breaking news
Delhi
-
యాంటీ పేపర్ బిల్లుకు లోక్సభ ఆమోదం
సాక్షి,ఢిల్లీ: యాంటీ పేపర్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓట్లతో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాసమైంది. పరీక్షల నిర్వహణ, పలు సంస్కరణలు చేపడుతూ బిల్లు రూపకల్పన జరిగింది. బిల్లు ఆమోదం తర్వాత రేపటికి లోక్సభ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు, 2026 (యాంటీ పేపర్ లీక్ బిల్లు) పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను ప్రతిపాదిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా పాసయ్యింది. పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంచారు.పేపర్ లీక్ చేసే వారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్లిస్ట్లో పెడతారు.పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్వర్క్లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి. -
“అరెస్టుల్లో తప్పేముంది?”.. విద్యార్థి నిరసనలపై నడ్డా కౌంటర్
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రభుత్వ చర్యలను సమర్థించారు. నిరసనలు చేపట్టినప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థి నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేశారని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నిరసనకారులపై చర్యలు తీసుకున్న వారిపై ఎందుకు చర్యలు లేవని.. వాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.దీనిపై స్పందించిన నడ్డా.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవడం వారి బాధ్యత అని అన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొనే వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.Union Minister JP Nadda on Wednesday defended the Delhi Police action at the CPI(M) headquarters, calling it a "normal law and order situation" and accusing the Opposition of politicising the incident. Responding in the Rajya Sabha after CPI(M) MP John Brittas raised the issue,… pic.twitter.com/i2yzjYApeE— The Siasat Daily (@TheSiasatDaily) July 29, 2026నిరసనలు చేస్తే చర్యలు సహజమేవిద్యార్థి ఉద్యమాలపై మాట్లాడిన నడ్డా.. యాక్టివిజంలో పాల్గొనేవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. చట్ట పరిమితులను దాటితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్న నడ్డా.. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా విద్యార్థి కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో తరగతి గది నుంచి రెండుసార్లు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.‘నేనూ అరెస్టయ్యా..’‘‘నేను కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను. ఎమర్జెన్సీ సమయంలో క్లాస్రూమ్ నుంచి రెండుసార్లు నన్ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని నడ్డా పేర్కొన్నారు. అయితే అప్పటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఉద్యమాల్లో పాల్గొంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్ చేశారు. అయితే నడ్డా మాత్రం పోలీసుల చర్యలను సమర్థించారు. చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల బాధ్యత అని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా, ఖర్గే మధ్య వాగ్వాదం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు వంటి అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాలం నాటి అరెస్టులను ప్రస్తావిస్తూ జేపీ నడ్డా కాంగ్రెస్పై విమర్శలు చేయగా, ప్రస్తుతం బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులు క్షీణిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.ప్రజలకు స్వేచ్ఛ లేదు: ఖర్గేపార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం సభలో మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని ఆరోపించారు. దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.దీనికి ప్రతిస్పందించిన జేపీ నడ్డా.. కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను నడ్డా రాజ్యసభలో ప్రస్తావించారు. అప్పట్లో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో క్లాస్ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛ, హక్కులు అణచి వేయబడ్డాయని పేర్కొంటూ, కాంగ్రెస్ చరిత్రను ఆయన విమర్శించారు. Ruckus in Rajya Sabha over police action on protesters: "Those who hit students are roaming free," Congress chief Mallikarjun Kharge slams Centre, JP Nadda hits back, says "police acted to maintain law & order" pic.twitter.com/EZ3u8jj7fu— NDTV (@ndtv) July 29, 2026ఇదే సమయంలో తమ పార్టీ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు రావడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసుల జోక్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళనకర సంకేతమని పేర్కొంది. అయితే, పార్టీ కార్యాలయాలకు పోలీసులు వెళ్లడం సాధారణ ప్రక్రియేనని జేపీ నడ్డా స్పందించారు. చట్టపరమైన అంశాల్లో పోలీసులు తమ విధులు నిర్వహిస్తారని తెలిపారు.దీంతో, ఎమర్జెన్సీ నాటి పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన చర్చతో రాజ్యసభలో వాతావరణం వేడెక్కింది. గత ప్రభుత్వాల విధానాలు, ప్రస్తుత పాలనపై అధికార–విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. -
కాక్రోచ్ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.As Soon as Dharmendra Pradhan’s Resignation is Confirmed……• Sonam Wangchuk has left.• Abhijeet Deepke and Saurabh Das are celebrating.Meanwhile, in Delhi, the Sangh Parivar has put their most Notorious and Riotous Group, the Bajrang Dal, out on the Streets.They are… pic.twitter.com/yLa72eEdBA— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2026ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.जो काॅकरोच जंतर-मंतर पर सनातन धर्म और मोदी जी को गाली दे रहे थे उनकी दिल्ली मेट्रो में जमकर धुलाई हो रही है...🤣😏 pic.twitter.com/XHtgERs9Hx— राजपूत सवित सिंह (@Savit12) July 29, 2026 మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.బీజేపీ అనుకూల వర్గాల వాదనమరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.THIS IS SHAMEFUL !!!If this is what young Indians have to face simply for supporting a protest then what kind of democracy are we becoming?This video appears to show Satyam Pandit confronting and slapping two youths on their way to the Jantar Mantar protest has sparked… pic.twitter.com/8zDPBMb1at— Ravi Prakash Official (@raviprakash_rtv) July 26, 2026ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. The police have started their job. The Students movement is over. Now who will come forward to help these students?Unity of students is required. #cjpprotesters #india #arrested #students #police pic.twitter.com/6o7LxWowhb— भारतीय (@ramanswall) July 27, 2026 -
ఈ జెన్జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్తో మొదలై..జెన్జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
అధికారులకు షాక్.. కేంద్రం కొత్త రూల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒక అధికారి.. ఒక అధికారిక కారు’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిబంధనలను వెల్లడించింది. దీనిపై కేంద్ర వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇకపై అదనపు బాధ్యతల పేరుతో సీనియర్ అధికారులకు మరో ప్రభుత్వ వాహనం కేటాయించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారిక కారుకు అర్హత ఉన్న ఓ అధికారి.. మరో మంత్రిత్వ శాఖ, విభాగం, ప్రభుత్వ రంగ సంస్థ (PSU) లేదంటే స్వయం ప్రతిపత్తి సంస్థకు అదనపు బాధ్యతలు నిర్వహించినా.. ప్రత్యేకంగా మరో వాహనం ఇవ్వకూడదని పేర్కొంది. అలాంటి అధికారులు తమకు ఇప్పటికే కేటాయించిన అధికారిక వాహనాన్నే అన్ని విధుల కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అధికారిక కార్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, అనవసర ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ రూల్ తెచ్చినట్లు చెబుతోంది.కఠిన ఆంక్షలు ఇలా.. కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు లేదంటే ఇతర అర్ధ ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై కూడా ఆంక్షలు విధించింది. కేవలం అధికారిక విధులు, అనుమతించిన పర్యటనల సమయంలో మాత్రమే వాటిని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వినియోగంలో లేని లేదా అదనపు వాహనాలను సురక్షితంగా భద్రపరచాలని అన్ని శాఖలకు సూచించింది.ప్రజాధనం ఆదా చేయడమే లక్ష్యంప్రభుత్వ వాహనాల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అనవసర వ్యయాలను నియంత్రించడం, ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఒకే అధికారి వద్ద పలు వాహనాలు ఉండటం వల్ల జరిగే దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు.. ప్రభుత్వ వనరుల వినియోగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది.2022 మార్గదర్శకాలకు కొనసాగింపుప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్రం 2022 సెప్టెంబర్లో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ శాఖల్లో అమల్లో ఉన్న నిబంధనలను ఒకే విధానంలోకి తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వులతో ఆ మార్గదర్శకాలను మరోసారి పునరుద్ఘాటించిన కేంద్రం.. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.వాహనాల నిర్వహణలో మారనున్న విధానంఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే.. ఈ నిబంధన వారికి నేరుగా వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వాహన సదుపాయాలు వారి హోదా, సంబంధిత నిబంధనల ప్రకారం కొనసాగుతాయి. తాజా ఉత్తర్వులు మాత్రం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల వాహన వినియోగానికే వర్తిస్తాయి. కొత్త నిబంధనలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వాహనాల కేటాయింపు, వినియోగ విధానం మరింత కట్టుదిట్టం కానుంది. -
నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసింది. చార్జ్షీట్లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేశ్, వికాస్, శుభమ్, ధనుంజయ్, ప్రహ్లాద్ సహా మొత్తం 13 మంది పేర్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం లీక్కు సంబంధించిన కుట్ర, ప్రశ్నపత్రాల అక్రమ సేకరణ, పంపిణీ తదితర అంశాలపై సీబీఐ విస్తృతంగా దర్యాప్తు జరిపి ఈ చార్జ్షీట్ను సమర్పించింది. ఈ కేసును నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు తీసుకోనుంది. చార్జ్షీట్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో కేసులో మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. -
‘గూగుల్లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
జెన్-జీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. తాజాగా సీజీపీ (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్ దాస్కు కౌంటర్గా.. అతడిని ‘‘పనికిమాలినోడు, ఉద్యోగం లేనివాడు’’ అంటూ మండిపడ్డారు. తన కెరీర్ విజయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు బదులిచ్చారు.సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా.. ‘‘గూగుల్లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు. అతనో పనికిమాలినోడు అని అర్థమైంది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను’’ అని పేర్కొన్నారు.నటిగా, ఎంపీగా నా ప్రయాణం వేరుతాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా అన్నారు. నటిగా, చిత్ర నిర్మాతగా, స్క్రీన్రైటర్గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ‘‘కొత్త ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను ఫిల్మ్మేకర్, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్లో ఉండటం అంటే ఏమిటో సౌరవ్ దాస్ లాంటి వారు అర్థం చేసుకోలేరంటూ విమర్శించారు.‘ముందు నైపుణ్యం నేర్చుకో’సౌరవ్ దాస్ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. నువ్వు కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.జెన్-జీ నిరసనలపై కంగనా వ్యాఖ్యలునీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై కంగనా గతంలో తీవ్రంగా స్పందించారు. ‘‘నా జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, ఉపయోగించే భాష నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ విమర్శించారు. ‘‘ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎవరు పెంచుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలుకంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీ స్పందిస్తూ.. జెన్-జీ యువత నుంచి కంగనాకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందేందుకు ఒక మహిళా ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.సౌరవ్ దాస్ కౌంటర్కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్ దాస్ కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి?’’ అని అన్నారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా తరాలు కంగనా వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘‘జెన్-జీ ఈ దేశానికి మీకంటే ఎక్కువ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంపై మళ్లీ నమ్మకం కలిగించే పని యువత చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనలతో మొదలైన వివాదంనీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీజీపీ కీలక పాత్ర పోషించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆందోళనల తర్వాత కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.కొనసాగుతున్న మాటల యుద్ధంనిరసనలు ముగిసినా.. కంగనా, సీజీపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు కంగనా నిరసనకారుల తీరును ప్రశ్నిస్తుండగా.. మరోవైపు సీజీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా సౌరవ్ దాస్పై కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
ఉత్తరాదిని వణికిస్తున్నవానలు
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. వచ్చే నాలుగైదు రోజుల్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. హిమాచల్లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో వాహనాలు, నివాసాలు మట్టి, బురద, రాళ్లకింద కూరుకుపోయాయి.అయితే, ప్రాణనష్టం సంభవించలేదు. ఉత్తరాఖండ్లో విడవకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఛార్ధామ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు. యాత్ర మార్గంలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ సీజన్లో అత్యధికంగా మంగళవారం వర్షం నమోదైందని, మూడేళ్లలోనే జూలైలో 29 డిగ్రీల సెల్సియస్తో అతి చల్లని రోజుగా మంగళవారం ఉందని ఐఎండీ తెలిపింది. -
కోర్టు గేట్లకు ఏముండాలో మేం చూసుకుంటాం!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు భవనం ప్రధాన గుమ్మటం, గేటు, అధికార పత్రాలపై జాతీయ చిహ్ననికి బదులుగా న్యాయస్థానం తన సొంత చిహ్నాన్ని వినియోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు గేట్లపై ఏముండాలో నిర్ణయించే విషయాన్ని తమకు వదిలేయాలని, ఇతర సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని పిటిషనర్కు హితవు పలికింది. ఈ అంశంపై బదరవాడ వేణుగోపాల్ అలియాస్ బాబా ఖతర్నాక్ అనే వ్యక్తి స్వయంగా పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ–2007 నిబంధనల ప్రకారం రాజ్యాంగ సంస్థలు జాతీయ చిహ్నాన్ని మాత్రమే ప్రదర్శించాలని, కానీ 1958లో ప్రారంభమైన సుప్రీంకోర్టు భవనంపై జాతీయ చిహ్నం ఇప్పటి వరకు లేదని ఆయన పేర్కొన్నారు.రిజిస్ట్రీ సైతం కోర్టు సొంత చిహ్నన్నే వాడుతోందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. ‘సుప్రీంకోర్టు గేట్లు, తలుపులపై ఏముండాలనే విషయాన్ని మాకే వదిలేయండి. మీ ఆహార్యం చూస్తుంటే సన్యాసిలా ఉన్నారు, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టిపెట్టి సమాజ సేవ చేసుకోండి. కోర్టు గేట్ల విషయం మేం చూసుకుంటాం‘అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ నిబంధనలను పిటిషనర్ ప్రస్తావించినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. పిటిషన్లో విచారణార్హమైన అంశాలు లేవంటూ కొట్టివేసింది.గతంలో వేసిన పిటిషన్కు కొనసాగింపుకోర్టులకు రాజ్యాంగపరమైన గుర్తింపు వంటి అశోక చిహ్నం సుప్రీంకోర్టుకు ఏర్పాటు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలంటూ వేణుగోపాల్ రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 ప్రకారం గతంలో ఒక రిట్ వేశారు. మార్చి 23న సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ అంశం పరిపాలనాపరమైనదని పేర్కొంటూ దీనిపై తగిన నోట్ను సంబంధిత అధికారికి పంపించాలని సెక్రటరీ జనరల్ను ఆదేశించింది. ఈ ఆదేశాల పురోగతిని తెలపాలంటూ వేణుగోపాల్ జూలై 3న రిజిస్ట్రార్ ద్వారా మరో పిటిషన్ వేశారు. ఆ తర్వాత, రిజిస్ట్రార్ ఉత్తర్వును సవాల్ చేస్తూ చేసిన అప్పీలును మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏం ప్రదర్శించాలనేది తమ సొంత విషయమంటూ అప్పీల్ను కొట్టివేసింది. -
నీచమైన వ్యక్తి ప్రల్హాద్ జోషీ
న్యూఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రల్హాద్ జోషీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అత్యాచారానికి పాల్పడిన వారికి అండగా నిలిచే వ్యక్తి, నీచమైన వ్యక్తి అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని విద్యా శాఖ మంత్రిగా నియమించడం ఏమిటని ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ ధ్వజమెత్తారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి తన మంత్రివర్గంలోని ఎవరినైనా విద్యాశాఖ మంత్రిగా ఎంపిక చేసుకుని ఉండొచ్చు కానీ ‘అత్యాచారానికి పాల్పడిన వారిని రక్షించే’ వ్యక్తిని ఎంపిక చేసుకోవడం విచిత్రంగా ఉందని చెప్పారు. ‘‘ప్రల్హాద్ జోషీ అత్యంత నీచమైన వ్యక్తి. అత్యాచారానికి పాల్పడేవారికి రక్షణ అవసరమని చెప్పే వ్యక్తి కంటే నీచమైనవాడు మరొకరు ఉండరు. ఆయనే నేడు విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి తీరు సరైంది కాదు. మంత్రివర్గంలో చాలామంది ఉండగా, వారిని కాదని ప్రల్హాద్ జోషీని ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన వారితో ప్రల్హాద్ జోషీ కలిసి ఉన్న పాత వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. -
‘దిల్ కా యాంగిల్’ మార్చుకోండి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్ జెడ్ తరాన్ని, వారి మనసులను గెలుచుకోవాలనుకుంటే కెమెరా యాంగిల్స్ కాకుండా ‘దిల్ కా యాంగిల్’మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా సూచించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల వీపులపై పడే ప్రతి లాఠీ దెబ్బ వారి కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రతిష్టకే హాని కలిగిస్తుందని తేల్చి చెప్పారు. మంగళవారం లోక్సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.యువతుల దుస్తులు చింపేసి అవమానించడం, కనికరం లేకుండా కొట్టించడం ఏమిటని మండిపడ్డారు. దేశ యువతపై పెల్లెట్ గన్లు, ఏకే–47లతో కాల్పులు జరపడం రాక్షసత్వం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం దృష్టిలో విద్యార్థులు ఉగ్రవాదులా? అని ధ్వజమెత్తారు. ఈ రోజు ఈ ప్రశ్నలను కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశం మొత్తం అడుగుతోందని అన్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.దేశంలోని యువతను ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. వారి గొంతుకలను అణచివేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో దాడి చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశమంతా ఇదే ప్రశ్న అడుగుతోందని వెల్లడించారు. మోదీ సత్య మార్గంలో నడవాలి పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ప్రియాంకా గాంధీ తోసిపుచ్చారు. ఫాస్ట్ట్రాక్ కోర్టుల పనితీరు ఇప్పటికే చాలా పేలవంగా ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని నిందించడం, డొల్ల రాజకీయ క్రీడలు ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నేటి కొత్త తరం ఎంతో అవగాహన కలిగి ఉందని, అబద్ధాలను గుర్తించగల అపారమైన సామర్థ్యాన్ని వారికి ఉందని వెల్లడించారు. యువత హృదయాలను గెలుచుకోవాలంటే ప్రధాని మోదీ సత్య మార్గంలో నడవాలని ప్రియాంకా గాంధీ సూచించారు. మోదీ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.‘‘నిజాన్ని అంగీకరించండి, బాధ్యత తీసుకోండి, పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిపుణులను సంప్రదించండి. లోపాలకు తావులేని నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయండి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలి. దేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్తరించాలి. అప్పుడే పిల్లలు ఉజ్వల భవిష్యత్తును కలలు కనగలరు’’అని స్పష్టంచేశారు. విద్యార్థులను బలవంతంగా వీధుల నుంచి తొలగించవచ్చేమో గానీ వారి ప్రశ్నలను మాత్రం తొలగించలేమని ప్రియాంకా గాంధీ తేల్చి చెప్పారు. -
పేపర్ లీక్ బిల్లు చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ బిల్లు విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు.ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల భారీ జరిమానా వంటి కఠినమైన శిక్షలు విధించేలా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను రూపొందించిన సంగతి తెలిసిందే. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. నిరసన వ్యక్తంచేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు.ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమరి్థంచారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తుండడం కీలక పరిణామం అని వెల్లడించారు. అనంతరం చర్చ బుధవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులది రాజకీయ ప్రసంగం: రిజిజు ప్రతిపక్షాలు పేపర్ లీక్ నిరోధక బిల్లు గురించి కాకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మొత్తం చర్చ బిల్లు యోగ్యతపై కేంద్రీకృతమై ఉండాల్సిందని అన్నారు. ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు బిల్లు గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయాలు చేశారని అన్నారు. అందరూ రాజకీయ ప్రసంగాలు చేశారని ఆక్షేపించారు. సభలో ఇలా చేయడం సరైంది కాదన్నారు. -
మా విచక్షణాధికారం
ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారం. దానిని ఎవరూ లాక్కోలేరు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేశ్కుమార్పై 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి చట్టబద్ధంగా ముందుకు వెళ్తాం.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ ‘హైడ్రా’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. చెరువులు, కుంటలను కాపాడేందుకు చేపట్టిన ఈ వ్యవస్థను కొనసాగించి తీరతామని తేల్చి చెప్పారు. హైడ్రా విషయంలో కోర్టుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ దురుద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) కేసులు వేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? ‘చెరువులు, నాలాలను కాపాడటంలో హైడ్రా తన విధులు నిర్వర్తిస్తున్న తీరుపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎన్ కన్వెన్షన్, గండిపేట, బతుకమ్మ కుంటల్లో ఆక్రమణలు తొలగిస్తే అవి పేదలవంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్లు కబ్జా పెట్టుకున్నారు. దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారు. కబ్జాదారులు డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చెరువులను ఆక్రమించిన వారు ధనవంతులైనా, పేదలైనా చర్యలు తప్పవు. గత 12 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. ‘గడిచిన 12 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. రాష్ట్రంలోని 11.56 లక్షల మంది అర్హులైన పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై (జీ)2.0) కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ నిధుల విడుదల, ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశాం..’ అని రేవంత్ తెలిపారు. విద్యా హక్కులపై కేంద్రం ఆధిపత్యం సరికాదు.. ‘పరీక్షల నిర్వహణ, లీకేజీల నిరోధానికి దేశస్థాయిలో పకడ్బందీ విధానం ఉండాలి. నిబంధనలు పట్టించుకోని కోచింగ్ సెంటర్లే ప్రశ్నపత్రాల లీకేజీలకు వేదికలుగా మారుతున్నాయి. విద్యకు సంబంధించి రాష్ట్రాల పరిధిలో ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవాలని చూడటం వల్లే గందరగోళం ఏర్పడుతోంది. నీట్ సహా ఇతర పరీక్షల విషయంలో యూనివర్సిటీలపై ఆధిపత్య ధోరణి వీడాలి. ప్రశ్నపత్రాల లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవు. ఆఫ్లైన్లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. సభలో చర్చ జరిగితే రాహుల్గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారు..’ అని సీఎం అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై పకడ్బందీ ప్రణాళిక ‘గత కేసీఆర్ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి పారిపోయింది. ప్రతి ఏటా రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్లు ఇందుకు అవసరమవుతాయి. ఇకపై ఏ సంవత్సరం బకాయిలు ఆ సంవత్సరమే చెల్లించేలా, అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో..కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో ఆ మేరకు డిమాండ్ చేస్తే బాగుంటుంది..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, సురేష్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు తదితరులు ఉన్నారు. -
NEET నిరసన కేసుల్లో సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: నీట్ నిరసనల కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో అరెస్టైన, అదుపులోకి తీసుకున్న మైనర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. 18 ఏళ్లలోపు వాళ్లతో పాటు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని వారిని తక్షణమే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో తదుపరి బలవంతపు చర్యలు (coercive action) తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.వాళ్లకు వర్తించదుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి ఈ రక్షణ వర్తించదని స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా చూడలేమని, మైనర్లు, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా పరిశీలన అవసరమని కోర్టు అభిప్రాయపడింది.FIRలపై తాత్కాలిక రక్షణజంతర్ మంతర్లో CJP నేతృత్వంలో జరిగిన నిరసనలు, ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులపై కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే అరెస్టులు, నిర్బంధాలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ ఆదేశాలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించనున్నాయి.పోలీసుల చర్యలపై విచారణకు సంకేతాలువిద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ విచారణలో పోలీసులపై వచ్చిన ఆరోపణలతో పాటు.. నిరసనకారుల నుంచి పోలీసులపై జరిగిన దాడుల ఆరోపణలను కూడా పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.కేంద్రం, ఏడు రాష్ట్రాలకు నోటీసులుఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల నిరసనల సమయంలో నమోదైన కేసులు, పోలీసు చర్యలు, అరెస్టులపై ఆయా ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది.విద్యార్థి ఉద్యమానికి కీలక మలుపునీట్ పేపర్ లీక్ ఆరోపణలపై ప్రారంభమైన ఉద్యమంలో పలువురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు, పోలీసు చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు విద్యార్థులకు కొంత ఊరటనిచ్చాయి. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేయడంతో.. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. -
జంతర్ మంతర్ లాఠీఛార్జిపై సీజేఐ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి ఘటనల్లో బాధ్యతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.“ఎవరు అతిగా బలప్రయోగం చేశారో తేల్చాలి. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేస్తుంది. బాధ్యతను నిర్ణయించకుండా చేసే దర్యాప్తునకు అర్థం లేదు” అని మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉందిప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు సీజేపీ ధర్మాసనం గుర్తు చేసింది. ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధానాల్లో మార్పులు అవసరమని పేర్కొంది. పోలీసులు గతంలో కోర్టులు సూచించిన మార్గదర్శకాలను పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి కొత్త ప్రొటోకాల్ అవసరమని సూచించింది. 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. టియర్ గ్యాస్, లాఠీచార్జి, నియంత్ర పద్ధతులపై సమగ్ర విధానం రూపొందించాలి అని పేర్కొంది. జులై 20న ఉద్రిక్తతలుజులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా(చలో సంసద్) వెళ్లేందుకు CJP నేతృత్వంలో నిరసనకారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీలు ఉపయోగించారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటుచేసుకుని పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెల్లెట్ గన్స్ వాడకంపై ఆగ్రహంపోలీసుల దాడిలో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఘటనను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు, చిన్నారులపై కూడా లాఠీచార్జి జరిగిందని.. యూనిఫాంలో లేకుండా సివిల్ డ్రెసులో ఉన్నవాళ్లూ దాడులు చేశారని.. ఎలక్ట్రిక బ్యాటన్లు, ఎలక్ట్రిక్ షీల్డ్లు వాడారని తెలిపారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యల్లో అతిగా బలప్రయోగం జరిగిందా? అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరమని తెలిపారు. మాజీ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు?ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించింది. జంతర్ మంతర్ ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉందో బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులకు కీలక సందేశంనిరసనలు, ఆందోళనలు ప్రజాస్వామ్యంలో భాగమని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. వాటిని నియంత్రించే క్రమంలో పోలీసులు చట్టపరమైన పరిమితులు దాటకూడదని సూచించింది. జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం వ్యాఖ్యలు.. నిరసనల నిర్వహణ, పోలీసుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. -
CJP సంబరాలపై వాంగ్చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్గా మారిన వేళ.. వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్చుక్ సపోర్ట్గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి వాటికి. అయితే ఫేస్బుక్ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తొలగించారంటూ ఫేస్బుక్పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ‘తాత్కాలిక’ వ్యవహారంపై మెటా వివరణ ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ.. దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించింది.నీట్ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది.అయితే జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.మెటా ఏమంది?వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెటా పేర్కొంది.భగ్గుమన్న బీజేపీ, అభిమానులుప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్న వీడియోను ఫేస్బుక్ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చకు ఈ ఘటన కారణమైంది.జెన్ జీ ఉద్యమం సమయంలో వీడియోనీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు యువతలో చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం మరింత ఆసక్తిని రేపింది.వివాదం టు వివరణ వరకుసోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేళ్లలో పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం గమనార్హం. అదీ నీట్ నిరసనలతో జెన్ జీ చేసిన ఆందోళనలపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్ల మంది వీక్షించారు. అయితే ఉన్నట్లుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చట్టపరమైన అభ్యర్థన కారణమా? అనే ప్రశ్నా తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చిన వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది.మెటాకు కేంద్రం నోటీసులుమెటా క్షమాపణలు చెప్పినప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్పందించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
చివరి నిమిషంలో కేంద్రం ప్లాన్ బెడిసి కొట్టిందా?
నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీనీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.రాజీనామా తర్వాత రాజకీయ వేడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు. ఉద్యమం తర్వాత కొత్త దశధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది. -
నీట్ ఉద్యమంలో మిడ్నైట్ ట్విస్ట్!
న్యూఢిల్లీ: నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరో కీలక మలుపు తిరిగింది. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశంపై కేంద్రంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో ప్రభుత్వం అర్ధరాత్రి కీలక చర్చలు జరిపింది. ఈ సమావేశం అనంతరం నిరసనకారులకు రక్షణ కల్పించేలా మరిన్ని రాష్ట్రాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సీజేపీ వెల్లడించింది.“ఏ ఒక్క నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం. అందరం కలిసి ఉన్నాం” అని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమకు ఉన్న అనుమానాలను చర్చల్లో ప్రస్తావించామని, వాటిపై స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు.#Important: 1 AM update.Hours after our press conference, Government’s representatives met us. The meeting lasted for 2-3 hours. They shared copies of the Bihar and Assam notifications guaranteeing FIR withdrawals, no action in future, and release of all detainees and… pic.twitter.com/G7WcHHcfAs— Saurav Das (@SauravDassss) July 27, 2026 2–3 గంటల పాటు సాగిన అర్ధరాత్రి భేటీసోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ ప్రెస్మీట్ తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు తమను కలిశారని, దాదాపు 2–3 గంటల పాటు చర్చలు సాగాయని తెలిపారు. బిహార్, అస్సాం ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవన్న హామీలకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను ప్రభుత్వం తమకు అందించిందని చెప్పారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ–ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కూడా ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“హామీలు అమలవుతాయా?”చర్చల అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీల అమలుపై తమకు ఆందోళన ఉందని స్పష్టం చేశారు. “చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతాయేమోనన్న భయాన్ని ప్రభుత్వ ప్రతినిధుల ముందు పెట్టాం. అందుకు ప్రతిగా బిహార్ హోం శాఖ జారీ చేసిన ప్రకటనను వారు చూపించారు. అందులో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లు ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు” అని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రక్షణ కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేయడంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.మళ్లీ ఉద్యమం హెచ్చరికతో కదిలిన ప్రభుత్వంకేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ మరోసారి ఆందోళన బాట పట్టే హెచ్చరికలు చేసింది. ఒప్పందం ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని పేర్కొంది. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారని సీజేపీ ఆరోపించింది. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించింది.బిహార్, అస్సాం తర్వాత రాజస్థాన్ హామీఇప్పటికే బిహార్, అస్సాం ప్రభుత్వాలు నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి. అరెస్టైన వారిని విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చర్యలు ఉండవని హామీ ఇచ్చాయి. తాజాగా రాజస్థాన్లోనూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ లభించిందని సీజేపీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు చేయబోమని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది.నీట్ పోరాటం ముగిసినట్లే!నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తాత్కాలికంగా ముగిసింది. అయితే నిరసనకారులపై కేసులు, అరెస్టుల అంశం కొత్త వివాదానికి దారితీసింది. తాజా చర్చలతో తాత్కాలికంగా ఆందోళన సద్దుమణిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల ఉపసంహరణ, విద్యార్థుల రక్షణపై అధికారిక ప్రకటనలు రావడమే కీలకంగా మారింది. -
ఢిల్లీ నిరసనలపై ఫేస్ స్కాన్ ఆపరేషన్
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ ‘చలో సంసద్ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ దగ్గర గత వారం జరిగిన ఉద్రిక్త ఆందోళనలకు సంబంధించిన వందలాది గిగాబైట్ల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ.. సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులకు, సీజేపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే.సుమారుగా 100 సీసీటీవీ వీడియో క్లిప్లలో నిరసనకారులు.. భద్రతా వలయాలను ఛేదించడం, పోలీసు సిబ్బందిపై దాడి, రాళ్లు రువ్వి ఆస్తులను ధ్వంసం చేయడం రికార్డయింది. ఇప్పటివరకు ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్) ద్వారా 2,873 మంది నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించారు. వీరిలో 989 మందిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, పోక్సో చట్టం కింద నమోదైన కేసులతో సహా పలు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దొంగతనం కేసుల్లో.. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న 92 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, బారికేడ్లను బద్దలు కొట్టడం, రాళ్లు రువ్వడం, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం, వాహనాల లోపల ఉన్న పోలీసులపై దాడి చేయడం, నిరసన మార్గంలో ఉన్న ప్రజా ఆస్తులను, దుకాణాలను ధ్వంస చేయడం వంటి ఘటనలు పలు ప్రదేశాల్లో సీసీటీవీలలో రికార్డయ్యాయి. కొన్ని ఫుటేజీలలో గుంపుగా బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగడం, జూలై 20న సంసద్ మార్గ్ వద్ద పలు చోట్ల రాళ్లు రువ్విన దృశ్యాలు ఉన్నాయి.అదే రోజు.. జంతర్ మంతర్ సమీపంలో పోలీసులు లోపల కూర్చున్నప్పటికీ, గుంపు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసి, ఒక పోలీసు వాహనాన్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించింది. టాల్స్టాయ్ మార్గ్ వద్ద ఒక వాహనానికి నిప్పు పెట్టడం, బస్సు టైర్లను పంక్చర్ చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసు సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్లు పలు వీడియోలు స్పష్టంగా చూపుతున్నాయని వర్గాలు తెలిపాయి. గాయపడిన ఒక మహిళా పోలీసు అధికారిని ఆమె సహచరులు సురక్షిత ప్రాంతానికి తరలించడం కనిపించింది.సంసద్ మార్గ్ వద్ద గుంపు ఒక పోలీసును చుట్టుముట్టి దాడి చేసింది. గాయపడిన పోలీసు సిబ్బంది యూనిఫామ్లపై రక్తం కారుతున్న అనేక క్లిప్లు ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమారు 200 మంది పోలీసులు గాయపడ్డారు. జూలై 22న రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్లో పోలీసు అధికారులు నంద్కిషోర్, వివేక్ భగత్లపై జరిగిన దాడులు నమోదయ్యాయి. కొంతమంది నిరసనకారులు కెమెరా ముందు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను సేకరించి తదుపరి చర్యల నిమిత్తం విశ్లేషిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. వీటిలో కన్నాట్ ప్లేస్లో ఓ మహిళ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, సంసద్ మార్గ్ వద్ద ఓ వ్యక్తి పార్లమెంటు గురించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసులపై ఒక మహిళ బూతులు తిట్టిన దృశ్యాలు ఉన్నాయి. -
ఇవాళే డెడ్లైన్! కేంద్రానికి సీజేపీ మరో వార్నింగ్
నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. కేంద్రంతో చర్చల అనంతరం ఆందోళనను విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావడం లేదని ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో కేంద్రానికి మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేరుస్తూ ఇవాళ గనుక రాతపూర్వక హామీ ఇవ్వకుంటే.. మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జులై 25న తాత్కాలికంగా ముగిసింది. అదే సమయంలో ఈ నిరసనలకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించారు. అయితే వాళ్లపైనా ఆయా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నీట్ నిరసనలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన చర్చల్లో.. నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారని సీజేపీ పేర్కొంది. ఆ తర్వాత కూడా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారంటూ ఆరోపించింది.‘‘హామీ ఉల్లంఘిస్తే నమ్మకద్రోహమే’’సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు కేంద్రానికి డిమాండ్లు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను నమ్మి ఉద్యమాన్ని విరమించారని.. ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.వార్నింగ్ ఎఫెక్ట్.. బిహార్ ప్రభుత్వ హామీసీజేపీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.బిహార్లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. మొత్తం 335 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆందోళనల సమయంలో హింస, ఆస్తుల నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.ఏకే-47 ఘటనపై దుమారంబిహార్లోని సివాన్లో నిరసనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జేపీ చౌక్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆందోళనల్లో మొత్తం 694 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 339 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల్లో పోలీసు అధికారులు సహా 91 మంది గాయపడ్డారని, 14 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.బెంగాల్లోనూ కేసులు.. 16 మంది అరెస్టుఇటు పశ్చిమ బెంగాల్లో నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోల్కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి, పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణపై బెంగాల్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల విషయంలో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.అసోంలోనూ అరెస్టులు.. కేసుల ఉపసంహరణకు నిర్ణయంఅసోంలోనూ నిరసనలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే.. సీజేపీ హెచ్చరికల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.ఢిల్లీ, మధ్యప్రదేశ్లో సోషల్ మీడియాపై నిఘాఇదిలా ఉండగా.. నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలో ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్పై మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.ముంబైలో కొనసాగుతున్న పోలీసుల నోటీసులుసీజేపీ ప్రకటన తర్వాత కూడా.. ముంబైలో కొంతమంది నిరసనకారులకు పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అధికారికంగా కేసుల ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.విద్యార్థుల న్యాయ పోరాటానికి సిబల్ చేయూతనీట్ నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. సీజేపీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లో నీట్ నిరసనలకు సంబంధించి కేసులు, అరెస్టుల ప్రక్రియ కొనసాగింది. అయితే కేవలం ప్రకటనలతోనే ఈ వివాదం ముగిసిపోతుందా? కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులువైన ప్రక్రియేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కీలకంగా మారాయి.తమ డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని సీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి? విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లేక ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తదుపరి చర్యలపైనే నీట్ ఉద్యమం భవిష్యత్ ఆధారపడి ఉంది. -
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలపడం దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆందోళన జరుగుతోందనే ఒకే కారణంతో పోలీసులు, ఇతర భద్రతాధికారులు లాఠీచార్జ్కు పాల్పడటం సరికాదని సీజేఐతోపాటు జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లతో జంతర్మంతర్లో జరిగిన ఆందోళనలపై పోలీసులు లాఠీఛార్జ్ తదితర బల ప్రయోగానికి పాల్పడటంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లు అన్నింటినీ కలిపి మంగళవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.అది రాజ్యాంగ హక్కువిచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ‘‘జంతర్ మంతర్ ఆందోళనల్లో పోలీసులు అతిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉంటే వాటిపై స్వతంత్ర విచారణ జరగాలి. ఇది కేవలం ఢిల్లీకి పరిమితమైన సమస్య కాదు. నిరసనలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పోలీసు ప్రోటోకాల్ అవసరం. ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ అంతర్భాగం’ అని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి ప్రాణం చాలా విలువైందని స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ మాట్లాడుతూ ‘‘పోలీసులు, విద్యార్థుల్లో ఎవరు గాయపడ్డా సమానంగానే చూడాలి. నిరసన ప్రదర్శనలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి రావచ్చు’’ అని అన్నారు. నిరసనల సందర్భంగా గాయపడ్డ పోలీసు సిబ్బంది కుటుంబాలు తమ వాదన కూడా వినిపించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ న్యాయస్థానానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
కేసుల రద్దుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారంలోగా ఆమేరకు హామీ లభించకుంటే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. సీజేపీ జాతీయ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్తో కలిసి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు, నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉప సంహరించుకుంటామని, కొత్తగా ఎవ్వరిపైనా కేసులు పెట్టబోమని మూడో విడత చర్చల సమయంలో కేంద్రం మాకు హామీ ఇచ్చింది. ఆ తర్వాతే 36 రోజులపాటు జంతర్మంతర్లో కొనసాగించిన నిరసనలను ఉపసంహరించుకున్నాం’అని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ‘ముసాయిదా ఒప్పందాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు అందజేయగా వారు ఆమోదం తెలిపారు. న్యాయనిపుణులతో చర్చలు జరిపాక మంగళవారం కల్లా ప్రభుత్వం లిఖిత పూర్వక ఒప్పందాన్ని అందజేస్తుందని మాకు హామీ ఇచ్చారు’అని వివరించారు. ‘ప్రభుత్వం నుంచి అందాల్సిన లిఖిత పూర్వక ఒప్పందం కోసం మేం ఎదురు చూస్తున్నాం. కేబినెట్ సీనియర్ మంత్రులు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం. నిరసనకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించరాదు. భవిష్యత్తులో వారిపై ఎటువంటి కేసులు పెట్టరాదు’అని రాంకా, దాస్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో తాము మరోసారి నిరసనలకు దిగక తప్పదని స్పష్టం చేశారు. -
ఏపీ డీఎస్సీపై కేంద్రం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రశ్నాపత్ర భద్రత, నియామక విధానం, క్రీడాకోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉపాధ్యాయుల నియామకాలు, వారి సేవా నిబంధనలు, నియామక ప్రక్రియ పూర్తిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పరిధిలోనే ఉంటాయని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. లోక్సభలో సోమవారం వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్రెడ్డి, పార్టీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ దేశంలోని ఎక్కువ పాఠశాలలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన నియంత్రణలో ఉంటాయని తెలిపారు. అందువల్ల ఉపాధ్యాయుల నియామకాలు, సేవా నిబంధనలు, పోస్టింగ్లకు సంబంధించిన అంశాలు వాటి పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను పారదర్శకంగా, పటిష్టంగా, సాధ్యమైనంతవరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు పార్లమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టం–2024ను తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా అనుసరించేందుకు ఇది ఒక నమూనా చట్టంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. మెగా డీఎస్సీకి సంబంధించి రాష్ట్రంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు మాత్రం కేంద్రమంత్రి జవాబివ్వలేదు. -
వైఎస్ జగన్ హయాంలోనే అత్యధిక ఇళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)–అర్బన్, పీఎంఏవై–అర్బన్ 2.0 పథకాల కింద ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు మొత్తం 19,67,971 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి తోఖన్ సాహు తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీనేత, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా 2015 జూన్ 25 నుంచి అమలవుతున్న పీఎంఏవై–అర్బన్ పథకాన్ని 2024 సెపె్టంబర్ 1 నుంచి పీఎంఏవై–అర్బన్ 2.0గా విస్తరించినట్లు చెప్పారు. ఈ పథకాల కింద ఏపీకి మంజూరైన 19.68 లక్షల ఇళ్లల్లో ఇప్పటివరకు 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, వీటిలో 10.75 లక్షల ఇళ్లల్లో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదలలో జాప్యం, మౌలిక వసతుల కల్పన ఆలస్యం, లబ్దిదారులు తమ వాటా నిధులు సమకూర్చుకోవడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా అమలు వేగం తగ్గిందని చెప్పారు. పీఎంఏవై–అర్బన్ 2.0 కింద 61,084 ఇళ్లు 2024 సెప్టెంబర్ 1 నుంచి పీఎంఏవై–అర్బన్ 2.0గా విస్తరించిన ఈ పథకం కింద ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు 61,084 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. అమరావతి భూసమీకరణ రైతులను పీఎంఏవై–అర్బన్ 2.0 లబ్ధిదారులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అత్యధిక ఇళ్ల మంజూరు, నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలోనే అత్యధికంగా ఇళ్లు మంజూరై, నిర్మాణం జరిగినట్లు కేంద్ర గణాంకాల ద్వారా వెల్లడైంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలన కాలంలో మొత్తం 14,15,800 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకాల కింద చంద్రబాబు పాలనలో 2015–19 మధ్య 4,91,087 లక్షల ఇళ్లు, 2024–27 (ప్రస్తుత సంవత్సరం) 61,578 మంజూరయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వాల హయాంలో మొత్తం 5,52,171 లక్షల ఇళ్లకు ఆమోదం లభించినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. -
సమన్వయం లేదు.. కలహాలు పెరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు, అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొరవడటం.. జిల్లాల్లో మంత్రుల ఏకఛత్రాధిపత్యం.. ఎమ్మెల్యేల నియోజకవర్గాల స్థాయి అభివృధ్ధి పనుల్లో జాప్యంపై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయం గాడి తప్పుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో జరిగిన సమావేశంలో పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందరిదీ సొంత అజెండానే.. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాల, ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరుపై రెండు గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలు, ఇంచార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరడం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లడం లేదని, మంత్రులు–ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని వచ్చిన నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్లు సమాచారం. చాలామంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రులు సొంత నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిధుల కేటాయింపుల్లోనూ వారికి ప్రాధాన్యమిచ్చుకుంటూ జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయని రాష్ట్ర నేతల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. మంత్రుల స్థాయిలోనూ, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు తమ సొంత అజెండా, సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలు తప్ప, పార్టీ ఇమేజ్కు పెద్దగా దోహదం చేయడం లేదన్న అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల భాగస్వామ్యం కొరవడిందన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. షబ్బీర్..సామేల్..డీసీసీల వ్యవహారాలపై ప్రశ్నలు తమకు అందించిన నివేదికల్లోని అంశాలను ప్రస్తావిస్తూ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా యాదాద్రి దేవస్థాన పాలకమండలి ఎంపికలో జిల్లా నేతల అభిప్రాయాలను కోరకపోవడం, జిల్లా నేతలను విస్మరించారని ఫిర్యాదులు రావడం, పీసీసీని లక్ష్యంగా చేసుకుంటూ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేయడం, యూత్ కాంగ్రెస్ నేత వ్యవహారంలో జరిగిన వివాదం, ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చుట్టూ జరిగిన పరిణామాలు, ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా స్పందించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. మండల కమిటీల ఏర్పాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో అనేక జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా మాట్లాడినట్లు తెలిసింది. అభివృద్ధి నిధుల కేటాయింపు, అధికార యంత్రాంగం స్పందన, స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేల సూచనలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపైనా అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. రంగంలోకి హైకమాండ్ రాష్ట్ర పరిస్థితిని గాడిన పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దింగింది. పార్టీ సమన్వయాన్ని కాపాడే క్రమంలో మొదటి అడుగుగా బుధవారం ఢిల్లీలో పార్టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటే.. మీనాక్షికి పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించడం, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని స్పష్టమైన కేతాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతల విషయంలో అవసరమైతే హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటుందని, ఏఐసీసీ పరిశీలకులను పంపి అవసరమైన చర్యలకు దిగుతామనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద తగిన నీటి మట్టం ఉన్నందున పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారని తెలిపారు.సోమవారం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే 48 గంటల్లో నివేదిక ఇచ్చారని, అందుకే దానిని బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదుం ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. టీ–ఫైబర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్–కరీంనగర్ రైల్వే మార్గం విద్యుద్దీకరణతోపాటు మిడ్ మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ సాధించిన విజయం తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిందని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని, అర్ధరాత్రి వేళల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదా లు జరిగినా వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్కడ దొరికిన నగదును లెక్కించడానికి మిషన్లు కూడా సరిపోవట్లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్ఫేక్ కంటెంట్పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.సమగ్ర కథనం: ఇథనాల్ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీబాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీగడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్పూర్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత.. గడ్కరీనే టార్గెట్?ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్ నితిన్ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా ఇథనాల్ పెట్రోల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.అసలు ఈ20పై వివాదం ఏంటి?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కోర్టు బాట పట్టిన గడ్కరీతనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది. -
లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపుతూ పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ నిరసనల సందర్భంగా వారిపై పోలీసుల చర్యల విషయమై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కేవలం నిరసన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరు. ఎక్కడైనా పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడితే దానిని అరికట్టాల్సిందే. ప్రతి పౌరుడి హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.ఈ విచారణలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి మాట్లాడుతూ..‘విద్యార్థుల భద్రత ఎంత ముఖ్యమో, పోలీసుల భద్రత కూడా అంతే ముఖ్యం. నిరసనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడకూడదు. పోలీసుల చర్యలకు సంబంధించి తగిన ఎస్ఓపీలు ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు" అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో నిరసనల్లోకి ఆకతాయిలు, సామాజిక విద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిరసనకారులు కూడా హింసకు తావులేకుండా ఆత్మనియంత్రణ, క్రమశిక్షణ పాటించడం అత్యంత కీలకమని పేర్కొంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల వ్యవహార శైలిపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్.. ‘బీహార్లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. -
పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. కారు దిగగానే!
సాక్షి, న్యూఢిల్లీ: యువత నిరసలతో దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కదా. ఇవాళ ఎంపీ హోదాలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కోసం వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నినాదాల పోరు కనిపించింది.సోమవారం ఉదయం పార్లమెంట్కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా “ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ.. నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది. అయితే ఎన్డీయే ఎంపీలు అవేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. అలా.. ఒకేసారి డబుల్ వెల్కమ్ దక్కింది ఆయనకు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్ వ్యవహారంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 రోజుల తర్వాత నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను నైతిక బాధ్యత తీసుకున్న నిర్ణయంగా ఎన్డీయే నేతలు అభివర్ణిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం నీట్ అవకతవకలకు ఆయన రాజీనామా చేయడం సరైందేనని అంటున్నాయి. #WATCH | Delhi: Former Union Education Minister and BJP MP Dharmendra Pradhan arrives at the Parliament. BJP-NDA MPs sloganeer "Dharmendra Pradhan zindabad" as they receive him here. pic.twitter.com/7DHXIzMkvI— ANI (@ANI) July 27, 2026 -
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్ఖర్ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది. -
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం.. కేంద్రానికి మరో పరీక్ష!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానుండగా, విద్యార్థి నిరసనలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితిలో లేదు.జూలై 20న జరిగిన సీజేపీ చలో సంసద్ నిరసన సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడులు చేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారన్న ఆరోపణలపై అమిత్ షాకు లేఖ రాశారు. 19 ఏళ్ల విద్యార్థి సహిల్ లోచాబ్ ఒక కంటిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, ఇలాంటి బలప్రయోగానికి అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన వ్యక్తులు విద్యార్థులను లాఠీలతో కొట్టిన ఘటనపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.Another disturbing video from the CJP "Sansad Chalo" protest is circulating online.Protesters allege that, after lathi charges and tear gas, pellet guns were also used during the crackdown.#संसद_मार्च#cjp_पार्टी pic.twitter.com/6IrdPuAQss— Zo World (@ZoWorldd1) July 22, 2026మరోవైపు, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఉపనేత సాగరికా ఘోష్ రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో తక్షణమే చర్చ జరపాలని ఆమె కోరారు. అయితే, నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)పై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం సీఆర్పీఎఫ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. సవరణ బిల్లు ప్రకారం, వ్యక్తులకు కనిష్ఠ జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు, గరిష్ఠ శిక్షను పది సంవత్సరాలకు పెంచనున్నారు. గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, సేవలందించే సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా, నిర్వాహకులకు కఠిన శిక్షలు, వ్యవస్థీకృత ప్రశ్నాపత్రాల లీకేజీ నేరాలకు మరింత కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చారు. అలాగే కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.ఇక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) కారణంగా వాహనాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నెల 31న ఢిల్లీలో మరో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. -
రాజీనామా ఖుషీ.. హుషారుగా స్టెప్పులేసిన సీజేపీ లీడర్స్
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. -
సభలో రగడ ఆగేనా?
సాక్షి, న్యూఢిల్లీ: సీజేపీ ఉద్యమంతో మోదీ సర్కార్పై పెరిగిన ఒత్తిడిని పార్లమెంట్లోనూ కొనసాగించాలని విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు నిర్ణయించాయి. చలో సంసద్ ర్యాలీలో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన, పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తూ కొనసాగిన పోలీస్ చర్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో విపక్ష పార్టీలు డిమాండ్ చేయనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు ఉద్దేశించి కొత్త ముసాయిదా బిల్లును ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో దానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై సోమవారం పార్లమెంట్లో ఖర్గే చాంబర్లో సమావేశమై ‘ఇండియా’ కూటమి నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉభయసభల్లో మరోమారు వాగ్వాదాల వేడి రాజుకోనుందని స్పష్టమవుతోంది. మరోవైపు నీట్ అంశంపై ఆందోళనలు సాగిస్తున్న విద్యార్థుల పట్ల భద్రతా బలగాలు అతిగా వ్యవహరించాయని, దీనిపై రాజ్యసభలో చర్చ చేపట్టాలని కోరుతూ టీఎంసీ రాజ్యసభ ఉప నేత సాగరికా ఘోష్ ఆదివారం నోటీసు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం సభలో ఆరోజు జరగాల్సిన కార్యక్రమాలను రద్దు చేసి, ఈ అంశంపై చర్చను చేపట్టాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్కు పంపిన నోటీస్లో సాగరిక పేర్కొన్నారు.నేటి నుంచి సభలో బిల్లులు → పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026’ను లోక్సభ ముందుకు తీసుకురానున్నారు. → ఇదివరకే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘వందేమాతరం’బిల్లుపై చర్చ జరుగనుంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా సమాధానం ఇవ్వనున్నారు. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండటంతో చర్చ ఆసక్తికరంగా మారనుంది. → సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య(సవరణ) బిల్లు–2026 కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. సుప్రీంకోర్టులో న్యాయ మూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ఈ సవరణ బిల్లు చర్చల జాబితాలో ఉంది. -
పాశవిక దాడికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచ్చింది మీరేనా? అని హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పాలని దేశ ప్రజల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయని రాహుల్ చెప్పారు. విద్యార్థులపై పాశవికంగా జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం అమిత్ షాకు రాహుల్ ఒక లేఖ రాశారు. ‘‘జంతర్మంతర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. విద్యార్థులు న్యాయమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుతూ ఆందోళన నిర్వహించారు. వారి డిమాండ్లను వినాల్సిన ప్రభుత్వం, పోలీసులతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వినియోగం వంటి తీవ్ర బలప్రయోగానికి పాల్పడింది. విద్యార్థినులతో కొందరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసుల దమనకాండలో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెల్లెట్స్ తగిలి గాయపడిన, ఒక కంట్లో చూపును కోల్పోయే ప్రమాదంలో పడిన టీనేజీ విద్యార్థి సాహిల్ లోచబ్ను కలిశా. ఒక జర్నలిస్టు సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడాలని మీరే అనుమతి ఇచ్చారా? ఇవ్వకపోతే ఎవరు ఆదేశించారు? సాధారణ దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు పోలీసులా లేదా వలంటీర్లా? వారికి అక్కడ విధులను అప్పగించింది ఎవరు?’’ అని అమిత్షాను రాహుల్ నిలదీశారు. ‘‘విద్యార్థులపై జరిగిన హింస ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. యువత దేశ భవిష్యత్తు. వారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’’ అని రాహుల్ ఆ లేఖ ద్వారా డిమాండ్చేశారు. -
హైపవర్డ్ యాక్షన్
దేశంలో తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో పలు పరిణామాల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం కూడా ఇదే అంశం చుట్టూ దేశ రాజకీయాలు పరిభ్రమించాయి. ఢిల్లీలో 37 రోజులపాటు చేసిన యువత ఆందోళనలు ఆగిపోయినప్పటికీ.. పరీక్షల్లో లీకేజీలు, అక్రమాల విషయంలో వారిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని కేంద్రం గుర్తించింది. ఈ అంశంపై ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లీకేజీలకు పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకునే దిశగా సాగుతున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్ను నియమించినట్లు చెప్పారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్ఫోర్స్ సూచనలు ఇస్తుందన్నారు. మరోవైపు పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం మోపడానికి, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో తాము మరింత విజృంభించాలని విపక్షాలు కూడా భావిస్తున్నాయి. విద్యార్థులపై పాశవికంగా దాడికి దిగడం, వారిపై కేసులు నమోదు చేయడంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచి్చంది మీరేనా? అంటూ హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. మరోవైపు నీట్ ఆందోళనలను పతాకస్థాయికి తీసుకెళ్లి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించడంతో విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేసింది. పంజాబ్లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై త్వరలో ఉద్యమించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే సంకేతాలిచ్చారు. ఇలా ఎవరికి వారు తమ హైపవర్డ్ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్ఫోర్స్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థలను ఎలా మెరుగుపరచాలన్న అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పటిష్టమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్ ఫోర్స్ సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు. కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. విశ్వసనీయంగా, పారదర్శకంగా... నీట్ పేపర్ లీకేజీ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే హైపవర్డ్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయడం గమనార్హం. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. మన పరీక్షా విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే, అందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరీక్షల సంస్కరణలపై దృష్టి సారించేందుకు ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్ఫోర్స్ సభ్యులు నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్డ్ టాస్క్ ఫోర్స్లో మొత్తం ఆరుగురు సభ్యులను నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షా విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక కోణంలో వ్యవస్థాగత సంస్కరణల పరంగా పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇందులో స్థానం కల్పించింది. → టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని → ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ → ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా → ఐఐటీ–చెన్నై డైరెక్టర్ వి.కామకోటి → విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్ → లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనాటెక్నాలజీ దిగ్గజం నీలేకని నందన్ నీలేకని భారతీయులకు సుపరిచితులే. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్కు ఆయన సహ వ్యవస్థాపకుడు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్గా సేవలందించారు. ‘ఆధార్’ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక ఆయనదే కీలకపాత్ర. 2023 జనవరిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఏర్పాటు చేసిన జీ20 టాస్క్ ఫోర్స్ సహ–అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బెంగళూరులో జన్మించిన నందన్ నీలేకని ఐఐటీ–బాంబే నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. పద్మభూషణ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు.ఫోర్బ్స్ ఆసియా బిజినెస్మేన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, బిజినెస్ స్టాండర్డ్ లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ఆయనను వరించాయి. ఏక్స్టెప్ ఫౌండేషన్ను నిలేకని స్థాపించారు. ‘టైమ్స్’ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో(2006, 2009), ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల(2024) జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. వ్యాపారం, ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో అందించిన సేవలకు గాను నీలేకని అనేక అవార్డులను పొందారు.టాస్క్ ఫోర్స్ బాధ్యతలు → నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన పరీక్షల వ్యవస్థను పునర్వ్యస్థీకరించడం→ పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలను సిఫార్సు చేయడం→ పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి నూతన వ్యవస్థను రూపొందించడం → జాతీయ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం. -
పరీక్షల సంస్కరణలపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పరీక్షల సంస్కరణలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల నివారణే లక్ష్యంగా పలు సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు నరేంద్ర మోదీ. ‘ పరీక్షల సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సాంకేతిక నిపుణుడు నందన్ నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, పరీక్షల విశ్వసనీయతపై ఇచ్చే ఈ నివేదికను అమలు చేస్తాం. లీక్లకు పాల్పడిన వారిని జైల్లో పెట్టాం. రేపు పార్లమెంట్లో కఠిన చట్టాలను తీసుకొస్తాం. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నివారణే లక్ష్యం సంస్కరణలు తీసుకురాబోతున్నాం. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నాం. వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తాం’ అని తెలిపారు.HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026 -
10 గంటల్లో 12 కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సీజేపీ సెన్సేషన్!
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలోనూ భారీ ఆదరణ పొందుతోంది. సీజేపీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఓ వీడియో కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల (120 మిలియన్) వ్యూస్ను సాధించి రికార్డు సృష్టించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఫోన్లో అందిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. అది కాస్తా వైరలైంది. ఈ వీడియోకు వచ్చిన స్పందనతో సోషల్ మీడియాలో సీజేపీ ప్రభావం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పటికే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ముఖ్యంగా యువతతో అనుసంధానం కావడానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారింది.అయితే సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, లైక్లు ఉద్యమానికి ఉన్న రాజకీయ మద్దతును పూర్తిగా ప్రతిబింబించవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సీజేపీ నాయకులు ఆసక్తికరంగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ భారత్లో దేనికీ 'నో' చెప్పకూడదు. ప్రస్తుతం మాత్రం మా దృష్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది అని అన్నారు. DEMOCRACY WINS! 🇮🇳Education minister Dharmendra Pradhan has resigned. pic.twitter.com/DsB6hCHUzP— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 -
వేదికపై ఒక్కరే.. వెనుక ఏడుగురు
సాక్షి, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనలకు, నిరసనలకు సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ముందుండి నడిపిస్తే ఈ నిరసనోద్యమానికి ఏడుగురు వ్యక్తులు వెనక వెన్నుముకలా నిలబడి ఉద్యమాన్ని విజయవంతంచేశారు. సీజేపీని స్థాపించడం మొదలు రోజువారీగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టడం వాంగ్చుక్ నిరాహార దీక్ష తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఈ ఏడుగురు వ్యూహకర్తలే కీలక భూమిక పోషించారు. లాయర్లు, జర్నలిస్టులు, పబ్లిక్ పాలసీ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులతో కూడిన ఈ బృందం ఉమ్మడి కృషితో ఉద్యమాన్ని ముందుకు సాగేలా దిశానిర్దేశంచేస్తోంది. వేదికపై వాగ్దాటితో ఉపన్యాసాలు చేసే నాయకుల పైనే కాకుండా, వెనుక ఉండి వ్యూహాలు రచించేవారు, మీడియా సమన్వయకర్తలు, చట్టపరమైన పోరాటం చేసేవారు, విద్యార్థి–జన సమీకరణ చేసేవారిపైనే ఉద్యమ విజయఫలితం ఆధారపడి ఉంటుందని సీజేపీ కీలక నాయకత్వం మరోసారి నిరూపించింది. దీంతో ఈ ఏడుగురు ఎవరనే చర్చ మొదలైంది. వీళ్ల గురించి క్లుప్తంగా.. వైష్ణవి (పాలసీ నిపుణురాలు) ఢిల్లీకి చెందిన వైష్ణవి సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధుల్లో ఒకరు. ఈమె విధాన నిర్ణయాల రూపకల్పనలో దిట్ట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ప్రముఖ పరిశోధనా సంస్థల్లో దాదాపు ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. విధాన రూపకల్పన, విద్యా వ్యవస్థలోని అంశాలపై ఈమెకున్న అవగాహన పార్టీ వ్యూహాల రచనకు ఎంతగానో తోడ్పడుతోంది. ఆఫ్రీన్ (సామాజిక ఉద్యమకారిణి) బెంగళూరుకు చెందిన ఆఫ్రీన్ ఎంబీఏ పూర్తి చేసింది. కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని ఈ ఉద్యమంలోకి వచ్చారు. విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో గమనించిన ఆమె సామాజిక అంశాలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సీజేపీ వక్తగా కొనసాగుతూ యువత, విద్యార్థి వర్గాల సమస్యలను బలంగా వినిపిస్తున్నారు. దీపక్ బలియాన్ (విద్యార్థి నేత) దీపక్ బలియాన్ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని రైతు కుటుంబం నుంచి వచ్చారు. సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రైతులు, యువత సమస్యలపై పనిచేసారు. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై సీజేపీ తరఫున పోరాడుతున్నారు. గ్రామీణ ప్రాంత యువత సమస్యలపై గళమెత్తుతున్నారు. రత్నా సింగ్ (న్యాయవాది) న్యాయపరమైన వ్యవహారాల బాధ్యతలను రత్నా సింగ్ పర్యవేక్షిస్తున్నారు. లా చదువుకున్నారు. జర్నలిజంలోనూ మంచి పట్టుంది. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ’స్క్రోల్’, ‘బార్ అండ్ బెంచ్’వంటి ప్రముఖ న్యాయ–మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ పార్టీ తరఫున చట్టపరమైన అంశాలను పర్యవేక్షస్తున్నారు. అశుతోష్ రాంకా (సామాజిక ఉద్యమాల అనుభవం) జైపూర్ కు చెందిన అశుతోష్ రాంకాకు సామాజిక ఉద్యమాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. సీజేపీ కంటే ముందు ఆయన ‘పరివర్తన్’అనే సంస్థ ద్వారా ఆరావళి పర్వతాల పరిరక్షణ, ధోల్ కా బాడ్ అడవులను కాపాడుకోవడం, నీట్ పరీక్షల అవకతవకలపై ఆందోళనలు చేపట్టారు. ఆయన అనుభవం సీజేపీ ప్రజా ఆందోళనలకు పెద్ద దిక్సూచిగా మారింది. సౌరభ్ దాస్ (ప్రజా సంబంధాలు) సౌరభ్ దాస్ స్వస్థలం ఢిల్లీ. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదివి స్వతంత్ర పరిశోధనాత్మక విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం సీజేపీ ప్రధాన వక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియాతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉద్యమ సమస్యలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు. సిద్ధాంత్ (డిజిటల్ మీడియాలో పట్టు) డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించిన సిద్ధాంత్ పూర్తిగా తెరవెనుక ఉండి సీజేపీ ఉద్యమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లారు. డిజిటల్ క్యాంపెయిన్ బాధ్యతలు పూర్తిగా ఈయనే చూసుకుంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆందోళనల వివరాలు డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఈయన అవలంభించిన సోషల్ మీడియా వ్యూహాలు సీజేపీకి ఎంతగానో కలసివస్తున్నాయి. -
ఆరోపణలను ఖండించిన వాంగ్చుక్
న్యూఢిల్లీ: కేంద్రంతో కుదిరిన ‘‘ఒప్పందం’’మేరకే తాను 26 రోజుల ఆమరణ నిరాహారదీక్షను ఉపసంహరించానన్న వార్తలను సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఖండించారు. జంతర్మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చినందుకే విరమించినట్లు స్పష్టం చేశారు. గత ఏడాది సెపె్టంబర్ 24న లద్దాఖ్లో యువతపై జరిగిన కాల్పులను గుర్తు చేసుకుంటూ, ఢిల్లీలో కూడా అలాంటి దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షను ఉపసంహరించుకుని శాంతి కోసం పిలుపునిస్తే పరిస్థితి సర్దుకుంటుందని భావించానని చెప్పారు. శుక్రవారం ఆర్ధరాత్రి యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేసిన సోనమ్ నిరాహార దీక్ష విరమణకు దారితీసిన పరిస్థితులను వివరించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదాన్ని కూడా ఆయన ఈ వీడియోలో పోస్ట్ చేశారు. తనను అరెస్ట్ అయినా చేయాలని, లేదంటే స్వేచ్ఛగా వెళ్లేందుకు అవకాశం కలి్పంచాలని వాంగ్చుక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కేంద్ర మంత్రుల చర్చల సందర్భంగా తాను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టబట్టలేదని, విద్యార్థులు కేసుల్లో చిక్కుకో కూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నానని చెప్పారు. లోపాయికారి ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే 26 రోజులపాటు ఆకలితో ఎలా ఉండేవాడినని ప్రశ్నించారు. ఏసీ గదిలో కూర్చొని ఒప్పందం చేసుకునే వాడినని అన్నారు. మంత్రులు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంతోపాటు, పార్లమెంటులో చర్చకు అంగీకరించారని, కేసుల విషయంలో మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను ఆందోళన చెందాననన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల సమక్షంలోనే నిరాహార దీక్ష ఉపసంహరించాలని అనుకున్నా మంత్రులు రాకముందు నుంచే తనను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని అన్నారు. వారు లేకుండానే దీక్ష విరమించడంపై దుఃఖం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని సొంత జాగీరులా నడపొద్దని బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి ఒక హెచ్చరిక అని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతికి మారుపేరైన ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచి పరిణామం అని స్పష్టంచేశారు. విద్యార్థుల నిరసనను ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గతానికి’, భారతదేశ భవిష్యత్తుకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తు గతాన్ని ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం ఆందోళన చేసిన విద్యార్థులను క్రూరంగా హింసించారని, వారికి ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు, వారిపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడానికి అనుమతించినందుకు హోంశాఖ మంత్రి అమిత్ షానే ప్రత్యక్ష బాధ్యులు అని పేర్కొన్నారు. విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ అంగీకరించదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారు భారతదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుని, చెదపురుగుల మాదిరిగా దానిని లోపలి నుంచే డొల్లగా చేస్తోందని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ చెదపురుగును తొలగించాలని తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను, దేశ భవిష్యత్తును కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల విజయమని అన్నారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారంటూ విద్యార్థులను ప్రశంసించారు. విద్యా విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత విద్యా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ పట్టు తొలగాలని చెప్పారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గానీ ప్రభుత్వం ఆ పని చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ విద్యా వ్యవస్థపై నేడు దాడులు జరుగుతున్నాయని, కొందరు కబ్జా చేస్తున్నారని, ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత ఉద్యమం విద్యా వ్యవస్థలో అక్రమాలకు, నిరుద్యోగానికి, దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన అని వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగ కల్పన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థలు కనుమరుగైపోయాయని, అందుకే యువత రోడ్డెక్కుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికీ వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ముమ్మాటికీ ప్రజలకు చెందినదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని రాహుల్ అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల భద్రత, సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన ప్రతి వర్గం కూడా తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధమైన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు జంతర్మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న వారిని రాహుల్ కలిశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
గుర్తుంచుకోండి.. బొద్దింకతో పెట్టుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్లో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. రాజీనామా వార్త తెలియగానే జంతర్మంతర్ వద్ద ఆందోళనచేస్తున్న నిరసనకారులు ఒక్కసారిగా ఆనందడోలికల్లో మునిగారు. జాతీయజెండాలు చేతబూని కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఉద్యమంలో ప్రభుత్వంపై గెలిచామన్న ఆనందంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘విద్యార్థి శక్తి విజయం సాధించింది‘అంటూ హర్షధ్వానాలు చేశారు. నీట్ లీకేజీతో మనస్తాపంతో ఆత్మహత్యచేసుకున్న పరీక్షార్థులకు నివాళిగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సంబరాలు కొనసాగించారు. వందేమాతరం నినాదాలతో ప్రాంగణం హోరెత్తిపోయింది. ఫోన్ కాల్తో ఒక్కసారిగా ఆనందం శనివారం తొలుత జంతర్మంతర్లో నిరసన కార్యక్రమంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఉన్న సమయంలోనే మంత్రి పదవికి ధర్మేంద్ర రాజీనామాచేసిన విషయం ఫోన్కాల్ ద్వారా తెలిసింది. ఈ ఘటన వివరాలను దీప్కే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసి తెలిపారు. 3 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో దీప్కే ఫోన్ మాట్లాడటం పూర్తయ్యేలోపే అక్కడి విద్యార్థులకు విషయం తెల్సి పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత దీప్కే మైక్తీసుకుని ‘మన విద్యార్థి శక్తి వరి్ధల్లాలి. మనం సాధించాం’అని బిగ్గరగా అరుస్తూ చర్చలు ఫలవంతమయ్యాయని ప్రకటించారు.దీంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. చేతులు పైకెత్తి విజయోత్సాహం వ్యక్తం చేశారు. వేదికపై ప్రదర్శించిన పోస్టర్లో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థుల పేర్లను దీప్కే చదివి వినిపించారు. వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ, వారి త్యాగాలను ఉద్యమం ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. షారుఖ్ఖాన్ హిట్ సినిమా ఛక్దే ఇండియాలోని దేశభక్తి పాటలను అక్కడ ప్లే చేశారు. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలను ప్రదర్శించారు. సీజేఐ సూర్యకాంత్కు థాంక్యూ.. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దిప్కే ప్రసంగించారు. ‘‘ధర్మేంద్ర రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయం. గుర్తుంచుకోండి బొద్దింకలతో పెట్టుకోవద్దు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అంత సులభం కాదు. కానీ విద్యార్థుల ఐక్యతతో ఇది సాధ్యమైంది. ప్రపంచం వంగుతుంది. కానీ దానిని వంచే సామర్థ్యం, నాయకత్వం మనకుండాలి. మీరు భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే ఎవరినైనా రాజీనామా చేయించవచ్చు అని ఈ ఉద్యమం నిరూపించింది. విద్యార్థుల ఐక్యత ముందు ప్రభుత్వం తలవంచింది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరే గనక మమ్మల్ని బొద్దింకలు అని పిలవకపోయి ఉంటే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేవాడినే కాదు. మీరే గనక మమ్మల్ని కాక్రోచెస్ అని పిలవకపోయి ఉంటే దేశ యువత వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలెట్టేదేకాదు. మీరేగనక కాక్రోచ్ అని పిలవకపోయి ఉంటే ఈరోజు ధర్మేంద్ర మంత్రిగా రాజీనామా చేసేవాడేకాదు. ఇవన్నీ సుసాధ్యంకావడానికి పరోక్షంగా మీ కాక్రోచ్ వ్యాఖ్యలే కారణం. అందుకే మీకు కృతజ్ఞతలు’’ అని దీప్కే అన్నారు. వాంగ్చుక్కు థాంక్యూ చెప్పని దీప్కే! తాము ఘన విజయం సాధించామని నిరసన వేదికపై నుంచి ప్రకటించిన సందర్భంగా దీప్కే చేసిన ప్రసంగంలో సోనమ్ వాంగ్చుక్ పేరును ప్రస్తావించలేదు. కనీసం థాంక్యూ చెప్పలేదు. వాంగ్చుక్ నిరాహార దీక్షతోనే తొలుత నిరసనగా మొదలైన ఈ కార్యక్రమం తర్వాత ఉద్యమంగా ఉధృతరూపం దాల్చింది. అలాంటి వాంగ్చుక్ను దీప్కే తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో ఉద్యమనేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే కొత్త చర్చ మొదలైంది. అయితే ఉద్దేశపూర్వకంగానే వాంగ్చుక్ పేరును దీప్కే ప్రస్తావించలేదనే వాదనా విని్పస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా దీప్కే ప్రసంగంలోని మాటలు ఉండటం గమనార్హం. ‘మన డిమాండ్లు నెరవేరడంతో నన్ను హీరోను చేసేయకండి. కేవలం ఒక్క వ్యక్తిని హీరోను చేస్తూ పోవడంతోనే ఇప్పుడు భారత్ ఇలా అస్తవ్యస్తంగా తయారైంది. అలాంటి తప్పును మీరు చేయొద్దు’’ అని దీప్కే అన్నారు.ఇప్పుడే సూర్యోదయమైంది ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ను దీప్కే చెప్పారు. ‘‘మోదీజీ. ప్రజాస్వామ్యానికి ఇప్పుడే సూర్యోదయం అయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడే తొలి వికెట్ పడింది. మా ఉద్యమ ప్రయాణం మరెంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరని అందరూ మాతో చెప్పేవారు. కానీ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని మేము నిరూపించాం’అని దీప్కే అన్నారు. -
ఆందోళనల విరమణ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంతో ఉద్యమించిన యువత ఆరంభించిన ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) శనివారం ప్రకటించింది. నీట్ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తోపాటు ఆత్మహత్యలకు పాల్పడిన పరీక్షార్థుల కుటుంబాలకు తలో రూ.1 కోటి నష్టపరిహారం, జూన్ 20నాటి ఛలో సంసద్ ర్యాలీలో పోలీసులతో ప్రతిఘటించిన ఉద్యమకారులపై మోపిన కేసులన్నింటినీ ఎత్తేసేందుకు మోదీ సర్కార్ సమ్మతి తెలపడంతో తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ప్రభుత్వంతో జరిపిన నాలుగో దఫా చర్చలు ఫలవంతమయ్యాక సీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని మంత్రులతో కలిసి సంయుక్త మీడియా ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో కలిసి శనివారం ఢిల్లీలోని ‘కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో అశుతోష్ మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన ఆర్థిక సాయంతోపాటు ఢిల్లీ, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఉద్యమకారులపై నమోదైన కేసులను నాలుగు రోజుల్లోపు ఎత్తేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో నిరసనలకు నేటితో ముగింపు పలుకుతున్నాం. జంతర్మంతర్ సహా అన్ని నిరసనవేదికల నుంచి కార్యకర్తలంతా ఇళ్లకు బయల్దేరండి’’అని అశుతోష్ కోరారు. హామీల అమలు, విద్యావ్యవస్థ పటిష్టతకు తీసుకునే చర్యలపై సమీక్ష కోసం సీజేపీ, ప్రభుత్వ ప్రతినిధులు నాలుగు వారాల తర్వాత మళ్లీ భేటీ అవుతారని అశుతోష్ వెల్లడించారు. తర్వాత జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఉద్యమం ముగిశాక కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడవద్దు అని సీజేపీ ప్రతినిధులు కోరారు. మంత్రి రాజీనామా, బాధితులకు నష్టపరిహారం, కేసుల ఉపసంహరణతోపాటు పరీక్షల నిర్వహణ, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు వాళ్లు సూచించిన ఐదు పాయింట్ల చార్టర్ను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది’’అని నడ్డా తెలిపారు. -
'కాక్రోచ్' గెలిచింది
న్యూఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరూపించింది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉద్యమం వైపు మళ్లించి అనుకున్నది సాధించింది. సీజేపీ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. గత పది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల కలత చెందానని ఆయన చెప్పారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని స్పష్టంచేశారు. ఇప్పటి పరిస్థితిని దేశ విద్రోహ శక్తులు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వొద్దన్న కారణంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువతకు ప్రధాన్ లేఖ రాశారు. ఢిల్లీలో పరిణామాలు శనివారం చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్రం, సీజేపీ చర్చలు సఫలం మరోవైపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. సీజేపీ లేవనెత్తిన మరో రెండు కీలక డిమాండ్ల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, నిరసనకారులపై కేసులు కొట్టివేయాలని సీజేపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలియజేసింది. మొత్తానికి మూడు కీలకమైన డిమాండ్లు నెరవేరడంతో కాక్రోచ్ జనతా పారీ్టలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఆశించిన లక్ష్యం నెరవేరడంతో.. 49 రోజులుగా సాగుతున్న పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిరసన ప్రదేశాల నుంచి అందరూ శాంతియుతంగా వైదొలగాలని ఆ పార్టీ నేత సౌరవ్ దాస్ కోరారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నడ్డా వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని తెలిపారు. అయితే, ఎంత ఇస్తారన్నది ఆయన పేర్కొనలేదు. శనివారం జంతర్మంతర్ వద్ద విద్యార్థుల సంబరాలు జంతర్మంతర్ వద్ద సంబరాల హోరు కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సంగతి తెలియడంతో జంతర్మంతర్ వద్ద శనివారం పండుగ వాతావరణం నెలకొంది. నిరసనకారులు త్రివర్ణ పతాకాలు చేతబూని, కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ‘చక్ దే ఇండియా’వంటి పాటలు వినిపిస్తుండగా, వారు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. చాలామంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలను, పోస్టర్లను ప్రదర్శించారు. మంత్రి రాజీనామాను తమ పోరాటానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్మంతర్ వద్ద జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనుకున్నది చేసి చూపించామని చెప్పారు. భయపడకపోతే గెలవవచ్చనడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామే నిదర్శనమని స్పష్టంచేశారు. సోనమ్ వాంగ్చుక్ సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. శాంతి, సహనం, పట్టుదలకు దక్కిన విజయం అని తేల్చిచెప్పారు. సీజేపీకి, దేశంలోని జెన్ జెడ్కి అభినందనలు తెలియజేశారు. అవినీతికి ప్రతీక ప్రధాన్ ప్రధాని మోదీ మొండితనం ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ‘విక్టరీ ఆఫ్ ట్రూత్’గా అభివర్ణించారు. ‘‘యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. లాఠీలు, పెల్లెట్ గన్లతో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. ప్రభుత్వాన్ని ఎవరూ తమ సొంత జాగీరులా నడపలేమని బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి హెచ్చరిక జారీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక అని అని మండిపడ్డారు. ఆయన వెళ్లిపోవడం మంచిదేనని చెప్పారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై జరిగిన అకృత్యాలకు గాను ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప విజయం, దేశ ప్రజలందరికీ అభినందనలు’’అని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.ఒక వైపు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఆందోళన విరమించిన సీజేపీ
ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.వాంగ్చుక్ మాట్లాడుతూ.. నవభారత్కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్చుక్ కోరారు. -
ఈ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మన విద్యా వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే దిశగా చాలా పెద్ద అడుగని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఆయన ఎక్స్లో వీడియో రూపంలో మాట్లాడారు.‘‘దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులందరికీ అభినందనలు. మీ అందరిని చూస్తుంటే గర్వంగా ఉంది. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, తమ భవిష్యత్తును కాపాడేందుకు ధైర్యంగా నిలిచిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. విద్యార్థులను, భారత భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులు, కార్మికులు, పేదలు, ఈ ప్రభుత్వం అణచివేసిన ప్రతి ఒక్కరూ తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడటమే నిజమైన ధైర్యం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించే సమయం వచ్చింది. భయపడొద్దు’’ అని పేర్కొన్నారు. धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है। शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।सड़कों पर आ कर लोकतंत्र, संविधान और अपने भविष्य की रक्षा में डट कर खड़े होने वाले हर एक युवा, हर छात्र को बहुत-बहुत बधाई।2 मांगें… pic.twitter.com/Uc2cEOCVKA— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 -
ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వాలు
ప్రజా ఉద్యమాలు.. ప్రభుత్వాల నిర్ణయాలను మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన జన్ లోక్పాల్ ఉద్యమం నుంచి, నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఏడాదికిపైగా సాగిన చారిత్రాత్మక పోరాటం వరకు.. ప్రజల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. తాజాగా.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నిరసనలు మరోసారి ప్రజా ఉద్యమాల శక్తిపై చర్చకు తెరలేపుతున్నాయి.👉2011లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమం జన్ లోక్ పాల్ బిల్లు అవినీతి వ్యతిరేక పోరాట చేశారు. రామ్ లీలా మైదానంలో 13 రోజుల పాటు నిరవధిక నిరహార దీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తలొగ్గి జన్ లోక్ పాల్ బిల్లు తీసుకోచ్చింది.👉2012 డిసెంబర్ 15 ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక ఆత్యాచార ఘటన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి నిర్భయ చట్టాన్ని తీసుకోచ్చింది👉కేంద్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఏడాది పాటు సాగిన ఈ చారిత్రాత్మక పోరాటానికి తలొగ్గి, నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను అధికారికంగా రద్దు చేసింది.👉నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యత కోరుతూ జంతర్ మంతర్ వేదికగా నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తలొగ్గడంతో చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వాంగ్చుక్ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీ: ఇది ప్రజాస్వామ్య విజయం అని ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలన్నారు. ఇకపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సీజేపీ,జెన్జీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. విజయానికి సంకేతంగా 'వి' గుర్తును చూపుతున్న దృశ్యాన్ని ఆయన పంచుకున్నారు.నీట్ లీకేజ్లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.అయితే, ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గత శనివారం(జులై, 18) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిన ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఆయన దీక్ష విరమించారు. ఆయనకు మద్దతుగా కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. -
కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం గెలిచింది సీజేపీ నేతలు అన్నారు. కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాజీనామాకు తమ ఉద్యమమే కారణమని చెప్పుకున్నారు. "మేము ఇది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు" అని దీప్కే వ్యాఖ్యానించారు. "ఈ రాజీనామా ఒక రుజువు.. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వం ముందు తలవంచకపోతే, ఎవరి రాజీనామాను అయినా మనం సాధించగలం" అని ఆయన అన్నారు.కేంద్ర మంత్రి రాజీనామాతో NEET-UG వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. తదుపరి విద్యాశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది, అలాగే పరీక్షా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టనున్న సంస్కరణలపై దేశవ్యాప్తంగా విద్యార్థి వర్గాల్లో ఆసక్తి నెలకొంది.#WATCH | Delhi: Moment when Union Education Minister Dharmendra Pradhan resigned from his post; visuals from the protest at Jantar Mantar pic.twitter.com/6YNf9LN3bN— ANI (@ANI) July 25, 2026 -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సీజేపీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ఆయన రాజీనామాతో సీజేపీ పోరాటం ఫలించింది. సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.‘‘భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం...జంతర్-మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను...నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.pic.twitter.com/VSArqS98OJ— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026 -
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
చర్చల్లో బిగ్ ట్విస్ట్.. కేంద్రానికి షాకిచ్చిన సీజేపీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మధ్య మూడో విడత చర్చలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. రాజీనామాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చర్చలను కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని శనివారం తేల్చిచెప్పింది.సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమకు చర్చలకు అతీతమైన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే తదుపరి చర్చలకు అర్థం ఉండదని స్పష్టం చేశారు.Dharmendra Pradhan’s resignation is NON-NEGOTIABLE.If it’s a no from the government, there’s no point of further discussion.— Ashutosh Ranka (@AshutoshRanka) July 25, 2026‘ముందు రాజీనామా.. ఆ తర్వాతే చర్చలు’నీట్ సహా పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం జరగనున్న మూడో విడత చర్చలకు ముందు సీజేపీ చేసిన ఈ ప్రకటనతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో సీజేపీ తన ప్రధాన డిమాండ్పై మరింత కఠిన వైఖరి ప్రదర్శించింది.రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలతఇప్పటికే జరిగిన చర్చల్లో సీజేపీ చేసిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండు అంశాలపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయకూడదన్న డిమాండ్పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలన్న డిమాండ్ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇందుకోసం ఈ మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరింది. అయితే రాజీనామాపై స్పష్టత ఇచ్చాకే చర్చలను ముందుకు తీసుకెళ్తామని సీజేపీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.రాజీనామాకు నో?మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, అది బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల అభిప్రాయం. పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సంస్కరణలు చేపట్టడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న సీజేపీప్రధాన్ రాజీనామాపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని సీజేపీ హెచ్చరిస్తోంది. చర్చల ఫలితం ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఆందోళనలు ప్రస్తుతం కేంద్రం–సీజేపీ మధ్య ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మూడో విడత చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
‘జంతర్ మంతర్’ ఎఫెక్ట్: మందుబాబులకు షాక్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వారాంతపు రోజుల్లో మద్యం దుకాణాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని మద్యం దుకాణాలను వారాంతం వరకు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ దుకాణాలు, భద్రతా కారణాల రీత్యా ముందుగానే మూతపడనున్నాయి.పోలీసుల నుంచి అందిన భద్రతా సమాచారం ప్రకారం నిఘా వర్గాల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గురువారం నాడు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసు ఇవ్వకుండానే దుకాణాలు అకస్మాత్తుగా ముందుగానే మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారాంతం ముగిసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనల కారణంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మద్యం దుకాణాల సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో వారాంతంలో మద్యం ప్రియులకు నిరాశ ఎదురుకానుంది.ఇది కూడా చదవండి: గుండెకు సొంత ‘మెదడు’.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి! -
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది. సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందివిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందివిద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారువిద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డాత్వరలోనే పరిహారం ఇస్తాంనిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాంసీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాంమూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీవిద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందివిద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిపరిహారంపై కూడా స్పష్టత ఇచ్చిందివిద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలిఆందోళన విరమించిన సీజేపీసీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలుసీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలుచర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీసెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లువిద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలుఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపుమరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపుఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గేఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలియువత ధైర్యంగా పోరాడిందిఢిల్లీ:ప్రధాని మోదీతో అమిత్ షా భేటీతాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలుమిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్చుక్శాంతికి, సహనానికి చెందిన విజయం ఇదిఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలిఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలిసీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు జంతర్మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలుఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీమిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాంవిద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీకేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీవిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదుఈ విజయం విద్యార్థులందరిదికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామాసీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామారాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్జంతర్మంతర్ సమీపంలో ఉద్రిక్తతపోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులుఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగంజంతర్మంతర్లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్జంతర్ మంతర్ను ముట్టడించడం ఆపండిదీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దునిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలిజంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటనజంతర్మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్మీట్అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయిసోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారుదీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందిపాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి400కి పైగా పాక్ హ్యాండిల్స్ను బ్లాక్ చేశాంఏఐ కట్టడికి కృషి చేస్తున్నాంఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయిరేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపుమరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీరేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపుఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదునిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలుకీలక డిమాండ్పై కొలిక్కి రాని చర్చలుఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులుమంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటనजिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతుసీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతువిద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందిపేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణంకచ్చితంగా ఆయన రాజీనామా చేయాలిసీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావంశనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారులాఠీలతో తలలు పగలకొట్టారుపిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలినీట్ లీక్పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలిఅవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారుఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారుఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదుఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరుయువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు టైఫాయిడ్తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేచికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలుఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుందిధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారుపోరాటం ఇలాగే కొనసాగించాలని సూచనకోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్యమోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలుఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలునేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచనకొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్యయువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్“ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్యరాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్చుక్ వివరణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్చుక్కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలునిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్చుక్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు.రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్చుక్ తెలిపారు.ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు."నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు."డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్చుక్ అన్నారు. AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్చుక్ చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతువాంగ్చుక్ వైరల్ వీడియోపై సఫ్దర్జంగ్ ఆస్పత్రి వివరణసోనమ్ వాంగ్చుక్ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో రికార్డైన దృశ్యాలు బయటకు వైరల్గా మారిన వీడియో‘‘నేను వెళ్తున్నా.. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు సవాల్ విసిరిన వాంగ్చుక్వైరల్ వీడియోపై స్పందించిన సఫ్దర్జంగ్ ఆస్పత్రి జూలై 21న ఆస్పత్రిలోని నో-వీడియోగ్రఫీ జోన్లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.వాంగ్చుక్ అనుచరులు ఈ వీడియోను చిత్రీకరించారని స్పష్టీకరణరికార్డు చేసిన వెంటనే కాకుండా శుక్రవారం విడుదల చేశారని స్పష్టం చేసింది.ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించారంటూ వివరణ ఇచ్చిన సర్దర్జంగ్ ఆస్పత్రికేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలుకేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుందినీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుపేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.సీజేపీ హెచ్చరికలు..రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలునిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగాఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm— Press Trust of India (@PTI_News) July 25, 2026సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చుజంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారుPolice Fortifies Jantar Mantar,A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026ఇంటర్నెట్ నిలిపివేత..సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేతపని చేయని మొబైల్ డేటా సర్వీసెస్బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X— ANI (@ANI) July 25, 2026 మెట్రో మూసివేత..సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత18 మెట్రో స్టేషన్లు క్లోజ్ లోక్ కల్యాణ్ మార్గ్రాజీవ్ చౌక్పటేల్ చౌక్రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్బారఖంబా రోడ్సుప్రీం కోర్ట్సేవా తీర్థ్జనపథ్మండి హౌస్సెంట్రల్ సెక్రటేరియట్ఐటీఓఢిల్లీ గేట్ఇంద్రప్రస్థఖాన్ మార్కెట్జోర్ బాగ్శివాజీ స్టేడియంఝండేవాలాన్న్యూ ఢిల్లీకేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసనధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలుకేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. -
ఒక్కరి రాజీనామాతో ఆగదా?: సీజేపీ సంచలన వ్యాఖ్యలు
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు కోరుతూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తోనే ఆగిపోదని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని సీజేపీ తాజాగా ప్రకటించింది. కేంద్రంతో నిన్నటి చర్చలు, కొనసాగుతున్న ఆందోళనల నడుమ సీజేపీ ప్రతినిధి(చర్చల) అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, ఇది “టైమ్ బాంబ్”లా మారుతోందని.. ఏ క్షణమైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.‘ఇక డిమాండ్లు మారొచ్చు’సీజేపీ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే.. నీట్ మరణాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. నీట్ నిరసనల్లో విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని మరో రెండు డిమాండ్లు ఉంచారు. వీటిల్లో.. మంత్రి రాజీనామా అంశంపై కేంద్రం ఒక్కరోజు గడువు కోరింది. ఇవాళ.. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఆ భేటీలో కేంద్రం ఏం చెప్పనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రంకా మాట్లాడుతూ.. అసంతృప్తి క్రమంగా పెరిగితే అది కేవలం ఒక్కరి రాజీనామా డిమాండ్కే పరిమితం కాకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. “ఇక ఈ డిమాండ్ మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది” అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే.. మరిన్ని రాజీనామాలు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడారు. అంతకు ముందు దీప్కే కూడా..విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేరిస్తేనే తాము ఆందోళనలను విరమిస్తామని.. అప్పటిదాకా జంతర్ మంతర్లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం మొండిపట్టు పడితే.. అవసరమైన పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ రాజీనామా కూడా డిమాండ్ రావచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. చర్చల్లోనూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ వివాదంలో ప్రభావిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై చర్చ జరిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నీట్ వివాదం.. బాధ్యతపై పోరునీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం పరీక్షల అంశంగా కాకుండా.. ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండగా.. మరోవైపు నిరసనకారులు వ్యవస్థాపరమైన మార్పులతో పాటు రాజకీయ బాధ్యతను కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకొచ్చాయి. ఉద్యమం ఏ దిశగా సాగుతుంది.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
మోదీ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది మరి!
నరేంద్ర మోదీ.. ఈ పేరుకు ఉన్న గ్లోబల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి లభించే ఆదరణకు ఇదే నిదర్శం కూడా. అలాంటి వ్యక్తి తొలిసారి జాతిని ఉద్దేశించి.. అదీ నీట్లాంటి నిరసనల మీద సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో ఊహించగలరా?. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం రాత్రి మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. పేపర్ లీక్పై ఆందోళనలను అర్థం చేసుకున్నామని, కఠిన చర్యలకు దిగుతున్నామని ప్రకటించారు. ఇకనైనా ఆందోళనలు విరమించాలి అంటూ పరోక్షంగా ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కోట్లాది మంది వీక్షణలు, లక్షల సంఖ్యలో స్పందనలతో ఆ వీడియో వైరల్గా మారింది.ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ సెల్ఫీ వీడియోకు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. 10 లక్షలకు పైగా కామెంట్లు, కోటిన్నరకు పైగా లైక్స్తో దూసుకుపోతోంది. అయితే అన్ని ప్లాట్ఫారమ్లతో కలిపి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026నీట్ వివాదంపై వీడియో సందేశంలో స్పందించిన ప్రధాని.. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత ఆశలు, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని భరోసా ఇచ్చారు.ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. ప్రధాని సందేశాన్ని స్వాగతించిన పలువురు.. ఇది విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం నీట్ వివాదంలో బాధ్యులపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.శుక్రవారం రాత్రి మరో వీడియోను రిలీజ్ చేశారాయన. ఈసారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మోదీ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక మోదీకి ఉన్న వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్, సోషల్ మీడియా ప్రభావం మరోసారి ఈ వీడియోల ద్వారా చర్చకు వచ్చింది. దేశీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ భారీ స్థాయిలో ప్రజలతో అనుసంధానమవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువతకు చేరువ కావాలంటూ మంత్రులకు సైతం నిన్నటి కేబినెట్ భేటీలో మోదీ సూచించడం గమనార్హం. నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో.. కేవలం ఓ రాజకీయ సందేశంగానే కాకుండా, సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ప్రజాదరణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్చుక్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్.. తన దీక్ష విరమణపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. కేంద్రంతో ‘డీల్ కుదుర్చుకుని’ దీక్ష విరమించారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడి నుంచే నేరుగా ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.. ‘‘26 రోజుల పాటు ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా?’’ అంటూ ప్రశ్నించారు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్చుక్ మాట్లాడుతూ.. తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.‘నా శరీరం ఎంత నష్టపోయిందో తెలుసా?’దీక్ష విరమణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి వాంగ్చుక్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యల కోసం తాను ప్రాణాలను సైతం పణంగా పెట్టానని తెలిపారు. ‘‘26 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాను. నా శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఇంత చేసిన తర్వాత కూడా నా నిబద్ధతకు సర్టిఫికెట్ కావాలా?’’ అని ప్రశ్నించారు. తన పోరాటాన్ని, త్యాగాన్ని రాజకీయ లెక్కలతో అంచనా వేయొద్దని కోరారు.ఐసీయూలో వాంగ్చుక్.. 11 కిలోల బరువు తగ్గింపువాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా విమర్శలపై స్పందించారు. 26 రోజుల నిరాహార దీక్ష కారణంగా ఆయన 11 కిలోల బరువు కోల్పోయారని, అందులో కండరాల నష్టం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం వాంగ్చుక్ గురుగ్రామ్లోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‘‘విమర్శించే ముందు ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోండి. 26 రోజుల పాటు ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తికి కనీసం కాస్త సానుభూతి చూపించండి’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026ఎందుకు దీక్ష విరమించారు?నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ల నుంచి కొన్ని హామీలు రావడంతో గురువారం ఆయన దీక్షను విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోకుండా చూడటం, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించడం, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాన్ని పరిశీలించడం వంటి హామీలు లభించాయని వాంగ్చుక్ తెలిపారు.విమర్శల మధ్య కొనసాగుతున్న చర్చదీక్ష విరమణ తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే వాంగ్చుక్ మాత్రం తన పోరాటం వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని స్పష్టం చేశారు. ‘‘ఇది వ్యక్తిగత విజయం కోసం చేసిన పోరాటం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు. -
పెల్లెట్ గన్లు గురిపెట్టారు
న్యూఢిల్లీ: జంతర్మంతర్ వద్ద ఈ నెల 20వ తేదీన శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా పెల్లెట్ గన్స్తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెల్లెట్స్ ఉపయోగించారనడానికి ఈ విద్యార్థే నిదర్శనమంటూ సాహిల్ అనే యువకుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పునరుద్ఘాటించారు. సాహిల్ త్రివర్ణ పతాకం చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అతడిపై పెల్లెట్ గన్తో దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. సాహిల్ కన్ను దెబ్బతి న్నదని, ఆ కంటితో అతనికి ఏమీ కనిపించడం లేదని తెలిపారు. సాహిల్ శరీరానికి తగి లిన గాయాలను సైతం రాహుల్ మీడియాకు చూపించారు. వేలాది మంది యువతకు ఇదే పరిస్థితి ఎదురైందని, వారిపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. నిరసనకారులు చేసిన నేరం ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక ‘క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత విద్యా వ్యవస్థ పతనానికి ప్రతీకగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. -
నిరసనకారులపై ఏఐ నజర్!
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని, పేపర్ లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద యువత, విద్యార్థు లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే, ఉద్యమకా రులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంతర్మంతర్ వద్ద నిరసనకు సంబంధించిన వీడియోలను చాలామంది ‘ఎక్స్’లో పోస్టు చేస్తున్నారు. నిరసన కారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది కచ్చితంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు(ఫేసియల్ రికగ్నిషన్) వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’లో పోస్టుచేసిన వీడియో క్లిప్లలో 360 డిగ్రీల కెమెరాలతో కూడిన లైవ్ సీసీటీవీ నిఘా వాహనం ద్వారా తీసిన దృశ్యాలు కనిపిస్తు న్నాయి. వాహనం లోపల ఉన్న స్క్రీన్ మీద కొందరు నిరసనకారుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు కూడా దర్శనమి స్తున్నాయి. ఆ వీడియో ల్లో ఎక్కడా ఆధార్ కార్డు వివరాల ప్రస్తావన లేదు. అయితే, వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసిన తర్వాత వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇచ్చే వ్యవస్థను పోలీసులు ఉపయో గిస్తున్నట్లు నిరసనకారులు అనుమానిస్తున్నారు. ఇది ఆధార్తో లేదా మరేదైనా ప్రభుత్వ డేటా బేస్తో అనుసంధానమై ఉండొచ్చని అంటున్నా రు. పోలీసులు ఆధార్ డేటాను ఉపయోగిస్తున్నట్లు అధికారిక ధ్రువీకరణ లేదు. తమ సాంకేతిక వ్యవస్థను ఆధార్ డేటాబేస్తో అనుసంధానించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పడం లేదు. జంతర్మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి సమీపంలో ఢిల్లీ పోలీసులు రెండు నిఘా వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మొబైల్ పర్యవేక్షణ యూనిట్గా పనిచేస్తూ, ఆ ప్రాంతం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను స్వీకరిస్తుంది. రెండో వాహనం కృత్రిమ మేధను ఉపయోగించి ఆ వీడియో ఫీడ్లను విశ్లేషించి, కెమెరాలో బంధించిన ముఖాలను పోలీసుల డేటాబేస్లో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చి చూస్తుంది. నిరసనకారులను ప్రత్యక్షంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ వ్యాన్లను మోహరించారని, వారు అక్కడికక్కడే బయో మెట్రిక్ వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటాను వెలికితీస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. అయితే, తమ ఉద్దేశశం నిరసనకారులందరినీ గుర్తించడం కాదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జన సమూహంలో నేర చరిత్ర ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులను అప్రమత్తం చేయడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు. ‘‘నేరగాళ్ల ఫొటోలతో కూడిన ఒక పెద్ద డేటాబేస్ మా దగ్గర ఉంది. అందువల్ల జంతర్మంతర్ ప్రాంతంలోని వివిధ సీసీటీవీ కెమెరాల నుంచి మాకు అందిన ఫుటేజ్ ఆధారంగా ముఖ గుర్తింపు చేస్తాం. తద్వారా అక్కడ నేరగాళ్లు ఉంటే అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది’’ అని పోలీసులు స్పష్టంచేశారు. -
మారని తీరు..సాగని సభలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు వరుసగా ఐదో రోజూ ఉభయసభల ప్రతిష్ఠంభనతోనే ముగిశాయి. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై వెంటనే చర్చ చేపట్టాలని, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులు పట్టుబట్టడంతో లోక్సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పేపర్ లీక్పై ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా, ముందుగా ప్రధాన్ను తొలగించాల్సిందేనంటూ ప్రతిపక్షం పట్టుబట్టింది. విపక్ష ఎంపీల ఆందోళనలతో పలుమార్లు వాయిదా పడింది. ఉభయసభలను చివరకు సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. చర్చను అడ్డుకుంటుంది మీరే: కిరణ్ రిజిజు లోక్సభ శుక్రవారం తొలి వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాక సైతం విపక్షాలు ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతూ నినాదాలతో సభను హోరెత్తించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనిపై స్పందిస్తూ.. ప్రభుత్వం మొదటి నుంచీ నీట్ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షమే షరతులు విధిస్తూ సభను నడవనివ్వడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఇప్పటికే నీట్ విషయంలో దేశానికి హామీ ఇచ్చారని, నీట్లో జరిగిన అవకతవకలు, ప్రశ్న పత్రం లీక్లను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ, ‘మీరు మీ పార్టీ సభ్యులను ఒప్పించండి. సభను అడ్డుకోవడం మాని దేశ యువతకు సంబంధించిన ఈ కీలక అంశంపై చర్చ జరగనివ్వండి. పార్లమెంట్ సమయాన్ని వృథా చేయొద్దు’అని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష ఎంపీల నిరసనలు సద్దుమణగలేదు. ప్రతిపక్ష సభ్యులు ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’అంటూ నినాదాలు కొనసాగించడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు రాజ్యసభలో వందేమాతరం బిల్లు.. రాజ్యసభలోనూ విపక్షాలు నిరసనలు కొనసాగాయి. పేపర్లీకేజీ డిమాండ్తో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, మంత్రి ప్రధాన్ రాజీనామా చేయకపోవడంపై ప్రతిపక్ష నేత ఖర్గే ప్రస్తావించిన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం నెలకొని, సభ వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు–2026‘ను ప్రవేశపెట్టారు. జనగణమనతో సమానంగా వందే మాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. అయితే ఈ బిల్లును సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. సీపీఐ సభ్యుడు సంతోష్ కుమార్ విద్యార్థుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. అనంతరం ప్రతిపక్ష నిరసనలు కొనసాగడంతో రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.ప్రధాన్ తొలగింపే మొదటి షరతు: రాహుల్ మంత్రి రిజిజు ప్రకటన అనంతరం పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించకపోతే ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ‘విద్యార్థుల డిమాండ్లు మూడున్నాయి. అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించడం. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడం. ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పడం... ఈ మూడు డిమాండ్లు నెరవేర్చకుండా ఎలాంటి చర్చ జరగదు’అని తేల్చి చెప్పారు. -
ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించాల్సిందే.. రాజీ ప్రసక్తే లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తేల్చిచెప్పింది. ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ నెల 20న నిరసన సందర్భంగా విద్యార్థులపై క్రూరంగా దాడి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణ చెప్పాలని స్పష్టంచేసింది. పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఢిల్లీలో రెండో విడత చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్, సీజేపీ తరఫున పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా పాల్గొన్నారు. తాజా పరిణామాలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులకు అందజేశారు. ప్రస్తుతం సీజేపీ పోరాటం మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన రాజీనామా చేసే దాకా విడిచిపెట్టబోమని ఆ పార్టీ పదేపదే చెబుతోంది. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రధాన్ రాజీనామా చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకారం! కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ మూడు డిమాండ్లలో రెండింటికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. గడువులోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తమఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపబోమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్కు ఉద్వాసన పలుకుతారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, సీజేపీ డిమాండ్లలో రెండింటికి తాము అంగీకరించినట్లు కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు మరోసారి చర్చలు: నడ్డా సీజేపీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వంతో అంతర్గతంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వారితో శనివారం మధ్యాహ్నం మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నాటి భేటీ అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. సీజేపీ ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లతోపాటు పరీక్షల కోసం ఐదు సంస్కరణలు సూచించారని వెల్లడించారు. అంతర్గతంగా చర్చించి.. తీసుకున్న నిర్ణయాలను శనివారం మధ్యాహ్నం జరిగే మూడో విడత భేటీలో వారికి తెలియజేస్తామని పేర్కొన్నారు. సీజేపీ ప్రధాన డిమాండ్లు → దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. → పేపర్ లీకేజీ, పరీక్షల రద్దు తదితర పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున ఆర్థిక పరిహారం చెల్లించాలి. → న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే బేషరతుగా కొట్టివేయాలి. -
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అకౌంటబిలిటీ కోరిన పాపానికి మోదీ ప్రభుత్వం విద్యార్థులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, ఈ దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీప ఆర్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించార.ఉ. దేశ విద్యా వ్యవస్థను దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ దేశ విద్యార్థులు బట్టబయలు చేశారని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పక్షాన నిలవడం నైతికంగానే కాకుండా రాజకీయ, రాజ్యాంగబద్ధ ధర్మం కూడా అని స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహలను కలిగించే విద్యావ్యవస్థ, మోడీ ప్రభుత్వపు అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యం వంటి అంశాలన్నీ నిరసనలకు దారితీయడం సహజ పరిణామమేనని సోనియాగాంధీ ‘ద హిందూ’పత్రికలో ‘ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్, యంగ్ ఇండియాస్ ట్రామా’శీర్షికతో రాసిన కథనంలో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ‘ఛలో సంసద్’సందర్భంగా విద్యార్థులపై చూపిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదని, 2020లో సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్బంగానూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దారుణంగా వ్యవహరించాయని, మహిళ రెజ్లర్లపై జరిగిన దమనకాండను కూడా ఈ దేశం మరచిపోలేదని అన్నారు. విద్యార్థులు ధైర్యంగా వేస్తున్న ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పిరికితనంతో జవాబు చెబుతోందని, క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడంలో దారుణంగా విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ప్రజల మనసుల్లో గూడుకట్టుకుపోయిన ఆగ్రహానికి ఆజ్యం పోసిందని అన్నారు. ఎనీ్టయేను శక్తిమంతం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచి్చన సలహాలను బహిరంగంగానే తిరస్కరించడం ద్వారా ప్రధాన్ ధిక్కారాన్ని ప్రదర్శించడమే కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆ కథనంలో ఆరోపించారు. -
నిరసనలపై విచారణ 27న రెండు పిల్స్పై విచారిస్తాం
న్యూఢిల్లీ: జంతర్మంతర్లో విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ఈ నెల 27న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై దాఖలైన రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేస్తామని ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యాదవ్ జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ తెలిపింది. ‘‘విద్యార్థులపై పోలీసులు అతిగా బలం ఉపయోగించారు’’అని, ఇది రోజూ జరుగుతున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించగా సీజేఐ స్పందించారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నెలరోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 20వ తేదీన నిర్వహించిన ‘ఛలో సంసద్’ర్యాలీలో పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసుల చర్యను గర్హిస్తూ జూలై 22న ఢిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయ. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసుల స్పందనను కోరింది. పోలీసుల చర్యకు సంబంధించిన అన్ని రికార్డులను, సీసీటీవీ ఫుటేజ్లను భద్రపరచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మీడియాది అతి నిర్లక్ష్యం: సీజేఐ ఛలో సంసద్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశంపై సత్వర విచారణను తాను నిరాకరించినట్లు వచ్చిన వార్తలను సీజేఐ సూర్యకాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆ అంశంపై ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాలేదని, ఒక రిప్రెజెంటేషన్ మాత్రమే అందిందని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. తమ కేసులను అత్యవసరంగా లిస్ట్ చేయాలని న్యాయవాదులు కోరుతున్న సమయంలో సీజేఐ మాట్లాడుతూ ‘‘రెండు రోజులుగా పిటిషన్ ఫైల్ అయినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. మీడియా అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పించుకని చీఫ్ జస్టిస్ ఆ పిటిషన్ను లిస్ట్ చేసేందుకు నిరాకరించారని తప్పుడు రిపోరి్టంగ్ చేస్తోంది’’అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆ రోజు ఉదయం పదిగంటల వరకూ ఒక్క కాగితమూ దాఖలు కాలేదు. ఒక రిప్రజెంటేషన్ మాత్రమే.. మిశ్రానో ఇంకెవరో పంపారు. దాన్ని రిట్ పిటిషన్గా ఎలా పరిగణిస్తా’’అని ప్రశ్నించారు. బుధవారం ఒక న్యాయవాది విద్యార్థులపై లాఠీఛార్జ్ విషయమై అత్యవసర విచారణ జరపాలని సీజేఐని కోరుతూ.. ‘‘పోలీసుల అకృత్యాలపై నా దగ్గర వీడియోలున్నాయి.... కేసు రేపు (గురువారం) లిస్ట్ చేయగలిగితే... విద్యార్థులు ఉన్నారు’’అని విన్నవించారు. అయితే సీజేఐ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతోపాటు కేసులు ప్రస్తావించే సమయంలో వీడియోలు చూడలేమని స్పష్టం చేశారు. విద్యార్థులను బాగా కొట్టారని న్యాయవాది తెలపగా.. ‘‘మా సమయం వృథా చేయవద్దు. మేము వీడియోలు చూడదలచుకోలేదు’’అని ఘాటుగా సమాధానమిచ్చారు. -
డిజిటల్ అరెస్ట్లపై దేశంలో ఎక్కడైనా సీబీఐ దర్యాప్తు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా నేరాలు దేశంలో ఎక్కడ వెలుగు చూసినా దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి పూర్తి అధికారాలు కల్పించింది. అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి నిలువునా దోచుకుంటున్న ఈ సైబర్ నేరాలను వ్యవస్థీకృత నేరంగా అత్యున్నత న్యాయస్థానం అభివరి్ణంచింది. హరియాణాకు చెందిన 73 ఏళ్ల వద్ధురాలిని నకిలీ ఆదేశాలతో భయపెట్టి రూ.కోటి మేర దోచుకున్న ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. విచారణలో భాగంగా శుక్రవార న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్, స్కైప్, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తు సంస్థలు నోటీసులు, సమన్లు జారీ చేయరాదని స్పష్టం చేసింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 35 ప్రకారం నోటీసులను భౌతికంగానే అందజేయాలని తేలి్చచెప్పింది. ద ర్యాప్తునకు ఆటంకాలు లేకుండా అన్ని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం–1946 కింద సీబీఐకి అనుమతులు ఇవ్వాల ని ఆదేశించింది. సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్మును గుర్తించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెరి్నంగ్ టూల్స్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంక్కు సూచించింది. ఏకంగా మూడు వేల కోట్లు కొట్టేశారుడిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాల తీవ్రతను గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో 1.23 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫిర్యాదులు నమోదయ్యాయి. కేవలం ఆ ఒక్క ఏడాదే బాధితుల నుంచి రూ.1,935 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. 2025 మొదటి రెండు నెలల్లోనే కొత్తగా 17,718 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటివరకు మొత్తంగా సుమారు రూ.3,000 కోట్ల మేర సీనియర్ సిటిజన్లు, ఇతర సామాన్యుల నుంచి నేరగాళ్లు లాగేసినట్లు అంచనా. మన దేశ చట్టాల్లో గుర్తింపు లేదుడిజిటల్ అరెస్ట్ అనే పదానికి దేశ చట్టాల్లో ఎలాంటి గుర్తింపూ లేదని న్యాయస్థానం తెలిపింది. వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్, విచారణల పేరుతో బెదిరింపులకు గురిచేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 కల్పిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇవి కేవలం ఆర్థిక నేరాలు మాత్రమే కాదని, అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న వ్యవస్థీకృత నేరాలని స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 111 కింద సైబర్ నేరాలపై కేసులు నమోదు చేయాలని సూచించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) అధికార పరిధి సమస్యలు తలెత్తకుండా ‘మకోకా’లాంటి కఠినమైన చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.మోసం సాగుతోందిలా... పోలీసులు, సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారుల పేరుతో నేరగాళ్లు బాధితులకు వీడియో కాల్స్ చేస్తారు. నకిలీ యూనిఫాంలు, ఐడీ కార్డులు, సెట్టింగులతో నమ్మిస్తారు. డ్రగ్స్ పార్శిల్, మనీ లాండరింగ్ లాంటి తీవ్రమైన నేరాల్లో ఇరుక్కున్నారని భయపెడతారు. ఎవ్వరితోనూ మాట్లాడనివ్వకుండా రోజుల తరబడి వీడియో కాల్లోనే ఉంచుతూ మానసికంగా వేధిస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. భయపడిన బాధితులు అడిగినంత డబ్బు పంపగానే నేరగాళ్లు అదృశ్యమవుతారు. వాస్తవానికి వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సీజేపీ కార్యకర్తల ఆందోళన.. నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు : సీజేఐ
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలపై మీడియాలో వస్తున్న కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. కోర్టు సమయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు.ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. దీని వెనుక ఉన్న అసలు సందర్భాన్ని వివరించారు. ఈ పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలను సీజేఐ పూర్తిగా కొట్టిపారేశారు. అత్యున్నత న్యాయస్థానం ఏనాడూ ఏ కేసు విచారణను కూడా తిరస్కరించదు. ప్రజలకు న్యాయం చేసేందుకు మేము 24 గంటలూ అందుబాటులో ఉంటాము అని ఆయన తేల్చి చెప్పారు.అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇస్తూ.. మా ముందుకు అధికారికంగా పిటిషనే రానప్పుడు, మేము దేనిపై విచారణ జరుపుతాము? కేవలం ఒక పేజీ లేఖ ఇచ్చి, దానిపై వెంటనే అత్యవసర విచారణ చేపట్టమంటే కుదరదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. వాటిని మేము ఉల్లంఘించలేము. పిటిషన్ను సరైన పద్ధతిలో దాఖలు చేయాలని నేను వారికి చెప్పాను. కానీ వారు తక్షణమే విచారణ కావాలని పట్టుబట్టారు. అందుకే నిబంధనల ప్రకారం సరైన పిటిషన్ ఫైల్ చేయాలని వారికి స్పష్టం చేయాల్సి వచ్చింది అని సీజేఐ వివరించారు.చట్టం అందరికంటే ముందు సుప్రీంకోర్టుకు అత్యున్నతమైనదని, దానిని మనమందరం అనుసరించాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు నిబంధనల ప్రకారం సరైన రూపంలో దాఖలైన ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించిందని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడిని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరపనుంది. -
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్
ఢిల్లీ :కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. సోషల్ మీడియాలో మంత్రులు యాక్టివ్గా ఉన్నారా.. లేదా అని నిలదీశారు. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారని ఆరా తీశారు. మంత్రులందరూ సోషల్ మీడియాలో కచ్చితంగా యాక్టివ్గా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందులో పోస్ట్ చేయడం కాదు.. వాటి గురించి అర్థం అయ్యేలా వీడియోలు పోస్ట్ చేయాలన్నారు. యువత ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, మంత్రులు కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిందేనన్నారు మోదీ. -
కేంద్ర మంత్రి రాజీనామా.. ఎందుకంటే?
ఢిల్లీ: పంజాబ్ బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ శుక్రవారం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆయన.. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రాజీనామా చేశారు. వచ్చే ఏడాది పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనలో ఉన్న ఈ సరిహద్దు రాష్ట్రంలో వచ్చే ఏడాది బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడైన బిట్టూ.. 2024లో బీజేపీలో చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అనంతరం కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఖాళీ చేసిన రాజస్థాన్ రాజ్యసభ స్థానానికి నామినేట్ కావడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమాపై బిట్టూ విమర్శలు గుప్పించారు. పంజాబ్కు సంబంధించిన పలు సున్నిత అంశాలున్నాయని.. ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందన్నారు. -
విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. పోలీసు ఉద్యోగాలకు గుడ్ బై
న్యూఢిల్లీ: నీట్ అక్రమాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యామంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) పోరాటం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో ఒక్కపక్క చర్చలు జరుపుతూనే ఉద్యమాన్ని నడిపిస్తోంది. మరోవైపు విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు వస్తోంది. యువతపై పోలీసుల దమనకాండను ముక్తకంఠంతో అందరూ ఖండిస్తున్నారు. తాజాగా ఇద్దరు పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా తాము ఉద్యోగాలు వదులుకుంటున్నట్టు ప్రకటించారు.ఉత్తరాఖండ్కు చెందిన షేర్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్ శుక్రవారం ఢిల్లీ జంతర్మంతర్లో తన ఉద్యోగానికి రాజీనామా ప్రకటించారు. ధర్నా వేదికపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. 'పట్వారీ' ఉద్యోగ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కిరాణా దుకాణాల్లో దొరికిందని షేర్ సింగ్ ఆరోపించారు. 2021 నుంచి ఉత్తరాఖండ్లో పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు."ఇది భగత్ సింగ్ దేశం, విప్లవం బాంబులు లేదా పిస్టల్స్ ద్వారా రాదు... మనం ఈ దుర్మార్గులను ఎదుర్కొంటాం. విప్లవం ఆలోచనల నుంచి పుడుతుంది, ఆ ఆలోచనలు ఎప్పటికీ నశించవు" అని ఆయన అన్నారు. ఆ తర్వాత తన పోలీసు బ్యాడ్జ్ను తీసి అభిజిత్ దిప్కేకు అప్పగించారు. అయితే, ఆ కానిస్టేబుల్ను ఇప్పటికే సస్పెండ్ చేశామని ఉత్తరాఖండ్ పోలీసులు తర్వాత తెలిపారు.ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల సమక్షంలో రవి కుమార్ అనే వ్యక్తి ప్రకటించాడు. సెలువులో ఉన్న తనను విధుల్లో చేరాలని పై అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపాడు. "నాకు ప్రభుత్వ నివాసం వద్దు, ప్రభుత్వ వాహనం వద్దు, ప్రభుత్వ జీతం కూడా వద్దు" అని ప్రకటించాడు.మాకు సంబంధం లేదుఢిల్లీ పోలీసులతో రవి కుమార్కు ఎటువంటి సంబంధం లేదని డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక విభాగమైన 'ఢిల్లీ హోమ్ గార్డ్స్'లో అతడు వలంటీర్ మాత్రమేనని వెల్లడించింది. దుష్ప్రవర్తన కారణంగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపింది. జంతర్ మంతర్ వద్ద కుమార్ చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిగత అభిప్రాయాలని, అవి ఢిల్లీ హోమ్ గార్డ్స్, ఢిల్లీ పోలీసులు లేదా ఏ ప్రభుత్వ సంస్థ అభిప్రాయాలు కాదని పేర్కొంది. చదవండి: విద్యార్థుల ఉద్యమం.. తరలివచ్చిన సినీ తారలు -
NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఏ నుంచి 47మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో జేఈఈ , నీట్ సహా సుమారు 20 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. -
బొద్దింకలను ఏరిపారేయండి.. మాజీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాక్రోచ్లను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీని కోరారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. గతంలో ఎక్కడ బొద్దింకలు కనిపించినా వాటిని చీపురుతో ఊడ్చి పారవేసేవారని, కానీ ఇప్పుడు ఆ చీపురు, బొద్దింక స్నేహితులయ్యాయయని, తద్వారా దేశవ్యాప్తంగా మురికి వ్యాపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశ నాయకుడు ఇకపై చీపురును నమ్మకూడదు. దానికి బదులుగా, బొద్దింకలను నిర్మూలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు.ఠాకూర్ గతంలోనూ తన వ్యాఖ్యల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఠాకూర్కు లోక్సభ టికెట్ నిరాకరించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు, అశోక చక్ర గ్రహీత, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరేను, ఠాకూర్ పురాణాల్లోని ప్రతినాయకులైన రావణుడు, కంసుడితో పోల్చారు.26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కర్కరే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కర్కరే తనను అన్యాయంగా ఇరికించారని.. తాను శపించడం వల్లే ఆయన చనిపోయారని’ఠాకూర్ ఆరోపించారుమాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్ధోషి2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటర్ సైకిల్కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ప్రగ్యాసింగ్ ఠాకూర్తో సహా ఏడుగురు నిందితులను గతేడాది జూలై నెలలో నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరాలేదు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన సీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరింది. ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామన్న సీజేపీ.. జంతర్మంతర్లో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొంది.అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. సమస్యలకు రాజీనామా పరిష్కారం కాదని.. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్కు పూర్తి మద్దతుగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి రాజీనామా నిర్ణయం సులభమే.. కానీ దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సమస్యల మూలాలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. -
అస్సలు సోనమ్ వాంగ్ చుక్ ఎవరు? : అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అసలు నాయకత్వం ఎవరిది? ఉద్యమ క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అస్సలు సోనమ్ వాంగ్చుక్ ఎవరు? ఆయన దీక్ష విరమిస్తే ఉద్యమం ఎందుకు ఆగాలి? అంటూ అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.వాంగ్చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తమ పోరాటం మాత్రం ఆగదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్చుక్ది కాదు. నాది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీది కూడా కాదు. ఇది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగే ప్రజా ఉద్యమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్మంతర్లో మా ఆందోళన కొనసాగుతుంది’ అని ఆయన వెల్లడించారు.వాంగ్చుక్ నిర్ణయం సరైంది కాదుఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనమ్ వాంగ్చుక్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనంగా వహించినట్లే ఇప్పుడు వాంగ్చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.విద్యార్థుల ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో మూసి తలుపుల వెనుక సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్చుక్ దీక్షను విరమించారని మసూద్ ఆరోపించారు. ఏ హామీల ఆధారంగా, ఏ పరిస్థితుల్లో దీక్ష విరమించారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోనమ్ వాంగ్చుక్ వంటి నిష్కళంక పర్యావరణవేత్తపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా వాంగ్చుక్ను కలిసి ప్రభుత్వ చర్యలను వివరించారని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన గౌరవప్రదంగా దీక్షను విరమించారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.అయితే ఈ వివాదాల మధ్య అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక వ్యక్తి నిర్ణయంతో ఉద్యమాలు ముగిసిపోవని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేవలం పరీక్షల అవకతవకల అంశంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం..10ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా!
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఇకపై పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారైనా పదేళ్ల జైలుశిక్ష, పదికోట్లు జరిమానా విధించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో.. పేపర్ లీక్లు, మోసాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. పేపర్ లీకేజీ పాల్పడిన నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో సందేశంలో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా చట్టానికి మరింత బలం చేకూర్చింది. రాబోయే మార్పులను వివరిస్తూ పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చట్టంలో చేర్చినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు ప్రధాని మోదీ గురువారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోగా కేసును పరిష్కరించి, శిక్షను ప్రకటించాల్సి ఉంటుంది. పేపర్ లీక్లలో పాల్గొన్న వారికి జైలు శిక్ష,జరిమానాలను కూడా పెంచే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశంలో పేపర్ లీకేజీకి పాల్పడిన నేరస్తులను పట్టుకున్నాం. వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు. విద్యార్థుల ఎడ్యుకేషన్ ఇయర్ వృథా కాకూడదనే వెంటనే నీట్ పరీక్ష నిర్వహించాం. కనీసం 22 లక్షల మంది విద్యార్థులకు సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగించింది.ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి నేను సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాను. ఆయా శాఖలు తీవ్రంగా శ్రమించి, రాత్రికి రాత్రే దీనికి ఆమోదం తెలిపాయి. రేపు (శుక్రవారం) దీనిపై మంత్రివర్గంలో చర్చ జరుగుతుంది. మంత్రివర్గ సభ్యుల సూచనల అనంతరం దీనికి తుది రూపం ఇస్తారు. పార్లమెంట్ సమావేశాల రెండో వారం ప్రారంభమయ్యే సోమవారం నుంచే, ఆ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు.ప్రధాని మోదీ వీడియో ప్రకటనపై స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి నొక్కి చెప్పారు. -
సీజేపీతో చర్చలు.. ఆ డిమాండ్పై రేపటిదాకా గడువు కోరిన కేంద్రం
ఢిల్లీ: సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామన్న సీజేపీ ప్రతినిధులు.. ఈ డిమాండ్లకు నెరవేరేవరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చి చెప్పారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి.కాన్ట్సిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 3 డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు ఉంచాం.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సౌరవ్ దాస్ తెలిపారు.‘‘మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. మరోసారి కేంద్రం చర్చలు జరుపుతాం. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరారు. రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారని ఆశిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకపోతే మరోసారి ఆందోళనకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు’’ అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. -
అటు బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. ఇటు గుజరాత్లో ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ అలర్ట్
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ఇప్పటివరకు కనీసం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వరదలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుండగా.. గుజరాత్లో రికార్డు స్థాయి వర్షాలతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. అసోంలో వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బ్రహ్మపుత్ర సహా పలు నదులు ఉప్పొంగడంతో 25 జిల్లాల్లోని 1,800కు పైగా గ్రామాలు నీటమునిగాయి. లక్షలాది మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.అయితే మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. నదీ పరివాహక ప్రాంతాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి.Assam Drowns in Deadly Floods.41 dead, over 7 lakh people affected as floods swallow 11 districts. Rivers still rising.Assam is hurting. Homes are gone, lives have been changed forever and even innocent animals have been lost.Please keep every affected family in your… pic.twitter.com/yAt3PCkyvb— زماں (@Delhiite_) July 24, 2026గుజరాత్లో ‘వర్ష’ విపత్తుఅసోంతో పాటు పశ్చిమ భారతంలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో కేవలం 24 గంటల్లోనే 1,100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.సహాయక బృందాలు సుమారు 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నవ్సారీ, వల్సాద్ సహా పలు జిల్లాల్లో పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.సౌరాష్ట్రపై పొంచి ఉన్న ముప్పుగుజరాత్పై ప్రస్తుతం ఓ వాతావరణ వ్యవస్థ ప్రభావం చూపుతోంది. దాదాపు ఒకే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ వాయుగుండం తరహా వ్యవస్థ భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలో రాత్రివేళ వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అహ్మదాబాద్ సహా మధ్య గుజరాత్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.🌧️ WATCH | Cars Go Underwater After Heavy Rain Floods Vapi Parking Lot.Flooding in Gujarat’s Vapi leaves several cars submerged as heavy rains continue to lash Valsad district.#Gujarat #Vapi #Valsad #Floods #HeavyRain #Monsoon #IndiaNews #BreakingNews pic.twitter.com/NhPQg0TpzM— India Focus Daily (@indiafocusdaily) July 24, 2026ఎందుకింత తీవ్రత?సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశానికి అవసరమైన వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. అయితే తక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడం వల్ల నదులు, డ్రైనేజీ వ్యవస్థలు తట్టుకోలేక వరదలు సంభవిస్తున్నాయి. ఈసారి పలు ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న అతిభారీ వర్షాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ముఖ్యంగా నదులు పొంగిపొర్లడం, నేలలో తేమ అధికంగా ఉండటం వల్ల వరద ముప్పు పెరిగింది.అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికరానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో ప్రయాణించవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవైపు అసోంలో వరదల విలయం.. మరోవైపు గుజరాత్లో కుండపోత వర్షాలు.. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రకృతి పరీక్ష పెడుతున్నాయి. -
ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ స్ట్రీట్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని శుక్రవారం సీజేపీ చెబుతోంది. నిరసనకారులపై కేసులు తప్పవని, జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగిస్తామని, పాస్పోర్టులు సీజ్ చేస్తామని.. అఖరికి అరెస్టులు చేస్తామని హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పులు, తమపై జరిగిన పోలీసుల చర్యలపై బాధ్యులపై చర్యలు, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రంతో సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.కేంద్రం ప్రయత్నాలుమరోవైపు ఆందోళనను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీజేపీ ప్రతినిధులతో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ తరఫున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు భేటీ అయ్యారు. ఎలాగైనా ఆందోళనలు విరమింపజేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతినిధులు చర్చలకు వెళ్లే ముందు మీడియాకు స్పష్టం చేశారు. ‘‘మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. మాపై లాఠీ చార్జి చేసింది పోలీసులు కాదు.. ఆ ముసుగులో ఉన్న గూండాలు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా పోరాటం ఆపం’’ అని ఆ ఇద్దరు ప్రకటించారు. దీంతో చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అప్రమత్తంఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నాం జంతర్ మంతర్ నుంచి కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.కేబినెట్ భేటీఅటు చర్చలు.. ఇటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. పేపర్ లీకుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలతో చట్టం అమలయ్యేలా సంస్కరణల రూపకల్పన దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాంగ్చుక్ దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగింపుప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా.. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్సీజేపీ తమ ప్రధాన ఎజెండాను స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నీట్ సహా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వివాదాలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మంత్రి రాజీనామా తర్వాతే విద్యా సంస్కరణలు, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని సీజేపీ పేర్కొంది.ఒకవైపు ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుండగా.. మరోవైపు సీజేపీ మాత్రం తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో పార్లమెంట్ స్ట్రీట్లో కొనసాగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం–సీజేపీ మధ్య జరగనున్న చర్చల ఫలితంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. -
నీట్ లీక్పై ‘సుప్రీం’ సీరియస్.. కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణలో వరుస లోపాలను ఇకపై కొనసాగించలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి సమగ్ర నివేదికలు కోరింది.నీట్ పేపర్ లీక్ కేసును శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం.. ఈ అంశాన్ని అత్యంత దగ్గరగా పర్యవేక్షిస్తామని తెలిపింది. పరీక్షల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చి, వాటిని సంస్థాగతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో నీట్ను నిర్వహించే ఎన్టీఏకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలినీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలు, భవిష్యత్ సంస్కరణల పురోగతిపై కేంద్రం, ఎన్టీఏ వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చే అవకాశాలు, డేటా భద్రత వంటి అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం కోరింది. “కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారితే డేటాను ఎలా రక్షిస్తారు?” అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.‘ఇక ఇలా కొనసాగనివ్వం’నీట్ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “వరుస తప్పిదాలను ఇక కొనసాగించలేం. ఈ అంశాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తాం” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమగ్ర ప్రణాళికను కోర్టు ముందు ఉంచేందుకు మరింత సమయం కావాలని కోరారు.ఇటు హైకోర్టులోనూ.. మరోవైపు నీట్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశం కూడా కోర్టు ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ నిలిపివేతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. నిరసనల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనా? అనే అంశంపై కోర్టు పరిశీలించనుంది.ఆందోళనలు.. రాజకీయ వేడినీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఉద్రిక్తత చోటుచేసుకోవడం, పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఇప్పటికే నీట్ లీక్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో.. నీట్ పరీక్షల భవిష్యత్ విధానం, భద్రతా ప్రమాణాలు, సంస్కరణలపై కేంద్రం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది. -
ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ— Press Trust of India (@PTI_News) July 24, 2026అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Our dharna at Jantar Mantar will continue until Dharmendra Pradhan resigns. We are very relieved that Sonam Wangchuk has broken his hunger strike as it had been more than 26 days. His life is… pic.twitter.com/SSyJANfcXA— ANI (@ANI) July 24, 2026మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు. -
రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఐదో రోజు అదే సీన్ రిపీట్ అయ్యింది. నీట్పై చర్చకు సిద్ధమని కేంద్రం చెబుతున్నా.. ముందు మంత్రి రాజీనామా చేశాకే చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో.. ఓసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభను స్పీకర్ ఓంబిర్లా సోమవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు.. కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సభను ప్రారంభించారు. అయితే ఆ కాసేపటికే విపక్షాల నినాదాలతో సభ మారుమోగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే నీట్ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమైందని.. ఈ తరుణంలో సభ కార్యాకలాపాలకు ఆటంకం సరికాదని కేంద్రం తరఫున ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో విపక్షాల శాంతిచకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గం. దాకా వాయిదా వేశారు. అయితే తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. లోక్సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. నీట్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. విపక్ష నేత కే.సీ. వేణుగోపాల్తో మరోసారి చర్చించానని చెప్పారు. ప్రధాని మోదీ కూడా దేశానికి హామీ ఇచ్చారని, సోనమ్ వాంగ్చుక్ సైతం నిరాహార దీక్ష విరమించి చర్చ జరపాలని కోరారని రిజిజు పేర్కొన్నారు. నీట్పై చర్చకు అవకాశం ఇవ్వకపోతే అది దేశానికి సరైన సంకేతం ఇవ్వదని అన్నారు. అయినా విపక్షాలు శాంతించకపోవడంతో.. స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. Union Minister for Parliamentary Affairs Kiren Rijiju speaks in Lok Sabha. He says, "I have requested KC Venugopal ji once again today, when we are all of the opinion that there should be a discussion on NEET. The PM has assured the nation. Sonam Wangchuk has broken his hunger… pic.twitter.com/1HcLc0a5ep— ANI (@ANI) July 24, 2026ఇక.. రాజ్యసభలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. సభ కాసేపు సాగినట్లే కనిపించినా.. ఆ వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు డిమాండ్ చేయడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లుస్వాతంత్ర్య సమర కాలం నుంచి జాతీయ భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గీతానికి మరింత గుర్తింపు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. వందేమాతర గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.అంతకు ముందు.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ఎందుకని?.. ప్రకటన చేయాలనుకుంటే సభలో చేయాలని.. పార్లమెంట్లో మాట్లాడితే తాము సంతోషిస్తామని.. ఆ చర్చలో తాము పాల్గొంటామని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్ లీకును తీవ్ర నేరంగా చూస్తున్నామని.. నిందితులను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. పేపర్లీక్లపై ఉక్కుపాదం మోపుతామని.. ఇందుకోసం కఠిన చట్టాలు తెస్తామని.. సోమవారం ఆ బిల్లును ప్రవేశపెడతామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు మాత్రం మంత్రి రాజీనామా తర్వాత ఏదైనా అని పట్టుబడుతున్నాయి. -
విచారణకు ఫైవ్ స్టార్ సౌకర్యాలు కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ: విచారణ పేరుతో వేరే దేశాల్లోలాగా ఫైవ్ స్టార్ హోటళ్లు కావాలా అని విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సీఐ నాగరాజు పోలీసు కస్టడీకి హైకోర్టు విధించిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. కింది కోర్టులు విధించిన నిబంధనల వల్ల పోలీసు కస్టడీ లక్ష్యం నెరవేరడం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితుడిని విచారణకు రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చేందుకు రానుపోను ఆరు గంటల సమయం పడుతోందని, విచారణకు సమయం ఎక్కడ ఉంటుందని అన్నారు. సీఐ నాగరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ.. విజయవాడ జైలులో ఉన్న పలువురి అరెస్టుకు ఆ పోలీస్ అధికారి కారణమైనందున, అక్కడ ఉంచితే ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతోనే హైకోర్టు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చిందని తెలిపారు. ఈ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘విచారణ పేరుతో వేరే దేశాల్లో లాగా ఫైవ్ స్టార్ హోటళ్లు, ఏసీ రూమ్లు, ప్రత్యేక సదుపాయాలు కావాలా ఏంటి?’ అని నాగరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇక్కడ సమస్య కేవలం జైలు మార్పిడి గురించి కాదని, రిమాండ్ విచారణ పద్ధతి గురించి అని స్పష్టం చేసింది. పోలీస్ విచారణ చట్టబద్ధమైన పద్ధతుల్లో, కోర్టు మార్గదర్శకాలకు లోబడి మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. జూన్ 23న అరెస్ట్ జరిగినందున చట్టప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని తేల్చిచెబుతూ «తీర్పును రిజర్వ్ చేసింది. -
వినీత్ జోషి బదిలీ.. అంతటి సమర్థుడ్ని ఎలా తప్పించారు?!
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ను నియమించింది. వినీత్ జోషికి మాత్రం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ బదిలీపై ఇప్పుడు చర్చ మొదలైంది.విద్యా వ్యవస్థలో కీలక ముఖం.. 1992 బ్యాచ్కు చెందిన మణిపూర్ క్యాడర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషి.. కేంద్ర విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. పరిపాలనలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. పరీక్షల నిర్వహణ నుంచి విద్యా విధానాల అమలు వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తొలి డైరెక్టర్ జనరల్గా వినీత్ జోషి పనిచేశారు. నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను నిర్వహించే సంస్థ ప్రారంభ దశలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.CBSE ఛైర్మన్గా మరో కీలక బాధ్యతను చేపట్టిన ఆయన.. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాలు, విద్యా ప్రమాణాల రూపకల్పన వంటి అంశాల్లో పనిచేశారు. అంతకుముందు మణిపూర్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత పరిపాలనా అనుభవం ఉన్న వినీత్ జోషి.. విద్యా రంగంలో కీలక సంస్థలకు నాయకత్వం వహించిన అధికారిగా గుర్తింపు పొందారు.అనుభవజ్ఞుడి స్థానంలో మరో సీనియర్వినీత్ జోషి స్థానంలో నియమితులైన నరేశ్ పాల్ గంగ్వార్ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఆయన.. కేంద్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన గంగ్వార్.. అంతకుముందు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.పరీక్షల నిర్వహణ, విద్యా రంగంలో ప్రత్యేక అనుభవం ఉన్న వినీత్ జోషి స్థానంలో.. పరిపాలనా అనుభవం ఉన్న మరో సీనియర్ అధికారిని కేంద్రం నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ వివాదం వేళ మార్పునీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులు, ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలోనే వినీత్ జోషి రూపంలో తొలి వికెట్ పడిందా?అనే చర్చ జోరుందుకుంది. బాధ్యతను అధికారులపైకి మళ్లించే చర్యగా కొందరు ఈ ‘ట్రాన్స్ఫర్’ను విమర్శిస్తున్నాయి. అయితే వినీత్ జోషితో పాటు మరికొందరి మార్పు జరగడంతో పరిపాలనా మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే.. కేంద్ర వర్గాల నుంచి దానికి కూడా సరైన సమాధానం ఇంకా రాలేదు.ఎందుకిలా?వినీత్ జోషి సుదీర్ఘ అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి. అయితే పరీక్షల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఆయన బదిలీ కావడం చర్చకు కారణమైంది. నీట్ వివాదానికి అసలు బాధ్యత ఎక్కడ ఉంది? వ్యవస్థలో లోపాలా? అధికారుల నిర్లక్ష్యమా? లేదంటే విధానపరమైన సమస్యలా? అన్నది భవిష్యత్తు పరిణామాలు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నీట్ వివాదం మధ్య జరిగిన ఈ ఉన్నత స్థాయి అధికార మార్పు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసే అవకాశం లేకపోలేదు. -
కేంద్రంతో చర్చలకు సీజేపీ గ్రీన్సిగ్నల్.. వేదిక ఫిక్స్
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం కీలక మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన సీజేపీ నాయకత్వం, తటస్థ వేదికలోనే సమావేశం నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించినట్లు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం అర్ధరాత్రి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రేపు చర్చలకు పిలుపు వచ్చింది. తటస్థ వేదికలో సమావేశం నిర్వహించాలని మేము కోరాం. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. చర్చలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను వేదికగా ఎంపిక చేశారు’ అని తెలిపారు. ఈ చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.#WATCH | Delhi: Saurav Das, Chief Spokesperson, Cockroach Janta Party, says, "... Tomorrow, a discussion has been called for, we are very happy that the government has agreed to our request that it be at a neutral venue. The Constitution Club of India has been chosen..." (23.07) pic.twitter.com/MoK1DgdgJ5— ANI (@ANI) July 24, 2026కాగా, నిరసనల వేళ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్చల కోసం పలుమార్లు ఆహ్వానం పంపినప్పటికీ, కేంద్ర మంత్రుల నివాసాల్లో సమావేశాలకు తాము హాజరుకాబోమని సీజేపీ స్పష్టం చేసింది. జంతర్ మంతర్లోనే లేదా అందరికీ ఆమోదయోగ్యమైన తటస్థ వేదికలోనే చర్చలు జరగాలని పట్టుబట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం తటస్థ వేదిక ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, యువతలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, బాధ్యులపై కఠిన చర్యలు, బాధిత కుటుంబాలకు న్యాయం వంటి డిమాండ్లతో సీజేపీ ఉద్యమం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి మోదీ పరీక్షా పేపర్ లీకుల కేసులపై ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, అది తమ ప్రధాన డిమాండ్లకు పూర్తి పరిష్కారం కాదని సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న శుక్రవారం చర్చలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లపై ఎలాంటి హామీలు ఇస్తుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
మోదీ వీడియో.. వాంగ్చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్కుమార్ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
మెగా డీఎస్సీలో అక్రమాలపై పార్లమెంటులో చర్చించాలి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అంతులేని అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సన్నద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న దాదాపు 16వేల టీచర్ల నియామకానికి సంబంధించిన మెగా డీఎస్సీ–2025లో భారీ స్థాయి అక్రమాలపై పార్లమెంట్ ఉభయసభలలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉభయ సభల్లో వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్సభలో ఎంపీ ఎం.గురుమూర్తి వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. ‘నీట్’ సమస్యంత తీవ్రమైనదే.. ‘మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టాయి. ప్రస్తుతం 22.79 లక్షల మంది ‘నీట్’ అభ్యర్థుల సమస్యపై పార్లమెంటులో చర్చించినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలపైనా చర్చ జరగాలి. అంతేకాదు ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తు. ప్రభుత్వ సంస్థల విశ్వసనీయత, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు సంబంధించిన అంశం. అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన పోటీపరీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం, పరీక్ష నిర్వహణను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం, తుది ఫలితాలకు సంబంధించి మెరిట్, రోస్టర్ జాబితాలను బహిర్గతం చేయకపోవడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత కూడా జాబితాల నుంచి అభ్యర్థుల పేర్లను తారుమారు చేయడం, స్పోర్ట్స్ కోటా నిబంధనల్లో మార్పులు చేయడం, రిజర్వేషన్లు పాటించకపోవడం, ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తడం, పరీక్షా పనులతో సంబంధం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా మొదటి ర్యాంకు రావడం, దీనిపై విమర్శలు రావడంతో తర్వాత అతని పేరును తుది జాబితా నుంచి తొలగించడం వంటి పలు అవకతవకలు టీచర్ అభ్యర్థుల విశ్వాసాన్ని దెబ్బ తీశాయి. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. డిజిటల్ «ఆధారాలను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలి, అర్హులైన టీచర్ అభ్యర్థులకు న్యాయం చేయాలి’అని వాయిదా తీర్మానాల్లో ఎంపీలు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతం, విశ్వసనీయతను కాపాడేలా సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. వీటన్నింటిపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించాల్సి ఉందని ఉద్ఘాటించారు. మామిడి మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి లోక్సభ ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి మామిడి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశలో కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ అంశాన్ని లోక్సభ జీరో అవర్లో ఆయన ప్రస్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్లో రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలోకు రూ.25 వరకు ధర పలికిన తోతాపూరి మామిడిని ప్రస్తుతం కిలోకు కేవలం రూ.2 నుంచి రూ.7 మధ్య మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాసెసింగ్ యూనిట్లు కిలోకు నాలుగైదు రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులకు సాగు ఖర్చులు కూడా రావట్లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ, దానికి చట్టబద్ధ హామీ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కూడా ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు కొనుగోలు అవుతోంది. చెల్లింపుల్లోనూ జాప్యమవుతోంది’ అని ఎంపీ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతులను బలోపేతం చేసి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అభ్యరి్థంచారు. -
జవాబుదారీతనం పెంచేలా లేదు
న్యూఢిల్లీ: పేపర్ లీక్ కేసుల్లో విచారణ పట్ల ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ ప్రకటన పరీక్షల్లో జవాబుదారీతనం పెంచేలా లేదని పేర్కొంది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘హాయ్.. నా పేరు ఏమీ లేదు’అనే శీర్షికతో ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోను షేర్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్మంతర్ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తేలి్చచెప్పారు. పేపర్ లీక్ కేసులపై మోదీ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసలైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని ఆక్షేపించారు. ప్రశ్నపత్రం లీక్ అయిన శిక్ష విధిస్తామంటే ప్రయోజనం ఉండదన్నారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. అసలు ప్రశ్నపత్రాల లీకేజీ ఎందుకు జరుగుతోందన్నదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలని చెప్పారు. గాయం అయిన తర్వాత మందు పూయడం కంటే అసలు ఆ గాయం జరగకుండా నివారించడమే తెలివైన పని అని సూచించారు. వ్యవస్థను నడిపే వారికి జవాబుదారీతనం, సామర్థ్యం లేకపోవడం వల్లే ఇలాంటి గాయాలు పునరావృతం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవచ్చని చెప్పారు. పేపర్ లీక్ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు ప్రధాని మోదీ వైపు ఎక్కువగా మళ్లుతోందని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారుల సంఖ్య పెరుగుతోందని రాంకా పేర్కొన్నారు. -
యువత కళ్లలోకి చూసే ధైర్యం మోదీకి ఉందా?
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో రక్తమోడిన యువత కళ్లలోకి నేరుగా చూసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. యువతకు అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక వారు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. నరేంద్ర మోదీ హయాంలో విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని ఆరోపించారు. ప్రజలకు ఊరట మాటలు గానీ, శాంతి ప్రకటనలు గానీ అవసరం లేదన్నారు. మోదీ ప్రభుత్వం యువతపై లాఠీచార్జి చేసిందని, సొంత పిల్లలు కానట్లుగా నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ మేరకు ఖర్గే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘మీ ఏసీ గదుల విలాసవంతమైన కోటల నుంచి బయటకు రండి. మీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వీధుల్లో రక్తమోడ్చిన యువతీ యువకుల కళ్లలోకి నేరుగా చూడండి’’అని మోదీకి తేలి్చచెప్పారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నేరవేర్చాలని స్పష్టంచేశారు. దేశంలో విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో చిక్కుకుందని ఖర్గే ఆరోపించారు. మోదీ చేసిన ప్రకటన కంటితుడుపు చర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అభివరి్ణంచారు. యువత దీన్ని అంగీకరిస్తారనే భ్రమలో ప్రధానమంత్రి ఉన్నారని ఆక్షేపించారు. టూ లిటిల్, టూ లేట్ పేపర్ లీక్ల దోషులను శిక్షించడానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి ప్రకటనను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’అని కొట్టిపారేశారు. అది మోసపూరితమైన ప్రకటన అని విమర్శించారు. విద్యార్థులు అలాంటి తక్కువ స్థాయి చర్యలను అంగీకరించలేరని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలను నివారించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. -
జడ్జి గ్రోవర్ సారథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీల ఉదంతంలో నమోదైన కేసుల సత్వర విచారణకు ఉద్దేశించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును జడ్జి అను గ్రోవర్ బాలిగా సారథ్యంలో నడపనున్నట్లు ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రకటించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుల ప్రాంగణంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మహిళా జడ్జి అను గ్రోవర్ ప్రస్తుతం ఢిల్లీలోని సౌత్–ఈస్ట్ జిల్లాలో జిల్లా జడ్జి(కమర్షియల్–4)గా సేవలందిస్తున్నారు. పేపర్ లీకేజీ నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తానని ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ బాధ్యతల్లోకి జడ్జిని నియమించడం గమనార్హం. ఉన్నత విద్య కార్యదర్శి బదిలీ.. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని మోదీ సర్కార్ గురువారం ఆకస్మికంగా పంచాయతీరాజ్ శాఖకు బదిలీచేసింది. ఈయన స్థానంలో ఉన్నత విద్య కార్యదర్శిగా నరేశ్ కుమార్ గంగ్వార్ను నియమించారు. పాఠశాల విద్య కార్యదర్శిగానూ ఇన్నాళ్లూ వినీత్ జోషినే కొనసాగారు. ఇప్పుడు ఆయనను తప్పించడంతో పాఠశాల విద్యా కార్యదర్శిగా నూతనంగా టీకే అనిల్ కుమార్ను గురువారం నియమించారు. -
విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవడం కంటే వారి ఉద్దేశాలను ప్రశ్నించడం ఎందుకు సులభంగా అనిపిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జంతర్మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తొందరపాటు వద్దని సూచించారు. విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిష్టను మీడియాలో మసకబార్చేలా చూపడం ఒక విద్యావేత్తగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వెల్లడించారు. ఆందోళనకారులు అసాధారణమైన సహనం, క్రమశిక్షణ, సంయమనం ప్రదర్శించారని అంగ్మో కొనియాడారు. అలాగే సమస్యలను ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సొంత విద్యార్థులనే అంత త్వరగా అపనమ్మకంతో చూసే వ్యవస్థ ఎలాంటిదని తాను తరచుగా ఆలోచిస్తుంటానని ఉద్ఘాటించారు. మన పిల్లలు రక్షణకు అర్హులు అని తేల్చిచెప్పారు. వారిని ప్రతినాయకులుగా చిత్రీకరించవద్దని కోరారు. వారు చెప్పేది అందరూ వినాలని వెల్లడించారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చే కుట్రలతో విద్యార్థులను అణచివేస్తామంటే సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నేడు దేశవ్యాప్త నిరసనలు
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, మంత్రి ధర్మేంద్ర రాజీనామా విషయాల్లో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ సీజేపీ శుక్రవారం దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరపాలని ప్రజలను కోరింది. ‘ప్రతి జిల్లాలో ఒక రోజంతా ఒక్కటే డిమాండ్’పేరిట నిరసన ప్రదర్శనలు జరగాలని సీజేపీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వ వ్యతిరేక నినదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు జాగ్రత్తగా ఢిల్లీ ప్రభుత్వం ఆ పరిసరాల్లో పెద్దసంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలను మొహరించారు. పలు చోట్ల బ్యారీకేడ్లను పెట్టడంతో కన్నాట్ ప్లేస్ చుట్టూతా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీక్షాస్థలి వైపునకు రాకుండా కొత్త వాళ్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఉద్యమంతోసంబంధంలేని ‘బయటి వ్యక్తులు’, గూండాలను బీజేపీ ఇక్కడికి తరలిస్తోందని సీజేపీ ఆరోపించింది. పోలీస్ యూనిఫాం లేని కొందరు పోలీస్ బ్యాటన్లు పట్టుకుని విద్యార్థులను బెదిరిస్తున్న వీడియోను సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్మీడియాలో విడుదలచేశారు. సమీప కన్నాట్ ప్లేస్లోని దుకాణదారులు గురువారం సాయంంత్రం ఆరున్నరకల్లా షాప్లు మూసేశారి న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రతికూల వాతావరణంలోనూ ఉద్యమిస్తున్న విద్యార్థులకు తమ సాయం ఎప్పుడూ ఉంటుందని జంతర్మంతర్ వద్ద జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలు చెలరేగే ఆస్కారముందని, ముందుజాగ్రత్తగా 16 ఢిల్లీ మెట్రోస్టేషన్లను గంటల తరబడి అధికారులు మూసేశారు. 14 గంటల తర్వాత సాయంత్రం రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లను మాత్రం తెరిచారు. అయితే శుక్రవారం అన్ని మెట్రో స్టేషన్లనూ మూసేస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర హోం శాఖ గురువారం జంతర్మంతర్ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా స్తంభింపజేసింది. జూలై 17వ తేదీ నుంచి ఇలా ఇంటర్నెట్ను నిలిపేయడం ఇది ఐదోసారి. వాళ్ల పోస్పోర్ట్లు రద్దు! రణరంగంగా మారిన జూలై 20నాటి పార్లమెంట్ ర్యాలీ ఉదంతంలో పాల్గొన్న నిరసనకారుల పాస్పోర్ట్లు రద్దయ్యే ప్రమాదముందని ఢిల్లీ పోలీస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు ఛలో సంసద్ ర్యాలీలో క్రియాశీలంగా పాల్గొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని, పోలీసులపై దాడులుచేసిన వారిని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, భద్రతా బలగాల బాడీకామ్లు, ఇతర సాంకేతిక మార్గాల ద్వారా గుర్తించి వారి పాస్పోర్ట్లను రద్దుచేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
అవే డిమాండ్లు.. అదే ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో అవే నినాదాలు, ప్రభుత్వ వైఖరి పదేపదే పునరావృతమవుతున్నాయి. ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై ప్రభుత్వం జవాబుదారీ వహించాలని విపక్షపార్టీల ఎంపీలు పార్లమెంట్లో గురువారమూ నినదించారు. ఎలాంటి షరతులు లేకుండా చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే చర్చలకు సుముఖత వ్యక్తంచేస్తామని విపక్ష ఎంపీలు భీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో లోక్సభ, రాజ్యసభల్లో నాలుగో రోజూ ప్రతిష్టంభన రాజ్యమేలింది. విపక్షాల ఆందోళనల నడుమ ఇరుసభలూ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి అదే తంతు... ఉభయసభల్లోనూ గురువారం సైతం నీట్ లీకేజీ, విద్యార్థులను కర్కశంగా పోలీసులు చితకబాదడంపై విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ఆరంభమైన వెంటనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎంత కాలమైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ వివాదం తర్వాత తీసుకున్న చర్యలు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తీసుకున్న చర్యలపై చర్చకు అనుమతించాలని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘మేము నిన్న విజ్ఞప్తి చేశాము. ఈ రోజు మీ ద్వారా సభకు మళ్ళీ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఇతర ప్రతిపక్ష సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడాం. మమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీ సూచనలు పంచుకోవాలని వారిని ఆహ్వానించాం. దయచేసి చర్చను ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించాలని మేము ప్రతిపక్షాన్ని చేతులు జోడించి అభ్యరి్థస్తున్నాం. అలాకాకుండా షరతులు విధిస్తూ, సాకులు చెబుతూ ఉండే విపక్షం చర్చను తప్పించుకోవాలలని చూస్తోందని అందరూ అర్థం చేసుకుంటారు. లీకేజీ అంశాన్ని రాజకీయం చేయొద్దు’’అని కోరారు. రాజీనామా తర్వాతే చర్చ: ఖర్గే రిజిజు ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. నీట్ పేపర్ లీక్పై 267వ నిబంధన కింద చర్చ కోరామని, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదన్నారు. ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేసిన తర్వాతే చర్చలో పాల్గొంటామని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ అదే అంశంపై సమాధానం ఇవ్వడం సరికాదన్నారు. స్పీకర్ను విడిగా కలిసిన రాహుల్, అమిత్ షా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాం«దీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, సౌగత రాయ్ తదితరులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చర్చించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, సభా నిబంధనల ప్రకారం చర్చకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉభయసభలు గురువారానికి వాయిదాపడ్డాక హోం మంత్రి అమిత్ షా సైతం స్పీకర్ బిర్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రెండు భేటీల్లో చర్చించిన వివరాలు వెల్లడికాలేదు.పోటాపోటీగా నిరసనలుపార్లమెంట్ ఆవరణలో గురువారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షం ఆందోళన కొనసాగించింది. ప్రధాని నివాసం వద్ద రాహుల్గాంధీ తదితర నేతలు నిరసనకు దిగడాన్ని తప్పుబడుతూ ఎన్డీఏ ఎంపీలూ పోటీగా నిరసన చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద ఎన్డీఏ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘యువతను రెచ్చగొట్టొద్దు. రాహుల్ గాంధీ హోష్లోకి రండి’అని ఎన్డీఏ ఎంపీ నినదించారు. ‘ఇండియా’కూటమి ఎంపీలు ‘ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలి‘, ‘ప్రాణాలు కాపాడండి.. నీట్ను రద్దు చేయండి’, ‘బుద్ధి తెచ్చుకోండి’, ‘వందేమాతరం’అని రాసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాం«దీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ప్లకార్డు లాక్కునే యత్నం నిరసనల సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ ప్రశాంత్ పడోలే చేతిలో ఉన్న ప్లకార్డును ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అధికారపక్ష సభ్యులు తమ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
నిరసనకారులపై పెల్లెట్ల వర్షం
న్యూఢిల్లీ: లాఠీచార్జ్తో విద్యార్థులను పోలీసులు చితకబాదారన్న వార్తల నడుమ మరో దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సమీపంలో జూన్ 20వ తేదీన జరిగిన చలో సంసద్ ర్యాలో పోలీసులు చట్టవిరద్ధంగా పెల్లెట్ గన్లను ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. తాము వాటిని ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నప్పటికీ పెల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో శస్త్రచికిత్సచేయించుకున్న పలువురి మెడికల్ రిపోర్ట్లు బహిర్గతంకావడంతో ఈ ఖాకీ దుస్తుల కర్కోటక వైఖరి తేటతెల్లమైంది. నిరాయుధులైన ఉద్యమకారులు శాంతియుతంగా చేసే ర్యాలీల్లో పెల్లెట్లు ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమతి మానవహక్కుల విభాగం గతంలోనే ఎన్నోసార్లు మొత్తుకున్నా ఢిల్లీ పోలీసులు మొద్దనిద్రపోతూ ఇప్పుడు సీజేపీ కార్యకర్తలపై పెల్లెట్ల వర్షం కురిపించారని సామాజికమాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కంట్లో చూపు కోల్పోయిన టీనేజర్ ర్యాలీలో పాల్గొన్న 19 ఏళ్ల సాహిల్ లోకాబ్ కుడి కంట్లోకి పెల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ముఖమంతా రక్తసిక్తమైన అతడిని వెంటనే సమీప లేడీ హార్డింగ్ వైద్యకళాశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి, అక్కడా సరైన పరిష్కారం లభించకపోవడంతో చివరకు ఎయిమ్స్ ట్రామా విభాగానికి 21వ తేదీన తరలించారు. వివరాలను అతని మేనమామ అజయ్ దుగ్గల్ ఏడుస్తూ చెప్పారు. ఇప్పుడెలా ఉందిరా అని లోకాబ్ను అడిగితే అతను చెప్పిన సమాధానంతో నోట మాట రాలేదు. మసగ్గా కాదుకదా కనీసం వెలుగు కూడా కన్పించట్లేదు. అంతా చీకటే’’అని సమాధానమిచ్చారు. ‘‘పెల్లెట్ ధాటికి అతని కుడి కంటి కారి్నయాకు రంధ్రం పడింది. కారి్నయల్ పెర్ఫోరేషన్ కారణంగా కుడి కంటితో చూడగలిగే అవకాశాలు కేవలం ఒక శాతం’’అని వైద్యులు చెప్పారు. మెడ, ఛాతి, భుజం, చేతిలోకీ పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఒకటి కుడి కంట్లో ఉండిపోయింది. ఢిల్లీ వర్సిటీ దూరవిద్యా కోర్సులో సాహిల్ డిగ్రీ చేస్తున్నాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు సిద్దమవుతున్నాడు. ఇప్పుడు ఇతని భవిష్యత్ ఏంటి? అని అతని కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సాహిల్లాగా మరెంతో మంది పెల్లెట్ల బారిన పడ్డారని మీడియాలో సాక్ష్యాధారాలతో సహా కథనాలు వెలువడుతున్నాయి. పలువురి ముఖం, ఛాతీ, మెడ, భుజాల్లోకి పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఔట్లుక్ రిపోర్టర్, 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరీ సైతం పెల్లెట్ల బారినపడి శస్త్రచిక్సిత చేయించుకోవాల్సి వచ్చింది. వివరాలను మన్సూరీ వెల్లడించారు. ‘‘ఆరోజు మధ్యాహ్నం మూడున్నరకు ఉద్యమకారులతోపాటు వెళ్తుంటే కన్నాట్ ప్లేస్లోని పాలికా బజార్ వద్ద సీఆర్పీఎఫ్లోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు గాల్లోకి బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. తర్వాత నేరుగా ఏదో ఆయుధం గురిపెట్టారు. కొన్ని సెకన్ల తేడాతో ఏదో వచ్చి నా ఎడమ కనుబొమ్మకు గుచ్చుకుంది. తర్వాత ఇంకొన్ని ఇనుపముక్కల్లాంటి నుదురు, ముక్కు, గదమ వద్ద గుచ్చుకున్నాయి. మెడలోకీ దూసుకెళ్లాయి. బాధ తాళలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లా. వైద్యులు వాటిని పెల్లెట్లుగా నిర్ధారించారు. మూడు పెల్లెట్లను వెంటనే తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు. ఒకటి మెడలో ప్రధాన నరం, రక్తనాళం సమీపంలో ఇరుక్కుంది. ఇంకోటి ఎడమ కంటి కదలికలను నియంత్రించే కండరం వద్ద చిక్కుకుంది. ఇంకోటి ముక్కు సమీపంలో ముఖంలోకి వెళ్లింది. వీటిని తీయకపోతే ప్రమాదమని చెప్పారు. సర్జన్ అందుబాటులో లేకపోవడంతో తర్వాతి రోజు శస్త్రచికిత్స చేసి తొలగించారు’’అని మన్సూరీ వెల్లడించారు.ఏమిటీ పెల్లెట్లు? పెల్లెట్ గన్ను పంప్–యాక్షన్ గన్ లేదా షాట్గన్ అని కూడా పిలుస్తారు. వీటిని పేలిస్తే చాలా చిన్నగా ఉండే ఇనుపముక్కల్లాంటివి జల్లెడలా చుట్టూతా వేగంగా దూసుకెళ్తాయి. ఇవి సెకన్కు 1,000 అడుగుల వేగంతో దూసుకెళ్తాయి. వీటిని ఏదైనా ఖనిజంతో లేదా రబ్బర్తో తయారుచేస్తారు. గన్లోని ఒక్కో క్యాట్రిడ్జ్లో 600 వరకు పెల్లెట్లు ఉంటాయి. ది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇతర నిబంధనల ప్రకారం ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ)ను పాటిస్తూ తొలుత పోలీసులు మైక్లో ఆందోళనకారులను శాంతించాలని హెచ్చరించాలి. తర్వాత జలఫిరంగులతో అడ్డుకోవాలి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాలి. తప్పదనుకుంటే లాఠీచార్జ్ చేయాలి. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే పెల్లెట్లు ప్రయోగించాలి. అవి కూడా నడుం కిందకు గురిపెట్టి కాల్చాలి. కానీ ప్రభుత్వ సాయుధబలగాలు ఉద్యమకారులను తరమికొట్టేందుకు నేరుగా ముఖం, ఛాతికి గురిపెడుతున్నాయని చాన్నాళ్ల నుంచి ఆరోపణలున్నాయి. -
నీళ్లు ఎత్తాలో.. వద్దో రాష్ట్రమే తేల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలో, లేదో కేంద్రం నిర్ణయించజాలదని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మరమ్మతులు అవసరమైన మేడిగడ్డ సహా ఇతర బరాజ్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అంశం కేంద్ర పరిధిలోనిది కాదని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందర్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, సీనియర్ నేత వకులాభరణం కృష్ణమోహన్లు పాటిల్తో సమావేశమయ్యారు. రాష్ట్ర నేతలు ఎన్డీఎస్ఏ నివేదికలపై పాటిల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వాస్తవ పరిస్థితులను ఇప్పటికే ఎన్డీఎస్ఏ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయాలను తెలుపుతూ, అందులో ప్రస్తావించిన అంశాలను వివరించారు. బరాజ్లకు అవసరమైన మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లు తెలిసింది. రాష్ట్రం తమ యంత్రాంగంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నట్లు తెలిసింది.మరమ్మతులు, నీటి ఎత్తిపోతలపై రాష్ట్రం నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే మాత్రం తమ విభాగాల తరఫున సాంకేతిక సహాయాన్ని అందిస్తామన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బరాజ్ల మరమ్మతుల పనులను మూడేళ్లుగా చేయకుండా రాష్ట్రం అలక్ష్యం చేశారంటూ రాష్ట్ర ఎంపీలు చెప్పినట్లు తెలుస్తోంది. బరాజ్ల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేస్తే.. మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం మరో తప్పిదం చేసిందనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తప్పుచేసి, ఆ నిందను కేంద్రంపై మోపే కుట్రలు చేస్తున్నారని ఎంపీలు చెప్పగా, అలాంటి ప్రయత్నాలను అడ్డుకొని, వాస్తవాలను ప్రజలకు తెలపాలని పాటిల్ సూచించినట్లు తెలిసింది. మరమ్మతుల్లో జాప్యం రాష్ట్రానిదే: అర్వింద్ కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో సమావేశం అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల జాప్యానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వమే కారణం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కో ట్లపై సమగ్ర దర్యాప్తు జరగాలి. కేసీఆర్, కేటీఆర్ దగ్గర రేవంత్ ఎంత మింగారు? ప్రాజెక్టులో దోచుకున్న దాంట్లో రాహుల్ గాందీకి ఎంత ఇచ్చారు?’అని ఆరోపించారు. ‘మంత్రి ఉత్తమ్కుమార్ బీఆర్ఎస్లోనూ సభ్యుడే, కాంగ్రెస్లో కూడా సభ్యుడు, మంత్రి. ఈయన ఆల్పార్టీ మెంబర్’అంటూ ఎద్దేవా చేశారు. రఘునందన్ రావు మాట్లాడుతూ... ‘పొట్టోడు, పొడుగోడు కలిసి రైతుల కడుపు కొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ దోషులే’అని చెప్పారు. -
రాజకీయ మనుగడ కోసమే అరాచకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ప్రవేశపరీక్షల పత్రాల లీకేజీలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, వామపక్ష పారీ్టలు రాజకీయ మనుగడ కోసం అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులను కవచంగా వాడుకుంటూ దేశ వ్యతిరేక శక్తులు, తుక్డే గ్యాంగులతో కలిసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షహీన్బాగ్ తరహాలో దేశంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నీట్ లీకేజీపై తక్షణ చర్యలు తీసుకున్నాం... నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 17 మందిని సీబీఐ అరెస్టు చేసిందని కిషన్రెడ్డి వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం ద్వారా దోషులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. రెండోసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహించామని.. విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారని కిషన్రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు రావాలని కిషన్రెడ్డి సవాల్ విసిరారు. టెన్త్ పేపర్ లీకైనప్పుడు రేవంత్ రాజీనామా చేయలేదేం? గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగినా ఏనాడూ బాధ్యత వహించని నేతలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డిలకు రాజీనామాలు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 2025లో టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 2026లో జగిత్యాలలోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కాంగ్రెస్ మంత్రులతో రాజీనామా చేయించారా అని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాకే రేవంత్రెడ్డి నీట్ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. -
జంతర్ మంతర్కు వేలాది మంది.. ఇది వాంగ్చుక్, దిప్కే వల్ల కాదు..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలకు వేలాది మంది తరలివస్తున్నారు. ఈ ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నేతృత్వం వహిస్తుండగా, లడఖ్కు చెందిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టడంతో ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. అయితే, ఇంతమంది జనం స్వచ్ఛందంగా తరలివస్తుండటానికి అసలు కారణం ఈ ఇద్దరు నేతల ఆకర్షణ మాత్రమే కాదని, 2026 నీట్ యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పేరుకుపోయిన తీవ్ర ఆగ్రహమేనని క్షేత్రస్థాయి పరిశీలనలు చెబుతున్నాయి. పరీక్ష ఒత్తిడితో తోబుట్టువులను, స్నేహితులను కోల్పోయిన అనేకమంది యువకులు, పాఠశాల విద్యార్థులు సైతం తల్లిదండ్రులకు తెలియకుండా ఇక్కడికి చేరుకుంటున్నారు.జంతర్ మంతర్కు ఇప్పుడు వేలాదిగా చేరుతున్న వారిని నడిపిస్తున్నది ఒక్క నాయకుడు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం తర్వాత విద్యార్థులు, యువతలో ఆగ్రహం మరింత పెరిగిందని అంటున్నారు. అదే దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఢిల్లీకి రావడానికి కారణమైందని పేర్కొంటున్నారు. అందుకే ఈ ఉద్యమం వ్యక్తుల చుట్టూ కాకుండా ప్రజల ఆవేదన చుట్టూ విస్తరిస్తోందని వివరిస్తున్నారు.ఇలా మొదలైంది సీజేపీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏఐఎస్ఏ వంటి విద్యార్థి సంఘాలు 2026 జూన్ 6 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 28న వాంగ్చుక్ దీక్ష ప్రారంభించగా, జులై మధ్యలో బారికేడ్లు తొలగించి, ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం, దిప్కేపై సిరా దాడి ఘటన మీడియా దృష్టిని మరింత పెంచాయి.జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు 'సంసద్ చలో' పేరిట వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ వైపు కవాతు చేపట్టగా, భద్రతా బారికేడ్లను దాటే యత్నం చేయడంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో నిరసనకారులు, పోలీసులు స్వల్పంగా గాయపడగా, 10-15 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయలేదని అధికారులు తెలిపారు.రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నేతలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఈ నిరసనలు పరీక్షల సమస్యలకు మించి రాజకీయ లక్ష్యాలతో సాగుతున్నాయని ఆరోపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ స్పందన, వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి, మరిన్ని విద్యార్థి బృందాల భాగస్వామ్యంపైనే ఈ ఉద్యమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల ఆగ్రహమే కారణంనీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకల వల్ల జీవితాలు నాశనమైన సాధారణ విద్యార్థులు, కుటుంబాలే ఈ జనప్రవాహానికి నిజమైన కారణం. నాయకుల పిలుపు కంటే మించి, వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన సామాన్యుల ఆగ్రహమే ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. -
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే?
మీరట్ : ఒకే వ్యక్తిని ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై మద్దతు, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వీడియోలు రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. శ్యామ్పురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో జూలై 17న ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు ప్రకటించారు. ఆ వికాస్ ఎవరో కాదు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లుగా పనిచేస్తున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లకు వికాస్ కెమెరా మెన్గా, కంటెంట్గా అనుగుణంగా భర్తగా నటించాడు. ఇప్పుడు ఆ రీల్ భర్తే.. రియల్ భర్తయ్యాడు. వివాహం అనంతరం విడుదల చేసిన వీడియోలో, చిన్నప్పటి నుంచి తాము ఎప్పుడూ కలిసి పెరిగామని, భవిష్యత్తులో కూడా విడిపోవాలని కోరుకోవడం లేదని అక్కాచెల్లెళ్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.వికాస్ కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిని విడదీయకుండా కలిసి ఉండేలా ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను తన అత్తగారి ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహంపై స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సనాతన సంప్రదాయాలకు, సామాజిక కట్టుబాట్లకు ఇది విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని కోరాయి.ఇదిలా ఉండగా, వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న చాముండ మాత ఆలయ నిర్వహణ మాత్రం ఆ సమయంలో ఆలయంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఎలాంటి పూజారి లేరని స్పష్టం చేసింది.వివాదం నేపథ్యంలో స్పందించిన ముగ్గురు సోదరీమణులు మరో వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పూ చేయలేదు. ఇది ప్రేమతో తీసుకున్న నిర్ణయం. మేమంతా పెద్దవాళ్లమే. మేము సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులకు సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు. అలాగే, పూర్వకాలంలో రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పుగా పరిగణించలేదే, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై పోలీసులు కూడా సమాచారం అందుకున్నట్లు హసన్పూర్ కొత్వాలి ఇన్చార్జ్ రాజేష్ కుమార్ తివారీ తెలిపారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, అధికారిక నమోదు వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. -
ఈ వీడియోను మీరూ నమ్మారా? రాజ్నాథ్ సింగ్ అలా చెప్పలేదు..
న్యూఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరసనకారులను బెదిరించినట్టు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వీడియోను పాకిస్థాన్ ప్రచార నెట్వర్క్ తప్పుడు సమాచారంతో వ్యాప్తి చేసినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఆ ప్రచారాన్ని నకిలీగా తేల్చింది. వైరల్ వీడియోను కృత్రిమంగా రూపొందించారని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచార ప్రచారంలో భాగంగా పాకిస్థాన్ ప్రచార అకౌంట్లు దాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నాయని తెలిపింది.ఆన్లైన్లో ప్రచారం అవుతున్న తప్పుడు వీడియోతో పాటు రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన ఎలాంటి మార్పులు చేయని వీడియోను కూడా ఫ్యాక్ట్ చెక్ విభాగం విడుదల చేసింది.ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. “ఈ వీడియో నకిలీ, కృత్రిమ మేధతో రూపొందించారు. ఢిల్లీ నిరసనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాంటి ప్రకటన చేయలేదు” అని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.ధ్రువీకరణ లేని సమాచారాన్ని షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద పోస్టులను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి తెలియజేయాలని సూచించింది. నిజమైన సమాచారం కోసం అధికారిక సోర్సులనే నమ్మాలని కోరింది.రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు?బుధవారం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.విద్యార్థులను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ఎక్స్లో చేసిన పోస్టులో.. “ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశ విద్యార్థులను, యువతను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు కొందరు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ⚠️ Fake Video Alert!🚨Pakistani propaganda accounts are circulating a video of Defence Minister Rajnath Singh claiming that he made threatening remarks about the protesting students. #PIBFactCheck:❌ The video is #Fake and AI-generated.✅ Defence Minister @rajnathsingh… pic.twitter.com/nmmaHTsarp— PIB Fact Check (@PIBFactCheck) July 23, 2026 -
రుద్రమదేవిలా హైదరాబాద్ నుంచి జంతర్ మంతర్కు అమ్మాయి
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా మంది యువతులు ఒంటరిగానే జంతర్ మంతర్కు వస్తున్నారు. ఓ అమ్మాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒంటరిగా వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేసింది. ‘‘అందరికీ హాయ్. నేను ఇప్పుడు నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నాను. నేను ఏం చేస్తున్నానో కూడా నాకు పూర్తిగా తెలియడం లేదు. ఇది ఎలా చేస్తానో కూడా తెలియదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మా తల్లిదండ్రులకు చెప్పలేదు. బయటకు వెళ్తున్నానని మాత్రమే చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తున్నాను. నేను ఒంటరిగానే వెళ్తుండటంతో చాలా భయంగా ఉంది. ఢిల్లీలో నాకు ఎవరూ తెలియరు. అయినా సరే... ఎలాగోలా ధైర్యం చేసి బయల్దేరాను. నాకు తెలుసు...’’ అని ఆమె వ్యాఖ్యానించింది.Many girls are coming solo to Jantar Mantar.She is from Hyderabad.@Cockroachisback pic.twitter.com/MvK7CWd4XE— 🪳Against Corruption (@akashuchani08) July 22, 2026ఒకరు ఎక్స్లో ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ... ‘‘ఈమె హైదరాబాద్కు చెందిన యువతి. ఈమె పేరు తెలిసింది. హైదరాబాద్కు చెందిన దిశ. దిశ ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ర్యాపిడో బైక్లో నేరుగా నిరసన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొంటోంది.తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని దిశ తెలిపింది. ఢిల్లీ చేరిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. ముందుగానే చెప్పి ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వారు కాదనే ఉద్దేశంతో ముందస్తుగా చెప్పలేదని తెలిపింది. అయితే తనకు నమ్మకమైన ఓ స్నేహితుడికి ప్రతి విషయం చెబుతూ, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. దారిలో కలిసిన మంచి మనసున్న వారు ఆమెకు నీరు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. దిశ రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, చాకలి ఐలమ్మ నేలపై పుట్టిన యువతి. తెలంగాణ మహిళలు ఒకప్పుడు తుపాకీ చేతబట్టి రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. అలాంటి ధైర్యసాహసాల సంప్రదాయం నుంచి వచ్చిన వారే వారు. దిశపై ఎంతో గర్వంగా ఉంది. మనందరి గొంతును ఆమె బలంగా వినిపిస్తుందనే నమ్మకం ఉంది. ముందుకు సాగు దిశ. ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని అందులో పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ఆందోళనలునీట్ యూజీ పరీక్షలో అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో జూలై 24న దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ప్రశ్నపత్రం లీక్ అంశంపై ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా, చర్చలకు ఆహ్వానించినా సీజేపీ తన ఆందోళన కొనసాగిస్తోంది.దేశవ్యాప్తంగా పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులకు సంఘీభావంగా ఈ నిరసన చేపడుతున్నామని సీజేపీ తెలిపింది. అనుమతులు, ఇతర ఏర్పాట్ల విషయంలో విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కలిసి పనిచేయాలని సూచించింది. "సమావేశాల ముందు విద్యార్థుల డిమాండ్లను గట్టిగా చదవాలి. పోలీసుల దౌర్జన్యానికి గురైన వారికి సంఘీభావం ప్రకటించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై" అని ప్రకటనలో పేర్కొంది. "జై హింద్, భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్" వంటి సానుకూల నినాదాలే ఇవ్వాలని, జరిగిన ప్రతిదాన్ని రికార్డు చేయాలని ఆందోళనకారులకు సూచించింది.ఏ పరిస్థితి ఎదురైనా శాంతియుతంగా, అహింసా మార్గంలోనే నిరసన కొనసాగించాలని సీజేపీ తెలిపింది. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే ఉండాలని, అనుమతి పొందిన మార్గాల్లోనే వెళ్లాలని, రెచ్చగొట్టే, పరువునష్టం కలిగించే, మత విద్వేషం రెచ్చగొట్టే లేదా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. Found her name. She is Disha from Hyderabad. She reached Delhi. From the airport took a rapido and directly and reached the protest site. She is there with the protesting students.She says she is safe and absolutely fine. The moment she landed in Delhi, she called her… pic.twitter.com/R4FHNa8311— Revathi (@revathitweets) July 23, 2026 -
సీజేపీ ఆందోళనకారులకు పోలీసులు బిగ్ షాక్.. ఆ పని చేస్తే పాస్పోర్ట్లు రద్దు!
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో.. హింసకు పాల్పడిన వారి పాస్పోర్ట్లను రద్దు చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. నీట్ పేపర్ల లీకేజీలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థికి రూ.కోటి చెల్లించాలని సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చలో సంసద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారి నిరసనలకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ,ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు తోడవ్వడంతో ఉద్యమం ఊపందుకుంది.పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం, పోలీసులపై ఆందోళన కారులు తిరగబడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యితే, ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు శాంతియుతంగా కాకుండా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా దాడులకు తెగబడిన వారి పాస్పోర్టులు రద్దు చేసే దిశగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఆందోళనకు నిబంధనలు ఉల్లంఘించి పార్లమెంట్ వీధుల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 118మంది పోలీసులకు గాయాలయ్యాయి. 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం కాగా.. 60మంది ఆందోళనకారులు గాయపడ్డారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65మందికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం.. జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్కు జాతీయ భద్రతా చట్టం, 1980 కింద ముందస్తు నిర్బంధ అధికారాలను కల్పిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని విచారణ లేకుండానే 12 రోజుల నుండి 12 నెలల వరకు నిర్బంధించవచ్చు.అయితే, ఈ ఉత్తర్వులు ప్రతి మూడు నెలలకొకసారి జారీ చేసే సాధారణ ప్రక్రియేనని, జూలై 7నే దీనికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ అయిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుత సీజేపీ నిరసనలకు, ఈ ఆర్డర్కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వివరించారు.శాంతిభద్రతలను కాపాడేందుకు నిరసనకారులు సహకరించాలని, సమస్యపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కాగా, ఈ పోలీసుల కఠిన చర్యలకు నిరసనగా జూలై 24, శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. -
‘పంచదార్ల’ను కాపాడండి.. కేంద్రానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి
ఢిల్లీ: అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండల్లో మైనింగ్ను వెంటనే అరికట్టి, అక్కడి వారసత్వ సంపదను కాపాడాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం సమర్పించిన ఆయన, చారిత్రక బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపి వేయించాలని, ఆ మొత్తం పంచదార్ల కొండ ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు.ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు స్థలం శాతవాహన కాలానికి చెందిన అత్యంత ప్రాచీన వారసత్వ కట్టడం అని, అది భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. అలాగే పంచదార్లలోని శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయమని తెలిపారు. ఈ రెండు చారిత్రక వారసత్వ కట్టడాల సమీపంలో మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగడం వల్ల పురావస్తు సంపదకు, సహజ వాతావరణానికి, శాశ్వత జలధారలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ క్షేత్రానికి సుమారు 90 మీటర్లు, 190 మీటర్లు, 200 మీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని, ఉపగ్రహ చిత్రాలతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో కూడా ఆ విషయం తెలిందని, ఇంకా మైనింగ్ కొనసాగితే, అది పురావస్తు సంరక్షణ చట్టాల ఉల్లంఘన అవుతుందని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో పురావస్తు శాఖతో తక్షణ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని, మైనింగ్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పంచదార్ల మొత్తం ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు. -
వాటర్ కానన్ ప్రయోగించిన పోలీసులు.. తడుస్తూ విద్యార్థుల డ్యాన్స్
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్పై బిహార్ రాజధాని పట్నాలో నిరసన తెలిపిన విద్యార్థులు ఉద్రిక్త పరిస్థితిని వైరల్ సీన్గా మార్చారు. తీవ్ర ఎండ ఉందంటూ వాటర్ కానన్ వాడాలని పోలీసులను వారు కోరగా.. నీళ్లు చల్లిన వెంటనే విద్యార్థులు నీళ్లలో తడుస్తూ డ్యాన్స్ చేశారు.భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను గాంధీ మైదాన్ సమీపంలో, గవర్నర్ నివాసానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకున్నారు.వైరల్ అయిన నిరసన దృశ్యాలువైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసులతో, "సార్.. వాటర్ కానన్ లేదా? చాలా వేడిగా ఉంది" అని చెప్పడం వినిపించింది. పోలీసులు నీళ్లను విద్యార్థులపై ప్రయోగించారు. వెంటనే అక్కడి నుంచి తప్పుకోకుండా విద్యార్థులు అదే చోట డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. Bihar is not for beginners..बिहारी होना इतना आसान नहीं है बौस। आंदोलन कुचलने के लिए बिहार पुलिस वाटर कैनन से पानी की बौछार कर रही है । बिहारी लोग झूम झूम कर रेनडांस का मजा ले रहे हैं। pic.twitter.com/x9Tcjj5hO2— Dr. Om Sudha (@dromsudhaa) July 23, 2026మరో వైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసుల తాడుతో తాడు థగ్ ఆఫ్ వార్ ఆడినట్టు కనిపించారు. ఇంకో వీడియోలో పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు పెట్టిన బ్యారికేడ్లను కొందరు ఎత్తుకుని పరుగెత్తారు. మరో ఘటనలో గేటు బోల్టులు తీసేసి దాన్నే తీసుకెళ్లినట్టు వార్తలు వచ్చాయి.ఈ వీడియోలపై సామాజిక మాధ్యమాల్లో జోకులు, మీమ్స్ వెల్లువెత్తాయి. "ఇది జంతర్ మంతర్ కాదు బాబూ... ఇది బిహార్" అనే అని కామెంట్లు చేశారు. కొందరు ఈ దృశ్యాలను హోలీ పండుగతో పోల్చారు. నిరసనకు అంతరాయం కలిగించేందుకు ఓ బీజేపీ నాయకుడు అక్కడికి వచ్చారు. ఆయన చేతిలో ఉన్న జెండాను చూసి గుర్తించిన విద్యార్థులు దాడి చేశారు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బీజేపీ నాయకుడిని రక్షించారు. CJP Protest Reaches Patna, Bihar 😳 | Biharis Joined Like Never Before!#cjp #cjpprotest pic.twitter.com/hKIua7GfUy— TrendSpark (@ZENLOOP008) July 23, 2026 Bihari On Top#BiharStudentProtest #BiharProtest #PatnaProtest #StudentsProtest #StudentRights #NEET2026 #NEETPaperLeak #JusticeForStudents #BiharStudents #Patna pic.twitter.com/5KyKD0MDVO— JaanVerse (@jaanverse) July 22, 2026 why is bihar police playing tug of war with protesters 😭😭???? pic.twitter.com/0OmP20Q1gY— PrinCe (@Prince8bx) July 23, 2026 -
సీజేపీ నిరసనలకు మద్దతుగా అన్నా హజారే ‘మౌన ఆందోళన్’
ముంబై: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం మహారాష్ట్రలోని అహిల్యానగర్లో 2 గంటల పాటు మౌన ఆందోళన్ చేపట్టారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.ఉదయం 11 గంటలకు అహిల్యానగర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన మొదలుపెట్టి, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించారు. ఆ తర్వాత అదే జిల్లాలోని తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్నా హజారే లేఖ రాసిన విషయం తెలిసిందే. "హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచివేస్తున్నాయి" అని అందులో పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా, సమాజం అనుభవిస్తున్న వేదన, ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పని తీరు మరింత జవాబుదారీతనంతో, సమర్థంగా మారుతుందని ఆయన చెప్పారు. నిరసనకారుల మాటలను ఓర్పుగా వినాలని, నమ్మకం పెంచే వాతావరణం కల్పించాలని, సానుకూల చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మౌన ఆందోళన్ తర్వాత విలేకరులతో మాట్లాడిన హజారే.. "ప్రజల సమస్యలు ప్రధానమంత్రికి తెలియాలి. అందుకే ఆయనకు లేఖ రాశాను" అని చెప్పారు.మరోవైపు, గురువారం జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్లిష్ట పరిస్థితుల కారణంగా సాయంత్రం 6.30 గంటలకల్లా కన్నాట్ ప్లేస్లోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.నిరసన ప్రాంతం బయట పూర్తిగా ధ్వంసమైన కారును ఢిల్లీ పోలీసులు ఉంచారని సీజేపీ ఆరోపించింది. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ముందు అద్దం ఉన్న ఆ కారు దృశ్యాలు షేర్ చేస్తూ.. "ఈ కారును ఇక్కడికి ఈ స్థితిలో తీసుకొచ్చారు. తర్వాత శాంతియుత నిరసనకారులపై నెపం మోపకుండా ముందే నమోదు చేసుకోవాలి" అని పేర్కొంది. -
యూనిఫాంలో ఉన్నంత మాత్రాన..!
ఢిల్లీ: సీజేపీ నిరసనల్లో 118 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన ట్వీట్ చేశారు. తమ సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు కూడా తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో బాధను అనుభవిస్తారని చెబుతూ.. పోలీసు వ్యవస్థలోని మానవీయ కోణాన్ని ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు ఎత్తిచూపారు.‘‘యూనిఫాం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి నొప్పి తక్కువగా అనిపించదు. ప్రతి బ్యాడ్జ్ వెనుక స్పందించే గుండె.. ఒక కుటుంబం, సేవ చేస్తామనే హామీ ఉంటాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి జరగడం తీవ్రంగా కలిచివేస్తోంది. అభిప్రాయ భేదాలుంటే గళం వినిపించొచ్చు కానీ.. హింసకు మాత్రం చోటు ఉండకూడదన్న ఢిల్లీ పోలీసుల పోస్ట్.. వైరల్గా మారింది.సీజేపీ ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘర్షణల అనంతరం ఢిల్లీ పోలీసులకు, సీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది.హింసను రెచ్చగొట్టారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిరసనకారులు రాళ్ళు రువ్వడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో సీనియర్ అధికారులతో సహా 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఏసీపీ (పంజాబీ బాగ్) జై ప్రకాష్, ఏసీపీ (కన్నాట్ ప్లేస్) వివేక్ భగత్, ఇన్స్పెక్టర్ నంద్ కిషోర్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. -
‘టైం, ప్లేస్ మీరే చెప్పండి’.. సీజేపీతో చర్చలకు కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి కేంద్రం సీజేపీని చర్చలు ఆహ్వానించింది. మీ ఇష్టం. టైం, ప్లేస్ ఎక్కడో మీరే చెప్పండి అన్ని సమస్యల్ని చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన తక్షణ రాజీనామా, నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, చలో సంసద్లో పాల్గొన్న వారిపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఉపసహరణపై కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ నేతలతో చర్చించేందుకు కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం నుంచి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపాం. అన్నీ సమస్యలపై కేంద్రం వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. చర్చలు జరిపేందుకు సమయం, ప్లేస్ వాళ్లం ఇష్టం.ఈ చర్చల్లో నాతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం పాల్గొంటారు. ఈ చర్చలు జేపీ నడ్డా ఇల్లు, కార్యాలయంలో జరిపితే బాగుంటుందని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి మాకు ఎలాంటి అహంభావం లేదు. చర్చల ద్వారా సమస్యల్ని క్రమంగా పరిష్కారం దిశగా అడుగులు వేయొచ్చు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న నిరంతర చర్యల్లో ఇది ఒక భాగం. చర్చల్లో పాల్గొనాల్సిందిగా సీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు. చర్చలు జరిపేందుకు కేంద్రం పంపుతున్న ఆహ్వానాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. మాతో చర్చలు జరపాలని అనుకుంటే కేంద్రమే మా వద్దకు రావాలి. మా డిమాండ్స్కు కట్టుబడాలి. అయితే, జంతర్మంతర్లో కేంద్రం మాతో చర్చలు జరపాలి. ఆ విషయంలో వెనక్కితగ్గబోమన్నారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ మార్చికి పిలుపునిచ్చిన తరుణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇవాళ ప్రధాని మోదీ పేపర్ లీకేజీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్ లీకేజీ కేసులపై సత్వరమే విచారణ, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. #WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "The govt has sent four formal proposals for discussions with their representatives since last afternoon...This is a standing invitation to all our youth friends that… pic.twitter.com/PAQ6PbeNIa— ANI (@ANI) July 23, 2026 -
ఇతను ఎవరు? సీజేపీ ర్యాలీలో ఇంతగా వైరల్ అయ్యాడేంటి?
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలకు చెందిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో వార్తల్లో నిలిచిన వారిలో ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ నకుల్ ధుల్ ఒకరు. నిరసన స్థలం నుంచి ఆయన విడుదల చేసిన భావోద్వేగ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో 'చలో సంసద్' ర్యాలీ సమయంలో పోలీసుల చర్యలో తనతో పాటు తన స్నేహితులపై దాడి జరిగిందని నకుల్ ఆరోపించారు.నకుల్ ధుల్ ఎవరు?నకుల్ ధుల్ ఢిల్లీకి చెందిన డిజిటల్ క్రియేటర్. సామాజిక అంశాలు, విద్య, యువత సమస్యలు, సమకాలీన పరిణామాలపై వీడియోలు రూపొందిస్తుంటారు. ప్రజా విధానాలు, విద్యా అంశాలు, పౌర సమస్యలపై అభిప్రాయాలు, లైవ్ రిపోర్టింగ్, వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన వీడియోలు ఎక్కువగా ప్రజా విధానాలు, విద్య, పౌర అంశాలపై ఉంటాయి. సామాజిక, రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనించే ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు.ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారు?ఇటీవల ఢిల్లీలో జరిగిన 'చలో సంసద్' నిరసన నుంచి నకుల్ ఒక వీడియో షేర్ చేయడంతో ఆయన ట్రెండింగ్లోకి వచ్చారు. ఆ వీడియోలో.. పార్లమెంట్ వైపు సాగిన నిరసనలో పోలీసులు తీసుకుంటున్న చర్యలో భాగంగా తనతో పాటు తన స్నేహితులను కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నకుల్ చేసిన ఆరోపణలకు స్వతంత్రంగా ధ్రువీకరణ జరగలేదు. ఆయన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, నిరసనకారులు హెచ్చరికలను పట్టించుకోకుండా నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని, దూకుడుగా వ్యవహరించారని, అందువల్ల వారిని చెదరగొట్టే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.నటి అయేషా ఖాన్కు ఏమైంది?నిరసనలో పాల్గొనకముందే, నినాదాలు చేయకముందే నటి, మోడల్, కంటెంట్ క్రియేటర్ అయేషా ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను సాయంత్రం 4 గంటలకు తన స్నేహితులతో కలిసి నిరసన స్థలానికి చేరుకున్నానని ఆ నటి తెలిపారు. తాను మాట్లాడకముందే, నిరసనలో పాల్గొనకముందే, ఆ ప్రాంతంలో నిరసన చేయడానికి అనుమతి లేదని ఓ పోలీసు అధికారి చెప్పారని ఆమె ఆరోపించారు."బతా దిజియే దూస్రా ఔర్ క్యా రాస్తా హైం? (దయచేసి మరో మార్గం ఏమిటో చెప్పండి?)" అని ప్రశ్నించానని అయేషా తెలిపారు. సమాధానం చెప్పే బదులు పోలీసులు తనను, తన స్నేహితులను పోలీసు వాహనంలోకి ఎక్కాలని కోరారని ఆమె ఆరోపించారు.కాగా, విద్యా రంగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, జవాబుదారీతనం, విద్యా సంస్కరణల డిమాండ్లతో ఈ నిరసనలు మొదలయ్యాయి.ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వం వహిస్తోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ వైపు ర్యాలీ జరిగిన సమయంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దూకుడుగా వ్యవహరించారని ఢిల్లీ పోలీసులు చెబుతుండగా, లాఠీచార్జి, టియర్ గ్యాస్ వాడారని నిరసనకారులు ఆరోపించారు.గత కొన్ని రోజులుగా షబానా ఆజ్మీ, వేదాంగ్ రైనా, అనుపమ్ ఖేర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు ప్రముఖులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. మంగళవారం నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసినా ఉద్యమం కొనసాగుతోంది. -
సీజేపీ నిరసనలపై ఉక్కుపాదం.. కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం అమలు చేయనుంది. నిరసనకారులను ఏడాది పాటు నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఎటువంటి విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే అవకాశం ఉంది. మూడు నెలల వరకు ఢిల్లీలో చట్టాన్ని అమలు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. పోలీసు కమిషనర్కు విశేష అధికారం కల్పించారు. ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు భారీ అదనపు అధికారాలు ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద నిర్భందించే అధికారం ఉంది. అసాధారణ ఢిల్లీ గెజిట్ నోటిఫికేషన్ను హోం శాఖ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అధికారాలను పరిమిత కాలం (మూడు నెలలు) వరకు వినియోగించే అధికారం ఉంది.అయితే, జాతీయ భద్రత చట్టంపై ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ భద్రత చట్టం మూడు నెలలకొకసారి రొటీన్గా రెన్యువల్ అవుతుందని.. సీజేపీ ఉద్యమాలకు ముందే ఈ ఆదేశం జారీ అయిందని పేర్కొన్నారు. ఇటీవల ఘటనలతో సంబంధం లేదని.. సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై పై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వెళుతోందన్న ఢిల్లీ పోలీసులు.. సీజేపీ ఉద్యమాలను అణచివేయడానికి అధికారాలు ఇచ్చారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఇది రొటీన్ త్రైమాసిక ఎన్ఎస్ఏ పునరుద్ధరణ మాత్రమేనని వెల్లడించారు.కాగా, జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ నిరసనలకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. -
హనీమూన్ హత్య కేసులో సోనమ్కు బిగ్ షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ను గురువారం రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అంతేకాదు.. మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె బెయిల్పై సుప్రీం కోర్టు ఇదివరకే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇండోర్కు చెందిన సోనమ్ రఘువంశీ.. 2025 మేలో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది. అక్కడే వీరిద్దరూ అదృశ్యం కాగా.. కొద్ది రోజుల తర్వాత రాజా మృతదేహం ఓ లోయలో లభ్యమైంది. దర్యాప్తులో భాగంగా రాజా హత్య వెనుక సోనమ్ కుట్ర ఉందని పోలీసులు అనుమానించారు. తన తండ్రి దగ్గరే పని చేసే ప్రియుడి రాజ్ కుశ్వాహాతో కలిసి ఆమె ప్లాన్ వేసినట్లు గుర్తించారు. ఈ ఇద్దరూ.. సుపారీ గ్యాంగ్తో కలిసి రఘువంశీని హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. బెయిల్ ఎలా వచ్చింది?ఈ కేసులో సోనమ్కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.విచారణకు ఆటంకం కలిగే అవకాశంజస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. ప్రస్తుత దశలో సోనమ్ బెయిల్పై బయట ఉండటం న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. విచారణ వేగంగా కొనసాగకపోతే ఆరు నెలల తర్వాత ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.సోనమ్ వాదనతనపై అభియోగాలను సోనమ్ ఖండించింది. తాను నిర్దోషినని, కేసు పూర్తిగా పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలపైనే ఆధారపడి ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. కేవలం ఆరోపణల ఆధారంగా తనను దోషిగా చూడలేమని కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా.. బెయిల్ను రద్దు చేస్తూ మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మేఘాలయా హనీమూన్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
మోదీ ట్వీట్కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
పేపర్ లీకులకు చెక్! కేంద్రం సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు.. అక్రమాలకు పాల్పడే వారికి త్వరగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు.ఈ మేరకు గురువారం ఉదయం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులపై కఠిన, వేగవంతమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, విభాగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.“యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు. పేపర్ లీకులకు పాల్పడి యువత భవిష్యత్తును దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Nothing is more important than the welfare and future of our youth!We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…— Narendra Modi (@narendramodi) July 23, 2026విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలుపరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల శ్రమను దెబ్బతీస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.నీట్ వివాదం వేళ ప్రధాని ప్రకటననీట్–యూజీ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షల నిర్వహణపై విశ్వసనీయతను పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న వేళ.. కేంద్రం వేగవంతమైన న్యాయ ప్రక్రియపై దృష్టి సారించింది.ఇటీవల పేపర్ లీకేజీ కేసుల్లో పలువురిపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇకపై ఇలాంటి వ్యవహారాల్లో విచారణ, శిక్షల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయ వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.“యువత భవిష్యత్తుతో ఆటలాడితే క్షమించం”పేపర్ లీకుల వ్యవహారాన్ని మహా పాపంగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నాలను సహించబోమని ఇదివరకే స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే పేపర్ లీకేజీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం.. నీట్ నిరసనకారులను శాంతింపజేస్తుందా? అనేది చూడాలి. -
బీజేపీపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉత్కంఠగా మారాయి. గత రాత్రి జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు.తాజాగా అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘కొందరు బయటి వ్యక్తులు మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యం. కొందరు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్ ఎప్పుడూ ప్రజాస్వామ్య నిరసనలకు అందుబాటులో ఉండే ప్రదేశమే’ అని వ్యాఖ్యానించారు.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "I have already spoken about the lathi charge. It was very brutal, and we will take the police officers who carried it out to court, and today is the 34th day of our protest. Sonam Sir's hunger… pic.twitter.com/LuZgdavsIr— ANI (@ANI) July 23, 2026అలాగే, నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాఠీచార్జ్ అత్యంత దారుణంగా జరిగింది. ఈ చర్యకు బాధ్యులైన పోలీసు అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం. మా ఉద్యమానికి ఇవాళ 34వ రోజు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.లడఖ్కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షపై కూడా దీప్కే స్పందించారు. ‘వాంగ్చుక్ సర్ నిరాహార దీక్షకు ఇవాళ 26వ రోజు. ఆయన ఆరోగ్యం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని భావిస్తున్నాం. అందుకే దీక్ష విరమించాలని కోరుతున్నాం. అయినప్పటికీ మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు.Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026 Sarthak Goswami covering a protest near New Delhi Railway Station. Video shows Delhi Police pushing and handling him in the crowd — arm yanked, phones out, total chaos. pic.twitter.com/Bw3feKQwij— Dilip Ray 🇮🇳 (@dilipray) July 22, 2026 -
నీట్ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్లో చదివిస్తావా?
నీట్–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడిన నీట్ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో..నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.‘నీట్ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలునీట్ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.కుమార్తె సోషల్ మీడియా ఖాతాపై చర్చసోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.విమర్శలు ఎటు వరకు?ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.రాజకీయ రంగు పులుముకున్న నీట్ వివాదంనీట్ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. -
పార్లమెంట్ను తాకిన ఏపీ మెగా డీఎస్సీ స్కామ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతూ.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది.రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా.. లోక్సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణ చర్చ చేపట్టాలని వారు కోరారు.16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు!ఏపీలో సుమారు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైఎస్సార్సీపీ అంటోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.స్పోర్ట్స్ కోటాలో మరీ దారుణంస్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని అన్నారు.మెరిట్ జాబితాలపై ప్రశ్నలుగతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ అంటోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.ఏపీలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదని.. పైగా అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలో ఇదివరకే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..Live Updates08: 14 PMగాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శనగాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలుమొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలుప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలునీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి 07: 30 PMవిద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్ఇండియాగేట్కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదువిద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారురాజ్ఘాట్కు వెళ్దామని అనుకుంటున్నాంమా బస్సును పోలీసులు అడ్డుకున్నారుబస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు07:18 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీరాజ్ఘాట్కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్, ఇండి కూటమి నేతలురాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలువిద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్07:08 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలురాహుల్ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీరాజ్ ఘాట్ బయల్దేరిన రాహుల్, ఇండి కూటమి నేతలువిద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్06:13 PMరాహుల్ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీవిద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చసమావేశం అనంతరం రాజ్ఘాట్కు వెళ్లే యోచనరాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు04:50PMరేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపుశాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ 03:21 PMనీట్ పేపర్ లీక్ కేసుపై కేంద్రం కీలక నిర్ణయంనాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుబాంబే హైకోర్టులోని రెండు బెంచ్ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపేపర్ లీక్ చట్టం కింద ప్రతిరోజూ విచారణ03:13 PMసీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంఅన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..జంతర్మంతర్లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ02:03 PM | కేంద్రం సంచలన నిర్ణయంఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలునిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారంసీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుసీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలునేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అవకాశంగెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్పై చర్యలుముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.‘‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతుజంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుఅంతకంతకు పెరుగుతున్న మద్దతు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుల మద్దతుమొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్బాలీవుడ్ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షాఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ తారలుఇటు సౌత్లోనూ పలువురి సపోర్ట్12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టిసీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.సెంట్రల్ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.ఎంట్రీ పాస్లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 11:33 AM | ముంబైలో పోలీస్ వాహనం నుంచి నిరసనకారుల పరార్చెంబూర్లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్ వీడియోలో కనిపించింది.దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలుజంతర్ మంతర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు.తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్పై CJP చీఫ్ సెటైర్పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేశారు.ప్రధాని ట్వీట్లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్గా పోస్టు చేశారు.‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్ను షేర్ చేశారు. https://t.co/mo44rK6tNc pic.twitter.com/kEeHWUMouF— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026 11:08 AM | బిహార్ అసెంబ్లీలో నీట్ నిరసనల సెగవిద్యార్థులపై లాఠీచార్జ్ అంశం బిహార్ అసెంబ్లీని కుదిపేసింది.విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతపార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపుయువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుఇవాళ పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు భేటీఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వంశాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీచలో సంసద్ మళ్లీ ఉండబోదన్న సీజేపీజంతర్ మంతర్ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులునిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణఅప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు11:04 AM | అభిజిత్ దీప్కేకు అస్వస్థతCJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు అస్వస్థతనిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్ తీసుకోనున్న దీప్కే గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడితిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్ మంతర్కు వచ్చే చాన్స్.10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలునిరసనకారులపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.10:43 AM | జంతర్ మంతర్కు అలఖ్ పాండేఫిజిక్స్ వాలా సీఈవో అలఖ్ పాండే జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.ఆందోళనకారులను ‘పాక్ ఫండెడ్’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.10:34 AM | చండీగఢ్కు విస్తరించిన నిరసనలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో చండీగఢ్లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులురాజీనామా తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలుఅప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణఇటు.. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుమంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులురాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిడిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రంచర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనంచర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలులీక్కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటనమంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్ నిరసనల వ్యవహారంకేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠచర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ఆరోపణలు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’పేపర్ లీక్లపై ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: CJP పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ను మరోసారి తెరపైకి తెచ్చింది.09:42 AM | పోలీస్పై దాడి వీడియో వైరల్జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడంNEET పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.09:17 AM | NEET పేపర్ లీక్పై ఫాస్ట్ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటనపరీక్షల పేపర్ లీక్లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకిఅనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్ అధికారి ఫొటో వైరల్CJP ఆందోళనల్లో ఇన్స్పెక్టర్ నందకిశోర్పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.08:21 AM | కేంద్రంపై ఆప్ నేత అతిషి విమర్శలుఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్ అధికారిఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.07:55 AM | పోలీస్ అధికారి చర్యలపై CJP స్పందననిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేతCJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, మండీ హౌస్, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి.🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJPకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.🔴 07:55 AM | పోలీస్ అధికారిపై చర్యలకు CJP డిమాండ్జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్ చేసింది.🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావంకేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.🔴 07:13 AM | ఇంటర్నెట్ నిలిపివేతపై కాంగ్రెస్ ఆరోపణలుజంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్ఐఆర్లు నమోదుCJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.🔴 03:46 AM | నాగ్పూర్లో నిరసనకారుల తరలింపునాగ్పూర్లోని సంవిధాన్ స్క్వేర్ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.🔴 02:44 AM | మరో పోలీస్ చర్యపై CJP ఆరోపణలుజంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్చల్!జూలై 20న జంతర్ మంతర్ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నంజంతర్ మంతర్ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్షCJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటనకనాట్ ప్లేస్ సమీపంలోని టాల్స్టాయ్ మార్గ్ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు. -
భద్రత కట్టుదిట్టం.. మెట్రో బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7:30 గంటల నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.ఇక, మెట్రో మూసివేత నిర్ణయం కారణంగా ప్రతిరోజూ మెట్రో సేవలపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా 16 మెట్రో స్టేషన్లను మూసివేసిన విషయం తెలిసిందే.తాత్కాలికంగా మూసివేస్తున్న మెట్రో స్టేషన్లు: లోక్ కల్యాణ్ మార్గ్ రాజీవ్ చౌక్ పటేల్ చౌక్ రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ బరఖంబా రోడ్ సుప్రీం కోర్ట్ సేవా తీర్థ్ జనపథ్ మండీ హౌస్ సెంట్రల్ సెక్రటేరియట్ ఐటీఓ ఢిల్లీ గేట్ ఇంద్రప్రస్థ ఖాన్ మార్కెట్ జోర్ బాగ్ శివాజీ స్టేడియం -
సీజేపీ నిరసనకు స్పాన్సర్ ఎవరు?.. అసలు కథ ఇదే
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్మంతర్ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్లాంటి నగరాల నుంచి ఆర్డర్ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.జంతర్మంతర్కు వరుసగా.. నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్ చావల్, రాజ్మా చావల్, టీ, శాండ్విచ్లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతుజూలై 20న చలో సంసద్కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్ మంతర్ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.ఫండింగ్పై రాజకీయ ఆరోపణలు.. సోషల్ మీడియాలో చర్చఅయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్ సపోర్ట్ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతుప్రస్తుతం జంతర్మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్మంతర్ ఫుడ్ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. -
గాడ్జిల్లా ఎల్ నినో భయపెట్టింది.. మరి ఈ మేఘాలు ఎలా వచ్చాయి?
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం భారత రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. బలమైన ఎల్ నినో భారత్లో వర్షాలను తగ్గిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 95 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగుతుందని తేల్చేశారు. మరి ఎల్ నినో ఉన్నా ఈ మేఘాలు, వర్షాలు ఎందుకు వస్తున్నాయి?ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. భారత రుతుపవనాల విషయంలో ఎల్ నినో సాధారణంగా వర్షాలకు ప్రతికూలంగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రతిరోజు వాతావరణాన్ని నియంత్రించదు. ఒక వారం లేదా కొన్ని రోజుల వర్షాలను ఆపే శక్తి దీనికి ఉండదు. మొత్తం రుతుపవనాల కాలంలో వర్షపాతం ఎలా ఉండొచ్చనే అంచనాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.స్థానిక వాతావరణ పరిస్థితులే కారణంప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండటానికి స్థానిక వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తేమతో కూడిన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రెండు సముద్రాల నుంచి భారీగా తేమ దేశ భూభాగంలోకి చేరుతోంది. ఈ తేమ, గాలి కలయికతో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్నినో ఈ స్థానిక పరిస్థితులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది.మళ్లీ పుంజుకున్న రుతుపవనాలుఇటీవల కొంతకాలం ఉత్తర దిశగా వెళ్లిన రుతుపవన ద్రోణి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. బంగాళాఖాతం నుంచి తేమ సరఫరా పెరగడంతో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. పశ్చిమ బెంగాల్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం ఎంత?భారత వర్షాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). ఇది హిందూ మహాసముద్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల సముద్ర ఉష్ణోగ్రతల తేడాలను సూచిస్తుంది. పాజిటివ్ IOD ఉన్నప్పుడు భారత్వైపు అదనపు తేమను తీసుకురావడంలో సహకరిస్తుంది. 1997లో బలమైన ఎల్ నినో ఉన్నప్పటికీ పాజిటివ్ IOD భారత్ను కరువు నుంచి కాపాడింది. అయితే ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలో ఉంది. దీంతో ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే బలమైన సహకారం అందడం లేదు.మరి వర్షాల లోటు ముగిసినట్టేనా?ప్రస్తుతం దేశమంతా మేఘాలతో కప్పుకున్నా.. రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయినట్లు భావించలేమని నిపుణులు చెబుతున్నారు. ఒకటి రెండు వారాల వర్షాలు మొత్తం సీజన్ పరిస్థితిని నిర్ణయించవు. కొన్ని రోజుల పాటు సాధారణ వాతావరణ వ్యవస్థలు బలమైన ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించగలవు. అయితే రుతుపవనాల మొత్తం గమనాన్ని తెలుసుకోవాలంటే రాబోయే నెలల్లో వర్షపాతం ఎలా ఉంటుందన్నదే కీలకం. -
సాక్షి మార్నింగ్ రౌండప్: జులై 23.. నేటి బిగ్ హెడ్లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు కొనసాగుతుండగా.. జంతర్మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఘర్షణల్లో పలువురు సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు నీట్ అంశంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ్టి మేజర్ హెడ్లైన్స్ను పరిశీలిస్తే.. ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. CJP నిరసనల్లో ఘర్షణలు నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీశాయి. జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో మంగళవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టాల్స్టాయ్ మార్గ్ వద్ద కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న CJP ఉద్యమం నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీపై ప్రారంభమైన CJP ఉద్యమం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ముంబైలో అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. నాగ్పూర్లోనూ నిరసనకారులను పోలీసులు తరలించారు. అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించడంతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ మధ్య వార్నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. గత పదేళ్లలో 150కిపైగా పేపర్ లీక్లు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. పేపర్ లీక్ల విషయంలో రాహుల్ గాంధీ ఎంపిక చేసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన లీక్లను ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నడ్డా స్పష్టం చేశారు.ఇరాన్పై అమెరికా దాడులు 12వ రోజుకు.. హార్ముజ్పై పెరుగుతున్న టెన్షన్మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్పై అమెరికా వరుసగా 12వ రాత్రి వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. తమపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు.. చమురు సరఫరాపై ఆందోళనప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధానికి కేంద్రంగా మారింది. ఈ మార్గంలో అంతరాయం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇరాన్–అమెరికా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగితే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పందిస్తూ.. తమ దేశం చమురు విక్రయించలేని పరిస్థితి వస్తే ఈ ప్రాంతంలోని మరే దేశం కూడా చమురు ఎగుమతి చేయలేదని హెచ్చరించారు.సోనమ్ వాంగ్చుక్ కీలక ప్రకటననీట్ నిరసనలకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని తెలిపారు.పంచదార్లకు నో మైనింగ్ జోన్.. వైఎస్సార్సీపీ పోరాటానికి ఫలితంఅక్రమ మైనింగ్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్ల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్ అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. పంచదార్ల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించకపోతే ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ గతంలో హెచ్చరించింది.సీదిరి అప్పలరాజు అరెస్ట్తో పలాసలో ఉద్రిక్తతవైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు తరలించారు. అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పలరాజు అరెస్ట్ను నిరసిస్తూ పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించాయి. మరోవైపు అరెస్ట్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరికతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.జింబాబ్వేతో టీమిండియా తొలి టీ20 నేడుఇంగ్లండ్ పర్యటన తర్వాత టీమిండియా మరో టీ20 సిరీస్కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న ఈ సిరీస్లో భారత జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సొంతగడ్డపై జింబాబ్వే కూడా టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. యువ భారత్ జోరు చూపిస్తుందా? లేదంటే జింబాబ్వే షాక్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఈరోజు ఫోకస్లో..ఢిల్లీలో CJP నిరసనలు.. పోలీసులతో ఘర్షణలునీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ గాంధీ వార్పార్లమెంట్ సమావేశాలు.. నీట్పై చర్చకు ప్రభుత్వం సిద్ధం.. మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టుఇరాన్పై అమెరికా 12వ రోజు దాడులుహార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలుప్రపంచ చమురు సరఫరాపై ప్రభావంసోనమ్ వాంగ్చుక్ దీక్షపై కీలక పరిణామంపంచదార్ల విషయంలో ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అప్డేట్స్తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరికలుమరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్తోనే ఉండండి. -
ప్రధాన్ రాజీనామాకు విపక్షాల పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ సమావేశాల మూడో రోజూ ప్రతిష్టంభన నెలకొంది. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల దాష్టీకం, ప్రధాన్ రాజీనామా డిమాండ్ అంశాలపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలతో సభా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రభుత్వం నీట్ అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, ముందుగా ప్రధాన్ రాజీనామా చేయా లని ప్రతిపక్షం పట్టుబట్టడంతో లోక్సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఉభయ సభల ఆరంభానికి ముందే నీట్పై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, హిబి ఈడెన్ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. నల్ల దుస్తులు ధరించి లోక్సభకు హాజరైన విపక్షాల ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగడంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మొదలయ్యాక కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. నీట్పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘విద్యార్థుల భవిష్యత్తు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. నీట్ పేపర్ లీక్, పరీక్షల పారదర్శకత, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని తెలిపారు. చర్చ ఏ తేదీన నిర్వహించాలనేది స్పీకర్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయిస్తామని చెప్పారు. దీనిపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. విద్యార్థుల లాఠీచార్జ్ ఉదంతంపై ప్రధాని సభలో ఎందుకు ప్రకటన చేయలేదు? అని నిలదీశారు. ‘‘ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తీరా చర్చిద్దామంటే ముందుగా ధర్మేంద్ర మంత్రి పదవికి రాజీనామాచేయాలనే కొత్త షరతు పెడుతున్నారు. అమలుసాధ్యంకాని షరతులు పెట్టి చర్చకు కాంగ్రెస్ మోకాలడ్డుతోంది’’అని రిజిజు విమర్శించారు. -
పిజ్జాలు, బర్గర్లు, గోల్గప్పా..
కొద్దిరోజుల నుంచి అలుపెరగక ఉద్యమంలో కొనసాగి అలసిపోయిన ఉద్యమకారులకు ఢిల్లీ, పొరుగున ఉన్న ప్రాంతాల్లోని సానుభూతిపరుల నుంచి ఆహార సహాయం వెల్లువెత్తుతోంది. తమ శక్తిమేరకు జనం ఈ విద్యార్థులకు సీజనల్ పండ్లు, ఇతర ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి కొందరు వినూత్నంగా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, గోల్గప్పాలు సైతం పంపిణీచేస్తున్నారు. పంక్తి భోజనాలకూ కొందరు ఆర్థికసాయం చేస్తున్నారు. కొందరు సాయంకాలపు చిరుతిండ్లు పంపిస్తూ ఉద్యమకారుల ఆకలిబాధలను తీరుస్తున్నారు. చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్ల రసాలు, శీతలపానీయాలు, దహీబల్లా ఇలా ఎన్నో రకాల ఆహారపదార్థాలను ఉచితంగా పంపిణీచేస్తున్నారు. ఆహార పొట్లాల పంపిణీ ఊపందుకుంద. సామూహిక భోజనాలకు సిక్కు వర్గీయులు ముందుకొచ్చారు. వాటర్ బాటిళ్లను విపరీతంగా పంచుతున్నారు. ఒక మలీ్టనేషనల్ కంపెనీలో పనిచేసే ఉన్నతోద్యోగి రవి మౌర్య కొద్దిరోజులు ఆఫీస్కు సెలవు పెట్టిమరీ ఉద్యమకారులకు ఆహార ఏర్పాట్లలో సాయపడుతున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లనూ అందుబాటులో ఉంచుతున్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ల నుంచి బుధవారం ఉదయమే ఇక్కడికి చేరుకున్నట్లు కొందరు నిరసనకారులు తెలిపారు. సమగ్రమైన విద్యావ్యవస్థ కోసం పోరాడుతున్న విద్యార్థులకు వృద్ధుల మద్దతూ ఉందని చాటేందుకే ఇక్కడికి వచ్చానని పంజాబ్ నుంచి వచ్చిన 70 ఏళ్ల బలదేవ్ తెలిపారు. ఇంట్లోంచి చూడ్డంకంటే నేరుగా ఉద్యమాన్ని కళ్లారా చూడ్డానికి వచ్చానని స్కూల్ యూనిఫాంలో వచ్చిన 16 ఏళ్ల విద్యార్థి ఒకరు తెలిపారు. -
ఉద్యమం... ఉధృతం
న్యూఢిల్లీ: పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం బుధవారం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పరీక్షార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలతో కోలాహలంగా మారింది. వాళ్లు చేసే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. బ్యాక్ప్యాక్లతో కొందరు కొన్ని రోజులపాటు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చారు. సొంతంగా బ్యానర్లు సిద్ధంచేసుకుని, ప్లకార్డులు పట్టుకుని ఉద్యమస్థలికి చేరుకున్నారు. కొందరు పోలీస్బారికేడ్లను ఊతంగా చేసుకుని కూర్చోగా కొందరు సమీపంలోని చెట్లు ఎక్కి మొత్తం ఉద్యమప్రాంగణాన్ని ఆసక్తిగా గమనించారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారని, ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్కు స్వల్పగాయమైందని పోలీసులు ఆరోపించారు. మూతబడిన మెట్రోస్టేషన్లు.. ఎలాంటి అనూహ్య పరిణామాలు జరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఢిల్లీ అధికార యంత్రాంగం ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్లను కొన్ని గంటలపాటు మూసేసింది. లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్్థ, జన్పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం, ఝాన్దేవాలన్ స్టేషన్లను మూసేశారు. ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తూ... ఉద్యమ స్ఫూర్తి పలు రాష్ట్రాల్లోనూ నిరసనకారులు పుణికిపుచ్చుకుని రాష్ట్ర రాజధానుల్లో ర్యాలీలు చేపట్టారు. బిహార్లో ‘లోక్భవన్ మార్చ్’పేరిట గవర్నర్ హౌస్కు ర్యాలీగా వెళ్లిన ఉద్యమకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించి విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీచార్జ్ సైతం చోటుచేసుకుంది. తమిళనాడులోనూ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఉద్యమసంఘాలు కోయంబత్తూర్ తదితర చోట్ల ఢిల్లీ లాఠీచార్జ్ను నిరసిస్తూ ర్యాలీలు చేపట్టాయి. -
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిణామాలు వే గంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గా లు ఒక్కటైపోయి, ఎన్డీయేలో చేరుతాయన్న ఊహాగానాలు నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నీట్–యూజీ పేపర్పై విద్యార్థులు డిమాండ్లు, రైతుల సమస్యలు, వాటర్ మేనేజ్మెంట్, విద్యా రంగం సమస్యలపై తాము చర్చించినట్లు తెలిపారు. ఎన్సీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి శరద్ పవార్, మరో వర్గానికి ఆయన కోడలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ నేతృత్వం వహిస్తున్నారు. సునేత్ర పవార్ పార్టీ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతోంది. శరద్ పవార్ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి. రెండు పార్టీలు విలీనమై, ఎన్డీయేలో చేరుతాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ మెజార్టీ కోసం ఎన్డీయే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీలోని వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. -
నిరసనకారులపై చర్యలు నిలిపేస్తే దీక్ష ఆపేస్తా
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో రణరంగంగా మారిన విద్యార్థుల ఉద్యమంలో పోలీసులతో ప్రతిఘటనకు దిగిన ఉద్యమకారులైన విద్యార్థులు, సీజేపీ మద్దతుదారులను కేసుల పేరిట వేధించకుండా వదిలేస్తే తాను ఆస్పత్రిలో నిరాహార దీక్షను విరమిస్తానని సోనమ్ వాంగ్చుక్ బుధవారం ప్రకటించారు. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ను మంగళవారం రాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఐసీయూలో ఉన్న వాంగ్చుక్ను మంత్రులు యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. గంటపాటు మంత్రులు వాంగ్చుక్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల చర్చల వివరాలు వెల్లడికాలేదు. మంత్రులు పరామర్శించాక వాంగ్చుక్ బుధవారం ఒక లేఖ రాశారు. లేఖలో వాంగ్చుక్ ప్రస్తావించిన షరతులు... 1. నీట్ పేపర్ లీకేజీ కారణంగా మనస్తాపంతో చనిపోయిన నీట్ పరీక్షార్థుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాలి 2. పరీక్షల్లో అక్రమాలపై పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలి 3. విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి 4. ఉద్యమంలో పాల్గొన్న సీజేపీ మద్దతుదారులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయకూడదు ఉద్యమకారులను ఒప్పిస్తా ‘‘ఈ షరతులకు ప్రభుత్వం ఒప్పుకుంటే దీక్షాస్థలిని వీడాలని, ప్రభుత్వప్రతినిధులతో చర్చలకు ముందుకు రావాలని నిరసనకారులను ఒప్పిస్తా. ఆ మేరకు వాళ్లతో మాట్లాడతా. నిరాహార దీక్ష ఆపేయాలని నన్ను ఇప్పటికే 65 మంది ఎంపీలు స్వయంగా, లేఖల రూపంలో కోరారు. నేనింకా ఎంతో దేశసేవ చేయాల్సి ఉంది. అందుకోసమైనా బతుకుతా. విద్యారంగానికి సేవచేసేందుకు విద్యార్థుల కోసం తిరిగి నా వృత్తిజీవితంలోకి వెళ్తా. అయితే ఎవరి కోసమైతే ఈ ఉద్యమం, దీక్ష ఆరంభించానో వాళ్ల త్యాగాలను పణంగా పెట్టి మధ్యలోనే దీక్షను విరమించలేను’’అని వాంగ్చుక్ అన్నారు. -
చర్చలకు సిద్ధం: సీజేపీ
న్యూఢిల్లీ: నెల రోజులుగా ఉద్యమబాటలో పయనిస్తున్న తాము ఇకపై చర్చల బాటలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు సత్వరం చరమగీతం పాడాలంటూ ఉద్యమపంథాలో వెళ్తున్న తాము ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ‘‘చర్చలకు మోదీ సర్కార్ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమాచారమిచ్చారు. ఆయన అధికార నివాసంలో చర్చలకు రావాలని ఆహా్వనంపలికారు. అయితే అధికారిక నివాసాల్లో చర్చలకు మేం సిద్ధంగా లేము. జంతర్మంతర్లో ప్రజాకోర్టు ఇప్పటికే కొలువుతీరి ఉంది. ప్రజలు వచ్చినట్లు మంత్రులూ ఇక్కడికొచ్చి చర్చిస్తే బాగుంటుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది’’అని దాస్ చెప్పారు. ‘‘మనందరం విద్యావంతులమే. జంతర్ మంతర్లో భద్రత పరంగా ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు అని ప్రభుత్వం భావిస్తే దీక్షాస్థలికి బదులుగా మరేదైనా తటస్థ వేదికపై చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. చర్చలకు మేం రెడీ అని ఎప్పుడో చెప్పాం. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఉత్తమమైన ప్రక్రియ. అయితే అర్థరహిత చర్చలకు మా ఉద్యమంలో చోటేలేదు. నిరసనకారుల డిమాండ్ల సాధనకు కృషిజరిగేలా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకురావాలి. మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఇంకా వేలాది మంది జంతర్మంతర్లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితంనాటి పోలీసుల లాఠీచార్జ్, ఉద్యమకారుల ప్రతిఘటన ఉదంతంలో విద్యార్థులపై పోలీసులు ఎలాంటి కేసులు మోపకూడదు. ఉద్యమం ఉధృతమవుతోంది. ఢిల్లీ నుంచి ఉద్యమం గోవా, ముంబై, జైపూర్లకు పాకింది. ఇది సహజంగానే జాతీయస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది’’అని దాస్ వ్యాఖ్యానించారు. -
విద్యార్థులు ఉగ్రవాదులు కాదు
న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవని, వాటిపై రాజీ పడటానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్–యూజీలో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. నిరసనకు దిగిన విద్యార్థులు ఉగ్రవాదులు కాదని.. వారు కేవలం నిష్పక్షపాతమైన విద్యా వ్యవస్థ కావాలని కోరుతున్నారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాల వల్ల నష్టపోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలన్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యా వ్యవస్థ రిగ్గింగ్కు గురైందని, అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియోను రాహుల్ ప్రదర్శించారు. ప్రభుత్వం, పాలకులు భయాందోళనలో ఉన్నారని, అందుకే విద్యార్థులను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలి..‘‘ప్రధానమంత్రి నివాసం వద్ద మంగళవారం శాంతియుత నిరసనలో పాల్గొన్న నన్ను బలవంతంగా ఈడ్చేశారు. భౌతిక దాడి చేశారు, నిర్బంధించారు. అవన్నీ నేను లెక్కచేయను. అవి చాలా చిన్న విషయాలు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయడమే నా పని. ఇప్పుడున్న విద్యా వ్వవస్థ వల్ల పేదలు ఇబ్బంది పడుతుండగా, ధనవంతులు పేపర్ లీక్లతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాలి. విద్యార్థులు లేవనెత్తిన మూడు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్య పేరిట దోచుకుంటున్నారు మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. భద్రతా దళాలు వారిపై ఆయుధాలు గురిపెట్టడానికి, దాడి చేయడానికి విద్యార్థులు చేసిన తప్పేంటి? వారు ఈ దేశం తమకు ఇవ్వాల్సిన వాటిని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కావాలని అంటున్నారు. విద్యా వ్యవస్థలో లోపాల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతులేని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మన విద్యా వ్యవస్థ నేడు లోపాలమయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. గత దశాబ్ద కాలంలో 152 సార్లు ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. కానీ, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. విద్యా వ్యవస్థ వైఫల్యం కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. సమాజంలో ఒక వర్గం వ్యక్తులు మన విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మన దేశంలో కుటుంబాలు విద్య కోసం చేసే వార్షిక వ్యయం రూ.1.32 లక్షల కోట్లు. ఇది రూ.1.4 లక్షల కోట్ల విద్యా బడ్జెట్కు దాదాపు సమానం. విద్య పేరిట కుటుంబాలను దోచుకుంటున్నారు. దేశంలో తయారీ రంగం మూతపడింది, పరిశ్రమల్లో అవకాశాలు లేవు, కార్పొరేట్ ఉద్యోగాలు లేవు. ఇక మిగిలిన ఏకైక మార్గం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే. అవి కూడా దక్కకుండా విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు’’ అని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.జితేంద్ర సింగ్ గురించి చర్చ అనవసరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. జితేంద్ర సింగ్ను ‘అప్రస్తుత వ్యక్తి’గా అభివరి్ణంచారు. నీట్–యూజీపై చర్చకు రాహుల్ తొలుత అంగీకరించి, తర్వాత మాట మార్చారని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారని జితేంద్ర సింగ్ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ బుధవారం స్పందించారు. ‘‘జితేంద్ర సింగ్ తనకు నచ్చిన ఎలాంటి విషయాన్నైనా ఊహించుకోవచ్చు. అలా ఊహించుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దాని గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆరోపణల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన గురించి చర్చ నిరర్థకమని పేర్కొన్నారు. పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్ ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం మానసికంగా కుప్పకూలిపోయే సమయం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. పోలీసులు నాతో ఎలా ప్రవర్తించారనేది నాకు అనవసరం. నేను పట్టించుకోను. నాతో ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించినా పట్టించుకోను. విద్యా వ్యవస్థపై, పత్రాల లీకేజీలను అరికట్టడంపై, పిల్లలకు చెల్లించాల్సిన ఖర్చులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నా విషయంలో నచ్చింది చేసుకోండి. ఐదు రెట్లు కాదు కదా పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్. పోలీసులు నాతో ప్రవర్తించిన తీరువల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. దెబ్బలు తినడం నాకు అలవాటే. అది సమస్యేమీ కాదు. ఇప్పుడంతా బాగానే ఉంది. ఒకటి రెండు దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు. ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు నన్ను ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఈ ప్రభుత్వాన్ని తొలగించమని నా చెవిలో చెప్పారు. ఆ భావన వారిలో ఉంది. జరిగిన దానిపై పోలీసులు కూడా సంతోషంగా లేరు. విద్యార్థులపై దాడి చేయడం దేశ భవిష్యత్తుకు వ్యతిరేకమైన నేరమని వివేకవంతులైన కొందరు పోలీసు సిబ్బంది భావిస్తున్నారు. నిరసనకారుల్లో తమ పిల్లలను చూసుకుంటున్నారు. -
నీట్ ఆందోళనలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలకు సూచించారు. పేపర్ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్, పదో తరగతి పరీక్షలతో పాటు పంజాబ్లో గ్రూప్-డీ పరీక్ష, అలాగే కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.అలాంటి సందర్భాల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతిపక్షాలు, ఇప్పుడు నీట్ లీక్ అంశాన్ని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నాయని జేపీ నడ్డా ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు.నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంతసేపైనా చర్చించేందుకు మేము సిద్ధం. సమస్యలకు పరిష్కారం పార్లమెంట్లో చర్చ ద్వారానే లభిస్తుంది. చర్చలకు పార్లమెంట్కు మించిన వేదిక మరొకటి లేదు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. -
ఇది పబ్లిసిటీ అని మీరు ఎలా చెప్పగలరు?
ఢిల్లీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతర్మంతర్లో లాఠీఛార్జ్పై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సీజేపీ నిరసన వీడియోలు భద్రపర్చాలని ఆదేశించింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్ల వేశారన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. పబ్లిసిటీ అని ఎలా అంటారు? అంటూ ప్రశ్నించింది. సీజేపీ నిరసనకారులపై క్రూరంగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం, పోలీసులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. సీసీ టీవీ, ఇతర వీడియో ఫుటేజీ సహా అవసరమైన రికార్డులను భద్రపరచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు కోర్టు వాయిదా వేసింది.విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు-ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన ఏఎస్జీ ఎస్.రాజు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిరసనల్లో పాల్గొన్న మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని.. వారి మర్మంగాలపై దాడులు చేశారని.. మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించారని, పోలీసుల వద్ద నేమ్బేడ్జీలు కూడా లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. తమ ఆరోపణలను రుజువు చేసేలా 110 వీడియోలు ఉన్నాయని తెలిపారు.అయితే, ఏఎస్జీ రాజు ఈ వాదనలను ఖండిస్తూ... నిరసనకారులు తీవ్ర హింసాత్మకంగా ప్రవర్తించారని పలువురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పిటిషన్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం పబ్లిసిటీ పొందేందుకే వేశారని వ్యాఖ్యానించారు. అయితే, చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యను ప్రశ్నిస్తూ... "ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్ అని మీరు ఎలా చెప్పగలరు? అంటూ నిలదీసింది.విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్లు ఎన్.హరిహరన్, వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. నిరసనకారులు రాజ్యాంగం ప్రసాదించిన శాంతియుత నిరసన, సమావేశమయ్యే హక్కులనే ఉపయోగించుకున్నారని తెలిపారు. -
'సర్, మీ ప్రభుత్వానికి మంచి బుద్ధి కలగాలి'
న్యూఢిల్లీ: విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును బాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ఖండించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న యువతను దౌర్జన్యంగా అణచివేయాలని చూడడం సమంజసం కాదని హితవు పలికారు. పంతాలకు పోకుండా ఉద్యమకారులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని మోదీ సర్కారుకు సూచించారు. పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష నాయకుల అరెస్ట్ను తప్పుబట్టారు. ఈ మేరకు ఎక్స్లో ఘాటు వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు.'వినాశకాలే విపరీత బుద్ధి'... సర్, మీ ప్రభుత్వానికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంచి బుద్ధి వస్తుందని ఆశిస్తున్నాను. దయ్యచేసి విద్యార్థుల పోరాటాన్ని ఇగో సమస్యగా చూడకండి. జెన్ జెడ్/సీజేపీ చట్టబద్ధమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోండి. ప్రభుత్వానికి గానీ, యువతరానికి గానీ ఏమాత్రం మేలు చేయని, మీకు అత్యంత విధేయులైన మీ ప్రతినిధులు చేసే రెచ్చగొట్టే ప్రకటనలను నియంత్రించండి.నిరసన తెలిపే హక్కు, డిమాండ్ చేసే హక్కును కాపాడాలి. లాఠీచార్జి, దౌర్జన్యాలతో వాక్ స్వేచ్ఛను హరించకూడదు. పోరాటం చేస్తున్నవారంతా మన సమాజానికి చెందిన ప్రజలే. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా? 'వారి' డిమాండ్లు నెరవేరనిదే ప్రభుత్వం పార్లమెంటులోనూ, పార్లమెంటు బయట కూడా విజయం సాధించకపోవచ్చు. మన శాంతియుత నిరసనకారులను, మద్దతుదారులను దేవుడు ఆశీర్వదించుగాక. జై హింద్!'' అంటూ శత్రుఘ్న సిన్హా తన పోస్ట్లో రాసుకొచ్చారు.నాకు కోపం వస్తోంది: నసీరుద్దీన్ షాఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు వ్యహరించిన తీరుపై సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురాఘత ఫలితాన్ని ఏదో ఒకరోజు వారు కూడా కచ్చితంగా అనుభవిస్తారని శపించారు. విద్యార్థులకు పోరాటానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు.చదవండి: డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ యాదవ్ అరెస్ట్''అమెరికా ఐసీఈ ఏజెంట్లను తలపించేలా, ముసుగులు ధరించి లాఠీలు పట్టుకున్న ఆ దుండగులు మన పిల్లలను క్రూరంగా హింసిస్తుండటం చూసి, ప్రస్తుతం నా గుండె బరువెక్కింది, నాకు తీవ్రమైన కోపం వస్తోంది. అప్పుడప్పుడు మీ పిల్లల గురించి ఆలోచించండి, అలాగే ఒకరోజు మీకు కూడా అదే గతి పడుతుందని గుర్తుంచుకోండి” అని నసీరుద్దీన్ షా అన్నారు.మీకు అండగా మేముంటాంన్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న యువతకు చాలా మంది ప్రజల సానుభూతి ఉందన్నారు షా. విద్యార్థుల పోరాటానికి ఎంతో మంది అండదండలు ఉన్నాయని, పోరాటం కొనసాగించాలన్నారు. దేశ యువతపై తనకు ఎప్పుడూ ఆశ ఉండేదని, అది ఇప్పుడు మరింత ద్విగుణీకృతం అయిందని పేర్కొన్నారు. మీరు మీ పోరాటాన్ని కొనసాగించండి, మేము మీకు అండగా ఉంటామని నసీరుద్దీన్ షా భరోసా ఇచ్చారు. -
ఆందోళనలు కాదు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయండి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ యువతను "రాజకీయ సాధనంగా" వాడుకుంటున్నాయని ఆరోపించారు.ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సహా పలు సంఘాలు చేపట్టిన నిరసనలపై రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. "ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశ విద్యార్థులు, యువతను రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ సాధనంగా వాడాలని కొందరు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం విద్యార్థులు, యువత ఆశయాలు నెరవేర్చడానికీ, వారి సంక్షేమానికీ పూర్తి నిబద్ధతతో పని చేస్తోంది" అని అన్నారు."మన విద్యార్థుల ప్రతి ఆందోళనను వినడం, పరిష్కరించడం మా బాధ్యత. భారత యువత చైతన్యవంతులు, పరిణతి ఉన్నవారు, వివేకం ఉన్నవారు. ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రయత్నాలను వారు అర్థం చేసుకుంటారని, అభివృద్ధి, ప్రగతి, దేశ నిర్మాణం దిశగా అడుగులు వేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది" అని తెలిపారు.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఇండి కూటమి సృష్టించిన రాజకీయ పరిస్థితిగా రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. "ఎవరికీ అన్యాయం జరగకుండా చూడటానికి, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు న్యాయం జరిగేలా చూడటానికి మేము పూర్తి నిబద్ధతతో ఉన్నాం. కొందరు ప్రతిపక్ష నేతలు విద్యార్థుల్లో కృత్రిమంగా సృష్టిస్తున్న ఆగ్రహం, అసంతృప్తి ప్రజలను, ముఖ్యంగా పిల్లలు, యువతను తప్పుదారి పట్టించే విఫల ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల మేము పూర్తి సున్నితత్వంతో ఉన్నాం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధమని పలుసార్లు స్పష్టం చేసింది" అని చెప్పారు.పార్లమెంట్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురండి వీధుల్లో ఆందోళనలు చేయడం కంటే పార్లమెంట్లో చర్చలో పాల్గొనడం మంచిందని ప్రతిపక్షాలకు సూచించారు. "ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు చర్చించాల్సిన స్థలం పార్లమెంట్. అక్కడ ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించే పూర్తి స్వేచ్ఛ ఉంది. సమస్యలను పార్లమెంట్లో కాకుండా వీధుల్లో పరిష్కరించాలని ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరైంది కాదని నేను భావిస్తున్నాను" అని అన్నారు.ప్రతిపక్షాలు సభ సజావుగా జరిగేలా సహకరించాలని రాజ్నాథ్ సింగ్ కోరారు. "ప్రతిపక్షాలు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఆటంకం కలిగించకుండా, చర్చించాలనుకున్న అంశాలన్నింటినీ పార్లమెంట్లో ప్రస్తావించి సభ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి" అని అన్నారు. -
కాక్రోచ్ జనతా పార్టీ సంచలన నిర్ణయాలు
న్యూఢిల్లీ: కాక్రోచ్లు కొనసాగిస్తున్న ఉద్యమం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బుధవారం తెలిపింది. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేసింది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే బుధవారం మాట్లాడుతూ.. 25 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షను వాంగ్చుక్ ఇక విరమించాలని కోరారు. పరీక్షల సంస్కరణల కోసం చేస్తున్న ఈ ఉద్యమం ఏ మాత్రమూ బలహీనపడబోదని చెప్పారు."వాంగ్చుక్ సర్ నిరాహార దీక్షను విరమించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేశానికి ఆయన అవసరం. ఆయన జీవితం ఎంతో విలువైనది. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన మా డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుంది" అని దిప్కే తెలిపారు.ఎక్స్లో చేసిన పోస్టులో సీజేపీ తన విజ్ఞప్తిని మరోసారి వెల్లడించింది. "సోనం సర్కు సీజేపీ విజ్ఞప్తి. మీ త్యాగం ఒక తరం యువతకు స్ఫూర్తినిచ్చింది. దయచేసి మీ నిరాహార దీక్షను విరమించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పరీక్షల్లో న్యాయం జరిగే వరకు, మా డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం" అని పేర్కొంది.మెదాంత ఆసుపత్రికి ఎంపీలు! వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించేలా ఒప్పించేందుకు ప్రతిపక్ష ఎంపీల బృందం గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన వేళ ఈ విజ్ఞప్తి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ వివేక్ టంఖా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ వాంగ్చుక్ను కలిసి, పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, విద్యా రంగంలో జవాబుదారీతనం అంశాలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తామని హామీ ఇవ్వనున్నారు.పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇస్తే తాను నిరాహార దీక్షను విరమిస్తానని వాంగ్చుక్ ఇప్పటికే చెప్పారు. అయితే, సీజేపీ చేపట్టిన "సంసద్ చలో" ర్యాలీపై ఢిల్లీలో పోలీసులు తీసుకున్న చర్యల తర్వాత, హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జవాబుదారీతనం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా వాంగ్చుక్ జూన్ 28న జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలో చేరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల తర్వాత ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి మెదాంత ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నపత్రం లీక్ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మరింత పెంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించింది. విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలను కూడా పార్టీ ఖండించింది. పరీక్షల సంస్కరణలు కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని తెలిపింది.జేపీ నడ్డా నివాసానికి మేము రాముసీజేపీ బుధవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి వెళ్లి సమావేశం కావడానికి నిరాకరించింది. విద్యార్థులు, నిరసనకారులు లేవనెత్తిన అంశాలపై చర్చించాలంటే మంత్రులే ప్రజా న్యాయస్థానానికి రావాలని పార్టీ తెలిపింది.సీజేపీ కార్యకర్త సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ఎలాంటి చర్చ అయినా జంతర్ మంతర్లోని "ప్రజల న్యాయస్థానం"లోనే జరగాలని స్పష్టం చేశారు. బీజేపీ నేత జేపీ నడ్డా నివాసంలో చర్చలు జరపాలన్న ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ, "మళ్లీ తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. మేము నేరుగా తిరస్కరించాం. ప్రజల న్యాయస్థానం ఇక్కడే ఉంది. మంత్రులే ప్రజల మధ్యకు రావాలి" అని దాస్ చెప్పారు.We request @Wangchuk66 sir to end his hunger strike. The country needs him, and his life is far too precious to be put at further risk.The peaceful protest at Jantar Mantar will continue until our demands are met. pic.twitter.com/rCfygpuCH6— Abhijeet Dipke (@abhijeet_dipke) July 22, 2026 -
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్
ఢిల్లీ: రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అదనంగా వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రబీ సీజన్కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు (బియ్యం రూపంలో) పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులు (LMT)గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణ నుంచి అదనపు బియ్యం సేకరణకు కేంద్రం నిర్ణయంపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల మేలు కోసం, బీజేపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు.ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి, సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) సేకరించాలని సంయుక్తంగా నిర్ణయించారు. తెలంగాణలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి 8 జూలైనాడు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై.. తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశాం.మా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, బియ్యం సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు (అంటే 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 8 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కిషన్రెడ్డి కోరారు. -
చర్చల్లో ట్విస్ట్! కేంద్రానికి CJP కొత్త కండిషన్
న్యూఢిల్లీ: నీట్ ఆందోళనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతూనే.. కాక్రోచ్ జనతా పార్టీ కొత్త కండిషన్ పెట్టింది. తాము వాళ్ల దగ్గరకు వెళ్లబోమని.. చర్చలకు ప్రభుత్వమే ముందుకు రావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా జంతర్ మంతర్కు వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే మా వద్దకే రావాలి. మా షరతులకు అంగీకరించాలి” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని, అహంకారాన్ని పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్పై వెనక్కి తగ్గేది లేదని CJP తేల్చిచెప్పింది. తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.జంతర్ మంతర్లోనే, లేకుంటే..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. చర్చలు జరపాలంటే తటస్థ ప్రదేశంలో లేదా జంతర్ మంతర్లోనే నిర్వహించాలని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చలపై కూడా సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రతినిధులను నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు సిద్ధమన్న కేంద్రంమరోవైపు, నిరసనకారులు చర్చలకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చల విషయంలో బాధ్యతను ప్రభుత్వం నిరసనకారులపైనే ఉంచినట్లు తెలుస్తోంది.జూలై 20న CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించగా.. నిబంధనలు ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు.. మూడు డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. వాటిని పరిశీలించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీజేపీ–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో దఫా చర్చల అంశం కీలకంగా మారింది. ఎవరు ముందడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్లు మూసివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రతా కారణాలతో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది.ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జన్పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లే ముందు మెట్రో సేవలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. భద్రతా పరిస్థితుల ఆధారంగా స్టేషన్ల పునఃప్రారంభంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని DMRC వెల్లడించింది. Delhi Metro stations -Lok Kalyan Marg, Rajiv Chowk, Patel Chowk, Ramakrishna Ashram Marg, Barakhambha Road, Supreme Court, Seva Teerth, Janpath, Mandi House, Central Secretariat, ITO, Delhi Gate, Indraprastha, Khan Market, Jor Bagh and Shivaji Stadium are closed till further… pic.twitter.com/PXLPuJTP2r— ANI (@ANI) July 22, 2026 -
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా రాహుల్ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసనపై స్పందించిన గిరిరాజ్ సింగ్.. రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఆయన చర్యలు అత్యంత ప్రమాదకరమైన ఉద్దేశాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించారు.‘‘రాజ్యాంగ పదవిలో ఉంటూ రాహుల్ గాంధీ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారు. ఆయన ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది’’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇతర దేశాల్లో జరిగిన పరిణామాలను అనుసరిస్తూ భారత్లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్పై ఆరోపణలు చేశారు. ప్రధాని నివాసం సమీపంలో నిరసన చేపట్టడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.VIDEO | Delhi: On Congress leaders’ protest at 7, LKM, Union Minister Giriraj Singh (@girirajsinghbjp) says, “By holding a constitutional office, he (Rahul Gandhi) has torn apart the dignity of the Constitution through his actions. His conduct reflects a very dangerous intention.… pic.twitter.com/j68qjxjiha— Press Trust of India (@PTI_News) July 22, 2026ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపైనా గిరిరాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరు ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం లేదని, “అర్బన్ నక్సల్స్గా మారుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. నిరసనల పేరుతో దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.‘‘ప్రధాని నివాసం సమీపంలో ఆందోళన చేయడం చాలా బాధ్యతారాహిత్యం. అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి ఉంటే.. లేదంటే ఎవరైనా ప్రమాదకర వస్తువులు విసిరి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తాను భావిస్తున్నట్లు గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.ఇదే సమయంలో సీజేపీ నిరసనలపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఆందోళనల పేరుతో విద్యార్థులను ముందుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని చెబుతున్నాయి. సీజేపీ ఆందోళనలు, రాహుల్ గాంధీ నిరసనల నేపథ్యంలో కేంద్రం–విపక్షాల మధ్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. -
నీట్ లీక్.. రాజీనామా కచ్చితంగా చేయాలా??
ఒక పరీక్ష.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్.. కోట్లాది కుటుంబాల ఆశలు. అలాంటి పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్-యూజీలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? లీక్కు పాల్పడిన వ్యక్తులదా? లేక ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రిదా?..నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ను తోసిపుచ్చుతోంది. ప్రశ్నపత్రం లీక్కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, పరీక్షా వ్యవస్థలో మున్ముందు ఈ తరహావి జరగకుండా సంస్కరణలు చేపడుతున్నామని చెబుతోంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి?. ఆయనేమైనా పేపర్ లీక్ చేశారా?. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు కదా అని!. కానీ.. తన శాఖ పరిధిలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థాపరమైన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అంటూ ఇంకోవైపు కూడా ఒత్తిడి నెలకొంది.నైతిక బాధ్యతా?.. పెద్ద మాటే!రాజకీయాల్లో “నైతిక బాధ్యత” అనేది చట్టపరమైన నేరంతో సమానం కాదు. ఒక మంత్రి స్వయంగా తప్పు చేశారని నిరూపణ కాకపోయినా.. తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం అనే సంప్రదాయం భారత రాజకీయాల్లో గతంలో కనిపించింది. అయితే కాలంతో పాటు ఈ సంప్రదాయంపై అభిప్రాయాలు మారాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు సాధారణంగా.. “తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, దర్యాప్తు పూర్తి చేయడం, వ్యవస్థను సరిదిద్దడం”నే బాధ్యతగా చెబుతున్నాయి. ఇదే నీట్ వివాదంలోనూ కేంద్రం వాదన.గతం ఏం నేర్పింది మరి?నీట్ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. 2024లోనూ నీట్-యూజీ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా విధానంపై అనుమానాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఆ సమయంలోనూ కేంద్ర విద్యాశాఖపై ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రదానే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నీట్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో.. “గత వివాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? వ్యవస్థలో లోపాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు నీట్ వివాదాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆందోళనలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతున్నారు.అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. లీకో, అవకతవకలో.. పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావడమే అసలు బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది.గతంలో నైతిక బాధ్యతతో పదవి వదిలిన నేతల గురించి తెలుసా?.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న వీళ్లు పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి!. లాల్ బహదూర్ శాస్త్రి..స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు తొలి ఉదాహరణగా తరచూ ప్రస్తావించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి శాస్త్రి ప్రత్యక్షంగా కారణం కాదు. అయినప్పటికీ రైల్వే మంత్రిగా శాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలుత ఆయన నిర్ణయాన్ని అంగీకరించకపోయినా.. శాస్త్రి పట్టుదలతో చివరకు రాజీనామాను ఆమోదించారు.టీటీ కృష్ణమాచారి..1958లో వెలుగులోకి వచ్చిన ముండ్రా కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎల్ఐసీ పెట్టుబడుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ఆర్థిక శాఖపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన శాఖపై వచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా నైతిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పబడుతుంది.మాధవరావ్ సింధియా.. 1992లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష కారణం కాకపోయినా.. శాఖ మంత్రిగా వ్యవస్థాపరమైన లోపాలకు బాధ్యత వహించడం రాజకీయాల్లో నైతిక ప్రమాణంగా నిలిచింది.నితీశ్ కుమార్.. గైసాల్ రైలు ప్రమాదం1999లో పశ్చిమ బెంగాల్లోని గైసాల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్.. ప్రమాదానికి తాను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.జార్జ్ ఫెర్నాండెజ్..2001లో తెహల్కా నిర్వహించిన ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ స్టింగ్ ఆపరేషన్ రక్షణ శాఖలో అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో రక్షణ శాఖపై వచ్చిన ఆరోపణలకు రాజకీయ బాధ్యత వహించిన ఘటనగా ఇది నిలిచింది.ప్రతి వైఫల్యానికి రాజీనామా జరిగిందా?అలా ఏం జరగలేదు. భారత రాజకీయ చరిత్రలో ప్రతి పరిపాలనా వైఫల్యానికి మంత్రి పదవి వదిలిన సందర్భాలు లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు దర్యాప్తులు, కమిటీలు, సంస్కరణలతో ముందుకు వెళ్లాయి. అందుకే ఇప్పుడు నీట్ వివాదంలోనూ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వాదన ప్రకారం.. లీక్కు పాల్పడిన వ్యక్తులు గుర్తించబడ్డారు. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తుల చర్యలకు మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయడం సరైన విధానం కాదని కేంద్రం చెబుతోంది.మరోవైపు ఆందోళనకారులు, ప్రతిపక్షాల వాదన మాత్రం వేరుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు.. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నీట్ వివాదం.. అసలు పరీక్ష ఎవరికంటే?నీట్ లీక్ వివాదం చివరకు ఒక మంత్రి పదవి ప్రశ్నకే పరిమితం కాదు. దేశంలోని పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మిస్తారు? భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భరోసా ఇస్తారు? అన్నదే అసలు సవాల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? లేదా అన్నది రాజకీయ నిర్ణయం. కానీ “ఒక వ్యవస్థ విఫలమైతే.. దాని అధిపతి ఎంతవరకు బాధ్యత వహించాలి?” అనే పాత ప్రశ్నను నీట్ వివాదం భారత రాజకీయాల్లో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ::వెబ్ ప్రత్యేకం -
జంతర్మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి సమయంలో, అలాగే మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను తొలగించారు. అయితే బుధవారం ఉదయం నుంచి నిరసనకారులు మళ్లీ అక్కడకు చేరుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.లేటెస్ట్ అప్డేట్స్:ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులుపోలీసులపై అల్లరిమూకల దాడిదాడిలో పలువురు పోలీసులకు గాయాలుజంతర్మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్పై నిషేదంగాయపడిన పలువురు పోలీసులుజంతర్మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణంపోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులుపోలీసులు, RAF సిబ్బందిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరిన ప్రొటెస్టర్లుగాయపడిన పలువురు పోలీసులు ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర హైటెన్షన్భారీగా తరలివస్తున్న యువతపార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలుప్రభుత్వం చర్చలకు రావాలంటే తమ వద్దకే రావాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమేనని, కానీ తమ షరతులను అంగీకరించాలని తెలిపారు.ప్రభుత్వ అహంకారం తగ్గాలని డిమాండ్ చేశారు.NEET పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.చర్చలు తటస్థ ప్రదేశంలో లేదంటే జంతర్ మంతర్లో జరగొచ్చని CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు విద్యార్థులపై పోలీసు చర్యలకు దిగిందని CJP ఆరోపించింది.తమ ప్రతినిధులను జేపీ నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు పిలిచి మరోవైపు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని విమర్శించారు.జూలై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది.మరోవైపు, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.NEET అంశంపై CJP–ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.నాలుగు నినాదాలే చేద్దాం: సీజేపీ జంతర్ మంతర్లో CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు.ఆందోళనల్లో నాలుగు నినాదాలకే పరిమితం కావాలని పిలుపు.‘‘భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేయాలని సూచన.ప్రతికూల నినాదాలతో ఉద్యమంపై తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ.ఎలాంటి నెగెటివ్ స్లోగన్స్ను సహించబోమని స్పష్టం చేశారు.స్పీకర్ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్NEET అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాల ఒత్తిడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్రాజీనామాకు పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. విపక్షాలుఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామంలోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠCJP నిరసనలు.. తాజా పరిణామాలువిద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని DMK ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.NEET వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని విమర్శించారు.సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను 20 రోజులకు పైగా కొనసాగించేందుకు అనుమతించారని గుర్తుచేశారు.ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని DMK ఎంపీ ఆరోపించారు.విద్యార్థుల పోరాటం ఆగదని, వారు తమ డిమాండ్ల కోసం కొనసాగుతారని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో భద్రతా కారణాలతో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.రాజీవ్ చౌక్, ఐటీవో, మండీ హౌస్ సహా 16 మెట్రో స్టేషన్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.జంతర్ మంతర్ పోలీస్ యాక్షన్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు👉 ‘సమయం వృథా చేయొద్దు’జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. “మా సమయం, మీ సమయం వృథా చేయొద్దు” అని న్యాయవాదికి సూచించింది. 👉 వీడియోలు చూడబోమన్న సీజేఐపోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోరగా.. “మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.👉 పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తతనీట్ పేపర్ లీక్పై CJP చేపట్టిన నిరసనల్లో భాగంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.👉 లాఠీఛార్జ్ చేశారంటూ ఆరోపణలువిద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది. పలువురు గాయపడ్డారని తెలిపింది.👉 ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్పోలీసుల చర్యపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.👉 ‘కోర్టును ఇందులోకి లాగొద్దు’పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. కేసును బుధవారం విచారణకు లిస్ట్ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.👉 నిరసనలు కొనసాగుతున్నాయిజంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు కొనసాగుతుండగా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.CJP హెచ్చరిక.. ఢిల్లీకి లక్షల మంది వస్తారుNEET పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని CJP హెచ్చరిక.జూలై 20న జరిగిన నిరసన కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా వ్యాఖ్య.ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది ఢిల్లీకి తరలివస్తారని హెచ్చరిక.స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యమమని రంకా పేర్కొన్నారు.ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో నిరసనలు తప్పవని వ్యాఖ్య.జూలై 20 మార్చ్ పోలీసుల జోక్యం వరకు శాంతియుతంగానే సాగిందని ఆరోపణ.ఆందోళనకారులను హింసాత్మకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శ.పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.31 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా ఉద్యమం సాగుతోందని చెప్పారు.CJP–ప్రభుత్వం రెండో దఫా చర్చలు నేడుNEET-UG 2026 పేపర్ లీక్ వివాదంపై కొనసాగుతున్న CJP ఆందోళనలు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు CJP–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు.జూలై 20న తొలిసారి CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ.ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం సమర్పించిన CJP.కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు కోరిన CJP.NEET పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.తొలి చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.CJP ఆందోళనకు TMC మద్దతుCJP చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ.విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ స్పందన దురదృష్టకరమని వ్యాఖ్య.‘‘విద్యార్థుల మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు?’’ అని ప్రశ్న.ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు చేసిన బెనర్జీ.పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు.నిరసనల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు.జంతర్ మంతర్ పోలీస్ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో విచారణజంతర్ మంతర్లో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యను సవాల్ చేస్తూ పిటిషన్.ఈ పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.జూలై 18న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించిన ఘటనపై అభ్యంతరం.పోలీస్ ఆపరేషన్పై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డులు భద్రపరచాలని కోరారు.శాంతియుత నిరసన హక్కును కాపాడేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి.భవిష్యత్లో నిరసనకారులపై విచక్షణారహిత పోలీస్ చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.CJP నిరసనలు.. 10 ఎఫ్ఐఆర్లు నమోదుఢిల్లీలో CJP నిరసనలకు సంబంధించి మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.న్యూఢిల్లీ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్లో 4, కన్నాట్ ప్లేస్లో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.మండీర్ మార్గ్, బరాఖంబా రోడ్, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు.నిరసనల సమయంలో హింస, రాళ్ల దాడి, విధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం వంటి అంశాలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.హింస ముందస్తు ప్రణాళికలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఘటనలకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.👉 పార్లమెంట్లో చర్చకు సిద్ధం: కేంద్రంనీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.👉 ‘ఘోర పాపం’ అన్న ప్రధాని మోదీనీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్తో ఆడుకోవడం ‘ఘోర పాపం’ అని వ్యాఖ్యానించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.👉ఆయన రాజీనామా చేయాల్సిందే!నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్లు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే ఆందోళనలను విరమిస్తామని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడం లేదు. తొలిరోజు నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన నిరసనకారుల ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినప్పటికీ.. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టామని ప్రధాని మోదీ అంటుండగా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధమంటూ ధర్మేంద్ర ప్రదాన్ విపక్షాలకు స్పష్టం చేశారు. #WATCH | Delhi | Cockroach Janta Party (CJP) National Spokesperson Ashutosh Ranka says, "This is the biggest movement in India's post-independence history...We have said this very clearly, what happened on 20th was a trailer. If the Govt doesn't agree, millions more will come to… pic.twitter.com/YwBpgeGkXc— ANI (@ANI) July 22, 2026👉జంతర్ మంతర్లో మళ్లీ భారీగా చేరిన నిరసనకారులువర్షం కురుస్తున్నప్పటికీ CJP కార్యకర్తలు జంతర్ మంతర్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఉదయం ఆందోళనకారుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.👉 CJP నేత వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అంటూ ఆరోపణCJP ప్రతినిధి సౌరవ్ దాస్ తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని ఆరోపించారు. తమ నిరసనల నేపథ్యంలోనే డిజిటల్ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే తమ సంస్థకు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన ఖాతాలు బ్లాక్ లేదా సస్పెండ్ అయ్యాయని CJP ఆరోపిస్తోంది.👉 పోలీసులపై రాళ్ల దాడి.. కేసు నమోదుమంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.👉 RAF వాహనంపై దాడికన్నాట్ ప్లేస్లో గుంపును చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. RAFకు చెందిన వజ్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు సంయమనం పాటించారని అధికారులు తెలిపారు.👉 రాహుల్ గాంధీ నిరసన.. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తతజంతర్ మంతర్ ఆందోళనకు దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వైపు నిరసనకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు.👉భద్రత కట్టుదిట్టంజంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచారు. -
నీట్ మంటలు.. కేంద్రానికి రాహుల్ గాంధీ ఐదు డిమాండ్ల అస్త్రం
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి వారిని విడుదల చేశారు.రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి తరలించగా, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ప్రియాంకను పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్బంధంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచారు.కీలక డిమాండ్లు..👉కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, 👉విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 👉విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 👉అలాగే విద్యార్థులపై జరిగిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని, 👉నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో తక్షణమే చర్చ నిర్వహించాలని, 👉దేశ విద్యా వ్యవస్థతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరారు.దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..‘భారత్లో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోంది? ప్రశ్నపత్రాలు ఎందుకు వరుసగా లీకవుతున్నాయి? విద్య ఎందుకు అంత ఖరీదుగా మారింది? పిల్లలను చదివించడానికి కుటుంబాలు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి? ఇవి లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగుతున్న సహజమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు’ అని వ్యాఖ్యానించారు. బుధవారం లోక్సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.भारत के छात्रों और प्रधानमंत्री को मेरा सीधा संदेश... pic.twitter.com/pgZZHLLz8h— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026మరోవైపు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపినా, కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం వెతకడం కంటే రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ లబ్ధే రాహుల్ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. -
నిరసనలకు వెళ్లలేదు.. ర్యాంక్ కొట్టాడు!
నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యా సంస్కరణలు.. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఓ టాపర్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. తోటి విద్యార్థుల్లా నిరసనల్లో పాల్గొనడం కంటే.. మళ్లీ పరీక్ష రాసి ర్యాంక్ కొట్టడంపైనే ఫుల్గా ఫోకస్ పెట్టాడు. అంతేకాదు ఆ ప్రయత్నంలో విజయమూ సాధించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతని స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.NEET-UG 2026 రీ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్-2 సాధించిన పంషుల్ బన్సల్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. నిరసనకు ఎందుకు వెళ్లాలి? దాని బదులు ఇంట్లో చదువుకుని స్కోర్ను మెరుగుపరుచుకోవచ్చు కదా అని తాను అనుకున్నానని చెబుతున్నాడు. మొదట నేనూ బాధపడ్డా..ఢిల్లీ గ్రేటర్ కైలాష్లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన పంషుల్.. మొదటి NEET పరీక్ష రద్దు కావడంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యాడట. "మొదట బాధగా అనిపించింది. నేను బాగా రాశానని, మెడికల్ సీటు వస్తుందని అనుకున్నాను. కాసేపటికి దీనినే మరో అవకాశం లాగా మార్చుకోవాలనుకున్నా. ఆ ఫలితం ఆధారంగా నా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.706 నుంచి 715 మార్కులకు..నీట్ మొదటి పరీక్షలో పంషుల్ 706 మార్కులు సాధించాడు. అయితే రీ ఎగ్జామినేషన్లో అతని స్కోర్ను 715 మార్కులు. ఎగ్జామ్లో 99.9999 పర్సంటైల్తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు కూడా తెలియజేశారు. అదనంగా లభించిన సమయాన్ని కొత్తగా చదవడానికి కాకుండా.. తన పాత ప్రణాళికనే మరింత క్రమశిక్షణతో కొనసాగించానని చెప్పాడు. "నా షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే రొటీన్ను కొనసాగించాను. చివరి నెలన్నరలో చేయగలిగినంత కష్టపడ్డాను. మిగతాది దేవుడిపై వదిలేశాను" అని పంషుల్ తెలిపాడు.నిరసనలపై నో కామెంట్NEET పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు నిరసనలపై తన అభిప్రాయం చెప్పాలని అడిగినప్పుడు.. పంషుల్ స్పందించేందుకు నిరాకరించాడు. "దానిపై నేను వ్యాఖ్యానించను" అని స్పష్టం చేశాడు.#NDTVExclusive | "I thought of the situation as an opportunity to improve my score. So I thought, why should I go to the protest? Instead I could be studying at home and improving my skill and score": NEET UG 2026 topper Panshul Bansal to NDTV's @ShivAroor on #IndiaMatters pic.twitter.com/G8c7O2KXHn— NDTV (@ndtv) July 21, 2026పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన NEET-UG పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న పరీక్షను రద్దు చేశారు. అనంతరం జూన్ 21న భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించి.. జులై 16న ఫలితాలు ప్రకటించారు.అయితే పంషుల్ బన్సల్ విజయ ప్రయాణంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన లక్ష్యంపై దృష్టి పెట్టి ర్యాంక్ సాధించిన అతని కృషిని పలువురు ప్రశంసిస్తుండగా.. మరోవైపు NEET వివాదంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను కొందరు గుర్తు చేస్తున్నారు.పంషుల్ వంటి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు మరో అవకాశం లభించడం ఒక కోణమైతే.. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా వ్యవస్థలోని లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే ఒత్తిళ్లతో ఉన్న విద్యార్థుల్లో అసంతృప్తికి చివరి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సాక్షి మార్నింగ్ రౌండప్: జులై 22.. నేటి బిగ్ హెడ్లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు ఉధృతం కాగా.. ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు నిరసన నాటకీయ పరిణామాలకు దారి తీసింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులు 11వ రోజుకు చేరడంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ‘చలో లోక్భవన్’ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ పొగాకు రైతులతో భేటీ కానున్నారు..ప్రధాని నివాసం వద్ద యుద్ధ వాతావరణం నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్పై పోలీసుల చర్యకు నిరసనగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపు నిరసన చేపట్టారు.ప్రతిపక్ష నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలు అయ్యాయని, ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నేడు కూడా విపక్షాలు తమ నిరసనలు కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP నేతృత్వంలో మూడో రోజు కూడా ఆందోళనలు కొనసాగనున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ ధర్నాలు రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. ‘చలో లోక్భవన్’కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని కీలక నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.నీట్పై సమగ్ర చర్చకు సిద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ నీట్ వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు కావాల్సింది సమాధానాలు, సంస్కరణలు, జవాబుదారీతనం అని పేర్కొన్నారు. ప్రధాని నివాసం వద్ద ప్రతిపక్షాల నిరసన ప్రజాస్వామ్య పద్ధతి కాదని.. భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుందని ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి.ఇరాన్పై అమెరికా దాడులు 11వ రోజుకు.. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా వరుసగా 11వ రోజు వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ సైట్లు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా దాదాపు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లపై దాడులు జరగడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.చమురు ధరలపై యుద్ధ ప్రభావం ఇరాన్-అమెరికా ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.పాలా మున్సిపాలిటీలో రాజకీయ షాక్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్ దియా బిను పులిక్కకండం పదవి కోల్పోయారు. కేరళలోని పాలా మున్సిపాలిటీలో ఎల్డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో యూడీఎఫ్ పాలన ముగిసింది. కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.సూరత్లో ఏఐ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు గుజరాత్ సూరత్ పోలీసులు ఏఐ ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. 18 ఏళ్ల చదువు మానేసిన యువకుడు ఈ నెట్వర్క్ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు.భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం సాధారణంగా ఉండనుంది.పొగాకు రైతులతో వైఎస్ జగన్ భేటీ.. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కూటమి పాలనలో అవస్థలు పడుతున్న వివిధ వర్గాల ప్రజలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణలో గిగ్ వర్కర్ల సమ్మె.. తెలంగాణలో గిగ్ వర్కర్లు సమ్మెకు దిగనున్నారు. 12 గంటల పాటు సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో, ఓలా, ఉబెర్ తదితర సేవలు నిలిచిపోనున్నాయి. మినిమమ్ చార్జిని ప్రభుత్వం నిర్ణయించాలని.. తమ డిమాండ్లను పరిశీలించాలని అసోషియేషన్ కోరుతోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.సిక్కిం విషాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. సిక్కింలో టన్నెల్ కూలిన ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్ పోలీస్ అకాడమీ కేసులో ట్విస్ట్.. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్లకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. కేసును షీ టీంకు అప్పగించారు. డీసీపీ లావణ్య నాయక్ జాదో పర్యవేక్షణలో విచారణ కొనసాగనుంది. మరోవైపు ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్, లైంగిక వేధింపుల నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.ఈరోజు ఫోకస్లో..* ప్రధాని నివాసం వద్ద ప్రతిపక్షాల నిరసన* రాహుల్ గాంధీకి గాయాల ఆరోపణలు* నీట్ లీకేజీపై పార్లమెంట్లో రగడ* ఇరాన్పై అమెరికా 11వ రోజు దాడులు* హార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు* తెలంగాణ కాంగ్రెస్ నిరసనలు* వైఎస్ జగన్ పొగాకు రైతులతో భేటీ* గిగ్ వర్కర్ల సమ్మె* సిక్కిం టన్నెల్ ప్రమాదం* హైదరాబాద్ పోలీస్ అకాడమీ కేసు అప్డేట్లు మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్తోనే ఉండండి. -
పంజాబ్ రైతులను అడ్డుకున్న హరియాణా పోలీసులు
శంభు/అంబాలా: అమెరికాతో కేంద్రం కుదుర్చుకోనున్న వాణిజ్యం ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన మహా పంచాయత్కు వస్తున్న పంజాబ్ రైతులను హరియాణా పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. హరియాణాలోకి ప్రవేశించకుండా శంభు సరిహద్దుల్లో ముందు జాగ్రత్తగా బారికేడ్లను, సిమెంటు దిమ్మెలను రోడ్డుకు అడ్డంగా ఉంచారు. రైతుల డిమాండ్ మేరకు హరియాణా వ్యవసాయ మంత్రి శ్యామ్ సింగ్ రాణా అక్కడికి వచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన రైతులతో ఆయన మాట్లాడారు. డిమాండ్లను తెలుసుకున్నారు. వారి నుంచి మెమోరాండం అందుకున్నారు.కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైతు సంఘాల నేతల మధ్య 10 రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేయడం, నిర్బంధంలో ఉన్న రైతు నేతలను విడుదల చేయడం వంటి డిమాండ్లను నెరవేరుస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో, తమ తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామంటూ రైతులు తిరుగు పయనమయ్యారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్లో దేశ్ బచావో మోర్చా పేరుతో రైతు సంఘాలు మంగళవారం కిసాన్ మహాపంచాయత్ తలపెట్టాయి. ఈ కార్యక్రమానికి పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల నుంచి రైతులు తరలివచ్చారు.ఇందులో భాగంగా పంజాబ్ నుంచి వివిధ రైతు సంఘాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు మంగళవారం శంభు సరిహద్దు వద్దకు చేరుకున్నారు. సరిహద్దు దాటాక బస్సుల్లో ఢిల్లీకి చేరాలనేది వారి ప్రణాళిక. అయితే, అధికారులు ముందు జాగ్రత్తగా శంభు వద్ద భారీగా బందోబస్తుతోపాటు బారికేడ్లు, సిమెంటు దిమ్మెలను ఘగ్గర నదీ వంతెనపై ఏర్పాటు చేశారు. వాటర్ కెనన్ వాహనాలను సిద్ధంగా పెట్టారు. పొరుగునే ఉన్న అంబాలా జిల్లాలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. పోలీసులు ఖనౌరీ, షాహాబాద్, కర్నాల్ బోర్డర్ పాయింట్ల వద్ద కూడా రైతులను అడ్డుకున్నారు. అయితే, బోర్డర్ పాయింట్ల మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
భర్తపై దాడి చేస్తుంటే నువ్వేం చేశావ్?
న్యూఢిల్లీ: గతేడాది మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోయి, ఈ కేసు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. వ్యాపారవేత్త రాజా రఘువంశీని చంపినట్లు ఆరోపణలున్న మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన సోనమ్ను గతేడాది జూన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆమెకు బెయిలిస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం వేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది.‘మీ ప్రవర్తనను మీరు ఎలా సమరి్థంచుకుంటారు? మీరు భర్తతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడే అతడిపై దాడి జరిగింది. అతడు మరణించాడు. అప్పుడు, ఆ తర్వాత మీరేం చేశారు? ఇది ప్రాథమికంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న. అరెస్ట్కు కారణాలేంటని మీరు మొదట్లోనే పోలీసులను అడిగారా?..ఇది రెండో ప్రశ్న’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘పిటిషన్లో పేర్కొన్న ఆధారాలను బట్టి తగు ఆదేశాలు జారీ చేయడం లేదా నిందితురాలు సోనమ్ను లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించడం గానీ చేస్తాం. వీటికి సిద్ధపడి రండి..’అంటూ సోనమ్ తరఫు లాయర్తో వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ఏపీలో 7 వారాల్లో 7 కస్టోడియల్ మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో కేవలం ఏడు వారాల వ్యవధిలో ఏడు కస్టోడియల్ మరణాలు, ఇతర తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. బదరవాడ వేణుగోపాల్ అలియాస్ బాబా ఖతర్నాక్ దాఖలు చేసిన ఈ పిల్ ఈ నెల 24న విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పాలన, పోలీసుల జవాబుదారీతనం, ప్రాథమిక హక్కుల రక్షణపై రాజ్యాంగపరమైన ప్రశ్నలేవనెత్తుతూ పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కస్టడీలో ఉన్న గాదె సాయికృష్ణ అదృశ్యం, పేరుపోగు క్రాంతికుమార్ మృతి, రెండున్నరేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం, సుగాలి ప్రీతికి సంబంధించిన ఆందోళనలు, అలాగే మాల గంగమ్మ, కళావతి, తాయారమ్మ, వీధి నవీన్కుమార్ల మరణాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడిచేసి, బహిరంగంగా అవమానించిన ఘటనను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలన్నింటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని లేదా ఏపీతో సంబంధం లేని అధికారులతో కూడిన కోర్టు పర్యవేక్షక స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్కు) దర్యాప్తును బదిలీ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. -
పేపర్ లీకేజీ... ఘోరమైన పాపం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ప్రశ్నపత్రాలను లీక్ చేయడం ‘ఘోరమైన పాపం’గా అభివర్ణించారు. ఈ పాపానికి ఒడిగట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. యువత భవిష్యత్తుతో ఆటలాడితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ‘మంగళ్ మిలన్’పేరిట జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. పేపర్ లీక్ అనేది పార్టీల రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని వెల్లడించారు. ఈ జాఢ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో ఆప్యాయత, అనురాగంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, యువత విశ్వాసాన్ని పొందాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. ‘మంగళ్ మిలన్’ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రసంగం వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలు రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిందంటూ ప్రధానమంత్రి చెప్పారని వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, ప్రధాని అనేక ముఖ్యమైన అంశాలపై మాట్లాడారని రిజిజు పేర్కొన్నారు. యువతతో ఎంపీలు మమేకం కావాలి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ‘నీట్’పునఃపరీక్షకు ప్రాధాన్యతనిచి్చ, దానిని విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. యువత విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా యువతతో మమేకం కావాలన్నారు.వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించాలని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్నవారికి కఠిన శిక్ష పడేలా చూసేందుకు అత్యంత సమర్థులైన న్యాయవాదులను రంగంలోకి దించినట్లు గుర్తుచేశారు. దోషులను శిక్షించాలని, పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్ఘాటించారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని అన్నారు. వారిని తప్పుదోవ పట్టించడం సులభమే అయినప్పటికీ సరైన మార్గంలో నడిపించడం మాత్రం కష్టమని వ్యాఖ్యానించారు. వారు మంచిమార్గంలో నడిచేలా చూడడం మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఎఫ్టీఏలతో దేశానికి లాభం అలాగే గత కొన్ని నెలల్లో దేశం సాధించిన విజయాల మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల అనేక దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్టీఏ) గురించి ఎన్డీయే ఎంపీలకు వివరించారు. ఈ ఒప్పందాలతో మన రైతాంగానికి, మన దేశానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దేశ శ్రేయస్సు కోసం జీవితంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేయాలని ఎంపీలను కోరారు. ‘‘దేశమే ప్రథమం, దేశ పురోగతి, సంక్షేమం కోసం మనం నిరంతరంకృషి చేయాలి’’అని పిలుపునిచ్చారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులకు ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాన సేవక్ (ప్రధాని మోదీ) శరీరంలోని ప్రతి అణువూ, ఆయన సమయంలోని ప్రతి క్షణమూ పిల్లల భవిష్యత్తు కోసమే అంకితం’’ అని బీజేపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. -
రూ.23 లక్షల కోట్లు కాదు.. వచ్చింది రూ.6,962 కోట్లే
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఎక్కడ రూ.23 లక్షల కోట్లు..? ఎక్కడ రూ.6 వేల కోట్లు..? ఎక్కడైనా పొంతన ఉందా? పోనీ అవైనా పూర్తిగా వచ్చాయా అంటే అదీ లేదు! ‘‘రెండేళ్లలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయ్.. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం.. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చేశాయ్..!’’ సీఎం చంద్రబాబు పదేపదే చెప్పే గొప్పలివీ! రెండు నెలల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడూ సేమ్ టూ సేమ్ బిల్డప్లు!! కానీ చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇందులో అణువంతైనా నిజం లేదని కుండబద్ధలు కొట్టింది. దావోస్లో మీటింగ్లు.. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలు.. సింగపూర్ యాత్రలు.. విశాఖ వేదికగా సీఐఐ పెట్టుబడుల సమావేశం.. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. అంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపీబీ ద్వారా చేసుకుంటున్న బూటకపు ప్రచారాలకు కేంద్ర ప్రభుత్వం తెర దించింది. లోక్సభ సాక్షిగా పెట్టుబడులపై వాస్తవ గణాంకాలను వెల్లడించింది. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్కు కేవలం రూ.6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డీపీఐఐటీ, ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత రెండేళ్లలో ఏపీకి మొత్తం పది ప్రాజెక్టులు రాగా అందులో కేవలం రెండు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు వైఎస్సార్సీపీ లోక్సభా పక్షనేత పీవీ మిథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే.. గత రెండేళ్లలో ఏపీకి వచ్చిన ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ రూ.6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు. ఆ ప్రాజెక్టులు పూర్తయి, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వస్తాయని అంచనా వేసిన ఉద్యోగాలు మాత్రమే. వాస్తవంగా ఇప్పటివరకు ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అనే వివరాలను కేంద్రం తన సమాధానంలో వెల్లడించలేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం కాబట్టి ఎన్నికల హామీల్లో పేర్కొన్న నిరుద్యోగ భృతి ఇక ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు సర్కారు నమ్మబలుకుతోంది. మొత్తంగా చంద్రబాబు సర్కారు చేస్తున్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రచారానికి.. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమైంది. రెండేళ్లలో పూర్తయినవి రెండంటే రెండు పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే కాగా మిగిలిన పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే ఉన్నాయని కేంద్రం సమాధానంలో వెల్లడైంది.వైఎస్ జగన్ హయాంలో వచ్చినవే.. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే మూడు పారిశ్రామిక కారిడార్లలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిలను మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు జితిన్ ప్రసాద తన సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందని, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈఎంసీ 2.0 కింద రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. అయితే ఇవన్నీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే కావడం గమనార్హం. ఓర్వకల్లు వద్ద దేశంలో తొలి డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, దీని ద్వారా 40,000 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. -
ఢిల్లీలో బోనాలు – దేశవ్యాప్తమైన తెలంగాణ సంస్కృతి
సాక్షి, న్యూఢిల్లీ: బోనాల పండుగ భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల మహోత్సవాలు మంగళవారం రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘దేశ రాజధానిలో బోనాలను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా పరిచయమవుతోంద’’న్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎ.పి. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ ఉత్సవాలు ఢిల్లీలోని తెలుగువారికి మాతృభూమితో అనుబంధాన్ని పెంచుతున్నాయ’’న్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రధాని నివాసం 'యుద్ధరంగం'
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల ధర్నాతో ఢిల్లీ లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి నివాస ప్రాంతం అట్టుడికింది. న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు మంగళవారం గొంతెత్తాయి. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ సహా పలు పార్టీల ఎంపీలు, నేతలు హైసెక్యూరిటీ జోన్ అయిన ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాల హోరుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరుపులు, తోపులాటలతో యుద్ధ రంగాన్ని తలపించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత కేంద్ర ప్రభుత్వ దూతగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి ధర్నా స్థలికి చేరుకున్నారు. నిరసన విరమించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఫోన్లో మాట్లాడారు. నీట్–యూజీపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. మోదీ రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. చేసేది లేక జితేంద్ర సింగ్ వెనుదిరిగారు. ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు తమ చేతులను తాళ్లతో కట్టేసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగింది. చివరకు పోలీసులు ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు..విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి జరిగినట్లేనని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎలాంటి సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోకుండా తప్పించుకోగలనని ప్రధాని మోదీ భావిస్తున్నారని.. కానీ, ఈసారి అలా చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని విశ్వసించే దేశభక్తి గల ప్రతి భారతీయుడు ఈ ధర్నాలో తమతో చేరాలని రాహుల్ కోరారు. విద్యార్థుల గళాన్ని ఎవరూ విస్మరించలేరని చెప్పారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన అరాచకాలకు సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం కోరేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లాం. జరిగిన దానికి బాధ్యత వహించడానికి గానీ, దీనిపై పార్లమెంట్లో చర్చ జరపడానికి గానీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థుల హక్కులు, వారి న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జి, బలప్రయోగం చేసినందుకు ఈ పిరికిపంద, నియంతృత్వ ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. మోదీ, అమిత్ షా మన యువత పట్ల తప్పు చేశారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం చేసి, వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే దాకా తమ పోరాటం ఆపబోమని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గబోమన్నారు. పోలీసులు తమపై బలప్రయోగం చేశారని కొందరు ఎంపీలు ఆరోపించారు. సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అరెస్టు.. విడుదల ప్రధానమంత్రి నివాసం ఎదుట బైఠాయించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించేందుకు ప్రయత్నించాయి. పోలీసులను తనను అరెస్టు చేసే సమయంలో రాహుల్ గాంధీ నేలపై పడుకొని కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైంది. రాహుల్కు, అఖిలేష్ యాదవ్ను పోలీసులు నిర్బంధించి, ఛత్రసాల్ స్టేడియంకు తరలించారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం అమలవుతోంది’’ అని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. చిత్రంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, అనిల్కుమార్ యాదవ్ తదితరులు రాహుల్ గాంధీ కంటి కింద గాయం కావడంతోపాటు చేతులు, కాళ్లపై కూడా స్వల్ప గాయాలయ్యాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ ముక్కు నుంచి రక్తం కారినట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తున్న ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో షేర్చేశారు. ‘‘మోదీజీ, మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా, మీ సర్వశక్తులు ఒడ్డినా సరే విద్యార్థుల న్యాయం జరగడం కోసం సాగుతున్న ఈ పోరాటం మాత్రం ఇప్పుడు ఆగదు’’ అని ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి రాహుల్, అఖిలేష్ను ఛత్రసాల్ స్టేడియం నుంచి పోలీసులు విడుదల చేశారు. ప్రియాంక గాంధీని మందిర్మార్గ్ స్టేషన్కు తరలించారు. ఆమె తల్లి సోనియా గాంధీ స్టేషన్కు చేరుకొని ప్రియాంకను పరామర్శించారు. తర్వాత ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు.పార్టీ నేతలను అరెస్టు చేసి తరలించిన మందిర్మార్గ్ పోలీస్స్టేషన్కు వచ్చిన సోనియాగాంధీ రాహుల్ గాంధీ మాట మార్చారు నీట్–యూజీకి సంబంధించిన అన్ని అంశాలపై, దానిపై జరుగుతున్న ఉద్యమంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై చర్చకు అంగీకరించిన రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల్లోనే వెనక్కి తగ్గారని, ఆ స్థాయి నాయకుడికి ఇది తగదని పేర్కొన్నారు. పార్లమెంట్లో చర్చించడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని పట్టబట్టారని చెప్పారు. నీట్–యూజీపై పార్లమెంట్లో నిబంధనల ప్రకారం అధికారిక చర్చ కోసం కాంగ్రెస్ ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని జితేంద్ర సింగ్ ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చకు ఇకనైనా ముందుకు రావాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
చలో సంసద్.. షాక్లో కాక్రోచ్ జనతా పార్టీ!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించారు. దీంతో సీజేపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మంగళవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా జనసమూహం రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సమయంలో పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియా ఢిల్లీలోని ఓ బర్గర్ అవుట్లెట్లో బర్గర్ కొనుగోలు చేసి కారులో కూర్చొని తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు నిరసనలో పాల్గొంటున్న వేళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరికొన్ని వీడియోల్లో అతన్ని కొందరు నిలదీస్తూ, నిరసనకు మద్దతుగా నిలవకుండా బర్గర్ ఎందుకు తింటున్నారని ప్రశ్నించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.ఈ ఘటనపై స్పందించిన అభిజిత్ దీప్కే, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకే విజేత దహియాను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. जंतर मंतर पर कल छात्र लाठियां खा रहे थे, उसी वक्त CJP प्रवक्ता विजेता दहिया मॉल में जाकर बर्गर खा रहा था !! pic.twitter.com/D75L0hJlZL— Sachin Gupta (@Sachingupta) July 21, 2026 విమర్శలపై స్పందించిన విజేత దహియా మాత్రం తాను నిరసన కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్నానని, అది ముగిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లానని తెలిపారు. రెండు రోజులుగా ఉద్యమ కార్యక్రమాలతో నిద్ర లేకుండా పనిచేశానని, ఇంటికి వెళ్లే మార్గంలో ఆకలి వేయడంతో ఆహారం తీసుకున్నానని చెప్పారు. బర్గర్ తినడంలో తప్పేముంది? ఆకలి వేసింది కాబట్టి తిన్నాను. దేశం కోసం ఉద్యమం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు’అని ఆమె పేర్కొన్నారు.కాగా, ట్రాన్స్జెండర్లపై చేసిన వ్యాఖ్యలు, మహిళల రాజకీయ అవగాహనపై చేసిన వ్యాఖ్యల కారణంగా విజేత దహియా గతంలోనూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నిరసన కార్యక్రమం సందర్భంగా వైరల్ అయిన వీడియోలతో దహియా వివాదం మరింత ముదిరి, చివరకు పార్టీ అతన్ని పదవి నుంచి తొలగించింది. -
రాహుల్ గాంధీ ధర్నాపై కేంద్ర సర్కారు సమాధానం ఇదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో ఎంపీ రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడిన విషయం తెలిసిందే. లోక్ కల్యాణ్ మార్గ్కు చేరుకుని రాహుల్ గాంధీతో ఆయన చర్చించారు. ఆ సమయంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడే ఉన్నారు.దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ... "కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయనతో పాటు ఉన్న సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు తమ మద్దతుదారులతో కలిసి అక్బర్ రోడ్ సమీపంలో ఒక్కసారిగా ధర్నాకు కూర్చున్నట్టు తెలిసింది.ఈ సీనియర్ ప్రతినిధి బృందానికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారితో చర్చించేందుకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి నన్ను ప్రభుత్వం స్వయంగా అక్కడికి పంపింది. ఆ ప్రదేశం ధర్నాలకు అనువైనది కాదని, అక్కడ ధర్నా చేయడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెబుతూ, ధర్నాను విరమించాలని రాహుల్ గాంధీని కోరాం.ప్రభుత్వం నీట్కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు అంగీకరిస్తే తాను వెంటనే ధర్నా విరమిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. కొన్ని క్షణాల్లోనే ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం అనుమతి తీసుకున్న తర్వాత, ఆయన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని, నీట్కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చాం.ఈ సమాచారం రాహుల్ గాంధీకి తెలియజేయగానే, దీనికే తాను అంగీకరించనని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని హామీ ఇవ్వాలని కూడా కోరారు. ఇప్పుడు తనకు రెండు డిమాండ్లు ఉన్నాయని, ఒకటి పార్లమెంట్లో చర్చ, రెండోది కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అని చెప్పారు.ఇంతకుముందు చర్చ మాత్రమే కోరారని గుర్తు చేయగా, ఇప్పుడు తన డిమాండ్లు మారాయని చెప్పారు. ఇంత త్వరగా మాట మార్చడం తనలాంటి సీనియర్ నేతకు తగదని వినయంగా వివరించే ప్రయత్నం చేయగా, అది తన ప్రత్యేక హక్కు అని చెప్పారు.ఈ ప్రదేశం ధర్నాకు అనువైనది కాదని హోం కార్యదర్శి వివరించే ప్రయత్నం చేయగా, తాను ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవడం కూడా తన ప్రత్యేక హక్కేనని సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ లాంటి సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు తన మాట నుంచి వెనక్కి తగ్గడం దురదృష్టకరం. అది ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధం.నీట్కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి భిన్నంగా, ఈ తీవ్రమైన అంశంపై నిబంధనల ప్రకారం అధికారిక చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదు" అని జితేంద్ర సింగ్ తెలిపారు. -
ఐసీయూలో 21 ఏళ్ల యువతి.... దేశ ప్రజలకు CJP అభిజిత్ క్షమాపణలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. వారిలో 21 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్పై చికిత్స పొందుతోంది. ఈ ఘటన అనంతరం గాయపడిన మద్దతుదారులను పరామర్శించిన దీప్కే.. వారిని రక్షించడంలో విఫలమైనందుకు దేశ ప్రజలకు, ముఖ్యంగా తమ పార్టీ మద్దతుదారులకు క్షమాపణలు తెలిపారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన అభిజీత్ దీప్కే, నిరసనలో గాయపడిన మద్దతుదారులకు, ముఖ్యంగా మహిళా నిరసనకారులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. మా మద్దతుదారులందరికీ.. ముఖ్యంగా పురుష పోలీసుల చేతిలో దాడికి గురైన యువతులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మిమ్మల్ని రక్షించడంలో మేము ఇంకా మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఢిల్లీ పోలీసుల చర్యల నుంచి మిమ్మల్ని కాపాడలేకపోయాం. దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.అలాగే, 20 మందికి పైగా విద్యార్థుల మరణాలకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడేందుకే ప్రభుత్వం మరికొంత మంది యువ విద్యార్థుల రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధపడింది అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన వారు ఎవరైనా ఉంటే తనను వ్యక్తిగతంగా సంప్రదించాలని కూడా ఆయన కోరారు.సోమవారం జరిగిన నిరసనకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, సీజేపీ పిలుపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పార్లమెంట్ పరిసరాలకు చేరుకున్నారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుండగా, నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి.


