Guntur
-
జిల్లాలో ప్రాధాన్య రంగాలకు ప్రత్యేక స్థానం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రాధాన్య రంగాలైన వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సర్వీసు రంగాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడో కలెక్టర్ల సమావేశంలో బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ హార్టికల్చర్, పశువులు, అడవులు, ఫిషింగ్, ఆక్వా, ఇండస్ట్రీస్, మైనింగ్, మ్యానుఫ్యాచరింగ్, తదితర 19 ప్రముఖ రంగాల్లో గ్రోత్ రేటు పెంచేందుకు లక్ష్యాలను తయారు చేశామన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీడీవీఏ వృద్ధిరేటు 14.9 శాతం, ఇండస్ట్రీస్ రంగానికి 21.29, సర్వీసు రంగంలో 16.01 ప్రగతి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఉద్యాన పంటలు, పశు సంవర్ధక శాఖలు ప్రధానమని పేర్కొన్నారు. గుంటూరులో మిర్చి సాగు విస్తారంగా చేస్తారని, ప్రస్తుతం జిల్లాలో శీతల గిడ్డంగుల గోదాముల్లో 40 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉంచారన్నారు. ఎగుమతి మార్కెట్ ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోవడంతో మంచి ధర కోసం రైతులు గోదాముల్లో నిల్వ ఉంచారని తెలిపారు. వ్యవసాయ రంగంలో రబీలో పంటల సాగు పెరిగిందన్నారు. కౌలు రైతుల పంటల రుణాలకు రూ. 58 కోట్లు నుంచి రూ. 100 కోట్లకు పెంచేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉద్యాన పంటల్లో గ్రోత్ ఇంజిన్ పంటలైన మిరప, పసుపు, కూరగాయలు, పూల సాగును 17800 హెక్టార్ల నుంచి 18,400 హెక్టార్లకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్ పంటల సాగును 12,100 హెక్టార్లను 14,500 హెక్టార్లకు పెంచుతామన్నారు. జిల్లాకు సంబంధించి అన్ని రంగాల్లో నిర్ధేశించనున్న లక్ష్యాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
నేడు దుగ్గిరాల ఎంపీపీ పదవికి ఎన్నిక
దుగ్గిరాల: దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఇన్చార్జి ఎంపీపీగా షేక్ జబీన్ వ్యవహరిస్తున్నారు. ఎన్నిక నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తహసీల్దార్ ఐ.సునీత తెలిపారు. ఇదిలా ఉంటే మంచికలపూడి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పదవికి కూడా గురువారం ఎన్నిక జరగనుంది. గుంటూరు రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నిక నేడు గుంటూరు రూరల్: రూరల్ మండలం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎన్నికను గురువారం ఉదయం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మండల అభివృద్ది అధికారి బి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు గుంటూరు లీగల్: ప్రతిష్టాత్మకమైన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఫలితాలూ అదేరోజు వెలువడతాయి. అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కోసం మొత్తం మూడు బూత్లు ఏర్పాటు చేశారు. 2,016 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు ముగిస్తుంది. గంట తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ రాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థులు బాధ్యతలు స్వీకరిస్తారు. -
శాంతి భద్రతల పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): శాంతి భద్రతల పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో బుధవారం సాంకేతిక పరిజ్ఞానంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసింగ్లోనూ సాంకేతిక పరిజ్ఙానంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరిగే నేర సమగ్ర సమాచారాన్ని రూపొందించాలని చెప్పారు. నేర స్థలాలను అనుసంధానం చేసి, నేరస్తులను, నేరాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా చేయాలన్నారు. ఇటీవల వేలిముద్రలకు సంబంధించి ఏఎఫ్ఐఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కువ కేసులు ఛేదించామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), సుప్రజ (క్రైం), డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) పలు విభాగాల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ సతీష్కుమార్ -
తెనాలిలో సదరం క్యాంప్ పునఃప్రారంభం
తెనాలిఅర్బన్: దివ్యాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ను నిర్వహించారు. ఆర్ధో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన దివ్యాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం ఆర్ధో–90, ఈఎన్టీ–42, సైక్రాటిక్–45 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. గురు, శుక్రవారాలలో కూడ క్యాంప్ జరుగుతుందని చెప్పారు. నృసింహస్వామి ఆలయ హుండీల లెక్కింపు నేడుమంగళగిరి టౌన్: మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను గురువారం లెక్కిస్తామని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను గురువారం ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్టు వివరించారు.ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోలునరసరావుపేట: రబీ 2024–25కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. ఖరీఫ్ కాలంలో ధాన్యం సేకరణ జిల్లాలో అధిక భాగం పూర్తయిందని ఈనెల 29 నాటికి కొనుగోళ్లు పూర్తిచేయటం జరిగుతుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 115 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 73 రైతు భరోసా కేంద్రాల ద్వారా 1947 మంది రైతుల వద్ద నుంచి 13,737 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. పీఎం యోగా అవార్డుకు దరఖాస్తు చేసుకోండినరసరావుపేట ఈస్ట్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యోగా అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు, లేదా సంస్థలకు అందించే ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన వారు ఆన్లైన్లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం తెలిపారు. యోగా అవార్డులు నిష్కళంకమైన ట్రాక్ రికార్డు, యోగా ప్రమోషన్, అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలకు అందిస్తారని వివరించారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను https://innovateindia. mygov.in/pm&yoga& awards&2025 వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాని సూచించారు. నేడు భట్టిప్రోలు కో–ఆప్టెడ్ మెంబర్ ఎంపికభట్టిప్రోలు: స్థానిక మండల ప్రజా పరిషత్ కో–ఆప్టెడ్ మెంబర్ స్థానానికి గురువారం పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎస్. వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రత్యేక అధికారి బి. వేణుగోపాల్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కో–ఆప్టెడ్ మెంబర్ మహ్మద్ ఫిరోజ్ ఎలియాస్ సలీం గత ఏడాది నవంబర్ 13న డిస్ క్వాలిఫై అయినట్లు జెడ్పీ సీఈవో జ్యోతిబసు ఉత్తర్వులు జారీ చేశారు. సలీం వరుసగా మూడు సమావేశాలకు హాజరు కానందున ఖాళీ స్థానం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నిక ఉంటుందని తెలిపారు. సమావేశంలో సభ్యులు చేతులు ఎత్తి ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారని ఆయన వివరించారు. రేపు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ రద్దు బాపట్ల: ఎస్టీలు, దివ్యాంగుల కోసం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా శుక్రవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి బుధవారం పేర్కొన్నారు. -
అవకతవకలు, అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలి
నరసరావుపేట రూరల్: అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జామాయిల్ వేలంలో అవకతవకలు, అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలని సామాజిక వన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డె హనుమారెడ్డి డిమాండ్ చేశారు. జామాయిల్ వేలంలో అక్రమాలు, అక్రమంగా కర్రను తరలించడాన్ని నిరసిస్తూ సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అటవీ శాఖ కార్యాయలం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల పరిధిలో 218 వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో పెంచిన జామాయిల్, కర్రకు గత ఏడాది నవంబర్లో వేలం నిర్వహించారని తెలిపారు. కర్ర నరుకుడు ప్రారంభించిన వ్యాపారులు అక్రమంగా రవాణా చేస్తూ కంపెనీలకు తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచిన జామాయిల్ కర్రకు వేలం నిర్వహించడం ద్వారా రైతులు టన్నుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. అటవీ శాఖ భూముల్లో రైతులకు నష్టం కలిగించే జామాయిల్ పంటను నిషేదించాలని కోరారు. ఈ భూముల్లో పండ్ల తోటల పెంపకం చేయడం ద్వారా రైతులకు, అటవీ శాఖకు ఆదాయం లభిస్తుందన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ గిట్టుబాటు ధరల లేక రైతులు నష్టాల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తాళ్లూరి బాబురావు, కె.వీరారెడ్డి, కొల్లి లింగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
పెదకాకాని: ఆర్చరీ క్రీడాకారులు అత్యున్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత సంజీవ సింగ్, వీవీఐటీయూ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అర్చరీ క్రీడకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్చరీ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న చెరుకూరి లెనిన్ వోల్గా అసోసియేషన్ కృషి ప్రశంసనీయమన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అమరావతి వేదికగా స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటునట్లు వివరించారు. వీవీఐటీయూ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్ల్లాడుతూ నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ నిర్వహణకు వీవీఐటీ యూనివర్శిటీ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్చరీ వంటి క్రీడల ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 900 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్లు హాజరయ్యారు. అండర్ 10, అండర్ 13, అండర్ 15 విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజు బుధవారం 723 మంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీవీఐటీయూ ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, ఏపీ అర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యం, వీవీఐటీయూ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సిజేరియన్లు చేసే ఆస్పత్రులకు నోటీసులివ్వండి
గుంటూరు మెడికల్: నూరుశాతం సిజేరియన్స్ చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. బుధవారం గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా ప్రొగ్రామ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ నూరు శాతం సిజేరియన్లు చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో జిల్లా టీమ్లతో తనిఖీలు చేయాలని చెప్పారు. ఆ ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేయాలని, సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లభించే మందుల వివరాలు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆసుపత్రి నోటీసు బోర్డులో అందరికి కన్పించేలా ప్రదర్శించాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను సత్వరమే గుర్తించి చికిత్స అందించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే క్షయ వ్యాధి పరీక్షల వివరాలు తప్పనిసరిగా సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే కుక్కకాటు, పాముకాటు కేసుల వివరాల గురించి ఆరా తీసి సంబంధిత వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా జిల్లా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవాలు ఆరోగ్య కేంద్రాల్లో పెంచేందుకు సంబంధిత పీహెచ్ వైద్య అధికారులకు ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేయాలని వెల్లడించారు. ఆర్సీహెచ్, హెచ్ఎంఐఎస్ పోర్టల్లో గర్భిణీల నమోదు నూరు శాతం తప్పనిసరి చేయాలన్నారు. గర్భిణీలు, చిన్నారులకు నూరు శాతం వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్బాబు, డాక్టర్ రత్నమన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాలు పెంచండి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ -
28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో ఈనెల 28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.స్వరూపరాణి తెలిపారు. సాంబశివపేటలోని కళాశాలలో బుధవారం సదస్సు బ్రోచర్, ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ గ్లోబల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (జీసీపీఏ), సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాల సంయుక్తంగా తొలిసారిగా అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘సైకో సోషల్ కాంపెటెన్సీస్ ఫర్ గ్లోబల్ యూత్’’ అనే అంశంపై ఏర్పాటు చేస్తున్న సదస్సు ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి, ఏఎన్యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, గుంటూరు జేఎంజే ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ విజయమేరీ ఉడుముల, పలువురు ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటుండగా, ఎస్వీయూ పూర్వ వీసీ ఆచార్య వి.శ్రీకాంత్రెడ్డి ముఖ్య ప్రసంగం చేస్తారని వివరించారు. దేశ, విదేశాల నుంచి పరిశోధకులు, అధ్యాపకులు, వివిధ రంగాల ప్రముఖులు ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. జీసీపీఏ అధ్యక్షురాలు డాక్టర్ డి. సరోజ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సామాజిక, మానసిక పరిస్థితులకు అనుగుణంగా యువతను సక్రమమైన మార్గంలో పయనింపచేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సదస్సు దోహదం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఏ. రోజిలీన్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టీఎస్ సుభాషిణి పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర కల్పించాలి
నాలుగు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షలు ఖర్చు చేశా. దిగుబడి 10 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితులు లేవు. వాటిలో సగం తాలు. ప్రస్తుతం 40 బస్తాలు యార్డుకు తీసుకువచ్చాను. క్వింటా రూ.9 వేలు ధర పలికింది. గత ఏడాది మిర్చి క్వింటా ధర సుమారు రూ.27 వేల వరకు పలికింది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ముడావత్ హిరా నాయక్, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, కల్వకుంట గ్రామం ఆత్మహత్యలే శరణ్యం నాలుగు ఎకరాల్లో 116 డీలక్స్ రకం మిర్చి పంట సాగు చేశాను. గత ఏడాది 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది పది క్వింటాళ్లుకూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందులో సగానికి పైగా తాలు వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టా. గత ఏడాది క్వింటా రూ.27 వేలు పలికింది. ప్రస్తుతం 34 బస్తాలు యార్డుకు తీసువచ్చాను. క్వింటా కాయలకు రూ.10 వేలు వేశారు. రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మిర్చి అమ్ముకుని వెళ్ళాలంటే భయమేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలు, ఎరువులు, పురుగు మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవే ధరలు కొనసాగితే రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం – పినికే వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా, పెద్ద అర్ధవీడు మండలం, తమ్మడపల్లె గ్రామం ● -
ఎదురుచూపూల్ ఎన్నాళ్లు!
గుంటూరు వెస్ట్: సుమారు 200 నుంచి 300 మంది సభ్యులు. నెలకు సుమారు రూ.2 లక్షలు పైనే ఆదాయం. ఎందిరికో ఆరోగ్యాన్ని, ఆటవిడుపును అందించే ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కునారిల్లుతోంది. 25 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల వెడల్పుగల ఈ పూల్ నగరంలోనే అతి పెద్దది. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి మూతపడిన ఈ పూల్ను కొన్ని నెలలపాటు గాలికొదిలేశారు. కొత్తగా క్రీడలను ప్రోత్సహిస్తామన్న కూటమి ప్రభుత్వం ఉన్న వాటిని కూడా కాపాడుకోలేకపోతోందనే విమర్శలు సభ్యుల నుంచి వస్తున్నాయి. ఎన్నో సార్లు సభ్యులు, స్థానికులతోపాటు పత్రికల్లో కూడా వార్తలు వచ్చినా జీఎంసీ అధికారుల్లో చలనం లేదు. ఇటీవల మరమ్మతుల పనులను రూ.20 లక్షలతో కాంట్రాక్ట్కు అప్పగించారు. అయితే ఆ నిధులూ అరకొరగా ఉండడంతో మరమ్మతులు సజావుగా సాగడం లేదు. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నా అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. పూల్ని శుభ్రపరచడానికి కావాల్సిన కనీస పరికరాలు కూడా అందుబాటులో లేవు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు ఈ పూల్లో ఆధిపత్యం చలాయించడానికి యత్నించడమే కాని అభివృద్ధి గురించి మాట్లాడరనే విమర్శ ఉంది. సభ్యులు ఒకొక్కరూ ఏడాదికి రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. సమ్మర్లో కేవలం ఒక్క మే నెలలోనే ఒక్కొక్కరికి రూ.2,000 వసూలు చేస్తారు. ఇన్ని నిధులు సమకూరుతున్నా అభివృద్ధి మాత్రం చేయరు. 50 మీటర్ల పూల్ సంగతేంటి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇదే ఆవరణలో 50 మీటర్ల పూల్కు శంకుస్థాపన చేశారు. దీనికి సుమారు రూ.3 కోట్లు కేటాయించారు. తర్వాత దీని సంగతే మర్చిపోయారు. ఈ పూల్ నిర్మాణం అయితే ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ పోటీలు నిర్వహించవచ్చు. ఏమి మారింది గత ప్రభుత్వ హయాంలో ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో నాలుగు నెలల నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. ఏం మారింది. మేము సీనియర్ సిటిజన్స్. ఈతతో కొంత ఉపశమనం పొందుతాం. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. 9 నెలల నుంచి బీఆర్ స్టేడియమూ ఇలానే ఉంది. ఇక్కడ వస్తున్న డబ్బులో కొంత పెట్టడానికి ఇబ్బంది ఏమిటీ. ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని తక్షణం పూల్ని ప్రారంభించాలి. – పెద్ది రమణారావు, సభ్యుడు. మా మొర ఎవరూ ఆలకించరు ప్రస్తుతం పూల్ ఉండే ప్రాంతం సుమారు రెండున్నర ఎకరాలు. సుమారు రూ.500 కోట్లపైనే విలువ చేస్తోంది. ఇంత ఖరీదైన ప్రాంతంలో ఉండే పూల్ని జీఎంసీ అధికారులు గాలికొదిలేశారు. గతంలో ఇక్కడ జాతీయ స్విమ్మర్స్ సాధన చేసేవారు. ఇప్పుడు వారు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. బయట ప్రైవేట్ పూల్స్ నెలకు రూ.3,000–5,000 వసూలు చేస్తున్నాయి. అధికారులు చొరవ చూపాలి. ముఖ్యంగా 50 మీటర్ల పూల్ నిర్మాణానికి దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు వస్తే అందరికీ మేలు జరుగుతుంది. – పాటిబండ్ల సుబ్బయ్య, స్విమ్మర్ ఏమిటీ నిర్లక్ష్యం మాకు పర్మినెంట్ మెంబర్షిప్ ఉంది. ఏడాదికి రూ.1,500 కడుతున్నాం. నేను మాస్టర్స్ విభాగంలో నేషనల్స్లో పాల్గొన్నాను. నాకు నిత్యం సాధన తప్పనిసరి. ఏడాదికి కనీసం 6 నెలలు కూడా పూల్ సరిగ్గా ఓపెన్ చేయట్లేదు. ఎన్నిసార్లని ఫిర్యాదులు చేయాలి. డబ్బులు తీసుకునేటప్పుడు ఆ మాత్రం బాధ్యత జీఎంసీ వారికి ఉండక్కర్లేదా. కనీసం ఎంపీ నిధులతోనైనా దీనిని పూర్తి చేయాలి. సమ్మర్ క్యాంప్ కోసం ౖపైపె మెరుగులు చేస్తారు. మళ్ళీ మామూలే. – ఎ.స్వర్ణ లలిత, స్విమ్మర్ నాలుగు నెలల నుంచి ఈత కొలను మూత నత్తనడకగా పూల్ మరమ్మతులు సుమారు 200 మంది సభ్యుల ఆగ్రహం నెలకు రూ.2 లక్షలపైగానే ఆదాయం అయినా జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం సమస్యలివీ పూల్లోని ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. ఫ్లోరింగ్ మళ్లీ వేయాల్సి ఉంది. పురుషులు, మహిళలకు కంబైన్డ్ బాత్ రూమ్స్ ఉన్నాయి. ఇవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కొత్తగా నిర్మించాలి. లైటింగ్ చాలా వరకు లేదు. నీటిని ఫిల్టర్ చేసే యతంరం కూడా మరమ్మతులకు గురైంది. కొత్త లైట్లు వేయాల్సి ఉంది. ఇక బేబీ పూల్ మరీ దారుణంగా ఉంది. దీనికి కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి. -
ప్రయాణికుల సౌఖ్యమే ముఖ్యం
తెనాలిఅర్బన్: బస్టాండ్ ఆవరణలో, బస్సులలో ప్రయాణికుల సౌఖ్యమే ముఖ్యమని ఆర్టీసీ జిల్లా ప్రాంతీయ అధికారి ఎం.రవికాంత్ చెప్పారు. తెనాలి డిపోను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్, గ్యారేజ్లను పరిశీలించి సూచనలు చేశారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉన్న సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎం ఎ.రాజశేఖర్, అసిస్టెంట్ డీఎం ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ జిల్లా ప్రాంతీయ అధికారి రవికాంత్ -
శుభాల షబ్–ఏ–ఖదర్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): పరిపూర్ణ మనసుతో మన్నింపు కోరుకునే అవకాశం రంజాన్ మాసంలో ముస్లింలకు దక్కుతుంది. చేసిన పాపాలను మనిషి మనస్ఫూర్తిగా ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరితే దైవం తప్పక అనుగ్రహిస్తాడని ఖురాన్లో ఉంది. వేయి నెలల ప్రార్థనల పుణ్యఫలాన్ని ఒక్క రాత్రిలో అందించే షబ్–ఏ–ఖదర్ గురువారం జరగనుంది. రంజాన్ మాసంలో ఈ రాత్రికి ప్రత్యేకత ఉంది. 26 రోజుల కఠోర ఉపవాస దీక్షలు పూర్తయిన తరువాత ఆఖరి మూడు రోజులకు ముందు వచ్చే షబ్–ఏ–ఖదర్ రాత్రి చాలా పవిత్రమైందని గ్రంథాల్లో(హదీసులు) ఉంది. ఈ రాత్రి చేసే ప్రత్యేక నమాజ్లు, ఆరాధనలు, ప్రత్యేక ప్రార్థనలు తప్పక అనుగ్రహం పొందుతాయని చెబుతారు. షబ్–ఏ–ఖదర్ తర్వాత ఆఖరి మూడు రోజుల ఉపవాస దీక్షలు(సతామీ) ప్రారంభమవుతాయి. రంజాన్ నెల ప్రారంభం నుంచి ఉపవాస దీక్షలు ఉండలేని వారు ఈ ఆఖరి మూడు రోజులు మాత్రం తప్పండా ఆచరిస్తారు. పేదల హక్కు జకాత్ ఇస్లాంకు ఉన్న ఐదు మూల స్తంభాలలో జకాత్ ఒకటి. ఇది ఆరాధనలో రెండో విధి. ఇస్లాం పవిత్ర గ్రంథంలో జకాత్ గురించి ప్రస్తావన కనీసం 32 సార్లు ఉంది. దీన్నిబట్టి జకాత్కు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతోంది. ఇది పేదల హక్కు. అవసరార్థులకు జకాత్ చెల్లించే సదాచారుల కోసం దేవుని వద్ద ప్రతిఫలం సిద్ధంగా ఉంటుందని హదీసులలో పేర్కొనబడింది. ప్రతి ముస్లిం తన సంపాదనలో రెండున్నర శాతం పేదలకివ్వాలన్నది జకాత్ ఉద్దేశం. నమాజ్ వలే ఇది కూడా తప్పనిసరి నియమం. ఇస్లాంను ఆచరించేవారు దీనిని విస్మరించరాదు. రంజాన్ మాసంలో నేడు ప్రత్యేకమైన రాత్రి ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమవుతున్న ముస్లింలు వేయి నెలల ప్రార్థనల పుణ్యం ఒక్కరోజులోనే.. జకాత్కు అమిత ప్రాధాన్యం పేదలకు సంపాదనలో 2.5శాతం ఇవ్వడం ఆనవాయితీ దానం బాధ్యత రంజాన్ మాసంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. పేదలకు సాయం చేయడం ముస్లింల బాధ్యత. పేదలూ సంతోషంగా పండగ జరుపుకోవడానికి ఈ విధానం దోహదపడుతుంది. రంజాన్ మాసంలో సాయం, దానం చేయడం ఎంతో పుణ్యం. – ముఫ్తి సమీయుజమా హబీబీ, ముస్లిం మత గురువు -
YSRCP: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. -
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని సూచించింది. ఏప్రిల్ 3 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
గీత దాటిన పోలీసులకు కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చట్టాలను గౌరవించకుండా కూటమి ప్రభుత్వం మెప్పుకోసమే పనిచేస్తున్న పోలీసులకు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్ కోసమే పనిచేస్తే పోలీసులే నష్టపోతారని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ యంత్రాంగం మీద న్యాయవ్యవస్థ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్రమైన ఆలోచనలో పడేశాయి. ప్రజలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో కీలకమైన పోలీస్ యంత్రాంగం చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం బాధాకరం. ఒకే కంటెంట్ ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ కావొచ్చేమోకానీ, పలుచోట్ల ఎఫ్ఐఆర్లు కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన సూచనలు పోలీస్ యత్రాంగం పట్టించుకోవడం లేదు.అరెస్ట్ చేయొద్దని చెప్పినా, పీటీ వారెంట్ పేరుతో అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఒక ప్రణాళిక బద్ధంగా పైనుంచి వచ్చిన నాయకుల సూచనలను పోలీసులు పాటిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఒకానొక సందర్భంలో డీజీపీని కూడా కోర్టుకు పిలవాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చే దాకా తెచ్చుకోవడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. కోర్టు సీసీ టీవీ ఫుటేజీలు అడిగితే కోతులు కొరికేశాయని చెప్పుకునే పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.వ్యవస్థీకృత నేరాల పేరుతో వేధింపులుగుంటూరులో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక రీల్ చేస్తే, అతడిని కర్నూలులో అరెస్ట్ చూపించారు. ఆయన్ను వ్యవస్థీకృత నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని కోర్టు ఆక్షేపించింది. మేం కళ్లు మూసుకుని ఉండలేమని గౌరవ హైకోర్టు చెప్పడం పోలీసుల వ్యవహారశైలికి నిదర్శనం. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షలు పడే నేరాలకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలని పలుమార్లు సూచించింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పింది. 41ఏ నోటీసు ఇచ్చాక స్పందించకుండ పారిపోయే ప్రయత్నం చేసినప్పుడే అరెస్ట్ చేయాలని కోర్టులు చెబుతున్నాయి. నరసరావుపేటలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి పెళ్ళిలో ఉంటే పోలీసులు మంగళగిరిలో ఉన్నట్టు చూపించారు. ఆ కేసులో ఆధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎన్ఎస్ 111 యాక్ట్ ని సోషల్ మీడియా యాక్టీవీస్ట్ల కేసుల్లో ఎలా వర్తింపచేస్తారంటూ కోర్టు పలుమార్లు ఆక్షేపించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు.రాష్ట్రంలో అడుగడుగునా అధికార దుర్వినియోగంరాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అడుగుడుగునా అధికార దుర్వినియోగం కనిపిస్తోంది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఎంపీపీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. గార్లపెంటలో ఇన్చార్జిగా ఉన్న గంగోజమ్మ తానే స్వయంగా వీడియో పంపినా కూడా అక్కడున్న లీడర్లపై కేసులు పెట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలో బలం లేకపోయినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది.ఒక పక్క పోటీ చేయడం లేదని చెబుతూనే మరోపక్క ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అత్తిలి, యలమంచలిలో ఎంపీపీ ఎన్నికలున్నాయి. రెండుచోట్లా వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా అడ్డదారులు తొక్కి మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలా అనైతిక కార్యకలాపాల ద్వారా గెలవాలని చూస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.పథకాల అమలుపై దృష్టిసారించండిరాష్ట్రంలో రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఒక పక్క మద్ధతు ధర లభించిక అప్పులపాలవుతున్నారు. మిర్చి రైతులు నెలరోజులకుపైగా ఆందోళనలు కొనసాగిస్తుంటే వారి కష్టాలు పట్టించుకునే వారే లేరు. పీ4 పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేసే పనులు పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీలకు, వెనుకబడిన వర్గాలకు కేటాయించిన పథకాలకు నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి పేదరికంపై యుద్ధం చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో నాయకులు బెదిరింపులకు దిగుతుంటే వారి ఆదేశాలకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వత్తాసు పలకడం సబబేనా? -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పాక్షిక విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ మత ప్రబోధకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రవీణ్కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని.. అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్కుమార్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ఉదయం దాకా ఆయన అలా పడి ఉండడం ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: పాస్టర్ ప్రవీణ్ ఒంటిపై గాయాలు! -
స్తంభోద్భవ అలంకారంలో నారసింహుడు
మంగళగిరి: మంగళాద్రి వేంచేసివున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి అలంకారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆస్థాన అలంకారోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు స్తంభోధ్భవం అలంకారంలో దర్శనమివ్వగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కైంకర్యపరులు రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావు ,శ్రీనివాసరావు,వైజాగ్కు చెందిన అంగలూరి శరకోపాచార్యులు వ్యవహరించారు. బుధవారం అలంకారోత్సోవాలలో భాగంగా కాళీయమర్ధనం అలంకారంలో స్వామి వారు దర్శనమివవ్వనున్నారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి పర్వేక్షించారు. -
రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి
తెనాలిరూరల్: రైలు ఢీకొని ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద చోటుచేసుకుంది. తెనాలి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి ఆరో బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న పెద్దనబోయన రాఘవరెడ్డి(46) తనతో కలసి డ్యూటీలో ఉన్న సహచరులకు వారి ఇళ్ల నుంచి మంగళవారం భోజన క్యారేజీలను తీసుకెళ్లాల్సి ఉంది. 11 గంటల ప్రాంతంలో సహచరులకు ఫోన్ చేసి భోజనాలు సిద్ధమయ్యాయో లేదో కనుక్కుంటే తీసుకొస్తానని చెప్పాడు. కొద్ది సేపటికే ఇప్పటం రైల్వే గేటు వద్ద పట్టాల వెంబడి మృతి చెంది పడి ఉన్నాడు. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రైలు ఢీకొట్టిందా లేక సడెన్గా రైలు రావడంతో పక్కకు జరిగే క్రమంలో కాలు జారి పడడంతో తల వెనుక భాగంలో గాయమై మృతి చెందాడా అన్న అంశాలు దర్యాప్తులో తెలుస్తాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సొంత రాజ్యాంగం పులిమేసి!
● మున్సిపల్ చట్టాలకు తూట్లు ● కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై వైఎస్సార్ సీపీ సభ్యుల ధ్వజం ● మేయర్ రాజీనామా ఆమోదంపై కౌన్సిల్ నిర్వహణ! ● అసలు రాజీనామా ఫార్మెటే సరికాదు ● వైఎస్సార్ సీపీ సభ్యుల వాకౌట్ ● మెజార్టీ సభ్యుల మద్దతుతో మేయర్ రాజీనామా ఆమోదం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్) : గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్నాయుడు రాజీనామాపై మున్సిపల్ చట్టాలను కాదని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) దుయ్యబట్టారు. ఈనెల 15న మేయర్ కావటి మనోహర్నాయుడు తన పదవికి రాజీనామా చేసి కలెక్టర్కు పంపిన విషయం తెలిసిందే. మేయర్ రాజీనామా ఆమోదం కోసం మంగళవారం కౌన్సిల్ హాల్లో అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా తాత్కాలిక మేయర్గా షేక్ సజీల తన నియామకానికి కారణమైన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తరువాత మేయర్ రాజీనామా ఆమోదానికి సభ్యుల అభిప్రాయాలు తెలియజేయాలని సజీల కోరారు. వెంటనే డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ మే యర్ రాజీనామా లేఖను కలెక్టర్కు పంపితే.. ఆ లేఖ ఆధారంగా కౌన్సిల్ ఎలా నిర్వహిస్తారు? అస లు కలెక్టర్ నగరపాలక సంస్థకు మేయర్ రాజీనామాపై ఏమని రాశారో చెప్పాలని సెక్రటరీని కోరారు. మౌనం వహించిన సెక్రటరీ డెప్యూటీ మేయర్ అడిగిన ప్రశ్నపై కౌన్సిల్ సెక్రటరీ మౌనం వహించారు. దీంతో వెంటనే కమిషనర్ పులిశ్రీనివాసులు అందుకుని సమాధానం చెప్పే యత్నం చేశారు. మేయర్ పదవికి మనోహర్ రాజీనామా చేస్తూ లేఖను మెయిల్ ద్వారా కలెక్టర్కు, కమిషనర్కు పంపారని, దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారని కమిషనర్ వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేయర్ రాజీనామాపై అత్యవసర కౌన్సిల్ నిర్వహణకు ఉన్న ఇద్దరు డెప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్గా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎంఏయూడీ శాఖకు లేఖ రాశామని, ఈ నెల 21న డెప్యూటీ మేయర్ షేక్ సజీలను తాత్కాలిక మేయర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీని ప్రకారం అత్యవసరం కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేయర్ రాజీనామా ఫార్మెట్ సరైంది కాదు ‘‘మున్సిపల్ చట్టం 92 (1) మేయర్ తన పదవికి రాజీనామా చేయాలంటే కౌన్సిల్ నిర్వహించి కౌన్సిల్లో రాజీనామాకు గల కారణాలను చర్చించిన తరువాత సభ్యుల ఆమోదంతో రాజీనామాను ఆమోదించాలి. లేదా కౌన్సిల్ సెక్రటరీకి రాజీనామాను పంపితే ఆ రాజీనామాకు అనుగుణంగా సెక్రటరీ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ తరువాత రాజీనామాను ఆమోదించాలి. కానీ ఇక్కడ నగర కమిషనర్ కలెక్టర్కు పంపిన రాజీనామాను ఆధారం చేసుకుని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రభుత్వానికి లేఖ రాయడమేమిటి’’ అని డెప్యూటీ మేయర్ వజ్రబాబు ప్రశ్నించారు. దీనిపై తాము లీగల్ ఓపీనీయన్న్ తీసుకుంటామని.. అప్పటి వరకు మేయర్ రాజీనామా ఆమోదం కోసం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తరువాత తాత్కాలిక మేయర్ షేక్ సజీల మెజార్టీ సభ్యుల ఆమోదంతో మేయర్ మనోహర్ రాజీనామాను ఆమోదించారు. అధికారపార్టీకి కమిషనర్ కొమ్ముకాస్తున్నారు మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు మేయర్ రాజీనామా లేఖను కలెక్టర్కు పంపడం ఆమోదయోగ్యం కాదు డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజమెత్తారు. కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసిన ఆనంతరం విలేకరులతో డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడారు. కమిసనర్ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మేయర్లు, డెప్యూటీ మేయర్లను, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లను టీడీపీ కూటమి భయభ్రాంతులకు గురిచేస్తోందని, పచ్చజెండా పట్టుకుంటేనే పదవిలో కొనసాగుతారని ప్రలోభాలకు గురిచేస్తోందని విమర్శించారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ సభ్యులు 46 మంది ఉంటే మెజార్టీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుందని ధ్వజమెత్తారు. కమిషనర్ కూడా మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. మేయర్ తన రాజీనామాను కలెక్టర్కు పంపడం ఆమోదం యోగ్యం కాదని పేర్కొన్నారు. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకుంటామని కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు. -
సహకార సంవత్సర ప్రణాళిక కోసం కమిటీలు
గుంటూరు వెస్ట్: ఐక్యరాజ్యసమితి 2025–26 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా(ఐవైసీ) ప్రకటించిందని, దీని ప్రణాళిక కోసం జిల్లా కమిటీలు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా కో–ఆపరేటీవ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ఐవైసీ సంవత్సర లక్ష్యాలు, జిల్లాస్థాయి ప్రణాళికలు, వార్షిక కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనికి సంబంధించి కమిటీ క్యాలెండర్ ఆమోదించిందని తెలిపారు. జిల్లాలో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల వివరాలతోపాటు, కొత్తగా కమిటి సభ్యుల వివరాలు కంప్యూటరైజేషన్ ప్రక్రియను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ నెలలో ఐవైసీ యాక్షన్ ప్లాన్ చేయాల్సిన యాక్టివిటీస్కు సంబంధించి ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మహిళలకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. మల్టీపర్పస్ స్పెషలిటి సెంటర్ గోడౌన్లకు ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక ప్రాజెక్టు కింద ఏదైనా కవర్ చేయడానికి అవకాశం ఉందో లేదో చూడాలన్నారు. జిల్లాలో పీఏసీలు నాబార్డు ద్వారా అందించిన ఆర్ధిక సహాయంతో నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్లలో స్థానిక రైతులు వారి పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా అందించిన రుణాలు, ఓవర్జ్యూస్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని రికవరీ చేయాలన్నారు. ఏపీ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ వివిధ మండలాల్లో మహిళ పాడి సహకార సంఘ 15 గ్రామాలను గుర్తించామన్నారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో 101 ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సంఘాలు పనిచేస్తున్నాయని జేసీ వివరించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి విరాచారీ, డీపీఓ నాగసాయికుమార్, వ్యవసాయ శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జీడీసీసీ బ్యాంకు సీఈఓ కృష్ణవేణి, అధికారులు పాల్గొన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మిర్చికి క్వింటాకు రూ.25వేలు చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11,781లు మద్దతు ధర అని ప్రకటించి మిర్చి రైతులకు తీరని అన్యాయం చేశాయన్నారు. ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదని ఆవేదన చెందారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ప్రతి రైతుకు అన్నదాతా సుఖీభవ ద్వారా రూ.20 వేలు ఇస్తానని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వేసవిలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలి పలు సూచనలు చేసిన సహాయ కార్మిక శాఖ అధికారి నరసరావుపేట: వేసవిలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి ఆఫీసర్, సహాయ కార్మికశాఖ అధికారి జి.ధనలక్ష్మి కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలకు అనుగుణంగా కార్మికుల రక్షణకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్మాగారాలు, దుకాణాలు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధిహామీ కూలీలు, వలస కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు సూచనలు చేశామన్నారు. పనిచేసే సమయం మార్చి పనిప్రాంతంలో చల్లని నీడ, నీటివసతి కల్పించాలని తెలిపారు. వైద్యసిబ్బందితో సమన్వయం చేసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలని చెప్పారు. -
సీఐ గన్కార్యం..!
ఫిరంగిపురంలో ఓవర్ యాక్షన్ ● అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న ఖాకీలు ● అధికార పార్టీకి కొమ్ముకాసి వీఆర్ బాట పడుతున్న వైనం ● సివిల్ పంచాయితీలలో తలదూర్చి శాఖకు చెడ్డపేరు ● రేంజ్ పరిధిలో అడ్డగోలు బదిలీలు, వీఆర్లు ● పది నెలల్లో ఒకే స్టేషన్కు ముగ్గురు సీఐలు ● కూటమి సర్కారు వచ్చాక ఎల్లో పైరవీలదే రాజ్యం సాక్షి ప్రతినిధి, గుంటూరు, నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలను పట్టుకుని పోస్టింగ్లు తెచ్చుకున్న సీఐలు కొందరు స్వామిభక్తి ప్రదర్శిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మరికొందరు అడ్డంగా దొరికిపోయి వీఆర్ బాట పడుతున్నారు. తాజాగా ఫిరంగిపురంలో సీఐ రవీంద్రబాబు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఒక స్థల వివాదంలో ఫిర్యాదు చేసిన వారిపైనే దాడికి తెగబడటం, వారికి సినీఫక్కీలో గన్ గురిపెట్టడం, ఒక యువకుడిని గన్తో కొట్టి గాయపరిచడం జిల్లాలో సంచలనం రేకెత్తించాయి. ఈ అధికారి సివిల్ పంచాయితీలో తలదూర్చి రెచ్చిపోవడం ఇది రెండోసారి. గతంలో గోడను పడగొట్టించి మరీ..! గతంలో పొనుగుపాడు గ్రామంలో దళితుల స్థలంలో గోడను పడగొట్టించి మరీ ఈ సీఐ రోడ్డు వేయించిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకుని వెళ్లిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డైమండ్బాబుపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గ్రామస్తుల చేతిలో తన్నులు తినే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ అధికారిని ఉన్నతాధికారులు వెనకేసుకొస్తారా, లేక చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ‘రేంజ్’ వేరు..! సీఐల బదిలీలు, వీఆర్ విషయంలో గుంటూరు రేంజ్ కొత్త ట్రాక్ రికార్డును నెలకొల్పింది. గుంటూరు రేంజ్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠీ వచ్చిన తర్వాత పలువురు సీఐలను బంతాట ఆడుతున్నారు. సరిగ్గా పది నెలలు క్రితం సుమారు 13 మందికిపైగా సీఐలను బదిలీ చేశారు. అయితే వీరు బాధ్యతలు స్వీకరించక ముందే వెనక్కి పిలిచారు. కొందరు సీఐలు బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిల్లోనే వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లోకి వెళ్తున్నారు. కొంతమందికి పోస్టింగ్ ఇవ్వగానే కూటమికి చెందిన పచ్చపత్రికల్లో, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతోంది. గత ప్రభుత్వానికి అంటకాగారని, వారికి పోస్టింగ్ ఇవ్వడమేమిటంటూ పోస్టింగ్లు వస్తాయి. వెంటనే వారిని వీఆర్కు పిలుస్తున్నారు. ఇలా వెళ్లిన వారికి నెలలు గడిచినా పోస్టింగ్లు ఉండటం లేదు. బూట్లతో డెప్యూటీ సీఎం వద్దకు వెళ్లారని వీఆర్కు.. జనసేన కార్యాలయంలో డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దీక్షలో ఉండగా బూట్లతో లోపలికి వెళ్లారంటూ మంగళగిరి పట్టణ సీఐ ఎం.శ్రీనివాసరావును వీఆర్కు పంపడం కూటమి ప్రభుత్వ విధానాలకు పరాకాష్ట. కొన్ని స్టేషన్లకు సీఐగా వస్తే ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. పట్టాభిపురంలో ఇప్పటికి నలుగురు సీఐలు మారారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ స్టేషన్కు సీఐగా కిరణ్ వచ్చారు. అతను ఎమ్మెల్యే భర్త ఆదేశాల మేరకు వేరే వారిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టడంతో అతనిని వీఆర్కు పంపారు. తర్వాత వీరేంద్రబాబు వచ్చీరాగానే సివిల్ పంచాయితీలలో వేలుపెట్టారు. విపక్ష నాయకులే టార్గెట్గా కేసులు పెట్టి వేధింపులకు దిగారు. అయితే అతన్ని కూడా వీఆర్కు పంపించి మధుసూదన్కు డీవో ఇచ్చారు. విధుల్లో చేరిన 24 గంటల్లోనే పోస్టింగ్ నిలిపేసి గాల్లో పెట్టారు. అరండల్పేట స్టేషన్కూ మొదట కుంకా శ్రీనివాసరావును తీసుకురాగా బోరుగడ్డ అనీల్ కేసులో వీఆర్కు పంపించి వీరాస్వామిని తీసుకువచ్చారు. నగరంపాలెం స్టేషన్కు మొదట మధుసూధనరావును, తర్వాత నాయక్, ప్రస్తుతం నజీర్బేగ్ను తీసుకొచ్చారు. ● తాజాగా రెండు రోజుల క్రితమే అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్పై వేటు పడింది. గ్రంధశిరి గ్రామంలో జరిగిన వివాదంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఒక నిందితుడు తప్పించుకుపోయేలా వ్యవహరించిన అంశంలో వీఆర్కు పిలిచారు. 25 మంది వీఆర్లో.. ప్రస్తుతం రేంజ్లో సుమారు 25 మందికి పైగా సీఐలు వీఆర్లో ఉన్నారు. వీరంతా కూడా కూటమి అధికారంలోకి వచ్చాక వీఆర్కు వెళ్లిన వారే. సీఐల పోస్టింగులలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. మిగిలిన వారిని వీఆర్కు పిలవడం లేకపోతే ప్రాధాన్యం లేని పోస్టింగ్లు కట్టబెట్టడం చేస్తున్నారు. లూప్లైన్ పోస్టింగ్లు ఇచ్చినా చిన్నచిన్న కారణాలతోనే వారిని పక్కన పెట్టారు. -
దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(గుంటూరు) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్ రావు మంగళవారం విడుదల చేశారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31న తుది గడువుగా నిర్ణయించారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ర్యాంక్ పొందిన వారితోపాటు ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు అని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ లు తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డులను వర్సిటీ వైబ్సెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్యూసీడీఈ.ఇన్ఫో నుంచి పొందవచ్చన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వర్సిటీ ఓఎస్డీ ఆచార్య ఆర్వీఎస్ఎస్ రవికుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణవేణి, సూపరింటెండెంట్లు జవ్వాజి శ్రీనివాసరావు, నేలపాటి నాగేశ్వరరావు, వర్సిటీ సిబ్బంది రాధాకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా సుబ్బారెడ్డి నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పట్టణానికి చెందిన వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో ఈనెల 23వ తేదీన అసోసియేషన్ సమావేశంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ 4 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా సేవలు అందిస్తున్న సుబ్బారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావటంపై జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, కోశాధికారి వై.వి.శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. -
హిజ్రా ప్రోద్బలంతోనే హత్య ప్రియుడే హంతకుడు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ కొలనుకొండ డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన హిజ్రా బత్తుల శశి అలియాస్ జెస్సీ ఏడాది క్రితం లక్ష్మీతిరుపతమ్మ(32)ను వ్యభిచార వృత్తిలోకి దించింది. కొలనుకొండ వద్ద ఆమెతో వ్యభిచారం చేయిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ముత్యాల కోమల్ కుమార్ (చింటూ) తిరుపతమ్మకు పరిచయమయ్యాడు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకే గదిలో కొంతకాలం సహజీవనం చేశారు. ఈ క్రమంలో జెస్సీ (హిజ్రా) భర్త నవీన్తోనూ లక్ష్మీతిరుపతమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు చింటూను దూరంగా ఉంచుతోంది. దీనిని మనస్సులో పెట్టుకున్న జెస్సీ లక్ష్మీతిరుపతమ్మపై కోపంతో రగిలిపోయింది. చింటూను ఉసిగొల్పి తిరుపతమ్మను హత్య చేయించింది. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపర్చినట్లు డీఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు, సిబ్బంది కేసును ఛేదించినట్టు వివరించారు. ఇదిలా ఉండగా జనవరి 31న జరిగిన మహిళ హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించకపోవడం విశేషం. లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసు ఛేదించినట్టు పోలీసుల ప్రకటన హిజ్రా భర్తతో తిరుపతమ్మ వివాహేతర సంబంధం ప్రియుడినీ దూరం పెట్టిన హతురాలు పథకం ప్రకారమే హత్య గుట్టుచప్పుడు కాకుండా నిందితుల అరెస్ట్ -
గుంటూరు
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025వైభవంగా ఆలయ వార్షికోత్సవం బాపట్ల: బాపట్ల పట్టణం పాతబస్టాండ్లోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. శాంతి కల్యాణ మహోత్సవం చేపట్టారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమరావతిలో జపాన్ బృందం అమరావతి: ప్రముఖ పర్యాటక కేంద్రం అమరావతిని మంగళవారం జపాన్ ప్రతినిధుల బృందం సందర్శించింది. వారివెంట ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఉన్నారు.వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం దుగ్గిరాల: శ్రవణానక్షత్రం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం దుగ్గిరాల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం ఘనంగా జరిగింది. I -
పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలోని ఇళ్లు లేని అందరికీ ఇళ్ళస్థల పట్టాలు అందజేయడంతో పాటు ఎన్నో ఏళ్లుగా కొండ పోరంబోకు, అటవీ, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలకు అదే స్థలాల్లో పట్టాలివ్వాలని, లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 23వేల మంది పేదలు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తుంటే మంత్రి నారా లోకేష్ ఐదు వేల మందికి పట్టాలిస్తామనడం సరికాదన్నారు. 23 వేల మంది స్థలాల పట్టాలివ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలన్నారు. మంగళగిరి పట్టణంలోని 134 సర్వేలోని ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వాలని కోరారు .నగరంలోని అనేక కాలనీలలో డ్రెయినేజీ, తాగునీటి సమస్య ఉందని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇచ్చిందని, అలాగే టీడీపీ ప్రభుత్వం కార్మికులకు పథకం వర్తింపజేసి ఏడాదికి రూ రూ.24 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వీసం జవహర్లాల్, జేవి రాఘవులు, పిల్లలమర్రి బాలకృష్ణ, ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కార్యదర్శి పాశం రామారావు -
సీఐపై చర్యలు తీసుకోవాలి
ఫిరంగిపురం: స్థానిక శాంతిపేటలో ఓ స్థలం వివాదం నేపథ్యంలో దళితులపై దురుసుగా ప్రవర్తించిన సీఐ రవీంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాత్రి కాలనీ వాసులు రాస్తారోకో చేశారు. ఫలితంగా గుంటూరు –కర్నూలు రాష్ట్రరహదారిపై ఇరువైపుల రెండకిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న గుంటూరు డీఎస్పీ భానోదయ కాలనీ వాసులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. స్థానిక పోలీసు స్టేషన్కు మంగళవారం ఉదయం శాంతిపేట కాలనీ వాసులను డీఎస్పీ మురళీకృష్ణ పిలిపించి వారితో మాట్లాడారు. సీఐపై ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేస్తానని చెప్పడంతో వారు జరిగిన విషయాలు తెలియజేస్తూ ఫిర్యాదు అదించారు. దీనిపై గుంటూరు ఎస్పీ సతీష్కుమార్ దృష్టికి తీసుకువెలతానని సీఐపై కేసు కడతానని డీఎస్పీ మురళీకృష్ణ హామీ ఇచ్చారు. తహసీల్దార్కు వినతి శాంతిపేటలో స్థలాన్ని కాలనీకి చెందిన జి.చిన్న అనే వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణం చేపడుతున్నాడని ఆ భూమి 608 ఏ–1 గ్రామకంఠానికి చెందిన భూమి అని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ జె.ప్రసాదరావుకు, స్థానిక పంచాయతీ ఈవో ఏకేబాబుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ ఆ భూమి పంచాయతీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అనంతరం కాలనీవాసులు గుంటూరులోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెల్లి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. శాంతిపేట వాసుల రాస్తారోకో స్థలం వివాదం పరిష్కరించాలని డిమాండ్ -
అమరావతిలో మంత్రి నారాయణ పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం పర్యటించారు. రాయపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాలను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకొని సూచనలు చేశారు. ఈ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.43 వేల కోట్లతో గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయన్నారు. మొదట రాజధానిలో క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఇప్పుడు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు పరిశీలించినట్టు పేర్కొన్నారు. 186 బంగ్లాలు, మంత్రులు, జడ్జిలు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయన్నారు. గెజిటెడ్ అధికారులకు 1440, ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయని, హైకోర్టు 16.85 లక్షల చదరపు అడుగులు వస్తుందని, అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో అందుబాటులోకి రానుందన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నామని, ల్యాండ్ వాల్యూ పెరిగిన తరువాత అప్పు తీరుస్తామని వెల్లడించారు. -
గుంటూరు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధురాలు (55) మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ గుంటూరు ప్లాట్ఫాం –1 వద్దకు చేరుకునే సరికి రైలులో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెంది ఉంది. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతురాలి వివరాలను సేకరించగా ఎలాంటి వివరాలు లేక పోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు జీఆర్పీ సీఐ అంజిబాబు 9440627546, ఎస్ఐ దీపికా 9121715242, జీఆర్పి పోలీస్ స్టేషన్ 0863–2220753 నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా తెలిపారు. -
విశ్రాంత పోస్టల్ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలే శరణ్యం
తెనాలి: స్థానిక కొత్తపేటలోని కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీలోని డీఎల్ కాంతారావు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆలిండియా పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ 2వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్సీసీపీఏ సెక్రటరీ జనరల్ కె.రాఘవేంద్రన్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాన్ని పటిష్టం చేసి, ఐక్యంగా పోరాడాలని సూచించారు. వైద్యసదుపాయాల అంశంలో ఉన్న సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పు కాపీలను రాష్ట్ర నలుమూలల్నుంచి వచ్చిన కార్యకవర్గసభ్యులు రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ నాగేశ్వరరావుకు అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని గౌరవాధ్యక్షుడు డీఎల్ కాంతారావు హామీనిచ్చారు. ఎఫ్ఎన్పీఓ సెక్రటరీ జనరల్ శివాజీ మాట్లాడుతూ సర్వీసు ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని చెప్పారు. ఏఐపీఈయూ పోస్ట్మెన్, గ్రూప్–డి సర్కిల్ కార్యదర్శి సీహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, వ్యతిరేక విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. పెన్షనర్లు, ఉద్యోగులు ఐక్యపోరాటాలను జరపాల్సిన ఆవశ్యకతను వివరించారు. సభలో ఆయా సంఘాల నేతలు ఎన్.రామారావు, కేఎస్సీ బోసు, న్యాయవాధి బి.జయభారతరెడ్డి, అతిథులు డి.మోహనరావు, కె.రాజారావు, పి.బాబూజీ, సీహెచ్ కోటేశ్వరరావు, వివిధ డివిజన్ల కార్యదర్శులు ప్రసంగించారు. తొలుత ఏఐపీఆర్పీఏ జెండాను డీఎల్ కాంతారావు, ఎన్సీసీపీఏ జెండాలను కె.రాఘవేంద్రన్ ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ 2వ సర్వసభ్య సమావేశంలో ఎన్సీసీపీఏ సెక్రటరీ జనరల్ కె.రాఘవేంద్రన్ -
ఉప ఎన్నికలపై అధికారులతో జెడ్పీ సీఈఓ సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తొమ్మిది మండల ప్రజా పరిషత్లకు సంబంధించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యలో ఉప ఎన్నికల నిర్వహణపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. జెడ్పీలోని తన చాంబర్లో జరిగిన సమావేశంలో జ్యోతిబసు మాట్లాడుతూ ఈనెల 27న మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసి, అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే విధానంపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సన్నాహక ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులతో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శిక్షణ నిర్వహించారు. పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు, దుగ్గిరాల, గుంటూరు రూరల్, తెనాలి, అచ్చంపేట, కారంపూడి, నరసరావుపేట, ముప్పాళ్ల ఎంపీడీవోలతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధిత జిల్లా కలెక్టర్లచే నియమించిన ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. బాపట్ల మండలం పిట్టలవానిపాలెం మండల అధ్యక్ష ఎన్నికకు బాపట్ల డీఎల్డీవో విజయలక్ష్మి, భట్టిప్రోలు కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు బాపట్ల డీఏహెచ్వో వేణుగోపాలరావు, దుగ్గిరాల మండల అధ్యక్ష ఎన్నికకు గుంటూరు డ్వామా పీడీ శంకర్, గుంటూరు రూరల్ ఉపాధ్యక్ష ఎన్నికకు ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, తెనాలి కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు హ్యాండ్లూమ్స్ ఏడీ ఉదయ కుమార్, అచ్చంపేట మండల అధ్యక్ష ఎన్నికకు క్రోసూరు వ్యవసాయశాఖ ఏడీ హనుమంతరావు, కారంపూడి ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డ్వామా పీడీ లింగమూర్తి, నరసరావుపేట ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డీఏఓ ఐ.మురళి, ముప్పాళ్ల కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు పల్నాడు డీఏహెచ్వో కె.కాంతారావు ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులయ్యారు. గురజాల డీఎల్డీవో గభ్రూ నాయక్, పెదకాకాని ఈవోపీఆర్డీ కె.శ్రీనివాసరావు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. -
ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన వాయిదా
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్చి 27 నుంచి 29వ తేదీవరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శనను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని తెలిపారు. గణనీయంగా పెరిగిన మల్లేశ్వరుడి ఆదాయం 109 రోజుల హుండీ కానుకల ఆదాయం రూ.58.03లక్షలు పెదకాకాని: శివాలయం మల్లేశ్వరస్వామి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మంగళవారం హుండీల్లోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా కాజ గ్రూపు టెంపుల్స్ ఈఓ పుణ్యాల వెంకటరెడ్డి హాజరయ్యారు. 109 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ.58,03,497లు ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.2,89,270లు సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం 54.300 గ్రాములు, వెండి 438 గ్రాములు, ఆస్ట్రేలియా 20 డాలర్లు, యుఎస్ఏ 139 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పాండ్లు, నేపాల్ కరెన్సీ రూ.130 , ఇండోనేషియా రూ.5000 వచ్చాయని డీసీ తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్ శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలుగ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గురు వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు మాచవరం: మాచవరం మండలంలో ముగ్గురు వీఆర్ఓలకు ఆర్డీఓ మురళీ కృష్ణ షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగమల్లేశ్వరరావు మంగళవారం తెలిపారు. మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం వీఆర్ఓలు ఏసుపాదం, లోకేష్, జానీబాషాలు ఐవీఆర్ కాల్స్లో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని మూడు గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ముగ్గురు వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. -
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం.. మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాతే హడావుడిగా రూ.11,781 లకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ నేటి వరకు ఒక్క కిలో మిర్చి కూడా కొనలేదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు?. వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది?. మిర్చి రైతులతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులంతా ఆవేదన చెందుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.‘‘రైతులను కాదని వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్నారు. దానివలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
ఆ విషయంపై టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరు?: గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. రాష్టవ్యాప్తంగా అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నారని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని నిలదీశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘21 మంది కూటమి ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయటం లేదు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులనూ తీసుకురాలేకపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు వెళ్తున్నా కూటమి ఎంపీలు మాట్లాడటం లేదు. కేవలం వైఎస్సార్సీపీ ఎంపీలపై ఆరోపణలు చేయటానికే వారు పరిమితం అయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. లేని లిక్కర్ స్కాం గురించి మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ స్కాం గురించి ఐటీ, ఈడీ సమన్లు కూడా ఇచ్చింది. వీటిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని గురుమూర్తి ప్రశ్నించారు.‘‘యోగేష్ గుప్త, మనోజ్ పాత్ర ఉన్నట్టు కేంద్ర సంస్థలు గుర్తించాయి. టిడ్కోలో కూడా భారీగా ముడుపులు తీసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. వీటిపై శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకు ప్రశ్నించటం లేదు?. కేంద్రం చంద్రబాబుని పట్టించుకోవడం లేదు. ఏదో కేసుల్లో ఇరికించటానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్సైజ్ శాఖతో సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్కసిరెడ్డి, మిథున్రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు’’ అని గురుమూర్తి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ వచ్చాక 43 వేల బెల్టు షాపులు తొలగించారు. మద్యం అమ్మే సమయాన్ని కుదిరించారు. అలాంటప్పుడు లంచాలు ఎవరైనా ఎలా ఇస్తారు?. అయినప్పటికీ కొంతమంది పత్రికాధిపతులను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్క డిస్టలరీలకూ పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం బ్రాండులకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. మార్కెట్లో ఉన్న బ్రాండులన్నిటికీ చంద్రబాబే అనుమతులు ఇచ్చారు. కానీ టీడీపీ నేతలు మాపై విష ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు’’ అని గురుమూర్తి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ అంటేనే లీకేజీలు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకేజీల ప్రభుత్వమంటూ రవిచంద్ర దుయ్యబట్టారు.కడప జిల్లాలో టెన్త్ పేపర్ వాట్సాప్లో ఎలా వచ్చింది? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా వెళ్తున్నాయి?. నారా లోకేష్ అసమర్థ మంత్రిగా నిలిచిపోయారు. బీఈడీ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అధికారులను సమర్థవంతంగా ఎందుకు వినియోగించలేకపోతున్నారు?. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రామబ్రహ్మం 1997లో ఇంటర్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత నారాయణ సంస్థల్లోనూ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నారాయణ సంస్థలకే ర్యాంకులు రావాలని పేపర్లు లీక్ చేశారు. అప్పట్లో నారాయణ సంస్థల వైఎస్ ప్రిన్సిపాల్ని కూడా అరెస్టు చేశారు’’ అని రవిచంద్ర గుర్తు చేశారు.‘2024లో చంద్రబాబు రాగానే మళ్లీ పేపర్లు లీకవుతున్నాయి. 6 లక్షల 19 వేల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ పేపర్ల లీకేజ్ అనేదే లేదు. నారాయణ సంస్థల ఉద్యోగిని ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యునిగా పెట్టారు. తద్వారా ఇంటర్మీడియట్ బోర్డును తమ చేతుల్లోకి మంత్రి నారాయణ తీసుకున్నారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రెచ్చిపోయిన సీఐ.. తిరగబడ్డ జనం
గుంటూరు: శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన సీఐ రెచ్చిపోవడంతో ఓ మామూలు వివాదం శాంతిభద్రతలకే విఘాతం కలిగించే పరిస్థితికి దారితీసింది. ఫిర్యాదు చేసిన దళితులపైనే విచక్షణ మరిచి తన ప్రతాపం చూపడంతో.. ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఓ యువకుడిని సీఐ తుపాకీతో కొట్టడంతో న్యాయం చేయాల్సిన తమపైనే దాడిచేయడం ఏమిటని ప్రజలు ముట్టడించడంతో సదరు సీఐ అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయ స్థలం ఉంది.ఈ స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ స్థలంలో సోమవారం షెడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ మురళీ, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడికి ఫిరంగిపురం సీఐ బి.రవీంద్రబాబు హోంగార్డుతో అక్కడికి చేరుకున్నారు. వచ్చీ రావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయడమేమిటని అక్కడి యువకులు ప్రశ్నించడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు.తన గన్ బయటకుతీసి అఖిల్ అనే యువకుడిని కొట్టడంతో అతనూ గాయపడ్డాడు. దీంతో స్థానికులు సీఐ రవీంద్రబాబును ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. అనంతరం.. దళితులు సీఐ డౌన్ డౌన్ అంటూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు డీఎస్పీ భానూదయ మేడికొండూరు, నల్లపాడు సీఐలు నాగూల్ మీరా, వంశీధర్తో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సీఐపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో వారికి సర్దిచెప్పి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
వైద్యసేవ ఉద్యోగులు విధుల బహిష్కరణ
గుంటూరు మెడికల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం గుంటూరులో ఎన్టీఆర్ వైద్య సేవ క్షేత్రస్థాయి ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వ శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయిప్ యూనియన్ తరపున ఈ నిరసన చేపట్టారు. యూనియన్ నాయకులు ఏపీ జేఏసీ అధ్యక్షురాలు శివకుమారి, కార్యదర్శి ప్రత్యూష, జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. నేడు గుంటూరులో న్యాయవాదులు విధుల బహిష్కరణ గుంటూరు లీగల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇ.ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. క్షయ వ్యాధిపై ఫార్మసీ విద్యార్థుల ప్రచారం తెనాలి: అంతర్జాతీయ క్షయ వ్యాధి దినం సందర్భంగా స్థానిక ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజి ఐపీఏ–ఎస్ఎఫ్, ఎన్ఎస్ఎస్ విభాగాల విద్యార్థులు సోమవారం ప్రచారం నిర్వహించారు. క్షయ వ్యాధిపై అవగాహన ప్రదర్శన చేశారు. క్షయ లక్షణాలు, నివారణ, సమయోచిత చికిత్స వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వ్యాధిపై అవగాహన కల్పించారు. అవసరమైన జాగ్రత్తతలను వివరించారు. ఏపీటీఐ–ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్. కె.వెంకటరమణ, ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, ఐపీఏ–ఎస్ఎఫ్ మెంటర్స్ జి.నందగోపాలకృష్ణ, పి.భార్గవి, ఎన్ఎస్ఎస్–1,2 విభాగాల ప్రోగ్రాం అధికారులు టి.జ్యోతిబసు, కె.కళ్యాణ చక్రవర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రుక్మిణీ అలంకారంలో నృసింహుడు మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీ నృసింహస్వామి సోమవారం రాత్రి రుక్మిణీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. మంగళవారం స్వామి స్థంభోద్భవం అలంకారంలో దర్శనమివ్వనున్నారు. -
అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి
కలెక్టర్ నాగలక్ష్మిగుంటూరు వెస్ట్: కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అర్జీదారులు పదే పదే వస్తున్నారని, ఈ విధానం మారాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ చిన్న చిన్న అంశాలను కొందరు సిబ్బంది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలు చాలా కీలకమన్నారు. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కరించాలన్నారు. అనంతరం వచ్చిన 231 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
హద్దులు దాటుతున్న ఇసుక
కొల్లూరు: కూటమి నేతలు ఇసుకను అక్రమ మార్గంలో హద్దులు దాటిస్తున్నారు. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంట సాల మండలం శ్రీకాకుళం ప్రాంతంలో ఉచిత ఇసుక క్వారీ ఉంది. ఇసుకను భారీ లారీలలో నింపి దొడ్డిదారిలో బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల కు అక్రమంగా తరలిస్తున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక, కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామాల నడుమ వ్యవసాయ కార్యకలాపా లు, ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గాలు మార్గం వారి అక్రమాలకు రాచమార్గంగా మారింది. రోజుకు 100 ఇసుక లారీలు అక్రమంగా తరలివెళుతున్నాయి. బిల్లులు నిల్ నిబంధనల మేరకు రీచ్ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇతర జిల్లాల్లోకి బిల్లులతో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఉచిత ఇసుక క్వారీలను దక్కించుకున్న కూటమి నాయకులు బిల్లులు లేకుండానే బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లా లకు ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం కృష్ణా జిల్లా నుంచి నదిలోని గాలు మార్గం ద్వారా బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా జిల్లాలోకి వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా అధిక సంఖ్యలో వాహనాలు గాజుల్లంక, పెసర్లంక, కొల్లూరు, పోతార్లంక, దోనేపూడి, కిష్కిందపాలెం, తోకలవారిపాలెం మీదుగా తరలివెళుతున్నా యి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు మాత్రం స్పందించడంలేదు. పెసర్లంక–కొల్లూరు రహదారి పనులు జరుగుతున్న తరుణంలో ఇసుక లారీల నుంచి కారుతున్న నీరు కారణంగా రోడ్డు మన్నిక ప్రశ్నార్ధకంగా మారుతుంది. కూలీల కడుపుకొడుతున్నారు ఉచిత ఇసుక క్వారీలలో తవ్వకాలకు కూలీలను మాత్రమే వినియోగించాలన్న నిబంధనకు తూ ట్లు పొడుస్తున్నారు. కాంట్రాక్టర్లు యంత్రాలను వినియోగిస్తున్నారు. నదిలో ట్రాక్టర్లు దిగి కూలీల తో ఇసుక నింపకుండా గుంతలు తీసి అడ్డుకుంటు న్న అధికారులు పక్క జిల్లా నుంచి అక్రమ మార్గంలో ఇసుకరవాణా జరుగుతున్నా పట్టించుకోలేదు. కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక క్వారీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు తరలింపు గాలు రోడ్డే అక్రమాలకు మార్గం పట్టించుకోని అధికారులు పరిశీలించి చర్యలు నదిలో అక్రమ మార్గం ద్వారా జిల్లాలోకి ఇసుక రవాణాను అరికట్టే విషయంలో రూల్స్ను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. మైనింగ్ శాఖాధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి కృష్ణా నదిలో జిల్లా దాటి బిల్లులు లేకుండా వాహనాలు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలిస్తాం. – బి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు. -
సాయుధ దళాలకు ఆర్థిక చేయూత అభినందనీయం
గుంటూరు వెస్ట్ : దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్న సాయుధ దళాలకు ఆర్థిక చేయూతనందించడం అభినందనీయమని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2024కు సంబంధించి గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక బృందాల నుంచి సేకరించిన రూ.2,05,197 చెక్కును మెప్మా పీడీ విజయలక్ష్మి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చేతుల మీదుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్.గుణ షీలాకు అందజేశారు. ఈ సందర్బంగా మెప్మా విభాగ కృషిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి పాల్గొన్నారు.కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
నేడు కౌన్సిల్ అత్యవసర సమావేశం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం తాత్కాలిక మేయర్ షేక్ సజిల అధ్యక్షతన జరగనుంది. ఇటీవల నగర మేయర్గా కావటి శివనాగమనోహర్నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమోద తీర్మానం చేసేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు విజయపురిసౌత్: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో మాచర్ల మండలం అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి 10 లక్షల చేప పిల్లలను సోమవారం విడుదల చేశారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వారంలో సైతం 10 లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలి వలలతో చేపల వేట చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మత్స్య సంపదను కాపాడుకోవాలని సూచించారు. ఎఫ్డీఓ టీవీఏ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఏఓ జగదీష్, మత్స్యశాఖ తనిఖీ అధికారి వెంకట రమణ, గ్రామ మత్స్య సహాయకులు లీలావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. యార్డుకు 1,18,783 బస్తాలు మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,18,783 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,05,617 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,200 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,200 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,366 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025దర్యాప్తుకు నాలుగు ప్రత్యేక బృందాలు ● అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు ● మృతురాలి మాజీ ప్రియుడిపైనా అనుమానం ఇఫ్తార్ సహర్ (మంగళ) (బుధ) గుంటూరు 6.25 4.52 బాపట్ల 6.25 4.52 నరసరావుపేట 6.27 4.54 తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం జరిగిన మహిళ హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్కుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీష్కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు విజయవాడలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతురాలు పామర్రు వాసి మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మి తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని తల్లికి చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్జెండర్ నజీరతోనూ పరిచయమైంది. వీరిద్వారా తిరుమపత్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది. ● 45 రోజుల వ్యవధిలో ఇద్దరి మహిళల హతం ● హడావుడిగా హతుల మృతదేహాల తరలింపు●● ఆధారాల సేకరణలో ఖాకీల విఫలం ● అసహనం వ్యక్తం చేసిన ఎస్పీ సతీష్కుమార్ ● డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఘటనలు ● రాజధాని ప్రాంతంలో కొట్టొచ్చినట్టు కనిపించిన భద్రతా వైఫల్యం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలూ సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీ తిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9.30 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్స్క్వాడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్థలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. గంజాయికి అడ్డా! కూటమి సర్కారు వచ్చాక తాడేపల్లి ప్రాంతం గంజాయికి అడ్డాగా మారింది. గంజాయి తాగి యువకులు హల్చల్ చేస్తున్నారు. మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల నులకపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఎస్పీ సతీష్కుమార్కు మహిళలు వివరించారు. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మి తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదల్లో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సీ, నజీర లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి లక్ష్మీతిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల్ని పోషించుకోవడం కోసం వంట పనికి వస్తుందని భావించామే కానీ ఇలాంటి పనులు చేస్తోందని ఊహించలేదని, ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని గుండెలవిసేలా విలపించారు. పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఘటనా స్థలం వద్దకు చేరుకుని పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ సతీష్కుమార్తాడేపల్లి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మహిళ హత్య కేసులో పూర్తి ఆధారాలు సేకరించకుండా మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తరలించడంపై జిల్లా ఉన్నతాధికారీ అసహనం వ్యక్తం చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. గత 45 రోజుల్లో ఈ ప్రాంతంలో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడం, డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నిత్యం వీవీఐపీలు తిరిగే ప్రాంతంలో ఘటనలు జరగడం, రెండు కేసుల్లోనూ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారడం కూటమి సర్కారు, హోంశాఖ పనితీరును, భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. 7న్యూస్రీల్మూడు నెలలుగా వీడియోలు, రీల్స్ హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీతిరుపతమ్మ, మరికొందరు రీల్స్, సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. డీజీపీ కార్యా లయం సమీపంలో నిత్యం వీవీఐపీలు తిరిగే రహదారిలో భద్రతా వైఫల్యానికి ఇది నిదర్శనంగా ఉంది. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. -
పుత్రశోకంతో తల్లడిల్లుతున్నాం
మద్యం దుకాణం తొలగించండి నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పుత్రశోకంతో తల్లడిల్లుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఇద్దరు బాధితులు ఎస్పీ సతీష్కుమార్ ఎదుట తమ గోడు వినిపించారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార కార్యక్రమం (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల అర్జీలను ఎస్పీ సతీష్కుమార్ పరిశీలించారు. ఫిర్యాదుదారుల బాధను ఆలకించారు. అర్జీలపై సబ్ డివిజన్లలోని పోలీసు అధికారులతో మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష, జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు. కొడుకు ఆచూకీ గుర్తించండి పెద్దబ్బాయి ఓంసాయిరెడ్డి గుంటూరు కృష్ణనగర్ నాలుగో వీధిలోని నారాయణ విద్యా సంస్థలో 10వ తరగతి చదివేవాడు. తొంభై శాతం సీటు రాయితీతో చేర్చాం. ఫీజు రాయితీ తొంభై శాతం నుంచి 80శాతానికి కుదించామని డబ్బులు చెల్లించాలని బయట నిలబెట్టారు. ఈ క్రమంలో నా సోదరుడు వెళ్లి ఫీజు చెల్లిస్తామని చెబితే లోనికి అనుమతించారు. గతనెల 8, 9 తేదీల్లో స్కూల్ నుంచి కుమారుడు ఫోన్ చేసి మాట్లాడాడు. బాగా చదువుతానని బదులిచ్చాడు. అదేనెల 13న విద్యా సంస్థల నుంచి ఫోన్ చేసి, ఓంసాయిరెడ్డి కనిపించడంలేదని తెలిపారు. సాయంత్రం వెళ్లి స్కూల్లో విచారించాం. అప్పటి నుంచి కుమారుని జాడలేదు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. కుమారుడు కనిపించక ఇప్పటికి నలభై రోజులకుపైగా గడిచింది. నా కొడుకుకు వ్యసనాల్లేవు. – తండ్రి వెండిదండి శివశంకర్రెడ్డి, పోస్ట్మాస్టర్, ముప్పలపాడు గ్రామం, హనుమంతునిపాడు మండలం, ప్రకాశం జిల్లా కుమారుడు మృతిచెందాడు.. ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి చిన్న కుమారుడైన వై.హరికృష్ణ (41) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్తంభాలగరువు సెంటర్ ఓ కంటి ఆసుపత్రి సమీపాన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ హరికృష్ణను కాలితో కొట్టి, చేతులతో నెట్టేశారు. దీంతో కొడుకు కిందపడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. గాయపడిన అతను చికిత్స పొందుతూ ఈనెల 18న మృతిచెందాడు. దీనిపై పట్టాభిపురం పీఎస్లో కేసు నమోదు చేశారు. పది రోజులుగా పోలీసులు చుట్టూ తిరుగుతున్నా.. ఇప్పటి వరకు అనుమానితులను గుర్తించలేదు. ఇప్పటికై నా నిందితులను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నాం. – వై.రత్నకుమారి, రాజేంద్రనగర్ ఒకటో వీధి. న్యాయం చేయండి ఎస్పీకి విన్నవించుకున్న బాధితులు కొడుకు జాడ కనుక్కోవాలని ఒకరి విన్నపం కుమారుడిని హతమార్చిన వారిని గుర్తించాలని మరొకరి వేడుకోలు -
కొత్త కవులను ప్రోత్సహిద్దాం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బ్రాడిపేటలోని కథా రచయిత్రి తాటికోల పద్మావతి నివాసంలో గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కవులందరూ కలిసి ‘కవిత్వంతో కాసేపు’ నిర్వహించారు. ఈనెల 21 న అంతర్జాతీయ కవితా దినోత్సవం, 30న ఉగాది పండుగ సందర్భంగా కవిత్వంపై చర్చించారు. ఔత్సాహిక కవులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సంఘం పని చేద్దామని సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.సుభాని తెలిపారు. కవులు తాము రాసిన కవితతోపాటు సమకాలీన కవులు రాసిన, తమకు నచ్చిన మరో కవిత వినిపించి జయప్రదం చేశారని కోశాధికారి నానా చెప్పారు. రచయిత్రి తాటికోల పద్మావతి ఆతిథ్యం, ఆప్యాయతలను కవులు కొనియాడారు. సంఘం ఉపాధ్యక్షులు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, సభ్యులు ఈవూరి వెంకట రెడ్డి, కొణతం నాగేశ్వరరావు, శ్రీవశిష్ట సోమేపల్లి పాల్గొన్నారు. -
27న గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం సోమవారం జరిగింది. అభ్యర్థులు తమ మేనిఫెస్టోను న్యాయవాదుల ముందు ఉంచారు. అధ్యక్ష పదవికి యగలశెట్టి శివ సూర్యనారాయణ, కాజా భరద్వాజ, నంబూరు పాములు, మధిర నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. వీరు బార్ అసోసియేషన్ను ప్రగతి పథంలో నడిపిస్తామని ఎలక్షన్ ఆఫీసర్ కాసు వెంకటరెడ్డి, న్యాయవాదుల సమక్షంలో ప్రమాణాలు చేశారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి మాలే దేవరాజు, డాక్టర్ చింతా రామ కోటిరెడ్డి, జనరల్ సెక్రెటరీ పదవికి ఎరస్రాని అజయ్ కుమార్, మొగల్ కాలేషా బేక్, మోతుకూరి శ్రీనివాసరావు. జాయింట్ సెక్రటరీ పదవికి పొమ్మినేని చంద్రశేఖర్, ఇల్లూరి విజయ్ వర్మ, గూడూరి అశోక్ కుమార్, జీవీఎస్ఆర్కేఎస్ చంద్రన్, లైబ్రరీ కార్యదర్శి పదవికి మువ్వా పాపిరెడ్డి, బొప్పా శ్రీనివాసరావు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కొప్పాల హనుమంతరావు, గండికోట శేషగిరిరావు పోటీలో ఉన్నారు. లేడీ రిప్రజెంటివ్ పదవికి అడపా ఇందిరా, పూర్ణం కళ్యాణి, లేడీ ఎగ్జిక్యూటివ్ పదవికి కండెపు కవిత, మంద విజయ్ కుమారి పోటీలో ఉన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ పదవికి మోర్ల బాల సుందరి, మహమ్మద్ దాదా ఖరీం, బండ్లకృష్ణ, పల్లె నరసింహారావు, పి.సురేష్ కుమార్ పోటీలో ఉన్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పదవికి లింగాల మారుతి, శివ నాగ ప్రసాద్, షేక్ రిహాన్ బేగం, పెరుమాళ్ళ శివ రంగనాయకులు, రాయపూడి శ్రీనివాసరావు (గుండు శీను) పోటీలో ఉన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్లో సుమారు 3వేల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 2012 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
నాడు డ్రాపవుట్.. నేడు పట్ట‘భద్రత’పై పట్టు
● యూజీసీ కమిటీకి తెనాలి బిడ్డ సారథ్యం ● జాతీయ భద్రత అధ్యయాలపై సరికొత్త కోర్సు రూపకల్పనకు కృషి ● డాక్టర్ రమేష్ కన్నెగంటి విజయప్రస్థానం తెనాలి: చదువుల్లో ఒకనాటి డ్రాపవుట్ కుర్రోడు...ఇప్పుడు ఏకంగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలోని కమిటీకి సారథి అయ్యారు. అదికూడా జాతీయ భద్రత అధ్యయనాలకు సంబంధించిన సరికొత్త ‘మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు’ రూపకల్పన కోసం. ప్రసిద్ధ యూనివర్శిటీల ప్రొఫెసర్లు, వైస్ఛాన్సలర్ సభ్యులుగా గల కమిటీకి ఆయన నాయకత్వం వహిస్తుండటం మరింత విశేషం. చదువు విలువ తెలుసుకుని.. తెనాలి బిడ్డ డాక్టర్ రమేష్ కన్నెగంటి. పుల్లరి ఉద్యమ యోధుడు కన్నెగంటి హనుమంతు మునిమనవడు. ఇంటర్ ఫెయిలయ్యారు. చదువు మానేశారు. తర్వాత విద్య విలువ తెలుసుకుని మళ్లీ పుస్తకం పట్టారు. బీఏ వరకు ఇక్కడే చదివారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్లో పీజీ అనంతరం, న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లో ‘యూఎస్–ఆస్ట్రేలియా సెక్యూరిటీ రిలేషన్స్’పై ఎంఫిల్ చేశారు. 2000–01లో ‘మిస్టర్ జేఎన్యూ’ టైటిల్ను ‘ద్రోణాచార్య’ గురుచరణ్సింగ్ చేతులు మీదుగా అందుకున్నారు. 2002–03లో ఇజ్రాయెల్లోని హిబ్రూ యూనివర్శిటీలో ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’ చదివారు. జేఎన్యూలో 2006లో ‘యూఎస్–ఇజ్రాయెల్ సెక్యూరిటీ రిలేషన్స్ ఇన్ ది పోస్ట్ కోల్డ్వార్ ఎరా’పై పీహెచ్డీ చేశారు. తర్వాత ఇజ్రాయెల్లోని బార్–ఇలాన్ యూనివర్శిటీలో ‘యూఎస్–ఇజ్రాయెల్–ఇండియా స్ట్రాటెజిక్ రిలేషన్స్’ (టె ర్రరిజాన్ని ఓడించటానికి మూడు దేశాల త్రిముఖ వ్యూహం’పై పోస్ట్డాక్టోరల్ ఫెలోషిప్ చేశారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతపై దృష్టి దేశంలో జరిగిన ఉగ్రవాద బాంబు పేలుళ్ల నేపథ్యంలో డాక్టర్ రమేష్ దృష్టి మానవ భద్రతపైకి మళ్లింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదం, వ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనాన్ని టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవటంపై అధ్యయనం, పరిశోధన కొనసాగించారు. ఆ క్రమంలోనే 2013లో హైదరాబాద్లో మానవ రక్షణ అధ్యయన సంస్థ (సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్)ను కొందరు స్నేహితులు, సంస్థల సహకారంతో ఆరంభించారు. పన్నెండేళ్లలోనే ఆ సంస్థ దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలపై ‘థింక్ ట్యాంక్’గా పలు విజయాలను సాధించింది. ఐఐటీ, నల్సర్ లా యూనివర్శిటీతో సహా పలు యూనివర్శిటీలు, ఆంధ్ర, తెలంగాణ పోలీసులతో సంస్థ ఎంఓయూలను కుదుర్చుకుంది. సంస్థ 12వ వార్షికోత్సవం ఈనెల 22న జరుపుకున్నారు. స్మార్ట్ పోలీసింగ్కు శ్రీకారం టెక్నాలజీ సాయంతో మానవభద్రత అంశంపై పలు ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న రమేష్, కృత్రిమ మేధతో స్మార్ట్ పోలీసింగ్, ఓడరేవుల రక్షణపై సరికొత్త ప్రోగ్రామ్లను రూపొందించారు. ఫలితంగా అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఆయనకు ఆహ్వానం లభించింది. యూనివర్శిటీ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ (హెచ్ఏఐ) ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో జరిగిన ‘మానవ–కేంద్రీకృత కృత్రిమ మేధస్సు’ శిక్షణకు డాక్టర్ రమేష్ హాజరయ్యారు. చైనా ప్రాబల్యం నుంచి హిందూ, పసిఫిక్ మహాసముద్రాల జలాలను కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీతో ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై వివిధ దేశాల సీనియర్ మిలటరీ అధికారుల చర్చలకూ రమేష్ సంస్థ వేదికై ంది. తాజాగా యూజీసీకి.. యూజీసీ సారథిగా తాజాగా రమేష్ ఎంపికయ్యారు. జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం సిలబస్, కోర్సు కంటెంట్ను ఖరారు చేస్తారు. క్రెడిట్ల సంఖ్య, కోర్సు కోసం మొత్తం మాడ్యూళ్ల సంఖ్య, పరిశ్రమల లింకేజ్లు ‘స్వయం’ ప్లాట్పామ్పై కోర్సును సకాలంలో అభివృద్ధి చేసి, అందించటం యూజీసీ బాధ్యత. జాతీయ భద్రతపై ఓ కోర్సు ఉంటుందని డాక్టర్ రమేష్ ‘సాక్షి’కి వెల్లడించారు. భద్రతా అంశాన్ని పాఠశాల విద్య నుంచే భాగం చేయాలని పేర్కొన్నారు. -
కేవీకేలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సోమవారం నగర శివారుల్లోని లాంఫాంలోని కేవీకేలో ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ ఎం.యుగంధర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పశు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జేవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనశాలల్లో రూపుదిద్దుకుంటున్న సాంకేతికతను రైతులకు చేరవేయటంలో కృషివిజ్ఞాన కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. వివిధ రంగాల్లో శిక్షణ, నైపూణ్యాల వృద్ధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ యువతకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ శాసీ్త్రయ సలహా మండలి సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించాలని అభిప్రాయపడ్డారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గేదెల యాజమాన్య పద్ధతులపై కేవీకే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ బి. శోభామణి, డాక్టర్ శివన్నారాయణలు క్షేత్రస్థాయి పరిశీలనలు, సూక్ష్మ సమన్వయంతో నిర్వహించేట్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు నరసింహారావు, ఎల్ఆర్ఎస్ హెడ్ డాక్టర్ ముత్తారావు వ్యవసాయ, అనుభంద సంస్థల నిపుణులు వారి సలహాలను అందించారు. కేవీకే శాస్త్రవేత్తలు 2024–25 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 2025–26 సంవత్సరంలోని కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యుగంధర్కుమార్ మాట్లాడుతూ సలహామండలి సలహాలు సూచనలు పాటిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు, ఎల్ఆర్ఎస్ సిబ్బంది, రైతులు, శాస్త్రవేత్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల వేతనాలు పెంచాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఇంతవరకు తమ వేతనాలు పెంచలేదని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. పాతగుంటూరులోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి అధ్యక్షుతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోగా ఉద్యోగుల పేరుతో కరెంట్ బిల్లులు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో అంగన్వాడీల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా వై.రమణను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దీప్తి, ఉపాధ్యక్షులు సుకన్య, ధనలక్ష్మి, హేమలత, రాజకుమారి, శివ పార్వతి పాల్గొన్నారు. -
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం వారు కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన తాడికొండ: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ–4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అంతకు ముందు రాష్ట్ర సచివాలయంలో మార్చి 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆమె వెంట ప్రొటోకాల్ డైరెక్టర్ మోహనరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, జిల్లా ఉపాధి కల్పనాధికారి దుర్గాభాయి, గుంటూరు పశ్చిమ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తుళ్ళూరు తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాల పరిశీలన తాడికొండ: తాడికొండ మండలంలో కొనసాగుతున్న వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాలను ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. నాలుగు కేంద్రాలను పరిశీలించిన వారు నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 50 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 510 మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్య ద్వారా చదువుతున్న మహిళలకు పరీక్ష నిర్వహించి ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేంద్ర అడల్ట్ ఎడ్యుకేషన్ బ్యూరో కన్సల్టెంట్ అధికారి జగన్ మోహన్ రావు, సభ్యులు ఓంకారం, శిరీష, దాసరి వెంకటస్వామి ఎంపీడీవో కె.సమతా వాణి, ఏపీఎం సాంబశివరావు పాల్గొన్నారు. శ్రీరంగనాయకులుగా నృసింహస్వామి మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆస్థాన అలంకార ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీరంగనాయకులు అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కైంకర్యపరులుగా కొడాలి సుగుణమ్మ జ్ఞాపకార్థం సీతారామయ్య, బసవ ఆనంద్, వెంకట అజయ్, ఆస్థాన కైంకర్యపరులుగా పచ్చళ్ళ విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈఓ ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. -
గతంలో ఓ సచివాలయ ఉద్యోగి అదృశ్యం
కొద్ది రోజుల కిందట ముగిసిన ఐసీసీ టోర్నీ, తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ నేపథ్యంలో నరసరావుపేట కేంద్రంగా బెట్టింగ్ భూతం జడలు విప్పింది. దీనికి అభం శుభం తెలియని ఎందరో అభాగ్యుల ప్రాణాలు అర్ధంతరంగా ఆరిపోతున్నాయి. అరికట్టాల్సిన పోలీసు యంత్రాంగం ముందుగానే పెవిలియన్ చేరడంతో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా బెట్టింగ్ సాగుతోంది. ఇప్పటికే ఎందరో అమాయకులు బెట్టింగ్ భూతానికి ఆహుతి అయ్యారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో జీవితాలు బలి కాకముందే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరసరావుపేట టౌన్: కాయ్ రాజా కాయ్ అంటూ ఊరిస్తోన్న బెట్టింగ్ భూతానికి అమాయకులు బలవుతున్నారు. ఒకటికి పది రెట్లు అంటూ ఆశలు కల్పించడంతో ఆ వలలో చిక్కుకుని బయటికి రాలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఓ యువకుడు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి నాలుగు నెలల కిందట నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన మహిళతో వివాహమైంది. గతంలో సాఫ్ట్వేర్ గా పనిచేసిన ఆ యువకుడు ఉద్యోగం మానేసి స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం బెట్టింగ్ యాప్లకు బానిసయ్యాడు. దీంతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందిన విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తొలుత పని ఒత్తిడితో కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. తీగలాగితే కదిలిన బెట్టింగ్ డొంక యువకుడి ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులకు దర్యాప్తులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతుడి సెల్ఫోన్, లాప్టాప్లను స్వాధీనం చేసుకుని అందులోని డేటా విశ్లేషించారు. కొంతమందికి మృతుడు తాను క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు నష్టపోయానని, సమయం ఇస్తే తిరిగి చెల్లిస్తానని ప్రాథేయపడుతూ పంపిన సందేశాలు గుర్తించారు. దీంతో బెట్టింగ్ ఊబిలో దిగి ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగుతోంది. ఐపీఎల్ నేపథ్యంలో జోరందుకున్న బెట్టింగ్లు అశల వలలో చిక్కుకుంటున్న యువత డబ్బులు పోగొట్టుకుని నవ వరుడు ఆత్మహత్య విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం ఆత్మహత్య చేసుకునేందుకు మరో యువకుడు ఇంటి నుంచి పరారీ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా రక్షించిన పోలీసులు బెట్టింగ్ అరికటడ్డంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్న పోలీసులు పోలీసులు విఫలం బెట్టింగ్ ఈ స్టాయిలో జడలువిప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా, అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బెట్టింగ్ చాపకింద నీరులా విస్తరించింది. ఏ ఇతర జిల్లాలో లేనంతమంది క్రికెట్ బకీలు పట్టణంలో ఉండటం గమరార్హం. పోలీసులు పట్టించుకోకపోవడంతో జడలు విచ్చుతోంది. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు వచ్చిన కొన్నే. జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి కూకటి వేళ్లతో పెకలించకపోతే ప్రస్తుత ఐపీఎల్లో మరెన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో యువకుడు పట్టణంలోని ప్రకాశ్నగర్కు చెందిన ఓ యువకుడు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లో పని చేస్తున్నాడు. అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ బెట్టింగ్లో డబ్బులు పందెం కట్టాడు. అవి పోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఇంట్లో విషయం తెలియజేసి తనకు డబ్బులు కావాలని కోరాడు. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెల్ఫోన్ లోకేషన్ ఆధారంగా అతన్ని గుర్తించి ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. విచారణలో క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఏం చేయాలో తెలియక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆ యువకుడు తెలిపాడు. రెండు నెలల కిందట గురజాల నియోజకవర్గానికి చెందిన ఓ సచివాలయ ఉద్యోగి సామాజిక పింఛన్ డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్లో పెట్టాడు. తెల్లవారేసరికి అధిక మొత్తం అవుతాయని ఆశకు పోయి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఒకటో తేదీ ఉదయం నగదు పంచకుండా అదృశ్యమయ్యాడు. అనంతరం ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తానని, ఉద్యోగం ఇస్తేనే తమ భార్యాపిల్లలు బతికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇలా బెట్టింగ్ వ్యసనానికి బానిసై నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. -
వైద్యులే నిజమైన హీరోలు
గుంటూరు మెడికల్: ఒక డాక్టర్ను తయారు చేసేందుకు ప్రభుత్వం ఏడాదికి రూ.1.72 కోట్లు ఖర్చు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజా సొమ్ముతో డాక్టర్లయిన వారు తమ సేవల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్లో 108 గుండె బైపాస్ సర్జరీలు విజయవంతంగా చేసిన ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి వైద్యులు, పద్మశ్రీ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను ఆదివారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే కార్డియాలజీ వైద్య విభాగంలో 25,000 ప్రొసీజర్స్, 5,000 పీటీసీఏ ప్రొసీజర్స్ చేసిన వైద్యులను సన్మానించారు. ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైద్యులు నిజమైన హీరోలని, చరిత్రలో నిలిచిపోయేలా మంచి పనులు చేయాలని పేర్కొన్నారు. సేవాభావం కలిగి ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్సీడీ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నామని, 1.8 కోట్ల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. వీరిలో కొత్తగా 10 లక్షల మంది అధిక రక్తపోటు, 10 లక్షల మంది షుగర్ బారిన పడ్డారని వివరించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 60వేల మంది రోగులను గుర్తించినట్టు వెల్లడించారు. స్టెమి కార్యక్రమం ద్వారా గుండె పోటు వచ్చిన 2,224 మందికి ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడామన్నారు. డాక్టర్ గోఖలేను అభినందించారు. జీజీహెచ్కు గొప్ప చరిత్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తాను గుంటూరు జీజీహెచ్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవటానికి రెండు ఘటనలు కారణమని చెప్పారు. జీజీహెచ్లో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిందని, సెల్ఫోన్ వెలుతురులో ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేశారని ‘సాక్షి’ మీడియాలో వార్తలు ప్రచురితం అయినట్లు చూసి జీజీహెచ్పై పేదలకు నమ్మకం కలిగించేందుకు ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ చేయించుకుని ఎనిమిదేళ్లయిందని, చాలా సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ చదువుకున్న ఏడుగురు వైద్యులకు పద్మశ్రీలు రావటం చాలా గొప్ప విషయమని చెప్పారు. లివర్ మార్పిడి ఆపరేషన్లకు ఏర్పాట్లు గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో మాతృసంస్థ అభివృద్ధికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. వంద ఆపరేషన్లు పూర్తిచేసిన గోఖలేను అభినందించారు. విశాఖలో ఇటీవల లివర్ మార్పిడి ఆపరేషన్ చేశారని, గుంటూరు జీజీహెచ్లో కూడా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సేవా భావం కలిగి ఉండాలి వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ వంద గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గోఖలేకు సన్మానం త్వరలో గుండె మార్పిడి ఆపరేషన్లు సన్మాన గ్రహీత డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ వైద్యులు ఆరోగ్యవంత సమాజానికి సాధ్యమైనంత కృషి చేయాలన్నారు. త్వరలో జీజీహెచ్లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్, నగర సెక్రటరీ డాక్టర్ బి.సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీ డాక్టర్ చండ్ర రాధిక రాణి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగళ్ల కిషోర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ తాతా సేవకుమార్, గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ , సీటీఎస్ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణమూర్తి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ నాతానీ శ్రీకాంత్, ఎనస్థీషియా వైద్య విభాగాధిపతి డాక్టర్ పోలయ్య పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అర్జిత సేవల్లో ఉభయదాతలు తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీహోమం, శాంతి కళ్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెటు కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. అంతరాలయానికి రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ముఖ మండప దర్శనానికి అనుమతించారు. భక్తులకు అమ్మవారి బంగారు వాకిలి దర్శనం కల్పించడంతో త్వరతిగతిన అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు ఇబ్బంది కలుగకుండా రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్ క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా భక్తులకు మంచినీటిని సరఫరా చేశారు. ఉచిత అన్న ప్రసాద వితరణ చేశారు. -
లవ్ యువర్ ఫాదర్ చిత్ర బృందం సందడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలో లవ్ యువర్ ఫాదర్ (ఎల్వైఎఫ్) చిత్ర బృందం సందడి చేసింది. వచ్చేనెల 4న ఎల్వైఎఫ్ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చిత్ర హిరో శ్రీహర్ష, నటులు బంటి, శ్రీకర్, నిర్మాత కిషోర్రాఠీ చేరుకున్నారు. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజ కార్యక్ర మాలు నిర్వహించారు. అనంతరం నటుడు శ్రీహర్షను ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య సత్కరించి, చిత్ర బృందానికి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్ర హిరో శ్రీహర్ష మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయని చెప్పారు. వచ్చే నెల 4న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లల్లో వీక్షించాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ చిత్ర టైటిల్ లవ్ యువర్ ఫాదర్ చాలా బాగుందని అన్నారు. వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఫాదర్స్ డే రోజునే కాకుండా తండ్రిని ప్రతినిత్యం ప్రేమించాలని అన్నారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ నటుడు శ్రీహర్షను అభినందించారు. టీడీపీ నాయకులు మల్లి, చిత్ర నిర్మాతలు కిషోర్ రాఠీ, రామస్వామిరెడ్డి, నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎం.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిత్ర బృందం బస్సు యాత్ర ప్రారంభించింది. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేత్ర సమస్యల పరిష్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: నేత్ర సంబంధ సమస్యలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో చంద్రమౌళీనగర్లో నెలకొల్పిన మెడెక్స్ హాస్పిటల్స్లో ఆధునిక నేత్ర సంరక్షణ వైద్యసేవలను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ మెడెక్స్ హాస్పిటల్స్ ద్వారా వైద్యరంగంలో అడుగుపెట్టడం శుభపరిణామమన్నారు. ప్రముఖ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మెడెక్స్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన కంటి, దంత, చర్మ, సైకాలజీ వైద్య సేవల విభాగాలను సందర్శించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి సిబ్బంది ఆయనకు వివరించారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ ఐ కేర్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23 వరకు మెడెక్స్ హాస్పిటల్స్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఆస్పత్రిని ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మెడెక్స్ హాస్పిటల్స్ ఐ కేర్ యూనిట్ చీఫ్ ఆఫ్తమాలజిస్ట్ డాక్టర్ యర్రారపు మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
నిరాధార వార్తలు పోస్టు చేస్తే కఠిన చర్యలు
సౌత్ డీఎస్పీ భానోదయ గుంటూరు రూరల్: సామాజిక మాధ్యమాల్లో నిరాధార వార్తలను పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ ఎ.భానోదయ తెలిపారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో డీఎస్పీ మాట్లాడారు. ప్రజా రిపోర్టర్ అనే వాట్సాప్ గ్రూప్లో 9640128296 అనే ఫోన్ నంబర్ కలిగిన వ్యక్తి గుంటూరు పోలీసుల అదుపులో దళిత జర్నలిస్టు? మూడు రోజులైనా ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదని పోస్టును వైరల్ చేసినట్టు వివరించారు. వాస్తవానికి దళిత జర్నలిస్టులెవరినీ అరెస్టు చేయలేదని డీఎస్పీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం తెచ్చి విక్రయిస్తున్న కేసులో మార్చి 22న తెల్లవారు జామున కూరపాటి విజయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అదే రోజు మధ్యాహ్నం న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని, అతనికి న్యాయమూర్తి రిమాండ్ విధించారని వెల్లడించారు. వాస్తవదూర పోస్టును పెట్టిన వ్యక్తిపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేడు ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లలోని రాజీవ్గాంధీ మెమోరియల్ ఎయిడెడ్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సోమవారం కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ బయాలాజికల్ సైన్స్, మ్యాథ్స్, భాషా పండిట్ తెలుగు, హిందీ పోస్టుల వారీగా దరఖాస్తు చేసుకుని, ఇప్పటికీ హాల్ టికెట్లు పొందని అభ్యర్థులు https://apdeecet.apcfss.in/aidedLogin, htt ps://doegunturblogspot.com నుంచి డౌన్లోడ్ చేసుకుని, గుంటూరు శివారు నల్లపాడులోని టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రానికి కేటాయించిన షిఫ్ట్ల వారీగా పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూడు షిఫ్ట్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి ఇంకొల్లు(చినగంజాం): ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో నల్లబర్లీ పొగాకు సాగు విస్తృతంగా చేపట్టినందున ప్రభుత్వమే కొనుగోలుకు చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా సీపీఎం కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇంకొల్లు కో ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో రైతుల సదస్సు నిర్వహించారు. ఆ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ.. రైతులకు తీవ్ర ఇబ్బందు లు ఉన్నాయని, కొనుగోలుకు వ్యాపారులు ముందుకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నా రు. ప్రభుత్వమే పొగాకు బోర్డు పరిధిలోకి ఈ పొ గాకు పంటను తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు కందిమళ్ళ రామ కోటేశ్వరరావు మాట్లాడుతూ గురువారం సచివాలయాల వద్ద రైతులు అర్జీలను సమర్పించి ధర్నా నిర్వహించాలన్నారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి తలపనేని రామారావు, పర్చూరు డివిజన్ రైతు సంఘం నాయకులు బండి శంకరయ్య పాల్గొన్నారు. ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి పిడుగురాళ్ల: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తుమ్మలచెరువు గ్రామం వద్ద ఆదివారం జరిగింది. వాహనం ఆచూకీ తెలియలేదు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. స్థానికులు సమాచారం మేరకు 108 సిబ్బంది నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒంటిపై పచ్చ రంగు గీతల చొక్కా ధరించి ఉన్నాడు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సంప్రదించాలని పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు. -
పురుగుమందు తాగి మెకానిక్ ఆత్మహత్య
చేబ్రోలు: పురుగుమందు తాగి బైక్ మెకానిక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. సుద్దపల్లి గ్రామానికి చెందిన షేక్ మౌలాలి (36) నారాకోడూరు గ్రామ సమీపంలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసి వెళ్లిన మౌలాలి నారాకోడూరు గ్రామ సమీపంలోని రైస్ మిల్లు వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న మూడేళ్లకే బలవన్మరణం! వివాహిత అనుమానాస్పద మృతి తాడేపల్లి రూరల్: ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కుంచనపల్లిలో జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. కుంచనపల్లికి చెందిన నల్లపు సంజీవరావు, విజయకుమారి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె కుక్కమల్ల సౌందర్య (26) 2022లో అదే గ్రామానికి చెందిన రాజును ప్రేమించింది. పెద్దలను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అదే గ్రామంలో భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే ఇటీవల సౌందర్యను రాజు, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నట్టు సమాచా రం. శనివారం రాత్రి తన భర్త వేధిస్తున్నాడంటూ తండ్రి సంజీవరావుకు సౌందర్య ఫోస్ చేసింది. ఆదివారం ఉదయం బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి సంజీవరావు, కుమారులు సౌందర్య నివాసానికి వెళిగ అప్పటికే సౌందర్యను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు వెళ్లగా సౌందర్య మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త, అతని తరఫు కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తన కుమార్తె సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సంజీవరావు విలపిస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలైన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల లయోలా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు సమీపంలోని నల్లపాడుకు చెందిన 25 మంది నాగార్జునసాగర్ వెళ్లి మొక్కు తీర్చుకొని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. -
సమాజాభివృద్ధికి హేతుబద్ధ ఆలోచనలు దోహదం
నరసరావుపేట ఈస్ట్: సమాజాభివృద్ధికి హేతుబద్ధ ఆలోచనలు, ఆచరణలు దోహదపడతాయని వక్తలు స్పష్టం చేశారు. హేతువాద సంఘం కార్యాలయంలో ఆదివారం పల్నాడు జిల్లా సంఘం ద్వితీయ మహాసభలు నిర్వహించారు. మతం–సైన్స్ అంశంపై ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షుడు కరణం రవీంద్రబాబు మాట్లాడారు. మనుష్యుల్లో ఆలోచనా శక్తిని మ తాలు ముందుకు సాగనీయవని తెలిపారు. మతాలు విశ్వాసాలతో ముడిపడి ఉండగా, సైన్స్ సత్యాన్వేషణ చేస్తుందని స్పష్టం చేశారు. హేతుబద్ధంగా మాట్లాడినందుకు కోపర్నికస్, గెలీలియో, బ్రూనో వంటి వారిని మతపెద్దలు వేధింపులకు గురి చేశారని తెలిపారు. విశ్వ తత్వం– జీవతత్వం అంశంపై భారత హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ మాట్లాడారు. విశ్వానికి ఆది, అంతాలు లేవని స్పష్టం చేశారు. మానవుడు సహజ సహేతుకంగా ఆలోచించే జీవి కావడంతో ఇంతటి అభివృద్ధిని సాధించాడని వివరించారు. సాయంత్రం నిర్వహించిన అధ్యయన తరగతుల్లో నిత్యజీవితంలో హేతువాదం అంశంపై ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ దరియావలి మాట్లాడారు. మూఢ విశ్వాసాలను ప్రశ్నించాలని తెలిపారు. డాక్టర్ గుమ్మా రచించిన హేతువాద, మానవతావాద తత్వవేత్త రావిపూడి వెంకటాద్రి గ్రంథాన్ని ఈదర గోపీచంద్ ఆవిష్కరించగా, రవీంద్రబాబు సమీక్షించారు. నూతన కార్యవర్గం ఎంపిక ఈ సందర్భంగా జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బి.పి.వి. సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా కట్టా సుబ్బారావు, ఉపాధ్యక్షునిగా వి.ఎస్.ఎస్. మూర్తి, సహాయ కార్యదర్శిగా షేక్ చినమస్తాన్, కోశాధికారిగా ఈదర గోపీచంద్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఘనంగా జిల్లా హేతువాద సంఘం ద్వితీయ మహాసభలు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక -
కార్యకర్తలందరికీ వైఎస్సార్ సీపీ అండ
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అంజినీపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కిరెడ్డిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. టీడీపీ మూకలు దాడి చేయడం దుర్మార్గమని, ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. రేపు అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని, అది గుర్తుపెట్టుకొని టీడీపీ నాయకులు వ్యవహరించాలని తెలిపారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యులు విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, పట్టణ, మండల కనీనర్లు చింతా వెంకట రామారావు, చల్లా పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అల్లు పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డి, కత్తెరపు రామ్గోపాల్రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ కాలే మాణిక్యరావు, పట్టణ యూత్ అధ్యక్షులు మందా సుధీర్, వైస్ ఎంపీపీ సాతులూరి బాబు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి -
ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్స్ సంఘ జిల్లా అధ్యక్షుడిగా కోటయ్య
నెహ్రూ నగర్(గుంటూరు ఈస్ట్): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా మార్పు కోటయ్య ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షులుగా మైల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి.కొండలరావు, కె.రజని, జనరల్ సెక్రెటరీగా ఎం.లక్ష్మణరావు, జాయింట్ సెక్రెటరీగా ఆర్.కోటేశ్వరరావు, పాతపాటి రమేష్, ట్రెజరర్గా సి.హెచ్.అనూష, ప్రెస్ సెక్రటరీగా ఎం.కోటేశ్వరరావు, పి.రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సి.హెచ్.ఆంజనేయులు, ఎన్.రవిశంకర్, కోటి శ్రీనివాసరావు, జె.విమలను ఎన్నుకున్నట్టు వివరించారు. కొత్తగా ఎన్నికై న కమిటీని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి అభినందించారు. న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.6 లక్షలకు పెంపు గుంటూరు లీగల్: న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో న్యాయవాదులు అనారోగ్యానికి గురైనప్పుడు రూ.లక్ష ఉన్న మెడికల్ బెనిఫిట్స్ రూ.1.50 లక్షలకు పెంచుతున్నట్లు తీర్మానించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. యాక్సిడెంట్ డెత్ జరిగితే బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్తో సంబంధం లేకుండా రూ.5 లక్షలు ఇచ్చే విధంగా తీర్మానించింది. ఇది మే 1 నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించింది. ముస్లింలను వంచించిన కూటమి ప్రభుత్వం నాదెండ్ల: ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు కూటమి ప్రభుత్వం మద్దతునివ్వడం అన్యాయమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని ద్రోహం చేశారని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి మోసం చేసిందని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, నితీష్కుమార్ మద్దతు తెలిపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు బహిరంగ ప్రకటన చేయడం ముస్లింలపై వారికున్న కపట ప్రేమను తేటతెల్లం చేసిందని తెలిపారు. ముస్లింలకు అండగా నిలుస్తామన్న మాటకు కట్టుబడి ఉంటే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయాలని షేక్ బాజీ డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లుపై చిత్తశుద్ధి ప్రకటించకపోతే భవిష్యత్తులో ముస్లింల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
పొగాకు రైతులను ముంచిన ప్రభుత్వం
బాపట్ల: పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పలెపోగు రాంబాబు ధ్వజమెత్తారు. పొగాకు తగిన ధర లేనప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రూ.200 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేటాయించి మార్క్ఫెడ్తో కొనుగోలు చేయించారని గుర్తుచేశారు. రైతులను ఆదుకున్నారని రాంబాబు పేర్కొన్నారు. బాపట్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ.. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు కనీస మద్దతు ధర కూడా రాకపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. పొగాకు బోర్డులు మద్దతు ధర లభించేలా చూడటంలో నిర్లక్ష్యంగా ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు క్వింటా రూ. పది వేలు పలకగా.. ఇప్పుడు రూ. నాలుగు వేలకై నా అడిగేవారే లేరన్నారు. బర్లీ పొగాకుకు అమెరికా, బ్రిటన్ వంటి ప్రాంతాల్లో డిమాండ్ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొనే పరిస్థితి లేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించకుంటే ఆందోళనకు దిగుతామని రాంబాబు హెచ్చరించారు. రైతులతో కలిసి వెల్లంపల్లిలోని పొగాకు బోర్డు వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నామని తెలిపారు. భారీగా పెరిగిన ఖర్చులు వైఎస్సార్సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఈద శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ.. పొగాకు సాగుకు ఖర్చులు పెరిగాయని, గిట్టుబాటు ధర మాత్రం లేకపోవటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. పొగాకు చెక్కు గిడ్డంగుల్లో పెట్టుకున్నదుకు గతంలో రూ.400 ఉంటే ఇప్పుడు రూ.720 వసూలు చేస్తున్నారని చెప్పారు. శనగ, మిర్చి రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించటంతో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు కొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, యువత జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, నాయకులు జోగి రాజా, నర్రావుల వెంకట్రావు, తన్నీరు అంకమ్మరావు, కటికల యోహోషువా పాల్గొన్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతన్న అన్నదాతలను ఆదుకోకపోతే ఉద్యమానికి సిద్ధం వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పలెపోగు -
దేశ అభివృద్ధిలో యూబీఐ కీలకపాత్ర
కొరిటెపాడు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శతాబ్దంపైగా లక్షలాది మంది ఉద్యోగుల సహకారంతో దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆ బ్యాంక్ జోనల్ హెడ్ సయ్యద్ జవహర్ చెప్పారు. ఆదివారం తాలూకా కార్యాలయ ఆవరణలోని పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఏపీ, తెలంగాణ యూనియన్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ ఆవిర్భావ సభ, తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జోనల్ హెడ్ జవహర్ మాట్లాడుతూ ఏ సంస్థ ఐనా ఉద్యోగుల సహాయ సహకారాలు లేకపోతే రాణించలేదని పేర్కొన్నారు. అధ్యక్షత వహించిన అసోసియేషన్ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యాలు, ప్రభుత్వాలు చిన్నచూపు ప్రదర్శించడం బాధాకరమని అన్నారు. విశ్రాంతి జీఎం, విశ్రాంత డీజీఎంలు డి.చిరంజీవి, పుల్లారావు, ఏవీఎస్ కృష్ణమోహన్, కేజే.శ్రీనివాసరావు, ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి వీవీకే.సురేష్ ప్రసంగించారు. సమావేశంలో విశ్రాంత ఏజీఎం కె.శివశంకరరావు, కన్వీనర్ ఎంకేవీ.ప్రసాద్, కొండూరి శ్రీనివాసరావు, తెలుగు రాష్ట్రాల విశ్రాంత అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఏఎఫ్డబ్ల్యూఎల్ వైస్ ప్రెసిడెంట్గా ఝాన్సీ
గుంటూరు లీగల్: ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ (ఏఎఫ్డబ్ల్యూఎల్) దక్షిణభారత ఉపాధ్యక్షురాలిగా సోమసాని ఝాన్సీ ఎన్నికయ్యారు. బెంగళూరులో ఈనెల 23న నిర్వహించిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి తెలంగాణకు చెందిన పి.రేవతి దేవిపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పోలూరు వెంకటరెడ్డి, సి.డి. భగవాన్, ఒట్టి జొన్నల బ్రహ్మరెడ్డి, కాసు వెంకట్రెడ్డి, కళ్ళం రమణారెడ్డి, కృష్ణారెడ్డి, పలువురు న్యాయవాదులు ఝాన్సీకి అభినందనలు తెలిపారు. ఝాన్సీ గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యురాలు కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా కె.శాంతకుమారి(తమిళనాడు) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ భాస్కర లక్ష్మీ, ప్రెసిడెంట్ అరుణ, ఈసీ సభ్యులు, గుంటూరు బార్ అసోసియేషన్ పూర్వ ప్రెసిడెంట్ పోలూరి వెంకట రెడ్డి, ప్రస్తుత ప్రెసిడెంట్ కాసు వెంకట రెడ్డి, బార్ కౌన్సిల్ మెంబెర్ బ్రహ్మానంద రెడ్డి, పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఝాన్సీ ప్రస్థానమిలా.. ఝాన్సీలక్ష్మి 2000 సంవత్సరం నుంచి న్యాయవాదిగా గుంటూరు జిల్లా కోర్ట్, హైకోర్ట్, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో పనిచేస్తున్నారు. సోమసాని బ్రహ్మానంద రెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. ఆమె ఆర్డీఓ ట్రిబ్యునల్ ప్యానెల్ అడ్వకేట్గా, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా, స్టాండింగ్ కౌన్సిల్ కం స్పెషల్ పీపీపీసీఆర్ సెల్, సీఐడీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఫెడరేషన్ అఫ్ ఉమెన్ లాయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఝాన్సీ లక్ష్మికి ట్రెక్కింగ్ అంటే ఆసక్తి. 2024 జూన్లో 53 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్కింగ్ కూడా చేశారు. -
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
‘వంద కేసులను, వెయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటా’
సాక్షి,అమరావతి : వంద కేసులను, వేయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మాజీ మంత్రి విడదల రజిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. ‘మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం.నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి’ అని పేర్కొన్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలువ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులుఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధంనా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు…— Rajini Vidadala (@VidadalaRajini) March 23, 2025 -
‘98 డీఎస్సీ’ మిగిలిన అభ్యర్థులకు న్యాయం చేయాలి
మంగళగిరి టౌన్: 1998 డీఎస్సీలో మిగిలిన బీసీ, ఎస్సీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1998 డీఎస్సీలో ఓసీలకు 50 మార్కులు, బీసీలకు 45, ఎస్సీలకు 40 మార్కులను కటాఫ్గా నిర్ణయించి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని, కానీ ఆయా కేటగిరీల్లో తగినంత మంది అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో 5 మార్కులు తగ్గించి ఇంటర్వ్యూలకు పిలిచారన్నారు. గత ఎన్నికల్లో యువగళం పాదయాత్రలో తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామని, తాము అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి 8 జిల్లాలకు సంబంధించి నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్, 98 డీఎస్సీ రిమైనింగ్ క్యాండిడేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సుహాసిని, జగ్గయ్య, శ్రీనివాసులు, మీరావలి, చంద్రయ్య, గోవిందరావు, మధుసూదన్రావు, జయరామయ్య, కె.జె.ఎస్. కుమార్ పాల్గొన్నారు. 9న వివాహం.. ఇంతలోనే విషాదం పెదకాకాని: వివాహమై 13 రోజులు కూడా కాకముందే గుండెనొప్పితో ఓ డాక్టర్ మరణించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఆ నవ వధువు భర్తను కోల్పోయి తీవ్ర దుఖః సాగరంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడేళ్లుగా డాక్టర్ శివాచారి (33) విధులు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందారు. ఈనెల 9వ తేదీన శివాచారికి వైద్యురాలైన లావణ్యతో తిరుపతిలో వివాహం జరిగింది. అయితే ఆయనకు శుక్రవారం తెల్లవారుజామున గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి సర్జరీ చేయించారు. చికిత్స పొందుతున్న శివాచారి అదేరోజు రాత్రి మరణించాడు. మృతదేహాన్ని ఒంగోలులోని స్వగృహానికి తరలించారు. వైద్యుడి మృతదేహాన్ని పలువురు డాక్టర్లు, సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. గ్రామ మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, పలువురు గ్రామ పెద్దలు వైద్యుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాడ సానుభూతి తెలిపారు. -
పోక్సో కేసుల్లో సున్నితత్వం అవసరం
గుంటూరులీగల్: పోక్సో చట్టం ప్రకారం బాధితులకు ఎలాంటి సహాయం అందించాలి, ఇటువంటి కేసులలో సున్నితత్వం అనేది ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శనివారం గుంటూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గుంటూరు పోక్సో కోర్ట్ న్యాయమూర్తి ఏ అనిత మాట్లాడుతూ బాధిత మహిళా, చైల్డ్ కానీ న్యాయం కోసం కేసు ఫైల్ చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించినపుడు నేరం చేసిన వారికి శిక్ష విధించి బాధితులకు న్యాయం చేయగలమని వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) గుంటూరు సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ కేసుల్లో బాధితులకు నల్సా పరిహార పథకం, లైంగిక దాడులకు గురైన వారికి రక్షణ పథకం 2012 ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహార పథకం 2015 ద్వారా పరిహారం ఎలా పొందవచ్చునో వివరించారు. గుంటూరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.విజయలక్ష్మి, ట్రైనీ న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, పోలీస్ సిబ్బంది, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నదుల సంరక్షణ ముఖ్యం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గుంటూరు సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ హిమనీ నదాల సంరక్షణ అనేది చాలా ముఖ్యమని అన్నారు. బొగ్గు, చమురు వనరులను తగ్గించి సహజ వనరులకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నీరు లేక ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రాబోవు తరాలకు నీటి విలువను తెలియజేయాలన్నారు. ప్రధానన్యాయమూర్తి పార్థసారథి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వలన పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. అన్ని అవసరాలకు మున్సిపల్ వాటర్ వాడుకొని తాగునీటికి మినరల్ వాటర్ వాడుతున్నామని, ఖాళీ స్థలాల్లో ఇళ్లు నిర్మించడం, మొక్కలను పెంచకపోవడం ప్రపంచం బాగుండాలంటే ఇప్పటి తరం అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి నీటిని సంరక్షించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గుంటూరు ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఎండీ నజీనా బేగం, గుంటూరు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ బి.ఆదిశేషయ్య, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్యోగ నియామక ఉత్తర్వుల్లో తప్పిదాలు
గుంటూరు మెడికల్: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్(జీజీహెచ్) కార్యాలయ ఉద్యోగుల తీరుపై రోజురోజుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డీ కార్యాలయంలో ఫార్మాసిస్టుల ప్రమోషన్లకు జీజీహెచ్ నుంచి జాబితాను పంపించే విషయంలో తప్పిదాలు చేసి మెమోలు పొందిన చరిత్ర ఇక్కడి కార్యాలయ ఉద్యోగులది. తాజాగా వీరి ఉదంతం మరోటి బయటపడింది. 19 పారా మెడికల్ పోస్టులకు గుంటూరు వైద్య కళాశాలలో రిక్రూట్మెంట్ నిర్వహించి శుక్రవారం అపాయిమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. శనివారం విధుల్లో చేరేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఉద్యోగులకు నియామక ఉత్తర్వుల్లోని తప్పిదాలతో గుండె ఆగినంత పనైంది. కాంట్రాక్టు ఉద్యోగానికి నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సిన చోట అవుట్సోర్సింగ్ పేరుతో తప్పుగా టైపింగ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ కాగితాలపై తప్పిదాలను సరిదిద్దాలని కోరినా అదేమీ కాదులే టేకిటీజీగా తీసుకోండంటూ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఉద్యోగులు తాపీగా సమాధానం చెప్పడం అభ్యర్థులకు విస్మయం కలిగించింది. గట్టిగా అడిగిన కొంతమందికి పెన్నుతో సరిదిద్ది మరికొంత మందిని సోమవారం రావాలని ఆదేశించారు. కార్యాలయ ఉద్యోగులు చేసిన తప్పిదాలకు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా జీజీహెచ్ అధికారులు ఎస్టాబ్లిష్మెంట్ విభాగంపై దృష్టి సారించి ఆసుపత్రి పరువు బజారున పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగానికి బదులుగా అవుట్సోర్సింగ్ అని టైపింగ్ జీజీహెచ్ ఎస్టాబ్లిష్మెంట్ సిబ్బంది తీరుపై ఆందోళన -
కల్తీ, నాణ్యతా లోపాలపై ఫిర్యాదు చేయాలి
గతంలో కిరోసిన్ అందుబాటులో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్లో కొంతవరకు కల్తీ నడిచింది. రాష్ట్రంలో కిరోసిన్ను నిలిపివేసిన తర్వాత కల్తీకి అవకాశం లేదనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో పెట్రోల్లో కలపాల్సిన 7 శాతం ఇథనాల్ను 20 శాతానికి పెంచారు. కారణం పర్యావరణ కాలుష్యం పెరగకుండా చూసేందుకే. బంకుల్లో ఇబ్బందులు ఏర్పడితే తప్పక ఫిర్యాదు చేయాలి. నిబంధనలు పాటించని బంకు యజమానులకు ఫైన్ తప్పదు. ప్రజల్లో చైతన్యం చాలా ముఖ్యం. – కోమలి పద్మ, జిల్లా పౌర సరఫరాల అధికారి, గుంటూరు -
సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాలి
కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గుంటూరు ఎడ్యుకేషన్: భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి అన్నారు. శనివారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేసిన భవన్స్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ రామలింగశాస్త్రి మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక జీవనంలో మన పురాతన కళలైన సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి కనుమరుగవుతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో భారతీయ విద్యా భవన్స్ ముందుకు వచ్చి సంస్కృతి, లలిత కళల అకాడమీని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి బాల్యం నుంచే సంగీతం, నాట్యం, సాహిత్యం, గానం, చిత్ర లేఖనంవంటి కళలు నేర్చుకొని అద్భుత ప్రతిభావంతులుగా రాణించాలన్నారు. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ లలిత కళలు మన భారత జీవన గమనంలో భాగమని, పాశ్చాత్య దేశాలు పుట్టక మునుపే మన దేశంలో నలంద, తక్షశిలా వంటి విశ్వవిద్యాలయాల్లో సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి అనేక కళల్లో శిక్షణా తరగతులను నిర్వహించి, భావితరాలకు అద్భుత కళారూపాలను అందించారని తెలిపారు. భారతీయ విద్యా భవన్స్ కార్యదర్శి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ అనేకమంది ప్రఖ్యాత కళాకారులకు జన్మభూమి అయిన గుంటూరులో అకాడమీను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వేదాంతం రామలింగేశ్వర శాస్త్రి చేతులమీదుగా అకాడమీ లోగోని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ సంగీత నాటక పాఠశాల ప్రిన్సిపాల్ మార్టూరు హరిబాబు, శ్రీసాయి మంజీరా ఆర్ట్ అకాడమీ కార్యదర్శి కాజా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి శేషు రాణిని సన్మానించారు. సాహితీ సమాఖ్య కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యా భవన్ కోశాధికారి రామ్ సుభాష్, హిందూ కళాశాల తెలుగు విభాగాధిపతి ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ హేమాంబ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు ఎమ్మెల్యే ఒత్తిడితోనే అంటున్న కుటుంబ సభ్యులు పట్నంబజారు: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు నమోదయింది. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్, సయ్యద్ ఫిరోజ్లు అన్నదమ్ములు. వీరిపై గత ఎనిమిది సంవత్సరాలుగా రౌడీషీట్ ఉంది. ఈక్రమంలో గత కొద్దిరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన తూర్పు ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్కు వీరికి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై వీరు దాడికి యత్నించారు. గతంలో నుంచే టీడీపీలో నసీర్ అహ్మద్, ఇంతియాజ్ కుటుంబీకుల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇంతియాజ్, ఫిరోజ్ల సోదరుడు ముజీబ్ కూడా టీడీపీ తూర్పు నియోజకవర్గ సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో వీరిమధ్య వివాదాలు మరింత ముదిరాయి. వివాదం విషయాన్ని మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉద్దేశ్యపూర్వకంగా వీరిపై పీడీ యాక్టు పెట్టించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి అదును కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే వీరికి ఉన్న రౌడీషీట్లను అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో పీడీ యాక్టుతో పావులు కదిపారనే ఆరోపణలు లేకపోలేదు. పీడీ యాక్టు నమోదైన ఇంతియాజ్, ఫిరోజ్లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లిన నేపధ్యంలో వారు పరారీలో ఉన్నారని తెలిసింది. ఈ నేపధ్యంలో వారు టీడీపీ అగ్ర నాయకత్వాన్ని కలిసి విషయాన్ని వారికి దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లుసమాచారం. -
నోటి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలి
పెదకాకాని: ప్రభుత్వం ఆధ్వర్యంలో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ టి.కృష్ణబాబు అన్నారు. ఓరల్ మెడిసిన్, ఓరల్ పథాలజీ, ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా నోటి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలన్నారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని సిబార్ దంత వైద్య కళాశాల గత రెండు రోజులుగా జరిగిన జాతీయ దంత వైద్య సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సుకు సిబార్ కళాశాల డీన్ డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాన్ఫరెన్స్ను ప్రారంభించారు. అంతర్జాతీయ ఓరల్ పథాలజీ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కె.రంగనాథన్ గౌరవ అతిథిగా విచ్చేశారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ స్వాగతోపన్యాసం చేశారు. డాక్టర్ టి.కృష్ణబాబు మాట్లాడుతూ సిబార్ దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో జాతీయ దంత వైద్య సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఓరల్ క్యాన్సర్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, ఓరల్ మెడిసిన్, రేడియాలజీ, ఓరల్ సర్జరీ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు వక్తలుగా విచ్చేసి వారి అనుభవాలను తెలియజేశారు. ఈ కాన్ఫరెన్స్కు దేశ నలుమూ లల నుంచి 500 వరకు ఓరల్ మెడిసిన్, ఓరల్ పథాలజీ, ఓరల్ సర్జరీ నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నా రు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఓరల్ మెడి సిన్ అండ్ రేడియాలజీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ కృష్ణ, కార్యదర్శి డాక్టర్ శివ ప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ అవినాష్ తేజన్వి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సమత, ట్రెజరర్ డాక్టర్ సేతు మంజూష, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు నాయక్, సిబార్ దంత వైద్య కళాశాల డీన్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ టి.కృష్ణబాబు సిబార్లో జాతీయ దంత వైద్యసదస్సు -
జిల్లావ్యాప్తంగా ఎనిమిది శక్తి బృందాలు
నగరంపాలెం: జిల్లాలోని మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం శక్తి యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. శక్తి బృందాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ సేవలను జిల్లాలోని మహిళలు, చిన్నారులకు అందించేందుకు ఎస్ఐ స్థాయి అధికారితో ఒక్కో బృందంలో ఆరుగురు పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని అన్నారు. ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలీస్ సబ్ డివిజన్కు ఒక్కో బృందం చొప్పున ఆరు బృందాలను నియమించామన్నారు. మిగతా రెండు బృందాలు మహిళా పోలీస్స్టేషన్ పరిధిలో ఉంటాయన్నారు. ఈ బృందాలకు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ సుబ్బారావు, సీఐ నారాయణ దిశా నిర్దేశం చేస్తారన్నారు. శక్తి పోలీస్ బృందాలు నిరంతరం పాఠశాలలు, కళాశాలలు వద్ద గస్తీ నిర్వహిస్తాయని పేర్కొన్నారు. శక్తి యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత సమాచారం నింపి, సేవలను పొందవచ్చునని ఎస్పీ సూచించారు. జిల్లా ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీలు సుబ్బారావు, అబ్దుల్ అజీజ్, కె.అరవింద్, ఎ.భానోదయ, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జెండా ఊపి సేవలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ -
అక్రమార్జనకు దగ్గరిదారి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానిలో కాంట్రాక్టర్లు, కొంతమంది మట్టి మాఫియా రాబందుల్లా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ ప్రతిరోజు రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి 5,6 కిలోమీటర్ల దూరంలోని కాజా టోల్గేట్ నుంచి గన్నవరం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి మట్టి తవ్వి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్దంగా ఈ మట్టిని కొంతమంది వ్యాపారులకు లారీ రూ.2వేలకు అమ్ముతుంటే ఆ వ్యాపారులు లారీ రూ.7వేల నుంచి రూ.8 వేలకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. వాస్తవానికి ఈ మట్టిని తరలించేందుకు మైనింగ్శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే సదరు కాంట్రాక్టర్ అవేవీ పట్టించుకోకుండా మట్టిని అమ్ముకోవడం ప్రారంభించారు. ఇదే అదనుగా కొంతమంది అక్రమార్కులు సైతం రాజధాని ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన రోడ్లను సైతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో సైతం.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలకు నివాసాలుగా ఇచ్చిన స్థలాల్లో రోడ్లను సైతం కొన్ని చోట్ల తవ్వేశారు. రాత్రిళ్లు ఆ రహదారిపై మట్టిని తవ్వి ఒక ప్రాంతంలో డంపింగ్ చేసి ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసి అమ్ముకుంటున్నారు. అక్రమ మట్టి తవ్వకాల విషయంలో ఈ మధ్యకాలంలో పలు కేసుల్లో నమోదైన ఓ వ్యక్తి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజధాని గ్రామాలైన కృష్ణాయపాలెం శివారు, వెంకటపాలెం, మందడం శివారు ప్రాంతాల్లో, కొండవీటి వాగు రోడ్డుకు సంబంధించిన మట్టిని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో లారీలు పెట్టి బయటకు తరలిస్తున్నారు. ఐదు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారు పొక్లెయిన్లు తీసుకువచ్చి, హద్దులు నిర్ణయించుకుని మట్టి తవ్వకాలు చేసుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. కనిపించని పర్యవేక్షణ రాజధానిలో వందలాది కంపెనీలు టెండర్లు దక్కించుకుని కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నాయి. పనులు నిర్వహించే దగ్గర ఎటువంటి సెక్యూరిటీని నియమించడం లేదు. దాంతో సూపర్వైజర్స్గా వ్యవహరించే వారు అక్రమాలకు పాల్పడుతూ రాజధానిలో సంపదను దోచుకుంటు జేబులు నింపుకొంటు న్నారు. మట్టిని రాజధాని ప్రయోజనాలకు కాకుండా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.నిబంధనలకు నీళ్లు రాజధానిలో రోడ్లను తవ్వేస్తూ మట్టి అక్రమ విక్రయాలు పట్టించుకోని అధికార యంత్రాంగం రాత్రిళ్లు ఐదు చోట్ల భారీ యంత్రాలతో మట్టి లోడింగ్ జేబులు నింపుకొంటున్న వ్యాపారులు, కాంట్రాక్టర్లు, వాహన యజమానులు రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలి తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం కాజాటోల్ వద్ద నుంచి గన్నవరం వరకు నిర్మించే రహదారిలో కాజా టోల్గేట వద్ద నుంచి వెంకటపాలెం శివారు వరకు రోడ్డు నిర్మించేటప్పుడు తవ్వే మట్టిని నిబంధనలకు విరుద్దంగా అమ్ముకోవడమే. సదరు కాంట్రాక్టర్లు అవినీతికి దారి చూపడంతో కొంతమంది స్వార్ధపరులు రాజధానిలో నిర్మించిన రహదారులను సైతం తవ్వేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రాజధానిలో చేపట్టిన అభివృద్ధి పనులపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
బాజీబాబా దర్గాను సందర్శించిన హైకోర్టు జడ్జి
పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విద్యావతి శనివారం పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించారు. పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి విద్యావతికి సిబ్బంది దర్గా మర్యాదలతో స్వాగతం పలికారు. దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేసిన న్యాయమూర్తి అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దర్గా సిబ్బంది న్యాయమూర్తి విద్యావతిని శాలువాతో సత్కరించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉరుసు మహోత్సవం జరగనున్న నేపధ్యంలో రూ.5వేల నగదు విరాళంగా అందజేసినట్లు దర్గా సిబ్బంది తెలిపారు. ఉగాది పండుగ ఏర్పాట్లు పరిశీలన వెలగపూడి(తాడికొండ): తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలోని రాష్ట్ర సచివాలయంలో ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకల కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం ఏపీ సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిలు పరిశీలించారు. వేడుకలు జరుగనున్న ప్రాంతం, సభావేదిక, ఏర్పాట్లు పలు అంశాలను అధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ భార్గవతేజ, ఆర్డీవో శ్రీనివాసరావు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమయపాలన పాటించండి – ఎకై ్సజ్ డీసీ డాక్టర్ కె.శ్రీనివాసులు నెహ్రూనగర్: మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ సూచించారు. శనివారం జిల్లాలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో గుంటూరు 1 టౌన్ ఎకై ్సజ్ స్టేషన్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్యం డిపో నుంచి తీసుకువచ్చే లిక్కర్ వివరాల నమోదు పక్కాగా ఉండాలన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి.అరుణకుమారి, ఏఈఎస్ ఎం.మారయ్యబాబు, ఎకై ్సజ్ వన్టౌన్ సీఐ లత, టూ టౌన్ సీఐ యశోధర ఇతర సిబ్బంది పాల్గొన్నారు. లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కర్లపాలెం: లైంగిక వేధింపుల నివారణ, పోక్సో చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఆరో అదనపు జడ్జి కె.శ్యామ్బాబు చెప్పారు. కర్లపాలెం మండల పరిఽధిలోని పేరలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి కె.శ్యామ్బాబు మాట్లాడుతూ లైంగిక వేధింపులు, అశ్లీలత వంటి నేరాల వంటివి విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా పేదలు న్యాయ సహాయం పొందవచ్చునని చెప్పారు. -
పార్థసారథి అలంకారంలో నృసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా నాగేశ్వరరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు. నేడు శ్రీరంగనాయకులు అలంకారం... లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు శ్రీరంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి కోరారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025చేప పిల్లలు విడుదల విజయపురిసౌత్: అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి మత్స్యశాఖ అధికారులు 10 లక్షల చేప పిల్లలను శనివారం విడుదల చేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.70 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. నృసింహుని సేవలో.. మంగళగిరి టౌన్: మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు మోహనకృష్ణ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లాతో పాటు నగరంలోని పలు పెట్రోలు బంకుల నిర్వాహకులు నిబంధనలకు పెట్రోలు వదులుతున్నారు. కొలతల్లో వ్యత్యాసం.. నాణ్యత ఘోరం.. వసతులు మృగ్యం. ఇదీ ఆయా చోట్ల దుస్థితి. ఇంత జరుగుతున్నా అధికారుల తనిఖీలు, తీసుకున్న చర్యలు శూన్యం. బండికి కాస్త గాలి పెట్టండి అని వేడుకున్నా.. సిబ్బంది లేరంటూ, మిషన్ పనిచేయదంటూ.. వస్తే మీరే పెట్టుకోండంటూ సిబ్బంది విరుపైన సమాధానం.. ఇంధన పరిమాణం తగ్గిందేందని ప్రశ్నిస్తే ఎండకు ఆవిరి అవుతుందంటూ వింతైన జవాబు.. లీటరుకు ఎందుకు అ‘ధనం’గా తీసుకుంటున్నారని అడిగితే మా దగ్గర ఇంతే అంటు కటువైన సమాధానం.. చిప్ మోసాలపై ఆరా తీయబోగా అంతా గప్‘చిప్’గా సర్దుకోవడం. ‘సాక్షి’ బృందం జిల్లాలోని పలు పెట్రోలు బంకుల్లో పరిశీలన జరపగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇఫ్తార్ సహర్ (ఆది) (సోమ) గుంటూరు 6.24 4.53 నరసరావుపేట 6.26 4.55 బాపట్ల 6.24 4.53 నెహ్రూనగర్/ పట్నంబజారు/ గుంటూరు వెస్ట్: నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు...కొలతల్లోనూ తేడా చూపిస్తున్నారు...రికార్డుల నిర్వహణ కూడా అంతంతమాత్రమే.. జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో తీరిది. పెట్రోల్ అమ్మకాల్లో పూర్తిస్థాయిలో గోల్మాల్ జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా...అధికారుల తనిఖీలు కూడా తూతూ మంత్రంగానే జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా గప్‘చిప్’! జిల్లాలో దాదాపు ప్రతి బంకు వద్ద పెట్రోలు లీటర్కి 5 ఎంఎల్ నుంచి 30 ఎంఎల్ దాకా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందని బంకుల నిర్వాహకులను అడగ్గా వేసవి ఎండల వలన ఆవిరి అయిపోతుందని పేర్కొంటున్నారు. దీంతో పాటు అమౌంట్ ఫీడ్ చేసే కీబోర్డ్ వెనకాల చిన్న చిప్ ఉంటుందని...దీని ద్వారా పెట్రోల్ గన్లో మోసం జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిప్ను మేనేజ్ చేసేందుకు రిమోట్ సిస్టం వచ్చిందని.. దాని ద్వారా ఎవరైనా అధికారులు తనిఖీకి వస్తే చిప్ను ఆఫ్ చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో 4 గన్లు ఉంటే ఒక గన్ మాత్రమే కరెక్ట్గా పనిచేస్తుందని.. మిగిలిన మూడు గన్లు సరిగా పనిచేయవని వీటి ద్వారా వినియోగదారులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పెట్రోల్కి రూ 3.74 పైసలు, డీజీల్కి రూ.2.20పైసలు బంకుల నిర్వాహకులకు కమీషన్ వస్తుంది. కల్తీ విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వ నూతన విధాల కారణంగా కొంత తగ్గిందనే చెప్పాలి. అన్ని బంకుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. తనిఖీలు నామమాత్రం.. జిల్లాలో మొత్తం 189 పెట్రోలు బంకులు ఉండగా, గుంటూరు నగరంలో సుమారు 30 పైగా ఉన్నాయి. అయితే వీటిల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదు. పెట్రోల్ బంకులను నిరంతరం సివిల్ సప్లయీస్తో పాటు తూనికలు కొలతల శాఖ, ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు తనిఖీలు చేస్తుంటారు. బంకుల్లో కొలత తేడా వచ్చిందని భావిస్తే అక్కడ చెకింగ్ చేయమని అడగొచ్చు. తూనికలు, కొలతల శాఖ సర్టిఫై చేసిన 5 లీటర్ల క్యాన్తో కొలిచి చూపాల్సిన బాధ్యత బంక్ యజమానులపై ఉంది. క్వాలిటీలో తేడా అని భావిస్తే అక్కడే ఫిల్టర్ పేపర్పై పెట్రోల్ పోసి తనిఖీ చేసి చూపుతారు. అయితే అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటంతో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. కేసుల నమోదులో కూడా అంతంతమాత్రంగానే వ్యవహరిస్తూ...స్వలాభం కోసం అధికారులు వెంపర్లాడుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. పలు ఫిర్యాదులు మౌఖికంగా అందుతున్నటప్పటీకీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రికార్డుల పరిశీలనతోనే సరి జిల్లాలో భారీగా తనిఖీలు చేశామని చెబుతున్న అధికారులు కేవలం రికార్డులను నామమాత్రంగా పరిశీలించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుకున్న స్థాయిలో తనిఖీలు జరగటంలేదని సమాచారం. ఆయా శాఖలోని కొంత మంది కీలక వ్యక్తులు, సిబ్బంది తాము తనిఖీలకు వెళ్లే బంకులకు ముందుగానే సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో లీగల్ మెట్రాలజీ అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. డీజిల్ వినియోగం 6.80 లక్షల లీటర్లు 7న్యూస్రీల్జిల్లాలో పెట్రోలు బంకులు : 189 జిల్లాలోని పలు పెట్రోలు బంకుల్లో గోల్మాల్ రికార్డులు కూడా సరిగా నిర్వహించని యాజమాన్యాలు కొలతల్లోనూ తేడాలు కనీసం గాలి మిషన్లు లేని బంకులు ఎన్నో.. మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు నిల్ నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు -
‘రెడ్ బుక్’ రచయిత ఫోన్ కాల్ వలనే పోసాని విడుదల ఆలస్యం’
సాక్షి, గుంటూరు: రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టారని.. 24 రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జైలు నుంచి బెయిల్పై విడుదలైన పోసానిని అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారని.. ఆ వయసులో పోసానిని అలా తిప్పటం కన్నా శిక్ష ఇంకేం ఉంటుంది?’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి. పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. అంతమాత్రానికే కేసులు పెడతారా?. వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా?. మరి ఆయనపై ఎందుకు కేసులు ఎట్టలేదు?. అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదలేదిలేదు’’ అని అంబటి స్పష్టం చేశారు.పోలీసుల కన్నా మా న్యాయ వాదులు డబుల్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మేము వస్తాం. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టుల్లో ఇబ్బంది పడతారు జాగ్రత్త. మా లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. శవాలు దొరకట్లేదుగానీ లేకపోతే అన్యాయంగా మర్డర్ కేసు కూడా పెట్టేవారు. నారా లోకేష్ కాల్ చేయటం వలనే పోసాని విడుదల ఆలస్యం అయింది. లేకపోతే మధ్యాహ్నానికే పోసాని బయటకు వచ్చేవారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎంతోకాలం నడవవు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి విడుదల
గుంటూరు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ దక్కడంతో.. గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో.. వివిధ పోలీస్ స్టేషన్లకు.. కోర్టులకు.. జైళ్లకు.. తిప్పుతూ ఇబ్బంది పెట్టారు.వివిధ జిల్లాల్లో కేసుల నుంచి ఊరట లభించిందని అనుకునేలోపు.. అనూహ్యంగా సీఐడీ కేసు తెర మీదకు వచ్చింది. అయితే ఈ కేసులోనూ ఆయన నిన్న(శుక్రవారం మార్చి 21) ఊరట దక్కింది. సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే..జిల్లా జైలుకు చేరిన రిలిజింగ్ ఆర్డర్స్ చేరడం ఆలస్యమైంది. ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడం.. ప్రక్రియలన్నీ ఈ ఉదయాన్నే పూర్తవటంతో.. రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమైంది. మరోవైపు కోర్టుకు చేరుకున్న పోసాని న్యాయవాదులు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్లో కేసు.. బెయిల్కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్సీఐడీ పెట్టిన కేసు.. బెయిల్ మంజూరు -
తొలియత్నంలోనే గ్రూప్-1లో విజయం
అకుంఠిత దీక్షతో గెలుపుతీరాలను చేరొచ్చని నిరూపించారు భానోదయ. తండ్రి మరణించినా ఆమె కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో.. తల్లి ప్రోత్సాహంతో ముందడుగు వేశారు. తన కోసం తల్లి పడే కష్టాన్ని చూసి చదువుతోపాటు కూచిపూడి నృత్యంపైనా శ్రద్ధపెట్టారు. నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చలించిన ఆమె వాటి నివారణకు తనవంతు కృషి చేయాలని తలంచి గ్రూప్-1కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె పూర్తి పేరు గొందేశి భానోదయ.లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): విశాఖ ప్రాంతానికి చెందిన గొందేశి భానోదయ తండ్రి రమణారెడ్డి స్టీల్ ప్లాంటులో చిరుద్యోగి. ఈమెకు తల్లి, ఓ సోదరి కూడా ఉన్నారు. చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంపై అభిరుచితో తర్ఫీదు పొందారు. సిలికాన్ ఆంధ్ర సంస్థ వెయ్యి మందితో నిర్వహించిన నృత్య పోటీలో భానోదయ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2011లో గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకున్నారు. 2012లో కూచిపూడిలో డిప్లమా సాధించారు. 2013లో తండ్రి మరణించడంతో తల్లి వెంకటలక్ష్మి ఇంటి బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇద్దరు కూతుళ్ల విద్యాభ్యాసంపై దృష్టిపె ట్టారు. తల్లి ప్రోత్సాహంతో 2018లో ఎంఏ పూర్తిచేసిన భానోదయ సివిల్స్ సర్వీసెస్ కు శిక్షణ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 మెయిన్స్ పూర్తిచేశారు. రిజల్ట్ పెండింగ్ పడింది. 2020లో హైదరాబాద్ లో నిర్మాణ రంగ వ్యాపారం చేస్తున్న రామ్మనోహర్తో పెళ్లయింది. 2022లో గ్రూప్-1 ఫలితాలు వచ్చాయి. భానోదయ విజయం సాధించారు. డీఎస్పీగా శిక్షణ పూర్తిచేసుకుని తొలుత గ్రేహౌండ్స్లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. భానోదయ దంపతులకు మూడేళ్ల కూమార్తె జుషరిత ఉన్నారు.తల్లి, భర్త ప్రోత్సాహంతోనే -ఈస్థాయికి..సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధ కలిగిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు నా వంతు కృషి చేయాలని పోలీస్ శాఖ వైపు అడుగులు వేశా. నా తల్లి వెంకట లక్ష్మి నా భర్త రామ్మనోహర్ ప్రోత్సాహంతో ఈస్థాయికి వచ్చా. యువత దృఢమైన ఆశయంతో కష్టపడితే గెలుపు తీరాలకు చేరడం సులువే.- గొందేశి భానోదయ, సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ -
డీలిమిటేషన్పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. -
నేడు గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల
సాక్షి, గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు జిల్లా జైలుకు రిలిజింగ్ ఆర్డర్స్ చేరాయి. వాస్తవానికి నిన్ననే పోసానికి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడంతో ఆయన విడుదల కావడం ఆలస్యమైంది. తాజాగా ప్రక్రియలన్నీ పూర్తవటంతో జిల్లా జైలుకు విడుదల ఆర్డర్ వచ్చింది.కూటమి సర్కార్.. పోసానిపై అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. కక్ష సాధింపుతో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశారు. పిటీ వారెంట్ పేరుతో పోలీసులు.. ఆయన్ను రాష్ట్రమంతా తిప్పారు. దీంతో, ఆయన కోర్టును ఆశ్రయించగా.. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ను మంజూరు చేసింది. కాగా, బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇక, పోసాని బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా.. న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు..ఏపీ పోలీసులు ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించింది. -
ఆచార్య కృపాచారికి పరిశోధక గురు పురస్కారం
తెనాలి: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత ఆచార్యుడు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పరిశోధక గురువుగా చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రముఖ రచయిత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. స్థానిక చెంచుపేట డొంకరోడ్డులోని ఆచార్య కృపాచారి నివాసానికి శుక్రవారం ఆచార్య ఇనాక్ వచ్చారు. పరిశోధక గురు పేరుతో కొలకలూరి పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఏటా ప్రదానం చేస్తున్న కొలకలూరి పురస్కారాలను రచయితలతోపాటు పరిశోధకులు, పరిశోధక గురువుకు కూడా అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో పరిశోధక గురు అవార్డుకు కృపాచారిని ఎంపిక చేశామని తెలిపారు. ఆరోగ్య కారణాలతో హైదరాబాద్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ సభకు కృపాచారి హాజరుకాలేకపోయారని చెప్పారు. అందుచేత తానే స్వయంగా తెనాలి వచ్చి కృపాచారికి ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ఆచార్య ఇనాక్ వివరించారు. కృపాచారి పర్యవేక్షణలో 75 మంది పీహెచ్డీలు, 68 మంది ఎంఫిల్ చేసినట్టు గుర్తుచేశారు. పలు విశ్వవిద్యాలయాలకు 45 పాఠ్యగ్రంథాలను అందించారనీ, పలు అవార్డులను స్వీకరించారని గుర్తుచేశారు. పురస్కారం స్వీకరించటంపై కృపాచారి సంతోషాన్ని ప్రకటించారు. -
విజ్ఞాన్ నిరులోత్సవ్–2కే25 ప్రారంభం
గుంటూరు రూరల్: విద్యార్థులు ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని ఏపీఎస్సీహెచ్ఈ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్) చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి చెప్పారు. పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాతీయస్థాయి టెక్ ఒడిస్సీ, కల్చరల్ కాస్కేడ్, క్రియేటివ్ కాన్వస్, వర్డ్ సింఫణీ, బిజినెస్ పరేడ్, చిల్ థ్రిల్, స్పోర్ట్స్ ఫెస్ట్ నిరులోత్సవ్–2కే25ను శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు చేశారు. ఐబీఎం ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ టెక్నికల్ టీమ్ లీడర్, విజ్ఞాన్ నిరుల పూర్వ విద్యార్థి నారేడ్ల లావణ్య మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వాళ్లే జీవితంలో నిలబడతారని చెప్పారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, గౌరవ అతిథిగా యాంకర్, యాక్టర్ విజ్ఞాన్ పూర్వ విద్యార్థి ప్రదీప్ మాచిరాజు రానున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. ఫెస్ట్కు సుమారుగా 200 కళాశాలల నుంచి 15 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. అనంతరం 45కుపైగా అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను యాజమాన్య ప్రతినిధులు సన్మానించారు. -
గజేంద్ర మోక్షం అలంకారంలో నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్ధాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం గజేంద్ర మోక్షం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శేషగిరిరావు, కల్యాణిలు వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ తిరుమలరావు, తాడికొండ సాయికుమార్ వ్యవహరించారు. శనివారం స్వామి పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు. -
కూటమి నేతలకు తొత్తులుగా అధికార యంత్రాంగం
గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి తాడేపల్లిరూరల్: కూటమి నేతలు చెప్పినట్టు అధికారులు పనిచేస్తున్నారని, తక్షణమే వారి తీరు మార్చుకోవాలని వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి హితవు పలికారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంపై శుక్రవారం మరోసారి తాడేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబం, మహిళా నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలపై ఫేస్బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా మాట్లాడుతూ, ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ముగిసిన ఏఎన్యూ ఇంటర్ కాలేజియేట్ బేస్బాల్ మెన్ టోర్నీ
గుంటూరు రూరల్: క్రీడా స్ఫూర్తి జీవితంలో ఉన్నస్థాయికి చేరుస్తుందని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బేస్ బాల్ (మెన్) టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఆర్వీఆర్జేసీ కళాశాల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. రన్నర్ ట్రోఫీని ఏఎన్యూ ఫిజికల్ కళాశాల జట్టు సాధించింది. తృతీయ స్థానంలో ఎమ్ఏఎమ్ పిజి కాలేజీ, నాలుగో స్థానంలో సిఆర్ కాలేజీ జట్లు నిలిచి ట్రోఫీలను అందుకున్నాయి. టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్యూ సాఫ్ట్ బాల్ (మెన్) జట్టును సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్ డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పి. గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఏఎన్యూ టోర్నమెంట్ ఆబ్సర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఎమ్ బుచ్చిబాబు, డాక్టర్ రాజామెరిసిన్బాబు, జె.ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
స్థల వివాదం నేపథ్యంలో ఇంటిపై దాడి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): స్థల వివాదం నేపథ్యంలో ఓ ఇంటిపై కొందరు దాడి చేసి ఇంటిని, ఇంట్లోని గృహోపకరణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారం శాంతినగర్ 4వ లైన్లో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. శాంతినగర్లోని ఇంటిలో జాజుల ఏడుకొండలు, అతని భార్య తిరుపతమ్మ ఉంటారు. వీరికి నలుగురు సంతానం. అదే ఇంట్లో అతని తమ్ముడు జాజుల బాల నరసింహారావు, అతని భార్య నాగమణి కూడా నివాసం ఉంటారు. ఏడుకొండలు ఫైనాన్స్, గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. 2021లో శాంతినగర్ 4వ లైన్లో 216 గజాల స్థలం శ్రీనివాసరావుపేటకు చెందిన కాశీవిశ్వనాథ్ కుమారుడు రవీంద్రబాబు వద్ద ఏడుకొండలు కొని ఇల్లు కట్టాడు. రవీంద్రబాబుకు శ్రీనివాసరావుపేటకు చెందిన పెడమల్లు భాస్కర్ల మధ్య కోర్టులో స్థల వివాదం నడుస్తోంది. 2018లో రవీంద్రబాబుపై భాస్కర్ కోర్టులో గెలిచారు. 2021లో స్థలాన్ని రవీంద్రబాబు వద్ద నుంచి కొన్న ఏడుకొండలును ఇల్లు ఖాళీ చేయాలంటూ మల్లు భాస్కర్ వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. శుక్రవారం ఏడుకొండలు, భార్య తిరుపతమ్మ బయటకు వెళ్లగా ఇంట్లో ఏడుకొండలు తమ్ముడు బాలనరసింహారావు, అతని భార్య నాగమణి ఉన్నారు. పెడమల్లు భాస్కర్ ఆయన సతీమణి భూలక్ష్మి పల్నాడు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుచరులు అయిన ఆలపాటి నాని, అశోక్లతోపాటు సుమారు 30 మందితో ఇంటిపైకి వచ్చి దాడి చేసి ఇంటిని, ఇంట్లో ఉన్న గృహోపకరణాలు ధ్వంసం చేశారు. బాధితులు 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగరంపాలెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని అందరినీ అక్కడి నుంచి తరిమేసి పెద్దమల్లు భాస్కర్ని అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితులు తేరుకొని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఇల్లు, ఇంట్లో గృహోపకరణాలు ధ్వంసం నిందితులు అధికారపార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా గుర్తింపు ! పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు -
24న రవాణా రంగ కార్మికుల ‘చలో పార్లమెంట్’
లక్ష్మీపురం: ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 24న చలో పార్లమెంట్ చేపట్టినట్లు సంఘ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని ఆటో స్టాండ్ల వద్ద ‘చలో పార్లమెంట్’ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రవాణా రంగంపై పెద్ద ఎత్తున దాడి ప్రారంభించిందని ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 106(1), (2)ను తీసుకురావడం చిన్న చిన్న తప్పిదాలకు కూడా డ్రైవర్లలను బాధ్యులు చేయటం భారీ శిక్షలు, జరిమానాలు విధించడం వంటి చర్యలు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం కార్మికులపై అదనపు భారాన్ని మోపడమేనని ఆవేదన చెందారు. రాష్ట్రంలో భారీ పెనాల్టీలు విధిస్తూ తీసుకొచ్చిన జీఓ నంబర్ 21నుతక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగర ఆటో డ్రైవర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసరావు, వెంకట్, జానీ పాల్గొన్నారు. -
1,21,706 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,12,589 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,21,706 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,200 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 51,200 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. జన గణనతోపాటే కులగణన జరపాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మంగళగిరి: జనగణనతోపాటే సమగ్ర కులగణన జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబీసీల ప్రధాన డిమాండ్లపై జాతీయస్థాయిలో ఈ నెల 24,25,26 తేదీలలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ కోటాలో ఓబీసీ మహిళల సబ్ కోటా చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీల ప్రధాన డిమాండ్లపై 24న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సమగ్ర కుల గణనలో జాప్యాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద 25న ధర్నా చేపడతామన్నారు. 26న ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జంతర్మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మరి క్రాంతికుమార్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉప్పాల శివలక్ష్మి, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పత్తి ఉత్పత్తిని పెంచేందుకు కృషి జరగాలి
గుంటూరు రూరల్: దేశంలో పత్తి పంట ఉత్పత్తి పెంచేలా కృషి జరగాలని వక్తలు అభిప్రాయపడ్డారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఎన్జీ రంగా వర్సిటీలో ఐసీఏఆర్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ (ఐసీఏఆర్– సీఐసీఆర్), వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పత్తి వార్షిక సమూహ సమావేశం (ఏజీఎమ్) 2025ను శుక్రవారం ప్రారంభించారు. మూడురోజులపాటు జరిగే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు ముఖ్య భాగస్వాములు హాజరయ్యారు. పత్తి ఉత్పత్తి పెంపుపై చర్చించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి అధ్యక్షత వహించారు. ఆమె పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో బీటీ పత్తి కీలకపాత్ర పోషించినట్టు వివరించారు. వర్సిటీ విడుదల చేసిన నరసింహ (ఎన్ఏ–1325) పత్తి రకం విజయ ప్రస్థానం గురించి చెప్పారు. పత్తి రైతుల నికర ఆదాయాన్ని గణనీయంగా పెంచడంలో ఇది దోహదపడిందని తెలిపారు. డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో పత్తి ఉత్పత్తి పెంపునకు కృషి జరగాలని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్, సిఐసిఆర్ నాగపూర్ సంచాలకులు డాక్టర్ వైజి ప్రసాద్, ఐసీఏఆర్, సీఐఆర్సీఓటీ ముంబై డైరెక్టర్ డాక్టర్ ఎస్కే శుక్లా, ఐసీఏఆర్ పంట శాస్త్ర విభాగం సహాయ డైరెక్టర్ జనరల్ (వాణిజ్య పంటలు) డాక్టర్ ప్రశాంతకుమార్దాస్, పత్తి ప్రాజెక్ట్ పర్యవేక్షణ, సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ సిడి మాయీ తదితరులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పత్తిపంట అఖిల భారత వార్షిక సమూహ సమావేశంలో వక్తలు -
24న శాంతియుత నిరసన
గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో దీర్ఘకాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మార్చి 24న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసన తెలియజేయనున్నట్లు ఎన్టీఆర్ వైద్య మిత్ర అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరులోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త (డీసీ) ఆఫీసుల వద్ద విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈనెల 27న మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆఫీస్ వద్ద గాంధేయ పద్ధతిలో శాంతియుత నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిద్దాం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి తెనాలిఅర్బన్: ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కొర్ర విజయలక్ష్మి సూచించారు. మలేరియా విభాగం ఆధ్వర్యంలో నరేంద్రదేవ్ కాలనీలో శుక్రవారం దోమలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల నివారణ గురించి వివరించారు. జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ జ్వర లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స పొందాలని సూచించారు. -
మేము చాలా ప్రమాదంలో ఉన్నాం
తాడేపల్లిరూరల్: చాలా ప్రమాదంలో ఉన్నామని, గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేస్తున్నారని గుంటూరు ఎస్పీ సతీష్కుమార్ ఎదుట నులకపేట ప్రజలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఎస్పీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేని ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం విలేకరులతో ఎస్పీ మాట్లాడుతుండగా స్థానిక మహిళలు వచ్చి ఆయనకు తమ గోడు విన్నవించుకున్నారు. గంజాయి మత్తులో యువకులు రోడ్లపై ద్విచక్రవాహనాలు వేసుకుని హల్చల్ చేస్తున్నారని, ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. తలుపులు వేసుకుని ఇంటి గేటుకు తాళం వేసుకుని ఇంట్లో ఉన్నా ఎక్కడెక్కడి నుంచో యువకులు వచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చే విద్యార్థినులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరిస్తున్నారని వివరించారు. పోలీసులు ప్రధాన వీధుల్లోనే రాత్రి గస్తీ తిరుగుతున్నారని, లోపల వీధుల్లోకి రావడం లేదని పేర్కొన్నారు. స్పందించిన ఎస్పీ మాట్లాడుతూ గంజాయి మూకలపై చర్యలు తీసుకుంటామని వివరించారు. రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సరైన పత్రాలు లేని 23 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. తనిఖీల్లో అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ కళ్యాణ్రాజు, ఎస్ఐలు ఖాజావలి, శ్రీనివాసరావు, నార్త్ సబ్ డివిజన్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేస్తున్నారు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు ఎస్పీ వద్ద నులకపేట ప్రజల ఆవేదన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ -
మందుల దుకాణాలపై దాడులు
నరసరావుపేటటౌన్: పట్టణంలోని పలు మందుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా బరంపేటలోని భాగ్యశ్రీ మెడికల్ ఏజెన్సీ దుకాణంలో మొదట తనిఖీలు నిర్వహించారు. దుకాణానికి సంబంధించి రిక్షా సెంటర్ సమీపంలో ఇళ్ల మధ్య ఉన్న గోదాంలో సోదాలు చేపట్టారు. అనుమతులు లేకుండా భారీ స్థాయిలో మందులు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించింది. మందులను సీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఫిజీషియన్ శాంపిల్స్ ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్ సీఐ పి. రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెనన్స్ ఏఈఈ శివనారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమతులు లేకుండా గోదాం నిర్వాహణ భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం దాడుల్లో పాల్గొన్న విజిలెన్స్, డ్రగ్స్ అధికారులు -
చట్టాలపై విదార్థులకు అవగాహన అవసరం
నరసరావుపేట టౌన్: చట్టాలపై విదార్థులకు కూడా అవగాహన అవసరమని ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కె. మధుస్వామి తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శుక్రవారం సెల్ఫ్ డిఫెన్స్, పోక్సో చట్టం తదితర అంశాలపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మధుస్వామి పోక్సో చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను తెలియజేశారు. రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య ఎదురైనా సంకోచించకుండా డయల్ 100కు గానీ, స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థలో గానీ సంప్రదించాలని సూచించారు. విద్యార్థి దశలో కష్టపడి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరేలా కృషి చేయాలని ఆయన తెలిపారు. తొలుత పట్టణ ఎస్ఐ అరుణ మాట్లాడుతూ మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచమని పేర్కొన్నారు. ప్రతి మహిళా ఫోన్లో నిక్షిప్తం చేసుకొని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని సూచించారు. తొలుత న్యాయ మూర్తి హాస్టల్ వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెనూను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్లు ఎన్. జయప్రద, జయలక్ష్మి పాల్గొన్నారు. -
గుంటూరు తాత్కాలిక మేయర్గా షేక్ సజీల
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 15న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు డెప్యూటీ మేయర్ షేక్ సజీల తాత్కాలిక మేయర్గా బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవిల సమక్షంలో సజీల తాత్కాలిక మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజీల మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మేయర్ రాజీనామాతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సజీల మేయర్గా బాధ్యతలు తీసుకున్నారని, త్వరలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రెగ్యులర్ మేయర్ ఎన్నికకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈనెల 25న గత మేయర్ రాజీనామా ఆమోదం కోసం అత్యవసర సమావేశం జరుగుతుందని వెల్లడించారు. -
ప్రమాదాలతో.. ఊయలూగుతూ..
పట్నంబజారు: రంగుల హరివిల్లును అందంగా ఆవిష్కరించే కళాకారులు వారు.. అందమైన బొమ్మలను సుమనోహరంగా తీర్చిదిద్దే అపరబ్రహ్మలు పెయింటర్లు. ఏ శుభకార్యమైనా ఇంటిని రంగులతో అలంకరించాలని కోరుకుంటాం అభిమాన నాయకుడు, హీరోపై ప్రేమను చాటేలా, దేవుని తిరునాళ్ల సందర్భంగా భక్తిపారవశ్యం ఉప్పొంగేలా బ్యానర్లు కట్టాలని భావిస్తాం. ఈ పనులకు మనకు తొలుత గుర్తొచ్చేది పెయింటర్లే. ఈ వృత్తికి గతంలో బాగా డిమాండ్ ఉండేది. గుంటూరు జిల్లాలో సుమారుగా 30వేల మందికిపైగానే పెయింటర్లు ఉన్నారు. గుంటూరు నగరంలో సుమారు 10వేల మందికిపైగా ఉండవచ్చని పెయింటర్ అసోసియేషన్ల అంచనా. అయితే కొన్నేళ్లుగా వీరి వృత్తి సజావుగా సాగడం లేదు. అధునాతన యంత్రాలతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తుండడంతో స్థానిక పెయింటర్ల ఉపాధికి గండి పడుతోంది. ఫలితంగా కుటుంబాలు పోషించుకోలేని దైన్యంలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. యాంత్రీకరణతోనే నష్టం గతంలో సాధారణ ఇంటి నుంచి రెండు, మూడు అంతస్తుల భవనాలు, బహుళ వ్యాపార సముదాయాలకూ పెయింటర్లే రంగులు వేసేవారు. ఫలితంగా ఏడాదిలో ఆరు నెలల పాటు వీరికి పుష్కలంగా పని దొరికేది. అయితే ఇప్పుడు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. రంగుల నుంచి రకరకాల డిజైన్లను యంత్రాలే వేసేస్తున్నాయి. దీంతో పెయింటర్లకు పని దొరకడం లేదు. అరకొరగా పని దొరికినా ఉదయం నుంచి చీకటి పడే వరకు రంగులు వేసినా రూ.600 నుంచి రూ.700 కూలి రావడం గగనమైంది. అది కూడా ఏడాదిలో కేవలం రెండు, మూడు నెలలే పనులు ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణాల సమయంలో రంగులు వేసే పనులను తాపీ మేసీ్త్రలే ఒప్పుకోవడం కూడా పెయింటర్ల జీవనాన్ని దెబ్బతీస్తోంది. దీనికి తోడు కంప్యూటర్పై ఫ్లెక్సీలు తయారు చేసే వ్యవస్థ రావటంతో బ్యానర్లపై బొమ్మలు, పెయింటింగ్లు వేసే పరిస్థితి దాదాపు కనుమరుగైంది. ప్రత్యామ్నాయం వైపు,, పనులు లేకపోవడంతో పెయింటర్లు ప్రత్యామ్నాయ వృత్తులవైపు మళ్లుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రంగుల షాపులు, కిరాణా దుకాణాల్లో గుమాస్తాలుగా చేరుతున్నారు. పూల దుకాణాల్లో కూలీలుగా బార్లలో వెయిటర్లుగా మారుతున్నారు. వృత్తిని నమ్ముకుని బతుకుతున్నాం ఎన్నోఏళ్ల నుంచి పెయింటింగ్ వృత్తిని నమ్ముకున్నాం. ఆధునిక యంత్రాల రంగప్రవేశంతో పనులు దొరకడం లేదు. ఆకలికేకలు తప్పడం లేదు. ప్రభుత్వమే మమ్మలను ఆదుకోవాలి. – షేక్ బాషా, పెయింటర్ పింఛన్లు, గృహాలు మంజూరు చేయాలి ఈ వృత్తి ద్వారా కుటుంబ పోషణ భారమవుతోంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని రుణాలు మంజూరు చేయాలి. ఈ డబ్బుతో యంత్రాలు కొనుక్కుని జీవనోపాధి పొందుతాం. పింఛన్లు, గృహాలు ఇచ్చి మా సంక్షేమానికి కృషి చేయాలి. – ఎస్.రాము, పెయింటర్ బహుళ అంతస్తుల భవనాలకు రంగులు వేయడం ఓ సాహసమే. తాళ్ల సాయంతో గాలిలో ఊగుతూ రంగులు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం మెండుగా ఉంది. రంగులు వేసే క్రమంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ప్రాణాలకు తెగించి పెయింటింగ్ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు ఇప్పుడు ఆకలికేకలతో ఆర్తనాదాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల కులవృత్తులకు విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ పథకంలో పెయింటర్లను చేర్చకపోవడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెయింటర్ల సంక్షేమానికి కృషి చేయాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
ఆర్చరీ చాంపియన్ షిప్ ప్రారంభం
ఏఎన్యూ(గుంటూరు): ఏపీ ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న లెనిన్ ఓల్గా మెమోరియల్ అండర్–13, అండర్–10 ఆర్చరీ చాంపియన్షిప్ శుక్రవారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభకు ఏఎన్యూ వీసీ కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీసీ మాట్లాడుతూ ఆర్చరీ పోటీలకు ఏఎన్యూ వేదిక కావడం ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులో విలువిద్యకు వర్సిటీ పూర్తి సహకారం అదిస్తుందన్నారు. ఏఎన్యూ రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్దికి యూనివర్సిటీలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం మాట్లాడుతూ ఆర్చరీ క్రీడను రానున్న రోజుల్లో ఏఎన్యూలో ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, నేషనల్ జడ్జి బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ చాంఫియన్షిప్లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి అండర్–13 విభాగంలో 700 మంది ఆర్చర్లు (బాలురు, బాలికలు) పాల్గొంటున్నారు. తొలిరోజు రికర్వ్. కాంపౌండ్, ఇండియన్ రౌండ్ విభాగాలలో ర్యాంకింగ్ పోటీలు జరిగాయి. -
గోకులాల నిర్మాణాలు వేగవంతం చేస్తాం
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మినీ గోకులాల నిర్మాణాలు నిర్దేశించిన సమయంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వర్చువల్గా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 390 మినీ గోకులాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో 284 నిర్మాణాలు పూర్తి చేసామన్నారు. మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల చివరి నాటికి మొత్తం పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ జ్యోతిబసు, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ శంకర్ అధికారులు పాల్గొన్నారు. -
పోసానికి బెయిల్ మంజూరు
గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు.. ఆపై వేధింపులుకాగా, ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 19 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. -
వైఎస్ జగన్పై పోస్టులు పెడితే సహించం
తాడేపల్లిరూరల్ : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సహించేది లేదని వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై, మాజీ మంత్రి రోజాపై అసభ్య పోస్టులు పెట్టిన కొందరిపై గురువారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే క్షణాల్లో కేసులు నమోదు చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితో ప్రతిపక్ష నేతలను పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఇప్పటి వరకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీల రాష్ట్ర అధ్యక్షులు కొండమడుగుల సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ నారాయణ రెడ్డి, ముదిగొండ ప్రకాష్, గంజి షణ్ముఖ, నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. పోలీసులు పక్షపాతం వహిస్తున్నారు ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగనారాయణ మూర్తి -
జాతీయ రహదారి భూముల పరిశీలన
ఫిరంగిపురం: నేషనల్ హైవే అథారిటీ ఇండియా ఆదేశాల మేరకు వినుకొండ నుంచి గుంటూరు జాతీయ రహదారి నంబరు 544డీని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు సేకరించే భూములను గురువారం జాయింట్ కలెక్టర్ భార్గవ్తేజ పరిశీలించారు. పొనుగుపాడు, మేరికపూడి, రేపూడి, నుదురుపాడు, వేమవరం, ఫిరంగిపురం, అమీనాబాద్ గ్రామాల్లోని భూములను చూసి రైతులతో మాట్లాడారు. సర్వే చేసే విషయం గురించి వారికి అవగాహన కల్పించారు. ఆయన వెంట తహసీల్దార్ జె.ప్రసాదరావు, సర్వేయర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ అబ్దుల్ రెహమాన్, ఆయాగ్రామాల వీఆర్వోలు, వీఆర్ఏలు, సర్వేయర్లు పాల్గొన్నారు. మేడికొండూరు మండలంలో.. మేడికొండూరు: మండలంలోని డోకిపర్రు, మంగళగిరిపాడు, మేడికొండూరు ప్రాంతాల్లో నూ భూములను జేసీ పరిశీలించారు. రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మేడికొండూరు తహసీల్దార్ ఎం.హరిబాబు, మండల సర్వేయర్ కె.సాంబశివరావు పాల్గొన్నారు. 1,48,601 బస్తాల మిర్చి విక్రయంకొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,42,015 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,48,601 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,200 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 60,317 బస్తాలు నిల్వ ఉంది. -
మిర్చి యార్డులో వ్యాపారులకు లైసెన్సు తప్పనిసరి
● జీరో, కటింగ్ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట ● మల్టిపుల్ లైసెన్స్దారులపై చర్యలు ● ఇప్పటికే 134 మందిని గుర్తించాం ● మరో 27 మంది జాబితా తయారు చేశాం ● మరోసారి తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం ● నిర్లక్ష్య ధోరణి, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు ● మార్కెటింగ్శాఖ రాష్ట్ర కమిషనర్ విజయ సునీత కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని మార్కెటింగ్శాఖ రాష్ట్ర కమిషనర్ ఎం.విజయ సునీత స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా మిర్చి వ్యాపారం చేసే వారి వల్ల ధర ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మార్కెటింగ్శాఖ విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావుతో కలిసి యార్డు అధికారులు, సిబ్బందితో గురువారం విజయ సునీత సమీక్ష నిర్వహించారు. ఒకే కుటుంబంలో రెండు, మూడు లైసెన్స్లు ఎలా ఇచ్చారని అధికారులు, సిబ్బందిని వివరణ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా యార్డులో జరిగిన, జరుగుతున్న అక్రమాలు, జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం, మచ్చు కాయల దోపిడీపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ నిర్లక్ష్య ధోరణి గల, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యార్డులో జరుగుతున్న వ్యవహారాలకు అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. యార్డులో లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించే వారిపై.. వ్యాపారం చేస్తూ చేయనట్టు చూపించే వారిపై.. గత రెండు, మూడు నెలలుగా తాము అడుగుతున్న సమాచారం ఇవ్వని దిగుమతి, ఎగుమతి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో మల్టిపుల్ లైసెన్స్లు కలిగి చట్టబద్ధంగా వ్యాపారం చేయకుండా ఐటీ ఎగ్గొట్టే ధోరణితో వ్యవహరిస్తున్న మిర్చి కమీషన్ ఏజంట్స్పై దృష్టి సారించడంతో పాటు వారి జాబితాను రూపొందించామని చెప్పారు. వాటన్నింటినీ క్రాస్ చెక్ చేసి 134 మందిని తేల్చామని పేర్కొన్నారు. దీంతోపాటు మరో 27 మంది జాబితా కూడా తయారు చేశామన్నారు. వీటన్నింటినీ మరోసారి క్రాస్ చెక్ చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి జాబితా రూపొందిస్తున్నట్లు వివరించారు. యార్డులో జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట వేసి యార్డును మరింత ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డులో వ్యాపారం చేసే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని ఆదేశించారు. గుంటూరు యార్డుకు కర్ణాటక రాష్ట్రం నుంచి అధికంగా మిర్చి బస్తాలు రావడం కారణంగా లోకల్ ఉత్పత్తిపై ఆ ప్రభావం పడి మిర్చి ధర తగ్గే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. అధికారులు, వ్యాపారులు, సిబ్బంది అందరూ కలసికట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించి మిర్చి రైతులకు మంచి ధర కల్పించేలా చూడాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్, మార్కెటింగ్శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు బి.రాజబాబు, మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం, అసిస్టెంట్ ఇన్చార్జి శ్రీకాంత్, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
అమరేశ్వరుడికి వేలం పాటల ద్వారా రూ.54.22 లక్షల ఆదాయం
అమరావతి: అమరేశ్వరుడికి వేలం పాటల ద్వారా రూ.54.22 లక్షలు ఆదాయం వచ్చింది. ఆలయంలో దుకాణాలకు గురువారం బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సునీల్కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2026 మార్చి 31 వరకు పాటదారులు వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఆలయంలో కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడాన్ని రూ. 9.51లక్షలకు, ఆవరణలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్ముకునేందుకు రూ.17.20లక్షలు, పార్కింగ్ రుసుం వసూలును రూ.10.61లక్షలకు, బొమ్మలు అమ్ముకునే హక్కుకు రూ.3.90 లక్షలకు, నదీ తీరంలో కూల్డ్రింక్స్ షాపునకు రూ.9.9లక్షలకు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు రూ. 2.66 లక్షలకు, తలనీలాలకు రూ. 20వేలు, మొదటి ప్రాకారంలో కూల్డ్రింక్స్ షాపు నిర్వహణకు రూ. 1.5లక్షలకు పాడుకున్నట్లు ఆయన వివరించారు. స్వామికి ఆదాయం గత ఏడాది రూ. 49.44 లక్షలు రాగా ఈ ఏడాది రూ.54.22 లక్షలు వచ్చినట్లు చెప్పారు. గత ఏదాది కంటే రూ.4.78 లక్షలు అధికంగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సిండికేట్తో ఆదాయానికి గండి పాటదారులు సిండికేట్ కావడంతో అమరేశ్వరుని ఆదాయానికి గండిపడింది. ఒకటి, రెండు వ్యాపారాలకు తప్పా మిగిలిన అన్నింటిలో పాటదారులు సిండికేట్ అయ్యారు. అధికారులు కూడా పార్కింగ్, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కుకు అధిక మొత్తంలో పాట పెంచారు. మిగిలిన వ్యాపారాలకు తక్కువ మొత్తంలో పెంచి మమ అనిపించారు. ఈ విధంగా దేవుని ఆదాయానికి గండి కొట్టటం దారుణమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. -
మిర్చి యార్డులో వ్యాపారులకు లైసెన్సు తప్పనిసరి
● జీరో, కటింగ్ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట ● మల్టిపుల్ లైసెన్స్దారులపై చర్యలు ● ఇప్పటికే 134 మందిని గుర్తించాం ● మరో 27 మంది జాబితా తయారు చేశాం ● మరోసారి తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం ● నిర్లక్ష్య ధోరణి, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు ● మార్కెటింగ్శాఖ రాష్ట్ర కమిషనర్ విజయ సునీత కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని మార్కెటింగ్శాఖ రాష్ట్ర కమిషనర్ ఎం.విజయ సునీత స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా మిర్చి వ్యాపారం చేసే వారి వల్ల ధర ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మార్కెటింగ్శాఖ విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావుతో కలిసి యార్డు అధికారులు, సిబ్బందితో గురువారం విజయ సునీత సమీక్ష నిర్వహించారు. ఒకే కుటుంబంలో రెండు, మూడు లైసెన్స్లు ఎలా ఇచ్చారని అధికారులు, సిబ్బందిని వివరణ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా యార్డులో జరిగిన, జరుగుతున్న అక్రమాలు, జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం, మచ్చు కాయల దోపిడీపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ నిర్లక్ష్య ధోరణి గల, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యార్డులో జరుగుతున్న వ్యవహారాలకు అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. యార్డులో లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించే వారిపై.. వ్యాపారం చేస్తూ చేయనట్టు చూపించే వారిపై.. గత రెండు, మూడు నెలలుగా తాము అడుగుతున్న సమాచారం ఇవ్వని దిగుమతి, ఎగుమతి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో మల్టిపుల్ లైసెన్స్లు కలిగి చట్టబద్ధంగా వ్యాపారం చేయకుండా ఐటీ ఎగ్గొట్టే ధోరణితో వ్యవహరిస్తున్న మిర్చి కమీషన్ ఏజంట్స్పై దృష్టి సారించడంతో పాటు వారి జాబితాను రూపొందించామని చెప్పారు. వాటన్నింటినీ క్రాస్ చెక్ చేసి 134 మందిని తేల్చామని పేర్కొన్నారు. దీంతోపాటు మరో 27 మంది జాబితా కూడా తయారు చేశామన్నారు. వీటన్నింటినీ మరోసారి క్రాస్ చెక్ చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి జాబితా రూపొందిస్తున్నట్లు వివరించారు. యార్డులో జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట వేసి యార్డును మరింత ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డులో వ్యాపారం చేసే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని ఆదేశించారు. గుంటూరు యార్డుకు కర్ణాటక రాష్ట్రం నుంచి అధికంగా మిర్చి బస్తాలు రావడం కారణంగా లోకల్ ఉత్పత్తిపై ఆ ప్రభావం పడి మిర్చి ధర తగ్గే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. అధికారులు, వ్యాపారులు, సిబ్బంది అందరూ కలసికట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించి మిర్చి రైతులకు మంచి ధర కల్పించేలా చూడాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్, మార్కెటింగ్శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు బి.రాజబాబు, మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం, అసిస్టెంట్ ఇన్చార్జి శ్రీకాంత్, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన ‘పచ్చ’ నేత
నకరికల్లు: అధికార అహంకారంతో తమ గుడిసెలను కూల్చేసిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. గుడిసెలు కూలగొట్టి భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని మండలంలోని బాలాజీనగర్ తండాకు చెందిన పలువురు సుగాలీలు పీడీఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుటఽ ఆందోళనకు దిగారు. బాధితుల తరఫున పీడీఎం పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి మాట్లాడారు. తండాకు చెందిన 37 సుగాలి కుటుంబాలకు మూడు సెంట్లు చొప్పున 1989లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అంతా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాట్రావత్ సాంబయ్య నాయక్ 2022లో గుడిసెలకు నిప్పంటించాడు. అతనిపై కేసు నమోదు కాగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాడు. అనంతరం తిరిగి సుగాలీలకే పట్టాలు మంజూరు చేయాలని హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు అందాయి. దీంతో కొందరు తిరిగి గుడిసెలు నిర్మించుకొని నివాసముంటున్నారు. అప్పటి నుంచి ఊరుకున్న సాంబయ్య నాయక్ ప్రస్తుతం టీడీపీ అండతో, తండాలో ఎవరూలేని సమయం చూసుకొని పొక్లెయిన్తో గుడిసెలను కూలగొట్టాడు. దీంతో బాధితులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కోర్టు ఉత్తర్వుల ఉన్నప్పటికీ గుడిసెలు కూల్చిన సాంబయ్య నాయక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కె.పుల్లారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్.శివానాయక్, పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పి.రామునాయక్, పి.సాంబబాయి, కేతావత్ శ్రీరాములు నాయక్, వి.బాలసింగ్నాయక్, కె.కృష్ణనాయక్, కె.రమాదేవి, ఆర్.హనుమానాయక్, ఆర్.మణిబాయి పాల్గొన్నారు. అధికార అహంకారంతో పేదల గుడిసెలు కూల్చివేత ఆందోళనకు దిగిన బాధితులు కోర్టు ఆదేశాల మేరకు చర్యలు బాలాజీనగర్తండాకు చెందిన ఎస్టీలు ఇచ్చిన అర్జీని పరిశీలించాను. భూ సమస్యపై ఇరువర్గాలు హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – కె.పుల్లారావు, తహశీల్దార్, నకరికల్లు -
కార్మికులతో ఇదేమి ఆటో!
చంద్రబాబుకు డ్రైవర్లంటే చిన్నచూపు చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఆటో డ్రైవర్లంటే చిన్నచూపు. వీరి సంక్షేమం కోసం ఏ రోజూ ఆలోచించ లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తొమ్మిది నెలలు గడిచినా అమలు చేయలేదు. ప్రభుత్వ తీరుతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. – శేషగిరి పవన్కుమార్ (వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు) రవాణా రంగం నిర్వీర్యం ప్రైవేటు రైడ్ యాప్స్ వచ్చాక ఆటో డ్రైవర్లు బేరాలు లేక నష్టపోతున్నారు. రోజంతా తిరిగితే రూ.300 కూడా మిగలట్లేదు. భారీ జరిమానాలు చెల్లించలేకపోతున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.10 వేలు వాహనమిత్ర ద్వారా ఇచ్చేది. ఈ సర్కారు రూపాయి సాయం చేయలేదు. పైగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. – షేక్ సంధాని, ఆటోడ్రైవర్, గుంటూరు ఉపాధికి గండి ప్రైవేట్ రైడ్ యాప్స్ వచ్చాక ఆటో డ్రైవర్ల ఉపాధికి గండిపడింది. భారీ జరిమానాలూ కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం మా సంక్షేమంపై దృష్టి సారించాలి. ఎన్నికల హామీలు నెరవేర్చాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగా వాహనమిత్ర అమలు చేస్తే కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. – ఎస్.నరసింహారావు, ఆటోడ్రైవర్, గుంటూరు పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. కార్మికులు, ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. అధికారంలోకి రాగానే వాహనమిత్ర అందిస్తామని డ్రైవర్లను నమ్మించింది. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఆ సంగతే మాట్లాడడం లేదు. గుంటూరు జిల్లాలో సుమారు 25 వేలకుపైగా ఆటోలు ఉంటాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆటో, కారు డ్రైవర్ల సంక్షేమానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. ఏటా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ 10 వేల ఆర్ధిక సాయాన్ని అందించి ఆదుకున్నారు. ఈ మొత్తాన్ని ఆటోవాలాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ), ఇన్సూరెన్స్, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునేవారు. దీంతో పాటు నవరత్నాల ద్వారా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలూ డ్రైవర్ల కుటుంబాలకు అందేవి. అయితే గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మబలికారు. వాహనమిత్ర కూడా అమలు చేస్తామని చెప్పారు. అదంతా నిజమని కోటి ఆశలు పెట్టుకున్న వాహనదారులకు ఇప్పుడు నిరాశే ఎదురైంది. సంక్షేమ పథకాలు అందకపోగా.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీనికితోడు భారీ జరిమానాలతో రవాణాశాఖ జూలు విదులుస్తోంది. దీంతో వాహనదారులు, ఆటోడ్రైవర్లు, మోటార్ వర్కర్లు లబోదిబోమంటున్నారు. ఎన్నికల హామీల అమలు, తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెలఖారులో విజయవాడలో జరగనున్న ఆటో డ్రైవర్ల రాష్ట్ర మహాసభల్లో సర్కారు తీరును ఎండగట్టాలని కార్మికులు ఐక్యంగా నిర్ణయించారు. భారీగా జరిమానాల పెంపు కూటమి సర్కారు వచ్చాక జీవో నంబర్ 21 అమలు చేస్తూ భారీ జరిమానాలతో వాహనదారుల నడ్డివిరుస్తోంది. గతంలో డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పాల్యూషన్, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.500 నుంచి రూ.750 వరకు జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం జీవో నంబరు 21 వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేలు, పర్మిట్ లేక పోతే రూ.10 వేలు, ఇన్సూరెన్స్ లేకుంటే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, ఫిట్నెస్ లేకపోతే రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. ప్రైవేటు చేతికి ఫిట్నెస్ పరీక్షలురవాణా రంగంలో ఉన్న ఆటో, వ్యాన్లు, కార్లు వంటి వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని ఫిబ్రవరి నుంచి ప్రైవేటు ఏజెన్సీకి కూటమి సర్కారు అప్పగించింది. ఏటా అవసరాన్ని బట్టి ఫీజు పెంచుకునే వెసులుబాటూ కల్పించింది. గతంలో ఫిట్నెస్ ఫీజు రూ.700 ఉండగా దానిని రూ.800కు పెంచారు. కూటమి సర్కారు బే‘కార్’ హామీలుప్రతి మహిళకు నెలకు రూ.1500... కూటమి అధికారంలోకి వస్తే 18–59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని ఊదరగొట్టారు. బడ్జెట్లో దీని ఊసే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 8,30,958 మంది, కృష్ణా జిల్లాలో 7,39,202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాట నమ్మి నిండా మునిగామని నిట్టూరుస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో వాహనమిత్ర లబ్ధి ఇలా.. సంవత్సరం వాహనదారులు లబ్ధి మొత్తం (రూ.కోట్లలో) 2019–20 20,594 20.95 2020–21 25,177 25.18 2021–22 23,837 23.84 2022–23 12,137 12.13 2023–24 12,540 12.54 ఐదేళ్లలో మొత్తం 94.64 -
రైలు కింద పడి వ్యక్తి మృతి
పెదకాకాని: రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పెదకాకానిలో జరిగింది. పెదకాకాని సుందరయ్య కాలనీకి సమీపంలో రైల్వేట్రాక్పై మృతదేహం ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున పైలెట్ ద్వారా గుంటూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి రైల్వే ఎస్ఐ కె.దీపిక సిబ్బందితో చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి సమీపంలో డ్రైవింగ్ లైసెన్స్ కనిపించడంతో దాని ఆధారంగా మృతుడు పెదకాకానికి చెందిన పంది గోపీకృష్ణ(32)గా గుర్తించారు. మృతుడి కాళ్ళు, చేతులు దూరంగా పడి ఉన్నాయి. మృతుడి తండ్రి సాంబశివరావు నాలుగేళ్ళ కిందట మరణించారు. గోపీకృష్ణకు తల్లి జ్యోత్స్న, తమ్ముడు ఉన్నారు. గోపీకృష్ణ లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ దీపిక తెలిపారు. -
వర్గీకరణ పేరుతో కూటమి చిచ్చు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఎస్సీ వర్గీకరణపై రాజీవ్రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభ, మండలిలో ఆమోదించిన కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్కుమార్ మండిపడ్డారు. మాలమహానాడు ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చుపెడుతోందని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో హలో మాల.. చలో రాజధాని పేరుతో లక్షలాది మందితో మాలల సింహాగర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమలో మాలమహానాడు నాయకులు గోదాజాన్పాల్, దారా హేమప్రసాద్, పిల్లి మేరి, ఏసుబాబు, బోరుగడ్డ రజనీకాంత్, రాచకొండ ముత్యాలరాజు, బండ్లమూడి స్టాలిన్, నల్లపు నీలాంబరం, సముద్రాల కోటి, డేవిడ్ విలియమ్స్ పాల్గొన్నారు. త్వరలో లక్షలాది మందితో హలో మాల.. చలో రాజధాని కార్యక్రమం మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్కుమార్ -
న్యాయవాదుల క్రికెట్ టోర్నీ విజేత గుంటూరు చంద్రశేఖర్–9 జట్టు
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లాస్థాయి న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్లో గుంటూరు చంద్రశేఖర్–9 జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు గురువారం సాయంత్రం ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, నాలుగో అదనపు జిల్లా జడ్జి రుద్రపాటి శరత్ బాబు ట్రోఫీలను బహూకరించారు. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుంటూరు న్యాయవాదుల జట్టుతో నరసరావుపేట న్యాయవాదుల జట్టు తలపడింది. తొలుత టాస్ గెలిచిన నరసరావుపేట జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన గుంటూరు న్యాయవాదుల జట్టుకు ఓపెనర్లు అంచుల రామాంజనేయులు (47 బంతుల్లో 59 పరుగులు), మహమ్మద్ మాజ్ (27 బంతుల్లో 48 పరుగులు) నిలకడైన ఆటతీరుతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన జట్టు కెప్టెన్ చంద్ర శేఖర్ రెడ్డి (26 బంతుల్లో 65 పరుగులు), సాజిద్ (20 బంతుల్లో 30 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో గుంటూరు న్యాయవాదుల జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 221 పరుగులు చేసింది. నరసరావుపేట జట్టులోని ఖాదర్, కిరణ్, సూర్యలకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నరసరావుపేట జట్టు 17.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో పది ఓవర్లకు 110/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న నరసరావుపేట జట్టును గుంటూరు జట్టు బౌలర్ సాజిద్ కుప్పకూల్చాడు. సాజిద్ 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు కూల్చాడు. నరసరావుపేట జట్టులో అధికంగా యశ్వంత్ 20 పరుగులు, రవి 44 పరుగులు, మధు 32 పరుగులు చేశారు. బౌలింగ్లో ఐదు వికెట్లు తీసి బ్యాటింగ్లో 30 పరుగులు సాధించిన గుంటూరు న్యాయవాదుల జట్టు ప్లేయర్ సాజిద్కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు రోజులుగా గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్లో బాపట్ల, వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరుల నుంచి మొత్తం ఎనిమిది న్యాయవాదుల జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లలో బాపట్ల జట్టుతో పోటీపడి నరసరావుపేట జట్టు విజయం సాధించగా, వినుకొండ జట్టుతో పోటీపడిన గుంటూరు జట్టు విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య గురువారం ఫైనల్ జరిగింది. -
కిమ్స్ శిఖర హాస్పిటల్లో అత్యాధునిక గుండె చికిత్సలు
గుంటూరు మెడికల్: గుంటూరు మంగళదాస్నగర్లోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో మూడు సంక్లిష్టమైన కరోనరీ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ చేయకుండానే ఆధునిక సాంకేతిక వైద్య పద్ధతులతో కరోనరీ రక్తనాళాల్లో ఉన్న అవరోధాలను స్టంట్ల సాయంతో తొలగించి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి కొత్త ముద్రను వేశారు. ఈ విషయాన్ని గురువారం కార్డియాలజీ వైద్యులు మీడియాకు వెల్లడించారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులు ఉండి, తీవ్రంగా కాల్షియం పెరిగిన రోగులు ముగ్గురు చికిత్స కోసం వచ్చినట్లు చెప్పారు. కిమ్స్ శిఖరలో అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాల సాయంతో ముగ్గురికి గుండె చికిత్సలు విజయవంతంగా చేశామన్నారు. ఆపరేషన్లతో పనిలేకుండా స్టెంట్లతో చికిత్సను అందించామన్నారు. యూకే నుంచి వచ్చిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజ్ఫర్ జమాన్ నేతృత్వంలో ప్రొసీజర్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంట్రాకరోనరీ అల్ట్రాసౌండ్, కొత్త కట్టింగ్ బెలూన్లు, మైక్రో–క్యాథెటర్స్, డ్రగ్–ఎల్యూషన్ బెలూన్ల వంటి ఆధునిక పరికరాల సాయంతో ఆపరేషన్ లేకుండా గుండె సమస్యలను తొలగించామని పేర్కొన్నారు. కిమ్స్ శిఖర కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత, కాథ్ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ శివప్రసాద్ చికిత్స విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిత మాట్లాడుతూ మునుపటి రోజుల్లో ఇలాంటి సమస్యలకు శస్త్రచికిత్స కోసం పంపించాల్సిన ఉండేదన్నారు. ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో అత్యంత తక్కువ ఆపరేషన్ అవసరం కలిగిన చికిత్సలను అందిస్తున్నామన్నారు. నూతన చికిత్స పద్ధతుల ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని వెల్లడించారు. -
కిలోన్నర గంజాయి పట్టివేత
అమరావతి: మండల పరిధిలోని ధరణికోట ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి కిలోన్నర గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆరు డొంకల బావి సెంటర్ సమీపంలోని పాగుబడిన కోళ్ల ఫారంలో గంజాయిని దాస్తుండగా పోలీసులు దాడి చేశారు. గమనించిన నిందితులు అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు కిలోన్నర గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ అచ్చియ్య మాట్లాడుతూ పారిపోయిన వారి కోసం పోలీసు బృందాలు, ఈగల్ టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. -
ఊయలే ఉరి తాడైంది !
రెంటచింతల: ప్రతి రోజూ సరదాపడి ఊగే ఊయలే తన ప్రాణం తీస్తుందని ఆ బాలుడు ఊహించలేకపోయాడు. రోజూ మాదిరే ఇంట్లో చీరతో ఊయల కట్టుకుని ఊగుతున్న సమయంలో మెడకు బిగుసుకుని ఊపిరాడక మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా రెంటచింతలలో చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి మాణం కాలనీకి చెందిన సలిబండ్ల అద్విక్రెడ్డి(11) ఆరోగ్యం బాగో లేదని చెప్పి గురువారం పాఠశాలకు వెళ్లకుండా, అమ్మమ్మ ఇంటి పైగదిలో చీరతో కట్టిన ఊయల ఊగుతున్నాడు. మధ్యాహ్నం అన్నం తినడానికి కిందకు అద్విక్రెడ్డి రాకపోవడంతో అమ్మమ్మ కటకం శౌరీలు పైకి వెళ్లి చూసింది. ఊయల చీర అద్విక్రెడ్డి మెడకు బిగుసుకుని పోయి ఉండటం గమనించి కేకలు వేసింది. బంధువులు వెంటనే స్థానిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అద్విక్రెడ్డి స్థానిక ఫాతిమా విద్యానికేతన్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి నిర్మలరాణి అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తోందతి. తల్లి, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడ వారిని కంట తడి పెట్టించింది. విద్యార్థి అద్విక్రెడ్డి అకాలమృతికి పాఠశాల డైరెక్టర్ ఏరువ మర్రెడ్డి, హెచ్ఎం ఏరువ స్టేఫీ స్టార్ సంతాపం తెలిపారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆగిన బాలుడి ఊపిరి -
ఎంఈఓ–2 పోస్టును ఎంఈఓ అకడమిక్గా మార్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఎంఈఓ–2 పోస్టులను ఎంఈఓ అకడమిక్గా మార్పు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎంఈఓ–2 సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీవీ రామకృష్ణ, రాయల సుబ్బారావు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజుతోపాటు విజయవాడలో సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె.రవీంద్రనాథ్రెడ్డిని వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎంఈఓ–1, 2 పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు ఆయా పోస్టులను భర్తీ చేసే సమయంలో అదే మండలంలో పని చేస్తున్న ఎంఈఓలకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. మండల పరిధిలో సీనియర్ ఎంఈఓకు డీడీఓ అధికారాలను అప్పగించడంతోపాటు సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులుగా ఎంఈఓ–2, గ్రేడ్–2 హెచ్ఎంలకు అవకాశం కల్పించాలన్నారు. అధికారులను కలిసిన వారిలో ఎంఈఓ–2లు అలీం, శంకర్రాజు, శ్రీనివాసరెడ్డి, జయంతి బాబు, నాగేంద్రమ్మ, లీలారాణి, జాకబ్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
జయహో భారత్..జయహో సునీత !
అచ్చంపేట: మహిళా శక్తికి ప్రతీకగా నిలచిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తరువాత సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చిన సందర్భంగా మండలంలోని వేల్పూరు జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు 100మీటర్ల జాతీయ జెండాతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ టి.తులసి మాట్లాడుతూ సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి వచ్చిన క్షణాలు అద్భుతమని, ఆమె ధైర్య సాహసాలు అనితరసాధ్యమని కొనియాడారు. ఈ విజయం యావత్ భారతావని గర్వించదగినదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ భారతదేశంలోని ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందని తెలిపారు. జయహో భారత్..జయహో సునీత విలియమ్స్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం అగస్టీన్రెడ్డి, ఉపాధ్యాయులు మస్తాన్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ -
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పుత్తా శివశంకర్రెడ్డి కోరారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..శ్వేతపత్రం విడుదల చేస్తారా?:కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు. ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపా«ధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.ఆ ధైర్యం మీకుందా?:గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం. ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్ పర్యటనను పెయిడ్ హాలిడేగా వాడుకున్నారు.2018కి పూర్వమే ఆ యూనిట్:విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు. ఆ యూనిట్కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.లోకేష్.. మంత్రిగా మీరు అశోక్ లీలాండ్ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్సిక్స్ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు. -
ఎవరు దొంగలు? ఎవరు అలా వ్యవహరించారు?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్పై వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం’.‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ నేత అక్రమ నిర్బంధం.. పరాకాష్టకు ‘కూటమి’ అరాచకాలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఈపూరు మండల వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ కొండవర్జి నాగేశ్వరరావు యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజాగళంలో మాట్లాడినందుకు నాగేశ్వరావును పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మిర్చి పొలానికి రాత్రి కాపలాకు నాగేశ్వరావు యాదవ్ దంపతులు వెళ్లగా.. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ లీగల్ టీం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పొన్నవోలు సుధాకర్రెడ్డిని ఈపూరు పోలీస్ స్టేషన్కు వైఎస్సార్సీపీ అధిష్టానం పంపించింది. దీంతో నాగేశ్వరరావు యాదవ్పై ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. ఈపూరు ఎస్ఐ వదిలేశారు.పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వినుకొండను కూటమి ప్రభుత్వం అరాచకాల అక్రమాలతో అనకొండగా మార్చిందని మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను టీడీపీ గుండాలు అత్యంత దారుణంగా హత్య చేశారు. పది నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. మీడియాతో మాట్లాడినందుకు నాగేశ్వరావు యాదవ్ను తీవ్రవాదిని తీసుకువెళ్లినట్టు పొలం నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో నేను వినుకొండ వచ్చాను. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి ధ్వజమెత్తారు.వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వినుకొండలో దారుణాలు, అక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలను నాయకుల్ని పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భయపెడితే భయపడే రకం ఇక్కడ ఎవరూ లేరు. అన్నిటికి సిద్ధమయ్యే ఉన్నాం. ప్రభుత్వం ప్రజల హక్కులను కాల రాస్తోంది. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని బ్రహ్మనాయుడు హెచ్చరించారు. -
రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్కు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని.. కానీ ప్రభుత్వం.. మార్షల్స్ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని మండిపడ్డారు.‘‘ఓటేశారు.. మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రజల ఆంకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైఎస్ జగన్ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బొత్స పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్ జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం’’ అని బొత్స దుయ్యబట్టారు.గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవుకథ చెబితే ఎలా?. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైఎస్సార్సీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైఎస్సార్సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం’’ అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. -
డీ అడిక్షన్ సెంటర్ పరిశీలన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మద్యానికి బానిసైన వారికి డీ అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చి మద్యపానానికి దూరం చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ డాక్టర్లకు సూచించారు. బుధవారం గుంటూరు జీజీహెచ్లోని డీ అడిక్షన్ సెంటర్, గుంటూరు ఎకై ్సజ్ కార్యాలయంలోని లేబొరేటరీని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మద్యానికి బానిసైన వారికి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. అనంతరం లేబొరేటరీని సందర్శించి రోజూ ఎన్ని నమూనాలు తీస్తున్నారని ఆరా తీశారు. కార్యక్రమంలో గుంటూరు ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, గుంటూరు ఎకై ్సజ్ శాఖ అధికారి అరుణ కుమారి, ఏఈఎస్ మారయ్య బాబు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఏఎన్యూ అంతర కళాశాలల సాఫ్ట్బాల్ టోర్నీ
గుంటూరు రూరల్: క్రీడలతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక దృఢత్వం సిద్ధిస్తుందని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని ఆర్వీఆర్జేసీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సాఫ్ట్ బాల్ (మెన్) టోర్నమెంట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. పోటాపోటీగా సాగిన టోర్నమెంట్లో ధనలక్ష్మి కాలేజీ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు మొదటి స్థానంలో నిలిచి విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. ఎమ్ఎల్ఎస్ డిగ్రీ కాలేజీ జట్టు రెండొవ స్థానంలో నిలిచి రన్నర్ ట్రోఫీని సాధించింది. తృతీయ స్థానంలో ఏఎన్యూ ఫిజికల్ కళాశాల జట్టు నిలవగా, నాలుగవ స్థానంలో ఆర్వీఆర్జేసీ జట్టు నిలిచింది. విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్లో మెలకువలతో తమ ఉత్తమ నైపుణ్యాన్ని కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్యూ సాఫ్ట్ బాల్ (మెన్) జట్టును సెలక్షన్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పీ గౌరీశంకర్, డాక్టర్ ఎమ్ శివరామకృష్ణ, ఏఎన్యూ టోర్నమెంట్ ఆబ్సర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, ఏఎన్యూ సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఎం.బుచ్చిబాబు, డాక్టర్ రాజామెరిసిన్బాబు, జే ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకున్న ధనలక్ష్మి కాలేజీ జట్టు -
విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమం
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): ట్రూఅప్, సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ భారం మోపడానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి చెప్పారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలంలో విద్యుత్ షాకులు అనే పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామారావు, ఈమని అప్పారావు తదితరలు పాల్గొన్నారు. రాజధాని రైతుల రిటర్న్బుల్ ప్లాట్లలో అత్యాధునిక సౌకర్యాలు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తాడికొండ : రాజధాని రైతుల రిటర్న్బుల్ ప్లాట్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు చెప్పారు. ఎల్పీఎస్ జోన్లలో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల వద్ద రహదారులు, డ్రెయిన్లు, రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, యుటిలిటి డస్ట్, అవెన్యూ ప్లాంటేషన్, తదితర పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నామన్నారు. కార్యచరణలో భాగంగా రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించిన 22 పనులకు కమిషనర్ కె.కన్నబాబు విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో లెటర్ ఆఫ్ అవార్డులు(ఎల్ఓఏ పత్రాలు) బుధవారం అందజేశారు. ఎల్ఓఏ పత్రాలు అందుకున్న గుత్తేదారు సంస్థలు అమరావతిలో నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరిస్తూ నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో ఈఎల్సీఆర్ గోపాలకృష్ణారెడ్డి, సీఈ ధనుంజయ, ఎన్.శ్రీనివాసులు, సీఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య భార్య, ఆమె బంధువల వల్లే నా కొడుకు మరణించాడని మృతుని తల్లి ఆరోపణ తాడేపల్లిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 10న పురుగుల మందు తాగిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. తాడేపల్లికి చెందిన కిశోర్(32) మద్యానికి బానిసయ్యాడు. భార్య నాగేశ్వరితో తరచూ గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగేశ్వరి తల్లి, సోదరుడు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంలో కిశోర్కు, వారికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నాగేశ్వరి తల్లి, సోదరుడు కిశోర్ కళ్లల్లో కారం కొట్టి దాడి చేశారు. మనస్తాపం చెందిన కిశోర్ ఈనెల 10న పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. అయితే భార్య, అత్త, బావమరిది వల్లే తన కొడుకు మరణించాడని కిశోర్ తల్లి బుజ్జి ఆరోపిస్తున్నారు. పెళ్లికి ముందు కిశోర్కు వ్యసనాలు లేవని, ఇంటర్నెట్లో పనిచేసేవాడని, ఇటీవల ఆ ఉద్యోగం మానివేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని బుజ్జి వివరించారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, సర్దిచెప్పాల్సిన అత్త, బావమరిది కళ్లల్లో కారం కొట్టి దాడి చేశారని, అందుకే తన కొడుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని విమర్శించారు. బుజ్జి వాదనను నాగేశ్వరి, ఆమె బంధువులు తోసిపుచ్చారు. మద్యానికి బానిసై తనను వేధిస్తుండడంతోనే తన తల్లి, సోదరుడు వచ్చారని నాగేశ్వరి చెప్పారు. దీనిపై ఎస్ఐ శ్రీనివాసరావు వివరణ ఇస్తూ కేసు నమోదులో ఎలాంటి రాజీ పడలేదని, కిశోర్ బంధువులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. విద్య, ఉపాధిపై అవగాహన గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాలలో బుధవారం విద్యార్థులకు విద్య, ఉపాధి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళ, దివ్యాంగుల సంక్షేమ విభాగం ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్యకుమారి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శిశు అభివృద్ధి విభాగం, పోషక, విస్తరణ విభాగాలు నిర్వహించిన ప్రదర్శనను ఆమె తిలకించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. సూచనలు చేశారు. కార్యక్రమంలో సామాజిక విజ్ఞాన విభాగం డీన్ డాక్టర్ బి శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ చైతన్యకుమారి, మహిళ శిశుసంక్షేమ శాఖ ప్రతినిధి గిరిజ పాల్గొన్నారు. మార్చి 27 నుంచి ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన గుంటూరు రూరల్: మార్చి 27 నుంచి మూడు రోజులపాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రదర్శనలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలనుంచి రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, పాల్గొంటారని పేర్కొన్నారు. 24న ఎయిడెడ్ స్కూల్లో పోస్టుల భర్తీకి కంప్యూటర్ పరీక్ష గుంటూరు ఎడ్యుకేషన్: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లలోని రాజీవ్గాంధీ మెమోరియల్ ఎయిడెడ్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈనెల 24న నిర్దేశిత కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత టెస్టు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సమాచారాన్ని తదుపరి తెలియపరుస్తామని పేర్కొన్నారు. -
ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల లోగో ఆవిష్కరణ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభ తిరుపతిలో మే 15 నుంచి 18 వరకు జరుగుతాయని సంఘ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సుభాని తెలిపారు. స్థానిక కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో జాతీయ మహాసభల లోగోను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ మహాసభలకు దేశ నలుమూలల నుంచి ఏఐవైఎఫ్ ప్రతినిధులతోపాటు జాతీయ నాయకత్వం పాల్గొంటుందని పేర్కొన్నారు. యువతను చైతన్యపరచడం, యువతలో సామాజిక స్పృహను పెంచడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యం అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాల చైతన్య,షేక్ వలి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి అఖిటి అరుణ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు ఖాసిం వలి, రెహ్మాన్, సుభాని తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి, మాదకద్రవ్యాల నిరోధానికి చర్యలు
ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు తెనాలిరూరల్: మాదకద్రవ్యాలు, గంజాయిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు తెలిపారు. గంజాయితోపాటు ఇతర మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాల రవాణాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తెనాలి రైల్వే స్టేషన్లో డాగ్ స్క్వాడ్తో బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి వచ్చిన పోలీస్ జాగిలం ‘లియో’ ప్రయాణికుల లగేజి, ప్లాట్ఫాంలు, రైల్వే పార్సిల్ కార్యాలయం, ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లలో తనిఖీ చేసింది. ప్లాట్ఫాంలపై కొందరి ప్రయాణికుల లగేజిని పరిశీలించడంతో గంజాయి, మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను గుర్తించే యత్నం చేసింది. ఈ సందర్భంగా తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎం.శివరామకృష్ణయ్య మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను తీసుకువస్తుండడంతో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన జాగిలాలతో తనిఖీలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తెనాలి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టినట్టు వివరించారు. గంజాయి, మాదకద్రవ్యాల గురించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబరు 14500కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో విజయవాడ ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఏఎస్ఐ బి. విజయరాజు, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ పీఎస్ఎన్ మూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలతో పెనుముప్పు
● ఏపీ ఈగల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకె రవికృష్ణ ● చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు గుంటూరు రూరల్: మాదకద్రవ్యాలు మానవాళికి పెనుముప్పుగా పరిణమించాయని ఏపీ ఈగల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకె రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మత్తు, మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి స్కూల్, కాలేజీలలో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేయాలని సూచించారు. ఈగల్ ఆర్గనైజేషన్ ఎస్పీ కె.నగేష్బాబు, చలపతి విద్యాసంస్థల అధినేత వైవీ ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, కరస్పాండెంట్ వై. సుజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కళాశాల యాజమాన్యం అతిథులను సన్మానించింది. -
మేయర్ పీఠాన్ని వదులుకోకూడదు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు మేయర్ పదవి విషయంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లాలని, ఎట్టిపరిస్థితిలో మేయర్ పీఠాన్ని వదులుకోకూడదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు రాజీనామా చేసిన ఆనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై.. అత్యవసర కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జ్ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబుతో కలిసి అంబటి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్ కావటి మనోహర్నాయుడు హాజరుకాలేదు. అంబటి మాట్లాడుతూ మేయర్ పదవి విషయంలో గట్టిగా వ్యవహరించాలని సూచించారు. సమావేశం వాయిదా పడినందున మళ్లీ జరిగే సమావేశానికి ముందు రోజున సమావేశమై కార్యాచరణ రూపొందిద్దామన్నారు. కూటమికి మేయర్ పదవి దక్కకుండా ఏం చేయడానికై నా పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మరింత బలంగా నిలబడి ప్రజల గొంతుకగా కౌన్సిల్లో ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్ కార్యాచరణౖపైవెఎస్సార్ సీపీ సమావేశం పార్టీ కార్పొరేటర్లతో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు భేటీ హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డెప్యూటీ మేయర్ వజ్రబాబు, మోదుగులవేణుగోపాలరెడ్డి, నూరిఫాతిమా -
మాస్ కాపీయింగ్ జరగకూడదు
కొల్లిపర: టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ఇన్విజిలేటర్లపై ఉందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కొల్లిపర హైస్కూల్లో టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తెనాలి సబ్కలెక్టర్ వి.సంజన సింహా , తహసీల్ధారు సిద్ధార్థ, ఎంపీడీఓ వి.విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కేంద్రాన్ని ప్రభుత్వం సమస్యాత్మక కేంద్రంగా రికార్డుల్లో నమోదు చేయడంపై ఆరా తీశారు. మనబడి నాడు–నేడు ద్వారా పాఠశాల అభివృద్ధికి ఎన్ని నిధులు మంజూరయ్యాయి? ఇంకా ఎంత అవసరమవుతాయన్న వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంఈఓ–2 ఝూన్సీలత తదితరులు ఉన్నారు. టెన్త్ హిందీ పరీక్షకు 27,491 మంది హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని 150 కేంద్రాల్లో బుధవారం జరిగిన టెన్త్ హిందీ పరీక్షకు 27,664 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 27,491 మంది హాజరయ్యారు. 21 కేంద్రాల్లో దూరవిద్య టెన్త్ పరీక్షలకు 1,039 మందికి 836 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. రాష్ట్ర పరిశీలకురాలు పి.పార్వతి ఐదు పరీక్షా కేంద్రాలు, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఏడు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 60 పరీక్ష కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మి -
గేట్లో జశ్వంత్ భవానీకి6వ ర్యాంక్
నరసరావుపేట ఈస్ట్: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2025 పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన పెంటేల జశ్వంత్ భవాని అఖిల భారత స్థాయి 6వ ర్యాంక్ సాధించాడు. జశ్వంత్ భవాని తండ్రి రాజశేఖర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ముంబైలో 5జీ సిస్టమ్ ఇంజనీర్గా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గేట్ పరీక్షలకు జశ్వంత్ సిద్ధం అయ్యాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. ఇందులో దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేశారు. -
మూల్యాంకనం వేగవంతం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగవంతమైంది. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అధ్యాపకులు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. గుంటూరు జిల్లాకు ఆర్ట్స్, సైన్స్ కోర్సుల వారీగా 3.30 లక్షలు, ఒకేషనల్కు సంబంధించినవి 60వేల స్క్రిప్ట్స్ వచ్చాయి. స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి, ఆర్ఐవో జీకే జుబేర్ పర్యవేక్షణలో ఈనెల 17 నుంచి జవాబు పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా వాల్యూయేషన్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో సబ్జెక్టుల వారీగా ఏర్పాటు చేసిన బోర్డులలో అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు–రెండు, ఇంగ్లీషు–19, హిందీ–ఒకటి, సంస్కృతం–15, మాధ్స్–31, సివిక్స్ రెండు చొప్పున బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినర్తో పాటు ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఉంటారు. వీరికి అదనంగా బోర్డుకు ఒకరు చొప్పున నియమించిన స్క్రూటినైజర్ మూల్యాంకనం చేసిన ఆన్సర్ స్క్రిప్ట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, కేటాయించిన మార్కులను పరిశీలిస్తారు. ఈ విధంగా 420 మంది అధ్యాపకులతో పాటు స్క్రూటినైజర్లుగా మరో 70 మంది అధ్యాపకులు విధుల్లో ఉన్నారు. కాగా 2వ స్పెల్లో మిగిలిన సబ్జెక్టులకు గురువారం నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఒకేషనల్ పేపర్ల వాల్యూయేషన్ కోసం ఏర్పాటు చేసిన ఆరు క్యాంపులలో ఒకటిగా గుంటూరులో కొనసాగుతుండడం గమనార్హం. సబ్జెక్టులవారీగా ఇంటర్ వాల్యూయేషన్ వాల్యూయేషన్ కేంద్రాల్లోనే మార్క్స్’ ట్యాబ్లేషన్ 70శాతం మంది అధ్యాపకులు విధులకు హాజరు పర్యవేక్షిస్తున్న ఆర్ఐఓ జుబేర్ అధ్యాపకులను రిలీవ్ చేసి వాల్యూయేషన్కు పంపాలి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల నుంచి స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకుల్లో 70 శాతం మంది హాజరవుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జవాబు పత్రాలను వేగంగా మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులందరూ రావాలి. వారిని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తక్షణమే రిలీవ్ చేసి వాల్యూయేషన్ కేంద్రానికి పంపాలి. లేకుంటే శాఖాపరమైన చర్యలతోపాటు జరిమానా విధిస్తాం. – జీకే జుబేర్, ఇంటర్విద్య ఆర్ఐవో, గుంటూరు -
క్షయకు క్రమం తప్పకుండా మందులు వాడాలి
కొల్లిపర: క్షయ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్యశాఖ సంయుక్త నిర్వహణలో కొల్లిపరలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. రోగులకు పోషకాహార కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్షయ రోగుల కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,557 మంది క్షయ రోగులు ఉన్నట్టు వెల్లడించారు. క్షయ రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ కొల్లి మేఘనారెడ్డి ముందుకు రావడం ముదావహమన్నారు. కొల్లి మేఘనారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. తొలుత సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి , తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. గ్రామంలో క్షయ రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితి గురించి ఆరా తీశారు. క్షయ పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిల్లి రాధిక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్, డియంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి , డిసిహెచ్ఎస్ మయానా మస్జిదాబి , తహసీల్ధారు సిద్ధార్ధ, ఎంపీడీవో విజయలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్, ఎంఆర్ ప్యూచర్ ఫౌండేషన్ ప్రతినిధి కొల్లి బాషిరెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా వర్కులు, రోగులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకం గుంటూరు వెస్ట్: జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి బ్యాంకర్ల సమీక్ష జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో ముందుకు వెళుతుందని, యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతోపాటు, ఎంఎస్ఎంఈలకు బ్యాంకర్లు వేగంగా రుణాలు అందించాలన్నారు. రైతుతోపాటు, కౌలు రైతులకు కూడా బ్యాంకర్లు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా రుణాల ప్రాసెసింగ్ అత్యంత వేగంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా అన్ని రంగాల్లో 15 శాతం పురోగతి సాధించడానికి బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రుణ లక్ష్యాలు, సాధించిన పురోగతిని వివరించారు. సమావేశంలో యూనియన్ బ్యాంకు డీజీఎం ఎస్.జవహర్, ఆర్బీఐ ఎల్డీఓ నవీన్ చిరునేని, నాబార్డు డీడీఎం ఇ.శరత్బాబు, జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి -
26లోపు రీ సర్వే పూర్తిచేయాలి
పొన్నూరు: పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న వల్లభరావుపాలెంలో ఈనెల 26 లోపు ప్రభుత్వ భూములు, నివాసాల రీసర్వే పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ తేజ చెప్పారు. బుధవారం గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను ఆయన తనిఖీ చేసి భూ రికార్డులు పరిశీలించారు. 5.24 సెంట్లు విస్తీర్ణంలోని చెరువు సరిహద్దులు, 7.63 సెంట్ల విస్తీర్ణంలోని తోక పోలాలను రోవర్ల ద్వారా తిరిగి నిర్ధారించే క్రమాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రీసర్వే బృందాలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జేసీ భార్గవ తేజ మాట్లాడుతూ వీఆర్వోలు, గ్రామ సర్వేయర్ల రోజువారి పని తీరును పరిశీలించి సర్వే త్వరగా పూర్తిచేయాలని తహసీల్దార్ మహ్మద్ జియావుల్హక్ను ఆదేశించారు. కార్యక్రమంలో తెనాలి సర్వే ఇన్స్పెక్టర్ పి. పార్థసారధి, మండల సర్వేయర్ సత్యనారాయణ, ఆర్ఐ శ్రీనివాస్, వీఆర్ఓలు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మందులతో క్షయ వ్యాధి నివారణ టీబీ విభాగ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ తెనాలిఅర్బన్: మందులు సకాలంలో వాడితే క్షయను పూర్తిగా నివారించవచ్చని టీబీ విభాగ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.రమేష్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని రోగుల ఇళ్లకు బుధవారం ఆయన వెళ్ళి వారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అలాగే వారు వాడే మందుల వివరాలు సక్రమంగా రికార్డు చేస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందులు ఒక్కరోజు వాడకపోయినా చాలా ప్రమాదమని చెప్పారు. ఆయన వెంట టీబీ తెనాలి యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, సూపర్వైజర్ పల్లెకొండ రవికుమార్, ఎం.లక్ష్మి, హెల్త్ విజిటర్స్ వి.వి.దిలీప్ కుమార్, కె.భార్గవి, వనజ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగోన్నతి వచ్చినా జీతం రాదట..! తప్పుల తడకగా ఏఎన్ఎంల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్ గుంటూరు మెడికల్: ఉద్యోగోన్నతి వచ్చినా జీతం రాదని తెలిసి పలువురు ఏఎన్ఎంలు లబోదిబోమంటున్నారు. అధికారులు చేసిన తప్పులకు తాము బలి అవుతున్నామని విలపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 266 గ్రేడ్–3 ఏఎన్ఎంలకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్గా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కౌన్సెలింగ్లో 15 మంది ఏఎన్ఎంలకు పొజిషన్ ఐడీ లేని ప్రాంతాల్లో అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో శాంక్షన్ పోస్టు ఉన్నా.. పొజిషన్ ఐడీ లేకపోతే జీతం రాదు. ఈ విషయాన్ని కౌన్సెలింగ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గమనించలేదు. ఖాళీల ప్రదర్శన బోర్డు ఏర్పాటు చేసినప్పుడు వాటిలో పొజిషన్ ఐడీలేని ప్రదేశాలు తీసివేసి, శాలరీ వచ్చే ప్రదేశాలు మాత్రమే చూపించాల్సి ఉంది. అయితే అవేవీ డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు పట్టించుకోలేదు. పొజిషన్ ఐడీ లేని ప్రాంతాల్లోనూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తీసుకుని కొత్త హోదాలో విధుల్లో చేరేందుకు కోటి ఆశలతో వెళ్లిన ఏఎన్ఎంలకు అక్కడి సిబ్బంది ఈ విషయం చెప్పారు. దీంతో లబోదిబోమంటూ 15 మంది ఏఎన్ఎంలు తిరిగి డీఎంహెచ్ఓ కార్యాలయానికి వచ్చారు. అయితే గురువారం సాయంత్రం మరోమారు కౌన్సెలింగ్ చేపట్టి మిగిలిన ఖాళీల్లో జీతం వచ్చే ప్రదేశాలు ఉంటే అక్కడ పోస్టింగ్ ఇస్తామంటూ డీఎంహెచ్ఓ అధికారులు చెప్పారు. దీంతో ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
1,27,005 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,27,005 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,24,077 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,903 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
‘వైఎస్సార్’ను జనం గుండెల్లో నుంచి తొలగించలేరు
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే , పార్టీ అధికార ప్రతినిధి కోరముట్ల శ్రీనివాసులు. స్వయంగా చంద్రబాబు కుమారుడే లోకేష్ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుమట్లు.. కోడుమూరులో నిన్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, నాగార్జున యూనివర్శిటీ సహా అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. చివరికి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. జనం రావటంతో ఆ ముష్కరులు పారిపోయారన్నారు.‘రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస కారులు వైఎస్ఆర్ విగ్రహాలపై పడ్డారు. విగ్రహాలను తొలగించ గలరేమోగానీ జనం గుండెల్లో నుండి వైఎస్సార్ ని తొలగించలేరు. తన తెచ్చిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్ దేవుడయ్యాడు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు అన్నీ తెలుసు. రాయలసీమకు వైఎస్సార్ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారు. వైఎస్ జగన్ నేరుగా ఎన్టీఆర్ పేరుతో జిల్లానే ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం వైఎస్సార్ పేరును తొలగిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ఇప్పటికే 4 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ కట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. కూటమి నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదువిశాఖపట్నంలో స్టేడియం పేరు తొలగించటం దారుణం. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? , కూటమి నేతలు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లుంచుకునే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
‘అమరావతి కేరాఫ్ అవినీతి’
సాక్షి,తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణ పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తోపుతుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తుంగలో తొక్కారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. దీని వలన 40టీఎంసీల నీరు రాయలసీమకు రాకుండా పోయింది. పోలవరాన్ని చివరికి బ్యారేజీగా మార్చేశారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు.పనులు ప్రారంభిస్తే వాటిని కూడా చంద్రబాబు ఆపేయించారు. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు నీరులేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీశైలంలో హక్కుగా రావాల్సిన నీటిని వాడుకోవటానికి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్ జగన్ తెచ్చారు. ఆ పనులన్నిటినీ చంద్రబాబు తన పార్టీ వారితో కేసులు వేయించి ఆపారు.రాయలసీమ మీద చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపించటం సరికాదు. శిష్యుడైన రేవంత్రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. అందుకే రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా తెలంగాణాకు వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ రైతులు ప్రభుత్వంపై ఉద్యమం చేయటానికి రెడీ అవుతున్నారు. అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు లేదు?. అమరావతిలో జరిగే కాంట్రాక్టుల్లోనూ భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ తెచ్చిన పారదర్శకత లేకుండా అడ్డుగోలుగా కాంట్రాక్టులను కట్టబెట్టేస్తున్నారు’అని ఆరోపించారు. -
నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్
సాక్షి,గుంటూరు: నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు నిరుద్యోగభృతి గురించి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తున్నారని అడిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో రాంప్రాసద్ తీరుపై ఎమ్మెల్సీ మాధవరావు మండిపడ్డారు. గతంలోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2014-2019లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.ఇప్పుడు మరోసారి నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చి మరో మారు మాట తప్పిందని దుయ్యబట్టారు. -
నిన్న నన్ను.. ఇవాళ మండలి చైర్మన్ను అగౌరవపరిచారు: బొత్స
సాక్షి,గుంటూరు: శాసన మండలిలో చైర్మన్ సహా వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. తాజాగా మండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్పై వివక్ష చూపించారని అన్నారాయన. శాసన మండలిలో బొత్స మాట్లాడుతూ..క్రీడా పోటీలు రెండు సభల సభ్యులకు నిర్వహించారు. శాసన మండలిని అవమానించారు. సీఎం, స్పీకర్ ఫొటోలు వేసి మండలి చైర్మన్ ఫొటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారు. వ్యక్తిగతంగా మండలి చైర్మన్ను ఇలా కించపరచడం సమంజసం కాదు.నిన్న ఉమ్మడి ఫొటోకు పిలిచి అక్కడ నాకు కుర్చీ వెయ్యలేదు. నాకు కుర్చీ వేయకుండా ప్రోటోకాల్ పాటించలేదు.వేరే వాళ్ల కుర్చీలో కూర్చోమని చెప్పారు. ఇప్పుడు ఏకంగా మండలి చైర్మన్ను ఇప్పుడు అగౌరవ పరిచారు.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై బొత్స అభ్యంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆమోదించారు. రేపు శాసన మండలిలో చర్చించాలి. కానీ అజెండాలో లేకుండా ఈరోజే పాస్ చేయాలనుకోవడం సమంజసం కాదు. ఈ బిల్లు పై చర్చ జరగాలన్నది మా అభ్యంతరం. రేపు సభ లేకపోతే ఈరోజు ఆమోదించాలి. కానీ ఇప్పుడే ఆమోదించేంత అత్యవసరం ఏముంది. మీకు నచ్చినట్టు చేసుకుంటాం అంటే మాకేమి అభ్యంతరం లేదు. ఉద్యోగులకు జీతాలు రేపు ఇస్తారా..?. యనమల చెప్పినట్టు బిల్లుపై చర్చ జరగాలి.బీఏసీలో రెండు రోజులు రిజర్వ్ పెట్టింది. అలాంటప్పుడు అసలు బిల్లు చూసుకునే అవకాశమే లేకుండా చర్చ పెట్టేస్తే ఎలా..?’ అని ప్రశ్నించారు. -
మీ సంకల్ప శక్తి, అంకితభావాన్ని చూసి గర్విస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అభినందనలు తెలిపారు. సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్కు కూడా అభినందనలు తెలియజేశారు. మీ సంకల్ప శక్తి, అంకితభావాన్ని చూసి మేము గర్విస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు.సుమారు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్లు.. ఎట్టకేలకు మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమ్మీదకు వచ్చారు #sunitawilliamsreturn. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రధాని మోదీ సైతం వెల్కమ్బ్యాక్ సునీత అంటూ అభినందనలు తెలియజేశారు. -
వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు
గుంటూరు రూరల్: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. సీఐ వంశీధర్ కథనం ప్రకారం నల్లపాడు గ్రామానికి చెందిన రాజుకు, మామిళ్ళపల్లికి చెందిన సృజన (23)తో ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల నుంచి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సృజన మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన సృజన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భర్తే తమ కుమార్తెను చంపాడని, ఉరివేసుకుందని సృష్టించాడని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసునమోదుచేసి దర్యాప్త చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. చిట్ఫండ్ బాధితుల విచారణ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నరసరావుపేటలోని సాధన చిట్ఫండ్ బాధితులను సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం విచారణ చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఎప్పటి నుంచి చిట్లు వేస్తున్నారు? ఎంత మొత్తంలో నెల నెలా చెల్లిస్తున్నారనే అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు 15 మందికిపైగా బాధితుల వద్ద వివరాలు సేకరించారు. అలాగే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు బ్యాంక్ ప్రతినిధులు కూడా తమ గోడును సీఐడీ అధికారులకు వినిపించారు. అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య దామరపల్లి(తాడికొండ): వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల బాధ పెరిగి కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడికొండ మండలం దామరపల్లి గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టం వస్తుండటంతో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చారు. కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపం చెందారు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడికి గురిచేస్తుండటంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో శ్రీనివాసరావు భార్య అరుణ కుమారి మనస్థాపంతో పొలానికి వేసేందుకు తెచ్చిన గడ్డిమందు తాగి ఈనెల 14న ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మంగళవారం ఉదయం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతులకు రిజర్వ్ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ముగ్గురి వద్ద నుంచి రూ.13 లక్షలు నగదు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై అరండల్పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. అరండల్పేట పోలీసుల కథనం ప్రకారం.. ఆంజనేయ పేట ప్రాంతంలో రుద్రా ఫౌండేషన్ యజమాని అయిన అరమండ రవికుమార్ అనే వ్యక్తి 2022లో ఉద్యోగవకాశాల పేరుతో పత్రికా ప్రకటనలు చేశాడు. ఆ ప్రకటనలు చూసిన పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ రవికుమార్ను కలిశారు. అతని మాయమాటలు నమ్మి రూ.5లక్షలు చెల్లించారు. అలాగే గడ్డల వంశీ అనే వ్యక్తి రూ.3 లక్షలు, గొట్టిపాటి మరియదాసు అనే వ్యక్తి రూ.5 లక్షలు రవికుమార్కు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టాభిపురం సీఐ పోస్టుపై సందిగ్ధం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పశ్చిమ సబ్ డివిజన్లోని పట్టాభిపురం పీఎస్ సీఐ పోస్టుపై సందిగ్ధం నెలకొంది. వీఆర్లో ఉన్న సీఐ ఎం.మధుసూదనరావును ఈనెల 16న పట్టాభిపురం పీఎస్ సీఐగా నియమిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి వరకు విధుల్లో ఉన్న వీరేంద్రబాబును సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కొత్త సీఐగా మధుసూదనరావు అదే రోజు రాత్రి స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్కు బ్రేక్పడినట్లు తెలుస్తోంది. దీంతో సందిగ్ధం నెలకొంది. బుధవారం సాధ్యమైనంత వరకు ఆయనే మళ్లీ సీఐగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. -
12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణమే నియమించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: పన్నెండో వేతన సవరణ సంఘాని(పీఆర్సీ)కి తక్షణమే చైర్మన్ను నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సంఘ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తొమ్మిది నెలల క్రితం అధికారంలోకి రాక ముందు, తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమిస్తామని, సకాలంలో డీఏలు ఇస్తామని హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. ఇప్పటికీ 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించకపోవడం దారుణమన్నారు. 12వ పీఆర్పీ చైర్మన్ను నియమించి, విధి విధానాలను అప్పగించి, సంఘాలతో చర్చలు జరిపి ఐఆర్ ప్రకటించి అమలు చేసేందుకు మరింత జాప్యం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదని, మరొక డీఏ జూలైకి రాబోతుందని, ఇప్పటికై నా డీఏలను తక్షణం చెల్లించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 2017లో ఇచ్చిన మెమో 57ని ఇంతవరకు అమలు చేయకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు. సంఘ రాష్ట్ర ప్రచురణ విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలలను అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలలను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 60 మంది విద్యార్థులు దాటిన ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేసి, మిగిలిన యూపీ పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాలను కొనసాగిస్తూ ప్లస్ 2 పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్, జిల్లా సహధ్యక్షురాలు వై. నాగమణి, కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, సాంబశివరావు, గోవిందయ్య, ఆంజనేయులు, షకీలా బేగం, కేదార్ నాధ్, రంగారావు, ప్రసాద్, ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, కోటిరెడ్డి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ 30 ఏళ్ల మహోత్సవం
మోతడక(తాడికొండ): చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 12–22 వరకు తమ అన్ని బ్రాంచిలలో 4 రోజుల పాటు చలపతి మహోత్సవం పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వైవీ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో పలువురు ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో కలిసి ఆయన పోస్టరు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చలపతి మహోత్సవంలో భాగంగా ఈ నెల 19న ఐడియాథాన్, 20న వివిధ అంశాలలో సాంకేతిక పరమైన పోటీలు 21–22 తేదీలలో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని సదావకాశం ఉపయోగించుకొని తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కార్యదర్శి వై సుజిత్ కుమార్, డైరెక్టర్లు డి వినయ్ కుమార్, కె శ్రీనివాసరెడ్డి, జి సుబ్బారావు, ప్రిన్సిపల్స్ డాక్టర్ కె నాగ శ్రీనివాసరావు, డాక్టర్ ఎం చంద్రశేఖర్, అకడమిక్ డీన్లు, వివిధ శాఖాఽధిపతులు పాల్గొన్నారు. -
23న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష
ఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2025 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ మంగళవారం విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ప్రవేశ పరీక్ష వివరాలను వివరించారు. ఈనెల 23న ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేయని అభ్యర్థులు నేరుగా టెన్త్ క్లాస్, డిగ్రీ ప్రొవిజినల్, మార్కుల జాబితా అభ్యర్థి ఫొటోతోపాటు సాధారణ ఫీజు రూ.500 చెల్లించి, పరీక్ష జరిగే 23న నేరుగా హాజరు కావచన్నారు. సంబంధిత ప్రవేశ పరీక్ష ఫలితాలును ఈనెల 25 సాయంత్రం విడుదల చేస్తామని చెప్పారు. ప్రవేశ పరీక్ష కేంద్రాలు సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎం ఎస్ ఆర్ ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), శ్రీ విజయ దుర్గ డిగ్రీ కాలేజ్ (కర్నూలు), శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ (అనంతపూర్) మొత్తం ఏడు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అర్హతలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. రెండేళ్ల వ్యవధి ఎంబీఏ జనరల్ కోర్సులకు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ కలిగి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో 45 శాతం, మిగిలిన వారు 50 శాతం ఉత్తీర్ణత శాతం కలిగి ఉండాలని సూచించారు. ఎంబీఏలో రెండు స్పెషలైజేషన్స్ ఎంబీఏ జనరల్లో ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రావెల్ టూరిజం మేనేజ్మెంట్, బిజినెస్ ఎనాలిటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ మొత్తం 8 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో రెండిటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. – ఎంసీఏ కోర్సులకు పది తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా ఇంజనీరింగ్, డిప్లొమా తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంసిఏ కోర్సులకు డిగ్రీలో తప్పనిసరిగా మ్యాథ్స్ చదివి ఉండాలి. దూర విద్యలో మ్యాథ్స్ డిగ్రీ చదివిన వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారు. డిగ్రీలో మ్యాథ్స్ చదవని విద్యార్థులు ఇంటర్లోనైనా మ్యాథ్స్ సబ్జెక్టును చదివి ఉండాలి అని వెల్లడించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వైబ్సెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏఎన్యూసీడీఈ.ఇన్ఫో నుంచి హాల్ టికెట్లను, ర్యాంక్ కార్డులు పొందవచ్చు అన్నారు. మరిన్ని వివరాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కేంద్రం ఏఎన్యూసీడీఈ.ఇన్ఫో అధికారిక వైబ్సెట్ నుండి, ఫోన్ నంబర్స్ – 9848477441, 0863–2346323 సంప్రదించవచ్చుని డైరెక్టర్ చార్య వెంకటేశ్వర్లు తెలిపారు. దరఖాస్తు చేయకున్నా సాధారణ ఫీజు రూ.500తో అదే రోజు పరీక్ష హాజరు కావచ్చు రాష్ట్రవ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ఏపీ ఐసెట్ ర్యాంకర్లు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు -
గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య
పిడుగురాళ్ల: గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుత్తికొండ గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన పరిటాల పోతురాజు(60) అనే రైతు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సక్రమంగా లేకపోవటం వలన సోమవారం రాత్రి గడ్డిమందు తన ఇంట్లోనే తాగాడు. గమనించిన భార్య హనుమాయమ్మ వెంటనే హుటాహుటిన పిడుగురాళ్ల ప్రైవేటు హాస్పటల్కు తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం గుంటూరు జీజీహెచ్లో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుమారుడు పరిటాల రామలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంపై నిరసన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్):ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తీరును నిరసిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ ద్వారా మాల, మాదిగలను విడదీస్తే సహించేది లేదని హెచ్చరించారు. వర్గీకరణ రాష్ట్ర యూనిట్గా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. లక్ష మందితో రాజధానిలో నిరసన సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మాల సంఘం జిల్లా అధ్యక్షులు దార హేమ ప్రసాద్, రాష్ట్ర మహిళా నాయకురాలు పిల్లి మేరి, ఏల్చూరి వేణు, బోరుగడ్డ రజనీకాంత్, పల్లె మురళి భీమ్ సేన సేవాదళ్ నల్లపు నీలాంబరం, ఉద్యోగ సంఘ నాయకులు కోడి రెక్క, కోటిరత్నం, రాచకొండ ముత్యాలరాజు, కార్యంశెట్టి సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లల నిష్పత్తి పెంచాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి గుంటూరు మెడికల్ : మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉంటుందని, పెంపునకు కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి చెప్పారు. గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు, జెండర్ వైలెన్స్పై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రు నిర్వాహకులు, వైద్యులతో సమావేశం జరిగింది. జిల్లా మల్టీ మెంబెర్ అప్రాప్రియేట్ అథారిటీ సభ్యులు, సలహా సంఘసభ్యులకు, ప్రసూతి వైద్య నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. జీజీహెచ్ గైనకాలజి ప్రొఫెసర్ డాక్టర్ పి.జయంతి మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లు నిర్వహించాల్సిన రిజిస్టర్లు, జిల్లాకు పంపాల్సిన రిపోర్టులు, పాటించాల్సిన నియమాల గురించి వివరించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి మాట్లాడుతూ పీసీపీఎన్డీటీ చట్టం అతిక్రమిస్తే విధించే శిక్షల గురించి వివరించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తెనాలి డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, డెమో ఎ.జయప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలకు పదును పెట్టాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు అంతర్గతంగా దాగిన నైపుణ్యాలకు పదును పెట్టాలని ఏఎన్యూ ఉప కులపతి ఆచార్య కె.గంగాధరరావు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంగళవారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వీసీ గంగాధరరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. కళాశాల కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి శ్యాం సుందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అనితాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా ఎంకాం విద్యార్థిని షేక్ షహనాజ్, ఎంబీఏ విద్యార్థి కె.అనంతలక్ష్మి, ఎమ్మెస్సీ మ్యాథ్స్లో వై.నాగమణి, ఫిజిక్స్లో బి.దుర్గా లావణ్య, కంప్యూటర్స్ సైన్స్లో కె.నాగసాయి రమ్య, కెమిస్ట్రీలో జుబేర్ అహ్మద్, ఎంసీఏ విద్యార్థి ఎన్. సాయిలీల ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. బీకాం జనరల్ విభాగంలో టాపర్గా నిలిచిన నరేంద్ర, బీకాం కంప్యూటర్స్లో షేక్ ఫారినా, బీఎస్సీ బీజెడ్సీలో షేక్ ఇషా సుల్తానా, బీబీఏలో జి.శ్వేత, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో టాపర్ పి. గౌస్య ప్రతిభా పురస్కారాలు పొందారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, అధ్యాపకులు బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి, డీవీ చంద్రశేఖర్, ఎస్. శ్రీనివాసరావు, యు. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. ఇఫ్తార్ సహర్ (బుధ) (గురు) గుంటూరు 6.24 4.56 నరసరావుపేట 6.26 4.58 బాపట్ల 6.24 4.56 సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ ఎవరు నిర్వహించాలనే సందిగ్ధత గుంటూరు కార్పొరేషన్లో నెలకొంది. మేయర్ పదవికి కావటి మనోహర్నాయుడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్ సమావేశం ఈ నెల 20న నిర్వహించనున్నారు. అయితే ఇద్దరు డెప్యూటీ మేయర్లు ఉన్న నేపథ్యంలో సభ ఎవరు నిర్వహించాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. గతంలో పాలకవర్గం ఎన్నికై న వెంటనే మేయర్గా కావటి మనోహర్నాయుడు, డెప్యూటీ మేయర్గా వనమా బాలవజ్రబాబు(డైమండ్బాబు)ను కౌన్సిల్ సభ్యులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత నాలుగు నెలలకు ఇద్దరు డెప్యూటీ మేయర్లకు అప్పటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో రెండో డెప్యూటీ మేయర్గా షేక్ సజిలాను ఎన్నుకున్నారు. ఈ ప్రకారం చూస్తే డైమండ్బాబుకు నాలుగు నెలల సీనియారిటీ ఉంది. ఈ నేపథ్యంలో డైమండ్బాబును ఇన్చార్జ్ మేయర్గా పీఠంపై కూర్చొపెడితే తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన కూటమి నేతలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిన షేక్ సజిలకు అవకాశం ఇవ్వాలని కమిషనర్పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కమిషనర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకూ దీనికి సర్కారు నుంచి సమాధానం రాలేదు. బుధవారం కూడా సమాధానం రాకుంటే కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతే కొత్త మేయర్ ఎన్నికల షెడ్యూల్ కోసం ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. మేయర్ పీఠంపై కూటమిలో రగడ మరోవైపు కూటమిలో మేయర్ పీఠం కోసం అంతర్గత కుమ్ములాట మొదలైంది. తెలుగుదేశంపార్టీలో రెండు వర్గాలు పదవి కోసం పోటీ పడుతున్నాయి. జనసేన కూడా తమకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే డెప్యూటీ మేయర్ ఇవ్వాలని పట్టుపడుతోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే మేయర్ అభ్యర్థిత్వం విషయలలో అధిష్టానం కోవెలమూడి రవీంద్ర(నానీ) పట్ల సానుకూలంగా ఉందంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన రోజునే ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు తొమ్మిది మంది కార్పొరేటర్లు సమావేశం నుంచి నిరసనగా బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ కూడా నానీకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాత్రమే నాని అభ్యర్ధిత్వానికి అనుకూలంగా ఉండగా, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి, కోవెలమూడి నానికి ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోవెలమూడి నానిని కాదని గల్లా మాధవికి ఇవ్వడంతో ఆయన కావాలనే మాధవిని ఓడించేందుకు యత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మాధవి వర్గం వేములపల్లి శ్రీరాంప్రసాద్(ఇసుక బుజ్జి)ని మేయర్గా చేయాలని పట్టుపడుతోంది. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా బుజ్జి వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. 7 కౌన్సిల్ ఎవరు నిర్వహించాలి ? కొనసాగుతున్న సందిగ్ధం మేయర్ రాజీనామాపై చర్చించేందుకు ఈనెల 20న కౌన్సిల్ సీనియర్ డెప్యూటీ మేయర్గా డైమండ్ బాబు టీడీపీలో ఉన్నందున సజిలకు ఇవ్వాలంటున్న కూటమి నేతలు ఏం చేయాలో చెప్పాలని ప్రభుత్వానికి కమిషనర్ లేఖ ఇంకా స్పందించని సర్కారు మేయర్ పీఠం కోసం కూటమిలో అంతర్గత కుమ్ములాటన్యూస్రీల్కాపు సామాజికవర్గం పోటీ ఇప్పటి దాకా మేయర్గా ఉన్న కావటి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం కార్పొరేటర్లు మేయర్ సీటుకు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాపులకే మేయర్ పీఠం ఇవ్వాలని కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు, ఇప్పటికే జనసేనలో చేరిన ఓ వర్గం పవన్ కళ్యాణ్ వద్ద మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి చేరిన కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మల వెంకట రమణ, యిర్రి ధనలక్ష్మీ కూడా మేయర్ పీఠం కోసం యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క బీసీలు, మైనార్టీలలో ఆశావాహులు పెరిగిపోతుండటంతో కూటమి పెద్దలకు మేయర్ సీటు అంశం తలనొప్పిగా మారింది. -
జేబుర్దస్త్
రాత‘కోతల’ రైటర్ పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర ట్రాఫిక్ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేస్తోంది. వారి అవినీతి అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. గుంటూరు నగర ట్రాఫిక్ పరిధిలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, వెస్ట్ సబ్డివిజన్లో ముగ్గురు ఎస్ఐలు, ఈస్ట్ సబ్డివిజన్లో ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు. ఒక ఎస్ఐ ప్రమాదంలో గాయపడి సిక్లో ఉన్నారు. ఈస్ట్, వెస్ట్ సబ్డివిజన్లలో కలిపి మొత్తం ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి సుమారు 80 మందికిపైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐలకు ఒక ప్రాంతాన్ని కేటాయించి ఒక అసిస్టెంట్ను ఇస్తారు. నిత్యం కేసులు రాయటంతో పాటు, ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలకు సంబంధించిన అంశాలను ఎస్ఐ చూడా ల్సి ఉంటుంది. అయితే కొందరు ఎస్ఐలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెట్రోల్ వాడేసుకుంటున్నాడు! వెస్ట్ ట్రాఫిక్ పరిధిలోనే ట్రాఫిక్ ఉన్నతాధికారి వద్ద పనిచేస్తూ జిల్లాలోని మరో పోలీసుస్టేషన్కు బదిలీ అయిన కానిస్టేబుల్ ప్రభుత్వ ద్విచక్రవాహనాన్ని సొంతానికి వాడేసుకుంటున్నాడు. నెలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 30 లీటర్ల పెట్రోల్ను సొంత అవసరాలకు ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ సుమారు తొమ్మిదేళ్ల పాటు పని చేసిన అతను బదిలీ అయినా ఇక్కడే తిష్టవేసి నెలవారీ వసూళ్ళు, ఎన్ఓసీ జారీల్లో చేతివాటం చూపిస్తున్నాడని సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. బదిలీ అయిన తర్వాత కూడా రెండు, మూడు సార్లు ప్రభుత్వం ద్వారా ఉచితంగా పెట్రోల్ వినియోగించినట్టు తెలుస్తోంది. పరువు ‘బజారు’పాలు గుంటూరు ఈస్ట్ పరిధిలో ఒక ఎస్ఐ, అతని అసిస్టెంట్లపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరు పట్నంబజారు, మార్కెట్, పూలమార్కెట్, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం తదితర ప్రాంతాల్లో అవినీతికి పాల్పడుతూ పరువును బజారుకీడస్తున్నట్టు సమాచారం. నిత్యం కేసులు నమోదు చేస్తూ.. అటుగా వచ్చే భారీ వాహనాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. చిరు వ్యాపారులపైనా ప్రతాపం చూపి ంచి భారీగా దండుకుంటున్నారని తెలుస్తోంది. రాంగ్రూట్లో ట్రాఫిక్ సిబ్బంది అవినీతితో అప్రతిష్టపాలు చలానాల సొమ్ము జేబులో వేసుకున్న ఎస్ఐ ప్రభుత్వం వాహనం వాడుకుంటున్న కానిస్టేబుల్ రైటర్గా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్పై ఆరోపణల పరంపర చలానాల సొమ్ము బొక్కేశారు వెస్ట్ సబ్డివిజన్ పరిధిలోని లాడ్జి సెంటర్, అమరావతి రోడ్డు, కొరిటెపాడు రోడ్డు చూసుకునే ఒక ఎస్ఐ, అతని అసిస్టెంట్ అవినీతి పరాకాష్టకు చేరింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీలకు ఆపిన సమయంలో పెండింగ్ చలానాలు ఉంటే.. వారిని భయపెట్టి మరీ వారి వద్ద నగదు తీసుకుని, ఆ డబ్బు చలానాలకు జమ చేయకుండా జేబులు నింపుకుటున్నారని ఆ శాఖ సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. వీరు డబ్బు తీసుకున్న వాహనాలను మరో ఎస్ఐ ఆపి చలానాలు కట్టాలని అడిగితే వాహనదారులు ఇంతకుముందే ఓ ఎస్ఐకు కట్టామని చెప్పడంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఇలా పలు ఫిర్యాదులు రావడంతో పరువు పోతుందనే భయంతో ఆ ఎస్ఐ, అతని అసిస్టెంట్ దిగమింగిన డబ్బులు చెల్లించిన ఘటనలూ ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు. మరో కానిస్టేబుల్ నేరుగా రైటర్ అవతారం ఎత్తాడు. స్టేషన్లో తానే రైటర్నని, స్టేషన్ అధికారి పనులన్నీ కూడా తానే చక్కబెడతానంటూ చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యానగర్ సమీపంలో ఒక వైద్యుడి వాహనాన్ని, ఒక ద్విచక్ర వాహనదారుడు వచ్చి ఢీకొట్టాడు. వైద్యుడు ఫిర్యాదు చేసిన క్రమంలో సీఐ కేసు కట్టాలని చెప్పినప్పటికీ, సదరు రైటర్ మాత్రం రూ.5వేలు ఇచ్చే వరకు కేసు నమోదు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి స్పెషల్ డ్రైవ్లో తీసుకు వచ్చిన వాహనాలూ కోర్టు వెళితే శిక్ష పడుతుందంటూ వేలాది రూపాయిలు గుంజుకుని వాహనాలు వదలి పెడుతున్నాడని తెలుస్తోంది. అవినీతికి పాల్పడితే చర్యలు ట్రాఫిక్ విభాగంలో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. పలు విషయాలు మా దృష్టికీ వచ్చాయి. అక్రమ వసూళ్ళకు పాల్పడే వారి గురించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం. –ఎం.రమేష్, (డీఎస్పీ, ట్రాఫిక్) -
ఓటరు కార్డులకు డోర్ నంబర్లు సరిగా ఉండాలి
కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: ఓటరు కార్డులకు డోర్ నంబర్లు సక్రమంగా ఉండేలా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్కు, డోర్ నంబరుకు సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి పాల్గొన్నారు. బాలల సంక్షేమానికి మరింత కృషి అవసరం జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించేందుకు అధికారులు మరింత కృషి చేయాలన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలల సంరక్షణక తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎం.ఉమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఈఓ రేణుక, డీపీఓ సాయికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
క్రేన్ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరులో క్రేన్ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. పొత్తూరు, సంపత్నగర్ ప్రాంతాలలో ఉన్న ఫ్యాక్టరీలలో అధికారులు సోదాలు చేశారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు మొత్తం 18 మంది ఓ బృందంగా దాడులు నిర్వహించారు. క్రేన్ అధినేత ఫ్యాక్టరీలు, బంధువుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు జరిగాయి. తనిఖీల సమయంలో అధికారులు క్రేన్ సంస్థల సిబ్బంది సెల్ఫోన్లు సీజ్ చేశారు. మంగళవారం రాత్రి అంతా తనిఖీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 18 మంది బృందంతో తనిఖీలు ఫ్యాక్టరీలు, బంధువుల ఇళ్లలో సోదాలు -
‘చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూచీ అనడం పెద్ద జోక్’
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్-2047 ఒక బూటకమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూజీ అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రపంచంలోనే తాను ఒక విజనరీగా చెప్పుకునేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ల నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలుశక్తిని పెంచకుండా, రాష్ట్రంలో తన విజన్తో సంపదను సృష్టిస్తానంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...శాసనసభలో చంద్రబాబు అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడుతూ చేసిన ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేందుకే. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా ఉండి మూడు విజన్ డాక్యుమెంట్లను ప్రకటించారు. విజన్-2020 అని ఒకసారి, విజన్-2029 అని మరోసారి, తాజాగా విజన్-2047 అని మూడోసారి తన స్వర్ణాంధ్ర లక్ష్యాలను ఆయన చాటుతూనే ఉన్నారు. నిజంగా ఒక లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన గతంలో ప్రకటించిన విజన్లలో ఎన్ని సాధించారు? ఎంతమంది ప్రజల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చారు? రాష్ట్రాన్ని ఎంత ఉన్నత స్థాయికి తెచ్చారో చెప్పాలి. గత రెండు విజన్లలోనూ చంద్రబాబు చేసింది ఏమిటా అని చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమే. ఇప్పుడు తాజా విజన్లో పీ4 ద్వారా ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులను కూడా ప్రైవేటువ్యక్తులకు కట్టబెట్టనున్నారు. చివరికి నడిచే రోడ్లను కూడా ప్రైవేటు వారికి అప్పగించి, టోల్ ట్యాక్స్ ద్వారా ప్రజల జేబులు ఖాళీ చేయించబోతున్నారు.విద్య-వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఘనుడుచంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ఘనమైన విజన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించాడు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. విద్యారంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి పూర్తిగా సహకరించారు. తాను సీఎం కాదు, సీఈఓను అని పిలిపించుకునేందుకే చంద్రబాబు ఇష్టపడ్డారు. అలాగే పనిచేశారు. చివరికి చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ వామపక్షాలు ఆయనకు గొప్ప బిరుదును ఇచ్చాయి. ఎంఎస్ఎంఈ లకు బదులుగా కార్పోరేట్ సంస్థలు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మిన నాయకుడు చంద్రబాబు. విజన్ 2020 తరువాత రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య దాదాపు 70 శాతం ఉన్నట్లు తేలింది. అంటే ఆయన విజన్ వల్ల ఎక్కడ సంపద పెరిగింది? ప్రజలు సంపన్నులు ఎందుకు కాలేకపోయారు? చంద్రబాబు విజన్ వల్ల పేదరికం పెరిగింది. హైటెక్ సిటీ, చుట్టుపక్కల భూములు ఏ విధంగా ఒక వర్గానికే ఉపయోగపడేలా చంద్రబాబు విధానాలు సహకరించాయంటూ రీసెర్చ్ స్కాలర్లు పుస్తకాలు రాశారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు.వ్యవసాయం దండగ అనే భావంతోనే పాలనవ్యవసాయం దండగ అనే భావంతోనే చంద్రబాబు పాలన సాగించారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండు కోట్ల మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ అడ్డుకుంటుంటే చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన హయాంలో చెప్పుకునేందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ తీసుకురాలేదు. ఇప్పుడు బనకచర్ల తన ఆలోచనల నుంచే పుట్టిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గతంలో ఐటీని తానే ప్రమోట్ చేశానని, హైదరాబాద్ను ప్రపంచపటంలో నిలబెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తాను లేకపోతే హైదరాబాద్కు ఐటీ వచ్చేదేకాదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. మరి ముంబై, బెంగుళూరు వంటి నగరాలు ఐటీలో మనకన్నా ముందుగానే అభివృద్ధి చెందాయన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు మరిచిపోతుంటారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వల్ల దేశంలో ఎలక్ట్రానిక్ యుగం ప్రారంభమైందని, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఫీజురీయింబర్స్మెంట్ వంటి పథకాల వల్ల గ్రామాల్లోంచి కూడా సాంకేతిక విద్యను చదివిన ఐటీ నిపుణులు పుట్టుకు వచ్చారనే వాస్తవాలను చంద్రబాబు అంగీకరించరు. ఆఖరికి కరోనా వల్ల ఐటీ కంపెనీలు వర్క్ఫ్రం హోం అవకాశం ఇస్తే, దానికి కూడా తన సూచనల వల్లే ఈ విధానంను ఐటీ సంస్థలు పాటించాయని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.పొలిటికల్ గవర్నెన్స్ చంద్రబాబు విజనా?పాత రాజకీయాలకు కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలు తయారు చేస్తానంటూ విజన్ 2020లో ప్రకటించారు. అంటే జన్మభూమి కమిటీలను తీసుకురావడం, పొలిటికల్ గవర్నెన్స్ను తీసుకురావడమే ఆయన విజనా? స్థానిక సంస్థల్లో ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా, ఫిరాయింపులతో పదవులను కాజేయడమే ఆయన గవర్నెన్స్ లక్ష్యమా? ప్లెయిన్ స్పీచ్ అనే పుస్తకంలో ప్రభుత్వం యంత్రాంగం అవినీతిలో మునిగిపోయింది, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవన్నీ చంద్రబాబు మరిచిపోయారా? ఇప్పుడు విజన్ 2047 గురించి బాధ్యత లేకుండా మాట్లాడారు. తన తాజా విజన్లో ఈ దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి వెడుతుందని పేర్కొన్నారు. ఒక సీఎంగా ఏ రకంగా దేశ జీడీపీ గురించి మాట్లాడుతున్నారు? 2047 నాటికి ప్రతి ఇంటికి 18వేల డాలర్ల ఆదాయం ఉండాలని సూచిస్తున్నారు. అంటే 2047 వరకు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏం అడగకూడదు. చంద్రబాబును ఆయన హామీల గురించి ప్రశ్నించకూడదు. స్వర్ణాంధ్ర విజన్ను విజయవంతం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి, పారిశ్రామికవేత్తలను కూడా వారే తీసుకురావాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అలాంటప్పుడు దావోస్కు సీఎంగా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళడం? ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్ళాలిగా? రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తీసుకువస్తాను, సంపదను సృష్టిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా 13 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నమని చెబితే, తాజాగా చంద్రబాబు 17 శాతం వృద్ధి రేటును సాధిస్తామని ఏ ప్రాతిపాదికన చెబుతున్నారు? ఇప్పటి వరకు అన్నింటిలోనూ లోటు కనిపిస్తోంది. ఇలా అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడతారా? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళలో 3.7 శాతం వృద్ధిరేటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో 7.23 శాతం వృద్దిరేటు తక్కువగా ఉంది. సేల్స్ టాక్స్లో 6.66 శాతం వృద్ధిరేటు తక్కువగా ఉంది. క్యాపిటల్ ఇన్వేస్ట్మెంట్ 50.53 శాతం తగ్గింది. సంపద పెరిగిందని ఎలా చెబుతున్నారు? ప్రపంచానికే చంద్రబాబు దిక్సూచీ అనడం పెద్ద జోక్ప్రపంచానికే తాను దిక్సూచీగా మారతానని విజన్ డాక్యుమెంట్లో ప్రకటించుకోవడం పెద్ద జోక్. గతంలో ఆయన హయాంలోనే 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఏపీ ఆయిల్ సీడ్స్ ను కూడా ప్రైవేటువారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, 1.30 లక్షల ఎకరాల ఆర్టీసీ భూములను, వైయస్ జగన్ హయాంలో నిర్మించిన పోర్ట్లను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అలాగే త్రిభాషా విధానంపైన మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజలు కోరుతున్న అన్ని భాషలను ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళలోకి తీసుకురాలేకపోతున్నారు? -
ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ
సాక్షి,గుంటూరు: సీఐడీ కార్యాలయంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని విచారించింది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదామరోవైపు, తనపై నమోదైన కేసులో బెయిల్ కోసం పోసాని కృష్ణమురళి గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా విచారణ నిమిత్తం మరింత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది. -
లంక పొలాల సమస్య పరిష్కరించాలి
తాడేపల్లి రూరల్: కుంచనపల్లిలోని దళిత లంక పొలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లిలో సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజాచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన రైతులతో మాట్లాడారు. కృష్ణానది ఒడ్డున దళితులకు ఇచ్చిన 30 ఎకరాల లంక పొలాల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సాగు చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, సీపీఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, కుంచనపల్లి గ్రామ శాఖ కార్యదర్శి అమ్మిశెట్టి రంగారావు, నాయకులు నాగపోగు విజయరాజు, అమ్మిశెట్టి రామారావు, కంచర్ల సాంబశివరావు, కొండపల్లి యశోద, సింగంశెట్టి రవికిషోర్, అమ్మిశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జనసేన నేత బెదిరింపులపై ఫిర్యాదు
నగరంపాలెం: ప్రైవేటు వైద్యులు సక్రమంగా శస్త్రచికిత్సలు నిర్వర్తించకపోవడంతో కుమారుడు మంచానికి పరిమితమైనట్లు ఓ తండ్రి వాపోయారు. జనసేన నేతపై భార్యభర్తలు ఫిర్యాదు చేశారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) ఏవీ రమణమూర్తి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఏఎస్పీలు కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), శివాజీరాజు (సీసీఎస్)లు కూడా అర్జీలు స్వీకరించారు. రెండేళ్ల కిత్రం కుమారుడు వంశీ క్రికెట్ ఆడుతుండగా కుడి కాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని చిలకలూరిపేటకు చెందిన తండ్రి దార్ల జోజయ్య తెలిపారు. సంగడిగుంట జీరో వీధికి చెందిన ఓ వివాహిత తన అత్తింటివారిపై ఫిర్యాదు చేశారు. తన భర్తకు మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, భర్తను పిలిచి విచారించాలని కోరారు. గుంటూరు టౌన్కు చెందిన ఎస్.వెంకటేశ్వరరావు తన కుమారుడికి ఉద్యోగం నిమిత్తం ఉండవల్లిలోని కన్సల్టెన్సీని సంప్రదించారు. రూ.1.30 లక్షలు చెల్లించాక నకిలీ కాల్ లెటర్ ఇచ్చారని చెప్పారు. న్యాయం చేయాలని కోరారు. కొబ్బరికాయల సాంబయ్య కాలనీకి చెందిన డ్వాక్రా గ్రూప్ లీడర్పై లాలాపేట పీఎస్లో ఫిర్యాదు చేశామని విజయలక్ష్మి, దేవి, దేవిక, హేమలత తెలిపారు. రూ.4.70 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పాతగుంటూరు, దుర్గానగర్ ఒకటో వీధికి చెందిన కర్పూరపు రమాదేవి, రాంబాబు మాట్లాడుతూ.., జనసేన నేతకు రూ.4 లక్షలు ఇచ్చామన్నారు. తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు.