breaking news
Guntur
-
‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’
సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్మీట్లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ప్రచార ఆర్భాటంతో సరి:కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.2016 నాటి చట్టం అమలు చేయాలి:ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసేవారు.కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియరింగ్ యంత్రాలు, బ్లైండ్ పర్సన్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్షిప్స్ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?:వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరు
సాక్షి, పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 98 రోజుల పాటు పిన్నెల్లి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి సర్కార్ అక్రమ కేసు బనాయించింది. -
రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
సాక్షి, తాడేపల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రేపు(మార్చి 19, గురువారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.ఉగాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలన్నారు.‘‘సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి’’ అని వైఎస్ జగన్ అభిలషించారు. -
జర్నలిస్టులకు అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ(బుధవారం, మార్చి18) హైదరాబాద్ జర్నలిస్ట్ కె.వెంకట్రామి రెడ్డి (కేవీఆర్) కలిశారు. తనను కర్నూలు పోలీసులు వేధించిన తీరును ఆయన వివరించారు. హైకోర్ట్లో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో విడుదల చేసినట్టు కేవీఆర్ తెలిపారు.తప్పుడు కేసులపై ఆందోళన చెందవద్దన్న వైఎస్ జగన్.. న్యాయపోరాటం చేద్దామనీ, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. -
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
‘ముస్లింలను చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది’’ అని అంజాద్ బాషా గుర్తు చేశారు.‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్ బాషా నిలదీశారు.‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304 కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గ్యాస్ కొరత లేదు...
గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం స్థానిక బస్టాండ్ దగ్గరలో ఉన్న ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎల్.పి.జి. ఏజెన్సీని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న వినియోగదారులతో ముఖాముఖీ మాట్లాడి ఎప్పుడు బుక్ చేశారో తెలుసుకొని, బుధవారం ఉదయం నాటికి సిలిండర్ పంపిణీ చేయాలని గోడౌన్ ఇన్చార్జిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అనవసరమైన ఆందోళనతో గ్యాస్ బుక్ చేయవద్దని వినియోగదారులను కోరారు. కొందరు డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంగా ఉన్నారని ఫిర్యాదు చేయగా, వారి పనితీరు మార్చుకోనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ బుకింగ్లకు సంబంధించి కొండపల్లి ప్లాంట్ నుంచి లోడ్ వస్తుందని, బుధవారం నుంచి ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందు పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని గోడౌన్ ఇన్చార్జి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ కోమలి పద్మ, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
న్యాయస్థానమే ఆదుకుంది
మంగళగిరి టౌన్: పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల యాజమాన్యం వ్యవహరించిందని హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ అన్నారు. ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల 2024– 25లో 83 మంది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ మార్కుల జాబితాలు జారీ చేయని నేపథ్యంలో వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిల్లలకు ఒరిజినల్ మార్కుల జాబితాలను అందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై పిల్లల తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ, పిల్లల తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్ బేతపల్లి మాట్లాడుతూ, 2024–25లో నిర్మల సీబీఎస్ఈ పాఠశాల నందు పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగిందని తెలిపారు. ఈనెల 9వ తేదీన జస్టిస్ న్యాపతి విజయ్ రెండు వారాల లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పు ఇవ్వటం సంతోషించదగ్గ విషయమని అన్నారు. హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ -
యడ్లపాడులో జాతీయస్థాయి నాటిక పోటీలు
యడ్లపాడు: కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు కళానిలయం, తెలుగు నాటక కళా పరిషత్తుల సంఘం వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ కళాజాతరకు యడ్లపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కళా ప్రాంగణం వేదిక అవుతుందన్నారు. ప్రతిరోజు మూడు చొప్పున ప్రధాన నాటికలతో పాటు ఒక ప్రత్యేక ప్రదర్శన ప్రేక్షకులను అలరించనున్నాయని వెల్లడించారు. యడ్లపాడు: మండల పరిధిలోని బోయపాలెంలో విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉన్నవ గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న విశ్వథన్ హోటల్పై మంగళవారం అధికారుల బృందం ఈ దాడులు నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి, వాటిని సీజ్ చేసి, యడ్లపాడులోని వీణా గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. హోటల్ యాజమాన్యంపై స్థానిక తహసీల్దార్ 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో యడ్లపాడు మండల డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, రెవెన్యూ ఇన్న్స్పెక్టర్ సుబ్బారావు, ఉన్నవ గ్రామ వీఆర్వో జగన్మోహనరావు, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: సమాజానికి చేటు కలిగించే బాల్య వివాహాల నివారణే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. గత నవంబరు 27వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించాల్సిన ప్రత్యేక కార్యాచరణ పై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికల ఆరోగ్యం పెద్ద సమస్యగా మారుతుందని, యుక్త వయసులోనే కుటుంబభారం పడుతుందని, జీవితం అంటే ఏమిటో తెలిసే సమయానికి జీవితం చరమాంకానికి చేరుతుందని అన్నారు. సమాజంలో బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ నిర్మాణంలో వారికి కీలక పాత్ర అందేటట్లు సహకరించాలని తెలిపారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరియైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ బాల్య వివాహిత రహిత గ్రామాలుగా గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలను తీర్మానించే క్రమంలో ఆ శాఖకు చెందిన వివిధ స్థాయిలలోని బాల్య వివాహ నిషేధిత అధికారులు తమ బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఎక్కువసార్లు బడికి హాజరు కానీ పిల్లలపై దృష్టి పెట్టి, అటువంటి పిల్లలు బాల్య వివాహ బాధితులు కాకుండా విద్యా సంస్థలు అన్నిటిలో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మునిసిపల్ అధికారులు, మండల, గ్రామ, వార్డు అధికారులు పాల్గొన్నారు. -
రూ.1.15 కోట్లకు మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : సుమారు రెండేళ్లకుపైగా మిర్చి డబ్బులు కోసం కాళ్లు అరిగేలా పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తున్నామని బాధిత మిర్చి రైతులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా తనగల గ్రామ వాసులు బోయ నారాయణ, పచ్చర్ల రాజు, ఈడిగ నరసింహగౌడ్, కురవ వెంకటేశ్ (సర్పంచ్), ఉప్పర లక్ష్మణ (షాబాదా గ్రామం)లు మంగళవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత రెండేళ్లుగా చవి చూసిన కష్టాలను మొరపెట్టుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందించారు. అనంతరం మిర్చి బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరులోని రెండు చిల్లీస్ ట్రేడింగ్ సంస్థల నిర్వాహాకులకు మిర్చి బస్తాలు పంపించేవాళ్లమని అన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం 2,300 మిర్చి బస్తాలు తీసుకురాగా, ప్రస్తుతం ధరలేదని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేయాలని నిర్వాహాకులు సూచించారని చెప్పారు. వారి చెప్పినట్లుగానే సదరు స్టోరేజీలో నిల్వ చేశామన్నారు. నిర్వాహాకులను డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అంటూ దాటవేశారు. దీంతో అనుమానం వచ్చి స్టోరేజీలో ఆరాతీయగా మా పేర్లపై మిర్చి బస్తాల్లేవని, నిర్వాహాకులు, వారి కుటుంబ సభ్యులపై ఉన్నాయని అన్నారు. మేమంతా మోసపోయిన గుర్తించి నిర్వాహాకులను గట్టిగా అడిగితే, మిర్చి విక్రయించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీనికిగాను చెక్కులు, ప్రామిసరీనోట్లు, రూ.100ల అగ్రిమెంట్లు రాసిచ్చారని అన్నారు. అలాగే గుంటూరు లాలుపురంలో స్థలం, కర్నూలులో ఎకరంన్నర పొలం విక్రయించగా వచ్చే డబ్బులు చెల్లిస్తామని బురిడి మాటలు చెప్పారని వాపోయారు. అయితే ఆ చెక్కులు, అగ్రిమెంట్ ఇతరత్రా కాగితాలు వల్ల ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్సి మోసగించి, రూ.1.15 కోట్లు చెల్లించకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రం నుంచి వందలాది కి.మీ ప్రయాణించి గుంటూరు వస్తుంటే సదరు ట్రేడింగ్ నిర్వాహాకులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. సదరు ట్రేడింగ్ కంపెనీల నిర్వాహాకులను నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. -
గోలివాగులో సంచరిస్తున్న మొసలి
రెంటచింతల: మండలంలోని గోలి గ్రామ సమీపంలోని గోలివాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోలి వాగు బ్రిడ్జిపై మొసలి సంచరిస్తున్న విషయం గమనించిన గ్రామస్తులు తహసీల్దార్ దొప్పలపూడి మేరి కనకం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్, అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియచేసి వాగు సమీపంలో హెచ్చరిక ప్లెక్సీ ఏర్పాటు చేయించారు. ప్రతి రోజు వాగులో దుస్తులు శుభ్రం చేసే మహిళలకు, ఈ రహదారిపై నుంచి జెట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్కు వెళ్తున్న గోలి గ్రామానికి చెందిన విద్యార్థులకు, గ్రామ సమీపంలో నాపరాయి క్వారీ కార్మికులకు, నాగమయ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, వాగులో పశువులకు దాహార్తిని తీర్చేందుకు వచ్చే పశుపోషకులు ఈ వాగులో మొసలి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్బన్: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కాయల్ప బృందం మంగళవారం సందర్శించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, క్వాలిటీ మేనేజర్ వాసుబాబు, క్వాలిటీ కన్సల్టెంట్ వాసు రాజు తతదితరులు ఆసుపత్రిలోని పలు వార్డులు, ఓపీ సేవలు, ల్యాబ్, రేడియాలజీ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలువురు అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్డర్ సౌభాగ్యవాణి, ఆర్.ఎం.వో డాక్టర్ మల్లిఖార్జునరావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తల్లి మందలించిందన్న కారణంలో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన మన్నవ తిరుపతయ్య(35) బేలుదారు పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుంతా మద్యంకే వాడేస్తుండడంతో తల్లి సోమవారం మందలించింది. మనస్తాపానికి గురై పురుగులమందు తాగిన అతన్ని కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. మృతుడి భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. -
హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
నరసరావుపేట: వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతోపాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులు, సమాజానికి మెరుగ్గా వివరించగలరని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరా అధికారి ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అది సకాలంలో, సరైన తూకంతో వస్తోందా, లేదా అని గమనించాలని కోరారు. సమావేశంలో భాగంగా ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల యంత్రాలను ప్రదర్శించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను ఎలా గుర్తించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. వినియోగదారుల హక్కులపై రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీఐ సంస్థ ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆచార్య... ఉద్యోగినులపై వేధింపులు ఆగవా?
పాట్లు పట్టని పాలకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఓ సదస్సు విషయంలో సీనియర్ మహిళా ఆచార్యులు గవర్నరుకు ఫిర్యాదు... పీహెచ్డీ సంతకం వ్యవహారంలో మరో మహిళా ప్రొఫెసర్కు వేధింపులు... ఇలా ఏఎన్యూలో ఇన్చార్జి పాలనలో మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కొందరి తీరుతో ఆవేదన చెందుతున్నారు. పదవుల కోసం పాకులాడటం తప్ప. విశ్వవిద్యాలయం భ్రష్టుపడుతున్నా పట్టించుకోని తాత్కాలిక పాలకుల ఉదాసీనత యూనివర్సిటీ ప్రతిష్టను మంట కలుపుతోంది. గత 18 నెలల తాత్కాలిక పాలకుల హయాంలో కొందరు మహిళా ఉద్యోగులు రాత పూర్వకంగా, మరి కొందరు మౌఖికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. తమ పదవులు నిలుపుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తున్న వివాదాస్పద అధికారులు విద్యావ్యవస్థను దిగజారుస్తున్నారు. మహిళలపై బాడీ షేమింగ్కు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. వారి వెతలెన్నో.. వర్సిటీలో గత ఏడాదిన్నర పాలనలో అనేక మంది మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక ఉన్నతాధికారి అండతో బాడీ షేమింగ్కు పాల్పడటం, మహిళలను దూషించటం, బెదిరించటం చేసినా పట్టించుకునే నాథుడే లేరని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వర్సిటీలోని ఒక కీలక వ్యక్తిపై సీనియర్ మహిళా అధ్యాపకురాలు ఒకరు గవర్నరుకు, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆ మహిళా ఆచార్యురాలికి అవమానం జరిగినా స్పందన లేదు. పీహెచ్డీ వ్యవహారంలో ఒక మహిళా ప్రొఫెసర్ను నిబంధనలకు విరుద్ధంగా సంతకం చేయాలని ఓ అధికారి ఒత్తిడికి గురిచేశారు. సదరు వ్యక్తిపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా స్పందన లేదు. ఒక దళిత మహిళాధికారిపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ఒకరు దూషించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు లేవు. దూరవిద్యలో గత అక్టోబరు నెలలో ఒక మహిళా అధికారి నాన్ టీచింగ్ ఉద్యోగిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇటీవల ఒక మహిళా ప్రొఫెసర్పై నేరుగా ఒక వివాదాస్పద వ్యక్తి వాగ్వివాదానికి దిగినా ఇతర ఆచార్యులు ప్రేక్షకుల్లా వ్యవహరించారేగానీ వర్సిటీకే శాపంగా మారిన సదరు అయ్యవారిని ఇదేం తీరు అని ఒక్క మాట అనలేదు. పరీక్ష భవన్లో ఒక నాన్ టీచింగ్ ఉద్యోగి కిందిస్థాయి మహిళా ఉద్యోగిని వేధించినా పట్టించుకోలేదు. ఒక అధికారి ఉద్యోగులతో సమావేశాలు పెట్టడం, సంబంధం లేని విషయాలు చెప్పి అసభ్య పదజాలం వాడుతున్నారని ఆ విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగులే వాపోతున్నారు. ఇన్చార్జి వీసీ పాలనలో ఒక మహిళా స్కాలర్ను ప్రొఫెసర్ కారుతో ఢీకొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని సంగతి తెలిసిందే. ఇన్చార్జి అధికారుల పాలనలో ఏఎన్యూలోని పాలన పూర్తిగా పక్కదారి పట్టింది. కొందరు వివాదాస్పద అధికారులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పేట్రేగిపోతున్నారు. ఎడ్యుకేషన్ ఫర్ సేల్ అంటూ వ్యాపారంగా మార్చినా, మహిళా ఉద్యోగులను దూషించినా వారికే కమ్మని న్యాయం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశించినా పచ్చ పైత్యంతో వర్సిటీకి శాపంగా మారిన కళంకిత అధికారులకు కొమ్ముకాస్తున్నారు. ఏఎన్యూ అన్ని విధాల అప్రతిష్ట పాలయినా, విద్యను వ్యాపారంగా మార్చినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. -
గుంటూరు మెడికల్ కాలేజీకి డబుల్ విజయం
– జాతీయ సదస్సులో రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుంది. కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులు జాతీయ సదస్సులో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించడం విశేషం. డాక్టర్ నమ్రితా ఓరల్ ప్రెజెంటేషన్లో ప్రథమ బహుమతి సాధించగా, డాక్టర్ వీణ ప్రియా పోస్టర్ ప్రెజెంటేషన్లో మొదటి స్థానం దక్కించుకుని కాలేజీకి గర్వకారణమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మంగళవారం విజేతలను అభినందించారు. కార్యక్రమంలో అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, ప్రొఫెసర్ – ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ పూర్ణమ్మ, ఇతర అధ్యాపకులు, సహాయ ఆచార్యులు, పీజీ వైద్యులు పాల్గొన్నారు -
మరో బాలుడిపై కుక్కల దాడి
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలోని నల్ల చెరువులో కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులపై దాడులకు తెగబడుతున్నాయి. కొద్దిరోజుల కిందట నల్లచెరువులో ముగ్గురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఆ చిన్నారులు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. ఆ సందర్భంలో నల్లచెరువు వాసులంతా కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి కమిషనర్ చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. అధికారులు వారికి నచ్చచెప్పి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మంగళవారం మరో బాలుడి పై కుక్కలు దాడి చేసి గొంతు, తలపై గాయపరిచాయి. దీంతో బాలుడిని వెంటనే కుటుంబ సభ్యులు పెద్దాసుపత్రికి తరలించారు. అనంతరం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. -
టీటీడీ చైర్మన్ను తొలగించండి
చంద్రబాబు సర్కారు తీరుపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులుపట్నంబజారు (గుంటూరు ఈస్ట్): అప్రజాస్వామికంగా, అత్యంత పాశవికంగా తిరుపతిలో మహిళలను అరెస్ట్ చేసి, వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తక్షణమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
శ్రీరామ పట్టాభిషేక అలంకారం
మంగళగిరి టౌన్ : మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారు భక్తులకు శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవ కై ంకర్యపరులుగా గుంటూరుకు చెందిన కారుమంచి మురళీసాయి, సోదరులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన యేనుగ కిషోర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు గోవాడలో కోటి కుంకుమార్చన అమృతలూరు(భట్టిప్రోలు): గోవాడలో ప్రసిద్ధి గాంచిన గంగ పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి కుంకుమార్చన సామూహిక లలిత పారాయణం జరగనున్నట్లు చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ఇప్పటి వరకు 7 అమావాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో 18వ తేదీన ఫాల్గుణ అమావాస్య మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, ఎస్ఎస్ఎఫ్ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా వీరభద్రుడి పూజ, గవ్యాంత పూజలు, తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలను ఎస్ఐ అపర్ణ సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతం నుంచి రెండు లారీలు నల్ల మట్టితో విజయవాడ వెళ్తుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాటికి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తెనాలిలో పర్యటించిన ఢిల్లీ బృందం తెనాలిఅర్బన్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని బృందం తెనాలిలో మంగళవారం పర్యటించింది. ఆదిత్య శుక్లా నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులు బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డును పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వాహణపై ఆరా తీశారు. వర్మీ, ఆర్గానిక్ కంపోస్టు, కోకో పిట్ కేంద్రాన్ని, ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.ఆర్.అప్పల నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఏఈ సునీల్, పంచాయతీ రాజ్ డీఈ శివరామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్ స్పందించాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు...మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారు: భూమన
సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్తో మొదలై... పుట్టా మహేష్తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్...మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీదా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్లు చూస్తే నో యాక్షన్. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్ : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కేడర్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వైఎస్ జగన్ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి, పార్లమెంటు ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జగన్ది మాత్రమే కాదు.. వైఎస్సార్సీపీ అంతా కలిసి కట్టుగా నిర్మించుకున్నాం. వైఎస్సార్సీపీ విలువలు,విశ్వసనీయత మీద పుట్టింది. అదే పునాదుల మీద కొనసాగుతోంది. గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్,మనం మంచి చేశాం. కాబట్టే ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నాం. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడా ప్రజలు గుర్తించారు. ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అవినీతి కోసం మాత్రమే వాళ్లు అధికారంలో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రాన్ని ఇచ్చినట్లు బాబు బిల్డప్. వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసి అప్పగించారు. కేవలంలో ఖజానాలో రూ.100కోట్లు మాత్రమే ఉంచారు. తర్వాత కోవిడ్ లాంటి కష్టాలు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా ఒత్తిళ్ల మధ్య మన పరిపాలన సాగింది. ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ వదిలి పెట్టలేదు. దేశ చరిత్రలో జరగని విధంగా హామీలు అమలు చేశాం. ముందుగానే క్యాలండర్ ఇచ్చి హామీలను అమలు చేశాం. బడ్జెట్లో క్యాలెండర్ పెట్టి పథకాలు అమలు చేశాం. పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నాం. మన హయాంలో రూ.3.31లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.2.7లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశాం. రెండేళ్లకే చంద్రబాబు కమిటెడ్ అప్పులు.. గ్రాస్ అప్పులు రెండేళ్లకే రూ.3.30లక్షల కోట్లు దాటాయి. చంద్రబాబు హామీలు మోసాలుగా తేలిపాయాయి’అని వైఎస్ జగన్ అన్నారు. ’మన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లిపోయాయి. జగన్ ఏం చేయగలిగాడు. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడని చర్చిస్తున్నారు. అవినీతికి తావు లేకుండా మనం పథకాలు అమలు చేశాం. ఇప్పుడు దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే కొనసాగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి. భూములను శెనక్కాయలకు, బెల్లానికి ఇచ్చేస్తున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డారు. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనే. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణం. చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించడం లేదు. మోసం చేశారని బాధితురాలు సీఎంకు ఫిర్యాదు చేస్తే కమిటీలు వేస్తామంటున్నారు. ఆదిమూలం మహిళపై లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్పై వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై నో యాక్షన్. మహిళలకు అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీద కూడా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్తో పట్టుబడితే నో యాక్షన్. తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతు, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే నో యాక్షన్.తన బావమరిది మహిళలపై నీచంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని బాబు అన్నారు. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు. చంద్రబాబుకు ఇక మిగిలింది రెండేళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలున్నాయి. మధ్యలో నా పాదయాత్ర కూడా ఉంటుంది. జగన్ 220లో కార్యకర్తలకు పెద్దపీట. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి’ అని అన్నారు. -
గాలికి ఎగిరిపోయిన టెన్త్ ఓఎంఆర్ షీటు
తాడేపల్లి రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా గాలి రావడంతో ఓ విద్యార్థి దగ్గర నుంచి ఆప్టికల్ మార్క్ రికగి్నషన్ (ఓఎంఆర్) షీటు ఎగిరిపోయింది. పది నిమిషాల వెతుకులాట అనంతరం దానిని ఓ కానిస్టేబుల్ పట్టుకుని ఇవ్వడంతో విద్యార్థి ఊపిరిపీల్చుకున్నాడు. తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో సోమవారం జరిగింది. తాడేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ నంబర్ గదిలో తలుపు పక్కనే కూర్చుని ఓ విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు. ఒక్కసారిగా గాలి ఎక్కువగా రావడంతో అతడి ఓఎంఆర్ షీటు కింద పడింది. దీంతో కంగారు పడిన ఆ విద్యార్థి జరిగిన విషయాన్ని అక్కడున్న ఉపాధ్యాయులకు చెప్పాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రవి..సూ్కల్ వెనుక భాగంలో వెతికినప్పటికీ ఓఎంఆర్ షీటు దొరకలేదు. అతడితో పాటు ఎగ్జామ్ సెంటర్ వద్ద వేచి ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా 10 నిమిషాల పాటు ఓఎంఆర్ షీటును వెతికారు. పాఠశాల బిల్డింగ్కు చిన్నపాటి సన్షేడ్ ఉండటంతో దానిపై ఉందేమోనని అనుమానంతో రవి వేరే బిల్డింగ్ ఎక్కి పరిశీలించగా అక్కడ ఓఎంఆర్ షీటు కనపడింది. వెంటనే ఆయన కిందకు దిగి పాఠశాలలో కర్రకు కట్టి వున్న చీపురు తీసుకుని కిందకు ఊడ్చాడు. బిల్డింగ్ వెనుక పెద్ద డ్రైనేజీ ఉండటంతో ఆ షీటు దానిలో పడుతుందని తల్లిదండ్రులు డ్రైనేజీపై నిలబడి ఓఎంఆర్ షీటును పట్టుకున్నారు. అనంతరం దాన్ని విద్యార్థికి ఇవ్వడంతో అతడు పరీక్ష రాశాడు. -
రాడ్ బెండింగ్ కార్మికుడు అనుమానాస్పద మృతి
తెనాలి రూరల్: రాడ్ బెండింగ్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన రాడ్ బెండింగ్ కార్మికుడు నారాయణ నరేంద్ర, శ్రీవాణి ప్రేమించుకుని 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పనుల కోసం తెనాలి వచ్చి ఇక్కడి నందులపేట లెనిన్ రోడ్డులో నివసిస్తున్నారు. ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఆదివారం రాత్రి అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి దాటాక మెలకువ వచ్చి చూడగా భర్త ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఉన్నాడని, తెలిసిన వారికి చెప్పి వైద్యశాలకు తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని శ్రీవాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టూ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద సోమవారం కేసు నమోదు చేశారు. -
నేతి వెంకన్న స్వామికి మొక్కులు తీర్చుకున్న అంబటి
రాజుపాలెం: పల్నాడు జిల్లా దేవరంపాడు కొండపై స్వయంభూగా మత్య్సరూపంలో వెలసిన నేతి వెంకన్నస్వామిని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిలు సోమవారం కొండకు విచ్చేసి దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబును, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిలను నాయకులు, కార్యకర్తలు దుశ్శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం మత్య్సరూపంలో ఉన్న నేతి వెంకన్నస్వామి వద్ద పూజారులు మంత్రోచ్ఛారణ నడుమ పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందించారు. వారి వెంకట పార్టీ మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దొంతిరెడ్డి సునీత శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి చంద్రమౌళి తదితరులు ఉన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్ : మంగళగిరి మండలంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం ఆత్మకూరు హనుమాన్నగర్కు చెందిన వెంకట సాయిరామ్ తన భార్యతో కలసి శనివారం రాత్రి నులకపేటలోని అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం తన ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరచి ఉంచడం గమనించి లోపలకు వెళ్ళాడు. బీరువా తాళాలు పగలకొట్టి బట్టలు చిందరవందరగా పడవేసి ఉండడం గమనించాడు. బీరువాలో వున్న సుమారు 2 లక్షల నగదుతో పాటు 3 బంగారపు ఉంగరాలు, జత చెవి కమ్మలు, ఒక వెండి గిన్నె చోరీకి గురైనట్లు గుర్తించాడు. బంగారం సుమారు 20 గ్రాముల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమాచారం ఇవ్వడంతో మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దుచేయాలి
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు తెనాలి: కేంద్ర పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషనన్ చట్టం–2025ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తెనాలి హెడ్ పోస్టాఫీసులో జరిగిన తెనాలి డివిజన్ పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ల వార్షిక సమావేశానికి డివిజనల్ అధ్యక్షులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎన్.నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్రప్రభుత్వ పెన్షనర్లు అందరినీ 8వ వేతన సంఘ పరిధిలోకి తీసుకోవాలని, 8వ వేతన సంఘాన్ని 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనుకూలంగా సీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను వెంటనే అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక డివిజనల్ కార్యదర్శి ఎల్.ప్రసాదరావు, కోశాధికారి పి.జోనేష్, రషీద్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 8వ కేంద్ర వేతన సంఘ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కోరిన ప్రశ్నావళి గురించి వివరించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పెన్షనర్ల డివిజనల్ కార్యదర్శి ఎన్జీ ఘోష్, పెన్షనర్ల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.తిరుమలరావు, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల నాయకులు శివ మాట్లాడారు. తదుపరి 70–90 ఏళ్లు నిండిన సంఘ సభ్యులను గౌరవంగా సత్కరించారు. తాడేపల్లిరూరల్: అగ్ని సాక్షిగా తాళి కట్టి భార్యను చేసుకున్న భర్త తనను వదిలివేయడంతో, తనకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులతో కలసి భర్త ఇంటి ముందు సోమవారం నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎస్వీ అపార్ట్మెంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు... కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చైతన్యకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన యర్రంనేని విజయ్తో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. 2019లో వీరికి కుమారుడు జన్మించాడు. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారంటూ విజయ్ భార్యను వదిలివేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత భర్త, అత్తమామలు బాబును చూసేందుకు వచ్చారు. భార్యను కాపురానికి తీసుకు వెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని ఎన్నిసార్లు వేడుకున్నా అత్తమామలు, భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రు, తాడేపల్లి పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదు. దీంతో 2020లో కోర్టును ఆశ్రయించింది. కాపురానికి తీసుకువెళ్లాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. తమకు సంబంధం లేదంటూ అత్తమామలు కూడా చేతులెత్తేశారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తెలిసిన బంధువుల ద్వారా ఆరా తీస్తే ఆయన హైదరాబాదులో వేరే యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఫారిన్ వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని తెలుసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం కుంచనపల్లిలోని అపార్ట్మెంట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆందోళనకు దిగింది. బాధితురాలు చైతన్య తండ్రి చౌదరి మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో 2025 డిసెంబర్లో జరిగిన బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్కు 925 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 795 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్కు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి, రీవాల్యుయేషన్ దరఖాస్తులను 26వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలని ఆలపాటి తెలిపారు. -
మొక్కజొన్నకు మద్దతు ధర ఏదీ ?
పొన్నూరు: రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల నుంచి మొక్కజొన్న పంటను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవసరమైన అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ● ఈ రబీలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈసారి 29, 298 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారన్నారు. ఒక్క పొన్నూరులోనే సుమారు 25 వేల ఎకరాలలో సాగు చేయగా, నియోజకవర్గంగా చూస్తే మొత్తంలో 40 వేల ఎకరాలలో పంట పండించారన్నారు. ఎప్పుడు కూడా రాష్ట్రంలోనే మొక్క జొన్న అధిక విస్తీర్ణంలో సాగు చేసే నియోజకవర్గంగా పొన్నూరుకు గుర్తింపు ఉందన్నారు. ● అలాంటి పంటకు క్వింటాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 కూడా అందడం లేదని అన్నారు. ● దళారుల ప్రభావాన్ని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల నుంచి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ రైతుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ● చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానం ప్రకారం ధరల స్థిరీకరణ నిధి అమలు చేయకపోవడంతోనే రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ● రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. ● ప్రస్తుతం ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ● కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.2400 చొప్పున రైతులకు అందాల్సి ఉండగా, వ్యాపారస్తులు క్వింటాకు రూ.1700 మాత్రమే అందించి, వారు ప్రభుత్వానికి మాత్రం రూ.2400 చొప్పున విక్రయిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ● దళారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి మార్కెట్ యార్డ్, మార్క్ఫెడ్ రంగంలోకి దించి రైతుల వద్ద నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, అలాగే అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిపించాలని అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. -
31న గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 31వ తేదీన జరుగుతాయని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగళ శెట్టి శివ సూర్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16,17 తేదీల్లో నామినేషన్ల దాఖలు, 23 ఉపసంహరణకు తుది గడువు.. అదేరోజు సాయంత్రం 4 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. 31వ తేదీ ఎన్నికలు.. అదేరోజు సాయంత్రం లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక, జనరల్ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 22లోపు సాయంత్రం 3.00 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పనిదినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్దిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు. గుంటూరు రూరల్: వాణిజ్య అవసరాలకు, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా రూరల్ మండలం దాసరిపాలెంలో బ్లూ వేల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో తనిఖీ చేయగా 4 గృహ వినియోగ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చౌడవరం లలితాపీఠం వద్ద చెన్నుపాటి వీరయ్య అనే వ్యక్తి వద్ద తనిఖీ చేయగా 10 గృహ వినియోగ సిలిండర్లు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేశారు. తక్కెళ్లపాడు వద్ద గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో తనిఖీ చేసి 3 గృహ వినియోగ సిలిండర్లు అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలలో మొత్తం 17 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి స్థానిక సీఎస్డీటీలకు అప్పగించారు. అత్యవసర సరుకుల చట్టం 1955లోని సెక్షన్ 6ఏలో మొత్తం 3 కేసులు నమోదు చేసి సంబంధిత జాయింట్ కలెక్టర్కి నివేదిక సమర్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. నరసరావుపేట టౌన్: మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంక్ రుణాల్లో మోసానికి పాల్పడ్డ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ ఫిరోజ్ సోమవారం తెలిపారు. పిడుగురాళ్ల, నరసరావుపేట ఇండియన్, స్టేట్ బ్యాంక్లలో మహిళ సంఘాల పేరుతో నకిలీ గ్రూప్లు సృష్టించి షేక్ ఉమర్వలి రుణాలు మంజూరు చేయించినట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తం 81 నకిలీ గ్రూప్ల పేరుతో రూ.9.59 కోట్లు రుణాలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్లో నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసులో ఇప్పటికే ఐదవ నిందితుడిని అరెస్ట్ చేయగా, మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారన్నారు. -
అమరజీవి త్యాగం అజరామరం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి చిరస్మరణీయుడని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షురాలు నిర్మల భారతి, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్యూలో .... ఏఎన్యూ(పెదకాకాని): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం శ్లాఘనీయమని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరుపుకొన్నారు. వర్సిటీలోని తెలుగుభాషా విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విభాగాధిపతి ఆచార్య ఎన్వీ కృష్ణారావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారం వేగవంతం చేయండి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం వేగవంతంగా చేయాలని డీఆర్వో షేఖ్ ఖాజావలి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్వో మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ అధికారులకు అందిన అర్జీలపై అవగాహన ఉండాలన్నారు. పరిష్కారానికి వీలుకాని అర్జీల గురించి అర్జీదారులకు వివరించి చెప్పాలన్నారు. అనంతరం వచ్చిన 238 అర్జీలను డీఆర్వో డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా అధికారులు పరిశీలించారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026Iరేపల్లె: కారుమూరులో వేంచేసియున్న లలితా పరబ్రహ్మేశ్వరి సమేత అమరలింగేశ్వరస్వామి వారికి సోమవారం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,800, గరిష్ట ధర రూ.9,500, మోడల్ ధర రూ.8,500 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గత కౌన్సిల్ ఆమోదించిన పనులు నిలిచిపోయాయి..కాంట్రాక్టర్లు స్పందించడం లేదు..అంటూ పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల చుట్టూ తిరిగినా.. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప.. పనులు జరగటం లేదన్నారు. పాలకవర్గం పదవీ కాలం ముగి యనున్న నేపథ్యంలో సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన చివరి సమావేశం నిర్వహించారు. కొద్ది మందికే కాంట్రాక్టు పనులు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొద్దిమంది కాంట్రాక్టర్లే అత్యధిక శాతం పనులు తీసుకున్నారని, అయితే పనులు మాత్రం చేయటంలేదని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆరోపించారు. అధికారుల భాగస్వామ్యంతో కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. క్వాలిటీ, నిర్ణీత సమయంలో పనులు చేసిన వారికి మాత్రం బిల్లుల చెల్లింపు జరగటం లేదని, బిల్లులు చెల్లించని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. వేసవిలో తాగునీటి సమస్య ఉన్న మాట వాస్తమేనని, పలు ప్రాంతాల్లో ఇబ్బందికరర పరిస్థితులు ఉన్నాయన్నారు. అనేక డివిజన్లలో బోరింగ్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అన్నారు. నగరంలో అనధికారిక హోర్డింగ్స్ ఉన్నాయని, వాటికి అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎల్ఈడీ బల్బులు పెడుతున్నారని, దాని వలన ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో ఆశీలు వసూలు చేస్తున్నారని ఇది ఎవరూ వసూలు చేయిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నగరంలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు 3వేల మందిని కుక్కలు కరిచాయని, పశ్చిమ నియోజకవర్గంలోనే 900 మంది ఉన్నారనని తెలిపారు. పూడికతీత పనులతో ఇబ్బందులు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కాలువల్లో పూడికతీత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. నగరంలో కుక్కల సమస్య అధికంగా ఉందని, దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. పాతగుంటూరు, ఏటుకూరు రోడ్డులోని శ్మశానవాటికలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. సచివాలయాల్లో పలు వస్తువులు పనిచేయటంలేదని సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. మొక్కల టెండర్లలో అవకతవకలు కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి మొక్కల టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఆరోపించారు. పనులు పూర్తయిన వాటికి కూడా టెండర్లు వేసి కొంత మంది అధికారులు, ప్రజాప్రతినిధులు డబ్బులు కై ంకర్యం చేశారని అన్నారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు 2024 సెప్టెంబర్ నుండి ఎంత వరకు బిల్లులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారులకు కృతజ్ఞతలు మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ నగరంలోని 57 డివిజన్ పరిధిలో అభివృద్ధి చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈస్ట్లో 532 పనులు రూ.270 కోట్లు, వెస్ట్లో రూ.290 కోట్ల పనులు మంజూరు చేశామని, వాటిలో రూ.140 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. బీఆర్ స్టేడియం, శంకర్విలాస్ బ్రిడ్జి, తక్కెళ్లపాడు ఆర్వోబీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. 14 ప్రియాంబుల్స్, ఒక ప్రతిపాదనను ఆమోదించటం జరిగిందన్నారు. అనంతరం కమిషనర్ మయూర్ అశోక్ను సత్కరించి, షీల్డ్ను అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మేయర్ చుక్కా ఏసురత్నం, మాజీ కార్పొరేటర్ పోతురాజు సుబ్బరావమ్మ మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గుంటూరు నగరంలో కేవలం రెండేళ్లలోనే అభివృద్ధి జరిగినట్లు చెబుతున్నారని, ఎవరి హయాంలో నగర అభివృద్ధి జరిగిందనేది రికార్డులు చెబుతాయని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అన్నారు. పాలకవర్గం పదవీ కాలం ఐదేళ్లలో మూడేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఆ సమయంలో అభివృద్ధి జరిగిందన్న వాస్తవం ప్రజలకు తెలుసునన్నారు. మూడేళ్లలో 25వ డివిజన్ పరిధిలో రూ.50 కోట్లకుపైగా పనులు జరగడమే అందుకు నిదర్శనమన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో అనధికారిక లే అవుట్లు పెరిగిపోతున్నాయని దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హాస్టల్స్ భద్రతపై అధికారులు దృష్టి సారించాలని, ప్రైవేట్ వసతి గృహాల్లో శానిటేషన్, ఒకే రూములో ఐదారుగురు ఉండటం వంటివి గమనించి చర్యలు తీసు కోవాలన్నారు. కూటమి కార్పొరేటర్ల వాగ్వాదం ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతున్న క్రమంలో కొంత మంది కూటమి కార్పొరేటర్లు ఆయన ప్రసంగాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవాలని చూశారు. వైఎస్సార్ సీపీ హయాంలో సింహ భాగం అభివృద్ధి జరిగిందని చెప్పటంతో ఆయనతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కూడా ప్రతి వాదనకు దిగారు. కూటమి ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో తాము అడ్డుపడలేదని, కానీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్న సమయంలో ప్రసంగానికి అడ్డురావటం భావ్యం కాదని చెప్పటంతో వివాదం సర్దుమణిగింది. -
పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భక్తులకు పరమపద నాథ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలియజేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరు గ్రామానికి చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు వ్యవహరించగా ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. -
టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 27,699 మంది విద్యార్థులకు గానూ 27,123 మంది హాజరయ్యారు. టెన్త్ పరీక్షల్లో మొదటి రోజు కావడంతో గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల వారీగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచి కోలాహలం నెలకొంది. విద్యార్థులను వెంట పెట్టుకుని తల్లిదండ్రులు కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల జిల్లా నోడల్ అధికారి పి.పార్వతి వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి మంగళగిరిలో కేంద్రాన్ని, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఎనిమిది కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 38 కేంద్రాలతో పాటు రాష్ట్ర పరిశీలకులు 12 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో సలీమ్ బాషా చెప్పారు. దూరవిద్య టెన్త్ పరీక్షలకు 781 మంది హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ప్రారంభమైన దూరవిద్య పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 970 మంది అభ్యర్థుల్లో 781 మంది హాజరయ్యారు. జిల్లా నోడల్ అధికారి పి.పార్వతి రెండు కేంద్రాలను తనిఖీ చేశారు. -
భక్తిశ్రద్ధలతో సత్తెమ్మతల్లి 16 రోజుల పండుగ
అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మతల్లి దేవాలయంలో సత్తెమ్మతల్లి, సత్యదేవుళ్ల కళ్యాణ 16 రోజుల పండుగ మహోత్సవాలు సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పొంగళ్లు పొంగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ నిర్వహకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి 16వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 1వ తేదీన అమ్మవారికి కళ్యాణం నిర్వహించామని, తిరిగి 16 రోజుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీనివాసరావు, సత్యవతి దంపతులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అచ్చంపేట: ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక గ్రామదేవతగా వెలుగొందుతున్న అచ్చమ్మ పేరంటాళమ్మ తల్లి మహోత్సవాలు మంగళ ,బుధ, గురు వారాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ కన్వీనర్ సూరే వెంకట సుబ్బారావు సోమవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాదికి ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలిరోజు తోరణపాకు అలంకరణ, విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధనలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మూడు రోజుల పాటు ప్రాతఃకాల పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు, లలితాసహస్రనామ పారాయణం, పంచాంగ శ్రవణం, మహో నైవేద్యం, వేపపూత ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గుంటూరురూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన గుంటూరు నగర పర్యటన ప్రతిపాదనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్లు అందుకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్రోడ్ శ్రీ కన్వెన్షన్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్స్టాండ్ వరకు పర్యటించే అవకాశాలు ఉన్నందున వాటి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం, ట్రాఫిక్ డీఎస్పీ బి.శ్రీనివాస్, ఈస్ట్ డీఎస్పీ అజీజ్, పాత గుంటూరు సీఐ వెంకటరావు, లాలాపేట సీఐ శివరామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ సీతారామిరెడ్డి, ఈస్ట్ తహసీల్దార్ సుభాని, ఇతర శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. -
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి రాజధాని ప్రాంతం నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టిని పెద్ద పెద్ద లారీలలో తీసుకువచ్చి చేబ్రోలు ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతం నీరుకొండ నుంచి ఐదు టర్బో లారీలలో మట్టి తీసుకువచ్చి స్థానిక జీబీసీ రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో మెరక చేస్తుండటంతో కొంతమంది పోలీసులకు, రెవెన్యూ, అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తెల్లవారుజామున మట్టిలోడ్తో వచ్చిన లారీలను స్థానిక ఎస్ఐ పి.వీరనారాయణ ఆధ్వర్యంలో సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మొత్తం ఐదు లారీలకు చెందిన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా చేబ్రోలు పరిసర గ్రామాల్లో మట్టిని పెద్ద పెద్ద లారీల్లో ఇక్కడకు తరలించి బ్రోకర్ల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడ్డ లారీలు అధికార పార్టీకి చెందిన వారివి కావటంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.రాజధాని ప్రాంతం నుంచి చేబ్రోలుకు తరలిస్తున్న అధికార పార్టీ నేతలు -
ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి : ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలియజేశారు వైఎస్ జగన్. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు వైఎస్ జగన్.‘సాహిత్య రంగంలో జాతీయ స్థాయి అత్యున్నతమైన పురస్కారం లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారు. తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. నందిని సిధారెడ్డిగారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం, వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం’ అని ప్రశంసించారు. ఇదీ చదవండి:నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
పదో తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మీరే మన రాష్ట్ర భవిష్యత్తు. పరీక్షల మీద దృష్టి పెట్టండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని పోస్టు చేశారు. Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026 -
పొట్టి శ్రీరాములు గారికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి,తాడేపల్లి: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి (మార్చి16) నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నివాళులర్పించారు.తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/KWE9EpRC9X— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026 -
అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలు
● ఫూలింగ్కి ఇచ్చిన భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ● జేబులు నింపుకుంటున్న తమ్ముళ్లు ● పట్టించుకోని మైనింగ్ ఇతర అధికారులు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో అధికార పార్టీ నాయకులు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. కొండ వెనుక ఉన్న ఫూలింగ్ భూముల్లో రాత్రివేళ గ్రావెల్ తవ్వకాలు చేసి అక్రమంగా తరలించడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు. రాజధానిలో గ్రావెల్కు తీవ్ర డిమాండ్ ఉండటంతో అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రివేళ పొక్లెయిన్లు, ట్రాక్టర్లు, లారీలతో భారీగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. ఈ గ్రావెల్ను అమరావతి మండలం వైకుంఠపురం ఇతర గ్రామాలకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై అటు మైనింగ్, రెవెన్యూ ఇటు పోలీసులు కూడా తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో యఽథేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలిపోతోంది. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గంజాయి కేసులో నిందితుల అరెస్ట్
పట్నంబజారు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కే.వెంకట ప్రసాద్ వివరాలను వెల్లడించారు. గుంటూరు తారకరామానగర్కు చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ 220 బాషా గంజాయి తాగటానికి అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో లంబసింగ్ వాటర్ ఫాల్స్ దాటిన తరువాత అన్నారం అనే గ్రామం వద్ద తాబేలీ ఛత్రపతి, తామిలి కొండలరావు వద్ద లిక్విడ్ గంజాయి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఛత్రపతి, కొండలరావుకు గంజాయి కావాలని ఫోన్ చేయగా, లిక్విడ్ గంజాయి తీసుకుని వారు ఈనెల 15వ తేదీన వస్త్ర నగర్ వద్దకు వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు వారినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
కనుల పండువగా బదరీ కేదారేశ్వర శాంతి కల్యాణం
కర్లపాలెం: అగ్రహారం గ్రామంలో ఉన్న గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి శివపార్వతుల శాంతి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా శివాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి పలు రకాల పూలమాలలతో అలంకరించారు. లోక కల్యాణం కోసం శాస్త్రోక్తంగా శివపార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. -
ఆర్టీఐ ప్రజాస్వామ్యానికి బ్రహ్మాస్త్రం
రాష్ట్ర సమాచార కమిషనర్ పి.సింహాచలం నాయుడు చేబ్రోలు: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే శక్తివంతమైన సాధనమని, ప్రజాస్వామ్యానికి ఇది బ్రహ్మాస్త్రం వంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.సింహాచలం నాయుడు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ‘20 సంవత్సరాల ఆర్టీఐ, గుడ్ గవర్నెన్స్’ అనే అంశంపై వర్క్షాప్ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2005లో అమల్లోకి వచ్చిన ఆర్టీఐ కేవలం ఒక చట్టం కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చిన కీలక సంస్కరణ అన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందే హక్కును ఈ చట్టం కల్పించిందని చెప్పారు. సమాచార హక్కు భావనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రను వివరించారు. భారతదేశంలో ఆర్టీఐ చట్టం ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితంగా అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజస్థాన్లోని బేవర్ ప్రాంతంలో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎంకేఎస్ఎస్) వంటి ప్రజా ఉద్యమాలు ‘హమారా పైసా – హమారా హిసాబ్’ అనే నినాదంతో సమాచార హక్కు కోసం పోరాడినట్లు వివరించారు. ఆ ఉద్యమాల ప్రభావంతోనే ఆర్టీఐ రూపుదిద్దుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఐ అమలుతో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు ఆర్టీఐని సమర్థంగా వినియోగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్ పి.మనోజ్ కుమార్ విద్యార్థులకు ఆర్టీఐ పిటీషన్ ఎలా దాఖలు చేయాలో వివరించారు. కార్యక్రమంలో లా డైరెక్టర్, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు
గుంటూరు మెడికల్: కవి, సేవా తత్పరుడు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో డాక్టర్ యశస్వి రమణ అవార్డు అందుకున్నారు. తలసీమియా రోగులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, వాక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 ఏళ్లకు పైగా వికలాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా అందజేసి వారి సంక్షేమం కోసం కృషి చేయడం, పేదలకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించిన డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజర్ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. గుంటూరు జిల్లా నుంచి డాక్టర్ యశస్వి రమణను మాత్రమే ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అవార్డు అందుకున్న డాక్టర్ రమణ యశస్వికి గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులు, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, ఐఎంఏ నేతలు, రోటరీ క్లబ్ నేతలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
తాడేపల్లి రూరల్: దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి.. వారి సమగ్ర అభివృద్ధికి పాలకుల ప్రణాళికలు చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బీసీ రమణ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేక 80 శాతం బీసీ కులాలు చట్టసభల్లో అడుగుపెట్టడం లేదని అన్నారు. దీంతో ఆయా వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. బహుజన పోరాట వీరుడు కాన్షీరాం జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో బీసీ భవనాలకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. బీసీలను చైతన్యం చేయడమే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్య బీసీ నాయకులు పాల్గొన్నారు. -
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్– గ్రీవెన్స్) తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీఓ అధికార వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ మేరకు జిల్లాలోని ప్రజలు గమనించాలని కోరారు. లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షునిగా వెలుగూరి కృష్ణమూర్తి, కార్యదర్శిగా కోట శివకృష్ణ, కోశాధికారిగా కొలిపాకుల లక్ష్మీకాంత్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా చిట్టెపు శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. నూతన కార్యవర్గం సభ్యులతో జిల్లా అధ్యక్షులు చక్కా సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు. సభలో నూతన అధ్యక్షులు కృష్ణ్ణమూర్తి మాట్లాడుతూ నూతన సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. కార్యదర్శి శివకృష్ణ్ణ మాట్లాడుతూ వ్యాపార ధోరణే కాకుండా సమాజం పట్ల తమ వంతు బాధ్యతగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. మాస్టర్ ప్రింటర్స్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శి నేతగాని ఫిలిప్స్ తన సందేశాన్ని అందించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు తోట శ్రీనివాస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఆదివారం బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్పై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐఆర్సీ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్కు సంబంధించిన ముఖ్యాంశాలు, తాజా నియమాలు, మార్గదర్శకాలు, ఆడిట్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలపై అవగాహన కల్పించారు. అనంతరం బ్రాంచ్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్ బ్యాంకు శాఖల ఆడిట్ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించేందుకు బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్ దోహదం చేస్తుందని చెప్పారు. వర్క్షాప్లో ఐసీఏఐ గుంటూరుశాఖ వైస్ చైర్మన్ వనిమిరెడ్డి వెంకట నరేష్, కార్యదర్శి కన్నెగంటి మృత్యుంజయరావు, కోశాఽ దికారి నాగబీరు రాజశేఖర్, సి కా సా చైర్మన్ షేక్ బాజీ, కమిటీ సభ్యులు దేసు సంపత్ , చింతా రఘు నందన్ పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల ఖోఖో టోర్నమెంట్లో కృష్ణవేణి కళాశాల జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్లో తమ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించటంతోపాటు జట్టులోని పి.గోపినాథ్, బి.దిలీప్, ఎన్.అనిల్, పి.వెంకట్రావు, ఎం.యూష్లు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగనున్న సౌత్జోన్ ఖోఖో పోటీల్లో ఏఎన్యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జట్టు విజయానికి కృషి చేసిన వ్యాయామ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, ప్రిన్సిపల్ నాతాని, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, అధ్యాపకులు ఎం.తిరుపతిరావు, మహమ్మద్ పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు డాక్టర్ గద్దె రాజేంద్రప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు. -
అక్షరాస్యత అతివలకు ఎంతో ఉపయోగం
● డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి ● వయోజనుల అక్షరాస్యత వార్షిక పరీక్ష కేంద్రాల తనిఖీ యడ్లపాడు: మండలంలోని 22 గ్రామాల్లో ఆదివారం అక్షర ఆంధ్ర–అక్షర పల్నాడు కార్యక్రమంలో భాగంగా అధికారులు వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలనకు జిల్లా డీఆర్డీఏ పీడీ పి.ఝాన్సీరాణి అకస్మికంగా మండలాన్ని సందర్శించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రలో జరిగే పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 2200 మంది వయోజనులు అక్షరాభ్యాసం చేస్తున్నారని వీరిలో 1670 మంది డ్వాక్రా సభ్యులు కాగా, 530 మంది ఉపాధి కూలీలు ఉన్నట్లు తెలిపారు. చదువుపై వయోజనులు చూపుతున్న ఆసక్తిని ఆమె అభినందించారు. చదువు లేని డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు తమ రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. పొదుపు సంఘాల్లో డబ్బుల లెక్కలు తెలుసుకోవడం, ఉపాధి హామీ కూలీ డబ్బుల లెక్కలు చూసుకోవడం ,బ్యాంకు చెక్కులపై సొంతంగా సంతకాలు చేయడం వంటి అంశాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశమని ఆమె పేర్కొన్నారు. మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు వందశాతం హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎంపీడీవో వి.హేమలత, డెప్యూటీ ఎంపీడీఓ షేక్ జాకీర్హుస్సేన్, సచివాలయ మండల అధికారి నాగిరెడ్డి, ఏపీఎం కె.రవీంద్రకుమార్, ఏపీఓ డి.సుందరరావు, సీసీలు వై.పెద్దయ్య, సిహెచ్. నాగేశ్వరరావు, జి.నాగేశ్వరరావు, ఎం.ద్రాక్షాయమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. -
అండర్–17, 19 బాక్సింగ్ జట్లు ఎంపిక
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–17, 19 బాలుర బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల పర్యవేక్షణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.చిరంజీవి, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాఽథ్లు పర్యవేక్షించారు. చిరంజీవి మాట్లాడుతూ ఎంపికై న జట్లు 21 నుంచి 23 వరకు విశాఖలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు అండర్–19: సీహెచ్ అభిషిత్ పాల్, రామేశ్వర్, ఎన్.లోకేష్ చౌదరి, అండర్–17లో జి.సాయిహర్ష, బి.దేవ సుధాకర్, ఎస్.కుశ్వంత్ రాజ్ కుమార్, ఎస్.చరణ్ దీప్, బి.వెంకట మనోహర్, ఎస్.సత్యకుమార్, పి.కార్తీక్, ఎస్.రోహిత్ కుమార్, ఎస్.విజయ్ కుమార్, జి.కనిష్క్, జి.సాయిరామ్ చరణ్ ఉన్నారు. -
వంటలకు గ్యాస్ మంట
నరసరావుపేట టౌన్: వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. హోటళ్లు, టీస్టాల్స్, ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ లేక తలలు పట్టుకుంటున్నారు. సరిపడ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా నిలిచిపోవటంతో రెస్టారెంట్లలో మెనూలను కుదించారు. రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వండే చైనీస్ వంటకాలు పూర్తిగా గ్యాస్ పొయ్యిలపైనే ఆధారపడి ఉంటాయి. కమర్షియల్ గ్యాస్ సిలీండర్లు అందుబాటులో లేకపోవటంతో ఇప్పటికే కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతబడ్డాయి. బ్లాక్లో అధిక ధరకు సిలిండర్లు కొనుగోలు చేస్తుండటంతో కొన్ని రెస్టారెంట్లలో ఆహార ధరలను పెంచారు. టీస్టాళ్లలో గ్యాస్ లేక ఎలక్ట్రిక్ స్టౌలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. అయితే గ్యాస్ కన్నా విద్యుత్ ఖర్చే అధికం అవుతుందని, దీంతో నష్టాలు చవిచూస్తున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. మరో వైపు హోటళ్ల నిర్వాహకులు కట్టెలు, బొగ్గు పొయ్యిలను వినియోగిస్తున్నారు. వాటికి డిమాండ్ పెరగటంతో ధరలు అమాంతం పెరిగాయి. వ్యాపారులకు ఇది అదనపు భారంగా మారింది. చిన్న వ్యాపారాల బతుకుబండిని నడిపించటంలో గ్యాస్ కీలకం. హోటళ్లు, టీస్టాల్స్, బేకరీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్ వంటివి పూర్తిగా గ్యాస్పై ఆధారపడి ఉంటాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడం యజమానులతోపాటు అక్కడ పనిచేసే కార్మిక కుటుంబాలను ఆందోళన కలిగిస్తోంది. హాస్టళ్లలో మెనూ కుదింపు.. వంట గ్యాస్ కొరత ప్రభావం ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే వారిపై పడింది. విద్యా కేంద్రంగా విరజిల్లుతున్న నరసరావుపేట పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటూ ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉదయం టిఫిన్కు బదులు రాగిజావ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో ఒక కూర, పెరుగు మాత్రమే అందిస్తున్నారు. వారం క్రితం మూడు కూరలు, ఒక ఫ్రై వడ్డించారు. విద్యార్థులు కడుపునిండా తినలేక ఇబ్బందులు పడుతున్నారు. 8 నుంచి సరఫరా బంద్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను ఈ నెల 8వ తేదీ నుంచి డీలర్లు నిలిపివేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గ్యాస్ సరఫరాలో సమస్య లేదని చెప్పుకొస్తుంది. వాస్తవానికి అనేక హోటళ్లు, వ్యాపార సంస్థలు మూసివేసి ఉండటం బహిరంగంగానే కనిపిస్తోంది. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గృహవినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే గ్యాస్ సంక్షోభం చిన్న వ్యాపారుల ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తుంది. -
రవాణాశాఖలో జోన్–3 ఎన్నికలు ఏకగ్రీవం
ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ శాఖ టెక్నికల్ అధికారుల సంఘం (జోన్–3) ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఒంగోలు అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్ ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించారు. ఒంగోలులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో మొత్తం 9 మంది ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికైనది వీరే... ఈ ఎన్నికలలో జోన్ 3 పరిధిలో నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షునిగా వి.బాలకృష్ణ, (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మంగళగిరి), గుంటూరు జిల్లా, ప్రధాన కార్యదర్శిగా కె.జయప్రకాశ్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ఒంగోలు), ట్రెజరర్గా కె.కరుణాకరన్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కావలి, నెల్లూరు జిల్లా) ఎన్నికై నట్లు వెల్లడించారు. జిల్లా రిప్రజెంటేటివ్ పోస్టులు మొత్తం ఆరు ఏకగ్రీవం కాగా, వారిలో గుంటూరు జిల్లాకు చెందిన జి.అమృతరాణి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తెనాలి), పల్నాడు జిల్లాకు చెందిన సీహెచ్ మనీషా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, నరసరావుపేట), బాపట్ల జిల్లాకు చెందిన కె.రవినాయక్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, చీరాల) ప్రకాశం జిల్లాకు చెందిన బి.భాను ప్రకాష్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ప్రకాశం) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏ మల్లికార్జున్రెడ్డి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), మార్కాపురం జిల్లాకు చెందిన కె.ఎల్.రావు (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, మార్కాపురం) ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా కార్యదర్శి మక్దూం షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో జోన్ 3 పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొని నూతనంగా ఎన్నికై న జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో జాలాది వాసి మృతి
చిలకలూరిపేటటౌన్: బైక్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన పిల్లి దొరకరాజు (38) ఆదివారం తెల్లవారుజామున వ్యక్తిగత పనులపై చిలకలూరిపేట వెళ్లి తిరిగి బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామం దాటిన తర్వాత, బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఎండిపోయిన పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజు తలకు బలమైన రక్త గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అమరావతి: విజయవాడ నుంచి అమరావతి వస్తున్న ఆర్టీసీ బస్సు గ్రామ సమీపంలో ఒక్కసారిగా ముందు టైరు పేలి రోడ్డు పక్కన కందకంలో దిగబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అమరావతి వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని పెదమద్దూరు దాటి అమరావతి సమీపానికి రాగానే ఒక్కసారిగా ముందుటైరు పేలింది. ఈక్రమంలో బస్సు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూసుకు వెళ్లి దిగబడి పూర్తిగా ఒకపక్కకి ఒరిగి పోయింది. ఈసమయంలో బస్సులో ఉన్న ఇరవై మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్లు ఎలాగోలా బస్సు నుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు నాగవర్ధిని, శివపార్వతి, రమాదేవిలకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిండంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అమరావతి: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మై భారత్ కేంద్రం గుంటూరు ఆధ్వర్యంలో అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం ఆదివారం అమరావతిలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో త్రిపుర రాష్ట్రం నుంచి యువతీయువకులు క్షేత్ర దర్శనంలో భాగంగా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయాన్ని, ధ్యాన బుద్ధ విగ్రహాన్ని, పురావస్తు మ్యూజియాన్ని దర్శించారు. త్రిపుర రాష్టానికి చెందిన 37 మంది యువతీయువకులు పాల్గొన్నారు. మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాలు, విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో తుళ్ళూరి సాంబశివరావు బెజ్జం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయోస్తు... పదిలం!
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థి జీవితానికి తొలిమెట్టు వంటి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాల పరిధిలో 27,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8.30 నుంచి ఆయా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. పాఠశాలల్లో హెచ్ఎంలు నుంచి పొందిన, వెబ్సైట్, వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్లతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా పరీక్ష రాసేందుకు వెళ్లవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అధికారుల పరిశీలన ఆదివారం గుంటూరు నగరంలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి, డీఈవో షేక్ సలీమ్ బాషా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆర్జేడీ, డీఈవోలు వేర్వేరుగా 20 కేంద్రాల చొప్పున పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద కోడ్ నంబరుతో కూడిన బోర్డులు, రోల్ నంబర్లు ప్రదర్శించడం, మౌలిక వసతులను తనిఖీ చేశారు. సోమవారం ఉదయం పరీక్షలు ప్రారంభం కానుండగా, గుంటూరు నగర పరిధిలోని పలు కేంద్రాల వద్ద సెంటర్ కోడ్ నంబర్లు కనిపించలేదు. కేవీపీ కాలనీలోని కేఎస్ఆర్టీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు కనిపించేలా సెంటర్ కోడ్ నంబరు, రోల్ నంబర్లతో కూడిన వివరాలను ప్రదర్శించలేదు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆది మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం ఈనెల 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం బాజీబాబా దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు మహోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వహణకు రాష్ట్ర వక్ఫ్బోర్డు రూ.17.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఉరుసు నిర్వహణకు వక్ఫ్ బోర్డు సూపరిండెంట్లు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19వ తేదీ సాయంత్రం చాందిని అలంకరణ, రాత్రి 10 గంటలకు పెదకాకాని ముస్లింపాలెం జెండా చెట్టు నుంచి వైభవంగా ఉరుసు మహోత్సవం ప్రారంభం అవుతుందన్నారు. 20వ తేదీ దీపారాధన, గంధం పంపిణీ, ఖురాన్ పఠనం, సలామి ప్రార్థనలు జరుగుతాయన్నారు. 19వ తేదీ రాత్రి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కలసి దర్గాలో ఉరుసు మహోత్సవ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. దుగ్గిరాల: దుగ్గిరాల రైలుపేటలోని పసుపు యార్డు సమీపంలోని వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, శాంతి హోమంతో వేడుకలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కల్యాణం కనులారా తిలకించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. కల్యాణం ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది. -
మైనింగ్లో నేనే కింగ్!
కృష్ణా జిల్లాలో మైనింగ్ శాఖలో డీడీగా పనిచేస్తున్న వ్యక్తి ఆ శాఖకు తానే రాజు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా తన కొత్త నిబంధనలతో పాత జీవోలను జోడించి అనుమతులు ఇవ్వడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఇచ్చిన ఒక అనుమతి వల్ల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పలు లంక భూముల రైతులతోపాటు రేపల్లె కరకట్ట వెంబడి ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాడేపల్లి రూరల్: కృష్ణానదిలో ఎక్కడ తవ్వకాలు నిర్వహించాలన్నా ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవో నంబరు 49, 100లకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ సమక్షంలో అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ కృష్ణా జిల్లాకు చెందిన మైనింగ్ శాఖ డి.డి. శ్రీనివాసరావు దానికి విరుద్ధంగా ప్రభుత్వ జీవోలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన 1966లో విడుదల చేసిన జీవోల ప్రకారం అనుమతులు ఇస్తున్నారు. గతంలో కూడా పలు క్లస్లర్ మిషన్లకు ఇదేవిధంగా అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అడ్డగోలుగా అనుమతులు తాజాగా ఒక రైతు పొలం మిగతా పొలాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉందని, ఇతర పొలాలతో సమానం చేసేందుకు మట్టిని తొలగించాలని, ఆ మట్టిని ఇటుక రాళ్ల బట్టీకి వినియోగించుకుంటామని ఓ టీడీపీ నేత లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నాడు. సదరు మైనింగ్ డి.డి. నిబంధనల ప్రకారం కలెక్టర్తో చర్చించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా నేరుగా ఫిబ్రవరి 4వ తేదీన అనుమతులు ఇచ్చారు. 120 రోజుల్లో ఆ పొలాన్ని చదును చేసి, వచ్చిన 13,355 టన్నుల మట్టిని తీసుకెళ్లవచ్చని అనుమతి ఇచ్చారు. లంక భూముల్లో తీసిన మట్టి ఇటుక బట్టీ రాళ్లకు పనికి వస్తుందా లేదా అనే విషయం పరిశీలించలేదు. లంక భూముల్లో నాలుగైదు అంగుళాల మందంలో ఇసుక పొరలు తగులుతాయి. అలాంటి మట్టి ఇటుక బట్టీలకు ఎలా పనికి వస్తుందని రైతుల ప్రశ్నిస్తున్నారు. మట్టి చాటున ఇసుకను తరలించేందుకు ఇలాంటి అనుమతులు తీసుకువచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు కనీసం ఆ భూమిని పరిశీలించకుండా అనుమతులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరీ ఇంత బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరించడాన్ని ఖండించారు.కృష్ణానదిలో లంక భూముల్లో అనుమతి ఇచ్చే సమయంలో మైనింగ్ శాఖ అధికారులు వివిధ శాఖల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా కొత్త జీవో నంబరు 49 ప్రకారం కలెక్టర్ అనుమతి తప్పనిసరి. పక్క పొలాల రైతులు ఎటువంటి అభ్యంతరం చెబుతారో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకుండానే మైనింగ్ వే బిల్లులు సహా అందజేసి గ్రామ సభను నిర్వహించి ప్రస్తుతం అభిప్రాయ సేకరణ తీసుకోవడంతో మైనింగ్ శాఖ డి.డి. శ్రీనివాసరావు చేసిన ఈ విషయం బయటకు వచ్చింది. లంక భూముల్లో ఎక్కడ ఎత్తుపల్లంగా ఉన్నాయి, తీసిన మట్టి ఇటుక బట్టీలకు పనికివస్తుందని ఎలా నిర్ధారించారో అధికారులు తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చోడవరం లంక భూముల్లో మట్టి తవ్వకాలు నిర్వహిస్తే మిగిలిన రైతులకు చావే శరణ్యం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లంక భూముల్లో మట్టి తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను పునరాలోచించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బ్రహ్మారెడ్డి గెలుపు
నగరంపాలెం: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి ఫలితాలను ప్రకటించారని ఆదివారం బ్రహ్మారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 13న ఏపీలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 141 మంది పోటీ చేయగా, అందులో 31 మంది మహిళా న్యాయవాదులు కూడా బరిలో నిలిచారు. అయితే బార్ కౌన్సిల్ సభ్యునిగా బ్రహ్మారెడ్డి 1,409 ఓట్లతో విజయం సాధించారు. ఆయన బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలవడం ఇది మూడోసారి. గెలుపునకు సహకరించిన ఏపీలోని న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. బ్రహ్మారెడ్డిని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, పట్టణ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాసు వెంకట రెడ్డి, న్యాయవాదులు అలికపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు అభినందించారు. 1991లో న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించిన బ్రహ్మారెడ్డి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా, బార్ కౌన్సిల్ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్గా, గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ పీపీగా పనిచేశారు. -
అక్షర ఆంధ్రా పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు వెస్ట్: ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదివారం తనిఖీ చేశారు. స్థానిక లాలుపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేయడంతోపాటు కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో నూరు శాతం అక్షరాస్యత సాధించడం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. పరీక్షలకు జిల్లాలో 90,426 మంది అభ్యర్థులు 1485 కేంద్రాల్లో హాజరయ్యారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పించారు. కార్యక్రమంలో వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్తంబోద్భవం అలంకారంలో నరసింహస్వామి మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్తంబోద్భవం అలంకారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. భక్తులు కనులారా దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావులు వ్యవహరించారు. -
కూటమి ప్రభుత్వంలో డ్రగ్గిస్టులు
పట్నంబజారు: కూటమి ప్రభుత్వంలో కామాంధులు, డ్రగ్గిస్టులకు కేరాఫ్కు మారిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ఒక ఫామ్ హౌస్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని దొరకటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేష్ ఈ విధంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులను నేరుగా మత్తు పదార్థాలకు అలవాటు అవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం డబ్బులు కోసం గంజాయి, డ్రగ్స్ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. రౌడీలను, డ్రగ్గిస్టులను, మహిళలను వేధించే వారిని పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా ఎంపీ మహేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్వర్క్తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. -
రైతుల అభ్యంతరాలు పరిశీలిస్తాం..
● కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి ● చోడవరం రీచ్ పరిశీలన ● ఆర్డీఓ రాకతో భారీగా చేరుకున్న రైతులుతాడేపల్లిరూరల్: రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తామని, ఉన్నతాధికారులకు తెలియజేసి నిర్ణయం తీసుకుంటామని కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి తెలిపారు. కృష్ణా జిల్లా చోడవరంలోని లంక భూముల్లో మేట పేరిట తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ‘మేట... బడాబాబులకు మేత’ శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి వివిధ శాఖల అధికారులతో కలసి చిర్రావూరు వైపు లంక భూములను పరిశీలించేందుకు మధ్యాహ్నం సమయంలో విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు అక్కడకు చేరుకున్నారు. లంక భూమి భౌతిక స్వరూపాన్ని ఆర్డీఓ శ్రీదేవికి వివరించారు. గతంలో అనుమతులు ఇచ్చిన ఇసుక రీచ్ల వల్లే వేలాది లంక భూములు కృష్ణానదిలో కొట్టుకుపోయాయని, పట్టా భూములు ఉన్న రైతులు కౌలు రైతులుగా మారారని తెలిపారు. చోడవరం ఇసుక రీచ్–2తోపాటు పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను అనుమతి ఇస్తే మంగళగిరి నియోజకవర్గంలోని చిర్రావూరు, రామచంద్రాపురం, గొడవర్రు, ఇతర ప్రాంతాల్లో లంక భూములతోపాటు రేపల్లె కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయని పేర్కొన్నారు. సొసైటీల కింద ఎంతో మంది వ్యవసాయం చేసుకుంటున్నారని, మట్టి తీసుకోవడానికి అనుమతి ఇస్తే చిన్నపాటి రైతులు తమ జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుందని, అందువలన అనుమతులు ఇవ్వవద్దంటూ వారు కోరారు. సీపీఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, కాశయ్యలు మాట్లాడుతూ లంక భూముల తవ్వకాల విషయంలో రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు.చోడవరం–2 ఇసుక రీచ్తోపాటు పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ దినేష్ తెలిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఇప్పటి వరకు రహదారి నిర్ణయించలేదని, డిస్ట్రిక్ శాండ్ నిబంధనల ప్రకారం ఏ జిల్లాలో ఇసుక రీచ్లు నిర్వహిస్తే ఆ జిల్లాలోనే అనుమతులు ఇస్తారని అన్నారు. అనుమతులు ఇవ్వకుండా గుంటూరు జిల్లా లోని కృష్ణానదిలో రహదారులు ఎలా నిర్మించారని రైతులు ప్రశ్నించగా ఆయన మాట దాటవేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు. -
జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన
గుంటూరు లీగల్: ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రెండో అదనపు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్చార్జి చైర్మన్ వై.నాగరాజా ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 41 బెంచ్లు, గుంటూరు జిల్లా కోర్డు ప్రాంగణంలో 15 బెంచ్లను ఏర్పాటు చేశారు. కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ ద్వారా సివిల్ కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ కుదుర్చారు. 2009నాటి కేసులో ఇరువర్గాల అంగీకారంతో రూ.2,68,60,000 రాజీ కుదిర్చా రు. రెండో అదనపు జిల్లా కోర్టులో ఒక సివిల్ దావాలో రూ.25కోట్లకు రాజీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అదనపు సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్), బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బార్ మెంబర్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లాలోని వివిధ న్యాయ స్థానాలలో పెండింగ్ లో ఉన్న రాజీ పడదగ్గ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. మొత్తం 24,756 కేసులు పరిష్కరించగా, వీటిలో సివిల్ కేసులు 1,694, క్రిమినల్ కేసులు 22,983, ప్రీ లిటిగేషన్ కేసులు 79, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులలో పరిష్కారమైన మొత్తం కేసుల విలువ మొత్తం విలువ రూ.42,58,65,889. జాతీయ లోక్ అదాలత్ ఫిజికల్, వర్చువల్ పద్ధతిలో నిర్వహణకు సహకరించిన న్యాయవాదులకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ సంస్థలకు, కక్షిదారులకు, న్యాయ సేవాధికార సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు. -
టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
● డీఈఓ షేక్ సలీమ్ బాషా ● పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి ● ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు ● రేపటి నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలు ● గుంటూరు జిల్లాలో హాజరు కానున్న 27,699 మంది విద్యార్థులు ● జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాలు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా ఉన్న 149 పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026గుంటూరులో ట్రాఫిక్ నిలిపివేసి చేపట్టిన చెట్ల నరికివేత పనులు గుంటూరు ఎడ్యుకేషన్: టీడీపీ పాలనలో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతోంది. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లు నిలువునా నరికివేతకు గురవుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా పచ్చదనం కనుమరుగైపోతోంది. గుంటూరు లక్ష్మీపురం మెయిన్రోడ్డు పొడవునా కాలువల నిర్మాణాన్ని చేపట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరికివేస్తున్నారు. ● లక్ష్మీపురం మెయిరోడ్డు ముఖద్వారమైన మదర్థెరిస్సా విగ్రహం నుంచి స్తంభాలగరువు వరకు కాలువల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించిన నగరపాలక సంస్థ అధికారులు మొదటి దశలో హాలీవుడ్ థియేటర్ నుంచి బేకర్స్ ఫన్ వరకు చెట్లను తొలగించారు. ● ప్రస్తుతం రెండో దశలో బేకర్స్ ఫన్ నుంచి శనివారం ఉదయం చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల ఎదుట నిర్మించిన మెట్లు, ర్యాంపులను తొలగించిన అధికారులు కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని భారీ వృక్షాలను వేళ్లతో పెకిలించి వేస్తున్నారు. ● వాస్తవానికి వాణిజ్య సముదాయాల ముందు మెట్లు, ర్యాంపులను తొలగించి, కాలువలు నిర్మించేందుకు అవకాశం ఉన్నా చెట్లను సైతం నరికి, వేర్లతో పెకిలించి వేయడం గమనార్హం. ● ఒక వైపు వేసవి మొదలై ఎండల తీవ్రత పెరుగుతున్న పరిస్థితుల్లో రోడ్డు పక్కన చెట్లను నరికివేయడం వల్ల మండు టెండల్లో నీడ కరువై అల్లాడాల్సిన దుస్థితి ఎదురుకానుంది. ● మొక్కలను పెంచి, చెట్లను సంరక్షించాల్సిన అధికారులే ఈ విధంగా చెట్లను నిలువునా నరికి వేస్తుండటంతో పర్యావరణ వేత్తలు, నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. 7టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. 2016లో సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనకు వస్తున్నారని, కొరిటెపాడు నుంచి గుజ్జనగుండ్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అప్పట్లో ఫుట్పాత్ల నిర్మాణం కోసమే వందలాది చెట్లను నరికివేశారు. మళ్లీ టీడీపీ అధికారంలో ఉండగా, చెట్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ నిలిపివేసి, చెట్లను నరికివేత పనులు చేపట్టారు. చెట్లతో నిండి పచ్చదనం పంచుతున్న లక్ష్మీపురం ప్రధాన రహదారి చెట్ల నరికివేతతో వెలవెలబోతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శనివారం 537.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. గొరిగపూడి(భట్టిప్రోలు):గొరిగపూడి పంచాయ తీ వరికూటివారిపాలెంలో శనివారం సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. -
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
రేపల్లె: మైనేనివారిపాలెం గ్రామం కృష్ణానది ఒడ్డున గురు నిలయం ఆవరణంలోని శ్రీ గాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు శనివారం మూడవ రోజు కనుల పండువగా జరిగాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన నిర్వహించారు. స్వామివారికి, దేవేరులకు మంగళస్నానాలు ఆచరించి వధువరులుగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడము శాంతి కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు కళ్యాణ్ చక్రవర్తి స్వామివారి కల్యాణ ఘట్టాలను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కన్నులారా తిలకించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బాపట్ల: బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్లో ఉన్న లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారి 55వ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివా రం ఉదయం స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులతో పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. మహిళలు కోలాటం నిర్వహించారు. తాడికొండ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తుళ్లూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. తుళ్లూరులో నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనా న్ని ఏర్పాటు చేస్తున్నారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలి పారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైశ్య ట్రస్ట్ ప్రెసిడెంట్ రూండి రాకేష్ వివరాలను అందిస్తూ పదివేల మంది కార్యక్రమానికి హాజరవుతారన్నారు. రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ లూర్దుమర్రెడ్డి 36వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. కానుకమాత చర్చి సహాయ గురువులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో ఐబీ మెగా క్రెడిట్ అవుట్ రీచ్
కొరిటెపాడు(గుంటూరు): ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ మెగా క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం అమరావతి జోన్కు సంబంధించి జేకేసీ కళాశాల రోడ్లోని ఆ బ్యాంక్ జోనల్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 జోన్లు, మూడు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బ్రాంచ్లు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా రూ.1,422 కోట్ల రుణాలను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బ్యాంక్ తిరుపతి జోనల్ మేనేజర్ సెల్వరాజ్ ఎం సహా, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రణేష్ కుమార్ మాట్లాడుతూ కస్టమర్ కేంద్రిత రుణ సేవల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు బ్యాంక్ ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ఉత్పత్తులను ప్రత్యేక స్టాళ్లలో ప్రదర్శించారు. అమరావతి జోనల్ మేనేజర్ ఎన్.గౌరి శంకర్ రావు, విజయవాడ జోనల్ మేనేజర్ ముచ్చినా రాజేష్, రాజమండ్రి జోనల్ మేనేజర్ కత్తుల రాజ్ కుమార్, విశాఖపట్నం జోనల్ మేనేజర్ పి.అవధేష్ కుమార్, డీఆర్డీఏ, మెప్మా అధికారులు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. -
శాసీ్త్రయ పరిశోధనల్లో నైతిక ప్రమాణాలు ముఖ్యం
చేబ్రోలు: పరిశోధనల్లో జంతువుల వినియోగం విషయంలో ఎథికల్ గైడ్లైన్స్ను కచ్చితంగా పాటించడం అవసరమని ఢిల్లీలోని సీసీఎస్ఈఏ సీనియర్ కన్సల్టంట్ డాక్టర్ వివేక్ త్యాగి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీసీఎస్ఈఏ (కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్సిపెరిమెంట్స్ ఆన్ యానిమల్స్) ఆర్థిక సౌజన్యంతో ‘‘రీడిఫైనింగ్ ఎక్సిపెరిమెంటల్ ఫార్మాకాలజీ’’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్ శనివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ‘‘ఎథికల్, ఆల్టర్నేటివ్ అండ్ డిజిటల్ ఫ్రాంటియర్స్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. డాక్టర్ వివేక్ త్యాగి మాట్లాడుతూ పరిశోధనల కోసం ప్రయోగ జంతువులను ఉపయోగించే సందర్భంలో జంతు సంక్షేమాన్ని కాపాడడం అవసరం అన్నారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్. హరీష్ శంకర్ మాట్లాడుతూ వైద్యశాస్త్రం, ఫార్మకాలజీ మరియు జీవశాస్త్ర పరిశోధనల్లో జంతు నమూనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ అనేక రోగాలపై పరిశోధనలు చేయడంలో జంతు నమూనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. 350 మందికిపైగా విద్యార్థులకు నిర్వహించిన ఓరల్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్లలో సత్తా చాటిన వారికి బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జే. మహేష్ కుమార్, సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే. సురేష్ బాబు, బెంగళూరులోని దయానంద్ సాగర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విజయ్ కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
గుంటూరు ఎడ్యుకేషన్ : పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత విద్యా బాటలు వేసిన కమ్మ హాస్టల్ సేవలు 102 వసంతాల మైలురాయిని చేరుకోవడం గొప్ప విశేషమని, విద్యార్థులు అంకుర పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. శనివారం అరండల్ పేటలోని కమ్మ విద్యార్థి సహాయ సంఘం (కమ్మ హాస్టల్) 102 వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.15 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘శ్రీ యలమంచిలి జనార్దనరావు కంప్యూటర్ ల్యాబ్’’ ను సుజనా చౌదరి ప్రారంభించారు. అనంతరం కమ్మ హాస్టల్ చరిత్రను ప్రతిబింబించే ‘‘కమ్మ హాస్టల్ చరిత్ర’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శాఖమూరి లక్ష్మీదేవమ్మ కమ్మ హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన సభకు కమ్మ విద్యార్థి సహాయ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ మనిషి ఉన్నత మనుగడకు అత్యంత ముఖ్యమైన విద్య, వైద్య రంగాల్లో కొండబోలు బసవపున్నయ్య నేతత్వంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సేవాభావంతో కొనసాగుతున్న ఈ సంస్థ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు వచ్చి చేయూతనందించాలన్నారు. కార్యక్రమంలో కమ్మ విద్యార్థి సహాయ సంఘ కార్యదర్శి కె.కృష్ణ ప్రసాద్, అధ్యక్షుడు ఎం. బంగారు బాబు ఉపాధ్యక్షుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, సినీ నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వర్లు, బొల్లేపల్లి సత్యన్నారాయణ, ఎన్. కోటేశ్వరరావు, అట్లూరి సుబ్బారావు, రత్నబాబు, డాక్టర్ యర్రా నాగేశ్వర రావు, పూర్వ విద్యార్థులు, పాలక మండలి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ ఉమ్మడి గుంటూరు జిల్లా విభాగానికి నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షురాలిగా ఎన్. నిర్మల భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో సంఘ ప్రధాన కార్యదర్శిగా పి. శామ్యూల్ పాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంఎల్ఎల్వీ. ప్రతాప్, కోశాధికారిగా ఎల్. రవీంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా వి. గణేష్ కుమార్. ఎస్. పురుషోత్తం రాజు, బి. నాగేశ్వరరావు నాయక్. జి.వి.ఆర్.ఏ. శేషారావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, ఎం. బుల్లయ్య, ఎస్కే. నీలోఫర్, వి. పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి గా ఆర్. శివరామయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి. శ్రీనివాసరావు, కె. మోహన్ రావు, వి. చంద్ర మోహన్, కె. విద్యాసాగర్ రెడ్డి, జేఏసీ సభ్యుడిగా బి. మధుసూదన్ ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితులుగా బి.సిరిల్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు షేక్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమాన్ని సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షురాలు నిర్మల భారతి మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీసీ చంద్రమోహన్ పూర్ణ చంద్ర రెడ్డి, రామచంద్రరావు, తోట ఉషాదేవి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘సాహితీ కిరణం’లో ముందస్తు ఉగాది వేడుకలు
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం సంస్థ వ్యవస్థాపకులు పొత్తూరు సుబ్బారావు, జయలక్ష్మిల ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు శనివారం సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి పర్యావరణ రచయిత డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ కవులు, రచయితలు సామాజిక స్పృహతో రచనలు చేయాలన్నారు. కార్తికా డెవలపర్స్ అధినేత వి.వి రాఘవరెడ్డి, జల్ది విద్యాధరరావులు ప్రసంగించారు. విడుదల నిహారిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు ప్రముఖ రంగస్థల నటులు, రచయిత విడుదల సాంబశివరావు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ కథా రచయిత్రి తాటికోల పద్మావతి రచించిన కథా పద్మాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనాన్ని ప్రముఖ రచయిత వడలి రాధాకృష్ణ నిర్వహించారు. సయ్యద్ జానీబాషా, బండికల్లు జమదగ్ని, ఎస్.ఎం సుభాని, వీఎస్వీ ప్రసాద్, సోమేపల్లి వశిష్ట, కొణతం నాగేశ్వరరావు, దార్వేముల అనిల్, సుభద్రాకృష్ణ, సుబ్బయమ్మ, పుల్లారావు, శ్రీనివాసరావులు కవితా పఠనం చేశారు. వివిధ రంగాలలో పేరు పొందిన చలపాక ప్రకాష్ (పత్రికా రంగం), కడియాల ప్రభాకరరావు (సంగీతం), రాసంశెట్టి నరసింహారావు(గాయకులు), వై. కనకదుర్ (సాహిత్యం), అత్తోట సౌజన్య (గాయని)లను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. కథల పోటీలలో విజేతలైన ఇంద్రగంటి మధుసూదన్రావు, మొగిలి పద్మ, మౌనశ్రీ మల్లిక్, కోరాడ అప్పలరాజు, చిట్యాల శ్రీధర్కుమార్, పట్నాల ఈశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి, ఎం సత్యగౌరీ, బీవీ మిత్ర కొత్తూరు సీతారామరాజు, సి రాజేశ్వరి, కిషోర్ కుమార్లకు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ వ్యాఖ్యాత పెద్దూరి దాసు సభా సమన్వయం చేశారు. వేడుకలు పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం పత్రిక కార్యాలయంలో పొత్తూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొంచెం కావాలిపుడు శీర్షికన కవితా గానం చేసిన ఎస్. ఎం. సుభానిని జాస్తి వీరాంజనేయులు శాలువాతో సత్కరించారు. ప్రముఖ సాహితీ వేత్త పెద్దురి వెంకటదాసు, ప్రముఖ కథా రచయిత వడలి రాధాకృష్ణ, పట్టాభి కళాపీఠం అధ్యక్షులు తూములూరి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ కవి రచయిత డాక్టర్ జెల్ది విద్యాధరరావు, జమదగ్ని, వశిష్ఠ సోమేపల్లి, సయ్యద్ జానీబాషా, తాటికోల పద్మావతి, ఎం. సుభద్రకృష్ణ, ప్రముఖ సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, ముట్లూరి ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్. దమయంతి తదితరులు సుభానికి అభినందనలు తెలిపారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం
నరసరావుపేట: గౌరవ వేతనంతో విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, లేనిపక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి హెచ్చరించారు. పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏఎల్ ప్రసన్న అధ్యక్షతన యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. మల్లీశ్వరి మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలనే దశలవారీ పోరాటాలలో భాగంగా ఇటీవల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గం అన్నారు. యూనియన్ నాయకులతో నిర్వహించిన చర్చల సందర్భంగా ప్రభుత్వ పెద్దలు 10 డిమాండ్లకు గాను తొమ్మిది నెరవేర్చామని అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉగాది సందర్భంగా పండగ నాటికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె సందర్భంగా శిబిరానికి వచ్చిన కూటమి అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతమణి కోశాధికారి మాధవి, సభ్యులు సావిత్రి, జయలక్ష్మి పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.మల్లేశ్వరి -
గుంటూరులో జోయాలుక్కాస్ రెండో షోరూం ప్రారంభం
నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం మెయిన్రోడ్లో జోయాలుక్కాస్ వరల్డ్స్ ఫేవరేట్ జ్యూవెలర్ షోరూంను శనివారం సాయంత్రం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నజీర్ అహ్మాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరులో రెండో షోరూమ్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. విస్తరణలో భాగంగా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభమైన ప్రతి షోరూంను ఆధునిక ఇంటీరియర్లు, విశాలమైన లేఅవుట్లు అత్యుత్తమ సౌకర్యాలతో వినియోగదారులకు మంచి అనుభూతి అందించేలా రూపొందించారని చెప్పారు. సినీ నటి సౌందర్యరెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యూ మాట్లాడుతూ మూడు రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు కొత్త షోరూంలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుల నిరంతర విశ్వాసం, ఆదరణ తమ వృద్ధికి చోదక శక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి షోరూంలో అత్యుత్తమ నాణ్యత, వినూత్న డిజైన్లు ఉన్నాయని తెలిపారు. సీఓఓ హెన్రీ గెర్గో, మార్కెటింగ్ హెడ్ అనిష్వర్గేష్, రిటైల్ హెడ్ రాజేష్కృష్ణన్, రీజనల్ మేనేజర్ రాజేష్ ఓఎస్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని వృద్ధుడి బలవన్మరణం
నాదెండ్ల: అసలే వృద్ధాప్యం.. ఆపై పక్షవాతం.. ఈ కారణంగా మతిస్థిమితం కోల్పోయిన ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గణపవరం గ్రామంలో నివాసం ఉండే పోతురాజు కృష్ణారావు (70) ముఠా పనులకు వెళ్తుండేవాడు. గడిచిన నాలుగేళ్ళుగా పక్షవాతంతో బాధపడుతూ చిలకలూరిపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధాప్యం పైబడటంతో కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. శనివారం ఉదయం గణపవరం నుంచి నాదెండ్ల వెళ్ళే డొంక రోడ్డులో ఐసీఎం కంపెనీ సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్ఐ వెంకయ్య సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. -
సమష్టి కృషితోనే నూతన ఆవిష్కరణలు
చేబ్రోలు: పరిశోధనలకు విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసినప్పుడే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని హైదరాబాద్లోని జీనోమిక్స్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో డాక్టర్ రత్నగిరి పోలవరపు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘ప్లాంట్ సైన్స్ కొలోక్వియమ్’’ అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి కాన్ఫరెన్స్ను శుక్రవారం ప్రారంభించారు. సావనీర్ను ఆవిష్కరించారు. ‘‘బయోటెక్నాలజికల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోయాక్టివ్ ఫైటో కెమికల్స్ ఆఫ్ మెడిసినల్ వ్యాల్యూ’’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. జీనోమిక్స్, విజ్ఞాన్ వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కన్సార్టియం సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ జీనోమిక్స్ రీసెర్చ్ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య ప్రారంభించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రత్నగిరి పోలవరపు మాట్లాడుతూ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు వైద్యరంగం, ఔషధ తయారీ, వ్యవసాయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. జబల్పూర్లోని మంగళయాతన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ కేపీఎంఎస్వీ పద్మశ్రీ , వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తాజా అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మైసూరులోని సీఎస్ఐఆర్–సీఎఫ్టీఆర్ఐ ప్లాంట్ సెల్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్వీ శ్రీధర్, మేక జగన్మోహన్రావు, విజ్ఞాన్ సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఈవో మేఘన కూరపాటి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ కృష్ణకిషోర్, డీన్లు పాల్గొన్నారు. ‘జీనోమిక్స్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్’ ప్రెసిడెంట్, సీఈవో -
ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
గుంటూరు వెస్ట్: కవయిత్రి మొల్ల అసమాన ప్రజ్ఞావంతురాలని, ఆమె రచించిన రామాయణం నిత్యనూతనమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కవియిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జేసీ మాట్లాడుతూ మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను, ఆమె జీవిత చరిత్రను వివరించారు. అచ్చ తెలుగు పదాలతో గద్యరూపంలో సామాన్య ప్రజలకు అర్థం అయ్యేట్లు ఆమె రామాయణాన్ని రచించారని చెప్పారు. ఆమె గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి రాజులు మొల్లమాంబకు కవిరత్న బిరుదుతో సత్కరించారని తెలిపారు. ఆమె పాండిత్యం, అసమాన ప్రజ్ఞ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, వేములకొండ శ్రీనివాస్, చింతనగుండ వాసు, జె.నాగేశ్వరరావు, యు.వెంకటేశ్వర్లు, రాజవరపు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్లో సురక్షితమైన, నమ్మదగిన నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం బ్రాడీపేటలో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ సురక్షితమైన ఉత్పత్తులతోనే విశ్వసనీయ వినియోగదారులు ఉంటారని చెప్పారు. వినియోగదారులకు రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అధునాతన డిజిటల్ వస్తువుల వరకు సాంకేతికతతో నడిచే మార్కెట్లో అందుబాటులో ఉండటం వలన అవి సురక్షితంగా, నమ్మదగినవిగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ముఖ్యమని అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 గురించి ప్రజల్లో అవగాహన కల్పించి, చట్టాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, లీగల్ మెట్రోలాజీ జాయింట్ కంట్రోలర్, వినియోగదారుల ఫోరం సభ్యులు, వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం ప్రారంభం
ఏఎన్యూ(పెదకాకాని): దేశ ఐక్యత, సమగ్రతను బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ కేంద్రం గుంటూరు వారు నిర్వహిస్తున్న అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఏఎన్యూలో జరిగిన ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్రం నుంచి మొత్తం 37 మంది యువతి యువకులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో సంస్కృతి, ఉపాధి అవకాశాలు, సాంకేతికత వంటి అంశాలపై పరస్పర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ జానపద నృత్య ప్రదర్శనలు, క్షేత్రస్థాయి సందర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడంలో ఇటువంటి యువజన సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం.సుధాకర్, మై భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, ఓఎస్డీ ప్రొఫెసర్ ఆర్వీఎస్ఎస్ఎన్ రవి కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దివ్యతేజోమూర్తి తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో యువత సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
గుంటూరు జీజీహెచ్లో కేంద్ర కమిటీ పరిశీలన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు పలు వార్డులను పరిశీలించారు. ఎన్ఐసీ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ రవీంద్రకుమార్, జాయింట్ డైరెక్టర్ రాజ్కుమార్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చెందిన రూపల్ ప్రకాష్, శ్యామల్రావు, హుస్సేన్లు అధికారుల బృందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు ఆన్లైన్లో నెక్ట్స్జెన్ పేరుతో నమోదు చేసేందుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా గుంటూరు జీజీహెచ్లో కాగిత రహిత ఓపీ సేవలు రోగులకు అందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జీజీహెచ్ అధికారులు నెక్ట్స్జెన్ పేరుతో రోగుల డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను నమోదు చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను ఏవిధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం స్వయంగా పరిశీలించారు. అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రిలో పరిశీలనకు తరలి వెళ్లారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ కలెక్టర్, స్పెషల్ అడ్మినిస్ట్రేటర్ సుధారాణి, అడ్మినిస్ట్రేటర్ డి.ప్రవీణ్కుమార్, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ప్రసాద్, తదితరులు కేంద్ర బృందం వెంట ఉండి వారికి సమాచారం అందజేశారు. -
ఖబరస్తాన్ మీదుగా వంతెన నిర్మాణం తగదు
శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి మంగళగిరి టౌన్ : మంగళగిరి–తెనాలి రోడ్డులో ఖబరస్తాన్పై బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన శ్రేయస్కరం కాదని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని తాళ్ళాయపాలెంలో శుక్రవారం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డు విస్తరణ అంశంపై స్పందించిన ఆయన హిందూ సంప్రదాయం దృష్ట్యా ఇలాంటి నిర్మాణాలపై రాకపోకలు అనుకూలంగా ఉండవని పేర్కొన్నారు. తెనాలి రోడ్డు విస్తరణపై ప్రజలు, మత పెద్దల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. వీటిని గౌరవంగా పరిగణనలోకి తీసుకుని మంత్రి నారా లోకేష్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. నగరంపాలెం: గ్యాస్ బుకింగ్ పేరుతో జరిగే సరికొత్త సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుని, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆన్లైననులో గ్యాస్ బుకింగ్కి వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనంగా కేటాయిస్తామని సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని చెప్పారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వెబ్సైట్ లింకులు పంపిస్తూ ముందుగా డబ్బులు చెల్లిస్తే వెంటనే గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని అన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మంగళగిరి టౌన్ : విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందిన ఉయ్యాల చందు (27) మంగళగిరి మండలం ఆత్మకూరులోని వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం పని నిమిత్తం ఆత్మకూరు వాటర్ ప్లాంట్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి వాటర్ ట్యాంక్ ఉన్న ఆటోతో మంగళగిరి పట్టణం టిప్పర్ల బజార్లో నారాయణ స్కూల్కు చేరుకున్నాడు. అక్కడి వాటర్ ట్యాంక్లోకి ఆటోలోని ట్యాంక్ నుంచి పైపు ద్వారా నీరు నింపుతున్నాడు. విద్యుత్ వైర్లు, వాటర్ ట్యూబ్స్ ఎర్త్ కావడంతో ఆటోలో కూర్చుని ఉన్న చందుకు విద్యుదాఘాతం తగిలింది. సిబ్బంది అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్: సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంలో ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని పంజాబ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఇంద్రపాల్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.ఎస్. నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్ సమాచార హక్కు కమిషన్ పనితీరు, సెకండ్ అప్పీల్ కేసులను ఎలా డిస్పోజ్ చేస్తున్నారో వివరించారు. అనంతరం ఇంద్రపాల్ సింగ్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ పాల్గొన్నారు. నెహ్రూనగర్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ రెండో రోజు కూడా కొనసాగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మీట్లో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు శుక్రవారం క్రికెట్, ఇతర పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, త్రోబాల్, స్కిప్పింగ్, 100 మీటర్స్ వాకింగ్, టెన్నికాయిట్ డబుల్స్, చెస్, క్యారమ్స్ వంటి పోటీలు జరిగాయి. స్పోర్ట్స్ మీట్ శనివారంతో ముగుస్తుందని డీసీ శ్రీనివాసులు చెప్పారు. -
ఏసీబీ ఉమ్మడి గుంటూరుకు ఉగాది పురస్కారాలు
నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం ఉగాది–26 పురస్కారాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుంటూరు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉత్తమ, రెండు సేవా పతకాలు లభించాయి. ఉమ్మడి జిల్లా అదనపు ఎస్పీ మహేంద్ర మత్తేకు సేవా పతకం, హెడ్కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావుకు ఉత్తమ సేవా పతకం, కానిస్టేబుల్ యు.సురేష్బాబు సేవా పతకానికి ఎంపికయ్యారు. ఏఎస్పీ మహేంద్ర మత్తే తొలుత గ్రేహాండ్స్, విశాఖపట్నం, పాడేరు, విజయవాడ జీఆర్పీ, విశాఖపట్నం అర్బన్ ఇంటిలిజెన్స్, శ్రీకాకుళం జిల్లా డీఎస్పీగా, విశాఖపట్నం సిటీ టాస్క్ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. 2023లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, ఏసీబీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు బదిలీయ్యారు. రుక్మిణి కల్యాణం అలంకారంలో నరసింహస్వామి మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రుక్మిణి కల్యాణం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణా ధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్రప్రసాద్ కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా ప్రగడ నరసింహమూర్తి వ్యవహరించారు. దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.57 లక్షలు విరాళం నగరంపాలెం: స్థానిక లాలాపేటలోని పురాతనమైన శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం పునఃనిర్మాణానికి గుంటూరు కొత్తపేట పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వీరగంధం సుబ్బారావు రూ.57 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం సుబ్బారావు ఆయన భార్య సువర్ణపద్మావతి జ్ఞాపకార్థం లాలాపేట శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్యాంక్ ఖాతాకు నగదు జమ చేశారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో దాత సుబ్బారావుని సత్కరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ టి.సుభద్ర, మిర్చియార్డు డైరెక్టర్ కొనకళ్ల సత్యం పాల్గొన్నారు. కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ నరసరావుపేట:పట్టణంలోని కుమ్మరబజార్లో ఆ వర్గీయులు ఏర్పాటుచేసిన తొలి తెలుగు మహిళ రామాయణం కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కవయిత్రి మొల్ల గొప్పతనం గురించి వివరించారు. సమీపంలోని మహాలక్షమ్మ చెట్టు వద్ద పూజలు చేశారు. ఇరువురిని కుమ్మరి సంఘ వర్గీయులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీపీ మంగమ్మ, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు తొర్లకొండ చిన అంజయ్య, ఇంటలెక్చువల్ ఫోర్ రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, పట్టణ వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, నాయకులు మోరా శ్రీనివాసరావు, షేక్ శిలార్, సంఘ నాయకులు పాల్గొన్నారు. -
మేట..బడా బాబులకు మేత
వివిధ శాఖల అధికారులు సమన్వయలోపం వల్ల ఇష్టారాజ్యంగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ అనుమతులు రైతులకు శాపంగా మారుతున్నాయి. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపు పేరుతో అనుమతుల వల్ల రాబోయే రెండు మూడేళ్లలో లంక భూములు కనుమరుగు అవుతాయి. వేలాది మంది రైతులు నష్టపోతారు. పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుంది. –ముసునూరు సోహాస్, ఏపీ రైతు సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తాడేపల్లిరూరల్: కృష్ణానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకునేందుకు బడా బాబులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. దీనిపై లంక భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో ఇసుక తవ్వేటప్పుడు కనీసం అక్కడ ఉన్న రైతులను సంప్రదించాల్సి ఉంది. కానీ ఇష్టారాజ్యంగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో లంక భూములు మాయమవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల లంక భూములు కృష్ణానదిలో కలిసిపోయాయి. కృష్ణాజిల్లా చోడవరం గ్రామంలో ఇసుకరీచ్–2కు అనుమతులు ఇవ్వడం, చోడవరం ప్రాంతంలోనే ఓ బడా బాబు భూమిలో ఇసుక మేట వేసిందంటూ చెబుతూ దానిని తొలగించేందుకు అనుమతులు తెచ్చారని వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లోని లంక భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు ఒక మీటరుకు ఇస్తే ఐదారు మీటర్లు తవ్వుతారని, అధికారుల పర్యవేక్షణ ఉండదని, దీంతో దిగువ ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాలు చిన్నపాటి వరదకు పంటలు కొట్టుకుపోతాయని, అధికారులు కనీసం పరిశీలించకుండా అనుమతులు ఇవ్వడం ఏమిటంటూ ఆ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతం వైపు లంక భూములు పల్లంగా ఉంటాయని, ఎత్తుగా ఉన్న వైపు ఇసుక మేటలు లేకపోయినా, నల్లమట్టి ఉన్నా మేటలు వేశాయని తప్పుడు రిపోర్టులతో ఈ అనుమతులు ఇస్తున్నారు. దీనివల్ల మూడు నుంచి ఐదు లక్షల క్యూసెక్కులలోపు వరద వస్తే లంక గ్రామాల్లోని పంటలు నీట మునుగుతాయి. ఈ ప్రాంతంలో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పంటలకు నష్టం జరగదు. 7–8 లక్షల క్యూసెక్కుల వరద వస్తే లంక భూములు మునిగిపోతాయి. లంక భూముల్లో మట్టిని తొలగించడం వల్ల ఆ ప్రాంతంలో మట్టి కొట్టుకుపోయి లంక భూములు కనుమరుగవుతాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు తీవ్ర అన్యాయం చోడవరం, చిర్రావూరు, రామచంద్రాపురంలతోపాటు దుగ్గిరాల మండలంలోని పలు ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు సొసైటీ కింద భూములు కేటాయించారు. ఈ భూముల్లో పసుపు, కంద, మొక్కజొన్నలతోపాటు ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రెండుసార్లు పంటలు వేస్తారు. పంటలు వేసే సమయంలో రెండుమూడు సార్లు వరద వచ్చినా కొద్దిపాటి నష్టమే జరుగుతుంది. ఈ ఇసుక తవ్వకాల వల్ల పంటలు పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. పశుపోషణ కష్టం ప్రభుత్వ, ప్రైవేటు లంక భూముల్లో పశువుల మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. లంక భూ ముల్లో ఉన్న మట్టిని తొలగించడం వల్ల ఇసుక బయటపడి పచ్చిమేత కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే పోషణ సరిగా లేక పశువులు అంతరించిపోతున్నాయి. వ్యాపారుల స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూములను కూడా నాశనం చేస్తే పాడిపరిశ్రమ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక భూముల్లో తవ్వకాలు నిర్వహించడం వల్ల మా భూమి పూర్తిగా కృష్ణానదిలో కలిసి పోతుంది. ఈ మధ్యకాలంలో కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో ఇప్పటి కే లంక భూములు విరిగిపోయి నదిలో కలిసి పోయాయి. ఈ తవ్వకాల వల్ల మరింత నష్టం కలుగుతుంది. లంక భూముల తవ్వకాలతోపాటు పక్కనే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. లేకుంటే రైతులకు ఆత్మహత్యే శరణ్యం. –అయ్యప్పరెడ్డి, రామచంద్రాపురం లంక భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తే గొర్రెలు, మేకలు, గేదెలు మేపుకునేవారు వలస వెళ్లాల్సిందే. చిర్రావూరుతోపాటు ఈ చుట్టు పక్కల ప్రాంతంలో ఐదు వేల గొర్రెలు, మేకలను లంక భూముల్లోనే మేపుకుంటున్నాం. లంక భూములు పోతే మా జీవితాలు కూడా తారుమారవుతాయి. –యాదయ్య, గొర్రెల కాపరి -
ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
గుంటూరు ఎడ్యుకేషన్: పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల పరీక్ష కేంద్రంలో శుక్రవారం సీనియర్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అన్ని గదుల్లోకి వెళ్లి, విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్ష కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటును పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు బస్సు సౌకర్యం, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేసి, పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లాలోని 87 కేంద్రాల్లో జరిగిన ఫిజిక్స్ పేపర్–2 పరీక్షకు కేటాయించిన 28,118 మంది విద్యార్థుల్లో 27,730 మంది హాజరయ్యారు. -
గుంటూరు
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఏరియా ఆసుపత్రి తనిఖీ నరసరావుపేట: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించారు. నిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,500, గరిష్ట ధర రూ.8,500, మోడల్ ధర రూ.7,300 వరకు పలికింది. I -
ప్రభుత్వ ఇఫ్తార్ విందుపై టీడీపీలో లుకలుకలు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఇఫ్తార్ విందు టీడీపీలో దుమారాన్ని రేపుతోంది. తూర్పు ఎమ్మెల్యే గుంటూరు జిల్లాలో అంతా తానే చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆహ్వాన పత్రికలు పోస్ట్ చేయడంపై టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. ఆ నిధుల్లో గుంటూరు జిల్లాకు రూ.5 లక్షలు కేటాయించింది. మరలా వాటిలో మార్పులు చేసి దానిని రూ.4 లక్షలు కేటాయించినట్లు తెలుస్తుంది. ప్రతి ఏటా ప్రభుత్వం జిల్లా కలెక్టర్తోపాటు సంబంధిత జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇఫ్తార్ విందుకు కేటాయించిన నిధులను సొంత ఖర్చులకు వినియోగిస్తున్నట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో సుమారు లక్ష మందికి పైగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నాయి. అయితే గుంటూరు తూర్పు నియోజవర్గ శాసనసభ్యుడు తన సొంత ఖర్చులతో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసినట్లు ఆహ్వాన పత్రికలు వేయించడం చర్చనీయంశంగా మారింది. ఆహ్వానపత్రికలో ఎక్కడా పశ్చిమ ఎమ్మెల్యే చిత్రం లేకపోవడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే, పశ్చిమ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించకుండానే పొన్నూరు రోడ్డులోని బి కన్వెన్షన్లో ఏర్పాటుచేయడం విశేషం. ఇఫ్తార్ విందు ఏర్పాట్లు తూర్పు ఎమ్మెల్యే ఒక్కరే పరిశీలించడం కూటమి నాయకులు జీర్ణించుకోక పోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు.. తూర్పు ఎమ్మెల్యే చిత్రంతో ఇఫ్తార్ విందునకు మిమ్ములను ఆహ్వానిస్తున్నాం అంటూ కరపత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కరపత్రంపై ప్రభుత్వ లోగో, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫొటోలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి చిత్రం కూడా లేకపోవడంపై టీడీపీ నాయకుల మధ్య చర్చనీయంశంగా మారింది. అసలు గుంటూరు తూర్పు, పశ్చిమ, మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మైనారిటీ నాయకుల ఫొటోలు కూడా లేకపోవడంపై కూటమి పార్టీలో ఇఫ్తార్ కీ దావత్పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ ఇఫ్తార్ విందు తూర్పు నియోజకవర్గ ముస్లింలకు మాత్రమేనా? పశ్చిమ నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న మిగిలిన ఐదు నియోజకవర్గాల ముస్లింలకు కూడానా అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. -
మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఇరవై నెలల కూటమి పాలనలో కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడూ నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ) అధిగమించలేదని చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇవే మాటలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రకాటన విడుదల చేసే దమ్ముందా అంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. ఎన్బీసీ దాటి అప్పులు చేయలేదని పయ్యావుల పచ్చి అబద్దం చెప్పాడని కాగ్ వెబ్సైట్ సాక్షిగా ఆయన నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు కూటమి అప్పులు రూ. 1.05 లక్షల కోట్లని వారం రోజుల్లో నిరూపించలేకపోతే అబద్ధాల కేశవ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ, మండలిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. చంద్రగిరిలో ఉన్న చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ యూనిట్లో మెషినరీ అప్గ్రడేషన్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్పుల మంత్రి, అబద్ధాల కేశవ్రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ మీద మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాటలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన, తాను చేసిన ఆరోపణలు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయలేదు. ఈ అబద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్కరోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఆయన దగ్గరున్న ఆధారాలుంటే చూపించాలి కదా. వైఎస్ జగన్ ప్రెస్మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చేసిన పయ్యావుల.. ఏయే అంశాలు అబద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు దగ్గరుంటే బయటపెట్టాలి.మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో20 నెలల పాలనలో మా ప్రభుత్వం చేసింది కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పేనని, కానీ వైయస్ జగన్ గారు రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు చెప్పారని పయ్యావుల చెబుతున్నాడు. కానీ కరెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 లక్షల కోట్లు). కాగ్ లెక్కల ప్రకారం 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానికి పయ్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేనని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31నాటికి బడ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్సైట్ చెబుతోంది.అంటే, ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 లక్షల కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మరో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ.11,850 కోట్లు. ఫిబ్రవరి 2026, మార్చిలో ఎస్డీఎల్ బాండ్స్ ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.అప్పులు రూ.1.05 లక్షల కోట్లేనని లేఖ ఇప్పించు..వైయస్సార్సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని చెబుతున్న పయ్యావుల కేశవ్.. ఇదే మాటను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి స్టేట్మెంట్ రిలీజ్ చేసే దమ్ముందా? మంత్రి మాట్లాడింది అబద్ధం కాదని, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 1.05 లక్షల కోట్లేనని వారం రోజుల్లో రాయించి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే పయ్యావుల కేశవ్ ఛాంబర్ బయట అబద్దాల కేశవ్ అని పేరు మార్చుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నా.నెట్ బారోయింగ్ ఎక్కడా మా ప్రభుత్వం అధిగమించలేదని పయ్యావుల మరో అబద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసినట్టు కాగ్ వెబ్సైట్లో చెప్పింది. ఏపీ ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎక్కడా నెట్ బారోయింగ్ అధిగమించలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావులకు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్లో అప్పులపై తప్పుడు లెక్కలు రాసి ఇచ్చారో ఆ అధికారులందరిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధాని మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం.ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జరిగిందా?నిందితులను బాధితులుగా చేర్చడమే వైయస్ జగన్ పరిపాలన అంటాడు.. కూటమి ప్రభుత్వంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి వేధించి పలుమార్లు అబార్షన్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదే పదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశాడు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రి లోకేష్లను కలిసి మొర పెట్టుకుంటే ఆమె జరిగిన న్యాయం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? ఆ కేసులను చూసి హైకోర్టు చీవాట్లు పెట్టలేదా? బాధితులను వేధించింది మీరు కాదా?హెరిటేజ్ మెషినరీ అప్గ్రేడ్ కోసం రూ.200 కోట్లు హెరిటేజ్ వ్యాపారం తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నారని, వారు ఏనాడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండర్లలో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండర్లలో ఏవేవీ సప్లై చేశారు? ఎల్ -3 గా ఎప్పుడు వచ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు సప్లై చేశారు వంటి అన్ని వివరాలు ఆయన మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అబద్ధం చెప్పాడని ప్రజలే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవడానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇదంతా దేవుడి మహిమ. చంద్రబాబు పాపాలను దేవుడే దగ్గరుండి బయటపెట్టిస్తున్నాడు.ఇది కాకుండా ఈరోజు కేబినెట్లో చంద్రగిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్లతో మిషనరీ అప్గ్రేడ్ కోసం ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్తగా 35 మందికి ఉద్యోగాలిస్తారట. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే చంద్రబాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిపెట్టారు? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏమిటని అడిగితే ఫ్లేవర్డ్ పాలు 131 శాతం అదనంగా ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అదనంగా వస్తుందట. వాటి వల్ల ప్రయోజనం ప్రజలకా? లేక హెరిటేజ్కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 పేరుతో హెరిటేజ్కి భారీ రాయితీలు ప్రకటించారు. కరెంట్ యూనిట్కి రూపాయి తగ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు.బీఆర్ నాయుడితో రాజీనామా చేయించలేరా?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చినా ఆయనతో ఇప్పటివరకు రాజీనామా చేయించని చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉందని ఎలా అనుకోవాలి? వీడియో బయటకొచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం చెందకుండా అంతలా బరితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్కి ఉన్న పాత బాగోతాలను ఆపాదించవచ్చా అని ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న.. అలాంటి బాగోతాలున్న వ్యక్తిని దేవుడి సేవకు వాడటం కరెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి తెలిసే టీటీడీ చైర్మన్గా నియామకం జరిగిందని బాధితురాలి లేఖల ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఆయన్ను చైర్మన్గా నియమించారు. వీడియోలు బయటకొచ్చినప్పుడైనా నిఆయనతో రాజీనామా చేయించి టీటీడీ ప్రతిష్ట కాపాడాలని అనిపించలేదా? లోకేష్ పాపానికి హెడ్ మాస్టర్ బలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ పేపర్ల నిండా వార్తలు, సోషల్ మీడియా నిండా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పిల్లల ఆవేదన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు.మధ్యాహ్న భోజనం బాగోలేదని మైలవరం తారకరామ నగర్ పాఠశాల హెచ్ఎం డ్రామా చేశాడని ఆంధ్రజ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్యత లేకుండా ప్రవర్తించాడన్న కారణంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్తవానికి వంట బాగోలేదని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్నట్టు హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎంక్వయిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండటం లేదని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు? సోషల్ మీడియా దెబ్బకి నారా లోకేష్ వైఫల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో హెడ్ మాస్టర్ను బలి తీసుకున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖను నిర్వహించడం చేతకానప్పుడు ఏశాఖా లేని మంత్రి పదవి తీసుకుని లోకేష్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థులకు మేలు చేసిన వాడవుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. -
హెరిటేజ్కి రాయితీలు.. ఏపీ కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: హెరిటేజ్కి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తుండగా.. చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్కి కేబినెట్ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెరిటేజ్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంట్ బిల్లులో యూనిట్ కి రూ.1 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566 శాతం, ఫ్లేవర్డ్ పాలు 131, పన్నీర్ 400 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద భారీ రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించలేదు. అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఏపీ కేబినెట్ ఆమోదించింది. -
ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నాం...
జిల్లా వ్యాప్తంగా ఈనెల 13 నుంచి ఉచితంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు వ్యాక్సిన్ వేస్తున్నాం. మూడు నెలల్లోగా జిల్లా వ్యాప్తంగా14 ఏళ్ల వయస్సున్న వారికే తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాక్సిన్ వేయాలంటే తప్పనిసరిగా బాలిక తల్లిదండ్రులు తమ సమ్మతి తెలియజేయాలి. జిల్లా వ్యాప్తంగా 83 ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం, శనివారం తప్ప మిగతా పనిదినాల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారు. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, గుంటూరు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.9,500, మోడల్ ధర రూ.9,000 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం గురువారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పొన్నూరు అంబేడ్కర్ సెంటర్లో కేక్ కట్ చేస్తున్న పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, పార్టీ నాయకులుగుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతున్న మాజీ ఎంపీ మోదుగుల, ఎమ్మెల్సీ యేసురత్నం, పార్టీ నాయకులు7 -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నెహ్రూనగర్: వారంతా నాలుగు పదులకుపైగా వయస్సు గలవారు. వయస్సుతో పనిలేకుండా పరుగులెత్తారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు మూడు రోజులపాటు స్పోర్ట్స్ మీట్ గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతు, ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు అరుణకుమారి, మణికంఠలు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. మొదటి రోజు 50, 100, 200 మీటర్లు రన్నింగ్, 400 మీటర్లు వాకింగ్, టెన్నికాయిట్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. నేడు క్రికెట్ ఇతర క్రీడలు ఉంటాయని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు దుర్గాప్రసాద్, శ్రీలత, ఏఈఎస్లు మారయ్యబాబు, రవీంద్రలు, రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నరసింహ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామేశ్వరరావు, కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యశోధర దేవి, ఉమ్మడి గుంటూరు జిల్లా కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటయ్య, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. గుంటూరు ఇంజినీర్కు గుర్తింపు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరుకు చెందిన యువ ఇంజినీర్ ఆకెళ్ళ నరసింహ సాయినాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో డైమెన్షనల్ ఇంజినీరింగ్ రంగంలో గణనీయమైన ముద్ర వేసిన కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత హూస్టన్లోని టెస్లా సంస్థ నుంచి ఆఫర్ అందుకున్నారు. గుంటూరులో పుట్టి పెరిగిన సాయినాథ్ తన పాఠశాల విద్యను బ్రాడీపేటలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం సత్తెనపల్లి మండలంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన సాయినాథ్, గత దశాబ్దంలో అత్యంత సమర్థుడైన డైమెన్షనల్ ఇంజినీర్గా ఎదిగారు. ప్రతిష్టాత్మకమైన అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఏఎస్ఎంఈ), జీడీ అండ్ టీ, సీనియర్ లెవల్ సర్టిఫికేషన్ పొందారు. దాదాపు 30 మంది ఇంజినీర్లకు ఆయన మార్గదర్శకత్వం వహించారు. -
నేడు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల
నూజండ్ల:మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో శుక్రవారం కోటిగట్ల ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల నిర్వహించనున్నారు. తిరునాళ్ల సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మొక్కుబడి ప్రభను ఏర్పాటుచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది గ్రామస్తులంతా ఐకమత్యంతో తిరునాళ్లను జరుపుకోవటం ఆనవాయితీ. నూజండ్ల, రెడ్డిపాలెం, దాట్లవారిపాలెం, మారెళ్లవారిపాలెం, తలార్ల పల్లె, అప్పాపురం తదితర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులుపాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెద్దలు తెలిపారు. రేపల్లె: బాపట్ల జిల్లా మైనేనివారిపాలెం గ్రామంలోని శ్రీ గురు నిలయంలో శ్రీగాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామికి సుప్రభాత సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని, దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం శ్రీ రంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కై ంకర్యపరులుగా కొడాలి సీతారామయ్య, బసవానంద్, వెంకట అజయ్లు, ఆస్థాన కై ంకర్యపరులుగా పచ్చళ్ల విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. నకరికల్లు: ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న మరో లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న లారీ బోల్తా పడింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటన మండలంలోని చల్లగుండ్ల వద్ద అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం జరిగింది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ వైపు నుంచి కోడిగుడ్లు లోడుతో లారీ చెన్నయ్కు బయలుదేరింది. మార్గమధ్యలో చల్లగుండ్ల వద్ద రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ వంట చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వస్తున్న కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టడంతో కోడిగుడ్ల లారీ హైవే పక్కన ఉన్న పొలాలలో బోల్తా పడింది. దీంతో లారీలోని సుమారు రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వ్యాక్సిన్ వచ్చిందోచ్..!
అక్కలారా..అమ్మలారాఇక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు చెక్ గుంటూరు మెడికల్: క్యాన్సర్ కేసులను ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను తగ్గింపు చేసి మరణాలు నివారించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్కు వ్యాక్సిన్ అందజేస్తుంది. ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా ఉచితంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. కేవలం 14 ఏళ్ల వయస్సున్న బాలికలకే తొలి ప్రాధాన్యం ఇచ్చి వారికి మాత్రమే వ్యాక్సిన్ వేసేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు రంగం సిద్ధం చేశారు. ఒక పక్క స్క్రీనింగ్... మరో పక్క వ్యాక్సిన్.... కారణాలు..... బాలికల సంఖ్య 22,400 -
క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఉంది...
క్యాన్సర్ రాకుండా నేడు హెచ్పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు తొద్మిదేళ్ల నుంచి 20 ఏళ్ల లోపువారికి ముందస్తుగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. రెండు మోతాదుల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. టీకాలు చాలా సురక్షితమైనవి. 30 నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలు ఏడాదికి కనీసం ఒకసారైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు. -
పేదలు గర్వపడేలా వైఎస్సార్ సీపీ ఆవిర్భావం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ప్రతి పేదవాడు గర్వపడేలా.. విద్య, వైద్యం, న్యాయం మన హక్కు అని చాటి చెప్పేలా, యువ భావజాలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ జెండాను మోదుగుల, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమమే ఽకోసం వైఎస్సార్సీపీ పుట్టిందన్నారు. దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్డర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చేలా వైఎస్ జగన్ దృష్టి సారిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ పదహారేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారే తప్ప.. ఏ రోజు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉందా.. ప్రతిపక్షంలో ఉందా అనేది చూసుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాంరసూల్, అనుబంధ విభాగాల నేతలు వంగల వలివీరారెడ్డి, పఠాన్ సైదాఖాన్, యర్రెడ్ల వెంకటేష్రెడ్డి, మారంరెడ్డి భాస్కర్రెడ్డి, చింతపల్లి వెంకటరమణ, రమణి, షరిఫుద్దీన్, కొత్తా చిన్నపరెడ్డి, నర్సిరెడ్డి, వెంకాయమ్మ, కోటి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి -
తెనాలిలో భారీ చోరీ
10 కిలోల వెండి, 10 గ్రాముల బంగారం అపహరణ తెనాలి రూరల్: తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ సాయి బాలాజీ జ్యుయలర్స్లో బుధవారం అర్ధరాత్రి దాటాక భారీచోరీ జరిగింది. షాపు తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గూర్ఖా గమనించి యజమానికి ఫోన్ చేసి పిలిపించడంతో విషయం బయటపడింది. షాపు యజమాని ఫిర్యాదుతో సీఐ రాముల నాయక్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. దాదాపు తొమ్మిది కిలోల వెండి ముడి సరుకు, ఒక కిలో వెండి వస్తువులు, 10 గ్రాముల బంగారం అపహరణకు గురైనట్లు షాపు యజమాని ఫిర్యాదు చేశారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. సీసీ టీవీ ఫుటేజ్ల్లో ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి వెళుతున్నట్టు గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
● గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బృందాలుగా సోదాలు ● 26 సిలిండర్లు సీజ్ చేసి కేసులు నమోదు
నగరంపాలెం: గుంటూరు, పల్నాడు జిల్లాలలో వాణిజ్య అవసరాలకు గృహావసరాల ఎల్పీజీ సిలెండర్లను అక్రమంగా వాడే దుకాణాలు, హోటళ్లపై గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కట్టమూరి వారి వీధిలోని స్వీట్ షాప్లో తనిఖీ చేయగా, యాజమాని ఐదు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నరసరావుపేట రోడ్లో ఐదు, గుంటూరు నగరంలోని లిబర్టీ సెంటర్లో బిర్యానీ హోటల్లో మూడు, ఓ కిచిడీ పాయింట్లో మూడు, ఆటోనగర్ ఇందిరానగర్ హోటల్లో ఐదు, కిచిడీ పాయింట్లో ఐదు సిలెండర్లను గుర్తించి స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 26 గృహ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లను సీజ్ చేసి, స్థానిక సీఎస్డీటీలకు అప్పగించారు.కేసులు నమోదు చేశారు. గుంటూరు ప్రాంతీయ విజిలెనన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
‘చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.ఈరోజు(గురువారం, మార్చి 12వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మల్లాది విష్ణు.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోంది. దసరా సమయంలో కనకదుర్గ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వంలో స్పందన లేదు.శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే. గతంలో ఆలయాల్లో ఇలాంటి అపశృతులు జరగలేదు. తిరుమల పరకామణిలో కోటి విలువైన బంగారం చోరీ కేసును సీరియస్గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో విపరీతంగా అపచారాలు జరుగుతున్నాయి. చివరకు దేవునికి కూడా సరైన నైవేద్యం కూడా పెట్టటం లేదు.కోటప్పకొండ ఆలయంలో నాసిరకం ప్రసాదాలు పెట్టి అపచారం చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?, పంచారామాలలో సైతం అపచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బీఆర్ నాయుడు రాసలీల వీడియోలు బయటకు వచ్చాయి. అయినాసరే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు?, పైగా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తారా?, హిందూ ధర్మాన్ని కాపాడే వారైతే కచ్చితంగా బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు,దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు’ తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. -
పార్థసారథి అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా నాగేశ్వరరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు. నేడు శ్రీరంగనాయకులు అలంకారం... శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శ్రీరంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈవో సునీల్కుమార్ కోరారు. తాడేపల్లి రూరల్ : కృష్ణానది దిగువ ప్రాంతంలో బ్రిటీష్కాలం నాటి రైల్వే బ్రిడ్జి పిల్లర్లను తొలగించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు చేపట్టారు. మొదటి పిల్లర్ను పగలకొట్టడం ప్రారంభించి బుధవారానికి వారం రోజులు దాటింది. ఆ పిల్లర్ను సగం కూడా పగలకొట్టేందుకు భారీ బ్రేకర్ వల్ల కావడం లేదు. నల్లరాయి, సిమెంట్తో కట్టిన ఈ బ్రిడ్జి చాలా దృఢంగా ఉంది. సగం వరకు పిల్లర్ను పగలకొట్టి పెద్ద పెద్ద జేసీబీలు తీసుకువచ్చి తోసినా పిల్లర్లను కదలించలేకపోతున్నారు. కృష్ణానదిలో మొత్తం 15 పిల్లర్లు ఉన్నాయి. రైల్వే అధికారులు ఈ పిల్లర్లను తొలగించి డబుల్లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక పిల్లర్ పగలకొట్టడానికి సుమారు 15 రోజుల వ్యవధి పడుతుందని, 15 పిల్లర్లు తొలగించాలంటే రెండు బ్రేకర్లు 5 నెలలు సమయం పడుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఇండియన్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే పురస్కారాల్లో భాగంగా గుంటూరుకు చెందిన శాఖమూరు పద్మ పెయింటింగ్స్ అండ్ క్లే క్రాఫ్ట్స్ విభాగంలో ‘ఇండియా ఆర్ట్స్ 2026’ అవార్డు పొందారు. ఈ మేరకు బుధవారం శాఖమూరు పద్మ అవార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. సైన్స్లో బీఈడీ పట్టభద్రురాలైన పద్మ కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసి, పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై ఉన్న మక్కువతో ఆయా అంశాల్లో బోధకురాలిగా మారారు. ఐదేళ్ల వయసు మొదలు అన్ని వయసుల వారికి వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్స్ నేర్పుతున్న పద్మ ప్రస్తుతం గుంటూరు జిల్లా లాం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
ఒడిశా నుంచి గుంటూరుకు గంజాయి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గంజాయి క్రయ విక్రయాలు చేసే 14 మందిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7.6 కిలోల గంజాయి, మత్తు బిళ్లలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ● గంజాయి క్రయ, విక్రయాలు చేస్తున్నారనే ముందస్తు సమాచారంతో బుధవారం చౌడవరం గ్రామంలో నల్లపాడు పీఎస్, సీసీఎస్ పోలీసులు సోదాలు చేశారన్నారు. ఈ క్రమంలో 14 మందిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ● చౌడవరం గ్రామ వాసి తోట గోపాలకృష్ణ అలియాస్ సాయి, బాపట్ల పర్చూరు మండలం నూతలపాడు గ్రామ వాసి కొల్లూరి నందీశ్వర్ అలియాస్ వరికూటి గౌరీశంకర్, షేక్.ఉస్మాన్ (పాతగుంటూరు), షేక్.సనావుల్లా అలియాస్ ఇర్ఫాన్ (కొత్తపేట), పఠాన్ జానీబాషా (వెంకటరావుపేట, పాతగుంటూరు), పోతార్లంక శ్యామ్ (అల్లీనగర్, పాత గుంటూరు), చల్లా వెంకటేశ్వర్లు (సాయిబాబా కాలనీ), నక్కా సాంబశివరావు (సాయిబాబా కాలనీ), కొడవటి హనోక్ (అల్లీనగర్), షేక్.జబ్బార్ (చంద్రబాబునాయుడు కాలనీ), బజంత్రీ దుర్గాప్రసాద్ అలియాస్ అమ్ము (ఆనందపేట), చల్లా వెంకటేష్ అలియాస్ చాపా, బత్తుల నాగ రాజు, కనిగిరి నాగరాజు అలియాస్ పిల్లి (లాలా పేట)లను అరెస్ట్ చేశారని అన్నారు. ● వీరి నుంచి 7.6 కిలోల గంజాయి, మత్తు బిళ్లలు సీజ్ చేశారని చెప్పారు. 32 ఏళ్ల లోపు వారే.. ● ఇందులో సాయి, గౌరీశంకర్ కీలకంగా వ్యవహరించేవారు. సాయిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉందన్నారు. వీరిద్దరూ ఈనెల 6న ఒడిశా వెళ్లి 8 కిలోల గంజాయిని గుంటూరు తీసుకొచ్చారని చెప్పారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు రైల్వేస్టేషన్ల పరిసరాల్లో తిను బండారాలు విక్రయించేవారని అన్నారు. గంజాయిని సాయి తన ఇంట్లో నిల్వ చేసేవాడని చెప్పారు. తద్వారా చిన్న పొట్లాలుగా చేసి మిగిలినవారు విక్రయించేవారని అన్నారు. ● షేక్ ఉస్మాన్, షేక్ ఇర్ఫాన్, పఠాన్బాషా, శ్యామ్లు మత్తు బిళ్లలు సైతం విక్రయించినట్లు తెలిపారు. వీరిలో 23 ఏళ్ల ఉస్మాన్ ఓల్డ్క్లబ్ రోడ్డులో మెడికల్ దుకాణం నిర్వహించేవాడని గుర్తించారు. ఇతను ఆన్లైన్లో మత్తు బిళ్లలు బుక్ చేసేవాడని అన్నారు. పట్టుబడిన 14 మంది 32 ఏళ్ల లోపు వారేనని చెప్పారు. -
బాబును సీఎంగానే భరించకపోతున్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైఎస్ జగన్ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పుకొచ్చారు. -
బీఆర్ నాయుడు, జనసేన శ్రీధర్పై చర్యలేవి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్యలేవి? అని నిలదీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.లిస్ట్ ఇదే.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్ఐ, పాస్బుక్ క్యూఆర్ కోడ్ భూమలు జియో ట్యాగింగ్ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని చంద్రబాబు ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్లో మోసాలు కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పింది. నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు. 2023-24లో రాబడులు రూ.1,70,767 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు రూ.32,680 కోట్లు. ద్రవ్యలోటు రూ.62,719 కోట్లు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వంలో రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు.అప్పుల్లోనూ ఉల్లంఘనలే.. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి. రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. కూటమి వచ్చాక ద్రవ్య లోటు 32.5 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే. 2024-25లో జీఎస్డీపీలో అప్పుల శాతం 5.89 శాతం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం 4.1 శాతమ మాత్రమే. మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయినా అప్పులు 4.1 శాతం మాత్రమే చేశాం. ఎన్బీసీకి లోబడే ఎవరైనా అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య అనుమతించిన దాని కన్నా అధికంగా అప్పులు చేశారు. చంద్రబాబు రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు చేశారు. మా హయాంలో పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశాం. రూ.12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. కరోనా పరిస్థితులు కూడా తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు రాగానే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధిక అప్పులు. 20 నెలల్లో బాబు తెచ్చిన అప్పులు 3.20 లక్షల కోట్లు దాటాయి. మేము ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. మేము ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు రెండేళ్లలోనే చేశారు. ఏపీని దోచుకుంటున్నారు కాబట్టే ఆదాయం పెరగడం లేదు.కేంద్రానికి లేఖ రాస్తాం..బినామీలు, ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో రూ.5000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. ఇలా దోచిపెడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదు. చంద్రబాబు పాలన చేయడం లేదు.. బిల్డప్ మాత్రమే. 2024-25 కాగ్ రిపోర్టు ప్రకారం అప్పు రూ.81,082 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని బాబు తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు సమాచారంపై కేంద్రానికి లేఖ రాస్తాం. డీవోపీటీకి, కేబినెట్, ఫైనాన్స్ సెక్రటరీలకు లేఖ రాస్తాం' అని అన్నారు. -
చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్ నివేదికే సాక్ష్యం
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయినేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు 2023-2024లో రాబడులు రూ.1,70,767 కోట్లు చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56శాతం పెరిగిందిచంద్రబాబు వచ్చాక రాబడులు తగ్గాయిచంద్రబాబు వచ్చాక ద్రవ్య లోటు 30శాతం పెరిగిందికోవిడ్ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా నెరవేర్చుతూ హామీలు నెరవేర్చాం.కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిందిచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారునెట్ బారో సీలింగ్ పరిధి దాటిందిరాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్ బారో సీలింగ్ పరిధి దాటిందిచంద్రబాబు అండ్ కో దోచిపెట్టడమే సరిపోతుందిమట్టిని,ఇసుక,భూములు,లిక్కర్ దేన్ని వదలడం లేదుఅన్నీంట్లో దోపిడీయేప్రభుత్వానికి ఆదాయానికి ఎలా వస్తుందిప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందివీళ్ల దోపిడికి వైజాగ్లో జరిగిన భూదోపిడీయే నిదర్శనంఇలా చేస్తే ఆదాయాలు వస్తాయి.చంద్రబాబు పాలనకు ఆయన బిల్డప్కు తేడా చూపించే మరో చరిత్రఓవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తారుఅప్పులు చేస్తారుఆ అప్పులు బయట పడకుండా దాచేస్తే ప్రయత్నం చేస్తారుకాగ్ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లుకానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్లు సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉంది16రోజుల అసెంబ్లీ సమావేశాలతో ప్రజలు ఒరిగింది సున్నాచంద్రబాబుఅధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్:2024-25లోనే పరిమితికి మించి రూ.17,953కోట్లు అధికంగా అప్పులు తీసుకువచ్చారు:ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘోరంగా ఉంది.ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లు:మా హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారు: మా ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే : ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను Damage చేశారన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది:రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు: విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావడంలేదు:వనరులన్నింటినీ కూడా దోచేసి సొంత జేబులు నింపుకుంటున్నారు:ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్, లెటరైట్, గ్రానైట్, లిక్కర్, భూములు, అధిక రేట్లకు పీపీఏలు దేన్నీ వదిలిపెట్టడంలేదు:దోపిడీ జరిగితే, ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తుంది?విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారుచవకగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు:రూ.5వేల కోట్ల విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జాచేస్తున్నారు:పొక్లెయిన్లతో లెవల్ చేసి, ప్రభుత్వం పెట్టిన బోర్డులను పీకేసి ఆక్రమించుకుంటున్నారు:ఇంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి, ఆయన బంధువు, లోక్సభ ఎంపీ కలిసి ప్రజల ఆస్తులను దోచేస్తున్నారు:ప్రభుత్వంతోపాటు వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయి:ప్రజల ఆస్తులను రాబందుల్లా కొల్లగొడుతున్నారుఆర్బీఐ అడ్వాన్స్లమీద ఆధారపడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో,మినిమం బ్యాలెన్స్ నగదు నిల్వ ఉండే రోజులు పడిపోయాయి:ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో నగదు నిల్వలున్న సమయం కేవలం 8 రోజులకు పడిపోయింది. 365 రోజుల్లో 357 రోజులు మినిమం బ్యాలెన్స్ కూడా ట్రెజరీల్లో లేవు. చంద్రబాబు తాను చేస్తున్న పరిపాలనకు, ఆయన ఇస్తున్న బిల్డప్కు మధ్య తేడా కనిపిస్తోంది:వైయస్సార్సీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారుచేస్తున్న అప్పుల్ని బయటకు రానీయకుండా దాచేసే ప్రయత్నంచేస్తున్నారు.2024-25లో చేసిన బడ్జెట్ అప్పులు రూ.60,485 కోట్లని వీళ్ల ప్రభుత్వం చెప్తోంది, కాని కాగ్ మాత్రం ఆ ఏడాదిలో చేసిన అప్పులు రూ.81,071 కోట్లని తేల్చిచెప్పింది. దాదాపుగా రూ.20 వేల కోట్ల అప్పులను, వాస్తవంకంటే తక్కువ చేసి చూపించారు. 2024-25లో బడ్జెట్ వెలుపల చేసిన అప్పులపై వివరాలు ఇవ్వమని మండలిలో రాతపూర్వకంగా ప్రశ్నించాం: అలాంటి అప్పులేవీ చేయలేదంటూ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నంచేసింది: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు, ప్రభుత్వ గ్యారంటీతో, పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటన్నింటినీకూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనక ఏమంటారు? కాని వాటి లెక్కలను చెప్పడం లేదుసభను తప్పుదోవ పట్టించిన అధికారులపై డీవోపీటికి ఫిర్యాదు చేస్తాం మొత్తం 16 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చూస్తే, తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్డబ్బాలు తప్ప ప్రజలకు ఒరిగింది సున్నా చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, చంద్రబాబుకి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్లిద్దరికీ పవన్కళ్యాణ్ మరొక జాకీ పెట్టి లేపుతాడు ఆత్మస్తుతి... పరనింద మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టారుసూపర్ సిక్స్,సూపర్ సెవన్లు లేవు నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు 18ఏళ్లు నిండిన 60ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధికింద రూ.1500ఇస్తామని హామీ ఇచ్చారు మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావన లేదుప్రతి నిరుద్యోగికి రూ.1.08లక్షల బకాయి పడ్డారుఈ బడ్జెట్లలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు ఇదే విషయం గురించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా50ఏళ్లు నిండిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు నెలకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామన్నారు. హామీ అమలు చేశారా?మా హయాంలో 66,34,372 మందికి పెన్లను ఇచ్చాం2026ఫిబ్రవరి నాటికి 60,96,108 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు2026 మార్చి నాటికి 60,69,664 పెన్షన్లు మాత్రమే ఇచ్చారుఒక్క నెలలో 25వేల పెన్షన్లు కట్ చేశారుమా హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాంపెన్షన్ల కోసం బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లుబడ్జెట్లో పెట్టింది రూ.27,719కోట్లు మాత్రమే భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉందిపెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదుudisc ప్రకారం 87,41,885 మందికి అమ్మ ఒడి ఇచ్చాంతల్లికి వందనం పేరుతో 20లక్షల మంది పిల్లలను తొలగించారుఉచిత బస్సు హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయారు ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పడంలేదు:పిల్లల సంఖ్యకు తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవని గట్టిగా ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపలేదు ఉచిత బస్సు ప్రయాణానికి దారుణమైన షరతులు పెట్టారు16 రకాల సర్వీసులు ఉంటే 5 రకాల సర్వీసులకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నిస్తే… నోరుమెదపలేదు. “రైతు భరోసా’’ కింద మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మాట్లాడలేదు. రెండేళ్లకు గాను ఇవ్వాల్సింది రూ.40వేలు, ఇచ్చింది పదివేలే:ఈ పథకానికి దూరంచేసిన 7 లక్షలమంది రైతుల పరిస్థితి ఏమిటి అని అడిగితే నోరు మెదపలేదు:కౌలు రైతులకు ఒక్కరూపాయికూడా ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే దానిగురించి కూడా మాట్లాడలేదు.ప్రీమింయ కట్టకపోవడం వల్ల 2023-24, 2024-25 వ్యవసాయ సీజన్లలో రూ.3,500 కోట్లు రైతులు నష్టపోయారు:వీరికి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే.. ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాటకూడా మాట్లాడలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు:ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా? ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు:వైఎస్సార్సీపీహయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు ఛైర్మన్ ద్వారా ఇచ్చారు:ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి:నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5 వేలలోపే అమ్ముకుంటున్నారు:మొక్కజొన్న ఎంఎస్పీ రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి:ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు: అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది:మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు:వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం: రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు:ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు:వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాటలాడలేదు ఫీజు రియింబర్స్ మెంట్, విద్యాదీవెన పథకానికి పెట్టిన బకాయిలు, వసతి దీవెన కింద పెట్టిన బకాయిలు ఎప్పుడు ఇస్తారన్నదానిపై ఒక్క మాటకూడా ముఖ్యమంత్రికాని, మంత్రులుకాని మాట్లాడలేదు.2024-26 రెండేళ్లకు విద్యాదీవెన, వసతి దీవెన బకాయలు రూ. 6,428కోట్లు.26-27 ఏడాదీ కలిపితే కలిపితే మొత్తం ఈ ఏడాది ఖర్చు చేయాల్సింది రూ.10,328 కోట్లు. కాని 2026-27 బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.2,766 కోట్లుమరి పిల్లల చదువులు ఎలా సాగుతాయని అడితే దానిపై ఎవ్వరూ మాట్లాడలేదు. తల్లిదండ్రులమీద తీవ్ర ఒత్తిడి ఉంది, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థి, పిల్లలు చదువులు మానుకోవాల్సిన పరిస్తి : ఉద్యోగులకు ఇస్తానన్న పీఆర్సీపైనా, ఐఆర్పైనా ప్రశ్నిస్తే దానిపైనా మట్లాడలేదు:ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.36వేల కోట్ల బకాయిలపైనా మాట్లాడలేదు:ఆశ వర్కర్స్, అంగన్వాడీల కు ఇచ్చిన హామీల ఊసు కూడా లేదు: సచివాలయాలు పెట్టి, రీసర్వే మొదలు పెట్టింది మేం:రీ సర్వే కోసం 40వేల మంది సిబ్బందిని పెట్టంది మేం:అన్నీ తానే చేశానన్నట్టుగా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు:బేసిక్ పే ఇస్తానన్న హామీని అమలు చేయాలని సర్వేయర్లు డిమాండ్ చేస్తే వారిమీద కక్షసాధింపులకు దిగుతున్నాడు:డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన, ఎగరగొట్టిన సున్నావడ్డీ గురించి మాట్లాడలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబుగారు ఒకవైపు వెన్నుపోటు పొడుస్తూ మరోవైపు వారిని మభ్యపెడుతున్నారు:మహిళా సాధికారితపై చంద్రబాబు కోతలు కోస్తున్నాడు:మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ 2014-19లో కూడా చంద్రబాబు మాట్లాడారు:ఎంతమందిని మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాడో చంద్రబాబు చెప్పగలడా? మా ప్రభుత్వంలో మహిళా సాధికారితకోసం, స్వయం ఉపాధి పథకాలను రద్దుచేశారు:ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్నతోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహనమిత్ర, సున్నావడ్డీలను రద్దుచేశారు:ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానంటూ చంద్రబాబు దొంగ మాటలు చెప్తున్నాడు. ఈ రెండేళ్లలో కొత్తగా అక్క చెల్లెమ్మలకు ఒక్క గజం స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇంటిపట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక ఇంటినికూడా మంజూరుచేసి ఇవ్వలేదు. మా హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చి, అందులో 21 లక్షల ఇల్లు మంజూరు చేశాం:10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం: వివిధ దశల్లో ఉన్న, పూర్తయ్యే దశలో ఉన్న ఆ ఇళ్లకు డబ్బులుకూడా ఇవ్వడంలేదు. స్కూళ్లు, ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క మాటకూడా మాట్లాడలేదు:ఆ 17 మెడికల్ కాలేజీలను ఏంచేస్తారో చెప్పడంలేదు :ఆరోగ్యశ్రీకి రూ.3,150కోట్లు బకాయిలు పెట్టారు:బకాయిలు ఇవ్వకపోతే అగ్రిమెంట్లు చేయబోమని నెట్వర్క్ ఆస్పత్రులు అల్టిమేటం ఇస్తున్నాయి. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రాబు కనమంటున్నాడు: చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూళ్లలో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మంచి చదువు ఇవ్వకుండా, మంచి వైద్యం ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా, ఎడాపెడా పిల్లల్ని కనమంటున్నాడు.పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. 1లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు.ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?హిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు? బాధితురాలిమీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారుప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు,అయినా చంద్రబాబు ఏం చేశాడుతనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖరాసింది:దేవుడిపట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్లాంటి పోస్టులో పెట్టాలని తెలిసికూడా, చంద్రబాబునాయుడు బి.ఆర్.నాయుడికే అప్పగించాడు. దేవుడిగురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించి మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా?ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు:కదిరి రథోస్త్సవంలో భక్తులు గాయపడ్డారుప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందిచివరకు తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు.ఇందాపూర్ డెయిరీ - హెరిటేజ్ మధ్య సంబధాల గురించి నిలదీశాం. సమాధానం చెప్పలేదు. సంగం-వైష్ణవిల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించాం. కాని నోరుమెదపలేదు. నెయ్యిపై దుమారం రేపుతూ మరోవైపు భయంకరమైన స్కాంకు పాల్పడుతున్నారు. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటివరకూ రూ.200 కోట్ల స్కాం బయటపడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఏడాది కాలంలో కేజీ నెయ్యిరేటు రూ.351 నుంచి రూ.716కు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్లారు:తిరుమల హుండీ డబ్బు లెక్కించే పరకామణి నుంచి ఏకంగా కోటి రూపాయలు విలువైన బంగారాన్ని చోరీ అయ్యింది:చంద్రబాబుగారి హయాంలో ఘోరమైన తప్పు జరిగింది:దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించి, మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో రూ.75వేల విలువ చేసే డాలర్ నోట్లు దొంగతనం జరిగితే, రూ.15కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి రాయించారు. కాని, కోటి రూపాయల విలువైన బంగారం చోరీచేస్తూ పట్టుబడితే ఆ కేసును బయటకు రానీయకుండా గూడుపుఠాణీ చేసి, తొక్కిపెట్టారు. జనవరి, 2025లో పరకామణిలో బంగారం దొంగతనాన్ని దాచిపెట్టిట్టారు: ఉద్దేశ పూర్వకంగా 2023లో జరిగిన వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు:రూ.75వేల విలువైన అమెరికన్ డాలర్ల చోరీ జరిగితే, మా హాయంలో గుడికి రూ.15కోట్లు విలువైన ఆస్తులు రాయించాం:2025 జనవరి నాటి భారీ దొంగతనాన్ని, మహాపచారాన్ని దాచిపెట్టేందుకు 2023 నాటి వ్యవహారాన్ని 2025 సెప్టెంబరు నుంచి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు: నెయ్యి వ్యవహారంలో కూడా అంతే :టెండర్లు ఖరారైందీ, సప్లై జరిగిందీ, టెస్టుల్లో ట్యాంకర్లు ఫెయిల్ అయ్యిందీ, వాటిని రిజెక్ట్ చేసిందీ, రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ లడ్డూ ప్రసాదంలోకి వెళ్లిందీ చంద్రబాబుహయాంలోనే:ఇది తెలిసికూడా, తప్పు తానుచేసి సెప్టెంబరు18, 2024న వైయస్సార్సీపీ మీదకు చంద్రబాబు నెట్టేశాడు:చంద్రబాబుగారు కుట్రలుమీద కుట్రలు చేశారు: -
అనారోగ్య బీమా!
ఆరోగ్యబీమా ఉన్న వ్యక్తులు ఏదైనా అనారోగ్యంతో తమ దగ్గరకు వస్తే, కొన్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి. రోగులతో మైత్రీభావంతో వ్యవహరిస్తూ నిజాయతీగా చేయాల్సిన వైద్యవృత్తిలో కొందరు అధిక సంపాదనకు అర్రులు చాస్తున్నారు. ఆరోగ్య బీమా ఉన్న రోగుల చికిత్స వారికి ఇంకా లాభసాటి వ్యవహారంగా మారింది. తెనాలి: ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఒకరు ఆసుపత్రికి రావటంతోనే కాంపౌండర్లు ఆరా తీస్తున్నారు. అతడు ఎక్కడ ఉంటున్నాడు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఆసుపత్రి బిల్లు కార్పొరేట్ స్థాయిలో ఉంటుందన్న విషయం చెప్పనవసరం లేదు. ఇక ఆరోగ్య బీమా ఉందని చెప్పిన వెంటనే వైద్యం చేసే తీరు మరోరకంగా ఉంటుంది. చిన్న రోగానికి కూడా ఇన్పేషెంటుగా అడ్మిట్ చేస్తున్నారు. అనవసర పరీక్షలు, స్కానింగులు చేయించి బిల్లును తడిసి మోపెడు చేస్తున్నారు. మందులు కూడా ఎక్కువ రాస్తున్నారనే అభియోగాలున్నాయి. చివరకు రూ.లక్షల్లో బిల్లును చేతిలో పెడుతున్నారు. ఇవిగో నిదర్శనాలు... ఉన్నా లేనట్టు చూపి మరీ.. ఆరోగ్య బీమా వైద్యంలో క్లెయిం ఏవిధంగా చేసుకోవాలనే అంశంపై బీమా కంపెనీల కన్సల్టెంట్లను డాక్టర్లు సంప్రదిస్తున్నారు. అడ్మిషను టైములో, డిశ్చార్జి చేసేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ ఉండాలనేది తెలుసుకుంటున్నారు. ఆ ప్రకారమే క్లెయిములు పెడుతున్నారు. ఉదాహరణకు రోగికి పరీక్షల్లో షుగర్ అని ఉంటే బీమా రాదనేది ఒక పారామీటరు అనుకుందాం... ల్యాబ్ పరీక్షల్లో ఆ రోగికి షుగర్ అని వచ్చినప్పుడు, సదరు డాక్టరే ల్యాబ్ టెక్నీషియన్తో మాట్లాడి షుగర్ లేనట్టుగా రిపోర్టులో నమోదు చేయిస్తున్నారు. ఇలా పరీక్షల రిపోర్టులనూ మార్చేస్తున్నారు. డైపర్, దూది, కేనల్ వంట బీమా పరిధిలోకి రానివాటికి అదనంగా వసూలు చేస్తున్నారు. ‘నేను డయాగ్నైజ్ చేస్తాను...బీమా కంపెనీ చికిత్స చేస్తుంది’ అన్నట్టుగా కంపెనీ పారామీటర్ల ప్రకారం జరిగే వైద్యంలో రోగికి అనవసర మందులతో అనర్థాలు, ఇన్పేషెంటుగా ఆసుపత్రిలో ఉండాల్సి రావటం, లేనిపోని పరీక్షలతో బిల్లుల భారం అనివార్యంగా మారుతోంది. దీనికితోడు మానసిక అశాంతి. ఆరోగ్యబీమాలో చిన్నపాటి వైద్యానికే రూ.లక్షన్నర ఖర్చయితే, అనుకోని రీతిలో తర్వాత మరేదైనా ఆరోగ్య సమస్య వస్తే బీమా మొత్తం సరిపోక, అప్పులు చేయాల్సి వస్తుందేమోనన్న బెంగతో చివరకు ఆరోగ్యబీమాపై ఉండటం మంచిదేనా? అన్న సందేహం వస్తోందని స్థానిక వ్యాపారి ఒకరు అన్నారు. ఇదే అంశంపై రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పార్లమెంటులో చేసిన సూచన ప్రకారం వైద్యంలో నైతికత, పారదర్శకత కోసం ఆసుపత్రులపై తగిన పర్యవేక్షణ ఉండటం చాలా అవసరం. -
నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థ పాలకవర్గం ఐదేళ్ల కాల పరిమితి ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. తెనాలికి జేసీ... తెనాలిఅర్బన్: తెనాలి పురపాలక సంఘ ప్రత్యేకాధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవను నియమించారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17తో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. ఆరు నెలలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు జేసీ ఈ పదవిలో ఉంటారని తెలిపారు. -
14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
ఉచితంగా వేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడిగుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో హ్యూమన్ పాపిలొమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్ల వయస్సున బాలికలకు ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్ ) దేశంలో ప్రధాన శత్రువుగా ఉందన్నారు. దానిని నివారించడానికి ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 90 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 83 కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్న పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఒక్క వ్యాక్సిన్ ఖరీదు రూ.4 వేలు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 14,167 మంది బాలికలు ఉన్నట్లు అంచనా అని, 21,170 డోసులు అవసరమని తెలిపారు. ఇప్పటివరకు 6,793 డోసులు జిల్లాకు అందాయన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ 14 ఏళ్ల బాలికలు వ్యాక్సిన్కు అర్హులన్నారు. మధ్యస్థ లేదా తీవ్రమైన అనారోగ్యం ఉన్న బాలికలకు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే టీకా ఇవ్వాలన్నారు. మునుపటి టీకాకు అలర్జీ వచ్చిన వారు లేదా ఈస్ట్ అలర్జీ ఉన్నవారు టీకా తీసుకోరాదని చెప్పారు. టీకా తీసుకునే బాలికలు ఖాళీ కడుపుతో ఉండకూడదన్నారు. పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే తల్లిదండ్రులు టీకా కేంద్రానికి పంపాలని సూచించారు. టీకా తీసుకున్న బాలికలు కనీసం 30 నిమిషాలు అక్కడే ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, డీపీఎంఓ సుజాత, తహసీల్దార్ సుభాని తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసును ఛేదించిన రైల్వే పోలీసులు
వివరాలు వెల్లడించిన జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పెదకాకాని రైల్వే స్టేషన్లో ఈనెల 4వ తేదీన జరిగిన హత్యకేసు మిస్టరీని గుంటూరు రైల్వే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు అరెస్టు చూపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4వ తేదీన పెదకాకాని రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ చివర భాగంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి హత్యకు గురి అయినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశ ంలో మృతి చెందిన వ్యక్తిని పరమడం అనీష్(40) అలియాస్ బ్లేడ్గా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును డీఎస్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు రైళ్లలో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడని మృతుడి పై చైన్నె, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో పలు దొంగతనాలు, నేరాలకు పాల్పడిన కేసులు నమోదు అయినట్లు విచారణలో తెలిసింది. మృతుడు అనీష్ తనతో కలిసి దొంగతనాలు చేసే తోటివారిని నిత్యం వేధిస్తుండటం.. ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరందరినీ పలు రైల్వే స్టేషన్లలో బ్లేడ్ బ్యాచ్గా పిలుస్తారని, మృతుడు అనీష్ దొంగతనం చేసిన సొత్తులో ఎక్కువ భాగం తనకు ఇవ్వాలని, తోటి సహచరులపై ఒత్తిడి తేవడం వారిని కూడా పలు మార్లు బ్లేడ్తో కోస్తా అని బెదిరించడం వల్ల ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనీష్ వేధింపులను తాళలేక ఈనెల 4వ తేదీన హతమార్చేందుకు పథకం రూపొందించారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఎఫ్.కుమార్ అలియాస్ అంతోని కుమార్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్న దీపేష్ ఎం.ఎస్, అలియాస్ మెంటల్ భాయ్, అనంతపురంకు చెందిన కొప్పుల వెంకటేష్ అలియాస్ వెంటి, అలియాస్ వెంగీ భాయ్లు పెదకాకాని రైల్వే స్టేషన్లో అనీష్పై బ్లేడ్లతో దాడి చేసి అతి కీరాతకంగా హతమార్చి పరారయ్యారు. ఈనెల 9వ తేదీన సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్–1లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని జీఆర్పీ సీఐ అంజిబాబు పట్టుకుని స్టేషన్కు తరలించి విచారించగా అనీష్ను హత్య చేసినట్లు అంగీకరించారు. వీరందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసును ఛేదించిన జీఆర్పీ సీఐ జి.అంజిబాబు, ఆర్పీఎఫ్ ఎస్ఐ మహబూబు సుభాని, కానిస్టేబుల్లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, శంకర్, ఆర్పిఎఫ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్, ఏఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని డీఎస్పీ, రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. -
అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం
నాదెండ్ల: గణపవరం జాతీయ రహదారి వద్ద శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల దర్శనార్ధం ప్రత్యేక క్యూలైనులు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారులు పి. లక్ష్మీనారాయణ, కన్నా శాస్త్రి భక్తుల గోత్రనామపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమాలను మాజీ సర్పంచ్ వలేటి హిమంతరావు, గణపవరం మద్ది లక్ష్మయ్య కంపెనీ ముఠాకూలీలు, కార్మికులు, సిబ్బంది పర్యవేక్షించారు. వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరు గ్రామ దేవతలు ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ, పరివార దేవతల ఆవరణలో మంగళవారం అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి నెల రెండవ మంగళవారం జరపతలపెట్టిన కార్యక్రమంలో భాగంగా భక్తులు, వివిధ భజన మండలి వారు పాల్గొని చాలీసా పారాయణం చేశారు. స్వామి వారికి పూజలు చేశారు. తెనాలి: మండల గ్రామం అంగలకుదురులోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన చేశారు. అనంతరం హారతి, రాత్రి 8 గంటల వరకు సాయిబాబా నామ సంకీర్తనను జరిపారు. ఉదయం 10 గంటలకు భజన, 11 గంటలకు వెస్ట్బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యంచే సత్సంగం జరిగాయి. మధ్యాహ్నం హారతి, అనంతర ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం అంగలకుదురులో శ్రీరామభక్త హనుమాన్ మహిళా కోలాట బృందంచే కోలాటంతో సాయిబాబా నామ సంకీర్తనలతో పురవీధుల్లో చిత్రరాజాలను ఊరేగించారు. రాత్రి అన్నప్రసాద వినియోగం జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్):అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సాంబ్రాజ్యం అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు జి.సౌజన్య, ఎ.ఉషాకిరణ్ పాల్గొన్నారు. ఆర్టీసీ సర్వీసుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ముస్లింల ఉపవాస దీక్షలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 20 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పూర్తి అయ్యాయి. ఈ నెలలో ముస్లింలు నమాజ్, దైవ చింతనతో పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తారు. తమ సంపద నుంచి కొంత పేదలకు దానం చేస్తారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత వచ్చే షవ్వాల్ నెల మొదటి రోజున రంజాన్ పండుగ నిర్వహిస్తారు. పొగతాగడం, మద్యపానం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఖురాన్ బోధిస్తుంది. సాధారణ సమయాల్లో కంటే ముస్లింలు రంజాన్ మాసంలో భిన్నంగా ఉంటారు. పగలంతా ఉపవాస దీక్ష, నమాజ్, రాత్రిళ్లు ప్రత్యేకంగా తరావీ నమాజ్లో పాల్గొంటారు. ఖురాన్ పఠనంతో తరావీ నమాజ్ చేయడం వల్ల పుణ్యఫలాలు దక్కుతాయని వారి విశ్వాసం. ఈ క్రమంలో ప్రత్యేకంగా మౌల్వీలను ఇతర ప్రాంతాల నుంచి పిలిపిస్తుంటారు. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి మత గురువులను ఆహ్వానించి ప్రార్థనలు, నమాజ్లు నిర్వహిస్తున్నారు. భగవంతుడికి భక్తుడికి వారధి... ఇస్లాం మత పంచసూత్రాలైన ఈమాన్ (దేవుడు ఒక్కడే), నమాజ్ (ప్రార్థన), రోజా (ఉపవాస దీక్ష) జకాత్ (దానం), హజ్ (మక్కా యాత్ర)లను ఆచరణాత్మకంగా నిరూపించుకునే అవకాశం ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు లభిస్తుంది. ఖురాన్ సూచించిన విధంగా రంజాన్ మాసంలో ముస్లింలు పగలు నీరైనా తాగకుండా ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం. ప్రతి ముస్లిం దైవ చింతనతో గడపాలి. నమాజ్, రోజా తప్పకుండా ఆచరించాలి. ఉపవాస దీక్ష తప్పనిసరిగా నిర్వహించాలి. మమమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరించడం వల్ల మానసిక, శారీరక ఉల్లాసం ఏర్పడుతుంది. పుణ్యఫలం కూడా లభిస్తుంది. – షేక్ అబ్దుల్ వాహబ్, ముస్లిం మత పెద్ద -
పట్టణ ప్రణాళికలో ఏసీబీ తనిఖీలు
నగరంపాలెం: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ప్రధాన కార్యాలయ ఆవరణలోని పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం ఉమ్మడి గుంటూరు ఏసీబీ అధికార, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే నేతృత్వంలో నలుగురు సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు, ముగ్గురు ఎస్ఐలు సిబ్బంది ఒక్కసారిగా బృందాలుగా ఏర్పడి ఉదయం 11 గంటల తర్వాత గుంటూరు జీఎంసీకి చేరుకున్నారు. మొదటి అంతస్తులోని పట్టణ ప్రణాళిక విభాగంలోకి వెళ్లారు. అందులో కార్యాలయపు రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఆన్లైన్ ఫిర్యాదులను పరిశీలించారు. ఎక్కువగా వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, తనిఖీలు చేశారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగపు సిటీ ప్లానర్ రాంబాబుతో మాట్లాడారు. ఇటీవల ఆన్లైన్, నేరుగా వచ్చిన ఫిర్యాదులపై సిటీ ప్లానర్ను ఆరాతీశారు. కీలక రికార్డులు స్వాధీనం అప్పటికే కార్యాలయంలో కూర్చుని ఉన్న ఇద్దరితో మాట్లాడారు. ఓ పని నిమిత్తం వచ్చానని, గతంలో ఒకరికి కొంత మొత్తంలో ముట్టజెప్పినట్లు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే సదరు అధికారి ఎవరనేది ఫిర్యాదు చేప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. అంతేగాక పట్టణ ప్రణాళిక విభాగపు అధికార, సిబ్బందితోనూ ఏసీబీ అధికారులు చర్చించారు. వివిధ ఫైళ్లకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పలువురు అధికారులను విచారించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలపై ఆరా తీస్తున్నారు. కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ఉల్లంఘనలు, వరుస ఫిర్యాదుల దృష్ట్యా కార్యాలయపు సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి రెగ్యులర్గా వచ్చే ఫిర్యాదులపై పరిశీలన చేస్తున్నామని అన్నారు. బుధవారం సైతం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. మధ్యాహ్నా వేళ ఏసీబీ జేడీ (విజయవాడ) సురేష్బాబు గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చారు. ఏఎస్పీ మహేంద్ర మత్తేతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఏఎస్పీకి సిబ్బందికి జేడీ పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలు దాదాపు రాత్రి వరకు కొనసాగాయి. ఏసీబీ తనిఖీలతో జీఎంసీ ఆవరణలోని మిగతా విభాగపు అధికార, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
ఏఎన్యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ సంవత్సరానికి రెండేళ్ళ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష కేంద్రాలు: సెంటర్ ఫర్ డిస్టెనన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), విజయ దుర్గ డిగ్రీ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ (అనంతపూర్), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎస్బీఎస్వైఎం డిగ్రీ కాలేజ్( మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం) మొత్తం 12 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ ఐసెట్ 2025లో అర్హులకు మినహాయింపు.. ఏపీ ఐసెట్–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను, ర్యాంక్ కార్డులు పొందవచ్చని దిట్టకవి ఆచార్య రామచంద్రన్ పేర్కొన్నారు. -
మామాఅల్లుళ్లను మింగేసిన కంటైనర్
నకరికల్లు: కంటైనర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై బోల్తా పడడంతో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని అడ్డరోడ్డు వద్ద అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన జిల్లా గురుమూర్తి (55), గుంటూరు నగరం లక్ష్మీపురానికి చెందిన గోపిదేశి సత్యనారాయణ (45) వరుసకు మామాఅల్లుళ్లు. ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలోని మామిడితోటకు మందు పిచికారీ చేయించి స్కూటీపై గుత్తికొండకు బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి పిడుగురాళ్ల వైపు అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి స్కూటీపై బోల్తా పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి ఎస్ఐ కె.సతీష్, సిబ్బంది వచ్చి స్థానికుల సహాయంతో క్రేన్ ద్వారా కంటైనర్ని పక్కకు తీయించారు. కంటైనర్ కిందనున్న మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. బైకుపై వెళ్తుండగా వాహనం పడి మృతిఅద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై కంటైనర్ బోల్తా పడడంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైవేపై వెళ్లే వాహనాలతోపాటు నరసరావుపేట–పిడుగురాళ్ల వైపు రాకపోకలు సాగించేవి కూడా భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. మండుటెండ కావడంతో ప్రయాణికులు వేచి ఉండలేక రెండుగంటల పాటు అవస్థలు పడ్డారు. కంటైనర్ను వెలికితీసిన పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
మంగళగిరి టౌన్: ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొలసాని వెంకటేశ్వరరావు(60) మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ రామవరప్పాడులో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వరరావు 1980లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా చేరారు. 2005లో ఏఆర్ కానిస్టేబుల్గా, 2019లో సివిల్ పీసీగా బదిలీ అయ్యి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్గా ఉంటూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలోని డాగ్ స్క్వాడ్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయనకు 2008లో గుండెజబ్బు రావడంతో స్టంట్స్ వేశారు. 2011లో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో పీపీటీ టెస్ట్లో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మంగళగిరి ఎయిమ్స్కు తరలించగా, పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన ఓపెన్ పికిల్ బాల్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో వైజయంతి డెంటల్ కేర్ సౌజన్యంతో స్థానిక గోరంట్లలోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన గుంటూరు ఓపెన్ ఉమెన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలు ముగిసినట్లు సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్ మంగళవారం తెలిపారు. కార్యక్రమంలో జీవీఎస్ ప్రసాద్, నిర్వాహకకార్యదర్శి కె. అరుణ్ కుమార్, మన్సూర్ వల్లి, కె.రవి, శశిధర్, నెక్ట్స్ జెన్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జీజే కిషోర్ తదితరులు పాల్గొన్నారన్నారు. -
గజేంద్ర మోక్షంలో నారసింహుడు
మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం గజేంద్ర మోక్షం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శేషగిరిరావు, కల్యాణిలు వ్యవహరించగా, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ తిరుమలరావు, తాడికొండ సాయికుమార్లు వ్యవహరించారు. నేడు పార్థసారథి ..... శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. -
సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఈనెల 8న ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అఖిల భారతస్థాయిలో అత్యధిక మార్కులతో పాటు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రభంజనం సృష్టించినట్లు సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. సోమవారం గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందకిషోర్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా సీఏ, సీఎంఏ కోర్సుల్లో 450కు పైగా ఆలిండియా ర్యాంకులను సాధించామని చెప్పారు. తాజా ఫలితాల్లో కె.చంద్రశేఖర్ 400 మార్కులకు గాను 308 మార్కులతో టాపర్గా నిలిచాడని తెలిపారు. అదే విధంగా ఏ.నాగసాయి 298, ఐ.జ్ఞానతేజ 297, బి.మణి 294, ఎం.సప్తగిరి 267 వంటి టాప్ మార్కులు సాధించారని తెలిపారు. సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు శ్రీమేధ అధ్యాపక, అధ్యాపకేతర బృంద సహకారం ఎంతగానో ఉందన్నారు. సీఏ ఫౌండేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఏ ఇంటర్, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సీఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా అన్నా నందకిషోర్, డైరెక్టర్ అన్నా శ్రీలక్ష్మి విద్యార్థులను అభినందించారు. -
బంగారం దుకాణాల్లో తనిఖీలు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరం లాలాపేటలోని బంగారం దుకాణాలలో సోమవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెంట్స్ (బీఐఎస్) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాలాపేటలోని సన గోల్డ్ టెస్టింగ్ దుకాణంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆభరణాల టెస్టింగ్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్మార్క్ను బంగారు ఆభరణాలపై మిషన్ ద్వారా ముద్రిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. బీఐఎస్ అధికారి వివేక్రెడ్డి మాట్లాడుతూ సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో లైసెన్సులు లేకుండా హాల్మార్క్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. షాపులో హాల్ మార్క్ వేసిన నాలుగు ఉంగరాలు, మరికొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లేజర్ మిషన్, కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మీడియాపై దాడి... బీఐఎస్ అధికారులు సన గోల్డ్టెస్టింగ్ దుకాణంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కవరేజ్కు వెళ్లిన మీడియాపై షాపు నిర్వాహకులు దాడి చేశారు. మాషాపులోకి ఎలా వస్తారంటూ దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. -
స్థలం ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు
నా భర్త విశ్రాంత ఉప తహసీల్దార్. రెండేళ్ల క్రితం ఆయన మృతిందారు. 1980లో నా భర్త, మరో ఇద్దరితో కలిసి చుట్టుగుంట సమీపాన ఎకరం 23 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. అందులో 1,548 గజాల స్థలంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత, అతని బంధువులతో కలిసి ఫేక్ డాక్యుమెంట్లు స్పష్టించారు. తద్వారా 1,548 గజాల స్థలంలో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ అక్రమ నిర్మాణంపై గతేడాది మే నెలలో అప్పటి కమిషనర్కు ఫిర్యాదు చేశాం. దీంతో నిర్మాణ పనులను అర్ధాంతంగా నిలిపివేశారు. కాలక్రమేణా మళ్లీ నిర్మాణ పనులు కొనసాగించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత గుంటూరు జీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, స్థలం తనదంటూ డాక్యుమెంట్స్ చూపించారు. అయితే ఆ పత్రాలు సరైనవికాదని జీఎంసీ అధికారులు తేల్చారు. ఇటీవల స్థలంతో సంబంధంలేదని, వేరే వ్యక్తికి చెందినదని సదరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత తెలియజేశారని అన్నారు. అయితే ఆ వ్యక్తి మాజీ ఎమ్మెల్యేకు స్వయానా బంధువు. ఈ ఆక్రమణ వెనుక మాజీ ఎమ్మెల్యే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన మాపై దౌర్జన్యాలకు పాల్పడటం, చంపుతామని బెదిరిస్తున్నారు. మా ఆస్తిని మాకు దక్కకుండా మాజీ ఎమ్మెల్యే, బంధువులు, అనుచరులు అడ్డు కుంటున్నారు. మా ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని కోరుతున్నాం. – జి.భారతి, శారదాకాలనీ 30వ లైను, గుంటూరు ● -
మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత మా స్థలం ఆక్రమించారు
నగరంపాలెం: మాజీ ఎమ్మెల్యే, జనసేన నేతపై బాధితులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తామన్నారు. నిర్ణీత వేళల్లో చట్టపరంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితుల సమస్యలపై వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు)లు కొన్ని అర్జీలు స్వీకరించారు. మొత్తం 112 ఫిర్యాదులు వచ్చినట్లు డీపీఓ వర్గాలు తెలిపాయి. పదేళ్ల క్రితం నాల్గవ తరగతి ఉద్యోగిగా రిటైరయ్యాను. ఇటీవల నా కుమారుడు మా ఆస్తి విక్రయించి డబ్బులు ఇవ్వలేదు. దీనికితోడు సరిగా చూడటంలేదు. ఈమధ్య నా గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. మిగతా స్థలాన్ని నా సొంతంగా విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. – బాలరాజు, కృష్ణబాబుకాలనీ, గుంటూరు -
ఎయిమ్స్లో తొలిసారిగా ట్రాన్స్–హ్యూమరల్ రీప్లాంటేషన్
మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో ఓ వ్యక్తికి ట్రాన్స్ హ్యూమరల్ రీ ప్లాంటేషన్ చేశారు. తెగిపోయిన చేతిని ఎయిమ్స్ ప్లాస్టిక్ సర్జన్లు తిరిగి జోడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జార్ఖండ్కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి విజయవాడలోని హనుమాన్జంక్షన్ సమీపంలో రోడ్డు నిర్మాణ సంస్థలో మిషన్లోడ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గత నెల 22వ తేదీన మిషన్లో చేయి ఇరుక్కుపోయి తీవ్రంగా నుజ్జునుజ్జు అయ్యింది. అదేరోజు మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాల అత్యవసర విభాగానికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. వైద్యబృందం రోగికి పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించింది. అరుదైన, అత్యంత క్లిష్టమైన మైక్రో వాస్క్యులర్ ప్లాస్టిక్ సర్జరీని డాక్టర్ శాంతకుమార్, డాక్టర్ శివలింగప్ప నేతృత్వంలోని బృందం, డాక్టర్ లిఖిత రెడ్డి, డాక్టర్ మనోజ్లు సుమారు 8 గంటల పాటు నిర్వహించారని, ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా బృందాలు ఈ శస్త్ర చికిత్సలో రక్తం ప్రసరించేలా చేసి చేతిని కాపాడారని పేర్కొన్నారు. తెగిపోయిన భాగాన్ని సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఎయిమ్స్ వైద్యశాలలో నైపుణ్యం గల వైద్యులు ఉండడం వల్ల ఈ శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం 14 రోజులు క్రిటికల్ కేర్ యూనిట్లో నిశితంగా పరిశీలించామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని, వార్డులో కోలుకుంటున్నాడని, తదుపరి పరీక్షల అనంతరం డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ అభినందించారు. -
14,15 తేదీల్లో వీవీఐటీయూ ఉద్గమ హ్యాకథాన్
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో ఏసీఎం విద్యార్థి విభాగం అధ్వర్యంలో మార్చి 14,15 తేదిల్లో జాతీయస్థాయి హాకథాన్ ఉద్గమ 1.0 నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూ నందు సోమవారం హ్యాకథాన్ ఉద్గమ 1.0 పోస్టర్లను అధ్యాపకులు, విద్యార్థులతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రో చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ యువ ఆవిష్కర్తలు బృందాలుగా ఏర్పడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతపై ఆలోచనలు పంచుకుని నిజజీవిత సమస్యలకు వినూత్న పరిష్కారాలు రూపొందించడం ఈ హ్యకథాన్ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రొటోటైప్లను, ప్రాజెక్ట్లను న్యాయనిర్ణేతలు, పరిశ్రమ నిపుణుల ముందు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ హ్యాకథాన్ పోటీల్లో పాల్గొనదలచిన సాంకేతిక విద్యార్థులు ఏసీఎం. వీవీఐటీగుంటూరు.కామ్ వైబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ ఆళ్ళ కళావతి, హ్యాకథాన్ సమన్వయకర్త డాక్టర్ బి.సాయిజ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం
కిమ్స్ చక్రలో మహిళా ఆరోగ్యంపై అవగాహన సదస్సు గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్లో మహిళా ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, డెప్యూటీ మేయర్ షేక్ షజిల, సినీనటి నివేద పేతురాజ్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా దేశం బలంగా ఉంటుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. నివేద పేతురాజ్ మాట్లాడుతూ సమాజంలో నేడు మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని చెప్పారు. మహిళలు తమకు నచ్చిన రంగం వైపు అడుగులు వేయడానికి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించాలన్నారు. మెడికల్ ఆకాంలజిస్ట్ డాక్టర్ కందుల రామ్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యంపై తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, ప్రాథమిక దశలోనే అన్ని రకాల క్యాన్సర్లు గుర్తించేందుకు రాయితీతో మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మహతి మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి వల్ల మహిళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించేలా నానోగ్రామ్ పరీక్ష అందుబాటులో ఉందన్నారు. క్యాన్సర్ సోకిన వారికి రొమ్ము తొలగించకుండానే క్యాన్సర్ కణితులు తొలగించే ఆధునిక ఆపరేషన్లు నేడు అందుబాటులో ఉన్నాయన్నారు. కిమోథెరఫీ, రేడియేషన్ థెరఫీ చికిత్సల్లో కూడా అత్యాధునిక క్యాన్సర్ డ్రగ్స్, ఆధునిక రేడియేషన్ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. సర్వేకల్ క్యాన్సర్ సోకకుండా వ్యాక్సిన్లు నేడు అందు బాటులో ఉన్నాయని, తొమ్మిదేళ్ల బాలిక మొదలు, 35 సంవత్సరాల వయస్సు వారు వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ సోకకుండా కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పైసలిస్తే చాలు ‘పాస్’!
‘మీరు ఒడిశా రాష్ట్రం నుంచి ఇంత దూరం రెండు ప్రాక్టికల్ పరీక్షల కోసం రావాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు ఇస్తే పూర్తి మార్కులతో పాస్ చేయిస్తాం’.. ఇదీ పల్నాడు జిల్లాలోని ఒక బీఈడీ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ సందేశం. దీనిపై విశ్వసనీయ సమాచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో బీఈడీ కళాశాల ప్రాక్టికల్ పరీక్షల పేరుతో రూ.10 లక్షల వరకు వసూలు చేస్తుండగా, అందులో నుంచి రూ. 2 లక్షలు మామూళ్లు ఇవ్వాలని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ఏజెంట్లకు చెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల కోసం బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణ తీరు ప్రహసనంగా మార్చారు. బీఈడీ యాజమాన్యాల దందా కేంద్రాల నిర్వహణపై కరువైన పర్యవేక్షణ -
వైభవంగా విఘ్నేశ్వరుని ఆలయ వార్షికోత్సవం
రేపల్లె: పట్టణంలోని పెదకూరగాయల మార్కె ట్ సమీపంలో వేంచేసియున్న శ్రీసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవలతో పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేక మహోత్సవాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నసంత ర్పణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెనాలి: శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఈనెల 13వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు బుర్రిపాలెంరోడ్డులోని శ్రీమహాత్మ సేవాశాంతి ఆశ్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి, ఆశ్రమవాసులకు అన్నదానం చేయటానికి నిర్ణయించినట్టు సంఘ నాయకులు వేజండ్ల శివన్నారాయణ, నిమ్మలూరి కమలాకరరావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. శాలివాహన సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘ నాయకులు మోదుకూరి శివరామకృష్ణప్రసాద్, నాంచార య్య, అయ్యవార్లు, క్రిష్టరావు, శంకరరావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఉరిటి శ్రీనివాసరావు, పి.జ్వాలారావు, వి.నాగరాజు, ఎం.శ్రీనివాసరావు తదితరులున్నారు. మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సోమవా రం గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్, శేషాంజనేయ గోపాల్లు వ్యవహరించగా, ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. గుంటూరువెస్ట్: జి. రామ్. జి – గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పమని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. వికసిత్ భారత్– జి. రామ్. జి పోస్టర్ను సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. జేసీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం, ఉపాధికి కొత్త హామీగా జి రామ్ జి నిలుస్తుందన్నారు. 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తుందన్నారు. సమయానికి కూలి చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం వంటి అంశాలను ఇందులో చేర్చారన్నారు. -
‘సుఖీభవ’పై చేతులెత్తేశారు!
చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ కోతలే కనిపిస్తున్నాయి. కష్టాన్నే నమ్ముకున్న కర్షకులకు కన్నీళ్లే మిగిలాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నా.. ఉచిత పంటల బీమా జాడ లేకుండా పోయింది. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్పలు చెప్పినా.. తొలి ఏడాది రిక్తహస్తం చూపారు. రెండో ఏడాది అరకొర సాయం అందింది. సీఎం చంద్రబాబు తీరుపై రంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్లో రూ.10 కోట్లు.. ధీమా ఇవ్వని బీమా.. కౌలు రైతులకు మొండిచేయి వైఎస్సార్ సీపీ హయాంలో.. -
మహిళల ఫొటోల కేసులో పోలీసుల విచారణ
దుగ్గిరాల: కళాశాల విద్యార్థినులు, మహిళల ఫొటో చిత్రీకరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని విచారించామని సీఐ బ్రహ్మం, ఎస్ఐ వెంకట రవి తెలిపారు. దుగ్గిరాల పోలీసుస్టేషన్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ విజయవాడలోని ఓ కళాశాలలో పని చేస్తున్న మహిళ తన స్నేహితురాలితో కలసి వెళుతున్న సమయంలో తుమ్మపూడికి చెందిన ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు గమనించి ప్రశ్నించగా అతను దుర్భాషలాడి బెదిరించాడని, అతని దగ్గర నుంచి సెల్ఫోన్ తీసుకుని చూడగా ఫొటోలు ఉన్నట్లు గుర్తించామని బాధితురాలు దుగ్గిరాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, నిందితుడ్ని 24 గంటలలోనే అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. సరదాకు వీడియోలు తీస్తున్నానని, రాత్రి వేళలలో ఆ వీడియోలు చూస్తూ ఉంటానని విచారణలో అతను చెప్పినట్లు తెలిపారు. సెల్ఫోన్ పరిశీలించగా సుమారు 1,060 ఫొటోలు ఉన్నాయని, 101 ఫొటోలు మాత్రమే మహిళల ఫొటోలు తీశాడని, మిగిలినవి వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవేనని తెలిపారు. సెల్ఫోన్ సీజ్ చేశామని అన్నారు. అతను ఆ ఫొటోలను ఎటువంచి అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించలేదని, మార్ఫింగ్ కూడా చేయలేదని తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి అనుమతి లేకుండా మహిళల ఫొటోలు తీయడం నేరం కాబట్టి అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఫొటోలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళ రక్షణకు ఆటంకం కలిగితే వెంటనే సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు
గుంటూరు ఎడ్యుకేషన్: టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల పేర్లలో తప్పులు, కేంద్రాలను కనుగొనడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన ‘కేంద్రాలకు వెళ్లడమే పెద్ద పరీక్ష’ కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల పరిధిలో పాఠశాలల పేర్లు, సెంటర్ కోడ్ స్పష్టంగా తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఎంఈవో, డీవైఈవోలతో పాటు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులను ఆదేశించారు. హాల్ టికెట్లో ఉన్న విధంగా మార్పు -
అర్జీలపై పూర్తి అవగాహన ఉండాలి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో వచ్చే ప్రతి అర్జీపైనా ఆయా శాఖాధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండా లని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీ మాట్లాడుతూ కొన్ని అర్జీలు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 514 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో షేక్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డీపీఓ నాగసాయికుమార్, డీఆర్డీఏ పీడీ టి.విజయలక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
30 మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్లో యూజీ విద్యార్థులు డయేరియా బారిన పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్లోని హాస్టల్లో ఉంటున్న 25–30 మంది యూజీ విద్యార్థులు 4 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వీరు చికిత్స పొందినట్లు సమాచారం.ఇందులో 20 మంది విద్యార్థుల్లో కొద్దిపాటి డయేరియా లక్షణాలున్నాయని, వారు ఒక్కరోజు చికిత్స పొంది డిశ్చార్జ్ కాగా, మరో 9 మంది విద్యార్థులకు ఎక్కువ లక్షణాలు కనబడడంతో వారు 2 రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి టెస్ట్లకు పంపారు. అలాగే, నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం గుంటూరులోని ల్యాబ్కు పంపినట్లు సమాచారం. -
‘కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే’
తాడేపల్లి : కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఏ రంగంలో చూసినా అంత విధ్వంసమేనన్నారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన శైలజానాథ్.. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. ‘నిరుద్యోగుల జీవితాలను అన్యాయం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత నాశనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. PPP మోడ్ కింద ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇస్తున్నారు. కొన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలను రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.. ఎస్సీ,ఎస్టీలకు వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చిన రుణాలను భేషరతుగా మాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సూపర్ సిక్స్ పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు.‘మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా?, మహిళా ద్రోహి పార్టీ టీడీపీ. జగన్ తెచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికీ రాయితీలు ఇవ్వలేదు. డ్రాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులే ఇవ్వకుండా వారిని కూడా పారిశ్రామిక వేత్తలను చేస్తానంటున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా గ్రూపుల పరపతి తగ్గింది. బ్యాంకర్లు రుణాలను ఇవ్వటం తగ్గించారు. మరి పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ ఎలా మాట్లాడతారు?, జగన్ సున్నావడ్డీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు మహిళలకు ఇచ్చారు. చంద్రబాబు వలన డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలు ఎవరికిచ్చారు?, సగం మందికి కూడా ఇవ్వకుండా సక్సెస్ చేశామని ఎలా చెప్పుకుంటారు?, అసెంబ్లీలో, బయటా డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. అన్నీ చంద్రబాబేమంత్రులు, ఎమ్మెల్యేలు కేరక్టర్ ఆర్టిస్టులుగా మిగిలి పోయారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ అన్ని వర్గాల మహిళలకూ మేలు చేశారు. చంద్రబాబు అందరినీ నిలువునా మోసం చేశారు. మహిళా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మహిళలకు కనపడకుండా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని భయపడుతున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, కాల్ సెంటర్కు కాల్ చేసినా ఏపీ పోలీసులు స్పందించటం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి అమిత్షానే లెటర్ రాశారుదేశంలోనే అట్టడుగు స్థానంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ వెళ్లిపోయింది. మహిళలు, చిన్నారులకు ఏపీలో అసలు రక్షణే లేదు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండించటం సిగ్గుచేటు. మహిళను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?, లోకేష్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మహిళల ఫోటోలు తీస్తూ దొరికాడు. మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ. మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
ఎయిమ్స్లో డయేరియా.. మూడు రోజులుగా తీవ్ర అవస్థలు
గుంటూరు, సాక్షి: మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం రేగింది. హస్టల్లోని వైద్య విద్యార్థులతో పాటు సిబ్బంది గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో 10 మంది విద్యార్థులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే డయేరియాకు గల కారణాలు ఏంటి.. ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు వల్ల సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళల పట్ల టీడీపీ నాయకుడి అమానుషం
గుంటూరు జిల్లా: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థునులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026భక్తి గుడారం.. స్తుతి నైవేద్యం అట్టహాసంగా ముగిసిన 49వ గుడారాల పండుగ దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,316 క్యూసెక్కులు వదిలినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కొమ్మూరు కాలువకు 733 క్యూసెక్కులు వదిలారు.అమరావతి: మంచి గంధం చెక్కకు ఎన్ని కోతలు చేస్తే, అంత సుగంధం వెదజల్లినట్లు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్రైస్తవ్యంలో ఉన్న కీస్తు విశ్వాసులు ప్రపంచాన్ని, దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటారని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం అన్నారు. అమరావతి మండలం లేమల్లె గ్రామంలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 49వ గుడారాల పండుగ చివరి రోజైన ఆదివారం పగటి పూట ముగింపు ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గుడారాల పండుగలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట దేవుడు నడిచి వారిపై తన ఆశీర్వాదాలను విస్తారంగా కురిపిస్తాడన్నారు. నాలుగు రోజులపాటు చేసిన ప్రార్థనలకు అనుగుణంగా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని తోడు మనతో ఉండాలన్నారు. పోగొట్టుకున్న వాటిన్నింటినీ దేవుని ఆశీర్వాదంతో రెట్టింపుగా పొందుతామన్నారు. అందరికీ కృతజ్ఞతలు.. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులు పూర్తిస్థాయిలో వసతులు కల్పించడంలో సహకరించిన వారందరికీ పాస్టర్ అబ్రహాం కృతజ్ఞతలు తెలిపారు. తొలి ఏడాది అనుభవాలతో ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది 50వ గుడారాల పండుగ మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ గుడారాల పండుగ ఎంతో ఘనంగా జరగటానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బంది ప్రతి ఒక్కరికి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలుతున్నామని పేర్కొన్నారు. నిరంతర స్తుతి అవసరం.. తొలుత చివరి రోజు సభలకు పాస్టర్ జేమ్స్ ప్రారంభ ప్రార్థన నిర్వహించారు. అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ ప్రసంగిస్తూ ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండియున్నదని తెలిపారు. మానవుడు దేవుడిని ఎంతగా ప్రార్థిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వాదాలు ఇస్తాడన్నారు. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఆయన కృప ఉన్నప్పటికీ ఎవరైతే స్తుతిస్తూ తమ హృదయాలను బలిపీఠంగా చేస్తారో వారిపై ఆయన ప్రత్యేక కృప కనబరుస్తాడన్నారు. లోకమంత దేవుని కృపతో నిండియున్నప్పటికీ దానిని అందిపుచ్చుకోవటానికి ప్రతి ఒక్కరూ దేవుడిని నిరంతరం స్తుతించాలన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. హోసన్నా మినిస్ట్రీస్ దైవ జనులు రమేష్, ఫ్రెడ్డీ పాల్ దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రార్థనలలో ఆదివారం కావటంతో దాదాపు 20 లక్షల మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ప్రసంగిస్తున్న దైవజనులు చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ, హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం -
ఇఫ్తార్ విందు ఏర్పాట్లు పరిశీలన
గుంటూరు రూరల్: నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్డునందున్న శ్రీ కన్వెన్షన్లో మంగళవారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాట్లను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, వైఎస్సార్ సీపీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, కదిరి ఇన్చార్జి మక్బుల్బాషా, నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి నూరిఫాతిమా, స్టేట్ మైనారిటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ఖాన్, తెనాలి పరిశీలకుడు గులాం రసూల్లు పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చే ప్రదేశాలు, పార్కింగ్, తదితర సౌకర్యాలను పరిశీలించి చర్చించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించి మైనారిటీలను ఒక స్థానంలో నిలబెట్టిన మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలతో ముందుకు సాగుతున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఈనెల 10వ తేదీన జరుగుతున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముస్లిం మైనారిటీలకు ప్రతి ఏటా జగనన్న ఇప్తార్ విందును పార్టీ స్థాపించిన నాటినుంచి ఇస్తూనే ఉన్నారని, ఇఫ్తార్ విందు కార్యక్రమాలను ప్రారంభించిన మహనీయుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేసుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను చేస్తున్న ముస్లిం సోదరులకు జగనన్న ఇచ్చే విఽందులో పాల్గొని ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైదాఖాన్, తూర్పు నియోజకవర్గం అధ్యక్షుడు లియాఖత్, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షుడు షర్బుద్దిన్, మైనారిటీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల పట్ల టీడీపీ నాయకుడి అమానుషం
దుగ్గిరాల: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థినులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు. -
కేంద్రానికెళ్లడమే పెద్ద ‘పరీక్ష’!
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు వారం రోజులే వ్యవధి ఉంది. పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 27,699 మంది విద్యార్థులకు 149 కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిరునామాలు లేకుండా జారీ హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల విడుదల చేసింది. వాటిపై పరీక్ష కేంద్రం కోడ్ నంబరు, పేరు ముద్రించి వదిలేశారు. ఆ కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో స్పష్టత ఇవ్వలేదు. కేంద్రాలను కనుక్కోవడమే విద్యార్థులకు పెద్ద పరీక్షగా మారింది. ఒకే పేరుతో ఉన్న పాఠశాలల క్యాంపస్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కనిపెట్టడం మరింత ఇబ్బందిగా మారింది. కేంద్రం కోడ్తోపాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలో కొన్ని చోట్ల ప్రాంతాల పేర్లు లేకుండా కేవలం పాఠశాల పేరుతో హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి. ఆ పాఠశాలే లేదు గుంటూరు నగరంలో సెంటర్ కోడ్ 54036తో నారాయణ ఇంగ్లిషు మీడియం స్కూల్ పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేశారు. సంబంధిత కేంద్రంలో పరీక్ష రాసేందుకు వివిధ పాఠశాలలకు చెందిన 170 మంది విద్యార్థులను కేటాయించారు. బృందావన్ గార్డెన్స్ 4వ లైను చిరునామాతో జారీ చేసిన హాల్ టిక్కెట్లు ఆధారంగా అక్కడకు వెళ్లిన విద్యార్థులు అవాక్కయ్యారు. నారాయణ స్కూల్ బదులుగా ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల ఉంది. నారాయణ స్కూల్ ఇక్కడి నుంచి పాఠశాలను తరలించి ఏళ్లు గడుస్తున్నా ఏటా ఇదే పేరుతో హాల్ టిక్కెట్లు జారీ చేస్తుండటం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా నిలుస్తోంది. గుంటూరులో సెంటర్ కోడ్: 54002, 54003తో భాష్యం హైస్కూల్ చంద్రమౌళీనగర్ పేరుతో హాల్ టికెట్లు జారీ చేశారు. ఒకే పేరుతో రెండు కేంద్రాలు ఉండటంతో వాటిని తె లుసుకోవడం ఇబ్బందిగా మారింది. జీకేఆర్ హై స్కూల్ పరీక్ష కేంద్రం చిరునామా హాల్టిక్కెట్లపై ముద్రించలేదు. ఆ పేరుతో ఏటీ అగ్రహారం, పట్టాభిపురంలో వేర్వేరుగా క్యాంపస్లు ఉన్నాయి. ‘సెంటర్ కోడ్ 54019, ఎస్ఎస్ఎన్వో హైస్కూల్, బ్రాడీపేట’ పేరుతో జారీ చేసిన హాల్ టకెట్లపై చిరునామా అస్పష్టంగా ఉంది. సెంటర్ కోడ్ 54046తో జారీచేసిన హాల్ టికెట్పై హెచ్సీహెచ్ఎస్, గుంటూరు పేరుతో ముద్రించిన కేంద్రం ఎక్కడ ఉందో తెలియదు. దీనిని మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్గా అర్థం చేసుకోవాలి. సెంటర్ కోడ్: 54047, కేఎస్సార్ మున్సిపల్ హైస్కూల్’ పేరుతో జారీ చేసిన హాల్ టిక్కెట్ చిరునామా కేవీపీ కాలనీగా మార్చుకోవాలి. -
విజయకీల్రాదిపై హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠాపన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం విఘ్న విమోచక హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠను ఘనంగా నిర్వహించామని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ, ప్రథమారాధన, తీర్థ ప్రసాద గోష్టి, విశేష తదియారాధనలతో కార్యక్రమాలు ముగిశాయని తెలిపారు. మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, భక్తు లు పాల్గొని స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్: కాకినాడలో ఈనెల 11వ తేదీన నిర్వహించే వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఏకలవ్య విగ్రహాలకు ఆదివారం ఆయన రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్లతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ గోరెబాబు, ఈపూరి ఆదాం, కట్టెపోగు నాగభూషణం, గొర్నిపూడి శుభాకర్, మాతంగి బాబు, కలకోటి చక్రవర్తి, బుర్రా శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి: పాలనాదక్షుడు కొత్త రఘు రామయ్య ను స్మరించుకుంటూ నూతనోత్తేజంతో ముందుకు వెళదామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణం విజయవాడ రోడ్డులోని కెనాల్ బండ్పై ఏర్పాటు చేసిన ప్రముఖ పార్లమెంటేరియన్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఉదయం మంత్రి మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వార్థం లేని రాజకీయాలు నడిపిన రఘురామయ్య స్మారకార్థం ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కొత్త సుబ్రహ్మణ్యం, కొత్త రమేష్బాబులను అభినందించారు. కార్యక్రమంలో విగ్రహదాతలు, ఎన్నారైలు పరుచూరి మీనాక్షిదేవి, డాక్టర్ సీతారామాంజనేయులు, రఘురామయ్య కుటుంబసభ్యులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు కొత్త హరికుమార్, కొత్త కృష్ణకుమార్, కొత్త శేషుబాబు, బసవయ్య, జెట్టి గుణ తదితరులు పాల్గొన్నారు. తొలుత రఘురామయ్య విగ్రహా నికి పుష్పాంజలి ఘటించారు. హోటల్ గౌతమ్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రఘురామయ్య సంస్మరణ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. -
నృసింహునికి పట్టువస్త్రాలు సమర్పణ
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి ఉన్న లక్ష్మీనరసింహస్వామికి పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. చీర, సారె, పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు, పలు రకాల పండ్లు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషిస్వామి దేవస్థానం నుంచి 96 పళ్లెములతో పూజా ద్రవ్యాలు, మంగళవాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకున్నారు. సంఘ అధ్యక్షులు ఊట్ల పాలశ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ఐదేళ్లలోనే యాభై ఏళ్ల సంస్కరణలు తెచ్చారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అన్నిఅనుబంధ విభాగాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సజ్జల అన్నారు.‘‘మండల, గ్రామస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో మహిళా విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. ఏదైనా సమస్యలపై గట్టిగా పోరాటం చేయవచ్చు. స్థానికంగా ఉన్న సమస్యలపై అక్కడే పోరాటం చేయాలి. పార్టీ పిలుపునిచ్చే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. మీ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. లీడర్లుగా ఎదగాలంటే చొరవ చూపి ముందుకు నడవాలి. చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారు. ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారు...వైఎస్ జగన్ అనేక పథకాలను మహిళలే కేంద్రంగా అమలు చేశారు. మహిళల జీవన ప్రమాణాలను పెంచేలా కృషి చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. దీని వలన జరుగుతున్న నష్టాలపై ఎక్కడికక్కడే సమావేశాలు పెట్టాలి. అందరిలోనూ చైతన్యం తీసుకు రావాలి. వచ్చే ఎన్నికల నాటికి మహిళలే కీలక పాత్ర పోషించేలా నాయకత్వం వహించాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్ జగన్ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్గా పని చేసి మళ్లీ జగన్ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది...కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా నేతలు ఆర్కే రోజా, వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి సహా పార్టీ మహిళా ముఖ్య నేతలు కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, అన్ని జిల్లాల మహిళా అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాంకాక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న ప్రతి మహిళకూ పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.’అని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2026 -
కుటుంబంలో సప్త స్వరాలు
సప్త స్వరాలకు జీవన పయనానికి చాలా దగ్గర సంబంధమే ఉంది. మాది సంప్రదాయ సంగీత కుటంబం. అమ్మ లలితకు ప్రస్తుతం 85 సంవత్సరాలు. ఆమె వీణ, వయోలిన్, గాత్రంలో అద్భుత ప్రతిభాపాటవాలు పొందారు. ఇప్పటికీ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పిస్తుంటారు. ఆమె స్ఫూర్తితో నేను వయోలిన్, వీణ, గాత్రంలో మూడు డిప్లమోలు పూర్తి చేశాను. నేను, అక్క సరస్వతి విఘ్ణుభట్ల సంగీత సిస్టర్స్గా పేరుగాంచాం. నా కుమార్తె ఐఐఎంలో ఎంబీఏ చేసినా సంగీతంలో అద్భుతమైన పట్టు ఉంది. సంగీతం మాకు అద్భుత జీవితాలను ప్రసాదించిందంటే అతిశయోక్తి కాదు. దీని కోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు చేసిన సాధన ఎంతో ఉపకరించింది. ముఖ్యంగా మేము రాణించడంలో ప్రతిభతోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. సీ్త్ర ఒక్క విషయం గుర్తించాలని నా మనవి. స్వేచ్ఛ పేరుతో చేసే విశృంఖలం ఎప్పటికీ మంచిది కాదు. అది చివరకు తననే దహిస్తుంది. సమాజంలో చులకన చేస్తుంది. నిత్యం గమనించుకుంటూ ముందుకు సాగాల్సిందే. తెలీక జరిగిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహిళపైనే ఉంటుంది. –కృష్ణవేణి విష్ణుభట్ల, ప్రిన్సిపల్, డాక్టర్ బాలమురళీకృష్ణ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్, గుంటూరు. -
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
గుంటూరు రూరల్: గుంటూరు నగరంలోని స్వర్ణభారతినగర్ ఇద్వానగర్ కాలనీలో శనివారం కార్డన్సెర్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ప్రజల భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెగా కార్డన్ డేగా ప్రకటించి ఒకేసారి విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో గంజాయి విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఏపీ కాల్ సెంటర్ నంబర్ – 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ -
అవరోధాలు అధిగమిస్తే విజయమే
మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. 2004లో డిగ్రీ పుర్తయిన నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించాను. ఈ క్రమంలో 2009లో వివాహం జరిగింది. అయినా పరీక్షలు రాయడం మానలేదు. వివాహం అయిన తర్వాత కొంత విరామం వచ్చినా కుటుంబం, భర్త సహకారంతో వాటిని అధిగమించడంతో 2010లో అటవీ శాఖాధికారిగా ఎంపికయ్యాను. ఆ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉండడంతో 2011లో రెండు సంవత్సరాల శిక్షణ కోసం నెలల బిడ్డను అమ్మ దగ్గర వదిలి డెహ్రడూన్ వచ్చాను. కఠోర శిక్షణ, కుటుంబం, నెలల బిడ్డ చాలాసార్లు నాతో నేనే పోరాడిన సందర్భాలున్నాయి. అయినా వెనుకడుగు వేయలేదు. మానసిక స్థైర్యంతోనే ముందుకు నడిచాను. ఇంట్లో పనులు నేనే చేసుకుంటాను. ఉద్యోగ బాధ్యతల్ని మరో పక్క చూసుకుంటాను. ముఖ్యంగా మహిళలకు సహనం చాలా ముఖ్యం. సహనంతోనే ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంటుందని నా జీవితం నాకు నేర్పింది... ఎం.హిమ శైలజ, జిల్లా అటవీశాఖాధికారిణి, గుంటూరు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలు నిలిపివేత
వేజండ్ల(చేబ్రోలు): మండలంలోని వేజండ్ల గ్రామంలో శుక్రవారం డొంకరోడ్డులో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్పై ‘డొంకనూ దోచేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితం కావటంతో తవ్వకాలు నిలిపివేశారు. వేజండ్ల జడ్పీ హైస్కూల్ పక్కన ఉన్న ప్రభల డొంక రోడ్డును యంత్రాలతో తవ్వకాలు చేసి అధికార పార్టీ నాయకులు ఎర్ర గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకోవటంపై విమర్శలు వచ్చాయి. శనివారం ఉదయం పెద్ద పెద్ద యంత్రాలతో స్థానిక నాయకులు రెండో రోజు తవ్వకాలు మొదలు పెట్టారు. స్థానికులు, గ్రామస్తులు రెవెన్యూ, పంచాయతీ, మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు కె.శ్రీనివాసశర్మ, ఈఓపీఆర్డీ ఎం.రవిశంకర్ల ఆదేశాలతో డొంక రోడ్డులో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ను నిలుపుదల చేశారు. -
ఇతరులను ప్రేరేపించే శక్తి కలిగి ఉండాలి
చేబ్రోలు: నాయకత్వం అనేది కేవలం పదవులు పొందడం మాత్రమే కాకుండా బాధ్యత, విలువలు, నిర్ణయ సామర్థ్యం మరియు ఇతరులను ప్రేరేపించే శక్తి కలిగి ఉండడమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచా వర్మ వివరించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకలను గివ్ ఫర్ గెయిన్ – బలమైన, సమగ్ర భవిష్యత్తు కోసం మహిళల సాధికారత అనే ఇతివృత్తంతో నిర్వహించారు. మహిళల విద్య, భద్రత, నాయకత్వ సామర్థ్యం, సంక్షేమం వంటి అంశాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు సమాజం మొత్తం పురోగతి, అభివద్ధి మరియు సౌభాగ్యాన్ని పొందుతుందని ఈ ఇతివృత్తం సారాంశమని తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచా వర్మ మాట్లాడుతూ విద్యాసంస్థలు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు తమ సామర్థ్యాలను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. డాక్టర్ జ్యోత్స్న వినుకొండ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కొర్రపాటి వాణిశ్రీ మాట్లాడుతూ మహిళలు జీవితంలో పంచుకోవడం, సహనం, రాజీ పడటం, పరిస్థితులకు అనుగుణంగా మెలగడం వంటి విలువలు ఎంతో ముఖ్యమని తెలిపారు. అనంతరం నిర్వహించిన పోటీలలో గెలుపొందిన అధ్యాపకులకు బహుమతులు అందజేశారు. డీఆర్డీవో జాయింట్ డైరెక్టర్, సైంటిస్ట్ ఎఫ్ – అనిత పూరి మోహింద్ర, పద్మశ్రీ, నారి శక్తి అవార్డీ, ప్రజ్వల ఫౌండర్ డాక్టర్ సునీత క్రిష్ణన్, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


