breaking news
Guntur
-
‘చంద్రబాబు మాటలు వింటే ఏం అనాలో అర్థం కావడం లేదు’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడమే పెద్ద స్కాం.. అంటూ చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారని.. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.ఈ సంతకాలు గవర్నర్ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం. గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ వేస్తాం. స్కామ్లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!. ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.నింద కలెక్టర్లపై మోపుతున్న చంద్రబాబు:కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టాడు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశాం. వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్సిక్స్, సూపర్సెవెన్ మోసాలు.విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు:అసలు ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు నడుపుతుంది? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరుగుతోంది?. ఎందుకంటే, ఒకవేళ ప్రభుత్వమే కనుక.. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు (ప్రజా రవాణా వ్యవస్థ) నడపకపోతే.. విద్య, వైద్యం, రవాణా ఎవరికీ అందుబాటులో ఉండవు. ఆయా రంగాల్లో మొత్తం ప్రైవేటు రంగం పెత్తనమే ఉంటుంది.వ్యవస్థలన్నీ తిరోగమనం:కానీ, ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేసేవాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన నీవు (చంద్రబాబు), కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.న్యాయపోరాటం కూడా చేస్తాం:ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.2 ఏళ్లు జీతాలు మరో పెద్ద స్కామ్:ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం:రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. గవర్నర్ 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్భవన్కు వెళ్లే ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్ను కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
కోటి సంతకాల ఉద్యమం.. ఒక చరిత్ర: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని.. చర్రితలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికీ వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.‘‘మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడమే పెద్ద స్కాం. మళ్లీ రూ. 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరు ఎలా ఇస్తారు?. ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా?’’ అంటూ వైఎస్ జగన్.. చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కోటి సంతకాలు లోక్భవన్కు చేరుకున్నాయి. కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు ఒక చరిత్ర. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఈ మాట చంద్రబాబే చెప్పుకున్నారు. కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు. 2 బడ్జెట్లు పెట్టినా ప్రజలను జరిగిన మంచి గుండుసున్నా. మన హయాంలో పథకాల అమలుకు క్యాలెండర్ ఇచ్చాం. బాబు సూపర్సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసం చేశారు. మన హయాంలో పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశాడు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కూటమి పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదు. ప్రైవేటీకరణ అంటేనే దోపీడీ. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. మన హయాంలో ఆర్టీసీని బతికించాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం. చంద్రబాబు తప్పులు చేసి కలెక్టర్లపైకి నెట్టేస్తున్నారు. అక్టోబర్ 7న సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించా. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు సంతకాల ఉద్యమం సాగింది’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఓ హోటల్లో బుధవారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకునేందుకు రైతులను సంఘటిత పరచాలని ఆ దిశగా ఉద్యమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో వచ్చే ఏడాది జనవరి 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీన జరగనున్న అఖిలభారత కిసాన్ సమితి జాతీయ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఙరైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఙమాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం వల్ల స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ వాటా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో ఒక్క పంటకీ గిట్టుబాటు ధరలు లేవన్నారు. గుంటూరులో జరిగే ఏఐకేఎస్ జాతీయ సమావేశాలకు రైతు సంఘం నాయకులు అశోక్ దావాలే, హనన్ మొల్ల విజూ కృష్ణ హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్ల సూరయ్య చౌదరి, లాం ఫారం మాజీ అసోసియేట్ డైరెక్టర్ ఆర్.అంకయ్య, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మూర్తి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ సమావేశాలకు సంబంధించిన ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద, రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నామని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినప్పుడే పాలన విజయవంతమవుతుందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ‘సూపర్ సిక్స్‘ హామీలను పక్కన పెట్టి ‘సూపర్ సక్సెస్’ అని చెప్పుకోవడం ఆత్మ సంతృప్తికి తగదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఉపాధి భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం, ఆ హామీ అమలులో ఎందుకు వెనుకంజ వేస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. అనంతరం జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగరకార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు పాల్గొన్నారు. నేడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మెడికల్ కళాశాలల వద్ద ధర్నాలు సీపీఐ జాతీయ సమితి సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు -
జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్కు నిహాల్ ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: మణిపూర్లో జనవరి 4వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్నకు శ్రీచైతన్య జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థి దానియేలు నిహాల్ ఎంపికై నట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడారంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన తమ విద్యార్థి దానియేలు నిహాల్ జాతీయస్థాయికి అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా నిహాల్ను అభినందించారు. కార్యక్రమంలో మహతి క్యాంపస్ ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్–నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూలుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
తెనాలి నుంచి పెద్దాపురానికి ధాన్యం రవాణా
తెనాలి: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెనాలి నుంచి తొలిసారిగా రైల్వేర్యాక్తో 30 వ్యాగన్ల ధాన్యాన్ని బుధవారం సాయంత్రం పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్కు తరలించారు. తెనాలి రైల్వేస్టేషన్కు లారీల్లో చేర్చిన ధాన్యాన్ని వ్యాగన్లలో లోడు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజరు కె.తులసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లాలో తొలిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నెలరోజుల వ్యవధిలో 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్టు తెలియజేశారు. ఇందుకుగాను రూ.63 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. తెనాలి నుంచి రైల్వే ర్యాక్లో ధాన్యం రవాణా ఇదే ప్రథమంగా చెప్పారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్డు మార్గాన తరలివెళ్లినట్టు తెలిపారు. జిల్లాలో 20 మంది రైస్మిల్లర్లు సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల బీపీటీ–5204 ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్బాబు, పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, తెనాలి, కొల్లిపర మండలాల వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు. -
కొనసాగిన ఐటీహెచ్పీబీఏబీ గ్లోబల్ కాన్ఫరెన్స్
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాలలో జరుగుతున్న గ్లోబల్స్ కాన్ఫరెన్స్ రెండవ రోజు బుధవారం కొనసాగింది. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా అవార్డు ఉపన్యాసాలు, పరిశోధనలపై సదస్సు నిర్వహించారు. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ విత్ హెల్త్కేర్ ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, బయోమెడికల్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ (ఐటీహెచ్బీఏబీ–2025) గ్లోబల్ కాన్ఫరెన్స్లో జపాన్ దేశానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా న్యూరాలజీ రంగంలో విశేషమైన పరిశోధనా, వైద్య అనుభవాన్ని వివరించారు. ఫార్మసీ రంగంలో జీవితకాల సేవలకు ప్రొఫెసర్ జి.నరహరిశాస్త్రికి, బయోటెక్నాలజీ రంగంలో జీవితకాల కృషికి డాక్టర్ శ్రీనివాసులుకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. పరిశ్రమలలో బయోటెక్నాలజీ అభివృద్ధికి కృషిచేసిన డాక్టర్ కె.సురేష్బాబుకు టాలెంటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు అందించారు. ఏబీఏపీ సీనియర్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ బిపిన్నాయర్, డాక్టర్ వెంకటదాసు వీరంకి, డాక్టర్ లతారంగన్లకు అందించి సత్కరించారు. యువ పరిశోధకుల ప్రతిభను గుర్తిస్తూ ఏబీఏపీ టాలెంటెడ్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ శ్రీకాంత్గడాడ్, డాక్టర్ బృందా గన్నేరు, డాక్టర్ శ్రీనివాస్ పెంట్యాలాలకు అవార్డులు అందజేశారు. నానో సైన్స్, టెక్నాలజీ రంగంలో ఉన్నత పరిశోధనలకు డాక్టర్ శ్రీనివాసరెడ్డి బోనం, ఏబీఏపీ గోల్డ్ మెడల్ను, పరిశ్రమలలో వినూత్న ఆవిష్కరణలకు డాక్టర్ జి.వివేకానందన్కు ఏబీఏపీ ఇండస్ట్రీ ఇన్నోవేటివ్ అవార్డు ప్రదానం చేశారు. మొత్తం 161 ఒరల్ ప్రెజెంటేషన్లు 104 పోస్టర్ ప్రెజెంటేషన్లు జరిగాయి. చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు నాదెండ్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి నళినిదేవిలు రచించిన ఎమ్సీక్యూస్ ఇన్ పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని జపాన్కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు ఇతర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డీఎస్ నకార సేవలు చిరస్మరణీయం
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మంగళగిరి టౌన్: విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన డీఎస్ నకార సేవలు చిరస్మరణీయమని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని పెన్షనర్స్ హోమ్లో జాతీయ పెన్షనర్ల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ పితామహులు డీఎస్ నకార విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో డీఎస్ నకార తన కర్తవ్యంగా న్యాయస్థానానికి వెళ్లారని గుర్తుచేశారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మక తీర్పు వెలువరించారని.. ఆనాటి నుంచి పెన్షనర్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా మంగళగిరిలో నకార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు సీనియర్ పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిచ్చయ్య, కృష్ణయ్య, మంగళగిరి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్లో పరిశోధనలకు పెద్దపీట
మంగళగిరి టౌన్: వైద్య రంగంలో మంగళగిరి ఎయిమ్స్ గణనీయమైన పరిశోధనలు చేపడుతోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతం శాంతసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో బుధవారం అనుసంధాన దివస్–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాల్గవ వార్షికోత్సవ పరిశోధన దినోత్సవాన్ని డాక్టర్ అహంతం శాంతసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ గురువారంతో ముగియనుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైద్యవిద్య, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు ప్రధాన అంశాలపై ఎయిమ్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి రంగాల్లో పరిశోధనలు చేపడుతోందని, రక్తహీనత, సికెల్ సెల్ వ్యాధి వంటి సాధారణ, సంబంధిత ప్రజా సవాళ్లపై కూడా దృష్టి పెడుతోందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాపులో వివిధ విభాగాల వైద్య విద్యార్థులు పలు అంశాలపై రీసెర్చ్ చేశారని చెప్పారు. ఎయిమ్స్లో పేషెంట్ కేర్, మెడికల్ స్టూడెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ చక్కగా జరుగుతోందని ఇందుకు నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ నిదర్శనమన్నారు. మెడికల్, సర్జికల్, డెంటల్, నర్సింగ్ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో 40 సెక్షన్లలో రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలు కేటగిరీల కింద రీసెర్చ్ చేసిన వారికి బహుమతులు అందించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజ్డ్ చైర్పర్సన్, డీన్ (రీసెర్చ్) డాక్టర్ జాయ్ ఎ.గోషల్, అసోసియేట్ డీన్ (రీసెర్చ్) డాక్టర్ మాధవరావు, అసిస్టెంట్ డీన్ (రీసెర్చ్) ఆర్తి గుప్త, ఆంధ్రప్రదేశ్ మాజీ డీఎంఈ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కె. బాబ్జీ, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ గోపాలన్, శోద్ క్లినికల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోనికా బహల్, నోవార్టిస్కు చెందిన డాక్టర్ అరుణ్భట్తో పాటు పలువురు ప్రతినిధులు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈడీ డాక్టర్ అహంతం శాంతసింగ్ -
21,22 తేదీల్లో వివా వీవీఐటీయూ 2కే25–26
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయస్థాయి యువజనోత్సవం వివా వీవీ 2కే25–26 నిర్వహించనున్నట్లు వీవీఐటీ విశ్వవిద్యాలయం ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గతశక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్ లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యు అనే నినాదంతో యానిమి ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ (శాక్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకత, నైపుణ్యం, కళాత్మకతను వెలికితీసే విధంగా సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక విభాగాలలో 93 అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ యువజనోత్సవానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం విద్యార్థులతో కలసి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి విడుదల చేశారు. శాక్ విద్యార్థి తనువుద్ధి నవ్య మాట్లాడుతూ, వీవీఐటీ నిర్వహించే యువజనోత్సవం వివా వీవీఐటీయూ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యువజనోత్సవంలో పాల్గొనే విద్యార్థులు వివావీవీఐటీ.కామ్ వెబ్సైట్ నందు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 2026 మార్చి 1వ తేదీ నుంచి కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీఏ, వెలుగు సౌజన్యంతో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు క్యూర్ కోడ్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే జనవరి 22 వరకు మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరగుతోందని, జూట్ ప్రొడక్ట్స్లో వచ్చే జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత శిక్షణకు 19 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు అర్హులని స్పష్టం చేశారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనంతో పాటు, వసతి కల్పించడం జరుగుతోందని వివరించారు. పూర్తి వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, ఓల్డ్క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు, 0863–2336912, 8125397953, 9700687696 ఫోన్ నంబర్లును సంప్రదించాలని ఆయన తెలియజేశారు జిల్లాలో 474 మందికి కౌన్సెలింగ్ నగరంపాలెం: జిల్లాలో ఈవ్టీజింగ్, ఇష్టానుసారంగా మోటారుసైకిళ్లను నడిపే వారిని గుర్తించే ప్రత్యేక డ్రైవ్ బుధవారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఈవ్టీజింగ్కి పాల్పడిన 260 మంది, బైక్ పోటీలు, బైక్లపై వంకర్లుగా వెళ్తూ మిగతా చోదకులను ఇబ్బందులకు గురిచేసే 214 మందిని గుర్తించారు. ఈ మేరకు వారికి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు హెచ్చరించారు. స్కూళ్లు, కళాశాలలు, ప్రధాన రహదారులు, జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతాలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, థియేటర్లు, రైల్వే/బస్టేషన్లు వద్ద డ్రైవ్ కొనసాగింది. ఈవ్టీజింగ్, బైక్ పోటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి డీడీఓలను ఆశ్రయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు, బోధన, బోధనేతర సిబ్బంది వ్యక్తిగత, సర్వీసు రూల్స్, ఫిర్యాదులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (డీడీవో) ద్వారా పరిష్కరించుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీడీవో స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు, ఫిర్యాదులను డీఈవో, ఆర్జేడీకి రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాని పక్షంలో అప్పీల్స్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఉన్నతాధికారులను సంప్రదించిన పక్షంలో సీసీఏ నిబంధలన ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల పోస్టర్ను బుధవారం వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996–2000 సంవత్సరాల మధ్య విద్యనభ్యసించిన విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. వేడుకలు విజయవంతం కావడానికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ కావ్య, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆలయ ఎగువ దిగువ సన్నిధులు, శ్రీ గండాలయస్వామి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ను నిషేధించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ తెలి పారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేశారు. కొండపై గల శ్రీ గండాలయస్వామి వారిని దర్శించి దీపం పెట్టే భక్తులు వారి వెంట తీసుకువచ్చే ప్లాస్టిక బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు తిరిగి వారితోపాటే తీసుకువెళ్లాలని సూచించారు. భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను కొండపై వదిలి వెళ్లరాదని ఆయన కోరారు. దేవాలయ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. కారంచేడు: బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 103 సంవత్సరాల శతాధిక వృద్ధుడు బుధవారం మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన మృతితో గ్రామంలోని పాలేటి వారి బజారులో విషాదఛాయలు అలముకున్నాయి. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన పాలేటి సుబ్బారావు (103)కు 92 సంవత్సరాల భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మనవలు, మనవరాళ్లు, ముదిమనవలతో కలిపి సుమారు 20 మందికి పైగా సంతానం ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బారావు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం నేతృత్వంలో నూనె గింజల పంటల్లో కలుపు యాజమాన్యంపై పుస్తకాల విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మి దేవి మాట్లాడుతూ రైతులు క్షేత్రస్థాయిలో చీడపీడలను గుర్తించి, సరైన యాజమాన్య చర్యలు చేపట్టేటట్లు సరళంగా, పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. వీఆటి రూపకల్పనలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఆమె అభినందించారు. రైతులు ఈ పుస్తకాలను సద్వినియోగించుకుని మంచి దిగుబడులు సాధించాలని శారదజయలక్ష్మి దేవి కోరారు. -
గిట్టుబాటు.. కప్పదాటు
గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ అరకొరగానే జరుగుతోంది. గోతాలు లేవని,మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ (బిజీ) పూర్తయింది అని జాప్యం చేస్తున్నారు. 75 కిలోల ధాన్యం బస్తా రూ.1792 కొనుగోలు చేయాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.1400 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. – మట్టుపల్లి పోతురాజు, రైతు, సుద్దపల్లి, చేబ్రోలు మండలం. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆరుగాలం శ్రమించి తుపాన్లు, భారీ వర్షాలను తట్టుకుని పండించిన రైతులకు గిట్టుబాటు ధర కరువైంది. ప్రభుత్వం ఇస్తున్నట్లు చెబుతున్నా వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తేమ, నూక శాతం పేరుతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే, దళారులు ధర తగ్గించి రైతులను నష్టాలపాలు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్లో 66,082.46 హెక్టార్లలో వరి సాగు చేశారు. హెక్టారుకు 64 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. అంటే మొత్తం 4,22,928 మెట్రిక్ టన్నుల దిగుబడి రావాలి. వాస్తవంగా జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే వచ్చే పరిస్థితులు లేవని రైతు సంఘాలు, నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 188 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 26 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల వద్ద దండిగా ఉన్న సమయంలో తుపాన్లు, తేమ శాతం నిబంధనల పేరుతో సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి, వారు చెప్పిన తక్కువ ధరకే అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లక్ష్యానికి దూరంగానే మిగిలిపోయింది. కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు ప్రభుత్వం ఏ– గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, 75 కిలోల బస్తాకు రూ.1,792 మద్దతు ధర ప్రకటించింది. అయితే, తేమ, నూక పేరుతో మిల్లర్లు, దళారుల దోపిడీకి కొందరు సిబ్బంది సహకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పొందడానికి సేకరణ నిబంధనల మేరకు గరిష్ట తేమ 17 శాతం ఉండాలి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నాలుగు, ఐదు రోజుల పాటు ఆరబోసిన ధాన్యాన్ని మిల్లుకు పంపితే నూక పేరుతో, తేమ అధికంగా ఉందంటూ తరుగు తీస్తున్నారు. ఆరబెట్టినా, పెట్టకపోయినా బస్తాకు మూడు కిలోల కోత మాత్రం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు చెందిన ధాన్యాన్ని ఒకే లారీలో మిల్లుకు పంపుతుంటారు. వీరు పంపిన లోడులో ఇతరుల పేరుతో కొన్ని బస్తాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. 75 కిలోల బస్తాకు ఒక్కో రైతు రూ.70 నుంచి రూ.100 వరకు నష్టపోతున్నాడు. గత్యంతరం లేక రైతులు, దళారులను ఆశ్రయిస్తూ వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఇప్పటి దాకా వారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతుల సమస్యలు పట్టడం లేదు . మండలాల్లో అధికార యంత్రాంగం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను దళారులు నేరుగా రైతుల పేరిట దర్జాగా మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతుకు మద్దతు ధర లభిస్తుంది. దీనిపై అవగాహన లేని రైతులు కల్లాల్లోనే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి దళారులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం బస్తా రూ.1400 లకే వ్యాపారులు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. కూలీ, బాడుగకు రూ. 44 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 75 కిలోల బస్తాకు 60 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. నిలదీస్తే కొర్రీలు అక్రమ కోత, తరుగును ప్రశ్నిస్తే ధాన్యం సేకరణలో కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మిల్లుల వద్ద రైతులు, నిర్వాహకుల మధ్య నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి. 75 కిలోల బస్తాకు మూడు కిలోల తరుగును అనుమతిస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారని సమాచారం. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలుతో పాటు కోత ధరలు అమాంతం పెరగడంతో నష్టాలను ఎదుర్కొంటున్నారు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసినా ఆశించిన ఫలితంలేదు. ఎకరాకు 40 బస్తాలు ధాన్యం వస్తుందని ఆశిస్తే 28 బస్తాలు మాత్రమే దక్కింది. ఎండలో తిరగబెడుతూ పది రోజులు ఆరబెట్టినా ధర రూ.1520 దాట లేదు. – వెంకటాద్రి, రైతు, పచ్చలతాడిపర్రు చేతికి అందివచ్చిన ఖరీఫ్ పంట ఇక నోటికి అందుతుందనుకున్న రైతుల ఆశలపై అధిక వర్షాలు, వరుస తుపాన్లు నీళ్లు జల్లాయి. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, తడిసి రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి, కష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని అన్నదాతలు భావించారు. అయితే తేమ శాతం నిబంధనల పేరుతో ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసింది. మరో గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దళారులు సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. -
అలరించిన జానపద సాంస్కృతిక సంబరాలు
నగరంపాలెం: భావితరాలకు భారతీయ కళల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తెలిపారు. మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో బుధవారం రాత్రి నాట్స్ ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు, ఉత్తమ ఉపాధ్యాయులు, కవులకు పురస్కారాలు ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు నిర్వహణలో అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ భారతీయ కళలు అంతరించపోకుండా జానపద, సాంస్కృత సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కళలను ప్రోత్సహించాలని చెప్పారు. జానపద కళలను చిన్నతనంలో తిలకించానని, ప్రస్తుతం నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాలలో జానపద కళలను ప్రోత్సహించేందుకు కళాకారులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కృతీ, సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు నాట్స్ అన్నివేళల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాట్కో లక్షలాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ప్రజా గాయకుడు పి.వి. రమణ నేతృత్వంలో కళాకారుల విన్యాసాలు అలరించాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణ జిల్లాలతోపాటు మలినేని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాటం, డప్పు, కొమ్ము కోయి తదితర నృత్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మందాడి కిరణ్, వేమూరి శ్రీనివాసరావు, వైద్యులు ఏ.ఆంజనేయులు, జన చైతన్య వేదిక నిర్వాహకులు లక్ష్మణ్రెడ్డి, కాకుమాను నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రైవేటు సేవలో సూపర్ స్పెషలిస్టులు
గుంటూరు మెడికల్ : సాధారణ వైద్య సేవలు సైతం ఖరీదైపోతున్న నేటి రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందాలంటే పేద రోగులు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు గుంటూరు జీజీహెచ్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల కంటే మెరుగైన, అధిక సంఖ్యలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్య విభాగాలు కలిగి ఉన్న గుంటూరు జీజీహెచ్లో సూపర్ స్పెషలిస్టుల సేవలు అంతంత మాత్రంగానే లభిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యులు గుంటూరు జీజీహెచ్లో జీతాలు తీసుకుంటూ ఎక్కువ సమయం ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాటించని సమయవేళలు మధ్యాహ్నం వైద్యం నిల్ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పేద రోగులకు తప్పని తిప్పలు ... -
మురుగు నీటికి అడ్డు తొలగింపు
తాడేపల్లి రూరల్ : కుంచనపల్లి బైపాస్ రోడ్డులో గల ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పంట కాలువకు అడ్డుకట్ట తొలగించడంతో మురుగునీరు మొత్తం బయటకు వెళ్లిపోయింది. బుధవారం సాక్షిలో ముంచెత్తుతున్న మురుగునీరు, పొంగిపొర్లుతున్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కథనం వెలువడింది. దీనికి స్పందించిన కార్పొరేషన్ అధికారులు ప్రాతూరు, కుంచనపల్లి మధ్య కాలువకు రైతులు అడ్డంగా వేసిన కట్టను తొలగించారు.దీంతో ఒక్కసారిగా మురుగు నీరు మొత్తం కిందకు వెళ్లింది. పంపింగ్ స్కీంతో పాటు అపార్ట్మెంట్ల వద్ద నిలిచిపోయిన మురుగునీరు కిందకు వెళ్లింది. రైతులు మాత్రం మురుగు నీరు వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, కార్పొరేషన్ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయం చూసుకుని, పంట కాలువలో మురుగునీరు పారకుండా చూడాలని కోరుతున్నారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. PAC సభ్యులుగా వంగా గీత (పిఠాపురం), షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ (కదిరి) నియమితులయ్యారు.కాగా, ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగిన సంగతి తెలిసిందే. షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
ఇది పీపీపీ కాదు.. పెద్ద స్కామ్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్కు పాల్పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్నవైఎస్ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు.. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు.చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం(డిసెంబర్ 18, గురువారం) వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్కు కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైఎస్ జగన్ లక్ష్యం:ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైఎస్ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.ఆర్థిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం:వైఎస్ జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి.. మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హెరిటేజ్తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా? రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కోసం వైఎస్ జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు, సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్:ఇవాల్టికి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే.. ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది?మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే... మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు.ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే... దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ?జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..వైఎస్ జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్థ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత.. ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒక వైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ... మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో కాలేజీలు పూర్తి కావా?ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబులాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువఈ నేపధ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైఎస్ జగన్ పిలుపు మేరకు అక్టోబర్లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే... 1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,..పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199, ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్సార్ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు.బ్యాలెట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం:రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే... అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైఎస్ జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైఎస్ జగన్కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు. ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు:ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైఎస్ జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి వైఎస్సార్ ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు.నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైఎస్ జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం.ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్ధరహితమని తేల్చి చెప్పారు. -
‘కోటి సంతకాలు.. బాబు పతనానికి పునాదులు’
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాలు కాదు.. చంద్రబాబు పతనానికి పునాదులు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద ఉన్న కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ గోరంట్ల మాధవ్ నిలదీశారు.భూమి, బిల్డింగ్లు అన్నీ ప్రభుత్వమే ఇస్తే నీ బినామీలకు దోచి పెడతారా?. వంద రూపాయలకే ఎకరం భూమి ఇస్తారా?. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కాలేజీలను ప్రైవేట్ వారికి ఇచ్చి జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇస్తుందంట.. ఆదాయం మాత్రం ప్రైవేట్ వారే తీసుకుంటారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. -
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని.. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీకి తెర తీశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్.. చంద్రబాబు విధానాలను నిలదీశారు.కుడిచేత్తో కాలేజీలిచ్చి.. ఎడమ చేత్తో కమీషన్లు: గుడివాడ అమర్నాథ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు.కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందన్న వైఎస్సార్సీపీ వాదనను ప్రజలు అర్థం చేసుకున్నారు. గత మా ప్రభుత్వం నిర్మించిన కాలేజీలు, ఆస్పత్రులతో పాటు ఆయా ఆస్పత్రుల పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములను కాజేయాలన్న కుట్రతోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒక వైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్ కాలేజీల రూపంలో జగన్ సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దోచిపెడుతున్నాడు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ.800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నాడు. తన దోపిడీ కుట్రలను యథేచ్ఛగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదికను కూడా వక్రీకరించేస్తున్నాడు. కిక్ బ్యాక్ల కోసం తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెబుతున్నాడు.జీతాల చెల్లింపుల పేరుతో రూ.1400 కోట్లు దోపిడీ: గోరంట్ల మాధవ్పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూటమి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించే దర్జాగా దోపిడీకి బాటలు వేసుకుంటున్నాడు. రేపు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలి పెట్టబోము. న్యాయస్థానాల్లో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోము.కేవలం దోపిడీ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్ వేశాడు. ఇందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడీ: :మొండితోక అరుణ్కుమార్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ గారు నాడు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మెడికల్ కాలేజీల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపద సృష్టిస్తే. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దాన్ని తన బినామీలకు ధారాదత్తం చేసే కుట్రలకు తెరలేపాడు.నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా.. వైఎస్ జగన్ నిర్మించిన కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ.100లకు ధారాదత్తం చేశాడు. ఇది కాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నాడు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు. -
ఇంటర్ పరీక్షల మార్పులకు సన్నద్ధం కావాలి
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఇంటర్మీడియెట్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో పల్నాడుజిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, పరీక్ష నిర్వహణ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సైమన్ విక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పాత విధానాన్నే అమలు చేస్తుండగా, ప్రథమ సంవత్సరం పరీక్షల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం సిలబస్లో భారీ మార్పులు జరిగాయనీ, అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపు, అన్సర్ బుక్లెట్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బోటనీ, జువాలజీ పేపర్లు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వీటి ప్రశ్నాపత్రం 43, 42 మార్కులకు కేటాయించగా ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయని, రెండు సంవత్సరాలకు కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మార్పులను విద్యార్థులకు వివరించి వారిని సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షల స్పెషల్ ఆఫీసర్ వి.వి.సుబ్బారావు, రమేష్, ఆర్జేడి జె.పద్మా, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు టి.ప్రభాకర్, కె.వేణు, ఎస్ఎస్ అండ్ ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాససాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణాధికారి సైమన్ విక్టర్ జూనియర్ ఇంటర్ పరీక్ష మార్పులపై అవగాహన సమావేశం -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
తెనాలి రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్పై వెళుతున్న ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం తెనాలి నుంచి నందివెలుగు మీదుగా ఆర్టీసీ బస్సు గుంటూరు వెళుతుండగా కాజీపేట ఏ–వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓ సైకిల్, బైక్ ఢీకొని దానిపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై పడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుపై పడిన వారిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. బైక్ పై ప్రయాణిస్తున్న కొలకలూరు బాపయ్యపేటకు చెందిన పురంశెట్టి రామకృష్ణ, నీలి శ్రీనివాసరావు గాయపడ్డారు. ఇరువురిని స్థానికులు తెనాలి వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వైద్యశాలలో నాలుగు స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులు తెనాలి అర్బన్: జిల్లాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెనాలి జిల్లా వైద్యశాలలో ఇప్పటికే 10 మంది చికిత్స పొందారు.మరి కొందరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పొన్నూరుకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం మరో నలుగురు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చేరినట్లు చెప్పారు. వీరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశామని, బుధవారం రిపోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. బాలుడు బలవన్మరణం మార్టూరు: ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్టూరులో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన దేసు ప్రసన్నకుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు భద్రి ( 14) సంతానం. భద్రి స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాసులో మెరిట్ స్టూడెంట్గా ఉండే భద్రి.. ఇటీవల తన అమ్మమ్మ మృతి చెందినప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ స్కూల్కు సరిగా వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఉదయం 7:30 గంటల సమయంలో భద్రి తన తాతయ్యకు టీ పెట్టి ఇచ్చి.. ఇంట్లోకి వెళ్లి తిరిగి బయటికి రాలేదు. మనుమడు ఎంతకూ బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్కు తల్లి చీరతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేయగా వారు కింద దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎప్పుడూ చదువులో ముందుందే భద్రి అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మనస్తాపంతో లారీ డ్రైవర్ ఆత్మహత్య బల్లికురవ: మనస్తాపంతో ఓ లారీ డ్రైవర్ మద్యంలో గడ్డి నివారణకు వాడే పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 65 గంటలపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం చనిపోయాడు. అందిన సమాచారం ప్రకారం మండలంలోని వైదన గ్రామానికి చెందిన శాయిని వేణుగోపాల్ (52) లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈయనకు భార్య రామాంజమ్మ ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఎస్సై వై. నాగరాజు కేసు నమోదుతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస వేడుకలను మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో ధనుర్మాస వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం గోదా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం 1వ పాశుర విన్నపం, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో... పొన్నూరు: పట్టణంలోని స్వయంభూ శ్రీ సాక్షి భావనారాయణస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దేవాలయం అర్చకులు గోవర్ధనం రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ్నిక స్వామి వేదాంతం అనంత శ్రీనివాస భట్టాచార్యులు, తిరుప్పావై ప్రవచకులు తిరువాయిపాటి గోవర్ధనాచార్యులు పాల్గొన్నారు. భక్తులు గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. వాజ్పేయి విగ్రహానికి రూ.8 లక్షలు విరాళం గుంటూరుమెడికల్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గుంటూరులో సోమ వారం శంకుస్థాపన జరిగింది. గుంటూరు లక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త మాదల రత్నగిరిబాబు రూ.8 లక్షలు విగ్రహ నిర్మాణ కమిటీకి మంగళవారం అందజేశారు. వైభవంగా స్వామి వారి ఆరాధన మహోత్సవం నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరులోని శ్రీకంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో శ్రీకంచి కామ కోటి పీఠం 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 32వ ఆరాధన మహోత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష పూజలు తెనాలి: నాజరుపేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపారు. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అలంకరణ చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి ప్రవచనం చెప్పారు. 30న ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5.45 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తారు. -
విద్యార్థుల శ్రేయస్సును విస్మరిస్తే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తప్పవు
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల శ్రేయస్సుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో షేక్ సలీమ్ బాషా హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ విద్యార్థులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదని స్పష్టం చేశారు. ● వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అనైతిక అడ్మిషన్లకు పాల్పడుతున్నాయని, ఒక పాఠశాలలో విద్యార్థులను మరొక పాఠశాలలో చేర్చుకుని, ఫీజుల విషయంలో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన చర్యలతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడటంతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోందన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన విధి, విధానాల ప్రకారం పాఠశాలలు నిర్వహించాల్సిందేనని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష ఫీజులు వసూలు చేయడం తగదని స్పష్టం చేశారు. ● నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెనాలి డీవైఈవో శాంతకుమారి, గుంటూరు తూర్పు ఎంఈవో నాగేంద్రమ్మ, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్య నేర్పించాలి గుంటూరు ఎడ్యుకేషన్: వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గుంటూరులోని మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పిల్లలకు విద్యనందిస్తున్న వలంటీర్లు, కేర్ టేకర్లకు కెపాసిటీ బిల్డింగ్. కార్యక్రమాన్ని మంగళవారం సాంబశివపేటలోని సెయింట్ జోసఫ్ బీఈడీ కళాశాలలో ప్రారంభించారు. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడం మన బాధ్యత అని అన్నారు. ● ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల్లో బిహార్ వాసులు అత్యధికంగా ఉన్నారని, వారి పిల్లలకు లెర్నింగ్ సపోర్ట్ ఇచ్చే విషయమై బిహార్ నుంచి ప్రథమ్ ఎన్జీవో టీం ప్రత్యేకంగా వచ్చారని, సంబంధిత ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీంతో సమన్వయం చేసుకుని మూడు రోజులపాటు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ● బిహార్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలకు, ఇక్కడి పిల్లల స్వభావంతో భిన్నంగా ఉన్నాయని, ప్రధానంగా భాషకు సంబంధించిన సమస్య ఉత్పన్నమవుతోంద్నారు. ● గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ ఐ.పద్మావతి మాట్లాడుతూ ఎన్సీపీసీఆర్ గైడెన్స్, సమగ్రశిక్ష ఎస్పీడీ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్లో నిర్వహించిన సర్వే ద్వారా వలస కుటుంబాల్లోని 2,196 మంది పిల్లల వివరాలు సేకరించామని, వారికి విద్యను కొనసాగించేందుకు అవసరమైన లెర్నింగ్ సపోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీం కంటెంట్ ప్రతినిధి లీలా పద్మావతి, బిహార్ ప్రథమ్ టీం ప్రతినిధి దీనానాద్ కుమార్ సిన్హా, గుంటూరు ఈస్ట్ ఎంఈవో ఎస్ఎంఎం అబ్దుల్ ఖుద్దూస్ పాల్గొన్నారు. డీఈఓ సలీమ్ బాషా -
కార్టూనిస్ట్ సుభానీకి ‘బాపు’ అవార్డు
కారంచేడు: ప్రముఖ కార్టూనిస్ట్గా, అనతికాలంలోనే కార్టూన్ ఎడిటర్గా అంచలంచలుగా ఎదిగిన పొలిటికల్ కార్టూనిస్ట్ షేక్ సుభానీకి ‘బాపు అవార్డు’ దక్కింది. కారంచేడు గ్రామానికి చెందిన సుభానీ షేక్ గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్లోని డెక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్గా పనిచేశారు. కార్టూన్ ఎడిటర్గా.. ఎన్నో పొలిటికల్ కార్టూలను వేసి అనేక మంది మన్ననలు పొందారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. దీంతో హైదరాబాద్లోని బాపు–రమణ అకాడమీ వారు గుర్తించి సుభానీకి బాపు అవార్డును అందించారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు రమణ అవార్డు, సినీ నటుడు మురళీమోహన్కు జీవన సాఫల్య పురస్కారం అందించారు. సుభానీకి పలువురు అభినందనలు తెలిపారు. -
ముంచెత్తుతున్న మురుగు
పొంగిపొర్లుతున్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కాలువ తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కుంచనపల్లి బైపాస్ రోడ్డుకు మురుగు నీటి ముంపు తీవ్రమౌతోంది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని నివాసాల నుంచి వెలువడే మురుగుతోపాటు ఇతర వ్యర్థాలు ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కాలువలోకి వచ్చి చేరుతున్నాయి. రైతులు కోతలు కోయడంతో కాలువలో మురుగు పంట పొలాల్లోకి రాకుండా ప్రాతూరు రోడ్డులోని అపర్ణ సమీపంలో కాలువకు అడ్డంగా కట్ట ఏర్పాటు చేశారు. కట్ట ఏర్పాటు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 2 కి.మీ. పొడవున ఉన్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్లో కుంచనపల్లి బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మురుగునీరు వచ్చి పంట కాలువలో చేరడంతో పొంగిపొర్లుతోంది. పంట పొలాలకు తప్పని ముప్పు మురుగు పంట పొలాల్లోకి వచ్చి చేరుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వద్ద మురుగు షెడ్డులోకి చేరుతున్నాయి. కుంచనపల్లి, ప్రాతూరు రోడ్డులో కుంచనపల్లి బ్రిడ్జి వద్ద నుంచి రైతులు కాలువకు అడ్డు వేసిన కట్ట వరకు సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో అరటి, పసుపు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఎక్కడైనా కాలువ కట్ట తెగితే ఆ మురుగు అంతా ఒక్కసారిగా వచ్చి పంటపొలాలను ముంచెత్తుతుందని, పండించిన పంటలు దేనికీ పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్కి మురుగు భారీగా వచ్చి చేరుతోందని రైతులు చెబుతున్నారు. కొన్నిప్రాంతాల వారు మురుగు ఎత్తి ఈ కాలువలోకి పంపిస్తున్నారని రైతులు అంటున్నారు. పలు బహుళ అంతస్తుల నుంచి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్కు మురుగు వచ్చి చేరుతోంది. ఆ కాలువకు అడ్డుకట్ట వేయడంతో అపార్ట్మెంట్లలో మురుగు వెనక్కి తంతున్నట్లు అపార్ట్మెంట్ వాసులు తెలుపుతున్నారు. అర ఎకరంలో పసుపు పంట సాగు చేశా. కాలువలో మురుగు పొంగి పొర్లడంతో పసుపు పంట తడిసి పోయింది. దీని వల్ల పసుపు కుళ్లిపోతోంది. ఇప్పటికే మూడుసార్లు ఇలా జరిగింది. ఇది నాల్గవ సారి. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మురుగుని మళ్లించే మార్గాన్ని ఏర్పాటు చేయాలి. –దాశెట్టి శంకరరావు, రైతు -
ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్
ప్రత్తిపాడు: పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్ తమ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు తెలిపారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కిట్స్ కళాశాలలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (ఐడీఈ) బూట్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసీటీఈ, ఎంవోఈ ఇన్నోవేషన్ సెల్, ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, వాధ్వానీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరిగే ఈ క్యాంప్కు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సంబంధిత స్కూల్స్ ఉపాధ్యాయులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల్లో ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్ వ్యాపారోన్ముఖ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్యాంప్ చేపడుతుందని వివరించారు. బూట్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆర్జేడీ వి.లింగేశ్వర రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు నిపుణులైన రిసోర్స్ పర్సన్లతో లెక్చర్లు, వర్క్ షాపులు, హ్యాండ్స్–ఆన్ సెషన్లు నిర్వహించబడతాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ కోయి శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను మరింత మెరుగు పరిచేందుకు బూట్ క్యాంప్ దోహదపడుతుందన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాబు, బూట్ క్యాంప్ ఇన్చార్జి ఎస్పీవోసీ డాక్టర్ అరుణ పాల్గొన్నారు. కిట్స్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నరసరావుపేట టౌన్: పగలు దుప్పట్లు విక్రయిస్తూ రెక్కీ నిర్వహించి తాళ్లాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన బైరా సుజాత గృహంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోని 21 సెవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వాచీలు, రూ.లక్ష నగదును ఈ ఏడాది నవంబర్ 28న దోచుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చిలకలూరిపేట పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్రాలచావిడి, పాత బాలాజీ సినిమా హాల్ దగ్గర సోమవారం సంచరిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో పైనేరాన్ని వారే చేసినట్లుగా అంగీకరించారన్నారు. నిందితులు నూర్ హసన్, నొసద్, మిన్నా యామిన్, అబ్దుల్ గప్పార్, సాహుల్ జబ్బార్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1,25,800 విలువైన చోరీ సొత్తును, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన అనంతరం మిగిలిన సొత్తు రికవరీ కోసం పోలీస్ కస్టడీ కోరతామన్నారు. ఈ దొంగల ముఠాపై హర్యానా, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఒడిశాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలో కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో ముఖ్యపాత్ర వహించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్ , ఎస్ఐ హజరత్తయ్య, సిబ్బంది వై.శ్రీనివాస్, ఎస్.వణుకుమార్, వి.హరీష్, కె. శ్రీరాములు, వి.నారాయణరావు, జి.జాన్బాబు, కె.శివకృష్ణ, షేక్ జాన్బాషా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
నిమ్మ రైతులకు తప్పని కన్నీరు
నికర ఆదాయం... 2017–18లో చేదు అనుభవాలు... కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం... మళ్లీ పెరిగిన ధర... నిమ్మ రైతులకు మార్కెట్ ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వరకు కిలో రూ.90 వరకు పలికినా, తర్వాత ధరలు తగ్గినప్పటికీ నిలకడగానే ఉంటూ వచ్చాయి. నెల రోజులుగా ధరలు భారీగా పతనం చెందాయి. ఇటీవల వరకు కిలో రూ.6–12 వరకు అమ్మకాలు జరిగాయి. సగటు ధర రూ.10–12 మధ్యనే ఉంటూ వచ్చింది. తాజా రూ.15కు చేరుకుంది. అయినా ఈ ధరలతో నష్టపోక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో హఠాత్తుగా తగ్గిన ధర కాయ ఆధారంగా కిలో రూ. 12–18 సగటున కిలో ధర రూ.12–15 నెల రోజులుగా ఇదే తీరులో అమ్మకాలు ఖర్చులు కూడా రావని రైతుల గగ్గోలు -
చలపతి ఫార్మసీలో ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాం నందున్న చలపతి ఫార్మసీ కళాశాలలో అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ (ఏబీఏపీ) సహకారంతో నిర్వహిస్తున్న ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ అంతర్జాతీయ సదస్సు (గ్లోబల్ కాన్ఫరెన్స్) మంగళవారం ప్రారంభమైంది. స్థిరమైన అభివృద్ధి కోసం హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బయో మెడికల్ సైన్సెస్తో సాంకేతికత సమన్వయం అనే ప్రధాన అంశంతో మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ శాస్త్రవేత్తలు, అకడమిషీయన్లు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అరుదైన అవకాశాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. కార్యక్రమానికి చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవి ఆంజనేయులు, సెక్రటరీ వై. సుజిత్కుమార్లు అధ్యక్షత వహించారు. ఏబీఏపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు. ● ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి మాట్లాడుతూ ఉన్నతవిద్య, పరిశోధన నాణ్యత, పరిశ్రమ అకాడమీ అనుసంధానం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ● ఏఎన్యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధరరావు మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న పరిశోధనాధోరణులు, వైద్య శాస్త్రాల్లో సాంకేతికతపై విలువైన అవగాహన కల్పించారు. ● యూనివర్సిటీ ఆఫ్ అలబామా, ట్రాన్స్లేషనల్ సైన్స్ మెడిసిన్ విభాగం డాక్టర్ ఎం.ఎన్.వి.రవికుమార్ మాట్లాడుతూ ప్రయోగశాల స్థాయి పరిశోధనలు, వైద్య ఆవిష్కరణలుగా సమాజానికి ఉపయోగపడే విధానాన్ని వివరించారు. ● ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ నేసె శ్రీనివాసులు వ్యవసాయ పరిశోధనల్లో బయోటెక్నాలజీ పాత్ర, ఆహార భద్రత, సమగ్ర అభివృద్ధి అంశాలపై వివరించారు. ● హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ జి. నరహరిశాస్త్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర శాఖల పరిశోధనలు ఇన్నోవేషన్పై సమాచారాన్ని అందించారు. ● అలబామా స్టేట్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ మనోజ్ కె. మిశ్రా బయోమెడికల్ సైన్సెస్, గ్లోబల్ రీసెర్చ్ సహకారం యువ పరిశోధకులకు ఉన్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో దేశంలోని సుమారు 12 రాష్ట్రాలకు చెందిన 50కి పైగా ప్రముఖ విద్యాసంస్థల నుంచి 1250 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ప్రారంభమైన గ్లోబల్ కాన్ఫరెన్స్ -
80 లోనూ పతకాల పంట
తెనాలిటౌన్: రూరల్ మండలం కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య 80 సంవత్సరాల వయస్సులోనూ అథ్లెటిక్స్లో పాల్గొని మెడల్స్ సాధిస్తున్నారు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో 7వ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో జావెలెన్ త్రో, లాంగ్ జంప్, త్రో బాల్ పోటీలు 80 సంవత్సరాలు దాటిన వారికి నిర్వహించారు. కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య పాల్గొన్నారు. ● బుల్లయ్య జావెలెన్ త్రో, త్రోబాల్, లాంగ్ జంప్లో ప్రథమ బహుమతి సాధించగా, ఆళ్ళ వీరారెడ్డి షార్ట్ఫుట్లో ప్రథమ బహుమతి సాధించినట్లు చెప్పారు. ● చిన్ననాటి నుంచి క్రీడల్లో ఈ ఇరువురు ఉత్సాహంగా పాల్గొంటారని గ్రామస్తులు వివరించారు. ఈ సందర్భంగా ఇరువురుని సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లక్కరాజు శ్రీనివాసరావు, లక్కరాజు ఉమాకాంత్, కొల్లి ఉమాశంకర్రెడ్డి, పుట్టా రవికిషోర్, లక్కరాజు హరి, ఎం.నరేంద్ర, ఎస్.కోటేశ్వరరావు, తదితరులు ఉన్నారు. -
ఇంధన పొదుపు అందరి బాధ్యత
గుంటూరు వెస్ట్: ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన వనరుల పొదుపు పాటించటం వల్ల భవిష్యత్ తరాలకు ఇంధన భద్రత, భరోసా కల్పించటం సాధ్యం అవుతుందన్నారు. జాతీయ ఇంధన వనరుల వారోత్సవాలు ప్రతి ఏటా డిసెంబరు 14వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. వారోత్సవాలలో విద్యుత్ వంటి ఇంధన వనరులను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించటంపై ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు, యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. సోలార్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇంధన పరిరక్షణ , పొదుపు చిట్కాల ప్రచార పోస్టర్లును ఆవిష్కరించి, ఇంధన వనరులను పొదుపు పాటిస్తామని, వృథాను అరికడతామని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీడీసీఎల్ ఎస్ఈ చల్లా రమేష్, సీఆర్డీఏ సర్కిల్ ఎస్ఈ ఎం. శ్రీనివాసరావు, ఈఈ కె.సత్యనారాయణ, డీఈలు శ్రీనివాసబాబు, నాగేశ్వరరావు, జె.హరిబాబు, సూర్యప్రకాష్, ఎస్ఏఓ రామిరెడ్డి, ఏడీఈలు బి.రాజమోహనరావు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
విద్యార్థినికి దండన ఘటనపై చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: వుూడో తరగతి విద్యార్థినిని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనలో ప్రైవేటు పాఠశాలకు చెందిన ఇన్చార్జ్ హెచ్ఎంతో పాటు మరొక ఉద్యోగినిపై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. విద్యార్థిని తల్లి గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఆదేశాలతో మంగళవారం గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. అత్యవసరంగా టాయిలెట్కు వెళ్లేందుకు మూడో తరగతి విద్యార్థిని పడిన ఇబ్బందిని గుర్తించకుండా నిర్థాక్షిణ్యంగా మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను తిలకించారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ఆధారంగా విద్యార్థినిపై క్రమశిక్షణ చర్యల పేరుతో విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఈవో సలీమ్బాషా ఆదేశాలతో జరిగిన సంఘటనకు బాధ్యులను చేస్తూ ఇన్చార్జ్ హెచ్ఎంతో పాటు మరొక నాన్ టీచింగ్ ఉద్యోగినిని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. -
పీఎఫ్ రుణాలపై ఆడిట్ అభ్యంతరాలు తొలగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: అత్యవసర ఖర్చుల కోసం ఉపాధ్యాయులు దాఖలు చేస్తున్న పీఎఫ్ రుణాల దరఖాస్తులను అసంబద్ధమైన ఆడిట్ అభ్యంతరాలతో తిరస్కరించడం మానుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమను గుంటూరులోని ఆడిట్ కార్యాలయంలో కలిసిన ఏపీటీఎఫ్ బృందం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. బసవ లింగరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల అవసరాలకు ఉపయోగపడతాయని నెల నెలా పీఎఫ్లో దాచుకున్న సొమ్ము అనారోగ్య పరిస్థితుల్లో వైద్య చికిత్సల కోసం దాఖలు చేసుకున్న రుణ దరఖాస్తుల్లో రూ.ఐదు లక్షలు దాటితే అసిస్టెంట్ సివిల్ సర్జన్, మెడికల్ సర్టిఫికెట్ తేవాలని లేదంటే పీఎఫ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నారని అన్నారు. ● పీఎఫ్ రుణాల మంజూరులో అర్థం లేని నిబంధనలు విధించడం తగదని, లేని నిబంధనలు చూపి దరఖాస్తులను ఏ విధంగా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఆడిట్ కార్యాలయం నుంచి లేవనెత్తుతున్న అభ్యంతరాలు పూర్తిగా విరుద్ధమన్నారు. ● ఎన్జీవోలకు వర్తించే నిబంధనలను ఉపాధ్యాయులకు అన్వయించడం సహేతుకం కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి అయినా సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ● పీఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్న పరిస్థితుల్లో జెడ్పీ పీఎఫ్ విభాగం, జిల్లా ఆడిట్ కార్యాలయం ఒకరిపై ఒకరు చెప్పుకుని రుణ దరఖాస్తులను కొర్రీలు వేస్తూ, కాలయాపనతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ● ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ పీఎఫ్ రుణాలపై జెడ్పీ కార్యాలయ సిబ్బంది వ్యవహరిస్తున్న అసంబద్ధ విధానాలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ● రుణానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో పాటు, ఉద్యోగ విరమణ అనంతర తుది చెల్లింపులకు ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కలవాలని చెబుతున్నారని, ఈ విధంగా ప్రవర్తించడ సరికాదన్నారు. ● జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమ స్పందిస్తూ ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆడిట్ అధికారిని కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, జి.దాస్, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ యూ.వందనం, జిల్లా కౌన్సిలర్లు సయ్యద్ జహంగీర్, కృష్ణారావు, గురుమూర్తి, అప్పారావు, తదితరులు ఉన్నారు. ఏపీటీఎఫ్ డిమాండ్ -
21న సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీన జరుపుకుంటోందని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాకేష్ రంజన్ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ‘భూమిని రక్షించండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ వాకథాన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ రంజన్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవానికి దారితీసే కార్యకలాపాలలో భాగంగా, కడప ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఆరోగ్యంగా ఉండండి, ఫిట్గా ఉండండి‘ అనే థీమ్తో ఫిట్నెస్ అవగాహన వాకథాన్ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. శారీరక ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి కడప ప్రాంతీయ కార్యాలయం, నగరపాలెం ప్రాంతంలో ఒక వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ అధిపతి ఇ. వెంకటేశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని వివరించారు. -
టీవీ-9 రజనీకాంత్, ఎన్టీవీ సురేష్లకు వైఎస్ జగన్ పరామర్శ
తాడేపల్లి: పితృ వియోగం కల్గిన టీవీ-9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు సురేష్లను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరిమర్శించారు. రజనీకాంత్ తండ్రి వెల్లల చెరువు సాంబశివరావు మృతిపై, ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు సురేష్ తండ్రి వెంకటామిరెడ్డి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వీరికి ఫోన్ చేసిన వైఎస్ జగన్.. ఇలాంటి కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. -
‘ ఆ అంశంపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’
తాడేపల్లి : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదక మీద కూడా ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేయమని ఆ కమిటీ చెప్పలేదన్నారు. కానీ స్టాండింగ్ కమిటీ నివేదిక పైనా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తన్నారన్నారు. ఈరోజు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విడదల రజిని మాట్లాడుతూ.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చకు తామె పిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘పేదల ఆరోగ్యంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. ఎంబీబీఎస్ సీట్లు విషయంలో రాష్ట్రాల వారీగా అసమానతలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉన్నాయని కమిటీ చెప్పింది. ఇలాంటి అసమానతలు ఉండ కూడదనే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో పీపీపీ పేరుతో చంద్రబాబు స్కాం కి తెరలేపారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయమని చెప్పింది. అంతేకాని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను ఇవ్వమని చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ppp కి ఇవ్వమని కమిటీ ఎక్కడ చెప్పిందో చూపించాలి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’ అని సవాల్ చేశారు. -
బాత్రూం డోర్ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన టీచర్
గుంటూరు: మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని టాయిలెట్కు వెళ్లేందుకు బాత్రూం డోర్ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత నెల 17న జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదుకు దిక్కు లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా పేర్కొంటూ క్లోజ్ చేయడంతో తిరిగి విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. గుంటూరు నగరం పట్టాభిపురంలోని జీకేఆర్ హైస్కూల్ ల్లో 3వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అర్జంటుగా టాయిలెట్కు వెళ్లాల్సి రావడంతో పాఠశాలలోని బాత్రూంకు వెళ్లింది. అయితే బాత్రూం ఖాళీ లేకపోవడంతో లోపల ఉన్న వారిని త్వరగా బయటకు రావాలని పిలిచేందుకు తలుపు తట్టింది. ఈ సంఘటన గమనించిన పాఠశాలలోని ఒక టీచర్ విద్యారి్థని పెద్ద తప్పిదం చేసినట్లుగా భావించి, చెంపపై దెబ్బ కొట్టడంతోపాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ విధంగా గంటన్నర సేపు విద్యారి్థని మోకాళ్లపై కూర్చునట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. బాలిక తల్లి సంకు త్రిలోచనకు ముగ్గురు పిల్లలు కాగా, ఇదే పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి వారిని పాఠశాలకు రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరపాల్సిన విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పాఠశాలకు వెళ్లి విచారణ జరపాల్సిన అధికారులు ఇవేమీ చేయకుండానే ఫిర్యాదు పరిష్కరించామని చెప్పి ఫిర్యాదును మూసివేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్కు వచ్చారు. గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా పేరుతో సంబంధిత విద్యార్థిని తల్లికి పోస్టులో లేఖ పంపారు. విద్యారి్థని తల్లిదండ్రులు ఇచ్చిన సెల్ఫోన్కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. -
విజయ్ దివస్: అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. విజయ్దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వానికి, త్యాగానికి గౌరవప్రధమైన నివాళి అర్పిస్తున్నాం. వారి సేవలు ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తాయి. రాబోయే తరాలకు వారు శాశ్వత ప్రేరణగా నిలుస్తారు అని ఎక్స్ఖాతాలో ట్వీట్ చేశారాయన.On #VijayDiwas, we remember and pay our respectful homage to the valour and sacrifice of the soldiers who laid down their lives securing victory for the Nation in the 1971 war. Their valiant service to our nation will forever be remembered and will continue to be a beacon of…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 16, 2025 -
జోజి నగర్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: భవానీపురం జోజి నగర్లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ఆయనకు చూపించాయి. ‘‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్, కరెంట్ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు..’’ అని జగన్ వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని.. అన్నివిధాల అవసరమైన సాయం అందిస్తామని’’ అని ఆయన భరోసా ఇచ్చారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఆయన్ని చూసేందుకు.. ఫొటోలు తీసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు.. కరచలనం చేసేందుకు.. భారీగా జనం తరలివచ్చారు.ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజి నగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. తమ ఇళ్లను కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులు ప్రభుత్వ పెద్దలకు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వైఎస్ జగన్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు కంటతడి పెట్టగా.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు. ఈ క్రమంలో.. ఇవాళ స్వయంగా ఆయన జోజినగర్ వెళ్లి బాధితులతో కలిసి కూల్చివేత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ప్రొద్భలంతోనే కూల్చివేతలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్నామని.. ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
అమరజీవికి జిల్లా ఎస్పీ ఘననివాళి
నగరంపాలెం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పొట్టిశ్రీరాములు కీలకపాత్ర పోషించారన్నారు. ప్రాణాలను సైతం ఏమాత్రం ఖాతారుచేయకుండా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల సాధనకై అహింసాయుత దీక్షతో పోరాడి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, కార్యాలయ ఏఓ వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పలువురు సీఐలు, ఆర్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్జీ రంగా వర్సిటీలో ... గుంటూరు రూరల్: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మిదేవి తెలిపారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్థంతిని పురస్కరించుకుని నగర శివారు లాంఫాంనందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో రీసెర్చ్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, పీజీ డీన్ డాక్టర్ ఏవీ రమణ, కంట్రోలర్ డాక్టర్ బి. ప్రసాద్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఎ. మణి, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, లైబ్రేరియన్ జి. కరుణ సాగర్, జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్యంలో రారాజు కొసరాజు
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : కొసరాజు సాహిత్యం ద్వారా ఆయన వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరమంతా ఉన్నతంగా వెలుగుతుందని మహా సహస్రావధాని ప్రవచన కిరీటి డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. సోమవారం గుంటూరులోని జేకేసీ కళాశాల సమావేశ మందిరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక, మనసు ఫౌండేషన్ సంయుక్తంగా సాహిత్య పరిశోధకులు పారా అశోక్కుమార్ నేతృత్వంలో రూపొందిన కొసరాజు సర్వలభ్య రచనల సంకలనం పుస్తకావిష్కరణ సభ జరిగింది. తొలుత ఈ గ్రంథాన్ని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం కొసరాజు జీవిత మాలికపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను అతిథులు ప్రారంభించి, కొసరాజు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, పత్తిపాటి దేవాక్షమ్మ, చలసాని అనురాధ, కస్తల పద్మ, డాక్టర్ కొసరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు -
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మార్పులకు సన్నద్ధం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఆర్ఐవో జి. సునీత పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలపై సోమవారం గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సాంబశివపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భగా ఆర్ఐవో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ సంస్కరణలు, సబ్జెక్టుల వారీగా సిలబస్, మార్కుల విభజనపై వివరించారు. ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల విధానంతో పాటు సిలబస్లో చోటు చేసుకున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాదేవి, ఇంటర్మీడియెట్ బోర్డు పరిశీలకురాలు పి.రేఖావాణి పాల్గొన్నారు. ఆర్ఐఓ జి. సునీత -
రైల్వే పెన్షన్ అదాలత్ బహిష్కరణ
గుంటూరు మెడికల్: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిపాలన విభాగంలో సోమవారం నిర్వహించిన పెన్షన్ అదాలత్ను ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు బహిష్కరించారు. సోమవారం జరిగిన పెన్షన్ అదాలత్లో ఒక పెన్షనర్ల సంఘానికి అనుమతి ఇచ్చి, తమ సంఘానికి అనుమతి ఇవ్వకపోవడంతో బహిష్కరించామని అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ కె.నారాయణరెడ్డి, సెక్రటరీ ఎల్.రాఘవబాబు తెలిపారు. గుంటూరు డివిజన్లో పనిచేస్తున్న ప్రధాన పెన్షన్ల సంఘాల్లో తమ సంఘం ఒకటని పేర్కొన్నారు. 300 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు పెన్షన్ అదాలత్లలో అన్ని గుర్తింపు పొందిన పెన్షనర్ల సంఘాలు పాల్గొనేందుకు, అభిప్రాయాలు తెలియజేసేందుకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా తమ సంఘం పాల్గొనకుండా ఉండేందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరండల్పేటలో జరిగిన సమావేశంలో సుధాకర్, కోశాధికారి ఆదినారాయణరెడ్డి, చెన్నయ్య, కోటేశ్వరరావు, శివరామ్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గుర్తించిన అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై సోమవారం స్థానిక కలెక్టర్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు వందలు, ఆపైన జనాభా కలిగిన షెడ్యూల్డ్ కులాల గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలో 40 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో అనుసంధానం చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తుందన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం , విద్యుత్, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డీడీ యు.చెన్నయ్య, జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, డిఎస్ఓ పి.కోమలి పద్మ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమర్థంగా విధులు నిర్వహించాలి మంగళగిరి టౌన్: పోలీస్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో సమర్థంగా బందోబస్తు విధులు నిర్వహించాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు విధులపై సోమవారం అధికారులకు సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందాల్ సూచనలు చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి సీసీ కెమెరాల అమరికలు, పనితీరును పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు రమణమూర్తి, రవికుమార్, హనుమంతు, స్పెషల్ బ్రాండ్ డీఎస్పీ శ్రీనివాసులు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వడ్డేశ్వరం విద్యార్థులు తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రగ్బీ సౌత్జోన్ ఖేలో ఇండియాలో భాగంగా రాష్ట్ర సబ్జూనియర్ బాలికలు అండర్–15 విభాగంలో గుంటూరు కొత్తపేటలో ఎంఆర్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం జూనియర్ క్యాంపస్లో ఈనెల 14వ తేదీన ఎంపిక పోటీలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేగావత్ భువనేశ్వరి భాయి ఎంపికై ందని తెలిపారు. ఎంపికై న విద్యార్థిని ఈనెల 27, 28 తేదీల్లో చైన్నె జేఎన్ స్టేడియంలో జరిగే ఖేలో ఇండియా సౌత్జోన్ అస్మిత లీగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు తెలియజేశారు. అలానే కృష్ణాజిల్లా, గన్నవరంలో ఈనెల 1, 2 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో అండర్–14 విభాగంలో తమ పాఠశాల విద్యార్థిని రావిపాటి దివ్య(8వ తరగతి) ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికై ందని వివరించారు. రావిపాటి దివ్య ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి రగ్బీ పోటీలలో పాల్గొనన్నుట్లు ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణులను, వ్యాయామ ఉపాధ్యాయులు మెల్లెంపూడి రవి, నూతక్కి రవి, పి.సతీష్కుమార్లను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
విజ్ఞాన్ యూనివర్సిటీకి పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరు
చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ఢిల్లీలోని నావల్ రీసెర్చ్ బోర్డ్ (ఎన్ఆర్బీ) – డీఆర్డీఓ నుంచి ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరైనట్లు వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ సోమవారం తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి.అశోక్ కుమార్, రీసెర్చ్ అడ్వైజర్ డాక్టర్ తొండెపు సుబ్బయ్య, భువనేశ్వర్లోని సీఎస్ఐఆర్ – ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీకి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కాలి సంజయ్లకు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పైలెట్ స్కేల్ టెస్టింగ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లో షీట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎన్హైడ్రస్ మెగ్నీషియం క్లోరైడ్ ఫ్రమ్ సీ వాటర్ బిట్టెర్న్స్’ అనే అంశంపై నిర్వహించనున్న ఈ పరిశోధనకు రూ. 74.35 లక్షల గ్రాంట్నుఎన్ఆర్బీ–డీఆర్డీఓ మంజూరు చేసిందని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా సముద్ర జలాల్లో మిగిలే బిట్టెర్న్స్ నుంచి అధిక స్వచ్ఛత గల ఎన్హైడ్రస్ మెగ్నీషియం క్లోరైడ్ తయారీకి వినూత్నమైన సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ పి.అశోక్ కుమార్, రీసెర్చ్ అడ్వైజర్ డాక్టర్ తొండెపు సుబ్బయ్యలను చైర్మన్ లావు రత్తయ్య, సీఈఓ మేఘన కూరపాటి అభినందించారు. -
రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో డివిజన్కు రజత పతకం
క్రీడాకారుడు శివరామకృష్ణ యాదవ్ను అభినందించిన డీఆర్ఎం లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈనెల 3వ తేదీ నుంచి 6 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్లో గుంటూరు రైల్వే డివిజన్లో కమర్షియల్ క్లర్క్ కమ్ టిక్కెట్ క్లర్క్ ఎ.శివరామకృష్ణ యాదవ్ రజత పతకం దక్కించుకోవడం అభినందనీయం అని డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో వెండి పతకం దక్కించుకున్న శివరామకృష్ణ యాదవ్ను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ తూర్పు కోస్ట్ రైల్వే, విశాఖపట్నంలో చాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలకు చెందిన వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొనగా 88 కిలలో విభాగంలో గుంటూరు డివిజన్కు చెందిన ఉద్యోగి శివరామకృష్ణ యాదవ్ వెండి పతకం కై వసం చేసుకోవడం అభినందనీయమన్నారు. డివిజన్ ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొని, డివిజన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల్సిందిగా కోరారు. -
‘ఇది బాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన ఘనమైన తీర్పు’
తాడేపల్లి : మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అనంతరం వాటిని జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపులో భాగంగా ఈరోజు(డిసెంబర్చే 15వ తేదీ) చేపట్టిన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమంప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైనదిగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ‘ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది. ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని అన్నారు.The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how… pic.twitter.com/umPRjU20xa— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025 ఇవీ చదవండి:కోటి సంతకాలు.. కోట్ల గళాలువిజయవాడకు వైఎస్ జగన్ఇదీ కదా ప్రజా ఉద్యమం అంటే.. -
‘ప్రజావైద్యం కోసం మా నాయకుడు విశేషంగా పని చేశారు’
తాడేపల్లి :గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజావైద్యం కోసం విశేషంగా పనిచేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. మరి నేటి కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనం ఆగ్రహంతో ఉన్నారనే దానికి ఈరోజు(సోమవారం, డిసంబర్ 15) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ర్యాలీలే ఉదాహరణ అని మాజీ మంత్రి, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేస్తుందని, గత 18 నెలల కాలంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసమే పీపీపీ మోడల్లోకి తీసకెళ్లారు. ఇది దుర్మార్గమైన మోడల్.కాలేజీలను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు..రాష్ట్రంలో కోటి సంతకాలకు మంచి స్పందన లభించింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయి.. ప్రతీ జిల్లాలో వైఎస్సార్సీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. జగన్ ప్రజావైద్యం కోసం విశేషంగా పని చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేశారు. ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈనెల 18న గవర్నర్ ను జగన్ కలుస్తారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి తెలియజేస్తాం. ప్రైవేట్ వాళ్లకు కాలేజీలను అప్పగించి, సిబ్బందికి మాత్రం ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. పేదవారి వైద్యాన్ని తాకట్టు పెట్టీ కిక్ బ్యాగ్స్ తీసుకోవాలని చూస్తున్నారు. మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు. -
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. రచ్చబండతో షురూ ..అక్టోబర్లో వైఎస్సార్సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.తుపాను ఆపలేకపోయింది!లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. -
అమరజీవికి వైఎస్ జగన్ నివాళి
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15) నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/J5uQWesAWJ— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు అయిన పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న నెల్లూరు జిల్లా పదమటిపల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. సానిటరీ ఇంజినీరింగ్(Sanitary Engineering)లో చదువు పూర్తి చేశారాయన. 1928–1930 మధ్యలో భార్య, పిల్లలు, తల్లి మరణించడంతో ఉద్యోగాన్ని వదిలి గాంధీజీ ఆశ్రమంలో చేరారు.స్వాతంత్ర్య పోరాటంలో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహం.. ఉద్యమాల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనలో అనేక సార్లు జైలుకు వెళ్లారు. దళితుల హక్కుల కోసం, ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్షలు చేశారు. పొట్టి శ్రీరాములు లాంటి వాళ్లు ముందు నుంచి ఉద్యమంలో ఉండి ఉంటే.. దేశానికి స్వాతంత్రం ఏనాడో వచ్చి ఉండేదని ఒకానొక సందర్భంగా గాంధీ కితాబిచ్చేవారు. అలాంటి మహనీయుడు..తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్తో 1952 అక్టోబర్లో మద్రాస్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. దాదాపు 58 రోజుల తర్వాత డిసెంబర్ 15వ తేదీన దీక్షలోనే మరణించారు. ఆయన త్యాగం తర్వాతే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అలా స్వరాష్ట్ర కలను సాకారం చేసి ‘‘అమరజీవి’’గా ఆయన కీర్తి దక్కించుకున్నారు. -
చంద్రబాబు పాలనలో విద్యా రంగం నిర్వీర్యం
చేబ్రోలు: కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, ఆన్లైన్ యాప్ల విధానంతో ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) గుంటూరు జిల్లా 51వ కౌన్సిల్ సమావేశం ఆదివారం చేబ్రోలులో ఘనంగా జరిగింది. స్థానిక ఆర్వీటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖరరావు అధ్యక్షత వహించారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా జాతీయ, ఎస్టీఎఫ్ఐ, యూటీఎఫ్ జెండాలను నారాకోడూరు హైస్కూల్ హెచ్ఎం ఎం. ఏడుకొండలు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభుదాసు, సీనియర్ నాయకులు ఆర్వీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. యూటీఎఫ్ బలోపేతం, ిసీపీఎస్ రద్దు, ఉపాధ్యాయుల సంక్షేమం, టెట్ అర్హత పరీక్ష, బోధనేతర పనులతో విద్యార్థికి దూరమవుతున్న ఉపాధ్యాయుడు, అభ్యుదయ భావాలతో కూడిన విద్య అందరి బాధ్యత అనే అంశాల గురించి సమావేశంలో చర్చలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ టెట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో ఎనిమిది తీర్మానాలు చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. నాయుడు, యూటీఎఫ్ నాయకులు ఎన్. కుమారరాజా, యన్. తాండవ కృష్ణ, ఎం. కళాధర్, వై. నాగమణి, జి. వెంకటేశ్వరరావు, మండల శాఖ అధ్యక్షుడు ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, స్థానిక ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్వీ కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. యూటీఎఫ్ నూతన కార్యవర్గం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా యు. రాజశేఖర్రావు, ప్రధాన కార్యదర్శిగా ఎం. కళాధర్, సహాధ్యక్షుడిగా జి వెంకటేశ్వర్లు, మహిళా సహాధ్యక్షులుగా షకీలా బేగం, కోశాధికారిగా గయా శుద్ధవుల, జిల్లా కార్యదర్శులుగా సీహెచ్. ఆదినారాయణ, జి. వెంకటేశ్వరరావు, సాంబశివరావు, కేదార్నాథ్, గోవిందు, రంగారావు. ప్రసాద్ , కామాక్షి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఘనంగా ముగిసిన యూటీఎఫ్ 51వ జిల్లా మహాసభలు -
సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు రూరల్: రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలు రాష్ట్ర జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ నేతృత్వంలో పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి వేణుమాధవరావు తెలిపారు. గుంటూరు జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నగరంలోని కృషి భవన్లో నిర్వహించారు. వేణుమాధవరావు మాట్లాడుతూ వ్యవ సాయ విస్తరణాధికారులకు జాబ్ చార్ట్, నామిలికేచర్ మార్పు తదితర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో ఏపీ జేఏసీ సహకారంతో పరిష్కారం అవుతాయన్నారు. జిల్లావ్యవసాయ విస్తరణ అధికారులు తమ సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కోశాధికారి సుభాని గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు సురేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు సురేష్ గోపి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు రమణయ్య పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కార్యవర్గం గుంటూరు జిల్లా ఏఈఓ సంఘం అధ్యక్షులుగా ఆలా రమేష్బాబు, కార్యదర్శిగా ఎన్ ప్రసాద్బాబు, కోశాధికారిగా ఎంఎన్ కృష్ణారావు, సహాధ్యక్షులుగా ఐ శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా పి రవికుమార్, ఆర్ వెంకయ్య, వీరంకి గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివరావు, ప్రచార కార్యదర్శిగా కె రమేష్బాబు, సంయుక్త కార్యదర్శులుగా ఐ జ్యోత్స్న, పి రాజేంద్రప్రసాద్, బి సౌజన్య, కార్యవర్గ సభ్యులుగా దేవ సమర్పణరావు, ఆదిలక్ష్మి, మురళి ఎన్నికై నట్లు ఎన్నికలు ఎన్నికల అధికారి రమణయ్య ఈ సందర్భంగా తెలిపారు. -
ఉపకార వేతనాలతో ఉన్నతస్థాయికి ఎదగాలి
తెనాలి: విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పారిశ్రామికవేత్త, తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్రప్రభు పేర్కొన్నారు. ఒక స్థాయికి చేరుకున్నాక తిరిగి సమాజానికి సేవ చేయాలని అన్నారు. పట్టణానికి చెందిన కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రొగ్రెసివ్ అసోసియేషన్ (కెపా) 21వ ప్రతిభా స్కాలర్షిప్ల ప్రదానోత్సవం ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో 2024–25 విద్యా సంవత్సరానికి 430 మంది విద్యార్థులకు రూ.14.53 లక్షల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. రామచంద్రప్రభు మాట్లాడుతూ తాను ఎస్ఎస్ఎల్సీ పరీక్ష ఫీజు రూ.16 కోసం నాలుగిళ్లు తిరగాల్సి వచ్చిందని, పీయూసీ, బీటెక్ను మెరిట్ స్కాలర్షిప్తోనే చదువుకున్నట్టు గుర్తుచేసుకున్నారు. స్కాలర్షిప్ ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తెరగాలని చెప్పారు. రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్బాబు మాట్లాడుతూ ఇరవైఏళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. నారాయణ గ్రూప్ స్కూల్స్, గుంటూరు ఏజీఎం దాసం శివనాగరాజు, శింగులూరి వీరన్న, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి బళ్లా నరేంద్రకుమార్, భావనా పవన్కుమార్, రంగిశెట్టి రమేష్ ప్రసంగించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవ్వాజి కోటినాగయ్య, కార్యదర్శి తాడికొండ చిన్నబ్బాయి, సభ్యులు బొల్లిముంత అమరేశ్వరరావు, వెంకటపున్నారావు, బొల్లిముంత శివరామకృష్ణ, సాయికృష్ణ, సాంబశివరావు, బర్మా కోటేశ్వరరావు, జగన్మోహనరావు, సోమరౌతు సాంబశివరావు, తన్నీరు కళ్యాణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, తెనాలి యూనిట్ కార్యదర్శిగా ఎన్నికై న ముళ్లపూడి సాయికృష్ణను అతిథుల చేతులమీదుగా సత్కరించారు. పారిశ్రామికవేత్త తులసీ రామచంద్రప్రభు 430 మందికి రూ.14.53లక్షల ఉపకార వేతనాల పంపిణీ -
సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యం
నగరంపాలెం: సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యమేనని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో ఆదివారం 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ నిర్వహించారు. రమ్య భారతి సాహిత్య పత్రిక నుంచి చలపాక ప్రకాష్, శ్రీ వసిష్ట సోమేపల్లి నిర్వహణలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. రమ్య భారతి గౌరవ సలహాదారులు వేముల హాజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ మాట్లాడుతూ సాహిత్యంలో మానవతా విలువలు ఉన్నప్పుడు రాణిస్తుందని పేర్కొన్నారు. ఏపీ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి.భవానిదేవి, ప్రముఖ కథకులు శ్రీ కంఠస్ఫూర్తి మాట్లాడుతూ మనిషిలో అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని వెలికితీసేందుకు వేదికను నెలకొల్పిన మహా వ్యక్తి సోమేపల్లి అని కొనియాడారు. అనంతరం కథల పోటీల్లో ప్రథమ విజేత సింగరాజు శ్రీనివాసరావు (గెలుపు), ద్వితీయ విజేత జి.రంగబాబు (ఇకనైనా మారండి ), తృతీయ విజేత బీఎస్కే.కరీముల్లా (బేరం), ప్రోత్సాహక ఉత్తమ పుర స్కారాలను సింహప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్), ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ) కు అందించి, సత్కరించారు. సభలో సాహితీవేత్త లు కేంద్ర సాహిత్య అవార్డుగ్రహీతలు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, రావెల సాంబశివరావు, సీహెచ్.సుశీలమ్మ, శివప్రసాద్, తోట కూర వెంకటనారాయణ, సుభాని పాల్గొన్నారు. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్ -
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీష
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెతాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గుంటూరుకు చెందిన డాక్టర్ ఆర్.శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘ రాష్ట్ర సెక్రటరీగా డాక్టర్ బి.ప్రకాశం, ట్రెజరర్గా డాక్టర్ సిహెచ్.సుజిత ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఏపీలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా స్పీచ్ థెరిఫీ సెంటర్లు నడుపుతున్నారని చెప్పారు. మాట, ప్రవర్తన లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అనాధికార స్పీచ్ సెంటర్ల నిర్వాహకులు నెలకు రూ. 25 నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు సరైన పద్ధతుల్లో స్పీచ్ థెరఫీ అందిచలేకపోతున్నారని, వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం అనధికార ఫీజు సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినికిడి లోపం ఉన్న వారి పిల్లల తల్లిదండ్రులు నిపుణులైన ఆడియాలజిస్ట్లను సంప్రదించి వారి పర్యవేక్షణలోనే యంత్రాలు వినియోగించాలని సూచించారు. సమావేశంలో సంఘ సభ్యులు మోహన్కుమార్, లావణ్య, క్రిష్టాఫర్, శ్రీను నాయక్ పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో పురోగతి పట్నంబజారు: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక డ్రగ్స్ సేవించిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం వరకు... గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్లోని లాలాపేట పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్న బజార్లో నివాసం ఉండే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక మైనర్ బాలికకు కొందరు యువకులు ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయమయ్యారు. డ్రగ్స్కు బానిసగా మార్చడంతో ఆమె తల్లి వంగల స్వప్న ప్రియ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇన్స్ర్ట్రాగామ్ ద్వారా పరిచయమైన కొంతమంది యువకులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసు అధికారులు యువకులను గుర్తించినట్లు తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల ద్వారా ఇన్స్ర్ట్రాగామ్లో బాలికకు పరిచయమైన యువకులు అంశాలను పరిశీలిస్తున్నారు. బాలిక చెప్పిన వాస్తవాలు ఆధారంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వారికి అందుతున్నాయి? ఈ విద్యార్థిని కాకుండా మరెవరికై నా డ్రగ్స్ అందజేస్తున్నారా? రక్షణలో చేస్తున్న యువకులకు ఎక్కడినుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది యువకులను విచారించే నేపథ్యంలో అసలు నిందితుల కోసం వెతుకులాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను సమాచారం అడగక దర్యాప్తులో ఉందని చెబుతున్నారు. యువకులను రిమాండ్ కూడా తరలించారని వాదనలు వినవస్తున్నాయి. ఏపీలో 15 ఏళ్ల తరువాత ఫార్మాసిస్ట్ల ఎన్నికలు గుంటూరు మెడికల్: విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 2025 డిసెంబర్లో ఏపీ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరులోని ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..15 ఏళ్లఅనంతరం ఏపీలో ఫార్మాసిస్ట్ల ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది ఫార్మాసిస్ట్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును యునైటెడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ప్యానల్ అభ్యర్థులైన వేమూరు మాలతి, నరేష్ లుక్కాకు వేయాలని అభ్యర్థించారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారు ఈనెల 24లోపు పోస్టల్ బ్యాలెట్లను స్పీడ్ పోస్ట్ ద్వారా విజయవాడలోని ఫార్మసీ కౌన్సిల్ కార్యాలయానికి చేరేలా చూడాలని కోరారు. ఈ నెల 24లోపు పోస్టల్ బ్యాలెట్లు చేరాలి యునైటెడ్ రిజిస్టర్ ఫార్మాసిస్ట్ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని వినతి -
నేటి ర్యాలీని జయప్రదం చేయండి
పట్నంబజారు: పేద ప్రజల పక్షాన.. వారి గొంతుకై పేద విద్యార్థుల కోసం చేపట్టిన పోరాటంలో భాగంగా సోమవారం కోటి సంతకాలకు సంబంధించి పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందన్నారు. జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల 80 వేల సంతకాల సేకరణ జరిగిందని తెలిపారు. ఇందులో కార్యకర్తలు, పార్టీ నేతలు చేసిన శ్రమ ఎనలేనిదని కొనియాడారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన గుంటూరు పశ్చిమం, తూర్పు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుండి సంతకాలు జిల్లా కార్యాలయానికి చేరుకున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అన్నారు. సంతకాల సేకరణలో భాగంగా నేడు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయం నుండి లాడ్జి సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ, ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో భాగస్వామ్యులు కావాలని ఆయన తెలిపారు. లాడ్జి సెంటర్ నుంచి తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లి సంతకాలను అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ ర్యాలీలో భాగంగా అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శనను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, వంగల వల వీరారెడ్డి, కార్పొరేటర్లు ఆచారి, అచ్చల వెంకటరెడ్డి, వంశి, సుబ్బారెడ్డి, ఆబిద్, మెహమూద్, కిషోర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు సిడి భగవాన్, పఠాన్ సైరా ఖాన్, కోరిటిపాటి ప్రేమ్ కుమార్, పార్టీ ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
కుంచెతో తెలుగును వెలిగించిన బాపు
నగరంపాలెం: చిత్రాలు, కార్టూన్ల ద్వారా తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపును స్మరించుకోవడం అందరి బాధ్యతని గజల్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో ఆదివారం బాపు– రమణ–బాలు కళాపీఠం, మల్లెతీగ సంయుక్తంగా బాపు జయంతి – బాపు స్మారక పురస్కారాల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అందమైన సీ్త్రని బాపు బొమ్మగా ప్రశంసిస్తున్నామంటే అది ఆయన చిత్రాలకున్న గొప్పతనమని తెలిపారు. తెలుగు వారు ఉన్నంత కాలం బాపు సినిమాలు, చిత్రాలు, కార్టూన్లు సజీవంగా ఉంటాయని చెప్పారు. తెలుగు అమ్మ ఒడి భాష కావాలన్నారు. తెలుగును అధికార భాషకంటే ముందు మన మమకార భాషగా గుర్తించాలని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాపు– రమణ – బాలు కళాపీఠం వ్యవస్థాపకులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి మాట్లాడుతూ బాపును స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలని తెలిపారు. బాపు సినిమాల్లోని ముఖ్య సన్నివేశాల్ని, పాటల్ని ఆత్మీయ అతిథి, సుప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎం.ప్రభాకర్ గుర్తు చేశారు. సాహితీ సమాఖ్య గుంటూరు కార్యదర్శి ఎస్వీఎస్.లక్ష్మీనారాయణ బాపు ప్రతిభను తెలిపే సంగతుల్ని వివరించారు. మల్లెతీగ కలిమిశ్రీ మాట్లాడుతూ బాపు దర్శకునిగా, చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా సేవలందించారని పేర్కొన్నారు. అనంతరం సుప్రసిద్ధ సినీ దర్శకులు వర ముళ్లపూడి, చిత్రకారుడు అరసవల్లి గిరిధర్, కార్టూనిస్టు హరి వెంకటరమణలకు బాపు స్మారక పురస్కారాలను అందించారు. బాపుతో ఉన్న అనుబంధాన్ని పురస్కార గ్రహీతలు గుర్తు చేసుకున్నారు. కార్టూనిస్టు హరి వెంకటరమణకు సత్కారంచిత్రకారుడు అరసవల్లి గిరిధర్కు సన్మానంముగ్గురికి స్మారక పురస్కారాల ప్రదానం -
ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం
పేదలకు వైద్య విద్య, పేద విద్యార్థులకు వైద్యాన్ని దూరం చేసి కార్పొరేట్ శక్తులకు మరింత ఊతం ఇచ్చేలా చంద్రబాబు సిగ్గులేని పాలన చేస్తున్నారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించకూడదా..? వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వాటిని చంద్రబాబు తన తాబేదార్లకు దోచిపెట్టేందుకు దుష్ట కార్యక్రమాలు చేస్తున్నారు. కచ్చితంగా కళాశాలల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం ఆగదు. – మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల పరిశీలకుడు -
ప్రజా ఉద్యమం విజయవంతం
చంద్రబాబు నిరంకుశ పాలన, రూ.లక్షల కోట్ల అప్పులు, అందని ద్రాక్షగా సంక్షేమం, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులను ధారదత్తం చేస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజలు విసిగిపోయారు. అందుకే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నియోజకవర్గంలో 72 వేల మందికిపైగా ప్రజలు కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తన వర్గానికి రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించారు. బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. – బలసాని కిరణ్కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
ర్యాలీని జయప్రదం చేయండి
నేడు ఉదయం 10 గంటలకు గుంటూరు కేంద్రంగా బృందావన్ గార్డెన్స్ నుంచి జరిగే కోటి సంతకాల పత్రాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి చేర్చేందుకు చేపట్టే ర్యాలీని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసి, తమ జేబులు నింపుకొనేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. చంద్రబాబు నిర్ణయంపై నిరసనగా రాష్ట్రంలో కోటి సంతకాలకు పిలుపునిస్తే.. కోటిన్నర సంతకాలు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత దీనిబట్టి అర్థమవుతోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ నేడు జరిగే ప్రదర్శనకు తరలిరావాలని కోరుతున్నాం. – అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు -
బాబు కుట్రలపై నిరసన ‘సంతకం’
పట్నంబజారు: వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు చేసిన ఒక్కో సంతకం చంద్రబాబు సర్కారు కుట్రలపై నిరసన తీవ్రత తెలుపుతోంది. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అయింది. ప్రజా ఉద్యమంలా ముందుకు సాగింది. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా, పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలకు అందకుండా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాలతో మద్దతు తెలిపారు. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రజలు భారీగా తమ సంతకాలతో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. అవగాహన కల్పించి మరీ... గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 23 డివిజన్లలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో అక్టోబర్ 18వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 1వ డివిజన్ నుంచి 15వ డివిజన్ వరకు, 17, 50, 51, 53, 54, 55. 56, 57 డివిజన్లలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నూరి ఫాతిమా 14 డివిజన్లలో స్వయంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. అనేక డివిజన్లలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే జరిగే అనర్థాలను ప్రజలకు స్వయంగా వివరించారు. అందరితో మమేకమవుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజెప్పారు. అనేక డివిజన్లలో ఆమె పర్యటించిన నేపథ్యంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 65 వేల సంతకాలను సేకరించారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, యువజన విద్యార్థి విభాగం నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోర్ కమిటీ నేతల సహాయ సహకారాలతో సంతకాల సేకరణ పూర్తయింది. కార్యక్రమానికి మైనార్టీ అసోసియేషన్ నేతలు, అఖిల భారత వడ్డెర సంఘం, మాదిగ సంక్షేమ పోరాట సమితి, ఆటో యూనియన్ నేతలు మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయానికి నియోజవకర్గం నుంచి సేకరించిన సంతకాల పత్రాలను పంపారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయి. -
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ నెల్లూరు
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు రెండో రోజూ అదే ఉత్సాహాన్ని కనబరిచారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్న్ ఆధ్వర్యంలో జరుగుతున్న 45వ రాష్ట్రస్థాయి వెటరన్న్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిమ్మగడ్డ నాగేశ్వరరావు, శ్రీ హాస్పిటల్ అధినేత చెరుకూరి పవన్కుమార్లు హాజరయ్యారు. విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్తోపాటు, మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ జనరల్ సెక్రటరీ మంగా వరప్రసాద్ తెలిపారు. విజేతల వివరాలు.. రెండో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరనన్ అథ్లెటిక్స్ అసోసియేషన్న్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావు వెల్లడించారు. 5కె రన్నింగ్ పురుషుల 65 ప్లస్ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన వి.సుధాకర్, 70 ప్లస్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎం. శంకరరావులు ప్రథమ స్థానం సాధించారు. మహిళల 5కె రన్నింగ్ 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి.కోటేశ్వరమ్మ, కె.శారదలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 1కెఎం వాక్ 90 ప్లస్ విభాగంలో డి.శేషగిరిరావు (గుంటూరు), 3కె వాక్ 70 ప్లస్లో బి.వెంకటలక్ష్మిలు ప్రథమ స్థానం సాధించారు. 481 పాయింట్లతో నెల్లూరు జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్, 431 పాయింట్లుతో విశాఖ జిల్లా రన్నర్స్గా నిలిచింది. బెస్ట్ మార్చ్ఫాస్ట్ వైజాగ్ ప్రథమ స్థానం, కృష్ణా జిల్లా ద్వితీయ స్థానం దక్కించుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కె.శ్రీనివాసరావు, ఇస్మాయిల్, రాఘవరావు, కృపారావు, అనిల్, ఎం.సత్యనారాయణలు వ్యవహరించారు. -
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ప్రభుత్వం నిర్వహించాల్సిన వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి, కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ప్రకారం కోటి సంతకాల సేకరణలో ప్రతి నియోజకవర్గంలోనూ వేల మంది ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేయటం ఇందుకు నిదర్శనం. జిల్లా కేంద్రం నుంచి సంతకాల పత్రాలను రాష్ట్ర పార్టీ ఆఫీసుకు తరలించే ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలి. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయటం వలన అన్నివర్గాల విద్యార్ధులకు అపార నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా రిజర్వేషన్లు, ప్రతిభతో ముందుకు సాగే విద్యార్థులకు ఇదోక శాపంలాంటి నిర్ణయం. కేవలం దోచుకో, దండుకో, దాచుకో అనే సిద్ధాంతంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. వైఎస్ జగనన్న నేతృత్వంలో కచ్చితంగా ఎంతటి ఉద్యమాలకై నా వెనుకాడం. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనను విరమించుకునే వరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తాం. – షేక్ నూరి ఫాతిమా, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ ద్వారా పేదలకు, వైద్య విద్య అభ్యసించే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు బలహీన వర్గాల కోసం 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణం. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు పొన్నూరు నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. సోమవారం ఉదయం గుంటూరులో జరిగే భారీ ర్యాలీకి అందరూ భారీగా తరలిరావాలి. – అంబటి మురళీకృష్ణ , పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
పేదలంటే చంద్రబాబుకు చిన్నచూపు
పేదలన్నా, పేద విద్యార్థులన్నా చంద్రబాబు చిన్న చూపుతో చూస్తున్నారు. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారు. పేదలకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగడం సిగ్గుచేటు. జగనన్న పేద విద్యార్థుల కోసం అనేక కళాశాలలను, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. వాటన్నింటినీ చంద్రబాబు నాశనం చేస్తున్నారు. సంతకాల సేకరణ సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టమైంది. చంద్రబాబు సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – షేక్ నూరి ఫాతిమా, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
ఈవ్టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
నగరంపాలెం: జిల్లాలో ఈవ్టీజింగ్పై 332 మందికి అవగాహన కల్పించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రహదారులపై అనవసరంగా సంచరిస్తున్న కొందరి ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈవ్టీజింగ్ను సహించేదిలేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టారని అన్నారు. ఈవ్టీజింగ్పై విద్యార్థులు, ప్రజలకు పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలు, ఆడపిల్లల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శక్తి బృందాలు, ప్రత్యేక పోలీస్ బృందాలు, నిఘా వర్గాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో 10 మంది స్క్రబ్ టైఫస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన మహిళ, కొల్లూరు మండలం క్రాప, పొన్నూరు, దుగ్గిరాల, తెనాలి ఐతానగర్, కొల్లిపర, కొల్లూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరికి వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో గర్భిణి ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రమాదం లేదని సీనియర్ ఫిజిషియర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ – కాకినాడ టౌన్ (07264), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), సికింద్రాబాద్ – నరసాపూర్ (07239) రైళ్లు జనవరి 9వ తేదీన, వికారాబాద్ – నరసాపూర్ (07211) జనవరి 10న, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07280), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), వికారాబాద్ – నరసాపూర్ (07249) రైళ్లు జనవరి 11న, వికారాబాద్ – నరసాపూర్ (07211), వికారాబాద్–నరసాపూర్(07253) జనవరి 12 వ తేదీన, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261) జనవరి 13న కేటాయించినట్లు తెలిపారు. కాకినాడ టౌన్ – వికారాబాద్( 07263) జనవరి 8న, నరసాపూర్–వికారాబాద్ (07250) జనవరి 9న, కాకినాడ టౌన్ –సికింద్రాబాద్ (07279), కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07262), నరసాపూర్ – వికారాబాద్ (07248) రైలు జనవరి 10న, నరసాపూర్ – వికారాబాద్ (07250) జనవరి 11న, కాకినాడ టౌన్ –వికారాబాద్(07262), నరసాపూర్–వికారాబాద్ (07248) జనవరి 12న, నరసాపూర్–వికారాబాద్ (07257), కాకినాడ టౌన్–వికారాబాద్ (07241) రైలు జనవరి 17న, నరసాపూర్–వికారాబాద్ (07259) రైలు జనవరి 18న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07285) రైలు జనవరి 19న గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. తెనాలిఅర్బన్: దళితుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు డిమాండ్ చేశారు. చుండూరు మండలం వలివేరు దళితవాడకు చెందిన పందిపాటి రెడ్డియ్యపై దాడికి నిరసనగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ముందుగా బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నగరంపాలెం: గుంటూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)ను అనివార్య కారణాలతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీఓ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జిల్లాలోని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ వారికి సహకరించాలని కోరారు. -
అన్ని వర్గాల నుంచి స్పందన
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి ఊహించని స్థాయిలో భారీ మద్దతు లభించింది. ప్రజల్లో తిరుగుతుంటే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోంది. పేదవాడికి వైద్యం, వైద్య విద్యను దూరం చేసి కార్పొరేట్ వారికి ఆసుపత్రులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలకు తెరలేపారని ప్రజలకు తెలిసిపోయింది. ఇకనైనా బాబు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి.పేదలకు న్యాయం చేయాలి. లేకుంటే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. – వనమా బాల వజ్రబాబు, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
ప్రైవేటీకరణను సహించం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు. చంద్రబాబు సర్కార్ కమీషన్ల కోసమే ప్రైవేటీకరణకు యత్నిస్తోంది. నేడు ఉదయం 10 గంటలకు మంగళగిరి బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. గాలిగోపురం మీదుగా మిద్దె సెంటర్, గౌతమ బుద్ధ రోడ్, బీఎండబ్ల్యూ షోరూమ్ వరకు సాగుతుంది. అక్కడి నుండి గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి ర్యాలీ చేరుకుంటుంది. అక్కడి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలి. – దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
ఘనంగా ముగిసిన విజ్ఞాన్ బాలోత్సవ్
●జోనల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ● హజరైన ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట రూరల్: విద్యార్థులు బాల్యం నుంచే విభిన్నంగా ఆలోచించే దృక్పఽథాన్ని అలవరచుకోవాలని ఎంపీ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని డీఎస్ఏ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన విజ్ఞాన్ బాల మహోత్సవ్ జోనల్ ఆటల పోటీలు శనివారం ముగిశాయి. ఎంపీ లావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రియేటివిటీ, ఇన్నోవేషన్, విభిన్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇండోర్ గేమ్, అవుట్ డోర్ గేమ్, వ్యక్తిగత హాబీ వంటి మూడు వ్యాపకాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మూడు వ్యాపకాలను పాటిస్తే విద్యార్థులు కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారని వివరించారు. జీవితంలో ఎప్పుడూ సెల్ప్ రెస్పెక్ట్, ఇంటిగ్రిటి విషయంలో రాజీపడకూడదని, తల్లిదండ్రులు గర్వపడేలా మన పనులు ఉండాలని హితవు పలికారు. దేశం యువతపై ఆశలు పెట్టుకుందని, మీ జీవిత కథలో మీరే హీరోలుగా మారాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో ఎలా మెలగాలి, ఎలా పనిచేయాలో తెలుస్తుందన్నారు. బాల మహోత్సవ్లో భాగంగా బాలబాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, 100 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్జంప్, షాట్పుట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలను, గుంటూరు జిల్లా కోర్ట్ ప్రాంగణంలో 17 బెంచీలను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట ఎన్హెచ్16 వంతెన వద్ద జరిగిన ఒక ప్రమాదంలో అశోక్కి సంబంధించిన ప్రమాద బీమా కేసులో బాధిత కుటుంబానికి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ రూ. కోటి అందించింది. విజ్ఞాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్ట్, డాక్టర్ పి. రాజారామ్మోహన్ మధ్య ఐదు ముఖ్యమైన చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. బెంగళూరులోని ఒక భూమి విక్రయ ఒప్పందం విఫలమైన వివాదంలో లోక్ అదాలత్ ద్వారా రూ.20 కోట్ల మేరకు రాజీ కుదిర్చారు. జిల్లా వ్యాప్తంగా సివిల్ కేసులు 1,376, క్రిమినల్ కేసులు 21,415, చెక్ బౌన్స్ కేసులు 578, ప్రీ లిటిగేషన్ కేసులు 97 కలిపి మొత్తం 23,466 కేసులు పరిష్కరించారు. న్యాయ సేవాధికార సంస్థ తరఫున కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విడిపోయిన జంటను ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.నీలిమ సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా కలిపారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 70, పశ్చిమ కాలువకు 45, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,666 క్యూసెక్కులు విడుదల చేశారు. 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం వన్టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె.లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంగణంలో జరిగే ఈ పుస్తక మహోత్సవం ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రిని లేదా ఉపముఖ్యమంత్రి తదితర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జనవరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్.సాయిరామ్, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి.లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 574.10 అడుగులకు చేరింది. ఇది మొత్తం 266.8601 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు వెయ్యి, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,354, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. జలాశయం నుంచి ఔట్ఫ్లోగా 49,995 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 49,995 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు
●కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ●తుళ్లూరులో ఘనంగా నయీ చేత న 4.0 కార్యక్రమం ●పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తాడికొండ: మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో తుళ్లూరు మేరీమాత హైస్కూలులో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సీఆర్డీఏ స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్ను హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ప్రదర్శన శాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ వివక్ష తగ్గించడమే నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహ హింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షకు గురౌతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని, ఇందుకు పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమన్నారు. అందుకే నయీ చేతన కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారన్నారు. లింగ సమానత్వం వంట గది నుంచి ప్రారంభం కావాలని, అప్పుడే మహిళలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా, స్థైర్యంగా ఉండగలరన్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడారు. జెండర్ చాంపియన్లు చలివేంద్రి సుగంధి, తురకా శ్యామల మాట్లాడారు. జెండర్ చాంపియన్లను మంత్రులు సత్కరించారు. అనంతరం లింగ సమానత్వం కోసం అవగాహన కల్పిస్తూ లఘు నాటికను ప్రదర్శించారు. లింగ సమానత్వంపై అవగాహన కరదీపికను విడుదల చేసి సెల్ఫీ తీసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కోసం వైద్య ఆరోగ్యశాఖ ఉచిత వైద్య శిబిరం, మిషన్ శక్తి కార్యక్రమాలపై ఐసీడీఎస్, శక్తి టీంపై జిల్లా పోలీస్ శాఖ, మహిళా కార్మికులు పని ప్రదేశాల్లో సౌకర్యాలపై జిల్లా కార్మిక శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సెన్స్ ఎగ్జిబిషన్, గ్రామీణ యువతకు డీడీయు జీకేవై 2.0 ద్వారా శిక్షణ కార్యక్రమాలపై సీడాప్–డీఆర్డిఏ, స్వయం సహాయక సంఘాల వ్యాపార ఉత్పత్తులతో విక్రయాలు, ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సెర్ప్ సంచాలకులు శివ శంకర్ ప్రసాద్, డీఆర్డీఏ ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణపై నిరసన సంతకం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన ప్రత్తిపాడు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న అనాలోచిత నిర్ణయంపై ప్రజల నుంచి ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. ఊరూ, వాడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజా ఉద్యమంలో మేము సైతం అంటూ నిరసన ‘సంతకం’ చేశారు. చంద్రబాబూ.. ఇదేం తీరు... అంటూ తల్లిదండ్రులు ఆవేదన వెళ్లగక్కారు. సారూ.. భవిష్యత్తు ఏంటంటూ యువత నిగ్గదీసి అడిగింది. ఇక ఆరోగ్యం దేవుడి దయేనా.. అంటూ పేదలు నిష్టూర్చారు. యువత, మహిళలు, పెద్దలు, పేద, మధ్య తరగతి ప్రజలు ముక్తకంఠంతో నిరసన గళం వినిపించారు. తమ నిరసనను ప్రజాస్వమ్య పద్ధతిలో వ్యక్తం చేస్తూ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. నియోజకవర్గంలో అనూహ్య స్పందన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకారం చుట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామంలో అక్టోబరు 17వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో రచ్చబండలు అప్పటి నుండి గుంటూరు రూరల్ మండలం పరిధిలోని 11 గ్రామాల్లో, అర్బన్ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో, ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడు, గనికపూడి, పాతమల్లాయపాలెం, కొత్తమల్లాయపాలెం, కోయవారిపాలెం, కొండేపాడు, యనమదల, ఈదులపాలెం, తుమ్మలపాలెం.. సహా మొత్తం 16 గ్రామ పంచాయతీల్లో, పెదనందిపాడు మండలంలోని కొప్పర్రు, పెదనందిపాడు, అన్నపర్రు, పాలపర్రు, జీజీపాలెం, గోగులమూడి.. సహా పద్నాలుగుకు పైగా గ్రామాల్లో, కాకుమాను మండలంలోని కొండపాటూరు, రేటూరు, కెబిపాలెం, చినలింగాయపాలెం.. సహా పదికి పైగా గ్రామాల్లో, వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరు, వట్టిచెరుకూరు, అనంతవరప్పాడు, ఐదవమైలు, పుల్లడిగుంట, గారపాడు సహా మొత్తం పదమూడుకు పైగా గ్రామాల్లో రచ్చబండలో నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛందంగా సంతకాలు.. నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ప్రైవేటీకరణ వలన కలిగే అనర్థాలను వివరిస్తూ, అన్ని వర్గాల ప్రజలు తమకు తాముగా సంతకాల ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళికలు రచించారు. ప్రజలు తమ నిరసన గళాన్ని స్వచ్ఛందంగా సంతకాల రూపంలో వినిపించేలా పార్టీ క్యాడర్ను సమాయత్తం చేశారు. ఇప్పటివరకు గుంటూరు రూరల్ మండలంలో సుమారు 8,245, పెదనందిపాడు మండలం 4,416, కాకుమాను మండలం 10,498, ప్రత్తిపాడు మండలం 16,419, వట్టిచెరుకూరు మండలం 3,921, గుంటూరు అర్బన్ మండలం 27,727 కలిపి నియోజకవర్గం మొత్తం మీద సుమారు 71,226 సంతకాల సేకరణ పూర్తి అయింది. చంద్రబాబు ప్రభుత్వం తమకున్న వ్యతిరేకతను ప్రజలు సంతకాల రూపంలో చాటి చెప్పారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఊహించిన దాని కంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో రచ్చబండ వద్దకు వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేసి నిరసన తెలుపుతున్నారు. ప్రజాసంఘాలు కూడా సంతకాల ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో ఏకంగా ఏపీకి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారు. వాటిలో ఐదు కళాశాలలను పూర్తి చేశారు. మిగిలిన కళాశాలలను పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ పేరుతో వాటిని ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం సిగ్గుచేటు. ఈ నిర్ణయంపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు. –బలసాని కిరణ్కుమార్, సమన్వయకర్త, ప్రత్తిపాడు నియోజకవర్గం -
ఏపీఆర్జేసీలో ఘనంగా స్వర్ణోత్సవాలు
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాల నాగార్జునసాగర్ పరివార్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైమ్యాట్ డైరెక్టర్, ఏపీఆర్ఈఐ కార్యదర్శి వి.ఎన్.మస్తానయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు రోజులుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురు సత్కారం జరిగింది. 1975వ సంవత్సరం నుంచి ప్రస్తుతం అధ్యాపకులుగా ఉన్న 118 మందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎన్.సరోజిని మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఆర్ఎస్ఐ, ఎఫ్ఎస్ వంటి ఉన్నత ఉద్యోగులుగా, వివిధ రంగాలలో ఉన్నతులుగా చేసిన కళాశాలకు ప్రిన్సిపాల్గా పని చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. గురువుల గౌరవం మసకబారుతున్న ఈ తరుణంలో దాన్నిసజీవంగా ఉంచి, గురుభక్తిని చాటుకుని కళాశాల పూర్వ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమాన్ని ఏపీఆర్జేసీ పూర్వ విద్యార్థులు ఎ.సైదారెడ్డి, ఎస్.నాగచారి, కె.వీరనంది, చక్రపాణి, జి.గోపాలరావులు నిర్వహించారు. తెలంగాణ విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, తెలంగాణ ఐజీ రమేష్రెడ్డి, ఐఏఎస్ అధికారి కె.వెంకటేశం, ఐఎఫ్ఎస్ అంబాసిడర్ సీహెచ్ రాజశేఖర్, పూర్వ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్, కలైపట్టు పోటీలు ప్రారంభం
పెదకాకాని: విద్యార్థులంతా క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యాయా మోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చుక్కా కొండయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి కలైపట్టు, ఫెన్సింగ్ పోటీలు గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆధునిక నర్సింగ్ హోం డాక్టర్ వీర్నల ప్రత్యూష్ మాట్లాడుతూ క్రీడల ద్వారా దేహదారుఢ్యం, స్నేహ సంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు. కలైపట్టు అండర్– 17 బాలబాలికల విభాగాల్లో 60 మంది పాల్గొన్నారన్నారు. ఫెన్సింగ్ అండర్– 17, అండర్– 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. 360 మంది క్రీడాకారులు హాజరు పోటీలకు రాష్ట్రస్థాయిలో 13 జిల్లాల నుంచి సుమారు 360 మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీలు ఎం. గోపి, కె. నాగశిరీష ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ శిల్ప సిందూర, పర్యవేక్షకులు మోహనలక్ష్మి, వ్యాయామోపాధ్యాయుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. లక్ష్మీపతి, పలువురు పీఈటీలు పాల్గొన్నారు. -
తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ ప్రదర్శనకు తెనాలి శిల్పాలు
తెనాలి: విజయవాడలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో ఆదివారం జరగనున్న తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ 4వ చిత్రకళా సంతలో తెనాలి శిల్పకళా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ కోరికపై తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఇందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఈ ప్రదర్శనలో భారతరత్న అటల్ బిహారి వాజపేయి, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్టాటా విగ్రహాలతోపాటు స్టైలిష్ స్టిల్తో తయారుచేసిన సింహం, పులి, జామెంట్రిక్ షేప్తో రూపొందించిన జింక, త్రీడీ టెక్నాలజీతో చేసిన ఎలిఫెంట్ ఫైట్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, సెల్ఫ్ మేడ్ పర్సన్ విగ్రహాలను ప్రదర్శిస్తున్నట్టు ‘కళారత్న’ కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష శనివారం విలేకరులకు తెలియజేశారు. చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మహాసభలు ఆదివారం ఉదయం చేబ్రోలులోని ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు తెలిపారు. మహాసభల ఏర్పాట్లను శనివారం యూటీఎఫ్ నాయకులు పర్యవేక్షించారు. జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో మహాసభలు ప్రారంభం కానున్నాయని, చేబ్రోలు ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభలలో జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చేబ్రోలు మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఖాదర్ బాషా, పి పార్థసారథి కోరారు. నరసరావుపేట: ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో 2025–26 విద్యా ఏడాదికి ఆదివారం వరకు కొనసాగనున్నాయి. పోటీలలో పురుషుల ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు లూథరన్ హైస్కూల్ మైదానంలో నిర్వహించగా, మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలులో నిర్వహించారు. టీడీపీ నాయకుడు డాక్టర్ రాంప్రసాద్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని వారు తెలిపారు. బాపట్లటౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహన చోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ హెల్మెట్ బరువు కాదు, అది మీ ప్రాణానికి రక్షణ కవచంలాంటిదన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణతోపాటు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు. -
భవానీ.. శరణు శరణు
భవానీ దీక్షల విరమణకు తరలివస్తున్న భక్తులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువైన ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు తరలివస్తున్నారు. భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కాయి. మూడో రోజైన శనివారం లక్ష మంది మాలవిరమణ చేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజాము రెండు గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నా భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు. శనివారం వేకువ జాము రెండు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆలయానికి భవానీలు భారీగా తరలివచ్చారు. వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్టు కిటకిటలాడాయి. సాయంత్రమే అధికం గిరిప్రదక్షిణ మార్గంలో పగటి వేళ కంటే రాత్రి వేళలోనే భవానీల రద్దీ అధికంగా కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా దీక్షల విరమణకు వస్తున్న భవానీలు సాయం సమయంలో ప్రశాంత వాతావరణంలో గిరిప్రదక్షిణ చేసి, తెల్లవారుజామున అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో చేరుకున్న తర్వాత రెండు గంటల్లో అమ్మవారి దర్శనం, ఇరుముడి, హోమ గుండంలో నేతి కొబ్బరి కాయ సమర్పణ, ప్రసాదాల కొనుగోలు పూర్తవుతోందని భవానీలు పేర్కొంటున్నారు. ఉదయం ఆరు గంటల లోపే భవానీలు దీక్షలను పరిపూర్ణం చేసుకుని రైల్వేస్టేషన్, బస్టాండ్కు చేరుతున్నారు. విశాఖపట్నం వైపు రత్నాచల్, హైదరాబాద్ వైపు శాతవాహన, చెన్నయ్ వైపు పినాకినీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల లోపు అందుబాటులో ఉండటం ఇందుకు కారణం. -
వెటరన్.. అదిరెన్
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు అదరగొట్టారు. వయస్సును లెక్కచేయకుండా మూడు పదుల నుంచి ఏడు పదుల వయసు వరకూ సత్తా చాటారు. ప్రతిభకు ఆసక్తికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 45వ రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. జాతీయ పతాకంతోపాటు క్రీడా జెండాను ఎగురవేశారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో భాగంగా తొలిరోజు లాంగ్ జంప్, షాట్ పుట్, 100, 800 మీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సుమారు నాలుగు వందల మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి 35 ప్లస్, 40 ప్లస్ , 45 ప్లస్ , 50 ప్లస్ , 55 ప్లస్ , 61 ప్లస్ , 65 ప్లస్, 70 ప్లస్.. ఇలా వయస్సుల వారీగా మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతల వివరాలు ఇవీ.. తొలిరోజు విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావులు వెల్లడించారు. షాట్పుట్ 30 ప్లస్ మహిళల విభాగంలో ప్రథమ స్థానంలో వి. సుదీప్తి (కృష్ణా జిల్లా), ద్వితీయ స్థానం ఎ. సావిత్రి (గుంటూరు), 40 ప్లస్ విభాగంలో డి. స్వర్ణవాహిణి (కృష్ణా) ప్రథమ స్థానం, ఆర్. నిర్మల (విశాఖపట్నం) ద్వితీయ స్థానం, 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ సి. విజయకళ ప్రథమ, కె. పద్మావతి ద్వితీయ స్థానాలు, 65 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన జె. లక్ష్మీ నరసమ్మ ప్రథమ స్థానం సాధించింది. మహిళల 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి. కోటేశ్వరమ్మ ప్రథమ స్థానం, పి. రాజేశ్వరమ్మ ద్వితీయ స్థానం, 65 ప్లస్ విభాగంలో నెల్లూరుకు చెందిన జె. లక్ష్మీనరసమ్మ ప్రథమ స్థానం సాధించారు. షాట్పుట్ 70 ప్లస్ మహిళల విభాగంలో విశాఖపట్నానికి చెందిన బి. వెంకటలక్ష్మి ప్రథమ స్థానం సాధించింది. 100 మీటర్ల పురుషుల పరుగు పందెం 70 ప్లస్ విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన ధనుంజయ, గుంటూరుకు చెందిన పి. వెంకటప్పయ్య, విశాఖకు చెందిన శంకరరావులు విజయం సాధించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు. రన్నింగ్ పోటీల్లో క్రీడాకారుడులాంగ్ జంప్ పోటీల్లో మహిళఉత్సాహంగా ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ఆరంభం -
ఆన్లైన్లో పరిచయం.. రూ. 18 లక్షలకు టోకరా
లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు సత్తెనపల్లి: ఫేస్బుక్లో పరిచయమైన యువతి మాటలు నమ్మి ఓ యువకుడు రూ.18 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వెలుగు చూసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 20వ వార్డుకు చెందిన తుమ్మల వెంకటేష్బాబు సెల్ఫోన్కు సంబంధించిన విడిభాగాలు విక్రయిస్తుంటారు. వెంకటేష్బాబుకు సెప్టెంబర్ నెలలో ఢిల్లీకి చెందిన సీహెచ్ రుచి అనే యువతి ఫేస్బుక్లో పరిచయమైంది. ఇరువురు వాట్సాప్ ద్వారా చాటింగ్, మాట్లాడుకోవటం చేశారు. ఆమె తెలుగులో మాట్లాడటంతో నమ్మాడు. ఢిల్లీలోని వసంత విహార్ ఏరియాలో నివసిస్తున్నానని, ఎలైట్ మాల్ స్టోర్ అండ్ ఈ కామర్స్ ఆన్లైన్ వ్యాపారానికి మేనేజర్గా పనిచేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఆన్లైన్లో బంగారం, వెండి, తదితర విలువైన వస్తువులు తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించింది. ఆమె రిఫరల్ ఐడీ లింకు ద్వారా లాగిన్ అయి మొదట ప్రవేశ రుసుము కింద రూ. 40 వేలు కట్టాడు. వివిధ వస్తువుల కొనుగోలు నిమిత్తం నగదు చెల్లించాడు. కొద్ది రోజులకే ధర పెరిగి లాభాటు వచ్చినట్టు చూపారు. గోల్డ్ రింగులు, చైన్లు, బ్రాస్లెట్స్ వంటివి తక్కువ ధరకు ఉన్నట్లు రుచి చెప్పింది. అత్యాశకు పోయిన వెంకటేష్ బాబు మరికొంత డబ్బును యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించి వస్తువులు కొనుగోలు చేశారు. ఆ నగదు వచ్చేలోపు మరో వస్తువు తక్కువ ధరకు చూపిస్తుండడంతో మొత్తం రూ.18 లక్షలు పెట్టి సామగ్రి కొన్నారు. లాభాలు అధికంగా వచ్చాయని నగదు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. -
మానవుల రక్షణార్థం సిలువపై ఏసు మరణం
గుంటూరు రూరల్: ఏసుక్రీస్తు ఈ భువిలో 2025 సంవత్సరాల క్రితం జన్మించి మానవుల రక్షణార్థమై సిలువపై మరణించెనని గుంటూరు రోమన్ క్యాథలిక్ మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య తెలిపారు. ఏసుక్రీస్తు మార్గము అనుసరణీయమని పేర్కొన్నారు. గుంటూరు మేత్రాసన పరిధిలో ఏసు క్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలు శనివారం నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జగద్గురువులు, కీర్తిశేషులు ఫ్రాన్సిస్ పోపు ద్వారా రూపుదిద్దుకుని, ప్రస్తుత రోమన్ క్యాథలిక్ విశ్వ పీఠాధిపతులు లియో పోపు నేతృత్వంలో జూబ్లీ వేడుకలు విశ్వవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ప్రత్యేక జూబిలీ ప్రార్థన ద్వారా జ్యోతి ప్రజ్వలన చేసి, గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య వేడుకలను ప్రారంభించారు. అనంతరం జూబ్లీ విశిష్టతను గురించి గురు డాక్టర్ చాట్ల మరియదాసు, క్రీస్తు రాకడ కోసం నిరీక్షణ, ఆశయాలు, లక్ష్యాలు అనే అంశంపై గురు పెంటారెడ్డి రాజారెడ్డి, దేవుని వాక్కు శ్రీసభ జీవన విధానం అనే అంశంపై గురు పూదోట స్టౌటన్ తోమాసు వివరించారు. విశ్వాస సంఘాల నిర్మాణం, గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవుల పాత్ర అనే అంశంపై గురు డాక్టర్ గోవిందు రాయన్న భక్తులకు వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీస్తు భక్తులందరికీ భోజన సదుపాయం కల్పించారు. మధ్యాహ్నం ఏసు సభ గురు విద్యార్థులు నిర్వహించిన సంస్కరణ రథసారథి జగద్గురులు ఫ్రాన్సిస్ పోపు జీవిత సందేశ నృత్య, నాటక కళా ప్రదర్శన భక్తులను అలరించింది. వైభవంగా దివ్య బలిపూజ స్వస్థత ప్రార్ధనల అనంతరం గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్ రెవరెడ్డి డాక్టర్ గాలిబాలిలు ప్రధాన యాజకులుగా, గుంటూరు మేత్రాసనంలోని గురువులందరితో కలిసి జూబ్లీ మహోత్సవ దివ్యబలి పూజను నిర్వహించారు. గురువులు, మఠకన్యలు, విశ్వాసులు 7000 మందికిపైగా పాల్గొన్న కార్యక్రమంలో పీఠాధిపతులు తమ వాక్యోపదేశాన్ని కొనసాగించారు. క్రీస్తు రాక కోసం అనేకమంది నిరీక్షించారన్నారు. ఆయన మనుషావతారంలో ఈ భువిలో జన్మించారన్నారు. గొల్లలు, దేవదూతలు, ముగ్గురు జ్ఞానులు ఆ దివ్య బాల ఏసుని కనుగొని ఆరాధించి, స్తుతించి కానుకలు సమర్పించారని వివరించారు. మనమందరం దివ్య ఏసు రెండో రాక కోసం నిరీక్షించి, క్రీస్తు ప్రభువు చూపించిన మార్గంలో నడిచి, పాప క్షమాపణ పొందాలని తెలిపారు. నూతన జీవితం ద్వారా ఆ దేవదేవుని కృపావరాలకు పాత్రులు కావాలని పిలుపు నిచ్చారు. జూ బ్లీ వేడుకలకు గురు డాక్టర్ గోవిందు రాయన్న, గురు పెంటారెడ్డి రాజారెడ్డి కోర్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. మహోత్సవానికి సహకరించిన లయోలా పబ్లిక్ స్కూల్ యాజమాన్యాని కి, అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి, గురువులకు, సిస్టర్స్కు, సకల విశ్వాసులకు గురు డాక్టర్ గోవిందు రాయన్న అభినందనలు తెలిపారు. రోమన్ క్యాథలిక్ మేత్రాసన పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య -
యర్రబాలెంలో స్పటిక రాళ్లు చోరీ
●బీభత్సం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తులు ●వాచ్మన్ను బంధించి రూ. 5 లక్షల విలువైన రాళ్లు అపహరణ మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని యర్రబాలెంలో క్రిస్టల్స్ (స్పటిక రాళ్లు) చోరీకి గురైన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. యర్రబాలెం – పెనుమాక రహదారిలో కొన్నేళ్లుగా పలువురు భాగస్వామ్యంతో క్రిస్టల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు బీభ త్సం సృష్టించారు. నెంబరు ప్లేట్లు లేని మూడు కా ర్లలో వచ్చి వాచ్మన్ కుటుంబాన్ని బెదిరించి, తాళ్ల తో బంధించారు. కేకలు వేయకుండా నోటిపై ప్లాస్టి క్ స్టిక్కర్లు అతికించారు. అనంతరం గోడౌన్ షట్టర్ తాళాన్ని కటింగ్ మిషన్తో కట్ చేసి, సీసీ కెమెరాల కనెక్షన్ను సైతం తొలగించారు. గోడౌన్లోకి ప్రవేశించి కొన్ని క్రిస్టల్స్ను గోతాల్లో నింపుకుని, వారు వచ్చిన కారుల్లో వేసుకుని పరారయ్యారు. అపహరణకు గురైన క్రిస్టల్స్ విలువ 5 లక్షల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ముందుగానే చోరీకి వ్యూహం దుండగులు పక్కా వ్యూహంతోనే చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు క్రిస్టల్స్ చోరీకి యత్నించారు. గోడౌన్ బయట వున్న కెమెరాల కనెక్షన్ను కూడా కత్తిరించారు. గమనించిన వాచ్ మన్ కుటుంబీకులు పెద్దగా కేకలు వేయడంతో పారిపోయే క్రమంలో వాకీటాకీని జారవిడుచుకున్నారు. అప్పట్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసి, దుండగులు వదిలి వెళ్లిన వాకీటాకీని సైతం పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. విభేదాలే కారణమా? నలుగురు భాగస్వాములు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి మధ్య విభేదాల కారణంగానే ఈ చోరీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒక భాగస్వామి వేరే ప్రాంతంలో క్రిస్టల్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఆయనే ఈ ముఠాను పంపి భీభత్సం సృష్టించడంతో పాటు దొంగిలించుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోరీకి జరిగిన తీరులో కొంత భాగం కెమెరాల్లో నమోదైంది. గోడౌన్ లోపలికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించిన ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిలో ఒక వ్యక్తి గతంలో ఇదే గోడౌన్కు వచ్చాడని, వాచ్మేన్ కుటుంబ సభ్యులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ పోలీసులు ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం రావడంతో శనివారం ఉదయం గోడౌన్ను సీఐ ఎ.వి. బ్రహ్మం, ఎస్ఐ వెంకట్ సిబ్బందితో పరిశీలించారు. లోపల, బయట పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. -
గుంటూరుకు శనిలా పెమ్మసాని
పట్నంబజారు: గుంటూరుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనిలా పట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అధికారం ఉందనే గర్వంతో విర్రవీగుతున్నారని మండి పడ్డారు. ‘అధికారం ఉంటే నువ్వేమైనా రౌడీవా పెమ్మసాని’ అని ప్రశ్నించారు. శనివారం గుంటూరు నగరంలోని శంకర్విలాస్ సెంటర్లో జరుగుతున్న ఓవర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరిశీలించిన అనంతరం అరండల్పేట వైపు వచ్చి పిల్లర్లు, తదితర అంశాలను పరిశీలించారు. స్థానిక వ్యాపారులు తమ గోడును వైఎస్సార్సీపీ నేతలకు తెలిపారు. ఫ్లయ్ ఓవర్కు అటు, ఇటు 12 అడుగులు వదిలి పెట్టాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్పొరేషన్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, షాపుల తాళాలు పగులగొడుతున్నారని తెలిపారు. ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టాలని ఇబ్బంది పెడుతున్నారని, బాండ్లు ఇస్తామని చెబుతున్నారు తప్ప నష్ట పరిహారంపై మాట్లాడటం లేదన్నారు. డమ్మీలుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పెమ్మసాని పెత్తనమే కొనసాగుతోందని ఆరోపించారు. నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డమ్మీలు మాత్రమేనని విమర్శించారు. రూ. 90 కోట్లతో అసలు బ్రిడ్జిని ఏవిధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. తాము బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2014, 2019 సమయంలో ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు, అప్పటి ఎంపీ గల్లా జయదేవ్, పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి రూ. 167 కోట్లతో సింగిల్ పిల్లర్ బ్రిడ్జినిర్మాణంతోపాటు, ఆర్యూబీ నిర్మించి నగరానికే మణిహారంలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారని తెలిపారు. నగరాన్ని సర్వనాశనం చేసేందుకే పెమ్మసాని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం అఖిల పక్ష సమావేశం నిర్వహించకుండా పెద్ద ఇంజినీర్లు చెబుతున్నప్పటికీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం సగం బ్రిడ్జి మాత్రమే పడగొట్టారని, కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా అసలు బ్రిడ్జి ఎలా ప్రారంభిద్దామని అనుకున్నారని ప్రశ్నించారు. అడ్డగోలుగా పనులు మాజీ ఎంపీ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా పార్టీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ శంకర్విలాస్ ఓవర్బ్రిడ్జి నిర్మాణంపై కనీసం అఖిల పక్ష కమిటీతో చర్చలు లేకుండా ఎలా పనులు ప్రారంభించారని ప్రశ్నించారు. బ్రాడీపేటకు సంబంధించి 14 అడ్డరోడ్డు తెరవకపోవడం పాలకులు, అధికారుల బుద్ధి లేని తనానికి నిదర్శనమన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి లేకుండా బ్రిడ్జి పడగొట్టి, ఆర్యూబీ కూడా నిర్మాణం చేపట్టని దుస్థితిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు వెళ్లే సమయాల్లో పేదలు ఆటోలోనే మృతి చెందుతున్న పరిస్థితులు ఎంతో బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, మెట్టు వెంకటప్పారెడ్డి, బైరెడ్డి రవీంద్రారెడ్డి, నందేటి రాజేష్, మామిడి రాము, పఠాన్ అబ్దుల్లా ఖాన్, ఎర్రబాబు, మేడా మురళి, వంగా సీతారామిరెడ్డి, సింగ్ నరసింహారావు, యేటి కోటేశ్వరరావు యాదవ్, బత్తుల దేవానంద్, కార్పొరేటర్లు ఆచారి, అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, కామిరెడ్డి రంగారెడ్డి, అంబేడ్కర్, పూనూరి నాగేశ్వరరావు, పోలవరపు వెంకటేశ్వర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఆలా కిరణ్, పఠాన్ సైదా ఖాన్, కానూరి శశిధర్, బుల్లెట్ సలీం, పిల్లి మేరి, తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో మళ్లీ డ్రగ్స్ కలకలం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని ఒక టీవీ చానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు. కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. -
ఘనంగా ప్రారంభమైన క్రెడాయి ప్రాపర్టీ షో
నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరు నగరంలో ప్రముఖ స్థిరాస్థి సంస్థ క్రెడాయి ప్రాపర్టీ షోను గుంటూ రు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ డీజీఎం సయ్యద్ జవహర్, స్టేట్ బ్యాంక్ డీజీఎం బి.కృష్ణకుమార్ ప్రభు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ది–గుంటూరు కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎం కిరణ్రెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, క్రెడాయి మాజీ ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గుంటూరు క్రెడాయి చైర్మన్ ఆరుమళ్ల సతీష్రెడ్డి, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రజరర్ ఎ.వి.నాగార్జునరెడ్డి, ప్రాపర్టీ షో 2025 కన్వీనర్ తియ్యగూర వినోద్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివనాగేశ్వరరావు, క్రెడాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్ అంగలకుదురు జెడ్పీ హైస్కూల్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్స్ అసోసియేషన్ అఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా క్రాస్ కంట్రీ పోటీల్లో అంగలకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ కై వసం చేసుకున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ ఖాన్ టైటిల్ సాధించిన టీంకు ట్రోఫీతోపాటు సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 24న కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా టీం పాల్గొంటుందని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ క్రీడాకారులకు స్పాన్సర్ కొరత ఉందని, కంపెనీలు ముందుకు వచ్చి క్రీడాకారులను దత్తత తీసుకుంటే రాబోవు రోజుల్లో గుంటూరు నుంచి అంతర్జాతీయ చూడగలమని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఏవీ ఆంజనేయులు, అరుణ్కుమార్, శాప్ కోచ్లు శివారెడ్డి, వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్లు వి.శరత్బాబు, అంజి, నాగరాజు పాల్గొన్నారు. -
విజ్ఞాన్, ఇప్సైటీ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, గుంటూరులోని ఇప్సైటీ డయాగ్నస్టిక్స్ రీసెర్చ్ సెంటర్ల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్ చాన్స్లర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఇప్సైటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి కోగంటి, సీఈవో–సీఎస్వో డాక్టర్ సందీప్ కుమార్ నాదెండ్ల విజ్ఞాన్ వైస్ చాన్సలర్ పి నాగభూషణ్లు అవగాహన పత్రాలను మార్చుకున్నారు. వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, ప్రెసిషన్ మెడిసిన్, ఆధునిక జీవసాంకేతిక రంగాలలో శాసీ్త్రయ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు కలిసి నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్, డ్రగ్ ఇంటరాక్షన్ల విశ్లేషణ, మాలిక్యులర్ రీసెర్చ్, లో–కాస్ట్ పీసీఆర్ టెక్నాలజీ అభివృద్ధి, సెప్సిస్ ట్రాన్స్క్రిప్టోమిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్ అనాలిటిక్స్ వంటి ఆధునిక పరిశోదనరంగాల్లో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఇప్సైటీ సంస్థ స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ ప్రయోగశాలలు, హైఎండ్ పరికరాలు, బయోఇన్ఫర్మాటిక్స్ సపోర్ట్, క్లినికల్ డేటా ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. వీటితోపాటు యూజీ –పీజీ విద్యార్థులకు పరిశోధన ఇంటర్న్షిప్లు, సంయుక్త పరిశోధన ప్రతిపాదనలను జాతీయ–అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీలకు సమర్పించడం, ఇప్సైటీ సంస్థ ఉద్యోగులకు విజ్ఞాన్లో ఉన్నత చదువులకు అవకాశాలు, అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లు, అంతర్జాతీయ సదస్సులు, సింపోజియాలు, సంయుక్త శాసీ్త్రయ పత్రాల ప్రచురణ, ఇన్నోవేషన్, స్టార్టప్–ఇకోసిస్టంపై సంయుక్త కార్యక్రమాలు, హెల్త్కేర్–లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఇండస్ట్రీ–అకాడమియా బ్రిడ్జ్ బలోపేతం చేస్తామన్నారు. రెండు సంస్థల సహకారం వలన ఆరోగ్య సేవల మెరుగుదల, ఖచ్చితమైన రోగ నిర్ధారణ, ప్రెసిషన్ థెరపీ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో అధునాతన పరీక్షలు అందించడంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, వివిధ విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు. -
అయినవారికి దోచిపెట్టేందుకే నిర్ణయాలు
ప్రైవేటీకరణ పేరుతో మెడికల్ కళాశాలలను అప్పనంగా తన వారికి కట్టబెట్టేందుకు బాబు చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్థమైనందునే నేడు కోటి సంతకాల ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రైవేటు రంగంలో ఉన్న తన మద్దతుదారులకు దోచిపెట్టేందుకే సీఎం చంద్రబాబు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పేదవాడికి ఉచితంగా వైద్యం, వైద్య విద్య అందాలంటే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేయాలి. – దాసరి రాజు, వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు -
ప్రైవేటుపై పోరు.. సంతకాల జోరు !
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఉద్యమం ● తాడికొండ నియోజకవర్గంలో 64 వేలు దాటిన సంతకాలు ● చంద్రబాబు సర్కారు తీరుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత తాడికొండ: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ, పేదలకు వైద్య సేవలను అందకుండా చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గంలో జోరుగా సాగింది. అక్టోబర్ 16వ తేదీన ఉద్యమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు, నాయకులను ఉత్సాహపరుస్తూ నియోజకవర్గంలోని 4 మండలాల్లో కార్యక్రమం చురుగ్గా సాగింది. ప్రణాళికాబద్ధంగా మండల, గ్రామ కమిటీలతో పాటు క్లస్టర్ ఇన్చార్జుల నియామకంతో సేకరణ ఉత్సాహంగా కొనసాగింది. 4 మండలాల పార్టీ అధ్యక్షులు వంగా పోలారెడ్డి, మార్పుల శివరామిరెడ్డి, తాళ్ళూరి వంశీకృష్ణ, మైనేని నాగమల్లేశ్వరరావుల ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర, మండల, గ్రామ అనుబంధ కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో నష్టాలను తెలియజేసి సంతకాలను సేకరించారు. అన్నివర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రైవేటు వారితో లాలూచీ పడిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తాడికొండ నియోజకవర్గంలో 64 వేలకుపైగా సంతకాలు సేకరించారు. ప్రజల నుంచి అనూహ్య మద్దతు తోడవడంతో సంతకాల సేకరణ జోరుగా సాగింది. చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సూపర్ సిక్స్ పేరుతో ఓట్లు దండుకొని హామీల అమలుపై మొండిచేయి చూపించిన వైనంపై ప్రజలు ఇప్పటికే మండిపడుతున్నారు. గ్రామాల్లో సంతకాల సేకరణకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు... చంద్రబాబు చేసిన మోసం గురించి ప్రజలకు వివరించినప్పుడు సర్కారుపై వ్యతిరేకత స్పష్టం కనిపించింది. పేదల కోసం ఉన్నత ఆశయంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.తాడికొండ నియోజకవర్గంలో అక్టోబర్ 16న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు తాడికొండ మండలం దామరపల్లిలో కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్న నాయకులు -
నేడు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: నాలుగో జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించనున్నట్లు డీఎల్ఎస్ఏ చైర్మన్–కమ్– ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బి. సాయి కల్యాణ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. లోక్ అదాలత్ శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు ఆవరణలో జరుగుతుందన్నారు. ఈ అదాలత్లో జిల్లా పరిధిలోని సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, వైవాహిక వివాదాలు, ప్రీ లిటిగేషన్ దశలో ఉన్న వివాదాలు తదితర కేసులు పరిష్కారం కోసం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. గుంటూరు నగరంలోని న్యాయ అధికారులు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు ప్రారంభ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి పలువురిని పలు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భీమినేని వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శిగా మన్నెం లక్ష్మి, వైఎస్సార్ టీయూసీ సహాయ కార్యదర్శిగా బోరుగడ్డ రజినీకాంత్లను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పిన టీడీపీ నాయకులు గెలిచిన తర్వాత ఇచ్చిన పహామీలు గాలికి వదిలేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయబోమని చెప్పడం తగదన్నారు. అంగన్వాడీలకు యాప్ల భారాన్ని రద్దు చేయాలన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో హెల్పర్లకు ప్రమోషన్లు ఆపటం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధనలక్ష్మి, ఏవీఎన్ కుమారి గౌరవాధ్యక్షుడు జి రమణ, ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి, రత్న మంజుల, ప్రేమ్ కుమారి, సీఐటీయూ నాయకులు దుర్గారావు హుస్సేన్ వలి, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా -
కాల భైరవస్వామికి పూజలు
పెదపులివర్రు (భట్టిప్రోలు): వ్యాఘ్రపుర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ వారి దేవాలయంలో కొలువైన శ్రీ కాల భైరవస్వామి వారికి మార్గశిర బహుళాష్టమి శుక్రవారం ప్రాతఃకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవత అమ్మవారి దేవాలయంలో నిత్యపూజ కై ంకర్యాలు విరజిల్లుతూ భక్తుల కోర్కెలు తీర్చే బంగారు కల్పవల్లి అమ్మవారిని భక్తులు సందర్శించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు సంపత్నగర్ శ్రీరామనామ క్షేత్రంలో నిర్వహిస్తున్న 99వ శ్రీరామకోటి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు, అలంకరణ జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి ఉత్సవ మూర్తులను తెప్ప తిరునాళ్లతో మహోత్సవం నిర్వహించారు. అనంతరం హోమం, పూర్ణాహుతి చేయగా, వసంత సేవ, అవబదోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరు కాగా, కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ రాగం వెంకట లీలా సుందరి బెల్లంకొండ మస్తానరావు పర్యవేక్షించారు. నరసరావుపేట రూరల్: మిరప పంటలో తెగుళ్లు, చీడపీడలను అరికట్టేందుకు సస్యరక్షణ చేపట్టాలని పల్నాడు జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్టినేటర్ డాక్టర్ ఎం.నగేష్, నరసరావుపేట ఉద్యాన అధికారి షేక్ నబీ రసూల్లతో కలిసి ఆయన శుక్రవారం మిరప తోటలను పరిశీలించారు. పోషక లోప నివారణకు పైపాటుగా 19–19–19, ఫార్ములా–6, మెగ్నీషియం సల్ఫేట్ను పిచికారి చేయాలని తెలిపారు. తెల్లనల్లి నివారణకు డైఫెన్డుయురాన్ 1.25 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మి.లీ.ను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటుచేసి, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థాయోమిథాగ్సం 0.4 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మీ.లీను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. నల్లతామర నివారణకు సైయాన్ట్రనిలిప్రోల్ 240 మి.లీ ఎకరానికి లేదా ఇమిడా క్లోప్రిడ్, ఫెఫ్రోనిల్ 50 గ్రాములు రెండు కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు. నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మహా కాల భైరవాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు నల్ల చెరువు ఒకటో వీధిలో శ్రీభవానీ శంకర శివసేన పూజ్య గురువులు శ్రీ సూర్యచంద్రేశ్వరానంద స్వామీజీ ఆధ్వర్యంలో కాల భైరవ జయంతి ఆరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాకాల భైరవాష్టమి విశిష్టతను భక్తులకు స్వామీజీ వివరించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. -
పేదలకు వైద్యం, వైద్య విద్య దూరం
చంద్రబాబు పేదవాడికి అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు వైద్య విద్య దూరం కావడంతో పేదలకు మెరుగైన వైద్యాన్ని దూరం చేసి ప్రైవేటు కళాశాలలకు ఊతమిచ్చి పేదలను మరింత అణగదొక్కాలని చూడటం అన్యాయం. ఇకనైనా తప్పుడు నిర్ణయాలు పక్కనబెట్టి పేదలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతతో జన సునామీలో బాబు కొట్టుకుపోవడం ఖాయం. తగిన సమయంలో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం మరిచిపోరు. – పరుచూరి నారాయణ,పాములపాడు -
చంద్రబాబు ఒక దొంగ దోపిడీదారుడు
15న నిర్వహించనున్న కోటి సంతకాల ర్యాలీ సన్నాహాక సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : చంద్రబాబు ఒక దొంగ అని, దోపిడీదారుడని అన్నీ దోచుకోవడమే ఆయన పని అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎంతో కష్టపడి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకొస్తే వాటిని కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 15న జరగనున్న కోటి సంతకాల సేకరణ ర్యాలీకి సంబంధించి శుక్రవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్విహించారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షత వహించారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ మెడికల్ కళాశాలలు కట్టుకుంటూ వస్తే... చంద్రబాబు అమ్ముకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు మేలు చేసేలా 30 ఏళ్ల ముందుకు ఆలోచించి జగన్ విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ నెల15న జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నడుమ లాడ్జిసెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం కలిపి 4,78,589 సంతకాలు పూర్తయినట్లు వివరించారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, జిల్లా, నగర, గ్రామ, మండల, డివిజన్ నుంచి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ర్యాలీలో భాగస్వాములు కావాలని కోరారు. మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 1.32 కోట్ల ఓట్లు వస్తే కోటి సంతకాల కార్యక్రమానికి 1.40 కోట్లకు పైగా రావడం ద్వారానే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. పేదవాడి ఆర్తనాదాన్ని తెలియజేసేదే ఈ సంతకమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు భవిష్యత్తులో భరోసా నింపడమే ధ్యేయంగా జగన్ 2.0 లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రాధాన్యత గుర్తించిన వై.ఎస్.జగన్ వాటిని ప్రజలకు చేరువ చేశాారన్నారు. ఇది కేవలం వైఎస్సార్సీపీ పోరాటం కాదని, ఇది ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలే కుప్పకూలి పోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయన్నారు. చంద్రబాబుకు అదేగతి పట్టనుందన్నారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, అందుకే కోటి సంతకాలు కాకుండా ఏకంగా 1.40 కోట్ల సంతకాలు పూర్తయ్యాయన్నారు. వైఎస్సార్సీపీకి పోరాటం కొత్తకాదన్నారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ టీడీపీ వారే సంతకాలు చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. చంద్రబాబు విధానాలు నచ్చని ఆ పార్టీ వారే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ వై.ఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదలకు వైద్యం, విద్య అందిందో అది ఇప్పుడు కూడా వారికి అందించేందుకు పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, వలి వీరారెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, మండేపూడి పురుషోత్తం, పఠాన్ అబ్దుల్లా ఖాన్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు తాడిబోయిన వేణుగోపాల్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, యేటి కోటేశ్వరరావు యాదవ్, పఠాన్ సైదా ఖాన్, నందేటి రాజేష్, సీడీ భగవాన్, ఉడుముల పిచ్చిరెడ్డి, సుబ్బులు, రూత్రాణి, అవినాష్, ప్రభు, వాసిమళ్ల విజయ్, కొండా రవి, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కబడిగా పచ్చదనం పెంపు
నెహ్రూనగర్: గుంటూరు మున్సిపాలిటీకి ఇటీవల రెండు లారీల మొక్కలు తెప్పించినప్పటికీ అసలు ఆ మొక్కలు ఎక్కడ నుంచి వచ్చాయో.. ఎన్ని వచ్చాయో అనే సమాచారం మిగతా అధికారులకు కూడా తెలియదంటే అతిశయోక్తి లేదు. గతంలో ఈ మొక్కల వ్యవహారం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ (ఏడీహెచ్) చూసేవారు. కానీ ఇప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)కు నేరుగా బాధ్యతలు అప్పగించడంతో మొక్కల లెక్కల్లో గోల్మాల్ జరుగుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొక్కలు తెప్పించడంలో డీఈఈ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. మొక్కలు తెచ్చేవి గోరంత.. బిల్లు పెట్టేది కొండంత.. అన్నట్లుగా వ్యవహారం ఉందని తెలిసింది. తెచ్చిన మొక్కలు ఏమైపోయాయి అని అడిగితే ఎండిపోయాయని చెప్పడం పరిపాటిగా మారింది. మొక్కల వ్యవహారం అంతా ఆ డీఈఈయే చూసుకోవడంతో ప్రస్తుతం ఇక్కడ పార్కు ఏడీహెచ్గా పనిచేస్తున్న శాంతి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొక్కలు ఏమైనా పాడైపోతే వెంటనే పార్కు సిబ్బందిని పిలిచి అధికారులు మందలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేయలేనని ఏడీహెచ్ శాంతి రిలీవ్ అయి వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో ముగ్గురు ఏడీహెచ్లు రిలీవ్ అయ్యారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సొంత నర్సరీ ఉంటే మేలు... గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు నగర పరిధిలో చాలానే ఉన్నాయి. ఆయా స్థలాల్లో మొక్కల పెంపకం, గ్రాస్ పెంచడం వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కార్పొరేషన్ ఆదాయం గండి పడకుండా ఉంటుందని నగరపాలక సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. నర్సరీలు లేకపోవడంతో ఎప్పుడైనా బయటి నుంచి మొక్కలు తెప్పించినప్పుడు వాటిని రిజర్వాయర్ల వద్ద గుట్టలు గుట్టలుగా పడేస్తున్నారు. తర్వాత అటువైపు చూసేవారే లేకపోవడంతో అవి పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. మిషన్ గ్రీన్ గుంటూరు కింద 5 లక్షల మొక్కలు నాటాలని జీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 1.50 లక్షలు మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన మొక్కలు ఏపీ గ్రీన్ కార్పొరేషన్, అటవీ శాఖ ద్వారా తెప్పించి నాటడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ మొక్కలు తెప్పించడంలో ఓ డీఈఈ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.నగరం సుందరీకరణలో భాగంగా పలు డివైడర్లలో ఉన్న పాత మట్టినంత తీసేసి కొత్త మట్టిని నింపారు. అదే విధంగా సదరు డివైడర్లలో మొక్కలు నాటుతున్నారు. అయితే వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మొక్కలు పాడైపోతున్నాయి. నిర్వహణ చూసుకోవాల్సిన సిబ్బంది సుమారు 80 మంది ఉంటే కేవలం 30 మందిలోపే విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. మిగిలిన వారంతా పార్కుల కింద జీతాలు రాయించుకుంటూనే నగరపాలక సంస్థ కార్యాలయంలో డెప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని అడిగే వారు లేకపోవడంతో ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. -
చంద్రబాబూ.. దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు...ఐవీఆర్ఎస్ కాల్స్తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో? విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది...ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్షీట్లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు...టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప.. చేతలు లేవు’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సరైన స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు సరైన బ్యాగులు, బూట్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి లోకేష్. తన పదవికి రాజీనామా చేయాలంటూ రవిచంద్ర డిమాండ్ చేశారు.‘‘పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు.‘‘ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా?. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని ప్రభుత్వం ఇది. నాడు-నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని చేతగాని మంత్రి లోకేష్’’ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్రెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్రెడ్డి నిలదీశారు.‘‘ఫైబర్ నెట్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్రెడ్డి ధ్వజమెత్తారు.ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్ నెట్లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్ని డైరెక్టర్గా తీసుకోవాలని సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. -
సీపీ బ్రౌన్ వర్థంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ వర్ధంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్కు నివాళులు అర్పించారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని.. తన మాతృ భాష కంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో.. కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన మహనీయుడు’ అని ప్రశంసలు కురిపిస్తూ పోస్టు చేశారు. భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని, తన మాతృ భాషకంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్ గారు. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన… pic.twitter.com/uwUwlZQfzm— YS Jagan Mohan Reddy (@ysjagan) December 12, 2025 -
అల్లూరి జిల్లా బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
అంబటి మురళికి అడుగడుగునా అడ్డంకులు
మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పల్నాడు పార్టీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కేతోపాటు పీవీఆర్ను అక్రమంగా కేసులో ఇరికించడంతో కోర్టులో లొంగిపోతున్న వారిని కలిసి మద్దతు తెలిపేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. వాహనాన్ని, తన అనుచరులను విడిచి ఆయన ఒక్కరే ఆర్టీసీ బస్సులో ఎక్కి మాచర్లకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆ బస్సును నిలిపారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన బస్సులోని చివరి సీటులోకి వెళ్లి పడుకొని వారికి కనిపించకుండా మాచర్ల పట్టణ శివారుకు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు పోలీసులు ఆయనను గుర్తుపట్టి అక్కడ నుంచి దించివేశారు. మురళీకృష్ణ పట్టణ శివారులో ఉన్న పొలాల్లో పయనించి ఆ ప్రాంతంలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి సాయం తీసుకొని, అడ్డదారుల్లో ఇబ్బంది పడుతూనే కోర్టు వద్దకు చేరుకొని పిన్నెల్లి సోదరులను కలిసి పార్టీ తరఫున మద్దతు తెలిపారు. మురళీకృష్ణ పట్టుదలతో గమ్యానికి చేరుకున్న తీరును పార్టీ నాయకులు అభినందించారు. -
దొడ్లేరు రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం
క్రోసూరు: దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం వస్తువుల కోసం బాధితులందరూ సమష్టిగా పోరాటం చేసిన ఫలితంగానే పరిహారం లభించిందని కౌలు రైతు, రైతు, వ్యసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కిందట దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో బంగారం కోల్పోయి, సరైన రసీదులు లేక అయోమయ పరిస్థితిలో ఆందోళన చేస్తూ రోడ్డెక్కిన రైతన్నలకు కౌలురైతు, రైతు – వ్యవసాయ కార్మిక సంఘాలు అండగా నిలిచాయని తెలిపారు. 2500 ఖాతాలు పరిశీలించి 500 మంది ఖాతాదారులు బంగారం కోల్పోయినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మొదటి దశలో 370 మందికి వడ్డీతో సహా రూ.2 కోట్ల 50 లక్షలు నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన 120 మందికి సరైన ఆధారాలు లేకపోవడం వలన నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెప్పిన నేపథ్యంలో మరింత పట్టుదలతో ప్రజా సంఘాల సహకారంతో 2 సంవత్సరాల 4 నెలలపాటు పోరాటం చేసి చివరగా 474 మంది రైతులకు రూ.3.50 కోట్ల నష్టపరిహారాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. దొడ్లేరు రైతాంగం చేసిన ఈ పోరాటం ఎలాంటి సమస్యనైనా సమష్టిగా పోరాటం చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని రుజువు చేసిందని, నేటి ప్రజానీకానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో శిలర్షా, ఈశ్వర్రెడ్డి, దగ్గు నటరాజు, తదితరులు పాల్గొన్నారు.కౌలు రైతు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు -
ఆర్టీసీ బస్సు డ్రైవర్కు శిక్ష
గుంటూరు లీగల్: ఆర్టీసీ బస్సు డ్రైవర్కు శిక్ష విధిస్తూ జిల్లా ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు చెప్పారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో 2019 జనవరి 6న జరిగిన ప్రమాదంలో వృద్ధుడు మోతుకూరి కోటేశ్వరరావు (70) మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కమ్మిలి వెంకట శివనారాయణకు గుంటూరు జిల్లా ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి సంవత్సరం జైలుశిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా, హారన్ కొట్టకుండా బస్సును నడిపి వెనుక నుంచి వృద్ధుడిని ఢీకొట్టాడు. బస్సు వెనుక చక్రం కింద పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై అదే రోజు మధ్యాహ్నం ఈస్ట్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతుని తరఫున వాదనలు వినిపించారు. తాడికొండ: లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొని క్వారీ గుంతలోకి దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందిన ఘటన తాడికొండ మండలం లాం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. జొన్నలగడ్డ వైపు నుంచి ధాన్యం లోడు దించి మితిమీరిన వేగంతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో క్వారీ గుంతలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఇక్కుర్తి ఉమాదేవి (50) నలిగిపోయి మృతి చెందింది. ఆటో డ్రైవర్తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో మరో ఆటోలో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ కె. వాసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీఆర్వో మధు, కార్యదర్శి అరుణ్ కుమార్ సిబ్బంది, స్థానికుల సాయంతో రెండు జేసీబీలతో లారీ, ఆటోలను క్వారీ గుంతలో నుంచి బయటకు తీశారు. అప్పటికే మహిళ ఆటోలో నలిగిపోయి మృతి చెందింది. లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారీ కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు పక్కనే ప్రమాదకర లోతులో ఉన్న క్వారీయింగ్ గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి. సంబంధిత అధికారులు స్పందించి ఫెన్సింగ్ వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుంటూరు వెస్ట్: ప్రత్తిపాడు మండలంలో గొట్టిపాడు–ఏబీ పాలెం రహదారికి ప్రభుత్వం రూ.2.17 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ గ్రామీణ రోడ్ల బలోపేత ప్రాజెక్టు గ్రాంట్ క్రింద 3.828 కిలో మీటర్ల మేర గొట్టిపాడు – ఏబీ పాలెం రహదారి బలోపేత చేయుటకు రూ.2.17 కోట్లు మంజూరు అయిందని చెప్పారు. ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని సంబంధిత గ్రామ ప్రజలు అనేక సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో వినతులు సమర్పించారన్నారు. -
అక్రమ అరెస్టులు చేసేందుకే పోలీసులా?
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమ అరెస్టులు చేసేందుకే పోలీసులు యంత్రాంగం పని చేస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులోని అంబటి రాంబాబు కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు వెళుతుండగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారని చెప్పారు. కోర్టులో లొంగిపోయేందుకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యేకు సంఘీభావంగా వెళ్లి, పరామర్శించే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ మొత్తం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేసేందుకే పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగసారా కాస్తున్న వారిని, గంజాయి విక్రయించేవారిని పట్టుకునే ఉద్దేశం లేదన్నారు. నేరాలను అరికట్టి, శాంతిభద్రతలను పరిరక్షించడం కంటే వైఎస్సార్ సీపీ నేతల అరెస్టులపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ హడావుడిగా వచ్చారని, 144 సెక్షన్తో పాటు యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు నోటీసు ఇస్తే రోడ్డుపై పడుకుని గందరగోళం చేశారని చెప్పారు. అంతే కాకుండా ఇది ప్రజాస్వామ్యమా? పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటారా? అని పెద్ద ఎత్తున గొడవ చేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కోర్టుకు హాజరవుతుండగా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని నియోజకవర్గ సమన్వయకర్తలను మాచర్ల వెళ్లనీయకుండా ఉదయమే హౌస్ అరెస్టులు చేసి అడ్డగించారని గుర్తుచేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వారికో న్యాయం... తమకో న్యాయమా అని అన్నారు. వర్గాల మధ్య కొట్లాటలే కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మోపిన హత్యానేరం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని అంబటి స్పష్టం చేశారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న కొట్లాటలతోనే జంట హత్యలు జరగాయని, ఈ విషయాన్ని నాడు హత్యలు జరిగిన రోజున సంఘటనాస్థలానికి వచ్చిన అప్పటి పల్నాడు ఎస్పీ స్వయంగా చెప్పారని అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించాలని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యేతోపాటు చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతో నిందితులుగా చేర్చారని ఆరోపించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లి, అక్కడ బెయిల్ తెచ్చుకున్నారని అన్నారు. బెయిల్ రద్దు కోవడంతో కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి పిన్నెల్లి సోదరులు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు వెళ్లారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం పోలీసు యంత్రాగాన్ని ఉపయోగించి ఎందుకు రాద్ధాంతం చేయాలని అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇంత నీచస్థితికి దిగజారాలా అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైసీపీ నేతలను అక్రమ అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారని, ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యంలో వైసీపీ నేతలను అజ్ఞాతంలోకి పంపుతున్నారని, తరువాత అధికారంలో వచ్చాక వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని, దందాలు, దోపిడీలతో అక్రమ సంపాదనతో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రలో 18 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో కోటి మందికి పైగా ప్రజలు స్పందించి వ్యతిరేకతను స్పష్టం చేశారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60వేలకు పైగా సంతకాలు సేకరణ జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా ?. వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇండిగో విషయంలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపై దేశ వ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితులను డైవర్ట్ చేసేందుకు వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కారు తప్పులన్నింటికీ రానున్న కాలంలో వడ్డీ సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. 2029లో ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ది కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ ప్రారంభం
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : ఏలూరు జిల్లా, ఏలూరు టైన్ అగ్రహారంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, చిరు వ్యాపారుల ఆర్ధికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ 112 సంవత్సరాల చరిత్ర కలిగిన ది ఏలూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 8వ బ్రాంచ్ శాఖ ప్రారంభించడం అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం గుంటూరులో హరిహర్ సినిమాస్ లైనులో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, బ్యాంక్ డైరెక్టర్, బ్యాంక్ చైర్మన్ అంబిక ప్రసాద్ పాల్గొన్నారు. -
పోలీసు రక్షణలో తప్పిపోయిన బాలిక
●36 గంటల్లో కేసు ఛేదన ● పెంపుడు తల్లిదండ్రుల నుంచి పారిపోయానన్న ఏడేళ్ల పాప కారంచేడు: తప్పిపోయిన ఏడు సంవత్సరాల బాలిక చెవుటూరి నాగేంద్రాన్ని పోలీసులు గురువారం కనుగొన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతకడం ప్రారంభించారు. కేసు నమోదు అయిన 36 గంటల్లో పాపను పట్టుకున్నారు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా అందించిన సమాచారం మేరకు.. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన చెవుటూరి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతుల పెంపుడు కుమార్తె నాగేంద్రం ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి బైటకు వెళ్లి అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ ఖాదర్బాషా బాపట్ల ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య సారథ్యంలో కారంచేడు, ఇంకొల్లు ఎస్ఐ సురేష్, చినగంజాం ఎస్ఐ రమేష్లు తమ సిబ్బందితో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం తమ సిబ్బంది చిలకలూరిపేట ప్రాంతంలో వెతుకుతుండగా పాప ఆ ప్రాంతంలో సంచరించిన విషయం గమనించిన పోలీసులు పాపను జాగ్రత్తగా విచారించారు. తన పెంపుడు తల్లిదండ్రులు కొడుతుండటంతోనే తాను ఇంటి నుంచి పారిపోయానని తెలపడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఎస్ఐ ఖాదర్బాషా విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలపడంతో వారి సూచనలతో పాపను బాపట్ల వన్స్టాప్ సఖి సెంటర్కు తరలించామన్నారు. పాప ఇష్ట్రపకారమే ఆమె పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించలేదని తెలిపారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ రాధామాధవి
గుంటూరు మెడికల్: బీజేపీ మహిళా మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ శనక్కాయల రాధా మాధవిని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మహిళా మోర్చా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డాక్టర్ శనక్కాయల రాధా మాధవి మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి, బీజేపీ సీనియర్ నాయకుడు కొత్తూరు వెంకట సుబ్బారావు మాట్లాడారు. కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారావు, నాగమల్లేశ్వరి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాస్, బజరంగ్ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి కె.నారాయణరెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి దుర్గా భవాని, కోలా రేణుక, మూడో మండల మహిళా అధ్యక్షురాలు బెహరా గాయత్రి, మాజీ కార్పొరేటర్ శ్రావణకుమారి, చావలి పద్మ, రావూరి లక్ష్మీ విమలాదేవి, కె.రేణుక, కె. విజయలక్ష్మి, వాణి త్రిపురమల్లు, కె.శ్రీదుర్గ పాల్గొన్నారు. -
తుమ్మల సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించాలి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : స్థానిక బృందావన్గార్డెనన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురు వారం తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి 23వ పురస్కార సభ నిర్వహించారు. తుమ్మల కళాపీఠం ఆధ్వర్యంలో జరగ్గా, సభకు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ ఏల్చూరి మురళీధరరావు (ఢిల్లీ)ను తుమ్మల కళాపీఠం అవార్డు, రూ.25 వేలు, దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం డాక్టర్ ఏల్చూరి మాట్లాడుతూ తుమ్మల సమగ్ర సాహిత్యాన్ని మరోమారు ప్రజలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సంస్థ కార్యదర్శి సూర్యదేవర రవికుమార్ మాట్లాడుతూ తుమ్మల సీతారామమూర్తి జయంతిని ఏపీ ప్రభుత్వం నిర్వహించాలని అన్నారు. సభలో అప్పాజోస్యుల సత్యనారాయణ, అక్కిరాజు సుందరరామకృష్ణ, ఎస్వీఎస్.లక్ష్మీనారాయణ, వెన్నిశెట్టి సింగారావు, పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, పారా అశోక్, ముత్తేవి, భూసురపల్లి, నాగరాజ్యలక్ష్మీ, నాగసుశీల, దేశం పాపిరెడ్డి, బొల్లేపల్లి సత్యనారాయణ, నూతలపాటి తిరుపతయ్య సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. -
స్కేటింగ్ పోటీల్లో బాలుడి ప్రతిభ
మంగళగిరి టౌన్: విశాఖపట్నం ఉడా పార్కులో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి జరుగుతున్న జాతీయ స్కేటింగ్ పోటీల్లో బాలుడు ప్రతిభ చాటాడు. మండల పరిధిలోని చినకాకాని గ్రామానికి చెందిన సుంకర ధరణీశ్వర్ 10 నుంచి 12 సంవత్సరాలలోపు జరిగిన ఇన్లైన్ స్కేటింగ్ ఫ్రీ స్టైల్ విభాగంలో స్కేటింగ్ స్పీడ్ స్లాలోమ్, క్లాసిగ్ స్పీడ్ స్లాలోమ్లో పోటీపడ్డాడు. స్పీడ్ స్లాలోమ్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ తరఫున రాష్ట్రం నుంచి ధరణీశ్వర్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో వివిధ విభాగాల నుంచి 11 మెడల్స్ సాధించాడు. ధరణీశ్వర్ను అకాడమి కార్యదర్శి శీలం లక్ష్మణ్, కోచ్ సింహాచలం, హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్ అభినందించారు. బి.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల ఏఎన్యూ(పెదకాకాని): ఈ ఏడాది సెప్టెంబరు నెలలో జరిగిన బి.ఫార్మసీ ఐదవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏఎన్యూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆలపాటి శివ ప్రసాద్ తెలిపారు. మొత్తం పరీక్షకు 370 మంది హాజరు కాగా 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 ఫీజు చెల్లించాలన్నారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫార్మా.డి మొదటి సెమిస్టర్కు 285 మంది హాజరు కాగా వారిలో 194 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 23వ తేదీలోగా ఫీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. -
రెండో వైస్ ఎంపీపీగా అనూరాధ ఏకగ్రీవం
ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల రెండో వైస్ ఎంపీపీగా అమర్లపూడి అనూరాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల రెండో ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చంద్రం ఇటీవల మృతిచెందారు. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడటంతో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి వి.శంకర్ ప్రైసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. మండలంలో 18 మంది ఎంపీటీసీలకుగాను వైఎస్సార్సీపీకి చెందిన 15 మంది విజయం సాధించారు. కాగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్బాబు) ఆధ్వర్యంలో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మతోపాటు ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. అందరి సమక్షంలో అమీనాబాద్ రెండు ఎంపీటీసీ సభ్యురాలు అమర్లపూడి అనూరాధను ఏకగ్రీవంగా ఎంపికచేసి బీ ఫాం అందజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో అమీనాబాద్ –1 ఎంపీటీసీ గాంధీబుడే (చిన్నసుబాని).. అమీనాబాద్–2 ఎంపీటీసీ సభ్యురాలు అమర్లపూడి అనూరాధను ప్రతిపాదించారు. అమీనాబాద్–3 ఎంపీటీసీ సభ్యురాలు సకిల.లక్ష్మి బలపరిచారు. దీంతో సమావేశానికి హాజరైన ఎంపీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీగా ఎ.అనూరాధను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల ప్రత్యేకాధికారి వి.శంకర్ ప్రకటించి పత్రాన్ని అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నిక కార్యక్రమాలను ఎంపీడీవో పి.శివ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ కె.ప్రసాద్, వైస్ ఎంపీడీవో విష్ణువర్ధన్రావు, సూపరింటెండెంట్ రవిబాబు, సీఐ శివరామకృష్ణ, ఈవోపీఆర్డీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. రెండో వైస్ ఎంపీపీ అనూరాధను పలువురు అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ, ఎంపీపీ షేక్, షహేలానర్గీస్, పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ హబీబుల్లా, వైస్ ఎంపీపీ–1 మార్పుల విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు ఐ.సీతారామిరెడ్డి, కె. హనుమాయమ్మ, గాంధీబుడే, చేవూరి నాగవేణి, టి. పెదలక్ష్మయ్య, టి.విజయలక్ష్మి, పి.జోస్ఫిన్, పి.లక్ష్మయ్య, షేక్.ఖాసిం షహీద్, సకిల లక్ష్మి, సాలె సంధ్యారాణి, కో అప్షన్ మెంబర్ షేక్ సుబాని, నాయకులు కె.చిన్నప్పరెడ్డి, డి.సురేష్, షేక్ సలీం, డి.మెల్కియా, కె.అప్పిరెడ్డి, ఎ.రత్నం, మేడాబాబు, పి.రఘు, పెరికల చిన్న, స్వర్ణ, చిన్నప్ప, చేవూరి రామమోహన్రెడ్డి, చిట్టా అంజిరెడ్డి, సాల్మన్, సయ్యద్ సైదులు, షేక్ మస్తాన్ వలి, కె.ప్రవీణ్రెడ్డి, ఐ.హేమలతారెడ్డి, బద్దూరి శ్రీనివాసరెడ్డి, మీరావలి, కె.ఆనంద్, పి.వెంకటరామిరెడ్డి, సంజీవరెడ్డి, పుల్లారావు, కె.శ్రీనివాసరెడ్డి, మోరంరెడ్డి, ఎం.జోజి, డి,నరేంద్రకుమార్, ఎం.శ్రీనివాసరెడ్డి, టి.కృష్ణ. రామారావు,ఎస్.రాయప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాల్యవివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలి
గుంటూరు వెస్ట్: గుంటూరు బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) కార్యక్రమంపై వందరోజుల ప్రచార కార్యక్రమ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీనికోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. బాల్య వివాహాలు వలన కలిగే అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.విజయలక్ష్మీ, గుంటూరు నగర పాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీనివాసరావు, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామఅప్పలనాయుడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రిదేవి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ గుంటూరు వెస్ట్: డిస్ట్రిబ్యూటర్లు అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను విక్రయించినా, డెలివరీ బాయ్స్ ఎక్కువ మొత్తాలు వసూలు చేసినా, అమర్యాదగా ప్రవర్తించినా చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో గురువారం గ్యాస్ ఏజన్సీస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ప్రభుత్వం ప్రతి నెలా నిర్వహించనున్న ఐవీఆర్ఎస్ సర్వేలో జిల్లా 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. ఏజెన్సీల పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. ఉజ్వల 3.0 పథకంలో భాగంగా ఎల్సీజీ కనెక్షన్లు త్వరగా అందజేయాలని తెలిపారు. పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్న 10 మంది గ్యాస్ ఏజెన్సీ యజమానులపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్ఓ కోమలి పద్మ, అధికారులు పాల్గొన్నారు. పారదర్శకంగా ప్రభుత్వ సేవలు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాట్లాడు తూ ప్రజల సంతృప్తి మేరకు సేవలు అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలో పరిశుభ్రత మరింత మెరుగు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులకు మంచి సౌకర్యాలు అందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అధికారులు పాల్గొన్నారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగింది.షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
భవానీపురం బాధితుల కంటతడి.. వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి. ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే.. తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు వైఎస్ జగన్ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతల హౌస్ట్ అరెస్ట్
సాక్షి, పల్నాడు జిల్లా: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. -
మాల ‘గెజిటెడ్ ’ అసోసియేషన్ కార్యవర్గం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మాల గెజిటెడ్ అధికారుల అసోసియేషన్, (మాల్ గోవా) గుంటూరు జిల్లా సాధారణ సమావేశం స్థానిక ఏసీ లా కాలేజీలో రాష్ట్ర అధ్యక్షులు జంగం విజయానంద్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొలకాటి రామకృష్ణ ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా తెనాలి ప్రకాష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూచిపూడి నెహ్రూబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్గా బాచు ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా చెరుకూరి జాన్ మణికుమార్, ఉపాధ్యక్షులుగా దాసరి కోటయ్య, పుల్లగూర శామ్యూల్ పాల్, సుధాకర్, తమలపాకుల బుల్లయ్యలు ఎన్నికై నట్లు పేర్కొన్నారు. జాయింట్ సెక్రెటరీలుగా గుంటి ప్రకాష్ ,పచ్చల కుమార్ రాజా ,బెజ్జం రవికుమార్, ఎద్దు రత్నరాజు, ట్రెజరర్గా కాలే వెంకటేశ్వర్లు, ఉమెన్ వింగ్ సెక్రటరీగా కొమ్మర్ల ఝాన్సీ రాణి, నీలం రమణ, తెనాలి జోష్ మేరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గౌతం ప్రసన్న, పి.నమ్రత్ కుమార్ ఎన్నికై నట్లు తెలిపారు. -
అక్రమ మైనింగ్పై విజిలెన్స్ అధికారుల దాడి
ఫిరంగిపురం: గుంటూరు జిల్లా అమీనాబాద్ కొండ ప్రాంతంలోని 545–25సర్వే నెంబర్లో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మైనింగ్ విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి దాడులు చేశారు. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ ఏజీ అనిల్బాబు, సిబ్బందితో కొండప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో మట్టి తవ్విన ఆనవాళ్లు, కొందరు వ్యక్తులతోపాటు పొక్లయిన్ ఉండటంతో వారిని ప్రశ్నించినట్లు చెప్పారు. భాగ్యారావు అనే వ్యక్తి తవ్వకాలు చేయిస్తున్నట్లు తెలిసిందని, మైనింగ్శాఖ అనుమతి పత్రాలు అడగటంతో ఇంకా రావాల్సి ఉందంటూ చెప్పడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పొక్లయిన్ను సీజ్ చేసి వీఆర్వో రామాంజి ద్వారా పోలీసు స్టేషన్కు తరలించాలని చెప్పామన్నారు. తాడేపల్లి రూరల్: కాంట్రాక్టర్లకు బకాయిలను వెంటనే చెల్లించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని సబ్కా కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొండా రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. డిప్యూటీ కోఆర్డినేటర్ సాధురావు, అసోసియేషన్ నాయకులు జీవీఆర్ నాయుడు, వి.శ్రీనివాసరావు, ఎ.సునీల్కుమార్, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులు డ్యామ్ ఫౌండేషన్ స్టోన్ వద్ద బుధవారం వేడుక నిర్వహించారు. ముందుగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రాజెక్టు కుడి కాలువ గేట్స్ డీఈ శ్రీకాంత్ , డీఈలు మురళీధర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గుంటూరు జిల్లాలో విజయవంతమైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు సంతకాలు చేసిన పత్రాలను ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలతో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలంటూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేయడం ద్వారా తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. తెనాలి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా 75 వేల మంది సంతకాలు చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో బోసురోడ్డులోని చిట్టి ఆంజనేయస్వామి గుడి సెంటరు నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా సాగారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక, వెనుక భారీ ఫ్లెక్సీ ఉంచారు. ఆ వేదికపై సంతకాలు చేసిన పత్రాల బాక్స్లను ఉంచారు. వాటిని ప్రత్యేక వాహనంలో గుంటూరుకు తరలించారు. వాహనాన్ని అన్నాబత్తుని శివకుమార్ స్వయంగా నడిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తెనాలి రూరల్, కొల్లిపర మండలాల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నేతృత్వంలో సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయం నుంచి బృందావన్ గార్డెన్స్రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు సంతకాలు చేసిన 74,763 పత్రాలను బాక్సుల్లో ఉంచి, వాటిని ఆటోపై ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. అంబటి రాంబాబు బుల్లెట్ నడుపుతూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాలయ రాజనారాయణ, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా నేతృత్వంతో మంగళదాస్నగర్లోని కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 65 వేల మందికిపైగా సంతకాలు చేయగా.. ఆ పత్రాలను కార్యాలయంలో అందజేశారు. ఇందులో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్, పరిశీలకుడు గులాం రసూల్, ఐదు మండలాల కన్వీనర్లు, అనుబంధ విభాగాల నాయకులతో ఏటుకూరు బైపాస్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో 68 వేల సంతకాలు సేకరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గంలో సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు నేతృత్వంలో 64 వేల మంది నుంచి సంతకాలు సేకరించారు. ఆ పత్రాలను ర్యాలీగా జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. నాలుగు మండలాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల ఆధ్వర్యంలో ప్రజల సంతకాలతో కూడిన పత్రాలను భారీ ర్యాలీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయం నుంచి తెనాలి బైపాస్ ఫ్లయ్ ఓవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి నియోజవర్గంలో 66,296 మంది సంతకాలు చేశారు. కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు ఎస్.కె మాబు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రుముక్కు వేణుగోపాల సోమి రెడ్డి, మంగళగిరి మండల అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిపోయిన శివ గోపయ్య , రాష్ట్ర విభాగ నాయకులు, జిల్లా నాయకులు నియోజవర్గ విభాగ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కొల్లిపర: మండల కేంద్రంలోని కృష్ణా నది కరకట్ట దిగువున అనుమతి లేకుండా బుధ వారం ట్రాక్టర్లులో ఇసుక లోడింగ్ చేస్తున్నవారిపై అధికారులు కన్నెర్ర చేశారు. రెవెన్యూ ఆర్ఐ వంశీకృష్ణ, మండల సర్వేయర్ హరికృష్ణ సంఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేక పోవటంతో హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దారు సిద్దార్ధ, ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రీ ఇసుక విధానం ద్వారా ఇసుక తరలించే సమయంలో మండల పరిధిలోని వినియోగదారులు వారి వద్ద ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శిఽ అనుమతి పత్రం తీసుకుని స్ధానిక రెవిన్యూ శాఖకు అందిస్తే వాటిని పరిశీలించి అధికారులు ఇసుక తరలించడానికి అనుమతి పత్రం జారీ చేస్తారన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో బుధవారం మాతృమరణాలపై సమీక్ష జరిగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ అధ్యక్షతన ఆయన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. జీజీహెచ్లో మరణాలపై ఆడిట్ నిర్వహించడం లేదంటూ నవంబరు 16న ‘అటకెక్కిన డెత్ ఆడిట్’ శీర్షిక పేరుతో ‘సాక్షి’ జిల్లా ఎడిషనల్ కథనం ప్రచురితమైంది. సాక్షి కథనానికి స్పందించిన ఆసుపత్రి అధికారులు బుధవారం సమీక్ష నిర్వహించారు. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులతో సమీక్ష చేశారు. గత రెండు నెలలుగా జీజీహెచ్లో ఆయా వార్డుల్లో చనిపోయిన రోగుల మరణాలపై సమీక్ష నిర్వహించారు. తురకపాలెం మెలియోడోసిస్, ఇటీవల కొత్తగా వస్తున్న స్క్రబ్టైఫస్ మరణాలపై ప్రత్యేక సమీక్ష చేశారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయిన వారి కేస్ షీట్లను 24 గంటల్లోగా మెడికల్ విభాగానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మంగళవారం మరణాలపై సమీక్ష నిర్వహించారని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ దేవకుమార్, న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిందు నర్మద, ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధికారాణి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపి తీరాల్సిందే
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తమ సంతకాల ద్వారా వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి సంతకాల పత్రాలను బృందావన్ గార్డెన్స్ మెయిన్రోడ్డులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల నుంచి పత్రాలను తీసుకువచ్చిన పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలకు అంబటి రాంబాబు అభినందనలు తెలిపారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమాతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి స్పందన లభించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో నుంచి తప్పించి, ప్రయివేటు వారికి కట్టబెడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజలు సంతకాలు చేయడం ద్వారా తమ వ్యతిరేకతను తెలిపారన్నారు. మా ప్రభుత్వం రాగానే ఆ నిర్ణయం వెనక్కు వైద్య కళాశాలలను పీపీఈ విధానంలో ప్రైవేటు వారికి అప్పగిస్తే.. తాము అధికారంలోకి రాగానే వైద్య కళాశాలలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రభుత్వ రంగంలో ఒక వైద్య కళాశాల, ఆస్పత్రిని నిర్మించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సదాశయంతో ముందుకు వెళ్లారని తెలిపారు. ఉద్యమంలో ఇది తొలి అడుగేనని, పీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంతకాలన్నీ నిక్షిప్తం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన సంతకాల పత్రాలు డిజిటలైజేషన్ చేసి భద్రపరుస్తున్నామని అంబటి చెప్పారు. ప్రతి పత్రంపై సంతకం చేసిన వారి పేరు, వారి సెల్ నంబరు ఉంటాయని, వాటని డిజిటల్ కాపీ రూపంలో భద్రపరుస్తామన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి పంపుతామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట చర్మకార వృత్తిదారుడు అచ్చియ్య వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అంబటి రాంబాబు సమక్షంలో సంతకం చేశారు. వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ కోటి మంది సంతకాలు చేయడాన్ని చూసి, చంద్రబాబు ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కార్యక్రమంలో మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పార్టీ ఆందోళనలకు చంద్రబాబు భయపడుతున్నారు
●అందుకే పోలీసులతో అణచి వేయాలని చూస్తున్నారు ●కోటి సంతకాల పత్రాల తరలింపులో మీడియాతో తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తెనాలి: చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన 74 వేల సంతకాల పత్రాల తరలింపును తెనాలిలో అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక బోసురోడ్డులోని చిట్టి ఆంజనేయస్వామి ఆలయం సెంటరులో ఏర్పాటైన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలను పోలీసులతో అణచివేయాలనీ, ఆపాలని పాలకవర్గాలు చూస్తున్నాయంటే ప్రజావ్యతిరేకతకు భయపడుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజలనుంచి సేకరించిన సంతకాల పత్రాలను ప్రజల సమక్షంలో బాక్సుల్లో సర్ది, జిల్లా కేంద్రానికి తరలించే కార్యక్రమానికి ముందురోజునుంచీ పోలీసులు అభ్యంతరం పెట్టటం ఇందుకు ఉదాహరణగా చెప్పారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన... మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం మంచిది కాదనే భావనతో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చినట్టు గుర్తుచేశారు. ఆ ప్రకారం గత అరవై రోజులుగా జరిపిన సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన లభించిందన్నారు. శిబిరాలు ఏర్పాటు చేసినా, ఇంటింటికీ వెళ్లినా ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలను చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, వివక్షపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. అందుకే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం తమకు ఆమోదయోగ్యం కాదని, పునఃసమీక్షించుకోవాలని ప్రజలు మాండేట్ ఇచ్చారని వివరించారు. సహకరించిన ప్రజలకు, సంతకాల సేకరణలో కృషిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలకు శివకుమార్ ధన్యవాదాలను తెలియ జేశారు. మేం అప్పుడు అభ్యంతరం పెట్టామా ? సంతకాల పత్రాల తరలింపు ప్రక్రియను పోలీసులు ఆపాలని చూశారని చెబుతూ అదేమని అడిగితే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అనుమతి లేదన్నారని శివకుమార్ చెప్పారు. తాము అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేసినపుడు అభ్యంతరపెట్టామా? అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్చైర్మన్ అత్తోట నాగవేణి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నాయకులు మైలా విజయ్నాయుడు, కొర్రా యశోద, కొంగర రాగమంజరి, షేక్ దుబాయ్బాబు, నిట్టా బాలు, కుర్రా శ్రీను పాల్గొన్నారు. -
18న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్కు వైఎస్ జగన్ తెలియజేయనున్నారు.ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్ జగన్ స్వయంగా గవర్నర్కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకారం.. తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్ కార్యాలయం వైఎస్సార్సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది. ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి.. ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు. -
బోరుగడ్డ అనిల్కుమార్ మా పార్టీ కాదు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘బోరుగడ్డ అనిల్కుమార్తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్సీపీ ఓ స్పష్టత ఇచ్చింది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఇండిగో తరహా సంక్షోభమే!
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ కోర్సులు చదవడం కష్టంగా మారుతుంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈనెల 17న ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు అందిస్తారు. అందుకే ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలి.. .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో 17 కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకు ఇస్తున్నారు. వంద రూపాయలకు ఎకరం చొప్పున ఒక్కో సంస్థకు 50 ఎకరాలు అప్పజెప్తున్నారు. దొడ్డి దారిన వారి నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వ కాలేజీలలో డాక్టర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో.. వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, రఘునాథ్ రెడ్డి , సుభాష్ చంద్రబోస్ , బాబురావు , అయోధ్య రామిరెడ్డి తదితరులు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామను కలిసి కుట్రను వివరించాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆమెనే నిధులు కేటాయించారు. ఏపీలో ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు ఫండింగ్ వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు ఫండ్ ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరాంప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేదల విద్యార్థులకు పేదలకు అన్యాయం జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పిన అమరావతికి ఇప్పుడు అప్పు ఎందుకు తెచ్చారు?. మెడికల్ కాలేజీల రూపంలో లక్ష కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నా.. తనకు కావలసిన మనుషులకు పంచడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు, పేదలకు నష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విద్యార్థులు తమ టాపు ప్రయారిటీగా ఎంచుకుంటారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఇండిగో లాంటి సంక్షోభం తలెత్తుతుంది అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. -
చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం
తాడేపల్లి రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. మూడు మండలాల నుంచి సుమారు 75 వేలకుపైగా సంతకాలు సేకరించారు. ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ సంతకాలు సేకరించడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఇంకా పదివేలకు పైగా సంతకాలు సేకరించనున్నట్లు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్)లు పేర్కొన్నారు. పేదలకు అండగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో పేదలకు మేలు చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయడానికి కుట్రలు పన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, సమన్వయకర్తతోపాటు మంగళగిరి తాడేపల్లి పట్టణ రూరల్ అధ్యక్షులు, దుగ్గిరాల అధ్యక్షులు ఆకురాతి రాజేష్, బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, నాళి వెంకటకృష్ణ, అమరా నాగయ్య, తాడిబోయిన శివ గోపయ్యల ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలపై ప్రజలకు అవగాహన కల్పించి సంతకాల సేకరణ చేపట్టారు. పెనుమాక, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, దుగ్గిరాలలో విద్యార్థులు తమ ఆవేదనను సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డితోపాటు స్థానిక నాయకులకు విన్నవించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తే ప్రజలకు వైద్యం మరింత దూరం అవుతుందని నాయకులు అవగాహన కల్పించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే సేకరించిన 75,800 సంతకాల ప్రతులను పట్టణ, మండల నాయకులు కలిపి మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలకు అందజేశారు. మరో ఐదు రోజుల్లో పదివేల సంతకాలు పూర్తికానున్నట్లు దొంతిరెడ్డి వేమారెడ్డి వెల్లడించారు. -
21న ‘పల్స్ పోలియో’ కార్యక్రమం
గుంటూరు వెస్ట్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్లలో శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార పోస్టర్లు. కరపత్రాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్తోపాటు అధికారులు పల్స్పోలియో ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. మార్గదర్శకాల ప్రకారం జాబితా నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం అభ్యర్థుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్కేర్లో ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు వైద్య ఆరోగ్యశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్కు సిద్ధం కావాలి రెండవ విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో రెండవ విడత ల్యాండ్ పూలింగ్పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించిందని గుర్తుచేశారు. దానికనుగుణంగా భూ సమీకరణ జరుగుతుందని అన్నారు. గ్రామ సభలు నిర్వహించేందుకు ముందుగా తేదీలను తెలియజేయాలని సూచించారు. వక్ఫ్ భూములను పరిరక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి
రేపల్లె: నాయీ బ్రాహ్మణులకు రాష్ట్రంలో అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్రాక్షారపు సూరిబాబు అన్నారు. రేపల్లెలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు, హాస్టల్స్, హెల్త్ శాఖలలో క్షౌర వృత్తి పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభుత్వం క్షౌ రశాలలకు 200ల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని, ఇది త్వరితగతిన అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యడ్లపల్లి కిషోర్బాబు, కె.అప్పారావు, విజయ్, కె.శివయ్య, సుబ్రహ్మణ్యం, కె.శివబాజీ, కొడాలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రూరల్: కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి తెనాలి మీదుగా గూడూరు వరకు నిర్మించిన మూడో రైల్వే లైన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రత్యేక రైలులో సాయంత్రం తెనాలి వచ్చారు. విండో ఇన్స్పెక్షన్లో భాగంగా జీఎం రైలులోనే ఉండి ట్రాక్ను పరిశీలిస్తూ ప్రయాణించారు. ఇదే రైలులో వచ్చిన విజయవాడ, గుంటూరు డీఆర్ఎంలు మోహిత్ సొనాకియా, సుదేష్ణసేన్ తెనాలిలో దిగిపోయారు. అమృత్ భారత స్టేషన్గా ఎంపికై న తెనాలి స్టేషన్ అభివృద్ధి పనులకు రూ.28 కోట్లు మంజూరు కాగా, వాటికి సంబంధించి జరుగుతున్న గూడ్స్ షెడ్డు నిర్మాణం, స్టేషన్లో కాలినడక వంతెనలు, ఇతర పనులను విజయవాడ డీఆర్ఎం మోహిత్ సొనాకియా అధికారుల బృందంతో పరిశీలించారు. స్టేషన్ మేనేజర్ టీవీ రమణకు పలు సూచనలు చేశారు. గుంటూరు మెడికల్: సుమారు 30 ఏళ్ల తర్వాత మళ్లీ మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు గుంటూ రు మెడికల్ కళాశాల విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ టైటిల్, పోస్టర్ను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ సమక్షంలో అధ్యాపకులు, వైద్య విద్యార్థులు మంగళవారం ఆవిష్కరించారు. ఎగ్జిబిషనన్కు ‘గుంటూరు మెడికల్ కాలేజ్ మెడ్ ఫ్యూషన్’ అని నామకరణం చేశా రు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సమాచారం, అవగాహన కల్పించేలా ప్రదర్శనలు ఉండాలని సూచించారు. విశిష్ట అతిథి రాజా కర్ణం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారికి రూ.లక్ష అందజేసి ఎగ్జిబిషన్ విజయవంతానికి తన మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, అధ్యాపకులు పాల్గొన్నారు. వేమూరు: కో ఆప్షన్ మెంబర్ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రైసెడింగ్ అధికారి పి.పద్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 12 గంటలలోపు నామినేషన్ పరిశీలన, అనంతరం చెల్లుబాటు నామినేషన్ పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఒంటి గంటలోపు నామినేషన్ ఉపసంహరణ, తర్వాత కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరుగుతుందన్నారు. -
డీఈవోగా సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా షేక్ సలీమ్ బాషా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారిగా పని చేస్తున్నారు. మంగళవారం జరిగిన డీఈవోల బదిలీల్లో భాగంగా సలీమ్ బాషా గుంటూరుకు, సీవీ రేణుక ప్రకాశం జిల్లాకు డీఈవోలుగా బదిలీ అయ్యారు. 10 నుంచి టెట్ నిర్వహణ ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఏపీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీ టెట్)కు గుంటూరు జిల్లాలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయంతో పంట వైవిధ్యతను పాటించాలి
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్) : ప్రకృతి వ్యవసాయం చేసి, పంట వైవిధ్యతను పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.పద్మావతి అన్నారు. ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కృషిభవన్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణ సదస్సును జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ పీడీ జి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగు చేస్తున్న పంటల పద్ధతులపై సిబ్బంది అవగాహనతో పని చేయాలని అన్నారు. రసాయన పద్ధతులు పాటిస్తున్న రైతుల్లో కూడా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగించాలని సూచించారు. ఆత్మ పీడీ జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం, యూరియా వినియోగాన్ని తగ్గించే దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. త్వరలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా సందర్శిస్తానని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్రాంత ఐఏఎస్లు విజయ్కుమార్, రాయుడు వీసీ ద్వారా మాట్లాడారు. సదస్సులో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: గుంటూరు నగరంలో జరుగుతున్న రాష్ట్ర ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలలో భాగంగా అరండల్ పేట వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన ప్రతినిధుల సభ మంగళవారం విజయవంతంగా జరిగింది. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పాండా, రైల్వే కార్మిక నాయకుడు వీరయ్య, చేనేత కార్మిక నాయకుడు వెంకట్రావు సభకు అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్బాబు, రాష్ట్ర కోశాధికారి డీవీఎన్ స్వామి, రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎంఎస్ శాంతి, అప్పారావు స్టీరింగ్ కమిటీగా వ్యవహరించారు. సభలో సంస్థ జాతీయ కార్యదర్శి పీకే షాహి మాట్లాడుతూ వేతనాల పెంపు కోసం, శ్రమ దోపిడీని అంతం, కార్మిక వర్గంలో రాజకీయ చైతన్యాన్ని కల్పించడానికి ఏఐఎఫ్టీయూ (న్యూ( కృషి చేస్తుందన్నారు. తెలియజేశారు. సీ్త్ర విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు సి.విజయ, పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జన సాహితి రాష్ట్ర అధ్యక్షుడు దివి కుమార్ తదితరులు సభలో మాట్లాడారు. అనంతరం సంస్థ రాష్ట్ర కార్యదర్శి కిషోర్బాబు ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికను చర్చించిన అనంతరం మహాసభ ఆమోదించింది. గణేష్ పాండా అధ్యక్షుడిగా, కిషోర్ బాబు కార్యదర్శిగా, డీవీఎన్ స్వామి కోశాధికారిగా వివిధ జిల్లాల నుంచి మరో 9 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీని మహాసభ ఎన్నుకుంది. సభలో వివిధ రంగాలు, వివిధ ప్రాంతాల కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంటేషన్ వాచర్లను క్రమబద్ధీకరించాలి మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ప్లాంటేషన్ వాచర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని వాచర్ల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంగళగిరి ఆటోనగర్లోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ అటవీ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. శ్రీధర్కు వాచర్ల సంఘాలు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అంకయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2016లో యూనియన్లతో కూడిన ఒప్పందం మేరకు 7 సంవత్సరాలు సేవ పూర్తిచేసిన వాచర్లను 2019 వరకు క్రమబద్ధీకరించినప్పటికీ అనంతరం ఈ ప్రక్రియ నిలిచిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం క్రమబద్దీకరించిన వాచర్లు నెలకు రూ. 27546/–లు వేతనం పొందుతున్నప్పటికీ తాత్కాలిక వాచర్లకు మాత్రం రోజుకు కేవలం రూ. 597/–లు మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి తేడా లేకున్నప్పటికీ వేతనాల్లో ఉన్న అసమానతలు తొలగించి సమాన ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి యామల మధు, తదితరులు ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్లో జాన్సైదాకు సిల్వర్ మెడల్ ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి పి.జాన్సైదా తాంగ్తా మార్షల్ ఆర్ట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు పాఠశాల హెచ్ఎం ఎల్.సాంబయ్య తెలిపారు. పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి జాన్సైదాను అభినందించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో అనకాపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తాంగ్తా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాన్సైదా సిల్వర్ మెడల్ సాధించాడన్నారు. విద్యార్థి, పీడీ సుజాతను ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ బలోపేతం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాలో క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ను బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకై విసృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రజా భద్రతను పెంపొందించేందుకు, నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ప్రతి రోజు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రధాన కూడళ్లల్లో నిఘా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధాన కూడళ్లు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు, బ్యాంక్లు, పాఠశాలలు, కళాశాలలు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో గస్తీ కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించడం, చోరీలు, అక్రమ కార్యకలాపాలు జరుగకుండా నిరంతరం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకై జిల్లాలోని ప్రధాన రహదారులు, కూడళ్లల్లో పోలీస్ బృందాలు విధుల్లో ఉంటున్నాయని, ప్రమాదాలు వాటిల్లకుండా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని రౌడీషీటర్లు, గంజాయి కేసుల నిందితులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. రూ.12.28 లక్షల బయో ఉత్పత్తులు స్వాధీనం నరసరావుపేట రూరల్: తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.12,28,740 విలువైన బయో ఉత్పత్తులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పార్సిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న వివిధ కంపెనీల బయో ఉత్పత్తులను నిలుపుదల చేశారు. వ్యాపారులు అందజేసిన బిల్లులు, అనుమతి పత్రాలను పరిశీలించిన అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ నుంచి బయో ఉత్పత్తులు రవాణా చేస్తున్నట్టు నిర్దారించారు. ఈ మేరకు రూ.12లక్షల విలువైన 188.8లీటర్ల ఆరు రకాల బయో ఉత్పత్తులను వ్యవసాయ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏవో సీహెచ్ ఆదినారాయణ, సీఐ కె.చంద్రశేఖర్, నరసరావుపేట ఏవో ఐ.శాంతి పాల్గొన్నారు. -
● కాలువలోనుంచి బయటకు తీసి వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ● అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు
సీతానగరంలో రోడ్డుపై మృతదేహం తాడేపల్లి రూరల్: సీతానగరం బకింగ్హామ్ కెనాల్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కనే మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వదిలి వెళ్లిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్ నుంచి ఎన్టీఆర్ కరకట్టకు వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద గోడపక్కనే ఒక మృతదేహం ఉంది. దీంతో ఆ మృతదేహాన్ని నీటిలోనుంచి తీసి బయట పెట్టినట్లు స్థానికులు గుర్తించారు. మృతుని శరీరంపై కేవలం అండర్వేర్ మాత్రమే ఉంది. బకింగ్హామ్ కెనాల్లో మృతదేహం కొట్టుకుని వస్తే ఆ మృతదేహాన్ని ఎవరైనా తీసిఅక్కడ వదిలి వెళ్లారా? లేదా ఏదైనా ఘర్షణ జరిగి నీటిలో ముంచి చంపి అక్కడ వదిలి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహాలను సహజంగా ఎవరూ బయటకు తీయరు. అలాంటిది ఈ మృతదేహాన్ని ఎక్కడ నుంచి అయినా తీసుకువచ్చి ఇక్కడ పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి శరీరంపై దుస్తులు తొలగించి ఈతకు వచ్చినట్లు చిత్రీకరించి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మధ్యకాలంలో సీతానగరం పుష్కర ఘాట్లో సీతానగరం, ప్రకాశం బ్యారేజ్ ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువకులు తిరుగుతూ పలువుర్ని బెదిరించి డబ్బులు లాక్కు వెళ్లారు. ఇలాంటి వారు ఎవరైనా అతన్ని చంపి దుస్తులు లేకుండా నీటిలో ముంచి చంపి బయట పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు పోస్ట్మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని.. ఎవరైనా ఈ మృతుడిని గుర్తిస్తే 08645272186 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. తెనాలిలో స్క్రబ్ టైఫస్ తొలి కేసు తెనాలి అర్బన్: తెనాలిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కావటం కలకలం రేపింది. రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన యాభై ఏళ్ల మహిళకు చర్మంపై మచ్చ కనిపించటం, జ్వరంగా ఉండటతో వైద్యం కోసమని మంగళవారం మధ్యాహ్నం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు స్క్రబ్ టైఫస్ కేసుగా అనుమానించారు. సంబంధిత పరీక్ష కిట్లు ఆసుపత్రిలో లేకపోవటంతో బయటనుంచి కొనుగోలు చేసి తెప్పించారు. ఆ కిట్తో పరీక్ష చేయగా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. -
నిర్మల మనసుతో సేవానిరతి
గుంటూరు మెడికల్: భార్య, భర్త ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు.. జిల్లా విడిచి అమెరికా వెళ్లా రు. వైద్య వృత్తిలో ఆమె బిజీగా ఉండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన రాణించాడు. సుమారు 45 ఏళ్లకు పైగా భార్యభర్తలు ఇద్దరు తమ తమ రంగాల్లో రాణించి, కష్టపడి సంపాదించారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇరువురూ ఏడు పదుల వయ సుకు చేరుకున్నారు. ఈక్రమంలో హఠాత్తుగా భార్య మృతి చెందింది. భార్య జ్ఞాపకాలతో అమెరికాలో ఉండలేక ఆమె మృతిచెందిన మూడేళ్లకు ఇండియాకు వచ్చేశారు. ఇక్కడకు వచ్చిందే తడవుగా తన భార్య చది విన మెడికల్ కళాశాలకు, జీజీహెచ్కు ఏదొకటి చేయా లని తలంచారు. సుమారు మూడు నెలలుకు పైగా గుంటూరు జీజీహెచ్లో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కాట్రపాడుకు చెందిన రాజా కర్ణం. భార్యపై ప్రేమతో.... రాజాకర్ణం భార్య డాక్టర్ నిర్మల వై.కర్ణం అమెరికాలో మానసిక వైద్య నిపుణురాలిగా విశేషమైన సేవలందిస్తూ మూడేళ్ల క్రితం మృతిచెందారు. భార్య మరణంతో మూడు నెలల క్రితం రాజా కర్ణం గుంటూరు జిల్లాకు వచ్చారు. తన భార్య చదువుకున్న గుంటూరు వైద్య కళాశాలలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆరు ఏర్పాటు చేయించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్లో మరో ఆరు ఆర్వో వాటర్ కూలింగ్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసి రోగులకు మంచినీరు, సురక్షిత చల్లటి నీరు తాగేందుకు అవకాశం కల్పించారు. సుమారు రూ.80లక్షలతో వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఆర్వో ప్లాంట్స్ను నిర్మించారు. తదుపరి శుశ్రుత విగ్రహాన్ని జీజీహెచ్ ఓపీ విభాగం వద్ద ఏర్పాటు చేయించారు. ఇటీవల యాంపీ థియేటర్ నిర్మాణం ఆస్పత్రిలో చేపట్టారు. తన భార్య పేరుతో ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణం చేపట్టిన రాజాకర్ణంను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్కు రూ.50లక్షలు, మాతా, శిశు సంరక్షణ వైద్య విభాగానికి(ఎంసిహెచ్) రూ.కోటి విరాళం ఇచ్చారు. జీజీహెచ్కు అనుబంధంగా బొంగరాల బీడులో ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల స్థలంలో సుమారు రూ.15 కోట్లతో తన భార్య పేరుమీదుగా సైకియాట్రీ బ్లాక్ నిర్మాణం చేసేందుకు ముందుకొచ్చారు. చనిపోయిన భార్య పేరు మీదుగా 70 పదుల వయస్సు దాటిన రాజా కర్ణం మూడు నెలలుగా జీజీహెచ్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఎంతో మంది ఆయన్ను అభినందిస్తున్నారు. -
చంద్రబాబు బాగోతం లెక్కలతో బయటపెట్టిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దొంగ లెక్కలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP) అంచనా గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని.. ఈ గణాంకాలు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తయారు చేసినవని అన్నారు.కాగ్ (Comptroller and Auditor General) విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. ఆ గణాంకాలు చెబుతున్నది ఏమిటంటే.. ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉందిఅప్పులు గణనీయంగా పెరిగాయిఅభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోయిందివినియోగం, పెట్టుబడులు పడిపోయాయిరెవెన్యూ, ఫిస్కల్ లోటు ఆందోళనకరంగా పెరిగాయిఅవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయిఈ పరిస్థితుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని జగన్ మండిపడ్డారు. ఆయన అబ్రహాం లింకన్ మాటలను ఉటంకిస్తూ, “కొంతకాలం అందరినీ మోసం చేయవచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు” అని చంద్రబాబుకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే, ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడి ఎందుకు?2014–19లో టీడీపీ పాలనలో GSDP వృద్ధి గొప్పదైతే.. ఇప్పుడు రాష్ట్రం జాతీయ GDPలో వాటా 4.45% మాత్రమే ఎందుకు ఉంది? 2019–24లో 4.78%గా ఉన్న సంగతేంటి?..టీడీపీ పాలనలో రాష్ట్రం వ్యక్తి ప్రాతి ఆదాయ ర్యాంక్ ఒక్క స్థానం కూడా మెరుగుపడకపోవడానికి కారణం ఏమిటి?.. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ నిలదీశారు.టీడీపీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని.. కానీ కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి అబద్ధపు ప్రచారాలు.. 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనుక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించండి అంటూ సమాచారాన్ని ఆయన మంగళవారం ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. 𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025 -
‘బాబూ.. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాగించలేదు’
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న పానుగంటి చైతన్యను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకోవడం అవివేకం. పానుగంటి చైతన్య చేసిన నేరం ఏంటి.. విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడం తప్పా?. గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ ఏడాది చిత్తశుద్ధితో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రిబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులను కాలేజీల యాజమాన్యం వేధిస్తున్నాయి.కళాశాలకు అనుమతించడం లేదు, హాల్ టికెట్ ఇవ్వకుండా, పరీక్షలకు దూరం చేస్తున్నారు. కోర్సు కంప్లీట్ అయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్నారు. చంద్రబాబు పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదం
ఏఎన్యూ(పెదకాకాని): విద్యార్థుల్లో నాయకత్వం, పరస్పర సహకారంతో పాటు స్వీయ అభివృద్ధి, వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదపడతాయని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మూడు రోజుల యువజనోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వర్సిటీ క్రీడా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆచార్య కంచర్ల గంగాధర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. వనరులను సద్వినియోగం చేసుకొని ఆకాశమే హద్దుగా విద్యార్థులు ఎదగాలని ఆయన తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు విద్యార్థుల సృజనాత్మకశక్తి, ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి యువజన ఉత్సవాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయని పేర్కొన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణతో, కళాత్మక నైపుణ్యంతో ముందుకు సాగాలని చెప్పారు. యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ ఆచార్య ఎస్. మురళీమోహన్ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ తదితర అంశాల్లో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. సుమారు 22 కళాశాలల నుంచి 400 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ జి. సింహాచలం, పాలకమండలి సభ్యులు కే సుమంత్ కుమార్, వర్సిటీ ఆర్ట్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సురేష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ పి.పి.ఎస్. పాల్ కుమార్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య తేజోమూర్తి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎన్.వి. కృష్ణారావు, ఆచార్య ఎం. త్రిమూర్తిరావు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
మహోద్యమ చరిత.. మహోజ్వల భవిత
కోటి సంతకాల సేకరణలో దూసుకు వెళ్తున్న పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు : చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై చేపట్టిన పోరాటంలో పొన్నూరు నియోజకవర్గ ప్రజలంతా భాగస్వాములయ్యారు. పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య, విద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పెదకాకాని, చేబ్రోలు, పొన్నూరు మండలం, పట్టణ పరిధిలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబటి మురళీకృష్ణ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, చంద్రబాబు చేస్తున్న మోసాన్ని వివరించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరంచేసి, వైద్యాన్ని ఉచితంగా అందించే కళాశాలలను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ప్రజలకు తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలలో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 65 వేల సంతకాలు సేకరించారు. ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై మండిపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పొన్నూరు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో పాల్గొని కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేపట్టిన ర్యాలీకి వచ్చిన ప్రజాదరణ చూసి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నించి విఫలమైంది. అయినా ప్రజలు వెనుకాడకుండా భారీ సంఖ్యలో ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాల్ని అంబటి మురళీకృష్ణ ప్రసంగాల్లో ఎండగడుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని పూర్తి చేయాల్సింది పోయి ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రజలకు ఆయన వివరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ వైద్యశాలలే ప్రజల ప్రాణాలను కాపాడాయని, ప్రజల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేటీకరణను విరమింపచేయాలని అంబటి మురళీకృష్ణ అధికారులకు విన్నపం చేశారు. రేపు కోటి సంతకాల సేకరణ ర్యాలీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం నియోజకవర్గంలో 65 వేలు పూర్తయిన సందర్భంగా పొన్నూరు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. 10న ఉదయం 9 గంటలకు పొన్నూరు పట్టణంలో, అనంతరం చేబ్రోలు, పెదకాకాని గ్రామాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
అనాథ ఆశ్రమ పిల్లలకు అమృత హెల్త్ స్కీం
హెల్త్ కార్డులు పంపిణీ చేసిన కలెక్టర్ గుంటూరు వెస్ట్: ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం దృష్ట్యా ఎన్టీఆర్ వైద్యసేవ, అమృత హెల్త్ స్కీంను అమలు చేస్తామని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం హెల్త్ కార్డులను చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 39 మంది చిన్నారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో మరణాలు సంభవించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖను సమన్వయం చేసుకుంటూ పంచాయతీ, రెవెన్యూ శాఖలు ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని తెలిపారు. ఈ జ్వరాలకు ఉపయోగించే మందులు ఉప ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
గుంటూరు
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 43.5481 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.1000, గరిష్ట ధర రూ.1600, మోడల్ ధర రూ.1300 వరకు పలికింది. పుస్తకం ఆవిష్కరణ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమింప చేసే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగనన్న అదేశాల మేరకు కోటి సంతకాల సేకరణను మొదలు పెట్టాం. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్దఎత్తున గ్రామస్తులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. –అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, పొన్నూరు 7 -
జీఎంసీలోకి మరో 11 గ్రామాలు
● ప్రస్తుతం విలీన గ్రామాల్లోనే మౌలిక వసతులు శూన్యం ●ఈ నెల 12న కౌన్సిల్ అత్యవసర సమావేశం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ గ్రేటర్ గుంటూరు దిశగా అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. 2012లో నగరం చుట్టూ ఉన్న 10 గ్రామాలను విలీనం చేయగా, తాజాగా 11 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ నెల 12వ తేదీన అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసేందుకు పాలక, అధికార వర్గాలు ముందుకు సాగుతున్నాయి. విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కరువు 2012లో నల్లపాడు, పెదపలకలూరు, అంకిరెడ్డిపాలెం, అడవితక్కెళ్లపాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటూకూరు, బుడంపాడు, రెడ్డిపాలెం గ్రామాలు విలీనం అయ్యాయి. వీటిలో సక్రమంగా తాగునీరు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు విఫలం అయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు 11 గ్రామాలను విలీనం చేస్తే వాటికి కూడా నగరపాలక సంస్థ నుంచే తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. 11 గ్రామాలు ఇవే.. గుంటూరు నగరపాలక సంస్థను గ్రేటర్ గుంటూరుగా చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 11 గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. చల్లావారిపాలెం, చినపలకలూరు, తురకపాలెం, వెంగళాయపాలెం, దాసుపాలెం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, లాల్పురం, మల్లవరం, ఓబులునాయుడుపాలెం, తోకవారిపాలెంలను విలీనం చేసేందుకు పంచాయతీ అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రకటనను నగరపాలక సంస్థ సిద్ధం చేశారు. 12న జరిగే అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆమోదించనున్నారు. తరువాత జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి నివేదిక వెళ్లిన తరువాత ప్రభుత్వం 11 గ్రామాలను విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత
ఏపీ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి తాడికొండ: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత, వినియోగదారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తుందని ఏపీ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి తెలిపారు. సోమవారం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట నాలుగో బ్లాకులో ఏపీ రెరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా భవనాల అమ్మకం, కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ రెరా అధికారిక వెబ్ సైట్ www.rera.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టంపై రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్స్కు విస్తృత స్థాయిలో అవగాహన కోసం ఏపీ రెరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతినెల ఒక జిల్లాలో 2025 డిసెంబర్ పది నుంచి 13 జిల్లాలలో 2026 డిసెంబర్ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఏపీ రెరా డైరెక్టర్ కె.నాగసుందరి మాట్లాడారు. సమావేశంలో ఏపీ రెరా సభ్యులు జగన్నాథ రావు, ఎం.వెంకటరత్నం, డి.శ్రీనివాసరావు, యు.ఎస్.ఎల్.ఎన్.కామేశ్వరరావు, జె.కులదీప్ పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేసి సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరోగ్య కేంద్రానికి తలుపులు వేసి ఉన్న సందర్భంలో 12 మంది ఉద్యోగులను సస్పెన్షన్ చేసిన విషయంపై సోమవారం ఏపీ ఎన్జీవో నేతలు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ను కలిసి మాట్లాడారు. పనివేళలు ముగిసిన పిదప తనిఖీలకు వచ్చిన నేపథ్యంలో అనాలోచితంగా చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసి ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. రాత్రిళ్లు విధులు నిర్వహించే స్టాఫ్నర్సులకు తగిన రక్షణ కల్పించాలని, సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు మర్లపాటి రామకృష్ణ, ఇతర నేతలు కమిషనర్ను కలిసిన వారిలో ఉన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ ఆధ్వర్యంలో స్థానిక వీవీవీ హెల్త్ హబ్లో గత రెండు రోజల నుంచి జరుగుతున్న గుంటూరు ఓపెన్ పికిల్ బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చెందిన టి.నేహా అండర్–14 మిక్సడ్ సింగిల్స్, ఉమెన్ ఓపెన్ సింగిల్స్లో ప్రథమ స్థానాన్ని సాధించి డబుల్ టైటిల్ సాధించింది. ఓపెన్ డబుల్స్లో విన్సెంట్, నాగరాజు విజేతలుగా నిలవగా, పి.ఆనంద్ కుమార్, కె.అరుణ్ కుమార్లు రన్నర్ టైటిల్ను సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాస్టర్ గేమ్స్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ భాస్కరరావు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీవీ రావు మాట్లాడుతూ గుంటూరులో పికిల్ బాల్ క్రీడ యువతను బాగా ఆకర్షిస్తుందని తెలిపారు. రోటరీ క్లబ్ తరఫున ఈ పోటీలను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ అధ్యక్షురాలు ఎం.అనురాధ, ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రోటరీ క్లబ్ సెంటినర్ అధ్యక్షులు డాక్టర్ వీర రాఘవరావు, గుంటూరు ఆదర్శ్ కోశాధికారి జయ శ్రీ, అశోక, జిల్లా పికిల్ బాల్ సంఘం సభ్యులు భరత్, మన్సూర్ వలి, డాక్టర్ హనుమంతరావు, జీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దుబాయి తీసుకెళతానంటూ మోసం
మంగళగిరి టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు మంగళగిరి టౌన్: దుబాయి తీసుకువెళతానని నమ్మించి మోసం చేసిన ఘటన మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణ పరిధిలోని పార్కురోడ్డుకు చెందిన జి.సాయి క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పసుపులేటి సాయికృష్ణ అనే వ్యక్తితో గత 20 సంవత్సరాలుగా పరిచయం వుంది. సాయికృష్ణ గతంలో దుబాయిలో ఉండి వచ్చాడు. దుబాయికి పంపిస్తానని, అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంత ఖర్చు అవుతుందని చెప్పాడు. 2023వ సంవత్సరంలో రూ.లక్ష ఇవ్వమని సాయికృష్ణ అడగడంతో సాయి తన సోదరుని ఫోన్నుంచి ఫోన్ పే ద్వారా రూ.లక్ష నగదును బదిలీ చేశాడు. అప్పటి నుంచి దుబాయికి ఎప్పుడు పంపిస్తావని అడిగితే అదిగో ఇదిగో అంటూ సాయికృష్ణ కాలయాపన చేశాడు. ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వకుండా, నీకు చేతనైనది చేసుకో.. అంటూ బెదిరింపులకు దిగాడు. ఒక పథకం ప్రకారమే దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఉద్యోగం ఇప్పించుకుండా మోసం చేసిన సాయికృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్స్టేషన్లో ఆదివారం బాధితుడు జి.సాయి ఫిర్యాదు చేశాడు. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పెదకాకాని: వెనిగండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్క్రబ్ టైఫస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నట్లు వెనిగండ్ల పీహెచ్సీ వైద్యాధికారి రామాంజిరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన షేక్ రజాక్ నెల రోజులుగా వెనిగండ్ల ముస్లింపాలెంలో నివసిస్తున్నాడు. ఇప్పటి వరకు గ్రామ శివారులోని సుందరయ్యకాలనీలో ఉంటూ క్యాటరింగ్, మండపాల డెకరేషన్ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పడప్పుడు నీరసం, ఆయాసంతో స్థానిక పీహెచ్సీకి వెళుతూ ఉండేవాడు. ఈనెల 3వ తేదీన నీరసంతో వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా వారి సూచన మేరకు అదేరోజు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసి జాయిన్ చేసుకున్నారు. ఈనెల 6వ తేదీన వచ్చిన వైద్య పరీక్షల రిపోర్ట్ ప్రకారం స్క్రబ్టైఫస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. 26 ఏళ్ల రజాక్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ బాజీ, వై.శ్యాంబాబు ఎన్నికయ్యారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సంఘ గుంటూరు జిల్లా 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు నాయకులు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. జిల్లా ఆర్థిక కార్యదర్శిగా బి.హనుమంతప్రసాద్, గౌరవాధ్యక్షుడిగా ఏవీ ప్రసాద్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్లుగా డి.పెదబాబు, ఎస్.రామచంద్రయ్య, డీకే సుబ్బారెడ్డి, వి.ప్రసాదరావు, కె.జోజప్ప, జి.దేవరాజు, జి.మల్లిఖార్జునరావు, డీఏ జోసఫ్ ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు, ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి తోట మాల్యాద్రి నూత కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అధికారిగా వి.భిక్షమయ్య వ్యవహరించారు. -
అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్
● పలు జిల్లాల్లో 150కి పైగా కేసులు ●19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి స్వాధీనం ●వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరి టౌన్: రాత్రిళ్లు ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగలను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ సోమవారం వివరాలను వెల్లడించారు. విశాఖపట్టణానికి చెందిన తోట శివకుమార్ (శివభవాని)పై రాష్ట్రంలో సుమారు 150కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. విశాఖపట్టణానికి చెందిన తోట వరలక్ష్మి శివభవానికి భార్య. భార్యాభర్తలు ఇద్దరూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన షేక్ ఇంతియాజ్తో కలసి పలుచోట్ల దొంగతనాలు చేశారు. ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంతనానికి పాల్పడడంలో వీరు సిద్ధహస్తులు. అక్టోబర్లో తిరుపతి పోలీసులు పలు దొంగతనాల కేసులో శివకుమార్ను అరెస్ట్ చేసి కడప జైలుకు పంపించారు. కడప జైల్లో షేక్ ఇంతియాజ్ పరిచయమయ్యాడని, జైలు నుంచి విడుదల అయిన తరువాత దొంగతనాలు చేసేందుకు ముగ్గురు ప్రణాళికలు రచించినట్లు విచారణలో తేలింది. – మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో తాళం వేసిన ఇంటిని రాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో బంగారం మాటీలు, చెవిదుద్దులు, 6 జతల పట్టీలతో పాటు రూ.20వేల నగదును దొంగిలించి పారిపోయారు. అదేవిధంగా దువ్వాడ, గాజువాక, అనకాపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. యర్రబాలెంలో జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రమంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరుపర్చగా మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. రూరల్ సీఐ ఎ.వి.బ్రహ్మం, రూరల్ ఎస్ఐలు సీహెచ్ వెంకటేశ్వర్లు, బాలు నాయక్, ఏఎస్ఐ రత్నరాజు, కానిస్టేబుల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు
గుంటూరు ఎడ్యుకేషన్: పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు దక్కుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పేర్కొన్నారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో కౌశల్ జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం గావించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాసీ్త్రయ ప్రతిభను పెంపొందించేందుకు కౌశల్ పరీక్షలు దోహదపడతాయన్నారు. జిల్లా కౌశల్ కో–ఆర్డినేటర్ ఎం.సురేష్కుమార్ మాట్లాడుతూ క్విజ్, పోస్టర్, రీల్స్ తయారీ అనే అంశంపై ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 8,9,10 తరగతుల నుంచి పాల్గొన్న 610 మంది విద్యార్థుల్లో ఆరుగురు ప్రథమ, మరో ఆరుగురు ద్వితీయ బహుమతులు పొంది, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ప్రథమ బహమతి రూపంలో రూ.1,500, ద్వితీయ బహుమతి రూపంలో రూ.వెయ్యి నగదు అందజేశారు. ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, పాఠశాల కో–ఆర్డినేటర్లు శాంతిప్రియ, రామాంజనుయులు, రవీంద్రబాబు, నిర్మల, బాలకృష్ణ పాల్గొన్నారు. –క్విజ్ విభాగంలో షేక్ రషీద్ (అంకిరెడ్డిపాలెం), సీహెచ్ మనోహ (వంగిపురం), షేక్ నస్రీన్ (మాచవరం) ప్రధమ బహుమతి, ఎ.వెంకట తనూజ (ప్రత్తిపాడు), పి.ప్రియాంక, ఎం.కీర్తన (కాకుమాను) ద్వితీయ బహమతి సాధించారు. –పోస్టర్ విభాగంలో బి.అమూల్య (అత్తోట), వి.విలియం బాబు (కాకుమాను) ప్రథమ బహుమతి, టి.వాసవి (ముట్లూరు), ఎం.శ్రీవిద్య (సంగం జాగర్లమూడి) ద్వితీయ బహుమతి పొందారు. – రీల్స్ విభాగంలో సయ్యద్ ఖాసిం (వేములూరిపాడు), మహి (గోగులమూడి) ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక -
జిల్లా క్రాస్కంట్రీ ఎంపిక పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్ ఎంపికల పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపిక కావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎంపికై న జట్టు కాకినాడలో ఈనెల 24వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు ఏవీ ఆంజనేయులు, కె.అరుణ్ కుమార్, పీఈటీలు శరత్బాబు, చక్రి, నాగరాజు, మోహన్, శాప్ అథ్లెటిక్స్ శిక్షకులు శివారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే గరం గరం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరుపై మరోసారి నిరసన గళం విప్పారు. ప్రజలు అడిగే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, దీని వల్ల నియోజకవర్గంలో ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. గతంలో జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్లో సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తుపాను ఫాన్ కారణంగా నగరంలో ప్రభుత్వం సాయం అందించే కార్యక్రమాలను కనీసం సమాచారం ఇవ్వకుండానే కమిషనర్, మేయర్ ప్రొగ్రాం డిజైన్ చేయడంపై మండిపడ్డారు. దీనిని ఖండిస్తూ ఎమ్మెల్యే గల్లా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అధికారులను, మేయర్ తీరును కడిగి పారేశారు. రేషన్ డీలర్ల ఆక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాజాగా గుంతల రోడ్డుకు ప్యాచ్ వేసి మరోసారి అధికారుల తీరును ఎండగట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఉన్నారో.. ఏ పని చేస్తున్నారో తెలియడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నా కనీసం తట్ట మట్టి కూడా వెయ్యకపోవడం సిగ్గుచేటని తెలిపారు. స్వయంగా తానే నియోజకవర్గంలో బైక్పై తిరిగి రోడ్ల అధ్వాన పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితిపై ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ అనేక సమీక్షలు నిర్వహించినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని తెలిపారు. తన ఇంటి ముందే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సొంత నిధులతో రోడ్డుపై గుంతలు పూడుస్తానని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు నియోజకవర్గ అభివృద్ధిలో ఫెయిల్ అయ్యారని ఆమె ఆరోపించారు. -
మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ?
తాడేపల్లి రూరల్: మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటి? దుమ్ము లేవకుండా బండరాళ్లు దొర్లకుండా ఎటువంటి గ్యారెంటీ ఇస్తారు? అప్పటివరకు క్వారీ నిలిపివేయాలని ఉండవల్లి దళితవాడకు చెందిన ప్రజలు ఆదివారం రాత్రి క్వారీ నిర్వాహకులను నిలదీశారు. ఆదివారం రాత్రి సమయంలో కొండపై భారీ యంత్రాలతో తవ్వుతున్న క్రమంలో వంద అడుగుల పై నుంచి ఓ బండరాయి దొర్లుకుంటూ ఇళ్లమీదకు వచ్చింది. అక్కడే వున్న ఓ వ్యక్తి పక్క నుంచి ఆ రాయి వెళ్లింది. ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ఆ ఇంట్లో వాళ్లు, కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉండవల్లిలో రాత్రి పగలు తేడా లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు నిర్వహించడంతో గ్రామం మొత్తం దుమ్మ ఏర్పడి ఇళ్లల్లో పేరుకుపోతోందని, వాతావరణంలో గాలి కూడా కలుషితం అవుతోందని, ఇప్పుడేమో రాళ్లు దొర్లుతున్నాయని, మా ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని.. దళితవాడ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలంటూ క్వారీ కింద భాగంలో ఆందోళన చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పాలని చూడగా.. క్వారీలో మట్టి తవ్వకాలు నిలిపివేస్తేనే ఇక్కడి నుంచి వెళతామని చెప్పడంతో తాత్కాలికంగా క్వారీలో మట్టితవ్వకాలను నిలిపివేశారు. అనంతరం తాడేపల్లి పోలీస్స్టేషన్కు వచ్చి జరిగిన సంఘటనపై పోలీసులకు వివరించారు. పోలీసుల నుంచి స్పష్టమైన హామీ రాలేదు. తాత్కాలికంగా నిలిచిపోయిన క్వారీ.... గత సంవత్సరం కాలం నుంచి నిరంతరం ఉండవల్లి క్వారీలో మట్టి తవ్వకాలను నాలుగు భారీ యంత్రాలతో నిర్వహిస్తున్నారు. గ్రామంలో కొంతమంది ఆందోళన చేయడంతో కొండపై వున్న ఆ భారీ యంత్రాలను కిందకి దించివేయడంతో తాత్కాలికంగా క్వారీ నిలిచిపోయింది. నిర్వాహకులు మాత్రం తమకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. గ్రామస్తులు తమ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఉండవల్లి దళితవాడలోకి దొర్లుకుంటూ వచ్చిన బండరాయి కాలనీవాసికి త్రుటిలో తప్పిన ప్రమాదం స్పష్టమైన హామీ ఇచ్చి క్వారీ నిర్వహించాలని నిర్వాహకులను నిలదీసిన స్థానికులు తాత్కాలికంగా నిలిచిపోయిన ఉండవల్లి క్వారీ -
ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. పీజీఆర్ఎస్కు వచ్చిన పలువురు బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించి, వారి విన్నపాలు ఆలకించారు. అర్జీదారుల సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్ణీత వేళల్లో అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులకు సంబంధించి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అన్నారు. అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదన్రావు (సీసీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు. టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు నగరంపాలెం: టీడీపీ నాయకులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరిస్తున్నారని తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదు చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకులు రాత్రిళ్లు ఇంటి తలుపులు కొట్టడం, కాల్ చేయడం వంటివి చేస్తున్నారన్నారు. తన కుమార్తెను, తనను చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
సంతకాల డిజిటలైజేషన్
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు పనితీరును వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛందంగా సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కోటి సంతకాలలో భాగంగా నియోజకవర్గంలో ప్రజల నుంచి సేకరించిన 65 వేల సంతకాలను విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. -
ఖాకీ తండ్రి... కంత్రీ కొడుకు
సాక్షి, నరసరావుపేట: పెడదారిపడుతున్న కొడుకును మందలించి దారిలో పెట్టాల్సిన తండ్రి తనయుడి మోసాలను చూసీచూడనట్టు వదిలేశాడు. కన్న పేగు మమకారంతో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికే నమోదైన కేసుల్లో బయటపడేలా చేస్తుండటం ఆ కొడుకు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఈ క్రమంలో ఈజీ మనీకి అలవాటుపడిన ఓ ఏఎస్ఐ కొడుకు చేసిన నిర్వాకానికి ఏకంగా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట నేషనల్ హైవే రోడ్డు ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠా జాతీయ రహదారిపై వాహనాలు ఆపి నగదు వసూలు చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసు విచారణలో తేలింది. నకిలీ రవాణాశాఖ అధికారుల పేరుతో... చిలకలూరిపేట బైపాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఈనెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వినుకొండ రూరల్ మండలంలో అయ్యప్పస్వామి భజనకు హాజరుకావడానికి గుంటూరు నుంచి వెళ్తున్న కారు ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న ట్రాలర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాలర్ను ముందుగా వెళ్తున్న కారులోని వ్యక్తులు ఆపడంతో ప్రమాదం జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు విచారణ చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠా ట్రాలర్ను ఆపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నరసరావుపేటకు చెందిన ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడు, చిన్న తురకపాలేనికి చెందిన ఎస్కే బాషా, బాలయ్యనగర్కు చెందిన వెంకట్రావ్, నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన గోపి, మహేష్ లు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరికి పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నలుగురు తమకేమీ తెలియదని బుకాయించినప్పటికీ, ఒకరు మాత్రం నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. హైవేపై వెళ్తున్న లారీలను రవాణాశాఖ అధికారుల పేరిట ఆపి నగదు వసూలు చేయడం కోసమే ఆపాం అని, అయితే అనుకోని విధంగా ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చినట్టు తెలియవచ్చింది. పోలీసు దందాలకు నాయకుడు రౌడీషిటర్ ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఏఎస్ఐ కుమారుడిపై నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో రౌడీషిట్ నమోదై ఉంది. పదుల సంఖ్యలో చీటింగ్, చోరీలు, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపరణలో కేసులు నమోదయ్యాయి. ఇటువంటి రౌడీషిటర్లను తరచూ పోలీసుస్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుండాలి. ఈ పోలీసు కంత్రీ కుమారుడిని ఇటీవల కాలంలో స్టేషన్కి పిలిచి కౌన్సెలింగ్ చేపట్టిన దాఖలాలు లేవని రూరల్ పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తండ్రికి ఉన్నతాధికారులతో ఉన్న సత్ససంబంధాలతో రౌడీషిటర్ల కౌన్సెలింగ్కు వెళ్లాల్సిన పనిలేకుండా సెట్ చేశారట. గతేడాదిగా సదరు రౌడీషిటర్తో పోలీసు ఉన్నతాధికారులు మామూళ్ల వసూళ్లకు ఏజెంట్గా నియమించినట్టు తెలుస్తోంది. నెలవారీ మామూళ్లను ఈ రౌడీషిటరే తండ్రి తరపున వెళ్లి బెదిరించి మరీ వసూళ్లు చేసేవాడని పోలీసు వర్గాలే చెప్పుకొస్తున్నాయి. తమ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు అండతో తండ్రీకొడుకులు రెచ్చిపోయారని, అయినా ఏం చేయలేక మిన్నుకుండిపోయామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సదరు ఏఎస్ఐపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కోటప్పకొండ వద్ద రూ.40 లక్షలు మోసం చేసిన ఘటనలో తండ్రీకొడుకులను శిక్షించి ఉంటే ఈ సమస్య వచ్చేంది కాదని అంటున్నారు. ఇతని బా«ధితులు నరసరావుపేటలో పదుల సంఖ్యలో ఉన్నా తండ్రి అధికారంతో బా«ధితులు బయటకు రావడానికి భయపడుతున్నారు.


