మహరాష్ట్ర: ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్ప కూలింది. ఈ ఘటనలో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. నలుగురికి గాయాలు కాగా..బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.