breaking news
Delhi
-
విభాగాల వారీగా టాపర్లు వీరే
జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరిగిన బీఈ, బీటెక్ పేపర్ 1 ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. 13,04,653 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 96.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది. 326 నగరాల్లోని 658 సెంటర్లలో జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 పరీక్ష నిర్వహించారు. ఇందులో ఇండియా వెలుపల నిర్వహించిన 15 సెంటర్లు కూడా ఉన్నాయి. కాగా ఈసారి పేపర్ 1లో 12 మంది 100 పర్సంటైల్ సాధించారు. బాలికలు ఎవరూ 100 పర్సంటైల్ సాధించలేకపోయారు. గతేడాది రెండు సెషన్లలో కలిసి మొత్తం 24 మంది 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. జనరల్- ఈడబ్ల్యూఎస్శ్రేష్ట్ జసోరియా (రాజస్థాన్)బాలికల విభాగంఆషి గ్రేవాల్ (హరియాణా)పీడబ్ల్యూబీడీహర్ష్ జైన్ (మధ్యప్రదేశ్)ఎస్టీ విభాగందక్ష్ షెహ్రా (రాజస్థాన్)ఎస్సీ విభాగందేవ శ్రీవేద్ (ఆంధ్రప్రదేశ్)ఓబీసీ- ఎన్సీఎల్నరేంద్రబాబుగారి మహిత్ (ఆంధ్రప్రదేశ్)100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరే1. శ్రేయస్ మిశ్రా (ఢిల్లీ)2. నరేంద్రబాబు గారి మోహిత్ (ఆంధ్రప్రదేశ్)3. శుభమ్ కుమార్ (బిహార్)4. కబీర్ చిల్లర్ (రాజస్థాన్)5. చిరాన్జిబ్ కార్ (రాజస్థాన్)6. భవేశ్ పత్రా (ఒడిశా)7. అనయ్ జైన్ (హరియాణా)8. అర్నవ్ గౌతమ్ (రాజస్థాన్)9. పసల మోహిత్ (ఆంధ్రప్రదేశ్)10. మాధవ్ విరాదియా (మహారాష్ట్ర)11. పురోహిత్ నిమయ్ (గుజరాత్)12. వివన్ శరద్ మహీశ్వరి (తెలంగాణ) -
పెళ్లికి ముందే అతడితో దుబాయ్ ఎందుకెళ్లావ్?
న్యూఢిల్లీ: వివాహానికి ముందే శారీరక సంబంధాలు కొనసాగించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. వివాహం చేసుకుంటానని ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత మరొక మహిళను వివాహం చేసుకున్నాడని నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఈ కేసు చారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న (BV Nagarathna) మాట్లాడుతూ.. ''వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ప్రవేశించే యువత జాగ్రత్త వహించాలని హితవు పలికారు. బహుశా మనం పాతకాలపు వాళ్ళమే కావచ్చు. కానీ వివాహానికి ముందు.. ఒక అబ్బాయి, అమ్మాయి అపరిచితులు. వారి మధ్య ఎంత సఖ్యత ఉన్నా వివాహానికి ముందు వారు శారీరక సంబంధంలో ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. అందుకే ఎవరికి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడద''ని అన్నారు.ఇక కేసు విషయానికి వస్తే.. 2022లో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వెబ్సైట్ ద్వారా నిందితుడికి బాధితురాలు పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడితో సన్నిహితంగా మెలిగింది. వారిద్దరూ దుబాయ్కు కూడా వెళ్లారు. పెళ్లికి ముందే వారిద్దరూ చాలా దూరం వెళ్లిపోయారు. అయితే తాము ఏకాంతంగా కలుసుకున్నప్పుడు తనకు తెలియకుండానే నిందితుడు వీడియో తీసి, తనను బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. తనను మోసం చేసి.. 2024 జనవరిలో పంజాబ్లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని కోర్టుకు తెలిపింది.కాగా, బాధితురాలు పెళ్లికి ముందే నిందితుడితో దుబాయ్ (Dubai) ఎలా వెళ్లిందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అన్న ఉద్దేశంతో బాధితురాలు అతడితో సన్నిహితంగా మెలిగిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వివాహానికి ముందే తొందరపాటు పనికిరాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వారిద్దరూ ఇష్టపూర్వకంగానే సన్నిహితంగా మెలిగినందున.. ఇది విచాణార్హమైన, దోషులుగా తేల్చదగిన కేసు కాదన్నారు. వారిని మధ్యవర్తిత్వానికి పంపుతామన్నారు. దీనిపై తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. చదవండి: కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయను? -
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీబీసీ,గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదనిన గీతం యూనివర్శిటీ సుప్రీంలో వాదించింది. అయితే వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది. -
ఒకే ఒక్కడు..!
ఢిల్లీ.. దేశ రాజధాని! మెరిసిపోయే మెట్రోలు, రాజప్రసాదాల్లాంటి భవనాలు.. కానీ వాటి వెనుకే వికృతమైన మురికి కూపాలు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు, బస్టాండ్ల దగ్గర దుర్గంధాలు అలవాటైపోయాయి. చూసీచూడనట్టు ముక్కు ముడుచుకుని వెళ్లిపోవడం నగరజీవి దైనందిన చర్య అయిపోయింది. కానీ, ఆ మురికిని చూసి ఒక సామాన్యుడి రక్తం మరిగింది. అతనే మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ ‘ఆసిఫ్ హిందుస్తానీ’. తన చేతిలోని కెమెరాను ఆయుధంగా, చీపురును ధ్వజంగా మార్చుకుని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాలకుల నిర్లక్ష్యంపై ఆసిఫ్ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. నలుగురికి 62 పార్కుల బాధ్యత ఆసిఫ్ చేసేది కేవలం వీధులు ఊడ్చడం కాదు.. ప్రభుత్వ అసమర్థతను నిలదీయడం.. ఢిల్లీలోని రోహిణిలో ఒక మురికి బస్టాండ్ను స్వయంగా శుభ్రపరచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఆయన నిగ్గు తేలి్చన వాస్తవాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. పశి్చమ ఢిల్లీలో కేవలం నలుగురు పారిశుధ్య కార్మికులు కలిసి 62 పార్కులను నిర్వహించాలట! ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? పారిశుధ్య కారి్మకులకు పని చేయాలనే ఉన్నా, వారి దగ్గర సరైన పరికరాలు లేవు. కాలం చెల్లిపోయి, కనీసం చెత్తను లోడ్ చేయడానికి కూడా పనికిరాని తుప్పు పట్టిన వాహనాలు అధికారుల దౌర్భాగ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నిర్లక్ష్యపు గోడలు బద్దలు కొడుతూ.. ‘పరిశుభ్రత.. అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది వ్యక్తిగత జవాబుదారీతనం’.. అని ఆసిఫ్ గట్టిగా నమ్ముతున్నాడు. చిప్స్ ప్యాకెట్ లేదా ప్లాస్టిక్ స్ట్రా రోడ్డుపై పారేసే ముందు ‘ఒక్క క్షణం ఆగి ఆలోచించండి’అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆ ఒక్క క్షణం చేసే ఆలోచనే నగరాన్ని మారుస్తుందన్నది ఆయన వాదన. మౌలిక వసతుల కన్నా మనుషుల మైండ్సెట్ మారడమే నిజమైన పరిష్కారమని నిరూపిస్తున్నాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, పౌర బాధ్యతను గుర్తు చేస్తున్న ఆసిఫ్ పోరాటం ఇప్పుడు ఒక ప్రభంజనంలా మారుతోంది. రేపటి కల.. సంయుక్త పోరాటం ఆసిఫ్ లక్ష్యం కేవలం ఒక్క రోజు నిరసన కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. యువతలో చైతన్యం తీసుకురావడం ద్వారా పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ‘ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేసే ఒక పటిష్టమైన నమూనా రావాలి’.. అని ఆయన గొంతెత్తుతున్నాడు. అధికారుల ఏసీ గదుల వెనుక దాగున్న ఉదాసీనతను కడిగేయాలంటే, సామాన్యుడు ఇలా వీధిలోకి రాక తప్పదని ఆసిఫ్ తన ప్రతి అడుగుతోనూ చాటి చెబుతున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు
న్యూఢిల్లీ: విద్యుత్ ఆవిష్కరణ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేధ సాంకేతికతపై కూలంకషమైన చర్చకు దేశ రాజధానిలోని భారత్ మండపం సిద్ధమైంది. సోమవారం నుంచి 20వ తేదీ దాకా ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం ఐదింటికి సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల్లో 700కుపైగా సెషన్స్ నిర్వహించనున్నారు. 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మోదీ ఆహా్వనం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తదితరులు రానున్నారు. సురక్షిత కృత్రిమ మేధ, ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా భద్రత, ఏఐలో భారత్ స్వయంసమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై నిపుణులు, విధాన కర్తలు చర్చించనున్నారు. కీలక సంస్థ సీఈఓల ప్రసంగాలు దక్షిణార్థ గోళంలో జరుగుతున్న తొలి ఏఐ సదస్సు కావడంతో దీనిపై అందరి దృష్టీ నెలకొంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్, డీప్మైండ్ టెక్నాలజీస్ సీఈఓ డెమిస్ హస్సాబీస్, ఆంత్రోపిక్ సీఈఓ డేరియో ఆమోడెయి, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ వంటి దిగ్గజాలు సైతం సదస్సులో ప్రసంగించనున్నారు. సదస్సుతోపాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్స్పోను సందర్శించాక ప్రధాని మోదీ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యే అవకాశముంది.భారత్లోని ఏఐ అంకుర సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను సదస్సు వేదికగా ప్రకటించే ఆస్కారముంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, విద్య, కార్పొరేట్ రంగాల్లో రాబోతున్న మార్పులకు ఏఐ ఏవిధంగా ఇతోధికంగా దోహదపడుతుందో వక్తలు వివరించనున్నారు. 2025లో ఫ్రాన్స్లోని పారిస్లో, 2024లో దక్షిణకొరియాలోని సియోల్లో, 2023లో బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద డిజటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో భారత్ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ రంగంలో ఎంతటి మార్పులొచ్చినా మానవీయ, సమ్మిళిత కోణంలోనే అవి జరగాలనే సందేశం విని్పస్తున్నాం. ఏఐ వనరులు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ అందుబాటులో ఉండాలి’’ కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చెప్పారు. ఏఐ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఇక్కడి యువతలో ఏఐ పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా మోదీ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఏఐ రంగ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్లు, విద్యార్థులు, పౌరులు ఇందులో పాల్గొననున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువకారి్మకశక్తి భారత్లోనే ఉంది. ఇక్కడ జనాభాలో 65 శాతం మంది వయసు 35 ఏళ్లలోపే. ఈ యువతరంలో ఏఐపై అనురక్తిని పెంచి ఏఐ బాటలు పయనించేలా చేస్తే ఈ రంగంలో భారత్ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదని, ఇక్కడ ఏఐ ఆధారిత పరిశ్రమలు పెరిగి, ఆవిష్కరణలు ఎక్కువై, డిజిటల్ సేవలు విస్తరించి, ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి’’ అని ఏఐరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ కొత్త ఏఐ ఉత్పత్తులపై సదస్సు వేదికగా ప్రకటనలు చేయొచ్చని చెబుతున్నారు.భారతీయ ఏఐపైనే దృష్టి ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఫౌండేషన్ మోడల్ పిల్లర్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో ఇప్పటికే 12 భారతీయ అంకురసంస్థలు భేటీ అయ్యాయి. ఇండియన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ మోడల్, మల్టీ లింగ్వల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం), స్పీచ్–టు–టెక్ట్స్, టెక్ట్స్,్ట–టు–ఆడియో, టెక్ట్స్,–టు–వీడియో, ఇ–కామర్స్ కోసం జనరేటివ్ ఏఐతో త్రిమితీయ సమాచారం, మార్కెటింగ్, వ్యక్తిగత సమాచార సృష్టి, ఇంజనీరింగ్ సిములేషన్, మెటీరియల్ రీసెర్చ్, అధునాతన అనలైటిక్స్, ఆరోగ్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, వైద్య పరిశోధన ఇలా పలు రంగాల్లో అంకుర సంస్థలు తమ కొత్త పరిశోధనలను ఇంపాక్ట్ ఎక్స్పో2026లో ప్రదర్శించే ఆస్కారముంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎక్స్పోలో 600కుపైగా కీలక స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఇస్తోనియా, తజకిస్తాన్, ఆఫ్రికా పెవీలియన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. డేటా కేంద్రంగా మార్చండి‘‘ఇన్నాళ్లూ అప్లికేషన్లు, ప్లాట్ఫా మ్లు, డివైజ్ల రంగంలో అభివృద్ధి పైనే దృష్టిపెట్టాం. అంతకంటే ముఖ్యంగా మరో ప్రాథమిక రంగంలోనూ ఆధిపత్యం కనబర్చాల్సి ఉంది. అదే డేటా సెంటర్ల ఏర్పాటు. ఇకనైనా డిజిటల్ మౌలికవసతులు, కృత్రిమ మేధారంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చుకుందాం. ఈ మేరకు ప్రపంచ సమాచార స్టోరేజీకి భారత్ను కేంద్రంగా మార్చండి. దీంతో సాంకేతిక విప్లవంతో మరో సంస్కరణల తరంగాలను సృష్టించండి. ఈ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే తాజా బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాం. సదుపాయాల కల్పన ఖర్చులను తగ్గించాం. తద్వారా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ను అంతర్జాతీయ ప్రధాన పోటీదారుగా మార్చండి’’ అని మోదీ అన్నారు.సరైన వేదిక భారత్: గుటెరస్ ‘‘అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ విజయపథంలో దూసుకుపోతోంది. ఇలాంటి భారత్ ఈ సదస్సుకు సరైన వేదిక. సూపర్పవర్ లాంటి రెండు శక్తివంతమైన దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఏఐ ఫలాలు దక్కొద్దు. యావత్ ప్రపంచదేశాలూ ఏఐ ప్రయోజనాలను పొందాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్న భారత్కు అభినందనలు. ఏఐ స్వతహాగా వృద్ధిచెందితే అది అందరి ఉపయోగకరమే’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. -
సరిహద్దుల్లో పాక్ డ్రోన్.. పార్సిల్ జారవిడిచి..
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల వెంట పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి దొంగచాటుగా తరలించేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్మీ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఆర్ఎస్పురా సెక్టార్లో శనివారం రూ.40 కోట్లకు పైగా విలువ చేసే 6.5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13వ తేదీ రాత్రి వేళ అనుమానాస్పద డ్రోన్ కదలికలపై ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది.అదేవిధంగా, పాక్ భూభాగం వైపు నుంచి వచ్చిన డ్రోన్ ఒకటి ఏదో వస్తువును జార విడిచిపెట్టిందంటూ అందిన సమాచారంతో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. ఈ మేరకు బస్పూర్ ప్రాంతంలోని నయీ బస్తీ కరోతానా గ్రామం వద్ద పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని పంట పొలాల్లో 6.582 కిలోల బరువున్న హెరాయిన్ ప్యాకెట్లను జవాన్లు కనుగొన్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సరిహద్దులకు సమీపంలోని కథువా జిల్లాలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన రెండు రోజుల్లోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. -
‘Need Ten Minutes’ : సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి గెలిచిన 19 ఏళ్ల అథర్వ్
ఢిల్లీ: ఫోమో, గోట్, వైబ్, బెట్..ఇవి జెన్జీలు తరచుగా వినియోగించే పదాలు. కానీ వాటికి బదులుగా ‘మై లార్డ్, విత్ డ్యూ రస్పెక్ట్, లెర్న్డ్ కౌన్సిల్, జ్యూరిస్డిక్షన్’ అనే పదాలతో ఓ 19 ఏళ్ల యువకుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో తన కేసును తానే వాదించాడు. ‘Need ten minutes’ అంటూ కేసులో విజయం సాధించాడు. న్యాయశాస్త్రంలో అనుభవజ్ఞులైన న్యాయవాదులు సైతం కొన్నిసార్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయడానికి వెనుకాడుతారు. అలాంటి పిటిషన్ను తానే స్వయంగా దాఖలు చేసి, తన వాదనలతో న్యాయమూర్తులను ఒప్పించాడు.సుప్రీంకోర్టు హాలు న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు, అసోసియేట్ లాయర్లు, జూనియర్ లాయర్లు, వాదులు, ప్రతివాదులతో కిక్కిరిసిపోతున్న సమయంలో, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుట టెన్ మినిట్స్ మోర్ అనే గొంతు వినిపించింది. ఆ గొంతు నిష్ణాతులైన న్యాయమూర్తి గొంతు అని అనుకుంటే పొరబడినట్లే.. 12వ తరగతి పూర్తి చేసి డాక్టర్ కావాలని కలలు కంటున్న 19 ఏళ్ల అథర్వ్ చతుర్వేది గొంతు. సరిగ్గా పది నిమిషాల తర్వాత అతనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 కింద తన ప్రత్యేక అధికారాలను వినియోగించి, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అథర్వ్తో పాటు అర్హులైన Economically Weaker Section (EWS) అభ్యర్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ జబల్పూర్కి చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ్, నీట్ పరీక్షలో ఒకసారి కాదు రెండు సార్లు ఉత్తీర్ణత సాధించాడు. 530 మార్కులు సాధించినప్పటికీ ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందలేకపోయాడు. కారణం ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. అదే సమయంలో ఇతర కోటాలో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్ పొందినట్లు అతను గమనించాడు.ఈ నేపథ్యంలో, జనవరి 6న సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఎస్ఎల్పీ దాఖలు చేశాడు. విచారణలో కోర్టు, విధానపరమైన లోపాల కారణంగా అథర్వ్ లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని గుర్తించింది. వాదన సమయంలో తగిన సమయం లేదని భావించిన అథర్వ్ పది నిమిషాలు అదనంగా కావాలి’ అని చీఫ్ జస్టిస్ను కోరాడు. ఆ పది నిమిషాల తర్వాతే అతనికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో 2025-26 సెషన్లో అతనికి ఎంబీబీఎస్ సీటు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన కేసును తానే వాదించి విజయం సాధించిన అథర్వ్, ఇప్పుడు వైద్య విద్యను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.ఇదే అంశంపై జబల్పూర్ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినిపించాడు. అథర్వ్ వాదనలతో ముగ్ధులైన జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తి సైతం అతనిపై ప్రశంసలు కురిపించారు. నువ్వు డాక్టర్ కాదు, న్యాయవాదిగా రాణించాలి. నువ్వు ఎంచుకున్న రంగం తప్పేమో అంటూ ప్రోత్సహించారు’ అని పలు జాతీయా మీడియా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
Mumbai: కుప్పకూలిన నిర్మాణంలోని మెట్రో పిల్లర్
మహరాష్ట్ర: ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్ప కూలింది. ఈ ఘటనలో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. నలుగురికి గాయాలు కాగా..బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
‘సేవా తీర్థ్’లోకి మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయ చిరునామా మారిపోయింది. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’లోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఢిల్లీని దేశ ఆధునిక రాజధానిగా మార్చి 95 ఏళ్లయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) నూతన భవనం సేవా తీర్థ్ను ప్రధాని మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. మోదీ పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో కలిసి సేవా తీర్థ్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. సేవా తీర్థ్తోపాటు కర్తవ్య భవన్–1, 2లను ప్రారంభించారు. పీఎంఓలో గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. సేవా తీర్థ్ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఫలకంపై దేవనాగరి లిపిలో సేవా తీర్థ్ అని లిఖించగా, దాని కింద నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అని లిఖించారు. సేవా తీర్థ్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ సైతం ప్రధానమంత్రి విడుదల చేశారు. కొత్త భవనంలో మోదీ తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించారు. మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పౌరుడికి జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్’ పథకానికి అనుమతి ఇస్తూ ఫైల్కు సంతకం చేశారు. లఖ్పతీ దీదీల సంఖ్యను ఆరు కోట్లకు పెంచడానికి మరో ఫైల్పై సంతకం పెట్టారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం రాహత్ పథకం కింద.. ప్రమాదాలకు గురైనవారికి రూ.1.5 లక్షల దాకా నగదు రహిత చికిత్స అందిస్తారు. డబ్బు లేకపోయినా బాధితులకు అత్యవసర చికిత్స తప్పనిసరిగా అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. మూడు కోట్ల మంది మహిళలను 2027 మార్చి నెల నాటికి లఖ్పతీ దీదీలుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే అది పూర్తయ్యింది. ఒక ఏడాది ముందే మూడు కోట్ల మంది లఖ్పతీ దీదీలుగా మారారు. 2029 మార్చి నెల నాటికి మొత్తం ఆరుకోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అధికారులకు టార్గెట్ విధించారు. మరోవైపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధికి గతంలో రూ.లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు రెట్టింపు చేశారు. అలాగే రూ.10,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్) 2.0’కు మోదీ అనుమతి మంజూరు చేశారు. ఈ నిధితో నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించబోతున్నారు. బ్రిటిష్ ఆనవాళ్లకు మంగళం ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) సేవా తీర్థ్లో కొలువు దీరగా, కేబినెట్ సెక్రెటేరియట్ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్–1, 2లలోకి తరలిస్తున్నారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆయా కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరబోతున్నాయి. బ్రిటిష్ వలస పాలకుల ఆనవాళ్లను క్రమంగా వదిలించుకొనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2014 నుంచే ఆరంభించారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో నూతన పార్లమెంట్ భవనంతోపాటు సేవా తీర్థ్ భవనం నిర్మించారు. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. బ్రిటిష్ పాలకులు మన మనసును బానిస మనస్తత్వంతో నింపేశారని, దాన్ని తప్పనిసరిగా వదిలించుకోవాలని మోదీ తరచుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకపై సేవా తీర్థ్గా పిలవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన రేస్ కోర్స్ రోడ్ను కూడా లోక్ కల్యాణ్ మార్గ్గా ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు నివాసం ఉండే రాజ్ భవన్లను లోక్ భవన్లుగా, లోక్ నివాస్లుగా మార్చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో మైలురాయి: మోదీసేవా తీర్థ్, కర్తవ్య భవనాలు వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ప్రగతితోపాటు ‘పౌరులే కేంద్రంగా ప్రభుత్వ పాలన’కు ఇవి ప్రతీకలు అని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్–1, 2ల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రిమాట్లాడారు. ఇప్పటిదాకా పీఎంఓగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా సేవలందించిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లు బ్రిటిష్ సామ్రాజ్య ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా నిర్మించినవేనని తెలిపారు. కానీ, నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సేవా తీర్థ్, కర్తవ్య భవనాలు నిర్మించామని చెప్పారు. ఇకపై ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పునాదిగా తోడ్పడుతాయని పేర్కొన్నారు. -
దేశంలో 40% మందిలో ఫ్యాటీ లివర్!
సాక్షి, స్పెషల్ డెస్క్: దేశంలో కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దాదాపు 40 శాతం మంది భారతీయులు ప్రస్తుతం ఫ్యాటీ లివర్ (కొవ్వు పేరుకుపోయిన కాలేయం) సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతీయులలో తక్కువ బరువు ఉన్నప్పటికీ పొత్తికడుపు భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉంటోందని.. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.అధ్యయనంలో తేలిన అంశాలివీ..లాన్సెట్ (ఆగ్నేయాసియా) జర్నల్లో ప్రచురితమైన ఫెనోమ్ ఇండియా అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ మధ్య 27 నగరాల్లో జరిపిన పరిశోధనలో సుమారు 38.9 శాతం మందిలో ఆల్కహాల్తో సంబంధం లేని మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) ఉన్నట్లు తేలింది. కాలేయం గట్టిపడటం లేదా మచ్చలు పడటం (ఫైబ్రోసిస్) ముప్పు సాధారణ వ్యక్తుల్లో 1.7% మందిలో ఉంది. ఇప్పటికే ఎంఏఎస్ఎల్డీ సమస్య ఉన్నవారిలో లివర్ ఫైబ్రోసిస్ 6.3 శాతం మందిలో.. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తంగా 2.4 శాతం మందిలో ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపించాయి. సైలెంట్ కిల్లర్..గతంలో నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్గా పిలిచే ఈ సమస్యను ఇప్పుడు ఎంఏఎస్ఎల్డీగా పిలుస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్య ఉన్న వారిలో చాలా మందికి తమ కాలేయం దెబ్బతింటోందనే విషయం ప్రాథమిక దశలో తెలియదు. ఈ వ్యాధి కాలేయాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఎంఏఎస్ఎల్డీ కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తోంది. దేశ జనాభాలో గణనీయమైన శాతం మందిలో లివర్ ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కాలేయం గట్టిపడే (స్కారింగ్) ప్రక్రియకు ప్రారంభ దశ. దీన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే అది కాలక్రమేణా కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్ లేదా ప్రాణాంతక కాలేయ కేన్సర్కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశ జనాభా విస్తృతిని, వేగంగా పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాటీ లివర్ రోగుల స్థాయి ఆందోళనకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వంటి జీవక్రియ సంబంధిత సమస్యలే ఫ్యాటీ లివర్కు ప్రధాన మూలాలని పరిశోధకులు స్పష్టం చేశారు. సరైన జీవనశైలి, పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
వేదికపై మంత్రి, ఐపీఎస్ మధ్య గొడవ..‘దెన్ గెట్ అవుట్ ఆఫ్ హియర్’
చండీఘడ్: గ్రీవెన్స్ సెల్ ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక) వేదికపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాను ఆదేశిస్తున్న ఆదేశాల్ని ఓ ఐపీఎస్ అధికారిణి పట్టించుకోలేదని కోపంతో ఓ మంత్రి ఊగిపోయాడు. సదరు ఐపీఎస్ అధికారిణిపై చిర్రుబుర్రలాడారు. మంత్రికి ఐపీఎస్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వినలేదు. సదరు పోలీసు అధికారిణి ‘దెన్ గెట్ అవుట్ ఆఫ్ హియర్’ అంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది. హర్యానా రాష్ట్రంలో శుక్రవారం జరిగిన జిల్లా ఫిర్యాదు పరిష్కార సమావేశంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి అనిల్ విజ్,కైతల్ జిల్లా పోలీసు అధికారి (SP) ఉపాసన ఐపీఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.మంత్రి అనిల్ విజ్ నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో టిట్రామ్ గ్రామానికి చెందిన సందీప్ మాలిక్ అనే వ్యక్తి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సందీప్పై ఫిర్యాదు చేశారు. ఎస్సై సందీప్ కబ్జాలతో పాటు ఇతర అనైతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా తన స్థిరాస్తులపై ఎస్సై కన్నుపడినట్లు వాపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.బాధితుడి ఫిర్యాదుపై మంత్రి అనిల్ విజ్ స్పందించారు. వేదికపై ఎడమవైపు ఉన్న కైతల్ జిల్లా ఎస్పీ ఉపాసన (ఐపీఎస్)కు వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.అందుకు కైతల్ ఎస్పీ ఉపాసన.. ఆ ఎస్సై కురుక్షేత్ర జిల్లాకు చెందినవారని, తన పరిధిలో లేడని, అందువల్ల అతన్ని సస్పెండ్ చేసే అధికారం తనకు లేదన్నారు. ఎస్సైని సస్పెండ్ చేసే అధికారం కురుక్షేత్ర ఎస్పీ మాత్రమే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు డీజేపీకి లేఖ రాయండి. నేను అతన్ని సస్పెండ్ చేయమని చెబుతున్నాను. మీరు నా ఆదేశాలను అమలు చేయాలి’ అని మంత్రి అన్నారు. మీకు ఆ ఎస్సైని సస్పెండ్ చేసే అధికారం లేకపోతే ఇక్కడి నుండి వెళ్లిపోండి’ అని విజ్ అన్నారు. మీరు చెప్పినట్లుగా డీజీపీకి లేఖ రాస్తాను. కానీ నేను అతనిని నేనే సస్పెండ్ చేయలేను’ అని ఎస్పీ ప్రతిస్పందించారు.నేను చెప్పాను. మీరు నా ఆదేశాలను పాటించాలి. మీరు మీ సొంత ఆదేశాలు ఇవ్వకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. As I previously highlighted in my tweet regarding Haryana and the positive reforms introduced by the BJP in governance, the core issue of bureaucratic accountability to the political leadership persists. For instance, Mr. Vij, a seasoned politician who has served as a minister… pic.twitter.com/hPSdCX7uaI— Lt Col Sushil Singh Sheoran, Veteran (@SushilS27538625) February 13, 2026 -
PM RAHAT: ప్రమాద బాధితులకు వెంటనే 1.5 లక్షల క్యాష్లెస్ వైద్యం
ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు గోల్డెన్ అవర్స్లో సకాలంలో చికిత్స అందించి వారి ప్రాణాల్ని కాపాడేందుకు కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎం రాహత్ పేరుతో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో రూ.1.5లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మోదీ తెలిపారు. శుక్రవారం పీఎంవో నూతన కార్యాలయం సేవాతీర్థ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సేవాతీర్థ్ నుంచి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ‘సేవాతీర్థ్ కొత్త చరిత్రకు సాక్ష్యం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం సేవాతీర్ధ్. స్టార్టప్ ఇండియా 2.0 కోసం 10 వేల కోట్లతో కార్పస్ ఫండ్. సకాలంలో వైద్యం అందక ప్రాణం పోకూడదన్న ఉద్దేశ్యంతో 1.5లక్షల వరకు నగదు రహిత వైద్యం. పీఎం రాహత్, లక్పక్ దీదీలకు 6 లక్షలు పెంచేందుకు యత్నం. ప్రారంభం వ్యవసాయ మౌలిక సదుపాలయ నిధి రెట్టింపు’ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పీఎం రాహత్ ఎలా పని చేస్తోందిప్రధానమంత్రి రాహత్ (PM RAHAT) పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి రూపొందించింది. ఈ పథకం ద్వారా బాధితులు డబ్బు కోసం ఆందోళన చెందకుండా, వెంటనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స అందుతుంది. అంటే, ఆసుపత్రి బిల్లులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా ఖర్చును భరిస్తుంది.బాధితుడు ఏ ఆసుపత్రిలో చేరినా, పథకం కింద ఖర్చు నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చికిత్స ఆలస్యం కాకుండా, వెంటనే ప్రారంభం కావడానికి సహాయపడుతుంది. ప్రమాదం జరిగిన మొదటి గంటల్లోనే అవసరమైన చికిత్స (సర్జరీ, ICU, మెడికల్ కేర్) అందించడమే ఈ పథకం లక్ష్యం.‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులు డబ్బు కోసం పరుగులు తీయకుండా బాధితుడు వెంటనే చికిత్స పొందేలా ఈ పథకం సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తగ్గుతుంది. ఈ పథకం వల్ల ‘డబ్బు లేకపోవడం వల్ల ప్రాణం కోల్పోవడం’ అనే పరిస్థితి తగ్గుతుంది. అంటే, ఆర్థిక స్థితి ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరికీ సమానంగా వైద్య సహాయం అందుతుంది. -
CJIకి సుప్రీం కోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై ఫిర్యాదుల వెల్లువ
న్యూఢిల్లీ: గడిచిన గత పదేళ్ల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ న్యాయవాదులపై సుమారు 8,360 చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2024లో అత్యధికంగా 1,170 ఫిర్యాదులు, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయిఅవినీతి, లైం**పరమైన, ఇతర తీవ్రమైన అంశాల్లో సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు,హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా? గత పదేళ్ల కాలంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.సంబంధిత ఫిర్యాదుల విషయంలో ఎలాంటి మెకానిజం పనిచేస్తుంది?’ అంటూ లోక్సభలో ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ మాథేశ్వరన్ వీఎస్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. అందుకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరణ ఇచ్చారు.గడిచిన పదేళ్ల కాలంలో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై 8,630 ఫిర్యాదులు అందాయని తెలిపారు.ఈ సందర్భంగా ఏ సంవత్సరంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కాలంలో వచ్చిన ఫిర్యాదుల వివరాల్ని వెల్లడించారు.అనంతరం, న్యాయమూర్తులపై ఫిర్యాదులను సేకరించడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థ (CPGRAMS) కాకుండా ప్రభుత్వానికి మరేదైనా యంత్రాంగం ఉందా? జవాబుదారీతనం నిర్ధారించడానికి అటువంటి ఫిర్యాదులను క్రమపద్ధతిలో నమోదు చేసి పర్యవేక్షించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తుందా? అని కూడా అడిగారు.ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదును కోర్టు 'ఇన్-హౌస్ ప్రొసీజర్' ద్వారా స్వీకరిస్తారని మేఘ్వాల్ అన్నారు. అదేవిధంగా, సంబంధిత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరిస్తారని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? లేదా? వంటి వివరాల్ని వెల్లడించలేదు. -
సేవా తీర్థ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు. అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు.సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్థ్లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్తో పాటు కర్తవ్య భవన్ 1,2ను మోదీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్లో ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.కర్తవ్య భవన్లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు ,విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్బి శాఖ, వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు. -
శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. ‘హైదరాబాద్–చెన్నై (778 కి.మీ.) కారిడార్ అమరావతి మీదుగా వెళుతుంది. అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేస్తే, డ్రైపోర్టు నుంచి బందరు పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవుతుంది. హైదరాబాద్–బెంగళూరు (586 కి.మీ.), హైదరాబాద్–పుణే (556 కి.మీ.) కారిడార్లను కూడా శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుంది. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించండి..’అని సీఎం కోరారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి గురువారం పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. మూసీ పునరుజ్జీవం, రైలు మార్గాల మంజూరు, విమానాశ్రయాల పనులు వేగవంతమే లక్ష్యంగా చర్చలు జరిపారు. ఆ మార్గం కేంద్ర నిధులతో చేపట్టండి కృష్ణా–వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాల్సిందిగా రైల్వే మంత్రిని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయం మొత్తం తామే భరిస్తామని తెలిపారు. ఈ మార్గంలోని టేకల్కోడ్లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని..కొడంగల్, టేకల్కోడ్, దౌల్తాబాద్లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సీఎం వినతులపై అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ‘గాంధీ సరోవర్’శంకుస్థాపనకు రండి హైదరాబాద్లోని ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి ఆ హ్వనించారు. 1948లో జాతిపిత మహత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూఘాట్ వద్ద ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. ఫిబ్రవరి నెలాఖరులో భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. మామునూరు విమానాశ్రయ పనులు ప్రారంభించండి రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్కు సమీపంలో నిర్మించనున్న మామునూరు ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును సీఎం కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్కు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని, విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా మామునూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను పంపిస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 18 ఎల్ఎంటీల అదనపు ధాన్యం తీసుకోండి వానాకాలం పంటకు (2025–26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకునేలా ఆదేశించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో సీఎం కలిశారు. వానాకాలం పంటకు సంబంధించి 53.73 ఎల్ఎంటీల ధాన్యం సేకరణకు అనుమతించారని, కానీ వరి భారీగా పండటంతో తాము అదనంగా 18 ఎల్ఎంటీలు సేకరించామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అలాగే 2024–25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుమతించాలి. 2024–25 వానాకాలం పంటకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్కు ఈ నెల 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారు. అయితే దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలి.2014–15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు ఎఫ్సీఐ బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి పడిన రూ.343.27 కోట్లు కూడా విడుదల చేయాలి..’అని కేంద్ర మంత్రికి సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. రాహుల్, కేసీ వేణుగోపాల్తోనూ భేటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరును వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ తదితర పథకాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని వివరించారు. కాగా క్షేత్ర స్థాయి ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంపై సీఎంను రాహుల్, కేసీ వేణుగోపాల్ అభినందించారు. హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్పై సీఎం సూచనలు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్సల్టెంట్ సంస్థకు పలు సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతను ‘రైట్స్’(ఖఐఖీఉ ) సంస్థకు రైల్వే శాఖ అప్పగించింది. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలైన్మెంట్లు, డీపీఆర్కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, కార్యదర్శి (కో ఆర్డినేషన్) డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ‘రైట్స్’ఈడీ లలిత్కుమార్ పాల్గొన్నారు. -
వైకల్య పింఛను రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: ఓ జవానుకు అందజేయాల్సిన వైకల్య పింఛనును ప్రభుత్వం నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వైకల్య (డిజెబిలిటీ పెన్షన్) పింఛను ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది కాదని స్పష్టం చేసింది. అది రాజ్యాంగబద్ధమైన హక్కని ప్రకటించింది. పింఛను అందజేయడంలో వివక్ష చూపడం లేదా తగ్గించడం వంటి చర్యలు సరికాదని తలంటింది. ఓ మాజీ సైనికోద్యోగికి వైకల్య పింఛను అందించాల్సిందేనంటూ సాయుధ బలగాల ట్రిబ్యునల్ ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం గురువారం కొట్టివేసింది. వైకల్య పింఛను ప్రభుత్వమిచ్చే దానం కాదు, అది దేశ సేవలో చేసిన త్యాగానికి దక్కిన గుర్తింపని తెలిపింది. ‘పింఛను ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా కాదు. గత సేవలకు ప్రతిఫలంగా చెల్లించే వాయిదా వేసిన వేతనం. నిర్ణీత నిబంధనలు పూర్తి చేసిన తర్వాత, అది ఒక స్థిరమైన, చట్టపరంగా అమలు చేయదగిన హక్కుగా మారుతుంది. పింఛను ప్రయోజనాలు ఆస్తి హక్కు వంటివి. చట్టపరమైన అధికారం లేకుండా వీటిని ఆపేయడం, తగ్గించడం, రద్దు చేయడం సాధ్యం కాదు’అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైన యజమానిగా ఉండాలని, దేశం కోసం పనిచేసిన వారికి ప్రయోజనాలు అందించే విషయంలో నిష్పక్షపాతంతో, సమానత్వంతో వ్యవహరించాలని ఉద్బోధించింది. ఒక ప్రయోజనాన్ని విధానం ద్వారా గుర్తించి, న్యాయస్థానం ధ్రువీకరించినప్పుడు, అమలు విషయంలో వివక్ష చూపరాదని పేర్కొంది. న్యాయపరమైన తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాల ద్వారా మాజీ సైనికులకు చెందాల్సిన పింఛనును నిరాకరించడమంటే ఆస్తిని లాక్కోవడమే అవుతుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 300ఏని ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. వైకల్య పింఛను హక్కు చాలా విలువైంది, ఒకసారి అది అర్హమైనదిగా తేలితే, బకాయిలు సహా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. -
నేనే రాజు.. నేనే మంత్రి!
సాక్షి, న్యూఢిల్లీ: ‘జనగణన 2027కు పూర్తి అవుతుంది...2029 కల్లా మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయి. అదే ఏడాది ఏప్రిల్లో జమిలి ఎన్నికలు ఉంటాయి. సీఎంగా నాకు మరో 6 నెలల సమయం అదనంగా లభిస్తుంది. ఇలా ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. మొత్తం పదిన్నరేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. నేనే రాజు.. నేనే మంత్రిని. నేను ఎవరితోనూ పోల్చుకోను. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. నేను నా ఊరు దాట..’ అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటులో ప్రధాన దోషి అప్పటి సీఎం కె.చంద్రశేఖర్రావు అని దానిపై విచారణ జరిపిన కమిషన్ స్పష్టంగా చెప్పినప్పటికీ దీనిపై సీబీఐ విచారణలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జాతీయ నేత అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని అన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడంలేదు? ‘కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 24 గంటల్లో కేసీఆర్ను అరెస్టు చేస్తామని గతంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కుండబద్దలు కొట్టారు. అలాంటిది రెండేళ్లుగా కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడంలేదు? ఆయన కోరారు కాబట్టే కాళేశ్వరంపై విచారణ చేయమని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రతిపాదనను సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అందజేశాం. ప్రధాని కార్యాలయం వరకు విషయం వెళ్లింది. అయినప్పటికీ అతీగతీ లేదు. ఇంతవరకు విచారణ జరపలేదు.. కేసీఆర్ను జైల్లోనూ వేయలేదు. దీనికి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి. కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్గాంధీ, సోనియా గాం«దీలను విచారించారు. ఈ–ఫార్ములా కేసును కూడా ఈడీకి ఇచ్చాం. కానీ మాజీమంత్రి కేటీఆర్ను ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్రావును విదేశాల నుంచి తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి ఆయనను తీసుకొచ్చేందుకు 20 నెలలు పట్టింది. ఆయన చెప్పిన సమాచారం ఆధారంగా మిగతావాళ్లకు నోటీసులు ఇచ్చాం ఇందులో రాజకీయం ఏమీలేదు. నేను ఇందులో జోక్యం చేసుకుంటే ఎవరూ బయట ఉండరు. ‘నైనీ’పై అసెంబ్లీలో ఆధారాలు వెల్లడిస్తా.. నైనీ కోల్ బ్లాక్లో సైట్ విజిట్ అనే నిబంధన కేంద్రమే పెట్టింది. ఒక్క సింగరేణిలోనే ఆ రూల్ ఉందని కిషన్రెడ్డి చెబుతున్నారు. నేను చెప్పింది నిజమైతే కిషన్రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను చెబుతా. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని ఆధారాలను వెల్లడిస్తా. కిషన్రెడ్డి లేఖ రాస్తే విద్యుత్ కొనుగోళ్లు సహా అన్ని కేసులూ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం. రాష్ట్ర పోలీసులపై కిషన్రెడ్డికి విశ్వాసం లేదంటే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కేసును కూడా సీబీఐకి అప్పగిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలా? ‘పాలమూరు, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో ఉన్నవే. వీటిపై ఏపీవాళ్లు పిటిషన్లు వేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టుకోకుండా మాకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. గోదావరిలో వాళ్లకు కావాల్సింది వాళ్లు అడుగుతున్నారు. కృష్ణాలో మాకు కావాల్సింది కూడా ఇవ్వాలి కదా. మా ప్రాజెక్టులు అడ్డుకుంటే ఊరుకుంటామా? వాళ్లకు ఏది నచ్చితే అది తీసుకుంటామంటే ఎలా? గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలు అంటే కుదరదు. వాళ్ల ప్రాజెక్టులకు ఏ రూలు వర్తిస్తుందో అదే రూలు మాకూ వర్తిసుంది. ఇక్కడ ప్రధాన సమస్య కృష్ణా జలాలే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే.. వాళ్లు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు..’ అని రేవంత్ స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ ‘రాష్ట్రంలో కేంద్రం మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్గా మారబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో, ఫ్యూచర్ సిటీకి దగ్గర్లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం భూమిని కూడా పూలింగ్ చేస్తున్నాం. ఎయిర్ట్పోర్ట్ని బుల్లెట్ రైళ్లకు అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం. 2034 లోపు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. మెట్రో ఫేజ్–2కు మార్చి 31 డెడ్లైన్గా పెట్టుకుని పని చేస్తున్నాం. జూన్ 2కు మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నాం..’ అని సీఎం తెలిపారు. ఎఫ్ఎస్ఎల్పై విపక్షాల విష ప్రచారం ‘ఎఫ్ఎస్ఎల్లో కీలక కేసులకు సంబంధించిన రికార్డులు కాలిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలని విష ప్రచారం చేస్తున్నాయి. అసలు విషయం వాళ్లకు తెలియదు. ఒక కేసుకు సబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత.. అవి తిరిగి దర్యాప్తు సంస్థకే అప్పగిస్తారు. 2021లో ‘ఓటుకు నోటు’ కేసు రిపోర్టు కూడా అలాగే తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ రికార్డులు కూడా అందులో ఉన్నాయంటే ఎలా?..’ రేవంత్ అని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్కు భాష, రాష్ట్రాల సరిహద్దులు లేవు. ఆయన ఏ ఒక్కరి సొత్తూ కాదు.. జాతీయ సొత్తు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. అందుకు నేను మద్దతిస్తా. ఇది నా వ్యక్తగత అభిప్రాయం, డిమాండ్. త్వరలో హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా..’ అని రేవంత్ చెప్పారు. -
సినిమా పేరు మార్చండి.. లేదా రిలీజ్ చేయకండి!
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమా టైటిల్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సరి్టఫికేషన్(సీబీఎఫ్సీ)కి, సినిమా నిర్మాత నీరజ్ పాండేకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి నటించిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించారు. అయితే, సినిమా టైటిల్ తమ వర్గం ప్రజలను కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ్ సమాజ్ ఆఫ్ ఇండియా నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అతుల్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఆయన పిల్ వేశారు. సినిమా పేరుతోపాటు కథాంశం బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. కులాన్ని, మతాన్ని సూచించే పండిత్ అనే పదాన్ని, అవినీతిని సూచించే ’ఘూస్ఖోర్(లంచగొండి)’తో కలిపి వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్పై గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘జాగృతం చేయడం, ప్రజలను కించపరుస్తూ అశాంతిని సృష్టించడం అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఇప్పటికే ఉన్న విభేదాలు చాలవన్నట్లు, మీరు కొత్తగా ఇలాంటి వాటితో మరింతగా అలజడులను ఎందుకు సృష్టిస్తున్నారు’అంటూ నిర్మాతపై మండిపడింది. ‘రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్యాన్ని మేం గౌరవిస్తున్నాం. అదే సమయంలో దానికీ హద్దులున్నాయి. మీరు ఎవరినైనా ఎందుకు కించపర్చాలి? ఇటువంటి పేరుపెట్టి ఓ వర్గం వారిని ఎందుకు తక్కువ చేయాలని చూస్తున్నారు?’అని ప్రశ్నించింది. ‘దీనిని భావ ప్రకటన స్వేచ్ఛగా భావించలేం. ఆ హక్కు ఇతరులను కించపరిచేందుకు ఇచి్చన లైసెన్సు కాదు. ఇలాంటివి నైతికతకు, సమాజానికి వ్యతిరేకం. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేయడానికి మేం అనుమతించం. సినీ నిర్మాతలు, జర్నలిస్టులు తదితరులు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నాం’అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా, చిత్రనిర్మాత తరపు న్యాయవాది.. కొత్త టైటిల్ను ఇంకా ఖరారు చేయలేదని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా టైటిల్ను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. సినిమా టైటిల్ వివాదంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా..ఆ పేరును మారుస్తామంటూ నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. కథాంశాన్ని, ఉద్దేశాన్ని ప్రతిబించేలా మరో పేరు పెడతామంది. -
18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి: సీఎం రేవంత్
ఢిల్లీ: వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కలిశారు.వానా కాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్ఎంటీ) అనుమతించారని.. కానీ భారీగా పంట ఉత్పత్తి కావడంతో అదనంగా 18 ఎల్ఎంటీలు తాము సేకరించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్ సీఐ సేకరించాలని కేంద్ర మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుమతించాలని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.2024-25 వానా కాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్కు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారత ఆహార సంస్థకు (ఎఫ్సీఐ) 2014-15 వానా కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం, రాష్ట్ర మంత్రి కోరారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. నాడు సేకరణకు తాము రుణం తీసుకున్నామని.. దానికి వడ్డీ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగిందని తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021, మే నుంచి 2022, మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. -
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్
సాక్షి, ఢిల్లీ: ‘‘తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. పదిన్నరేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ అన్నారు. తానూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని..తనను అన్నవాళ్లనే తాను అంటున్నానన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని.. కేసీఆర్, హరీష్రావు కోరినట్లు ప్రభుత్వం నడవదన్నారు.‘‘మున్సిపల్ ఎన్నికల్లో నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా. జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ విగ్రహం నేనే ఆవిష్కరిస్తా. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. కేసీఆర్ సెల్ఫ్ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెడతా. సైట్ విజిట్ నిబంధన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మా ప్రభుత్వం వచ్చినట్టుకే సింగరేణి అప్పుల్లో ఉంది. మా ప్రభుత్వం ఎవరి ఫోన్లు టాపింగ్ చేయడం లేదు. జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి’’ అని రేవంత్ పేర్కొన్నారు.ప్రభాకర్రావును విచారించేందుకే మాకు 20 నెలలు పట్టింది. ఫోన్ టాపింగ్ కేసు విచారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. సుప్రీంకోర్టు ద్వారా ప్రభాకర్రావును రప్పించాను. త్వరలో చార్జిషీట్ కూడా వేయమని ఆదేశాలు ఇచ్చా. ప్రభాకర్రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరు బాంబులతో పేల్చలేదు. బాంబులతో పేలిస్తే ప్రాజెక్టుపైకి లేస్తుంది. గుంతలోకి కూరుకుపోదు. ఎన్డీఎస్ఎ నివేదిక మేరకు కాళేశ్వరంపై అధ్యయనం జరుగుతుంది’’ అని రేవంత్ వెల్లడించారు. -
పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్రెడ్డి వివరించారు. దీంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని ఖర్గే చెప్పారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్డులోని అధికార నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజాజీ మార్గ్లోని ఖర్గే నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, విజయావకాశాలపై సుమారు 30 నిమిషాల పాటు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాలు పారీ్టకి కలిసివస్తాయని రేవంత్ వివరించారు. 70 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల్లో బీసీ సామాజిక వర్గం, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఖర్గే, రేవంత్ చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు ఖర్గే, రేవంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇటీవల రాజకీయ, పాలనా పరమైన అంశాలు బయటకు రావడంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని రేవంత్కు ఖర్గే హితబోధ చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. ఒకవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. నేడు కేంద్ర మంత్రులతో భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి గురువారం రాష్ట్రానికి సబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. -
భరతమాతనే... అమెరికాకు అమ్మేశారు
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కారును విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒప్పందం పేరిట మన తల్లి భరతమాతనే అమెరికాకు అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు. ‘‘వ్యవసాయం, ఇంధనంతో సహా అన్ని రంగాలనూ అమెరికా చేతికి అప్పగించేశారు. ఆ దేశానికి పూర్తిస్థాయి లొంగిపోయారు. దేశాన్ని ఇలా అడ్డంగా అమ్మేసినందుకు మీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదా?’’అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో రాహుల్ ప్రసంగించారు. అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని మోదీ సర్కారు ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ‘‘పలు విషయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా నేరుగా విపరీతమైన ఒత్తిడి పెట్టింది. పూర్తిగా ఆయన మెడలు వంచి నొక్కిపట్టింది. అందుకే దేశాన్ని మోదీ అమెరికాకు అమ్మేశారు. కేవలం అధికారం కాపాడుకోవడానికి జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారు. లేదంటే ఇలాంటి ఏకపక్ష ఒప్పందానికి ఆయనే కాదు, ఏ భారత ప్రధానీ అంగీకరించబోడు’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యర్థి మెడను దొరకబుచ్చుకున్నాక దాన్ని గట్టిగా నొక్కిపడతారు. దాంతో అతను అల్లాడిపోతాడు. లొంగిపోయానంటూ చేతులెత్తేస్తాడు. మోదీ చేసింది సరిగ్గా అదే’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వాణిజ్య ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తిగా రాజీ పడింది. జౌళి రంగాన్ని నేలమట్టం చేశారు. మన డేటాను, రైతులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, మన శక్తియుక్తులను, చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ అమ్మేశారు. ఇంధన భద్రతను గాలికొదిలేశారు. ఇకపై మనం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించేది అమెరికాయే తప్ప మన ప్రధాని కాదు! పైగా ఆ కొనుగోళ్లను అగ్ర రాజ్యమే నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. వారు చెప్పిన వాళ్ల దగ్గర కొనకపోతే మనపై మళ్లీ 50 శాతం టారిఫ్లు బాదుతారు. మన ఆర్థిక, ఇంధన రంగాలను మనపైకే ఆయుధాలుగా గురి పెట్టేందుకు అమెరికాను కేంద్రం అనుమతించింది’’అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రయోజనాల కోసమే... వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ సర్కారు అమెరికాకు దాసోహమన్న తీరు చాలా విషాదకరమని రాహుల్ అన్నారు. ‘‘మోదీ కేవలం తాను మాత్రమే లొంగిపోలేదు. 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తునే అమెరికాకు అప్పగించేశారు. అధికార బీజేపీ ఆర్థిక ఆయువుపట్లలో ఒకరిపై అమెరికాలో కేసు నడుస్తుండటమే ఇందుకు కారణం. సొంత పార్టీ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే దేశాన్ని అగ్ర రాజ్యానికి మోదీ అమ్మకం పెట్టారు’’అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘డిజిటల్ వాణిజ్య నిబంధనలపై నియంత్రణను కేంద్రం పూర్తిగా అమెరికాకు వదిలేసుకుంది. డేటా లోకలైజేషన్ను తొలగించేసింది. అమెరికా నుంచి డేటా వరదకు గేట్లెత్తేందుకు ఒప్పుకుంది. బడా టెక్ కంపెనీలకు 20 ఏళ్ల ట్యాక్స్ హాలిడేలు ప్రకటించేసింది. మొదట్లో మనపై కేవలం 3 శాతంగా ఉండే అమెరికా టారిఫ్లు ఇప్పుడు 18 శాతానికి పెరిగాయి. అమెరికా వస్తూత్పత్తులపై భారత టారిఫ్లు మాత్రం 16 శాతం నుంచి ఎకాయెకి సున్నాకు పడిపోయాయి. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 146 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి’’అంటూ రాహుల్ మండిపడ్డారు. ‘‘కేంద్రం మన వ్యవసాయ రంగాన్ని అమెరికాకు బార్లా తెరిచేసింది. దాంతో అక్కడి వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మన రైతులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మోదీకి ముందు ఏ ప్రధానీ ఇలాంటి సిగ్గుచేటైన పని చేయలేదు. ఇకముందు మరే ప్రధానీ చేయబోడు’’అన్నారు. అధికార పక్ష సభ్యులు పదేపదే లేచి రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చేతనైతే వాటికి రుజువులు చూపాలని సవాలు చేయగా అందుకు తాను సిద్ధమేనని రాహుల్ బదులిచ్చారు.మేమైతే ఇలా చేసేవాళ్లం ‘‘యుద్ధాల శకం ముగిసిందని మోదీ అంటున్నారు. కానీ నిజానికి మనమున్నదే యుద్ధాల శకంలో! ఇలాంటప్పుడు మన బలాలేమిటో అవగాహన ఉండాలి. ప్రజలే మన నిజమైన బలం’’అని రాహుల్ అన్నారు. ‘‘ఇండియా కూటమే గనుక అధికారంలో ఉంటే వాణిజ్య ఒప్పందం విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరించేది. డేటా మన అతి పెద్ద ఆస్తి. అది అమెరికాకు అందుబాటు ఉండాలంటే భారత్ను అమెరికా సేవకునిలా గాక సమాన భాగస్వామిగా పరిగణించాలని ట్రంప్కు కుండబద్దలు కొట్టేవాళ్లం. ఆ హోదాలోనే చర్చలు జరిపేవాళ్లం. దేశ ఇంధన భద్రతపై, మన రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, వాటిపై చర్చలకు తావు లేదని ఆయన ముఖం మీదే చెప్పేవాళ్లం. పాక్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ అల్పాహార భేటీ వంటి ఉదంతాలపై కచి్చతంగా అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లం’’అని చెప్పుకొచ్చారు.ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ, పురీ అమెరికాతో పాటు పలు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఇల్లు.. మనదేశంలోనే.. ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అతి పెద్ద ఇల్లు ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడో విదేశాల్లో కాదు… మన భారతదేశంలోనే ఉంది. గుజరాత్లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్స్గా గుర్తింపు పొందింది. ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు, మ్యూజియం కూడా కాదు – రాజ గైక్వాడ్ కుటుంబం ఇప్పటికీ ఇక్కడే నివసిస్తోంది.లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉన్న ఈ మహల్ దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం దీని వైభవాన్ని చూపిస్తుంది. 1890లో బరోడా మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III ఈ అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించాడు. ఆ కాలంలో ఇల్లు అనేది కేవలం నివాస స్థలం కాదు, శక్తి, సంపద, సంస్కృతికి ప్రతీక. ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లోనే దాదాపు 2.7 లక్షల పౌండ్లు ఖర్చు చేయబడ్డాయి.ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిషోల్మ్ దీనిని రూపకల్పన చేశారు. భారతీయ, ఇస్లామిక్, యూరోపియన్ శైలుల అద్భుత సమ్మేళనం ఈ నిర్మాణంలో కనిపిస్తుంది. ప్రతి మూలలో రాజ వైభవం ప్రతిబింబిస్తుంది. ప్యాలెస్ లోపలికి వెళ్లినప్పుడు దాని వైశాల్యం మనసును ఆశ్చర్యపరుస్తుంది. విశాలమైన దర్బార్ హాల్ బెల్జియం గాజుతో చేసిన ఫ్లోర్, ఇటలీ నుండి తెచ్చిన వెనీషియన్ మొజాయిక్ డిజైన్లతో అలరారుతుంది. ప్యాలెస్ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్టు, క్రికెట్ మైదానం, అందమైన తోటలు మాత్రమే కాదు, ఈ ప్యాలెస్ లో చిన్న జూ కూడా ఉంది. ఇది ఒక ఇల్లు కాదు, ఒక స్వంత ప్రపంచం లాంటిది. అప్పట్లోనే ఆధునిక సౌకర్యాలు కూడా ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి.1890లలోనే లిఫ్ట్ సౌకర్యం ఉండటం విశేషం.అత్యాధునిక ప్లంబింగ్, విద్యుత్ వ్యవస్థలు కూడా అమర్చబడ్డాయి. అంతేకాదు, మహారాజా సాయాజీరావు గైక్వాడ్ కళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. భారతదేశపు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మను ఆహ్వానించి అనేక అద్భుత తైలవర్ణ చిత్రాలను వేయించారు. నేటికీ ఆ అరుదైన కళాఖండాలు ఈ ప్యాలెస్ కే గర్వకారణంగా నిలుస్తున్నాయి. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. -
‘రైట్ టూ రీకాల్’పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో పనితీరు లేని ఎంపీలు,ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో మాట్లాడారు. రాజ్యసభ జీరో అవర్లో రాఘవ్ చద్దా ఓ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రజలకు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు పనితీరు బాగలేకపోతే వారిని తొలగించుకునే హక్కు కల్పించాలని కోరారు.ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నిక చేసే హక్కు ఇస్తుంది కానీ, ఎన్నికైన ప్రతినిధులను పనితీరు లేకపోవడం లేదా అవినీతి వంటి కారణాలతో పదవీ కాలం పూర్తికాకముందే తొలగించే ప్రత్యక్ష విధానం లేదు అని ఆయన అన్నారు. ‘రైట్ టు రీకాల్’ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను పనితీరు లేకపోతే లేదా అవినీతిలో చిక్కుకుంటే తొలగించే అవకాశం కలుగుతుంది అని పేర్కొన్నారు.ఈ హక్కు ఇప్పటికే ప్రపంచంలోని 24 దేశాల్లో అమలులో ఉందన్నారు. అదే సమయంలో పంచాయతీ స్థాయిలో మనదేశంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఈ ప్రతిపాదనపై సభలో కొంతమంది సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చద్దా మాత్రం ఈ హక్కు సాధారణ రాజకీయ విభేదాల కోసం కాకుండా, నిరూపితమైన అవినీతి, మోసం, లేదా విధులను నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడాలని స్పష్టం చేశారు.ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే, ప్రజలకు వారిని తిరస్కరించే శక్తి ఉండాలి అని ఆయన వాదించారు.మొత్తం మీద, రాఘవ్ చద్దా చేసిన ఈ ‘రైట్ టు రీకాల్’ ప్రతిపాదన భారత రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఇది అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను తీసుకురావచ్చని భావిస్తున్నారు. -
అలాంటి వాడింకా పుట్టలేదు!
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి బుధవారం లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ‘‘భరతమాతను ఎవరూ విక్రయించలేరు. ఆ ఆలోచన కూడా ఎవరూ చేయలేరు. అలా మన దేశాన్ని అమ్మేయగల, కొనగల వాడెవడూ ఇంకా పుట్టలేదు’’అంటూ రాహుల్ వ్యాఖ్యలను సభలోనే తిప్పికొట్టారు. దేశం ఇప్పటిదాకా చూసిన అత్యంత బలమైన ప్రధాని మోదీయేనని మంత్రి పేర్కొన్నారు. నిండు సభలో అబద్ధాలు చెప్పడం, వాటిపై సంబంధిత మంత్రి సమాధానం కూడా వినకుండా ని్రష్కమించడం రాహుల్కు అలవాటేనని మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్ ఏ ప్రపంచంలో విహరిస్తుంటారో తెలియదు! విపక్ష నేతకు ఉండాల్సిన సీరియస్నెస్ ఆయనలో ఇసుమంతైనా లేదు. బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తున్నప్పుడు సభలో ఉండాల్సిందిగా సూచించినా ఆగకుండా వెళ్లిపోయారు. ఒక సభ్యుడు తన ప్రసంగం పూర్తవగానే సభ నుంచి నిష్క్రమించడం నిబంధనలకు విరుద్ధం’’అని దుయ్యబట్టారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రిజిజు మీడియాతో కూడా మాట్లాడారు. విపక్ష నేత ప్రసంగం పూర్తిగా అబద్ధాలమయమంటూ దుయ్యబట్టారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్ను కోరతామని పేర్కొన్నారు. అంతేగాక సభలో చేసిన వ్యాఖ్యలను రాహుల్ ధ్రువీకరించాలంటూ నోటీసిస్తామని కూడా చెప్పారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావిస్తానని రాహుల్ పట్టుబట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘ప్రధాని, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ నడుమ జరిగే సంభాషణలను బహిరంగంగా చర్చించడం నిషిద్ధం. అలా చేస్తే దేశ భద్రత పరిస్థితేమిటి? ఇలాంటి సున్నితమైన అంశంపై రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవర్తించారు. దాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోజూశారు. దీన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. తాను ఎంపీనని, దేశ ప్రజల పట్ల తనకు నిర్దిష్ట బాధ్యతలున్నాయని ఆయన గుర్తుంచుకుంటే మంచిది’’అన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని రిజిజు మండిపడ్డారు. స్పీకర్తో దుర్భాషలు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన చాంబర్లోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని రిజిజు ఆరోపించారు. కె.సి.వేణుగోపాల్, ప్రియాంకాగాంధీ వాద్రా వంటి సీనియర్ నేతలు వాళ్లను వారించకపోగా మరింతగా ప్రోత్సహించారని ఆక్షేపించారు. ‘‘ఆ సమయంలో నేనూ అక్కడే ఉన్నా. బిర్లాపై కాంగ్రెస్ ఎంపీలు ఎలాంటి దారుణమైన పదాలు వాడారో చెప్పలేను! దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సహృదయుడు కాట్టి ఊరుకున్నారు గానీ లేదంటే వారిపై కఠిన చర్య తీసుకునేవారే’’అని చెప్పారు. #WATCH | Delhi: Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "... At least 20-25 Congress MPs entered the Lok Sabha Speaker's chamber and abused him. I was also there. The Speaker is a very soft person, otherwise strict actions would have been taken. Senior Congress… pic.twitter.com/4SQ8eGEZ3X— ANI (@ANI) February 11, 2026 -
పోలవరంపై రాజీపడొద్దు.. ఏపీని అప్పుల కుప్పగా మార్చొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. 2026–27 బడ్జెట్పై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా ఎండగట్టారు. తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరి్థకమంత్రిని అభినందిస్తూ.. 2026–27 మూలధన వ్యయాన్ని రూ.12.21 లక్షలకోట్లకు పెంచడాన్ని స్వాగతించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.5 శాతం పెరుగుదల అని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. పోలవరాన్ని 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉండగా, బడ్జెట్ ప్రసంగంలో దీన్ని 41.15 మీటర్లకే పరిమితం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల వద్ద కేవలం 75 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలమని, దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని చెప్పారు. తద్వారా లక్షలాదిమంది రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55 వేలకోట్లు కాగా, సవరించిన వ్యయం రూ.30,436 కోట్లకు కుదించడం రాష్ట్ర రైతులకు చేసే ద్రోహమేనని మండిపడ్డారు. ఆఫ్ బడ్జెట్ అప్పులతో రాష్ట్రం ఎటు పోతోంది? ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో మొత్తం అప్పులు రూ.3.32 లక్షలకోట్లు ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3.20 లక్షలకోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేలకోట్లు, ఏపీఎస్సీఎల్ ద్వారా వేలకోట్లు అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని చెప్పారు. ఏపీఎండీసీ నిధులను ప్రైవేట్ వ్యక్తులు నేరుగా వాడుకునేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇలాంటి ఆఫ్ బడ్జెట్ అప్పుల వల్ల భవిష్యత్తులో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తుచేశారు. లక్షలకోట్లు అప్పులు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేలకోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోతోందని ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన వైద్యవిద్యను ప్రైవేట్పరం చేయడం వెనుక మర్మమేమిటని నిలదీశారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు, సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక డిమాండ్లు రాష్ట్రానికి సంబంధించి ఆయన పలు డిమాండ్లు చేశారు. అవి.. » విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపేసి, దానికి ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి. » విభజన హామీ అయిన కడప స్టీల్ప్లాంట్ను త్వరితగతిన పూర్తిచేయాలి. » కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులను 100 శాతం కేంద్ర నిధులతో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. » ఉపాధిహామీ పథకం స్థానంలో వచ్చిన వీబీజీ రామ్ పథకంలో రాష్ట్ర వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచడం వల్ల ఏపీ వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి కూడా 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి. » రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎగువ పెన్నార్ అనుమతులు రద్దయ్యాయి. కేంద్రం చొరవ తీసుకుని ఆ అనుమతులను పునరుద్ధరించాలి. -
భారత్లో అవినీతి తగ్గుముఖం!
న్యూఢిల్లీ: భారత్లో అవినీతి కొంత తగ్గుముఖం పట్టినట్లు అంతర్జాతీయ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ అయిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)–2025 నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 182 దేశాల్లో అవినీతి నిర్మూలనపై అధ్యయనం చేయగా, భారత్కు 91వ స్థానం దక్కింది. గత ఏడాది 96వ స్థానంలో నిలిచిన భారత్ ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆసియా పిసిఫిక్ దేశాల్లో అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు క్రమంగా పెరుగుతున్నాయని, వాటి ఫలితాలు సైతం కనిపిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలియజేసింది. ప్రపంచంలో ప్రతిచోటా అవినీతి అనేది అతిపెద్ద జాడ్యంగా మారినట్లు ఆందోళన వ్యక్తంచేసింది. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే తొలుత పాలకులు, రాజకీయ నేతలు చొరవ చూపాలని, వారు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించింది. జవాబుదారీతనం లేని నాయకుల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు జరుగుతున్నాయని వెల్లడించింది. వారంతా వ్యవస్థల్లో సంస్కరణలు కోరుకుంటున్నారని తెలియజేసింది. వ్యవస్థల ప్రక్షాళనతో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ⇒ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 182 దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతిని అధ్యయనం చేసి ర్యాంకులు ఇచి్చంది. సున్నా నుంచి 100 దాకా స్కోర్ కేటాయించింది. సున్నా స్కోర్ అంటే అత్యంత అవినీతి దేశమని అర్థం. 100 దాకా స్కోర్ వస్తే అక్కడ అవినీతి ఆనవాళ్లు పెద్దగా లేనట్లే. ⇒ పలుదేశాల్లో అవినీతిని బహిర్గతం చేస్తున్న జర్నలిస్టులకు హెచ్చరికలు ఎదురవుతున్నాయి. దాడులు జరుగుతున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ⇒ అవినీతిపై పరిశోధన చేసి, ప్రజలకు తెలియజేస్తున్న జర్నలిస్టులకు హత్యకు గురవుతు న్నా, దాడులను ఎదుర్కొంటున్నా పాలకులు సరిగ్గా స్పందించడం లేదని కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ నివేదిక ఆక్షేపించింది. ⇒ 2012 నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 829 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అవినీతిని బయటపెట్టడమే వీరు చేసిన నేరం. ⇒ సీపీఐ స్కోర్ 50 కంటే తక్కువ ఉన్న దేశాలైన బ్రెజిల్, ఇండియా, మెక్సికో, పాకిస్తాన్, ఇరాక్లో ఎక్కువ మంది జర్నలిస్టులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ స్కోర్ 35, ఇండియా స్కోర్ 39, మెక్సికో స్కోర్ 27, పాకిస్తాన్ స్కోర్ 28, ఇరాక్ స్కోర్ 28గా ఉంది. ⇒ 31 దేశాల్లో 2012 నుంచి అవినీతి గణనీయంగా తగ్గిపోయింది. మిగిలిన దేశాలు అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యాయి. కొన్ని దేశాల్లో అవినీతి అదేస్థాయిలో ఉండగా, మరికొన్ని దేశాల్లో కొంత పెరిగింది. ⇒ ప్రపంచ సగటు సీపీఐ స్కోర్ 42గా నమోదైంది. మూడింట రెండొంతుల దేశాల స్కోర్ 50 కంటే తక్కువే ఉన్నట్లు తేలింది. ⇒ అవినీతి వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతోంది. వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. మౌలిక వసతులు అందడం లే దు. యువత ఆశలు సాకారం కావడం లేదు. ⇒ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ రిపోర్టులో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం స్కోర్ 89. అవినీతి నిర్మూలనలో ఫిన్లాండ్, సింగపూర్ కంటే డెన్మార్క్ ముందంజలో ఉంది. చిట్టచివరి స్థానాల్లో దక్షిణ సూడాన్, సోమాలియా, వెనెజులా నిలిచాయి. ⇒ అగ్రదేశం అమెరికాకు 29వ ర్యాంకు, యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు 20వ ర్యాంకు లభించింది. ⇒ ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, యూకే, న్యూజిలాండ్లో అవినీతి నిర్మూలన ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదని నివేదిక పేర్కొంది. అవినీతిని అంతం చేయాలన్న సంకల్పం అక్కడి పాలకుల్లో కనిపించడం లేదని వెల్లడించింది. ⇒ అవినీతి పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో పెచ్చరిల్లుతున్న అవినీతి సమాజానికి ముప్పుగా పరిణమిస్తోంది. పాలకులు అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ జర్నలిస్టులను, ఎన్జీఓలను కట్టడి చేయాలని చూస్తున్నారు. పాలకుల్లో పారదర్శకత గానీ, జవాబుదారీతనం గానీ లోపిస్తున్నాయి. అంతిమంగా ఇది అవినీతికి బాటలు వేస్తున్నట్లు కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ నివేదిక తేలి్చచెప్పింది. -
ఆ రెండు పుస్తకాలు ఒక్కటి కావు
న్యూఢిల్లీ: చైనా బలగాలతో భారత సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పుస్తకం చర్చనీయాంశం కావడంతో దాని ప్రచురణసంస్థ ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా’మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆ పుస్తకాన్ని ఇప్పటిదాకా ముద్రించలేదని, ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార కాపీ అని పెంగ్విన్ ర్యాండమ్ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ప్రీ–ఆర్డర్ అని పేర్కొన్నంత మాత్రాన అది ఇప్పటికే ముద్రితమై అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదు. త్వరలో ప్రచురితంకావొచ్చు అని అర్థం. అంతేగానీ పుస్తకం ముద్రించామని మేం ఎక్కడా పేర్కొనలేదు’’అంటూ పుస్తకాలకు సంబంధించి తాము అనుసరించే 4 విధానాలను పెంగ్విన్ ర్యాండమ్ వివరించింది. అవి.. 1. కొత్త పుస్తకాన్ని ప్రకటించం: అంటే కొత్త రచన, నూతన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం జరిగిందని అర్థం. అంతేగానీ ఈ పుస్తకం ఇప్పటికే ముద్రితమైందని కాదు. అది ఇంకా ఆన్లైన్లోకి అందుబాటులోకికూడా రాదు. 2. ప్రీ–ఆర్డర్: ఇది ప్రచురణకు సంబంధించిన ప్రామాణిక అనుసరణీయ విధానం. నచి్చతే పాఠకులు లేదా రిటైల్ సంస్థలు త్వరలో ప్రచురితంకాబోయే ఈ పుస్తకం కోసం ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ దశలోనూ పుస్తకం ముద్రితంకాదు. అందుబాటులో ఉండదు. 3. రాబోయే తేదీ ఖరారు: ఫలానా తేదీన పుస్తకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం జరిగిదంతే. అంతమాత్రాన ఆరోజుకల్లా పుస్తకం ముద్రితమైపోతుందని అర్థంకాదు. 4.ముద్రిత పుస్తకం: విక్రయాల కోసం రిటైల్ దుకాణాల్లోకి వచ్చాకే ఆ పుస్తకం అధికారికంగా ముద్రితమైందని భావించాలి. పుస్తకాన్ని ఏరకంగానూ విడుదల చేయలేదు: పెంగ్విన్‘‘నరవణె రాసిన ఈ పుస్తకాన్ని ప్రింట్ లేదా డిజిటల్ లేదా పీడీఎఫ్ ఇలా ఏ ఫార్మాట్లోనూ అందుబాటులోకి తేలేదు. ఒక్క పుస్తకాన్ని కూడా ముద్రించలేదు. ఎవరికీ విక్రయించలేదు. ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార వెర్షన్ మాత్రమే. దానితో మాకు సంబంధం లేదు. పుస్తకం ప్రచురణ హక్కులు మాకే ఉన్నాయి. పుస్తకాన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు. బహిర్గతంచేయలేదు. ప్రస్తుతం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపాల్లో షేర్ అవుతుంటేగనక అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కులను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ అంశంలో మేం చట్టపర చర్యలు తీసుకుంటున్నాం’’అని సంస్థ స్పష్టం చేసింది. మౌనం వీడిన నరవణె పుస్తకం వివాదం కావడంతో ఎట్టకేలకు నరవణె మౌనం వీడారు. ఈ పుస్తకం ఇంకా ప్రచురితంకాలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం పెంగ్విన్ ఇండియా సంస్థ వెల్లడించిన ఒక ప్రకటనను నరవణే మంగళవారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. ‘‘పుస్తకం తాజా స్థితి ఇదే’’అని దానికి ఒక క్యాప్షన్ పెట్టారు. పుస్తకమొచ్చిందని రెండేళ్ల క్రితమే చెప్పారు: రాహుల్పుస్తకం ప్రచురితంకాలేదన్న పెంగ్విన్ వాదనల్లో నిజంలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. గతంలో నరవణే చేసిన ట్వీట్ను రాహుల్ అందరిఎదుట బయటకు చదివి వినిపించారు. ‘‘హలో ఫ్రెండ్స్. నేను రాసిన పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడున్న లింక్ను క్లిక్చేసి చదవండి. ఆనందంగా పఠనం పూర్తిచేయండి. జైహింద్ అని నరవణె రాసుకొచ్చారు. ఇది డిసెంబర్ 2023లో నరవణె ఆయన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. పుస్తకం అసలు ప్రచురితంకాలేదని పెంగ్విన్ చెబుతోంది. కానీ ఇప్పటికే ఈ పుస్తకం అమెజాన్లో ఉన్నట్లు తెలుస్తోంది’’అని రాహుల్ అన్నారు. -
ఏఐ, డీప్ఫేక్ కంటెంట్పై కేంద్రం ఆంక్షల కొరడా
న్యూఢిల్లీ: యూట్యూబ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో తామరతుంపరలా పుట్టుకొస్తూ విస్తృతంగా షేర్ అవుతున్న ఏఐ కంటెంట్, డీప్ఫేక్ అంశాల ఉరవడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల కొరడా ఝుళిపించింది. కృత్రిమమేథ(ఏఐ) సృష్టించిన సమాచారం(కంటెంట్)తోపాటు అసలును భ్రమింపజేసేలా ఉండే డీప్ఫేక్ కంటెంట్ విస్తృతిని అరికట్టేందుకు మోదీ సర్కార్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఇంటర్మీడియేటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్,2021లో సవరణలు చేస్తూ కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదలచేసింది.దీని ప్రకారం ఇకపై ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు ఫలానా అభ్యంతర, అసభ్య, తప్పుడు ఏఐ/డీప్ఫేక్ కంటెంట్ను ఆన్లైన్ నుంచి తొలగించాలని ఆదేశిస్తే సోషల్మీడియా వేదికలు కేవలం మూడు గంటల్లోపే వాటిని తొలగించాలి. గతంలో 36 గంటల గడువు ఉండేది. ఇతర కంటెంట్లకు సంబంధించి గడువులను కొన్నింటికి 15 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించగా మరికొన్నింటికి 24 గంటల నుంచి 12 గంటలకు గడువు తగ్గించారు. పూర్తి/పాక్షిక నగ్నత్వం లేదా శృంగార సంబంధ, ప్రైవేట్భాగాలను చూపించే కంటెంట్ను కేవలం 2 గంటల్లోపే తొలగించాలి ప్రభుత్వం నిబంధనను తీసుకొచ్చింది. ఏఐ టూల్స్ సాయంతో సృష్టించిన ఎలాంటి కంటెంట్కైనా దానిపై ‘ఏఐ జనరేడెడ్’అనే లేబుల్ను ముద్రించాలి. ఆ సమాచారాన్ని తాము సృష్టించారో లేదా ఏఐ సాయంతో మార్పులు చేశారో స్పష్టంగా పేర్కొనాలి. వెరిఫికేషన్ మెకానిజం తేవాలి.. హానికర, చట్టవ్యతిరేక కంటెంట్ను మూడుగంటల్లోపే ఆన్లైన్ సోషల్మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలి. ఏదైనా కంటెంట్ను ఎవరైనా అప్లోడ్ చేస్తే అది వాళ్లు తయారుచేసిందా? లేదా మరొకరి నుంచి కాపీ కొట్టారా? అనేది రూఢీచేసుకునేందుకు వీలుకలి్పంచే టూల్స్, వెరిఫికేషన్ మెకానిజంను సోషల్మీడియా ప్లాట్ఫామ్లు అందుబాటులోకి తేవాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు డీప్ఫేక్కు చెక్పెట్టేందుకే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. వీటిని ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి తెస్తారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’అదే తేదీన ముగుస్తుండటం విశేషం.ఏఐ కంటెంట్ లేదా ఏఐతో మార్పులుచేసిన ఆడియో, వీడియో, ఆడియో–వీడియో కంటెంట్ను సింథటికల్లీ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్(ఎస్జీఐ)గా పరిగణిస్తారు. ఈ కంటెంట్ను ఆన్లైన్లో చూసిన యూజర్లు ఇది నిజమైనదా? కల్పనా? అనేది తెల్సుకునేందుకు ఆ కంటెంట్పై ఖచి్చతంగా ఏఐ లేబుల్ను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇంటర్మీడియేటరీ సంస్థలు ఈ లేబుల్ను తొలగించడానికి వీల్లేకుండా మెటాడేటా/టెక్నికల్ ప్రూవెన్స్ మార్కర్లను శాశ్వతంగా ముద్రించాలని పేర్కొంది. అప్పుడే అది ఎక్కడి నుంచి తొలుత షేర్ అయిందనేది తెలుస్తుంది. దాంతో అలాంటి ఏఐలో చట్టవ్యతిరేక సమాచారముంటే తొలిసారి షేర్చేసిన వ్యక్తి/సంస్థను గుర్తించడం అత్యంత సులభమవుతుంది. యూజర్ డిక్లరేషన్ ఉండాల్సిందేతొలిసారిగా అప్లోడ్ చేసిన వ్యక్తి/సంస్థ/యూజర్ సంబంధిత కంటెంట్పై డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. సింథటిక్గా సృష్టించిందా లేదా ఏఐతో మార్పులు చేసిందా? అనేది పేర్కొనాలి. అయితే ఈ డిక్లరేషన్లు నిజమైనవా కావా ? అని సరిచూసుకునే టెక్నికల్/ఆటోమేటెడ్ టూల్స్ను సామాజికమాధ్యమ వేదికలు అందుబాటులోకి తేవాలి. లేబులింగ్ లేదా వెరిఫికేషన్ జరగని పక్షంలో సంబంధిత డేటాపై సామాజికమాధ్యమ వేదికలదే బాధ్యత అవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. చట్టవ్యతిరేకమైనదంతా నేరమేచట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సృష్టించబడే ఏఐ కంటెంట్ను ఇకపై నేరమయ కంటెంట్గా పరిగణిస్తారు. చిన్నారులపై లైంగికవేధింపుల మెటీరియల్, అసభ్య కంటెంట్, గొప్ప వ్యక్తిని కించపరుస్తూ ఆయన ప్రతిరూపాలు తయారుచేయడం, తప్పుడు ఎల్రక్టానిక్ రికార్డ్లు సృష్టించడం, ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి అక్రమ వస్తువులను ప్రోత్సహించే ఎలాంటి కంటెంట్ను అయినా నేరమయ కంటెంట్గా లెక్కించి కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే కృత్రిమ కంటెంట్ను ఎప్పటికప్పుడు ఆటోమేటెడ్ టూల్స్తో తొలగించే బాధ్యతాయుత సంస్థలకు ఐటీ చట్టంలోని 79 సెక్షన్ ప్రకారం రక్షణ లభిస్తుందని కేంద్రం భరోసా ఇచి్చంది. కంప్యూటర్ ఆధారిత, చాట్జీపీటీ, గ్రోక్, జెమినిలతో కృత్రిమ, అల్గారిథంతో సృష్టించిన, ఎడిట్ చేసిన, మార్పులుచేసిన, అవాస్తవ ఫొటో లు, ఆడియో, విజువల్, ఆడియో–విజువల్ కంటెంట్ మొత్తాన్నీ ఏఐగా పరిగణస్తారు. -
స్పీకర్ను తొలగించాలి
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసిచ్చింది. రాజ్యాంగంలోని 94–సి ఆర్టీకల్ కింద లోక్సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు దాన్ని అందజేసింది. ‘‘సభా వ్యవహారాల నిర్వహణలో ఓం బిర్లా పూర్తిగా ఏకపక్షంగా, విపక్షాల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు’’అని ఆరోపించింది. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్, ఆ పార్టీ చీఫ్ విప్ కె.సురేశ్, విప్ మొహ్మద్ జావెద్ విపక్షాల తరఫున మంగళవారం మధ్యాహ్నం సెక్రెటరీ జనరల్కు నోటీసు అందజేశారు. ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ పదవి నుంచి తొలగించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ‘‘సభలో పలుమార్లు విపక్ష సభ్యులను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై విపక్ష నేత రాహుల్గాంధీ ప్రసంగాన్ని పూర్తి కూడా చేయనివ్వలేదు. స్పీకర్ వివక్షాపూరిత ధోరణికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. విపక్ష నేతను సభలో అసలు మాట్లాడనివ్వనే లేదు. ఫిబ్రవరి 4న ఒక బీజేపీ ఎంపీ మాజీ ప్రధానులపై అత్యంత అభ్యంతరకరంగా మాటల దాడి చేసేందుకు స్పీకర్ అనుమతించారు. పైగా అలా చేసినందుకు ఆయనను కనీసం ఒక్కసారైనా మందలించలేదు.ఇలాంటి ప్రవర్తనను అలవాటుగా మార్చుకున్న సదరు సభ్యునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మేం పదేపదే విజ్ఞప్తి చేసినా స్పీకర్ పట్టించుకోలేదు’’అని నోటీసులో ఎంపీలు ఆరోపించారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు వెళ్లి ‘అనూహ్య చర్య’కు దిగాలని భావించినట్టు కచ్చితమైన సమాచారం తన వద్ద ఉందని స్పీకర్ చేసిన ప్రకటనను కూడా వారు ప్రస్తావించారు. ‘‘స్పీకర్ చేసిన ఈ ఆరోపణలు పూర్తి నిరాధారం. అంతేగాక కాంగ్రెస్ ఎంపీల పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయి. పార్లమెంటరీ పద్ధతులను, నియమ నిబంధనలను పరిరక్షించాల్సిన స్పీకరే ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేసేందుకు నిండు సభను వాడుకోవడం దారుణం. ఇది రాజ్యాంగబద్ధ పదవిని పూర్తిగా దుర్వినియోగం చేయడమే. ప్రజా సమస్యలపై గళమెత్తకుండా విపక్ష సభ్యులను స్పీకర్ పలుమార్లు అడ్డుకున్నారు’’అంటూ నోటీసులో పేర్కొన్నారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను ఏకపక్ష సస్పెండ్ చేయడం తదితరాలను కూడా అవిశ్వాస తీర్మానానికి కారణాలుగా వారు పేర్కొన్నారు. ఈ తీర్మానం మార్చి 9న సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్టు లోక్సభ వర్గాలు పేర్కొన్నాయి. రెండోసారి నోటీసు! స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు యోచిస్తున్నట్టు సోమవారం ఉదయమే వార్తలు రావడం తెలిసిందే. దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని అనంతరం విపక్ష నేతలు తెలిపారు. మంగళవారం ఉదయమే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్పీకర్పై నోటీసివ్వాలని ఈ సందర్భంగా వారంతా నిర్ణయించారు. అనంతరం చివరి ప్రయత్నంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుతో విపక్ష నేతలు భేటీ అయి తమ డిమాండ్లపై మరోసారి చర్చించారు. ఆయన నుంచి సానుకూల స్పందన లేదంటూ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత లోక్సభ సెక్రెటరీ జనరల్కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు. అయితే తేదీని తప్పుగా పేర్కొనడంతో సాయంత్రం దాన్ని వెనక్కు తీసుకుని మరో నోటీసు సమర్పించారు. సంతకం చేయని రాహుల్! అవిశ్వాస తీర్మానం నోటీసుపై పలు పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు విపక్షాలు తెలిపాయి. వారిలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు, ఆర్జేడీ సభ్యులున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు సంతకాలు చేయకపోయినా అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీలు మద్దతు తెలిపాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నోటీసుపై సంతకం చేయకపోవడం గమనార్హం. విపక్ష నేత రాహుల్గాంధీ కూడా సంతకం చేయలేదని సమాచారం!తీర్మానంపై తేలేదాకా విధులకు దూరంస్పీకర్ ఓం బిర్లా నిర్ణయం కాంగ్రెస్ తదితర విపక్షాలు తనపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం అంశం పరిష్కారమయ్యేదాకా విధులకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ బిర్లా సన్నిహిత వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. నైతిక ప్రమాణాలకు కట్టుబడుతూ ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు వివరించాయి. స్పీకర్పై గానీ, డిప్యూటీ స్పీకర్పై గానీ అవిశ్వాస తీర్మానం సభ పరిశీలనలో ఉండగా కార్యకలాపాలకు వారు అధ్యక్షత వహించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 96 కూడా నిర్దేశిస్తోంది. విపక్షాలు అందజేసిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్ను స్పీకర్ ఆదేశించారు. దానిపై నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇప్పుడేం జరుగుతుంది?స్పీకర్ ఓం బిర్లాను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ విపక్షాలు నోటీసివ్వడం ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ, విపక్షాల మధ్య పార్లమెంటులో పది రోజులుగా సాగుతున్న రగడ కాస్తా ఈ ఉదంతంతో కొత్త మలుపు తిరిగింది. దాంతో ఇకపై ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది. స్పీకర్ తొలగింపు ప్రక్రియను ఆర్టీకల్ 94సి లో స్పష్టంగా పొందుపరిచారు. దానిప్రకారం అవిశ్వాస తీర్మానం సాధారణ మెజారిటీతో నెగ్గితే స్పీకర్ ఉద్వాసనకు గురవుతారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసివ్వడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది.దానిపై కనీసం ఇద్దరు ఎంపీల సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో స్పీకర్పై నిర్దిష్టమైన అభియోగాలను పేర్కొనడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే స్పీకర్కు అవిశ్వాస తీర్మానంపై స్పందించేందుకు అవకాశం ఉంటుందని లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ పి.డి.టి.ఆచారి తెలిపారు. ‘‘తర్వాత తీర్మానంలోని భాష ప్రమాణాల మేరకు ఉన్నదీ లేనిదీ డిప్యూటీ స్పీకర్ పరిశీలిస్తారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఎవరూ లేరు గనుక చైర్పర్సన్ల ప్యానల్లోని సీనియర్ మోస్ట్ సభ్యుడు ఆ బాధ్యత చేపట్టే అవకాశముంది. నోటీసిచ్చిన 14 రోజుల అనంతరం తీర్మానం సభ పరిశీలనకు వస్తుంది. సభాపతి దాన్ని సభ పరిశీలనకు ఉంచుతారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా కోరతారు.కనీసం 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానాన్ని పరిశీలిచేందుకు సభ అనుమతి లభించినట్టు ప్రకటిస్తారు. అనంతరం తీర్మానంపై చర్చ చేపడతారు. 10 రోజుల్లో దానిపై సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తీర్మానంలో తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు ఆర్టీకల్ 96 స్పీకర్కు అవకాశం కలి్పస్తోంది’’అని ఆయన వివరించారు. స్పీకర్పై ఇప్పటికే దాకా మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, రెండుసార్లు ఓటింగ్ దాకా వచ్చినా అవి వీగిపోయాయి.స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు అనుసరించే పద్ధతి భిన్నంగా ఉండటమే అందుకు కారణమని ఆచారి తెలిపారు. ‘‘మెజారిటీ లెక్కింపు విషయంలో ఓటింగ్కు హాజరైన ఎంపీలను మాత్రమే కాకుండా, ఖాళీలను మినహాయించి లోక్సభ సభ్యులుగా ఉన్న వారందరి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాలక పక్షానిదే అవుతుంది. కనుక తీర్మానం వీగిపోతుందే తప్ప గట్టెక్కదు’’అని వివరించారు. గతంలో స్పీకర్లు జీవీ మౌలాంకర్ (1954), హుకుంసింగ్ (1966), బలరాం జాఖడ్ (1987)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలిచ్చినా అవి వీగిపోయాయి. -
బంగారమే బిగ్ బాస్
న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్కు మించి బంగారం ఈటీఎఫ్లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్లో ఈక్విటీ ఫండ్స్ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్/ పన్ను ఆదా ఫండ్స్) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్.. గోల్డ్ ఈటీఎఫ్లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్ల్లోకి డిసెంబర్లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. -
నరవణే పుస్తక వివాదం.. పెంగ్విన్ కీలక ప్రకటన
ఢిల్లీ: నరవణే పుస్తకం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బుక్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘తన బుక్ అందుబాటులోకి వచ్చిందని నరవణె చెప్పారు. బుక్ విడుదలపై నరవణే అయినా అబద్ధం చెప్పాలి.. లేకపోతే పెంగ్విన్ అయినా అబద్ధం చెప్పాలి. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతున్నారని అనుకోను’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.కాగా, ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై లోక్సభలో కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్గాంధీ ప్రయత్నించడం.. అందుకు మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు.పెంగ్విన్ ఏం చెప్పిందంటే?ఇదిలాఉండగా.. నరవణే పుస్తక వివాదంపై పెంగ్విన్ సంస్థ వివరణ ఇచ్చింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన జ్ఞాపకాల సంకలనం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'పై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పుస్తక ప్రచురణకు సంబంధించి తమకే ప్రత్యేక హక్కులు ఉన్నాయని, ఇది ఇప్పటివరకు ఏ రూపంలోనూ అధికారికంగా విడుదల కాలేదని స్పష్టం చేసింది.ముద్రణ రూపంలో గానీ, డిజిటల్ రూపంలో గానీ ఈ పుస్తకాన్ని తాము ఇప్పటివరకు పంపిణీ చేయలేదని.. డిజిటల్ కాపీలు చట్టవిరుద్ధమని, అవి కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని సంస్థ హెచ్చరించింది. ఇలాంటి అనధికారిక పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీ పోలీసుల విచారణమరోవైపు, అధికారికంగా విడుదల కాకముందే ఈ పుస్తకంలోని అంశాలు బయటకు ఎలా వచ్చాయనే దానిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. స్పెషల్ సెల్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. -
భాగవత్ విందులో అద్నాన్ సమీ.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..
ముంబై: గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం ముంబైలో సల్మాన్ ఖాన్, వికీ కౌశల్, రవీనా టాండన్, శిల్పా షెట్టి తదితరులకు భాగవత్ విందు ఇచ్చారు. ఆయనతో కలిసి భోజనం చేస్తున్న ఫొటోను అద్నాన్ సమీ పోస్ట్ చేశారు.‘‘భాగవత్ జీ అద్భుతమైన వ్యక్తి. నా అపోహలు, అపార్థాలను చక్కగా నివృత్తి చేశారు’’ అంటూ పొగడ్తలు కురిపించారు. దీనిపై కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లు తీవ్రంగా స్పందించాయి. ‘అద్నాన్ సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్తాన్ ఎయిర్ పోర్స్ పైలట్. 1965 యుద్ధంలో ఆయన మన పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఆర్ఎస్ఎస్ జాతి వ్యతిరేకి’ అని కాంగ్రెస్ ఎక్స్లో మండిపడింది. ఆర్థిక నేరారోపణలతో లుకౌట్ నోటీసు జారీ అయిన నటునికి విందు ఇచ్చిన భాగవత్ ఏం సందేశం ఇస్తున్నారని శివసేన (యూబీటీ) ప్రశ్నించింది. -
సర్కు ఆటంకం కలిగిస్తే ఊరుకోం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్(ఈసీ), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సర్ ప్రక్రియకు అవరోధాలు కలిగించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అదే సమయంలో, ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ గడువును మరో వారంపాటు పొడిగించింది. ఈ నెల 4వ తేదీన జరిగిన విచారణకు సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరై వాదనలు వినిపించడం తెల్సిందే. ‘వాట్సాప్ ద్వారా కాకుండా ఈసీ అధికారికంగా ఆదేశాలు జారీ చేయాలి. వాటిని ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మైక్రో అబ్జర్వర్లను తొలగించాలి’అని కోరారు. వీటిపై సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం వీటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘సర్ విషయంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాం. ఈ విషయంలో ఎటువంటి అడ్డంకులను కలిగించం. ఇందులో మావైఖరి సుస్పష్టం’అని సీజేఐ తెలిపారు. సర్ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవగాహన లేని అధికారులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారు(ఈఆర్వో)లను నియమించిందంటూ ఈసీ తరఫున సీనియర్ లాయర్ డీఎస్ నాయుడు అభ్యంతరం తెలపగా మైక్రో అబ్జర్వర్లు ఏకపక్షంగా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీకల్లా పూర్తి చేసి, తుది జాబితా ప్రకటించాల్సి ఉందంటూ ఆయన..స్వల్ప కారణాలు చూపి 1.68 లక్షల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, సంబంధిత దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయడానికి, తుది జాబితాకు గడువును మరో ఒక వారం పాటు గడువు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెరిఫికేషన్ అనంతరం విడుదల చేసే ఫలితాలను తాము తప్పనిసరిగా పరిశీలిస్తామని, అవసరమైన పక్షంలో జోక్యం చేసుకుంటామని సీజేఐ ప్రకటించారు. ఓటర్ల తుది జాబితాపై అంతిమ నిర్ణయం ఎన్నికల అధికారులకే ఉండాలని స్పష్టం చేసింది. బెంగాల్ ప్రభుత్వం అందజేస్తామంటున్న 8,505 మంది అధికారులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించాలో ఈసీయే నిర్ణయిస్తుందని కూడా తెలిపింది. ఓటర్లకు ఈసీ విడుదల చేసిన నోటీసులను కొందరు తగులబెట్టారని లాయర్ డీఎస్ నాయుడు తెలపగా, ధర్మాసనం సీరియస్గా తీసుకుంది. ఇటువంటి ఘటనలపై అఫిడవిట్ సమరి్పంచాల్సిందిగా బెంగాల్ డీజీపీని ఆదేశించింది. -
లోక్సభలో అవే దృశ్యాలు.. మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్షాల మధ్య పలు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండటంతో సోమవారం కూడా సభ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే వాయిదా పడింది. తొలుత ఉదయం రెండుసార్లు, అనంతరం మధ్యాహ్నం రెండింటి తర్వాత మంగళవారానికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. వారం రోజులుగా సభ నిత్యం అంతరాయాలనే ఎదుర్కొంటూ వస్తుండటం తెలిసిందే. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్గాంధీ ప్రయత్నించడం, అందుకు మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు. పదేపదే అవాంతరాలు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టింది. ఆ వెంటనే విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలకు దిగారు. తాము లేవనెత్తిన పలు అంశాలపై తక్షణ చర్చకు పట్టుబట్టారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా వాటిని లేవనెత్తవచ్చని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. రాహుల్తో సహా సభ్యులంతా తమ అంశాలను లేవనెత్తవచ్చన్నారు. అయినా సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. కేవలం కార్యకలాపాలను స్తంభింపజేయడమే లక్ష్యంగా వారు వ్యూహం రూపొందించుకుని సభకు వచ్చారంటూ మండిపడ్డారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే, ముందుగా రాహుల్ను మాట్లాడనివ్వాల్సిందేనని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. నిబంధనల మేరకు బడ్జెట్పై చర్చ ప్రారంభం కావాల్సి ఉందని సభాపతి స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రధాన వక్తగా శశి థరూర్ పేరు ఇచి్చనందున ఆయన మాట్లాడాలని సూచించారు. విపక్షాల నినాదాలు ఆగకపోవడంత సభ మధ్యాహ్నం రెండిటితో వాయిదా పడిడంది. తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ బడ్జెట్పై చర్చను ప్రారంభించాల్సిందిగా థరూర్కు సూచించారు. తన ప్రసంగానికి ముందు విపక్ష నేత రాహుల్ కొన్ని అంశాలను లేవనెత్తదలచారని థరూర్ పేర్కొన్నారు. రాహుల్ బడ్జెట్పై ప్రసంగిస్తే అభ్యంతరం లేదని రాయ్ బదులిచ్చారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, బడ్జెట్పై చర్చకు ముందు పలు అంశాలపై మాట్లాడేందుకు తనకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. అందుకు తనకు అవకాశమిస్తానని విపక్ష సభ్యులతో సమావేశం సందర్భంగా స్పీకర్ అంగీకరించినట్టు వెల్లడించారు. కానీ అలాంటిదేమీ లేకుండా నేరుగా బడ్జెట్పై చర్చను మొదలు పెడుతున్నారంటూ ఆక్షేపించారు. తనకు అలాంటి సమాచారమేదీ లేనందున ఇతర అంశాలు లేవనెత్తేందుకు అనుమతించలేనని రాయ్ పేర్కొన్నారు. స్పీకర్ అలాంటి అంగీకారానికి రాలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు స్పష్టం చేశారు. ఒప్పందంపైనే రాహుల్ మాట్లాడాలనుకుంటే దానిపై స్పందించేందుకు స్పీకర్ సభలో అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. అధికార, విపక్షాల్లో ఎవరూ పట్టు వీడకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు రాయ్ ప్రకటించారు. ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం ఫిబ్రవరి 5న ఆమోదం పొందడం తెలిసిందే! ఇలా జరగడం 22 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సందర్భంగా ఆయన స్థానం వద్దకు వెళ్లి అనూహ్య చర్యకు పాల్పడాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్టు కచి్చతమైన సమాచారం అందిందని స్పీకర్ పేర్కొన్నారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని తానే సూచించినట్టు తెలిపారు. దీన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా తోసిపుచ్చారు. అది పచ్చి అబద్ధమన్నారు. -
ఢిల్లీని ఖలిస్థాన్ చేస్తాం.. స్కూళ్లలో బాంబులు పెట్టాం
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఈరోజు( సోమవారం) ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోహిణి ప్రాంతంలోని వెంకటేశ్వర గ్లోబల్ స్కూల్, శ్రీనివాస పురిలోని లోరిటో కాన్వెంట్ స్కూల్, సిద్దిఖీ నగర్ లోని ఇండియన్ పాఠశాలతో మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి.అయితే ఈ మధ్య కాలంలో పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇలా బెదిరింపు మెయిల్స్ చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను గుర్తించిన అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. -
2 గంటలకో స్కామ్ మెసేజ్
ఆన్లైన్ వినియోగం విపరీతంగా పెరుగుతుండడంతో డిజిటల్ మోసాలు ఆందోళనకర స్థాయిలో అధికమవుతున్నాయి. నమ్మదగిన సందేశాలు, డీప్ఫేక్ వాయిస్, క్యూఆర్ కోడ్స్తో సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. తమను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్న విషయం అత్యధికులు గ్రహించడం లేదు. నష్టం జరిగాకే తాము మోసపోయినట్టు గుర్తిస్తున్నారు. కొత్త నంబర్లు, మెసేజ్ల ద్వారా మొబైల్కు వచ్చే లింక్స్ను తెరవకూడదని ఆర్బీఐ, బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు హెచ్చరిస్తున్నా, నేరాల సంఖ్య తగ్గడం లేదు.రోజుకు సగటున 13 మెసేజ్లు..: సందేశం, ఈ–మెయిల్ రూపంలో, సోషల్ మీడియా యాప్స్లో సగటున రోజుకు 13 మోసపూరిత (స్కామ్) మెసేజ్లను భారతీయులు అందుకుంటున్నారు. అంటే రెండు గంటలకో స్కామ్ సందేశం వస్తోందన్న మాట. ఆన్లైన్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవడానికి సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 102 గంటలు సమయం వెచ్చిస్తున్నారని ఆన్లైన్ ప్రొటెక్షన్ సేవలు అందిస్తున్న అంతర్జాతీయ దిగ్గజం మ్యాకఫీ ‘2026 స్టేట్ ఆఫ్ ద స్కామివర్స్’నివేదిక వెల్లడించింది. స్కామర్స్ కేవలం 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే స్కామ్ పూర్తి చేస్తున్నారని తెలిపింది. బాధితులు సగటున రూ.93,915 నష్టపోయినట్టు వెల్లడించింది. లింక్ లేకుండానే.. డెలివరీ నోటీసులు, సబ్స్క్రిప్షన్ పునరుద్ధరణ, బ్యాంక్ అలర్ట్ వంటి సందేశాలు కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి సైబర్ నేరగాళ్లు ఉపయోగించే సాధారణ వ్యూహాలుగా మారాయి. కొత్త ఎత్తుగడ ఏమంటే అనుమానాస్పద సోషల్ మీడియా సందేశాలలో 20% ఎటువంటి లింక్ లేకుండా వస్తున్నాయి. 66% మంది వినియోగదారులు ఈ లింక్ రహిత సందేశాలకు స్పందించారు. స్కామర్ల ఉచ్చులో పడడానికి ఈ అంశం కూడా కారణమైంది. రోజుకు కనీసం నాలుగు డీప్ఫేక్ వీడియోలు తమకు ఎదురవుతున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. డీప్ఫేక్ వీడియోల్లో 65% ఇన్స్ట్రాగామ్ వేదికగా దర్శనమిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు వాయిస్–క్లోన్ స్కామ్ను ఎదుర్కొన్నారు. వాయిస్–క్లోన్ అంటే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బ్యాంక్ లేదా ప్రభుత్వ అధికారుల గొంతును అనుకరిస్తూ చేసే వాయిస్ మెసేజ్ అన్నమాట. అధునాతన వ్యూహాలతో.. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70% మంది గత సంవత్సరం తమ సోషల్ మీడియా ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను తెరవడంలో ఏడాది క్రితం కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉన్నామని 82% మంది చెప్పారు. అయినా, స్కామర్లు అధునాతన వ్యూహాల ద్వారా ఇటువంటి వినియోగదారులను కూడా బోల్తా కొట్టిస్తున్నారు. నెటిజన్లను నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు ఏఐ, అధునాతన డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తూ ఆర్బీఐ, బ్యాంకులు, ట్రాయ్, ఆధార్, ఇతర ప్రభుత్వ సంస్థల పేర్లతో సందేశాలను పంపడంతోపాటు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. సర్వే గురించి.. ⇒ నివేదిక పేరు: మ్యాకఫీ 2026 స్టేట్ ఆఫ్ ద స్కామివర్స్ ⇒ ఎందుకు: ఆన్లైన్ మోసాలకు సంబంధించి నేరగాళ్ల వైఖరి, ప్రవర్తన, బాధితుల అనుభవాలను తెలుసుకోవడానికి ⇒ ఏఏ దేశాలు: భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ⇒ ఎప్పుడు: 2025 నవంబర్లో సర్వే నిర్వహణ ⇒ ఎవరెవరు: 18 ఏళ్లు పైబడిన 7,592 మందిపై ⇒ విధానం: ఆన్లైన్ వేదికగా ⇒ సర్వేలో పాల్గొన్న 87% మంది భారతీయులు తాము వ్యక్తిగతంగా ఆన్లైన్ స్కామ్ను అనుభవించామని చెబుతున్నారు.⇒ సైబర్ నేరగాళ్ల చేతిలో ఆర్థికంగా నష్టపోయినట్టు 51% మంది వెల్లడించారు. ⇒ ఒక స్కామర్ తన లక్ష్యాన్ని మోసం చేసి డబ్బు లేదా సమాచారాన్ని దొంగిలించడానికి పట్టిన సమయం కేవలం 5 నిమిషాలే.⇒ఒక సంవత్సరం క్రితం కంటే నేడు తమ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉందని 63% మంది నమ్ముతున్నారు.⇒ స్కామ్ బాధితుల్లో 24% మందిని ఏడాదిలోపే సైబర్ నేరగాళ్లు మళ్లీ లక్ష్యంగా చేసుకున్నారు. ⇒ 90% మంది మోసపూరిత క్యూఆర్ కోడ్ అందుకున్నారు. స్కాన్ చేయగానే ప్రమాదకర స్థాయికి 38% మంది చేరుకున్నారు.⇒ డీప్ఫేక్ స్కామ్ను గుర్తిస్తామన్న నమ్మకం లేదని, తమను తాము రక్షించుకోలేమని మూడింట ఒక వంతుకుపైగా మంది తెలిపారు. -
వీణా–వాణిల గౌరవానికి భంగం కలిగిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: వీణా–వాణిలకు జన్మతః వచ్చిన వైకల్యాన్ని ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకు వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, స్వరాష్ట్రంలోనూ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అవిభక్త కవలలు వీణా–వాణిలను కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అర్వింద్ జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వీణా–వాణిల శారీరక స్థితిని రాజకీయ పోలికలకు వాడుకున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్న వారిని అవహేళన చేయడం, వారి గౌరవాన్ని కించపరచడమే. ఇది కేవలం ఆ ఇద్దరు యువతులనే కాకుండా, వైకల్యంతో పోరాడుతున్న వేలాది మందిని కించపరచడమే అవుతుంది’అని ఆయన ధ్వజమెత్తారు. వీణా–వాణిలు అపారమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని అర్వింద్ కొనియాడారు. వారు ఇప్పటికే విజయవంతంగా బీకామ్ పూర్తి చేశారని, అలాంటి వారిని రాజకీయ బురదలోకి లాగడం అమానవీయమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బహిరంగంగా మాట్లాడేటప్పుడు సంయమనం, సున్నితత్వం పాటించాలని ఎంపీ హితవు పలికారు. -
నడి రోడ్డుపై 15 అడుగుల లోతు గొయ్యి
న్యూఢిల్లీ: నిర్మాణ పనుల కోసం ఢిల్లీ జల్బోర్డు తవ్విన 15 అడుగుల లోతు గుంతలో ఓ మోటారు సైకిలిస్ట్ పడి, ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి జనక్పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం ఉదయం 8 గంటలకు వెలుగు చూసింది. కైలాస్పురికి చెందిన కమల్ భయానీ(25) ఓ ప్రైవేట్ బ్యాంకు కాల్ సెంటర్ ఉద్యోగి. గురువారం అర్ధరాత్రి సమయంలో విధులు ముగించుకుని బయలుదేరిన ఆయన..ఇంటికి చేరుకోలేదు. దీంతో, కుటుంబసభ్యులు భయాందోళనకు గురై ఆ చుట్టుపక్కలున్న జనక్పురి, సాగర్పూర్, వికాస్ పురి, రోహిణి తదితర పోలీస్స్టేషన్లకు వెళ్లి, విషయం అక్కడి అధికారులకు వివరించారు. పెద్దగా ఎవరూ స్పందించలేదు. కమల్ రోజూ ప్రయాణించే రహదారిపై రాత్రంతా గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల వేళ ఓ మహిళ జనక్పురి ప్రాంత పోలీస్స్టేషన్కు ఫోన్ చేసి, అధికారులు తవ్విన గుంతలో బైకుతోపాటు ఓ వ్యక్తి చలనం లేకుండా పడిపోయి కనిపించినట్లు తెలిపింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలికి దిగి కమల్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. జనవరి 16వ తేదీ రాత్రి నోయిడాలో యువరాజ్ మెహతా(27) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిర్మాణ ప్రాంతంలో నిలిచిన నీటి గుంతలో కారుతోపాటు పడి ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. అన్ని చోట్లా నిర్లక్ష్యమే: బాధిత కుటుంబం నిర్మాణ పనుల కోసం ఆ రోడ్డును కొన్ని రోజు లుగా మూసివేశారు. గురువారం భారీ గుంతను తవ్వారు. ఆ విషయం తెలియక కమల్ అటుగా వచ్చి ప్రమాదం బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కమల్ ప్రాణాలు కోల్పోయారని కుటుంబీకులు, సన్నిహితులు ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి వెతికి ఉంటే అతడి ప్రాణాలు దక్కించుకోగలిగేవారమన్నారు. ముగ్గురు అధికార్ల సస్పెన్షన్ ఘటన ప్రాంతాన్ని ఢిల్లీ జల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ స్వయంగా పరిశీలించారు. అధికారులు గుంత చుట్టూ కొంతమేర రక్షణ చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు. అయినప్పటికీ, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆ మార్గంలో వాహనదారులు రాకపోకలను మాత్రం మానలేదన్నారు. అంతేకాకుండా, అక్కడ జరిగే పనుల్ని పట్టించుకోని జల్బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్లను సస్పెండ్ చేశామన్నారు. -
3 వారాల్లో తేల్చాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మె ల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు మరో సారి డెడ్ లైన్ విధించింది. అనర్హతలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న కాలయాపనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం వెలువడకపోతే తామే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీద్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. మున్సిపల్ ఎన్నికలతో ఆలస్యం: సింఘ్వీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ‘అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న మొత్తం పిటిషన్లలో ఒకదానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన రెండు పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఉండటం వల్ల స్పీకర్ కొంత సమయం కోరాల్సి వచ్చింది. మార్చి మధ్యలోగా లేదా అంతకంటే ముందే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది..’ అని చెప్పారు. 16 నెలలుగా ఏం చేస్తున్నారు?: మోహిత్ రావ్ సింఘ్వీ వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది మోహిత్రావ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ’గత 16 నెలలుగా ఈ వ్యవహారాన్ని స్పీకర్ కార్యాలయం తొక్కిపెడుతోంది. స్పీకర్ స్వయంగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిపారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?..’ అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కోర్టులను రీల్స్ కోసం వాడుకోవద్దు విచారణ సందర్భంగాన్యాయవాద వృత్తిలోని నైతికతపై జస్టిస్ సంజయ్ కరోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు గదుల్లో జరిగే వాదనలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ’రీల్స్’ రూపంలో పోస్ట్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ’న్యాయస్థానాలను రీల్స్ కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమగా మారింది. బాధ్యతాయుతమైన ఆఫీసర్లుగా ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు..’ అని హితవు పలికారు. -
బదులిచ్చే ధైర్యం ప్రధానికి లేదు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానికి లేదన్నారు. ప్రభుత్వం సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలనుకోవడం లేదని ఆరోపించారు. పదేపదే అబద్ధాలు చెప్పడమే మోదీ పని అని ఆరోపించారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోదీ తన 97 నిమిషాల ప్రసంగంలో ముఖ్యమైన, అవసరమైన విషయం ఒక్కటీ చెప్పలేదు. ఇంకా వందేళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల కిందటి సంగతులే మాట్లాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని అధికార పక్షం పార్లమెంటులో చెబుతోంది. తాము ఆ పుస్తకాన్ని బాహాటంగా చూపినా వారికి అర్థం కావడం లేదు. ముందుగా వాస్తవాలను శ్రద్ధగా విని, ఆపై సమాధానం చెప్పాలి’’ అని ఖర్గే అన్నారు. రాహుల్, కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టూ్ట వివాదంపైనా ఆయన స్పందించారు. సభ బయట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను సిక్కులకు జరిగిన అవమానంగా ముద్ర వేశారని మండిపడ్డారు. ‘‘సిక్కులను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేశారు’’ అని గుర్తు చేశారు. సిక్కులను, దళితులను, ఆదివాసీలను ఎవరినీ గౌరవించే అలవాటు లేనిది బీజేపీకేనన్నారు. ఇతరు లను ఎలా కించపరచాలా అనే మోదీ ఆలోచిస్తారని ఖర్గే ఆరోపించారు. ‘‘దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కానీ మోదీ మాత్రం వాటిని దివాలా తీసే కర్మాగారాలు అని పిలుస్తూ నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని నడిపే దార్శనికత మోదీకి లేదు’’ అన్నారు. రాహుల్ ఏం ప్రశ్నలు అడుగుతారో, ఎలాంటి వాస్తవాలు బయటపెడతా రోనని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభలో మోదీపై దాడి జరుగుతుందని నిఘా సమాచారముందని చెబుతున్నారు. అంత గొప్ప ఇంటలిజెన్స్ పుల్వామా వంటి ఉగ్ర దాడుల సమయంలో ఏమైంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డ తరవాత మోదీ ఆందోళనగా ఉన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లొంగిపోయి ఆ దేశంతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందం కుదుర్చు కున్నారు. తద్వారా మన దేశ రైతులను బలిపశు వులను చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్పై సుప్రీంకోర్టు సీరియస్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది.బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల విచారణకు సమయం పొడిగించాలని స్పీకర్ తరఫున సంఘ్వీ కోర్టును కోరారు. ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగిందని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. మరో మూడు వారాల సమయం ఇచ్చింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయితే, గత విచారణ సందర్భంగా.. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. -
యువతుల మిస్సింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్
ఆపరేషన్ మిలాప్.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. కిందటి ఏడాది ఈ ఆపరేషన్ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.దేశ రాజధాని రీజియన్లో మిస్సింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్ ప్రమోషన్ ముఠా ఉందని తేల్చేశారు.జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్గా రిపోర్ట్ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్ గర్ల్స్ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా వైరల్ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.After following a few leads, we discovered that the hype around the surge in missing girls in Delhi is being pushed through paid promotion. Creating panic for monetary gains won't be tolerated, and we'll take strict action against such individuals.— Delhi Police (@DelhiPolice) February 6, 2026గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్ కమిషనర్ సంజయ్ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు. -
ప్రతి పిటిషన్పై మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రతి అంశంపై మళ్లీ మళ్లీ ‘మినీ ట్రయల్స్’నిర్వహించడం సాధ్యం కాదని, దర్యాప్తును వేగంగా ముగించాలని జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్తో కూడిన ధర్మాసనం సీబీఐని గురువారం ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా విచారణ కొలిక్కి రాకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటే అది అంతులేకుండా పోతుందని, న్యాయం జరగడంలో జాప్యం అవుతుందని హెచ్చరించింది. ఇలాగే సాగదీస్తే మూడు నాలుగేళ్లు పడుతుంది.. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టు కేవలం ఒక నిర్దిష్ట అంశంపైనే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు సాగదీతపై ఘాటుగా స్పందించింది. ‘ప్రతి పిటిషన్పై మేం మినీ ట్రయల్ నిర్వహించలేం. ఇలాంటి విజ్ఞప్తులను అనుమతిస్తూ పోతే ఈ కేసు అంతులేకుండా ముందుకు వెళుతుంది. ఇలాగే విచారణను సాగదీస్తే దర్యాప్తు పూర్తి కావడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ఇది న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించడమే అవుతుంది’అని జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘ఈ కేసులో ప్రధాన దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అదనపు విచారణ కొనసాగిస్తున్నాం. కేసును ఒక ముగింపు దిశగా తెచ్చే క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అని నివేదించారు. నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు పేరుతో విచారణను సాగదీస్తున్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్లు తమ వద్ద ఉన్న అదనపు సమాచారాన్ని సీబీఐకి అందజేయవచ్చని సూచించింది. ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం... దర్యాప్తును ఒక నెల కాలపరిమితిలోగా ముగించాలన్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ఎవరిని విచారించాలి? ఎవరిని అదుపులోకి తీసుకోవాలి? అనే అంశాలపై మేం ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం. అది పూర్తిగా దర్యాప్తు సంస్థ విచక్షణకు సంబంధించిన విషయం. ట్రయల్ కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగంగా జరగడమే ముఖ్యం. దర్యాప్తు అనేది నిరంతర ప్రక్రియ. కొత్త నిజాలు తెలిసినప్పుడు వాటిని విస్మరించలేం. దర్యాప్తు సంస్థపై కాలపరిమితి పేరుతో అనవసరమైన ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి’అని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ, సీబీఐ తన విధి నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చని పేర్కొంది. సుమారు 13,16,964 ఫైళ్లతో కూడిన సమాచారాన్ని, హార్డ్ డిస్క్లను విశ్లేషించాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టు దృష్టికి తెచ్చింది. ఇంత భారీ స్థాయిలో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి సమయం పడుతుందని, అందుకే గడువు విషయంలో వెసులుబాటు కల్పించాలని సీబీఐ కోరింది. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై స్పష్టతనిస్తూ, కాలయాపన చేయకుండా కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
తెలంగాణ డీజీపీ నియామకంలో జాప్యం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు అదనంగా మరో నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది. తక్షణమే ఎంప్యానెల్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఆధారంగా అర్హులైన అధికారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ డీజీపీ ఎంపిక విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. యూపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ వాదనలు వినిపిస్తూ.. ‘తెలంగాణలో 2017లో మాజీ డీజీపీ అనురాగ్ శర్మ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ డీజీపీ కోసం ప్రతిపాదనలు పంపలేదు. సుదీర్ఘ కాలం తర్వాత 2025 ఏప్రిల్లో జాబితా పంపింది. ఇంత జాప్యం జరిగినందున, దీనిపై స్పష్టత కావాలి’అని చెప్పారు. మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? యూపీఎస్సీ వాదన విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా స్పందించారు. ’తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మీరు పిటిషన్ వేశారు సరే.. ఒకవేళ మీ వాదనను అంగీకరించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తే, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంటి? అక్కడ యాక్టివ్ డీజీపీ లేకుండా పోతారు కదా? పిటిషన్ వేసే ముందు ఈ పరిణామం గురించి యూపీఎస్సీ ఎందుకు ఆలోచించలేదు?’అని నిలదీశారు. రాష్ట్రం మూడు నెలల గడువు పాటించనప్పుడే.. యూపీఎస్సీ ఎందుకు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చాక సాకులు చెప్పడం సరికాదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో నియామక ప్రక్రియను నిలిపివేస్తే అది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి సహకరించినట్లవుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రెగ్యులర్ డీజీపీలను నియమించకుండా, యాక్టింగ్ (ఇన్చార్జి) డీజీపీలతో పాలన సాగిస్తున్న విధానంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల వలలో మీరు (యూపీఎస్సీ) పడకండి. అసలు రాష్ట్రాలకు పూర్తిస్థాయి డీజీపీలు ఉండటం ఇష్టం లేదు. తమకు నచ్చినట్లుగా వ్యవహరించే, తమకు అనుకూలంగా ఉండే యాక్టింగ్ లేదా తాత్కాలిక డీజీపీలే వారికి కావాలి. అందుకే ఈ జాప్యమంతా’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. యూపీఎస్సీకి కోర్టు ధిక్కరణ అస్త్రం ప్రకాశ్ సింగ్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన అధికారులను కొనసాగించేందుకు నియామకాల్లో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయని, దీనివల్ల అర్హత, మెరిట్ ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. డీజీపీ పదవీ విరమణకు ముందే రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని, ఒకవేళ రాష్ట్రాలు సకాలంలో స్పందించకపోయినా, జాప్యం చేసినా.. ఇకపై యూపీఎస్సీ నేరుగా సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయొచ్చని స్పష్టం చేసింది. రాజకీయ ప్రాధాన్యతలతో కాకుండా.. అధికారుల సరీ్వస్ రికార్డు, సీనియారిటీ, మెరిట్ ఆధారంగానే డీజీపీ ఎంపిక జరగాలని తేల్చిచెప్పింది. -
ఓం బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సభకు రాకుండా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెనుక దాక్కున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ధ్వజమెత్తారు. మోదీ సభకు వస్తే కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, అందుకే రావొద్దని చెప్పానంటూ బిర్లా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. గురువారం లోక్సభ వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. సభకు వచ్చి విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదన్నారు. అందుకే స్పీకర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారని విమర్శించారు. సభలో మోదీపై దాడి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదని స్పష్టంచేశారు. మోదీపై చేతులెత్తే ప్రసక్తే లేదన్నారు. లేని ఆలోచన ఉన్నట్లు కల్పించవద్దని సూచించారు. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి స్థానం వద్ద ముగ్గురు మహిళా ఎంపీలు నిల్చున్నారని, అంతకు మించి ఏమీ జరగలేదని ప్రియాంక గాంధీ తేలి్చచెప్పారు. సభలో ఏదైనా మాట్లాడేందుకు అధికారపక్ష ఎంపీలకు స్పీకర్ అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. తమను మాత్రం మాట్లాడనివ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలను ఎందుకు మాట్లానివ్వడం లేదో మోదీని, అమిత్ షాను అడగాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని సైతం అనుమతించడం లేదని ఆమె ఆక్షేపించారు. -
ప్రధాని సమాధానం లేకుండానే.. లోక్సభలో తీర్మానం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ చరిత్రలో గత 22 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ బుధవారమే సమాధానం ఇస్తారని భావించినప్పటికీ, నినాదాలు, నిరసనల కారణంగా సభ గురువారానికి వాయిదా పడిన విషయం తెల్సిందే. గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ కూడా కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ఆరంభమయ్యాక సైతం ప్రధాని మోదీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం నిరాకరించారంటూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నరేంద్ర–సరెండర్’ అంటూ ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వెల్లోకి వెళ్లారు. కాశీలో మణికరి్ణక ఘాట్ వ్యవహారంపై బ్యానర్లు ప్రదర్శిస్తూ సమాజ్వాదీ పార్టీ సభ్యులు.. టీఎంసీ, ఇతర ఇండియా కూటమి సభ్యులు కూడా వారికి జత కలిశారు. ఈ గందరగోళం మధ్యే జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. తీర్మానానికి ప్రతిపక్షాలు చేసిన సవరణలను స్పీకర్ తిరస్కరించారు. -
రాష్ట్రపతిని కించపర్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోందని అన్నారు. తనపై ఎంత విద్వేషం గుమ్మరించినా తనను సమాధి చేయడం కాంగ్రెస్ పార్టీ తరం కాదని తేలి్చచెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. దాదాపు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న పేద గిరిజన మహిళను, రాజ్యాంగబద్ధమైన పదవిని, భారత రాజ్యాంగాన్ని ఆ పార్టీ కించపర్చిందని మండిపడ్డారు. దళితులను, గిరిజనులను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కూడా కించపర్చిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రవనీత్సింగ్ బిట్టూను ద్రోహి అని నిందించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను నిస్సిగ్గుగా కాపాడుతోందని మండిపడ్డారు. ‘ప్రేమ దుకాణం’ అంటూ కల్ల»ొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోదీ.. తేరీ ఖబర్ ఖుదేగీ(మోదీ.. నీ సమాధి తవ్వుతాం) అంటూ నినాదాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది వారి తరం కాదని అన్నారు. పేద కుటుంబంలో జని్మంచిన తాను ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఈ పదవి ఇంకా కొనసాగుతుండడం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, అందుకే నిత్యం తనను దూషిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి పదవిని వారి కుటుంబ హక్కుగా భావిస్తున్నారని సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతిపక్షాల వల్లే లోక్సభకు వెళ్లలేకపోయా.. ‘‘దేశంలో కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు నాకున్నాయి. వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా. ప్రజల అండదండలున్న నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను ఒక సమస్యగా పరిగణిస్తోంది. కానీ, మేము ప్రజలను ఒక బలంగా, సవాళ్లకు పరిష్కారంగా భావిస్తున్నాం. బుధవారం లోక్సభలో జరిగిన పరిణామాలు నిజంగా బాధాకరం. ప్రతిపక్షాలు అలజడి సృష్టించడం వల్లనే సభకు వెళ్లలేకపోయా. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సభాపతి స్థానంలో ఉన్న అస్సాం ఎంపీపై, ఆంధ్రప్రదేశ్ దళిత ఎంపీపై పేపర్లు విసిరేశారు. అస్సాం ప్రజలను.. మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించారు. దళితులను అవమానించారు. కాంగ్రెస్ వల్ల అస్సాం గాయకుడు భూపేన్ హజారికా ఎన్నో అవమానాలకు గురయ్యారు. సదానందన్ మాస్టర్ను అవమానించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బిట్టూను కాంగ్రెస్ నాయకుడొకరు(రాహుల్ గాం«దీ) బుధవారం ద్రోహి అంటూ దూషించారు. ఆ పార్టీకి సిక్కులంటే ద్వేషం. కాంగ్రెస్ నుంచి ఎన్నో గ్రూప్లు విడిపోయాయి. ఎంతోమంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. బిట్టూ సిక్కు కాబట్టి ద్రోహి అని నిందించారు. ఇది సిక్కులకు, గురువులకు జరిగిన అవమానం. సిక్కుల పట్ల విద్వేషాన్ని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుంది. నిన్న రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడు సదానందన్ మాస్టర్ తన కృత్రిమ కాలును ప్రదర్శిస్తే ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆయన గొప్ప విలువలున్న వ్యక్తి. రాజకీయ గొడవల వల్ల మూడు దశాబ్దాల క్రితం కాలు పోగొట్టుకున్నారు. ఆయనను అవమానించడం మొత్తం దేశానికి బాధ కలిగించింది. అందుకు విపక్ష ఇండియా కూటమి బాధ్యత వహించాలి. ఓట్ల కోసం చొరబాటుదార్లను రక్షిస్తున్నారు ‘‘పశ్చిమ బెంగాల్లో దయలేని ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. పతనం కావడంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఓట్ల కోసం చొరబాటుదార్లను కాపాడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం దేశాన్ని నాశనం చేయొద్దు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం చొరబాటుదార్లను సహించవు. వారిని బయటకు వెళ్లగొడతాయి. మనదేశంలో మాత్రం చొరబాటుదార్లను రక్షించే పరిస్థితులున్నాయి. అందుకోసం కోర్టులపైనా ఒత్తిడి తెస్తున్నారు. మన యువత హక్కులను లాక్కొని, గిరిజనుల భూములను కబ్జా చేస్తున్నవారిని కాపాడడం ఏమిటి? మన ఆడబిడ్డలు, కుమారుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నవారిని రక్షించడం తగదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు దశాబ్దాలపాటు అధికారం అనుభవించాయి. అధికారంలో ఉన్నప్పుడు సొంత లాభం చూసుకోవడం తప్ప ప్రజల బాగు కోసం చేసిందేమీ లేదు. నేడు మనం డీల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గతంలో డీల్ అంటే బోఫోర్స్ డీల్ మాత్రమే. ప్రజల జీవితాలను మార్చడం వారికి ముఖ్యం కాదు. సొంత జేబులు నింపుకోవడమే ముఖ్యం’’ అని మోదీ ధ్వజమెత్తారు. .నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి ‘‘అన్ని రంగాల్లో నూతన స్ఫూర్తి, శక్తితో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇందులో భాగంగా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిపై మనం దృష్టి పెట్టాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ భారత్’ ప్రపంచమంతటా వినిపించాలి. మన నాణ్యమైన ఉత్పత్తులు అన్ని చోట్లకూ వెళ్లాలి. అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ, అరుదైన ఖనిజాల రంగాల్లో ముందడుగు వేస్తున్నాం. సంస్కరణల ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సంస్కరణల వల్ల లాభాల్లోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ సంస్కరణలు చేపట్టాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన నిర్వాకాలకు ఇప్పుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు పెడుతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించడానికి తన స్థానం నుంచి లేవగానే విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ను కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో మోదీ ప్రసంగం ప్రారంభించారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలతో హోరెత్తించారు. నిరసన వ్యక్తంచేశారు. లోక్సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవమానాలు సహించబోమని అన్నారు. కూర్చొని నినాదాలు ఇవ్వొచ్చంటూ ఖర్గేకు ప్రధాని మోదీ సూచించారు. కొద్ది సేపటి తర్వాత ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మోదీ ప్రసంగం కొనసాగింది. విపక్ష సభ్యులు బయటకు వచ్చి మకరద్వారం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆ ఒప్పందాలతో ప్రపంచంలో గొప్ప విశ్వాసం ‘‘యూరోపియన్ యూనియన్తో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికాతో ఒప్పందానికి వచ్చాం. ఇవి ఫ్యూచర్ రెడీ ఒప్పందాలు. ప్రపంచంలో గొప్ప విశ్వాసం నింపాయి. ప్రపంచ స్థిరత్వానికి ఈ ఒప్పందాలు తోడ్పడుతాయి. గత కొన్నేళ్లలో తొమ్మిది పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇది ఈయూతో కుదిరిన ఒప్పందం ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’. మనం ఇక వెనక్కి చూడాల్సిన అవసరం గానీ, పరుగు ఆపాల్సిన అవసరం గానీ లేదు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా వేగంగా దూసుకెళ్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రపంచమంతటా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నూతన ప్రపంచ క్రమం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇప్పుడు భారత్ పట్ల ప్రపంచదేశాల్లో గొప్ప విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎన్నో దేశాలకు మన దేశం విశ్వసనీయ భాగస్వామిగా మారింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తులో పాలుపంచుకోవాలని ఇతర దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే మనతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. దక్షిణార్ధ గోళ దేశాలకు(గ్లోబల్ సౌత్) నేడు మనమే బలమైన గొంతుకగా మారాం’’ అని మోదీ అన్నారు. -
‘సర్’పై కమల్ హాసన్ ఏమన్నారంటే..
ఢిల్లీ: కమల్ హాసన్ రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల అర్హులైన సుమారు కోటి మంది ఓటర్లు చనిపోయిన వారి జాబితాలో చేరే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా తన తొలి ప్రసంగంలోనే ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై విమర్శలు గుప్పించారు. ఆయన దీన్ని ఒక వ్యాధిగా అభివర్ణిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసే చర్య అని అన్నారు.సవరణ ప్రక్రియలో తప్పుగా పేర్లు తొలగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఫలితంగా, నిజంగా జీవించి ఉన్న ఓటర్లు కూడా జాబితాలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల సంఘం ఈ విధమైన చర్యల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కమల్ హాసన్ ఆరోపించారు. ప్రజలకు ఉన్న ఓటు హక్కును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతత్వం కోసం ప్రయత్నించకూడదని ఆయన స్పష్టం చేశారు.తమిళనాడులో ఇటీవల జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో 97.4 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.43 కోట్లకు తగ్గింది. ఈ తొలగింపులపై ఇప్పటికే వివాదం చెలరేగింది.తన ప్రసంగంలో కమల్ హాసన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రజల హక్కులను గౌరవించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. “ప్రజాస్వామ్యం శాశ్వతం, కానీ ప్రభుత్వాలు తాత్కాలికం. ప్రజల హక్కులను దెబ్బతీయడం ఎప్పటికీ అంగీకారయోగ్యం కాదు’అని వ్యాఖ్యానించారు.కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజల హక్కుల పరిరక్షణపై ఆయన చేసిన ఆందోళన, భవిష్యత్తులో రాజకీయ వేదికపై మరింత చర్చకు దారితీయనుంది. -
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాను. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని ఆయన అన్నారు.పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని విజ్ఞప్తి చేశాను’అని స్పీకర్ తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు.బుధవారం ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు సభలో జరిగిన గందరగోళం, వాయిదాపై ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ..‘ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. లోక్సభలో కొంతమంది సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో గందరగోళం సృష్టించవచ్చని నాకు ముందస్తు సమాచారం వచ్చింది’ అని ఆయన వెల్లడించారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బాబు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం.దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే ఏ తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని సీఎఫ్టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం. నాణ్యత విషయంలో రాజీ పడలేదు. నిబంధనల సవరణకు ముందే బోలె బాబా కంపెనీ టీటీడీకి సరఫరా చేసింది. చిన్న అప్పన్న నా పీఏ కాదు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులపై బురద చల్లడానికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు, సీఎఫ్టీఆర్ఐకు ఎందుకు వెళ్తాను. దేవుడిపై రాజకీయాలు చేయొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సిట్ తేల్చి చెప్పింది. వైఎస్సార్సీపీ టార్గెట్గా మళ్ళీ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంక్వయిరీ కమిటీ వేయడం కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా కమిటీ వేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. ఘోరమైన తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పింది. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్పై దాడి చేశారు. చంద్రబాబు చెప్పిన తప్పులే.. నిజమని చెప్పేందుకు మళ్లీ కమిటీ వేశారు. తప్పు చేసిన వ్యక్తి అయితే.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు?. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఆయనపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. రాజకీయ ఆరోపణ చేయడం తోక ముడవడం చంద్రబాబుకు పరిపాటి. టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు తిరస్కరించారు’ అని తెలిపారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు లాంటిది. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలకు దేవుడు.. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. టీడీపీ హయాం నుంచి బోలే బాబా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తోంది. అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే బోలె బాబాను బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి పైన మాపై ఎందుకు రుద్దుతున్నారు. ఆ ట్యాంకర్లను బ్యాక్ డోర్ ద్వారా వాడుకున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ కోసం లడ్డు విషయాన్నీ వాడుకుంటున్నారు. గత జనవరి నుంచి టీటీడీ పూర్తిగా అప్రతిష్ట పాలైంది’ అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..‘లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి.. విషయాలు తేల్చండి అని సవాల్ విసిరారు. -
తెలంగాణ గ్రామపంచాయతీలకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్. కేంద్రం 15వ ఆర్థిక సంఘం పంచాయితీలకు సంబంధించిన బకాయి నిధులను గురువారం విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల అయ్యాయి. తెలంగాణ పంచాయితీలకు కేంద్రం రూ.3 వేల కోట్ల దాకా బకాయిలు ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవతో కొద్ది కొద్దిగా నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది. అయితే ఈలోపు.. ఎన్నికలు రావడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఎన్నికలు పూర్తి కావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపుల అనంతరం నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: నాలుగు వారాల్లో తెలంగాణ డీజీపీ నియామకంపై తేల్చాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇవాళ (ఫిబ్రవరి 5, గురువారం) విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో డీజీపీ నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫార్సులు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారుల యోగ్యత ఆధారంగా సిఫారసులు చేయాలన్న ధర్మాసనం.. సకాలంలో యూపీఎస్సీకి ప్రతిపాదిత డీజీపీ పేర్లను పంపడంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది.ఈ ఆలస్యం వల్ల మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుందన్న సుప్రీంకోర్టు.. యాక్టింగ్ డీజీపీ పేరుతో రెగ్యులర్ డీజీపీని నియమించడం లేదని పేర్కొంది. ‘‘రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే.. త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖలు రాయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదు’’ అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. -
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీత రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ పేర్కొంది.విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఇలా అయితే మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చు. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వం అని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు.గత విచారణలో(జనవరి 20) కూడా.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా.. సునీత పిటిషన్పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది. -
2.5 కోట్లకుపైగా ఆధార్ నంబర్ల డియాక్టివేట్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ డేటాబేస్ను మరింత సురక్షింతంగా, విశ్వసనీయంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకుపైగా ప్రజల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడిచింది. ఈ మేరకు బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా నిలిచిన ఆధార్లో ప్రస్తుతం సుమారు 134 కోట్ల మందికి సంబంధించిన వినియోగదారులు ఉన్నారని తెలిపారు. అయితే వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ నంబర్ క్రియాశీలకంగా ఉంటే, సంక్షేమ పథకాల దురి్వనియోగం, గుర్తింపు సంబంధ మోసాలు జరిగే ఆస్కారం ఉండటంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు, సంస్కరణ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తెలిపారు. ఆధార్ వినియోగదారుడి చిరునామాలో నమోదైన రాష్ట్రం, మరణం నమోదైన రాష్ట్రం వేరుగా ఉంటే అలాంటి వ్యక్తుల వివరాలు సమీకరించి మరణాలను ధృవీకరించుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత ఆయా వ్యక్తుల ఆధార్ నంబర్లను నిలిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. గుర్తింపు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా వినియోగదారులు తమ బయోమెట్రిక్స్ను లాక్/అన్లాక్ చేసుకునే సదుపాయం కలి్పస్తున్నట్లు పేర్కొన్నారు. లావాదేవీల సమయంలో లబి్ధదారు భౌతికంగా ఉన్నట్లు నిర్ధారించే ’లైవ్నెస్ డిటెక్షన్’ ఫీచర్తో కూడిన ఫేస్ అథెంటికేషన్, ఆధార్ సెక్యూర్ క్యూఆర్ కోడ్, ఆఫ్లైన్ ఈ–కేవైసీ వంటివి అందుబాటులోకి తెచి్చనట్లు వివరించారు. వినియోగదారుల ప్రధాన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ ఎవరితోనూ పంచుకోదని, డేటాను ఎన్క్రిపె్టడ్ ఫార్మాట్లో భద్రపరచడం తప్పనిసరి చేశామని జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. -
సభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్లో బైఠాయించారు. అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. రాహుల్కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ‘ఎడ్వినా అండ్ నెహ్రూ’, ‘మిత్రోఖిన్ ఆర్కైవ్’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్ దూబ్ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్ దూబేపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
142 ఏళ్ళ కలర్ సోడా..ఇప్పటికీ లభ్యం
ఒక చిన్న బాటిల్లో చల్లగా ఉండో ఆ సోడా... ఎప్పుడూ మనల్ని రిఫ్రెష్ చేస్తుంది కదా? కానీ, మీరు ఊహించగలరా... కోకా-కోలా, పెప్సీ రాకముందే అంటే 142 ఏళ్ల క్రితం – భారతదేశంలో ఒక సోడా జన్మించింది! అది కూడా పూణే నగరంలో! ఈరోజు మనం మాట్లాడేది ఆ అద్భుతమైన కథ గురించి – ‘అర్దేషిర్ సోడా’!1880లలో... ఇరాన్లోని యాజ్డ్ నగరం నుంచి ఒక యువకుడు – అర్దేషిర్ ఖోదాదాద్ ఇరానీ – జీవితంలో ఏమీ లేకుండా, కేవలం 8 రూపాయలతో భారతదేశానికి వచ్చాడు. అది కూడా పూణే నగరానికి రాగానే అతని జీవితం పూర్తిగా మారిపోయింది.ఒక రోజు పూణేలోని ఒక బార్లో గొడవ జరిగింది. ఎందుకంటే... ముంబై నుంచి సోడా సప్లై చేసే మూల్స్ (పట్టెగాడిదలు) ఆలస్యమయ్యాయి. సోడా లేకుండా ప్రజలు ఆగ్రహంతో గొడవపడుతున్నారు. అర్దేషిర్ ఆ దృశ్యం చూసి ఆలోచించాడు – "ఎందుకు ఇక్కడే సోడా తయారు చేయకూడదు? అన్న ఆలోచన వచ్చి అక్కడే అతను ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. చార్కోల్ భట్టీ వెలిగించి, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసి, దాన్ని నీటిలో కలిపాడు. ఫిజ్ వచ్చింది! తర్వాత చక్కెర, ఫ్లేవర్స్ కలిపి... 1884లో *అర్దేషిర్ సోడా* పుట్టుకొచ్చింది! గమనించండి – కోకా-కోలా 1886లో పుట్టింది. అంటే అర్దేషిర్ సోడా రెండేళ్ల ముందు!ఆ రోజు నుంచి ఈ సోడా పూణే ప్రజల హృదయాల్లో చోటు చేసుకుంది. ఒరిజినల్ సోడా తప్ప... ఇప్పుడు కాఫిన్-ఫ్రీ కోలా, పైనాపిల్, గ్రీన్ యాపిల్, పీచ్, జీరా మసాలా, మసాలా కాలా ఖట్టా, టానిక్ వాటర్... ఎన్నో ఫ్లేవర్స్! అంతేకాదు, నేచురల్ ఇంగ్రీడియెంట్స్తో తయారవుతుంది. అద్భుతమైన విషయం ఏమిటంటే – ఇప్పటికీ 'రిటర్నబుల్ బాటిల్' సిస్టమ్! 24 గాజు బాటిల్స్ కేస్కి 360 రూపాయల డిపాజిట్. ఖాళీ బాటిల్స్ తిరిగి ఇస్తే డబ్బు తిరిగి వస్తుంది. అందుకే ఈ బ్రాండ్ పూణేకే పరిమితమైంది. మార్జ్బాన్ ఇరానీ (అర్దేషిర్ గ్రేట్-గ్రాండ్సన్) చెప్పినట్లు – "బాటిల్స్ తిరిగి రాకపోతే, నాకు ఫిల్ చేయడానికి ఏమీ ఉండదు!"పూణేలోని ప్రతి ఇరానీ కేఫ్లో – డోరాబ్జీస్, కైకోబాడ్ వంటి సెంచరీ-ఓల్డ్ రెస్టారెంట్స్లో – అర్దేషిర్ సోడా తప్పనిసరి! చిన్నారులు పెరిగిన టేస్ట్, ఆ ఫిజ్ సౌండ్, ఆ నాస్టాల్జియా... ఇప్పటికీ అలాగే ఉంది. గ్లోబల్ బ్రాండ్స్ వచ్చినా, ఈ లోకల్ హీరో ఇంకా రాజ్యమే చేస్తోంది!స్నేహితులారా, ఇది కేవలం సోడా కాదు... ఒక ఇమ్మిగ్రెంట్ స్వప్నం, ధైర్యం, ఇన్నోవేషన్ కథ! పూణేకి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా అర్దేషిర్ సోడా తాగారా? కామెంట్స్లో చెప్పండి! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం... మళ్లీ కలుద్దాం! జై హింద్! -
మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ.. కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. ఇప్పటికే మణిపూర్ సీఎంగా యుమ్నం ఖేంచంద్ను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత రాష్ట్రపతి పాలనను ఉపసంహరించుకుంది. ఈశాన్య రాష్ట్రంలో రాజ్యాంగ ప్రక్రియను అధికారికంగా పునరుద్ధరించాలని హోం మంత్రిత్వ శాఖ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది.మణిపూర్లో మొయితీ-కుకీ తెగల మధ్య ఘర్షణలు.. హింసాత్మక పరిస్థితులు ఏడాదిన్నరపాటు కొనసాగాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మధ్యలో సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చినా.. అలాంటిదేం జరగలేదు. చివరకు.. 2025 ఫిబ్రవరి 13న బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా.. తాజాగా మణిపూర్కు కొత్త సీఎంగా బీజేపీ నేత, రాష్ట్ర ఖేమ్చంద్ సింగ్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.Ministry of Home Affairs today issued a notification announcing the revocation of President’s Rule in Manipur with immediate effect. pic.twitter.com/GZNE61aeAW— ANI (@ANI) February 4, 2026మణిపూర్లో గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. మాజీ సీఎం ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ హైకమాండ్ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఖేమ్చంద్ సింగ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అనుభవం, విశ్వసనీయత ఉండటంతో పాటు, ప్రజలతో అనుబంధం కూడా బలంగా ఉండడంతో సీఎం బాధ్యతల్ని ఖేమ్చంద్ సింగ్కు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. -
యువతికి ఆకలేసింది.. స్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టింది!
ఫుడ్ డెలివరీ బాయ్ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్లో ఫుడ్ డెలివరీ చేయటం కోసం ఎంతో కష్టపడుతుంటారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతను భయంతో గజగజ వణికి పోయాడు..చివరికి ఆర్డర్ను డెలివర్ చేయకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతూ నెటిజన్లకు ఆశ్చర్చాన్ని కలిగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఒక డెలివరీ బాయ్ ..ఎప్పటి లాగే.. అతనికి ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బిర్యానీ పార్శిల్ తీసుకుని ఫుడ్ డెలివరీ చేయాల్సిన అడ్రెస్కి వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది. కానీ అతను ముందుకు వెళ్లగా… ఆ లోకేషన్ చూసి షాక్ అయ్యాడు.ఆ వ్యక్తి రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని, బయటకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని అన్నాడు. దానికి ఆ అమ్మాయి..తాను చాలా లోపల ఉన్నానని, బయటకు రాలేనని ..తాను స్మశానంలో ఫ్రెండ్స్తో లోపల పార్టీ చేసుకుంటున్నాం” అని చెప్పింది. ఈ మాటలు విన్నాక రైడర్ పూర్తిగా హడలెత్తిపోయి, ఆర్డర్ క్యాన్సిల్ చేసి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చింది.ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగినదో స్పష్టంగా తెలియడం లేదు. కొందరు ఇది ఫేక్ వీడియో అని, మరికొందరు AI ద్వారా తయారైన వీడియో అని చర్చ చేస్తున్నారు. అయినా, రాత్రి సమయాల్లో ఇలాంటి అడ్రస్లకు డెలివరీ చేయడం ఎంత భయంకరమో ఈ వీడియో అందరికీ చూపిస్తుంది. -
హక్కుల సంఘం దృష్టికి ఏపీ జంగిల్ రాజ్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున ఆటవిక పాలనను వైఎస్సార్సీపీ, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం ఆ పార్టీ నేతల బృందం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రమాసుబ్రమణ్యంను కలిసి అరాచక పాలన గురించి ఆధారాలతో సహా వివరించింది. తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే.. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తమ కార్యకర్త మందా సాల్మన్ రాజును టీడీపీ శ్రేణులు ఎలా హత్య చేశాయో మానవ హక్కుల సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. టీడీపీ నేతలు తమ పార్టీ వాళ్లను ఎలా చంపాలని చూశాయో తెలియజేస్తూ.. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన ముందు ఉంచింది. ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను కలిసిన బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ , ఎమ్మెల్సీఅరుణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీజూపూడి ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న దాడుల పైన దర్యాప్తు చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం. టీడీపీ దాడులపై దర్యాప్తు చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. డీజీపీ ద్వారా నివేదిక తెప్పించుకుంటానని అన్నారు. త్వరలోనే దర్యాప్తు కమిటీ రాష్ట్రానికి వస్తుందని భావిస్తున్నాం. చంద్రబాబు అనే నరహంతకుడు ప్రజల్ని చంపేస్తున్నారు. ఈ ఆటవిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని కేంద్రాన్ని కోరుతున్నాం. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో దళితుల పైన దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను మానవ హక్కుల సంఘానికి వివరించాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల పైన పెట్రోల్ బాంబులు వేసి చంపేయాలని చూశారు. దళితులపై దాడులు ఏమాత్రం జరుగుతున్న పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థ పనిచేయడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ మానవ హక్కుల సంఘం ఆశ్రయించాం. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు, హత్యలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరాం. డీజీపీ ద్వారా నివేదిక తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మందా సాల్మన్ రాజు సోదరుడు మాట్లాడుతూ.. మాలాంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మా గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వేడుకుంటున్నాం. మానవ హక్కు సంఘానికి నివేదిక ఇచ్చాం. -
మణిపూర్ నూతన సీఎంగా ఖేమ్చంద్ సింగ్
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్కు కొత్త సీఎంగా బీజేపీ నేత, రాష్ట్ర ఖేమ్చంద్ సింగ్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది.మణిపూర్లో గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. మాజీ సీఎం ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ హైకమాండ్ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఖేమ్చంద్ సింగ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అనుభవం, విశ్వసనీయత ఉండటంతో పాటు, ప్రజలతో అనుబంధం కూడా బలంగా ఉండడంతో సీఎం బాధ్యతల్ని ఖేమ్చంద్ సింగ్కు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఖేమ్ చంద్ సింగ్ నియామకంతో గత ఏడాది నుంచి కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, పరిపాలనా లోటు ఈ నియామకంతో ముగుస్తుందని ఆశిస్తున్నారు.ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పరిపాలనా నిర్ణయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఖేమ్చంద్ సింగ్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు
ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ట్రేడ్డీల్తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్ డీల్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషం చిమ్మారు.వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్కు ఇష్టం లేదు. ట్రేడ్ డీల్తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు. -
లోక్సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: లోక్సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, హిబి ఈడెన్, చామల కిరణ్కుమార్రెడ్డి ఉన్నారు. స్పీకర్ తీరుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో సస్పెండ్ అయిన ఎంపీల ఆందోళనకు దిగారు.రాహుల్ గాంధీ ‘చైనా’ కామెంట్స్పై ఉదయం నుంచి లోక్సభలో చర్చ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే ఇంకా ప్రచురించని పుస్తకం ఆధారంగా వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ.. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో వ్యాఖ్యలు చేయడంతో వివాదం నెలకొంది.విపక్ష సభ్యులు.. సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేయడంతో గందరగోళం నెలకొంది. 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్సభ సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. అనంతరం లోక్సభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి.కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని.. 8 మందిలో తానూ ఉన్నానని తెలిపారు. స్పీకర్.. రాహుల్ గాంధీ మైక్ను కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాలలో వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే సమావేశాన్ని వాయిదా వేసే విధంగా ప్రవర్తించారు. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ ఎంపీల వలనే సభ వాయిదా పడుతున్నట్టు బీజేపీ ప్రచారం చేస్తున్నారు.నరేంద్ర మోదీ ట్రంప్కు సరెండర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరుగుతున్న డిబేట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయన మైకు కట్ చేశారు. ఆయన మైక్ కట్ చేస్తే మేము ఎందుకు కట్ చేశారని అడిగేందుకు స్పీకర్ పోడియం ముందుకు వెళ్లాం. 8 మందిపై కావాలనే సస్పెన్షన్ వేటు వేశారు. మా నోరు మూయించాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మిగతా ఎంపీలందరూ మా తరఫున రేపు సభలో ప్రశ్నిస్తూనే ఉంటారు. రేపు పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ గురైన ఎనిమిది మంది ఎంపీలం ఆందోళన చేస్తాం.స్పీకర్ అనే వ్యక్తి ఏ కులానికి చెందినవారనేది మేము చూడలేదు. మాకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశాం. మేం మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది’’ అని కిరణ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. -
ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై విమర్శలు గుప్పించారు. చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు. మోదీ ఇమేజ్ను క్రియేట్ చేసిన వాళ్లే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో విడుదల చేయనివి ఇంకా ఉన్నాయి. అమెరికాలో అదానీపై కేసు నమోదు చేశారు. వాళ్ల టార్గెట్ అదానీ కాదు.. మోదీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. యూఎస్-ఇండియా ట్రేడ్ నాలుగు నెలలుగా పెండింగ్లో ఉంది. ఇప్పటికిప్పుడు భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై కేంద్రం ఆమోదం ఎందుకు తెలిపింది.‘మోదీ చాలా భయంతో ఉన్నారు. మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్ ఒత్తిడితోనే ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రైతుల రక్త మాంసాలను కేంద్రం అమ్ముకుంది. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారు.’ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్లోక్సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్కు గుయ్యారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సెక్రటరీ జనరల్ బెంచ్పైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, వారింగ్, కిరణ్ రెడ్డి సస్పెన్షతో పాటు మొత్తం ఎనిమిది మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. -
అజిత్ పవార్ విమాన ఘటన.. మళ్లీ తెరపైకి ‘టేబుల్టాప్ రన్వే’
ఒక్క చిన్న పొరపాటు… పెద్ద ప్రమాదానికి దారి.” అనే మాట నిజంగానే విమాన ప్రయాణాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ జరిగిన బారామతిలో టేబుల్టాప్ రన్వే ఉంది. కొండలను చదును చేసి లేదా లోయల మధ్య ఎత్తైన ప్రదేశంలో నిర్మించే రన్వేలను టేబుల్టాప్ రన్వేలు అంటారు. ఇవి సాధారణ రన్వేల కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టంగా మారుతుంది.మంగళూరు ఎయిర్పోర్ట్ కూడా టేబుల్టాప్ రన్వేతోనే ఉంది. 2010లో అక్కడ ఒక విమానం రన్వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2020లో కోజికోడ్లో భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్వే దాటి 35 అడుగుల లోతులో పడిపోయి రెండు ముక్కలు అయింది. ఆ ఘటనలో 21 మంది మరణించారు. ఈ సంఘటనలు టేబుల్టాప్ రన్వేల ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.ఇక భూటాన్లోని పారో ఎయిర్పోర్ట్ చుట్టూ 18 వేల అడుగుల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. దీనిని ప్రపంచంలోనే అత్యంత డైంజరస్ ఎయిర్ పోర్ట్ గా భావిస్తారు. ఇక్కడ ల్యాండ్ కావాలంటే పైలట్లు పర్వతాల మధ్య నుంచి పదునైన కోణాల్లో విమానం నడపాలి. అందుకే అన్ని విమానాలకు అనుమతి ఉండదు. అలాగే నేపాల్లోని టెన్జింగ్-హిల్లరీ ఎయిర్పోర్ట్కు కేవలం 527 మీటర్ల చిన్న రన్వే మాత్రమే ఉంది. రెండు వైపులా కొండలు ఉండటంతో ల్యాండింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది.ఇలాంటివి ప్రపంచంలో ఇంకా కొన్ని విమానాశ్రయాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్ అంటే పైలట్లకు పెద్ద సవాలు. అనుభవం ఉన్న పైలట్లు కూడా ప్రతిసారీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా పైలట్ల చాకచక్యంతోనే చాలా ప్రమాదాలు తప్పుతున్నాయి. కానీ పర్వతాలు, సముద్రాలు లేదా చిన్న రన్వేలు ఉన్న ప్రాంతాల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అది పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే అలాంటి ఎయిర్పోర్ట్లలో ప్రతి ల్యాండింగ్ ఒక పరీక్షలాంటిదే. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి’
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టింది. మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీలు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు.ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి అని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని.. అక్రమ కేసులు, అరెస్టులు చేయించడమే కాదు.. హత్యలకూ పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వదలడం లేదు. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై అధికార టీడీపీ దాడులు చేసింది. ఈ జంగిల్ రాజ్పై చట్టబద్ధంగా, అహింసా పద్ధతుల్లో వైస్సార్సీపీ పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పరిస్థితులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ. త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలసి పరిస్థితులను ఆయనకు వివరించాలని భావిస్తోంది.కూటమి పాలనలో ఇప్పటిదాకా.. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారుజోగిరమేష్ ఇంటిపై దాడి చేశారువలభనేని వంశీ ఇంటిపై దాడి చేశారుకొడాలి నాని ఇంటిపై దాడి చేశారుపేర్ని నాని ఇంటిపై దాడి చేశారుముద్రగడ ఇంటిపై దాడి చేశారునల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుకామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారుకేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారుఅబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి చేశారుభూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుహిందూపుర్ వైసీపీ ఆఫీస్ పై దాడి చేశారుదాడిశెట్టి రాజాపై దాడి చేశారుఉప్పల హారికా, ఉప్పల రాముపై దాడి చేశారుదేవినేని అవినాష్ పై దాడికి యత్నించారుచిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారుమార్గాని భరత్ ఆఫీస్ పై దాడివిడదల రజినీపై దాడికి యత్నం నంబూరి శంకర్రావు ఆఫీసుపై దాడిఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిడెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేశారు సాక్షి ఆఫీసులపై దాడి చేశారు -
ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అవసరం
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్పై విధించిన సుంకాలను తగ్గించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని అన్నారాయన. అమెరికా వాణిజ్య విషయంలో భారత్ తీరు సరిగా లేదంటూ.. గతేడాది ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని 18 శాతానికి తగ్గుతాయని ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ప్రకటించారు. అయితే.. భారత ఉత్పత్తులపై అమెరికా మొత్తంగా 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది. ఇందులో రష్యాతో చమరు కొనుగోళ్ల నేపథ్యంతో విధించిన 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో.. రష్యాతో చమురు వాణిజ్యం పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని కూడా ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో వెల్లడించారు. కానీ, ఆ సుంకాల పరిస్థితిపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.మోదీ ఏమన్నారంటే..ట్రంప్ ఫోన్కాల్.. సోషల్ మీడియా పోస్ట్ పరిణామంపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుంది.. .. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం! ఇక ట్రంప్ ఏమన్నారంటే.. ‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది. అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని ట్రంప్ హర్షం వెలిబుచ్చారు. నేను, మోదీ మాటల మనుషులం కాదు. పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి. మోదీని నా అత్యుత్తమ మిత్రుల్లో ఒకరు. వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు(BUY AMERICAN). 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు.. సోమవారం రాత్రి నుంచే ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అంటూ బ్రేకింగ్ న్యూస్లా ఒక్కో పరిణామాన్ని వివరించుకుంటూ పోయారు. అయితే.. రష్యా చమురు సంకాల పరిస్థితిపై మాత్రం అటు ట్రంప్, ఇటు మోదీ నుంచి క్లారిటీ రాలేదు. కానీ, గోర్ మాత్రం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా తుది టారిఫ్లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే.. రష్యా చమురు విషయంలో జాతి ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఒత్తిళ్లకు నిజంగానే తలొగ్గిందా? అనేదానిపై కేంద్రం నుంచి స్పష్టత రావ్సాల్సి ఉంది. -
ఏపీలో అరాచక పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ఎండగట్టారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి తగులబెట్టారని ఆరోపించారు. వందల మంది తమ పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇళ్లను దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు మద్దతుగా ఉందన్న ధీమాతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. ఏపీలో కనీసం ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు. రైతులకు తీరని అన్యాయం.. పీఎం కిసాన్ను పెంచండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2019 నుంచి రైతులకు ఇస్తున్న రూ.6 వేలు ’పీఎం కిసాన్’ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కనీసం రూ.9 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాబు మోసం.. పథకాలన్నీ బంద్! గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేసిన ’ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల 74 శాతం మంది రైతులు బీమా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, సన్నకారు రైతులకు వరంలా ఉన్న ఉచిత బోరు బావుల పథకాన్ని కూడా నిలిపివేశారని, పాడి రైతులకు ఇచ్చే లీటరుకు రూ.4 బోనస్ను, కోల్డ్ స్టోరేజీల సబ్సిడీలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు (పీపీపీ మోడల్) చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిపై కోటి సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం ఇచ్చామని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను ఆపాలను పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. -
సభలో ‘చైనా’ రగడ!
న్యూఢిల్లీ: ‘చైనా రగడ’ సోమవారం లోక్సభను కుదిపేసింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణలకు సంబంధించి విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వాటికి సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని పలు అంశాలను రాహుల్ సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. విపక్ష నేత వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు బీజేపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఉటంకించడాన్ని ఆక్షేపించారు.సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. నరవణె పుస్తకం గురించిన ఉటంకింపులను అనుమతించబోనని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినా రాహుల్ పట్టించుకోలేదు. పలువురు విపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.ఒక్క వాక్యానికే భయమెందుకు?సోమవారం లోక్సభ సమావేశమై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టింది. బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య మాట్లాడుతూ కాంగ్రెస్ దేశభక్తిపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అనంతరం ప్రసంగించిన రాహుల్ వాటిపై మండిపడ్డారు. ‘‘నెహ్రూ–చైనా అంశంపై మాట్లాడాలని నేను అనుకోలేదు. కానీ కనుక సూర్య చేసిన విమర్శలకు బదులుగా దానిపై మాట్లాడక తప్పడం లేదు. నెహ్రూ కేవలం తాను రాజనీతిజ్ఞుడినని చెప్పుకునేందుకు వేలాది ఎకరాల భూభాగాన్ని చైనాకు సరెండర్ చేశారని నిరాధారణ ఆరోపణలకు దిగుతున్నారు’’ అన్నారు. ఆ క్రమంలో 2020 భారత్, చైనా గాల్వాన్ ఘర్షణల గురించి జనరల్ నరవణె తన పుస్తకంలో రాసిన అంశాలను ఉటంకించారు. అందుకు అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురణ అయిందో లేదో ముందుగా రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో మొదలైన రగడ 50 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పుస్తకం, వార్తా పత్రిక క్లిప్పింగ్ తాలూకు అంశాలనూ సభలో ప్రస్తావించడానికి అనుమతి లేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటి ప్రస్తావనకు అడ్డంకులేమీ లేవని రాహుల్ వాదించారు. నరవణె పుస్తకం ప్రచురితం కాలేదని రాజ్నాథ్ అభ్యంతరం తెలిపారు. దానిపై ఒక మేగజైన్లో వచ్చిన వ్యాసంలోని అంశాలనే ఉటంకిస్తున్నానని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్క వాక్యం చదివితే ఎందుకంతగా బెంబేలెత్తిపోతున్నారు?’’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పుస్తక ప్రస్తావనను అనుమతించడం లేదని ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ‘అయితే నేనేం మాట్లాడాలో మీరే చెప్పండి’ అని రాహుల్ అనడంతో, ‘నేనేమీ మీ సలహాదారును కాదు’ అంటూ స్పీకర్ ఆగ్రహించారు. స్పీకర్ రూలింగ్కు కట్టుబ డకుంటే ఏం చర్యలు తీసుకోవాలో సభ నిర్ణయించాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు హెచ్చరించారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గకపోవడంతో పుస్తక ప్రస్తావన తగదంటూ ఆయన్ను బిర్లా పదేపదే వారించారు. పుస్తకాన్ని ప్రచురించొద్దంటూ నరవణెను కేంద్రం బెదిరించిందంటూ రాహుల్ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్నాథ్ మండిపడ్డారు. అదే నిజమైతే దానిపై నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాహుల్కు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ఆయనను మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలకు దిగారు. గందరగోళం నడుమ సభను మధ్యాహ్నం మూడింటిదాకా స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం కూడా ఇండో–చైనా సరిహద్దు అంశాన్ని లేవనెత్తేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. అందుకు అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సైన్యాన్ని న్యూనతపరిచే వ్యాఖ్యలకు దిగొద్దని రాహుల్కు రిజిజు సూచించారు. ప్రతిష్టంభన నడుమ సభ సాయంత్రం నాలుగింటిదాకా వాయిదా పడింది. మోదీకి, మంత్రులకు నచ్చదు!సభ మళ్లీ సమావేశమయ్యాక రాహుల్ తన ప్రసంగం కొనసాగించారు. తాను లేవనెత్తుతున్నది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. ‘‘సహజంగానే ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి ఇది నచ్చదు. అందుకే నన్ను మాట్లాడనివ్వడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), మనోజ్ ఝా (ఆర్జేడీ) తదితర విపక్ష సభ్యులు రాహుల్కు బాసటగా నిలిచారు.మోదీ, రాజ్నాథ్ దోషులుగా తేలతారనే...సభలో నన్ను అడ్డుకున్నారు: రాహుల్‘‘2020లో చైనాతో ఘర్షణ సందర్భంగా మన సైనిక బలగాల నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వమ్ము చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని అంశాలు వెలుగులోకి వస్తే ఆ ఉదంతంలో వారిద్దరూ దోషులుగా రుజువవుతారు. ఆ భయంతోనే నేను సదరు అంశాలను ప్రస్తావించకుండా బీజేపీ సభ్యులు లోక్సభలో పదేపదే అడ్డుకున్నారు’’ అని విపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. సోమవారం సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ, రాజ్నాథ్ గురించి ఆ పుస్తకంలో నరవణె రాశారు. చైనాతో ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తనకు ఏం చెప్పిందీ, ఎలాంటి ఆదేశాలిచ్చిందీ స్పష్టంగా పేర్కొన్నారు. దాన్నే నేను సభలో ప్రస్తావించా. ఆ రెండు మూడు వాక్యాల్లో విషయమంతా స్పష్టంగా బయటపడిపోయేది. పైగా వాటిని రాసింది నాటి ఆర్మీ చీఫ్! కానీ ఆ మాత్రానికే మోదీ సర్కారు బెంబేలెత్తిపోతోంది. ఎందుకంటే అది వెలుగులోకి వస్తే వారిద్దరి బండారం బయటపడుతుంది’’ అన్నారు. 2020లో చైనా చొచ్చుకొస్తున్నప్పుడు మోదీ 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు స్పష్టంగా దిశానిర్దేశం చేయాలి. అంతే తప్ప నిర్ణయాలను ఇతరుల భుజస్కంధాలపై నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. కానీ మోదీ చేసింది సరిగ్గా అదే! ఆర్మీ మాజీ చీఫ్ రాసిన పుస్తకాన్ని ప్రచురణ కూడా కానివ్వడం లేదు’’ అని రాహుల్ ఆరోపించారు.నిబంధనల దుర్వినియోగం: కాంగ్రెస్సభలో విపక్ష నేత రాహుల్గాంధీని మోదీ సర్కారు అవహేళన చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా ఆయన గొంతు నొక్కేందుకు నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడింది. నరవణె పుస్తకంలోని నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే చౌకబారు చేష్టలకు దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ ఆరోపించారు. ఇది నయా ఫాసిజానికి తిరుగులేని తార్కాణమంటూ ధ్వజమెత్తారు.పార్లమెంటును కించపరిచారువిపక్ష నేత రాహుల్గాంధీ తన ప్రవర్తనతో పార్లమెంటు గౌరవానికే భంగం కలిగించారని బీజేపీ దుయ్యబట్టింది. అంతేగాక భారత్–చైనా సరిహద్దు అంశంపై నిరాధారణ ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీశారంటూ ఆక్షేపించింది. రాహుల్ పూర్తిగా భారత వ్యతిరేక శక్తుల భాష మాట్లాడుతున్నారని మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. సభలో రాహుల్ ప్రవర్తన భారత్ పరువును మంటగలిపేందుకు పక్కా పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలువైన సభా సమయాన్ని రాహుల్ వ్యర్థపరిచారని మండిపడ్డారు. ‘‘జాతీయ భద్రతతో ఆటలాడొద్దు. దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దు’’ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో భారత భూభాగాన్ని చైనాకు కోల్పోయినందుకు రాహుల్ తక్షణం దేశానికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ ఏకంగా నిండు సభలోనే మన దేశ శత్రువుల భాష మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ మండిపడ్డారు.ఆ పుస్తకంలో ఏముంది?లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ, మంత్రుల నడు మ రగడకు కేంద్ర బిందువుగా మారిన ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తన సైనిక జీవితం తాలూకు జ్ఞాపకాలకు ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరిట పుస్తక రూపమిచ్చారు. పెంగ్విన్ పబ్లిషింగ్ హౌజ్ దాన్ని ప్రచురించాల్సి ఉంది. అందుకు రక్షణ శాఖ అనుమతి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నట్టు నరవణె గత అక్టోబర్లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో ఆ పుస్తకంపై ద కారవాన్ మేగజైన్ గత నెలలో కవర్ పేజీ వ్యాసం ప్రచురించింది. రాహుల్ సోమవారం సభలో ఉటంకించింది ఆ వ్యాసంలోని అంశాలనే! తద్వారా, గాల్వాన్ ఘర్షణ వంటి అతి కీలక ఉదంతంపై సరైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కారు తాత్సారం చేసిందని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు.నిర్ణయాన్ని నాకే వదిలారు: నరవణె2020 జూన్15 రాత్రి తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. వాటిలో కల్నల్ సంతోష్కుమార్తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగి నా డ్రాగన్ దేశం ఆ వివరాలను బయ టికి రానివ్వ లేదు. ఆ ఘర్షణల సమయంలో నరవణె ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ 2020 ఆగస్టు 31న రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో తన భేటీ గురించి పుస్తకంలో నరవణె రాశారు. ‘‘(గాల్వాన్ ఉద్రిక్తతలపై) ప్రధాని మోదీతో మాట్లాడానని రాజ్నాథ్ నాకు చెప్పారు. ‘అది పూర్తిగా సైనిక నిర్ణయం. మీకు ఏది సరైందనిపిస్తే అలా చేయండి’ అన్నారు. దాంతో బాధ్యతంతా పూర్తి గా నాపైనే పడింది. ‘చైనా దూకుడును అడ్డుకు నేందుకు) నేనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలా అని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపో యాను’’ అని అందులో నరవణె రాసుకొచ్చి నట్టు కారవాన్ వ్యాసం పేర్కొంది. ‘‘పుస్తకం బ్యాక్ కవర్పై 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్గా చేసిన జనరల్ వి.పి.మాలిక్ రాసిన అభిప్రాయం కూడా ఆసక్తికరంగా ఉంది. ‘గాల్వన్ లోయ ఘర్షణ, దానికి ముందు, తర్వాత జరిగిన పలు ఉదంతాల గురించి పుస్తకంలో రాసిన అంశాలు చదువుతుంటే పాఠకులంతా భావోద్వేగాలతో ఊగిపోవడం ఖాయం’ అని మాలిక్ రాసుకొ చ్చారు’’ అంటూ వ్యాసం ముక్తా్తయించింది. -
సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులు గీత దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్లైన్ నంబర్ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్లైన్ నంబర్ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్ చేయాలని చెబుతున్నారు. అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్ చేయొచ్చు కదా?’అని అన్నారు. తప్పేంటి?: సుప్రీం ధర్మాసనందీనిపై జస్టిస్ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది. పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. ముందస్తు పరిశీలన: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి. -
ఢిల్లీలో బంగభవన్ వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే పేరిట అధికారులు తమ రాష్ట్రంలో కుటుంబాలను వేధిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే విషయమై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మమత సోమవారం బంగభవన్ వద్ద బందోబస్తు కోసం వచ్చిన ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ఓటర్ల సమస్యలను ఈసీ ముందు ఏకరవు పెట్టేందుకు వచ్చిన తనను ధర్నా చేస్తాననే ఉద్దేశంతో అడ్డుకోవడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆమె ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులను మొహరించారు. తర్వాత అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో మమత ఘటన వివరాలను వెల్లడించారు. బెంగాల్లో ఎస్ఐఆర్ బాధితులుగా మిగిలిపోయిన వారిలో దాదాపు 50 కుటుంబాలను మమత ఢిల్లీకి తరలించారు. కొందరు చాణక్యపురిలోని రాష్ట్ర ప్రభుత్వ భవనం అయిన బంగ భవన్లో, మరికొందరి వేర్వేరు చోట్ల విడిది ఏర్పాటుచేశారు. వీళ్లను కలిసేందుకు మమత బంగభవన్కు చేరుకోగానే అక్కడ మొహరించిన భారీ బందోబస్తును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బెంగాల్లో ఎస్ఐఆర్ బాధిత కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా? వాళ్ల గోడు వెళ్లబోసుకోవద్దా?’’అని పోలీసులను మమత నిలదీశారు. ‘‘బంగభవన్కు పోలీసులొచ్చి బాధిత కుటుంబాలను బెదిరించారు. మా కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఎలక్షన్ కమిషన్తో మాకు సమావేశముంది. అధికారికంగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే ఇక్కడికొచ్చాం. ఎస్ఐఆర్ వేధింపులకు బెంగాల్లో చాలా మంది చనిపోయారు. వాళ్ల కుటుంబాలు మీడియాతో మాట్లాడకూడదా?’’అని పోలీసులను మమత నిలదీశారు. అప్పుడెక్కడికి పోయారు? ‘‘బెంగాల్ కుటుంబాలు బసచేసిన ప్రతి చోటుకు పోలీసులు ఎందుకొస్తున్నారు? ఇప్పుడొచ్చిన ఇదే పోలీసులు ఎర్రకోటవద్ద బాంబు పేలినప్పుడు ఎక్కడికి పోయారు?. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులను నేను తప్పుబట్టంలేదు. పోలీస్బాస్లను నిలదీస్తున్నా. మీకు దమ్ములేదు. దేశాన్ని రక్షించే సత్తా లేదు. బెంగాలీలు, జనాన్ని పీడించడమే మీకు తెలుసు. ఎస్ఐఆర్ పేరిట అరాచకాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీకి నేనొస్తే వీళ్లకు భయం పట్టుకుంటోంది. నేనేమైనా లక్షల మందిని వెంటేసుకొచ్చానా?. పేదలకు ఢిల్లీలో స్థలం లేదా? ఢిల్లీ జమీందారీలా తయారైంది. నేనేమీ ఇక్కడకు వీళ్లతో కలిసి ధర్నా చేపట్టేందుకు రాలేదు. మేమంతా న్యాయంకోసం ఇక్కడికొచ్చాం’’అని మమత అన్నారు. ఢిల్లీ పోలీసుల ప్రశ్నల పరంపర నుంచి కుటుంబాలను రక్షించేందుకు వాళ్లు ఉంటున్న ప్రాంతాలకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సాకేత్ గోఖలే, దోలా సేన్, కకోలీ ఘోష్ దస్తీదార్, బాపీ దల్దార్లు వెళ్లారు. ఢిల్లీ కైలాశ్ కాలనీలోని పశ్చిమబెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గెస్ట్హౌస్లో ఉన్న 20 మందికి రక్షణగా సాకేత్ గోఖలే వెళ్లగా అక్కడికి చేరుకున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. హేలీ రోడ్లోని బంగభవన్కు చేరుకున్న బాధితులతో తర్వాత మమత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ అయి వాళ్ల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. తర్వాత వాళ్లను వెంటబెట్టుకుని మమత ఈసీ కార్యాలయానికి వెళ్లారు. -
ఢిల్లీలో మమత.. ఈసీపై తీవ్ర ఆరోపణలు
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సర్(SIR) విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన తమ మాటల్ని వినలేదని, తమను అవమానించారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ తీరుపై మండిపడ్డారు.పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టి.. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం, మమతా బెనర్జీ.. సీఈసీ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈసీతో సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మమత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎల్కే అద్వానీ గారిని గౌరవిస్తాను. ఆయన తన తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను అందించగలరా అని అడుగుతున్నాను. ‘సర్’ పొంతన లేనిది. తప్పుల తడకగా ఉంది, అసంబద్ధమైనది. ఈ ఎన్ఆర్సీ కారణంగా బీఎల్ఓలతో సహా 150 మందికి పైగా మరణించారు. నేను నా వెంట 100 మందిని తీసుకువచ్చాను. వారిలో కొందరిని ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించారు. కానీ వారు సజీవంగా ఇక్కడే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. Outside the @ECISVEEP office in Delhi, Mamata Banerjee questioned the cruel SIR rules asking how ordinary citizens can produce parents’ birth certificates.150+ BLO deaths. Living voters marked “dead.”This isn’t verification. This is voter suppression. Bengal won’t stay… pic.twitter.com/idewLmDaR4— Abhishek Banerjee Fans (@ABFansClub) February 2, 2026సర్ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించం. ఆయన మా మాటల్ని వినలేదు.. మమ్మల్ని అవమానించారు. ‘సర్’ వల్ల పశ్చిమ బెంగాల్లో చాలా కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. కొందరు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేకపోవడంతో ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయారు. ఇంకొందరి ఓట్లు రకరకాల కారణాల వల్ల తొలగించారు అని అన్నారు.#WATCH | Delhi: Outside the Election Commission Office in Delhi, West Bengal CM Mamata Banerjee says, "... I respect Advani Ji and ask him whether he can provide the birth certificates of his father and mother. This is mismatch, a mismap, and unparliamentary... More than 150… pic.twitter.com/e6dhXl4AfN— ANI (@ANI) February 2, 2026అయితే, మమత చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు ఖండించాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో అనుచితంగా ప్రవర్తించారని, సీఈసీ చెప్పేది వినిపించుకోలేదని అధికారులు తెలిపారు. మమత ప్రశ్నలకు సీఈసీ సరిగ్గానే స్పందించారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. మమతా బెనర్జీది అంతా డ్రామా అంటూ కొట్టిపారేసింది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ మమతపై విమర్శలు గుప్పించారు. గంటసేపు ఈసీ ఆఫీసులో ఉండి, మాట్లాడి, సమావేశాన్ని బహిష్కరించానని చెప్పడం ఏంటని ఆయన విమర్శించారు. లోపల జరిగిందొకటి.. బయట మమత చెప్పిందొకటి అన్నారు. డ్రామా నడిపారని, పోలీసుల్ని ఇందులోకి లాగడం సరికాదని సూచించారు. -
సీఎం యోగి ఆధిత్యనాథ్ సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల స్థిర,చర ఆస్తులు అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే వాహనాలు ఇతర ఆస్తులతో స్థిరాస్తులైన ఇళ్లు, స్థలాల వివరాలను అందించాలని సూచించారు. ఇందుకోసం మానవ్ సంపద (Manav Sampada) పేరుతో ఓ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,66,261 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. డిసెంబర్ 31,2025 నుంచి జనవరి 31,2026 వరకు వారి ఆస్తుల వివరాల్ని పోర్టల్లో పొందుపరచాలని ఆదేశించారు. నిర్ధేశించిన గడువు లోపు ఆస్తుల వివరాలు అందించాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీఫ్ సెక్రటరీ ఎస్పీ గోయల్ పర్యవేక్షించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ ఆస్తులు ఇవేనంటూ సంబంధిత ఆస్తుల వివరాల్ని మానవ్ సంపద్ పోర్టల్లో ఆధాలతో సహా అప్లోడ్ చేశారు. వారిలో 68వేల మంది ఉద్యోగులు వారి వివరాల్ని ఇవ్వలేదు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం వారి జనవరి జీతాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఇచ్చే వరకు జీతాలు ఇవ్వకూడదని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రమోషన్ల నిలిపివేయడం, వారిపై పెనాల్టీ విధిస్తామని హుకుం జారీ చేశారు. -
సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్నెట్లో సాక్షి చానెల్ తొలగించడంపై విచారణ జరపాలని డీటీ శాట్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సాక్షిపై కక్షగట్టి.. మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్కు భారీ షాక్ తగిలినట్లైంది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీ చానెల్ను తొలగించారు. పైగా సాక్షి టీవీని ప్రసారం చేయొద్దంటూ ఎంఎస్వోలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ తొలగింపు వ్యవహారంపై సాక్షి యాజమాన్యం టీడీశాట్, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో టీడీశాట్కు ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే.. టీడీశాట్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్ను టీడీ శాట్ విచారణ జరపనుంది. టీడీశాట్ (TDSAT) అంటే Telecom Disputes Settlement and Appellate Tribunal. ఇది భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి, అప్పీలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం. -
చంద్రబాబు పరపతి తుస్సు!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏలో కీలకంగా ఉన్నానని, తనవల్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. పైకి ఆయనెన్ని కబుర్లు చెప్పినా కేంద్రం మాత్రం చంద్రబాబును లెక్కలోకి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్టే ఉదాహరణగా నిలుస్తోంది. 2024లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ఢిల్లీకొచ్చి కేంద్రానికి తాను చెప్పిందే వేదమన్నట్లుగా ప్రగల్భాలు పలికారు. తీరా ఈ బడ్జెట్ చూస్తే ఆయన మాటలన్నీ తుస్సే అన్నట్లుగా ఉంది. దీంతో ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోయారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ఎక్కడ చంద్రబాబూ? 2024లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. 2026 కల్లా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ పనులు పూర్తవుతాయన్నారు. తీరా 2026–27 బడ్జెట్లో ఏపీకి స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు వంటి వాటిల్లో దేనికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నం–చెన్నై, విశాఖపట్నం–బెంగళూరు వంటి నగరాలకు స్పీడ్ రైలు కారిడార్ను సాధించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుల కేటాయింపులు రూ.2,066.32 కోట్లు ఇక చంద్రబాబు ఢిల్లీకి వచి్చన ప్రతిసారీ అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూతనివ్వాలంటూ కోరుతున్నారు. కేంద్రం మాత్రం బడ్జెట్లో నిధులు కాకుండా అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులిచి్చంది. తాజా బడ్జెట్లో వివిధ అంతర్జాతీయ బ్యాంకుల అప్పుల ద్వారా కేటాయింపులు చేసింది. వీటిలో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు నుంచి రూ.432.09 కోట్ల అప్పు.. ఏపీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుకు జర్మనీ బ్యాంకు నుంచి రూ.155.32 కోట్లు.. ఏపీ రోడ్ అండ్ బ్రిడ్జెస్ రీ–కనస్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు ఎన్బీడీ నుంచి రూ.350 కోట్లు.. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.1,128.91 కోట్ల అప్పులకు కేంద్రం కేటాయింపులు చేసింది. అంటే.. 2026–27 బడ్జెట్లో కేంద్రం చంద్రబాబుకు రూ.2,066.32 కోట్ల అప్పులకు అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బడ్జెట్లో చంద్రబాబును కేంద్రం పట్టించుకోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో.. ఇక కేంద్ర బడ్జెట్లో తాము సాధించింది ఏమీ లేకపోయినప్పటికీ టీడీపీ కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం మీదుగా పక్క రాష్ట్రాలకు రైల్వే కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. ఇదేదో తాము సాధించిన గొప్పగా బిల్డప్ ఇస్తున్నారు. -
బడ్జెట్లో ఏపీకి మళ్లీ అన్యాయమే
సాక్షి, న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయమే జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రైల్వే కారిడార్లు తెచ్చుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. గతేడాది కంటే ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గడంపై మండిపడ్డారు. ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబూరావు, వైఎస్ అవినాశ్రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మాట్లాడారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నామని చెప్పుకొనే చంద్రబాబు సాధించిందేమిటని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 41.5 మీటర్లకే ఉంచుతూ నిధులు కేటాయించినట్లు తెలిపారు. 2026–27 బడ్జెట్లో పోలవరానికి రూ.3,320 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్కు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. విశాఖ–చెన్నై, విశాఖ–బెంగళూరుకు రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. ఈ విషయాల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ రెండు అంశాలపై తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. బడ్జెట్లో టూరిజానికి పెద్దపీట వేయడం, ఇందులో అరకు వ్యాలీ అభివృద్ధికి కేంద్రం చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. అప్పులు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినందునే చంద్రబాబు తలొగ్గుతున్నారు ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ను కేంద్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పారు. పోలవరం, జలజీవన్, పీఎంజేఎస్వై పథకాలకు పూర్తిగా నిధులు తగ్గించారని మండిపడ్డారు. జీరాంజీ పథకానికి రూ.58 వేల కోట్లు కోత వేశారని చెప్పారు. ఈ స్కీంను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. రాష్ట్రాలు 40 శాతం భరించే పరిస్థితులు లేవని, కేంద్రం వాటా కుదిస్తే ఇది నిర్వీర్యం అవుతుందని ఆ రోజు బిల్లు పాస్ చేసినప్పుడు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీ పునరి్వభజన చట్టంలో... పోలవరాన్ని తాము నిర్మిస్తామని, ఇందుకు రూ.57 వేలకోట్లు గ్రాంటు ఇస్తున్నామని కేంద్రం పొందుపరిచిందని చెప్పారు. గత బడ్జెట్లో ఎత్తు తగ్గించి, నిధులు తగ్గించారన్నారు. దాదాపు రూ.27 వేల కోట్లు తగ్గించినా, ఎత్తు తగ్గించినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరానికి ఏటా ఇలా నిధులు తగ్గించుకుంటూపోతే ఆ స్వప్నం ఎప్పుడు సాకారమవుతుందని ప్రశ్నించారు. రూ.30 వేల కోట్లలో రూ.3,320 కోట్లే కేటాయించారన్నారు. కేంద్రం చంద్రబాబుకు అప్పులు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వబట్టే.. పోలవరం విషయంలో తలొగ్గుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరుతో రూ.15 వేల కోట్లు అప్పు చేయడమేగాక.. మళ్లీ కొత్త అప్పులు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు 21 నెలల్లో రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. గత పాలనలో వైఎస్ జగన్ ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక, సోమాలియా అవుతుందని వ్యాఖ్యలు చేసిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబుకు ఇంత అప్పు చేయడానికి సిగ్గులేదా అని నిలదీశారు. కొత్తగా ఏపీఎండీసీ పేరుతో రూ.5 వేలకోట్లు, బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రూ.11 వేలకోట్ల అప్పునకు పూనుకున్నారని చెప్పారు. ప్రైవేటు సంస్థ ఏదైనా ప్రభుత్వానికి అప్పు ఇస్తే.. ప్రభుత్వం కట్టని పరిస్థితుల్లో ఆ అప్పును డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చనే షరతును ప్రభుత్వం పెట్టడం దుర్మార్గమని చెప్పారు. ఇబ్బడిముబ్బడిగా అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం పూర్తికి మరో పదేళ్లు?ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధలేదని ఈ బడ్జెట్ ద్వారా మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు. ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాటలు వింటుంటే అక్కడ నీరు ఏరులై పారుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపులో కూడా చంద్రబాబు, ఆయన టీం నోరు మెదపలేదని విమర్శించారు. గతేడాది కంటే ఇప్పుడు మరింతగా నిధులు తగ్గించడం చూస్తుంటే ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని మరో పదేళ్ల వరకు తీసుకెళ్లేలా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా ఏపీకి ఏటా అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పులాంధ్రప్రదేశ్గా చేసిందన్నారు. రాష్ట్రాన్ని కార్పొరేట్ల చేతుల్లో ఎలా పెట్టాలి, సొంత లాభాలు ఎలా గడించాలి అనేవే చంద్రబాలు ఆలోచనలని ఆయన విమర్శించారు. -
హైస్పీడ్గా రైల్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేని అత్యాధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైస్పీడ్ రైల్, రవాణా సామర్థ్యం పెంపు, భద్రత విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. అభివృద్ధి అనుసంధానకర్తగా భావించే ఈ కారిడార్లను ముంబై–పుణే, పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య ఏర్పాటుచేయాలని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2,77,830 కోట్లను కేటాయించారు. దీంతోపాటు అదనపు బడ్జెటరీ వనరుల నుంచి రూ.15 వేల కోట్లు సమకూరుతాయని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. ఈ నిధులతో కొత్తలైన్ల నిర్మాణ,ం లోకోమోటివ్స్, కోచ్లు, వేగన్ల కొనుగోలు, ఇతర పనులు చేపడతారు. 2025–26లో రైల్వేకి 2,52,000 కోట్లు కేటాయించగా, ఈసారి 10.25 శాతం ఎక్కువగా కేటాయించారు. ఇప్పటివరకు రైల్వేకి చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. రవాణా కారిడార్» సుస్థిర రవాణా కోసం డెడికేటెడ్ రవాణా కారిడార్ (డీఎఫ్సీ)ను డాంకునీ (పశ్చిమబెంగాల్) నుంచి సూరత్ (గుజరాత్) వరకు 2.052 కి.మీ. నిడివి తో ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని తూర్పు– పశ్చిమ డీఎఫ్ఏసీగా పేర్కొంటారు.» అధిక రద్దీ ఉండే 18 వేల కి.మీ. ట్రాక్ మార్గంలో భద్రతకు నిర్దేశించిన కవచ్, సీసీటీవీ కెమెరాలు, టెలికం కోసం రూ.7,500 కోట్లు కేటాయించారు. రైల్వే నెట్వర్క్ మొత్తానికి కవచ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని బడ్జెట్ లో పేర్కొన్నారు» దేశీయ కంటెయినర్ తయారీ కోసం కొత్త పథకం ప్రవేశపెడుతూ రూ.10వేల కోట్లు కేటాయించారు. » లోకోమోటివ్స్, వేగన్లు తదితరాల కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు కేటాయించారు. దీంతో మరిన్ని వందేభారత్ రైళ్లు, 24–కోచ్ స్లీపర్ రైళ్లను తీసుకుంటారు.» అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు. » కొత్త లైన్ల నిర్మాణానికి రూ.36,721.55 కోట్లు, రూ. గేజ్ మార్పిడికి రూ.4,600 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 37,750 కోట్లు కేటాయించారు.రూపురేఖలు మారిపోతాయిహైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణంతో దేశ రవాణారంగం రూపురేఖలు మారిపోతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఏడు కారిడార్లు మొత్తం 4000 కి.మీ. నిడివితో విస్తరించి ఉంటాయని తెలిపారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రూ.1.20 లక్షల కోట్లు ప్రయాణికులు, భద్రత కోసం వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. భద్రతపై రైల్వే ఎక్కువ ఫోకస్ పెట్టిందని, దీనివల్ల 95 శాతం రైలు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య తొలిసారి చేపట్టిన హైస్పీడ్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. – రైల్వే మంత్రి3,547.32 కోట్ల మిగులురైల్వే శాఖకు వచ్చే సంవత్సరంలో రూ.3,85,733.33 కోట్ల ఆదాయం వస్తుందని, రూ. 3,82,186.01 కోట్లు వ్యయమవుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 3,547.32 కోట్లు మిగులుతుందని భావిస్తున్నారు. 2024–25లో రైల్వేకి రూ. 3,35,757.09 కోట్ల ఆదాయం సమకూరగా, రూ.3,32,440.64 కోట్లు వ్యయమైంది. రూ.3,316.45 కోట్లు మిగులు వచ్చింది. మ్యాచ్ సమ్మరీవందే భారత్తో రైల్వే శాఖ బౌలింగ్ స్పీడు పెరిగింది. ఆ స్పీడు మరింత పెంచేందుకు వీలుగా... ఎంత ఫాస్ట్ బౌలింగ్నైనా తట్టుకునేందుకు తగ్గ పిచ్లు తయారు చేయాలని మోదీ సర్కారు సంకల్పించింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే కొత్త రైళ్లు హైస్పీడ్ బంతుల్లా దూసుకెళతాయి. స్థిరమైన ఆటకు తగ్గ పిచ్లా సరకు రవాణాను గాడిలో పెట్టడానికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అక్కరకొస్తుంది. కవచ్, సీసీటీవీలతో భద్రతపై పెట్టే వ్యయం... నోబాల్స్, వైడ్స్కు అడ్డుకట్ట వేస్తుంది. రూ.2.77 లక్షల కోట్ల భారీకేటాయింపుతో ఈ బడ్జెట్లో రైల్వే మామూలు ఓవర్ కాదు. దేశ రవాణాను వేగంగా నడిపించే పవర్ స్పెల్ వేసింది. -
సాగు.. ఫోకస్ మిస్!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించారు. 2025–26 సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే ఈసారి 7.12 శాతం మాత్రమే కేటాయింపులు పెంచారు. దీంతో వ్యవసాయ రంగంలో ఏ విభాగంపై కూడా పెద్దగా ఫోకస్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక మంత్రి పూర్తి నిర్లక్ష్యం చేశారని అఖిల భారత కిసాన్ సభ ఆరోపించింది. వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునరుజ్జీవనం పట్ల ఎటువంటి నిబద్ధతను చూపలేదని ఆక్షేపించారు. అయితే, వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ’సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే దార్శనికతను కనబరిచిందని ఆర్థిక మంత్రి నిర్మలచెప్పారు. సంప్రదాయసాగుపై ఆధారపడటాన్ని తగ్గించి గ్రామీ ణ జీవనోపాధిని వైవిధ్యపరిచేందుకు బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. కొత్త ఏఐ టూల్.. » కేంద్రం ‘భారత్–విస్తార్ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్)’ అనే పేరుతో బహుళ భాషా కృత్రిమ మేధ టూల్ను ప్రకటించింది. దీనికోసం రూ.150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతులకు సలహాలు అందించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ టూల్ అగ్రిస్టాక్ పోర్టల్లను, సాగు పద్ధతులపై ఐకార్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానం చేస్తుంది. » పండ్లు, కూరగాయల మిషన్ను క్రిష్నియోన్నతి యోజన కింద కలిపేసి రూ.700 కోట్లు కేటాయించారు. » మఖానా బోర్డు పేరును బిహార్, ఇతర రాష్ట్రాల్లో మఖానా అభివృద్ధి పథకంగా మార్చారు. దీనికి రూ.90 కోట్లు కేటాయించారు. » పీఎం–కిసాన్కు రూ.63,500 కోట్లు కేటాయించారు. » వ్యవసాయ విద్య, పరిశోధనకు 3 శాతం కోతవేసి రూ. 9,964 కోట్లు కేటాయించారు. » ఇన్లాండ్ ఫిషరీల కోసం 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను స్టార్టప్లు, మహిళా సంఘాలు, చేపల పెంపకందారుల ద్వారా పటిష్టం చేస్తారు. ప్రధానమంత్రి సంపద యోజనకు కేటాయింపులను రూ.1,500 కోట్ల నుంచి 2,500 కోట్లకు పెంచారు. » కోస్తా, కొండ ప్రాంతాల్లో అధిక వ్యయమయ్యే పంటలైన కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ సాగుకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు. » పేద, సన్నకారు రైతులకు వస్తున్న ఆదాయంలో దాదాపు 16 శాతం పశుసంపద నుంచి వస్తోందంటూ.. 20,000 కంటే ఎక్కువ పశువైద్య నిపుణుల లభ్యతను పెంచడానికి రుణ–సంబంధిత మూలధన సబ్సిడీ పథకాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ పథకం ప్రైవేట్ రంగంలో వెటర్నరీ, పారావెట్ (పారా–వెటర్నరీ) కళాశాలలు, వెటర్నరీ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, బ్రీడింగ్ సౌకర్యాల స్థాపనకు తోడ్పడుతుంది. » గత బడ్జెట్లో ప్రకటించిన కాటన్ టెక్నాలజీ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ హైబ్రిడ్ సీడ్స్కు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ పథకాలు ఇంకా ప్రారంభంకాలేదు. చరిత్రాత్మక బడ్జెట్..అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేసే చరిత్రాత్మక బడ్జెట్ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. ఇది రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. – వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్మ్యాచ్ సమ్మరీఈ ఇన్నింగ్స్లో వ్యవసాయ రంగానిది విచిత్రమైన పరిస్థితి. బంతి నేరుగా వ్యయసాయ రంగం చేతిలోకి వచ్చింది. కానీ కీపర్ చేతిలోకి రాకుండానే జారిపోయింది. అంటే... అన్నీ ఉన్నా కొంచెం ఫోకస్ మాత్రం మిస్సయింది. కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. పెద్ద షాట్లు వస్తాయని ఆశించిన చోట బంతి జారిపోయింది. అటు బ్యాట్స్మన్కూ అందలేదు. ఇటు కీపర్కూ దొరకలేదు. సాగు, అనుబంధ రంగాల కేటాయింపుల్లో స్కోర్బోర్డు ముందుకు కదిలినట్టే కనిపించినా, ఫీల్డ్లో మాత్రం ఫోకస్ తప్పిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఏఐ టూల్స్, పథకాలు ప్రకటించినా రైతులు ఎదురుచూస్తున్న అంశాలకు మాత్రం చోటు దొరకలేదు. వికెట్ పడలేదు. కానీ ఫోకస్ లేక వ్యవసాయానికి అవకాశం మిస్ అయింది. డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులుకేంద్ర ప్రభుత్వం అంచనా న్యూఢిల్లీ: డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల(రూ.18.33 లక్షల కోట్లు) పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం అణు ఇంధనంపై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 90 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కార్యరూపం దాలుస్తున్నాయని వివరించారు. భారత్లో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాలో డేటా సెంటర్లు సహా ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడతామని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిజిటల్ కనెక్షన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. డేటా సెంటర్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 2047 దాకా ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపాదిత ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో చిప్ల తయారీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితులపై కరుణ17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం రద్దుఅత్యాధునిక చికిత్సలు మరింత మందికి చేరువ సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు కేంద్రం భారీ ఆర్థిక ఊరట ఇచ్చింది. క్యాన్సర్ చికిత్సల్లో వినియోగించే 17 రకాల ప్రాణాధార ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ ఆధునిక ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. టార్గెట్, ఇమ్యునోథెరపీ లాంటి ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ మందులపై సాధారణంగా 10% కస్టమ్స్ సుంకం ఉంటుంది. తాజాగా దీన్ని మినహాయించనుండటంతో బాధి తులకు ఊరట లభించనుంది. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను మాత్రమే వెతికి పట్టుకుని నాశనం చేసే టార్గెటెడ్ థెరపీ, రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసి క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యునోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండటమే దీనికి కారణం. ఇక 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకునే ఔషధాలను కూడా సుంకాల మినహాయింపు జాబితాలో చేర్చారు. -
హెల్త్ 'హబ్'
న్యూఢిల్లీ : ఆరోగ్య రంగంలో సదుపాయాలను విస్తరించడం, వైద్య విద్య, ఫార్మా రంగాలకు ప్రోత్సాహం, హెల్త్కేర్లో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడం లక్ష్యంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పది శాతం పెంపుతో రూ.1,06,530.42 కోట్లను ఆరోగ్యశాఖకు కేటాయించారు. ఆధునిక చికిత్సలతో బయో ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ‘బయో ఫార్మా శక్తి’ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేయనున్నారు. దేశం బయో ఫార్మా తయారీ హబ్గా ఎదిగి దిగుమతులపై ఆధార పడాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. కొత్తగా మూడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న 7 నైపర్లను ఆధునీకరిస్తారు. వెయ్యి అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు రూ.4,000 కోట్లు కేటాయించారు. నేషనల్ ఎయిడ్స్, లైంగిక సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి రూ.3,477 కోట్లు వ్యయం చేయనున్నారు. రాంచి, తేజ్పూర్లోని మానసిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేయడంతోపాటు ఉత్తరాదిలో ‘నిమ్హాన్స్’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య రంగంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు రూ.350 కోట్లు కేటాయించారు. ప్రమాదాల సమయంలో వేగంగా అత్యవసర వైద్య సదుపాయాలు అందేలా ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య, వైద్య విద్య రంగంలో సిబ్బంది, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, వైద్య విద్య సీట్ల అప్గ్రెడేషన్, నర్సింగ్ విద్య తదితరాల కోసం రూ.1,725 కోట్లు కేటాయించారు. దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా, జీవన శైలి జబ్బుల చికిత్స భారం, నైపుణ్యం కలిగిన హెల్త్కేర్ నిపుణులకు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని హెల్త్కేర్ ప్రొఫెషనల్ విద్య విస్తరణ, బలోపేతం కోసం మూడేళ్లలో రూ.980 కోట్లు వ్యయం చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. దీని ద్వారా 10 కీలక విభాగాల్లో హెల్త్ ప్రొఫెషనల్ అనుబంధ ఇన్స్టిట్యూట్లను నెలకొల్పి ఐదేళ్లలో లక్ష మంది నిపుణులైన ప్రొఫెషనల్స్ను సిద్ధం చేస్తారు. వృద్ధుల జనాభాకు అనుగుణంగా 1.5 లక్షల మంది కేర్ టేకర్స్ను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. దేశంలో ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆయుష్, ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆస్పత్రులు, అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, పునరావాసం, వైద్య విద్య , పరిశోధన సౌకర్యాలతో ఇవి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రాలు 3 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ప్రధాని స్వాస్థ సురక్ష యోజన రూ.11,307 కోట్లు ఎన్హెచ్ఎం రూ.39,390 కోట్లు పీఎం –జేఏవై రూ.9,500 కోట్లు పీఎం – ఏబీహెచ్ఐఎం రూ.4770 కోట్లు ఢిల్లీ ఎయిమ్స్ రూ.5500.92 కోట్లు సీజీహెచ్ఎస్ పెన్షనర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ పథకానికి రూ.8697.86 కోట్లు కేంద్ర ఆస్పత్రులకు రూ.4599.66 కోట్లు హెల్త్ రీసెర్చ్ విభాగానికి రూ.4,821.21 కోట్లు (డీహెచ్ఆర్) సురక్షితమైన రక్త మార్పిడి సేవలకు రూ.275 కోట్లు -
విలేజ్.. విన్నర్
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలాంటి గ్రామీణ భారతావనిపై మరింత దృష్టి సారించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం కీలక ఫ్లాగ్షిప్ పథకాలకు తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించింది. గత ఉపాధి హామీ పథకం స్థానంలో మరింత పటిష్టమైన వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రాష్ట్రాలను భాగస్వామ్యం చేసే ఈ కొత్త పథకానికి మునుపెన్నడూ లేని రీతిలో కేటాయింపులు చేయడం విశేషం. మొత్తంమీద గ్రామీణాభివృద్ధికి 2026–27 బడ్జెట్లో రూ.1,94,369 కోట్లు దక్కాయి. పాత ఉపాధి హామీ పథకానికి రూ.30,000 కోట్లు, వ్యవసాయ మౌలికసదుపాయాలు, అభివృద్ధి ఫండ్కు రూ.4,400 కోట్లను కలుపుకుంటే 21 శాతం మేర నిధులు ఎగబాకినట్లు లెక్క!గ్రామీణ ప్రజలకు పక్కాగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచి్చంది. దీనికి వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ).. సంక్షిప్తంగా వీబీ–జీ రామ్ జీ అని పేరు పెట్టారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఇకపై ఏటా 125 రోజుల పాటు (పాత చట్టంలో 100 రోజులు) ఉపాధి హామీ దక్కుతుంది. కీలక వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను నివారించేందుకు 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. దీని కింద ప్రధానంగా జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధిని కల్పించే పనులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులను చేపడతారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, మెరుగైన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ గవర్నెన్స్ పెంపొందించడం, పల్లెవాసుల్లో ఆర్థిక సాధికారతను పెంచడం కొత్త చట్టం ప్రధానోద్దేశమని మోదీ ప్రభుత్వం చెబుతోంది. పాత ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు 100 శాతం, మెటీరియల్ ఖర్చులో 75 శాతం కేంద్రమే భరించేది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న జీ–రామ్–జీ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు ఉపాధి వ్యయాన్ని 60:40 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది. తాజా బడ్జెట్ కేటాయింపులకు రాష్ట్రాల వాటా తోడైతే జీ–రామ్–జీ కోసం ఏకంగా రూ.1.51 లక్షల కోట్లు దక్కుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ‘చరిత్రాత్మకం, అపూర్వమైనది’గా ఆయన అభివర్ణించారు. కాగా, ముగిసిపోతున్న పాత పథకం కింద చేపట్టిన పనుల కోసం అదనంగా ఈ బడ్జెట్లో మరో రూ.30,000 కోట్లను కేటాయించడం ద్వారా ఉపాధి కల్పనకు గట్టిగానే నిధుల హామీ లభించింది.‘వికసిత్ భారత్ జీ–రామ్–జీ’తో ఉపాధికి మరింత గ్యారంటీ... 2026–27 కేటాయింపులు:రూ.95,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.86,000 కోట్లు (సవరించిన అంచనా రూ.88,000 కోట్లు)జోరుగా ఇళ్ల నిర్మాణం (పీఎంఏవై)గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లోనూ కేంద్రం నిధులను భారీగా కేటాయించింది. పీఎంఏవై 2.0 స్కీమ్ కింద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.18,625 కోట్లు దక్కాయి. గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబి్ధదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 2026–27లో రూ.3,000 కోట్లు జమ చేయనున్నారు. కాగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు 2026–27లో 6.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 30.75 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,917 కోట్ల నిధులు అందనున్నాయి. గ్రామాల్లో 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026–27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలనేది బడ్జెట్ అంచనా.2026–27 కేటాయింపులు: రూ.73,542 కోట్లు2025–26 కేటాయింపులు:రూ.74,626 కోట్లు(సవరించిన అంచనా రూ.40,000 కోట్లు)మ్యాచ్ సమ్మరీఈ బడ్జెట్ మ్యాచ్లో గ్రామీణ భారతం క్రీజ్లో నిలబడి గెలిచింది. ఉపాధి, ఇళ్లు, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీతో పల్లెల ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఫ్లాగ్షిప్ పథకాలకు దండిగా నిధులు రావడంతో గ్రామీణ అభివృద్ధి స్ట్రైట్ బ్యాట్తో ఆడిన క్లియర్ విన్నర్గా మారింది. ఉపాధి హామీకి కొత్త రూపు, ఇళ్ల నిర్మాణానికి వేగం, గ్రామ రహదారులకు దిశ, ఇంటింటికీ నీరు, నెట్కి హైస్పీడ్తో గ్రామాలు ఈ బడ్జెట్లో చేతులెత్తి విజయాన్ని ప్రకటించాయి. ఇది వికసిత్ భారత్ లక్ష్యం దిశగా గ్రామీణ భారతం సమయం చూసుకుని కొట్టిన మ్యాచ్– విన్నింగ్ షాట్.రహదారులు.. రయ్ రయ్ (పీఎంజీఎస్వై) 2026–27 కేటాయింపులు:రూ.19,000 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.19,000 కోట్లు(సవరించిన అంచనా రూ.11,000 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణం, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అమలవుతున్న ఫ్లాగ్ షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన – పీఎంజీఎస్వై) ఇది. తాజా బడ్జెట్లోనూ మోదీ సర్కారు ఈ పథకంపై మరింత ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ స్కీమ్ నాలుగో దశ అమలవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 26,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్ల నిర్మాణం లక్ష్యం. పర్యావరణ అనుకూల సాంకేతికతతో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 4,200 గ్రామీణ ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానించాలని కేంద్రం సంకల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్ నాటికి 7,87,809 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు అంచనా.స్వచ్ఛ భారత్.. రెండో దశ 2014లో ఆరంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) స్టేటస్ సాకారమైంది. దీన్ని కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ కోసం ఇప్పుడు రెండో దశ అమలవుతోంది. 2026–27లో 48,096 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణ పరిధిలోకి తీసుకురానున్నారు. 36,119 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. 1,352 బ్లాక్లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. 1,50,000 గ్రామాల్లో సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2026–27లో 50,000 వ్యక్తిగత టాయిలెట్లు, 5,000 కమ్యూనిటీ టాయిలెట్లు, 10,000 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నారు. 2026–27 కేటాయింపులు:రూ.9,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.12,192 కోట్లు (సవరించిన అంచనా రూ.8,000 కోట్లు)ఇంటింటికీ తాగునీరు (జల్జీవన్ మిషన్) జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం ద్వారా దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది లక్ష్యం. దీన్ని సాకారం చేసేందుకు పథకాన్ని 2028 వరకు పొడిగించారు. తదనుగుణంగానే తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2026–27లో 1,70,000 గ్రామ పంచాయితీల్లో హర్ఘర్ జల్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. 80 శాతం గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనేది తాజా బడ్జెట్ లక్ష్యం.2026–27 కేటాయింపులు:రూ.67,670 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.67,000 కోట్లు (సవరించిన అంచనా రూ.17,000 కోట్లు)భారత్ నెట్.. హైస్పీడ్దేశంలో గ్రామ పంచాయతీలన్నింటినీ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. ఇప్పటిదాకా 2,24,323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 7,72,676 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) వేశారు. 2025–26లో 10,000 జీపీలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించారు. 80,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ నెట్వర్క్ వేశారు. 2026–27లో 42,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం లభించనుంది. 1,60,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ వేయనున్నారు. 20,50,00 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.2026–27 కేటాయింపులు: రూ.24,000 కోట్లు2025–26 కేటాయింపులు: రూ.22,000 కోట్లు (సవరించిన అంచనా రూ.5,500 కోట్లు)ఇక చాంపియన్లుగా ఎంఎస్ఎంఈలుబడ్జెట్లో రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) చాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చు కోవడానికి సంస్కరణల ఎక్స్ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూడు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు చాంపియన్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి 2021లో ఏర్పాటుచేసిన ‘స్వయం సమృద్ధ భారత్ నిధి’కి రూ.2,000 కోట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రూ.7 లక్షల కోట్లకుపైగా విలువైన టీఆర్ఈడీఎస్లను ఎంఎస్ఎంఈలు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఆయా కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టీడీఎస్ను సులభతరం చేయడంతో ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందన్నారు. -
నిధుల సిక్సర్
న్యూఢిల్లీ : పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రతిపాదించింది. అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా కొత్త ఆయుధాలు, ఎయిర్క్రాఫ్ట్లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. ‘ఆపరేషన్ సిందూర్’చరిత్రాత్మక విజయం నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే తమ దృఢ సంకల్పానికి మూలధన సేకరణ సహా రక్షణ రంగ బడ్జెట్ పెంపు మరింత ఊతం ఇచి్చందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.5,53,668 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు రూ.1.80 లక్షల కోట్లతో పోల్చుకుంటే మూలధన వ్యయం రూ.39 వేల కోట్లు పెంచింది. అయితే 2025–26 సంవత్సరానికి సవరించిన మూలధన వ్యయాన్ని రూ.1,86,454 కోట్లుగా అంచనా వేశారు. తాజా మూలధన వ్యయంలో యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ.53,733 కోట్లు, నౌకాదళం కోసం రూ.25,023 కోట్లు కేటాయించారు. రూ.1,71,338 కోట్ల పింఛన్లతో కలిపి రెవెన్యూ వ్యయాన్ని రూ.5,53,668 కోట్లుగా చూపించారు. కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పౌర, శిక్షణ విమానాల తయారీకి అవసరమైన కాంపొనెంట్లు, విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగ పరిశ్రమలకు.. విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాలింగ్కు అవసరమైన విడిభాగాలపై బీసీడీ రద్దును ప్రతిపాదించారు. రక్షణ రంగ వైమానిక పరిశ్రమకు ఈ రెండు నిర్ణయాలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునికయుద్ధరీతులపై కేంద్రందృష్టి పెట్టింది.మాజీ సైనికుల సీహెచ్ఎస్కు రూ.12,100కోట్లు మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (సీహెచ్ఎస్) కోసం రూ.12,100 కోట్లు ప్రతిపాదించామని రాజ్నాథ్ చెప్పారు. భద్రత, అభివృద్ధి, స్వయం సమృద్ధి మధ్య సమతూకాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని అన్నారు. 2026–27 నాటికి అంచనా వేస్తున్న జీడీపీలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 2 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిలటరీ ఆధునీకరణతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, వనరుల సముచిత వినియోగానికి వీలుగా క్రమబద్ధమైన సేకరణపై రక్షణ బడ్జెట్ దృష్టి పెడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా సాయుధ దళాల బడ్జెట్పై దేశ రక్షణ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ఆధునీకరణ, బలోపేతానికి దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని రక్షణ బడ్జెట్ ప్రస్ఫుటం చేసిందని థాలేస్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ కనగ్లేకర్ అన్నారు. త్రివిధ దళాల ఆధునీకరణే లక్ష్యం: రక్షణ మంత్రి త్రివిధ దళాల ఆధునీకరణే ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశమనిరాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.85 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది సుమారు 24 శాతం అధికమని పేర్కొన్నారు. ఈ పెంపుదలతో దేశ మిలటరీ సామర్థ్యం మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రాధాన్యత ఇచి్చనట్లు తెలిపారు. మ్యాచ్ సమ్మరీమిగతా విషయాల్లో ఎంత ‘డిఫెన్స్’ ఆడినా... డిఫెన్స్ రంగం విషయానికి వచ్చేసరికి నో డిఫెన్స్. ఎందుకంటే భద్రతపై రాజీ ఉండకూడదన్నది ప్రభుత్వ పాలసీ. అందుకే... రక్షణ రంగం సేఫ్ ప్లేను వదిలి నిధుల సిక్సర్ కొట్టింది. రూ.7.84 లక్షల కోట్ల రికార్డు కేటాయింపుతో కేంద్రం బంతిని నేరుగా బౌండరీ దాటించింది. చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కొట్టిన ఈ షాట్ కేవలం స్కోర్ పెంచడానికి కాదు, మ్యాచ్ను కంట్రోల్లోకి తీసుకురావడానికి. మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆధునిక మిలటరీ హార్డ్వేర్తో దేశ రక్షణ విషయంలో ఎంత హిట్టింగ్కైనా సిద్ధమని మోదీ సర్కారు స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్ సిందూర్’ తర్వాత సన్నద్ధతకు మరింత పదునుపెట్టిన ఈ బడ్జెట్... డిఫెన్స్లో కాదు, అగ్రెసివ్ ఫీల్డ్ సెటప్తో ఆడుతున్న స్పష్టమైన సంకేతం. -
వికసిత్ భారత్కు రోడ్మ్యాప్
‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందడం లేదు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని కోరుకుంటున్నారు. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, అధిక వృద్ధిని సాధించడమే ధ్యేయంగా బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఇది భారతీయుల సమ్మిళిత సంకల్పం. విశ్వసనీయ ప్రజాస్వామ్య భాగస్వామిగా, విశ్వసనీయ నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాదారుగా భారత్ పాత్ర మరింత విస్తరిస్తుంది.యువతకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్ను రూపొందించారు. ఈ చరిత్రాత్మక బడ్జెట్ యువత ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మహిళల సాధికార స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. గ్రామాల సంక్షేమం, పేదలు, రైతుల అభివృద్ధి కోసం చక్కటి బడ్జెట్ను తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి నా అభినందనలు. వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉంది. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారి. వికసిత్ భారత్–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్ప్రెస్కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం.మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి రోడ్మ్యాప్గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలతో ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా మన ప్రయాణం వేగవంతమవుతుంది. ఏ దేశానికైనా ప్రజలే అతిపెద్ద బలం. అందుకే ప్రజల్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు పెంచడానికి కృషి చేస్తున్నాం. యువశక్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తాజా బడ్జెట్తో వేర్వేరు కీలక రంగాల్లో నాయకులు, నూతన ఆవిష్కరణలు తయారు కాబోతున్నారు. క్రీడా రంగంలో యువతకు నూతన అవకాశాలు దక్కబోతు న్నాయి.మన దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పన్ను మినహా యింపులు ప్రకటించాం. దేశంలో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల సారథ్యంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు దక్కుతుంది. ప్రతి జిల్లాలో బాలికల కోసం కొత్త హాస్టళ్లు రాబోతున్నాయి. దాంతో వారి విద్యాభ్యాసం మరింత మెరుగవుతుంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమలు ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలే. కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం రైతులకు బడ్జెట్లో ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించాం’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -
విమర్శలకు దీటైన జవాబు
న్యూఢిల్లీ: రైతులు, యువత, తయారీ దారులు, కుటుంబాల వ్యథలను పట్టించుకోకుండా బడ్జెట్ను తయారుచేశారని విపక్ష నేత రాహుల్గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మల మీడియా భేటీలో తిప్పికొట్టారు. ‘‘ రాహుల్గాంధీ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, ప్రతికూల పరిస్థితుల ప్రభావం మన రంగాల మీదా పడుతోంది. అందుకే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలు వస్త్ర, తోలు పరిశ్రమల దాకా అన్నింట్లోనూ కొత్త పథకాలు తీసుకొచ్చాం. రైతులు, మహిళా వ్యవస్థాపకుల దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేశాం. ఇవన్నీ చూశాక కూడా మీరు(రాహుల్) రాజకీయంగా విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం.కానీ మీరు ఏ అంశాల మీదయితే విమర్శించాలనుకుంటున్నారో అవన్నీ నాకు చెప్తే నేను సావధానంగా వింటా. అందుకు తగ్గట్లు బదులిస్తా’’ అని నిర్మల అన్నారు. ‘‘ గత 12 ఏళ్లుగా భారతీయ ఆర్థికపథం స్థిరంగా ముందుకు సాగుతోంది. స్థిర అభివృద్ధిని సాధిస్తోంది. ద్రవ్యోల్బణం మధ్యస్తంగా ఉంది. అత్యధిక అనిశ్చితి, అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలకు జై కొట్టాం. ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించాం. ఆత్మనిర్భరతను మదిలో నిలుపుకుని దేశీయ తయారీరంగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేశాం. ఇంధన భద్రతకు పట్టంకట్టాం. దిగుమతులపై ఆధారపడే తత్వం నుంచి కాస్తంత దూరం జరిగాం’’ అని ఆమె అన్నారు. డెరివేటివ్ మార్కెట్లో ఎస్టీటీ పన్ను పెంపుఅత్యాశకు పోయి పెట్టుబడులను పోగొట్టుకొనే మదుపరులను అప్రమత్తంచేసే లక్ష్యంతో డెరివేటివ్ మార్కెట్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను(ఎస్టీటీ)ని కాస్తంత పెంచామని నిర్మల చెప్పారు. తాజా బడ్జెట్లో ఎస్టీటీని ప్రస్తుతమున్న 0.02 నుంచి 0.05 శాతానికి పెంచారు. ‘‘ నేనేం డెరివేటివ్ ట్రేడింగ్కు వ్యతిరేకం కాదు. చిన్న మదుపరులు పెట్టుబడులను నష్టపోవద్దనే సదుద్దేశంతోనే ఎఫ్ అండ్ ఓ మార్కెట్లో పన్నులను పెంచాం’’ అని నిర్మల పేర్కొన్నారు. -
వికసిత్ భారత్.. పెట్టుబడిదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: సామాన్యుడికి కొంత మోదం.. స్టాక్ మార్కెట్లకు, మదుపర్లకు ఖేదం.. స్టార్టప్లకు కాస్త నిరాశ.. పన్ను చెల్లింపుదారులకు అసంతృప్తి.. విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తయారీరంగం వారికి ఊరట.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బడ్జెట్ క్రికెట్ మ్యాచ్ చూశాక.. వివిధ వర్గాల అనుభూతులివి. 2026–27 సంవత్సరానికిగానూ రూ.53.47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను నిర్మల ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ, ప్రజాకర్షక హామీలకు దూరంగా బడ్జెట్ను రూపొందించారు. విత్త మంత్రి తన బడ్జెట్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు ప్రకటించారు.యువశక్తి బడ్జెట్మాఘ పౌర్ణమి శుభ పర్వదినాన, సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు రవిదాస్ జయంతి రోజున 2026–27 బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు నిర్మల తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ 12 ఏళ్లలో ఆర్థిక రంగానికి స్థిరత్వం వచ్చిందని, సుస్థిరాభివృద్ధి, ద్రవ్య క్రమశిక్షణ సాధ్యమయ్యాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజాకర్షక హామీలకంటే ప్రజల ప్రయోజనాలను నిరంతరం ఎంచుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. దీన్ని ‘యువ శక్తి నడిపిన బడ్జెట్’గా ఆమె అభివర్ణించారు.3 కర్తవ్యాలువిత్తమంత్రి తన ప్రసంగాన్ని మూడు ప్రధాన కర్తవ్యాలతో ప్రారంభించారు. అవి సమ్మిళిత వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందరితో కలసి–అందరి ప్రగతి. జీఎస్టీ సరళీకరణ, లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వంటి 350కిపైగా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మొదటి కర్తవ్యం కింద 6 రంగాల్లో చర్యలు ప్రతిపాదించారు. కీలక రంగాల్లో తయారీని భారీగా పెంచడం, ‘చాంపియన్ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈ)’ తయారుచేయడం, మౌలిక వసతుల రంగానికి ఊపునివ్వడం, ఇంధనరంగంలో సుస్థిరాభివృద్ధి – దీర్ఘకాలిక భద్రతకు చర్యలు, పట్టణ ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. కస్టమ్స్ పన్నుల్లో సరళీకరణ2026–27 బడ్జెట్లో కస్టమ్స్ విధానాన్ని సరళీకరించారు. అనవసర మినహాయింపులను తగ్గించారు. 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేశారు. ప్రయాణికుల బ్యాగేజ్ నిబంధనలను సడలించి, వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి తగ్గించారు. ‘ఇంద్రధనుస్సు’ తయారీఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, టెక్స్టైల్స్, క్రీడా పరికరాలు వంటి ఏడు రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగాల సృష్టి, సాంకేతికత ఆధారిత అభివృద్ధిపై దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పర్యాటకం – చిరు వ్యాపారాలుహిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్లలో పర్యావరణ హిత పర్వత మార్గాల అభివృద్ధికి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 పురావస్తు కేంద్రాల అభివృద్ధికి కూడా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. డేటా సెంటర్లు, స్టాక్ మార్కెట్మనదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటుచేసే సంస్థలకు నిర్మలమ్మ పెద్ద శుభవార్తే చెప్పారు. భారతదేశం నుంచి గ్లోబల్ డేటా సెంటర్ సేవలు అందించే సంస్థలకు ఏకంగా 20 ఏళ్ల పాటు.. అంటే 2047 వరకు పన్ను మినహాయింపు ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధించారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచుతున్నట్టు ప్రకటించారు. విదేశీ టూర్లు – విదేశీ విద్యవిదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ను 2 శాతానికి తగ్గించారు. విదేశీ విద్య, వైద్య ఖర్చులపై కూడా టీసీఎస్ తగ్గింపు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. విద్యార్థులు, యువ ఉద్యోగులు, టెక్ ఉద్యోగులు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎన్నారైలు వంటి చిన్న పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, 6 నెలల పాటు అమల్లో ఉండే విదేశీ ఆస్తుల వెల్లడింపు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్తఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు, విదేశాల నుంచి మరింత మూలధనాన్ని ఆకర్షించేందుకు నిర్మల మూడు కీలక అంశాలు ప్రకటించారు. కార్పొరేట్ బాండ్లకు మార్కెట్ – మేకింగ్ ఫ్రేమ్వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి వినూత్న మార్గం, లిస్టెడ్ కంపెనీల్లో అలాంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులు పెంచడం వంటి నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యంగా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (పీఐఎస్) ద్వారా ఎన్ఆర్ఐలు ఇప్పుడు భారతీయ స్టాక్స్లో పెట్టుబడి పెట్టొచ్చు. మౌలిక వసతులుమౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా, తూర్పున పశ్చిమ బెంగాల్లోని డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కలిపే ప్రత్యేక సరకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను ప్రారంభిస్తారు. తీర ప్రాంత సరుకు రవాణాను ప్రోత్సహించే పథకాన్ని కూడా అమలు చేస్తారు. సీప్లేన్ ల తయారీ దేశీయంగా జరిగేలా ప్రోత్సాహకాలు ఇస్తారు.క్లీన్ ఎనర్జీస్వచ్ఛ ఇంధన రంగంలో భాగంగా, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగించే కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ సాంకేతికతల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20,000 కోట్ల వ్యయం ప్రకటించారు. పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు, నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ‘వృద్ధి అనుసంధానాలుగా’ అభివృద్ధి చేయనున్నారు. లిథియం–అయాన్ బ్యాటరీలు, అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన దిగుమతులపై కూడా డ్యూటీ మినహాయింపు కొనసాగుతుందని ప్రకటించారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటుచేయనున్నారు.దివ్యాంగులకు వరాలుదివ్యాంగులకు చేయూతకోసం ‘దివ్యాంగజన్ కౌశల్ యోజన’, ‘దివ్యాంగ్ సహకార యోజన’ వంటి పథకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యావరణ ప్రజా రవాణా ప్రోత్సహించేందుకు 4వేల విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇంకా, 7 అరుదైన వ్యాధులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలను వ్యక్తిగత వినియోగం కోసం డ్యూటీ లేకుండా దిగుమతికి అనుమతి ఇచ్చారు.ప్రపంచ స్థాయికి ఉత్పాదక రంగందేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మల అనేక పథకాలు ప్రకటించారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’, ఫార్మా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.10వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల విడి భాగాల తయారీ ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం, గ్లోబల్ సప్లై చైన్లో భారత్ వాటా పెంచేందుకు రూ.10వేల కోట్లతో కంటైనర్ తయారీ పథకం ప్రకటించారు. సాగు – బ్యాంకింగ్ – క్రీడలువ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం వంటి చర్యలు ప్రకటించారు. బ్యాంకింగ్ రంగం మీద అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే పదేళ్లలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఖేలో ఇండియా మిషన్కు శ్రీకారం చుడుతున్నట్టు నిర్మల తెలిపారు. -
కంచి పట్టుచీరలో హుందాగా..
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్పైనే కాకుండా.. ఆమె ధరించే చీరలు కూడా ఏటా ఆసక్తికి కేంద్రంగా మారుతుంటాయి. నిర్మల వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ప్రత్యేకమైన చీరలో కనిపించారు. తమిళనాడులో సంప్రదాయ కుటుంబంలో జన్మించి, తెలుగింటికి కోడలిగా వచ్చిన నిర్మలా సీతారామన్ దక్షిణ భారత సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించే వస్త్రాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు.ఈసారి బడ్జెట్ సందర్భంగా మెజెంటా రంగు కంచి పట్టుచీర ధరించారు. బంగారు రంగు గడులు, కాఫీ–ఊదా రంగు బోర్డర్ చీరలో హుందాగా కనిపించారు. పసుపు రంగు, నిండు చేతుల రవిక ధరించారు. తమిళనాడు చేనేత కార్మికులు మగ్గంపై తయారుచేసే కంచి పట్టుచీరలకు దేశవ్యాప్తంగా పేరుంది. ఈ చీరలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం దాకా చోళ రాజుల హయాంలో కంచి చేనేత పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. -
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.33,180 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన నిధుల కేటాయింపులు, పన్నుల వాటా వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాలో స్వల్ప పెరుగుదల కనిపించగా, మౌలిక వసతుల కల్పనలో భాగంగా హైదరాబాద్కు మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రతిపాదించడం గమనార్హం. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా కింద ఈసారి తెలంగాణకు 2.174 శాతం ఖరారైంది.దీని ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.33,180.78 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ పన్ను రూ.9,740.28 కోట్లు, ఆదాయపు పన్ను రూ.11,808.15 కోట్లు, కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.9,074.92 కోట్లు, కస్టమ్స్ సుంకం రూ.1,770.30 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.754.15 కోట్లు, ఇతర ట్యాక్స్లు రూ.32.98 కోట్లు ఉన్నాయి. కాగా గత బడ్జెట్లో కేంద్రం పన్నుల రూపంలో తెలంగాణకు రూ.29,899.77 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి వస్తున్న పన్నుల నిధులు రూ.3,281.01 కోట్లు అధికం. హైదరాబాద్కు మూడు ‘హైస్పీడ్’మార్గాలు దేశవ్యాప్తంగా నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్రం ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లలో మూడు కారిడార్లు హైదరాబాద్ను అనుసంధానించనున్నాయి. ఇది రాష్ట్ర రవాణా రంగానికి ఊతమిచ్చే అంశం. ఈ కారిడార్లలో పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నైలు ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల బదిలీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ‘ఎస్ఎన్ఏ స్పర్‡్ష’మాడ్యూల్ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు.. కేవలం ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అందులో తెలంగాణ చోటు దక్కించుకుంది. జీఎస్టీ పరిహారం లెక్కలు ఇవీ.. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు, గతంలో కేంద్రం ‘బ్యాక్ టు బ్యాక్ లోన్’పద్ధతిలో నిధులు విడుదల చేసింది. దీని కింద తెలంగాణకు 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి మొత్తం రూ.6,949.49 కోట్లు విడుదలైనట్టు తాజా బడ్జెట్ పత్రాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకు కేటాయింపులు ఇవే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజనలో భాగంగా తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ సహా ఇతర ఎయిమ్స్లు అన్నింటికి కలిపి రూ.2,005 కోట్లు కేంద్రం కేటాయించింది. హైదరాబాద్ ఐఐటీ (ఎక్సట్రనల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు)కు నిధుల కేటాయింపులో మొండి చేయి చూపించారు. కాగా తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయింపులు ప్రత్యేకంగా చేయలేదు. సింగరేణికి పెరిగిన నిధుల కేటాయింపు సింగరేణి కేలరీస్ సంస్థకు రూ.2,500 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.405.97 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి గత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించి, రూ.281.07 కోట్లకు సవరించారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో నిధుల కోత విధించి రూ.215 కోట్లు ఏడు నైపర్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.కాగా హైదరాబాద్లోని ఇన్కాయిస్కు రూ.30 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.26 కోట్లు, హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డాక్)కు రూ.280 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.14.55 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు, నిజాం సంస్థాన విలీనం కోసం పోరాడిన యోధులకు (పెన్షన్లు) రూ.589.97 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు కేటాయింపుల్లో కోత విధించి రూ.908.78 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు.అయితే హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కు కేటాయింపుల్లో కోత విధించారు. మూడేళ్ల క్రితం రూ.115 కోట్లు కేటాయించి, రెండేళ్ల క్రితం బడ్జెట్లో కేవలం రూ.10.84 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం....గత బడ్జెట్లో కేవలం నామమాత్రంగా రూ.0.01 కోట్లు కేటాయించింది. కాగా ప్రస్తుత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) సహా దేశంలోని 25 స్వయంప్రతిపత్తి కేంద్రాలన్నింటికీ కలిపి రూ.1,643.87 కోట్లు, సీడీఎఫ్డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయంప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ.1,002.13 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ.1,745.52 కోట్లు కేటాయించారు. -
ఫిబ్రవరిలో ఉక్కపోత!
న్యూఢిల్లీ: ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. అదే సమయంలో, సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయంది. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో కనిపిస్తున్న పొడి వాతావరణం ఈ మార్పులకు కారణమని పేర్కొంది.ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర (Mrutyunjay Mohapatra) శనివారం మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తమ్మీద చూస్తే ఈ ఫిబ్రవరి నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందన్నారు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి మించి ఉంటాయన్నారు.ఉష్ణోగ్రతలు(Temperature) ఎక్కువగా ఉండటం వల్ల పంటల పెరుగుదల వేగం పుంజుకుంటుందన్నారు. గోధుమ, బార్లీ వంటి పంటలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కోతకు వచ్చే అవకాశముందన్నారు. ఫలితంగా, కంకుల్లో గింజలు సరిగా లేక, తాలు గింజల కారణంగా దిగుబడి తగ్గుతుందని వివరించారు. పెరిగిన అంతర్జాతీయ పర్యాటకులుసాక్షి, న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. 2020లో 63.37 లక్షలుగా ఉన్న అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య వరుసగా, 2021లో 70.10 లక్షలు, 2022లో 1.43 కోట్లు, 2023లో 1.88 కోట్లు, 2024లో 2.05 కోట్లుగా ఉందని వివరించింది.విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతాలు, ట్రావెల్ ట్రేడ్ రంగంతో కలిసి పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని వెల్లడించింది. ప్రచార కార్యక్రమాలకు ఐదేళ్లలో రూ.205 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొంది.చదవండి: చెత్త కొండలకు కాలం చెల్లినట్టే!పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. భారత్ను ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. -
నిర్మలా సీతారామన్ బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసలు
ఢిల్లీ: లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 140కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈబడ్జెట్. వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్ధేశనం చేస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర బడ్జెట్ అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధి మధ్య సరైన సమతుల్యతను సాధించిందన్నారు. సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టిన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్. ప్రపంచంలో భారత్ బలమైన స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బడ్జెట్ 2026.. ఇండియా ఏఐ మిషన్ విస్తరణకు చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాలన, పరిశ్రమల అభివృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామన్నారు. ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. పాలన- ప్రజా సేవలు.. ఏఐ అనువర్తనాలు “ఫోర్స్ మల్టిప్లయర్స్”గా పనిచేస్తాయని.. సేవల అందజేతలో సమర్థత పెరుగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆరోగ్యరంగం, వ్యవసాయం, సామాజిక సంక్షేమ పథకాలలో AI వినియోగం ద్వారా లక్ష్యబద్ధత పెరిగి.. లీకేజీలు తగ్గుతాయని అంచనా వేశారు.రంగాల వారీగా AI వినియోగం చూసుకుంటే.. డిజిటల్ పాలన: మోసాల గుర్తింపు, కంప్లయెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం.విద్య: వ్యక్తిగతీకరించిన లెర్నింగ్ ప్లాట్ఫారమ్లుఆరోగ్య రంగం: డయాగ్నస్టిక్స్, టెలీమెడిసిన్ విస్తరణ.వ్యవసాయం: పంట దిగుబడుల అంచనా, వాతావరణ సూచనలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం..ఇండియా AI మిషన్ విస్తరణ.. పరిశ్రమ వర్గాలు ఇండియా AI మిషన్కు కేటాయింపులను రూ.2,000 కోట్ల నుంచి కనీసం రూ.5,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా.. జాతీయ కంప్యూట్ సామర్థ్యం (GPUలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపు), స్టార్టప్లు, పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం అవసరమైన కంప్యూటింగ్ వనరులు (GPUలు, క్లౌడ్ సర్వర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు) తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేలా ప్రభుత్వం లేదా సంస్థలు క్రెడిట్లు/సబ్సిడీలు ఇవ్వడం.. అందుబాటులో ఉండే AI ప్రయోగశాలలు (labs) ఏర్పాటు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వనరులు, సాంకేతికత, శిక్షణ, పరిశోధన అవకాశాలను అందరికీ సమానంగా అందించడం ఉన్నాయి.AI స్టార్టప్లకు ప్రోత్సాహకాలు.. AI స్వీకరణ ఖర్చు తగ్గించేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తక్కువ ఖర్చుతో కంప్యూట్ వనరులు, స్పష్టమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భారత్ను గ్లోబల్ AI అభివృద్ధిలో పోటీదారుగా నిలపాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఏఐని దేశ అభివృద్ధి, పరిశ్రమల పోటీ, ప్రజా సేవల సమర్థత కోసం ప్రధాన సాధనంగా ప్రభుత్వం గుర్తించినట్లు ఈ బడ్జెట్తో అర్థమవుతోంది. -
అంబటిపై హత్యాయత్నం.. కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడి, ఆపై ఆయన్నే అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. గుంటూరులో టీడీపీ గుండాగిరిపై ఆదివారం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసులు రూల్ ఆఫ్ లా ను గాలికి వదిలేశారు. ప్రతిపక్షల నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పై హత్యాయత్నం జరిగింది. రాళ్లు కర్రలతో ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఆస్తులు వాహనాలన్నిటిని ధ్వంసం చేశారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఫలితంగా హింస ఇంకా కొనసాగుతోంది. ఈ వివరాలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్కి ఫిర్యాదు చేశాం. ఏపీలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరాం.. ..ఏపీలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదు. దాడుల్ని నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకొని శాంతిభద్రతలను చక్కదిద్దాలి. పరిస్థితులు మరింత దిగజారకుండా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని లేఖ ద్వారా కేంద్రాన్ని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
ఇక చిన్న నోట్ల ఏటీఎంలు!
సాక్షి, స్పెషల్ డెస్క్: డిజిటల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నా.. ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయుల దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లతో ముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కారంగా రూ.10, రూ.20 నాణేలను విరివిగా ప్రవేశపెట్టినా జనం నుంచి వీటికి స్పందన అంతంతే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఇళ్లకే పరిమితం అవుతున్న నాణేలు! తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావనతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్నేళ్లుగా రూ.10, రూ.20 కాయిన్స్ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్ను తీసుకుంటున్నా అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు. చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. కాగా ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్బీఐని కోరాలని భావిస్తోంది. అలాగే పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే చిన్న నోట్లు, నాణేలను ఇచ్చే హైబ్రిడ్ ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనుంది. పరిశీలనలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరు తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను పంపిణీ చేసే నమూనా యంత్రాలను ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నారు. ఈ ఏటీఎంలకు ఆమోదముద్ర పడితే వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వంటి జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ముంబై శాఖలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరును ఆర్బీఐ పరిశీలించింది. ముంబై పైలట్ ఫలితాలను సమీక్షించడంతో పాటు ఆర్బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ఏటీఎంలను బ్యాంకుల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
బడ్జెట్ క్వీన్ సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను అందించారు. ⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు. ⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు. ⇒ అతితక్కువ బడ్జెట్ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా హీరూభాయ్ ముల్లిజ్భాయ్ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం ముగించారు. ⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది. -
3న తెరుచుకోనున్న అమృత్ ఉద్యాన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ఆవరణలోని అమృత్ ఉద్యాన్ను ప్రజల సందర్శన కోసం మంగళవారం నుంచి తెరవనున్నారు. భీమ్, అర్జున్, మదర్ థెరెస్సా తదితర 145 వెరైటీల గులాబీ లు సహా వేలాది రకాల ఫల, పుష్ప జాతులను ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఉచితంగా బుక్ చేసుకోవచ్చని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రెస్ సెకట్రరీ నవికా గుప్తా శనివారం మీడియాకు వెల్లడించారు. సందర్శన వేళలివే..ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. వారంలో ఆరు రోజులపాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించుకోవచ్చు. అయితే, చిట్టచివరి ఎంట్రీకి సాయంత్రం 5 గంటల వరకే అవకాశం ఉంటుందని గుప్తా వివరించారు. నిర్వహణ సంబంధ పనుల కోసం ప్రతి మంగళవారం ఉద్యాన్ను మూసివేస్తామని, అలాగే హోలి పండుగను పురస్కరించుకుని 4వ తేదీన సందర్శకులను అనుమతించమన్నారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్..ఈ ఏడాది సందర్శకులు ఆన్లైన్లో https:// visit.rashtrapatibhavan.gov.in/. ద్వారా ముందుగానే స్లాట్లను బుక్ చేసుకుకోవాల్సి ఉంటుందని నవికా గుప్తా చెప్పారు. తర్వాతి రోజు సందర్శన కోసం ముందు రోజు ఉద యం 10 గంటల్లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నార్త్ అవెన్యూ, రాష్ట్రపతి భవన్ మధ్యన గల ప్రెసిడెంట్ ఎస్టేట్ 35వ నంబర్ గేటు ద్వారా సందర్శకుల రాకపోకలకు ఏర్పాట్లు చేశామని ఆమె వివరించారు. సందర్శకుల కోసం ప్రతి 30 నిమిషాలకు సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి 35వ నంబర్ గేట్ వరకు షటిల్ బస్సు సౌకర్యం ఉందన్నారు. చివరి షటిల్ బస్ సర్వీసు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని చెప్పారు.ఏమేం చూడొచ్చునంటే..బాల వాటిక, ప్లుమెరియా గార్డెన్, బన్యన్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, బాబ్లింగ్ బుక్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్లను సందర్శించుకునేందుకు అవకాశ ముంది. వందలాది రకాల గులాబీలతో పాటు తులిప్లను చూడొచ్చని నవికా గుప్తా అన్నారు. సందర్శకులు ఇక్కడ గలగల పారే సెలయేరు(బాబ్లింగ్ బ్రూక్)ను, అందంగా తీర్చిదిద్దిన బన్యన్ గార్డెన్లో పాదాల ఒత్తిడి చికిత్సకు అనువైన నడక దారులు (రిఫ్లెక్సా లజీ పాథ్స్)ను కూడా చూడొచ్చని ఆమె వివరించారు. ఈ ఏడాది అమృత్ ఉద్యాన్ కోసం 85 పుష్ప జాతులను ఎంపిక చేశామని ఉద్యాన్ ఇన్ఛార్జి అవనీశ్ బన్సల్ తెలిపారు. అమృత్ ఉద్యాన్తోపాటు రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ మ్యూజియంలను వారంలో ఆరు రోజులపాటు మంగళవార నుంచి ఆదివారం వరకు చూడొచ్చు. అదేవిధంగా, ప్రతి శనివారం జరిగే ఛేంజ్ ఆఫ్ గార్డ్ వేడుకను కూడా తిలకించే అవకాశముంది.వీటిని వెంట ఉంచుకోవచ్చుసందర్శకులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ తాళం చెవులు, పర్సులు, హ్యాండ్బ్యాగులు, వాటర్ బాటిళ్లు, శిశువుల కోసం పాల బాటిళ్లను వెంట తెచ్చుకోవచ్చని చెప్పారు. ఉద్యాన్ లోపల వివిధ పాయింట్లలో తాగు నీరు, టాయిలెట్లు, ప్రాథమిక చికిత్స సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. అదేవిధంగా, రక్షణ శాఖ సిబ్బంది కోసం మార్చి 3న, సీనియర్ సిటిజన్ల కోసం మార్చి 5న, మహిళలు, గిరిజన స్వయం సహాయక బృందాల మహిళల కోసం మార్చి 10న, దివ్యాంగుల కోసం మార్చి 13వ తేదీన సందర్శనలకు ప్రత్యేకించామన్నారు. -
సవాళ్లపై సవారీ!
అమెరికా టారిఫ్లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం ఓవైపు.. జీడీపీ వృద్ధి మందగమనం, ప్రపంచ దేశాల్లో అనిశి్చతితో రూపాయి పతనం, భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు, ఉపాధిని మింగేస్తున్న ఏఐ ద్వారా ఎదురవుతున్న సవాళ్లు మరోవైపు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మరికొన్ని గంటల్లో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. నేటి బడ్జెట్ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, యువతకు ఉత్సాహాన్ని కలిగించేలా, మౌలిక రంగాలను మెరిపించేలా గేమ్ చేంజింగ్ విధానాలతో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్లో నజరానాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తయారీ నుంచి మౌలిక సదుపాయాల వరకు.. ఉద్యోగ సృష్టి నుంచి గ్రామీణాభివృద్ధి వరకు.. పునరుత్పాదక శక్తి నుంచి డిజిటల్ ఆవిష్కరణల వరకు.. దేశ ఆర్థిక ఇంజన్ను నడిపించే అనేక వ్యూహాత్మక విధానాలను కేంద్రం ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే వృద్ధి వేగాన్ని కొనసాగించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించే సంస్కరణలను ఈ బడ్జెట్ చేపడుతుందని భావిస్తున్నారు. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి పార్లమెంటులో 2026–27 బడ్జెట్ను ప్రవేపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెడుతుండటం విశేషం. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఐటీ, జీఎస్టీ శ్లాబుల్లో తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులకు తోడు మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటివి ఇప్పటివరకు అమెరికా సుంకాలను తట్టుకోవడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి కేంద్రం సరికొత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. సవాళ్లు ఎన్నో.. ఈసారి కేంద్ర బడ్జెట్ ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల మధ్య వస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిరంగా మారిన కమోడిటీల ధరలు, ప్రధాన బ్యాంకులు అనుసరించిన ద్రవ్య విధానాల వంటి సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థను కమ్ముకున్నాయి. దేశీయంగా ఆర్థిక లోటును తగ్గించుకుంటూనే వినియోగాన్ని పెంచడం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం, మూలధన వ్యయాన్ని పెంచాలన్న ఒత్తిళ్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అయితే పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడం వల్ల కొత్త బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రానికి ఉన్న అవకాశాలను పరిమితం చేసింది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశి్చత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరికొత్త ఆర్థిక వృద్ధి చోదకాన్ని కనుగొనడం నిర్మలా సీతారామన్కు అతిపెద్ద సవాల్ కానుంది. అమెరికాతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీలను విక్రయిస్తుండటం, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కూడా ఆమె ముందున్న మరో కష్టతరమైన లక్ష్యమని ఆర్థికవేత్తలు అంటున్నారు. బడ్జెట్ టీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కొన్ని ఊరటలు..⇒ కేంద్రం ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై వేయకుండా అంతర్గతంగా సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉంది. ⇒ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేర ళ, అస్సాం రాష్ట్రాలకు కొత్త పథకాలను ప్రకటించొచ్చు. ⇒ రైల్వే, పునరుత్పాదక ఇంధన, పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మూలధన వ్యయం పెరగొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ⇒ పన్నుల విషయంలో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. కార్పొరేట్ పన్ను రేట్లు మారకపోవచ్చు. ⇒ ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత లభించనుంది. నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు ఉండవచ్చు. ⇒ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఈవీ రంగాలకు మరింత చేయూత అందించే అవకాశం ఉందని అంచనా. ⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బడ్జెట్ కేటయింపులు పెంచడమో లేదా క్రెడిట్ గ్యారెంటీలు ఇవ్వడమో ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మ బడ్జెట్ పద్దు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ప్రభుత్వ మూలధన వ్యయం రూ. 12 లక్షల కోట్లు దాటొచ్చు. బడ్జెట్ క్వీన్ సీతారామన్దేశ చరిత్రలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రిగా రికార్డుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను అందించారు. ⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు. ⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు. ⇒ అతితక్కువ బడ్జెట్ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా హీరూభాయ్ ముల్లిజ్భాయ్ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం ముగించారు. ⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది. నేరుగా ‘బడ్జెట్’ను వీక్షించనున్న 30 మంది విద్యార్థులుకేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను కళాశాల విద్యార్థులు లోక్సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక అవకాశం కల్పించింది. అలాగే ఆర్థిక శాఖ కార్యకలాపాలపై వారికి అవగాహన కల్పించడంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కళాశాల విద్యార్థులు ఆదివారం బడ్జెట్ను నేరుగా వీక్షిస్తారు. అలాగే ఆర్థిక శాఖ కార్యాలయం ఉన్న కర్తవ్య భవన్–1ను సందర్శించి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ శాఖ కార్యకలాపాలు, విధానాల రూపకల్పన, సంస్థల పాత్ర గురించి తెలుసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆర్థిక మంత్రి ఆయా విద్యార్థులతో ముచ్చటించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యకలాపాలు, ప్రభుత్వ పరిపాలన, ప్రజాస్వామిక ప్రక్రియల గురించి అవగాహన కల్పించడంతోపాటు యువతను అందులో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆర్థిక శాఖ తెలిపింది. -
ఏడు జిల్లాల్లో చొరబాటుదార్లదే మెజార్టీ
గౌహతి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదార్లు విచ్చలవిడిగా ప్రవేశించారని, రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో ప్రతికూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అస్సాం నుంచి చొరబాటుదార్లను బయటకు పంపించి, స్థానికులను రక్షించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. శుక్రవారం అస్సాం రాష్ట్రం ధెమాజీ జిల్లాలో మిసింగ్ తెగ ప్రజల యువజన వేడుక ముగింపు కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దిబ్రూగఢ్లో పర్యటించారు. రూ.1,715 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు.చొరబాటుదార్ల నుంచి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో విముక్తి లభించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఇక్కడ చొరబాటుదార్ల సంఖ్య ఏకంగా 64 లక్షలకు చేరుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడు జిల్లాల్లో వారే మెజార్టీగా ఉన్నారని చెప్పారు. ఈ ధోరణి మారాలంటే బీజేపీని గెలిపించాలని స్పష్టంచేశారు. అస్సాంలో జనాభా స్థితిగతులను పూర్వస్థితికి తీసుకురావాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడం బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి మరింత బలం ఇవ్వాలి ‘‘చొరబాట్లు ఆగాలని ప్రజలు నిజంగా కోరుకుంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు మరింత బలం ఇవ్వాలి. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 1.26 లక్షల ఎకరాల భూములను చొరబాటుదార్ల నుంచి కాపాడింది. మిసింగ్ తెగ ప్రజలు కష్టజీవులు. శ్రమించడం వారి సంస్కృతిలోనే ఉంది. ఎగువ అస్సాంలోకి చొరబాటుదార్లు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది.బ్రహ్మపుత్ర నదిపై బోగిబీల్ వంతెనను నిర్మించింది. దీనివల్ల దిబ్రూగఢ్, ధెమాజీ మధ్య అనుసంధానం పెరిగింది. భారతదేశ ప్రగతికి ఈ వంతెన ఒక ప్రతీకగా నిలుస్తోంది. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. కానీ, బోగిబీల్ వంతెన నిర్మాణం పూర్తిచేయలేదు. నరేంద్ర మోదీ పట్ల రాష్ట్ర ప్రజలు విశ్వాసం కనబర్చారు. అందుకే వంతెన నిర్మాణం నాలుగేళ్లలో విజయవంతంగా పూర్తయ్యింది’’ అన్నారు.రాహుల్ అవమానించడం దారుణం ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అవమానించడం దారుణం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ‘ఎట్హోం’ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేసిన ‘గమోసా’ను ధరించడానికి రాహుల్ నిరాకరించారు. దేశ విదేశీ ప్రముఖులు ఆ కండువాను గౌరవపూర్వకంగా ధరిస్తే రాహుల్ మాత్రం ధరించకుండా అగౌరవపర్చారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని కించపరిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదు. అస్సాం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. తుపాకులు, తూటాలు, ఘర్షణలు, మరణాలు తప్ప అస్సాంకు కాంగ్రెస్ ఇచ్చిందేమిటో చెప్పాలి. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. అందుకోసం చొరబాట్లను ఆయుధంగా ఉపయోగించుకుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాట్లకు అడ్డుకట్ట పడింది. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని గుర్తించి, కచ్చితంగా వెనక్కి పంపిస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది. యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అస్సాం తేయాకు పరిశ్రమకు, కారి్మకులకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ నుంచి యూరప్ దేశాలకు తేయాకు ఎగుమతులు పెరుగుతాయి. అభివృద్ధి, శాంతి, రక్షణ, పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి కావాలంటే మరోసారి బీజేపీకి పట్టం కట్టాలి. చొరబాట్లు, వరదల నుంచి అస్సాంను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు సమానమే‘‘కాంగ్రెస్ పాలనలో గిరిజన తెగలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొన్నారు. సొంత గుర్తింపును కాపాడుకొనేందుకు పోరాడాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారికి భద్రత లభిస్తోంది. పారామిలటరీ దళాల్లో నియామకాల విషయంలో గిరిజన యువతకు ప్రాధాన్యమిస్తాం. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు మరింత గుర్తింపు దక్కాల్సి ఉంది. వేర్వేరు సంస్కృతుల సమ్మేళనం వల్లనే భారతదేశ సంస్కృతి మరింత వికసిస్తుంది. దేశంలో అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలకు సమాన హక్కులున్నాయి. అవన్నీ సమానమే’’ అని అమిత్ షా చెప్పారు. -
రుతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు
న్యూఢిల్లీ: రుతుక్రమ ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని జీవించే హక్కుతో పాటు విద్యా హక్కులో కూడా రుతుక్రమ ఆరోగ్యం భాగమని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బాలికల కోసం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటిలోనూ బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.బాల బాలికలకు, దివ్యాంగులకు విడి టాయ్లెట్లు ఉండాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. వీటిని అమలు చేయని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, సర్కారీ స్కూళ్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సదరు సౌకర్యాలన్నీ అమలవుతున్నదీ లేనిదీ జిల్లా విద్యాధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించింది. నిష్పాక్షిక సర్వేల ద్వారా కూడా వాస్తవ స్థితిగతులను ఎప్పటికప్పుడు వారు తెలుసుకుంటూ ఉండాలని పేర్కొంది.విద్యా హక్కు చట్టంలోని సెక్షన్–19 ప్రకారం అన్ని పాఠశాలలూ ఈ నిబంధనలను, ప్రమాణాలను పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. లింగ సమానత్వం, విద్యాపరమైన సమానత్వాన్ని సాధించడమే లక్ష్యం కావాలని ఈ సందర్భంగా ధర్మాసనం ఆకాంక్షించింది. నెలసరి ఆరోగ్యంపై బాలికలకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలని కోరింది. విద్యా ప్రణాళికలో ఆ అంశాలను కూడా భాగం చేయాలని ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర విద్యా మండళ్లు, సంబంధిత విద్యా విభాగాలకు సూచించింది. విద్యార్థినుల ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా రుతుక్రమ పరిశుభ్రత విధానం అమలు చేయాలంటూ జయా ఠాకూర్ సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. దాని 2024 డిసెంబర్ 10వ తేదీన వాదనలు ముగించిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.సమస్యల లేమి చేదు వాస్తవం ధర్మాసనం తరఫున 126 పేజీల తీర్పును జస్టిస్ పార్ధివాలా రాశారు. రుతుక్రమం బాలికల విద్యకు ముగింపు కారాదన్న ప్రఖ్యాత అమెరికా విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలీసా మెర్టన్ కొటేషన్తో తీర్పును మొదలుపెట్టారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా బాలికల విద్య విషయంలో ఒకప్పటి సవాళ్లే ఇప్పటికీ పెను సమస్యలుగా నిలిచి ఉన్నాయన్నది ఒప్పుకోక తప్పని చేదు నిజమంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమే రుతుక్రమ ఆరోగ్యం.చదువుకోవడానికి ఆటంకంగా నిలిచే ప్రతి అడ్డంకిని తొలగించడమూ విద్యా హక్కులో భాగమే. సౌకర్యాల లేమితో బాలికలు స్కూలుకు వెళ్లలేకపోతే ఇతర ప్రాథమిక హక్కులకూ దూరమవుతారు. బాలికలకు సురక్షితమైన, గౌరవప్రదమైన విద్యా వాతావరణం కల్పించడం రాజ్యాంగ బాధ్యత’’ అని ధర్మాసనం నొక్కిచెప్పింది. ‘‘రుతుక్రమం వల్ల శరీరం అపవిత్రమైందనే భావనతో ఏ బాలికైనా చదువుకు దూరమైతే మేం చెప్పదలచింది ఒక్కటే. అది నీ తప్పు కాదు. సమాచార లోపం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మౌనమే అందుకు కారణం’’ అని పేర్కొంది.విద్యా హక్కుకు తూట్లు సురక్షితమైన, ప్రభావవంతమైన నెలసరి శుభ్రత చర్యలు విద్యార్థినుల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యానికి దోహదపడతాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విద్య, సమాచారాన్ని పొందే హక్కు ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవన హక్కులో విడదీయలేని భాగం. స్కూళ్లలో నెలసరి శుభ్రత నిర్వహణ సదుపాయాలు, సౌకర్యాల లేమి విద్యార్థినుల ఆత్మగౌరవాన్నే దారుణంగా దెబ్బతీస్తుంది. విద్య, సంబంధిత అంశాల్లో ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడే హక్కుకు భంగం కలిగిస్తుంది’’ అని అభిప్రాయపడింది. ‘‘జీవించే హక్కు, ఆత్మ గౌరవం అనే విస్తృత చట్రంలో విద్యా హక్కు భాగం. విద్య అందుబాటులో లేకుండా అవి అసాధ్యం’’ అని పేర్కొంది.స్కూళ్లలో పరిశుభ్రత విభాగంవిద్యార్థినుల నెలసరి శుభ్రత గురించి వెలువరించిన తీర్పులో ధర్మాసనం జారీ చేసిన ముఖ్య ఆదేశాలు... ⇒ నెలసరి ఆరోగ్యంపై బాలికలకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలి. ⇒ ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర విద్యా మండళ్లు, సంబంధిత విద్యా విభాగాలు దీన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలి. ⇒ ఏఎస్టీఎం డి–6954 నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆక్సో–బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ను గ్రామీణ, పట్టణ అనే తారతమ్యాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఉచితంగా అందుబాటులో ఉంచాలి. ⇒ నాప్కిన్లు విద్యార్థినుల టాయిలెట్ల సమీపంలో వెండింగ్ మెషీన్ల ద్వారా లేదా పాఠశాలలోని నిరీ్ణత అధికారి వద్ద అందుబాటులో ఉండేలా చూడాలి. ⇒ నాప్కిన్లను పడేసేందుకు టాయ్లెట్ల పక్కనే మూతతో కూడిన వేస్ట్బిన్ విధిగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచేలా యాజమాన్యాలు శ్రద్ధ వహించాలి. ⇒ బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఉండాలి. అవి చక్కగా పని చేసే స్థితిలో ఉండాలి. ⇒ టాయ్లెట్లలో నిరంతర నీటి వసతితో పాటు సబ్బు, వాష్బేసిన్, ఇతర కనీస సదుపాయాలు అందుబాటులో ఉండాలి.⇒ ప్రతి స్కూలులోనూ నెలసరి పరిశుభ్రత విభాగం ఏర్పాటు చేయాలి. అందులో శానిటరీ ప్యాడ్లతో పాటు లో దుస్తులు, అదనపు యూనిఫాం, డిస్పోజబుల్ బ్యాగులు ఉంచాలి. ⇒ వాడేసిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా, పర్యావరణహితంగా పారవేసే ఏర్పాట్లు ప్రతి స్కూల్లోనూ ఉండాలి. ⇒ వ్యర్థాలను పారవేసే విషయంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలి. ⇒ టాయిలెట్లు విద్యార్థినుల గోప్యతను కాపాడేలా ఉండాలి. ⇒ దివ్యాంగ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విడిగా టాయిలెట్లను నిర్మించాలి ⇒ నెలసరి శుభ్రత, దానికి సంబంధించిన అన్ని అంశాలపైనా ఉపాధ్యాయులందరికీ సమగ్ర శిక్షణ ఇవ్వాలి. నెలసరిలో ఉన్న పిల్లలకు ఎలా సాయపడాలో వారికి పూర్తిగా తెలిసుండాలి. ⇒ జన్ ఔషధీ సువిధా ఆక్సో బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదీ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు రేడియో, టీవీ, సినిమా హాళ్లలో, బస్సులు, ఆటోలపై, గోడలపై ప్రకటనల రూపంలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ⇒ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్లైన్ గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. -
Sunetra Pawar: డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఊహించని విధంగా బుధవారం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది.అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది.ఈ నిర్ణయం వెనుక రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఈ క్రమంలో సునేత్ర పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా అజిత్ పవార్ వర్గానికి మరింత ప్రాధాన్యం లభించనుంది. -
తీహార్ జైల్లో కలకలం.. ఉమర్ ఖలీపై తోటి ఖైదీల దాడి?
ఢిల్లీ: తీహార్ జైల్లో ఉమర్ ఖలీపై తోటి ఖైదీలు దాడికి పాల్పడ్డారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితుడు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్పై తోటి ఖైదీలు మూకుమ్మడి దాడి చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఉమర్ ఖలీపై దాడి జరిగిందంటూ పలు సోషల్ మీడియా పోస్టులు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగా దాడి జరిగిందా? దాడి చేసిన వారు ఎవరు? దాడి చేయడానికి కారణం ఏమిటి? దాడి తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వంటి వివరాలపై స్పష్టత కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే కేసులో ఇదే కేసులో జనవరి 5న సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆరేళ్ల క్రితం దేశ రాజధాని భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు బెయిల్ తిరస్కరించింది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేది లేదని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ వీఎన్ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాములుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్ల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. 11 షరతులు విధించిన కోర్టుఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్పోర్ట్లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్ మార్గ్ పోలీస్స్టేషన్కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్ నంబర్, ఈమెయిల్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.వీళ్లది కీలక పాత్ర..‘‘ ఉమర్ ఖలీద్, ఇమామ్లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్యూ వాట్సాప్ గ్రూప్ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్ఆర్సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్ 13వ తేదీన ఖలీద్ను అరెస్ట్చేశారు.ఈ కేసులో బెయిల్ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గత ఏడాది డిసెంబర్లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన రిజర్వ్చేసి సోమవారం తీర్పును వెలువర్చింది.సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్లు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు. -
పుట్టింటికి వచ్చేయమన్నా వినలేదు
అత్తింట ఆమెకు వేధింపులు ఎదురవుతున్నాయనే విషయం.. మాకు తెలిసే సరికి ఆలస్యమైంది. అతను చెయ్యి చేసుకున్న విషయం తెలిసి పంచాయితీ పెట్టాం. క్షమాపణలు చెప్పి.. ఇంకొసారి కొట్టానంటూ బిడ్డ మీద ఒట్టేశాడు. అయినా వేధించడం ఆపలేదు. కడుపుతో ఉందని చూడకుండా గొడ్డు చాకిరీ చేయించాడు. చనిపోయే ముందు కూడా నా సోదరి తన కష్టం చెప్పుకుంది. పగవాడికి కూడా ఇలాంటి చావు రాకూడదు.. కాజల్ కేసులో ఆమె సోదరుడు నిఖిల్ భావోద్వేగంగా జరిగింది వివరించాడు. అసలేం జరిగింది?.. ఢిల్లీ స్వాట్(Special Weapons and Tactics) కమాండో అయిన కాజల్ చౌద్రి.. జనవరి 22న భర్త అంకుర్ చేతిలో దారుణ హత్యకు గురైంది. అంకుర్ రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్. కాజల్ సోదరుడు నిఖిల్ పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్లో కానిస్టేబుల్. హత్యకు కొన్ని నిమిషాల ముందే ఆమెతో ఫోన్లో మాట్లాడిన నిఖిల్.. సిబ్బందితో హుటాహుటిన అంకుర్ నివాసానికి చేరుకున్నాడు. ఒక పక్క పెద్ద డంబెల్.. మరో పక్క రక్తపు మడుగులో పడి ఉన్న సోదరి.. ఇంకోపక్క అంకుర్, అతని కుటుంబ సభ్యులు నిల్చుని ఉన్నారు.ఆలస్యం చేయకుండా కాజల్ను ఆస్పత్రికి తరలించాడు నిఖిల్. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిందామె. ఆమె మరణించిన కొద్ది గంటలకే అంకుర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడతను. అయితే.. ఈ కేసు వెనుక వరకట్న వేధింపుల కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం కాస్త..అంకుర్, కాజల్ చౌద్రీ పానిపట్లో కాలేజీలో చదివే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో 2023 నవంబర్లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పగింతల సమయంలో అంకుర్ కోరినవన్నీ కాజల్ తల్లిదండ్రులు అప్పగించారు. అయినా కూడా అంకుర్ సంతృప్తి చెందలేదు. కాజల్ ద్వారా తనకు కావాల్సినవన్నీ అత్తింటి నుంచి కానుకల రూపంలో అందుకున్నాడు. ఈ క్రమంలో పిల్లనిచ్చిన మామ దగ్గర విడిగా అప్పు కూడా చేశాడు. ఆపై కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చింది. ఆ తర్వాతే ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా ఓపికగా భరించింది. ఈలోపు కాజల్ మరోసారి గర్భం దాల్చింది. అయినా కూడా భర్త ఆమెతో అన్ని పనులు చేయించేవాడు. ఒకపక్క స్వాట్ డ్యూటీ.. మరోపక్క ఇంటి పనులు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి విషయాలను చేరవేసింది. అప్పటిదాకా ఆ విషయాలేవీ తెలియని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు నిఖిల్ షాక్ తిన్నారు. బిడ్డను తీసుకుని పుట్టింటికి వచ్చేయమని బతిమాలారు. ఆమె వినలేదు. చావైనా బతుకైనా భర్తతోనేనని తేల్చేసింది. దీంతో కాజల్ తల్లిదండ్రులు పెద్దలను కూర్చోబెట్టి పంచాయితీ ద్వారా అంకుర్కు సర్దిచెప్పించారు. ఆ రాత్రి ఏం జరిగిందంటే.. ఇంత జరిగినా.. అంకుర్ వేధింపులు ఆపలేదు. జనవరి 22న రాత్రి కాజల్తో గొడవపడ్డాడు. 10గం. ప్రాంతంలో అంకుర్ తన బావమరిది నిఖిల్కు ఫోన్ చేశాడు. ‘‘ఈ కాల్ రికార్డ్ చేసి పెట్టుకో. ఆధారాంగా పనికొస్తుంది. నీ అక్కను చంపేస్తున్నా’’ అంటూ ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడాడు. దీంతో కంగారుపడ్డ నిఖిల్ శాంతంగా ఉండమని, ఫోన్ తన సోదరికి ఇవ్వమని కోరాడు. అయితే అంకుర్ అరుస్తూ ఫోన్ పెట్టేశాడు. దీంతో నిఖిల్ తన సోదరికి కాల్ చేశాడు. ఆమె మాట్లాడుతున్న.. ఫోన్ లాక్కుని కట్ చేసేశాడు. మరో ఐదు నిమిషాలకు నిఖిల్ ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి ఆమెను చంపేశానని.. ఆస్పత్రికి రావాలని చెప్పాడు. భయపడ్డ నిఖిల్ తన సిబ్బందితో వెస్ట్ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ఎక్స్టెన్షన్లోని అంకుర్ కుటుంబం ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే జరగాల్సింది జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. జనవరి 22వ తేదీన రాత్రి 10-10.30 గం. ప్రాంతంలో ఘటన జరిగింది. కాజల్ నాలుగు నెలల గర్భిణి అని, మృతదేహాంపై మరిన్ని గాయాలు ఉన్నాయని పోస్ట్మార్టం నివేదికలో తేలింది. కాజల్ బిడ్డను తామే పెంచుకుంటామని.. ఎట్టి పరిస్థితుల్లో అంకుర్ కుటుంబం నీడ కూడా పడనివ్వబోమని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. -
పీటీ ఉష భర్త హఠాన్మరణం
రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(63) గుండెపోటుతో కన్నుమూశారు.గురువారం అర్ధరాత్రి దాటాక.. 12.30 గంటల ప్రాంతంలో తిక్కోడి పెరుమాళ్పురంలోని నివాసంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను పెరుమాళ్పురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉష ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణంతో ఆమె హుటాహుటిన కేరళ బయల్దేరారు. శ్రీనివాసన్ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force)లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పరుగుల రాణి, పయ్యోలి ఎక్స్ప్రెస్గా పేర్లున్న పీటీ ఉష.. 1991లో దగ్గరి బంధువైన శ్రీనివాసన్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఉజ్జ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతి గురించి సమాచారం అందిన ప్రధాని నరేంద్ర మోదీ పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. శ్రీనివాసన్ మృతికి సంతాపం తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సైతం ఉష కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
‘వీధి కుక్కల అంశం’పై సుప్రీం తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: వీధికుక్కల కట్టడిపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ అంశంపై గురువారం వాదనలు ముగించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. హైవేలపైకి వచ్చే వీధి పశువుల కోసం, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలను సామాజిక బాధ్యతగా గోశాలలను ఏర్పాటు చేయాలని కోరాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ)కి సూచించింది. జాతీయ రహదారులపైకి వచ్చే వీధి పశువుల విషయంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేలా ప్రత్యేక యాప్ను రూపొందించాలని కోరింది.జాతీయ రహదారులపైకి పశువులు ప్రవేశించే ప్రమాదమున్న ప్రాంతాలు దేశవ్యాప్తంగా 1,300కుపైగా ఉన్నాయని ఎన్హెచ్ఏఐ లాయర్ తెలిపారు. చాలా వరకు రాష్ట్రాలు పశువుల సంచారం కట్టడికి చర్యలు తీసుకున్నాయన్న ఆయన..ఈ విషయంలో మహారాష్ట్రం, జార్ఖండ్, రాజస్తాన్లు వెనుకబడ్డాయన్నారు. వీధి కుక్కల పునరావాసం, స్టెరిలైజేషన్కు సంబంధించిన గతేడాది నవంబర్ 7వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై పంజాబ్, రాజస్తాన్, యూపీ, తమిళనాడు ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.పంజాబ్ ప్రభుత్వం రోజుకు కేవలం వంద శునకాలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేసినట్లు తెలపగా, వీధికుక్కలను పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 45 వ్యాన్లు ఉన్నాయంటూ రాజస్తాన్ ప్రభుత్వం తెలపడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. గడ్డి వాములో సూదిని వెదికినట్టు ఉందంటూ వ్యాఖ్యానించింది. వీధి కుక్కల సమస్యను ఇప్పుడు నియంత్రించకుంటే ఏటికేడు మరింత పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది.నవంబర్ 7వ ఉత్తర్వుల తర్వాత జంతువుల షెల్టర్లు, స్టెరిలైజేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ పలు ఎన్జీవోలు, ప్రైవేట్ సంస్థల నుంచి 250కి పైగా దరఖాస్తులు అందాయని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఏడబ్ల్యూబీఐ)ప్రతినిధి చెప్పారు. వీటిని ఆమోదించడమా లేదా తిరస్కరించడమా వెంటనే తేల్చేయాలని ధర్మాసనం ఆదేశించింది. -
కొడుకు కోసం ‘నరసింహావతారం’!
వెరవాల్(గుజరాత్): గిర్ అడవుల అంచున.. మృత్యువు పంజా విసిరితే, ఒక సామాన్య రైతు పరాక్రమం ముందు ఆ క్రూర మృగం చిత్తయింది. కన్నకొడుకును రక్షించుకోవడానికి ఆ తండ్రి చేసిన పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇది కేవలం ఒక వార్త కాదు.. చావు ముంగిట నిలబడి గెలిచిన ఒక యోధుడి గాథ!అర్ధరాత్రి.. మృత్యువు పంజాగిర్ సోమనాథ్ జిల్లాలోని గాంగ్డా గ్రామం. 60 ఏళ్ల రైతు బాబు వాజా తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. చుట్టూ చిమ్మచీకటి.. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక్కసారిగా పొలాల్లో నుంచి ఒక చిరుతపులి ఆకలిగొన్న రాక్షసిలా బాబు మీదకు దూకింది. బాబు చేతిని పట్టుకుని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. ఆయన పెట్టిన కేకలు విని కొడుకు శార్దూల్ పరుగున వచ్చాడు.కొడుకుపై దాడి.. తండ్రి విశ్వరూపంతండ్రిని వదిలేసిన ఆ క్రూర మృగం.. సాయం కోసం వచ్చిన కొడుకు మీదకు లంఘించింది. కొడుకుపై దాడి చేస్తున్న చిరుతను చూసి ఆ తండ్రిలో రక్తం ఉడికిపోయింది. వయసు భారమైనా, ఆపదలో ఉన్న కొడుకును చూసి ఆయనలో దాగి ఉన్న వీరుడు మేల్కొన్నాడు. పక్కనే ఉన్న కొడవలి, ఈటె అందుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ చిరుతపై విరుచుకుపడ్డాడు. కొన్ని నిమిషాల పాటు సాగిన ఆ ప్రాణాంతక పోరాటంలో.. బాబు వాజా పంజాకు పంజా విసిరి ఆ చిరుతను అక్కడికక్కడే హతమార్చాడు!నాన్న ప్రేమకు సెల్యూట్చిరుత దాడిలో బాబు వాజా, అతని కొడుకు శార్దూల్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఉనా పట్టణంలోని ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం చిరుతను చంపినప్పటికీ, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అటవీ శాఖ అధికారులు బాబు వాజాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణం తీయడం నేరమే కావచ్చు.. కానీ ప్రాణం పోయే స్థితిలో ఒక తండ్రి చూపిన తెగువకు సోషల్ మీడియాలో నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. -
సమాజాన్ని వెనక్కు తీసుకెళ్తున్నామా?
న్యూఢిల్లీ: విద్యాలయ ప్రాంగణాల్లో కులాధారిత వివక్షను నిరోధించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతనంగా రూపొందించిన సమానత్వ నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వాటి అమలుపై స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ ధర్మాసనం గురువారం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ‘‘కుల వివక్ష లేని, కులరహిత సమాజ సాధన కోసం స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల్లో మనం చేసిందేమిటి? ఈ విషయంలో సమాజాన్ని వెనక్కు తీసుకెళ్తున్నామా అన్న భావన కలుగుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది.యూజీసీ సమానత్వ నిబంధనల్లో, వాటిలో వాడిన భాషలో చెప్పలేనంత అస్పష్టత ఉందంటూ ధర్మాసనం ఆక్షేపించింది. అంతేగాక, ‘‘ఈ దశలోనే మేం గనక కల్పించుకోకపోతే ఈ నిబంధనలు దారుణ పరిణామాలకు దారి తీసేలా ఉన్నాయి. అంతిమంగా సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపడమే గాక దాన్ని విభజించేలా ఉన్నాయి’’ అంటూ దుయ్యబట్టింది. ఈ నిబంధనలపై నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సరైన మార్పుచేర్పులు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.లేదంటే కొందరు వాటిని దుర్వినియోగం చేసే ఆస్కారం చాలా ఉందని స్పష్టం చేశారు. ‘‘ప్రఖ్యాత న్యాయ కోవిదులు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అవగాహన ఉన్న నిపుణులు... ఇలా ఇద్దరు లేదా ముగ్గురితో కమిటీ ఏర్పాటు కావాలి. సమాజం ఎలా ప్రగతి సాధించాలి, అందుకోసం విద్యా సంస్థల్లో ఏర్పరచే నిబంధనల వల్ల విద్యాభ్యాసం పూర్తయి సమాజంలోకి వెళ్లాక విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు వంటి అంశాలన్నింటినీ వారు లోతుగా అధ్యయనం చేయాలి’’ అని సీజేఐ సూచించారు. తదుపరి విచా రణను మార్చి 19కి వాయిదా వేశారు. సమానత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆలోగా స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, యూజీసీని ఆదేశించారు.ఎటువైపు వెళ్తున్నాం?రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశానుసారం 2012 నాటి నిబంధనల స్థానంలో కొత్తగా సమానత్వ నిబంధనలను జనవరి 13న యూజీసీ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటిప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ కమిటీల ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు వాటిలో స్థానం కల్పించాలని పేర్కొన్నారు. అయితే నూతన నిబంధనల్లో కుల నిర్వచనాన్ని ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా విస్తరించడం, జనరల్ కేటగిరీ తదితరాలను విస్మరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూజీసీ నూతన సమానత్వ నిబంధనల ఆమోదనీయతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖల య్యాయి.వివక్ష అనే పదాన్ని కులానికి తావివ్వని రీతిలో నిర్వచించాల్సిందిగా యూజీసీని ఆదేశించాలని కోరాయి. వాటిపై విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత సామాజిక స్థితిగతులు తదితరాలపై పలు కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. వివక్షను రూపుమాపేందుకు విద్యా సంస్థల్లో విద్యార్థులకు కులాలవారీగా ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సీజేఐ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘దేవుడా! కులాంతర వివాహాలే జరుగుతున్న ఈ రోజుల్లో ఇవేం చర్యలు? దయచేసి ఇలాంటి పనులకు దిగకండి. విద్యాలయ హాస్టళ్లలో ఇంతకాలంగా కులాలకు అతీతంగా అంతా కలిసే ఉంటున్నారు.వారి మధ్య కొత్తగా ఇలాంటి విభజనలు తీసుకురావద్దు’’ అని సూచించారు. ప్రాంతీయ వివక్ష విషయంలో నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలున్నాయంటూ ఆయన నిలదీశారు. ‘‘ఉదాహరణకు ఒక దక్షిణాది విద్యార్థి ఉత్తర భారత దేశంలోని విద్యా సంస్థలో చదువుతున్నాడు. అతని కులం వంటివి తెలియకపోయినా కేవలం ప్రాంతం ఆధారంగా వివక్ష, అవమానం ఎదుర్కొన్నా డనుకుందాం. ఇలాంటి వాటికి నూతన నిబంధనల్లో పరిష్కారం ఏముంది?’’ అని ప్రశ్నించారు. అసలు వివక్ష అనే పదానికి పాత నిబంధనల్లో ఇప్పటికే విస్తృతమైన నిర్వచనం ఉండగా మళ్లీ కొత్త నిర్వచనం తేవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ తప్పుబట్టారు.ర్యాగింగ్ ఊసే లేదేం?జనరల్ కేటగిరీకి చెందిన నూతన విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ చేతుల్లో ర్యాగింగ్కు గురైతే దానిపై నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలూ లేవని విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ విస్మయం వెలిబుచ్చారు. విద్యాలయాల్లో ప్రధాన సమస్య అయిన ర్యాగింగ్ గురించి ఈ నిబంధనల్లో ప్రస్తావనే లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. దాని గురించి అస్సలే పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.‘‘విద్యాల యాల్లో ర్యాగింగ్ చాలావరకు జూనియర్, సీనియర్ తేడాల ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. ఇంతటి ప్రధాన సమస్యను విస్మరించడం ఏమిటి? విద్యాల యాల్లో వివక్ష అంటే కేవలం కులాధారితంగా మాత్రమే ఉంటుందనే దురభిప్రాయానికి రావడం ఏ మేరకు సబబు?’’ అంటూ నిలదీశారు. భారత ఐక్యత అనే భావన విద్యాలయాల్లో సర్వత్రా ప్రతిఫలించాలని జస్టిస్ బాగ్చీ అభిప్రా యపడ్డారు.విద్యాలయాల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. జనరల్ కేటగిరీకి చెందిన వారిపై జరిగే కులాధారిత వివక్షను నిబంధనల్లో విస్మరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఆక్షేపించారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలే ఇలాంటి వివక్షను ఎదుర్కొంటాయనే దురభిప్రాయం కలిగేందుకు ఆస్కారం కల్పించారన్నారు. -
భారత్ కొత్త ఆశాకిరణంగా ఎదుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఇప్పుడొక కొత్త ఆశాకిరణంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ఆరంభం సందర్భంగా గురువారం ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసంగించారు. యూరోపియన్ యూనియన్తో భారత్ బుధవారం చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకున్న మరుసటి రోజే బడ్జెట్ సమావేశాలు ఆరంభమవడంతో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ఆశయాల భారత్ ఇది. అత్యంత కీలకమైన ఐరోపా కూటమితో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో భారతీయ భారతీయ తయారీదారులకు సువర్ణావకాశం దక్కింది. 27 ఈయూ దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేద్దాం.ఇకనైనా సంస్థలు ఐరోపా విపణిలోకి విస్తృతంగా విస్తరించేలా, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలి. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘‘సమాజంలో అట్టడుగు, చిట్టచివరి వ్యక్తికి సైతం ప్రభుత్వ ప్రయోజనాలు దక్కేలా ఎన్డీఏ సర్కార్ కృషిచేస్తుందని విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిస్తాం. భవిష్యత్ తరాలకు సంస్కరణల ఫలాలను అందిస్తాం. భారత ప్రజాస్వామ్యం, భారత జనాభాయే ఇప్పుడు ప్రపంచానికి గొప్ప అవకాశాలు, వనరులుగా కన్పిస్తున్నాయి. ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో భారతదేశం తన శక్తిసామర్థ్యాలు, ప్రజాస్వామ్యం పట్ల తన అంకితభావాన్ని, ప్రజాస్వామ్యయుతంగా తీసుకునే నిర్ణయాలను భారత్ గౌరవిస్తుందనే సందేశాలను గట్టిగా విన్పించే అవకాశం మనకు దక్కింది. ఈ సందేశాలను ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆమోదిస్తున్నాయి, శ్లాఘిస్తున్నాయి. నేటి సమాజం అవరోధాలు సృష్టించేందుకుకాదు సమస్యల పరిష్కారం కోసమే ఉంది. విధ్వంసాలు కాదు తీర్మానాలు కావాలి. భారత్ ఇటీవలే దీర్ఘకాలిక సమస్యల వలయం నుంచి బయటపడి దీర్ఘకాలిక భవిష్యత్ ఆశయాల సాధన దిశలో వడివడిగా అడుగులేస్తోంది. ఇదే తరుణంలో 21వ శతాబ్దపు తొలి పావుభాగం ముగింపునకు, తర్వాత పావుభాగం ఆరంభానికి తాజా బడ్జెట్ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది మనకెంతో సానుకూలంగా ఉంది. ప్రపంచానికి భారత్ ఒక కొత్త ఆశాకిరణంగా వెలుగొందుతోంది. ఇప్పుడు ప్రపంచంలో మనమే ప్రధాన ఆకర్షణ’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ త్రైమాసిక తొలినాళ్లలోనే కుదిరిన ఎఫ్టీఏ ఒప్పందం.. మన భారతీయ యువత బంగారు భవితకు కొత్త చివుళ్లు తొడిగిస్తోంది. కొత్త బాసట బాటలో నడిపిస్తోంది. ఆశయాల భారత్, ఆశావహ యువత, ఆత్మనిర్భర్ భారత్ కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం’’అని మోదీ అన్నారు.మనీతోపాటు మనసుల్ని గెల్చుకుందాం..‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేరొందిన ఈ ఒప్పందం ద్వారా మనం సరకులను ఈయూ మార్కె ట్లోకి ముంచెత్తేలా చేద్దాం. తయారీ దారులకు ఆత్మ సంతృప్తి ఎంత అవసరమో సరకుల నాణ్యత అనేది కూడా అంతే ఆవశ్యకం. నాణ్యమై న వస్తూత్పత్తులను అందించడం ద్వారా మంచి లాభాలను గడించండి. నాణ్యమైన ఉత్ప త్తుల ఎగుమతితో యూరప్ దేశవాసుల మన సులనూ గెల్చుకో వచ్చు. దీంతో దశాబ్దాలపాటు మంచి పేరు అలాగే నిల్చి ఉంటుంది. వాణిజ్యబంధమూ బలపడుతుంది. ఇక్కడి బ్రాండ్లను అక్కడ పరిచయం చేయడంతోపాటు భారతీయత అనే బ్రాండ్నూ సుస్థిరంచేయండి. తద్వారా భారత్కు మరింత ప్రతిష్టను తీసుకురండి’’ అని తయారీదారులకు మోదీ సూచించారు. -
కాళేశ్వరం, ‘కాకతీయ’ భేష్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలను, సాధించిన విజయాలను పలుచోట్ల ఉటంకించింది. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, ఐటీ, పరిశ్రమలు, స్టార్టప్ల వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ప్రశంసించింది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలోనూ మెరుగైన పనితీరును కనబరిచిందని పేర్కొంది. సాగు విస్తీర్ణం దాదాపు రెట్టింపు.. ఆర్థిక సర్వేలో పేర్కొన్న గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 2014లో 1.31 కోట్లుగా ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఈ అద్భుత ప్రగతికి కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకమని సర్వే ప్రశంసించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలు అన్నదాతకు అండగా నిలిచాయని పేర్కొంది. అయితే సాగు విస్తీర్ణం భారీగా పెరిగినప్పటికీ వరి దిగుబడిలో తెలంగాణ ఇంకా మెరుగుపడాల్సి ఉందని సర్వే సూచించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ల తో పోలిస్తే తెలంగాణలో ఎకరానికి వచ్చే దిగుబడి జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. అకాల వర్షాలు, వడగాడ్పులు అందుకు ప్రధాన కారణమని సర్వే తెలిపింది. వాతావరణాన్ని తట్టుకొనే విత్తనాలను వాడటం ద్వారా దీన్ని అధిగమించవచ్చని సర్వే సూచించింది. పీడీఎస్ ఆహార ధాన్యాల రవాణా వాహనాల కదలికలను రియల్టైమ్లో గుర్తించేందుకు కేంద్రం ‘అన్న చక్ర’ పేరుతో ప్రవేశపెట్టిన వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను పూర్తిస్థాయిలో అమలు చేసిన ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని సర్వే గుర్తించింది. భూ రికార్డుల నిర్వహణలోనూ తెలంగాణ ముందుందని.. రెవెన్యూ, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖలను అనుసంధానిస్తూ తీసుకొచ్చిన ’భూభారతి’ పోర్టల్ (ధరణికి కొనసాగింపుగా/మార్పుగా) పారదర్శకతను పెంచిందని సర్వే అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం కట్టడి బహుబాగు.. 2025–26 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్–డిసెంబర్) గణాంకాల ప్రకారం తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కేవలం 0.20 శాతంగా నమోదైంది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇది భారీగా తగ్గింది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలన్నింటికంటే ఇదే అత్యల్పం కావడం విశేషం. జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం సగటున 1.72 శాతంగా నమోదైంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్బణం 1.39 శాతంగా ఉండగా కర్ణాటకలో 3.14 శాతంగా ఉంది. మరోవైపు సంపద సృష్టిలోనూ తెలంగాణ సత్తా చాటింది. సేవల రంగంలో టాప్గేర్ ఐటీ, పారిశ్రామిక, మహిళా సంక్షేమ రంగాల్లోనూ తెలంగాణ తనదైన ముద్ర వేస్తోందని ఆర్థిక సర్వే వివరించింది. ’వికసిత్ భారత్’లో తెలంగాణది కీలకపాత్ర అని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఐటీ, సేవల రంగంలో తెలంగాణ తన సత్తాను మరోసారి చాటుకుంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న సేవల రంగంలో దాదాపు 40 శాతం వాటా కేవలం నాలుగు రాష్ట్రాలదే కాగా అందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులతో కలిసి తెలంగాణ ఈ ఘనత సాధించింది. అధిక ఉత్పాదకత, ఆధునిక ఐటీ సేవలు, ఫైనాన్స్ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని సర్వే ప్రశంసించింది. కృత్రిమ మేధ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని, దేశంలోని మొత్తం జెన్–ఏఐ స్టార్టప్లలో 7 శాతం వాటాతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచిందని సర్వే తెలిపింది. బెంగళూరు, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ స్టార్టప్లకు కేరాఫ్ అడ్రస్గా మారింది. మహిళా సాధికారతకు పెద్దపీటమహిళా భద్రత, ఉపాధి కల్పనలో తెలంగాణ మోడల్ భేష్ అని సర్వే కితాబిచ్చింది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ భరోసా కల్పిస్తున్నాయని సర్వే ప్రశంసించింది. కొచ్చిలోని విమెన్ పోలీస్ కంట్రోల్ రూమ్తోపాటు షీటీమ్స్ను ఆదర్శంగా పేర్కొంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన వీ–హబ్ అద్భుత ఫలితాలిస్తోందని.. స్టార్టప్ ఎకోసిస్టమ్తో మహిళలను అనుసంధానిస్తోందని సర్వే హైలైట్ చేసింది. మహిళలు అన్ని రకాల పరిశ్రమల్లో, షిఫ్టుల్లో పనిచేసేలా నిబంధనలను సడలించిన 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రశంసించింది. గుజరాత్తోపాటు హైదరాబాద్లోని ఫార్మా క్లస్టర్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నాయని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలుస్తున్నాయని సర్వే పేర్కొంది. దేశంలోని 85% సిమెంట్ పరిశ్రమ కేంద్రీకృతమైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రభాగంలో ఉంది. అగి్నమాపక అనుమతుల కోసం థర్డ్–పార్టీ సరి్టఫికేషన్ను అనుమతించి ఇన్స్పెక్టర్ రాజ్ విధానానికి స్వస్తి పలికిన రాష్ట్రంగా తెలంగాణను సర్వే గుర్తించింది. -
వైఎస్ జగన్ సంస్కరణలను కొనియాడిన కేంద్ర ఆర్థిక సర్వే
సాక్షి,న్యూఢిల్లీ: తన హయాంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక శాఖ కొనియాడింది. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు)పై కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసల వర్షం కురిపించింది.రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్బీకేల ద్వారా ఈ-ఫార్మ్ మార్కెట్ ప్లాట్ఫామ్ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టంగా తేల్చింది.అంతేకాకుండా, మహిళా సాధికారత కోసం జగన్ చేపట్టిన సంస్కరణలకూ సర్వే ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపింది. 2023-24లో ఉత్పాదక రంగంలో మహిళల యాజమాన్యంలో ఉన్న సంస్థల వాటా గణనీయంగా పెరిగిందని, మహిళా కార్మిక భాగస్వామ్య రేటు కూడా అధికంగా నమోదైందని ఆర్థిక సర్వే వెల్లడించింది.ఇదీ చదవండి: ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్ -
యూజీసీ కొత్త రూల్స్కు ‘సుప్రీం’ బ్రేక్.. ఎందుకో తెలుసా?
ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను రూపుమాపి.. సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఇటీవల నోటిఫై చేసిన విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలు-2026 వివాదంలో చిక్కుకున్నాయి. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఎలా పెద్దదైంది? దీనిని కేంద్రం ఎలా సమర్థిస్తుందో చూద్దాం.. ఏమిటీ నిబంధనలు?ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ ‘సమానత్వ(ఈక్విటీ) కమిటీ’ల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. కులం, మతం, లింగం, వికలాంగత, జాతి వంటి వివక్షలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సెల్లు పని చేస్తాయి. ఇంతకు ముందు.. 2012 నిబంధనలను రద్దు చేసి, మరింత విస్తృతమైన, కఠినమైన నియమాలు అమలు చేయబడతాయి. ఇందులో హెల్ప్లైన్లు, కఠినమైన బాధ్యతా ప్రమాణాలు వంటి నిబంధనలు ఉంటాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సమానత్వ చర్యలు, ఫిర్యాదు పరిష్కారాలపై UGCకి నివేదికలు సమర్పించాలి.రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ(ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం) నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను జనవరి 13వ తేదీ నుంచి అమలులోకి తెచ్చింది. అభ్యంతరాలు దేనికి? సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. అయితే కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. కొంతమంది విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలు అనుకోకుండా కొత్త విభజనలకు దారితీయవచ్చని.. అలాగే దుర్వినియోగం జరగకుండా సరైన రక్షణలు లేవని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయానికి కూడా ఈ నిరసన సెగ తాకింది. దీనికి నిరసనగా పార్టీకి కొందరు బీజేపీ నేతలు, ఓ సీనియర్ బ్యూరోక్రాట్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏముంది?మరోవైపు, రిజర్వుడు కేటగిరీల కిందకు రాని విద్యార్థులు, బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే విషయాన్ని కొత్త నిబంధనల్లోని 3(సి) విస్మరించిందని పేర్కొంటూ వినీత్ జిందాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీలు సైతం దీనిని అదనపు బాధ్యతలుగా చూస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కమిటీ ప్రతినిధుల మధ్య విభేదాలు పెరిగే అవకాశంపై ఆందోళన పిటిషన్లో వ్యక్తం చేశారు.తాత్కాలికంగా ఎందుకు నిలిపివేసింది?బిల్లులోని కొన్ని నిబంధనలను సుప్రీం కోర్టు గురువారం తాత్కాలికంగా నిలిపివేసింది. దీని అమలుకు స్వేచ్ఛా, సమానత్వం, సమగ్రతతో కూడిన వాతావరణం అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.కేంద్రం ఏం చెబుతోంది?కొత్త నిబంధనల వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎవరూ వేధింపులకు గురికారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు.UGC బిల్లు 2026 ప్రధానంగా ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షతో పాటు ఇతర రకాల వివక్షను నివారించడానికి రూపొందించబడిందని అంటున్నారాయన. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించే చారిత్రాత్మక అడుగు అని మద్దతుదారులు అంటున్నారు. విద్యా నిపుణులు ఇది వ్యవస్థలోని అడ్డంకులను తొలగించి, సమానత్వాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.మొత్తంగా.. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించడమే లక్ష్యం అయినప్పటికీ.. దాని అమలు విధానం, దుర్వినియోగం అవకాశాలు, కొత్త విభజనల భయం కారణంగా వివాదం చెలరేగింది. -
ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్
సాక్షి, ఢిల్లీ: తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి విజన్ను కేంద్రం కొనియాడింది. వ్యవసాయ రంగంలో.. 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. ‘‘2021లో అప్పటి ఏపీ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టింది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జీఐఎస్ సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చారు. మొత్తం 6,901 గ్రామాల్లో ఈ రీసర్వే జరిపారు. మొత్తంగా 81 లక్షల భూముల పునః సర్వే జరిగింది. దాదాపు 86 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయి’’ అని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో.. చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా మరోసారి పటాపంచలు అయ్యాయి. భూ సర్వే జగన్ విజనేనంటూ కేంద్రం కూడా బాబుకి షాకిచ్చినట్లైంది. -
ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.8-7.2గా అంచనా వేస్తూ.. గతేడాది కంటే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జీడీపీ వృద్ధి అంచనా.. భారత ఆర్థిక వ్యవస్థ FY27లో సుమారు 6.8–7.2% వరకు పెరగనున్నట్లు అంచనా, దృఢమైన మాక్రో ఫండమెంటల్స్ మరియు సంస్కరణలు ఈ వృద్ధికి బలం ఇస్తున్నాయి.ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) దృశ్యపటం.. ద్రవ్యోల్బణం మొత్తం మీద స్థిరంగా ఉండొచ్చని, ముఖ్యంగా ఆహారం, ఇంధన ధరలు కంట్రోల్లోనే ఉంటాయని అంచనా.రాజకోశ లోటు (ఫిస్కల్ డెఫిసిట్).. రాజకోశ లోటు తగ్గే దిశగా ఉందని, ఆర్థిక పరిమితికి కట్టుబడి ఉందని ప్రభుత్వం మళ్లీ ధృవీకరించింది.ఉద్యోగ ధోరణులు.. తయారీ, సేవల రంగం మరియు గిగ్ ఎకానమీ విభాగాల్లో ఉద్యోగ సృష్టి మెరుగుపడినట్లు సర్వే సూచిస్తోంది.బాహ్య వాణిజ్యం & యూరోపియన్ యూనియన్ ఒప్పందం.. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. దీనివల్ల ఎగుమతులు, పోటీతత్వం పెరగనున్నాయి.తయారీ రంగానికి బూస్ట్.. ‘మేక్ ఇన్ ఇండియా 2.0’పై దృష్టి కేంద్రీకరించి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నారు.డిజిటల్ ఎకానమీ.. డిజిటల్ పేమెంట్లు, ఫిన్టెక్, AI వినియోగం వేగంగా పెరుగుతూ, భారత్ను ప్రపంచ స్థాయి టెక్ హబ్గా మలుస్తోంది.హరిత శక్తి మార్పు.. సౌర, వాయు, హైడ్రజన్ వంటి గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి, స్థిరమైన వృద్ధికి అనుకూలంగా పాలసీ మద్దతు కొనసాగుతోంది.మానవ కేంద్రిత సంస్కరణలు.. సాంకేతిక వినియోగాన్ని విస్తరించడంలో కూడా, సంక్షేమాన్ని కాపాడే విధంగా సంస్కరణలు పూర్తిగా మానవ కేంద్రితంగానే ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ప్రపంచంలో భారత స్థానం.. భారతాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు “ఆశాకిరణం”గా వర్ణిస్తూ, గ్లోబల్ పెట్టుబడులు, దృష్టి భారత్వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు. -
‘పప్పా.. నేను అజిత్ పవార్తో వెళ్తున్నాను’.. పింకీ మాలి చివరి మాటలు ఇవే..!
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు ముందు విమాన సిబ్బంది పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలికి చేసిన చివరి ఫోన్ కాల్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన పింకీ..ప్రయాణానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ, ‘పప్పా, నేను అజిత్ పవార్తో బారామతి వెళ్తున్నాను. ఆయనను అక్కడ దింపిన తర్వాత నేను నాందేడ్కి వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం’ అని చెప్పింది. ఆ మాటలు ఆమె తండ్రికి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.పింకీ మాలీ మరణంపై ఆమె తండ్రి శివకుమార్ మాలి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా కూతురు ఫోన్ చేస్తే మాట్లాడాను. చివరిగా.. ‘రేపు నీ పని అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని అన్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాలేదు. తన కూతురు ఇక లేరని తెలుసుకున్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.ఆయన మాట్లాడుతూ..‘నేను ఆమెతో రేపు మాట్లాడతానని అనుకున్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. నా కూతురు నాకు దూరమైపోయింది. ఆమె ఇటీవల అజిత్ పవార్తో అనేక ప్రయాణాల్లో పాల్గొనేది. నాకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. నాకు టెక్నికల్ విషయాలపై అవగాహన లేదు. నేను పూర్తిగా కుంగిపోయాను. నాకు కావలసింది ఒక్కటే. నా కూతురి భౌతిక కాయం. గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయడానికి మాత్రమే నేను కోరుకుంటున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మాటలు ఒక తండ్రి హృదయవేదనను, ఒక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పింకీ మాలి చివరి మాటలు ఇప్పుడు వారి కుటుంబానికి శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోయాయి. -
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. ఏ క్షణం.. ఏం జరిగింది?
ఢిల్లీ: అజిత్ పవార్ విమాన ప్రమాదానికి పైలెట్ తప్పిదమే కారణమనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వని పైలట్లు.. రన్ వే సరిగ్గా కనిపించక అంచనా తప్పినట్లు సమాచారం. తొలి ప్రయత్నంలో పైలట్లు ల్యాండ్ చేయలేకపోయారు. రెండో ప్రయత్నంలో 8:44కు విమానం ప్రమాదానికి గురైంది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ఇచ్చిన సూచనలకు పైలట్ ఇచ్చే సమాధానమే రీడ్బ్యాక్..విమానం రెండోసారి ల్యాండింగ్ కోసం సిద్ధమవగా.. మొదట రన్వే కనిపించడం లేదని చెప్పిన పైలట్లు.. కొన్ని సెకన్ల తర్వాత రన్వే కనిపిస్తోందని తెలిపారు. ఉదయం 8:43 గంటల సమయంలో విమానానికి రన్వే 11పై ల్యాండింగ్కు అనుమతి లభించింది. అయితే, సాధారణంగా పైలట్లు ఇచ్చే తిరుగు సమాధానం (Readback) ఈసారి రాలేదు. సరిగ్గా నిమిషం తర్వాత, రన్వే వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం ఏటీసీ గుర్తించింది. అయితే.. ఈ దుర్ఘటనలో విమానం ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు పైలట్ రీడ్బ్యాక్ చేయకపోవడం ప్రమాదానికి దారి తీసినట్లు కేంద్రం పేర్కొంది. ఏ క్షణం.. ఏం జరిగింది?👉ఉదయం 8:18 నిమిషాలకు తొలిసారిగా బారామతి ఎయిర్ ఫీల్డ్ను కాంటాక్ట్ చేసిన విమానం👉30 నిమిషాల తర్వాత పూణే ఎయిర్ కంట్రోల్ నుంచి బారామతికి కంట్రోల్లోకి విమానం👉విజిబులిటీ, గాలి వేగం గురించి అడిగిన పైలట్లు.. 3000 మీటర్ల విజిబిలిటీ, సాధారణ గాలి వేగం👉రన్ వే 11 పై ల్యాండింగ్ కోసం ఫైనల్ అప్రోచ్కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్👉ఫస్ట్ అప్రోచ్లో రన్ వే కనిపించకపోవడంతో గో అరౌండ్కు వెళ్లిన విమానం👉గో అరౌండ్ తర్వాత.. విమానం పొజిషన్ గురించి అడిగిన పైలెట్.. మరోసారి ఫైనల్ అప్రోచ్కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్ 👉రన్ వే కనిపిస్తుందా? అని అడిగిన ఏటిసీ..👉ప్రస్తుతం కనిపించడం లేదు.. కనిపించిన తర్వాత కాల్ చేస్తామన్న పైలెట్👉కొన్ని సెకన్ల తర్వాత రన్ వే కనిపిస్తుందని వెల్లడించిన పైలెట్ 👉ఉదయం 8:43 నిమిషాలకు రన్ వే లెవెన్పై ల్యాండింగ్ క్లియరెన్స్.. అయితే కీలకమైన "రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్" సమాధానం ఇవ్వని పైలట్👉ఉదయం 8:44 నిమిషాలకు రన్వే పక్కన భారీ ఎత్తున మంటలు.. క్రాష్ అయిన విమానం👉రన్ వే 11కు ఎడమ వైపున విమాన శకలాలు -
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కారణం ఏంటంటే?
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం పొగమంచు, వెలుతురు లేమి కారణంగా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రయాణిస్తున్న విమానం బుధవారం ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్, విదీప్ జాదవ్,పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శంభవి పాఠక్లు ప్రాణాలు కోల్పోయారుఅయితే, ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలెట్ల గురించి నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ మంగళవారం ఉదయం ముంబై నుంచి లియర్జెట్ 45 విమానంలో బయలు దేరారు. అయితే, ఈ విమానం, బరామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ ప్రయత్నం చేస్తుండగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. విమాన ప్రమాదంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు, అలాగే పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ శంభవి పాఠక్ అక్కడికక్కడే మరణించారు.కెప్టెన్ సుమిత్ కపూర్ అనుభవజ్ఞుడైన కమర్షియల్ పైలట్. ఆయనకు బిజినెస్ ఫ్లైట్స్ నడిపిన అనుభవం ఉంది. శంభవి పాఠక్ కూడా శిక్షణ పొందిన కమర్షియల్ పైలట్. గతంలో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. ఇద్దరూ వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు పనిచేస్తున్నారు.విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విమానం ఎందుకు నియంత్రణ కోల్పోయిందో, సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్నది పరిశీలిస్తున్నారు. బరామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విమానయాన రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. -
అరవ శ్రీధర్ ఎపిసోడ్.. మొహం చాటేసిన పవన్ కల్యాణ్
సాక్షి, ఢిల్లీ: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై స్పందించేందుకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరాకరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన్ని.. బుధవారం మీడియా ప్రతినిధులు పలకరించారు. అయితే చాలా అంశాలపై మాట్లాడిన ఆయన.. శ్రీధర్ అంశంపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరారు. అయితే ఆయన నోరు విప్పలేదు. సైలెంట్గా మొహం చాటేసుకుని కారెక్కి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో అరవ శ్రీధర్పై సస్పెన్షన్ వేటు పడిందని నిన్నంతా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అదంతా జన సైనికుల అత్యుత్సాహం అని తర్వాతే తేలింది. రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు అరవ శ్రీధర్ను రక్షించే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా.. కేవలం విచారణ కమిటీ పేరిట తతంగం నడిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తున్నారు. కేంద్ర ప్రగతిని ఆమె చదివి వినిపిస్తున్నారు. రేపు సభ ముందుకు ఆర్థిక సర్వే రానుంది. ఫిబ్రవరి 1వ తేదన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో నూతన శకానికి తెర లేచింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నడుమ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లో ఈ చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. పరిమాణంతో పాటు ప్రాధాన్యతపరంగా కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలన్నింటికీ ఈ ఎఫ్టీయూ తల్లి వంటిదని(మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) పరిశీలకులు అభివర్ణిస్తున్నారు! ఇది అమల్లోకి వస్తే ఇరు పక్షాల నడుమ వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల మేరకు తగ్గనున్నాయి. యూరప్ కార్లు, వైద్య పరికరాలు, వైన్ తదితరాలపై టారిఫ్లు దిగొస్తాయి. మొత్తంగా అక్కడి దేశాల దిగుమతులన్నింటిపైనా సుంకాలు భారీగా తగ్గుతాయి. యంత్ర పరికరాలు, రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులపై ప్రస్తుతమున్న భారీ టారిఫ్లు దాదాపుగా కనుమరుగవుతాయి. బదులుగా ఆ ఖండానికి భారత ఎగుమతుల్లో చాలావాటిపై సుంకాలు వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 90 నుంచి 100 శాతం దాకా తగ్గనున్నాయి! ఈ తగ్గింపు వస్తూత్పత్తులతో పాటు సేవలకు కూడా వర్తించనుంది!! మొత్తమ్మీద 93 శాతం వస్తువులపై సుంకాల ఎత్తివేతకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. ఈ ఒప్పందం కోసం ఇరు పక్షాల నడుమ 18 ఏళ్లకు పైగా చర్చోపచర్చలు కొనసాగుతుండటం విశేషం. అయితే ఎఫ్టీఏపై లాంఛనంగా సంతకాలు జరిగేందుకు కనీసం మరో ఆర్నెల్లు, అది అమల్లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టనుంది. ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన, ఇతరత్రా అంశాలపై ఇరువైపులా పూర్తిస్థాయి అధ్యయనం తదితరాలు జరగాల్సి ఉండటమే ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా ప్రపంచ దేశాలపై టారిఫ్లను ఆయుధంగా ప్రయోగిస్తూ హడలెత్తిస్తుండటం తెలిసిందే. ఆ వాణిజ్య బెదిరింపులకు భారత్, ఈయూ ఒప్పందాన్ని దీటైన సమాధానంగా పరిగణిస్తున్నారు. ఎఫ్టీఏకు తోడుగా ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊపునిచ్చే దిశగా మరో 12 ఒప్పందాలు కూడా శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఖరారయ్యాయి. వాటితో పాటు మరో రెండు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా ఖరారయ్యాయి. వాటిలో ఒకటి రక్షణ–భద్రతకు సంబంధించినది కాగా మరొకటి భారత్ నుంచి ప్రతిభావంతులను యూరప్లో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు తదితరాలు కల్పించేందుకు వీలు కల్పించేది. ప్రపంచానికే స్థిరత్వం: మోదీ ఎఫ్టీఏ ఖరారుపై మోదీ హర్షం వెలిబుచ్చారు. ఒప్పందం అనంతరం ఉర్సులా, కోస్టాతో కలిసి ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వాణిజ్యపరంగా అంతర్జాతీయంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్, ఈయూ భాగస్వామ్యం ప్రపంచానికి అత్యవసరమైన స్థిరత్వాన్ని అందిస్తుందని మోదీ విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘భారత్ తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూరప్ మార్కెట్తో మన చిన్న పరిశ్రమలు, రైతులకు అనుసంధానం మరింత పెరిగేందుకు, ఉత్పత్తి, సేవా రంగాల్లో నూతన అవకాశాల సృష్టికి ఇది ఎంతగానో తోడ్పడనుంది. ఎఫ్టీతో భారత్, ఈయూ మధ్య పెట్టుబడులు ఇతోధికంగా పెరగనున్నాయి. నూతన ఇన్నొవేషన్ భాగస్వామ్యాలు ఏర్పడటమే గాక అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి. ఆ కోణంలో చూస్తే ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, భారత్–ఈయూ సమైక్య ప్రగతికి బ్లూప్రింట్ వంటిది’’అంటూ ప్రధాని కొనియాడారు. ఇరు పక్షాల నడుమ ఈ భాగస్వామ్యం అంతిమంగా ప్రపంచానికే ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండో–పసిఫిక్ మొదలుకుని కరీబియన్ దీవుల దాకా పలు ప్రాజెక్టుల విషయంలో భారత్, ఈయూ కలిసి పని చేస్తాయని ప్రకటించారు. సవాళ్లకు సమాధానం: ఉర్సులా భారత్, ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయి వంటిదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుతున్న వేళ ఈ ఒప్పందానికి ఎనలేని ప్రాధాన్యం సమకూరిందని అమెరికా ఒంటెత్తు పోకడలను ఉద్దేశిస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరంగా ప్రస్తుతం దేశాలన్నీ ఎదుర్కొంటున్న పెను అంతర్జాతీయంగా సవాళ్లకు పరస్పర సహకారం, సమన్వయమే అత్యుత్తమ పరిష్కారమని ఈ ఒప్పందం మరోసారి సందేశమిచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘మేం సాధించాం. ఒప్పందాలన్నింటికీ తల్లిగా చెప్పదగ్గ ఎఫ్టీఏను కుదుర్చుకున్నాం. ఏకంగా 200 కోట్ల మందికి అద్భుతమైన మార్కెట్ను ఏర్పాటు చేసుకోనున్నాం. ఇది ప్రపంచంలో రెండో, నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా నిలిచిన రెండు దిగ్గజాల గాథ. ఇరు పక్షాలకూ లాభదాయకమైన రీతిలో ఒప్పందం కుదిరింది’’అని ఉర్సులా పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత, యూరప్ ఎగుమతిదారులపై వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల దాకా తగ్గుతాయని చెప్పారు. అంతేగాక ఇరువైపలా లక్షలాది నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘‘భారత నైపుణ్యాలు, సేవలు, యూరప్ టెక్నాలజీ, పెట్టుబడులు, ఇన్నొవేషన్లు పరస్పరం అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఇరు పక్షాలూ ఊహించలేని స్థాయిలో ప్రగతి సాధిస్తాయి. ఒంటరిగా వెళ్తే భారత్, ఈయూల్లో ఏ ఒక్కరికీ ఆ స్థాయి ప్రగతి సాధ్యం కాదు’’అని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఎఫ్టీఏ ద్వారా రెండు ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడంతో పాటు భారత్, ఈయూ పౌరులకు భద్రత మరింత మెరుగవనుంది. నానాటికీ అభద్రత పెరిగిపోతున్న నేటి ప్రపంచంలో ఇది అత్యంత కీలకమైన అంశం’’అని ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మైలురాయి వంటిది: కోస్టా భారత్, ఈయూ ఎఫ్టీఏను వాణిజ్య ఒప్పందాల చరిత్రలోనే మైలురాయిగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, వ్యూహత్మక అంశాల్లో సహకారమే పునాదులుగా ఒప్పందం కుదిరిందన్నారు. అందుకే ఇది ఎనలేని చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. చర్చలే శాంతికి మార్గం యుద్ధాలతో శాంతి ఎన్నటికీ సాధ్యం కాదని భారత్, ఈయూ శిఖరాగ్ర సదస్సులో నేతలు అభిప్రాయపడ్డారు. పరస్పర విశ్వాసంతో కూడిన చర్చలే అందుకు ఏకైక మార్గమని ప్రధాని మోదీ, ఈయూ సారథులు ఉర్సులా, ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో స్థితిగతులు, ఇండో–పసిఫిక్లో పరిస్థితులు తదితరాలపై వారితో లోతుగా చర్చలు జరిగినట్టు మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు చెప్పారు. యుద్ధాలతో ఎన్నటికీ శాంతిని సాధించలేమని ఉక్రెయిన్ ఘర్షణను ఉద్దేశించి ఉర్సులా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్వం ద్వారా శాంతిసాధన యత్నాల్లో యూరప్ కూడా మోదీవైపు నమ్మకంతో చూస్తోందని కోస్టా పేర్కొనడం విశేషం. -
వీబీ జీ రామ్జీపై చర్చ కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉపాధి హామీ పథకంలో సంస్కరణలే లక్ష్యంగా సవరణలో తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్(గ్రామీణ్)(వీబీ జీ రామ్ జీ) చట్టంపై పార్లమెంట్లో చర్చ ఉండబోదని మోదీ సర్కార్ కుండబద్ధలు కొట్టింది. బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సంప్రదాయం మేరకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. పార్లమెంట్ సమావేశాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్జీనరేగా)పై చర్చించాలని భేటీలో విపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడారు. ‘‘దేశంలో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చాక దానిని మనందరం ఆచరించాల్సిందే. దాని నుంచి మళ్లీ రివర్స్గేర్లో వెళ్లలేం. వెనకడుగు వేసి మళ్లీ పాత చట్టాన్ని అమలుచేయబోం. అలా ఎన్నటికీ సాధ్యంకాదు. వీబీ జీ రామ్జీ చట్టంపై, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సర్వేపైనా చర్చించడానికి ఏమీ లేదు.గత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎన్నికల సంస్కరణలపై విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. ఆనాడు విపక్ష సభ్యులు గంటల తరబడి మాట్లాడి మాట్లాడి అలసిపోయారు’’ అని రిజిజు వ్యాఖ్యానించారు. ‘‘ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఓటర్లు మమ్మల్ని ఎన్నుకున్నారు. అయితే విపక్ష సభ్యులందరికీ పార్లమెంట్లో తమ వాణిని వినిపించే వాక్ స్వాతంత్య్రం ఉంది. రామ్జీ చట్టం, ఎస్ఐఆర్ ప్రక్రియ మినహా మిగతా అంశాలను విపక్షాలు ప్రస్తావించవచ్చు. వాళ్ల వాదనలను వినడమూ మా విధే. అంశాలపై చర్చ జరిగేలా చూడాలిగానీ రభస జరిగేలా చూడొద్దు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘సభలో ఏఏ అంశాలపై చర్చిస్తారనే సభాకార్యకలాపాల జాబితాను మేం వెల్లడించట్లేమని విపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. వాస్తవానికి బడ్జెట్ సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సభాకార్యకలాపాల షెడ్యూల్ను విడుదల చేస్తాం’’ అని రిజిజు స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు షురూపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. 29న కేంద్ర ప్రభుత్వం సామాజిక, ఆర్ధిక సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. గతానికి భిన్నంగా తొలిసారిగా ఆదివారం (ఫిబ్రవరి ఒకటో తేదీ) ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2026–27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. రాజ్యసభ, లోక్సభలో దీనికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.వాడివేడిగానే చర్చలుఈ సమావేశాల్లో మోదీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు పదునైన అంశాల కత్తులు నూరుతున్నాయి. భారత్పై అమెరికా పాతిక శాతం అదనపు టారిఫ్ల భారం మోపడంతో దేశ వస్త్ర పరిశ్రమ, ఆహార ఎగుమతులు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని, ఇతర రంగాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయన్నాయని అఖిలపక్ష భేటీలో విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చేసి ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు తప్పుబట్టాయి. ఈ అంశాలపై విపక్షాల ఆరోపణలతో పార్లమెంట్ అట్టుడికే అవకాశాలున్నాయి. వీటితోపాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల తీరు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు నిర్ణయించాయి.సహకరించాలన్న కేంద్రంరక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, వైఎస్సార్సీపీ, డీఎంకే, టీడీపీ, టీఎంసీ, శివసేన షిండే, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు.అన్ని అంశాలపై చర్చించాలన్న విపక్షాలుభేటీ అనంతరం రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత, పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ పాలనలో రాజ్యాంగం కలి్పంచిన హక్కులు పూర్తిగా నిరీ్వర్యమయ్యాయి. రాజ్యాంగ సంస్థలు బలహీనపడుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగబద్ధ సంస్ధల్లో ఒకే భావజాలానికి చెందిన వ్యక్తులను నియమించడం ద్వారా సంస్థల స్వతంత్రతను మోదీ సర్కార్ దెబ్బతీస్తోంది’’ అని తివారీ మండిపడ్డారు. ‘‘డాలర్తో మారకం విలువ ఏకంగా 92 రూపాయలకు పడిపోయింది. రష్యా చమురు కొనుగోళ్లు, అమెరికా టారిఫ్ దెబ్బ, జమ్మూకశీ్మర్కు రాష్ట్ర హోదా, ఢిల్లీలో దారుణమైన వాయు కాలుష్యం, ఇండోర్ మరింత దారుణంగా నీటి కాలుష్యం.. ఇలా ఎన్నో అంశాలపై చర్చకు పట్టుబడతాం’’ అని తివారీ అన్నారు.చమురు శుద్ధిలో గ్లోబల్ లీడర్గా..పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉండేలా చట్టాలు, నిబంధనల విషయంలో పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. చమురు శుద్ధిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. త్వరలో గ్లోబల్ లీడర్గా మారడం ఖాయమని తెలిపారు. ప్రతిఏటా 260 మిలియన్ టన్నుల చమురు శుద్ధి సామర్థ్యం ఉందని, దీన్ని 300 మిలియన్ టన్నులకు పెంచబోతున్నామని స్పష్టంచేశారు. దేశంలో గ్యాస్ పంపిణీలోనూ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. పట్టణాలు, నగరాల్లో పైప్లైన్, గ్యాస్ పంపిణీ వ్యవస్థలు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. దేశంలో పారదర్శకమైన, పెట్టబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఇంధన రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తేల్చిచెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ ఇన్ ఇండియా, స్కేల్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా’ అంటూ ప్రపంచ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. -
ఇంధన రంగంలో అద్భుత అవకాశాలు
బేతుల్(గోవా): సంస్కరణల ఎక్స్ప్రెస్పై మనదేశం పరుగులు తీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇంధన రంగంలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వేగవంతమైన సంస్కరణలు, విప్లవాత్మక చర్యలతో ఇంధన భద్రత నుంచి ఇంధన స్వతంత్రత దిశగా భారత్ ముందుకు సాగుతోందని వివరించారు. మంగళవారం గోవాలో ‘భారత ఇంధన వారోత్సవం–2026’లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దేశ ఇంధన రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చమురు, సహజ వాయువు అన్వేషణ, వెలికితీత కోసం 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.చమురు, గ్యాస్ వెలికితీత కోసం ఇప్పటికే 170 బ్లాక్లు కేటాయించామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా భారత్ అవతరించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అండమాన్ నికోబార్ బేసిన్ హైడ్రోకార్బన్ ఉత్పత్తి కేంద్రంగా మారబోతోందని అన్నారు. మనం ఉపయోగించుకుంటున్న మొత్తం ఇంధనంలో సహజ వాయువు వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచబోతున్నట్లు వి వరించారు. దీనివల్ల ఎన్ఎన్జీ, పైపులైన్ల తయారీలో కొత్తగా అందుబాటులోకి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థ నానాటికీ బలోపేతం అవుతోందని, ఫలితంగా రాబోయే రోజుల్లో పెట్రోకెమికల్స్కు డిమాండ్ మరింత పెరుగుతుందని అన్నారు.మాతో చేతులు కలపండిభారత ఇంధన రంగంలో నేడు వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దేశ విదేశాల పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డుకెక్కిందని, దేశంలో ఇంధన ఉత్పత్తులకు డిమాండ్ స్థిరంగా పెరుగుతోందని గుర్తుచేశారు. అంతర్జాతీయ డిమాండ్ను సైతం తీర్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలో టాప్–5లో ఒకటిగా నిలుస్తోందన్నారు. 150కి పైగా దేశాలకు ఎగుమతు లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో భారత సామర్థ్యం విదేశీ భాగస్వాములకు తోడ్పడుతుందని ఉద్ఘాటించారు. తమతో చేతులు కలపాలని, ఇక్కడున్న అవకాశాలు ఉపయోగించుకోవాలని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. చమురు, గ్యాస్ అన్వేషణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, సముద్ర మంథన్ మిషన్లో భాగంగా సముద్రాల అంతర్భాగంలో వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నామని వివరించారు. -
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’
సాక్షి,ఢిల్లీ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. పేద ప్రజలను వైద్య విద్యకు దూరం చేసేందుకు చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పుతాం’అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. ‘అమరావతికి మేము వ్యతిరేకం కాదు.అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడాలని బిల్లులో పెడితే మద్దతు ఇస్తాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పుతాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు మూలన పడేశారు. దానికి నిధులు కేటాయించకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయింది.నిర్దేశించిన సీలింగ్కు మించి 69 శాతం ఎక్కువగా అప్పులు చేశారు.అప్పుల తెచ్చిన నిధులను ఏం చేస్తున్నారు. కనీసం సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం లేదు. 8 త్రైమాసిక ఫీజులు చెల్లించలేదు. కనీసం హాస్టల్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉంటున్నారు. రైతులకు పంటల భీమా అమలు చేయడం లేదు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి తగ్గించిన నిధులను కేంద్ర నుంచి తీసుకురావాలి.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ... నిధుల లోటును పూడ్చేలా కృషి చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
బడ్జెట్ సెషన్: కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్-పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు నేతృత్వంలో ఆల్పార్టీ మీటింగ్ జరుగుతోంది. సెషన్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రం అన్ని పార్టీలను కోరుతున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో.. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే విద్యారంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే.. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్ఐఆర్ అంశాలపై విపక్షాలు కేంద్రంపై పోరాటానికి దిగాయి. ఈ తరుణంలో బడ్జెట్ సమావేశాలను తమ నిరసనలకు వేదికగా మార్చుకోవాలనుకుంటున్నాయి. చర్చకు పట్టుబట్టే అవకాశం ఉండడంతో.. తమకు సహకరించాలని అఖిలపక్షం ద్వారా కేంద్రం బతిమాలుతోంది. ఇదిలా ఉంటే.. VIDEO | Delhi: Visuals from all party meeting being held ahead of the Budget Session.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#Delhi pic.twitter.com/GUDbDQmwcQ— Press Trust of India (@PTI_News) January 27, 2026 జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ రేపు.. రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతాయి. కేంద్రం జనవరి 29న ఆర్థిక సర్వే.. ఫిబ్రవరి 1న ఆదివారంనాడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీతో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. అలాగే.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. -
వీడియో వైరల్: ‘కాలింగ్ బెల్’ తెచ్చిన తంటా..
ఢిల్లీ: ఒక చిన్న పొరపాటు తీవ్ర ఘర్షణకు దారితీసింది. శనివారం రాత్రి గ్రేటర్ నోయిడాలోని బీటా-2 ప్రాంతంలోన నింబస్ సొసైటీలో ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాత్రి 10 గంటల సమయంలో ఒక డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు.. దీంతో ఆగ్రహంతో సదరు ఫ్లాట్ యజమాని సెక్యూరిటీ గార్డులను పిలిచాడు.సెక్యూరిటీ గార్డులకు, డెలివరీ ఏజెంట్కు మధ్య వాగ్వాదం మొదలై చివరకు అది దాడికి దారితీసింది. డెలివరీ బాయ్ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో, 12 మందికి పైగా యువకులు బైక్లపై కర్రలు, రాడ్లతో సొసైటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలు, రాడ్లు, పిడిగుద్దులతో పరస్పరం దాడులకు దిగారు. ‘‘పొరపాటున బెల్ కొట్టినందుకు సెక్యూరిటీ గార్డులు డెలీవరి బాయ్పై దాడి చేశారు. ఆగ్రహించిన డెలీవరి బాయ్ తన తోటి మిత్రులను పిలవడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది" అంటూ ఓ సంస్థ ఈ వీడియో ట్వీట్ చేసింది. గొడవ జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే బైక్లపై వచ్చిన వారు పారిపోయారు. కొందరైతే తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో బెల్ కొట్టిన డెలివరీ ఏజెంట్తో పాటు గొడవకు దిగిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. బైక్లపై వచ్చి దాడిలో పాల్గొన్న మిగిలిన యువకులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.IITL Nimbus Express Parkview 2, Greater NoidaDelivery boy rang doorbell of the wrong flat by mistake. Flat owner called the society security guards who assaulted the Rider. Angry Rider also called his fellow riders and after that it was free for all.pic.twitter.com/egTQ51xwxp— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 25, 2026 -
ఖర్గే, రాహుల్కు మూడో వరుసా?
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలు ప్రొటోకాల్ రగడకు వేదికయ్యాయి. విపక్ష నేతలకు వెనక వరుసల్లో సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. సోమవారం కర్తవ్యపథ్లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీకి మూడో వరుసలో స్థానం కల్పించారు. లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన వారిద్దరినీ మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. వారు మూడో వరుసలో కూర్చున్న ఫొటోలను ఆ పారీ్టకి చెందిన పలువురు నేతలు ఎక్స్లో పంచుకున్నారు.తమ నేతలకు సీట్ల కేటాయింపులో వివక్ష ఎందుకని నిలదీశారు. ఇవి చిల్లర చేష్టలంటూ మండిపడ్డారు. మోదీ సర్కారు ఆత్మన్యూనతకు ఈ ఉదంతం నిదర్శనమని రణ్దీప్ సుర్జేవాలా తదితరులు విమర్శించారు. యూపీఏ హయాంలో బీజేపీకి చెందిన విపక్ష నేత ఎల్కే అడ్వాణీకి తొలి వరుసలోనే స్థానం దక్కేదని వారు గుర్తు చేశారు. అయితే వేడుకలు ప్రారంభమైన కాసేపటికి ఖర్గే మొదటి వరుసలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పక్క సీటుకు మారారు. కాంగ్రెస్ విమర్శల్లో అహంకారమే తప్ప మరేమీ లేదంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనేవాలా ఎదురుదాడికి దిగారు.क्या देश के विपक्ष के नेता के साथ ऐसा व्यवहार किसी मर्यादा, परंपरा और प्रोटोकॉल के मापदंड पर खरा उतरता है ?ये केवल हीन भावना से ग्रस्त सरकार की कुंठा दिखाता है ।प्रजातंत्र में मतभेद रहेंगे मगर श्री @RahulGandhi के साथ किया जाने वाला ये व्यवहार अस्वीकार्य है। pic.twitter.com/b4mdU9BU7G— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2026 -
టికెట్ల కోసం పైరవీలు వద్దు.. క్షేత్రస్థాయిలో నిలబడండి..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజకీయమంటే మైకుల ముందు ఉపన్యాసాలు దంచడం కాదు.. ఓటరు జాబితాలో అక్రమాలను అడ్డుకోవడం! ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయాలు నడిపే రోజులు పోయాయి.. ఇకపై ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా నిలబడాల్సిందే. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు.. బూత్ స్థాయి పోరాటమే శరణ్యం’అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హరియాణాలోని కురుక్షేత్రలో జరిగిన పార్టీ శిక్షణ శిబిరంలో ఆయన 2029 ఎన్నిక లను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు తగు హెచ్చరి కలు చేశారు. బీజేపీ అధికార బలంతో వ్యవస్థలను హైజాక్ చేస్తోందంటూ ఆయన.. ‘కాంగ్రెస్ నాయకులు ఇకపై యుద్ధం చేయాల్సింది వేదికలపై కాదు, ఓటరు జాబితాలపై’అని స్పష్టం చేశారు.అసలు కథ బూత్లోనే ఉంది..బీజేపీ గెలుపు గురించి రాహుల్గాంధీ మాట్లాడుతూ, ‘వాళ్లు కేవలం ప్రచారంతో గెలవడం లేదు. అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఓటరు లిస్టుల ను ట్యాంపర్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారు. అందుకే మన నిఘా బూత్ స్థాయి నుంచే మొదలుకావాలి. ప్రతీ గల్లీలో పహారా కాయాలి. నిరుద్యోగం, రైతు సమస్యలు, ధరల పెరు గుదల వంటి అంశాలను ఆయుధాలుగా మలుచు కుని జనంలోకి వెళ్లాలి’అని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనా తీరుపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రచారం, ఈవెంట్ల మయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ‘ప్రకటనలు, ఆర్భాటాలతో ప్రజాస్వా మ్యం బతకదు. బీజేపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటోంది. ఓటరు జాబితా నుంచి ఈవీఎంల నిర్వహణ వరకు ప్రతి చోటా వారి కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. హరియా ణాలో ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలు ఇకపై ప్రతి గల్లీలో, ప్రతి బూత్లో కాపలాదారులుగా మారాలి. కేవలం ఓట్లు అడగడమే కాదు.. మన ఓట్లను కాపాడుకోవడం కూడా యుద్ధంలో భాగమే’అని రాహుల్ ఉద్బోధించారు.నేనే రాజు అనుకుంటే కుదరదు..సొంత పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, పైరవీ రాజకీయాలపై రాహుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వేదికపై ఉన్న సీనియర్ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. ‘కొందరు నేతలు తమను తాము పార్టీ కంటే గొప్పవారని, తాము లేకపోతే పార్టీయే లేదని భ్రమపడుతున్నారు. అలాంటి వారి వెనుక తిరగడం, వారి కోటరీలలో చేరడం జిల్లా అధ్యక్షులు మానుకోవాలి. టికెట్ల కోసం ఢిల్లీలో సిఫార్సులు, పెద్దల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి కాలం చెల్లింది. గ్రూపు రాజకీయాలను నేను సహించను. ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉంటారో వారికే భవిష్యత్తు ఉంటుంది. మీరే క్షేత్రస్థాయిలో సేనాపతులు. ఎవరి బెదిరింపులకు లొంగకండి. కష్టపడి పనిచేసే వారికే టికెట్ దక్కుతుంది తప్ప.. సిఫార్సులతో వచ్చే వారికి కాదు,’అని రాహుల్ తేల్చి చెప్పారు. బీజేపీకి చెక్ పెట్టాల్సిందేసంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు డేటా మేనేజ్మెంట్, బూత్ స్థాయి కమిటీలే కీలకమని రాహుల్ స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటాల కంటే, క్షేత్రస్థాయి నిఘానే 2029లో కాంగ్రెస్ను గెలిపిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీ యంత్రాంగాన్ని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ కూడా సాంకేతికతను, డేటాను నమ్ముకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. బూత్ మేనేజ్మెంట్లో డేటా అనలిటిక్స్ను ఉపయోగించుకోవాలని, ఇది బీజేపీ సంస్థాగత బలానికి గట్టి పోటీ ఇస్తుందని ఆయన సూచించారు. -
నాకు జీవితకాల గౌరవం!
న్యూఢిల్లీ: పలు రంగాల్లో భారత్ సాధిస్తున్న అద్భుత విజయాలు ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా, ప్రగతిశీలంగా, సురక్షితంగా తీర్చిదిద్దుతాయని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ పేర్కొన్నారు. తద్వారా అన్ని దేశాలూ ఎంతగానో లబ్ధి పొందుతాయని ఆమె అన్నారు. కర్తవ్యపథ్ వేదికగా భారత గణతంత్ర ఉత్సవాలను తిలకించడాన్ని అద్భుత అనుభూతిగా అభివరి్ణంచారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో పాటు ఉర్సులా సోమవారం గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం తెలిసిందే. ఆ అనుభూతిని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘నాకు నిజంగా జీవితకాల గౌరవమిది. గణతంత్ర వేడుకల్లో ఈయూ పతాకం, మా సైనిక కూటమికి చెందిన పతాకాలు రెపరెపలాడాయి. భారత్తో ఈయూ సమాఖ్య నడుమ నానాటికీ బలపడుతున్న రక్షణ బంధానికి అవి తార్కాణం. మంగళవారం కుదిరే భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందాలతో ఆ బంధం మరింత బలోపేతం కానుంది’’అని ఎక్స్ పోస్టులో ఉర్సులా ఆశాభావం వెలిబుచ్చారు. ఈయూ నేతలు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ వేడుకలకు మోదీ సర్కారు ఏటా విదేశీ నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ వస్తోంది. -
యాప్రే యాప్..
మొబైల్ అంటేనే యాప్స్. ఉత్పాదకత, వినోదం, సోషల్ మీడియా, విద్య, యుటిలిటీ, ఈ–కామర్స్.. అవసరం ఏదైనా మొబైల్ అప్లికేషన్స్తోనే (యాప్స్) మన జీవితం ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 14,900 కోట్ల యాప్ డౌన్లోడ్స్ నమోదయ్యాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. డౌన్లోడ్స్తోపాటు వినియోగంలోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది.ఐఓఎస్, గూగుల్ ప్లే స్టోర్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి వివిధ రకాల యాప్స్నకుగాను 2,84,000 డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఫీచర్స్, కంటెంట్, సేవల కోసం మొబైల్ యూజర్లు ఈ యాప్స్నకు నిమిషానికి రూ.2.9 కోట్లు ఖర్చు చేశారు. తొలిసారిగా గేమ్స్ కంటే యాప్స్పై అధికంగా వ్యయం చేశారని అమెరికాకు చెందిన డిజిటల్ ఇంటెలిజెన్స్, యాప్ డేటా ఎనాలిసిస్ కంపెనీ సెన్సార్ టవర్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యాప్ల కథాకమామీషు ఎలా ఉందో చూద్దాం.. -
గణతంత్ర వేడుకల్లో ‘సిందూర’ స్ఫూర్తి!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ శకటం, ఆ పోరాటంలో పాక్ పీచమణచిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, అతి శక్తిమంతమైన క్షిపణులు, కొత్త తరం యుద్ధ విమానాలు, సరికొత్త సైనిక విభాగాలు... ఇలా అమేయమైన భారత సైనిక శక్తిని 77వ గణతంత్ర దిన వేడుకలు కళ్లకు కట్టాయి. సిందూర్ థీమ్తో రూపొందిన భారత సైన్య శకటం అందరినీ ఆకట్టుకుంది. ఇక దేశీయంగా రూపొందించిన పలు ప్రళయ భీకర ఆయుధాలు ఆహూతులను ఆద్యంతం అలరించాయి. ముఖ్యంగా 150 ఏళ్ల వందేమాతరం థీమ్ ఉర్రూతలూగించింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికగా నిలిచాయి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ ఈసారి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారిని వెంటబెట్టుకుని సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేడుకలకు విచ్చేశారు. అనంతరం త్రివిధ దళాధిపతి హోదాలో సైనిక వందనం అందుకున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, సైనిక, ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. పలు రంగాల ప్రముఖులతో పాటు మొత్తం 10 వేల మందికి పైగా వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ‘సారే జహా సె అచ్ఛా’, ‘కదం కదం బఢాయె జా’వంటి దేశభక్తి గీతాలతో పాటు వందేమాతరం అందరిలోనూ స్ఫూర్తి నింపాయి. 90 నిమిషాల పాటు జరిగిన వేడుకలో 18 సైనిక దళాలు, 13 సైనిక బ్యాండ్లు అలరించాయి. వేడుక అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక అతిథులతో పాటుగా గుర్రపు బగ్గీలోనే వెనుదిరగడం విశేషం. సాయుధ పాటవం సాహో... త్రివిధ దళాల సైనిక పాటవ ప్రదర్శనకు గణతంత్ర వేడుకలు వేదికగా నిలిచాయి. గణతంత్ర పరేడ్కు పరేడ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీశ్ కుమార్ సారథ్యం వహించారు... → బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణులు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ, అర్జున్ యుద్ధ ట్యాంకు, ధనుష్ ఆర్లిటరీ గన్స్, దివ్యాస్త్ర బ్యాటరీ వంటివి అందరినీ అలరించాయి. → 100 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన స్ఫూర్తిదాయకమైన ‘భిన్నత్వంలో ఏకత్వం’థీమ్ ఆకట్టుకుంది. → స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా సైన్యం ‘యుద్ధ వ్యూహ అమరిక’ద్వారా తన పాటవాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించడం విశేషం. → ఆ క్రమంలో, గత మేలో పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్లో కీలకపాత్ర పోషించిన క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలను కళ్లకు కడుతూ రూపొందించిన త్రివిధ దళాల శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. → ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్, ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో శకటం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. సిందూర్ ఆపరేషన్ వేళ బ్రహ్మోస్ క్షిపణులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర వ్యవస్థలతో పాటు పాక్లోని కీలక నగరాల్లో ఎయిర్ బేస్లను నేలమట్టం చేయడం, ఎస్–400 డిఫెన్స్ వ్యవస్థలు పాక్దాడులను పూర్తిస్థాయిలో అడ్డుకోవడం తెలిసిందే. → టీ–90 భీష్మ, అర్జున్ యుద్ధట్యాంకులు, బీఎంపీ–2 పదాతి దళ వాహనం, నాగ్ క్షిపణి వ్యవస్థ ముందు నడుస్తుండగా తేలికరకం అత్యాధునిక ధ్రువ్, అపాచీ ఏహెచ్–64ఈ, ప్రచండ్ హెలికాప్టర్లు వాటికి రక్షణగా సాగాయి. రోబోటిక్ శునకాలు, మానవరహిత యుద్ధ వాహనాలు వాటిని అనుసరించాయి. → భారీ వాహనాలపై తరలివచ్చిన శక్తిబాణ్, దివ్యాస్త్ర తర్వాత తరపు అత్యాధునిక యుద్ధ సామర్థ్యానికి అద్దం పట్టాయి. → కొత్తగా ఏర్పడిన భైరవ్ పదాతి దళ బెటాలియన్ కవాతు ఆకట్టుకుంది. సంప్రదాయ పదాతి దళం, ప్రత్యేక దళాల మేలుకలయికగా దీన్ని రూపొందించారు. → నేవీ, వాయు సేన నుంచి 144 మంది చొప్పున యువ సిబ్బందితో జరిగిన కవాతులు అలరించాయి. → క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన నావ థీమ్తో రూపొందించిన నావిక దళ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. → డీఆర్డీఓ రూపొందించిన అత్యాధునిక హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ ఎల్ఆర్–ఏఎస్హెచ్ఎంను అంతా ఆసక్తిగా తిలకించారు. → సీఆర్పీఎఫ్, సశస్త్ర సీమాబల్ డేర్డెవిల్ మోటార్సైకిల్ రైడర్ బృందాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. → ఇక ఆహూతులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఏరియల్ ఫ్లైపాస్ట్ విన్యాసాలు ఉర్రూతలూగించాయి. 29 విమానాలు ఇందులో పాల్గొన్నాయి. వాటిలో 16 యుద్ధ విమానాలు కాగా నాలుగు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు. → రాఫెల్, మిగ్–29, సెఖోయ్–30 జాగ్వార్ యుద్ధ విమానాలు ఆపరేషన్ సిందూర్ను తలపించేలా స్పియర్హెడ్ ఆకృతిలో ఒళ్లు గగ్గుర్పొడిచే విన్యాసాలు ప్రదర్శించాయి. → కర్తవ్య పథ్లో కవాతు చేసిన 30 శకటాలు దేశ సాంస్కృతిక ఘనతకు, వైవిధ్యానికి అద్దం పట్టాయి. వీటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి 17 కాగా, 19 కేంద్ర ప్రభుత్వ శాఖలు, త్రివిధ దళాలకు చెందినవి. రక్షణ పాటవానికి అద్దం: మోదీ గణతంత్ర వేడుకలు భారత రక్షణ పాటవానికి అద్దం పట్టాయని మోదీ పేర్కొన్నారు. మన సన్నద్ధతకు, సాంకేతిక సామర్థ్యానికి, పౌరుల భద్రత పట్ల తిరుగులేని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచాయని ఎక్స్ పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ‘‘ఈ వేడుకల్లో ఈయూ అధినేతలకు ఆతిథ్యమివ్వడం భారత్కు గొప్ప గౌరవం. నానాటికీ బలపడుతున్న భారత్, ఈయూ బంధానికి ఇది అద్దం పట్టింది’’అన్నారు.ఎన్నెన్నో ‘తొలి’ఘనతలు! ఈ గణతంత్ర వేడుకలు పలు ‘తొలిసారి’ఘనతలకు వేదికగా నిలిచాయి... → కొత్తగా ఏర్పాటైన పదాతి దళ భైరవ్ లైట్ కమెండో బెటాలియన్, శక్తిబాణ్ రెజిమెంట్, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ వంటివెన్నో వీటిలో ఉన్నాయి. శక్తిబాణ్ను డ్రోన్, కౌంటర్ డ్రోన్ రెజిమెంట్గా తీర్చిదిద్దారు. → రెండు మూపురాల బ్యాక్ట్రియన్ ఒంటెలు, జన్స్కార్ అశ్వాలు తొలిసారి పరేడ్లో పాలుపంచుకున్నాయి. → 61వ అశ్వికదళ సభ్యులు కూడా తొలిసారి కవాతులో పాల్గొన్నారు. → లద్దాఖ్, డోగ్రా, అరుణాచల్, కుమాయూన్, ఘడ్వాల్, సిక్కిం స్కౌట్స్ సభ్యులతో కూడిన మిశ్రమ స్కౌట్స్ దళం కూడా సైనిక దుస్తుల్లో తొలిసారిగా అలరించింది. → డీఆర్డీవో రూపొందించిన నౌకా విధ్వంసక హైపర్సోనిక్ క్షిపణి ఎల్ఆర్–ఏఎస్హెచ్ఎం కూడా తొలిసారి పరేడ్లో పాల్గొంది. → రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ తరఫున సైనిక శునకాలు, డేగలు కూడా ఈసారి పరేడ్లో భాగస్వాములు కావడం విశేషం. → సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో సాగిన కవాతుకు మహిళా సైనికాధికారి సారథ్యం వహించారు. ఈయూ సైనిక దళాలు ఈసారి గణతంత్ర కవాతులో యూరోపియన్ యూనియన్కు చెందిన సైనిక దళాలు కూడా పాల్గొనడం విశేషం. ఈయూ సైనిక పతాకతో పాటు ఆపరేషన్ అట్లాంటా, ఆస్పిడెస్ నేవీ ఆపరేషన్ల తాలూకు పతకాలతో అలరించాయి. యూరప్ బయట ఇలాంటి వేడుకల్లో ఈయూ దళాలు పాల్గొనడం ఇదే తొలిసారి!నారీ శక్తిని చాటిన సిమ్రన్ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాల ఈసారి గణతంత్ర పరేడ్లో నారీ శక్తికి ప్రతీకగా నిలిచారు. పూర్తిగా పురుషులతో కూడిన 147 మంది సభ్యుల సీఆర్పీఎఫ్ దళానికి ఆమె సారథ్యం వహించి చరిత్ర సృష్టించారు. ‘దేశ్ కే హమ్ రక్షక్’గీతం నేపథ్యంలో విని్పస్తుండగా ఆమె నాయకత్వంలో సీఆర్పీఎఫ్ దళం కవాతు సాగింది. గణతంత్ర వేడుకల్లో పూర్తిగా పురుషులతో కూడిన సైనిక దళానికి మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాకు చెందిన 26 ఏళ్ల సిమ్రన్ గతేడాదే సీఆరీ్పఎఫ్లో చేరారు. ఆ జిల్లా నుంచి ఆఫీసర్ హోదాలో అందులో చేరిన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం. సిమ్రన్ స్వగ్రామం నౌషేరా నియంత్రణ రేఖకు కేవలం 11 కి.మీ. దూరంలోనే ఉంటుంది. ఆమె తాత కూడా సైన్యంలో పని చేశారు.ఆకట్టుకున్న మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన తలపాగా అందరినీ ఆకట్టుకుంది. ఈసారి ఆయన బంగారు జరీతో నేసిన నెమలీక ముద్రలతో కూడిన ముదురు ఎరుపు రంగు, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన తలపాగా ధరించారు. ముదురు నీలం, తెలుపు రంగుల కుర్తా పైజామా, తేల నీలం రంగు హాఫ్ జాకెట్ ధరించారు. పదేళ్లకు పైగా పంద్రాగస్టు, గణతంత్ర వేడుకల్లో మోదీ రంగుల తలపాగాలు ధరిస్తూ వస్తుండటం తెలిసిందే. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ కూడా భారత సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. సాధారణ ప్యాంటు, సూటుకు బదులుగా ఆమె ముదురు ఎరుపు, బంగారు రంగులతో కూడిన పట్టు బంద్గలా ధరించారు. నదుల పేర్లు ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆహూతుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లకు ఈసారి వీవీఐపీ, వీఐపీ వంటి పేర్లకు బదులుగా నదుల పేర్లు పెట్టడం విశేషం. బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసీ, కృష్ణ, మహానది, నర్మద, పెన్నా, పెరియార్, రావి, సోన్, సట్లెజ్, తీస్థా, వైగై, యమున పేర్లతో ఎన్క్లోజర్లను రూపొందించారు. జనవరి 29న రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకకు కూడా ఆహూతుల ఎన్క్లోజర్లకు వినూత్నంగా వేణువు, డమరుకం, ఎక్తారా, మృదంగం, నగాడా, పఖావజ్, సంతూర్, సారంగి, సరోద్, షెహనాయ్, సితార్, తబలా, వీణ వంటి భారత సంప్రదాయ సంగీత వాయిద్యాల పేర్లు పెట్టనున్నారు.వందేమాతరం స్ఫూర్తి ఈసారి వేడుకల్లో వందేమాతరం థీమ్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ గేయంలోని తొలి చరణాలకు అద్దం పట్టే తేజేంద్రకుమార్ మిత్రా వంటి కళాకారుల పురాతన పెయింటింగుల నమూ నాలను ఆహూతుల ఎన్క్లోజర్లపై ప్రద ర్శించారు. జాతీయోద్యమంలో దేశమంతటా స్ఫూర్తి నింపిన ఈ గేయ రచనకు ఈ సంవత్సరమే 150 ఏళ్లు నిండటం తెలిసిందే. ఆ సందర్భంగా ‘150 ఏళ్ల వందేమాతరం’థీమ్కు గణతంత్ర వేడు కల్లో ప్రాధాన్యం దక్కింది. ఆహ్వానపత్రికల నుంచి పరేడ్ల దాకా అన్నింట్లోనూ వందేమాతరం లోగో దర్శనమిచ్చింది. -
రేపు అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై చర్చ
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) ఉదయం గం. 11లకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన ఆర్థికసర్వే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామాన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది. అయితే ఇలా ఆదివారం రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండగా, మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంచితే, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్ఐఆర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం పలు కీలక బిల్లులను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఈసారి పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన పరేడ్లో.. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలు ఇలా..77వ గణతంత్ర దినోత్సవం: 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని.. భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.ముఖ్య అతిథులు: ఈ ఏడాది యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.యుద్ధ స్మారకం వద్ద నివాళి: ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించి, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.రాష్ట్రపతి రాక: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ముఖ్య అతిథులతో కలిసి సంప్రదాయ 'రాష్ట్రపతి బగ్గీ'లో కర్తవ్య పథ్కు చేరుకున్నారు.జాతీయ జెండా ఆవిష్కరణ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం, 21 గన్ సెల్యూట్తో గౌరవ వందనం సమర్పించారు.బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన: పరేడ్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అపాచీ హెలికాప్టర్ల గర్జన: గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు తమ విన్యాసాలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ధనుష్ గన్ సిస్టమ్: భారత సైన్యానికి వెన్నెముకగా నిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ పరేడ్లో భాగస్వామ్యం వహించింది.అశోక చక్ర ప్రదానం: అంతరిక్ష యాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దేశ అత్యున్నత పురస్కారం ‘అశోక చక్ర’ను రాష్ట్రపతి ప్రదానం చేశారు.యూరోపియన్ యూనియన్ బృందం: తొలిసారిగా ఈ పరేడ్లో యూరోపియన్ యూనియన్ (EU) మిలిటరీ బృందం పాల్గొని గౌరవ వందనం సమర్పించింది.ఆపరేషన్ సింధూర్ : ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇతివృత్తంతో రూపొందించిన శకటం ప్రత్యేక గుర్తింపు పొందింది.61వ కావల్రీ: ప్రపంచంలోనే ఏకైక క్రియాశీల గుర్రపు దళం అయిన '61వ కావల్రీ' పరేడ్లో తన రాజసాన్ని ప్రదర్శించింది.వందేమాతరం థీమ్: ఈ ఏడాది పరేడ్ ‘వందేమాతరం - 150 ఏళ్లు’ అనే ప్రత్యేక థీమ్తో సాగింది.రాష్ట్రాల శకటాలు: దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మరో 13 వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు ప్రదర్శనలో నిలిచాయి.వికసిత్ భారత్ 2047: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో వేడుకలు జరిగాయి.కర్నల్ సోఫియా ఖురేషీకి గౌరవం: ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీకి ‘విశిష్ట సేవా మెడల్’ ప్రకటించారు.పద్మ అవార్డుల ప్రకటన: గణతంత్ర వేడుకల సందర్భంగా 131 మందికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.ట్రాఫిక్ ఆంక్షలు: పరేడ్ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.లైవ్ స్ట్రీమింగ్: దేశ ప్రజలందరూ వీక్షించేలా దూరదర్శన్, యూట్యూబ్ ఛానళ్లలో వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఇది కూడా చదవండి: మావోయిస్టు కోటలో మొదటిసారి మువ్వన్నెల రెపరెపలు -
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. సరిహద్దుల్లో అలర్ట్
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తమైంది. భారత్-పాక్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు గస్తీ ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా మోహరించాయి. డ్రోన్లతో ఎల్ఓసీ వెంట బలగాలు నిఘా పెట్టాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం అంతటా భద్రతా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకల కోసం చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురుగ్రామ్, చిల్లా, టిక్రీ, సింఘు, కాపషేరా, బదర్పూర్ మరియు ధౌలా కువాన్ సరిహద్దుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టారు. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్ను పెట్టుకున్నట్లు తెలిపాయి.గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు కొనసాగుతున్నాయి. అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ అభివృద్ధి, సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధాన్ని ప్రతిబింబించేలా పేరేడ్ సాగుతోంది. పరేడ్లో ఆరువేల మంది సైనికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ముజాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ముగణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్మొదటిసారిగా ఇండియన్ ఆర్మీ ‘ఫేజ్డ్ బ్యాటిల్ అరే’ ప్రదర్శనదేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర,భిన్నత్వంలో ఏకత్వం థీమ్పై 100 మంది కళాకారులతో సంగీత నృత్య కార్యక్రమంపరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర, అశోక చక్ర విజేతలుప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానంపరేడ్లో పాల్గొన్న ఐరోపా సమాఖ్య చెందిన సైనిక బృందం150 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్తో 21 సార్లు పేల్చి గౌరవ వందనంశుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానంపూల వర్షం కురిపించిన 4 ఎంఐ-17 హెలికాఫ్టర్లుప్రత్యేక ఆకర్షణగా భారతీయ న్యాయ సంహిత శకటంవేడుకల్లో తొలిసారి జంతు దళం కవాతు జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ముమొదటిసారిగా ఇండియన్ ఆర్మీ ‘ఫేజ్డ్ బ్యాటిల్ అరే’ ప్రదర్శనదేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్వేడుకల్లో భాగంగా వార్ మెమోరియాల్ వద్ద అమరజవాన్లకు ప్రధాని మోదీ నివాళులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బయల్దేరిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మురాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్కు ద్రౌపదీ ముర్ము ద్రౌపదీ ముర్ముతో పాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సైనికులతో పరేడ్ 6,050 మంది సైనికులతో పరేడ్ 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శన 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు కర్తవ్య పథ్ దగ్గర 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పే విధంగా జరిగే కవాతు ఆయుధ ప్రదర్శన వైమానిక విన్యాసాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఏఐ స్మార్ట్ కళ్లజోళ్లతో నిఘా ఏర్పాట్లు #WATCH | Preparation visuals from Kartavya Path ahead of the 77th Republic Day Parade. pic.twitter.com/j3LY0Xdzfj— ANI (@ANI) January 26, 2026 -
10వేల కిలోల పేలుడు పదార్థాలు.. డిటోనేటర్లు లభ్యం
జైపూర్: గణతంత్ర దినోత్సవం ముందు రోజు దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజస్థాన్లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా పేలుడు పదార్థాలను ఇటీవల ఢిల్లీ ఎర్రకోట కారు పేలుళ్లకు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. హార్సౌర్ గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9,550 కిలోల అమోనియం నైట్రేట్ను 187 సంచుల్లో నింపి ఒక పొలంలో దాచినట్లు గుర్తించారు. నాగౌర్ జిల్లా జిల్లా ఎస్పీ మృదుల్ కచ్చావా ఈ వివరాలను వెల్లడించారు.అమోనియం నైట్రేట్ గతంలో అనేక పేలుళ్లలో ఉపయోగించినట్లు తెలిపారు. ముఖ్యంగా, 2025 నవంబర్లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో ఈ రసాయనం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తుచేశారు. హార్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.అమోనియం నైట్రేట్తో పాటు పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు,12 కార్టన్లు, 15 బండిల్స్ బ్లూ ఫ్యూస్ వైర్లు, 12 కార్టన్లు, ఐదు బండిల్స్ రెడ్ ఫ్యూస్ వైర్లు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక విచారణలో సులేమాన్ ఖాన్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎక్స్ప్లోజీవ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.గణతంత్ర దినోత్సవానికి ముందు ఇంత భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉగ్రకుట్రలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తోంది. -
ఏఎస్పీ రవికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం–2026 సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన పతకాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు మొత్తం 19 పతకాలు వరించాయి. పోలీస్ విభాగంలో ఒకరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం) వరించింది. మరో 15 మందికి ప్రతిభావంతమైన సేవా పతకాలు (ఎంఎస్ఎం) దక్కాయి. జైళ్ల శాఖ (కరెక్షనల్ సర్వీసెస్) నుంచి ముగ్గురు సిబ్బంది పతకాలకు ఎంపికయ్యారు.రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఇచ్చే ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్వి‹Ù్డ సర్వీస్’ ఈసారి రాష్ట్రం నుంచి ఒకే ఒక్క పోలీసు అధికారికి దక్కింది. తిరుపతి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రవి మనోహర తిరుమల చారి ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా. పోలీస్ ప్రతిభావంతమైన సేవా పతకాలు విధి నిర్వహణలో అంకితభావం చాటుకున్న అడిషనల్ ఎస్పీ నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది వరకు మొత్తం 15 మందికి ‘పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ లభించింది. ⇒ సింగాల కృష్ణమోహన్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ⇒ రాయపు శివారెడ్డి, డీఎస్పీ ⇒ పోలవరపు వెంకట శేష నాగమల్లికార్జునరావు, అసిస్టెంట్ కమాండెంట్ ⇒ కరజాడ రామారావు, అసిస్టెంట్ కమాండెంట్ ⇒ కుందేటి నరసింహారావు, ఇన్స్పెక్టర్ ⇒ కామవరపు విక్రమరావు, సబ్ ఇన్స్పెక్టర్ ⇒ షేక్ షఫీ ఉల్లా, సబ్ ఇన్స్పెక్టర్ ⇒ కటారి జయరామ్, ఆర్మ్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ ఈత వెంకటకృష్ణ మునేశ్వరరావు, ఆర్మ్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ చిన్నావుల శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ మాదాసు గంగాధరరావు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ అబ్రహం అన్నలదాసు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ కొప్పిశెట్టి రామకృష్ణ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ⇒ గళ్ల రంగయ్య, హెడ్ కానిస్టేబుల్ ⇒ కాళీదేవి నరసింహులు, హెడ్ కానిస్టేబుల్ ⇒ జైళ్ల శాఖలో ఉత్తమ సేవలందించినందుకు జైలర్ గొల్లపోతు రవిబాబు, చీఫ్ హెడ్ వార్డర్ దోనేపూడి ⇒ వెంకట కృష్ణప్రసాద్, హెడ్ వార్డర్ గేరా ఆనందరావుకు ‘మెరిటోరియస్ సర్విస్ మెడల్స్’ లభించాయి. -
వికసించిన పద్మాలు
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను ఆదివారం విడుదల చేసిన ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన 131 మంది ప్రముఖులకు స్థానం దక్కింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈసారి అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా, 16 మందికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించారు. అలాగే విదేశీయులు, ఎన్నారైల విభాగంలో ఆరుగురు ఎంపికయ్యారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడలు తదితర రంగాల్లో నిష్ణాతులైన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. దేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే పద్మవిభూషణ్ పురస్కారం ఈసారి బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రసింగ్ దేవల్ (మహారాష్ట్ర), కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్లను మరణానంతరం వరించింది. వీరితో పాటు ప్రజా వ్యవహారాల విభాగంలో కె.టి.థామస్(కేరళ), కళల విభాగంలో ఎన్.రాజమ్(ఉత్తరప్రదేశ్), సాహిత్యం, విద్య విభాగంలో పి.నారాయణన్ (కేరళ) ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. ఇక విశిష్ట సేవలకుగాను ఇచ్చే పద్మభూషణ్ జాబితాలో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, మలయాళీ నటుడు మమ్ముట్టి, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్, ప్రచార రంగ దిగ్గజం పియూష్ పాండే వంటి వారున్నారు. తెలుగు రాష్ట్రాలకు పద్మ పంటతెలుగు రాష్ట్రాలకు ఈసారి పద్మ పురస్కారాల్లో పెద్దపీట దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ను కళల విభాగంలో పద్మశ్రీ వరించింది. అలాగే గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళలు), మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి(సాహిత్యం) ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి(కళలు), వైద్య రంగంలో గూడూరు వెంకట రావు, పాల్కొండ విజయ్ఆనంద్రెడ్డి పద్మశ్రీ అందుకోనున్నారు. సైన్స్ రంగంలో చంద్రమౌళి గడ్డముణుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్, పశుసంవర్థక విభాగంలో రామారెడ్డి మామిడి (మరణానంతరం) తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేశారు. అలాగే.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్, తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్ సాహిత్యం, విద్యా రంగంలో పద్మశ్రీ వరించింది. క్రీడా, సినీ రంగాలకు చెందిన పలువురు ఇతర ప్రముఖులకు కూడా పద్మశ్రీ దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్ భుల్లర్, హాకీ క్రీడాకారిణి సవితా పునియాలను పద్మశ్రీ వరించింది. సినీ రంగం నుంచి బెంగాలీ నటుడు ప్రోసెన్జిత్ ఛటర్జీ, మరణానంతరం నటుడు సతీష్ షా, అనిల్ కుమార్ రస్తోగి ఈ జాబితాలో ఉన్నారు. మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కారాలు అందుకోనున్నారు.ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు ⇒ మాగంటి మురళీమోహన్(కళల విభాగం) ⇒ గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళల విభాగం) ⇒ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) కళల విభాగం ⇒ వెంపటి కుటుంబ శా్రస్తి(సాహిత్యం మరియు విద్య) తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు ⇒ దీపికా రెడ్డి (కళల విభాగం) ⇒ గూడూరు వెంకట రావు (వైద్య విభాగం) ⇒ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్య విభాగం) ⇒ చంద్రమౌళి గడ్డముణుగు (సైన్స్–ఇంజనీరింగ్) ⇒ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (సైన్స్, ఇంజనీరింగ్) ⇒ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజనీరింగ్) ⇒ రామారెడ్డి మామిడి (మరణానంతరం)–పశుసంవర్థక విభాగంపద్మవిభూషణ్ (5) దేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం ఐదుగురిని వరించింది. ⇒ ధర్మేంద్రసింగ్ దేవల్ (మరణానంతరం): కళలు (మహారాష్ట్ర) ⇒ కె.టి.థామస్: ప్రజా వ్యవహారాలు (కేరళ) ⇒ ఎన్.రాజమ్: కళలు (ఉత్తర ప్రదేశ్) ⇒ పి.నారాయణన్: సాహిత్యం మరియు విద్య (కేరళ) ⇒వి.ఎస్.అచ్యుతానందన్ (మరణానంతరం): ప్రజా వ్యవహారాలు (కేరళ) పద్మభూషణ్ (13) విశిష్ట సేవలకు గాను 13 మందిని పద్మభూషణ్ వరించింది. ⇒ అల్కా యాగ్నిక్: కళలు (మహారాష్ట్ర) ⇒ మమ్ముట్టి: కళలు (కేరళ) ⇒ ఉదయ్ కోటక్: వాణిజ్యం, పరిశ్రమలు (మహారాష్ట్ర) ⇒ భగత్ సింగ్ కోష్యారీ: ప్రజా వ్యవహారాలు (ఉత్తరాఖండ్) ⇒ విజయ్ అమత్రాజ్: క్రీడలు (అమెరికా) ⇒ పియూష్ పాండే (మరణానంతరం): కళలు (మహారాష్ట్ర)‘ఆకాశ్’ మార్గదర్శకుడుమధిర: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆకాశ్ క్షిపణి మాజీ డైరెక్టర్ డా.గడ్డముణుగు చంద్రమౌళి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. 1958 నవంబర్ 9న మధిరలో గడ్డమణుగు సత్యనారాయణరావు, సరస్వతిదేవి దంపతులకు జన్మించిన చంద్రమౌళి.. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివారు. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పట్టా పొందారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లో 34 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు.మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం టీమ్లో సమర్థవంతంగా పనిచేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రఖ్యాతిగాంచిన ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేసి భారత ప్రభుత్వం మన్ననలు పొందారు. ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్గా భారత వైమానిక దళం, సైన్యం కోసం క్షిపణి ఉత్పత్తి బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన మార్గదర్శకత్వంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ విజయవంతంగా అభివృద్ధి చెందింది. 60 కంటే ఎక్కువ ఆకాశ్ క్షిపణుల విజయవంతమైన ప్రయోగాలను పర్యవేక్షించి, వ్యవస్థ పనితీరుపై రక్షణ దళంలో విశ్వాసాన్ని పెంచారు. ఆకాశ్ ప్రాజెక్ట్ ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమకు రూ.22 వేల కోట్లకుపైగా ఆర్డర్లు లభించాయి.వైద్యరంగంలో విశిష్ట సేవలకు..సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్ డా.గూడూరు వెంకట రావును పద్మశ్రీ వరించింది. ఏఐజీ హైదరాబాద్ ఆసుపత్రి ఆర్కిటెక్చర్గా, సహ వ్యవస్థాపకుడిగా, అంతర్జాతీయంగా వైద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గ్యాస్ట్రోఎంట్రాలజీలో వెంకటరావుకు మూడు దశాబ్దాలకుపైగా క్లినికల్ అనుభవం ఉంది. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ జీవీ రావుగా పిలిచే ఆయన ఇప్పటివరకు 12,000కు పైగా సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ‘ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ’లాంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు నిర్వహించినవారిలో ఆద్యుడు. డయాబెటిస్ చికిత్స కోసం ‘మ్యాక్రో ఎన్క్యాప్సులేషన్ డివైజ్’ను రూపొందించిన వైద్యనిపుణుడిగా ఖ్యాతిగడించారు. ప్రత్యేక అనుభూతినిచ్చింది: గూడూరు వెంకట రావు వ్యక్తిగతంగా సాధించిన విజయాలన్నింటిలోనూ పద్మశ్రీ ప్రత్యేక అనుభూతినిచ్చింది. రోగి సంరక్షణకు అంకితభావంతో పనిచేసే నా సహోద్యోగుల బృందానికి, ఏఐజీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను. నా కెరీర్కు మద్దతుగా నిలిచిన డా. నాగేశ్వర్రెడ్డిని తప్పనిసరిగా ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఆపరేషన్ గదికి మించి సంస్థ నిర్మాణం, విద్యా శిక్షణ–పరిశోధన, సమాజానికి సేవ చేసే రంగంలో గుర్తించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తరువాతి తరం సర్జన్లకు శిక్షణ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ, సంస్థల బలోపేతం, నాణ్యమైన వైద్యం అందేలా చూడటం నా ప్రయాణంలో ప్రధానమైన అంశాలు. పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి.. డా.నోరి దత్తాత్రేయుడు (పద్మభూషణ్) సాక్షి, అమరావతి: కేన్సర్ మరణ శాసనం కాదు.. సరైన సమయంలో గుర్తిస్తే ఆ మహమ్మారిని జయించవచ్చని నిరూపించి అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన తెలుగుతేజం, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది. దత్తాత్రేయుడు కృష్ణాజిల్లా మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21న జన్మించారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి 1971లో ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న ఆయన, ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ పూర్తిచేశారు. గాం«దీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులకు 12 మంది సంతానంలో ఆఖరివాడైన నోరి నాలుగో ఏటలోనే తండ్రిని కృష్ణా వరదల్లో కోల్పోయారు. అనంతరం.. అత్యంత పేదరికం అనుభవిస్తూ తన తల్లి కష్టాన్ని గుర్తెరిగిన ఆయన ప్రపంచంలోనే టాప్ అంకాలజిస్టుల్లో ఒకరిగా ఎదిగారు. కేన్సర్ వ్యాధిపై 4 పుస్తకాలు రాశారు.విద్యారంగంలో కృషి.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన జగదీశ్కుమార్కు పద్మశ్రీ అవార్డు లభించింది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విబాగానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. జగదీశ్కుమార్ యూజీసీ చైర్మన్గా, జేఎన్యూ వైస్ చాన్స్లర్గా పని చేశారు. ఆయన తండ్రి రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి జయప్రద పెద్దగా చదువుకోలేదు. ఇంట్లో పెద్దవాడైన జగదీశ్ 1 నుంచి 7 వరకు సొంతూరు మామిడాల ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఇంటర్ వరకు మిర్యాలగూడలో, డిగ్రీ, ఎంఎస్సీ (ఎల్రక్టానిక్స్) హైదరాబాద్లో చదివారు. మద్రాస్ ఐఐటీలో ఎంఎస్ చదివి అక్కడే పీహెచ్డీ పూర్తి చేశారు.కెనడాలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ చేశారు. తర్వాత ఖరగ్పూర్ ఐఐటీలో ప్రొఫెసర్గా పని చేశారు. తర్వాత ఢిల్లీ ఐఐటీలో, జేఎన్యూ ఢిల్లీలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత మూడేళ్లు గేట్ చైర్మన్గా పనిచేశారు. 2016లో ఢిల్లీ జేఎన్యూ వైస్ చాన్స్లర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత కేంద్రం ఆయనను యూజీసీ చైర్మన్గా నియమించింది. నానో ఎల్రక్టానిక్ డివైసెస్, నానో స్కేల్ డివైస్ మోడలింగ్, సిమ్యులేషన్, ఇన్నోవేటివ్ డివైస్ డిజైన్, పవర్ సెమీ కండక్టర్ డివైజ్ విభాగంలో జగదీశ్ నిష్ణాతులు. ఆయన పరిశోధనల ఆధారంగా పలు పేటెంట్లు లభించాయి. బాధ్యతను మరింత పెంచింది: జగదీశ్పద్మశ్రీ అవార్డు నా బాధ్యతను మరింతగా పెంచింది. ఉన్నత విద్యను మరింతగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు సరళంగా అందుబాటులోకి తెచ్చేందుకు చేయాల్సిన కృషిని ఈ అవార్డు నాపై ఉంచింది. రానున్న కాలంలో మన వర్సిటీలు, కళాశాలలను బలోపేతం చేయాలి. ఉపాధ్యాయులకు మరింత శిక్షణ ఇవ్వాలి. ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.గ్రామాల్లో ఆర్థిక సాధికారతకు బాటలుశంషాబాద్: సహకార సంఘాల బలోపేతం.. పాడిపరిశ్రమ అభివృద్ధితో ప్రజలు సాధించే ఆర్థిక సాధికారతే సామాజిక శ్రేయస్సుగా నాలుగు దశాబ్దాలు కృషి చేసిన మామిడి రామారెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. మామిడి భోజిరెడ్డి, లీలావతి దంపతులకు 1942 ఫిబ్రవరి 24న జన్మించారు. ఆయన తండ్రి భోజిరెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా నగరంలోని ఇందిరాసేవాదన్లో సంగం లక్ష్మీబాయి విద్యాసంస్థలను నెలకొల్పారు. రామారెడ్డి చాదర్ఘాట్ పాఠశాలలో చదివి ఆ తర్వాత నిజాం కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం చేశారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో రాజకీయాంశాలపై పీజీ చేశారు.రాజేంద్రనగర్ బ్లాక్లోని పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, శంషాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా పనిచేసిన రామారెడ్డి ఆ తర్వాత తండ్రి స్థాపించిన విద్యాసంస్థల ద్వారా మహిళలకు విద్యనందిస్తూనే సహకార వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఆయన సహకార వికాస సంస్థ పేరిట వరంగల్, కరీంనగర్, హనుమకొండ తదితర జిల్లాలో మొత్తం 755 సహకార సంఘాలను ఏర్పాటు చేయించారు. ఈ సంఘాలు ప్రస్తుతం 550 కోట్ల టర్నోవర్తో స్వయం సమృద్ధిని సాధించాయి. ఆయనకు పద్మశ్రీ రావడంపై అతని శంషాబాద్వాసులు హర్షం వ్యక్తం చేశారు. రామారెడ్డి గత అక్టోబరు 26న మరణించారు. గుర్తింపు వచ్చినందుకు సంతోషం స్వయం సమృద్ధి, పరస్పర సహకారమనే అంశాలతోనే ఆయన సహకార సంఘాలతో ఆర్థిక చైతన్యంతోపాటు సాధికారతకు బాటలు వేశాడని రామారెడ్డి భార్య శ్యామల ‘సాక్షి’తో చెప్పారు. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన లక్ష్యాన్ని ప్రభుత్వాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.ఐదున్నర దశాబ్దాలుగా నృత్యంలో...తెలంగాణకు చెందిన నృత్య కళాకారిణి దీపికారెడ్డి. ఆమె 1965, సెప్టెంబర్ 15న హైదరాబాద్లో జన్మించారు. తండ్రి వీఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. తల్లి రాధికారెడ్డి కూచిపూడి నృత్యకారిణి. తాత నూకల రామచంద్రా రెడ్డి మాజీ మంత్రి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ’దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ ద్వారా వేలాది మంది నృత్య దీపికలను తయారుచేశారు. ఐదున్నర దశాబ్దాలుగా నృత్య కళారంగానికి సేవ చేస్తున్నారు. ప్రతి నెలా కొత్త కాన్సెప్ట్ : దీపికారెడ్డిమాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కూచిపూడి నృత్యం అనేది ఒక కళ కాదు. అది భగవంతుని ఆరాధనగా భావిస్తాం. ఐదున్నర దశాబ్దాల కృషికి గుర్తింపు లభించింది. పౌరాణిక గాథలను వేదికల మీద, దేవాలయాల దగ్గర నృత్య ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆ భగవంతుడికి దగ్గరయ్యామన్న అనుభూతిని పొందుతాం. అలాంటి అనుభూతిని ఈ రోజు పొందాను. ప్రతి నెలా ఒక కొత్త కాన్సెప్ట్ ను కూచిపూడి నృత్యం ద్వారా ప్రజల ముందుకు తెస్తున్నాం. దీంట్లో భాగంగా పర్యావరణం, మహిళలు, సామాజిక అవగాహన అంశాలూ ఉంటున్నాయి.వెంపటి చిన సత్యం గారు గురువుగా లభించడం నాకు ఓ వరం. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్య సాధన చేస్తున్నాం. ఈ కూచిపూడి నృత్య ప్రయాణంలో మా అమ్మన్నాన్నలు వీఆర్ రెడ్డి, రాధికా రెడ్డి, నా భర్త శ్యామ్గోపాల్, నా పిల్లలు అభినవ్, శ్లోకా.. నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. గీతాంజలి నృత్య అకాడమీ ద్వారా ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్నేళ్లుగా నన్ను ఆదరించి, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎంతోమంది కళాకారులు కనే అత్యుత్తమ కళ ఇది. ఎంతో సంతృప్తినిచ్చింది.జన్యుశాస్త్ర రంగంలో సేవలకు..లాలాపేట: హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–సీసీఎంబీ సైంటిస్టు డా.కుమారస్వామి తంగరాజ్ను పద్మశ్రీ పరస్కారం వరించింది. ‘సీఎస్ఐఆర్ భట్నాగర్ ఫెలో’గా జన్యు శాస్త్ర రంగంలో చేసిన అత్యుత్తమ కృషికిగాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన తమిళనాడు రాష్ట్ర చంగల్పట్ జిల్లా చేయుర్లో 1963 జూన్ 2న జన్మించారు. విద్యాభ్యాసం అంతా తమిళనాడులోనే చేశారు. భారతీయ జనాభా మూలం, అనుబంధాలు, వ్యాధి దృక్పథాలను అర్థం చేసుకోవడంలో తంగరాజ్ చేసిన పరిశోధనలు దోహదపడతాయి.రేడియేషన్ ఆంకాలజీలో విస్తృత సేవలుదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ స్వీకరించిన డాక్టర్ విజయానంద్ రెడ్డి 1982లో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్లో ఉత్తీర్ణత పొందారు. తర్వాత రేడియేషన్ ఆంకాలజీలో ఎండీ, డీఎన్బీలతో ప్రస్తుతం హైదరాబాద్లోని అపోలో కేన్సర్ సెంటర్లో ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా... అలాగే ఆ సంస్థకు డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. గతంలో ఆయన అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా, ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీకి చైర్పర్సన్గా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా వైద్యరంగానికి అందించిన సేవలకుగాను ఆయనకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆయన రాసిన అనేక వ్యాసాలకు బంగారు పతకాలూ అందాయి. నా సేవలు నా దేశానికే: డాక్టర్ విజయానంద్ రెడ్డి నా మాతృభూమికే నా సేవలు అంకితం కావాలనుకున్నాను.. అందుకే ఇక్కడే ఉండిపోయా. అప్పట్లో కేన్సర్ను ప్రాణాంతకమైన వ్యాధిగా చూసేకాలం నుంచి... క్రమంగా అది కూడా ఓ సాధారణమైన జబ్బు ‘అదీ మామూలుగానే తగ్గిపోతుందిలే’అని పేషెంట్స్లో భరోసా నింపేలా కేన్సర్ రోగులకు సేవలందించా. నాలుగు దశాబ్దాలకు పైగా అందించిన సేవలను దేశం గుర్తించినట్లుగా ఓ మంచి అనుభూతికి లోనవుతున్నా. నాకు వచ్చిన ‘పద్మశ్రీ’నాది మాత్రమే కాదు... రోగులకు వాళ్ల వెతలను దూరం చేయడంలో నాతోపాటు సహకరించిన నా సహాయకులు, మా ఆస్పత్రి సిబ్బందితోపాటు నా మీద నమ్మకముంచి ఆరోగ్యవంతులైన నా పేషెంట్లు అందరిదీ అని భావిస్తున్నా. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. -
Republic Day 2026: ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ఢిల్లీలో హై అలర్ట్
ఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (జనవరి 26, సోమవారం) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీని నిఘా నీడలోకి తెచ్చారు. ఉగ్రముప్పు హెరేపు (జనవరి 26, సోమవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలుచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. కర్తవ్య పథ్లో ఏఐ (AI) పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు.ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్క్లోజర్లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. భద్రతను పటిష్టం చేసిన ఢిల్లీ పోలీసులు.. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను ఉపయోగించనున్నారు. అనుమానితులను గుర్తించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది.చరిత్రలో తొలిసారిగా..అన్ని సీసీటీవీ కెమెరాలను వీడియో అనలిటిక్స్, ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ చరిత్రలో తొలిసారిగా పోలీసులు స్మార్ట్ గ్లాసెస్ ధరించి విధుల్లో పాల్గొంటారు. రద్దీని పర్యవేక్షించడంతో పాటు అనుమానితులను గుర్తిస్తారు. గడ్డం, జుట్టు పెంచినా, ముఖంపై గాయాలు ఉన్నా.. పాత, కొత్త ఫోటోల ఆధారంగా వ్యక్తులను గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. స్మార్ట్ గ్లాసెస్లో ఉండే కెమెరా మొబైల్ యాప్తో అనుసంధానించబడి ఉంటుంది. ఇందులో దాదాపు 65,000 మంది నేరస్తుల డేటాబేస్ ఉంటుంది. ఎవరైనా నేరస్తుడు కనిపిస్తే ఈ పరికరం వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.థర్మల్ స్కానింగ్:ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వ్యక్తులు దాచుకున్న ఆయుధాలను, అనుమానాస్పద వస్తువులను కూడా గుర్తించవచ్చు. కేవలం ఢిల్లీ జిల్లాలోనే 10 వేల పోలీసులు, 3 వేల పైగా సీసీటీవీ కెమెరాలు, 30కి పైగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మూడు అంచెల తనిఖీలు నిర్వహించనున్నారు.కాగా, జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు. -
చెంప దెబ్బకు చంపేశాడు!
న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్పూర్లోని ఆ కేఫ్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ, ఒక్కసారిగా పేలిన తుపాకీ గుళ్లు అలజడి రేపాయి. వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఫైజాన్ అలియాస్ ఫజ్జీ (24) అనే యువకుడు కేవ్లో ఉండగా.. తల, ఛాతీలో తూటాలు దిగి అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర గాయాలైన ఫైజాన్ను ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్స్ట్రాగామ్లో ప్రత్యక్షమై నేరాన్ని అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది. ఔను.. నేనే చంపేశా.. హత్య జరిగిన కొన్ని గంటలకే నిందితుడు తన ఇన్స్ట్రాగామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేని ఆ గొంతు వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘నేనే ఫైజాన్ను చంపాను. నాలుగు నెలల క్రితం వాడు నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయాను.. అందుకే ఇప్పుడు వాడి ప్రాణం తీశాను. ఇందులో మా కుటుంబానికి, స్నేహితులకు సంబంధం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత కక్ష!’.. అంటూ నిందితుడు కెమెరా ముందు ఒప్పుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పు తీర్చమన్నందుకే.. హత్యకు కారణం పాత కక్ష అని నిందితుడు బుకాయిస్తున్నా, బాధితుని కుటుంబం మాత్రం మరో భయంకరమైన కోణాన్ని బయటపెట్టింది. నిందితుడు ఫైజాన్ దగ్గర రూ.40,000 అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే పక్కా ప్లాన్తో చంపేశాడని మృతుని సోదరుడు సల్మాన్ ఆరోపిస్తున్నాడు. ‘వాడు కేవలం కాల్చడమే కాదు, కత్తితో కూడా పొడిచాడు. నా తమ్ముడు ప్రాణాల కోసం ఎంత పోరాడాడో ఆ గాయాలే చెబుతున్నాయి’.. అంటూ సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్రమ కేఫ్ సీజ్ ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. అక్రమంగా నడుస్తున్న ఆ కేఫ్ను వెంటనే సీజ్ చేశారు. నిందితుడు పోస్ట్ చేసిన వీడియో నిజమేనా? లేక తప్పుదోవ పట్టించే కుట్రా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
వాణిజ్య ఒప్పందాలతో యువతకు నూతన అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మన యువతకు దేశ విదేశాల్లో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వేర్వేరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యువత అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలోనే ఉందని గుర్తుశారు. వారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తే దేశం ప్రగతి మరింత వేగవంతమవుతుందని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ శనివారం 18వ రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరిగిన రోజ్గార్ మేళాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 61 వేలమందికిపైగా యువతీ యువకులకు వర్చువల్గా నియామక పత్రాలు అందజేశారు. దేశ యువతకు 2026 సంవత్సరం సరికొత్త ఆశలు ఆనందాలతో మొదలైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నియామక పత్రం కేవలం ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదని.. ఇది దేశ నిర్మాణానికి అందిన ఆహ్వానం అని అభివర్ణించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. నాగరిక్ దేవో భవ ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో ఎదురైన అనుభవాలు గుర్తుచేసుకోవాలి. అలాంటి ఇబ్బందులు ప్రజలకు ఎదురు కాకుండా మనం వారికి సేవ చేయాలి. ఉద్యోగ జీవితంలో ప్రజాసేవే పరమార్థంగా భావించాలి. నాగరిక్ దేవో భవ అనే సూక్తిని పాటించాలి. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పౌరుడిని దేవుడిగా పరిగణించాలి. యువత ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. దీనివల్ల నిర్మాణ సంబంధిత రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. మన దేశంలో స్టార్టప్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. ‘డిజిటల్ ఇండియాతో’నూతన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. యానిమేషన్, డిజిటల్ మీడియాతోపాటు ఇతర రంగాల్లో ఇండియా గ్లోబల్ హబ్గా మారుతుండడం హర్షణీయం. యువత కృషి వల్లే ఈ ఘనత సాధ్యమవుతోంది. సంస్కరణలతో మేలు నేడు దేశం సంస్కరణల ఎక్స్ప్రెస్లో పయనిస్తోంది. సంస్కరణలతో ప్రజల జీవితాలు, వ్యాపార–వాణిజ్యాలను మరింత సులభతరంగా మార్చాలని నిర్ణయించాం. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో తదుపరి తరం సంస్కరణలతో యువ పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతోంది. చరిత్రాత్మక కార్మిక సంస్కరణల(లేబర్ కోడ్)తో కార్మికులు, ఉద్యోగుల సామాజిక భద్రత బలోపేతమైంది. వ్యాపారవేత్తలకు సైతం లబ్ధి చేకూరుతోంది. గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతి సాధించింది. దశాబ్ద కాలంలో దేశ జీడీపీ రెట్టింపైంది. 2014 ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2.5 రెట్లు పెరిగాయి. పెట్టుబడులు పెరగడమంటే యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే. ఎల్రక్టానిక్స్ తయారీ రంగం 2014 నుంచి ఆరు రెట్లు వృద్ధి చెంది రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు దాటాయి’’అని ప్రధానమంత్రి వివరించారు. మహిళా సాధికారతకు బాటలు దేశంలో రోజ్గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. శనివారం నియామక పత్రాలు అందుకున్నవారిలో 8 వేల మందికి పైగా యువతులు ఉన్నారు. గత 11 ఏళ్లలో దేశ వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు అయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు. ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు మహిళా సాధికారతకు బాటలు వేశాయని, మహిళా స్వయం ఉపాధి 15 శాతం మేర పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. అంతేకాకుండా మహిళల కొనుగోలు శక్తి పెరగడంతో 2025లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 2 కోట్ల మార్కును దాటాయని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కోసం రూపొందించిన ‘ఐగాట్’ప్లాట్ఫామ్లో ఇప్పటికే 1.5 కోట్ల మంది ఉద్యోగులు చేరారని, కొత్త ఉద్యోగులు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఇక అమెరికా-భారత్ బంధానికి బీటలు!
శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ఒకటి ఉంది. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాంటి శత్రువుతోనే జత కట్టాలని, భుజం తట్టి ప్రొత్సహించాలని అగర్రాజ్యం బలంగా భావిస్తోంది!. ఈ నేపథ్యంలోనే అమెరికా-భారత్ మధ్య స్నేహబంధానికి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు..బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో శాంతి యుతంగా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాలే. అయితే.. అక్కడి జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో వాషింగ్టన్-ఢిల్లీ మధ్య సంబంధాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారట్లు.. వాషింగ్టన్ పోస్ట్ ఓ సమగ్ర కథనం ప్రచురించింది. అందులో..ఇటీవల నిర్వహించిన సర్వేల్లో జమాత్, బీఎన్పీలకు ప్రజాదరణ అధికంగా ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా జమాత్ విద్యార్థి విభాగం ‘‘ఇస్లామీ ఛాత్ర శిబిర్’’ ఆమధ్య నిర్వహించిన వర్సిటీ ఎలక్షన్స్లో ఆధిపత్యం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికలకు జమాత్ బలమైన పునాది వేసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికన్ రాయబారి ఒకరు స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఇస్లామిక్ వైపు మళ్లింది అని అన్నారు. ఈ తరుణంలో జమాత్ నాయకులతో అమెరికా స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటే మంచిదని సూచించారు కూడా.భారత్ ఆందోళనలు ఏంటంటే..జమాత్-అమెరికా దోస్తానాపై భారత్ ఆందోళనలో అర్థం ఉంది. ఎందుకంటే.. జమాత్-ఎ-ఇస్లామీని భారత్ ఎప్పటినుంచో శత్రువుగానే చూస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1971 యుద్ధంలో ఈ పార్టీ పాకిస్తాన్ పక్షాన నిలిచిన చరిత్ర ఉంది. అలాగే మతోన్మాదంతో ఆ సమయంలో మైనారిటీలను ఊచకోత కోసిందని అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాత్ అధికారంలోకి వస్తే.. హిందువుల సహా ఇతర మైనారిటీలకు భద్రత ఉండబోదని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా జమాత్కు మద్దతుగా నిలిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.జమాత్ బ్యాక్గ్రౌండ్ ఇది.. 1971 విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా.. పాక్కు మద్దతుగా నిలిచింది జమాత్-ఎ-ఇస్లామీ. పార్టీకి చెందిన అనేక నాయకులు, వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాలు)లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా హింస, హత్యలతో పాటు మైనారిటీలపై దాడులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఆ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉండేది.ఒకానొక టైంలో దేశద్రోహి పార్టీ అంటూ అనేకసార్లు నిషేధానికి గురైంది. విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా నిలిచినందుకు, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు.. ఇలా రకరకాల కారణాలు చూపించారు. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తుంటే.. జమాత్ మాత్రం షరియా చట్టం అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్లే.. 2013లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ పార్టీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను తీసేసింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రధాని హోదాలో షేక్ హసీనానే ఆనాడు ఈ పని చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయాక.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు జమాత్పై నిషేధం ఎత్తేసింది. దీంతో అవినీతి వ్యతిరేకం.. సంక్షేమం.. అంటూ జమాత్ కొత్త నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఆదరణ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.అమెరికా మరోలా.. ప్రస్తుతానికైతే అమెరికా.. జమాత్తో ఫ్రెండ్షిఫ్ను కోరుకోవడం లేదని సమాచారం. ‘‘బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికల్లో మేం ఎవరికీ మద్దతు ఇవ్వబోం’’ అని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత ఛాందస పార్టీగా పేరున్న జమాత్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. షరియా చట్టాలను అమలు చేస్తే.. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది కూడా.రాజకీయ వాతావరణంహసీనా తొలగింపుతో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మార్పు పేరుతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే మాజీ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్.. యూనస్ ప్రభుత్వం మత ఛాందస వాదులతో చేతులు కలిపి అవామీలీగ్ కేడర్ను, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. హసీనా ప్రస్తుతం భారత్లో ప్రవాసంలో ఉండగా.. జమాత్ సహా ఇస్లామిస్టులు ఆమె ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు. -
సోషల్ మీడియా సెన్సేషన్.. ఎవరీ అభినవ భగత్ సింగ్!
ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్ సింగ్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్,ఎగ్జామ్స్,పర్సంటేజ్ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్,ట్యూషన్,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్ సింగ్ అలా కాదు. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన గౌతమ్ ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.అశ్వమిత్ గౌతమ్ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. -
ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం
ఢిల్లీ: ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి చీకటి అలుముకుంది. వర్షం, పొగ మంచు కారణంగా ఢిల్లీలో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. భారత వాతావరణ విభాగం (IMD) ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, గాలివేగం గంటకు 40–60 కిమీ వరకు చేరే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుండి వచ్చే వాతావరణంలో అవంతారాలు(వెస్ట్రన్ డిస్టబెన్స్) కారణంగా ఈ ఆకస్మిక వర్షానికి కారణమని ఐఎండీ స్పషం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో వర్షం, మంచు, చలి ఉంటుందని తెలిపింది. హిమాలయ పర్వత రాష్ట్రాలలో భారీ వర్షాలు, మంచు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. జనవరి 27 వరకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. -
నైని కోల్ బ్లాక్ వివాదంపై కేంద్రం సమగ్ర విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని నైని బొగ్గు క్షేత్రానికి సంబంధించిన టెండర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్రాజ్ నయన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తన ఆదేశాల మేరకే ఈ కమిటీ ఏర్పాటైనట్లు ఆ శాఖ మంత్రి కిషన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ (టీ/ఎన్ఏ) మరపల్లి వెంకటేశ్వర్లుతో కూడిన కమిటీ ఈ విచారణ జరపనుంది. గనిని అభివృద్ధి చేయడంతో పాటు నిర్వహించే సంస్థ (మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎంఓడీ)ను ఎంపిక చేయడానికి సంబంధించి 2025 నవంబర్ 28న జారీ చేసిన టెండర్ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందన్న అంశంపై ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది. ఈ టెండర్ నోటీసు (ఎన్ఐటీ)లోని నిబంధనలు, విధానాల అమలు, టెండర్ ప్రక్రియలో తలెత్తిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. టెండర్ రద్దుకు గల కారణాలను స్పష్టంగా గుర్తించనుంది. ఇతర సంస్థలతో పోల్చి అధ్యయనం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) టెండర్ విధానాలను, కోల్ ఇండియా సహా ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న ఎండీఓ, అవుట్ సోర్సింగ్ విధానాలతో పోల్చి కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే నైని కోల్ బ్లాక్కు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ఖర్చులు చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? వ్యయ పరిమాణం సరైనదేనా? అన్న అంశాలపైనా కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వెంటనే సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, మూడు రోజుల్లో కేంద్ర బొగ్గు శాఖకు నివేదిక సమరి్పంచాలని బొగ్గు శాఖ ఆదేశించింది.12 ఏళ్ల సింగరేణి స్థితిపై సీబీఐ విచారణ కోరాలి » నైనీ కోల్బ్లాక్స్ వేలం నిర్వహించలేకపోతే కేంద్రానికి అప్పగించండి » పారదర్శకంగా వేలం నిర్వహించి సింగరేణికి కేటాయించేందుకు సిద్ధం » బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కమీషన్లకు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయి » కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్ : సింగరేణి సంస్థ విషయంలో ఏం జరిగిందో పూర్తిస్థాయి విచారణ జరగాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి (12 ఏళ్ల వ్యవహారంపై) విచారణ కోరుతూ సీబీఐకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నైనీ కోల్బ్లాక్స్ వేలం నిర్వహించలేకపోతే, ఒకవేళ కేంద్రానికి అప్పగిస్తే పారదర్శకంగా వేలం నిర్వహించి సింగరేణికి కేటాయించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కార్ సింగరేణిలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే, దానినే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కమీషన్లకు అవినీతి, అక్రమాలకు పాల్పడితే, దాని మూల్యాన్ని సింగరేణి కారి్మకులు చెల్లించాల్సి వస్తోందన్నారు. ‘2015లో కేంద్ర ప్రభుత్వం నైనీకోల్ బ్లాక్ను క్యాప్టివ్ మైన్గా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించింది. సహజంగా ఆ మైనింగ్ పనులు సింగరేణితోనే చేయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా మేం చేయలేము అని సింగరేణితో లేఖ రాయించి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేసింది. ఒక్క కాప్టివ్ మైన్ రాష్ట్రానికి అప్పగిస్తే గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని తప్పటడుగులు వేస్తున్నాయో చూస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ టెండర్ విషయంలో 17 కంపెనీలు సైట్ విజిట్ చేశాయి. టెండర్ దాఖలుకు ఈ నెల 29 వరకు టైమ్ ఉంది. 2015లో టెండర్లు పిలిచినా రద్దు చేశారు. సింగరేణికి ఇవ్వకుండా బలవంతంగా లేఖ రాయించి. ప్రైవేట్ వ్యక్తులకు గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత రద్దు చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సర్కార్ టెండర్లు పిలిచి రద్దు చేసింది సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన చోట ప్రాజెక్ట్ అథారిటీ అని పెట్టారు. ఇప్పటివరకు ఒక్కరికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. నైనీ కోల్బ్లాక్ సింగరేణికి రాకుండా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే ప్రయత్నం చేశారు. తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణికి ఇస్తే గతంలో కూడా బలవంతంగా సింగరేణితో లేఖ రాయించి 25 ఏళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. ఈ రెండు ప్రభుత్వాలు పోటీపడి సింగరేణిని కష్టాల్లో పడేశాయి’అని కిషన్రెడ్డి తెలిపారు. -
మన అమృత్ భారత్ రైలు నేడు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి–తిరువనంతపురం సూపర్ఫాస్ట్ రైలు కూడా ఉంది. ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్పూర్ మధ్య అమృత్ భారత్ రైలు నడుస్తుండగా, ఇది రాష్ట్రానికి రెండో రైలు. రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. రైలు వేళలు ఇలా... 17041 నంబరుతో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17042 నంబరుతో బుధవారం సాయంత్రం 5.30కు తిరువనంతపురం నుంచి బయలుదేరి గురువారం రాత్రి 11.30కి చర్లపల్లికి చేరుకుంటుంది.ఈ రైలు నల్లగొండ, గుంటూరు, తెనాలి, గూడూ రు, రేణిగుంట, కాటా్పడి, ఈరోడ్ – కోయంబత్తూరు, పాలక్కాడ్, ఎర్నాకులం టౌన్, కొ ట్టాయం, కాయంకులం రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. ప్రస్తుతం ఇదే రూట్లో శబరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. కొత్తగా ప్రారంభం కానున్న అమృత్భారత్ వల్ల అయ్యప్ప భక్తులకు భారీ ఊరట లభించనుంది. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో హాలి్టంగ్ సదుపాయం ఉంది.ఈ ట్రైన్లో 11 సాధారణ బోగీలు, 8 స్లీపర్ బోగీలు ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. -
ఒక్కటై పోరాడుదాం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల వెనుక ఉన్నట్లే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దు కోసం కూలీలతో కలిసి పోరాటం సాగించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సందీప్ దీక్షిత్ నేతృత్వంలోని రచనాత్మక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన ఉపాధి హామీ కూలీల సదస్సులో రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూలీలు తరలివచ్చారు. తాము పనులు చేసే స్థలాల నుంచి పిడికెడు మట్టి తీసుకొచ్చారు. మొక్కల కుండీల్లో ఈ మట్టిని చల్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పేదలకు హక్కు లు కల్పించడమే ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. కూలీలంతా ఏకమై పోరాడితే మోదీ వెనక్కి తగ్గుతారని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిస్తారని చెప్పారు. ఈ సదస్సులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వ్యవసాయ పనిముట్లను చేతబూని పలుగు పారలు ప్రదర్శించడం విశేషం.పేద కూలీలకు తీవ్ర నష్టం ‘‘పనులు కావాలని కోరుకునేవారు అందుకోసం గౌరవంగా డిమాండ్ చేసే వెసులుబాటు ఉపాధి హామీ పథకంలో ఉంది. పేదలకు పని హక్కు లభిస్తుంది. ఈ ఉద్దేశాన్ని నాశనం చేయడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. 2020లో ఇలాగే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్లోపల, బయట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాం. దాంతో నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేసింది. అప్పుడు రైతులను లక్ష్యంగా చేసుకున్నారు.. ఇప్పుడు పేద కూలీలను టార్గెట్ చేస్తున్నారు. ఉపాధి పనుల కోసం ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది ఇక కేంద్రమే నిర్ణయిస్తుంది. సహజంగానే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, విపక్ష పాలిత రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇస్తారు. పనులు ఎప్పుడు, ఎక్కడ కల్పించాలి? కూలీలకు ఎంత వేతనం ఇవ్వాలన్నది కేంద్రమే నిర్ణయించబోతోంది. దాంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. స్వాతంత్య్రం ముందునాటి పరిస్థితులను మళ్లీ తీసుకురావాలన్నదే బీజేపీ నాయకుల ఎత్తుగడ. అప్పట్లో రాజు చేతిలోనే మొత్తం అధికారాలు, సంపద ఉండేవి. ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని మార్చాలని బీజేపీ పెద్దలు ఆరాటపడతున్నారు. వారిని అడ్డుకోవాలంటే మనమంతా ఒక్కటై పోరాటం సాగించాల్సిందే. బీజేపీ నాయకులు నిజంగా పిరికిపందలు. మనం కలిసికట్టుగా ముందుకెళ్తే వారంతా పారిపోతారు’’ అని రాహుల్ తేల్చిచెప్పారు. గాందీజీ పేరును తుడిచిపెట్టే కుట్ర: ఖర్గే ప్రజల హృదయం నుంచి జాతిపిత మహాత్మాగాంధీ పేరును తుడిచేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కూలీల సదస్సులో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన అణగారిన వర్గాలను నిర్బంధ కూలీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పేదలకు ఉపాధి కల్పించే మహత్తర పథకాన్ని రద్దు చేయడం ఏమిటని మండిపడ్డారు. తాను చాయ్వాలా అని చెప్పుకుంటున్నారని, నిజానికి ఏనాడూ ఆయన చాయ్ తయారు చేయలేదని, రైళ్లలో తిరుగుతూ విక్రయించలేదని ఖర్గే అన్నారు. చాయ్వాలా పేరిట మోదీ చేసేదంతా ఉత్త డ్రామా అని కొట్టిపారేశారు. -
నోయిడా టెక్కీ ఆఖరి క్షణాలు.. వీడియోలో ఏముందంటే..!
నోయిడా: కారుతో సహా నీటి గుంతలో పడి మరణించిన నోయిడాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సహాయక బృందాలు గాలిస్తున్న దృశ్యాలతో పాటు.. దట్టమైన మంచులో నీటిపై ఆ వ్యక్తి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి ఉంచిన వెలుగు కనిపిస్తోంది. రక్షణ సిబ్బంది అతడిని కంగారు పడొద్దంటూ ధైర్యం చెబుతున్న మాటలు కూడా వీడియోలో వినిపించాయి. జనవరి 16 రాత్రి 27 ఏళ్ల యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోగా.. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఈ వీడియో బయటకొచ్చింది.గురుగ్రామ్లో సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువరాజ్ మెహతా... ఇంటికి తన కారులో తిరిగి వస్తుండగా నోయిడాలోని సెక్టార్-150లో నిర్మాణ స్థలం దగ్గర తవ్విన లోతైన గోతిలో కారు పడిపోయింది. అతను దాదాపు రెండు గంటల పాటు సహాయం కోసం అభ్యర్థించాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. యువరాజ్ తండ్రి రాజ్కుమార్ మెహతా కూడా ఘటన స్థలంలోనే ఉన్నారు. మూడు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం కారును బయటకు తీశారు.Another saddening video of 27 year old techie shows mediocre efforts by specialised authorities ultimately leading to his death in Noida's Sector 150.PS: The white dot you see in this video is the flashlight from victim Yuvraj Mehta's phone seeking help! pic.twitter.com/2OT0NR5RG6— Harsh Trivedi (@harshtrivediii) January 22, 2026లోటస్ గ్రీన్స్ కన్స్ట్రక్షన్, ఎం.జెడ్ విజ్టౌన్ ప్లానర్స్ సంస్థలకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, ఆ నీటి గోతి వల్ల జరిగిన మరణానికి వీరిని బాధ్యులను చేస్తూ కేసు నమోదైంది. 2014లో కొనుగోలు చేసిన ఈ ప్లాట్లో భారీ యంత్రాలతో గోతిని తవ్వి, ఏళ్ల తరబడి నీటితో అలాగే వదిలేశారు. దీంతో నీటితో నిండిపోయి చెరువులా మారింది. బురద నీరు, చెత్తాచెదారంతో కలుషితమైంది. ఎం.జెడ్ విజ్టౌన్ ప్లానర్స్ డైరెక్టర్ అభయ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. -
నైనీ కోల్ టెండర్ల ఎఫెక్ట్.. సింగరేణి కేంద్ర బృందం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ బ్లాక్ వివాదంపై విచారణకు కేంద్ర బృందాన్ని సింగరేణికి పంపిచనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో కేంద్రం బృందం.. తెలంగాణలో పర్యటించనుంది.కాగా, నైనీ కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఇద్దరు సభ్యుల కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. ఈ వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను, ఇతర అంశాలపైనా ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. -
జమ్మూలో ఘోరం
బందేర్వాహ్/జమ్మూ: ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లో పాల్గొనేందుకు వెళ్తున్న 10 మంది సైనికులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జ మ్మూకశ్మీర్లోని డోడా జిల్లాలోని భందేర్వాహ్–ఛంబా అంతర్రాష్ట్ర రహదారిలో 9,000 అడుగుల ఎత్తయిన ఖన్నీ పర్వత ప్రాంతంలో సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భారత ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. విషయం తెల్సిన వెంటనే సైన్యం, పోలీసులు అన్వేషణ, సహాయక చర్యలను ఆరంభించారు. 200 అడుగుల లోతైన లోయలో పడిపోయిన వాహనం నుంచి నలుగురు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మంది సైనికులను ఎలాగోలా పైకి తీసుకొచ్చి ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సైనిక వాహనం చాలా ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ లోయలో పడటంతో ఎక్కువ మంది చనిపోయారని అదనపు డిప్యూటీ కమిషనర్ సుమిత్ భుత్యాల్ వెల్లడించారు. అసలేమైంది?ఖన్నీ పర్వతం మీద ఉన్న ఆర్మీ పోస్ట్కు చేరుకునేందుకు పలువురు సైనికులు గురువారం మధ్యాహ్నం అత్యంత అధునాతన ‘క్యాస్పిర్’ ఆర్మీ వాహనంలో బయల్దేరారు. రహదారిలో పాతిపెట్టిన మందుపాతరలు, శక్తివంత పేలుడు పదార్థాలు(ఐఈడీ)లను గుర్తించే, ఉగ్రవాదుల తుపాకీ గుళ్ల వర్షాన్ని సైతం తట్టుకోగల బుల్లెట్ప్రూఫ్ వాహనంగా ‘క్యాస్పిర్’ పేరొందింది. గురువారం అననుకూల వాతావరణంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్ చేతుల్లోంచి వాహనం అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని జమ్మూ కేంద్రంగా పనిచేసే వైట్నైట్ కోర్ బలగం తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధానిసైనికుల వీరమరణం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘డోడా ఘటన అత్యంత విచారకరం. సాయుధ బలగాల్లో అత్యంత ధైర్యవంతులను కోల్పోయాం. దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన మీ త్యాగాలను జాతిజనులు సదా గుర్తుంచుకుంటారు’’ అని ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తన ఆకాంక్ష తెలియజేశారు. గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికార యంత్రాంగానికి ప్రధాని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
ఢిల్లీ కమిషనర్గా ‘డాగ్ లవర్’ ఐఏఎస్!
ఢిల్లీ: సంజీవ్ ఖిర్వార్.. సీనియర్ ఐఏఎస్ అధికారి. మూడేళ్ల కిందట తన పెంపుడు కుక్కల వ్యవహారంలో వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి. నాడు వాటి మార్నింగ్ కోసం ఏకంగా స్టేడియం ఖాళీ చేయించి వివాదంలో చిక్కుకున్నారాయన. ఈ ఘటన తర్వాత కేంద్రం ఆయన్ని బదిలీ చేసింది. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ సీన్లోకి వచ్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఉన్న కమిషనర్ అశ్వనీ కుమార్ను జమ్మూ కశ్మీర్కు బదిలీ చేశారు. త్వరలో ఢిల్లీ కార్పొరేషన్ బడ్జెట్ సమర్పణ ఉంది. సరిగ్గా దీని ముందరే.. ఖిర్వార్కు బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. అదే సమయంలో ఆయన డాగ్ లవర్ కావడం ఇక్కడ మరో చర్చకు దారి తీసింది. 1994 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్కి చెందిన ఖిర్వార్.. 2022లో ఢిల్లీ త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులను బయటకు పంపించి, తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించాడనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన వల్ల తాము ఇబ్బంది పడ్డామని కొందరు అథ్లెట్లు ఆనాడు మీడియా ముందు వాపోయారు కూడా. అయితే తానే తప్పూ చేయలేదని.. తానొక శునక ప్రియుడ్ని అని ఆ టైంలో గర్వంగా ప్రకటించుకున్నారాయన. ప్రస్తుతం వీధి కుక్కల అంశం ఢిల్లీతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు విచారణ సైతం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఖిర్వార్ నేతృత్వంలో కార్పొరేషన్ కుక్కల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. -
కర్ణాటక గవర్నర్ పంతం.. ‘సుప్రీం’కు సిద్ధరామయ్య సర్కార్!
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.గవర్నర్ అభ్యంతరాలివే.. ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.కోర్టు ఏం చెప్పిందంటే..గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.సభ ఆగిపోతుందా?.. రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట. -
మీడియా ముందు పోలీసులేం మాట్లాడాలో నిర్ణయించండి
న్యూఢిల్లీ: విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రజలు, మీడియా సమక్షంలో పోలీసులు ఏ మేరకు ప్రస్తావించాలో, ఏ అంశాలను మాత్రమే వెల్లడించాలో తెలిపే నియమావళిని రూపొందించాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత మూడు నెలల్లోపు ఈ మేరకు నిబంధనావళిని తయారుచేయాలని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం సూచించింది. ఈ మేరకు జనవరి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులోని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న, విచారణ దశలో ఉన్న కేసులపై మీడియా ఎదుట పోలీసులు కీలక విషయాలతోపాటు అనవసర విషయాలనూ ప్రస్తావిస్తున్నారని, ఈ ధోరణికి అడ్డుకట్టవేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కోర్టు సూచనలుచేసింది. ‘‘కోర్టుకు సహాయకుడు(అమికస్ క్యూరీ)గా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కేంద్ర ప్రభుత్వం, విదేశాలు అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా ‘పోలీస్ మాన్యువల్ ఫర్ మీడియా బ్రీఫింగ్’ను తయారుచేశారు. దీనిని మీరు ఒకసారి పరిశీలించండి. బాగుంటే దీనిని మీరూ అనుసరించండి. లేదంటే కొత్తగా మరోటి తయారుచేసుకోండి. కొత్త మాన్యువల్ను ఆ తర్వాత రెండు వారాల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి’’అని కోర్టు ఆదేశించింది. శంకరనారాయణన్ తయారుచేసిన ఈ 60 పేజీల మాన్యువల్లో నాలుగు భాగాలున్నాయి. దర్యాప్తుకు ఎలాంటి భంగం కల్గించకుండా, నష్టం వాటిల్లకుండా, కీలక అంశాలు బయటకు పొక్కకుండా, క్లుప్తంగా విషయాలను మీడియాకు పోలీసులు చెప్పొచ్చని మాన్యువల్ పేర్కొంది. -
ఏఐ అద్దాలతో రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా ఈసారి ఢిల్లీ పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే కళ్లద్దాలు ధరించనున్నారు! ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)తో పనిచేసే ఈ ఏఐ స్మార్ట్ కళ్లద్దాలను నేరాల డేటాబేస్తో అనుసంధానిస్తారు. దాంతో వేడుకకు హాజరైన వాళ్లలో గత నేరగాళ్ల ముఖాలను గుర్తించి వెంటనే బలగాలను హెచ్చరిస్తాయి! తద్వారా పాత నేరస్తులు, నిందితులు, అనుమానిత వ్యక్తులను తక్షణం అదుపులోకి తీసుకునే వీలుంటుంది. కార్యక్రమాలకు హాజరైన గుమిగూడిన జనంలోని వారిలో ఎవరి ముఖమైనా నేరచరితుల డేటాతో సరిపోలితే స్మార్ట్గ్లాస్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో జనం గందరగోళానికి గురికాకుండా కేవలం అనుమానితున్ని మాత్రమే జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవచ్చని న్యూఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మాహ్లా వివరించారు.ఎరుపొస్తే పట్టివేత‘‘ ఏఐ స్మార్ట్గ్లాస్ ఆయా పోలీస్ ఉపయోగించే స్మార్ట్ఫోన్కు వెంటనే సందేశం పంపుతుంది. ఆ సందేశంలో గ్రీన్ బాక్స్ వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నేరచరిత్ర లేదు అని అర్ధం. ఒకవేళ ఎరుపు రంగు వస్తే అతనికి గత నేరాలతో సంబంధం ఉందని అర్థం. వెంటనే అతని గుర్తింపు కార్డ్లను పరిశీలించి అదుపులోకి తీసుకోవాలా వద్దా? అతడిపై గతంలో ఉన్న నేరాభియోగాలు తీవ్రమైనావా కావా? వెంటనే అదుపులోకి తీసుకోవడం అవసరమా కాదా? అనేవి పోలీసులు నిర్ణయించి తగు రీతిలో స్పందిస్తారు’’ అని ఏసీపీ దేవేశ్ వెల్లడించారు. ‘‘వ్యక్తుల చరిత్రను తక్షణం గుర్తించడం అనే ఈ ప్రక్రియ కారణంగా గతంలో మాదిరి ఒక్కో వ్యక్తిని మాన్యువల్గా తనిఖీచేయాల్సిన శ్రమ తగ్గుతుంది. దీనికితోడు విస్తృతంగా ఏర్పాటుచేసిన సీసీటీవీలు, డ్రోన్లతో పర్యవేక్షణ, ఏఐ ఆధారిత విశ్లేషణ విధానాలతో ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలనూ వేగంగా గుర్తించవచ్చు’’ అని ఆయన వెల్లడించారు.20 ఏళ్ల పాత ఫొటో అయినాసరే..‘‘ మా దగ్గర ఉన్న డేటాబేస్లో పాత నేరగాళ్లకు చెందిన 20 ఏళ్లక్రితంనాటి ఫొటో ఉన్నాసరే సంబంధిత నేరస్తుడు ఇవాళ కన్పించినా ఏఐ స్మార్ట్గాŠల్స్ అనేది సరిపోల్చుకోగలదు. అంతటి సామర్థ్యం ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్కు ఉంది. స్మార్ట్ గ్లాసెస్ చూపు నుంచి నేరస్తులు తప్పించుకోలేరు. ఈ అద్దాలకు థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యమూ ఉంది. ఇనుము, ఉక్కు లోహాలు సహా పదునైన వస్తువులు, నిషేధిత ఆయుధాలతో సంచరించే వ్యక్తులనూ ఇవి గుర్తించగలవు. సబ్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు ఈ కళ్లద్దాలను ఇస్తున్నాం. పోలీసు వాహనాల ముందుభాగంలోనూ వీటిని అమర్చుతాం. గణతంత్ర వేడుకల్లో వీటిని ఢిల్లీలో ఉపయోగించడం ఇదే తొలిసారి’’ అని అధికారి చెప్పారు. అయితే ఎన్నింటిని కొనుగోలు చేశారో, వాటి ధర తదితర వివరాలను ఆయన వెల్లడించలేదు. ‘‘ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతు మార్గంతోపాటు సున్నితమైన ప్రదేశాల్లో మొత్తంగా 10,000 మంది పోలీసులను న్యూఢిల్లీ జిల్లా నుంచి రప్పిస్తున్నారు. వేడుకలకు వచ్చే ప్రతి వాహనం మూడంచెల భద్రతావలయాన్ని దాటుకుని రావాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో అవినీతి, అక్రమాలు: కిషన్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ అనేక సమస్యల్లో కూరుకుపోయింది. కేంద్రానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉన్నా నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు?. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు కోసం కేంద్రం నైనీ కోల్ బ్లాక్ను సింగరేణికి అప్పగించింది. టెండర్లను ఆహ్వానించి వాటిని రద్దు చేశారు. దేశంలో ఎన్నో టెండర్లు నిర్వహిస్తుంటాం.. కానీ, ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఒడిషాలో బీజేపీ వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించాను.నేను సింగరేణికి 683 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒప్పించాను. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 32వేల కోట్ల బకాయి పడింది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని వాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పనిచేస్తోంది. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్ చూస్తోంది. 12 ఏళ్లుగా నైనీ బ్లాక్ విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారు. సీబీఐ అనుమతి కోరుతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. బీఆర్ఎస్ హయాంలోనూ అనేక అక్రమాలు జరిగాయి. సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారు. అవినీతి, అక్రమాలతో సింగరేణిని నాశనం చేయవద్దు. సింగరేణిలో ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదు. సింగరేణి సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. సింగరేణి అన్ని వ్యవహారాలపై దర్యాప్తు జరగాలి. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే పరిశీలిస్తాం. మంత్రుల మధ్య వాటాల తేడా వల్లే నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు జరిగింది. సైట్ విజిట్ నిబంధన పెట్టాలనే విషయం కేంద్రానికి తెలియదు. దేశవ్యాప్తంగా సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన ఉంటే.. ఇక్కడ మాత్రం వేరుగా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే లాభాల్లోకి తీసుకువస్తాం అని అన్నారు.


