breaking news
Guntur
-
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోసారి ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే.. నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితాన్ని.. కుటుంబాల కష్టార్జితాన్ని ఉద్యోగ పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నారు. వారికి కావాల్సింది ఒక్కటే.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా.. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. వ్యవస్థే విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు కాదు.. మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకం.చంద్రబాబూ.. న్యాయం చేయడం మీకు ఒక ఆప్షన్ కాదు.. ప్రభుత్వపరంగా మీ బాధ్యత. కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?.వారి భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? డీఎస్సీలో బయటపడిన స్కాంకు మీరు బాధ్యత వహిస్తారా? లేదా? నిరుద్యోగుల కలలతో ఆడుకోవడం కాదు..వారి కష్టానికి న్యాయం చేయండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters… pic.twitter.com/hyYMHwsYEK— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వినాయకుని విగ్రహానికి పార్టీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
వైఎస్ జగన్ అడిగింది లోకేష్కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి నేతలకు షాక్ !
గుంటూరు: కొరిటెపాడు ట్యాంక్బండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సింగంశెట్టి కోటేశ్వరరావు భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కన్నసాని బాజీపై సింగంశెట్టి కోటేశ్వరరావు 446 ఓట్లతో విజయభేరి మోగించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొరిటెపాడులోని కొరిటెపాడు ట్యాంక్బండ్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. 2,700 వాకర్స్ ఓట్లకుగాను, 2,222 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సింగంశెట్టి కోటేశ్వరరావు ప్యానెల్లో ఉపా«ధ్యక్షుడిగా ఏరువ ఇన్నారెడ్డి, తలతోటి సురేంద్ర, కార్యదర్శిగా చాగంటి విష్ణువర్థన్రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు, జాలీ వాకర్గా పి.శ్రీనివాస చక్రవర్తి, కోశాధికారిగా ఎల్.సత్యనారాయణ, ఈసీ సభ్యులుగా ఎస్.రామకృష్ణరెడ్డి (జిమ్), కె.శ్రీనివాస రావు (ట్రాక్–1), ఎన్.నరసింహారావు, (ట్రాక్–2), వై.శ్రీనివాసరావు (కల్చరల్) గెలవగా, గార్డెనింగ్ యేళ్ల రత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సింగంశెట్టి కోటేశ్వరరావుకి 1,307 ఓట్లు రాగా, కన్నసాని బాజికి 861 ఓట్లు పోలయ్యాయి.ఫలించని కుతంత్రాలు.. సమీప ప్యానెల్ అభ్యర్థులను ఓడించేందుకు కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బాజీ గెలుపు కోరుతూ ఎమ్మెల్సీ ఆలపాటి, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు బొనబోయిన శ్రీనివాస్లు ఓటు వేసినప్పటికీ కూటమి కుతంత్ర రాజకీయాలను వాకర్స్ తిప్పికొట్టారు. రెండేళ్ల వరకు ట్రాక్వైపు చూడకుండా బుద్ధిచెప్పినట్లయిందని చెప్పుకొంటున్నారు. ఇదీ చదవండి: కుదేలైన ‘పొదుపు’! -
విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#GaneshChaturthi— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026అంతకు ముందు.. ఓ సందేశంలో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే వైఎస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని చుట్టేసిన వినాయకుడు -
పిడుగుపాటుతో నలుగురి మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాల్లో పిడుగుపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం తనను కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: రేపు(సోమవారం, సెప్టెంబర్ 14వ తేదీ) వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
రాజధాని పనుల పురోగతిపై మంత్రి సమీక్ష
వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్ గుంటూరు రూరల్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతేడాది పంట నష్టం కూడా ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్ అన్నారు. గుంటూరు అమరావతిరోడ్డులోని ఓ ప్రైవేటు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు పంటలకు ఇన్స్యూరెన్స్ చేయించి పంట నష్టాలను జగన్ అందజేశాడని, కానీ నేడు టీడీపీ ప్రభుత్వం రైతులతోనే పంటలకు ఇన్స్యూరెన్స్ కట్టాలని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రైతులకు చేసిందేమీ లేకపోయినా కనీసం ఇన్స్యూరెన్స్, పంటనష్టాలను కూడా చెల్లించకుండా రైతులను టీడీపీ ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడటంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి గుంటూరు జిల్లాలో అన్ని మండలాలలో వర్షాభావ పరిస్థితులపై తక్షణమే సమగ్ర పంట నష్టం సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు తగిన పరిహారం, ఇన్న్పుట్ సబ్సిడీ అందించాలన్నారు. వర్షాభావంతో నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విజ్ఞాన్లో ఘనంగా ఏపీ ఫార్మసీ లీడర్షిప్ సమ్మిట్–2026
చేబ్రోలు: ఫార్మసీ రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనా దృక్పథం, నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరమని ఐపీజీఏ అధ్యక్షుడు డాక్టర్ అతుల్ నాసా అన్నారు. ఫార్మసీ రంగంలో భవిష్యత్ అవకాశాలు, కెరీర్ మార్గాలు, వృత్తిపరమైన అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ఏపీ ఫార్మసీ లీడర్ షిప్ సమ్మిట్–2026’ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, ఫార్మసీ కళాశాల, ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐపీజీఏ) ఏపీ స్టేట్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐపీసీ–2026 బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. ‘అన్లాకింగ్ ఫ్యూచర్ కెరీర్స్ అండ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్’ అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఫార్మసీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులకు భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు పరిశ్రమలో వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాంకేతికత, పరిశోధన రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ పీఠం వైఎస్సార్ సీపీదే
నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు. రానున్న గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో కదనరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ షేక్ నూరి ఫాతిమా అధ్యక్షతన నిర్వహించిన తూర్పు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, తూర్పు నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ప్రసంగించారు. తొలుత దివంగత మహానేత డాక్టర వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం నియోజకవర్గంలోని డివిజన్, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను (ఐడీ కార్డులు) పంపిణీ చేశారు. -
శివ శక్తి.. వీక్షణతో సంతృప్తి
తెనాలి: తెనాలికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రాయన గిరిధరగౌడ్ తాజా చిత్రాలు దేశ రాజధాని ఢిల్లీలో కళాప్రియులను ముగ్ధులను చేయనున్నాయి. ఆరుగురు చిత్రకళాకారులతో కలిసి అక్కడి బికనీర్ హౌస్లోని సెంట్రల్ హాలులో ఈ బృంద ప్రదర్శన ఏర్పాటు కానుంది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో గిరిధర్గౌడ్వి ఐదు పెయింటింగ్స్, పది రేఖాచిత్రాలు కొలువుదీరనున్నాయి. లేపాక్షి చిత్రకళలోని సంప్రదాయ ప్రతిధ్వనులను దాటి, ఆధునికతను జోడించి శివ–శక్తిల శాశ్వత తత్వాన్ని దృశ్యీకరించిన చిత్రసరళి ఇది. విభిన్న శైలులు... మైసూర్లో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ, బరోడాలో పీజీ చేసిన గిరిధరగౌడ్ అక్కడే కొంతకాలం ఫ్యాకల్టీగా పనిచేశారు. ఉద్యోగ జీవితం సంతృప్తిగా అనిపించక తెనాలి సమీపంలోని స్వస్థలం గరువుపాలెంలో స్థిరపడ్డారు. అక్కడే చిత్రకళా రచనలో ప్రయోగాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రభావంతో తొలిదశలో పౌరాణిక చిత్రాలను గీస్తూ వచ్చారు. ఒకే మూసకు పరిమితం కాకుండా తన కళాజీవితంలో మహాభారతం, రామాయణం ఇతివృత్తాలను, విభిన్న శైలులను అనుసరించి ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రకళా సిరీస్ను రూపొందిస్తున్నారు. వర్ణాల వినియోగంలో విలక్షణత గిరిధరగౌడ్లోని ప్రత్యేకతగా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ‘లేపాక్షి’కి నవ్యధోరణి... కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఫెలోషిప్తో లేపాక్షి చిత్రకళపై చేసిన పరిశోధన అనంతరం చిత్రకళా రీతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఐదు శతాబ్దాల నాటి లేపాక్షి కళలోని మంచి లక్షణాలను, శైలిని దృష్టిలో ఉంచుకొని నవ్యధోరణితో, రంగుల మేళవింపుతో ఆధునికతను మేళవిస్తున్నారు. చిత్రకళా రచనలో ‘దశావతారాలు’ నుంచి రకరకాల సిరీస్లను తీసుకొచ్చారు. ఆ క్రమంలో చిత్రీకరించిన కళాఖండాలను ‘శివ శక్తి’ సిరీస్గా గతేడాది హైదరాబాద్ కళాకృతిలో ప్రదర్శించారు. తాజాగా ఢిల్లీలో బృంద ప్రదర్శనకు చేసిన చిత్రాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హిందూ చింతనలోని అత్యంత లోతైన తాత్విక భావనలలో ఒకటైన శివ–శక్తి శాశ్వత తత్వాన్ని అన్వేషించేవిగా ఉన్నాయి. చైతన్య తత్వాన్ని వివరించేలా... శివ–శక్తికి సంబంధించిన విడదీయరాని బంధాన్ని శ్రీచక్రం, ప్రకృతి–పురుష తత్వం ద్వారా దృశ్యకళారీతిలో ప్రయోగాత్మకంగా చేసిన చిత్రసరళిగా గిరిధరగౌడ్ చెప్పారు. శివుడు, శివ శక్తి, నంది, సింహనంది, మయూర, గణపతి, కుమారస్వామి, మూషికం... కుటుంబం అంతా మమేకమై సృష్టికి సంబంధించిన చైతన్యతత్వాన్ని వివరించే దృశ్య రూపాలివి. వీటిలో సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ రూపాలను ఈ చిత్రసరళిలో శ్రీచక్ర రూపంలో ఇమిడి ఉండేలా చిత్రీకరించారు. శ్రీచక్రం స్వరూపాన్ని కేవలం దృశ్యమాధ్యమంలా కాకుండా, శివ–శక్తి త్రికోణాత్మక తత్వాలను జోడించారు. ఆదిశంకరాచార్య ‘సౌందర్యలహరి’లోని శ్లోకాలను స్ఫూర్తిగా తీసుకుని, అర్ధనారీశ్వర స్తోత్రానికి ఆలంబనగా శివకుటుంబం మహత్యాన్ని దృశ్యమాధ్యమంలో తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. అక్రిలిక్ పెయింటింగ్స్కు బంగారం, వెండి పూతను అద్దటం మరో విశిష్టత. దేశవిదేశాల్లో చిత్రాలు... గత మూడు దశాబ్దాల్లో వివిధ రాష్ట్రాల్లోని గ్యాలరీల్లో 10 సోలో ఎగ్జిబిషన్లు చేశారు గిరిధరగౌడ్. దేశవ్యాప్తంగా జరిగిన 37 గ్రూప్ ఎగ్జిబిషన్లలోనూ చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో లండన్, న్యూయార్క్, సింగపూర్, చైనా తదితర ఎగ్జిబిషన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతోపాటు అనేక కళాసంస్థల నుంచి గౌరవాన్ని అందుకున్నారు. -
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే దోపిడీ ముఠాలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆధారాలు దొరక్కుండా వ్యూహాత్మకంగా దోపిడీలకు పాల్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడడంతో బయట రాష్ట్రాల వారితోపాటు జిల్లాకు చెందిన కొంతమంది కూడా ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడులో హత్యలు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీల పరంపరను పరిశీలిస్తే.. అధిక శాతం దొంగతనాలు తాళాలు వేసి ఊరికి వెళ్లిన వారి ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు ఉండే ఇళ్లను ముందుగానే రెక్కీ వేసి ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. 80 శాతం దొంగతనాలు ఇలాంటివే కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో... బాపట్ల జిల్లాలో... బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల, మార్టూరు వంటి ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో భారీ మొత్తంలో సొత్తు చోరీకి గురైనట్లు కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో సొత్తు మాత్రం రికవరీ చేయని పరిస్థితి నెలకొంది. వినుకొండ పట్టణంలో వరుస దొంగతనాలు అక్కడి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించి రాత్రిపూట గస్తీలు ముమ్మరం చేసి దొంగతనాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లక్ష్మీపురం: క్రికెట్ అండర్–19 వన్డే ఆంధ్రా జట్టుకు గుంటూరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎ.దేవ ప్రమోద్ వికెట్ కీపర్ కం బ్యాటర్, ఎం. శ్రీ సమన్విదత్త ఓపెనింగ్ బ్యాటర్గా, కె.వి.కౌశిక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా, ఎస్.కె. అబ్దుల్ జబ్బర్ లెగ్ స్పిన్నర్గా జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆంధ్రా జట్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు త్రీ మెన్ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. త్వరలో జరగబోయే అంతర్రాష్ట్ర పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్కి, సెలక్షన్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గంటల కొద్దీ ట్రాఫిక్కు అంతరాయం చేబ్రోలు: చేబ్రోలు – మంచాల గ్రామాల మధ్య ఉన్న కొమ్మమూరు బ్రిడ్జిపై శనివారం రాత్రి లారీ నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొన్నూరు, గుంటూరు మార్గాల వైపు కి.మీ.ల పొడువున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎనిమిది రోజుల కిందట కొమ్మమూరు బ్రిడ్జికి ఒకవైపు కొంతభాగం కూలిపోయింది. అప్పటి నుంచి పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. పెద్ద వాహనాలు బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది. పొన్నూరు వైపు లారీ వెళుతుండగా బ్రిడ్జిపైభాగంలో ఎదురుగా మరో వాహనం వచ్చింది. లారీ ఆగిపోవటంతో దీనిని సర్దుబాటు చేయటానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. రెండు వైపులా సుమారు ఐదు కి.మీ. మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్రిడ్జి దాటడానికి వాహనదారులకు గంటలకొద్దీ సమయం పట్టడంతో అవస్థలు తప్పలేదు. మరోవైపు వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి అయినప్పటికీ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో క్లియర్ కాకపోవడంతో పోలీసులకు కూడా కష్టాలు తప్పలేదు. ఈపూరు: తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ జలాలను విడుదల చేసిన క్రమంలో 85వ మైలు సమీపంలో కుడి ప్రధాన కాలువను ఎస్ఈ టి. రమేష్ శనివారం పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహ కొలతలను తెలుసుకున్నారు. నీటి వృథా జరగకుండా కాలువలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను పరిగణనలో తీసుకుని తాగునీటి చెరువులను సకాలంలో నింపాలని ఆదేశించారు. వెంట ఈఈ ఆర్.మల్లికార్జున, డీఈఈ షేక్ ఖాదర్, ఏఈ ఎం యుగంధర్ ఉన్నారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,535 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హై లెవెల్కి 96 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 604, తూర్పు కాలువకు 403, పశ్చిమ కాలువకు 150, నిజాంపట్నం కాలువకు 250, కొమ్మమూరు కాలువకు 915 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దొంగతనాలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడంతో పాటు, దొంగలు దొరికినా బాధితులు పోగొట్టుకున్న సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో వారి చేతికి అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోరులు చెలరేగిపోతున్నారు. దొంగతనానికి వచ్చి ఇంట్లోని వారిని సైతం చంపేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ దొంగతనాలు, దోపిడీలతో హడలిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా నేరాల నియంత్రణకు చంద్రబాబు సర్కారు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఐ ప్రతీకాత్మక చిత్రం -
సివిల్ కేసుల పరిష్కారంలో గుంటూరుకు ప్రథమస్థానం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ మార్గదర్శకత్వంలో, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ చక్రవర్తి నాయకత్వంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన జిల్లా కోర్టు ప్రాంగణంలో కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 46 బెంచ్లను, జిల్లా కోర్ట్లో 16 బెంచ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 14,587 కేసులను పరిష్కరించారు. వీటిలో సివిల్ కేసులు 954, క్రిమినల్ కేసులు 13594, ప్రీ– లిటిగేషన్ కేసులు 39 ఉన్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చాలాకాలంగా పెండింగ్లో ఉన్న అధిక విలువ కలిగిన అనేక కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించబడ్డాయని తెలిపారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రంలో సివిల్ కేసుల పరిష్కారంలో వరుసగా ఆరుసార్లు ప్రథమ స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు. అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అదనపు సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్), న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ సభ్యులు, ఇన్స్యూరెన్స్ కంపెనీ, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న 24 భూ సేకరణ అప్పీళ్లకు లోక్అదాలత్లో పరిష్కారం లభించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దేవరపల్లి జయంత్ కుటుంబసభ్యులకు రూ.96 లక్షల పరిహారం చెల్లించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీ అంగీకరించింది. సోదరీమణులు తమ ఆస్తి హక్కును వదులుకుని రూ.రెండు కోట్లు స్వీకరించేందుకు అంగీకరించారు. -
మద్యం దుకాణాల రెన్యూవల్కు నోటిఫికేషన్
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఓపెన్, రిజర్వు కేటగిరీ మద్యం దుకాణాల రెన్యూవల్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శనివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక ఏడాది కాలపరిమితికి (01.10.2026 – 30.09.2027 వరకు) గానూ ఈ కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పరిధిలో 125 ఓపెన్ దుకాణాలు, 13 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నాయని తెలిపారు. పల్నాడు జిల్లాలో 129 ఓపెన్, 13 గీత కులాల మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పారు. చెల్లింపు నిబంధనలు ఇలా... నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు వైన్ షాపుల్లో ఎమ్మార్పీ ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని.. ఎవరైనా మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నట్లు గుర్తిస్తే మొదటిసారి రూ.10 లక్షలు జరిమానా.. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. అదే విధంగా ప్రతి షాపులోనూ తప్పనిసరిగా సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉండాలని, వాటికి కమాండ్ కంట్రోల్ అయిన ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్, జిల్లా అధికారులకు యాక్సెస్ ఉంటుందన్నారు. సీసీ కెమెరాలను ట్యాంపరింగ్ చేస్తే మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి రూ. లక్ష, మూడోసారి లైసెన్స్ రద్దు ఉంటుందన్నారు. 21వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఆసక్తిగల వారు ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఏపీఎస్బీసీఎల్టీడీ.ఏపీ.జీఓవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ఎవరైనా మద్యం షాపులను రెన్యూవల్ చేసుకోని వారు ఉంటే, సదరు షాపులకు ఈ నెల 22 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించి, 30వ తేదీన లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) వి. అరుణకుమారి, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు పాల్గొన్నారు. -
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్గా నిలబడాలి...ఎల్నినో ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి
గుంటూరు: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై అమానుషంగా దాడిచేసిన ఘటనపై తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ బస్సు వెళ్తోంది. ఆ డ్రైవర్ను తలమల ఏసురాజు నడుపుతున్నాడు. బస్సు ముందు బైక్పై వెళ్తున్న పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం డ్రైవర్పై దాడిచేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్బుక్ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి, నోటీసులు జారీ చేశారు. ఏపీలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి.విధుల్లో ఉండగానే దాడి⚡ విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ విధులకు ఆటంకం కలిగించి, అతడిపైనే తీవ్రంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.#AndhraPradesh #RTCDriver #Attack #APNews pic.twitter.com/Io5z3XUoOQ— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 11, 2026ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి -
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్ట్యాగ్తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
‘కాటూరి’లో అరుదైన సమస్యకు శస్త్ర చికిత్స
ప్రత్తిపాడు: అరుదైన సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి కాటూరి వైద్యుల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్సను చేసింది. వివరాలు.. గ్రామానికి చెందిన రితిక(6) తన మూడవ సంవత్సరం నుండే మూత్రకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. బాలికను ఆమె తల్లిదండ్రులు ఇటీవల ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలోని కాటూరి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యుల బృందం బాలికకు సీటీ యూరోగ్రామ్ పరీక్షలు చేసి రెండు వైపులా డ్యూప్లెక్స్ కిడ్నీలు, డబుల్ యూరేటర్లు (మూత్రనాళాలు) ఉన్నట్లు నిర్ధారించారు. కుడి వైపునున్న కిడ్నీ ఎగువ భాగం మూత్రనాళం బాగా ఉబ్బి, వంకర్లు తిరిగి యోని లోపలకు తెరుచుకుని ఉండటం వలనే నిరంతరం యోని నుంచి ద్రవ స్రావం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో కుడి కిడ్నీలో పనిచేయని ఎగువ భాగాన్ని, ఉబ్బి వంకర్లు తిరిగిన ఎగువ మూత్రనాళాన్ని డాక్టర్ బి.ప్రకాశరావు, డాక్టర్ నిషాంత్, డాక్టర్ వెంకటేశ్వరరావులతో కూడిన వైద్యుల బృందం గురువారం శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యాధి వివరాలను వైద్యుల బృందం వెల్లడించింది. చిన్నపిల్లల్లో నిరంతర యోని స్రావాలు, పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తే ‘ఎక్టోపిక్ యూరేటర్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ఎక్టోపిక్ యూరేటర్ చాలా అరుదైన సమస్యని, రెండు నుంచి నాలుగు వేల మందిలో ఒకరు ఈ సమస్య బారిన పడతారని తెలిపారు. అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందాన్ని మేనేజ్మెంట్ అభినందించింది. ఎక్టోపిక్ యూరేటర్ సమస్యకు సమర్థంగా చికిత్స -
మేధకు వెన్నుదన్ను
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రస్తుతం తరం విన్నూత ఆలోచనలతో ముందుకెళ్తోంది. సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. పరిష్కారానికి సులవైన మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్పైర్ చేసే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోంది. చిట్టిబుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలో ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తు న్న కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో వా టికి బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతో పాటు సైన్స్ ఉపాధ్యాయులకు అప్పగించింది. తాజాగా 2026–27 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ మానక్ రిజస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను నమోదు చేసుకునేందుకు తుది గడువు ఈనెల 15న ముగియనుంది. ప్రాజెక్టుల తయారీ కోసం.. విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాలస్థాయిలో మూడు చొప్పున ప్రాజెక్టులను విద్యార్థులతో ఆన్లైన్లో రిజిస్టర్ చేయించాల్సి ఉంది. అందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని వారి పాఠశాలల్లో విద్యార్థులకు గైడ్గా వ్యవహరించేందుకు సైన్స్ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాల్సి ఉంది. గతేడాది 1,100 ప్రాజెక్టులు నమోదు గతేడాది ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలకు గుంటూరు జిల్లా నుంచి నమోదు చేసిన 1,100 ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 88 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సంబంధిత ప్రాజెక్టుల తయారీకి ఒక్కో విద్యార్థికీ రూ.10 వేలు చొప్పున మంజూరు చేసింది. గతంలో నిర్వహించిన ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శనల్లో భాగంగా పలువురు విద్యార్థులు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటి కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు పొందిన విద్యార్థులు ఉన్నారు. నమోదు ఎలా అంటే.. విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డ్స్– డీఎస్టీ.జీవోవీ.ఇన్ సైట్కు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. విద్యార్థి పేరు, పాఠశాల, చదువుతున్న తరగతి వివరాలతో పాటు విద్యార్ధి ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, పేరెంట్ జాయింట్ అకౌంట్ నంబ ర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు న మోదు చేయాలి. పూర్తి వివరాలను హెచ్ఎం, సైన్స్ టీచర్ల నుంచి పొందాలి. విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను పరిశీలించిన తరువాత వాటిలో బెస్ట్ ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసి, ప్రదర్శన జరిగే సమయంలో వాటిని తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులను కలుపుకుని సంబంధిత విద్యార్థికి రూ.10 వేలు చొప్పున కేంద్ర అందించనుంది. సమస్యలకు పరిష్కారానికి వినూత్న ఆలోచనలు ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తుది గడువు ఈనెల 15న ముగియనుంది. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, రెసిడెన్షియల్, సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వలన సమాజానికి, ప్రజలకు మేలు చేసే అంశాలతో ప్రాజెక్టు నివేదికను గైడ్ టీచర్ సహాయంతో సిద్ధం చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. వైజ్ఞానిక ప్రతిభ, నూతన ఆలోచనలు కలిగిన విద్యార్థులకు ఆకాశమే హద్దుగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనల ద్వారా ప్రతిభ చాటేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు ప్రాజెక్టులు, హైస్కూల్, ఇంటర్మీడియెట్ స్థాయిలో ఐదు ప్రాజెక్టుల చొప్పున నమోదు చేసుకోవాలి. ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనపై అన్ని యూపీ, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ యాజమాన్యాలు విద్యార్థులకు సమాచారం ఇచ్చి, ఆసక్తి గల విద్యార్థులను కచ్చితంగా ప్రోత్సహించాలి. తరగతి గదిలో చదువుతో పాటు విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంలో ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఎంతో కీలకం. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని పాఠశాలలు, కళాశాలలు తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రోత్సహించాలి. –షేక్ సలీమ్ బాషా, జిల్లా విద్యాశాఖాధికారి -
ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి
తాడేపల్లి రూరల్: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై అమానుషంగా మీదపడి దాడిచేసిన ఘటనపై ఆలస్యంగా తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ను పెనుమాక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో డ్రైవర్ తలమల ఏసురాజును పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు ఆపి డ్రైవర్ను విచక్షణా రహితంగా దాడిచేశాడు. జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వీరేంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును విచక్షణా రహితంగా కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్బుక్ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్కు అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు. గుంటూరు రూరల్: కారు డ్రైవర్ ఓవర్ స్పీడుకు బొలెరో డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఎన్హెచ్ 16లో బుడంపాడు వద్ద ప్రకాశం జిల్లాకు చెందిన పాలకుర్తి వెంకటేశ్వర్లు బొలెరో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో శుక్రవారం విజయవాడ వైపు నుంచి బొలెరో ట్రక్లో బాతుల లోడుతో వెళుతూ బుడంపాడు వద్ద హైవే నుంచి కిందకు దిగుతున్నాడు. అదే క్రమంలో తెనాలి బాలాజీరావుపేటకు చెందిన జల్లి సతీష్ హైవే సమీపంలోని ఆస్పత్రిలోలో ఆరోగ్యం చూపించుకుని హైవే ఎక్కేందుకు తన కారులో వెళుతున్నాడు. కారులో వెళుతూ మితిమీరిన వేగంతో హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగుతున్న బొలెరో ట్రక్ను ఢీకొన్నాడు. బొలెరో ట్రక్ బోల్తాపడగా డ్రైవర్ వెంకటేశ్వర్లు(45) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించి మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలి
గుంటూరు మెడికల్: పండుగలను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ బాధ్యతతో జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ పర్యావరణ హిత వినాయక చవితి వేడుకలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం గుంటూరు ఆధ్వర్యంలో పర్యావరణ మానవ సమాజ భద్రత ఫౌండేషన్, పర్యావరణ విద్యా కో ఆర్డినేటర్ డి.తిరుపతిరెడ్డి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగమని చెప్పారు. అయినప్పటికీ వాటి వల్ల పర్యావరణానికి హానికలుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కృష్ణయ్య వెల్లడించారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం మాట్లాడుతూ ప్లాస్టర్ ప్యారీస్(పీఓపీ) విగ్రహాలు, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యతతోపాటు, జలచరాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన విగ్రహాలు, సహజ రంగులను వినియోగించడం పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయమని వెల్లడించారు. పండుగ సమయంలో ప్లాస్టిక్ అలంకరణలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. సహజ పదార్ధాలను ఉపయోగించాలని, పర్యావరణానికి హాని కలుగకుండా బాధ్యతాయుతమైన నిమజ్జన పద్ధతులు పాటించాలని సూచించారు. సహజ మట్టితో, వివిధ విత్తనాలతో కలిపి తయారు చేసిన 3వేల గణేష్ విగ్రహాలను రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఉచితంగా పంపిణీ చేశారు. పూజల అనంతరం విగ్రహాలను మట్టిలో నాటడం ద్వారా వాటిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరిగే విధంగా రూపొందించినట్లు నజీనా బేగం చెప్పారు. సంప్రదాయ పండుగను పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, జీవ వైవిద్య పరిరక్షణతో అనుసంధానం చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు పాల్గొన్నారు. -
ఏపీ సీఆర్డీఏ గ్రీవెన్స్ రద్దు
తాడికొండ: రాజధానిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను వినాయక చవితి పర్వదినం సందర్భంగా రద్దు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి సెలవు దినాలలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ సమస్యలు పంపించాలని సూచించారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింగు గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సింగు నరసింహారావును వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జీడీసీసీ బ్యాంక్ బ్రాంచిల్లో డిపాజిట్లు పెంచాలి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(జీడీసీసీబీ) పరిధిలో డిపాజిట్లను గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సూచించారు. జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశం బ్యాంక్ చైర్మన్ మక్కెన అధ్యక్షతన బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జీడీసీసీ బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల పనితీరు, ఆర్థిక పరిస్థితి, రైతులకు అందుతున్న రుణ సదుపాయాలు తదితర అంశాలపై జరిగిన సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. సమావేశంలో నాబార్డు డీడీ శరత్, ఆప్కాబ్ జీఎం అశ్విని, జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో వృద్ధుడికి యావజ్జీవం గుంటూరు లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగం శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. పెదకాకాని పోలీస్ స్టేషన్న్లో నమోదైన క్రైమ్ నంబర్ 708/2021 కేసులో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన షేక్ సుభాని(70) నిందితుడిగా ఉన్నారు. బాధితురాలి తరఫున బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవర్లు బాధ్యత తీసుకోవాలి పట్నంబజారు: ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవర్లు బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జి.సామ్రాజ్యం సూచించారు. ఆర్టీసీ బస్టాండ్లోని తిక్కన కాన్ఫెరెన్స్ హాలులో శుక్రవారం హయ్యర్ బస్సులు, ఆంకాల్ బస్సుల డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆర్ఎం సాంబ్రాంజ్యం మాట్లాడుతూ సెల్ఫోన్ డ్రైవింగ్, మద్యం తాగడం, ఇతర కారణాలతో డ్రైవింగ్ చేయడం వలన ప్రయాణికుల జీవితాలు ఇబ్బందులు నెట్టడమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వేగనియంత్రణ, సమయస్ఫూర్తితో డ్రైవింగ్చేయాలన్నారు. అనంతరం బస్సుల ద్వారా ప్రమాదాలు జరిగిన సమయంలో ఏవిధంగా ఎదుర్కొవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఏఎస్ఐ, వైద్యశాల సెక్యూరిటీపై దౌర్జన్యం తెనాలిరూరల్: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఔట్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ, వైద్యశాల సెక్యూరిటీపై దౌర్జన్యం చేసి దాడి చేయబోయిన వ్యక్తిపై కేసు నమోదైంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవలి నుంచి సాయి, మరి కొంత మంది తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు గురువారం అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో వచ్చారు. మద్యం తాగి ఉన్న వారు అక్కడ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న యువకుడితో వాగ్వాదానికి దిగి దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న ఔట్పోస్ట్లోని ఏఎస్ఐ రఘు వెళ్లారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయనపైనా దౌర్జన్యం చేశారు. దీనిపై త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. -
నేడు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 44 బెంచెస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్, చెక్కు బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మీడియేటర్స్కు వర్చువల్ పద్ధతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రైనీ ఆర్. విజయ కమల మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వీఎస్వీ హిమబిందు, సీనియర్ సివిల్ జడ్జి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అదనపు కార్యదర్శి హెచ్. అమరలింగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి కొండపై కొలువైన గండాలయ స్వామికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కొండపై దీపాలు వెలిగించారు. మంగళగిరితోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున గండాలయ స్వామికి దీపాలు వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి అమావాస్యకు కొండపై స్వామి సన్నిధికి చేరుకుంటారు. దీపాలు వెలిగించడం వల్ల చీకటి దూరమై వెలుగులు నిండుతాయని, జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మంగళగిరి కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో మిర్చి యార్డులో క్రయవిక్రయాలు, ఇతర మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెలవు రోజుల్లో మిర్చి పంటను యార్డుకు తీసుకురావద్దని యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి యార్డులో యథావిథిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు. యడ్లపాడు: చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్ఎన్ మూర్తి, సీఆర్డీఏ పర్యవేక్షక ఇంజినీర్ బీవీ సుధాకర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట టౌన్ సెక్షన్ పరిధిలో ఈ తనిఖీలు చేశారు. 34 బృందాలు, 34 మంది అధికారులు, 85 మంది సిబ్బంది పాల్గొన్నారు. 1,885 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. ప్రత్యేక తనిఖీల్లో 115 కేసుల్లో వినియోగదారులకు రూ.8.79 లక్షల అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ ఇంజినీర్ డీపీఈ సీహెచ్ వెంకటేశ్వరరావు, గుంటూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ వై. ఏడుకొండలు వివరాలను వెల్లడించారు. విద్యుత్ అక్రమ వినియోగంపై 94408 12263, 94408 12360 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో పలు విభాగాల డీఈఈలు పి. భార్గవి, కె.రవికుమార్, ఎన్. మల్లికార్జున ప్రసాద్, ఏఈఈలు ఎన్. కరుణాకర్, ఎం.సతీష్కుమార్, యు. శివశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
రూ.1,272 కోట్లతో ఆరోగ్య వసతులు
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు రూ.1,272 కోట్లతో చేపట్టిన ఆరోగ్య వసతుల పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం గుంటూరు మెడికల్ కాలేజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.249.50 కోట్లతో పూర్తి చేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో రూ.234.50 కోట్లతో 10 అత్యవసర చికిత్స కేంద్రాలు, రూ.15 కోట్లతో 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 24 అత్యవసర చికిత్స కేంద్రాలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 10 పూర్తయ్యాయని చెప్పారు. సెప్టెంబరు నెలాఖరుకు మరో మూడు పూర్తి చేసి, మార్చి నాటికి మొత్తం 24 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డిసెంబరులో ‘సంజీవని’ డిసెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను అనుసంధానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు వివరించారు. -
పేదల వైద్యంపై పాలకుల కుట్ర
పేదల ఆరోగ్యంపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. నాడు వారిని ఆదుకునేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి పేరుమార్చి మరీ నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు అంటే నెట్వర్క్ ఆసుపత్రులు భయపడేలా బిల్లుల బకాయిలు పెట్టింది. వైద్యం చేయించుకోవాలని ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరణే ఎదురవుతోంది. కొర్రీలు పెట్టి నానా అవస్థలు పడేలా వ్యవహరిస్తోంది. ఆపరేషన్లకు పేద రోగులు రూ.వేలల్లో ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. గుంటూరు జీజీహెచ్లో కనీసం మందులు కూడా పూర్తిగా ఇవ్వని దుస్థితిలో టీడీపీ పాలన సాగుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: అనారోగ్య సమస్యతో గత నెల 10వ తేదీన వెంకటేశ్వర్లు (60) గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా తనకు ఉచితంగా ఆపరేషన్ చేయాలని రోగి కోరాడు. డబ్బులు తమకు సకాలంలో విడుదల కావడం లేదని, అదనంగా రూ.30 వేలు చెల్లిస్తే ఆపరేషన్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అంత మొత్తం లేక వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఇలా నిత్యం గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్స అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు రావడం లేదని, అందుకే ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతున్నామని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్లు సమాధానం ఇస్తున్నారు. అంతిమంగా పేద రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందక డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకోవడంగానీ, జీజీహెచ్కు వెళ్లడంగానీ చేస్తున్నారు. తొమ్మిది నెలలుగా బిల్లులు పెండింగ్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి గతంలో ఉన్న రోగాల జాబితాను తగ్గించడం, ఆపరేషన్ల ప్యాకేజ్ తగ్గించడం, అనుమతులు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం నిత్యకృత్యంగా మారింది. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులను తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉంచడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చెరిపివేయాలనేది కుట్రలో భాగంగా పేరు మార్చింది. ఆరోగ్యశ్రీ అనే పేరు ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ పేరును చెరపలేమని భావించి కార్డులను సైతం మార్చివేసింది. బిల్లులు రాక కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేందుకు వచ్చే నిరుపేద రోగులను చేర్చుకోవడం లేదు. అనుమతులకు సాగదీత ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకునే రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఒక్క రోజులో అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ అనుమతులు రావాలంటే కనీసం నాలుగు నుంచి వారం రోజులు కూడా పడుతోంది. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులను గతంలో ప్రతి నెలా సక్రమంగా చెల్లించేవారు. ఆసుపత్రుల నిర్వాహకులు సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చేవారు. నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ.1,500 కోట్లు బకాయిలు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం రూ. వెయ్యికోట్లకుపైగానే చెల్లించాల్సి ఉంది. నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్లు మాత్రమే విడుదల చేస్తుండటంతో బకాయిలు పెరుగుతున్నాయేగానీ తగ్గని పరిస్థితి నెలకొంది. దీనిపై నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఫాలోఅప్ మందులు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలనెలా ఇచ్చే మందుల్లో రెండు, మూడు రకాలను మాత్రమే ఇస్తున్నారు. మిగతావి లేవని, మరుసటి రోజు రావాలని చెబుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే మందుల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని వారు మండిపడుతున్నారు. రోగులకు అంత ఓపిక లేక బయట మార్కెట్లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేయడమే ధ్యేయం వ్యవహారం ఉందని వైద్యులే చెబుతున్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్స్ (యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. యూఎఫ్బీయూ పరిధిలోని ఏడు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. గుంటూరు నగరం, జీటీ రోడ్లో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ బ్యాంకుల యూనియన్ల నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్న్ (ఐబీఏ)తో చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్పీఎస్కు బదులుగా పాత పెన్షన్న్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె, అనంతరం అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల నాయకులు కె.రవికుమార్, కేఆర్వీ విజయ్కుమార్, నాగపావని, కె.కోటిరెడ్డి, రాంబాబు, మైనేని శివప్రసాద్, ఏఐటీయూసీ నాయకుడు వి.రాధాకృష్ణమూర్తి, సీఐటీయూ నాయకులు లక్ష్మీనారాయణ, నళినీకాంత్, ఎం.సాంబశివరావు, జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చిట్టి చేతులతో మట్టి గణపతి తయారీ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్ గణేష్’ కార్యక్రమం ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. శుక్రవారం నగరంలోని 55 పాఠశాలలకు చెందిన 25 వేల మంది విద్యార్థులు ఏకకాలంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ ఘనత సాధించారు. గతంలో 8,750 మందితో ఉన్న రికార్డును అధిగమించడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి ఎలియాజ్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై భావితరాలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సైకత వినాయకుడు, మట్టి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే సహించం
లక్ష్మీపురం: ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. గుంటూరు నాజ్ సెంటర్లోని ఆర్జేడీ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఐఓ సునీత, ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే నోటీసులు ఇచ్చి సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించకుండా చూస్తామని ఆర్ఐఓ, ఆర్జేడీ హామీచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర నాయకులు మహేష్, సతీష్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ కోటేశ్వరరావుకు గుర్రం జాషువా పురస్కారం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుర్రం జాషువా 2026 సాహితీ పురస్కారం ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు అధ్యాపకుడు ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావుకు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం ఉదయం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు జరిగే సాహితీ సభలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు వివరించారు. గతంలో సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, చంద్రబోస్, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, ఓల్గా వంటి ప్రముఖులకు ఈ పురస్కారం అందించామన్నారు. జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కవితా సమ్మేళనం, 25వ తేదీన దేశభక్తి, అభ్యుదయ పాటల పోటీలు, జాషువా పద్యాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ‘దేశంలో విద్య, ఉద్యోగాల పరిస్థితులు– యువత, విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని చెప్పారు. జాషువా పురస్కార సభలో ముఖ్య వక్తగా ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథులుగా ప్రజాశక్తి దినపత్రిక డెప్యూటీ ఎడిటర్ వి.రాం భూపాల్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జాషువా విజ్ఞాన కేంద్రం ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్.భావన్నారాయణ, కార్యదర్శి వి.వి.కె.సురేష్, ఎస్.పద్మ, కాకుమాను నాగేశ్వరరావు, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు. -
రైలు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
లక్ష్మీపురం: సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో అర్ధరాత్రి చైన్ లాగి ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కొని పరారీ అయిన భవారియా గ్యాంగ్లో మూడో నిందితుడిని రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గుంటూరు రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో గుంటూరు రైల్వే పోలీస్ డీఎస్పీ అక్కేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమంయలో చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఆరుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ దుండగులు, అప్పికట్ట రైల్వే స్టేషన్ సమీపంలోని నాగరాజు కాలువ వద్దకు రాగానే చైన్ లాగి రైలును నిలిపి వేశారు. రైలులోని ఎస్–3, ఎస్–6 బోగీలలో ఇద్దరు మహిళలల మెడల్లో సుమారు 75 గ్రాముల బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన రైలు బందోబస్తు పోలీసు సిబ్బంది అయిన కొండెపి సాయి, ప్రయాణికులపై కంకర రాళ్లతో, క్యాట్ బాల్తో దాడి చేయడంతో పాటు కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు హెచ్చరించినప్పటికీ దుండగులు వినక పోవడంతో ఆత్మ రక్షణార్థం ఎస్ఎల్ఆర్ ఆయుధంతో ఏఆర్ పోలీసులు వి.రవికుమార్, కె.బాలకెంటరెడ్డి, ఆర్పీఎఫ్ సిబ్బంది ఎం.అలెగ్జాండర్, ఎం.వెంకటనాగరాజు పది రౌండ్లు నిందితులపై కాల్పులు జరిపారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై తెనాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ లోదే సరస్వతి కేసు నమోదు చేశారు. జూలై 3వ తేదీన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో అరెస్టు దర్యాప్తులో భాగంగా హరియాణా రాష్ట్రం నూహ జిల్లా, సాంగెల్ గ్రామానికి చెందిన నిందితులలో ఒకరైన ఏ 3 కిషన్ సింగ్ అలియాస్ సీతారామ్ను ఈనెల 8వ తేదీన గ్రామంలోని ఇంటి వద్ద అరెస్ట్ చేసి నూహా స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పొంది శుక్రవారం గుంటూరు ఫస్ట్ క్లాస్ రైల్వే కోర్టులో హాజరు పరిచారు. సాంకేతిక ఆధారాలతో ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన గుంటూరు రైల్వే డీఎస్పీ పి.అక్కేశ్వరరావు, గుంటూరు లైన్ సర్కిల్ సీఐ పి.నరసింహారావు, చీరాల పోస్ట్ ఐపీఎఫ్ బి.చంద్రశేఖర్రావు, గుంటూరు ఆర్పీఎఫ్ ఎస్ఐ షేక్ మహబూబ్ సుభాని, ఆర్పీఎఫ్ ఇన్చార్జి మహిళా ఎస్ఐ ఎల్.సరస్వతి, నరసరావుపేట, బాపట్ల ఆర్పీఎఫ్ ఎస్ఐలు ఎం.రాజమోహన్, ఎస్.మనోజ్కుమార్రెడ్డి, చీరాల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పూర్ణచంద్రారావు, ఒంగోలు ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బజార్, రేపల్లె ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గోపీలను రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. గత రెండు సంవత్సరాలుగా చేసిన నేరాలు ఇవే... ఈ నేరంతో పాటుగా రాజస్థాన్ భవారియా గ్యాంగ్ గుంటూరు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు సంవత్సరాల నుంచి చైన్ లాగి, సిగ్నల్ ట్యాంపరింగ్ నేరాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కిషన్ సింగ్ను విచారించగా గుంటూరు జీఆర్పీ సబ్ డివిజన్ పరిఽధిలో 12 నేరాలు చేసినట్లుగా వెల్లడైంది. నడికుడి న్యూ పిడుగురాళ్ల, తుమ్మల చెరువు, దొనకొండ, అప్పికట్ల వద్ద జరిగిన నేరాలు, అదే విధంగా తుమ్మల చెరువు, నిడుబ్రోలు ప్రదేశాల్లో జరిగిన పోలీస్ కాల్పుల కేసులుగా వీటిని గుర్తించారు. ఇంకా అరెస్ట్ కావల్సిన నిందితులు వీరే.. -
మద్యం సిండికేట్కి చంద్రబాబు సర్కార్ దాసోహం
సాక్షి, విజయవాడ: మద్యం సిండికేట్కి చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. వేలం లేకుండానే మద్యం షాపుల రెన్యూవల్కు నిర్ణయం తీసుకుంది. టీడీపీ లిక్కర్ సిండికేట్కి చంద్రబాబు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వేలం లేకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ చక్రం తిప్పింది.స్థానిక ఎన్నికల కోసం టీడీపీ నేతలకు మద్యం షాపులు రెన్యూవల్ చేస్తూ.. ఏపీలో 3,736 మద్యం షాపులు కొనసాగించాలని నిర్ణయించింది. విచ్చల విడిగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చేసింది. ప్రిన్సిపాల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. -
‘డీఎస్సీ అక్రమాలకు సీఎంగా బాబు నైతిక బాధ్యత వహించరా?’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. .@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old… pic.twitter.com/vzDTCvOwGE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2026ఇదీ చదవండి : ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్ -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
బూత్ల వారీగా సమగ్ర వివరాలు ఇవ్వండి: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగించకుండా చూడాలని, అదే సమయంలో దొంగ ఓట్లను ఏరివేయాలని ఆ లేఖలో స్పష్టంగా కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బూత్ స్థాయిలో బహిర్గతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాఆరు. ఈ లేఖ ప్రతిని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపించారు.డౌన్ లోడ్ లింకులతో సరిపెట్టకుండా...ఎస్ఐఆర్లో భాగంగా కొత్తగా ఓటర్లను చేర్చడం, తొలగించడం, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం, మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఇతర సవరణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నియోజకవర్గాల వారీగా, బూత్ల వారీగా సమగ్రంగా అందించాలని లేఖలో కోరారు. కేవలం డౌన్లోడ్ లింకులు ఇవ్వకుండా అధికారికంగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మ్యాప్ కాని ఓటర్లు, ఇతర కేటగిరీల కింద జారీ చేసిన నోటీసులపై కూడా పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎన్ని నోటీసులు జారీ చేశారు, ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎన్ని ఓటర్లను తొలగించారు, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో బూత్, నియోజకవర్గాల వారీగా వెల్లడించాలని పేర్కొంది. దీనివల్ల బూత్ స్థాయి ఏజెంట్లు సంబంధిత ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనుమానిత ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిందని లేఖలో అప్పిరెడ్డి పేర్కొన్నారు. వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, చట్ట ప్రకారం డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కుటుంబ సభ్యులందరి ఓట్లూ ఒకే బూత్లో ఉండాలిపోలింగ్ కేంద్రాల పునర్విభజనలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్లకు, కొన్ని సందర్భాల్లో వేర్వేరు వార్డులకు కేటాయించబడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే ఇంటి చిరునామాలో నివసించే కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉంచాలని కోరారు. ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చినప్పుడు అనుసరించిన ప్రమాణాలను కూడా స్పష్టంగా వెల్లడించాలని కోరింది. భౌగోళిక ప్రాంతం, ఇంటి నంబర్, ఓటరు వరుస సంఖ్య లేదా ఇతర ఏ ప్రమాణం ఆధారంగా ఓటర్లను బదిలీ చేశారో స్పష్టం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నందున, ఎస్ఐఆర్ అనంతరం వచ్చిన తాజా ఓటర్ల డేటా ఆధారంగా పోలింగ్ కేంద్రాల పునర్విభజనను మరోసారి సమీక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.బూత్ మ్యాపింగ్ను పార్టీలకు అందించాలికొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పూర్తి బూత్ మ్యాపింగ్ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్కు అనుసంధానించిన ప్రాంతాలు, బూత్ స్థాయి అధికారుల వివరాలు, పాత బూత్ల నుంచి కొత్త బూత్లకు ఓటర్ల బదిలీల వివరాలను అందులో పొందుపరచాలని కోరారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు నియమించిన బూత్ స్థాయి అధికారుల పేర్లు, సంప్రదించాల్సిన నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ బూత్ స్థాయిలో పారదర్శకంగా జరగాలని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా చూడాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.ఇదీ చదవండి:‘అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం’ -
అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: వడ్డే
సాక్షి, విజయవాడ : అమరావతిలో ఎయిర్ పోర్టు కోసం 19 వేల ఎకరాలు తీసుకోబోతున్నారని.. భూ సేకరణకు అంతే లేకుండా పోతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భూ దాహానికి పుల్స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియడం లేదన్నారు.‘‘99 పైసలకే వెయ్యి కోట్ల భూములు టీసీఎస్కు కట్టబెట్టారు. కాగ్నిజెంట్కు వెయ్యి కోట్ల విలువైన 22 ఎకరాలను కట్టబెట్టారు. కాగ్నిజెంట్కు అమెరికా ప్రభుత్వం మొట్టికాయలు వేసింది. తప్పు చేస్తున్నారని కాగ్నిజెంట్పై అమెరికా కేసులు పెట్టబోతోంది. నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి చట్టం అనుమతించదు చంద్రబాబు. అమరావతిలో స్విస్ ఛాలెంజ్ పేరుతో ఉల్లంఘటనలకు ప్రయత్నించారు. 1921 ఎకరాల్లో సింగపూర్ సంస్థ స్టార్టప్ సెంటర్ పెడతామన్నారు. ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా పోయారు’’ అని శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.ఎన్జీటీ తీర్పుకు వ్యతిరేకంగా నదిలోకి కరకట్ట జరపాలని చూస్తున్నారు. కరకట్టకు కొన్ని వందల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కొండవీటి వాగులో నీరు ఎత్తిపోయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఇప్పుడు మరో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అమరావతిలో కొన్ని వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది’’ అని శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మార్కెట్ ఆధారిత పంటల దిశగా దృష్టి సారించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: రైతులు సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత పంటల దిశగా దృష్టి సారించాలని నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ 2047– వ్యవసాయ ఆధారిత పారిశ్రామికత ద్వారా ఆంధ్రప్రదేశ్ సాధికారత’ అనే అంశంపై గురువారం జాతీయ సదస్సు నిర్వహించారు. గోవిందరాజులు మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత రైతులుగా అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర కాలం నుంచి ఇప్పటి వరకు దేశంలో వ్యవసాయం అభివృద్ధి సాధించిన తీరును వివరించారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు రైతుల శ్రేయస్సుకోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను గురించి వివరించారు. పొగాకు బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ యువత తమ తెలివితేటలతో పాటు సాంకేతికతపై తమకున్న పట్టుతో వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలన్నారు. సదస్సు కన్వీనర్, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ యు.రవి కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60కి పైగా పరిశోధన పత్రాలు వచ్చాయని, వాటిలో 30 ఉత్తమ పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని చెప్పారు. ఆయా పరిశోధనాంశాలతో అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించిన ప్రత్యేక సంచికను సదస్సులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, పీజీ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్.అనితాదేవి, డాక్టర్ కామేశ్వర శాస్త్రి, వీఎస్టీ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకట నర్సయ్య, అధ్యాపకులు డాక్టర్ నిర్మలా రాణి, డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు, డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు -
నవీన ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి
తెనాలి: ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్ఫూర్తిగా నేటి యువతరాన్ని మానవతా స్పృహ కలిగిన శాస్త్రవేత్తలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య భావజాలంతో కూడిన కృత్రిమ మేధస్సులో స్వదేశీ సంస్కారాన్ని జోడించాలని, ఇందుకు తరగతి గదిలో నైతికతతో కూడిన శాస్త్ర పాఠాలను బోధించాలని సూచించారు.డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటైన పత్యేక సభకు ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు అధ్యక్షత వహించారు. తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును అమరరాజా గ్రూప్ అధినేత గల్లా రామచంద్రనాయుడుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రదానం చేశారు. ● సభలో వెంకయ్యనాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ యలవర్తి నాయుడమ్మ పల్లెటూరి నుంచి దేశ శాస్త్ర సాంకేతికరంగాన్ని దిశానిర్దేశం చేసేస్థాయికి ఎదిగిన మహామనిషిగా గుర్తుచేశారు. విజ్ఞానశాస్త్రం ప్రయోగశాలకే పరిమితం కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి అందాలని భారతరత్న అంబేడ్కర్, దీనదయాళ్లు చెప్పిన మాటలను నాయుడమ్మ ఆచరించి చూపారని తెలిపారు. 1951లో ఆయన సీఎల్ఆర్ఐ డైరెక్టర్గా చేరేనాటికి దేశంలో తోలు పరిశ్రమలో 56 వేలమందికి జీవనాధార వృత్తిగా మాత్రమే ఉండేదన్నారు. సీఎల్ఆర్ఐ, సీఎస్ఆర్ఐల్లో నాయుడమ్మ చేసిన పర్యావరణ అనుకూల సాంకేతికతతో దేశంలో ఆ పరిశ్రమ రూపురేఖలు మారాయని చెప్పారు. ● అవార్డుగ్రహీత గల్లా రామచంద్రనాయుడు తన ప్రసంగంలో నాయుడమ్మతో తనకు గల అనుబంధాన్ని స్మరించుకున్నారు. అమెరికాలో ఉన్నపుడు తిరిగి మాతృదేశానికి వచ్చి, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు తనను ప్రోత్సహించినవారిలో నాయుడమ్మ ఒకరని చెప్పారు. స్వదేశానికి వచ్చినా ఏదైనా సమస్య వచ్చినపుడు తగిన పరిష్కారాన్ని చూపేవారని గుర్తుచేసుకున్నారు. ఆ అనుబంధం కారణంగానే తాను ఈ అవార్డుకు ప్రతిపాదన తీసుకురాగానే వెంటనే అంగీకరించానని వివరించారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు శాస్త్రసాంకేతికపై ఆసక్తిని పెంచి యువశాస్త్రవేత్తలు ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ తరపున సైన్స్ సెంటర్ నిర్వహించిన సైన్స్ ప్రయోగాల్లో విజేతలైన విద్యార్థులకు అతిథుల చేతులమీదుగా సర్టిఫికెట్లు, నగదు, జ్ఞాపికను అందజేశారు. రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్, అయినాల మల్లేశ్వరరావు, ఫౌండేషన్ కార్యదర్శి యలవర్తి పవన్కుమార్ పాల్గొన్నారు. -
పారా మెడికల్ విద్యార్థుల నిరసన ర్యాలీ
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గుంటూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ గురువారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి బీఆర్ స్టేడియం, టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు అనేక కారణాల వల్ల ఆరు సంవత్సరాలకు పొడిగించ బడుతున్నాయన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సమీర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం, సంబంధిత విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు చెలగాటం ఆడటం సరికాదన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి కిరణ్ దాసరి, నాయకులు నాయక్, సాయి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
వీసీ హామీతో రిలే నిరాహార దీక్షలు విరమణ
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు ఇచ్చిన హామీతో ఒప్పంద ఆధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలను విరమించుకుంటున్నట్లు వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సుమారు 20 ఏళ్ళుగా సేవలందిస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిలే నిరాహార దీక్షలు గురువారం 44వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతన పెంపుపై ఉత్తర్వులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఇటీవల కమిటీ సమర్పించిన వేతన పెంపు నివేదికను రాబోయే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదింపజేసి, ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని వీసీ ఆచార్య కె.గంగాధరరావు హామీ ఇచ్చారన్నారు. ఈ రిలే నిరాహారదీక్షలను రెక్టార్ ఆచార్య ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, నూట అధ్యక్షుడు ఆచార్య పి.బ్రహ్మాజీరావు ఒప్పంద అధ్యాపకుల నిరసన టెంట్ వద్దకు చేరుకుని వారితో మాట్లాడి నిమ్మరసం అందించి శాంతియుత ఆందోళనను విరమింపజేశారు. రేపు జాతీయ లోక్ అదాలత్ గుంటూరు వెస్ట్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సేవలను పొందేందుకు కోర్టు ఫీజు లేదని, పరస్పర అంగీకారంతో పరిష్కారం అవుతుందని, త్వరగా న్యాయం లభిస్తుందని చెప్పారు. అన్ని కోర్టుల పరిధిలో జరుగుతుందన్నారు. అనంతరం జేసి జాతీయ లోక్ అదాలత్ పోస్టర్ను విడుదల చేశారు. డీఆర్ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు అత్తోట(కొల్లిపర): మండల పరిధిలోని అత్తోట గ్రామశివారు డొంక రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి చోటుచోసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తోట గ్రామానికి చెందిన కొంతమంది కారులో తెనాలి వెళుతున్నారు. గ్రామ శివారులోని డొంక రోడ్డులో మలుపు గమనించకపోవటంతో కారు ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న కొంత మంది వెంటనే కారులోని వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. -
మహిళ హత్యకేసులో ముగ్గురు అరెస్టు
పెదకాకాని: మహిళను దారుణంగా హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్ డిఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ అన్నారు. ఈనెల 7వ తేదీన పెదకాకాని మండలం, వెనిగండ్లలో దాది కోటేశ్వరమ్మ(48)ను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న చాకుతో గొంతు కోసి హతమార్చిన సంగతి విధితమే. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని గురువారం పెదకాకాని పీఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ మృతురాలు కోటేశ్వరమ్మ కుమారుడు సాధిక్ గుంటూరు ఆటోనగర్లోని మెకానిక్ షోరూంలో నాలుగేళ్లుగా మెకానిక్గా పనిచేస్తున్నారు. అదే షోరూంలో దాచేపల్లి మండలం, ముత్యాలంపాడు గ్రామానికి చెందిన యద్దనపూడి మరియకుమారి ఆమె భర్త పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరియకుమారితో సాధిక్కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో సాధిక్ వారి కాపురాన్ని కూడా వెనిగండ్లలోనే పెట్టాడు. కొద్దికాలానికి సాధిక్ మరియకుమారి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ.. ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పాడు. అంతేకాకుండా మరియకుమారి కుటుంబ అవసరాలకు డబ్బులు ఇవ్వడం, వారి బాకీలు తీర్చడం, కులాలు వేరు కావడంతో ఇష్టం లేని కోటేశ్వరమ్మ మరియకుమారి కుటుంబంతో గొడవ పడుతూ వస్తోంది. తన కుమార్తె వివాహానికి అడ్డుగా ఉన్న ఆమెను ఎలాగైనా హతమార్చాలని మరియకుమారి నిర్ణయించుకుంది. పిడుగురాళ్ల ప్రాంతంలో నివశిస్తున్న తన సోదరితో పరిచయం ఉన్న పల్నాడు జిల్లా, మాచవరం మండలం, రుక్మిణీపురం గ్రామానికి చెందిన అన్నంగి శ్రీకాంత్ను సంప్రదించింది. అందుకు అంగీకరించిన శ్రీకాంత్ అప్పటికే భార్యపై దాడి చేసి కేసులో నిందితుడిగా ఉన్నాడు. శ్రీకాంత్ తనకు తోడుగా తన మేనమామ కొడుకు బత్తుల మహేష్కు ఈ విషయం తెలియజేశాడు. మహేష్ పల్నాడు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతూ ఏడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పథకం ప్రకారం హత్య... మరియకుమారి కోటేశ్వరమ్మను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. గత కొద్ది రోజులుగా మృతురాలితో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ వస్తుంది. గతంలో బిర్యానీలో విషప్రయోగం చేసినా సఫలీకృతం కాలేదు. గత 15 రోజుల కిందట కోటేశ్వరమ్మకు కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి నమ్మించి తాగించింది. దీంతో అనారోగ్యానికి గురైన ఆమె కొద్ది రోజులుగా గేదెలు మేపేందుకు కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఇదే అదునుగా చూసిన నిందితురాలు ఈనెల 7వ తేదీన ఉదయం మృతురాలి ఇంటికి వెళ్ళింది. మంచిగా పలకరించి స్టౌ వెలిగించి దోసె వేసి ఇచ్చింది. అప్పటికే బత్తుల మహేష్, అన్నంగి శ్రీకాంత్లు నెంబర్ ప్లేట్లు తొలగించిన బైక్ను సమీపంలోని చెట్టు కింద పెట్టి ఎదురు చూస్తున్నారు. నిందితురాలు ఇచ్చిన ఫోన్ సిగ్నల్తో ఇరువురూ ఇంటిలోకి ప్రవేశించారు. మీరు ఎవరంటూ మృతురాలు అడగడం, మన పిల్లలే అని చెప్పడం, ఇరువురూ ఒక్కసారిగా కోటేశ్వరమ్మపై దాడి చేసి పక్కనే ఉన్న చాకుతో గొంతు కోయడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇరువురు పక్కనే ఉన్న నీటితో రక్తపు మరకలు కడుక్కుంటుండగా ఒక్కసారిగా పైకి లేచి గోడను పట్టుకోవబోవడంతో మరోసారి చాకుతో బలంగా గొంతు కోసి, బీరువాలో ఉన్న బంగారం, డబ్బులు దోచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్థానికంగా సేకరించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి దొంగిలించిన బంగారు ఆభరణాలు, రూ.70,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ వివరించారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నారాయణస్వామి, ఎస్ఐలు సురేష్, డి.రామకృష్ణ, క్రైం సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
విజ్ఞాన్–ఎన్ఐటీ ఢిల్లీ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ–న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఎన్ఐటీ ఢిల్లీ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు విద్యా, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగనున్నాయని తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల కోసం ప్రయోగశాల సందర్శనలు, శాసీ్త్రయ సమాచారం, పరిశోధనా సామగ్రి మార్పిడి, సంయుక్త సదస్సులు, సెమినార్లు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు (ఎఫ్డీపీ), వర్క్షాప్ల నిర్వహణ చేపట్టనున్నారు. వర్చువల్ తరగతుల ద్వారా అతిథి అధ్యాపకుల ఉపన్యాసాలతో పాటు, ఫ్యాకల్టీ ఇమర్షన్ ప్రోగ్రామ్ (ఎఫ్ఐపీ) కింద అధ్యాపకుల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించనున్నారు. ఈ అవగాహన ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్య, పరిశోధన, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత బలమైన వేదిక ఏర్పడనుందని వైస్ చాన్స్లర్ తెలిపారు. ఎన్ఐటీ ఢిల్లీ అధ్యాపకులు, విజ్ఞాన్ డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకుని కాంట్రాక్టు వైద్య సిబ్బంది నిరసన
గుంటూరు మెడికల్: కాంట్రాక్టు వైద్య సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం గుంటూరు జీజీహెచ్లో కళ్లకు నల్లరిబ్బన్లతో గంతలు కట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది గతనెల 20 నుంచి వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గురువారం నల్లరిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి, ఉద్యోగాలు రెగ్యులరయ్యేంత వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, కాంట్రాక్టు వైద్య సిబ్బందికి బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టాఫ్నర్సులు రేణుక, బి.వి.ఆర్.లక్ష్మి, మేరి, శ్రీలక్ష్మి, లక్ష్మీకుమారి, పద్మావతి, ఫార్మాసిస్టులు చంద్రకళ, అశ్విని, పావని, శ్రీలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, ఖాశిం, బాషా, సుభశ్రీ, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
గర్వించేలా గుర్తింపు
● వ్యర్థాల నిర్వహణలో సరికొత్త విధానాల అమలు ● ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ ● ఫ్లోటింగ్ సౌర విద్యుత్తో 420 ఈ–వాహనాల పరుగులు మైక్రో పాకెట్లు.. చెత్త నుంచి సంపద సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై సమరం ‘ఆత్మ’లకూ పింఛన్లు! ‘సర్’పై ఎన్నో సందేహాలు నగరంలో గాలి నాణ్యతను కాపాడేందుకు ప్రధాన రహదారులపై మెకానికల్ స్వీపింగ్ యంత్రాలు, ధూళి నియంత్రణకు వాటర్ స్ప్రింక్లర్లు వినియోగిస్తున్నారు. రహదారులపై ఏర్పడే గుంతలను గుర్తించిన వెంటనే మరమ్మతులు చేసేందుకు ‘రోడ్ డాక్టర్’ వ్యవస్థ ద్వారా వేగంగా ప్యాచ్వర్క్ పనులు చేపడుతున్నారు. రహదారి డివైడర్లలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ అర్బన్ గ్రీనరీని విస్తరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత ఆలోచనలు తోడైతే నగర రూపురేఖలు ఎలా మారతాయో గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) నిరూపిస్తోంది. శాసీ్త్రయ పద్ధతుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, హరిత ఇంధన వినియోగంతో సుస్థిర ప్రగతి దిశగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’లో దేశవ్యాప్తంగా 130 నగరాలతో పోటీపడి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును కై వసం చేసుకుంది. నగరపాలక సంస్థ పరిధిలోని 42వ వార్డు రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది. -
నేడు ఏఎన్యూ స్వర్ణోత్సవ స్మారక చిహ్నం ఆవిష్కరణ
ఏఎన్యూ (పెదకాకాని): ఉన్నత విద్యకు బీజం వేసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఐదు దశాబ్దాల ప్రస్థానంలో విద్య, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట గుర్తింపును సొంతం చేసుకుందని ఇన్చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఏఎన్యూలో ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ 1976లో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకొంటోందన్నారు. వేడుకల్లో భాగంగా స్వర్ణోత్సవ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు, ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు, ఇన్చార్జి రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ కుట్రలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయించింది. డీఎస్సీపై వైఎస్ జగన్ ప్రెస్మీట్ పెట్టిన వెంటనే వీడియోలను తొలగించారు. ఫేక్ అకౌంట్లతో మెటాకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మరో వైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి ప్రభుత్వం.. 20కిపైగా వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు కూడా బ్లాక్ చేయించింది.సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు వెనుక ఏపీకి చెందిన సైబర్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ స్కామ్ వార్తలు పెట్టినందుకే సోషల్ మీడియా అకౌంట్ల బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.ఇదీ చదవండి: జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్ -
‘లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదు’
గుంటూరు: డీఎస్సీ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. డీఎస్సీ పరీక్షల్లో ఎన్నడూ జరగనంత అవినీతి జరిగిందని, లోకేష్ అడ్డంగా దొరికిపోయాడని మండిపడ్డారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ వ విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు.‘డీఎస్సీ పై ప్రభుత్వానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. అందుకే చంద్రబాబు గానీ, లోకేష్ గానీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాట్లాడలేదు. లోకేష్... లవ్ క్యాష్ అన్న సంగతి తెలుసు. లోకేష్ దొరికిపోయిన దొంగ. లోకేష్ రాజకీయాలకు పనికి రారు...మంత్రిగా కూడా పనికి రారు. లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారట ముఖ్యమంత్రిని చేస్తే దేశాన్నే అమ్మేస్తారు. లోకేష్ ఉద్యోగాలను బఠానీలు అమ్మినట్లు అమ్మేశారు. ఆయన రాజీనామా చేయాలి. లోకేష్తోనే టీడీపీ సర్వ నాశనం అవుతుంది. డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్ల చేత మాట్లాడిస్తున్నారు. ఇంకా రెండు డిఎస్సీలు పెడతామంటున్నారు. లోకేష్కు మంత్రి సీటులో కూర్చునే హక్కు లేదు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా? -
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
డీఎస్సీ స్కామ్తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్లో ఫస్ట్ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్హార్స్’ అవుట్లెట్
తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్హార్స్ గ్రూప్ (టీడీహెచ్) కొంతకాలంగా దేశీయ రిటైల్ మార్కెట్పై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్–65)పై సూర్యాపేట మండలం, రాయన్గూడెం గ్రామంలోని సూర్యాపేట హోటల్–7 ప్రాంగణంలో తమ ఆరవ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. మధ్యాహ్నం జరిగిన ప్రారంభ వేడుకలో తెనాలి డబుల్హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ప్రసాద్ మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రయాణీకులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అవుట్లెట్ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇకపై వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు, 130పైగా రకాలను (ఎస్కేయూ) ఒకేచోట నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. వీటిలో తమ బ్రాండ్కు చెందిన పప్పుధాన్యాలు, ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో పాటు ప్రీమియం చాకెట్లు, టీడీహెచ్ ఫుడ్స్, మిల్లెట్ మార్వెల్ కౌమ, గోపురం బ్రాండ్ల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. విమాన ప్రయాణికులకు విజయవాడ ఎయిర్పోర్టులో, రోడ్డుమార్గాన వెళ్లేవారికి సూర్యాపేట హోటల్–7వద్ద తెనాలి డబుల్ హార్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మోహన్ శ్యాంప్రసాద్ తెలిపారు. దళితుల హత్యలను పట్టించుకోని ప్రభుత్వం ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 25 మంది దళితులను హత్యలు చేసి తగలబెట్టినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం పెదపలకలూరు గ్రామంలో ఇటీవల అమానుషంగా హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టబడిన దావులూరి ప్రసన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావులూరి ప్రసన్నపై ఆగస్టు 13 తేదీన పెట్రోలు పోసి దహనం చేసిన ఘటనలో మరణించిన మాదిగ బిడ్డ ప్రసన్న కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా పాలకుల స్పందన శూన్యమన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపలకలూరూకు చెందిన నిరుపేద టైల్స్ కార్మికుడు దావులూరి ప్రసన్న హత్యతో కలిపి ఇప్పటివరకు ఏకంగా 25 హత్యలు జరిగినా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఈ మారణహోమం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు హత్య బాధాకరమే కానీ ఆ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ప్రకటించినట్టే అదే రీతిలో ప్రసన్న కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో దళితుల తీవ్ర ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదని సువర్ణ రాజు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రావూరి శ్యామ్, ఇంజుమూరి విజయ్కుమార్, తలారి నాని, కేశవరపు దానియేలు, జె.విజయ్, వి.బుజ్జి, ఎన్.రాంబాబు, బాబు, బి.సత్యనారాయణ, పి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పెదకాకానిలో 35.2 మి.మీ. వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 35.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా పెదనందిపాడు మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వివరాలు.. చేబ్రోలు మండలంలో 21 మి.మీ., పొన్నూరు 19.8, తాడేపల్లి 19.6, ప్రత్తిపాడు 14.8, ఫిరంగిపురం 12.2, వట్టిచెరుకూరు 10.2, మంగళగిరి 3.8, గుంటూరు పశ్చిమ 2.8, తెనాలి 2.6, కాకుమాను 2.6, గుంటూరు తూర్పు 1.8, తుళ్ళూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 43.6 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 40.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సూర్యాపేట హోటల్–7లో 6వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ప్రారంభించిన చైర్మన్ అండ్ ఎండీ మోహన్ శ్యామ్ప్రసాద్ -
జీజీహెచ్లో ఉచితంగా వైద్యసేవలు....
గుంటూరు జీజీహెచ్లో ఆత్మహత్యాయత్నం చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు సాధారణ జీవితం గడిపేలా చేస్తున్నాం. ఆర్థికపరమైన సమస్యలు, సంసార జీవిత సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, ప్రయోజకులు కాకపోవడం, ఉద్యోగపరమైన ఒత్తిడులు, తాగుడు అలవాటు ఉండటం, కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య పాల్పడిఉండటం తదితర కారణాల వల్ల పలువురు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారిని ఓ కంట కనిపెట్టాలి. ఆత్మహత్యలకు పాల్పడే ఆలోచన ఉన్నవారిని సంప్రదించటం, వారితో చర్చించటం, వారికి వనరులు కల్పించటం ద్వారా నివారించవచ్చు. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వైద్య విభాగాధిపతి, జీజీహెచ్ -
ఒకే ఒక్క జీవితం..!
గుంటూరు మెడికల్: యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి 7లక్షల మంది ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. భారతీయులు 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 15నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సువారే ఎక్కువ. కేవలం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ సంయుక్తంగా 2003 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. డేంజర్ బెల్స్.. వ్యక్తులు డల్గా ఉండటం, ఎవరితో కలవకుండా మూలన ఒంటరిగా కూర్చోవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం, బరువు తగ్గిపోవడం, ముఖం దిగాలుగా ఉండటం, ఆహారం మానివేయడం, తదితర లక్షణాలు వ్యక్తుల్లో కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై వారికి మానసిక వైద్యులచేత కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఈలక్షణాలు కనిపించేవారు హైరిస్క్ గ్రూపునకు చెందిన వారు. కారణాలు.... భారతదేశంలో ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆల్కహాలు, మాదకద్రవ్యాలకు బానిసలవ్వటం, వైవాహిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో అపజయాలు, ఒత్తిడి, కుంగుబాటు, ఆర్ధిక సమ్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, పేదరికం, అక్రమ సంబంధాలు, కుల,వర్గ వివక్షలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీజీహెచ్లో బాధితుల వివరాలు... గుంటూరు జీజీహెచ్లో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి చికిత్స పొందినవారు ప్రతినెలా 30 మందికిపైగా ఉంటున్నారు. జీజీహెచ్ వైద్యులు, మానసిక వైద్య నిపుణులు వీరిలో పలువురికి కౌన్సెలింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నారు. ప్రతిఏడాది 200 నుంచి 300 మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వారు జీజీహెచ్కు వస్తుండగా, కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాజిక మాధ్యమాలలో, వార్తా పత్రికల్లో, ఆత్మహత్యలు జరిగే విధానాన్ని అన్వేషించేవారిని, విచారం, దిగులు, దుఃఖం, ఎక్కువ కాలం ఉంటే అది ఆత్మహత్యకు దారి తీసే అవకాశముంది. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా సడన్గా శాంతంగా ఉండడం, నిరుత్సాహంగా గడపడం చేస్తుంటే తేడాను గమనించాలి. గతంలో లాగా స్నేహితులతో కలవకుండా, ఆట పాటల్లో పాల్గొనకుండా, దైనందిన కార్యక్రమంలో నిరాసక్తతతో ఒంటరి తనంగా వుండడానికి ఇష్టపడుతుంటే ఆ మార్పును ఆత్మహత్యకు సంకేతంగా పరిగణించాలి. మాటల్లో, సంభాషణల్లో నైరాశ్యం కనబరుస్తూ, వస్త్రధారణలో, వ్యక్తిగత శుభ్రతలో, ఆకర్షణలో నిరాసక్తత, వ్యక్తపరుస్తుంటే వారితో తప్పనిసరిగా వారితో మాట్లాడి వారి బాధను ఆలకించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. -
నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయాలి
మంగళగిరి టౌన్: నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేయాలని, వారం రోజుల్లో ధరలు నియంత్రించకపోతే గిడ్డంగుల ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. గౌతమబుద్ధ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం డీటీకి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ రోజురోజుకూ ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి నిత్యావసర ధరలను అదుపులోకి తీసుకురాకపోతే ప్రజలను సమీకరించి గిడ్డంగులను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, చంద్ర నాయక్, న్నవరపు ప్రభాకర్, జాలాది జాన్బాబు పాల్గొన్నారు. -
నేడు దశాబ్ది ఉత్సవాలు
నెహ్రూనగర్: గుంటూరు కథోలిక పీఠాధిపతులుగా డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫాదర్లు మోన్సిగ్నోర్ అల్లం శౌరెడ్డి, మోన్సిగ్నోర్ పామిశెట్టి బాలస్వామి, మోన్సిగ్నోర్ చాట్ల మరియదాసు, పూదోట దానయ్య, దాసరి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు రింగ్ రోడ్డులోని బిషప్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద నుంచి బిషప్ హౌస్ వరకు ప్రదక్షిణ (ఊరేగింపు) ప్రారంభం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు డాన్బాస్కో మైదానంలో ప్రత్యేక దివ్యబలి పూజ సమర్పించనున్నట్లు వివరించారు. అనంతరం బిషప్ భాగ్యయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని హాజరుకానున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బిషప్లు, గురువులు, కన్యాసీ్త్రలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొంటారని వివరించారు. -
నిరంతర విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్న్లు, ట్రాన్న్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ అధికారిక వెబ్సైట్ www.a pcpdc.in లేదా ఏపీసీపీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్న్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
కారుమూరి కోటిరెడ్డికి ఘననివాళి
అంతిమయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు రూరల్: మండలంలోని అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బావ కారుమూరి కోటిరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలోని కోటిరెడ్డి నివాసంలో ఆయన పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర, దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అన్నాబత్తిని శివకుమార్, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరిఫాతిమా, బలసాని కిరణ్కుమార్, అంబటి మురళి, డైమండ్ బాబు, గజ్జల సుధీర్భార్గవరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి నాగార్జునయాదవ్, మాజీ ఇన్కంటాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాంరసూల్ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు...
ఆత్మహత్య చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్న వారు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇంట్లో తమపై ఉన్న బరువు బాధ్యతల్ని ఇతర కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడి చేసి జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తలు సైతం పిల్లలకు, కుటుంబ సభ్యులకు వివరిస్తారు. ఇలాంటివారిని తక్షణమే మానసిక వైద్యులకు చూపించడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా అడిగిన వస్తువు కొనిపించకపోతే చనిపోతామని బెదిరిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తక్షణమే స్పందించి వారిని మానసిక వైద్యులకు చూపించాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మానసిక రుగ్మత. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసికవ్యాధుల వైద్య నిపుణుల సంఘం, జిల్లా అధ్యక్షుడు -
నిర్దేశిత ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలి
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వినాయకుని విగ్రహాలను నిర్ణయించిన ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని పాటించి పర్యావరణ హితానికి తోడ్పాటును అందించాలని కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా పర్యావరణ హిత రంగులు మాత్రమే విగ్రహాలకు వినియోగించాలన్నారు. అవసరమైన సౌకర్యాలతో తాత్కాలికంగా ప్రత్యేక నిమజ్జన కొలనులను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. మండపాలు నిర్వహించే వర్గాలు సహా ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నీటి నాణ్యత దెబ్బతినకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
ఓట్ల తొలగింపుపై విచారణకు కలెక్టర్ ఆదేశం
గుంటూరు వెస్ట్: పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు తొలగించారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ విచారణకు ఆదేశించారు. మన్నవ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బొనిగల అమరేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు, అలాగే గత నెల 5వ తేదీన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అమరేంద్ర ప్రసాద్ కోరారు. ఎంపీటీసీ సభ్యుని భార్య సహా సుమారు 173 మంది ఓటర్ల పేర్లు ఎటువంటి నోటీసులు లేకుండా అధికారులు తొలగించారు. సర్ ప్రక్రియలో మరిన్ని పేర్లు తొలగింపునకు గురయ్యాయి. వీటితోపాటు బీఎల్వో లాగిన్ను అనధికార వ్యక్తులు వాడుతూ జోక్యం చేసుకోవడం తదితర అంశాలు ఫిర్యాదులో ప్రస్తావించారు. స్పందించిన కలెక్టర్... విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని 88–పొన్నూరు ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను ఆదేశించారు. నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా ప్రతాప్రెడ్డి గురు, శుక్రవారాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజులు జిల్లా పరిధిలోని పలు సంక్షేమ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేయనున్నారు. -
చేనేత పింఛన్లకు నిబంధనలు సడలించాలి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులకు కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్లకు విధించిన నిబంధనలను సడలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విన్నవించింది. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కార్యాలయంలో బుధవారం జాయింట్ డైరెక్టర్ రాజారావుకు కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద నుంచి పొందుతున్న కూలి మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో తీసుకుంటున్నట్లుగా ఆధారం చూపాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. నూలు, ఇతర ముడి సరుకులు కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ బిల్లులు సమర్పించాలనే నిబంధనను కూడా తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ వినతులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, పూర్ణచంద్రరావు, మోహనరావు, రామారావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఉదయం 9 గంటల నుంచి దృష్టిదోష నివారణ, గ్రహదోష నివారణ, ఆయురారోగ్య అభివృద్ధి నిమిత్తం సర్వరక్షాకర శ్రీ సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు ఉదయం 8.30 గంటలకు ఆలయానికి చేరుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నెహ్రూనగర్: సాంఘిక సంక్షేమ శాఖ(ఎస్సీ వెల్ఫేర్) జిల్లా ఇన్చార్జిగా డి.దుర్గాబాయి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా అధికారిగా పనిచేస్తున్న హర్షిత 45 రోజుల పాటు హెచ్ఆర్డీ (హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్) ట్రైనింగ్ నిమిత్తం వెళ్లారు. ఆమె స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న దుర్గాబాయిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయపురిసౌత్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం వద్ద జిప్ రైడ్, జిప్ సైక్లింగ్ను కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. వీటిని ఏపీ టూరిజం, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు రూ.16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందజేయగా ఆ వాహనాలను వారు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.1.71 కోట్లతో చేపట్టిన జిప్రైడ్, జిప్ సైక్లింగ్ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురజాల ఆర్డీఓ మురళి, తహసీల్దార్ కిరణ్ కుమార్, టూరిజం డీవీఎం కృష్ణచైతన్య, డీటీఓ నాయుడమ్మ, యూనిట్ మేనేజర్ బ్రహ్మయ్య, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఖాజా మొయిద్దీన్, జెస్టిన్ జోసఫ్, నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమల్ హాసన్ పాల్గొన్నారు. తెనాలి: డివిజన్ సబ్ కలెక్టర్గా సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్. 1992లో జన్మించారు. సివిల్స్ పరీక్షలు రాసి, 259వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఆయన్ను తీసుకున్నారు. శిక్షణ అనంతరం గతేడాది ఏప్రిల్ 28న తిరుపతిలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. తెనాలి సబ్కలెక్టర్గా తొలి పోస్టింగ్ చేపట్టనున్నారు. ప్రస్తుతం కె.శ్రీరమణి ఆర్డీఓగా పనిచేస్తుండగా.. ఆమె స్థానంలో సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. -
ముగ్గురు ద్విచక్ర వాహన చోరులు అరెస్ట్
తెనాలి రూరల్: వారంతా చదువు మధ్యలో ఆపేసిన వారు. బైక్ మరమ్మతు పనులు నేర్పించేందుకు మెకానిక్ల వద్ద తల్లిదండ్రులు చేర్పించారు. తాళం లేకుండా వాహనాలను స్టార్ట్ చేసి తీసుకెళ్లడం, ఇగ్నిషన్ వైరింగ్ మార్చి బైక్లను ఆన్ చేయడం నేర్చుకున్నారు. ఇంకేముంది.. బైక్లను చోరీ చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. మైనార్టీ తీరని వీరు తొలి ప్రయత్నంలోనే మూడు బైక్లను చోరీ చేశారు. ఎక్కడ అమ్మాలో తెలియక పోలీసులకు పట్టుబడ్డారు. తెనాలి పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న బాల నేరస్తులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సీహెచ్. రాంబాబు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలో ఇటీవలి కాలంలో బైక్ల ఇగ్నిషన్ వైరింగ్ను తప్పించి, చిన్న వైరు ముక్క సాయంతో బైక్ల చోరీ జరుగుతుండడంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మూడు కేసులు నమోదైనట్టు తెలిపారు. దర్యాప్తులో ముగ్గురు బాల నేరస్తులు చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బజాజ్ పల్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, బజాజ్ ప్లాటినా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయడంతో పాటు, వీలైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐ విజయ్కుమార్ ఉన్నారు. బాల నేరస్తులను జువైనెల్ హోంకు తరలించారు. బైక్లు చోరీ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరాల ఫుటేజ్లు, వాహనాల నంబర్లను మెకానిక్ల గ్రూప్లో పెట్టడం నిందితులను గుర్తించడంలో పోలీసులకు ఉపయోగపడింది. మెకానిక్ పనులు నేర్చుకుంటూ దొంగతనాలు చేసిన మైనర్లు -
నిమిషంలో 60 ఆరోగ్య పరీక్షలు
మంగళగిరి టౌన్: అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతతో వైద్యరంగంలో సరికొత్త మార్పులకు మంగళగిరి వేదికగా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు వేగవంతమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే లక్ష్యంతో మంగళగిరి పట్టణ పరిధిలోని గణపతి నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఎరోస్ వెల్నెస్ ఆధ్వర్యంలో వినూత్న ఏఐ ఆధారిత ఆరోగ్య పరీక్షల విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఏఐ ఆధారిత ముఖ స్కానింగ్ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల మాట్లాడుతూ సాధారణంగా ఆరోగ్య పరీక్షలకు రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాల నివేదకల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ కొత్త విధానంలో రక్తనమూనా సేకరించడకుండానే కేవలం 60 సెకండ్లలో 60 రకాల ఆరోగ్య సూచికలను అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సాంకేతికతలో భాగంగా వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్తప్రసరణ, చర్మకణాల కదలిక తదితర అంశాల ఆధారంగా సుమారు 28 రకాల శారీరక కొలమానాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. అదనంగా ఇంటర్నెర్ ఆధారిత జీవ సంవేదకాలు, ఆధునిక స్క్రీనింగ్ పరికరాలతో మరో 32 కీలక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని వివరించారు. ఈ వినూత్న ప్రాజెక్ట్ను విజయవంతంగా అమలు చేసేందుకు యూపీహెచ్సీకి చెందిన సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బందికి రెండు రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎరోస్ వెల్నెస్ సీఈవో శిల్పాదేశాయ్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష, వైద్యసిబ్బంది, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
‘కమిషన్ నివేదికలో ఏమైనా రహస్యం ఉందా?
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలా రిజర్వేషన్లు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వైపు కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారు. నివేదిక పరిశీలనలో ఉందని ఎంతకాలం చెబుతారు.? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించిందికమిషన్ నివేదిక ఎందుకు బహిర్గతం చేయటం లేదు. కమిషన్ నివేదికలో ఏమైనా రహస్యం ఉందా? అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. బీసీ రిజర్వేషన్ల పూర్తి గణాంకాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 34 శాతం రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలన్న కోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్ర బాబు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బయటపడకుండా చంద్రబాబు, లోకేష్ పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే.. గెలవాల్సిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తే.. కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో ఉన్న పార్టీలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు సెమీ ఫైనల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు మిమ్మల్ని గెలిపిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నాయకులను గెలిపించాలి. పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తి మా మా బిడ్డ లాంటి వాళ్లే. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్సిక్తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. -
కూటమి పాలనలో ‘ధరల’ పిడుగు.. ఇదేనా చంద్రబాబు, పవన్ల సంపద సృష్టి?
శాసనసభ ఎన్నికలకు ముందు నిత్యావసర సరుకుల ధరలపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏమిటి?ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అసాధారణ రీతిలో ప్రస్తుతం ధరలు పెరుగుతుంటే ఏ సాకులు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు ఎల్లో మీడియా బాండ్ బాజా వాయిస్తోంది. ధరల నియంత్రణకు ఏమి చేస్తున్నది మాత్రం తెలియడం లేదు.ధరాఘాతానికి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలోనే ధరలు ఎలా పెరిగాయో గమనించండి. సన్నబియ్యం ధర 2024 ఏప్రిల్ లో కిలో 40 నుంచి 45 రూపాయలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో ఇదే బియ్యం ధర 70 నుంచి 80 రూపాయలవరకు ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వంట నూనెలు అప్పట్లో 90 నుంచి 106 రూపాయల వరకు ఉంటే, ఇప్పుడు 170 నుంచి 195 రూపాయల వరకు ఉంది. అంటే ఏకంగా అరవై నుంచి తొంభై రూపాయల వరకు పెరగడం అసాధారణమని చెప్పాలి. పంచదార ధర కిలోకి పాతిక నుంచి 30 రూపాయల వరకు పెరిగింది. ఉల్లి ధర సుమారు 40 రూపాయలు, ఎండు మిర్చి ధర సుమారు 150 నుంచి 200 రూపాయలకు పైగా పెరగడం ఆందోళన కలిగించే అంశమే. వినియోగదారులపై ఒకరకంగా ధరల పిడుగుపడిన చందమే అనిపిస్తుంది. కందిపప్పు, చింతపండు వంటి సరుకుల ధరలు కూడా బాగా పెరిగాయి.ఇక ఇసుకను ఉచితం అన్నప్పటికీ, ఇళ్ల నిర్మాణం చేసుకునేవారు లారీకి 20 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. మద్యం ధరలు పెరగనే పెరగవు అన్నట్లుగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మద్యం ధరలు సైతం పెరుగుతున్న తీరుపై మద్యం ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల బాదుడు కూడా గణనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ చార్జీలు కూడా 15 శాతం వరకు పెరిగినట్లు చెబుతున్నారు.పెట్రోల్, డీజిల్పై ఉన్న వ్యాట్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వీటి ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వానికి అదనంగా వాట్ రూపేణా ఆదాయం సమకూరుతోంది.ఆయా వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయాలు కూడా అధికం అవుతాయి. అయినా ఏపీలో అప్పులు మాత్రం నానాటికి పెరుగుతున్నాయే తప్ప, అదుపులో ఉండడం లేదు. ఈ ఇరవై ఆరు నెలల్లోనే ఏపీలో అన్ని రకాల అప్పులు కలిసి 3.86 లక్షల కోట్లకు చేరాయి.ఇది చంద్రబాబు సృష్టించిన సంపద అని అంతా వ్యంగ్యంగా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పులకు సంబంధించి అసలుతో పాటు వడ్డీలు చెల్లించవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. అమరావతి పేరుతో ఇప్పటికే ఏభైవేల కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. అప్పులన్నిటిని ఏమి చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేసి ఉంటే అందరికి తెలిసేది. కానీ అప్పుల వినియోగంపై ఎవరూ ప్రభుత్వ పక్షాన వివరణ ఇవ్వడం లేదు.ఇంత అప్పు చేసినా ఆయా చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జల జీవన్ కాంట్రాక్టర్లు ధర్నా చేసినా ఫలితం దక్కినట్లు లేదు. ఏలూరులో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల వాచ్మన్లు ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నది వారి ఆవేదనగా ఉంది. జూనియర్ డాక్టర్ లు తమ స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్ని చూస్తుంటే ఆంధ్ర సమాజం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోందా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో అవినీతి మాత్రం దూసుకుపోతోందని సెంటర్ ఫర్ లిబర్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ సైతం కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణల వల్ల ఎన్డీఏ పనులు ప్రజలలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాల గురించి రాయాలంటే చాంతాడంత లిస్టు అవుతుంది.ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్లు ఏమని ప్రచారం చేశారో గుర్తు చేసుకోండి.పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ అధికంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని తగ్గిస్తామని, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు తగ్గిపోతాయని ప్రచారం చేశారు. కర్నాటకలోని కొన్ని బంకుల వద్దకు వెళ్లి పోటోలు దిగి, అప్పటి జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడు అయితే ధరల రెక్కలు విరిచివేస్తామని ఊదరగొట్టారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. సీన్ కట్ చేస్తే, కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్క వస్తువు ధర తగ్గలేదు సరికదా.. పెక్కింటి ధరలు అమాంతంగా దాదాపు రెట్టింపు అయ్యాయి.ఇదే టైంలో రైతులకు న్యాయం జరిగిందా అంటే అది లేదు. పంటలు చేతికి వచ్చినప్పుడు ధరలు పడిపోయి వారంతా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. రైతుల చేతుల నుంచి పంట వ్యాపారుల వద్దకు చేరాక మాత్రం రేట్లు పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణమన్న భావన ఉంది. ఇలాంటి సమయాలలో విజిలెన్స్ అధికారులు తగు చర్యలు తీసుకుని ధరలను నియంత్రిస్తారు. కాని ఇప్పుడు అది ఎంతవరకు జరుగుతోంది తెలియదు. చంద్రబాబు, లోకేశ్లు తమ వాగ్దానం ప్రకారం వ్యాట్ ను తగ్గించి ఉండవచ్చు. అది వారి చేతిలో పని. ఎన్నికల హామీ కూడా ఉన్నందున వారు ఆ పని చేసి, సరుకుల ధరలు తగ్గించడానికి ప్రయత్నించి ఉంటే కాస్త పేరు వచ్చేది. కానీ వారు ఆ పని చేయడం లేదు. అంటే ఇక్కడ కూడా ప్రజలను ఢోకా చేసినట్లే కదా అన్న విమర్శను విపక్షం చేస్తోంది.అయితే ఎల్లో మీడియా ఈ ధరల సమస్యను పక్కదారి పట్టించడానికి తంటాలు పడుతోంది. ఇదంతా కరువు వల్ల, యుద్దం వల్ల అని ప్రచారం ఆరంభించాయి. లేకుంటే వ్యాపారుల తీరుతో కష్టాలు వస్తున్నాయని టిడిపి మీడియా అంటోంది. వారిని కంట్రోల్ చేయవలసిన ప్రభుత్వం వైఫల్యం చెందినట్లే కదా అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని సలహా ఇవ్వలేకపోయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా, అప్పట్లోనే ఉక్రెయిన్- రష్యా యుద్దం ఆరంభమైనా, ఏ మాత్రం కనికరం లేకుండా ఎల్లో మీడియా ప్రభుత్వంపై పలు వ్యతిరేక కథనాలు రాసి ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేసేవి. చంద్రబాబు, లోకేష్ తదితరులు అచ్చంగా అదే పనిలో ఉండేవారు. అప్పటికన్నా పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉన్నా ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని అనుకుంటే ధరల బారిన పడి ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి తను పడుతున్న కష్టం తెలియదా!కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.బుధవారం పర్చూర్ నియోజకవర్గ కేడర్తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్లో లేదంటే అక్టోబర్లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్కు పాదయాత్రలు కొత్త కాదు. 2017లో ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్సీపీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి యాత్రను ప్రారంభించారు. సుమారు 341 రోజులపాటు సాగిన ఆ యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. ఆనాడు మొత్తం 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా..పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సామాజిక వర్గాలతో జగన్ నేరుగా మమేకమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూనే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. యాత్ర ముగిసే సమయానికి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకమైనట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. 2019లో అధికారంలోకి..ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన కొద్ది నెలలకే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన రాజకీయ జీవితంలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రకటన చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
నంబూరులో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం
పెదకాకాని: నంబూరు గ్రామ పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రూ.29.71 కోట్ల నిధులతో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్తో కలసి మంగళవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో అనేక చోట్ల విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉప కేంద్రం వల్ల మండలంలో లోఓల్టేజి సమస్యలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్రాణం మార్కెండేయబాబు, అధికారులు, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యాల పెంపుతోనే ప్రత్యేక గుర్తింపు
ఏఎన్యూ(పెదకాకాని): విద్యార్థులు నైపుణ్యాల పెంపుతో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఏఎన్యూ పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి దర్శకుడు బోయపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞత, సంస్కారం, లౌక్యం, బాధ్యతాయుతమైన లక్షణాలను అలవరచుకోవాలని సూచించారు. తాను ఏఎన్యూ పూర్వ విద్యార్థినని, విశ్వవిద్యాలయం అందించిన సర్టిఫికెట్ తన సినీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. తనను ప్రముఖ సినీ దర్శకుల స్థాయిలో నిలబడటానికి అది దోహదపడిందన్నారు. సమాజంలో క్రమక్రమంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా, వాటిని అవసరమైన మేరకే వినియోగించాలని హితవు పలికారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రెక్టార్ ఆచార్య శివరాం, ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం తదితరులు ప్రసంగించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం అందించిన సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. పాటలు, నృత్యాలతోపాటు విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఆద్యంతంగా ఉత్సాహంగా కనిపించారు.ఉత్సాహంగా 5కే వాక్ ఏఎన్యూ స్వర్ణోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన 5కే వాక్ ఉత్సాహంగా సాగింది. క్రీడా మైదానంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలంలు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్, అనంతరం సర్వీస్ రోడ్డు మీదుగా కంతేరు అండర్ బ్రిడ్జి, ఆనందజ్యోతి మీదుగా విశ్వవిద్యాలయ ప్రధాన గేటుకు వాక్ చేరుకుంది. తిరిగి క్రీడా మైదానానికి వెళ్లింది. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
చీకటి గోపి మృతిపై తేలని చీకటి కోణాలెన్నెన్నో
తాడికొండ: చీకటి గోపి మృతిపై చీకటి కోణాలను బయట పెట్టాలని దళిత ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. ఒంటిపై గాయాలతో పోలీస్స్టేషన్ నుంచి నేరుగా ఆస్పత్రిలో చేరిన గోపి తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చుబడి జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యులకు గోపి చనిపోయే ముందు నన్ను పోలీసులు తీవ్రంగా కొట్టారని మృతుడి సోదరుడు సతీష్, సోదరికి చెప్పి భయాందోళనకు గురయ్యాడని, ఆస్పత్రి నుంచి వెళ్తే మళ్లీ తీసుకెళ్లి చావబాదుతారంటూ భయంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన అనంతరం గోపి కాళ్లు, ఒంటిపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బంధువులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే... పోస్టుమార్టం పూర్తయిన వెంటనే నివేదిక రాకుండానే పోలీసులు ఒక అడుగు ముందుకేసి పోలీసులు అసలు కొట్టనేలేదని సెలవిచ్చారు. తాడికొండ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని చెప్పుకొచ్చారు. ఎక్కడా కొట్టినట్లు అందులో నమోదు కాలేదని చెబుతున్నా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పర్యవేక్షణ లేని ఓ గది ఉండటం, అందులోకి చీకటి గోపి సహ నిందితులను విచారణ నిమిత్తం తీసుకెళ్లి తీసుకొచ్చినట్లు ఆ రికార్డుల్లో నమోదయింది. అయితే ఆ గది దుస్తులు మార్చుకునేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతి కౌన్సెలింగ్కు అదే గదిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ● చీకటి గోపి కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఉంగరం దొంగతనం చేసిన ప్రధాన నిందితుడు చింతచెర్ల గోపి, శాంతిరాజు ఉన్నారు. అయితే గోపి మృతి చెందిన దగ్గర నుంచి ఆ కుటుంబాలు జాడ లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అయితే వీరు భయంతో పారిపోయారా లేక వారు నోరు విప్పితే అసలు విషయం బయట పడుతుందని పోలీసులే వారిని తప్పించారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ● మృతుడు గోపికి జనసేన సభ్యత్వం ఉంది. ఆన్లైన్ రసీదును కూడా బంధువులు చూపిస్తున్నారు. సోదరుడు సతీష్కి టీడీపీ సభ్యత్వం, ఐడీ కార్డు కూడా ఉంది. ఇంతా జరిగిన స్థానిక కూటమి నాయకులు కానీ, ఎమ్మెల్యే, ఇతర నాయకులు కనీస పరామర్శకు రాకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ● రెండు రోజుల పోలీసు కస్టడీలో విచారణ పేరుతో ఆ గదిలోకి మృతుడు గోపి, ఇతర నిందితులను సీసీ కెమెరా పర్యవేక్షణ లేని గది లోపలికి తీసుకెళ్లి బయటకు తీసుకొచ్చినట్లు కెమెరా రికార్డుల్లో స్పష్టంగా నమోదయినట్లు సమాచారం. కాగా అసలు కొట్టినట్లు ఎక్కడా కనిపించలేదు కాబట్టి పోలీసులు కొట్టలేదంటూ సమర్దించుకుంటున్నారు. -
జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 26 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.4 మి.మీ. వర్షం పడింది. సగటున 5.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివరాలు.. ప్రత్తిపాడు మండలంలో 20.4 మి.మీ., పెదనందిపాడు 18.6, గుంటూరు పశ్చిమ 13.1, గుంటూరు తూర్పు 9.2, తెనాలి 3, దుగ్గిరాల 2.8, తుళ్ళూరు 2.4, మేడికొండూరు 2.4, పెదకాకాని 2.4, ఫిరంగిపురం 2.2, కాకుమాను మండలంలో 1.6 మి.మీ. చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 38.7 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 31.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. నగరంపాలెం: యూకే బ్రైటన్లో స్థిరపడిన ప్రముఖ తెలుగు సెలబ్రిటీ చెఫ్ కాంతికిరణ్ తమ్మా అరుదైన గౌరవా న్ని సొంతం చేసుకున్నా రు. గుంటూరు కొత్తపేటలో జన్మించారు. యూకే లో స్థిరపడ్డారు. బ్రైటన్న్లో ది స్పైస్ సర్క్యూట్ లిమిటెడ్ చెఫ్ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను ప్రతిష్టాత్మక బీఐహెచ్ స్పాట్లైట్ అవార్డ్స్ (2026)లో చెఫ్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఫైనలిస్ట్గా ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. యూకేలో దక్షిణ భారత, ముఖ్యంగా తెలుగు వంటకాలు, ఆహార సంస్కృతికి అందిస్తున్న విశిష్ట సేవలకు లభించిన అరుదైన గుర్తింపుగా ఈ గౌరవాన్ని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న బీఐహెచ్ స్పాట్లైట్ అవార్డ్స్– 2026 విజేతలను లండన్లోని క్వాగ్లినోస్లో ప్రకటించనున్నారు. కాంతికిరణ్ తమ్మా చెఫ్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్ట్గా నిలవడం తెలుగు వారి గర్వకారణంగా మారింది. మంగళగిరి రూరల్: యువ ఇంజినీర్ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకట శ్యామ్ (22) రాజధానిలో ఈ– 14 రోడ్డు నిర్మాణం చేస్తున్న ఓ కంపెనీలో ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి రోజు విధుల కు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరులో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14 రోడ్డు నిర్మాణంలో భాగంగా డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో కాంక్రీట్ మిక్సర్ వేయాల్సిన ప్రదేశం కాకుండా ముందుకు వెళ్లడంతో డ్యూటీలో ఉన్న ఇంజినీర్ శ్యామ్ వాహనాన్ని వెనక్కి పిలవడంతో డ్రైవర్ రివర్స్ గేర్లో వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అతను డైరెక్షన్ మార్చుకో అని డ్రైవర్కి చెప్పేలోపు వాహనం శ్యామ్కు తగలడంతో అతను కింద పడిపోవడం అతడిపై టైర్ ఎక్కటం క్షణాల్లో జరిగిపోయింది. తోటి ఉద్యోగులు ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. తెనాలి రూరల్: రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి చెందిన ఘటన తెనాలి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం జరిగింది. రైల్వే స్టేషన్ దక్షిణ క్యాబిన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో పట్టణ పాండురంగపేటకు చెందిన వంట మాస్టర్ ఎమ్మిటిశెట్టి నాగేశ్వరరావు(67) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎర్ర రంగు చేతి సంచి ఉంది. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించగా, రాత్రికి మృతుడి వివరాలు తెలిశాయి. ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్చురీలో సీసీ కెమెరాలు ఏర్పాటు
గుంటూరుమెడికల్: నగరంలోని జీజీహెచ్ మార్చురీ విభాగంలో మంగళవారం ఆసుపత్రి అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ‘మార్చురీలో పైసాచికం’ శీర్షికతో మార్చురీలో మృతదేహం అప్పగించేందుకు మామూళ్లు తీసుకుంటున్నారనే విషయంపై ‘సాక్షి’ పత్రికలో ఈ నెల 4న కథనం ప్రచురితమైంది. గతంలో సీసీ కెమెరాలు ఉండేవి, నేడు కెమెరాలు లేకపోవడం వల్ల పలువురు వైద్య సిబ్బంది మార్చురీలో మృతదేహాలు అప్పగించేందుకు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ ప్రచురించడంతో ఆసుపత్రి అధికారులు స్పందించారు. సదరు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేత
లక్ష్మీపురం: కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేయనున్నట్లు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల దేవాలయ భూములను పేద రైతులు సాగు చేస్తున్నారని, వారికి దేవదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇవ్వాలని కోరారు. పంట వచ్చిన తరువాత కౌలు చెల్లంచేందుకు అనుమతినివ్వాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింప చేయాలని, పంట నష్టపరిహారాలు కౌలు రైతులకు కూడా ఇవ్వాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపునకు, నల్లమడ ఆధునికీకరణకు ఒకే సారి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నీలాంబరం, ఏడుకొండలు, మొగిలయ్య, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ -
చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ఈ
సత్తెనపల్లి: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే లక్కరాజుగార్లపాడు రోడ్లోని చెరువును ఇరిగేషన్ ఎస్ఈ టీ రమేష్ మంగళవారం పరిశీలించారు. కాలువల నుంచి విడుదలైన నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును ఆయన పరిశీలించి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఇరిగేషన్ ఈఈ మురళీధర్, ఏఈ సుందర్రావు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బి.మధుసూదనరావు, ఏఈ సాగర్మరియరాజు, సిబ్బంది ఉన్నారు. గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న రెండు నెలలపాటు తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత, ఉత్పత్తుల తయారీ వంటి కోర్సులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సదుపాయం కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఐపాడ్ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీగా నిర్ణయించారన్నారు. ఆసక్తి కలిగినవారు మరిన్ని వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్ను గానీ, 70366 89346, 91822 45693 ఫోన్ నంబర్లనుగానీ ఉదయం 9–సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించాలన్నారు. గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఆగస్టు 21 వ తేదీ నుంచి పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జీజీహెచ్లో నల్లమాస్క్లు ధరించి నిరసన తెలియజేశారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలన్నారు. బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు రమాదేవి, సుజిత, హైమావతి, శైలజ, భార్గవి, అంజలి, ల్యాబ్ టెక్నీషియన్లు ఖాసీం, రమేష్, వాణి, ఆదిలక్ష్మి, శైలజ, ఫార్మాసిస్టులు శ్రీలక్ష్మి, సుజాత, అశ్విని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లీగల్: అక్షరాలు జీవితాన్ని మార్చగలవని, చదువుకున్న సమాజం దేశ భవిష్యత్తును మార్చగలదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం కాదన్నారు. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవడం అన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఒకరినైనా అక్షరాస్యులుగా మార్చేందుకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఎం.వెంకట రమణప్ప, జిల్లా బాలల పరిరక్షణ సంస్థ అధికారి సీహెచ్ విజయ్కుమార్, డీపీఓ పి.వి.నాగసాయికుమార్, సోషల్ వెల్ఫేర్ శాఖ సూపరింటెండెంట్ కె.మధుసూదన్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎ.పద్మావతి, ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపటిలోగా బహిరంగ విచారణ పూర్తి చేయాలి
డీఆర్వో షేక్ ఖాజావలి గుంటూరు వెస్ట్: ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) పెండింగ్ దరఖాస్తుల బహిరంగ విచారణ గురువారం నాటికి పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి స్పష్టం చేశారు. సర్పై తహసీల్దార్లతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. బుక్ ఏ కాల్ విధానంలో వచ్చిన అభ్యర్థనలను వేగంగా పరిష్కరించడానికి కనీసం గంటకు ఒకసారి యాప్ను సందర్శించాలని పేర్కొన్నారు. ఫారం 6,7,8 లలో వచ్చిన క్లెయిమ్పైనా దృష్టి సారించాలని తెలిపారు. నిబంధనల మేరకు కాలానుగుణంగా రాజకీయ పార్టీలకు వివరాలు అందించాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) తమ పరిధిలో గల పన్నెండు వందల మంది ఓటర్ల వివరాలు, ఫొటోలు విధిగా పరిశీలించాలని చెప్పారు. వాటిలో తప్పులు ఉన్నా, ఫొటో జత కాకపోయినా వారే బాధ్యులు అవుతారని తెలిపారు. ప్రతి విద్యాసంస్థలో ఓటరు అక్షరాస్యత క్లబ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జనగణన కింద విచారణ పూర్తి కావలసిన అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు, తాళాలు వేసిన ఇళ్ల వివరాలు సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. రెవెన్యూ సేవలు ప్రజలకు చేరువ చేయాలని పేర్కొన్నారు. రీ సర్వే వంటి ప్రక్రియపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది విస్తృతంగా ప్రజలతో మమేకం కావాలని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన అన్ని రకాల సేవలు అందించాలని డీఆర్వోవివరించారు. -
మంగళాద్రిపై అరుదైన అతిథి... పునుగుపిల్లి సంచారం
● భక్తుల కెమెరాకు చిక్కిన వన్యప్రాణి ● అటవీ శాఖ అధికారుల నిర్ధారణ ● రాత్రి వేళల్లోనే సంచారం ● భక్తులు ఆటంకం కలిగించవద్దని సూచనమంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై అరుదైన పునుగుపిల్లి కనిపించింది. నాలుగు రోజుల క్రితం కొండపైకి వెళ్లిన భక్తులు రాళ్ల మధ్య పునుగుపిల్లి సంచరిస్తున్న దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆరా తీసి పునుపుపిల్లి సంచారాన్ని ధ్రువీకరించినట్లు సమాచారం. మంగళగిరి కొండకు సమీపంలో కృష్ణానది పరీవాహక ప్రాంతం ఉండడం, పరిసరాల్లో పంట్లతోటలు, పొదలు, నీటి వనరులు అందుబాటులో ఉండడం పునుగుపిల్లి సంచారానికి అనుకూల పరిస్థితులుగా అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా పునుగు పిల్లులు రాత్రి వేళల్లో చురుకుగా సంచరిస్తూ, పగటి సమయంలో రాళ్ల సందుల్లో, పొదలు వంటి సురక్షిత ప్రాంతాల్లో దాక్కుంటాయి. పండ్లు, చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పునుగుపిల్లులు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో కనిపించే చిన్న క్షీరదాలు. ఆంధ్రప్రదేశ్లో శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాల్లో వీటి ఉనికి నమోదు అయింది. జనసంచారం ఎక్కువగా ఉండే మంగళగిరి కొండపై ఇలాంటి వన్యప్రాణి కనిపించడం, వన్యప్రాణి ప్రేమికులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొండపై పునుగుపిల్లి కనిపించనపుడు దాని దగ్గరకు వెళ్ళడం, వెంబడించడం, ప్లాష్ లైట్లు వేయడం, ఆహారం అందించడం, పట్టుకునే ప్రయత్నం చేయవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అది తన సహజ ఆవాసంలో స్వేచ్ఛగా సంచరించేలా భక్తులు, సందర్శకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి తాడేపల్లి పరిసరాల్లో గతంలోనూ పునుగుపిల్లులు జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది మార్చి 2న తాడేపల్లి ముగ్గురోడ్డు సమీపంలోని నివాస గృహంలోకి పునుగుపిల్లి ప్రవేశించడంతో అధికారులు దానిని సురక్షితంగా స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
విజ్ఞాన్కు హెచ్సీఎల్టెక్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్టెక్ ప్రతిష్టాత్మకమైన ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు అందజేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంగళవారం వైస్ చాన్సలర్ కృష్ణకిషోర్కు హెచ్సీఎల్టెక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ విభాగ ప్రతినిధి రాజమురుగన్ అథిముత్తు నాడర్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’కు సంబంధించిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు. హెచ్సీఎల్టెక్ సంస్థ తన ప్రశంసాపత్రంలో సాంకేతిక ప్రతిభావంతుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఇరువర్గాల ఉమ్మడి నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించింది. ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’గా విజ్ఞాన్ యూనివర్సిటీతో కలిసి విద్యా రంగం– పరిశ్రమ మధ్య బలమైన వారధిని నిర్మిస్తున్నామని, విద్యార్థులు తమ నైపుణ్యాలను చాటుకుని వృత్తిపరమైన కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
జీఎంసీ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్
నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంట్రాక్ట్ పనులను రద్దు చేసి, డిపాజిట్లను జప్తు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి జీఎంసీ కమిషనర్ జారీ చేసిన ఏకపక్ష ఉత్తర్వులను కొట్టివేసింది. బాధితుడి డిపాజిట్ మొత్తాన్ని ఆరు వారాల్లోగా తిరిగి చెల్లించాలని జస్టిస్ హరినాథ్.ఎన్ తీర్పు వెలువరించారు. అసలేం జరిగిందంటే.. నల్లచెరువుకు చెందిన ‘దిరిసాల శ్రీనివాసరావు’ ఏజెన్సీ గతంలో (2017–18, 2019–20) ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పోర్టల్ డేటాను, రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిందని జీఎంసీ ఆరోపించింది. నాయుడుపేట డ్రెయిన్లు, చంద్రబాబు నాయుడు కాలనీ రోడ్డు, క్రిస్టియన్ పేట యూజీడీ పనుల్లో పోర్టల్ శాతాలకు, ఎల్వోఏ రిజిస్టర్కు మధ్య భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో సదరు ఏజెన్సీకి సంబంధించి గుండారావుపేట, బండ్ల బజార్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ పరిసరాల్లో చేపట్టిన రూ. 2.02 కోట్ల విలువైన ఆరు సివిల్ పనులను రద్దు చేస్తూ, ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేస్తూ జీఎంసీ కమిషనర్ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావుతో పాటు మరికొంత మంది కాంట్రాక్టర్లు కూడా ఇదే జాబితాలో ఉన్నారు. జీఎంసీ చర్యను సవాల్ చేస్తూ కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది అనంత వాదనలు వినిపించారు. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండా డిపాజిట్లు జప్తు చేయడం చట్టవిరుద్ధమని కోర్టుకు విన్నవించారు. ఉభయ పక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి.. పాత పనుల్లో అక్రమాలు జరిగాయన్న నెపంతో కొత్త టెండర్లను రద్దు చేయడం, డిపాజిట్లను జప్తు చేసే అధికారం జీఎంసీకి లేదని స్పష్టం చేశారు. కమిషనర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని పేర్కొన్నారు. వివాదాస్పద ప్రొసీడింగ్స్ను పూర్తిగా రద్దు చేశారు. పిటిషనర్కు సంబంధించిన ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ను తీర్పు ప్రతి అందిన ఆరు వారాల్లోగా రీఫండ్ చేయాలని జీఎంసీని ఆదేశించారు. -
అవి ఉండే అవకాశం లేదు..
ప్రత్తిపాడు: రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రకంగా పింఛన్ల మంజూరు సంఖ్యను దరఖాస్తు దశలోనే కుదించేందుకు పథకం పన్నినట్లుగా కనబడుతోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఇంట్లో సహజంగా ఉండే ఆధార్ కార్డు, రేషన్ కార్డులను అడ్రస్ ప్రూఫ్ జాబితాలో చేర్చలేదు. స్థానికతను నిర్ధారించుకునేందుకు అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడీ, గ్యాస్ బిల్లు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ల్లో ఏదో ఒకటి తప్పనిసరన్న నిబంధనను విధించింది. దీంతో వృద్ధుల పరిస్థితి ఆదిలోనే హంసపాదులా తయారైంది. కేవలం ఆధార్ను ఆధార్ హిస్టరీ అప్లోడ్ చేసేందుకు, హౌస్హోల్డ్ మ్యాపింగ్కు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ అవ్వక.. ఇటీవల సర్ ప్రక్రియతోపాటు అంతకుముందు జరిగిన సవరణల్లో ఓటర్ ఐడీ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసినట్లు మొన్నటి వరకు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఓటర్ ఐడీ కోసం కార్యాలయాలకు వెళ్తున్న వారికి ఇంకో సమస్య ఎదురవుతోంది. కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కాలేదని, ముందు కార్డు లింక్ చేయించుకోవాలని ఉచిత సలహాలిచ్చి వెనక్కు పంపిస్తున్నారు. దాదాపుగా సగం మందికి ఫోన్ నంబర్తో అనుసంధానం కాలేదని తెలుస్తోంది. ఇవి కాక ఆధార్ కార్డులకు లింక్ అయిన మొబైల్ నంబర్లు, ఓటీపీలు, కరెంటు బిల్లులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా సమర్పించాల్సిన పత్రాలెన్నో ఉన్నాయి. వీటన్నింటినీ తీసుకుని స్వర్ణ గ్రామ కార్యాలయాలకు వెళ్లడానికి దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక దరఖాస్తుకే ఇలా ఉంటే విచారణ తర్వాత ఎన్ని మంజూరవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను పరిశీలించి, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు. వాస్తవానికి స్థానికతను నిరూపించుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నాలుగింటిలో మూడు ప్రూఫ్లు వృద్ధుల వద్ద ఉండే అవకాశమే లేదు. పాస్పోర్టు విదేశాలకు వెళ్లే వారి వద్ద లేదా కొద్దో గొప్పో ఆర్థిక స్థోమత ఉన్న వారి వద్ద మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కచ్చితంగా 95 శాతం మంది వృద్ధుల వద్ద ఉండే అవకాశమే లేదు. డ్రైవింగ్ లైసెన్స్ 60 ఏళ్ల పైబడిన కర్ర లేనిదే కాలు బయట పెట్టలేని వృద్ధుల వద్ద ఉండటం చాలా అరుదు. మొదటి నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్న అతికొద్ది మంది వద్ద మాత్రమే ఉండే వీలుంది. మొత్తమ్మీద ఐదు, పది శాతం మంది వద్ద కూడా ఉండని పరిస్థితి. మూడవది గ్యాస్ బిల్లు. మలి వయస్సులో కొడుకులు, కుమార్తెల వద్ద ఉండే వృద్ధుల పేరుతో గ్యాస్ బిల్లు ఉండటం అంటే సాధ్యమయ్యే పని కానే కాదు. ఓటర్ ఐడీ అనేక మంది వృద్ధులకు ఉన్నా అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవేళ పాత కార్డు దొరికినా ఇప్పుడు పది అంకెలతో ఉండే కొత్త కార్డు కావాలని మెలిక పెడుతున్నారు. -
విద్యుత్ బస్లను ఆర్టీసీ పర్యవేక్షించాలి
నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్ బస్లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్ బస్ల డిపోల ఏర్పాటు పేరుతో మూసివేసిన అలిపిరి, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు– 2, గుంటూరు– 2, విద్యాధరపురం డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణికుల దృష్ట్యా బస్లు, సిబ్బందిని పెంపొందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. మూతపడిన డిపోలను వెంటనే పునః ప్రారంభించాలని అన్నారు. శిబిరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు, ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు కె.గంగాధర్రావు, జె.నాంచారయ్య, కె.పాములు మద్దతు ప్రకటించగా, ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎంవీఎస్.రామకృష్ణ, కార్యకర్తలు వి.మధుసూదన్రావు, సిహెచ్.శ్రీను, టి.శ్రీను, రవిచంద్, జయశ్రీ, బి.రామాంజనేయులు, ఎల్.వి.ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: పన్నులు చెల్లించకుండా రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి, నిర్బంధంలో ఉన్న వాహనాలు ఈనెల 26 వేలం నిర్వహించనున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయ ఆవరణలోని 33, తెనాలి కార్యాలయంలోని 33 వాహనాలు (హెచ్జీవీలు, ఎంజీవీలు, ఎల్జీవీలు, మోటార్ సైకిల్స్, మోటార్కార్, మ్యాక్సిక్యాబ్లు) ఈ వేలంలో విక్రయిస్తామని తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు చెల్లించాల్సిన పన్నులు, అపరాధ రుసుం ఈనెల 25లోగా చెల్లించాలని అన్నారు. లేనిచో ఈనెల 26 మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు డీటీఓ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగరంపాలెం: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన నేరస్తుడిపై పీఐటీ–ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో యువత, విద్యార్థులు లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మల్లవరుపు పృధ్వీపై ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పృధ్వీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అతనిపై మంగళగిరి పట్టణ పీఎస్, తాడేపల్లి పీఎస్, దుగ్గిరాల పీఎస్, ఎన్టీఆర్ జిల్లా సూర్యారావుపేట పీఎస్, గుడూరు పీఎస్లో కేసులు ఉన్నాయని తెలిపారు. -
సీఐని విధుల నుంచి తొలగించాలి
● గిరిజన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణం ● సీఐపై గుంటురు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు నగరంపాలెం: డైభ్బె ఏళ్లు పైబడిన గిరిజన మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన బాపట్ల రెండో పట్టణ పీఎస్ సీఐను విధుల నుంచి డిస్మస్ చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్నాయక్ డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి వినతిపత్రం అందించారు. మట్రా జాలమ్మపై సీఐ ప్రవర్తించిన తీరుని ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వడిత్యా శంకర్నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల ఆరున బాపట్ల జిల్లా ఆదినారాయణపురంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారని అన్నారు. ఈ క్రమంలో 70 ఏళ్లు పైబడిన గిరిజన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మట్రా జాలమ్మపై బాపట్ల రెండో పట్టణ పీఎస్ సీఐ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. సీఐ మాట్లాడిన మాటలు మా ఆత్మలు క్షోభిస్తున్నాయని, మనసులు కలిచివేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత వృద్ధురాలి నుంచి స్వయంగా వాంగ్మూలం నమోదు చేయాలని కోరారు. ఘటనకు సంబంధించి సీసీ పుటేజీ, వీడియో రికార్డులు, పోలీసుల విధి నిర్వహణ వివరాలు, ఇతరత్రా ఆధారాలను భద్రపరిచి పరిశీలించాలని కోరారు. విచారణ ముగిసే వరకు బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఐజీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఆమె పట్ల ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారని పేర్కొన్నారు. ఐజీని కలిసిన వారిలో నాయకులు రామావతు అంజినాయక్, హరిలాల్ నాయక్, పాండు నాయక్, కె.ఆనంద్, ఇ.హనుమంతునాయక్, పి.గోవర్ధన్ ఉన్నారు. -
గంజాయి తాగి, విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు తెనాలిరూరల్: గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను డీఎస్పీ బి.జనార్ధనరావు వెల్లడించారు. నందివెలుగు జంక్షన్ వద్ద బ్రిడ్జి కింద గంజాయి విక్రయాలు, తాగుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం సాయంత్రం తెనాలి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, డెప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, వీఆర్వోలు గుంపెన నాగరాజు, కొత్త జార్జి థామస్ సమక్షంలో దాడులు చేశారు. అబ్దుల్ కరీమ్(కొల్లిపర), అమిరె ఆనంద్ కిషోర్ అలియాస్ చోటు(కొల్లిపర), షేక్ సాధిక్(తెనాలి), కోలా రత్నరాజు(తెనాలి), దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లూ(తెనాలి), బత్తెన అజయ్కుమార్(తెనాలి), రెడ్డి సాయికుమార్(తెనాలి) గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా గంజాయిని గుంటూరుకు చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీరి సమాచారంతో మంగళవారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో దాడి చేసి ప్రధాన సప్లయర్లుగా పేర్కొన్న ఆరేటి నవీన్న్, షేక్ షఫీలను అరెస్టు చేశారు. తెనాలి ప్రాంతానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా లింక్ను ఛేదించారు. అరెస్టయిన వారిలో పలువురిపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కొందరిపై దొంగతనాలు, ఎన్న్డీపీఎస్ కేసులు ఉండగా, షేక్ షఫీపై ఎన్న్డీపీఎస్, ఆయుధాల చట్టం, హత్య, దాడి తదితర కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచగా రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్తో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్ధనరావు అభినందించారు. సమావేశంలో తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు. -
ఏపీ డీఎస్సీ స్కామ్లో సంచలన పరిణామం
సాక్షి,విశాఖ: ఏపీ డీఎస్సీ స్కామ్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో టీచర్ ఉద్యోగాలు పొందిన చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలడంతో చర్చాంశనీయమైంది. ఈ వ్యవహారంపై ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) అధికారులకు సంచలన లేఖ రాశారు.ఈ ఫేక్ సర్టిఫికేట్ల బండారాన్ని సాక్షి టీవీ తొలుత బయటపెట్టగా, తాజాగా ఖోఖో అసోసియేషన్ అధికారిక లేఖతో విషయం మరింత స్పష్టమైంది. శాప్కు రాసిన లేఖలో‘చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలకు సర్టిఫికేట్లు మేం ఇవ్వలేదు.శాప్ నుండి వీళ్ల అభ్యర్థిత్వంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. వీళ్లు ఇద్దరికి మేం ఎలాంటి మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మా టోర్నమెంట్ల జాబితాల్లో ఎక్కడా వీరి పేర్లు లేవు. శాప్కి మేం పూర్తి వివరాలు అందిస్తున్నాం. వీళ్లు పొందుపర్చిన సర్టిఫికేట్లు చెల్లవు.నకిలీ, ఫోర్జరీ సర్టిఫికేట్లపై విచారణ జరపాలి. ఆ సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోవాలి. శాప్కి మేం పూర్తి సహకారాన్ని అందిస్తాం’అని ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ’ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు వైఎస్ జగన్. ‘కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. శ్యామ్, టి.రాజా, ఎం.గంగా సూరిబాబు, రాజేష్తో పాటు 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం దారుణం. ‘‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడం, ఉద్యోగాల భర్తీ కోరడమే వారు చేసిన నేరమా?, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా?, అధికారంలోకి రావడానికి యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు. . మూడేళ్లకు రూ.21,600 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా..యువతను మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది. మెగా డీఎస్సీ స్కాంలో రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా..సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ అణచివేత, సెన్సార్షిప్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ ఇస్తూ నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అడిగితే మాత్రం కేసులా?, ఇది కూటమి ప్రభుత్వ యువత వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిక్రూట్మెంట్ స్కాంలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాలు పరిపాటిగా మారుతున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలను గౌరవించడం టీడీపీకి ఎప్పుడూ చేతకాలేదు. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించడం కంటే.. అవినీతి, రాజకీయ మాయాజాలానికే ప్రాధాన్యం ఇస్తోంది.నిరుద్యోగ యువతపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.Cases were…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2026 డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
రేపు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. -
‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై 3.30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున జూన్ నెల నుంచే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన మోసాలు బయటపడటంతో సమాధానం చెప్పలేక ఇద్దరు ఐఏఎస్ అధికారులను ముందుకు నెట్టి అబద్ధాలు చెప్పిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. స్పోర్ట్స్ కోటా అక్రమాలలో శాప్ పాత్ర ఉందని, అధికారుల ప్రెస్మీట్లో మీడియాను బెదిరించినట్లు ఉందన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, డీఎస్సీ కన్వీనర్, శాప్ చైర్మన్ చేసిన తప్పులను అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలన్నింటిపై విచారణ జరిపి తప్పులను తేల్చాల్సిన రోజు అధికారులకు వస్తుంది. స్పోర్ట్స్ డీఎస్సీ, మెగా డీఎస్సీల్లో టెట్ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈడిగ ప్రభాకర్కు టెట్ అర్హత లేదని స్వయంగా అతనే ఒప్పుకున్నా, 2018లో 77 మార్కులు వచ్చాయని పీపీటీ ద్వారా అబద్ధపు ప్రచారం చేశారు. ఎస్జీటీ పోస్టుకు పేపర్ వన్-ఏ అవసరమైతే, స్పెషల్ స్కూల్స్కు వర్తించే పేపర్ టు-బి మార్కులను చూపించి కమిషనర్ ప్రజలను తప్పుదారి పట్టించారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పరిశీలిస్తే ఎక్కడా ప్రభాకర్కు పేపర్ టు-బి రాసిన దాఖలాలు లేవు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తర్వాత 2025లో జరిగిన టెట్ పరీక్షను ప్రభాకర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలి. జే ఉషా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కు దరఖాస్తు చేసుకుంటే, ఆమెకు ఏకంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టు కేటాయించారు. 2017 తర్వాత లాంగ్వేజ్లకు ప్రత్యేకంగా టెట్ పాస్ కావాలన్న నోటిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఉషాకు పోస్టు ఇచ్చారు. రాజ్ కుమార్ అనే వ్యక్తికి అర్హత లేకపోయినా, డీఎస్సీ రాయకపోయినా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు. తప్పులను ప్రశ్నిస్తున్న మీడియాకు, అభ్యర్థులకు వార్నింగులు ఇస్తూ అక్రమ కేసులు పెడతామని శాప్ ఎండీ బెదిరిస్తున్నారు. జూడో క్రీడలో జరిగిన ఘోరమైన అవకతవకలను రెండు అసోసియేషన్ల మధ్య గొడవగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూస్తున్నారు. 2025 సెప్టెంబర్లోనే రిక్రూట్మెంట్ ముగిస్తే, 2026 జూన్లో వెబ్సైట్ ద్వారా సర్టిఫికెట్లను అక్రమంగా మార్చేశారు. పెద్దాడ అప్పలరాజుకు తన తమ్ముడి సర్టిఫికెట్తో ఉద్యోగం ఇచ్చిన విషయం అధికారిక వెబ్సైట్ ద్వారానే బట్టబయలైంది.ఆర్చరీ, కబడ్డీ అభ్యర్థుల సర్టిఫికెట్లు, విజయాల వివరాలను కూడా అధికారులు నిస్సిగ్గుగా ట్యాంపరింగ్ చేశారు. ఎమ్మెల్యే పూనా రవికుమార్ సంతకాలతో ఇచ్చిన సర్టిఫికెట్లను చెల్లుబాటు చేయడానికి నకిలీ ఆథరైజేషన్ లెటర్లను సృష్టిస్తున్నారు. జీవో నెంబర్ 4, 47 ప్రకారం సెక్రటరీ లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే సంతకం చేయాలన్న రూల్ ఉంటే గౌరవ అధ్యక్షుడి సంతకాలను ఎలా ఆమోదిస్తారు. 2018 నోటిఫికేషన్ ప్రకారం స్పోర్ట్స్ పర్సన్లకు గ్రౌండ్ పెర్ఫార్మెన్స్కు 20 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చే నిబంధనను ఎందుకు రద్దు చేశారు. జిల్లా స్థాయిలో డీఎస్డీవోల ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే పద్ధతిని పూర్తిగా తొలగించి శాప్లో కూర్చుని అక్రమాలకు పాల్పడ్డారు. కలెక్టర్లు, డీఈవోల ఆధ్వర్యంలో జరగాల్సిన 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్ను పూర్తిగా ఎత్తేసి నియామక పత్రాలు ఇచ్చారు. అభ్యర్థులు పెట్టుకున్న గ్రీవెన్స్లను కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా, శాప్ లేఖలు రాసినా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అర్హులకు న్యాయం చేయకుండా తొక్కిపెట్టింది. కోర్టు ఆదేశాలు ఉన్న 100 జెన్యూన్ కేసులను స్వయంగా తీసుకొస్తాం, గ్రీవెన్స్ ద్వారా బాధితులకు న్యాయం చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
లోకేశ్.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడినా.. ఎదురు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీలో అక్రమాలు చేసి టీడీపీ నేతలు దొరికి పోయారు. సాక్ష్యాలు బయటపడినా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే వెళ్తారు. అక్రమాలు బయట పడినా లోకేష్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఒకప్పుడు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తే సీబీఐతో విచారణ జరిపించుకోమని వైఎస్ఆర్ సవాల్ చేశారు. మరి లోకేష్ పై ఆధారాలతో బయటపడినా ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. చంద్రబాబు వెంటనే లోకేష్తో రాజీనామా చేయించాలి అని రాజీవ్ అన్నారు.. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఉవ్వటం ఏపీలోనే చూస్తున్నాం. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపై కూడా సీబీఐ విచారణకు మేం సిద్ధమంటున్నా కూడా వాళ్ల దగ్గరి నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఉద్యోగం ఇచ్చే ముందు సర్టిఫికేట్ల విచారణ చేయాలి. కానీ ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకుని ఇప్పుడు సర్టిఫికేట్ల విచారణ చేస్తామంటారా?. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. వారిపై చర్యలు తీసుకుబే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఫేక్ వాళ్లు బయటకు వచ్చి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో బయట పెడతారోనని భయం.. .. పైగా ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడతున్నారు. నారా లోకేష్ సవాల్పై చర్చించటానికి మా మాజీ మంత్రులు సిద్ధమే. అది చూసి ఆయన భయంతో పారిపోయారు. సవాల్ చేసిన నారా లోకేష్ మహిళలను అడ్డం పెట్టి మాట్లాడించటం ఎందుకు?. ఇది సిగ్గుచేటు అని కొండా రాజీవ్ అన్నారు.ఇదీ చదవండి: జనసేనకు షాకిచ్చిన టీడీపీ -
‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు...జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్ జగన్కి సవాల్ చేసే స్థాయి లోకేష్కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్ సవాల్ విసిరారు. -
నగర ఖాళీల సంస్థ!
సిబ్బంది నిల్.. ఒత్తిడి ఫుల్.. అవినీతి హల్చల్ అవినీతికి ‘ఇన్చార్జ్’లునెహ్రూనగర్: రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ)ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో పాలనను పట్టించుకోని సర్కారు వైఖరితో నగరంలో పౌరసేవలు అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం సేవలందించాల్సిన స్థానిక సంస్థను ఖాళీల సమస్య దారుణంగా వేధిస్తోంది. మొత్తం 110 మంజూరైన క్యాడర్ పోస్టుల్లో ప్రస్తుతం కేవలం 46 మంది మాత్రమే విధుల్లో ఉండగా, ఏకంగా 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 58 శాతానికి పైగా పోస్టులను భర్తీ చేయకుండా గాలికొదిలేయడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎన్నికల నిర్వహణ ఎలా? ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ చివరినాటికి నిర్వహించాలని ప్రభుత్వం ముమ్మరంగా యోచిస్తోంది. అయితే కార్పొరేషన్లో సిబ్బంది కొరతతో ఈ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా సాధ్యమనేది ఇప్పుడు ‘మిలియన్ డాలర్ల ప్రశ్న’గా మారింది. ఉన్న సిబ్బందిని ప్రభుత్వం ఎడాపెడా అదనపు బాధ్యతలతో ముంచెత్తుతోంది. ఓటర్ల జాబితా తయారీ కోసం, బీఎల్ఓ డ్యూటీలు, రోజుకో సర్వే చేయమంటూ ప్రభుత్వ ఆదేశాలు, వీటికితోడు నగర ప్రజల రోజువారీ దరఖాస్తులు, రెగ్యులర్ డ్యూటీలతో ఉద్యోగులు ఊపిరిసలపక నానా తంటాలు పడుతున్నారు. ఎస్ఈ విధుల్లోకి.. వస్తారా.. రారా? ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ జి.వెంకటేశ్వర్లు గత రెండు నెలల క్రితం సెలవుపై విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఈఈ సుందరామిరెడ్డి ఇన్ఛార్జ్ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇంజినీరింగ్ సెక్షన్లో దొంగ టెండర్లు, ‘లెస్’ మాయాజాలం సృష్టించి ప్రభుత్వ ఖజానాకు, కార్పొరేషన్కు కోట్ల రూపాయల నష్టం చేకూర్చిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ఈ వ్యవహారం నగరంలో తీవ్ర దుమారం రేపింది. ఏసీబీ తనిఖీలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం సెలవుపై వెళ్లిన ఎస్ఈ తిరిగి విధుల్లోకి చేరతారా లేదా? అన్న అనుమానాలను సిబ్బందే బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 18 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు గాను 13 ఖాళీగా ఉన్నాయి. కేవలం ఐదుగురితో ఇంత పెద్ద నగరంలో రోడ్లు, కాలువల పనులను పర్యవేక్షించడం అసాధ్యంగా మారింది. ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. చేరిన నెలరోజుల్లోనే లీవ్లోకి ఏసీ.. కార్పొరేషన్లో కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు కూడా నిలకడలేకుండా పోయింది. కమిషనర్ తర్వాత కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోయారు. అడిషనల్ కమిషనర్ (జీఎస్డబ్ల్యూఎస్) పోస్టు ఇప్పటికే ఖాళీగా ఉంది. డిప్యూటీ డైరెక్టర్ వంటి ఉన్నత స్థానాల్లోనూ ఎవరూ లేరు. కీలక అధికారులంతా సెలవులపై వెళ్లడం, పోస్టులు భర్తీ కాకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు ఫైళ్ల రూపంలో మూలనపడుతున్నాయి. సంతకాలు పెట్టే దిక్కులేక పాలనాపరమైన అనుమతులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. టౌన్ ప్లానింగ్ బేజారు.. అక్రమ నిర్మాణాల జోరు అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం ఖాళీల అడ్డాగా మారింది. ఏకై క టౌన్ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది. 13 టీపీ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు ఉండగా ఒక్కరూ విధుల్లో లేరు. తొమ్మిది టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పోస్టుల్లో ఏకంగా ఏడు ఖాళీలే. నాలుగు అసిస్టెంట్ సిటీ ప్లానర్ పోస్టుల్లో రెండు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి, ఇన్ఛార్జ్ల అండదండలతో నగరంలో అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం గుంటూరు నగర పాలనను మాత్రం పూర్తిగా గాలికొదిలేసింది. నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్పొరేషన్లో మంజూరైన ఐదు మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో ఒక్కరూ పనిచేయడం లేదు. మొత్తం ఐదు పోస్టులూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో ముగ్గురు శానిటరీ సూపర్వైజర్ పోస్టుల్లో ఒక్కరూ లేరు. 24 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను కేవలం ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తుండగా, 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న కీలక స్థానాల్లో రెగ్యులర్ అధికారులను నియమించకుండా, ఉన్న అరాకొర సిబ్బందికే ప్రభుత్వం ఇన్ఛార్జ్ బాధ్యతలను కట్టబెడుతోంది. అయితే ఈ తాత్కాలిక పాలన నగరంలో అవినీతి దందాలకు రాచబాటగా మారింది. అదనపు పోస్టులను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం,ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో సామాన్యులను, వ్యాపారులను నిలువునా పిండుకుంటున్నారు. ఎవరిపై నిఘా లేకపోవడం, రేపోమాపో ఇంకొకరు వస్తారనే ధీమాతో విచ్చలవిడిగా ‘ముడుపుల’ దందా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వెనిగండ్లలో మహిళ దారుణ హత్య
బంగారం, నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు పెదకాకాని: మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చిన ఘటన పెదకాకాని మండలం వెనిగండ్లలో చోటు చేసుకుంది. దుండగులు ఇంట్లో ఉన్న నగదు, నగలు అపహరించుకుని వెళ్లారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామానికి చెందిన దాది కోటేశ్వరమ్మ(48)కు గోరంట్ల గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. సుమారు 20 ఏళ్ల కిందట భర్తతో మనస్పర్ధలు రావడంతో పిల్లలతో కలసి స్వగ్రామం వెనిగండ్లలోనే నివసిస్తోంది. ఏడాది కిందట కుమార్తె బంతిని తన మేనల్లుడు సాయికి ఇచ్చి వివాహం జరిపించింది. గత రెండు నెలలుగా గ్రామంలోని కొండమడుగుల సంజీవరెడ్డి ఇల్లు అద్దెకు తీసుకుని ఆమె తన కుమారుడు సాధిక్ నివసిస్తున్నారు. సాధిక్ గుంటూరు ఆటోనగర్లో షెడ్డులో మెకానిక్గా పనిచేస్తున్నాడు. గేదెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న కోటేశ్వరమ్మ అనారోగ్యం కారణంతో కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చిన సాధిక్ తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లో ఉన్న రూ.6 లక్షల నగదు, 8 సవర్ల బంగార ఆభరణాలు దుండగులు దోచుకెళ్లారు. ఇంట్లో పొలం అమ్మిన డబ్బులు, బంగారం ఆభరణాలు ఉన్నట్లు పక్కా సమాచారంతో తెలిసిన వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటానని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. -
తైక్వాండోలో గుంటూరు జిల్లా ఓవరాల్ చాంపియన్
తెనాలి: అమరావతి తైక్వాండో అసోసియేషన్(గుంటూరు) ఆధ్వర్యంలో తెనాలిలో రెండురోజులపాటు నిర్వహించిన 5వ ఏపీ స్టేట్ సబ్జూనియర్, 3వ ఏపీ స్టేట్ కిడ్స్ తైక్వాండో చాంపియన్షిప్–2026లో గుంటూరు జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. స్థానిక జేఎంజే మహిళా కాలేజ్లో ఈ పోటీలను నిర్వహించారు. విజేతలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రన్నర్స్గా, అనకాపల్లి తృతీయస్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా చాంపియన్షిప్లో తెనాలికి చెందిన తైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు 15 బంగారు పతకాలు, 9 రజత పతకాలు, 10 కాంస్య పతకాలను సాధించారు. పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 300 మంది వరకు పాల్గొన్నారు. అమరావతి తైక్వాండో అసోసియేషన్, గుంటూరు కార్యదర్శి బండారు దానిశ్వరరావు పర్యవేక్షించారు. -
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గ్రీన్ వాక్
గుంటూరు మెడికల్: స్వచ్ఛ వాయువు దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు నగరంలో గ్రీన్ వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుజ్జనగుండ్ల వరకు గ్రీన్వాక్ నిర్వహించారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు గ్రీన్వాక్లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ, వాయువు కాలుష్య నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్వాక్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హారం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిపిన వేసిన సమయంలో ఇంజన్లను ఆన్లైన్లో ఉంచకుండా ఆఫ్ చేసి ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం అన్నారు. వాహనాల ఇంజిన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆఫ్ చయడం వల్ల వాయువు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలన్నారు. కాలుష్య నియంత్రణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వాహనదారులు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే స్వచ్ఛమైన గాలి లక్ష్యాన్ని సాధించగలమన్నారు. విజయపురిసౌత్/నరసరావుపేట: జలవనరుల శాఖ ఫుల్ అడిషనల్ ఎస్ఈగా టి.రమేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎస్ఈగా పనిచేసిన వెంకటరత్నం గుంటూరుకు బదిలీ కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈఈ గా విధులు నిర్వర్తిస్తున్న టి రమేష్ అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన టి రమేష్ను ఇరిగేషన్ ఈఈ లు, డీఈలు, జేఈలు, ఉద్యోగులు అభినందించారు. మ్యూజికల్ నైట్కు హాజరుకానున్న దర్శకుడు బోయపాటి ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 5కె రన్, వాక్ నిర్వహించనున్నారు. అందుకుగాను వర్సిటీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు కలిపి సుమారు 6 వేల మంది ఉత్సాహంగా పాల్గొననున్నారు. క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు నుంచి ప్రారంభమయ్యే 5కే రన్–వాక్ క్యాంటీన, రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్ మీదుగా సాగుతుంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ జరిగే మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. అలానే పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం సంగీత విభావరి అందించనున్నారు. పాటలు, నృత్యాలతో పాటు వర్సిటీ విద్యార్థుల కళా ప్రదర్శనలు అలరించనున్నాయి. ప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ కారు అగ్నికి ఆహుతైన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ప్రత్తిపాడుకు చెందిన చేరెడ్డి శ్రీనివాసరరావు తన కుమార్తెను హైదరాబాద్కు చెందిన పుసులూరి దిలీప్కు ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు పాఠశాల సెలవులు కావడంతో కుమార్తె ప్రత్తిపాడుకు వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అల్లుడు తన టయోటా కారును ఇంటి వద్ద నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతై పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన కారును ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం
నగరంపాలెం: స్థానిక నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొలువైన శ్రీవీరభద్రస్వామి ఆలయ 25వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు పోలీస్ అధికార, సిబ్బంది ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఏఆర్ డీఎస్పీ శంకరయ్య దంపతులతోపాటు జిల్లా ఎస్పీ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ పూజారి వంశీ బృందంలోని ఐదుగురు వేద పండితులు ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం, కుటుంబాల శ్రేయస్సు, జిల్లా ప్రజల శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వందలాది మందికి అన్నదానం చేశారు. డీఎస్పీలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), శంకరయ్య (ఏఆర్) దంపతులు, ఏఆర్ ఆర్ఐలు శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, ఆర్ఎస్ఐలు, ఏఆర్ ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మెరిట్ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో సీట్లు కేటాయించాలి
● జీఓ 102ను రద్దు చేసి 151 ప్రకారం వైద్య సీట్ల భర్తీ చేయాలి ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్ గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య ప్రవేశాలకు 2020 డిసెంబరు 4న విడుదల చేసిన జీఓఎంఎస్ నంబరు 151ని అమలు కొనసాగించాలని, 2026 జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102ను పునః పరిశీలించాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం అమరావతి రోడ్డులోని ఆలా ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. జీవో ఎంఎస్ నంబరు 102తో నిబంధనలు డబ్ల్యూపీ నంబరు 11018/2019లో ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా 2020 డిసెంబరు 4న ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబరు 151ని జారీ చేసిందన్నారు. నాటి నుంచి జీఓఎంఎస్ నంబరు 151కనుగుణంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్య ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జీఓకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు రాలేదన్నారు. ఈ జీఓ రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థుల ప్రయోజనాలు కాపాడిందని వివరించారు. అయితే నేడు అన్ని ఐచ్చికాల పద్ధతిని నిలిపివేయాలన్న ప్రదిపాదన, హైకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ప్రవేశ విధానం స్ఫూర్తి, లక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ ఎంఎస్ నంబరు 151 కింద ఏర్పాటు చేసిన పారదర్శక యంత్రాంగం ఏ మాత్రం పక్కకు వెళ్లినా అది రిజర్వేషన్ల సమర్థంగా అమలుపై ప్రతికూట ప్రభావం చూపి విద్యార్థులకు అనవసరమైన ఆందోళనకు గురికావచ్చని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జీఓ నంబరు 102 రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థులకు నష్టం కలిగించడమే కాకుండా సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102లోని నిబంధనలను పునః పరిశీలించాలని, కౌన్సెలింగ్ ప్రక్రియలో అన్ని ఎంపికల విధానాన్ని కొనసాగించాలని, జీఓ 151ని మార్పులు చేయకుండా అమలు చేయాలని కోరారు. సమావేశంలో కొరివి వినయ్కుమార్ పాల్గొన్నారు. -
ఏడిపింఛెన్..!
తొలి రోజేస్వర్ణ–2 కార్యాలయం బయట నిరీక్షిస్తున్న వృద్ధులు రెండేళ్లుగా పింఛను కోసం ఎదురుచూసి, ఎన్నో ఆశలతో కొత్త పింఛనుకు దరఖాస్తు చేసుకుందామని సోమవారం గ్రామ సచివాలయాలకు వెళ్లిన వారికి తొలి రోజే చుక్కలు కనిపించాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సేవ పోర్టల్ కొంత సేపు సర్వర్ డౌన్ అవ్వడం, మరికొంత సేపు నెమ్మదించడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రోజంతా కార్యాలయాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రత్తిపాడులోని స్వర్ణ–1లో మూడు, స్వర్ణ–2లో రెండు, స్వర్ణ–3లో మూడు దరఖాస్తులు మాత్రమే సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ అయ్యాయంటే సర్వర్ ఎంత స్లోగా ఉందో చెప్పకనే తెలుస్తుంది. – ప్రత్తిపాడు -
పీజీఆర్ఎస్కు డుమ్మా కొడితే చర్యలు
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ముఖ్యమైన కార్యక్రమానికి కొందరు అధికారులు గైర్హాజరవుతున్నట్లు గుర్తించామన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దూరప్రాంతాల నుంచి అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన అర్జీలను కలెక్టర్తోపాటు జిల్లా పరిషత్ సీఈఓ వి.జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా మైనారిటీ అధికారి జె.పార్థసారథి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
జీఎంసీకి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
నెహ్రూనగర్: వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ ఫలితాలు సాధించిన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) జాతీయ స్థాయిలో సత్తా చాటి ఒకే వేదికపై రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కై వసం చేసుకుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 130 నగరాల మధ్య నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ – 2026’ పోటీల్లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుని ‘నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ’గా గుర్తింపు పొందింది. అలాగే రాష్ట్రస్థాయి వార్డుల కేటగిరీ–2 విభాగంలో నగరంలోని 42వ వార్డు ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, అదనపు కార్యదర్శి అమన్దీప్ గార్గ్ల చేతుల మీదుగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వందలాది నగరాలతో పోటీపడి గుంటూరు నగరం రెండో స్థానంలో నిలవడం నగర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. జీఎంసీ ఇన్చార్జి ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ అనిల్కుమార్, కోమలి పాల్గొన్నారు. న్యూఢిల్లీలో అవార్డులు అందుకున్న కమిషనర్ కె.మయూర్ అశోక్ -
‘‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’
సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ను అమ్మకానికి పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కామ్ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న డీఎస్సీ స్కామ్ అక్రమాలపై సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ అక్రమాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. అడ్డ దారిలో ఉద్యోగాలు పొందినవారి వివరాలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?.ఇద్దరు మహిళా అధికారులతో మాట్లాడించారు. డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాలి. ఏపీలో అమ్మకానికి టీచర్ పోస్టులు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఆమాటకొస్తే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టారు. టీచర్ పోస్టుల అమ్మకం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నారా లోకేషే.కుంభకోణం చిన్నది కాదు, చేయించింది చిన్నవారు కాదు. మొదట డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్నారు.ఇప్పుడేమో అక్కడక్కడా తప్పులు జరిగాయేమో అంటున్నారు. మా దృష్టికి వస్తే విచారణ జరుపుతామని చెప్తున్నారు.ఈ తప్పులు చేసిందీ, చేయించింది చిన్న వ్యక్తులు కాదు. దీనంతటి వెనుక ఉన్నది నారా లోకేషేనని తేలిపోయింది. డీఎస్సీ అక్రమాలు జరిగినందునే సాక్షితోపాటు మిగతా మీడియా సంస్థలు వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. అక్రమాలపై విచారణ జరపమనే మేమూ కోరుతున్నాం. అయితే లోకేష్కు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని ఎలా నమ్మాలి?.స్కాం జరిగినప్పుడు ఎవరు చేశారు? ఎలా చేశారో బయటకు తీయాలి. ఏదైనా తప్పులను చూపిస్తే దాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.మీడియా విచారణ చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాను సెన్సార్ షిప్ చేయటం దుర్మార్గం. ఏపీలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోంది.స్పోర్ట్స్ కోటాలో అధికభాగం టీచర్ పోస్టులను అమ్మేసుకున్నారు.బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఎందుకు రాలేదు?. నవీన్ అనే టాపర్ పేరు లిస్టులో పెట్టి, తర్వాత ఎందుకు తీసేశారు?. దీనిపై నవీన్ హైకోర్టుకు వెళ్లడంతో అక్రమాల డొంక కదిలింది. నవీన్ ఇష్యూపై అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రకటనలు చేశారు.డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో నవీన్ పాల్గొన్నాడు.పేపర్ లీక్ అయింది. ప్రశ్నలను అమ్ముకున్నారు.120 ప్రశ్నలను రూ.3 లక్షల చొప్పున అమ్ముకున్నారు. అనేక అంశాలపై ఆధారాలు ఉన్నాయి. క్రీడా సంఘాల నుండి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ఫేక్ టీచర్లు విద్యార్థులకు ఏం చదువులు చెప్తారు?.అర్హులకు అన్యాయం చేస్తే వారి జీవితాలు ఏం కావాలి?.డీఎస్సీలో అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాలి. బాధ్యత కలిగిన మంత్రి లోకేష్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవాలు మాట్లాడకుండా నోరు పారేసుకుంటున్నారు. సవాల్ చేసే లోకేష్ శాసనమండలికి వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు?. జూడో సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసిన నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారు.వారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఫోర్జరీ అని తెలిసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?. దొంగల ముఠాలాగా వ్యవహరిస్తున్నారు.రేపు విచారణ జరిగితే అధికారులు కూడా తప్పించుకోలేరు. తప్పు జరిగినా బరితెగించి మాట్లాడుతున్నారు.మేము బయట పెట్టిన కేస్ స్టడీస్కు మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో తప్పులు చేసిన వారు జైలు పాలయ్యారు. హర్యానాలో అప్పటి సీఎం, ఆయన కుమారుడు జైలు పాలయ్యారు. చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు.మరి తప్పులు జరిగాయని అధికారులు ఎలా చెప్పారు?. చంద్రబాబు తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు అందించవచ్చు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే సీబీఐతో విచారణ జరపాల్సిందే.కేంద్రంలో కూడా వారి ప్రభుత్వమే ఉన్నప్పుడు లోకేష్, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?’అని ప్రశ్నించారు.👉ఇదీ చదవండి : టోరీ జరగలేదు... సర్టిఫికెట్ వచ్చింది! -
రూ.53.76 కోట్లతో ‘నవ గుంటూరు’ నిర్మాణం
నెహ్రూనగర్: గుంటూరు నగరాన్ని ఆధునిక మౌలిక వసతులు, ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.53.76 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ మేరకు 6 ప్రధాన విభాగాలలో నగరవ్యాప్త పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం రూ.17.93 కోట్లతో బీఆర్ స్టేడియం, కలెక్టరేట్, చుట్టుగుంట, నాజ్ సెంటర్ తదితర 7 ప్రధాన జంక్షన్లను సుందరీకరించనున్నట్లు చెప్పారు. రూ.7.30 కోట్లతో మహిళ, సూపర్ హీరో వంటి వినూత్న కాన్సెప్టులతో ఆరు థీమ్ పార్కులు, రూ.7.01 కోట్లతో నగరంలోని 21 ప్రాంతాల్లో నైబర్హుడ్ పార్కులను తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతను చాటుతూ విజయవాడ–గుంటూరు ప్రవేశ మార్గంలో రూ.1.59 కోట్లతో ‘మిర్చి థీమ్ పార్క్’ నిర్మించనున్నామని పేర్కొన్నారు. రూ.10.58 కోట్లతో 30 అత్యాధునిక పబ్లిక్ టాయిలెట్లను, పచ్చదనం పెంచేందుకు రూ.9.34 కోట్లతో 13 మార్గాలలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో గుంటూరు సమగ్రంగా రూపాంతరం చెందనుందని కమిషనర్ పేర్కొన్నారు. -
‘ఉత్త మా’ పురస్కారాలు
● అవార్డు పొందిన ముగ్గురు అధ్యాపకులూ సీఎం సామాజిక వర్గమే ● రాష్ట్ర స్థాయి ఎంపిక తీరు చూసి విస్తుపోతున్న విద్యావేత్తలు ● పరీక్షల్లో అవకతవకలకు కారణమైన వారూ ఉత్తమ అధ్యాపకులేనట! ● ఎవరేమనుకున్నా పట్టనట్టుగా పాలకుల వ్యవహార శైలి ● ఇతర సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధ్యాపకుల విద్యాపరమైన రికార్డుతోపాటు విద్య, పరిశోధన అంశాలనూ లెక్కలోనికి తీసుకోలేదు. వారు వ్యక్తిగతంగా కనబరిచిన ప్రతిభ, అందుకున్న పురస్కారాలు పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలు, వాటి ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న వారి జాబితా చూస్తే ఇవేమీ కనిపించవు. దీంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఆరోపణలున్నా పట్టింపేదీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల నిర్వహణ పదవిని ‘ఉత్తమ’ అవార్డుకు ఎంపికై న ఓ అధ్యాపకుడు నిర్వర్తించేవారు. ఆయన హయాంలో యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది పరీక్ష ప్రారంభానికి ముందే బీఈడీ ప్రశ్నపత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీకేజీ ఘటనపై అప్పట్లో పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఓ బీఈడీ కళాశాల క్లర్క్ను, కొందరు ఒడిశా విద్యార్థులను నామమాత్రంగా బాధ్యులను చేసి చేతులు దులుపుకొన్నారు. పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటే గతంలో ఆ పదవిలో ఉన్న వారిని యూనివర్సిటీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అధికారికి మరింత అగ్రపీఠం వేసినట్లు వ్యవహరించారు. ఆ తరువాత కూడా పీజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు తప్పుగా రావడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇవ్వడం వంటి అనేక ఘటనలు ఈ అధికారి హయాంలో చోటుచేసుకున్నాయి. ఇక బోధన, పరిశోధన అంశాల్లో ఈ అధ్యాపకుడు కనబరిచిన ప్రత్యేక ప్రతిభ ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఈడీ పేపర్ లీక్ జరిగిన సమయంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం చాలా సీరియస్ అయ్యిందని, ఏఎన్యూ ఉన్నతాధికారులను నివేదిక కూడా అడిగిందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఘటన చోటుచేసుకున్న విభాగానికి చెందిన అధికారికి ఇప్పుడు అదే శాఖ నుంచి ఉత్తమ అవార్డును ప్రదానం చేయడం వెనుక లోకేశ్, చంద్రబాబులకు ఉన్న ప్రత్యేక సామాజిక ప్రేమను తెలియజేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. విద్యావ్యవస్థ ఏమైతే తమకేంటి, తమ వర్గ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు విపరీతమైన ధోరణిని అవలంబిస్తున్నారని కూడా కొందరు మండిపడుతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిపాలన, వ్యవస్థాపరమైన అన్ని పదవులు, నియామకాలన్నింటిలోనూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అగ్రతాంబూలం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వాములమైనప్పటికీ తమకు కనీస ప్రాధాన్యత కూడా ఉండటం లేదని కొన్ని సామాజిక వర్గాలు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి. కానీ అవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, ఏఎన్యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన అవార్డుల ప్రక్రియను కూడా ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం, ముగ్గురూ సైన్స్ కళాశాలకు చెందిన వారే కావడం టీడీపీ ప్రభుత్వ విపరీత ధోరణికి అద్దం పడుతోందని విద్యావంతులు మండిపడుతున్నారు. విద్యారంగంలో విశేష సేవలు అందించడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలిచిన వారిని ఉత్తమ గురువులుగా ఎంపిక చేయడం పరిపాటి. విద్యార్థులను తీర్చిదిద్దడం, విద్యార్థుల మన్ననలు అందుకోవడం, విద్యారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం, వాటి అమలుకు కృషి వంటివి కూడా ఆయా గురువులకు ఉండాల్సిన లక్షణాలు. ఇతర అధ్యాపకులకూ ప్రేరణ కలిగించేలా ఉత్తమ అవార్డుకు ఎంపికై న వారు ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఉత్తమ అధ్యాపకుల జాబితా చూస్తే అందరూ విస్తుపోవాల్సిందే. పాలకుల సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఉమ్మడి జెడ్పీ
మూడుగా మారిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు ● 25 నుంచి మొదలుకానున్న కార్యకలాపాలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో జెడ్పీ ● ఇప్పుడు 17 మండలాలకు గుంటూరు పరిమితం ● పల్నాడులో 28, బాపట్ల పరిధిలో 20 మండలాలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కొత్తగా పల్నాడు, బాపట్ల జెడ్పీలు ఏర్పడనుండగా.. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లా 17 మండలాలకు పరిమితం కానుంది. అదే విధంగా పల్నాడులో 28, బాపట్లలో కొత్తగా కలిసిన వాటితో కలిపి 20 మండలాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే అధికంగా మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 57 మండలాల నుంచి 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని మండలాల వారీగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న దృష్ట్యా, త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. 1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 నుంచి 1959 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. 1921 నుంచి 1927 వరకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పీజీఎన్ యతిరాజుల నాయుడు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా 1921 నుంచి 1959 వరకు తొమ్మిది మంది జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిలో కొనసాగారు. మూడు సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 1959లో అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా డిసెంబర్ ఒకటో తేదీన మేడూరి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వరకు గత 66 ఏళ్ల కాలంలో 36 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో నాలుగు సార్లు ఇన్చార్జ్ చైర్మన్లు, 18 సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగారు. జెడ్పీకి 16 మంది చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో కాసు వెంగళరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు తదితర ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన మోహన్ కందా గుంటూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన కాలంలో జెడ్పీ ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతమున్న జెడ్పీ పరిపాలన భవనాన్ని 1964 జూలై 15న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కాకుమాను, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వట్టిచెరుకూరు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో అమృతలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కర్లపాలెం, కొల్లూరు, మార్టూరు, నగరం, నిజాంపట్నం, పర్చూరు, పిట్టలవానిపాలెం, రేపల్లె, చుండూరు, వేమూరు, వేటపాలెం, యద్దనపూడి మండలాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు, గురజాల, ఈపూరు, కారంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, నూజెండ్ల, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్వరూపం మారింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పడనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా పరిషత్లను ఏర్పాటు చేస్తూ జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇక నుంచి మూడు జిల్లాల వారీగా విడిపోనుంది. -
చారిత్రక నవలల అధ్యయనం ద్వారానే నాగరిక సమాజాభివృద్ధి
నగరంపాలెం: గత కాల సామాజిక, నాగరికత, రాజకీయ సాంస్కృతిక, నేపథ్యాలు తెలుసుకునేందుకు చారిత్రక నవలల అధ్యయనం దోహదపడతాయని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి అన్నారు. ఆదివారం నగరంపాలెం బొమ్మిడాల ఆర్యవైశ్య వసతిగృహ సమావేశ మందిరంలో కేంద్ర సాహిత్య అకాడమీ, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగులో చారిత్రక నవలలు అంశంపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. రచయిత కోసూరి రవికుమార్ అధ్యక్షత వహించారు. అడవి బాపిరాజు చారిత్రక నవలపై షేక్ రెహమానుద్దిన్, అనువాద చారిత్రక నవలలపై సూరిప్రసాద్, నోరి నరసింహశాస్త్రి, చారిత్రక నవలలపై పిన్నమనేని మృత్యుంజయరావు పత్ర సమర్పణ చేశారు. మధ్యాహ్న సభలో రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు డాక్టర్ సిహెచ్.సుశీలమ్మ అధ్యక్షత వహించారు. విశ్వనాథ సత్యనారాయణ చారిత్రక నవలపై కె. మురళీకృష్ణ, వర్తమాన కాలంలో చారిత్రక నవలలు అంశంపై మారుతీ పౌరోహితం, ఎం.శివప్రసాద్ చారిత్రక నవలలపై ఎస్.జ్యోతి పత్ర సమర్పించి మాట్లాడారు. సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి షణ్ముఖానంద, రచయిత మోదుగుల రవికృష్ణ, డాక్టర్ వి.సింగారావ్, భూసరపల్లి వెంకటేశ్వర్లు, రావెల సాంబశివరావు, కె.శివప్రసాద్, కె.దయానంద్ పాల్గొన్నారు. -
యంత్రాలపైనా మాయ మాటలే!
● సర్కారు యంత్రాల కోసం 1,943 మంది అన్నదాతల నిరీక్షణ ● ఖరీఫ్ ముగుస్తున్నా ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి ● రూ.3.30 కోట్ల నిధులున్నా పథకం అమలులో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కొరిటెపాడు (గుంటూరు): రాయితీపై వ్యవసాయ యంత్రాలను పొందే రైతులకు ప్రభుత్వం పలు కఠిన నిబంధనలను విధించింది. లబ్ధిదారులకు సొంత భూమి ఉండటంతో పాటు కనీసం మూడు సార్లు ఈ–పంట రికార్డుల్లో నమోదు చేయించి ఉండాలి. గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఇలాంటి సబ్సిడీలు పొంది ఉండకూడదు. ఈ నిబంధనల ప్రకారం భూమి రికార్డులను సమర్పించిన రైతుల ఆన్లైన్ దరఖాస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలా ఎంపికై న అర్హుల జాబితాపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతకం చేసిన తర్వాత ఐదు రోజులకు సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. మే నెలలోనే 1,943 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాయితీ ట్రాక్టర్లు, యంత్రాలను పంపిణీ చేయలేదు. నిధులున్నా నిర్లక్ష్యమే.. పథకంలో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్ సామగ్రి, స్ప్రేయర్లు, మినీ ట్రాక్టర్లలా తొమ్మిది రకాల యంత్రాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గుంటూరు జిల్లా కోటా కింద 880 యూనిట్లకు రాయితీగా రూ.3.30 కోట్లను కేటాయించింది. ఇందులో ఇతరులు, జనరల్ కోటాకు రూ.2.55 కోట్లు, షెడ్యూల్డ్ కులాల కోటాకు రూ.58 లక్షలు, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కోటాకు రూ.17 లక్షలను కేటాయించారు. ఖరీఫ్ ముగుస్తున్నా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 67 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సాగు పనుల ప్రారంభంలోనే సబ్సిడీ యంత్రాలను అందజేసి ఉంటే బాగుండేదని రైతులు అంటున్నారు. సీజన్ అంతా ముగిసిపోయిన తర్వాత ఇస్తే తమకేం లాభమని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో పండుగ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే ఏటా సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వందలాది మంది ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పరికరాలు అడిగిన రైతులందరికీ మంజూరు చేశారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్ సామగ్రి, రోటోవేటర్లు, స్ప్రేయర్లు అందజేశారు. నాడు రైతు సంక్షేమంపై ఎంతో శ్రద్ధగా ప్రభుత్వం పథకాలు అమలు చేసింది. కానీ నేడు టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది.– ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని అన్నదాతలకు కష్టాలకు తోడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. రైతులను ఏ మాత్రం ఆదుకోని సర్కారు.. ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం, మద్దతు ధర కల్పించడం వంటి అన్ని విషయాల్లోనూ రైతులకు అన్యాయమే చేస్తోంది. తాజాగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) కింద సబ్సిడీ యంత్రాల పంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ, అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. -
జీఓ నంబర్ 33 తక్షణమే రద్దు చేయాలి
లక్ష్మీపురం: తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ మార్పిడిలకు సంబంధించి జారీ చేసిన జీఓ నంబర్ 33ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో వీడియో విడుదల చేశారు. గతంలో కిడ్నీ మార్పిడిల పేరుతో అనేక అక్రమ దందాలు జరిగాయని, కోట్లాది రూపాయల వ్యాపారం సాగడంతోపాటు పేద, సామాన్య ప్రజలు మోసపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయన్నారు. కిడ్నీ మార్పిడిలో రక్త సంబంధీకులకు మాత్రమే అవకాశం ఉండేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత జీవో నం.33 ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు కిడ్నీ మార్పిడిల విషయంలో మరింత అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీవో నంబర్ 33ను వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సాఫ్ట్బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక
పెదకాకాని: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని ఏకలవ్య నగర్లోని రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శనివారం రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు సుమారు పది క్వింటాళ్ల బరువు కలిగిన 23 రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. స్థానికంగా నివసించే మేడా కుమారి ఇళ్ల వెంట తిరిగి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసు స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పోలీసులు నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఇర్ఫాన్లు పాల్గొన్నారు. 15లోపు పేరు నమోదుకు అవకాశం మధురానగర్(విజయవాడ సెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. తాము ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 93475 72766, 98481 11138 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేస్తామన్నారు. తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. -
వినాయక మండపాలకు ఆన్లైన్లో అనుమతులు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతుల కోసం ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓ (సీఐ)లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని నేరుగా పరిశీలించాలని సూచించారు. ప్రజా, అత్యవసర వాహనాల రాకపోకలు, విద్యుత్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు పరిశీలించాక అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు, విద్యుద్దీపాల ఏర్పాట్లల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక సిలిండర్లు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చూడాలన్నారు. ప్రధాన రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ ఏరియాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. నిఘా పెంచాలి నిమజ్జన ఊరేగింపు తేదీలు, మార్గాలను ముందుగా సమీక్షించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా పెంచాలని సూచించారు. ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు, నినాదాలు, రెచ్చగొట్టే చర్యలు వద్దని నిర్వాహకులకు సూచించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం స్పష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. -
చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యే
లక్ష్మీపురం: చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యేనని, బాధ్యులపై చర్య తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులతో కలిసి పోలీసులపై చర్య తీసుకోవాలని ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్కుమార్ మాట్లాడుతూ పోలీసుల చర్యల వలనే గోపి మృతి చెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న ఘటనలో అదే పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారణ చేయడం వల్ల విచారణ నిష్పక్షపాతంపై అనుమానాలు ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చీకటి గోపి ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో గత కొంతకాలంగా పోలీసుల కస్టడీ, విచారణ లేదా పోలీసుల చర్యల అనంతరం వ్యక్తులు మృతి చెందిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఇది ఒక్క గోపి కుటుంబం సమస్య కాదని, చీకటి గోపి మరణాన్ని ఒక కుటుంబానికి జరిగిన విషాదంగా మాత్రమే చూడకూడదన్నారు. పోలీసు స్టేషన్కు విచారణ కోసం పిలిపించిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హింస, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేస్తూ పోలీసుల దుర్మార్గంపై, సీఐడీ ఎస్పీ చెప్పే అబద్ధాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ప్రత్యేకంగా కలిసి సమస్య తీవ్రతను వివరించాలని, డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమస్య పరిష్కారం కాకపోతే చలో గుంటూరు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు ప్రకటించారు. -
డిసెంబరు 1–3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’
లక్ష్మీపురం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ‘బడ్లావ్ జరూరీ హై’ నినాదంతో దేశవ్యాప్త పోరాటాలకు సీపీఐ సమరశంఖం పూరించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 12 ఏళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రైతులు, కార్మికులు, సామా న్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోవడం, రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, దేశంలో మత ఉన్మాదాన్ని పెంచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లను నీరుగార్చే విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ విషయంలో అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట చెబు తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై దేశమంతా స్పందిస్తే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చంద్రబాబునా యుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏ మాత్రం స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగ ర కార్యదర్శి ఆకిటి అరుణ్కుమార్, నాయకులు మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, రాధాకృష్ణమూర్తి, బీవీఆర్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ్ణ -
ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ అన్నారు. సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ (ఎస్పీఎల్టీఓ) ఆధ్వర్యాన ఆదివారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సమాజంలో విద్యావ్యాప్తికి ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్పీఎల్టీఓ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పయర్థ నాగయ్య మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రైవేటు ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైందని, తమ సంస్థ ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పని చేస్తోందని తెలిపారు. 110 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను సత్కరించి, పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మలినేని విద్యాసంస్థల అధినేత మలినేని పెరుమాళ్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాల తెలుగు సహచార్యులు డాక్టర్ బూసి వెంకట స్వామి, ఏపీ రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి.రామచంద్రరాజు, కాటూరి హైస్కూల్ డైరెక్టర్ కాటూరి వెంకటేశ్వరరావు, ఎస్పీఎల్టీవో కార్యదర్శి ఎం.రాకేష్, పాఠశాల అధ్యక్షుడు కొండపల్లి విల్సన్, జాతీయ సమన్వయకర్తలు పి.రాజారత్నకుమార్, లేళ్ల కోటేశ్వరావు, జాతీయ ఉమెన్స్ సమన్వయకర్త దాసరి నాగమణి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, ఆర్.రాము పాల్గొన్నారు. 48 గంటల్లో బాలికను పట్టుకున్న పోలీసులు లక్ష్మీపురం: సాంకేతిక పరిజ్ఞానంతో 48 గంటల వ్యవధిలో బాలికను పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన ఆదివారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్తంభాలగరువు సాయినగర్కు చెందిన కాసిమళ్ల నారాయణ వద్ద మనవరాలైన బాలిక పెరుగుతుంది. బాలిక ఇంటి దగ్గరలోని డ్రై క్లీనింగ్ షాప్లో పనిచేస్తోంది. ఆగస్టు 31వ తేదీ సా యంత్రం 07.30 గంటలకు తన ఇంటిలోని చెత్త పారేసివస్తానని తాతయ్యకు చెప్పి బయ టకు వెళ్లిన అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. నారాయణ చుట్టు పక్కల ఎంత గాలించినా కనిపించకపోవడంతో ఈనెల 3వ తేదీన పట్టాభిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో బాలిక ఇంటి నుంచి విజయవాడ వెళ్లి అక్కడ నుంచి వైజాగ్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక వైజాగ్లో ఉన్నట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం వైజాగ్ వెళ్లి బాలికను గుంటూరు తీసుకు వచ్చారు. వెస్ట్ తహసీల్దార్ కిరణ్కుమార్ సమక్షంలో బాలికను నారాయణకు అప్పగించారు. బాలిక ఆచూకీని గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
లలిత పీవీఎస్లో వైద్య విద్యకు ప్రాధాన్యం
గుంటూరు మెడికల్: లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభమైన నాటి నుంచి అకాడమిక్స్, వైద్య వృత్తిపరమైన విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని సంస్థ చైర్మన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీ రాఘవ శర్మ అన్నారు. ఆదివారం గుంటూరు తక్కెళ్లపాడులోని లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో లలిత సీఎంఈ సిరీస్ లో తొలి కార్యక్రమంలో పెరిఫెరల్ న్యూరోపతిలో ఆధునిక పరిణామాలు అనే అంశంపై సైంటిఫిక్ సీఎంఈ నిర్వహించారు. లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ముంబై బాంబే హాస్పిటల్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ గౌరవ అతిథిగా , లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ శర్మ మాట్లాడుతూ వైద్యులు పీజీ వైద్య విద్యార్థుల కోసం లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్లో క్రమం తప్పకుండా అకాడమిక్ సెషన్లు, క్లినికల్ మీటింగ్స్, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, న్యూరో సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ పెరిఫెరల్ న్యూరోపతి వ్యాధుల ప్రాబల్యం నానాటికి పెరిగిపోతుందని చెప్పారు. వ్యాధులను ఏవిధంగా గుర్తించి చికిత్స అందించే విషయాలను వివరించారు. సంస్థ డైరెక్టర్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. బాంబే హాస్పిటల్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ ‘ఎమర్జింగ్ ల్యాండ్ స్కేప్ ఆఫ్ ఇమ్యూనో– మీడియేటెడ్ న్యూరోపతిస్’ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఆర్ మురళీధర్ రెడ్డి ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ డయాబెటిక్ న్యూరోపతిస్ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ నిమ్స్కు చెందిన డాక్టర్ వై.శిరీష ప్రాక్టికల్ అప్రోచ్ టు పెరిఫెరల్ న్యూరోపతి అనే అంశంపై ప్రసంగించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ మధు నాగప్ప ఇన్ఫెక్షయస్ న్యూరోపతిస్ అనే అంశంపై మాట్లాడారు. ముంబైకి చెందిన డాక్టర్ విన్నీ విల్సన్ ఆధ్వర్యంలో పెరిఫెరల్ న్యూరోపతి పై క్విజ్ నిర్వహించారు. సీఎం ఈ కార్యక్రమానికి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డాక్టర్ తారక్నాథ్, డాక్టర్ యు.వీరమ్మ, డాక్టర్ బి.సాయికృష్ణ, డాక్టర్ గాజుల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన వైద్యులు, న్యూరాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు, వివిధ మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్కి చెందిన పి.జి వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. -
11న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): గ్రామీణ బ్యాంకుల బలోపేతానికి ఐక్య పోరాటం నిర్వహించనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) అధ్యక్షుడు బీఎస్ రాంబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అనుబంధ సంస్థగా ఏర్పడిన అనంతరం తొలి జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజ్మెంట్లతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందన లేకుంటే అక్టోబర్ 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అన్ని పోరాటాలకు ఏఐబీఈఏ సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రుణాల ఎగవేతపై ఆందోళన.. కొన్ని కార్పొరేట్ సంస్థలు తీసుకున్న భారీ రుణాలను ఎగవేయడం వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభనష్టాల ఒడిదుడుకులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న సంస్థలకు తక్కువ మొత్తానికి సెటిల్మెంట్లు చేయడం వలన బ్యాంకులపై ఆర్థిక భారం పడుతోందని వెల్లడించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రయత్నాలను బ్యాంకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారు. సమావేశంలో మూర్తి, రాధాకృష్ణమూర్తి, నాగపావని, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, వెంకటేష్ తదితర నాయకులు ప్రసంగించారు. నూతన కార్యవర్గం.. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా చైర్మన్గా పీవీ రాఘవరావు, అధ్యక్షుడుగా టి.హరనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.షణ్ముఖరావు, కోశాధికారిగా ఎం.నరహరి ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, గ్రామీణ బ్యాంకుల బలోపేతం లక్ష్యంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది. -
తుళ్లూరు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ప్రమాదం
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘అక్రమాలపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?’
సాక్షి, తాడేపల్లి: అక్రమాలను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సర్కార్కు భయం పట్టుకుందని.. అందుకే ప్రశ్నించే గొంతులను నులుముతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అనధికార సెన్సార్ షిప్ దుర్మార్గం అన్నారు. సోషల్ మీడియా ఖాతాలను లేపేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లను తొలగించారు. సాక్షి టీవీ, బిగ్ టీవీ ఖాతాలను కూడా లేపేశారు. ప్రశ్నించే గొంతులను చూసి చంద్రబాబుకు ఎందుకంత భయం?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే నేరమా?. అందులో అబద్దాలు ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ఎక్కౌంట్లపై దాడి ఎందుకు?. తప్పులను కప్పి పుచ్చుకోవటానికే సోషల్ మీడియా ఖాతాలపై దాడి చేస్తున్నారు. ఇదే కొనసాగితే సోషల్ మీడియా వార్ తప్పదు. డీఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. పదవికి రాజీనామా చేసి సీబీఐతో విచారణ జరపాలి. సోషల్ మీడియా అకౌంట్లపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. న్యాయ పోరాటం చేసి మళ్ళీ ఆ అక్కౌంట్లను సాధిస్తాం’’ అని శివశంకర్ అన్నారు. -
ఇదేం... విభజన?
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన వ్యవహారం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే తెరపైకి తెచ్చిన బహిరంగ కుట్రలా కనిపిస్తోందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు ఉన్న 57 డివిజన్లను ఏకంగా 76కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అగ్గి రాజేస్తోంది. క్షేత్రస్థాయి భౌగోళిక సరిహద్దులు, సహజ నిర్మాణం, పరిపాలనా సౌలభ్యం, కనీస శాసీ్త్రయ ప్రమాణాలను గాలికొదిలేసి.. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లే అధికారులు జీ హుజూర్ అంటూ సరిహద్దులను గీసేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని విభజన కత్తి దూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రాంతాలను ఒక క్రమపద్ధతి లేకుండా రెండు మూడు డివిజన్లలోకి అడ్డగోలుగా ముక్కలు చేసి పంపించారు. అంతేకాకుండా, పలుచోట్ల సహజ హద్దులైన ప్రధాన రహదారులను కాకుండా నాలుగు అడుగుల సందులను బౌండరీలుగా చూపించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. అనేక డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చి పక్క డివిజన్లో కలిపినప్పటికీ, కొన్ని డివిజన్లలో జనాభా భారీగా పెరగడం, మరికొన్నింటిలో తీవ్రంగా తగ్గిపోవడం వంటి అంతుచిక్కని లెక్కలు అధికారుల పనితీరును బట్టబయలు చేస్తున్నాయి. ఉదాహరణకు నల్లపాడు, అంకిరెడ్డిపాలెం లాంటి విలీన ప్రాంతాలను అసంబద్ధంగా కలపడం వల్ల స్థానిక ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది. జన సైనికుల్లోనూ అసంతృప్తి సెగలు ఈ అశాసీ్త్రయ విభజన కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోనే కాకుండా, క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామి అయిన జనసేన కేడర్లోనూ అసంతృప్తి రగిలిస్తోంది. తమకు పట్టున్న డివిజన్లు, జనసైనికుల ప్రాబల్యం ఉన్న కాలనీలను కూడా అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా చీల్చి బలహీన పరిచారంటూ జనసేన స్థానిక శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. స్వప్రయోజనాల కోసమే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ మ్యాపింగ్ చేయించారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కమిషనర్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 11 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రస్తుతం డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 11వ తేదీ వరకు గడువు విధించారు. వచ్చిన అభ్యంతరాలను 12వ తేదీన సీడీఎంఏకు పంపడం, 13న సీడీఎంఏ తుది జాబితా ఖరారు చేసి, 14న ఫైనల్ జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అన్యాయంగా మార్చిన సరిహద్దులను సవరించాలంటూ నగరవ్యాప్తంగా నిరసన స్వరాలు మిన్నంటుతున్నాయి. -
ప్రతిభకు పట్టం
మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం శనివారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఎంపిక చేసిన 85 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవాన్ని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పాల్గొన్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
మిర్చి యార్డులో ఎగుమతి వ్యాపారుల ఐపీ కలకలం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డులోని వ్యాపార వర్గాల్లో ఐపీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. మిర్చి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నట్లు చెబుతున్న ఓ ఎగుమతి వ్యాపారి తాజాగా సుమారు రూ.కోటి మేర ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. ఐపీ ప్రక్రియలో భాగంగా తనతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సుమారు 46 మంది మిర్చి దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. యార్డులో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపార వర్గాల్లో రూ.కోట్లలోనే నిత్యం లావాదేవీలు జరుగుతుంటాయి. దిగుమతి వ్యాపారుల నుంచి ఎగుమతి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ అనంతరం విదేశీ మార్కెట్లకు తరిలిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య సరుకు సరఫరా, చెల్లింపులు, బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి ఐపీ దాఖలు చేసి సంబంధిత దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపడం బాధితుల్లో ఆందోళన రేపుతోంది. తమ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పలువురు భయపడుతున్నారు. రెండున్నర ఏళ్లుగా యార్డులో పలువురు రూ.కోట్ల మేరకు ఐపీ పెట్టడం గమనార్హం. తాజాగా మరొకరు అదే బాటలో వెళ్లడం చర్చనీయాంశమైంది. మరో ఇద్దరిపై చర్చ.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు మిర్చి ఎగుమతి వ్యాపారులు కూడా ఐపీ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది. వారు కూడా ఐపీ దాఖలు చేస్తే దిగుమతి వ్యాపారులపై ఆర్థిక ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
గుంటూరు జిల్లాకు హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ
నగరంపాలెం: ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించి, పోలీస్శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో అండర్–10, అండర్–14, మిక్స్డ్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఫౌండేషన్ కార్యదర్శి జీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం ఏడు గంటలకు స్టేడియం టెన్నిస్ కోర్టులో రిపోర్ట్ చేయాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలన్నారు. మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలోని ఒక రేషన్ దుకాణం నుంచి బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. డీలర్ దుకాణం మూసివేసి వెళ్లిపోగా, లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.. వారి కోసం ఎదురు చూస్తుండగా బియ్యం అక్రమ వ్యాపారి తన అనుచరులతో వచ్చి దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనంతరం మినీ లారీని వేగంగా డ్రైవ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామస్తులు పక్కకు తప్పుకోవడంతో లారీ తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికే పలుమార్లు రేషన్ బియ్యం తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం శనివారం 535.70 అడుగులకు చేరింది. ఇది 179.4878 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 8,022, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 16,875 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 16,875 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నెహ్రూనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ వినాయక చవితిని కాలుష్య రహితంగా జరుపుకొందామని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా 11వ తేదీన నగరంలోని సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ‘ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి’ నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. -
భావితరాలకు గురువులే మార్గదర్శకులు
గుంటూరు ఎడ్యుకేషన్: భావితరాలను సన్మార్గంలో నడిపే బాధ్యత గురువులపైనే ఉందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నెలకొల్పడమే ధ్యేయం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు విలువలు నేర్పాలన్నారు. ఇది సమాజానికి గొప్ప పెట్టుబడి కాగలదని పేర్కొన్నారు. విలువలు అనే పునాదిపై సమాజాన్ని నిర్మించాలని కోరారు. ఇది ఉపాధ్యాయుల చేతిలో ఉందని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, మంచి సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలో ఉంటారని, వారిని చక్కగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు అందించాలని సూచించారు. విద్యార్థులు అనుకున్నది సాధించే వరకు కృషి చేసేలా ప్రేరణ కల్పించాలన్నారు. ఒత్తిడిని, ఓటమిని తట్టుకునే శక్తి కలిగి ఉండే విధంగా విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. గాంధీ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజుల్లోనే యావత్తు దేశాన్ని మమేకం చేశారన్నారు. భావితరాలకు ఏం కావాలో ఆలోచించి, అందుకు అవసరమైన మెట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఆచార్యుడిగా, తత్వవేత్తగా నిలిచారని తెలిపారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు, కష్టపడి పనిచేసే వారు ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు విశ్లేషణ శక్తిని కల్పించాలని సూచించారు. ఉన్నతమైన వృత్తి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న పవిత్రమైన వృత్తిలో ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని చెప్పారు. అనంతరం 85 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ విద్యా సంస్థల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ బి. వందనాదేవి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, సమగ్రశిక్ష ఏపీసీ ఐ. పద్మావతి, డీవైఈవోలు జి. ఏసురత్నం, శాంతకుమారి, ఎంఈవోలు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకలకు టీడీపీ ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. ఏడాదికోసారి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకునే కార్యక్రమం వైపు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఉపాధ్యాయులను గౌరవించుకునే కార్యక్రమానికి వారు రాలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సైతం కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో ఉపాధ్యాయులలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. -
వంతెన శిథిలం.. ప్రాణాలే పణం
గుంటూరుఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర ఆలయం అన్నమయ్య కళావేదికపై తెలుగు కళావైభవం ఉత్సవాల్లో భాగంగా శనివారం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.చేబ్రోలు: కృష్ణా డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ, రవాణా రంగంలో మైలురాయిగా నిలిచిన చరిత్రాత్మక కొమ్మమూరు కాలువపై పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. చేబ్రోలు వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరినా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. శుక్రవారం కాలువకు ఒక వైపు ఉన్న వంతెన పక్కభాగం కొంతమేర కూలిపోయింది. గత జూలై నెలలోనే ఈ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని ‘సాక్షి’ దినపత్రికలో ‘నాడు మోక్షం.. నేడు నిర్లక్ష్యం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా అటు టీడీపీ ప్రభుత్వం, ఇటు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో కూలిపోయే పరిస్థితి వచ్చిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన వంతెన 1877వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు కొమ్మమూరు కాలువ నిర్మాణాన్ని పూర్తి చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రారంభమయ్యే పశ్చిమ ప్రధాన కాలువ 20 కిలోమీటర్ల దూరంలోని దుగ్గిరాల లాకుల వద్ద మూడు కాలువలుగా విడిపోతుంది. వాటిలో ఒక్కటైన కాలువపై చేబ్రోలు వద్ద బ్రిటిష్ వారు రాతి కట్టడాలు, ఇనుప రాడ్లతో ఈ వంతెనను నిర్మించారు. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ప్రమాదాలకు నిలయం గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి పొన్నూరు, గుంటూరు, బాపట్ల, రేపల్లె, చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి. నిత్యం వేలాది సంఖ్యలో బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలతో రద్దీగా ఉంటుంది. వాహనదారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వంతెన ఇరుకుగా ఉండటం, మలుపు వద్ద దారి తప్పడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6న టిప్పర్ లారీ అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్ను ఢీకొని 25 అడుగుల లోతున్న చానల్లో పడింది. ఆ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వంతెనపై నుంచి లారీ కాలువలో పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వంతెన పైభాగంలో పెద్ద గుంతలు పడటంతో బండరాళ్లను అడ్డుగా పెట్టారు. రైలింగ్ కూలిపోతే ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ప్రస్తుతం కూలిపోవడానికి ఈ నిర్లక్ష్యమే కారణమని వాహనదారులు మండిపడుతున్నారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం హెవీ లోడ్తో శుక్రవారం వెళ్తున్న లారీ వంతెన పైభాగానికి వచ్చే సమయానికి ఎదురుగా వాహనం రావడంతో కొంత పక్కకు వచ్చి పైన ఉన్న కొండరాళ్లను ఎక్కించడంతో వంతెన కూలిపోయినట్లు సమాచారం. లారీ సహా కాలువలో పడి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది. గతంలో ‘సాక్షి’ హెచ్చరించినప్పటికీ యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. వాహనాల రాకపోకల ఒత్తిడి కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ వంతెన దుస్థితిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రూ.42.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆధునిక సాంకేతికతతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2023 ఆగస్టు నెలలో మద్రాసు కాలువపై 40 అడుగుల వెడల్పు రోడ్డు, 1.25 కి.మీ. మేర నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేశారు. సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. కనీసం మొదటి దశ పనులు కూడా పూర్తి కాలేదు. పనుల్లో భాగంగా చేబ్రోలు వైపు తారు రోడ్డులో సగం వరకు తవ్వేశారు. దాని పక్కన పెద్ద గొయ్యి తీసి వదిలేశారు. ప్రమాదకరంగా ఉంచడంతో తాత్కాలికంగా కొంత మట్టి పోశారు. సమీపంలో డ్రెయిన్ ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రమాదాలకు కేంద్రంగా మారింది. బ్రిడ్జి రోడ్డు మలుపుగా ఉండటంతో సగం వరకు రోడ్డు కోసుకుపోయి ఉంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేవారు తరచుగా ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. తాత్కాలికంగా రాళ్లు, ప్లాస్టిక్ దిమ్మెలు అడ్డుగా పెట్టారు. పురాతన బ్రిడ్జికి పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగితే ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంది. -
వివా వీవీఐటీయూలో ఘనంగా టీచర్స్ డే
పెదకాకాని: వివా, వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నంబూరు వీవీఐటీయూలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుకొండ సైనిక్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రతిష్టాత్మక రక్షణ మంత్రి ట్రోఫీ గ్రహీత గ్రంథి సర్వరాయుడు, ఉత్తమ ప్రిన్సిపాల్ పురస్కార గ్రహీత దారపనేని చినవెంగాయ, వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి గ్రంథి సర్వరాయుడు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో అత్యుత్తమంగా రాణించడానికి, విజయం సాధించడానికి బలమైన కాంక్షను పెంపొందించుకోవాలని సూచించారు. సంకల్పంతో లక్ష్యాల వైపు అడుగులు వేయాలని, నిరంతర ప్రయత్నం కచ్చితంగా మంచి ఫలితాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. దారపనేని చినవెంగాయ మాట్లాడుతూ విద్యార్థులు నేడు అత్యంత నూతనంగా, సృజనాత్మక కోణంలో ఆలోచనలు చేస్తున్నారని, వారి ఆలోచనా సరళికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు బోధన చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులు గ్రంథి సర్వరాయుడు, దారపనేని చినవెంగాయలను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గేయాలాపనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల విభాగం సభ్యులు, వీవీఐటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకాడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, వివా ప్రిన్సిపాల్ సిహెచ్.సరళ, వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ విజయవంతం
తాడేపల్లి: దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని, అక్రమాలకు కారణమైన మంత్రి లోకేష్ తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని "గురు పరిరక్షణ దీక్ష"లో వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపహాస్యం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 నియామకాలు ఒక భారీ కుంభకోణంగా మారాయని, ఇది మెగా డీఎస్సీ కాదు పక్కా 'దగా డీఎస్సీ' అని వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను పక్కనబెట్టి, టెట్ అర్హత కూడా లేని వారికి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు అండగా నిలుస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ‘గురు పరిరక్షణ దీక్ష’ను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరిగిన ఈ మెగా కుంభకోణాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక దీక్షకు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. నిరసన ప్రారంభానికి ముందుగా సమాజానికి మార్గదర్శనం చేసిన పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను నాయకులు వేదికపై ఘనంగా సత్కరించారు. అనంతరం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీల భుజాలపై నల్ల కండువాలు వేసి దీక్షను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడం, కర్నూలుకు చెందిన ప్రభాకర్తో పాటు క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని వారికి పోస్టులు కట్టబెట్టడమే ఈ దగా డీఎస్సీకి నిదర్శనమని ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, యువగళం పాదయాత్రలో పాల్గొన్న తమ పార్టీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ పోస్టులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కనీస అర్హత లేని నకిలీ ఉపాధ్యాయులను బడుల్లోకి పంపిస్తే భావితరాల విద్యార్థుల పరిస్థితి ఏంటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడితే సమాధానం చెప్పే ధైర్యం లేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పారిపోయారని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే, ఈ డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నియామకాలపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అలాగే ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంతో పాటు, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మోసపోయిన 3.30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటాన్ని ఏమాత్రం ఆపబోమని నాయకులు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.ఉదయం దీక్షను ప్రారంభించిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న డీఎస్సీ అక్రమాల పుట్టగా మారిందని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన దారుణాలకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హతలు లేని వారు టీచర్లుగా నియమితులైనట్లు సాక్షాత్తూ ఈ ప్రభుత్వమే తేల్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అక్రమాలపై నాలుగైదు జిల్లాల్లో విద్యాశాఖ రహస్యంగా విచారణ చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా గమనిస్తుంటే అసలు మెగా డీఎస్సీ ఎంత లోపభూయిష్టంగా సాగిందో సామాన్యులకు సైతం ఇట్టే తెలిసిపోతోందని విమర్శించారు. నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి నియామకాల వరకు అడుగడుగునా అవినీతి జరిగిందని ఇప్పటికే తేలిపోయిందని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో, తప్పుడు రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే రాజీనామా చేశారో, ఇక్కడ మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భారీ స్కామ్పై సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలన్నదే వైఎస్సార్సీపీ ప్రధాన డిమాండ్ అని సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. అనర్హులు గురువులుగా వస్తే భావి పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ నిశితంగా ఆలోచించాలని కోరారు. కష్టపడి చదివి ప్రతిభతో టీచర్ పోస్టులు సాధించిన వారిని తీసేయమని తాము కోరడం లేదని, నకిలీలను మాత్రమే ఏరివేయాలని స్పష్టం చేశారు.ఆ తర్వాత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, పవిత్రమైన గురువులను స్మరించుకోవడమే కాదు, వారిని గౌరవించుకోవడం కూడా మనందరి విధి అని ఉద్ఘాటించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసిన డీఎస్సీ నియామకాలు చూస్తే విద్యావ్యవస్థలోకి నకిలీలను తీసుకొచ్చారని అర్థమవుతోందన్నారు. భావితరాలకు సైతం ఈ ప్రభుత్వం పక్కా పన్నాగంతో వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి డీఎస్సీ ద్వారా శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కేవలం కోట్లకు కక్కుర్తి పడి చేసిన అక్రమాల పాపం లక్షలాది మంది విద్యార్థుల భవితను నేడు ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ప్రభుత్వంలో కనీస ఉలుకూ పలుకూ లేకపోవడం దారుణమన్నారు. పాఠశాలలంటే కేవలం భవనాలు కాదని, భావితరాలకు విలువలు నేర్పే ఉత్తమ గురువులని కన్నబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఉన్నతమైన గురువుల నియామకంలో కూడా దొంగలు పడ్డారని ఉద్యమం చేయాల్సిరావడం సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఉపాధ్యాయులతో సమాజం దారితప్పి భావితరాలకే తీవ్ర ప్రమాదం వాటిల్లే ముప్పు ఉందని హెచ్చరించారు. ఎంత వద్దని మొత్తుకున్నా లోకేష్ కావాలనే విద్యాశాఖను ఎంచుకున్నాడని గతంలో చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తుచేశారు. కేవలం అడ్డదారిలో డబ్బులు దండుకోవడం కోసమే లోకేష్ ఈ విద్యావ్యవస్థను ఎంచుకుని మంత్రి అయ్యాడా అని అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే బాధ్యత టీచర్లదే కాబట్టి, వారిని అక్రమాలకు వాడుకోవచ్చనే దురుద్దేశంతోనే అడ్డదారిలో పోస్టులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా మంత్రిగా నారా లోకేష్ వేసిన ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉందన్నారు. లోకేష్కి మంత్రి పదవి అంటే కేవలం మెహర్బానీ కోసమేనని, బాధ్యతగా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఏ శాఖపై రానన్ని ఆరోపణలు, అవకతవకలు విద్యాశాఖపై వస్తున్నా లోకేష్ కనీస వివరణ ఇచ్చుకునే ధైర్యం చేయలేదన్నారు. డీఎస్సీ అక్రమాలను బయటపెడుతున్న మీడియా ఛానెళ్ల సోషల్ మీడియా అకౌంట్లను ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా బ్లాక్ చేయిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ చేసిన నిరంతర పోరాట ఫలితమే ఈరోజున అన్ని మీడియా ఛానెల్స్ డీఎస్సీ అక్రమాలను బయటకు తీసుకొస్తున్నాయన్నారు. మొన్నటి వరకు కేవలం స్పోర్ట్స్ కోటాలోనే అక్రమాలు జరిగాయని అంతా అనుకున్నారని, కానీ ఇప్పుడు అన్నింటా అవినీతి జరిగినట్టు రుజువైందని తెలిపారు. ఒక్క నకిలీ టీచర్ ఉద్యోగం పట్టుకున్నా రాజీనామా చేస్తానన్న లోకేష్, ఇప్పుడు పదుల సంఖ్యలో బయటపడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో డీఎస్సీ అక్రమాలు బయటపడిన తర్వాత ఇక ప్రభుత్వంతో చర్చలు అనవసరమని పేర్ని నాని తేల్చిచెప్పారు. తండ్రీకొడుకులకు సైకో బుద్ధులు ఉన్నాయి కాబట్టే టీచర్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారని, తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ - 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి నియామకాల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలోనూ తీవ్రమైన అవకతవకలు జరిగాయని, బహుశా భారతదేశ చరిత్రలో ఇంత దుర్మార్గమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ చూసి ఉండమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలతో పాటు ఉపాధ్యాయుల జీవితాలను కూడా బలిపీఠం ఎక్కిస్తున్న దుస్థితిని మొట్టమొదటిసారిగా మన ఆంధ్రరాష్ట్రంలో చూస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఆదర్శప్రాయంగా నిలిచి, ప్రభుత్వాల ద్వారా ప్రయోజనాలు పొందిన పెద్దలను పార్టీ శ్రేణులు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఘనంగా సన్మానించుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్లు లీక్ కావడం, ఉద్యోగాల కోసం జీవోలు మార్చడం, లక్షలాది రూపాయలు చేతులు మారడం వంటి దారుణాలు జరిగాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించినట్లుగా, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఈ డీఎస్సీ అక్రమాలపై తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.ఈ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, పి.సురేష్ బాబు, ఇసాక్ బాషా, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్ కుమార్, రామచంద్రారెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, రూహుల్లా, కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 16 వేల పోస్టుల భర్తీలో 16 వేల ఆరోపణలు వస్తున్నాయని, టెట్ లేకుండానే దొంగ సర్టిఫికెట్లతో కొలువులు ఇచ్చేశారని ఆయా నేతలు దుయ్యబట్టారు. డీఎస్సీ బాధితులకు పూర్తి న్యాయం జరిగి, ప్రభుత్వం సీబీఐ విచారణ వేసే వరకు తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్సీపీ నాయకులు ముక్తకంఠంతో హెచ్చరించారు.మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, తానేటి వనిత, జోగి రమేశ్, ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దూలం నాగేశ్వరరావు, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్, టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నాబత్తుని శివకుమార్, జక్కంపూడి రాజా, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు బాలసాని కిరణ్, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, అంబటి మురళీ కృష్ణ, విజయవాడ మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పార్టీ నూర్బాషా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దస్తగిరి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్యక్షుడు భగవాన్, లీగల్ సెల్ నాయకురాలు మాధవి, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు హాజరై దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటలకు దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలకు పార్టీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. -
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్లు
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్లు నోరు విప్పడం లేదు. కర్నూలు అనర్హత టీచర్ ప్రభాకర్పై సమాధానం చెప్పని ఐఏఎస్లు.. నకిలీ క్రీడా సర్టిఫికెట్ల టీచర్లపై కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా వహిస్తున్నారు. అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యాశాఖ మాజీ కార్యదర్శి కోన శశిధర్ నోరు విప్పడం లేదు. విద్యాశాఖ కమిషనర్ అన్సారియా ఎందుకు మాట్లాడటం లేదన్న సందేహాలు వ్యక్తమవుతుండగా.. కార్యదర్శి శ్యామలరావు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా నకిలీ సర్టిఫికెట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్ ఎందుకు నోరు విప్పడం లేదు? గతంలో అంతా సక్రమమన్న అజయ్ జైన్ ఇప్పుడెక్కడ?. శాప్ ఎండీ భరణికి ఇప్పుడు బాధ్యత లేదా?. అర్హతలేని స్పోర్ట్ కోటా టీచర్లపై ఎండీ భరణి ఎందుకు నోరు విప్పడం లేదు?. లోకేష్ను కాపాడటం కోసం నోరు విప్పడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై పోస్ట్ చేస్తే చర్యలంటూ చంద్రబాబు సర్కార్ వార్నింగ్లు ఇస్తోంది. అడ్డంగా దొరికిపోవడంతో ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. -
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా 'గురు పరిరక్షణ దీక్ష' పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్ బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?: వైవీవైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది. అర్హులుగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించమని మేము అడగడం లేదు. అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేస్తే అనర్హులు బయటపడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?: కురసాలమాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అనర్హులు గురువులు అయితే విద్యార్థుల నష్టపోతారు. విద్యావ్యవస్థలో నకిలీ గురువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నకిలీ గురువులతో భావితరాలు నష్టపోతాయి.. ఈ డీఎస్సీ ప్రక్రియ దుర్మార్గమైన స్కామ్. స్కామ్ బయటపడినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?. కూటమి సర్కార్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అన్ని వర్గాలకు ప్రభుత్వం నష్టం చేసింది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: టీచర్స్ డే సందర్భంగా గురువులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన భవిష్యత్తుకు నిజమైన శిల్పులు ఉపాధ్యాయులే. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో కలలను రేకెత్తించి.. విలువలను పెంపొందిస్తూ మంచి భవిష్యత్తును నిర్మించుకునే.. ఆత్మవిశ్వాసాన్ని కల్పించేది గురువులే’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. చిన్నారులను జ్ఞానవంతులుగా, సాధికారులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ప్రతి గురువుకీ హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.On the occasion of #TeachersDay, I extend my heartfelt greetings and gratitude to all our teachers.Teachers are the architects of our future. Beyond imparting knowledge, they inspire dreams, instil values and give our children the confidence to shape a better tomorrow.My…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026 -
సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
సాక్షి, విజయవాడ: ఏపీలో రెడ్బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను కూటమి సర్కార్ బ్లాక్ చేయించింది. వాస్తవాలు ప్రసారం చేసిన సాక్షి సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షి ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లను బ్లాక్ చేయించిన చంద్రబాబు సర్కార్.. డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో వణుకు పోతోంది.సాక్షి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. టీడీపీ ఫేక్ అకౌంట్లు, ఏపీ సైబర్ క్రైమ్తో కలిసి కుట్రలు చేస్తోంది. ఇప్పటికే సాక్షి సోషల్ మీడియాపై కూటమి సర్కార్ పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును చంద్రబాబు సర్కార్ కాల రాస్తోంది. ఏపీ సర్కార్ కుట్రలపై సాక్షి మీడియా న్యాయ పోరాటం చేస్తోంది.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇదీ చదవండి: మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ -
జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్
వాహనదారులపై 501 చలానాలు, రూ.3.33 లక్షల జరిమానా నగరంపాలెం: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమల్లో భాగంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకు విస్తృత తనిఖీలు కొనసాగించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 501 చలానాలు నమోదు చేసి, రూ.3.33 లక్షల జరిమానా విధించారు. హెల్మెట్ ధరించని వాహనదారులు, కార్లలో సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లపై 120 కేసులు, ట్రిపుల్ రైడింగ్పై 12 కేసులు, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై 37 కేసులు, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసిన వారిపై ఎనిమిది కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై 16 కేసులు, వాహనానికి సైలెన్సర్ లేని ఒకరిపై ఒక కేసు, 12 మంది మైనర్లపై, మోటారు వాహన చట్ట ఉల్లంఘించిన వారిపై 314 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ వాడకంపై 18 రోడ్డు భద్రత అవగాహన, 250 మంది డ్రైవర్లు, 300 మంది విద్యార్థులు, 255 మంది ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. -
7వ తేదీ లోగా వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోండి
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రాడీపేటలోని శ్రీమేధ విద్యాసంస్థల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ నందకిషోర్, కరస్పాండెంట్ అన్నా శ్రీలక్ష్మి శ్రీకృష్ణునికి పూజ నిర్వహించారు. క్యాంపస్ ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందకిషోర్ మాట్లాడుతూ అధర్మం వృద్ధి చెందినప్పుడు ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు శ్రీకృష్ణావతారాన్ని దాల్చారని అన్నారు. భగవద్గీత ద్వారా సామాన్య జీవితాన్ని ఏ విధంగా జీవించాలో, ధర్మాన్ని పాటించే విధానం, సంక్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలను తీసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని బోధించారని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ (2026)లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈనెల 1–4 వరకు రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఫైరింగ్ విభాగంలో ఎస్బీ సీఐ ఏ.మల్లికార్జునరావు స్టెన్ గన్ ఈవెంట్లో ద్వితీయ, కార్బైన్ ఈవెంట్లో తృతీయ స్థానంలో, వెయిట్ లిఫ్టింగ్్ 85 కిలోల విభాగంలో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరావు గోల్డ్ మెడల్, కబడ్డీలో ఎస్బీ మహిళా కానిస్టేబుల్ క్రాంతికుమారి, పట్టాభిపురం పీఎస్ మహిళా కానిస్టేబుల్ తిరుపతమ్మ గుంటూరు రేంజ్ నుంచి రెండో స్థానం సాధించారు. హ్యాండ్ రైజింగ్లో ఎస్బీ మహిళా కానిస్టేబుల్ క్రాంతికుమారి సిల్వర్ మెడల్, కె.వేణుబాబు ఆధ్వర్యంలో గుంటూరు డాగ్ స్క్వాడ్కు చెందిన ‘సింబా’ నార్కోటిక్ టెస్ట్ విభాగంలో రెండో స్థానం సాధించారు. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలువురు వైద్య సిబ్బంది సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి ప్లకార్డులు చేతపట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈనెల 8 నుంచి విధులు బహిష్కరిస్తామని యూనియన్ నేతలు తెలిపారు. 30 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ విధులు బహిష్కరించి నిరసన కొనసాగిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు స్టాఫ్నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాశిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
నీటి ప్రవాహం మృత్యుపాశమై..
సంగం: ఆ యువకుడు పొట్టకూటి కోసం వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా కాలువలో స్నానానికి దిగాడు. కానీ నీటి ప్రవాహం రూపంలో మృత్యువు కబళించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన మోహన్ (30), ఇబ్రహీం నేమ్బోర్డులు బిగించే పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని తిరిగెళ్తూ శుక్రవారం సంగం కావలి కాలువ వద్ద స్నానానికి దిగారు. కొద్దిసేపటికే మోహన్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అప్రమత్తమైన ఇబ్రహీం ఈత కొట్టి ఒడ్డుకు చేరుకున్నాడు. మోహన్ మాత్రం నీటిలో కొట్టుకుపోయి కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మోహన్ ఆచూకీ లభించలేదు. చివరకు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు. -
స్వాతంత్య్ర సమరయోధుల వారసుల ఇళ్ల నిర్మాణాలు నిలిపివేత
గుంటూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుల వారసులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను లబ్ధిదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. వివరాలు.. అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 2010లో అప్పటి ఉన్నతాధికారులు సుమారు 70–80 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. అదే స్థలాలు గతంలో 1985లో వేరే వారికి కేటాయించగా వాళ్లు ఆ స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవటంతో 2010లో ఉన్నతాధికారులు విచారించి గతంలో 1985లో ఇచ్చిన వారికి రద్దు చేసి 2010లో స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించి ఇళ్ల పట్టాలను మంజూరు చేసి అందజేశారు. అప్పటి నుంచి కొందరు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టి వదిలేయగా మిగిలిన వారు అక్కడ ఎటువంటి మౌలిక వసుతులు లేకపోవటంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. ఇటీవల కాలంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కలిసి తమకు కేటాయించిన స్థలాలకు డ్రెయినేజీ, తాగునీరు వసతులు కల్పించాలని తాము ఇళ్ళు నిర్మించుకుంటామని అభ్యర్థించారు. దీంతో కలెక్టర్ ఉన్నతాధికారులు ముందు ఇళ్లు నిర్మాణాలు చేస్తే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారుల రాకతో.. అనుమతి లేదని టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల అండతో పొక్లెయిన్తో నిర్మాణాలు కూల్చేందుకు వెళ్లారు. దీంతో నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేదిలేదని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నామని లబ్ధిదారులు ఎదురుతిరిగారు. సర్దిచెప్పిన పోలీసులు దీంతో పోలీసులు ఇరువురికి సమన్వయ పరిచి ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ కనీసం నిర్మాణాలు నిలిపేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఉన్నతాధికారుల అనుమతులతోపాటు టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోవాలని అధికారులు చెప్పటంతో లబ్ధిదారులు స్వాతంత్య్ర సమరయోధులకు ప్లానింగ్ అనుమతులు అధికారులే ఉచితంగా ఇవ్వాలని చట్టాలే చెబుతున్నాయని సూచించారు. దీంతో అధికారులు చేసేది లేక కనీసం అర్జీలైనా పెట్టుకోవాలని అనుమతులు ఉచితంగానే ఇస్తామని, చెప్పి అనుమతులు వచ్చే దాకా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని చెప్పి వెళ్లారు. ఉన్నతాదికారులు విచారించి తమ స్థలాల్లో తాము ఇళ్లు నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు. -
‘రణభేరి–ఇక సమరమే’ సదస్సులో పాల్గొనండి
లక్ష్మీపురం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఏపీసీఓఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రణభేరి–ఇక సమరమే’ సదస్సులో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ బి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బ్రాడీపేటలోని సీఐటీయూ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే పోరుబాటకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ బి ముత్యాలరావు, సీఐటీయూ కోశాధికారి ఎం.సాంబశివరావు, వివిధ విభాగాల రాష్ట్ర జిల్లా నాయకులు ఎస్ శ్యామ్, వి రమేష్బాబు, సీహెచ్ గోపాలకృష్ణ, పి శ్రీనివాసరావు, రామకృష్ణలు పాల్గొన్నారు. -
పోలీసుల చిత్రహింసలతోనే గోపి మృతి
తాడికొండ: పోలీసుల చిత్రహింసల వలనే ఆటో డ్రైవర్ చీకటి గోపి మృతి చెందాడని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపించారు. పొన్నెకల్లులో మృతుడు గోపి కుటుంబాన్ని సీపీఎం, కేవీపీఎస్, రైతు, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ విచారణ పేరుతో పోలీసులు దాడి చేయడంతో కొట్టిన దెబ్బల కారణంగా గోపి అనారోగ్యానికి పాలయ్యాడని అన్నారు. చికిత్స నిమిత్తం గోపిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ డాక్టర్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన తెనాలి తరలించి అక్కడ చికిత్స అందించారని చెప్పారు. గోపి ఆరోగ్యం విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ గోపి మృతి చెందాడన్నారు. న్యాయవిచారణ చేయాలని డిమాండ్చేశారు. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గంలో పోలీసుల దెబ్బలకు తాళలేక ఒక దళిత యువకుడు చనిపోతే మూడు రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా, చర్చ జరుగుతున్నా ఎమ్మెల్యే కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్పందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో గుంటూరు జిల్లాలో పోలీసులు పనికట్టుకొని దళితులపై తప్పుడు నేరారోపణ చేసి విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నవీన్ అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కంచమాటి అజయ్ కుమార్, చింతల భాస్కరరావు, బరక వెంకటేశ్వర్లు, ఏరువ అంజిరెడ్డి, బాణావత్ భద్రయ్య, జోషి పాల్గొన్నారు. గోపి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: దళిత సంఘాల డిమాండ్ తాడికొండ: దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి హింసించిన కేసులో చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కుల వివక్ష పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రు మాల్యాద్రి అన్నారు. శుక్రవారం తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని మృతుడు చీకటి గోపి కుటుంబాన్ని దళిత సంఘాల నాయకులు పరామర్శించి, మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాల్యాద్రి మాట్లాడుతూ చీకటి గోపీ మరణానికి కారకులైన పోలీసులపై సమగ్ర విచారణ జరిపి ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నీలం నాగేంద్రం మాట్లాడుతూ చీకటి గోపీ అనే దళిత యువకుడిని సీఐ ఉమేష్, ఎస్ఐ జోజి, కానిస్టేబుళ్ళు మురళీ, ముస్తఫాలు తీసుకొచ్చి దొంగతనం కేసులో విచక్షణా రహితంగా కొట్టడంతోనే మరణించాడన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరివి వినయ్ కుమార్, భీమ్ సేన సేవాదళ్ అధ్యక్షుడు నల్లపు నీలాంబ్రం, పాటిబండ్ల కోటేశ్వరరావు, దళిత బహుజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బెన్నిస్ రాయ్, దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి విల్సన్, చార్వాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ పాల్గొన్నారు. -
ఎస్టీయూ కార్యాలయం ఉద్యమ కేంద్రం
మంగళగిరి టౌన్: ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ఎస్టీయూ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎస్టీయూ–ఏపీ రాష్ట్ర నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను కేవలం సంఘపరమైన అంశాలుగా కాకుండా విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కార్యాలయం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి, సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధన, విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్టీయూ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ప్రశంసనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ నిర్వహించిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ– ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్. సాయిశ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసెఫ్ సుధీర్బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ కె.వి.శేఖర్, మాజీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షణ్ముర్తి, గాజుల నాగేశ్వరరావు, తిమ్మన్న, రమేష్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియాలో ఫొటోలు పెడతామంటూ బెదిరింపులు
● రూ.87,000 కాజేసిన నిందితులు ● నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు గుంటూరు రూరల్: సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తిని బెదిరించి నగదు కాజేసిన కేసులో ముగ్గురు నిందితులను నల్లపాడు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.87,000 స్వాధీనం చేసుకున్నారు. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. సంగడిగుంటకు చెందిన తూమాటి పాల్, శ్రీరామ్ అరుణ్కుమార్, ఉయ్యాల రితిక్ అలియాస్ హృతిక్లు జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించి మహిళలు, ఇతరల పేర్లుతో ట్రాప్ చేసి పర్సనల్గా మాట్లాడి రికార్డింగ్లు, ఫొటోలు సేకరించి బెదిరించి డబ్బు కొట్టేయటం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వారికి పరిచయమైన వ్యక్తిని ఏటుకూరు బైపాస్, బుడంపాడు బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి, అక్కడ నిందితులు బాధితుడిని బెదిరించి, అతనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను తీసి, వాటిని కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించి, రెండు బ్యాంకు ఖాతాల ద్వారా మొత్తం రూ.87,000 బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. అభినందించిన జిల్లా ఎస్పీ బాపట్లటౌన్: ఉద్యోగంతోపాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026లో పట్టణ సీఐ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో బాపట్ల టౌన్ పోలీస్స్టేషన్ సీఐ రాంబాబు విశేష ప్రతిభ కనబరిచారు. లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక ట్రోఫీని కై వసం చేసుకున్నారు. శుక్రవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సీఐను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, వివిధ పోలీస్ విభాగాల నుంచి ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఇనన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మొత్తం 20 మందికి పైగా లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో పోటీ పడ్డారన్నారు. వారందరినీ అధిగమించి బాపట్ల టౌన్ ఇన్న్స్పెక్టర్ విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకోవడం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు. -
అమ్మవారికి ‘వైఎస్సార్ సీపీ’ నగల సమర్పణ
పెదకాకాని: పవిత్ర శ్రావణ మాసంలో శివాలయంలో మాయమైన బంగారు ఆభరణాలను సమర్పించడానికి వెళితే టీడీపీ గూండాలు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. పెదకాకాని శివాలయంలో ఆగస్టు 14వ తేదీన అలంకరించిన బంగారు ఆభరణాలు, మంగళసూత్రాలు, నాన్తాడు మాయమయ్యాయని 19వ తేదీన అర్చకులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మూడు రోజుల పాటు కేసు నమోదు చేయకపోవడంతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేశారు. అలాగే 27వ తేదీన నగర సంకీర్తన నిర్వహించి అమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మీదేవి రూపు సమర్పించిన సంగతి విదితమే. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, మంగళగిరి, తాడికొండ, వేమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, వరికూటి అశోక్బాబు, స్థానిక నాయకులతో కలిసి అంబటి మురళీకృష్ణ ఆలయానికి వెళ్లేందుకు సమీపంలో ఉన్న మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మవారి అనుగ్రహంతో ఆలయానికి చేరుకుని నాన్తాడు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎమ్మెల్యే అండతోనే టీడీపీ నేతల ఆగడాలు వైఎస్సార్ సీపీ నాయకులు అమ్మవారికి ఆభరణాలు సమర్పించడానికి శివాలయానికి వెళితే ఆ రోడ్డుపై టీడీపీ వారు పసుపు నీళ్లు చల్లడం దారుణంగా ఉందని అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ, పది రోజుల క్రితం నగర సంకీర్తన చేసి మంగళసూత్రాలు సమర్పించాం. నాన్తాడు శుక్రవారం రోజున సమర్పిస్తామని ప్రకటిస్తే, స్థానిక ఎమ్మెల్యే గురువారం ప్రెస్మీట్ పెట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యక్రమాన్ని అడ్డుకునే చర్యలకు పాల్పడ్డాడన్నారు. ఆలయాల్లో రాజకీయ కుట్రలు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఎమ్మెల్యే డైరెక్షన్తోనే టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి చేరి ఆలయానికి వెళుతున్న పార్టీ నాయకులను అడ్డుకోవడం, బైఠాయించడం, గొడవలు సృష్టించారన్నారు. టీడీపీ వాళ్లు కేవలం గొడవలు సృష్టించడానికే రోడ్డుపైకి వచ్చారన్నారు. బెల్ట్షాపు నిర్వహిస్తూ పట్టుబడిన వారిని పాలకవర్గ సభ్యులుగా కొనసాగిస్తున్న ఘనత టీడీపీకే దక్కిందన్నారు. భక్తులందరి సహకారంతో అమ్మవారి ఆభరణాలు సమర్పించడంతో తన జన్మ సార్థకమైందని భావోద్వేగంతో అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ళ జ్యోతి, ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
నృసింహుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళగిరి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజా సామాగ్రితో హాజరై అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వరలక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. పుష్పాలు, పసుపు, కుంకుమ తదితర సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: నేటి యువతరం క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఐజీపీ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చి ఎనిమిది పతకాలు సాధించానని తెలిపారు. టేబుల్ టెన్నిస్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో పతకాలు సాధించి ఆల్రౌండర్గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈగల్ టీం టేబుల్ టెన్నిస్లో 40 ఫ్లస్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో రజత పతకాలు, 50 ఫ్లస్ సింగిల్స్, 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజత పతకం, షటిల్ బ్యాడ్మింటన్లో 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్లో రజతం, స్విమ్మింగ్లో 25 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. ఈగల్ విభాగం మొత్తంగా 40 పతకాలు సాధించడం విశేషమని పేర్కొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం – తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. మచిలీపట్నం – తిరుచానూరు (07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారు జామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
కొంతమేర కూలిన కొమ్మమూరు చానల్ బ్రిడ్జి
చేబ్రోలు: కృష్ణా డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ, రవాణా రంగంలో మైలురాయిగా నిలిచిన చరిత్రాత్మక కొమ్మమూరు కాలువపై పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. చేబ్రోలు వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరింది. శుక్రవారం కాలువకు ఒక వైపు ఉన్న వంతెన పక్క భాగం కొంతమేర కూలిపోయింది. గత జూలై నెలలోనే ఈ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని సాక్షి దినపత్రికలో ‘నాడు మోక్షం.. నేడు నిర్లక్ష్యం’ అనే శీర్షికన కథనం వెలువడింది. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఈ రోజు ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పిన పెను ప్రమాదం హెవీ లోడ్తో వెళ్తున్న లారీ వంతెన పైభాగానికి వచ్చే సమయానికి ఎదురుగా వాహనం రావడంతో కొంత పక్కకు వచ్చి పైన ఉన్న కొండరాళ్లను ఎక్కించటంతో బలహీనంగా ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయినట్లు సమాచారం. త్రుటిలో లారీకి పెను ప్రమాదం తప్పింది. లారీ సహా కాలువలో పడి ఉండే ప్రాణనష్టం జరిగి ఉండేది. వాహనాల రాకపోకల ఒత్తిడి కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కూలిన వంతెన కొంత భాగం వద్ద అధికారులు ప్లాస్టిక్ బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలకు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి పొన్నూరు, గుంటూరు, బాపట్ల, రేపల్లె, చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వంతెనపై ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు ప్రయాణిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. -
పేద రోగుల మృత్యుఘోష
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వెంటిలేటర్పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే శ్మశానం వద్ద కదలాడినట్లు గమనించి కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణి అక్కడ వైద్యులు లేక గంటలకొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించిన హృదయ విదారకమైన ఘటన.. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించిన దారుణం.. బతికుండగానే స్ట్రెచర్ సహా ఓ వృద్ధుడిని బయటకు గెంటేసిన వైనం.. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా రోగికి ఇంజెక్షన్ ఇవ్వని ఘటన.. ఇవన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జీజీహెచ్లో జరిగిన ఘటనలు. మళ్లీ చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ నిర్లక్ష్యం మరింత పెరిగింది. అత్యవసర వేళ వెటకారం తాజాగా ఈ నెల ఒకటో తేదీన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి(30) తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగంలో చేరాడు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నాడంటూ బంధువులు ఎంత వేడుకున్నా అక్కడి వైద్య సిబ్బంది చలించలేదు. పైగా ‘ఎవరి ఆక్సిజన్ మాస్క్ అయినా పీక్కుని వచ్చి మాకు ఇవ్వండి.. పెడతామంటూ’ వెటకారంగా మాట్లాడారు. కొద్ది సేపటికే ఊపిరి అందక గోపి మృతి చెందాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇలాంటి దారుణ ఘటనలు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో కోకొల్లలు. ఎంతో కీలక ఆసుపత్రి జీజీహెచ్కు గుంటూరుతో పాటు చుట్టుపక్కలనున్న ఆరు జిల్లాల ప్రజలు వైద్యం కోసం వస్తారు. రోజుకు దాదాపు 3,500 నుంచి 4 వేల మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యులు, వారు అందజేస్తున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ వారంలో రెండు రోజులు సెలవులు పెట్టి మరీ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు పరుగులు పెడుతున్నారు. సీఎస్ఆర్ఎం వెంకటేశ్వరరావు సైతం రాత్రివేళ అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న ఇద్దరు అధికారులు సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో మిగతా వారు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు జీజీహెచ్లో గత తొమ్మిది నెలలుగా నమోదవుతున్న మరణాల రేటును పరిశీలిస్తే.. గుండెలు పగిలే నిజాలు వెలుగులోకొచ్చాయి. జీజీహెచ్లో 2024లో 7,846 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. 2025లో 6,529 మంది చనిపోయారు. 2026లో సైతం వారానికి వంద మంది చొప్పున మృత్యువాత పడుతున్న దయనీయ పరిస్థితి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా అత్యవసర వార్డుల్లో చేరిన రోగులే సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలొదులుతున్నారు. తీరు మార్చుకోని అఽధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్యచికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీఎస్ఆర్ఎంఓ, సూపరింటెండెంట్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని వైఎస్సార్ సీపీ హయాంలో నూతనంగా ప్రారంభించారు. అయితే ఎమెర్జెన్సీ వైద్యులు సొంత ప్రాక్టీసు చేసుకుంటూ ఈ విభాగాన్ని గాలికొదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అత్యవసర వార్డుల్లోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టును రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారికి ఇవ్వడంతో సీనియర్ వైద్యులెవరూ వారి మాట లెక్కచేయని పరిస్థితి. ఇన్చార్జులు కావడంతో వారు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. వైద్యం కోసం ఆశగా వచ్చిన పేదరోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారికంగా 1,250 ... అనధికారికంగా మరో వెయ్యికిపైగా పడకలతో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా ఉంది. ఫలితంగా, ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకు కేటాయిస్తున్న సమయం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఇవ్వడం లేదు. ప్రధానంగా క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమెర్జెన్సీ వార్డులు, గైనిక్, పిల్లల వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా జీజీహెచ్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. -
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్లో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ వరుసగా ఎన్నో సాక్ష్యాలు బయటకు వస్తున్నా ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థి టెట్లో క్వాలిఫై కాకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?వన్ టు వన్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి..’ అని స్పష్టం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ఇంకా దాక్కుంటారా..? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ.. మోసాల్లో మెగా, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట దగా అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేశ్తో రాజీనామా చేయించకుండా.. అధికార బలంతో అబద్ధాలు చెబుతూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కుమారుడిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ అదృశ్య శక్తి లోకేశ్ కాదంటారా? కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.చంద్రబాబూ..! ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం. ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే.. వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి మీకు డబ్బా కొట్టించుకోవడం ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బ తీసిన ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు. పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మరోమారు భరోసా ఇస్తున్నాం. లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్ కోటా వరకు.. టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు.. మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నా.మీ అక్రమాలను ఏపీపీఎస్సీకి పాకించారు..మరో నిర్ఘాంతపరిచే విషయం ఏమిటంటే.. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా? డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్మెంట్ను మధ్యలో ఆపేయడంతోపాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపివేయడం వాస్తవం కాదంటారా? .@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల… pic.twitter.com/8dkiPMnKjk— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
GSLV ప్రయోగం విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి,తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం వల్ల దేశంలో వాతావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. Congratulations to @isro on the successful #GSLVF17 launch carrying #EOS05 from Sriharikota. I commend the scientists and engineers whose dedication and precision made this achievement possible. The mission strengthens weather monitoring, disaster management and national… https://t.co/PODbu2k2HQ— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టింది మెగా డీఎస్సీ కాదని, యువగళం డీఎస్సీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన పాపాలను ఎల్లకాలం దాచిపెట్టలేరని, రోజుకో నిజం బయటపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న డీఎస్సీ అక్రమాలపై శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తమ అనుచరులకు, కార్యకర్తలకే స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారు. కనీసం టెట్ అర్హత సాధించని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను కఠినంగా వర్తింపజేస్తూ, తమ యువగళం టీచర్లకు మాత్రం ఎలాంటి అర్హతలూ లేకపోయినా మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ అక్రమాల డొంక ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ విస్తరిస్తోంది. కౌతాళం మండలంలోనే ఏకంగా 24 మంది, ఒకే చోట ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆదరణ లేని జూడో ఆట పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి దాదాపు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో కేవలం 79 మార్కులు వచ్చిన వారికి, తూర్పు గోదావరి జిల్లాలో అసలు అర్హతే లేని వారికి నియామకాలు చేపట్టారు. ఇటువంటి ఉపాధ్యాయులు రేపటి తరం పిల్లలకు ఏం పాఠాలు చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పూర్తిగా అవినీతి అడ్డాగా మారింది. క్రీడా సర్టిఫికేట్లను కనీసం వెరిఫికేషన్ చేయకుండా నియామకాలు ఎలా పూర్తి చేస్తారని పేర్ని నాని మండిపడ్డారు.చంద్రబాబు, లోకేష్లకు ధైర్యముంటే స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన టీచర్ల జాబితాను, వారి సర్టిఫికేట్లను వెంటనే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. మెగా డీఎస్సీలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం మరో డీఎస్సీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బావ హత్యకు బావమరిదే సూత్రధారి
గుంటూరు: కిడ్నాప్నకు గురైన పాలిష్ వ్యాపారి హత్య కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని తేలింది. కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించారు. బావ హత్యకు సుపారి ఇచ్చిన బావమరిదిని, కిరాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య (53) అలియాస్ నాగ మహేష్ పాలిష్ వ్యాపారం చేసేవాడు. అతనికి 2006లో విజయవాడ వాసి సంధ్యారాణితో పెళ్లై, ఇద్దరు పిల్లలు. అతనికి 35 ఏళ్ల అట్టలూరి దీప్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా సరిగా ఇంటికెళ్లడం లేదు. తెనాలి నందులపేటలో దీప్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత నెల 29న అతను సాయంత్రం ఇంటి నుంచి వెళ్లగా, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో దీప్తి వెతుకుంటూ 30న ఆటోనగర్ వెళ్తుండగా సోమసుందరపాలెం శివారులో స్కూటీ, చెప్పులు కనిపించాయి. దీనిపై తెనాలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అతడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలించారు. విచారణలో విజయవాడ రాజీవ్నగర్లో ఉంటున్న నాగమహేష్ బావమరిది పగడాల రాజేష్ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బావ హత్యకు బావమరిది కీలక సూత్రధారి అని గుర్తించామని చెప్పారు. బుధవారం రాత్రి రాజేష్ను, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరుకి చెందిన కొమరబత్తిని సందీప్, బుస్సా సంజయ్, కొప్పుల అపర్ణ అలియాస్ బుజ్జి, దేవరకొండ మారుతీవరప్రసాద్ అలియాస్ మారుతీని అరెస్ట్ చేశామన్నారు. ఇసుక క్వారీ వద్ద మృతదేహం నాగమహేష్ దీప్తితో సహజీవనం చేస్తూ, ఆస్తి మొత్తం ఆమెకు రాసిస్తాడని రాజేష్ కక్ష పెంచుకున్నాడు. ఆస్తిని తన సోదరి, ఆమె పిల్లల పేరిట రాయకపోవడంతో బావ హత్యకు పథకం రూపొందించాడు. సందీప్కు రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సందీప్ తన అనుచరులతో తెనాలిలోని ఓ హోటల్లో పది రోజులు బస చేసి, నాగమహేష్ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. గత నెల 29న సోమసుందరపాలెం వద్ద బైక్పై వెళ్తున్న అతన్ని గుంటూరు నుంచి అద్దెకు తెచ్చిన కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. తేలప్రోలు, అత్తోట, తుములూరు మీదుగా కరకట్టపై రేపల్లె వైపు వెళ్తూ కారులోనే గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. గురువారం ఓలేరు ఇసుక క్వారీ వద్ద మతదేహాన్ని గుర్తించారు. భట్టిప్రోలు తహసీల్దార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్దన్, తెనాలి గ్రామీణ సర్కిల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. చదవండి: ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ -
‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’
సాక్షిప్రతినిధి, గుంటూరు: తమ చిన్నారిని రక్షించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ తండ్రి మూడు నెలలుగా అధికారులు, అధికారపార్టీ నాయకులు అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కూతురి ఆచూకీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు ఆ బాధ్యతను మరిచిపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారిపై అత్యుత్సాహం చూపి అరెస్టు చేయడం వంటి వాటికి పరిమితమై పోయారు. లా అండ్ ఆర్డర్ గాలికొదిలేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి జనాన్ని పీక్కుతింటూ పోలీసు శాఖ ప్రతిష్టను కొందరు అవినీతి ఖాకీలు దిగజారస్తున్నారు. గుంటూరు నగరంలో జరిగిన సంఘటనపై హైకోర్టు సీరియస్గా స్పందించి పోలీసులను చీవాట్లు పెట్టడంతో ఇప్పుడు హడావుడిగా సిట్ ఏర్పాటు చేసి వెతుకులాట ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మూడు నెలలు దాటుతున్నా ఆచూకీ లేదు గుంటూరు నగరానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక జూన్ 9వ తేదీన ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి అదే రోజు సాయంత్రం నగరంలోని పట్టాభిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అనగా జూన్ 10వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను గంజాయి తాగే ఓ యువకుడు (22 ఏళ్లు) కిడ్నాప్ చేశాడనే విషయం బయట పడడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ నెల్లూరు మొబైల్ షాపులో మొబైల్ కొన్నట్లు సీసీ çటీవీ ఫుటేజీలో గమనించిన తండ్రి అతని మొబైల్ ఈఎంఐ నంబరుతో సహా పోలీసులకు అందించారు. అదే నెల 18వ తేదీన ఫోన్ ఆన్ చేసినట్లుగా పోలీసులు చెప్పడంతో తండ్రి కార్లు ఏర్పాటు చేసి ఓ ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లను తీసుకుని హుటాహుటిన కోయంబత్తూరు వెళ్లారు. 13 నుంచి 18వ తేదీ వరకు కోయంబత్తూరులోని లాడ్జిల్లో వారు బస చేసినట్లు ఆధారాలు కూడా దొరికాయి. అనంతరం కోయంబత్తూరు రైల్వేస్టేషన్లో తండ్రే ఆరీ్పఎఫ్ పోలీసులను కలిసి రైల్వేస్టేషన్ పుటేజీ పరిశీలించగా సికింద్రాబాద్ రైలు ఎక్కినట్లు గుర్తించారు. దీంతో కారుల్లో వెళితే ఆలస్యమవుతోందని భావించిన తండ్రి ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లకు తానే విమాన టికెట్లు కొనుగోలు చేసి సికింద్రాబాద్కు వచ్చారు. అక్కడ కిడ్నాపర్ మేనత్తను పట్టుకుని ప్రశ్నించగా, తన ఇంటికి వచ్చివెళ్లినట్లు అంగీకరించింది. ఆ తరువాత సెల్ స్విచ్ ఆఫ్ చేసిన నిందితుడు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడో బాలికను ఎక్కడ దాచాడో తెలియని పరిస్థితి. మిస్సింగ్ కేసు నమోదు చేసి వదిలేశారు.. మైనర్ బాలికను గంజాయి తాగుతూ కత్తి పెట్టుకుని తిరిగే ఓ జులాయి కిడ్నాప్ చేశాడని జూన్ నెల 11వ తేదీన పోలీసులకు తెలిసినప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంచి దర్యాప్తు చేశారే తప్ప, కనీసం కిడ్నాప్, పోక్సో చట్టం కింద సెక్షన్లు మార్పు చేయని పరిస్థితి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అలియాస్ పండుగా పోలీసులు గుర్తించారు. అతనికి ఇన్స్ర్ట్రాగామ్లో 300 నుంచి 400 మంది వరకు కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరిని పిలిచి విచారించిన పోలీసులు ఆతరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చేతులెత్తేశారు. పోలీసులు, బాలిక తండ్రి, వారి బంధువులు కోయంబత్తూరు, పాల్గాడ్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో లాడ్జిల్లో వెతికారు. అయితే వీరి ఆచూకీ ముందుగానే ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నిందితుడు వీరు అక్కడికి చేరుకునే రోజు లాడ్జిలు ఖాళీచేసి వెళ్లిపోతున్నాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడడం, ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా గురువారం కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు మార్పు చేసి హైకోర్టుకు నివేదించేందుకు నానా తంటాలు పడ్డారు. ‘ఫోన్ ఆన్ చేస్తే తప్ప ఏం చేయలేమంటూ..’జూన్ 21వ తేదీన సికింద్రాబాద్లో వెతికిన పోలీసులు ఇక ఆ తరువాత నిందితుడి ఫోన్ ఆన్ చేస్తే తప్ప, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రాలు దాటి వెళ్లి అమాయకులను అర్ధరాత్రి పూట ఎత్తుకొస్తున్న పోలీసులకు ఓ మైనర్ బాలిక కిడ్నాప్ అయి మూడు నెలలు దాటుతున్నా చలనం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటి నుంచి మూడు నెలలుగా పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాలిక తండ్రి చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయిన విషయం అందరికి తెలిసిందే. బాలిక ఇంటి నుంచి వెళుతూ లక్ష రూపాయల నగదు, బంగారం తీసుకెళ్లినట్లు సమాచారం.పోలీసులకు సవాల్ విసిరిన కిడ్నాపర్ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకున్న నిందితుడు సికింద్రాబాద్లో ఉండే తన మేనత్త ఫోన్ నుంచి జూలై 13వ తేదీన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయినా పోలీసుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం. చదవండి: బావ హత్యకు బావమరిదే సూత్రధారి -
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.2025లోనూ తగ్గిందే..2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026‘ఇది తప్పుడు ప్రచారం’..2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. ‘రెడ్బుక్ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్ ఎవరబ్బా? -
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, గుంటూరు: పెదకాకానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమ్మవారి మంగళసూత్రం మాయంపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ సిద్ధమయ్యారు. అంబటి మురళీకృష్ణను అడ్డుకోవాలని టీడీపీ నాయకులు ప్లాన్ చేశారు. పెదకాకాని ఆలయానికి టీడీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. అంబటి మురళి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోన రఘుపతిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారుమల్లాది విష్ణు కారుపై దాడికి చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి మంగళసూత్రం మాయం నేపథ్యంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి ఇవాళ నాంతాడు సమర్పిస్తానని వారం రోజులు క్రితమే అంబటి మురళి ప్రకటించారు. అంబటి మురళితో పాటు కొంతమంది భక్తులు కొత్త నాంతాడు తయారు చేయించారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలను ఆలయం వైపు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం: పంచాయతీ కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ వీరికి ఇచ్చే జీతాల్లో ఎటువంటి పెరుగుదల లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు జి. రమణి అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డీపీఓ కార్యాలయంలో డీఎల్పీఓ శ్రీనివాస్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి నేలటూరి రత్నకుమారి అధ్యక్షత వహించగా, యూనియన్ జిల్లా కార్యదర్శి చింతల శ్రీనివాసరావు, పెరవలి శ్రీరాములు, ఇండ్ల అంకమ్మరావు, ఇజి చిన్న ఏడుకొండలు, బెన్నీ తదితరులు పాల్గొన్నారు.


