Guntur
-
ఏమిటి ‘రాజా’ ఇది!
సాక్షి, హైదరాబాద్: రోజుకో వార్నింగ్..సొంత పార్టీ నేతలపైనే ఘాటైన విమర్శలు..అమ్ముడు పోతారంటూ ఆరోపణలు..నోటీసులు ఇవ్వడం కాదు..దమ్ముంటే సస్పెండ్ చేయండి అంటూ సవాలు..గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం రోజురోజుకూ చిలికిచిలికి గాలివానగా మారుతోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. నిత్యం సొంత పార్టీ రాష్త్ర స్థాయి నేతలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలకు రాష్త్ర నాయకత్వం గుర్రుగా ఉంది. నేతలను దొంగలని సంబోధిస్తున్నారు. బీజేపీని బీఆర్ఎస్కు తాకట్టు పెట్టేస్తారంటూ విమర్శిస్తూ నగరంలో పారీ్టకి కంటిలో నలుసులా తయారయ్యాడు. సొంత పార్టీ నేతలు ప్రత్యర్థి పారీ్టల నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారంటూ ఆరోపిస్తూ పార్టీ పరువు బజారున పడేస్తున్నారు.. ఇదిలా ఉంటే పార్టీలో ఉన్న అగ్ర నేతలు ఈ ఎపిసోడ్కు పుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. కేంద్రంలో పెద్దలతో మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ డైలమాలో పడింది. పార్టీ కార్యక్రమాల్లో ఎవరి వెంట నడవాలనేది అంతు చిక్కడం లేదు. మొదటి నుంచి ఆయన ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గత ఎన్నికల ముందు సస్పెండ్ ఎత్తివేసి, గోషామహల్ అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా ఆయన తీరులో మార్పు కనిపించలేదు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపుల్లోనూ రాష్త్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జెండా పట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో స్థానం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ రాయబారం చేసినప్పటికీ తాత్కాలికంగా కొంత సద్దుమణిగిందని అంతా భావించినా, ఇటీవల కాలంలో పరోక్షంగా సంజయ్పైనా విమర్శణాస్త్రాలను ఎక్కుపెట్టారు రాజాసింగ్. దీంతో గ్రూపు రాజకీయాలు ఉన్న మాట తెలిసిందే అయినా ఓ వర్గం ఓ నాయకుడిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం గమనార్హం. పార్టీ పరంగా అంతర్గత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, ఇప్పటికిప్పుడు రాజాసింగ్పై చర్యలు తీసుకునే ఆస్కారం లేని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ అనంతరం జరిగిన పరిణామాల తర్వాత తెలంగాణ బీజేపీపై రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేస్తూ రెబల్గా మారే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడినా, పార్టీకి కట్టుబడి ఉండకపోతే వారిపై చర్యలు తప్పవని ఇటీవల హైకమాండ్, స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దమ్ముంటే సస్పెండ్ చేయాల్సిందిగా సవాల్ విసురుతూ ఎమ్మెల్యే ప్రెస్నోట్ విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న హైకమాండ్.. ఏ క్షణమైనా రాజాసింగ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.. దమ్ముంటే సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్ దమ్ముంటే బీజేపీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పారీ్టలో దొంగలంతా ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జరిగితే మీ అందరి బాగోతాలు బయటపెడతానంటూ హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆయన తీరును నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై రాజాసింగ్ స్పందిస్తూ నోటీసులు ఇవ్వనీ పారీ్టకి ఎవరు నష్టం చస్తున్నారో బయటపెడతా, ఇంటి దొంగలంతా ఒక్కటై బీజేపీని బీఆర్ఎస్ నాయకలకు తాకట్టు పెడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పార్టీని బీఆర్ఎస్కు పారీ్టకి తాకట్టు పెడతారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ఈ విమర్శలు పారీ్టలో దుమారం రేపుతున్నాయి. -
ఆర్సీబీకి హృదయపూర్వక శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: అభిమానుల పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టీం ఐపీఎల్ కప్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్సీబీ, కోహ్లీ అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ విజయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆ జట్టు ట్రోఫీని ఎత్తిన ఫొటోతో తన సందేశం ఉంచారు. Heartfelt congratulations to #RCB on creating history in #IPL2025! A long awaited moment for millions of fans across the world. pic.twitter.com/CeDobHFMoK— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 -
రెడ్బుక్ వత్తాసు.. అదుపు తప్పిన ‘పోలీసు’
రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సాక్షాత్తు కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. మద్యం విక్రయాలు మొదలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తున్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి, పోలీసులకింత, ఎమ్మెల్యేకు ఇంత, చంద్రబాబుకు ఇంత, లోకేశ్కు ఇంత అని పంపకాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది.ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు దగ్గర డబ్బులు తీసుకుని అనధికారికంగా పర్మిట్ రూములకు అనుమతిస్తున్నారు. ప్రతి పర్మిట్ రూమ్, ప్రతి బెల్ట్ షాపు నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మట్టి, సిలికా, క్వార్ట్జ్ , ల్యాటరైట్.. ఇలా ఏ వనరునూ వదలకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది. పోలీసులను దొంగల ముఠాలో భాగస్తులుగా చేసి వారిని వాడుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా?గొడవల వల్ల కేసులుండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది తప్పు.. ఏది న్యాయం.. అనేది నాకు తెలియదు. నేను వాటిని వెనకేసుకు రావడం లేదు. కానీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలుగా మారిపోకూడదని మాత్రం గట్టిగా చెబుతున్నా. మీరు ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది చూసి తీర్పు ఇస్తుంది. అప్పటి వరకు కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయిలు కారు. కేసులున్నాయనే కారణంతో వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, దారుణంగా కొట్టి, వారి కుటుంబాన్ని, వారి పరువు ప్రతిష్టలను మంటగలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? అలాగైతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా 24 కేసులున్నాయని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారా? అలా చేస్తే అది ధర్మమేనా?-వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ఎవరి మీదైనా కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడిరోడ్డు మీద హింసించే అధికారం పోలీసులకు ఎక్కడిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై ముగ్గురు యువకులను అరికాళ్లపై కొడుతూ హింసించిన ఘటనకు సంబంధించి బాధిత యువకుల కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల్లో చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను ఏ రకంగా దుర్వినియోగం చేస్తోందో కనిపిస్తోందన్నారు. ఆయనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే, ఆ గొంతు నొక్కేందుకు చంద్రబాబు దగ్గరుండి వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇంకా వారిని జైళ్లకు పంపడంతో పాటు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అసలేం జరిగిందంటే.. ⇒ పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరిముల్లాలు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వారు. రాకేష్ తెనాలిలో ఉండడు. పాలిటెక్నిక్ చదివిన అతను హైదరాబాద్లో జొమాటో కంపెనీలో పని చేస్తున్నాడు. వీళ్లంతా యువకులు. చిన్నతనంలో ఏదో పాత కేసు వాయిదా కోసం రాకేష్ తెనాలి వచ్చాడు. అతన్ని చూడటానికి అతని స్నేహితుడు జాన్ విక్టర్ మంగళగిరి నుంచి వచ్చాడు. అతను జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయ్యాడు. విక్టర్ వెంట అతని స్నేహితుడు మెకానిక్ అయిన కరీముల్లా కూడా వచ్చాడు. ⇒ ఈ ముగ్గురూ కలిసే సమయానికి ఇదే ఐతా నగర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సివిల్ డ్రెస్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దీంతో వారు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అదే వారు చేసిన తప్పు. ఆ ప్రయత్నంలో చిన్న వాగ్వాదం జరగ్గా, జాన్విక్టర్ బైక్తో పాటు, అతడి మొబైల్ను సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. వాటినెందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించి ఆ కానిస్టేబుల్ నుంచి బైక్ కీ, మొబైల్ వెనక్కు తీసుకుని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాకేష్ తన ఇంటికి వెళ్లిపోగా, మిత్రుడు కరీముల్లాతో కలిసి జాన్ విక్టర్ మంగళగిరి వెళ్లారు. ఇది జరిగింది ఏప్రిల్ 24న. ⇒ ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 25న తన సహచరులైన కొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లిన ఆ కానిస్టేబుల్.. జూనియర్ అడ్వకేట్ అయిన జాన్విక్టర్తో పాటు, అతడి స్నేహితుడు కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారు. రాకేష్ను కూడా తీసుకొచ్చి ఆ రాత్రంతా తెనాలి టూ టౌన్ పీఎస్లో ఉంచి తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 26న ముగ్గురినీ స్టేషన్కు దగ్గరలో ఉన్న రోడ్డుపైకి తీసుకొచ్చి బహిరంగంగా అరికాళ్లపై దారుణంగా కొట్టారు. రోడ్డు మీద షేమింగ్ చేస్తూ, వారి పరువు, ప్రతిష్టతో ఆడుకుంటూ తెనాలి టూ టౌన్సీఐతో పాటు, మరో సీఐ వారిని లాఠీలతో అరికాళ్లపై చితకబాదారు. (ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాకు చూపారు) ⇒ అంతటితో ఊర్కోక, ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 27న కూడా మరో రోడ్ సెంటర్కు తీసుకెళ్లి కిరాతకంగా కొట్టారు. అలా మూడు రోజులు చట్టవిరుద్ధంగా వారిని అదుపులో ఉంచుకోవడమే కాకుండా, విక్టర్ జేబులో ఒక కత్తి పెట్టి ఇద్దరు వీఆర్వోలను పిలిపించి.. అతడి జేబులో మారణాయుధం ఉన్నట్లు పంచనామా రాయించారు. ఆ మర్నాడు, ఏప్రిల్ 28న వారిని కోర్టులో హాజరు పర్చారు. పోలీసుల దెబ్బలకు వారి కాళ్లు బొబ్బలెక్కినా, వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవడమే కాకుండా, న్యాయమూర్తి ఎదుట నోరు విప్పితే, ఆ తర్వాత స్టేషషన్కు తీసుకెళ్లి, ప్రైవేట్ పార్టులకు కరెంట్ షాక్ ఇస్తామని బెదిరించారు.ఈ ప్రశ్నలకు బదులేది?⇒ ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? పోలీసులు తమను దారుణంగా హింసించారని, తమ ఒంటిపై గాయాలున్నాయని ఆ ముగ్గురూ వాటిని చూపినా, ఆస్పత్రిలో వైద్యుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటిని ఎందుకు నోట్ చేయలేదు? ఎందుకంటే అది మెడికో లీగల్ కేసు అవుతుందన్న భయం. అలాగే పోలీసులు డాక్టర్ను బెదిరించి అయినా ఉండాలి. లేదా ప్రలోభాలకు గురి చేసైనా ఉండాలి. ⇒ ఏప్రిల్ 26న ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదితే, నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకొచ్చింది. నిజానికి ఆ వీడియోను రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను జీరి్ణంచుకోలేక మంచి వారైన కొందరు పోలీసులు ఈ వీడియోను బయటపెట్టారు. ముగ్గురు యువకులను అంత దారుణంగా హింసించిన పోలీసులు, తమ చర్యలను సమర్థించుకోవడం కోసం వారిని సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.అన్ని వ్యవస్థలూ నాశనం⇒ లా అండ్ ఆర్డర్ కుప్పకూలిన పరిస్థితుల మధ్య.. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య.. స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. ఏడాది గడిచిపోయింది. స్కూళ్లను పట్టించుకోవడం లేదు. విద్యా రంగం పూర్తిగా నాశనమైపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్ల బిల్లు అవుతుంది. ఏడాదిగా ఆ మొత్తం ఇవ్వక పోవడంతో రూ.3,600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పేదలు ఆరోగ్యశ్రీ కింద ఆ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుకునే పరిస్థితి లేదు. ⇒ మరోవైపు వ్యవసాయం కూడా దిగజారిపోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఈ–క్రాప్ నాశనం అయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.అందుకే ‘వెన్నుపోటు దినం’ ⇒ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ను గాలికొదిలేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా బుధవారం (నేడు) రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని మరోసారి పిలుపునిస్తున్నా. ⇒ ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలిసి రావాలని కోరుకుంటున్నా. ⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.పలకరించిన వారే లేరు.. జగన్ భరోసా ఇచ్చారుమా అబ్బాయి బాబులాల్ అలియాస్ కరిముల్లా మంగళగిరిలో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడితో కలసి తెనాలి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఈ విధంగా కొట్టారని తెలిసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు పలకరించ లేదు. వైఎస్ జగన్ ఒక్కరే పలకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.– షేక్ అమీర్బాషా, రాంతున్ (బాబులాల్ తల్లిదండ్రులు) బాధలో ఉన్న మాకు ధైర్యం చెప్పారు మా అబ్బాయి రాకేష్కు ప్రమాదంలో కాలు విరిగితే డాక్టర్లు రాడ్ వేశారు. కాలులో రాడ్ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వీడియో చూసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. కాలుకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? బాధలో ఉన్న మాకు జగన్ ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. – దోమ వాసు, మాధవి (రాకేష్ తల్లిదండ్రులు)పాత కేసులకూ, ఆ ఘటనకూ ఏం సంబంధం?⇒ ఆ ముగ్గురు యువకులపై పాత కేసులున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఆ కేసులకూ, ఈ ఘటనకూ ఏం సంబంధం? అంత దారుణంగా వారిని నడిరోడ్డు మీద హింసించాలా? నేను ఆ ముగ్గురు యువకులను వెనకేసుకు రావడం లేదు. అలా వారిని అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై అంతలా హింసించడం ఎంత వరకు సబబు? కేసులుంటే కోర్టు చూసుకుంటుంది. కానీ, శిక్షించడానికి పోలీసులకు ఏం అధికారం, హక్కు ఉన్నాయి? అసలు శిక్షించడానికి పోలీసులు ఎవరు? ⇒ జరిగిన సంఘటనలను ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హననం చేస్తున్న పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా. జాన్విక్టర్ జూనియర్ అడ్వకేట్ కాదా? రాకేష్ చెల్లెలు ఇంజనీర్ (ఆమెను చూపుతూ). రాకేష్ పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివాడు. అంటే వారిది చదువుకున్న కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి, కొట్టి పరువు తీయడం ధర్మమేనా? ఒకవేళ పోలీసులు చెబుతున్నట్లు వారికి అంత దారుణమైన బ్యాక్ గ్రౌండ్ ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవమే అయితే.. మంగళగిరికి చెందిన వారిని, తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? దాని అర్థం ఏమిటి? అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే అని కదా? అలాగే వారిపై నమోదైన కేసులు పెద్దవి కాదనే కదా అర్థం?ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్స్ ⇒ కరీముల్లాపై కూడా గతంలో ఎలాంటి కేసులు లేవు. కానీ అతడని కూడా దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ ఇష్యూ పెద్దదవుతుందని తెలిసిన తర్వాత జాన్విక్టర్, రాకేష్ మీద రౌడీ షీటర్లుగా కేసు ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. వారిని పరామర్శించి, జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ, వారికి సంఘీభావం చెప్పడానికి ఎవరొచ్చినా.. సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా, వారి సోషల్ మీడియా ఇష్టానుసారం దు్రష్పచారం చేస్తోంది. వారిది గంజాయి బ్యాచ్ అని, వారంతా రౌడీ షీటర్లు అంటూ ఆ కుటుంబాల పరువు తీస్తున్నారు. ⇒ కేసుల మీద అంతిమంగా తేల్చాల్సింది కోర్టులు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతున్నా.. పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తారు. ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా? అని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో దొంగ పోస్టులు పెట్టే తీరు అయితేనేం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు అయితేనేం.. వాటి మీదా కేసులున్నాయి. చంద్రబాబు మీద ఏకంగా 24 కేసులున్నాయి. అలా అని ఆయన్ను కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా? అదే చేస్తే అది ధర్మమేనా అని అడుగుతున్నా.అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాల పరువు తీస్తారా? ⇒ పాత కేసులు ఉన్నాయని తీసుకొచ్చి కొట్టడం పోలీసులు చేసిన పనికి సమర్థింపు కానే కాదు. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణలు చేశారు. అది న్యాయం కాదని అవతలి వారు కోర్టుల్లో వాదిస్తారు. న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు వింటారు. ఆ తర్వాత తీర్పునిస్తారు. అంతే కానీ, గతంలో వారిపై కేసులు ఉన్నాయి కదా అని, పోలీసులు వారిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్ చేస్తూ వారి కుటుంబ పరువు తీయడం భావ్యమేనా? ⇒ ఇది రాకేష్ అనే యువకుడి కాలికి తీసిన ఎక్స్రే. అతడి కాలు విరిగితే ఆపరేషషన్ చేసి లోపల రాడ్ వేశారు. ఆ విషయం మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. పైగా, ఒక సీఐ తన బూటుకాలితో రాకేష్ కాలును అదిమిపడితే, మరో సీఐ అతడి అరికాళ్లపై లాఠీతో చితకబాదారు. ఇది ఏ మాత్రమైనా ధర్మమేనా?⇒ ఈ పాప రాకేష్ చెల్లెలు. పెళ్లి కావాల్సిన పాప. వీరి పరువు తీశారు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుని బతికే రాకేష్ను ఇలా హింసించి, కేసులు పెట్టి వేధించి, ఆ కుటుంబంతో ఆడుకోవడం ధర్మమేనా? విక్టర్ జూనియర్ అడ్వకేట్. విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీరే. విక్టర్ వాళ్ల నాన్న ప్రజాశక్తి అనే పేపర్లో మాజీ రిపోర్టర్. ఒక మాజీ జర్నలిస్ట్ కొడుకు పరిస్థితి ఇది. ఇది ధర్మమేనా అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి.పోలీస్ రాజ్యం.. హింసాకాండ⇒ ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే యువకుడిపై తప్పుడు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్లో పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామçÜ్తులు వచ్చి ఆందోళన చేసి అతడిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హరికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లతో దొంగ సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. కానీ హరికృష్ణ ఇప్పటికీ నడవలేని స్థితిలోనే ఉన్నాడు. ⇒ రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్, దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. వీరు పోలీసులా.. రాక్షసులా? అని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అతడిని హింసించారు. చివరకు మహిళలు అని కూడా చూడకుండా వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లు సుధారాణి, కృష్ణవేణి మీద పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి నెలల తరబడి తిప్పుతూ వేధించారు. ఇవన్నీ చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రజలంతా ఆలోచన చేయాలి.జగన్ పర్యటనలో భద్రత లోపాలుచింతలపూడి చెక్పోస్టు నుంచే ఆటంకాలుట్రాఫిక్ నియంత్రించకుండా పోలీసుల నిర్లక్ష్యంటీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లతో వచ్చినా అడ్డుకోని వైనంకనీసం వాహనం కూడా దిగని కాన్వాయ్ పోలీసులువైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మంగళవారం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో పోలీసులు పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. జగన్ పర్యటనకు భారీగా జనం వస్తారని తెలిసినా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. కొంత మంది పోలీసులను కేటాయించినా, వారు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. తెనాలి వచ్చేటప్పుడు చింతలపూడి చెక్పోస్టు నుంచి జగన్ కాన్వాయ్కి ఆటంకాలు మొదలయ్యాయి. జగన్ కాన్వాయ్ వస్తుందని తెలిసినా, ఎదురుగా వచ్చే వాహనాలను ఏ మాత్రం దారి మళ్లించలేదు. దీంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి ఆలస్యం అయ్యింది. పట్టణంలోకి అడుగు పెట్టాక కూడా కనీసం రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకులు జగన్ పర్యటనను అడ్డుకుంటామని ముందు రోజే ప్రకటించినా, వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. జగన్ వస్తున్న మార్గంలో వారు నల్ల బెలూన్లతో వచ్చినా అదుపు చేయకుండా చోద్యం చూశారు. వైఎస్ జగన్ వాహనాన్ని చుట్టుముట్టిన జనం.. కానరాని పోలీసులు ఓ దశలో వారు జగన్ కాన్వాయ్కి అడ్డం పడే ప్రయత్నం చేశారు. తమ చేతిలో హింసకు గురైన వారిని పరామర్శించడానికి వస్తున్నారన్న కారణంతోనే పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఐతా నగర్లో దోమా రాకేష్ ఇంటి వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. రోడ్డుపై నుంచి ఇరుకు సందులో ఉన్న రాకేష్ ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు, జగన్ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరిద్దరు అధికారులు తప్ప పోలీసు సిబ్బంది కనపడలేదు. జగన్ కాన్వాయ్లో వచ్చిన పోలీసులు కనీసం వ్యాన్ కూడా దిగలేదు. దీన్ని బట్టి కావాలనే జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పర్యటన సమాచారం ముందుగానే జిల్లా ఎస్పీకి అందించినా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. -
దారి పొడవునా అధినేతకు నీరాజనం
మంగళగిరి టౌన్/దుగ్గిరాల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు, అభిమానులు నీరాజనం పలికారు. పువ్వులు చల్లి ఘన స్వాగతం పలికారు. జై జగన్.. అంటూ నినదించారు. తెనాలిలో ఇటీవల పోలీసులు నడిరోడ్డుపై యువకులను చితకబాదిన సంగతి విదితమే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జాన్ విక్టర్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తాడేపల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం ఉదయం తెనాలికి వైఎస్ జగన్ బయలుదేరారు. ఈ క్రమంలో తెనాలి చేరుకునే వరకు ప్రతి ఊరు, ప్రతి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చిన్నారులు, మహిళలు రోడ్డుపై వేచి చూశారు. నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి భరతమాత సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఇతర నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం కుంచనపల్లి ప్రాతూరు అండర్ పాస్ వద్ద వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, మాజీ అధ్యక్షులు పాటి బండ్ల కృష్ణమూర్తి, మిరియాల రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు కలకోటి సునీల్ తదితరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట బైక్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి రోడ్డులో వైఎస్సార్సీపీ పట్టణ, రూరల్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బీసీ సెల్ నాయకులు కుంచాల కిషోర్ తదితరులు స్వాగతం పలికారు. మంగళగిరి నుంచి తెనాలి వెళ్లే మార్గంలో పెదవడ్లపూడి పైవంతెన వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని పూలవర్షం కురిపించారు. వైఎస్ జగన్ తన కాన్వాయ్ను ఆపి, ప్రజలకు అభివాదం చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడకు చేరుకుని వైఎస్ జగన్తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. తనకోసం వచ్చిన వారందరినీ నవ్వుతూ పలకరించిన ఆయన.. అందరితో కరచాలనం చేశారు. తర్వాత అక్కడి నుంచి ముందుకు కదిలారు. దుగ్గిరాల మండల పరిధిలో మోరంపూడి సర్పంచ్ ఇత్తడి రమేష్, ఇతర గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దుగ్గిరాల లాకుల వద్ద మండల అధ్యక్షులు శివగోపయ్య, పెరికలపూడి సర్పంచ్ గంపల గంగాధర్, సీనియర్ నాయకులు తిమోతి, నాగేశ్వరరావు, రామకోటిరెడ్డి తదితర నాయకులు వైఎస్ జగన్ రాకకోసం వేచి చూశారు. తమ అభిమానాన్ని చాటేందుకు పెద్ద ఎత్తున పూలతో ఘన స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో జనం తరలి రావడంతో ఆ కూడలి నుంచి బయటకు రావడానికి వైఎస్ జగన్కు కొన్ని నిమిషాలు సమయం పట్టింది. కార్యకర్తల కోసం కాన్వాయ్ ఆపి మరీ వైఎస్ జగన్ అభివాదం చేయడంతో వారందరూ ఆనందోత్సాహంతో కేరింతలు కొట్టారు. సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు బైక్ ర్యాలీలు, కార్లలో, పలు, ఇతర వాహనాలలో అనుసరించగా.. దుగ్గిరాల నుంచి తెనాలికి జన సందోహం నడుమ వైఎస్ జగన్ వెళ్లారు. -
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లైంగికదాడి తర్వాత హత్య చేసి, ఆభరణాలు చోరీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... పట్టణ ముత్తెంశెట్టిపాలెం తూర్పు కాల్వ కట్ట రోడ్డులో కబేళా వంతెన నుంచి వైకుఠపురం వెళ్లే మార్గంలో అయ్యప్పస్వామి గుడి పక్కనే తాడిపత్రి మల్లీశ్వరి (60) ఒంటరిగా నివసిస్తోంది. టిఫిన్ బండి, టీ స్టాల్, కూల్డ్రింక్ దుకాణం నిర్వహిస్తోంది. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి టిఫిన్ బండి పనులను ప్రారంభిస్తుంటుంది. అదే సమయంలో టీ కూడా విక్రయించడంతో ఉదయాన్నే అక్కడి వారు టీ తాగేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వచ్చిన వారు మల్లీశ్వరి బయటకు రాలేదని, ఇంటి కిటికీ నుంచి చూశారు. ఇంకా మంచంపైనే ఉంది. పిలిచినా స్పందన లేకపోవడంతో ఇదే ప్రాంతంలో నివసించే ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి చూడగా మల్లీశ్వరి మృతి చెంది ఉన్నట్టు గుర్తించింది.మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు, బీరువాలోని నగలు చోరీకి గురైనట్టు తెలిసింది. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ వి. మల్లికార్జునరావు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు.మృతిపై అనేక అనుమానాలు..మల్లీశ్వరి మృతిపై స్థానికుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపునకు బయట గడి పెట్టి ఉండడం, విగతజీవిగా పడి ఉన్నప్పుడు శరీరంపై దుస్తులు సరిగా లేకపోవడం, ఆభరణాలు మాయమవడంతో ఆమైపె లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం ఆభరణాలు, నగదు దోచుకెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మల్లీశ్వరిది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీఐ తెలిపారు. -
రూ.51 కోట్లతో అభివృద్ధి పనులు
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో సుమారు రూ.51 కోట్లతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ చాంబర్లో జరిగింది. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన 143 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై సభ్యులు, వివిధ విభాగాధిపతులతో చర్చించి, ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర శివారు, నగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలలో రోడ్లు, డ్రైయిన్లు, వీధి దీపాలు, తాగు నీటి పైపులైన్లు ఏర్పాటు వంటి పనులకు ఆమోదం తెలిపామన్నారు. నాజ్ సెంటర్, స్వామి థియేటర్ వద్ద, అడవితక్కెళ్ళపాడులలోని షాపింగ్ కాంప్లెక్స్లలో లీజు గడువు పూర్తయిన షాపులకు నిబంధనల ప్రకారం రెన్యూవల్ చేయడానికి ఆమోదించామన్నారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండటంతో వాటికి శస్త్రచికిత్సలు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా ముగ్గురు పశువుల డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్ సహాయకులను నియమించాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వర రావు, నూకవరపు బాలాజీ, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నగర పాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం పాల్గొన్నారు. ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ -
ఎండీయూ వాహనాల ఆపరేటర్ల ప్లకార్డుల ప్రదర్శన
తెనాలి: ఎండీయూ వాహనాల ఆపరేటర్లు తమకు న్యాయం జరిపించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాల ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోశాధికారి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆపరేటర్లు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను తెలియజేసే ప్లకార్డులతో సహా అయితానగర్కు చేరుకున్నారు. ఆయనకు వినతిపత్రం అందజేసి, తమ గోడును విన్నవించుకోవాలని ఆశించారు. కిక్కిరిసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మాజీ సీఎం కాన్వాయ్ను అనుసరించటంతో సాధ్యపడలేదు. దీనితో స్థానిక లింగారావు సెంటర్లో కారులోంచి బయకొచ్చి అభివాదం చేస్తున్న మాజీ సీఎం దగ్గరకు ప్లకార్డును తీసుకెళ్లారు. ప్లకార్డును పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లకార్డును తన చేతికి తీసుకుని ప్రదర్శించారు. అయితానగర్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో అక్కడ జనంలోనూ ఈ ప్లకార్డులను ప్రదర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటామని ఆపరేటర్లు చెప్పారు. -
బాలికపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు
లక్ష్మీపురం: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏటీ అగ్రహారం పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు కలిగాక మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. మొబైల్ షాపులో పని చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తున్నారు. మస్తాన్కు రెండో వివాహం చేయాలని ఆయన కుటుంబసభ్యులు సిద్ధం అయ్యారు. దీంతో ఆమె నిలదీయడంతో ఒంటరిగా వదిలేశాడు. ఇటీవల ఆమె కుమార్తె (8) నిద్రలో ఉలిక్కి పడటం, ఏడవడం వంటివి చేస్తుండటంతో ఏమైందని తల్లి ఆరా తీసింది. మస్తాన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు
నగరంపాలెం: స్థానిక కొత్తపేట (పశువుల ఆసుపత్రి)లోని శ్రీజగన్నాథస్వామి వారి దేవస్థానంలో శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారిని పెండ్లి కుమారునిగా, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లను పెండ్లి కుమార్తెగా అలకరించారు. రాత్రి 7 గంటలకు అంకురారోపణ, కలశస్థాపన, ధ్వజారోహణ, విశ్వక్సేన పూజ, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. వారికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈవో టి.సుభద్ర పర్యవేక్షించారు. ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం తెనాలి: తెనాలికి చెందిన కవి, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావు పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. విజయవాడకు చెందిన ‘తెలుగు కళారత్నాలు’ సాంస్కతిక సేవా సంస్థచే సోమవారం అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 10 గంటలపాటు జరిగిన సకల కళాప్రదర్శనలో నాగేశ్వరరావు సాహిత్య ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రం, పతకాన్ని ఏపీ సచివాలయం ఓఎస్డీ డాక్టర్ ప్రభాకర్, విశ్రాంత ఆదాయ పన్ను అధికారి డాక్టర్ పతంగి చెన్నయ్య, ప్రముఖ రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవి సమక్షంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యూవీ రత్నం అందజేశారు. జనాభా నిర్వహణపై క్యూఆర్ కోడ్తో ప్రజాభిప్రాయం నరసరావుపేట: జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈ నెల 1 నుంచి 20వ తేదీ వరకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు జిల్లా అర్ధ గణాంకశాఖ అధికారి మాలతి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం క్యూఆర్ కోడ్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని కుటుంబాల నుంచి జనాభా నిర్వహణ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించాలని ఆదేశించారు. జేసీ సూరజ్ గనోరే, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేడు నాగార్జునసాగర్లో సామూహిక యోగా నరసరావుపేట: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోట, జూన్ 18న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 512.00 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 4,050 క్యూసెక్కులు విడుదల అవుతోంది. చిట్ఫండ్ యజమానికి బెయిల్ మంజూరు గుంటూరు లీగల్: చిట్ ఫండ్ యజమానికి గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పాలడుగు పుల్లారావు సాయిసాధన చిట్ఫండ్ కంపెనీ నడుపుతూ రూ.కోట్లు స్కామ్ చేసి ప్రజలను మోసం చేశారనే అభియోగంపై అరెస్టయ్యారు. దీనిపై నరసరావు పేట–1 టౌన్ సిట్ సీఐడీ వారు కేసు నమోదు చేశారు. ఇరువురి హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
నరనారాన నయవంచన
కూటమి ఏడాది పాలనలో అడుగడుగునా దగా, దౌర్జన్యం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ప్రచారంతో అందరూ నిజమే అనుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన ఉగాది పోయింది... దసరా పోయింది. ప్రయాణానికి పంక్చర్ పడుతూనే ఉంది. అమలైతే జిల్లాలో రోజుకు రూ.30 లక్షల చొప్పున ఏడాదికి రూ.109 కోట్ల మేరకు మహిళలకు లబ్ధి కలుగుతుంది. ఈ ఉచితం ఇవ్వకపోవడం వల్ల ఈ మేర జిల్లాకు చెందిన మహిళలు నష్టపోయారు. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అంతా ‘గ్యాస్’ అని తేలిపోయింది. చాలా మందికి తొలి విడత సబ్సిడీనే పడలేదు. రాయితీ డబ్బులు ముందుగానే ఖాతాలకు జమ చేస్తామని డప్పులు కొడుతున్నారు. జిల్లాలో 56 ఏజెన్సీల పరిధిలో 7,55,000 కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి 187.43 కోట్ల వరకు లబ్ధిదారులకు అందాలి. కానీ అమలు నామమాత్రంగానే ఉంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు, ప్రత్తిపాడు: కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటంటే ఒక్కటీ ఏడాది గడిచినా అమలు కాలేదు. తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15,000 ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతీ ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3000 భృతి అందజేస్తామన్నారు. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు. అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ జూన్ నుంచే అమలు చేస్తామన్నారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ‘‘మనం హామీలిచ్చాం. సూపర్ సిక్స్ చెప్పాం. చూస్తే భయమేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’ అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. 19 – 59 ఏళ్ల వారికని చెప్పినా అతీగతీ లేదు. ఈ పథకం కింద జిల్లాలో 7,28,391 మందికి అర్హత ఉన్నట్లు అంచనా. ఇప్పటికే అక్షరాలా రూ.1311.10 కోట్లు వీరికి అందాలి. ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదు.అతివలకు ఉచిత బస్.. తుస్ఉచిత సిలిండర్ల అమలు ‘గ్యాసే’ఎన్నికల హామీలుమహిళలకు సాయం హుళక్కే -
మోసానికి ప్రతిరూపం చంద్రబాబు
పట్నంబజారు: మోసానికి నిలువెత్తు ప్రతిరూపం ఏదైనా ఉంది అంటే.. అది చంద్రబాబే. ప్రజలను నమ్మించి.. వంచించటం ఆయనకు కొత్త ఏమీ కాదు. ఎన్నికల సమయంలో నోటికి వచ్చినట్లు హామీలు గుప్పించి... తీరా గెలిచిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. అధికారం కోసం ఎంతటి దుర్మార్గానికి వెనకాడని వ్యక్తి చంద్రబాబు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ అంటూ అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. ఏడాది పాలన అంతా వంచన జరిగిన క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – షేక్ నూరిఫాతిమా, వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు కూటమిది మోసపు పాలన పొన్నూరు: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వం పనితీరుకు నిరసనగా బుధవారం పొన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఉదయం 10 గంటలకు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నాం. తహసీల్దారు కార్యాలయం వరకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందిస్తాం. నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలి. – అంబటి మురళీకృష్ణ, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త -
ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి: వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా తయారైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తెనాలి ఘటన సహా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇవాళ తెనాలిలో తన పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు.‘‘తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. వారిలో ఒకరు జూనియర్ అడ్వకేట్, మరొకరు పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్, మూడో యువకుడు మెకానిక్. ఒకరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా, మిగతా ఇద్దరూ మంగళగిరికి చెందినవారు. మంగళలగిరికి చెందిన యువకులను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు...ఆ యువకులను తీవ్రంగా గాయపరచటమే కాకుండా దారుణంగా అవమానపరిచారు. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేశారంటూ కేసు పెట్టారు. ఈ కేసు తర్వాతనే వారిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాల రాయటమే’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అదే తెనాలిలో ఒక మార్వాడీ యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఒక ఇంట్లోకి చొరపబడి మహిళపై దాడి చేశాడు. వారి అనుమతి లేకుండా సీసీటీవీ పుటేజీ తీసుకెళ్లారు. అదేమని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనుషులు కిడ్నాప్ చేస్తే సరైన చర్యలే తీసుకోలేదు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Today, I visited Tenali and raised a serious concern about the growing high-handedness of the police under the @ncbn Garu-led government.In Tenali, three Dalit and minority youths were brutally assaulted by the police without any legal basis—one a junior advocate, another a… pic.twitter.com/vuvKiJidBn— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2025 -
కుంజా రజితకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: భారత అథ్లెట్ కుంజా రజిత(Kunja Rajitha)కి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 4x400 రిలేలో ఆమె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని తన సందేశంలో ఆకాంక్షించారాయన.Congratulations to Kunja Rajitha for winning gold in women’s 4x400 relay at the 26th Asian Athletics Championships held in Gumi, South Korea. This gem of an athlete from Ramachandrapuram (V) in Alluri Sitarama Raju Dist. is a pride of our state. Wishing her all the success in… pic.twitter.com/hC2ZRw5ORo— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2025 -
కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని.. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. నడిరోడ్డులో యువకులపై పోలీసుల థర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతీ వర్గానికి సంక్షేమం అందింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)లో ప్రతి వ్యవస్థ నీరుగారింది. ఫీజురీయింబర్స్మెంట్ కింద 3,600 కోట్ల రూపాయిలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాళా తీసింది. రైతు భరోసా లేదు. ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం(Vennupotu Dinam) నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: ప్రశ్నించడమే ఆ యువకుల తప్పా? -
నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: వైఎస్ జగన్
సాక్షి, తెనాలి: రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని.. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్బుక్తో వేధించి హింసిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్లో జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్. బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉంది. ఐతా నగర్లో సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గోవడ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవపడుతున్న కానిస్టేబుల్ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పీఎస్లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్ 26న ఐతానగర్లో నడిరోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్ సీఐ, మరో పీఎస్ సీఐ కూడా ఉన్నారు. ఇద్దరూ వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద రౌడీషీట్ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతోంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా.. ఎల్లో మీడియా బ్యాచ్ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చు. ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా?. ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా?. పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా?. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని జగన్ ప్రశ్నించారు. -
తెనాలి: వైఎస్ జగన్ భద్రతలో లోపాలు
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. మళ్లీ అదే.. అదే నిర్లక్ష్యం వహిస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగా వ్యవహరించింది. భారీగా జనసందోహం వస్తారని తెలిసి కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం.. అరకోర సిబ్బందిని కేటాయించినా వాళ్లు పట్టిపట్టనట్లుగా వ్యవహారించడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది.పోలీసుల చేతిలో హింసకు గురైన బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ తెనాలి వెళ్లారు. మార్గమధ్యంలో.. చింతలపూడి చెక్ పోస్టు నుంచి జగన్ కాన్వాయ్కు ఆటంకాలు కలిగాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను పోలీసులు కావాలనే నిలవరించలేదని స్పష్టమైంది. ఇక.. తెనాలిలోకి ఎంటరయ్యాక కూడా రోప్ పార్టీ కనిపించలేదు. దీంతో కార్యకర్తలే జగన్ వాహనానికి రక్షణగా నిలిచి ముందుకు తీసుకెళ్లారు. చివరకు ఐతా నగర్లోని జాన్ విక్టర్ ఇంటి వద్దకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. మరోవైపు.. జగన్ వచ్చేదాకా కూడా ఆ ఇంటి వద్ద ఒక్క పోలీసు సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు.. జగన్ తెనాలి పర్యటనలో భద్రతాలోపాలపై వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వం, పోలీసులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తెనాలి: జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. అక్కడి పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫొటోలు, ఆస్పత్రి రిపోర్టులతో జగన్కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా.. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకు ముందు..జగన్ రాక సందర్భంగా తెనాలిలో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా.. ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది.తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు.అన్నం పెట్టకుండా హింసించారుతమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. ‘‘పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు. అరెస్ట్ చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్గా కొడతారా?. అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా?. స్టేషన్కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
అరాచకం ఖాకీచకం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగానికి గుంటూరు జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. రెడ్బుక్ను ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే జిల్లా కావడంతో పోలీసులు మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పలు పాత కేసులు తిరగదోడి వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు అడ్డులేకుండా పోయింది. తెనాలి పోలీసులు ఒక కేసులో నిందితులకు నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చి తమ ప్రతాపం చూపించారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎస్సీ కమిషన్ వివరణ అడిగినా బాధ్యులను ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.అక్రమ కేసులు వైఎస్సార్సీపీలో చురుగ్గా ఉండే నేతలను టార్గెట్ చేశారు. పెదనందిపాడు మండలం వరగానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త ముల్లమూరి హరిప్రసాద్ (నాని)పై టీడీపీ నేతలు దాడిచేసి హత్య చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్పై అక్రమంగా 12 కేసులు పెట్టి జైలులో పెట్టారు. బెయిల్పై విడుదలైన తర్వాత మళ్లీ హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ పార్లమెంట్ ఇనన్చార్జి దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో పాటు మరో 42 మందిపై కేసులు నమోదు చేశారు. దుగ్గిరాల మండలంలో కౌంటింగ్ రోజు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దాడి చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే సమయంలో ఓ వ్యక్తి గాయాల పాలై మృతి చెందగా, ఈ కేసులో సోషల్ మీడియా కార్యకర్త కరీమ్తో పాటు జెడ్పీటీసీ భర్త వీరయ్యతో పాటు జాన్సన్, మరో 20 మందిపై హత్య కేసు నమోదు చేశారు. తాజాగా వీరయ్యపై మరో మూడు కేసులు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగా బండితో గుద్దడంతో వెంకటరెడ్డి మృతి చెందగా, వైఎస్సార్ సీపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారు. దానికి ప్రతీకారంగా ఎన్నికలైన ఆరు నెలల తరువాత వైఎస్సార్ సీపీ నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, జక్కిరెడ్డి కృష్ణారెడ్డి, మేకా వెంకటరామిరెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.సోషల్ మీడియా రాష్ట్ర కో–ఆర్డినేటర్ మేకా వెంకటరామిరెడ్డిపై 18 కేసులు నమోదు చేశారు. మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిపై ఒక కేసు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పరిధిలో జరిగిన చిన్న గొడవలను ఆసరాగా 10 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, అప్పటి వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడిగా పదవి వచ్చిన సమయంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కూటమి నేతలు వీఆర్ఓ చేత అక్రమ ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. తాడికొండ మండలం కంతేరు గ్రామంలో రాజకీయ కక్షతో ఎంపీటీసీ, దళిత మహిళ వలపర్ల కల్పనపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కంతేరు గ్రామానికి చెందిన జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన కళ్లం హరికృష్ణారెడ్డిపై కూడా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించారు. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో దళితులపై దాడులు నిర్వహించి ఇబ్బందులకు గురి చేయడంతో గ్రామంలో 20 మంది ఎస్సీలు గ్రామంలో లేకుండా వేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికీ వారు గ్రామానికి రాలేదు. ఫిరంగిపురం మండలం గరుడాచలం పాలెంలో ఎన్నికల అనంతరం కూటమి నేతలు దళితులపై దాడులు చేసి ఎదురు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో అగ్రవర్ణాలు కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తమకు రహదారి సౌకర్యం కోసం చర్చి ప్రహరీని వందలాది మంది పోలీసులను మోహరింప చేసి కూల్చి వేశారు. ఎదురించిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. వైఎస్సార్ సీపీ వట్టిచెరుకూరు మండలం మండల కన్వీనర్ మన్నవ వీర నారాయణపై అక్రమంగా కూటమి నేతలు కేసులు నమోదు చేశారు.బెదిరించి.. ఆత్మహత్యకు పురిగొల్పి బంగారం షాపులో పనిచేసే వ్యక్తి బంగారంతో పరారు అయ్యాడన్న కేసులో, తెనాలిలో బంగారం బట్టీ నిర్వహించే సిద్దేశ్ అనే వ్యక్తిని పోలీసు స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో మాట్లాడటంతో అదేరోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక కేసులో రిసీవర్గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పోలీసు మాన్యువల్ ప్రకారం పోస్టుమార్టం చేయించాలి. అయితే కుటుంబ సభ్యులు అడిగినందున, ఫిర్యాదు ఏమీ లేనందున పోస్టుమార్టం చేయించలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ కేసు తమకు చుట్టుకుంటుందన్న భయంతో సిద్దేశ్ కుటుంబ సభ్యులు, యూనియన్ సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చి మృతదేహాన్ని వారి స్వస్థలానికి ఆఘమేఘాలపై పంపించేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెనాలి పోలీసుల పైశాచిక దాడికి గురైన బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తెనాలి పర్యటనకు వస్తున్నారు. -
సుద్ధపల్లిలో వ్యక్తి దారుణహత్య
చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపధ్యంలో వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన సోమవారం సుద్ధపల్లిలో చోటు చేసుకుంది. చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరి గోపయ్య(35)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చేబ్రోలు సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్ఐ డి.వెంకటకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి తల్లి కొమ్మూరి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.వెంకటకృష్ణ తెలిపారు. మహిళకు ఇద్దరు వ్యక్తులతో ఉన్న వివాహేతర సంబంధం నేపధ్యంలో ఇరువురి మద్య చోటు చేసుకున్న వివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
జెడ్పీలో ఉద్యోగుల బదిలీలు
కౌన్సెలింగ్ ద్వారా 91 మందికి స్థాన చలనం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో 91 మంది ఉద్యోగులు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ వి.జ్యోతిబసు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ ఒక చోట ఐదేళ్లు విధులు నిర్వహించిన వారిని ఇతర ప్రాంతాలకు తప్పనిసరిగా బదిలీ చేస్తున్నామని, ఖాళీగా ఉన్న ప్రాంతాలకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీల్లో భాగంగా ఏడుగురు పరిపాలనాధికారులతో పాటు ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు, 17 మంది జూనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది టైపిస్టులు, ఇద్దరు ల్యాబ్ అసిస్టెంట్లు, 39 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఒక నైట్ వాచ్మెన్ బదిలీ అయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ రాజారత్నం పాల్గొన్నారు. -
ఆత్మరక్షణ కోసం ఆయుధం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతి చిన్న సమస్యని పెద్దదిగా చూడడం, ఆందోళన చెందడం, క్రమశిక్షణ లోపించడం తదితర అంశాలను నేటిచిన్నారుల్లో తరచూ చూస్తుంటాం. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యతనిచ్చి పెద్ద కళాశాలల్లో సీట్లు సాధించాలనే తపన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరు మాత్రం తమ పిల్లల్ని విద్యావంతులుగానూ ఆత్మ రక్షణ విద్యలోనూ మేటిగానూ చూడాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా శిక్షణా శిబిరాల్లో చేర్పించి దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా శిక్షణ పొందిన కొందరు చిన్నారులు పోటీల్లోనూ రాణిస్తున్నారు. గుంటూరు విద్యానగర్లోని కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సుమారు 100 మందికిపైగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత నెల 24 నుంచి 26 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన 5వ అంతర్జాతీయ కర్రసాము పోటీల్లో 9 బంగారు, 5 రజతాలు 3 కాంస్య పతకాలు సాధించి ఔరా అనిపించారు. అకాడమీ కోచ్ కాశీనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణలో రాటుదేలుతున్న వీరు కర్రసాముతోపాటు తైక్వాండాలోనూ విశేషంగా రాణిస్తున్నారు. కర్రసాము, తైక్వాండోల్లో రాణిస్తున్న చిన్నారులు అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట మారుతున్న తల్లిదండ్రుల ఆలోచన ధోరణి -
ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్ల మనోగతం బెంగళూరు ఐఐఎస్సీలో చేరతాను మా స్వస్థలం గుంటూరు. నాన్న కిషోర్ చౌదరి ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తుండగా, తల్లి పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటర్గా పని చేస్తున్నారు. టెన్త్ ఐసీఎస్ఈ సిలబస్లో 588, ఇంటర్మీడియెట్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్లో 100 పర్సంటైల్తో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకు సాధించాను. తాజా ర్యాంకుతో బెంగళూరు ఐఐఎస్సీలో బీటెక్లో మాఽథమాటిక్స్ ఇన్ కంప్యూటర్లో చేరతాను గుత్తికొండ సాయి మనోజ్ఞ, 152వ ర్యాంకు గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గుంటూరు నగరంలో చదివిన విద్యార్థుల్లో ఆరుగురు అఖిల భారతస్థాయి ఓపెన్ కేటగిరీలో 200 లోపు ర్యాంకులు సాధించారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సోమిశెట్టి వెంకట సాయిచక్రి అఖిల భారతస్థాయి ఓపెన్ కేటగిరీలో 33వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. రాష్ట్రస్థాయిలోనే ఇది అత్యుత్తమ ర్యాంకు. తండ్రి శ్రీరామమూర్తి వ్యాపారం చేస్తుండగా, తల్లి సుజాత గృహిణి. పదవ తరగతి, ఇంటర్ గుంటూరులోని భాష్యంలో చదివిన సాయి చక్రి టెన్త్లో 572, ఇంటర్లో 965 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్లో 99.96 పర్సంటైల్తో 646వ ర్యాంకు కై వసం చేసుకున్న సాయిచక్రి తాజాగా అడ్వాన్స్లో ఓపెన్ కేటగిరీలో 33వ ర్యాంకు సాధించాడు. ముంబై ఐఐటీలో సీఎస్ఈలో చేరతానని చెబుతున్న సాయిచక్రి సైబర్ టెక్నాలజీ రంగంలో నిపుణుడుగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నాడు. సైబర్క్రైమ్లను నివారించే ఆశయంతో ముందుకు వెళ్లాలనే ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు. ముంబై ఐఐటీలో చేరతాను మా స్వస్థలం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం. నాన్న వీరపునాయుడు లారీ ట్రాన్స్పోర్ట్లో పని చేస్తారు. అమ్మ వసంత గృహిణి. ఆరో తరగతి నుంచే గుంటూరులో చదువుతున్నాను. టెన్త్లో 588, ఇంటర్లో 984 మార్కులు సాధించాను. తాజా ర్యాంకు ఆధారంగా ముంబై ఐఐటీలో సీఎస్ఈలో చేరతాను. బీటెక్ తరువాత ఐఏఎస్కు ప్రిపేర్ కావాలనే లక్ష్యంతో ఉన్నాను. – ఎన్. ఆకాష్, 108వ ర్యాంకు పరిశోధనలు చేయాలనే ఆసక్తి మా స్వస్థలం గుంటూరులోని ఏటీ అగ్రహారం. నాన్న భాను కృష్ణారావు లోకో పైలెట్. అమ్మ పద్మజ గృహిణి. తాజా ర్యాంకు ఆధారంగా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మాథమాటిక్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సులో చేరతాను. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాను. – ఎం. శ్రీకర గణేష్, 104వ ర్యాంకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను మా స్వస్థలం సత్తెనపల్లి. నాన్న కోటేశ్వరావు ఇనుమెట్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అమ్మ కోటేశ్వరమ్మ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐఐటీ ముంబైలో సీఎస్ఈలో చేరతాను. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి కలుగుతున్న విఘాతానికి పరిష్కారం చూపేందుకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను. డి.జస్వంత్ బాలాజీ, 151వ ర్యాంకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతాను మా స్వస్థలం గుంటూరు. నాన్న టి.పిచ్చయ్య, విజ్ఞాన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. అమ్మ ఇవాంజిలిన్ విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలు. కంప్యూటర్ సైన్స్కు భిన్నంగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేయాలనే లక్ష్యంతోఉన్నాను. ముంబైలో ఈ.ఈ బ్రాంచ్లో చేరతాను. టి.విక్రమ్ లెవీ, 146వ ర్యాంకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను మా స్వస్థలం సత్తెనపల్లి. నాన్న కోటేశ్వరావు ఇనుమెట్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అమ్మ కోటేశ్వరమ్మ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐఐటీ ముంబైలో సీఎస్ఈలో చేరతాను. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి కలుగుతున్న విఘాతానికి పరిష్కారం చూపేందుకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను. డి.జస్వంత్ బాలాజీ, 151వ ర్యాంకు -
దివ్యాంగులు అన్నిరంగాల్లో పోటీపడాలి
గుంటూరు వెస్ట్: దివ్యాంగులు అన్ని రంగాల్లోనూ పోటీపడాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆరుగురు దివ్యాంగులకు ల్యాప్ట్యాప్లు బహూకరించారు. ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త పాల్గొన్నారు. ఇద్దరికి కారుణ్య నియామకపత్రాలు.. ఇద్దరికి ఆయా శాఖల్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో తాడిశెట్టి ఎస్ఎస్కే కుమార్కు పోలీసు శాఖలోనూ, బుళ్ల శృతికి రెవెన్యూ శాఖలో ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఇన్చార్జి కలెక్టర్ అందజేశారు. కాలుష్య నియంత్రణ సామాజిక బాధ్యత గుంటూరు వెస్ట్: కాలుష్య నియంత్రణను సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లు, గుడ్డ సంచులను ఆవిష్కరించారు. -
ఈ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఆక్రమ కేసులు బనాయించడంతోపాటు అనేక కేసుల్లో థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ క్రూరంగా వ్యవహరిస్తోంది. తెనాలిలో అత్యంత దారుణంగా చట్టాలకు వ్యతిరేకంగా పోలీసులు నడిరోడ్డు మీద నిందితులను కూర్చోబెట్టి థర్డ్డిగ్రీ ప్రయోగించారంటే అది చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమే. హైకోర్టు, సుప్రీంకోర్టు అలాగే మానవ హక్కుల సంఘానికి సంబంధించి సుమోటోగా కేసు రిజిస్ట్రేషన్ చేసి తక్షణమే దాడికి పాల్పడ్డ సీఐలను, వారికి సహకరించిన వారిని సస్పెండ్ చేయాలి. గురజాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎక్కడో హైదరాబాదులో పనిచేసుకుంటూ ఒక ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చిన హరికృష్ణను తెలుగుదేశం పార్టీ నాయకులకు కారులో ఎత్తుకొని వెళ్లి చిత్రహింసలకు గురిచేసి అతని మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడవలేని విధంగా కొట్టినటువంటి సీఐ భాస్కర్ని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ మీద ఆక్రమ కేసులు బనాయిస్తూ పోతున్నారు . ఇప్పటి వరకు 8 కేసులు కేసులు నమోదు చేశారు. పీడీ యాక్ట్ పెడితే దానికి సంబంధించి హైకోర్టుకు వెళితే పీడీ యాక్ట్ను కొట్టి వేసింది. అయినా మళ్లీ దొంగతనం కేసు పెట్టి లోపల పెట్టడం అన్యాయం. ––పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు -
వెన్నుపోటుకు పేటెంట్ చంద్రబాబుదే
గుంటూరు రూరల్: వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఈవిషయంలో పేటెంట్ ఆయనదేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం మండలంలోని ఏటుకూరు బైపాస్ నందున్న వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు తనకు పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా.. ఆదాయాన్ని సృష్టిస్తా అని అబద్దాలు చెప్పి గద్దెనెక్కి నేడు రాష్ట్రంలోని ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచాడన్నారు. సంపద సృష్టి పేరుతో పేదల కష్టం దోపిడీ వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి విద్యుత్ చార్జీలను పెంచి పేదలు, రైతులను వెన్నుపోటు పొడిచాడన్నారు. సంపద సృష్టి పేరుతో గ్రామాల్లో వీధికి నాలుగు బెల్ట్ షాపులను నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులా పారించి పేదల కష్టాన్ని దోచుకుంటున్నాడన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు పేదలు సంతోషంగా ఉంటే నచ్చదని పేదలను అణగదొక్కేందుకు ఎల్లపుడూ చూస్తుంటాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా నేటికి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారన్నారు. దానికితోడు నిత్యం వేల కోట్ల అప్పులు చేసి నేటికి ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ ఈనెల 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని నియోజకవర్గంలోని పాత మల్లాయపాలెం గ్రామంనందున్న దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడినుంచి ర్యాలీగా వెళ్లి ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. పొన్నురు నియోజకవర్గ ఇన్చార్జ్ అంబటి మురళీకృష్ణ, నగర అధ్యక్షురాలు, ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ నూరి ఫాతిమా, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఏటుకూరులో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్ట్
లక్ష్మీపురం: వ్యసనాలకు అలవాటు పడిన భర్తను వదిలి పుట్టింట్లో ఉంటూ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న మహిళను ఆమె భర్త కత్తి పొడిచి గాయాలపాలు చేశాడు. నిందితుడిని పట్టాభిపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోబాల్డ్పేటకు చెందిన మెరిగల రాజేష్, కల్పనకు 2014లో వివాహం అయింది. రాజేష్ పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా రాజేష్ వ్యసనాలకు అలవాటు పడి మద్యం సేవిస్తూ భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక కల్పన ఏడాది క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను పోషించేందుకు చంద్రమౌళినగర్లోని సంస్థలో చిరు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే రాజేష్ మద్యం సేవించి పిల్లలు కావాలంటూ, కాపురానికి రావాలంటూ భార్య పని చేసే ప్రదేశానికి వెళ్లి వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గత నెల 25న రాత్రి ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి వాగ్వివాదానికి దిగిన రాజేష్ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి తీవ్ర గాయాలపాలు చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు కల్పనను హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. సమచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో విచారించి, బాధితురాలు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు. నిందితుడు ఉడాయించడంతో అతనికోసం గాలింపు చేపట్టారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణిలకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి కోబాల్డ్పేట 7వ లైన్లో నిందితుడు ఉన్నట్లు తెలియడంతో మెరిగల రాజేష్ను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతోనూ, డ్వాక్రా రుణాలు ఇప్పిస్తామంటూ మోసగించారని బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల అర్జీలను జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్) స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులకు మొబైల్ ద్వారా బాధితుల సమస్యలను వివరించారు. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ అర్జీలు స్వీకరించారు. పోలీసు పీజీఆర్ఎస్లో బాధితుల మొర ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్పీలు -
వెన్నుపోటు చంద్రబాబుకు అలవాటే..!
నెహ్రూనగర్: వెన్నుపోటు అంటే గుర్తుకువచ్చేది చంద్రబాబే అని నాడు ఎన్టీఆర్ను.. నేడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేసి చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. జూన్ 4న జరగనున్న వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేసేందుకుగాను సోమవారం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సన్నాహక సమావేశం స్థానిక బస్టాండ్ ఎదురుగా గల తూర్పు కార్యాలయంలో జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అధ్యక్షతన వహించారు. అంబటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం అమలుకాని హామీలు ఎన్నో ఇచ్చారన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలనైనా అమలు చేస్తున్నారా.. అంటే వాటిని కూడా నిలిపివేశారన్నారు. జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి చంద్రబాబు మెడలు వంచైనా సరే సంక్షేమ పథకాలను అమలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తెనాలిలో యువకులను పోలీసులు విచక్షణ రహితంగా కొడితే వారిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తుంటే.. గంజాయి, రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తారా అంటూ హోంమంత్రి మాట్లాడటం బాధాకరమన్నారు. చంద్రబాబు హామీలు నీటిమీద రాతలు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ నీటి మీద రాతలేనన్నారు. ఆయన హమీలు ఇచ్చారంటే అమలు కావానే అర్థమన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీకి రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని.. కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. పార్టీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నూరిఫాతిమా మాట్లాడారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్పొరేటర్లు పాల్గొన్నారు. నాడు ఎన్టీఆర్కు..నేడు హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు బాబు మోసాలను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్నేందుకే వెన్నుపోటు దినం కార్యక్రమం ప్రజలంతా పాల్గొని చంద్రబాబు మెడలు వంచైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
‘ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’
తాడేపల్లి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా ఆధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు బుధవారం(జూన్ 4వ తీదీ) చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ రేపు మండల స్థాయిలో కూడా వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ చేయాలి. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం చేయాలి. ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్థానాల ద్వారా అధిగమిద్దాం. నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేయాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైన ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ మీడియాతో మాట్లాడి వివరించాలి. ఎలాంటి శషబిషలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి కాదు.. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలి’ అని సజ్జల పేర్కొన్నారు. -
మహిళపై ‘ఎల్లో’ ఎస్సై రమేష్ బాబు దౌర్జన్యం
ప్రకాశం జిల్లా: కొండెపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు దౌర్జన్యానికి దిగారు. సీసీ ఫుటేజ్ తనిఖీ పేరుతో అనుమతి లేకుండా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న మహిళను ఎస్సై రమేష్ పక్కకి తోసేశాడు. పోలీస్ బృందంతో ఇంట్లో హాల్ చల్ చేశాడు. మాకు సహకరించకపోతే మా విధానమే వేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళను, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి సీసీ కెమెరా డీవీఆర్ ఎత్తుకెళ్లినట్టు ఇంటి యజమాని కొండలరావు ఇవ్వాళ ఎస్పీకి పిర్యాదు చేశారు. -
భారత చెస్ యువ కెరటం గుకేష్కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: నార్వే చెస్ ఛాంపియన్షిప్లో వరల్డ్ చాంపియన్, భారత చెస్ సంచలనం డి గుకేష్.. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్ల్సన్ను ఓడించడంపై గుకేష్కు అభినందనలు తెలిపారు వైఎస్ జగన్. కేవలం 62 మూవ్లతోనే కార్లసన్ను మట్టికరిపించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన వైఎస్ జగన్.. గుకేష్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గుకేష్ గెలిచిన ఆనంద క్షణాల్ని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 👉ఇదీ చదవండి: ప్రపంచ నంబర్ వన్ను ఓడించిన గుకేష్ప్రపంచ చాంపియన్ కార్లసన్తో జరిగిన ఆరో రౌండ్ పోరులో భారత చెస్ యువ కెరటం అనూహ్య విజయాన్ని సాధించాడు. క్లాసికల్ గేమ్లో గుకేష్ కార్ల్సెన్ను ఓడించడం ఇదే మొదటిసారి. దీంతో గుకేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోతే, కార్ల్సన్కు మాత్రం అసహనం కట్టలు తెంచుకుంది. కార్ల్సెన్ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ బల్లపై బలంగా కొట్టాడు. It was enthralling to watch World Champion @DGukesh defeating the Norwegian chess grandmaster, Magnus Carlsen, in 62 moves in Round 6 of the 2025 Norway Chess. Hearty congratulations to this hero! May his prowess reign supreme and bring many more laurels to India.#NorwayChess… pic.twitter.com/TaBZkE97Ew— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025 -
‘టెన్త్ విద్యార్థులకు నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి : మంత్రి నారా లోకేష్ టెన్త్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పడమే కాకుండా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. పదో తరగతి పరీక్ష పత్రాల దిద్దుబాటులో ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. ‘ జరిగిన తపఉకు అంగీకరించకపోగా ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు. పదో తరగతి విద్యార్తుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మార్కులు తక్కువ వేసి వేలాది మంది విద్యార్థులను ఫెయిల్ చేశారు. రీవెరిఫికేషన్ చేయిస్తే ఎంతోమందికి మంచి మార్కులు వచ్చాయి. టెన్త్ క్లాస్ అనేది పిల్లలకు సున్నితమైన దశ. అలాంటి పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రికార్డుల కోసం వారం రోజుల్లోనే పేపర్లు దిద్దాలని చూశారు. కనీసం టీచర్లు సంఖ్యను కూడా పంచకుండా పేపర్లు దిద్దించారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. రీవెరిఫికేషన్ కు తీసుకున్న రూ. 6 కోట్ల ఫీజను వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి తప్పించుకోవాలని చూస్తే సహించలేదు’ అని హెచ్చరించారు. -
బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?
గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్ చేశారాయన. . @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025 -
తెలంగాణ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటే తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ చేశారు.Warm wishes to all the brothers and sisters of Telangana on this momentous #TelanganaFormationDay— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025 -
ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్లను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. రెడ్బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు (Chandrababu) గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఏర్పడే దారుణాలను ఇప్పటికే రాష్ట్రం అంతా చూస్తున్నారని అన్నారు. దీనిపై పౌరసమాజం కూడా గళం విప్పాలని, లేని పక్షంలో సమాజానికే రక్షణం లేకుండా పోతుందని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే... గత ఏడాది ఎన్నికల ఫలితాలు ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి కొనసాగింపుగా పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్లు చేయించడం వంటి రాజ్యహింస ప్రారంభించారు. ముందుగా సోషల్ మీడియా యాక్టివీస్ట్లపై అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ పోలీసుల ద్వారా తప్పుడు కేసులు బనాయించారు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. తరువాత దశలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, ఒక ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ సిద్దం చేయడం, దానికి అనుగుణంగా అరెస్ట్లు, జైళ్ళకు పంపడం చేస్తున్నారు.ఇక మూడోదశలో భాగంగా సామాన్యులు, జర్నలిస్ట్లపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. ఈ మొత్త వ్యవహారానికి చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థను, రాజకీయ ఒత్తిళ్ళతో ఇష్టారాజ్యంగా పనిచేయాలంటూ ప్రోత్సహించారు. దాని పరిణమాలే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సమాజమే అశాంతిమయం అవుతుంది. రక్షించాల్సిన పోలీసులే చట్టాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణం పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విపరిణామాలు ప్రజాస్వామిక వ్యవస్థకే చేటు కలిగిస్తాయి. రాజకీయ కక్షసాధింపులతోనే పాలనమాజీ ఎంపీ నందిగం సురేష్ మీద పన్నెండు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకు పంపడం చేస్తున్నారు. పార్టీ నాయకుడు తురకా కిషోర్ మీద కూడా ఇలాగే గతంలో జరిగిన సంఘటనలను తవ్వితీసి, వాటికి బాధ్యుడుగా చూపుతూ అర్థంలేని ఘటనల్లో అరెస్ట్ చూపుతున్నారు. ఆయన బెయిల్ తెచ్చుకునేందుకు సిద్దపడుతుండటంతో, బయటకు రాగానే మరో పీటీ వారెంట్తో సిద్దంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేసుకుని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలుపెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. దానికి నిదర్శనమే తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై పట్టపగలు సీఐ స్థాయి అధికారులే లాఠీలతో హింసించడం. ఎక్కడో ఆటవిక రాజ్యం ఉన్న దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలుసు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, న్యాయస్థానాలు చేసే విచారణను, నేర నిర్ధారణను, శిక్షను కూడా తామే అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు? మొత్తం రాజకీయ నాయకత్వం ఇచ్చిన దన్నుతో పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర సీఎం, ఆయన కుమారుడు స్వయంగా రెడ్బుక్ పాలనను సాగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి, దాని ప్రకారం పనిచేసిన వారికే రివార్డులు ఉంటాయని చెప్పడం వల్లే ఇటువంటి దారుణమైన పరిణామాలు జరుగుతున్నాయి. దీనినే కొనసాగితే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. సామాన్యుడు బతకడమే కష్టమవుతుంది.ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. దానిపై ఇద్దరు ఎమ్మెల్సీలు, కాకాణి కుమార్తె జిల్లా కలెక్టర్ను కలవడానికి వెడితే వారిపైన కూడా కేసులు పెట్టడం చూస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానమే కలుగుతోంది. ఇటువంటి దుష్ట సంప్రదాయం తమను కూడా చుట్టుముడుతుందనే ఆలోచన చంద్రబాబుకు కలగడం లేదు. చట్టాలను పక్కకుపెట్టి, ఒక మాఫియా సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. తాము చెప్పినట్లు వినని వారిని వీఆర్కు పంపడం, సస్పెండ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిని దారుణమైన స్థితికి తీసుకువచ్చారు. అలాగే పల్నాడు జిల్లాలో హరికృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు.పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన కుమారుడిని చూపించమంటే, అసలు మా ఆధీనంలోనే లేడని పోలీసులు జవాబు చెప్పారు. స్టేషన్ వద్ద నుంచి వెళ్ళకపోతే హరికృష్ణ కుటుంబసభ్యులపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. హరికృష్ణపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ వద్ద తనను హింసించారని చెబితే ఆయనను ఆసుపత్రికి పంపారు. ఆ ఆసుపత్రిలోని వైద్యాధికారులను పోలీసులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. హరికృష్ణ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు హరికృష్ణను కలిసేందుకు ఆయన తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కనీసం ములాఖత్ కూడా ఇవ్వకుండా కక్షసాధిస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిని వదిలేసి, ఎవరిమీద ఫిర్యాదు ఇచ్చారో వారితోనే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ వారిపై ఇలాగే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వెన్నుపోటు దినం(Vennupotu Dinam) పేరుతో శాంతియుతంగా నిరసనలు చేపడతామంటే ఈ ప్రభుత్వం భయపడుతోంది. వాటికి అనుమతులు ఇవ్వకూడదని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఏడాది దుష్ట పాలనకు ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనలను అడ్డుకోలేరు’ అని సజ్జల స్పష్టం చేశారు. -
రేపు తెనాలికి వైఎస్ జగన్.. జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) రేపు తెనాలికి వెళ్లనున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్(John Victor) కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారని, జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి మధ్యాహ్నం 12.00గం. ప్రాంతంలో తాడేపల్లికి బయలుదేరుతారని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉంటే.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారంటూ ఆరోపణలకు దిగారు. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశాయి. -
అండర్పాస్లో ఇరుక్కుపోయిన లారీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట నుంచి సీతానగరం వచ్చే మార్గంలో బకింగ్హామ్ కెనాల్ వద్ద ఉన్న రైల్వే అండర్పాస్లో మరోసారి భారీ వాహనం ఆదివారం ఇరుక్కుపోయింది. సీతానగరం నుంచి ఎన్టీఆర్ కరకట్ట వైపు వెళుతున్న లారీ రైల్వేబ్రిడ్జి సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్ను దాటి ముందుకు వచ్చేసింది. బ్రిడ్జి కిందకు రాగానే లారీపై ఉన్న లోడ్ బ్రిడ్జికి తగిలి ఇరుక్కుపోవడంలో లారీ డ్రైవర్ లారీని నిలిపివేశాడు. చివరకు టైర్లలో గాలి తీసి ఆ లారీని ముందుకు తీసుకువెళ్లారు. ఈ రైల్వే బ్రిడ్జి కింద తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జికి ప్రమాదం కలగకుండా బ్రిడ్జికి సమాంతరంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జరిగిన ఈ సంఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘వెన్నుపోటు దినం‘ విజయవంతం చేయాలి
పొన్నూరు: అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసగించిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు జూన్ 4న నిర్వహించనున్న ’వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్లు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, తాడికొండ, గుంటూరు తూర్పు, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, షేక్ నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్కుమార్లతో కలిసి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభకు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. తొలుత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.హామీలు నెరవేర్చని చంద్రబాబుఅనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ప్రజలు ఇప్పటికే చంద్రబాబుకు ఓటెందుకు వేశామా అనే ఆలోచనలో పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలు గుర్తెరిగి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి డీబీటీ రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు అంటే మోసం, దగా, వెన్నుపోటు, అబద్ధాలే గుర్తుకు వస్తాయన్నారు. ఎన్నికల ముందు చదువుకునే ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఒక్క హామీ అరకొరగా ఇచ్చి అన్నీ ఇచ్చినట్లు ప్రచారం చేయడంలో దిట్ట చంద్రబాబని విమర్శించారు. పైగా వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్లు, సిబ్బంది ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రతి ఒక్కరూ రాసుకుంటున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు దుష్టపాలనకు నిరసనగా ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పొన్నూరులో కూడా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. ర్యాలీలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అన్నివర్గాలకు అన్యాయంపార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదికే కూటమి ప్రభుత్వం ప్రజలతో ఛీ అనిపించుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి మోసం చేశారని అన్నారు. సంక్షేమాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో ఉన్న విద్యావ్యవస్థలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమూల మార్పులు తీసుకువచ్చి ఆ రంగాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు టాబ్లు ఇస్తే చెడిపోతారని చెప్పడం దుర్మార్గం అన్నారు. సంపద సృష్టిస్తా, పేదలను ధనవంతులుగా చేస్తా, అభివృద్ధిని అందలం ఎక్కిస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారని దుయ్యబట్టారు. నవంబరు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు లబ్ధితోపాటు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వ్యవస్థలో ఎలాంటి మార్పు తీసుకురావాలన్నా అది వైఎస్ జగన్తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఆయనను మళ్లీ సీఎం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం వెన్నుపోటు దినం కరపత్రాలను ఆవిష్కరించారు. మైనారిటీ కమిషన్ సభ్యులు షేక్ సైఫుల్లా, ఎంపీపీ భవనం పద్మలీల, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ నల్లమోతు రూత్ రాణి, నియోజకవర్గ నాయకులు ఆకుల వెంకటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వరరావు, షేక్ నాజర్, బొనిగల వేణుప్రసాద్, చింతలపూడి మురళీకృష్ణ, ఎందేటి వెంకట సుబ్బయ్య, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు ఎస్జీటీలతో భర్తీ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పించడం ద్వారా భర్తీ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 219 మంది జూనియర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లను నిర్భందంగా బదిలీ చేయడాన్ని ఆపాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకను ఆదివారం నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో కలిసిన యూటీఎఫ్ జిల్లా ప్రతినిధులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్ట్లలో స్కూల్ అసిస్టెంట్లకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు హడావుడి నిర్ణయాలు మానుకోవాలని తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, బెల్లంకొండ ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, సీనియర్ నాయకులు పి.హనుమంతరావు, చెన్నకేశవరావు, గఫ్ఫార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు -
ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి సత్కారం
నగరంపాలెం: ఉద్యోగ విరమణ పొంది ప్రతిఒక్కరూ తమ భావి జీవితాన్ని సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. ఎస్ఐలు రంగారావు (అరండల్పేట పీఎస్) పి.నాగేశ్వరరావు (చేబ్రోలు పీఎస్), బి.వెంకటేశ్వరరావు (ఏఆర్), ఏఎస్ఐ ఎంవీ.కృష్ణారావు (పట్టాభిపురం పీఎస్), హెడ్ కానిస్టేబుల్ సీహెచ్.కృష్ణారావు (పట్టాభిపురం పీఎస్), జి.నాగేశ్వర రావు (తాడికొండ పీఎస్),షేక్ మహమ్మద్షరీఫ్ (డీపీఓ సీనియర్ సహాయకుడు)లు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో వారిని సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి గారు, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఆర్ఐలు శివరామకృష్ణ, జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మైలా సాంబశివరావు, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి హుస్సేన్ పాల్గొన్నారు. -
క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం
చినగంజాం: క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దడం గొప్ప విషయం అని హైదరాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్ను వేణుగోపాల్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి శిక్షకుడుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు గిరిబాబు వ్యవహరించి ప్రతి రోజూ శిక్షణ అందించారని, అనేక మంది యువ క్రీడాకారులు ప్రేరణ పొందారన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి జూన్ 1వ తేదీ వరకు గ్రామీణ యువతకు కబడ్డీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించామని.. శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. కోచ్ గిరిబాబు మాట్లాడుతూ శిబిరంలో మొత్తం 150 మంది బాలలకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డాక్టర్ నల్లూరి సుబ్బారావు రూ.లక్ష విరాళంగా అందజేశారని తెలిపారు. దీంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, కబడ్డీ కిట్లు అందజేశామన్నారు. శిబిరంలో సీనియర్ క్రీడాకారులు బి.నాగాంజనేయులు, వెంకటేశ్, కె.సతీష్రెడ్డి, బి.శివారెడ్డి, డి.సుబ్బారెడ్డి, వి. వెంకటేశ్, జీటీ అంకిరెడ్డి, ఎం.భాను ప్రకాష్రెడ్డి తదిరులు పాల్గొనగా వారి సలహాలు సూచనల మేరకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి క్రీడాకారులకు భోజన వసతి కల్పించేందుకు అన్ను వేణుగోపాల్ రూ.40 వేలు ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. మచిలీపట్నం జిల్లా అదనపు పోలీస్ అధికారి సత్యం, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ దాత డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అసోసియేషన్ చైర్మన్ చంద్రమోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఈత అత్యుత్తమ వ్యాయామమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో 11వ సీనియర్ అంతర్ జిల్లాల స్విమింగ్ ఛాంపియన్షిప్– 2025 పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పలు ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ కె.రవికాంత్, అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, కార్యదర్శి మోహనవెంకటరామ్, కోశాధికారి రమేష్, పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులతో క్రీడా మైదానాలు కళకళలాడాలని, ఆ విధంగా స్టేడియంను తీర్చిదిద్దుతామని తూర్పు శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. గత మూడు రోజల నుంచి స్థానిక బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అండర్–16 బాల బాలికల ఓపెన్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రూ.100 కోట్లతో స్టేడియంను అభివృద్ధి చేస్తామన్నారు. పోటీల నిర్వహకుడు, టెన్నిస్ కోచ్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ అండర్–16 బాలుర విజేతగా కె.విన్సెంట్ నిలవగా రన్నర్గా జయ సాయి కుమార్ నిలిచాడన్నారు. బాలికల్లో గోలి జోషిత విజేత కాగా తనిక్ష రెడ్డి రన్నర్గా నిలిచిందని చెప్పారు. విజేతలకు బహుమతులను నసీర్ అహ్మద్, టోర్నమెంట్ స్పాన్సర్ డాక్టర్ రామకృష్ణ, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, జీవిఎస్ ప్రసాద్, సుబ్బారావు, జాగర్లమూడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముగిసిన అండర్–16 టెన్నిస్ పోటీలు -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియ నుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూత న వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. వీఐపీ దర్శనాలను బ్రేక్ ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉ దయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టి కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శ నం కల్పించారు. మధ్యాహ్నం 2గంటలవరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువు రు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలనుంచి భక్తుల తాకిడి కనిపించింది. మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్.. అంతరాలయ దర్శనం రద్దు -
సంక్షేమం సున్నా!
పాలనకు ఏడాదైనా.. కూటమి ఏడాది పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం క్ర.సం. పథకం పేరు లబ్ధిదారుల సంఖ్య లబ్ధి మొత్తం(రూ.కోట్లలో) 1. వైఎస్సార్ ఆసరా 2,90,994 808.60 2. జగనన్న అమ్మ ఒడి 2,01,590 657.39 3. జగనన్న అమ్మ ఒడి (అదర్స్) 1,87,574 47.32 4. అర్చకుల గౌరవ వేతనం 1,051 0.53 5. జగనన్న చేదోడు 11,397 32.59 6. వైఎస్సార్ ఉచిత పంటల బీమా 57,207 74.47 7. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 25,401 67.72 8. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు 45,615 543.66 9. ఇమామ్లు, మౌజన్లకు వేతనం 120 0.06 10. వైఎస్సార్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 65,758 78.10 11. జగనన్న తోడు (వడ్డీ) 33,485 1.47 12. జగనన్న తోడు (రుణాలు) 68,163 108.32 13. జగనన్న వసతి దీవెన 1,05,471 115.86 14. జగనన్న విద్యా దీవెన 1,15,392 364.94 15. వైఎస్సార్ కల్యాణమస్తు 1,297 11.65 16. వైఎస్సార్ కాపు నేస్తం 21,502 97.71 17. వైఎస్సార్ లా నేస్తం 243 3.04 18. వైఎస్సార్ మత్స్యకార భరోసా 269 0.58 19. వైఎస్సార్ నేతన్న నేస్తం 940 7.30 20. పాస్టర్ల గౌరవ వేతనం 1,823 0.91 21. వైఎస్సార్ రైతు భరోసా 1,77,545 885.97 22. వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణం 48,397 13.61 23. వైఎస్సార్ సున్నావడ్డీ (ఎస్హెచ్జీఎస్) 3,77,515 100.73 24. వైఎస్సార్ వాహన మిత్ర 17,574 61.16 25. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 54,315 42.26 26. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 86,931 394.80 27. వైఎస్సార్ బీమా 5,324 79.33 28. వైఎస్సార్ చేయూత 1,14,844 503.93 29. వైఎస్సార్ పెన్షన్ కానుక 2,96,952 2847.82 30. జగనన్న విదేశీ విద్యా దీవెన 42 3.68 31. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం 4 0.04 మొత్తం 24,14,735 7,955.54 సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం మాటలకే పరిమితం అయింది. దీంతో ప్రజలకు ఆర్థికంగా చేయూత లేకపోవడంతో కొనుగోలు శక్తి క్షీణించింది. మార్కెట్లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజధాని పేరుతో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మినహా మిగతావి ముందుకు సాగడం లేదు. దీంతో ఏడాది కూడా గడవకముందే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. పింఛన్ల తనిఖీ పేరుతో రద్దు సంక్షేమంపై ఏ మాత్రం దృష్టి పెట్టని చంద్రబాబు ప్రభుత్వం పేదల నోటి దగ్గర కూడు కూడా లాక్కొనేందుకు సన్నద్ధం అవుతోంది. పండుటాకులపై తన ప్రతాపం చూపిస్తోంది. దీనిలో భాగంగా పింఛన్ల తనిఖీ పేరుతో ఉన్న వాటినీ తొలగిస్తోంది. ఇప్పటి వరకు 6,798 మందికి వివిధ సాకులతో పింఛను రద్దు చేశారు. తాజాగా పైలెట్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి జిల్లాలో ఒక సచివాలయం పరిధిలో తనిఖీ చేశారు. పింఛన్దారుల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ మరోసారి వారి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేశారు. ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలు సేకరించారు. వీటిలో తేడాలు ఉన్నాయంటూ రద్దు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అమలుకాని హామీలు ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు జిల్లాలో పర్యటించి పలు హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ముస్లింలకు మొండిచేయి ‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తాం. నూర్బాషా కార్పొరేషన్ పెట్టి ఏడాదికి రూ.వంద కోట్లు ఆర్థిక సాయం చేస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది’ అంటూ గతంలో గుంటూరు పర్యటనలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్ భూములను బయట వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం తెగించింది. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ ఊసు మర్చిపోయారు. రూ.7,955.54 కోట్ల మేరకు లబ్ధి వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాలకు మొత్తం రూ.7,955.54 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో 2019–24 కాలంలో 24,14,735 లక్షల మందికి రూ.7,955.54 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఇందులో అత్యధికంగా వైఎస్సార్ ఆసరా కింద 2,90,994 మందికి రూ.808.60 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కింద 1,77,545 మందికి రూ.885.97 కోట్లు, జగనన్న అమ్మ ఒడి ద్వారా 2,01,590 మంది లబ్ధిదారులకు రూ.657.30 కోట్లు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా 45,615 మందికి రూ.543.66 కోట్లు లబ్ధి చేకూరింది. అన్నీ మాటలకే పరిమితం ఏడాదైనా ఇంకా అదే తీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయలేదు. ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. దాని ఊసే లేదు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా రైతుకు రూ.20,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పినా ఏడాది గడిచినప్పటికీ వాటి ప్రస్తావనే లేదు. ఇప్పటికీ ప్రజలకు మాటలతో కూటమి ప్రభుత్వం మోసగిస్తూనే ఉంది. కార్యాలయాల వద్ద పడిగాపులు గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే అన్ని సేవలు అందేవి. కూటమి అధికారంలోకి వచ్చాక అన్నీ ఆగిపోయాయి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. – స్వాతి, గుంటూరు అధికారం కోసం అబద్ధాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ఎన్నో పొందాం. కూటమి సర్కారు ఏర్పడితే ఏవేవో ఇస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ అమలు చేయకపోవడం బాధాకరం. కేవలం అఽధికారం కోసమే అబద్ధపు మాటలు చెప్పారు. ఏడాదైనా సంక్షేమ పథకాల ఊసే లేదు. – లలితమ్మ, గుంటూరు వైఎస్సార్సీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు విద్యార్థుల చదువులకు ఇబ్బంది ఉండేది కాదు ఇళ్లు లేని పేద ప్రజలకు స్థలాలు ఇచ్చి కట్టించిన వైనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఒక్కటీ అమలు కాని సంక్షేమ పథకాలు అసలు ఆ ఊసే వినిపించకపోవడంతో బాబు పాలనపై అన్ని వర్గాలు ఆగ్రహం ప్రకటనలకే పరిమితమవుతున్న కూటమి పాలకులు మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి అదే బూటకపు ముచ్చట్లు నమ్మించి నట్టేట ముంచిన పాలకులు ఉన్న సంక్షేమ పథకాలు కూడా కోల్పోయిన ఆవేదనలో ప్రజలు నిరుద్యోగ భృతితల్లికి వందనంగా ఏటా రూ.15,000 ఇస్తాం. నిరుద్యోగులకు భృతిగా నెలకు రూ.3000 చొప్పున ఇస్తాం. ఏటా అన్నదాతలకు రూ.20,000 వేలు ఇచ్చి ఆదుకుంటాం. ఆడబిడ్డకు నిధిగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంటూ ఊరించినా ఒక్కటి కూడా అమలు చేయలేదు. గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై చంద్రబాబు సమీక్షించిన పాపాన పోలేదు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు అమరావతి రాజధానిలో భాగం. ‘హైదరాబాద్, సికింద్రాబాద్లకు తోడుగా సైబరాబాద్ నిర్మించి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు కేవలం 163 కి.మీ మాత్రమే... కానీ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 180 కి.మీ.తో ఏర్పాటు చేస్తానని’ చంద్రబాబు చెప్పారు. ఈ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. -
మళ్లీ రేషన్ కష్టాలు
గుంటూరు వెస్ట్: రేషన్ సరుకుల పంపిణీ తొలిరోజు దారుణంగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎండీయూ వాహనాలను కాదని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రారంభించింది. దీని కోసం నాయకులతోపాటు కార్యకర్తలను దుకాణాలకు పంపి హడావుడి చేసింది. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా చోట్ల ఈ –పోస్ మిషన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి స్థానిక ఏటీ అగ్రహారంలో నెంబర్ 0781174 రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. కొద్ది సేపటికే అక్కడ ఈ –పోస్ మిషన్ మొరాయించింది. జిల్లాలో మొత్తం 972 రేషన్ దుకాణాలున్నాయి. 5,99,511 మందికి సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. తొలి రోజు పెద్దగా స్పందన లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేటప్పుడు పేదలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని కార్డుదారులు వాపోతున్నారు. తప్పని సమస్యలు చాలా దుకాణాల్లో సర్వర్ మొరాయించింది. కొన్ని చోట్ల నెమ్మదించింది. ఈ పోస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు చాలా వరకు పాడైపోయాయి. కొన్ని చోట్ల లైన్లు కనబడగా, మరికొన్ని చోట్ల ఎవ్వరూ రాలేదు. మిషన్లు పనిచేయకపోవడంతో ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. తొలిరోజు సరుకుల పంపిణీలో తీవ్ర ఇబ్బందులు పలుచోట్ల ఈ– పోస్ మిషన్లు మొరాయింపుతో సమస్యలు ఎమ్మెల్యే మాధవి ప్రారంభించిన దుకాణంలోనూ పనిచేయని వైనం ఇంటి వద్దకే సరుకులు ఇచ్చే వ్యవస్థను నాశనం చేసిన కూటమి ప్రభుత్వం పాలకుల తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహం -
వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
మంగళగిరి: ఈ నెల 4వ తేదీన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినంలో నియోజకవర్గంలోని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పిలుపునిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట కల పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం వెన్నుపోటు దినం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వేమారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. నియోజకవర్గంలో నివాసముంటన్న చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించేలా వెన్నుపోటు దినాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని, చంద్రబాబుకు ఆ ఘనత దక్కిందన్నారు. చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించాలి.. ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వెన్ను పోటు దినంలో ప్రజలంతా ఐక్యంగా పాల్గొనాలన్నారు. ప్రజలకు చేసిన మోసాన్ని చంద్రబాబుకు తెలిసేలా వెన్ను పోటు దినంను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను సూపర్ సిక్స్ పేరుతో మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఇచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపేసిన చంద్రబాబు తన పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, ప్రజలంతా వెన్నుపోటు దినంలో పాల్గొని చంద్రబాబు, లోకేష్లు కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మంగళగిరి, తాడేపల్లి పట్టణ, మండల, దుగ్గిరాల అధ్యక్షులు నాలి వెంకట కృష్ణ, బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, సీనియర్ నాయకుడు పాటిబండ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కట్టెపోగు భూషణం, బందాపు రుక్మాంగరెడ్డి, యర్రకోటి మల్లిఖార్జునరెడ్డి, రత్నాకరం శ్రీనివాసరాజు,సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఈపూరి ఆదామ్, తిరుమల శెట్టి సురేంద్ర,కలకోటి సునీల్కుమార్, షేక్ జానీ బాషా, చిలువూరి ఫిలోమినా, జంగా నాగిరెడ్డి, భీమిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, మాదాల గోపీ కృష్ణ, నందిగం ఆకాష్, లేళ్ళ సురేష్, షేక్ సర్ధార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించేలా నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తాం వాల్ పోస్టర్ల ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త వేమారెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావు -
గుంటూరు
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాల కింద అందించిన మొత్తం వివరాలు.. నేడు వల్లభేశ్వరుడి వార్షికోత్సవం రొంపిచర్ల: మండలంలోని విప్పర్లలో గల వల్లభేశ్వరస్వామి ఆలయ ఏడో వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు జరుగుతాయి. అలరించిన వేణుగాన కచేరీ నగరంపాలెం: బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం వల్లూరు కృష్ణకిషోర్, ఆర్.శశాంక్, జనార్దన్ల వేణుగాన కచేరీ అలరించింది.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 512.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది. కూటమి పాలన సంక్షోభం వైపు వెళ్తోంది. గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందాయి. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి.. సంక్షేమం మాటే మరిచిపోయింది. పింఛను నామమాత్రంగా పెంచి, ఉన్న లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించడం మినహా ఒక్క పథకాన్నీ అమలు చేయలేదు. సరికదా.. ఇప్పటికే ఉన్న అన్ని పథకాలకూ తిలోదకాలు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, రెడ్బుక్ రాజ్యాంగం అమలు, సామాన్యులపై దౌర్జన్యాలు చేయడంపైనే పాలకులు దృష్టి పెట్టారు. ప్రజా సంక్షేమం గాలికొదిలేశారు. 7న్యూస్రీల్ -
చెస్ టోర్నీ విజేతగా ధృవేష్
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల విన్నర్ ట్రోఫిని గుంటూరుకు చెందిన డి.ధృవేష్ కై వసం చేసుకున్నాడు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్పైన్ స్కూల్లో ఆదివారం రాష్ట్రస్థాయి చెస్ ఓపెన్ టోర్నమెంట్ జరిగింది. చెస్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్, స్కాట్స్పైన్ స్కూల్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 178 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏడు రౌండ్లపాటు సాగిన ఈ పోటీల్లో గుంటూరుకు చెందిన ధృవేష్ విన్నర్గా నిలువగా, విజయవాడకు చెందిన పి.జయసాకేత్ రన్నర్ ట్రోఫీని అందుకున్నాడు. విజేతలకు చెస్ సీనియర్ కోచ్లు డి.లక్ష్మణరావు, జె.మల్లేశ్వరరావు, స్కూల్ ఫిజికల్ డైరక్టర్ ఎన్.శివ ట్రోఫీలను అందజేశారు. -
నిర్బంధ బదిలీల ఆదేశాలు ఉపసంహరించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ కేడర్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నిర్భంద బదిలీ చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డిని ఆర్జేడీ కార్యాలయంలో కలిసి ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. లాంగ్ స్టాండింగ్లో లేకున్నప్పటికీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా వెళ్లాల్సిందేనని ఒత్తిడి తీసుకువచ్చి, నిర్బంధ బదిలీపై పంపాలనే నిర్ణయాన్ని ఎస్టీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీసులో సీనియార్టీని పరిగణలోకి తీసుకుని, మెరిట్ జాబితా సిద్ధం చేయాల్సి ఉండగా, పుట్టిన తేదీ ఆధారంగా జాబితాలను తయారు చేయడం నిబంధలకు విరుద్ధమన్నారు. తక్షణమే వాటిని సరిచేసి మెరిట్ ప్రకారం జాబితాలు తయారు చేయాలని కోరారు. రీ అప్పోర్షన్కు గురైన ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్తో పాటు జత చేసిన రీ అప్పోర్షన్ పాయింట్లను తొలగించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఆర్జేడీని కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుబ్బారెడ్డి, నాయకులు శ్యామ్, దిబ్బయ్య, బాజీ, వెంకట్రావు ఉన్నారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు -
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం అండదండలతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇటీవల దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన ముగ్గురు యువకులపై తెనాలి పట్టణంలో పట్టపగలే దాడి చేసిన పోలీసులు.. మరో యువకుడు ఆత్మహత్యకు కారణమయ్యారు. పోలీసుల వేధింపులతో సిద్ధేష్ శివాజీ అనే యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ధ్వజంతెనాలిలో పోలీసుల వేధింపులతో మరొకరు బలికావడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలనే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. కొందరు పోలీసుల దారుణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ సంఘటనపై నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.కాగా, బంగారం రికవరీ కేసులో సిద్ధేష్ ను పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఆ ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక సిద్ధేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తప్పించుకోవడానికి సిద్ధేష్ మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించారు. Same Tenali cops behind another tragedy: Siddhesh dies after police harassmentTenali, June 1: The same police officers who were recently caught on video brutally assaulting three Dalit youths in broad daylight in Tenali are now being accused of driving another young man,… pic.twitter.com/rFyyglLpXk— YSR Congress Party (@YSRCParty) June 1, 2025 -
తెనాలిలో విషాదం.. బంగారం వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని సమాచారం.దొంగ బంగారం కేసులో సిద్దేశ్ శివాజీని కొంత బంగారం ఇవ్వమని పోలీసులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సిద్ధేష్ శివాజీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
‘బాబు మహానుబావుడు.. అధికారంలోకి వచ్చాడు లక్షల ఉద్యోగాలు పీకేశాడు’
సాక్షి,గుంటూరు: తాజాగా కోనసీమ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనది డేగకన్ను, తప్పు చేసిన వారు తన నుంచి తప్పించుకోలేరంటూ పిట్టలదోరలా మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తూ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు దళిత, మైనార్టీ యువకులను హింసిస్తే చంద్రబాబు డేగ కన్నుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వారిపై చర్య తీసుకుంటే తాను చట్టవిరుద్దంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైయస్ఆర్సీపీ శ్రేణులపై పెట్టిస్తున్న తప్పుడు కేసులు, వేధింపులను పోలీసులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. పోలీసుల హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలికి వెడుతున్నారని వెల్లడించారు.ఇంకా ఆయనేమన్నారంటే..తెనాలి అయితానగర్కు చెందిన జాన్ విక్టర్, దోమా రాజేష్,షేక్ బాబూలాల్ అనే యువకులు చిరంజీవి అనే కానిస్టేబుల్పై దాడి చేశారని వారిపై 307 కేసు పెట్టారు. చట్టప్రకారం వారిని అరెస్ట్ చేసి కోర్ట్కు పంపాల్సింది పోయి, వారిని పట్టుకుని నడిరోడ్డుపై లాఠీలతో చావబాదారు. వారంతా దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన వారు. ఈ హింసను చూస్తుంటే అసలు ప్రజస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. దీనిని మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తే, వారిపై రౌడీషీట్లు ఉన్నాయని, రౌడీలకు సపోర్ట్ చేస్తారా అని ఎదురుదాడి చేస్తున్నారు. చట్టాన్ని పోలీసులే చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్ట్లు ఎందుకు? విచారణలు ఎందుకు? శిక్షలు ఎందుకు? ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి, కోర్ట్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పోలీసుల పనిచేయాలే తప్ప, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. తనది డేగ కన్ను అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు ఈ దారుణం కనిపించలేదా? పోలీసులను మందలించడానికి ఎందకు భయపడుతున్నారు? ఇటువంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతాయి.ఏడాది తరువాత పాలనలో ఏ గేర్ మారుస్తారు?అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. నిత్యం లంచాల సొమ్మతో సూట్కేసులు మోయడమే ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న పని. కోససీమ జిల్లా చేయ్యూరు ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ నెల పన్నెండో తేదీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని, ఇకపై పాలనలో గేర్ మారుస్తానని చంద్రబాబు అన్నారు. ఏం గేరు మారుస్తారో మాకు మాత్రం అర్థం కాలేదు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి అబద్దాలను కూడా అవలీలగా చెబుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి అబద్దాలనైనా సరే లైవ్ డిటెక్టర్కు కూడా దొరకకుండా చెప్పగల నేర్పరి. 'అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం, అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఛండశానసనుడిని అవుతాను' ఇవీ చంద్రబాబు తాజాగా చెప్పిన సుభాషితాలు. అసలు అవినీతి సమాజానికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోంది. దానికి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఈ అవినీతి సొమ్మును వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. సీఐల బదిలీల నుంచి అన్ని పోస్టింగ్లకు ఒక రేటును పెట్టి, లంచాలు దండుకుంటున్నది నారా లోకేష్ అనేది సత్యం. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ప్రజలను మోసం చేసిన వైనంను ప్రశ్నిస్తూ ఈనెల 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి, మిర్చి, పొగాకు, ధాన్యం ఇలా ఏ పంట పండిచే రైతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ స్టంట్ కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజలను నిజంగా మేలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. వైఎస్సార్సీపీ నిరసనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం.అవినీతిపై బెల్ట్ తీసే సీఎంకు బెల్ట్షాప్కు కనిపించవా?చంద్రబాబు తనది డేగ కన్ను అంటున్నాడు, బెల్ట్ షాప్లు పెడితే బెల్ట్ తీస్తాను అని కూడా హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు కనిపిస్తున్నాయి. ఆయనది డేగ కన్ను ఎలా అవుతుంది? ఆ షాప్లు ఎందుకు కనిపించడం లేదు? బడులు తెరవగానే అమ్మ ఒడి ఇస్తానని చెబుతున్నాడు. ఏడాది కిందట కూటమి పార్టీ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు బడులే తెరవలేదా? ఈ ఏడాదే బడులు తెరుస్తున్నారా? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు అంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం వారు చేసిన హామీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏవీ ఆ పదిహేను వేలు అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గం సంతోషంగా ఉంది? విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, కనీసం అమరావతి రైతులు సైతం సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైన పాలనను ఈ ఏడాది కాలంలో ప్రజలు చవిచూశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు, చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం కూటమిది. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానంటూ నమ్మించి దాదాపు 2.60 లక్షల మందిని రోడ్డుపాలు చేశారు. ఏపీ ఫైబర్నెట్, బేవరేజెస్, ఏపీఎండీసీల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలను తొలగించారు.ఎండీయులతో 72 నెలల ఒప్పందాన్ని కొనసాగించాలిఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్తో కలిపితే మొత్తం ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాం. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని రోడ్డుపాలు చేశారు. ఇదే ఎండీయులతో గత ప్రభుత్వం 72 నెలల పాటు కొనసాగేలా అగ్రిమెంట్ ఉంది. అది పూర్తి కాకుండానే వారిని తొలగించారు. ఇది చట్ట విరుద్దం. వారిపై ఇంత కక్షసాధింపు ఎందుకు? బుడమేరు వరదల్లో వారు కష్టపడి పనిచేసిన కూడా వారిని నమ్మించి గొంతుకోశారు. చట్టవిరుద్దంగా తమను తొలగించారంటూ ఇప్పటికే కొందరు ఎండీయులు న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు.మంత్రి నాదెండ్ల మనోహరే పీడీఎస్ బియ్యం స్మగ్లర్వారిని తొలగించే సమయంలో చంద్రబాబు ఎండీయులను గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. ఎండీయుల ద్వారా పనిచేసే వారంతా స్మగ్లర్లని, కాకినాడ పోర్ట్కు రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సంచలనమైన ఆరోపణలు చేశారు. వారంతా సంఘవిద్రోహశక్తులు అని మాట్లాడారు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు స్మగ్లర్లుగా మారారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ద్వారా ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయి. కాకినాడ నుంచి ఆఫ్రికాదేశాలకు వెళ్ళే బియ్యం అంతా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతోంది. మట్టి, ఇసుక, ఉద్యోగాల బదిలీలు, పీడీఎస్ బియ్యంను అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఎండీయుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అక్రమ పీడీఎస్ రవాణా వ్యవహారంలో మొదటి స్మగ్లర్. తరువాత మంత్రి నారా లోకేష్. మీరు అక్రమాలు చేస్తూ, ఎండీఓలపై ఆరోపణలు చేయడం దారుణం. -
బాబుగారూ.. ‘టెన్త్’లో మీరు, మీ కొడుకు ఫెయిల్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్(Nara Lokesh) టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్ ఫలితాలు సరైనవేనా? -
బదిలీల పేరిట ఉద్యోగులకు వేధింపులు.. లంచాల డిమాండ్: ఎన్ చంద్రశేఖర్రెడ్డి
గుంటూరు, సాక్షి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని.. ఇప్పుడు బదిలీల పేరుతో వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్రెడ్డి(N Chandrashekar Reddy) అన్నారు. ఏపీలో ఉద్యోగుల బదిలీల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటూ శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల బదిలీల్లో భారీగా అక్రమాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల(Kutami MLAs) నుండి సిఫార్సు లేఖలు తెమ్మని కొందరు అధికారులు చెప్తున్నారు. ఆ సిఫార్సు లేఖలు కావాలంటే అదే విషయాన్ని కూడా జీవోలో ప్రస్తావించాల్సి ఉంది. అయినా.. ఉద్యోగుల బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సులతో పనేంటి?.. .. కొంతమంది టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి బదిలీల వ్యవహారం నడిపిస్తున్నారు. లక్షలకు లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు. లంచాలు పూర్తిగా అందలేదని బదిలీల సమయాన్ని కూడా పెంచటం అన్యాయం. రాజకీయ బదిలీలు కరెక్టు కాదు. లంచాలు లేకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలి. అలా జరిగినప్పుడే ఉద్యోగులు సరిగా పని చేయగలుగుతారు. రెవెన్యూ శాఖలో కొన్ని పోస్టులకు వేలం వేయటం దుర్మార్గమైన చర్య. అనంతపురంలో సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేత అశ్వథ్రెడ్డి దూషణలకు దిగారు. ఉద్యోగులను తిడితే ప్రభుత్వాన్ని తిట్టినట్టే. టీడీపీ నేత అశ్వథ్రెడ్డి(Ashwath Reddy)పై కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రశేఖర్ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు మారకపోతే.. భవిష్యత్తు ఘోరంగా ఉంటుంది -
రియల్ లైఫ్లోనూ ఆయన హీరోనే: సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే జనాలకు మదిలో మెదిలే రూపం సూపర్ స్టార్ కృష్ణగారిదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ఇవాళ(మే 31) కృష్ణ జయంతి(Krishna Birth Anniversary) సందర్భంగా నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారాయన.సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగారు(Super Star Krishna Gaaru) హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్గా, స్టూడియో అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజకీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి(వైఎస్సార్) అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అంటూ జగన్ పోస్ట్లో పేర్కొన్నారు. -
క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే..
వచ్చే ఏడాది పొగాకు సాగు చెయ్యకుండా క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే పొగాకు రైతులకు న్యాయం జరుగుతుంది. గత ఏడాది ధర బాగుంది కదా అని ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని నల్ల బర్లీ సాగు చేశాను. తీరా ఇప్పుడు చూస్తే అసలు కొనేవారే లేరు. ఒకవేళ ఎవరన్నా కొనేందుకు ముందుకు వచ్చినా బాగా ధర తగ్గించి అడుగుతున్నారు. అందుచేత వచ్చే ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే మేలు జరుగుతుంది. – కంచర్ల సాల్ బాబు, పొగాకు రైతు, తిమ్మాపురం ధాన్యం కొనేవారే లేరు నాకున్న అర ఎకరం సొంత పొలంతో పాటు 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట పండించాను. కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనేవారు కరువయ్యారు. ఇప్పటికీ ధాన్యం 300 బస్తాల వరకు నిల్వ ఉంది. గత ఏడాది ఖరీఫ్, ఈ ఏడాది ఖరీఫ్లో పండించిన ధాన్యం ప్రస్తుతం రూ. 2 వేల నుంచి రూ. 2400 ధర ఉండాల్సి ఉండగా, పాత ధాన్యాన్ని కూడా ఇప్పటికీ దళారులు రూ. 1400కే అడుగుతున్నారు. చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లోకి అధికారులు వచ్చి సమావేశాలు నిర్వహించి, ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ధాన్యం ధర ఈ విధంగా పతనమైన రోజులు గతంలో చూడలేదు. – నాగిశెట్టి రమేష్, కౌలు రైతు, కసుకర్రు -
ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టం
నాలుగు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. గత ఏడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మిర్చి పంటకు రక రకాల తెగుళ్లు వ్యాపించడంతో పాటు వాతావరణంలో మార్పుల కారణంగా 10 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు. అందులో సగానికి పైగా తాలు వచ్చింది. ఎకరాకు ఇప్పటివరకు విత్తనం మొదలు, పురుగు మందులు, కోత కూలీలు, తొక్కుడు, బాడుగ, కౌలు కలుపుకొని రూ.2.50 లక్షలు వరకు ఖర్చు వచ్చింది. అంటే మొత్తం నాలుగు ఎకరాలకు రూ.10 లక్షల వరకు ఖర్చు వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.23 వేలు నుంచి రూ.28 వేలు వరకు పలికిన తేజ రకం ఎరుపు కాయలకు ఈ ఏడాది రూ.9 వేలు నుంచి రూ.10 వేలు పలుకుతోంది. జనవరిలో 25 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకువచ్చాను. క్వింటాకు రూ.13,500 ధర వచ్చింది. మార్చి నెలలో మరో 20 బస్తాలు తీసుకువెళ్తే క్వింటా రూ.9 వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక తాలు రకం గత ఏడాది క్వింటాకు రూ.16 వేలు ధర ఉంటే ఈ ఏడాది రూ.4,500 వేలు కూడా ధర దక్కడం లేదు. ఈ ఏడాది మొత్తం మీద ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షల వరకు నష్టం రావడం ఖాయం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం గ్రామం -
నేటి నుంచి రైల్వే గేటు మూసివేత
ఫిరంగిపురం: ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం నుంచి జూన్ మూడో తేదీ వరకు గేటు మూసివేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.రైల్వే గడ్డర్ను ఢీకొన్న భారీ వాహనంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం రైల్వే ట్రాక్ వద్ద ఏర్పాటుచేసిన రైల్వే గడ్డర్ను ఓ భారీ వాహనం ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్ అండర్పాస్ వద్ద భారీ వాహనాల రాకపోకల నిషేధానికి ఏర్పాటు చేసిన రైల్వే గడ్డర్ను చూసుకోకుండా వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.యోగాతో సంపూర్ణ ఆరోగ్యంవీసీ ఆచార్య కె.గంగాధరరావుఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ యోగా సెంటర్లో యోగా సాధన చేశారు. వీసీ ఆచార్య కె గంగాధరరావు యోగా ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ఆవశ్యకతను మనం గుర్తించడంతోపాటు, సమాజానికి అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించిన ప్రజలు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ అన్నారు. జూన్ 4వ తేదిన జరగనున్న వెన్ను పోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని, దీనిని ప్రజలు గుర్తించారని, కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం 15 ఎకరాలలో ఉందని, కొత్త ఇంటిని కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలలో ఇళ్లు కడుతున్నారని ప్రశ్నించారు. చేతిలో మీడియా ఉందని దుష్పచారం చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని గుర్తించుకోవాలని హితవు పలికారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయి ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొని తెలియజేయాలని కోరారు. పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినోత్సవంలో నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలను చేసిన మోసాల్ని ఎండగట్టడమే వెన్నుపోటు దినోత్సవ లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలంతా మోసపోయారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. సమావేశంలో గుంటూరు తూర్పు, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు బొమ్ము తాతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు పచ్చల రత్నకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దామర్ల కుబేరస్వామి, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ఊట్ల పాలశ్రీనివాసరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, మంగళగిరి మండల, పట్టణ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, ఆకురాతి రాజేష్, తాడేపల్లి పట్టణ, రూరల్, దుగ్గిరాల మండల అధ్యక్షులు బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, పట్టణ అధ్యక్షురాలు సంకె సునీత, నియోజకవర్గ ప్రతినిధి కాశినీడు బాజి గంగాధర్, జిల్లా సెక్రటరీ అహ్మద్ బాజీ సాహిద్, దివ్యాంగుల అధ్యక్షుడు బొక్కా అగస్టీన్, ఎస్టీ అధ్యక్షుడు మేడా వెంకటేశ్వరరావు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని విజయంతం చేయాలి మంగళగిరి నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు -
సేవల్లో ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’
తెనాలి: పవిత్రమైన వైద్యవృత్తిలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే వృత్తిజీవితంలో సంతృప్తినే కాదు... ఏకంగా రాష్ట్ర, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శుక్రవారం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును స్వీకరించిన వలివేటి శుభావతి ఇందుకు చక్కని నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకై క మహిళ కూడా శుభావతినే. ఏఎన్ఎం విధుల్లో వైద్యవృత్తి ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో నిర్వహిస్తూనే ఉన్నత కోర్సులు చేస్తూ, వరుస పదోన్నతులతో మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్ హోదాకు ఎదిగారు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకున్నారు. సంగం జాగర్లమూడి స్వస్థలం తెనాలి రూరల్ మండల గ్రామం సంగంజాగర్లమూడి వలివేటి శుభావతి స్వస్థలం. తల్లిదండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం. వైద్యరంగంలో తొలిగా ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల పీహెచ్సీ పరిధిలోని చందవరం సబ్సెంటర్లో ఏఎన్ఎంగా శుభావతి వృత్తిజీవితం ఆరంభమైంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే పీజీ కోర్సులు చేస్తూ వచ్చారు. 13 ఏళ్ల సర్వీసులో మూడు పీజీలు చేశారు. ఫలితంగా పదోన్నతిపై ఇదే జిల్లాలోని నకిరేకల్లో హెల్త్ ఎడ్యుకేటర్గా నియమితులయ్యారు. అక్కడ 12 ఏళ్లపాటు పనిచేశారు. కర్నూలులోని రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)కు మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ గత జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. పేద రోగులకు సేవలు వైద్యరంగంలో తన 39 ఏళ్ల సర్వీసులో శుభావతి పేద ప్రజలు, అవసరమైన వారికి తగిన సేవలను అందిస్తూ వచ్చారు. తన సమర్థత, నిబద్ధతను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వర్తించారు. అనేక అవార్డులను అందుకున్నారు. నకిరేకల్లో ఉండగా, హెచ్ఐవీ ప్రాజెక్టుపై శుభావతిని నాటి కలెక్టర్ ప్రత్యేక శిక్షణకని ఢిల్లీ పంపారు. అదే ప్రాజెక్టుపై జిల్లాలోని ఆర్ఎంపీ/పీఎంపీలతో సహా ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు శుభావతి హెచ్ఐవీపై అవగాహన కల్పించారు. ఆ కృషికి గుర్తింపుగా అప్పటి మంత్రి కొణిజేటి రోశయ్య నుంచి అవార్డును అందుకున్నానని శుభావతి చెప్పారు. నాతోటి సిబ్బంది, ప్రజలు ఎంతో ప్రేమను చూపటం గుర్తుండి పోతుందని అంటారు శుభావతి, ‘ఎంతో కష్టపడి పనిచేశాను. అందరి మన్ననలు పొందాను. స్వచ్ఛందంగా బాధ్యతలను నిర్వర్తించాను. ఇప్పుడు జాతీయ అవార్డు లభించిందంటే నా వృత్తి జీవితం మొత్తానికి అందిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు శుభావతి. భారత రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న వలివేటి శుభావతి ఉభయ తెలుగు రాష్ట్రాల్నుంచి అవార్డు దక్కించుకున్న ఏకై క మహిళగా గుర్తింపు ఎన్నో అవార్డులు.. రివార్డులు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ఆహ్వానంపై బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు, బాలికా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక ప్రసంగాలు చేశారు. గుంటూరు జిల్లాలో బాల్య వివాహాల నిరోధంపై రిసోర్స్ పర్సన్గానూ వ్యవహరించారు. దీనిపై పలు పాటలు రాసి, స్వయంగా గానం చేశారు. అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్లనుంచి అవార్డులను అందుకున్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ సూచనపై ఓటరు అవగాహనపై పాట రాశారు. చైన్నెలో సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్తో స్వరకల్పన చేయించారు. ఈ సందర్భంగా నాటి కలెక్టర్ రేఖారాణి ప్రశంసాపత్రం అందించారు. రక్తహీనతపై అవగాహన కోసం పాట రాశారు. శ్రీకాకుళంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ నిర్వహించిన సేవలకు అవార్డులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్, న్యూట్రిషన్పై శుభావతి రాసిన పాట పాపులరైంది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లోనూ ఏఎన్ఎంల పుస్తకంలో తొలి పేజీలోనే ఆ పాటను ముద్రింపజేశారు. ఏపీ కల్చరల్ అవేర్నెస్ రాష్ట్రస్థాయి ఉత్తమ పౌరురాలి అవార్డు, శ్రీకాకుళంలో ఆంధ్రరత్న అవార్డు వంటివెన్నో తనకు అలంకారాలుగా మారాయి. భర్త ప్రైవేటు ఉద్యోగి, ఏకై క కుమారుడు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పటల్లో పని చేస్తున్నారు. రిటైరయ్యాక సొంత జిల్లా గుంటూరులోనే స్థిరపడ్డారు. -
తోడికోడళ్లకు మంత్రి మనోహర్ నివాళి
తెనాలిరూరల్: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన తోడికోడళ్లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిల మృతదేహాలు శుక్రవారం సాయంత్రం తెనాలికి చేరుకున్నాయి. నందులపేటలోని కవిరాజ పార్కు రోడ్డులో అక్షరగీత విద్యానికేతన్ వద్ద బంధువుల సందర్శనార్ధం మృతదేహాలను ఉంచారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మృతదేహాలకు నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. -
తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం
● ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి ● అండర్–16 టెన్నిస్ పోటీలు ప్రారంభం గుంటూరు వెస్ట్ (క్రీడలు): పిల్లలు శారీరకంగా, ఽమానసికంగా ధృఢంగా ఉండాలంటే క్రీడా సాధన ఎంతో కీలకమని ఏసీబీ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మి తెలిపారు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియం సింథటిక్ కోర్టులో అండర్–16 ఓపెన్ బాలబాలికల టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయలక్ష్మి మాట్లాడుతూ కొందరు తల్లిదండ్రులు చదువులకిచ్చే ప్రాధాన్యత పిల్లల ఆరోగ్యానికి ఇవ్వడం లేదన్నారు. దీంతో పిల్లల్లో అధిక శాతం ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జంక్ ఫుడ్తోపాటు మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీలైనంత వరకు వారికి దూరంగా ఉంచాలని సూచించారు. టెన్నిస్ విలువ తెలిసిన సీనియర్ ఆటగాడు ఎస్.రామకృష్ణ ఈ టోర్నమెంట్ను స్పాన్సర్ చేయడం అభినందనీయం అన్నారు. పోటీల నిర్వాహకుడు షేక్ అహ్మద్ మాట్లాడుతూ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. మొత్తం 36 మంది చిన్నారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతరం పోటీలను జయలక్ష్మి,, రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ బీఎన్ఎన్ మూర్తి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ పి.శామ్యూల్ జొనాథన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఎన్.సాంబశివరావు, జీవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ కార్యాలయంలో కారు చోరీ చేసిన దొంగ అరెస్టు
లక్ష్మీపురం: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో కారు చోరీ చేసి పరారైన ఘటనలో వ్యక్తిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నట్టు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 28వ తేదీన కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన పనకనపల్లి రాంప్రసాద్ రెడ్డి 2009–2014 వరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్లో ఓలా క్యాబ్, అలాగే మరి కొన్ని చోట్ల డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. ఆర్థిక పరిస్ధితులు అనుకూలంగా లేని కారణంగా మరలా తిరిగి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వద్ద పనిచేసేందుకు ఈనెల 28వ తేదీన గుంటూరు విద్యానగర్లోని రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ సాంబశివరావు వద్దకు వచ్చి పని కావాలని అడిగాడు. ప్రస్తుతం పనిలేదని ఆయన చెప్పాడు. కొద్ది రోజుల తరువాత చూద్దాం అని చెప్పడంతో కడప నుంచి వచ్చానని, రెండు రోజుల ఇక్కడే ఉండి వెళ్తానని చెప్పాడు. గతంలో ఉన్న పరిచయాల వల్ల ఆఫీస్ వద్దనే ఉన్నాడు. అయితే అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ డ్రైవర్గా పని చేసే సంతవరపు నాగార్జున ఏపీ 07జెడ్ 2137 నంబర్ గల కారును కార్యాలయం వద్ద పార్కింగ్ ప్రదేశంలో పెట్టి తాళాలు కార్యాలయంలో పెట్టి వాచ్మెన్కు చెప్పి వెళ్లిపోయాడు. తరువాత రాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాద్ ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును, వాచ్మన్ సెల్ఫోన్ను చోరీ చేసి పరారైయ్యాడు. దీంతో కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో చోరీ చేసిను కారులో ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును ఆపి పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు రాంప్రసాద్రెడ్డిని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న ప్రియురాలిని కలసి, కారు తిరిగిద్దామని వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు అంగీకరించాడు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది ఆంజనేయులు, ప్రసాదరావు, శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్కు వచ్చాడు. హైడాటిడ్ సిస్ట్ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్కుమార్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శ్యాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు, నర్సింగ్ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అభినందించారు. -
ఏడాదిలోనే ప్రజావ్యతిరేకత
● జూన్ 4న ‘వెన్నుపోటు దినం’లో ప్రజలకు చేసిన మోసం బహిర్గతం చేయాలి ● నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెనాలి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఏడాదికాలంలోనే వ్యతిరేకత పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కన్నా అధికంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీనిచ్చారని, పవన్కల్యాణ్ భరోసానిచ్చారని గుర్తుచేశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదన్న భావనకు ప్రజలు వచ్చారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాన్నీ, హామీలనిచ్చి మోసగించిన తప్పిదాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ బహిర్గతం చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం పార్టీ పిలుపు మేరకు జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ను విజయవంతం చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 4న జరగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన పార్టీ ముఖ్యనేతల సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. ‘వెన్నుపోటు దినం’ పోస్టరును ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో 184 హామీలను ఇచ్చారనీ, పైగా ఇంకా సూపర్సిక్స్ ఉన్నాయని గుర్తుచేశారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్కు గ్యారెంటీ’ అన్నారని చెప్పారు. ఏ పథకాన్నీ అమలు చేయలేదని చెబుతూ అదేమంటే రూ.4 వేల పింఛను ఇస్తున్నామని వారే చెబుతున్నారని రాంబాబు అన్నారు. గ్యాస్బండకు డబ్బులు ఇచ్చామంటున్నా 1.49 కోట్ల కనెక్షన్లు ఉంటే 30–40 వేలకు మించి ఇవ్వలేదన్నారు. కార్యకర్తల నుండి పెద్ద నాయకుల వరకు అందరిపైనా కేసులు పెట్టటం, జైళ్లకు పంపటం, బెయిలు రాకుండా చేస్తూ భయపెట్టాలని చూడటం మినహా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబునాయుడు గతంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు మరో రెండు పార్టీలతో కలిసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏటా రూ.15 వేలు ఇస్తామన్నారని, రైతుభరోసా కూడా లేదన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవన్నారు. విజయవంతానికి కార్యాచరణ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో జూన్ 4న ఉదయం 10 గంటలకు మార్కెట్ సెంటర్ నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం నిరసన ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. విజయవంతానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాలనలో ఏవిధంగా మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి పాలనలో ఎటువంటి లబ్ధి కలిగిందీ, ఎలా జీవనప్రమాణాలు పెరిగాయి? చంద్రబాబు హామీలను అమలుచేయకుండా ఏవిధంగా మోసం చేసిందీ స్పష్టంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లిముంత పోతురాజు, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డటి సురేంద్ర, అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, తెనాలి పట్టణ, రూరల్ మండల, కొల్లిపర మండలాల అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, కొర్ర యశోద, మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ దుబాయ్బాబు మాట్లాడారు. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ సీనియర్ నేతలు మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, తాడిబోయిన రమేష్, జొన్నల శివారెడ్డి, బొంతు నరేంద్రరెడ్డి, బూరెల దుర్గాప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, ఈద యశ్వంత్రెడ్డి, కుర్రా జస్వంత్, బండ్లమూడి నాని, తదితరులు పాల్గొన్నారు. అక్కిదాసు కిరణ్ స్వాగతం పలికారు. ఆయా కమిటీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై -
వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురుని పలు పదవుల్లో నియమిస్తూ.. ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన కళ్లం హరికృష్ణారెడ్డిని, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వేలూరి అనిల్రెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి షణ్ముఖ్ (నాని)లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రధానోపాధ్యాయులకు ఉద్యోగోన్నతి ధ్రువపత్రాలు అందజేత గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, నగరపాలకసంస్థ పాఠశాలల్లో ఉద్యోగోన్నతులపై నియమితులైన ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ధ్రువపత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జనరేట్ అయిన ఉద్యోగోన్నతుల ధ్రువపత్రాలను హెచ్ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ హెచ్ఎం ఏ.తిరుమ లేష్, హెచ్ఎంగా ఉద్యోగోన్నతి పొందిన షేక్ మొహ్మద్ ఖాసిం పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు చెరుకుపల్లి: లారీ, బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మోరవాగుపాలెం నుంచి చందోలు వైపు లారీ వస్తోంది. అదే సమయంలో మచిలీపట్నం నుంచి నెల్లూరు వైపునకు వెళ్తున్న బొలెరో చందోలు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ సమీపంలోకి వచ్చింది. రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బొలెరోలో ఉన్న డ్రైవర్ దుర్గారావుకు తీవ్రగాయాలు అయ్యాయి. క్లీనర్ చంద్రమౌళి స్వల్పగాయాలతో బయటపడ్డారు. -
పొగాకు.. ఆరోగ్యానికి చేటు
● నేడు నో టుబాకో డే ● బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ● పొగాకు వినియోగంతో అనేక నష్టాలు ప్రకృతి వనరులను కాపాడుకోవాలి గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం మొదలుపెట్టే ధూమపానం చివరకు ప్రాణాలనే హరిస్తుంది. సిగరెట్, బీడీ, చుట్ట తాగే అలవాటు వ్యసనంలా మారి మనిషిని బానిసను చేసుకుంటుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో 40 శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానంతో కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా మే 31వ తేదీన నో టుబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. జిల్లాలో బాధితులు అధికమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 35 శాతం మంది యువత ధూమపానం చేస్తున్నారు. వివిధ రోగాలతో 30 – 39 ఏళ్ల వయస్సు వారిలో చనిపోతున్న ప్రతి ఐదుగిరిలో ఒకరు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లేనని తేలింది. గుంటూరు జీజీహెచ్లో ప్రతి నెలా 1,200 మంది పురుషులు, 2 వేల మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్లతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 శాతం మంది కేవలం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందించేందుకు 15 ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. వీటిల్లో రోజూ 400 మంది వరకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. చట్టం ఏం చెబుతోందంటే.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, బస్ స్టేషన్లు, జనసంచారం ఉండే మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ధూమపానం చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, గుడులకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మటం చట్టరీత్యా నేరం. 18 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు చట్టరీత్యా విక్రయించకూడదు. చట్టాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధూమపానం చేసేందుకు అనుమతించాలి. పొగాకు వినియోగంతో క్యాన్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారిలో 40 శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్కు గురవుతున్నవారే. పొగతాగటం, పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, పాన్పరాగ్ వంటి వాటిని వినియోగించటం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స తీసుకుని త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవచ్చు. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు ధూమపానంతో గుండెజబ్బులు పొగతాగే వారిలో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో 400 రకాల విషపదార్థాలు ఉంటాయి. కార్బన్ మోనాకై ్సడ్ వల్ల గుండెపోటు, టార్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. నపుంసకత్వం, పక్షవాతం పొగరాయుళ్లను వదలవు. పొగతాగే వారికి చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా పొగాకు ప్రభావం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారిలో 70 శాతం మంది ధూమపానం చేసేవారే. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ జీజీహెచ్లో ఉచిత కౌన్సెలింగ్ గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో పొగాకు ఉత్పత్తుల అలవాటు మానేయాలనుకునే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, ఔషధాలు ఇస్తున్నారు. 2019 నుంచి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది 1,263 మందికి చికిత్స అందించడం ద్వారా కొంత మంది స్మోకింగ్ అలవాటు మానేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఛాతీ ముందు భాగంలో, భుజానికి, తొడకు.. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేని చోట నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటిస్తారు. ఈ ప్యాచ్ అంటించి కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రతి నెలా పది మందికి పైగా పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానివేస్తున్నట్లు గుర్తించామని సెంటర్ ఇన్చార్జి డాక్టర్ వడ్డాది వెంకట కిరణ్ తెలిపారు. -
ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదని.. కడపలో మహానాడు పెట్టటం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు.‘‘మహానాడులో చంద్రబాబు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేదీ చెప్పలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా? వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవాడా..?. జగన్ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే. డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే. సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు. జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారు. నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరు. నందమూరి కుటుంబ మహానాడు కాస్తా నారావారి మహానాడులా మారిపోయింది...అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా?. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్లను తీసుకువచ్చారు. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు. గృహ ప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా..?. లోకేష్కి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మహానాడులో ఏఐ ఎన్టీఆర్తో పొగిడించుకుంటారా.. నిజంగా ఆయన బతికే ఉంటే..’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సంక్షేమ పథకాల అమలను అమలు చేయమంటే.. సినిమా డేట్స్ మార్చినట్లు మారుస్తున్నారంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఒక్కమాట మీద చంద్రబాబు ఏనాడూ నిలపడలేదని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని ఎవరు నడపబోతున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేశారని.. కేవలం మాటలు చెప్పి సీమ ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘సీమ గడ్డకు మీరు చేసిన అన్యాయాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని కానీ, హైకోర్టు కానీ ఉండాలి. కానీ ఏదీ చేయకుండా మా ప్రాంత ప్రజలను మోసం చేశారు. మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియో ద్వారా పొగిడించుకున్నారు. నిజంగా ఎన్టీఆర్ బతికి ఉంటే మీ గురించి ఏం మాట్లాడే వారో మీకు తెలియదా..?. సీమకు వచ్చిన అనేక ప్రాజెక్టులను కూడా చంద్రబాబు తరలించారు. మహానాడు సాక్షిగా రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి మీరు చెప్పిన హామీలు మర్చిపోయారా..?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘మీరు రాయలసీమ అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. హంద్రీనీవాను కూడా సకాలంలో పూర్తి చేయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం తలపెట్టారు. రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉంటే కనీసం మా హైకోర్టును మాకివ్వాలి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ తిరిగి మాకే ఇవ్వాలి. అన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ అవసరాలు తీర్చాలి. 50 లక్షల చదరపు అడుగులతో రాజధాని అంటున్నారు. అమరావతి కోసం చేసే అప్పులు అందరూ తీర్చాలా?. మా సంపద తీసుకువచ్చి అమరావతిలో ఖర్చు చేయటం భావ్యమా..?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నలు గుప్పించారు. -
ఆలయ భూముల హస్తగతానికి కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దేవాదాయశాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారుచౌకగా దేవాలయ భూములను అడ్డతోవలో ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయ స్థానాలు నిర్ధేశించిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన వారికి కారు చౌకగా దేవుడి భూములు కట్టబెట్టేందుకు సిద్దమైంది. దాతలు స్వామివారి నైవేద్యం కోసం ఆలయాలకు విరాళంగా ఇచ్చిన భూములను క్యాబినెట్ ఆమోదం లేకుండా, వేలం నిర్వహించకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సేవా సంస్థల ముసుగులో నచ్చిన వారికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు ఈ నెల 2న ప్రభుత్వం జీవో నంబర్ 139 విడుదల చేసింది.అంతేకాకుండా ప్రస్తుత లీజు దారులకు మరో 33 ఏళ్లు లీజు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం న్యాయస్థానాల ఆదేశాలను లెక్కచేయకపోవడమే. దేవాదాయ శాఖ భూములను లీజుకు ఇవ్వాలంటే టెండర్ విధానం ద్వారా బహిరంగ వేలం నిర్వహించి ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వారికివ్వాలి. వ్యవసాయేతర భూములను 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వకూడదని కోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేవాదాయ శాఖ భూములను తన వారికి అప్పనంగా కట్టబెట్టేందుకు న్యాయస్థానాల ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్నారు.ధార్మిక సంఘాలను సంప్రదించలేదురాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములుంటే అందులో 87 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఖరీదైన 4,244 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. రూ. 5 లక్షల విలువ దాటిన పనులను నామినేషన్ పద్దతిన ఇవ్వకుండా గత వైయస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోంది. దేవుడి భూములు లీజుకు ఇవ్వాలంటే వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వేలం లేకుండా రూ. వేల కోట్ల విలువైన భూములను అప్పగించడానికి చట్ట సవరణ చేయడం దుర్మార్గం.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఆలయాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. హిందూ సమాజం, ధార్మిక సంఘాలను కనీసం సంప్రదించాలన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా చట్టసవరణ చేసేందుకు జీవో ఇస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ కుట్రను వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మఠాలు, సత్రాల పేరిట ఉన్న విలువైన భూములను సేవా సంస్థల ముసుగులో ఎలాంటి వేలం లేకుండా ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 139ని తక్షణం రద్దు చేయాలి. హిందూ సమాజానికి బ్రాండ్ అంబాసిడర్లంటే దేవాలయాల ఆస్తులను దోచుకోవడమేనా? ఒకవైపు ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతుంటే పట్టించుకోకపోగా మరో వైపు ఆలయాల ఆస్తులనే కాజేసే కుట్రలు చేస్తున్నారు. -
వెన్నుపోటు దినంగా జూన్ 4.. పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్ది. అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవిచూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడే వైఎస్ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు. 1995లో సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తరువాత 1999, 2014, 2024లోనూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలుచంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ సొమ్ము దేనికి వినియోగించారో తెలియదు. ఆనాడు మామాకు వెన్నుపోటు పొడిస్తే, ఈ రోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. దీనిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్సీపీ వెన్నుపోటుదినంను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్ళి స్థానికంగా ఉన్న అధికారులకు మెమోరాండంలు సమర్పిస్తాయి. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, సాకె శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, కుంభా రవి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకులు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, ఎన్.చంద్రశేఖర్రెడ్డి, కొమ్మూరి కనకారావు, చల్లా మధుసూధన్రెడ్డి, మనోహర్రెడ్డి, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
‘కూతురు కొడుకు ఎన్టీఆర్కు వారసుడా?’
సాక్షి, తాడేపల్లి: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప.. నారా లోకేష్ ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ..‘మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్కు కూతురు కొడుకైన నారా లోకేష్.. ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడు?. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్, ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడు కాలేడు. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం. ఇలాంటి దగుల్బాజీ రాజకీయం చేసే వారు ప్రపంచంలో ఈ తండ్రీకొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు. అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. రెడ్ బుక్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అడుగుపెట్టడానికే వణికిపోతున్నారు. ముంబై నుంచి సినీ నటిని రప్పించి, ఆమెతో ఆరోపణలు చేయించి.. ఆమెను అడ్డం పెట్టి జిందాల్ కంపెనీ రాకుండా తరిమేశారు’ అని విమర్శలు చేశారు.కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రష్టుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్ను తిట్టడానికే సరిపోయింది. టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. .@naralokesh ఎన్టీఆర్ గారి వారసుడిగా కాలేడు:మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్కు కూతురు కొడుకైన నారా లోకేష్, ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడు?నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన… pic.twitter.com/mpEcSgXMPT— YSR Congress Party (@YSRCParty) May 29, 2025పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’ అని మండిపడ్డారు. -
ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం గెలుచుకున్న జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు. మీ గెలుపు భారత్, ఆంధ్రప్రదేశ్కు గర్వ కారణం’ అని పేర్కొన్నారు. Heartiest congratulations to @JyothiYarraji on winning the Gold in Women’s 100m Hurdles at the 26th Asian Athletics Championships in Gumi, South Korea! A proud moment for both India and Andhra Pradesh. Wishing you many more accolades ahead!#AAC2025 pic.twitter.com/IlVI79is5d— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025 -
బిల్లుల్లోనూ పచ్చపాతం
నెహ్రూనగర్: జనవరి 10వ తేదీన గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటించే ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు షో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ.35 లక్షలు వెచ్చించి తెప్పించారు. ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నేటికీ నగరపాలక సంస్థ అధికారుల వద్ద లెక్క లేదు. అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొక్కలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. దీనిపై సాక్షిలో ఏప్రిల్ 13వ తేదీన ‘ఎండిన మొక్కలు..తేలని లెక్కలు’ పేరిట కథనం ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. దీంతో ఎక్కడ ఈ బిల్లు ఆపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడు ఏడీహెచ్గా పనిచేసిన శ్రీనివాస్ను సరెండర్ చేసి మరీ సదరు బిల్లు రూ.35 లక్షలు ప్రాసెస్ చేసినట్లు సమాచారం. ఖర్చుల బిల్లు వస్తే ఒట్టు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ రోజు పోలింగ్, తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బ్యారికేడింగ్, డిపార్ట్మెంట్ సిబ్బందికి సంబంధించిన భోజనాలు, టీ, కాఫీలు, స్నాక్స్, ఇతర స్టేషనరీ వంటి పనులు కాంట్రాక్టర్లు సుమారు 1.50 కోట్ల వర్కులు ఇంజినీరింగ్ అధికారుల హాహీతో చేపట్టారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బిల్లులను అధికారులు ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వడ్డీలకు తీసుకొచ్చి... కొంతమంది కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో స్థలాలు, ఇళ్లు తనాఖాలు పెట్టి పనులు చేశారు. ఆ వర్కులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ పడుతోంది. మరికొంత మంది కాంట్రాక్టర్లు బయట వ్యక్తుల వద్ద నుంచి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వలన తాము అప్పుల్లో కూరుకుపోతున్నామని బహిరంగంగానే వాపోతున్నారు. ఏదో విధంగా బిల్లు ప్రాసెస్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను వేడుకుంటున్నారు. సిఫార్సులు.. పర్సంటేజీలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో చేసిన వర్కుల బిల్లులు ప్రాసెస్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన వర్కులకు మాత్రమే బిల్లులు ప్రాసెస్ అవుతున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైపా వడ్డీలు కట్టుకోలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతకొంత ముట్టజెప్పి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు కూడా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక అధికారులు అడిగినంత ఇచ్చుకుని ప్రాసెస్ చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు. బిల్లుల ప్రాసెసింగ్లో మున్సిపల్ అధికారుల తీరిది తమ అనుకునే వారికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత అవసరం లేదనుకున్న వారికై తే నెలల తరబడి పెండింగ్ ఇటీవల సీఎం పర్యటనకు రూ.35 లక్షల విలువైన మొక్కలు ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో కూడా తెలియని దుస్థితి రూ.35 లక్షల బిల్లు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి ఇంకా పెండింగ్లోనే ఏడాది క్రితం ఎన్నికల ఖర్చు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమ అనుకునే కాంట్రాక్టర్ల బిల్లు ప్రాసెస్ చేయడంలో చూపుతున్న ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మిగతా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మొండి చేయి చూపుతున్నారనేది జగమెరిగిన సత్యం. గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంత మందికి బిల్లులు చెల్లింపులు జరపకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు పర్సంటేజ్ రూపంలో ముడుపులు సమర్పించుకుంటే ఎప్పటి బిల్లు అయినా ప్రాసెస్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే చెల్లింపులు ఎవరైనా కాంట్రాక్టర్ అత్యవసరం అని అడిగితే సదరు బిల్లుల చెల్లింపులు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తున్నాం. – నమ్రత్కుమార్, అకౌంటెంట్ -
ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: లాసెట్ అభ్యర్థులకు ఉచిత మోడల్ లాసెట్ ఎంతగానో ఉపయోగకరమని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రొసిక్యూషన్ ఎండీ.బర్కత్ అలీ అన్నారు. ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ను గురువా రం నగరంపాలెంలోని ఆయన కార్యాలయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ పల్లపు కృష్ణ, బి.కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, స్పాట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఎ.శేషగిరిరావులు ఆవిష్కరించారు. శేషగిరిరావు మాట్లాడుతూ ఈ పరీక్షను జూన్ ఒకటిన గుంటూరు శ్యామలానగర్ ఒకటో వీధిలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహిస్తామని అన్నా రు. ఉదయం పది గంటలకు పరీక్ష మొదలువుతుందని, మరిన్ని వివరాలకు 8297483785 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కొండవీటి శ్రీనివాసరావు, కె.వీరభాస్కర్, న్యాయవాదులు కె.నారాయణ చిన్న, జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. హత్య కేసులో రిమాండ్ బల్లికురవ: మండలంలోని కొమ్మినేనివారి పాలెంలో గత ఏడాది అక్టోబర్ 4న జరిగిన హత్య కేసులో నిందితుడు పి. నారాయణరెడ్డికి అద్దంకి కోర్టు న్యాయమూర్తి బుధవారం 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వై. నాగరాజు తెలిపారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
మాచర్ల మండలం కొప్పునూరుకు చెందిన గొర్రెల కాపరిగా గుర్తింపు బండారుపల్లి(తాడికొండ): పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం బండారుపల్లి గ్రామ పంట పొలాల్లో జరిగింది. వివరాల ప్రకారం.. మాచర్ల మండలం కొప్పునూరుకు చెందిన రేఖా ఆంజనేయులు గొర్రెల మందతో సంచరిస్తూ బండారుపల్లి గ్రామ పంట పొలాల్లో మధ్యాహ్నం సమయంలో విరామం కోసం చెట్టు కిందకు వెళ్లాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో చెట్టుపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వెంట ఉన్న కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు సీఐ కె వాసు తెలిపారు. పిడుగుపాటుకు గేదె మృతి తాడేపల్లిరూరల్: తాడేపల్లి రూరల్ ప్రాతూరులో పిడుగు పాటుకు గురువారం ఒక పాడి గేదె మృతి చెందింది. తాడేపల్లి పశువైద్యులు డాక్టర్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రాతూరు గ్రామానికి చెందిన మోటేపల్లి సాయిచందు అనే రైతు ఏడు గేదెలను పెంచుతున్నాడని, ప్రతి రోజు గడ్డి కోసం కృష్ణానది తీరానికి తీసుకువెళతాడని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిడుగులతో కూడిన వర్షం పడింది. గేదెలు మేస్తున్న దగ్గరగా పిడుగు పడడంతో ఒక పాడిగేదె మృతి చెందిందన్నారు. -
పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం
తెనాలి: ఆంధ్యా ప్యారిస్ తెనాలిలోని బుర్రిపాలెంరోడ్డులో తొమ్మిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఓంకారాశ్రమం ఇప్పుడు పవిత్ర పూజాక్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా స్వార్థపరుల కారణంగా కునారిల్లుతూ వచ్చిన ఆశ్రమమిది. ఆశ్రమ స్థలాన్ని పవిత్ర సందర్శనీయ స్థలంగా చేయాలని గత ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఫలితంగానే ఇప్పుడు ఆశ్రమ స్థలంలో పరివార దేవతా, శిఖర, ధ్వజస్తంభ, శ్రీశరభ సాళ్వేశ్వరస్వామి, శ్రీపార్వతీ సమేత శ్రీఓంకారేశ్వరస్వామి వార్ల ఆలయం నిర్మించారు. ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుంచి ఆరంభించారు. తెనాలి బుర్రిపాలెంరోడ్డులోని ఓంకారాశ్రమం 1932లో ఏర్పాటైంది. కాకుమాను శ్రీరాములు అనే ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆశ్రమాన్ని స్థాపించారు. సాధువులు ధ్యానం చేసుకునేందుకు, వారి పోషణ కోసమనే భావనతో ఏర్పాటైన ఆశ్రమానికి అప్పట్లో శ్రీవ్యాస ఆశ్రమ నిర్వాహకుడు మలయాళస్వామి శంకుస్థాపన చేశారు. ఆశ్రమం తరపున పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య కోసమని దాతలు 12.83 ఎకరాల మాగాణి భూమిని సమకూర్చారు. దాతల లక్ష్యం నిర్విఘ్నంగా నెరవేరింది. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరిగాయి. అప్పట్లో ఆశ్రమానికి స్వామీజీలు ట్రస్టీలుగా ఉండేవారు. 1947–1963 మధ్య ఆశ్రమానికి గల మాగాణి భూమిని విక్రయించారు. ఆ డబ్బుతో గంగానమ్మపేటలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలో రెండు ఇళ్లు, చెంచుపేటలోని గోడౌన్ కొనుగోలు చేశారు. ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మలయాళస్వామి మరణంతో ఆశ్రమ ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మొదలయ్యాయి. 1980 వరకు పరంపరగా సాగాయి. అనంతరం ట్రస్టీలు ఏర్పాటైనా 1996లో ఆశ్రమ నిర్వహణ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పట్నుంచి అభివృద్ధి శూన్యమైంది. పైగా 1983లో ఆశ్రమంలో గల ధ్యానమందిరాన్ని కూల్చారు. 1998లో ఆశ్రమ స్థలంలోని 80 సెంట్ల స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు లీజుకిచ్చారు. కోర్టు వివాదంతో ప్రైవేటు విద్యాసంస్థకు లీజు ఆగిపోయింది. లాడ్జికి అద్దెకు ఇచ్చిన భవనం శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలోని భవనాన్ని గతంలో కొంతకాలం లాడ్జికి అద్దెకిచ్చారు. కొన్ని నెలలు రిక్రియేషన్ క్లబ్ కూడా నడిచింది. దేవదాయశాఖ చర్యలతో ఏడాదికి రూ.5.23 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఆశ్రమానికి 2022లో అవుతు శ్రీనివాసరెడ్డి ఈవోగా వచ్చారు. వేలం ఆదాయం పెరిగేలా చూశారు. అప్పట్నుంచి ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఆశ్రమ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. 1.40 ఎకరాల ఆశ్రమం స్థలం ముందుభాగంలో ఆలయం నిర్మాణానికి 2023 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. దేవదాయశాఖ రూ.26.66 లక్షలు, ఆశ్రమ నిధులు రూ.13.34 లక్షలు, దాతల సహకారంతో నిర్మాణం పూర్తయింది. రేపు ప్రతిష్టా మహోత్సవం ఈనెల 31వ తేదీన ఉదయం 8.19 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. గురువారం వేదస్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి, సంప్రదాయ పూజలను ఆరంభించారు. రెండురోజుల పూజల అనంతరం 31న యంత్రబింబ, ధ్వజ ప్రతిష్టలు, కళాన్యాసము, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవదాయశాఖ డీసీ కె.బసవ శ్రీనివాసరావు పాల్గొంటారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆశ్రమంలో ఓంకారేశ్వరస్వామి ఆలయం ఆరంభమైన ప్రతిష్టా మహోత్సవాలు -
తప్పిపోయిన చిన్నారి
మంగళగిరి టౌన్ ః ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన ఓ చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి అజయ్నగర్కు చెందిన తేజస్విని అనే పాప ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న సీఐ వినోద్ కుమార్ కంటపడింది. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అజయ్నగర్ అని, తండ్రి పేరు విజయ్ అని చెప్పడంతో ఆ చిన్నారిని తీసుకుని అజయ్నగర్లోని పాప నివాసానికి వెళ్లి తేజస్విని తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా ఇంటికి రావడంతో సిఐ వినోద్కుమార్కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగింత -
జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి
లక్ష్మీపురం: వస్తు సేవల పన్నుతో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో ప్రీ జీఎస్టీ డే వేడుక నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జీఎస్టీతో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని అభినందించారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటన్స్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ ఆడిట్లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు. నేషనల్ కనూ్స్య్మర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రాణ రక్షణ కోసం వాడే మందులపై జీఎస్టీని తక్షణమే తీసివేయాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్నును కూడా రద్దు చేయాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి అధికారులు సమీక్ష చేయాలన్నారు. ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే ఉండాలని సూచించారు. పలువురు పరిశ్రమ ప్రతినిధులు జీఎస్టీ అంశాలపై తమ అభిప్రాయాలను తెలిపారు. కమిషనర్ సుజిత్ మల్లిక్ను ట్రేడ్ వర్గాల వారు సన్మానించారు. కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్, వి. వెంకటేశ్వరరావు, మనోజ్ కుమార్, మరియదాసు, రాయలు, ఆనందరావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ -
గోళ్లమూడి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలి
పెదకాకాని: గోళ్లమూడి తాగునీటి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వైవీ షణ్ముఖకుమార్ అన్నారు. పెదకాకాని మండలం గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వహణ పరిశీలన కోసం గురువారం రాష్ట్ర బృందం పర్యటించింది. ఆయన మాట్లాడుతూ గోళ్లమూడిలోని తాగు నీటి చెరువును పల్లె పుష్కరిణి కింద చేపట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. తాగునీటి అవసరాలపై గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ఉప్పలపాడులో పంట కుంట(ఫాం పాంట్స్) తవ్వుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. శ్రామికులకు రోజువారి వేతనం కనీసం రూ.290 ఉండేలా చూ డాలన్నారు. పంట కుంట నిర్మాణం చేపట్టిన రైతులతో మాట్లాడి సూచన చేశారు. కుంట కట్టలపై పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పెంచడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. చేపల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు. అనంతరం లాలుపురం గ్రామంలో పర్యటించారు. ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు షణ్ముఖకుమార్ గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాలు సందర్శన -
కౌన్సెలింగ్లో ఉపాధ్యాయులకు ముప్పుతిప్పలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహణలో విద్యాశాఖ దారుణంగా విఫలమైంది. గుంటూరు జోన్–3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 17 హెచ్ఎం పోస్టులతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల పరిధిలో మరో 56 గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున పిలిచారు. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో గురువారం ఉదయం 8 గంటలకల్లా ఉండాలని స్పష్టం చేశారు. గుంటూరుతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి సైతం ఉపాధ్యాయులు తరలివచ్చారు. ప్రభుత్వ హైస్కూళ్లలో హెచ్ఎం పోస్టులకు గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేసిన అధికారులు ఇదిగో, అదిగో అంటూ సాయంత్రం 6 గంటల వరకు ఎటూ తేల్చకుండా ఉండిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీలతో ఈ నెల 30న ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ రెండు రోజుల ముందుగానే 28న నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైన విద్యాశాఖాధికారులు గురువారం మరోసారి అదే తీరును కొనసాగించారు. విద్యాశాఖ తీరుతో విసుగెత్తిపోయిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళనకు దిగడంతో సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు, పల్నాడు డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ వచ్చి మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉద్యోగోన్నతుల పేరుతో రెండు రోజులపాటు నరకం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులకు కష్టాలు ఉదయం రావాలని పిలిచి సాయంత్రం వరకు ఎటూ తేల్చని అధికారులు -
రహదారి విస్తరణకు సర్వే ప్రారంభించాలి
ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్తేజ గుంటూరు వెస్ట్: జాతీయ రహదారి 544ని వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్లుగా విస్తరించేందుకు జిల్లా పరిధిలోని జాయింట్ మేనేజ్మెంట్ సర్వేను వెంటనే ప్రారంభించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్తేజ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల పరిధిలో ఈ రోడ్డు 18 కిలో మీటర్ల వరకు ఉంటుందన్నారు. రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దీనిపై వచ్చిన రెండు అభ్యంతరాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణ పరిధిలో ఉన్న విద్యుత్ స్తంభాలు పక్కకు జరపడంతోపాటు పైపులైనులు, కాలువలకు అంచనాలు తయారు చేయాలని పేర్కొన్నారు. డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఎన్హెచ్ పీడీ పార్వతీశం పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించండి జిల్లాలోని పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రియల్, ఎక్స్పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని గాలికొదిలేసిన కూటమి సర్కార్
పట్నంబజారు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల ఆటోలు, 10 వేల వరకు కార్లు (ట్యాక్సీ ప్లేట్) ఉన్నాయి. 2019–24 మధ్య ఈ కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలిచింది. ప్రతి ఆటో, ట్యాక్సీ, క్యాబ్, మాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిని అన్ని విధాలుగా ఆదుకుంది. వైఎస్సార్లో... ఎస్ అనే అక్షరాన్ని శ్రామికులకు అంకితం చేసిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్మికులకు అండగా తాను ఉంటూ భరోసా కల్పించారు. రూ.10 వేలు ఏటా అందజేసి కార్మిక కుటుంబాలకు అండగా నిలబడ్డారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవరన్న సంక్షేమానికి తోడ్పాటు అందించారు. ఏడాదికి రూ.10 వేలు అందించటం ద్వారా ఆటోడ్రైవర్లు, కార్ డ్రైవర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్పీ), ఇన్సూరెన్స్, ఇతరత్రా అవసరాలకు ఎంతగానో ఉపయోపడేది. దీంతో పాటుగా నవరత్నాలకు సంబంధించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయంబర్స్మెంట్తోపాటు అనేక సంక్షేమ పథకాలు ప్రతి డ్రైవరన్న ఇంటి ముంగిటకు తీసుకెళ్లిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదే. 2024 ఎన్నికల్లో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతోపాటు హెవీ, టిప్పర్ లైసెన్స్లు ఉన్న వారికి రూ ఏడాది రూ.15వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో చెప్పారు. కూటమి పాలన ఏడాది పూర్తి కావస్తున్నా కనీసం ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరికీ అందజేసిన పాపాన పోలేదు. చాలామంది ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కింద ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులు వంటి వాహనాలను ప్రైవేట్ ఫైనాన్స్ల నుంచి అప్పు చేసి మరీ తీసుకుని నడుపుతున్నారు. ఇలా ప్రభుత్వానికి రూ.కోట్లు పన్నులు చెల్లిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. ఒకవైపు భారీగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో జీవో నెంబర్ 21 రద్దు చేసి, వాహనదారులపై పడుతున్న గ్రీన్ ట్యాక్స్ను కూడా తగ్గిస్తామని కూటమి చెప్పింది. అధికారంలో వచ్చిన తరువాత కూడా 21, 31 నంబరు జీవోలతో భారీ జరిమానాలతో తమకు వస్తున్న అంతంత మాత్రం ఆదాయంలో చాలా వరకు నష్టపోతున్నామని డ్రైవర్లు, మోటారు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భారీగా జరిమానాకేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో అమలు చేస్తున్న జీవో నంబరు 21తో డ్రైవర్లపై భారీ జరిమానాలు విధిస్తూ ఆర్థికంగా నడ్డి విరుస్తున్నారు. గతంలో డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పాల్యూషన్, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.500 నుంచి రూ.750 వరకు జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం జీవో నంబరు 21 వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేలు, పర్మిట్ లేకపోతే రూ.10 వేలు, ఇన్సూరెన్సు లేకుంటే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, ఫిట్నెస్ లేకపోతే రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. దీంతో రవాణా రంగంతోపాటు, డ్రైవర్లపైనా పెనుభారం పడుతోంది.వైఎస్సార్ సీపీ హయాంలో......వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా జిల్లా వ్యాప్తంగా అర్హత గల ట్యాక్సీ, ఆటో, మ్యాక్సీ క్యాబ్తోపాటు పలు వాహనాల డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున అందజేశారు. తాను కార్మికుల పక్షపాతినని ఆయన చాటి చెప్పారు. డ్రైవర్లకు అందించిన సాయాన్ని పట్టికలో చూడొచ్చు.ఇవన్నీ ఎంతో కీలకండీజిల్, పెట్రోల్ ధరలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఆటో విడి భాగాల ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఆటో డ్రైవర్ల ఆదాయానికి నష్టం కలిగించే ఆన్లైన్ యాప్స్ రద్దు చేయాలి. పాత ఈ– చలానాలు రద్దు చేయాలి. డ్రైవర్లకు వ్యక్తిగత బీమా రూ.10 లక్షలు అమలు చేయాలి. కేంద్రం విడుదల చేసిన 894 గెజిట్ రద్దు చేయాలి. ప్రమాదాల నివారణ పేరుతో డ్రైవర్లకు ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించే యాక్టు 106(1) (2) ప్రమాదకరం. జీవో 21, 31 రద్దు చేస్తే డ్రైవర్లకు మేలు జరుగుతుంది.వీటి సంగతి ఏంటో..బ్యాడ్జి కలిగిన అన్ని వాహనాల డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయంభారీ జరిమానాలకు కారణమవుతున్న జీవో సంబరు 21, 31ల రద్దుడీజీల్, పెట్రోల్ ధరల తగ్గింపుటాటా మ్యాజిక్ వ్యాన్లు, జీపులు, కార్లకు గ్రీన్ టాక్స్, లేబర్ టాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్ గేట్ ఫీజుల తగ్గింపుడ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు మంజూరుచంద్రన్న బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంరవాణా రంగంలోకి ఆన్లైన్ యాప్స్ వచ్చాక ఆటో డ్రైవర్లు బేరాలు లేక నష్టపోతున్న పరిస్థితి. రోజంతా తిరిగితే రూ.500 నుంచి రూ.800 వరకు వస్తోంది. డీజిల్, ఇతర ఖర్చులు పోనూ మిగిలే రూ.200తో కుటుంబాన్ని నెట్టుకురావాలి. ఇటువంటి దయనీయ పరిస్థితిలో కొత్త జీవోలతో భారీ జరిమానాలు చెల్లించలేక అప్పులపాలవుతున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.10 వేలు వాహనమిత్ర ఇచ్చేది. ఆటోల మరమ్మతులు వంటి వాటికి ఉపయోగపడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.– వరగాని ప్రవీణ్కుమార్, ఆటోడ్రైవర్వైఎస్సార్సీపీ హయాంలో అందిన సహాయంసంవత్సరం లబ్ధిదారుల అందించిన సాయంసంఖ్య (రూ.కోట్లలో)2019–20 20,594 20.952020–21 25,177 25.182021–22 23,837 23.842022–23 12,137 12. 132023–24 12,540 12.54మొత్తం 94,645 94.64 -
తోడికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం
తెనాలి రూరల్: అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోడికోడళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలుముకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే తోడికోడళ్ల బంధం మరణంలోనూ వీడలేదు. పట్టణానికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిలు తోడికోడళ్లు. ఝాన్సీరాణి కుమారుడు నాగార్జున, ఆడపడుచు పార్వతితో కలిసి వీరు ముగ్గురు గురువారం అరుణాచలానికి కారులో పయనమయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని ఒంగోలు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యకుమారి, సరస్వతికుమారి కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యకుమారి తన భర్త నరసింహారావుతో కలిసి ఇక్కడి కవిరాజపార్కు రోడ్డులో అక్షర గీత విద్యానికేతన్ను స్థాపించారు. సరస్వతికుమారి భర్త వెంకటేశ్వరరావు ఆర్మీలో పని చేసి రిటైరై తెనాలిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఝాన్సీరాణి భర్త నాగేశ్వరరావు గాంధీచౌక్లో పారగాన్ వాచ్ కంపెనీ నిర్వహించేవారు. ముగ్గురు అన్నదమ్ములు గతంలోనే మృతి చెందారు. ఆప్యాయంగా ఉండే తోడి కోడళ్లు అరుణాచలం దర్శనం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆడపడుచు పార్వతిని వెంటబెట్టుకుని ఝాన్సీరాణి కుమారుడు నాగార్జునతో కలిసి తమకు తెలిసిన వారి కారు తీసుకుని బయలుదేరారు. రోడ్డుప్రమాదం రూపంలో వీరి కుటుంబాలను మృత్యువు కబళించింది. సూర్యకుమారికి ఇద్దరు కుమారులు ఉండగా. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. సరస్వతికుమారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవిరాజపార్కు రోడ్డులో నివసిస్తున్నారు. ఝాన్సీరాణి పెద్దకుమారుడు గతంలో మృతి చెందగా, ప్రస్తుతం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద సాయి పథం అపార్ట్మెంట్లో చిన్న కుమారుడు నాగార్జున కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. బాపట్ల జిల్లాలో కారు ప్రమాదం ముగ్గురు మృత్యువాత -
అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం
సత్తెనపల్లి: ‘‘ మీరేమీ ఇబ్బంది పడవద్దు, భయపడ వద్దు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉన్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం..’’ అంటూ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, నరసరావుపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో వారు గురువారం పర్యటించారు. ఏడాది క్రితం టీడీపీ, జనసేన నేతల దాడులు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ళ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రీయాశీలక నాయకుడు కొర్లకుంట శివ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని కలిగించారు. మృతుడు తండ్రి, పాకాలపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జూన్ 3న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పిస్తారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూట్ మ్యాప్ను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్ చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్ మీరాన్, సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, ఎంజే ఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి(సత్తెనపల్లి టౌన్), వేపూరి శ్రీనివాసరావు (రాజు పాలెం), భవనం రాఘవరెడ్డి (నకరికల్లు), నక్కా శ్రీను(ముప్పాళ్ళ), వైఎస్సార్ సీపీ నాయకులు బండి కోటినాగిరెడ్డి, ఏకుల మత్తయ్య, పల్లె గాబ్రియేలు, కోట ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, నేతల బృందం రెంటపాళ్ళ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ జూన్ 3న రెంటపాళ్ళకు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో రూట్మ్యాప్ పరిశీలన -
కార్మికులంటే అలుసు
చంద్రబాబునాయుడు ఏ రోజూ కార్మికులకు మేలు చేసింది లేదు. కార్మికులంటే ఆయనకు ఎప్పుడూ అలుసే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏడాది గడస్తున్నా.. ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా ఫైన్లు పెరిగిపోవటం, చలనాలు, జరిమానాలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నాం. మా సంక్షేమం కోసం ఏ రోజూ ఆలోచించలేదు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుఏటా రూ.15 వేల ఆర్థిక సాయం, 21, 31 జీవోల రద్దు, పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. – మొగిలి పుల్లారావు (డ్రైవర్) -
‘టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్’
తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకు, వైయస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్లుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజలకు కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండ మూడు రోజులు గడిపేశారు. కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారుమహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్ జగన్ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని అర్థమవుతోంది. వైఎస్ జగన్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్, చేయూత, ఆసరా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ గారి ఏడాది పాలనలో ఆఖరి మూడు నెలలు కరోనా ఉంది. అంతకు ముందు రెండు నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన ఏడు నెలల్లో జగన్ గారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మహిళలకు డ్వాక్రారుణమాఫీ, పెన్షన్లు పెంచారు, చేయూత, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏం చేశారని వారిని గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.వైఎస్ జగన్ పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే లక్షా నలబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాడు-నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనలు బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తియినా డీఎస్సీనీ పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమయ్యింది? ప్రతిసారీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారే తప్ప, ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. గాలేరీ-నగరీ, హంద్రీనీవాకు చంద్రబాబు ఏం చేశారు? ఆనాడు ఎన్డీఆర్ పునాది వేస్తే, చంద్రబాబు హయాంలో కేవలం అయిదు టీఎంసీలకే వాటిని పరిమితం చేశారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైయస్ఆర్, వైఎస్ జగన్ హయాంలోనే వచ్చాయి. కర్నూలు రాజధానిని వదులుకున్నందుకు ఈ ప్రాంతానికి హైకోర్ట్ వస్తుందని భావిస్తే, దానికి కూడా ఆటంకాలు కల్పించారు. సత్యవేడు, శ్రీసిటీ, కొపర్తి పారిశ్రామికవాడలను తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబేతాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్లో కనీసం 13 క్యూసెక్కుల నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్సార్ దానిని నిర్మిస్తే, చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అదే గండికోట రిజర్వాయర్లో వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న చర్యల కారణంగా 27 టీఎంసీలను నిలబెట్టారు. సీమలోని అనేక ప్రాజెక్ట్ల్లో నీటి నిల్వలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటి నుంచో నంద్యాల, తిరుపతి జిల్లా కావాలని ప్రజలు పోరాటాలు చేస్తే, వైఎస్ జగన్ ఎటువంటి పోరాటాలు లేకుండానే కొత్తగా సీమకు నాలుగు కొత్త జిల్లాలను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రీసెర్చ్ సెంటర్, శుద్ది చేసిన జలాలను తీసుకువచ్చారు. కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా? చంద్రబాబు హయాంలోనే సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగింది. వైయస్ఆర్ హయాంలో ఫ్యాక్షన్ తో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేసుకుని సీట్లు ఇచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. నేడు వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఫీజురీయింబర్స్మెంట్. వైయస్ఆర్ పేరు చెబితే 108, 104 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం చేయకుండానే, తనకున్న ఎల్లో మీడియా బలంతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడం తెలియని వైఎస్ జగన్ మాత్రం ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారుపులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కరలేదని చంద్రబాబు మోకాలడ్డారు. పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచన చేయాలి. చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్ట్ల నిర్మాణం దండుగ అని రాసుకున్నారు. అటువంటి చంద్రబాబు పోలవరంను నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చేపడతానంటూ, పోలవరంను నాశనం చేశారు. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్ట్లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయకక్షలను పెంచిపోషించారు. పల్నాడులో పట్టపగలు హత్యలు, తెనాలిలో దళత, మైనార్టీ యువకులపై పోలీసుల దాష్టీకం ఇవ్వనీ ప్రజాస్వామిక స్పూర్తితోనే చేస్తున్నారా? కేవలం తెలుగుదేశం వారికే పథకాలు అందించాలి, పని చేయాలంటూ ఒక సీఎంగా ఉండి ఎలా పిలుపునిచ్చారు? దీనినే పరిపాలన అంటారా? గతంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు పథకాల సొమ్మును చేరువ చేశాం. దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలోవైఎస్సార్సీపీ వారికి ఎటువంటి పథకాలు అందకూడదని మాట్లాడటంను ఎలా చూడాలి. నరేంద్రమోదీ గురించి గత అయిదేళ్ళ కిందట ఎంత దారుణంగా మాట్లాడాడో చంద్రబాబు మరిచిపోయారు. ఈరోజు మహానాడులో ఎన్డీఆర్ పేరును జపిస్తున్న చంద్రబాబు అధికారం కోసం ఆయన జీవించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రజలు మరిచిపోలేదు. బ్రాహ్మిణీ స్టీల్ను నిర్మించాలని వైయస్ఆర్ అనుకుంటే, చంద్రబాబు దానిని దారుణంగా అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు.గొప్పలు చెప్పుకోవడంలో ఘనుడు చంద్రబాబుహైదరాబాద్ను తానే నిర్మించానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. మహానాడు మొదలయ్యే రోజున వైఎస్సార్జిల్లా పేరును మార్పిస్తూ జీఓ తెప్పించుకున్నారు. మీలాగా మేం ఏనాడు ఆలోచించలేదు. ఎన్డీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీకి స్వతాహాగా ఒక డాక్టర్, సీఎంగా వైద్య, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్సార్ పేరు పెడితే సహించలేకపోయారు. ఈ రోజు కడపలో వైఎస్సార్ విగ్రహాలను అవమానించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్ల ముసుగులో కమీషన్లు దండుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైఎస్ జగన్ భావిస్తే, దానిని కూడా తొలగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు. వైఎస్ జగన్ ఒక్క సమావేశం పెడితే, మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు’ అని గడికోట స్పష్టం చేశారు. -
వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ను ఇచ్చింది. కాగా, వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది.వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని.. వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని.. ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. -
మాజీ ఎంపీ నందిగం సురేష్పై ఖాకీల ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎంపీ నందిగం సురేష్పై తుళ్లూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ ఎంపీపై అమానవీయ చర్యకు పోలీసులు దిగారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఆయనను పోలీసులు హింసిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో మాజీ ఎంపీని విచారించాలన్ని హైకోర్టు చెప్పింది. అయితే, ఆ మేరకు విచారణ కొనసాగడం లేదు.జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయనను పోలీసులు లాకప్లోనే ఉంచుతున్నారు. ఇది హైకోర్టు ధిక్కరణే అని న్యాయవాదులు అంటున్నారు. నందిగం సురేష్కు ఖాకీలు సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. తుళ్లూరు పోలీసుల తీరుపై మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. -
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వారధి వద్ద వృద్ధురాలిని బస్సు ఢీకొనడంతో రెండు కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో శిశువిహార్ నుంచి తాడేపల్లి తిరిగి వస్తున్న వైఎస్ జగన్.. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు.వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్కు ఆయన అప్పగించారు. ఎమ్మెల్సీ అరుణ్.. 108కు పలుమార్లు ఫోన్ చేసినా కానీ సిబ్బంది స్పందించలేదు. దీంతో ఎమ్మెల్సీ అరుణ్.. అటు వైపుగా వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేంతవరకూ ఎమ్మెల్సీ అరుణ్ అక్కడే ఉన్నారు. -
ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు(Chandrababu) చేప్పేవన్నీ అబద్ధాలే. చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివేవారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి జగన్ అడుగులేశారు.. .. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేటీకరణ(AP Medical Colleges Privatization) చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో ఫీజుబులిటీ రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి రూ.5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.500 కోట్ల విలువైన ఆస్తిని రూ.5 వేలకు ఇవ్వటం ఏంటి?. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదల్చుకున్నారు?. చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డెక్కారు. పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు. కరోనా సమయంలో జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరు గారి పోయాయి. ఇప్పుడు పీపీపీ పద్దతి అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు?. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మళ్ళీ డోలీల బాధ తప్పటం లేదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం అని రజిని అన్నారు. ఇదీ చదవండి: కడిగిన ముత్యంలా మా నాన్న బయటకు వస్తారు -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి రజత కవచం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి బుధవారం దాతలు రజత కవచం సమ ర్పించారు. మండల పరిధిలోని ధరణికోటకు చెందిన కామని వీరయ్య, సామ్రాజ్యం దంపతులు సుమారు రెండుకిలోల 395 గ్రాముల బరువుతో రూ.3లక్షల విలువైన రజత కవచానికి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ఈఓ రేఖకు అప్పగించారు. అనంతరం అర్చకులద్వారా సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కవచాన్ని అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమపూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారునేడు జెడ్పీ గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు కౌన్సెలింగ్గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తూ గ్రేడ్–2 హెచ్ఎం ఉద్యోగోన్నతుల కోసం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు గురువారం ఉదయం 8 గంటలకు జెడ్పీ కార్యాలయ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో హాజరు కావాలని సూచించారు.శివాలయంలో అవినీతిపై విచారణమంగళగిరి : మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో జరిగిన అవినీతిపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవస్థాన అభివృద్ధికి దాతలు అందించిన నగదును రికార్డులలో నమోదు చేయకపోవడంతో అభివృద్ధి పనులలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు బుధవారం ఆలయానికి చేరుకుని ఈవో కార్యాలయంలో పలు ఫైళ్ళును స్వాధీనం చేసుకున్నారు.పునఃప్రారంభమైన సదరం క్యాంప్తెనాలిఅర్బన్: వికలాంగుల ధృవ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. ఆర్థో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ జరుగుతుందని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.31న అయ్యప్ప స్వామి దేవస్థాన వార్షికోత్సవంచిలకలూరిపేట: ఓగేరు వాగుకు దక్షిణాన ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవం ఈ నెల 31వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం దేవస్థాన వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కమిటీ సభ్యులు తవ్వా నాగమల్లేశ్వరరావు, సత్యనారాయణ, భవిరిశెట్టి మణి పాల్గొన్నారు. -
అక్కడ అధికారంలోకి రాగానే...
ఎన్నికల వేళ కూటమి హామీ.. ఇప్పుడు అడిగితే కస్సు‘బస్సు’ పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : కూటమి గద్దెనెక్కిన తరువాత తొలుత గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని నేతలు చెప్పారు. అనంతరం దసరా ధమాకా... దీపావళికి టపాసులు పేలాస్తామంటూ.... ప్రేలాపనలు పలికారు. సంక్రాంతికి ఉచిత ప్రయాణం అని చెప్పిన సర్కార్ మాట విన్న మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. తిరిగి ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఏడాదిగా పూటకో మాట చెబుతూ ప్రకటనలు చేయడంపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అంటూ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రకటించగా.. ఇంకో అమాత్యుడు నారా లోకేష్ రోడ్ మ్యాప్ వేద్దాం.. వచ్చే ఏడాది నుంచి పథకాల అమలుపై దృష్టి సారిద్దామని చెప్పి మ్యాప్ గీస్తూనే ఉన్నారా... అని సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా ‘పథకాలు అమలు చేయాలంటే భయమేస్తోందని’ చెప్పటంపై ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు. ఇక ఉచిత ప్రయాణం లేనట్టేనా? అని మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భారీగా మహిళా ప్రయాణికులు గుంటూరు జిల్లాకు సంబంధించి నిత్యం లక్ష మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. గుంటూరు కేంద్రంగా నిత్యం అనేక ప్రాంతాలకు మహిళా ఉద్యోగులు, ఆయా పనులు చేసుకునే వారు, వ్యాపారం చేసే మహిళలు, విద్యార్థులు, ఇతర పనులపై వచ్చే యువతులు రాకపోకలు సాగిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మహిళలు 1.50 లక్షలు, పశ్చిమ నియోజకవర్గంలో 1.30 లక్షలు, తెనాలిలో 1.41 లక్షలు, పొన్నూరులో 1.15 లక్షలు, తాడికొండలో 1.60 లక్షలు, మంగళగిరిలో 2.03 లక్షలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1.45 లక్షలమందికిపైగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలో 345 బస్సులు సేవలు అందిస్తున్నాయి. అధికంగా మహిళలు గుంటూరు 1, 2 డిపోలు, మంగళగిరి ప్రాంతాల నుంచి హైకోర్టు, సచివాలయం, ఇతరత్రా ఉద్యోగాలకు నెలవారీ పాస్లు తీసుకుని ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. నిత్యం ఆర్టీసీ ఆదాయం రూ.1.20 కోట్లకుపైగా ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అంటే 50 శాతం అనుకున్నా... రూ.60 లక్షల మేర ప్రభుత్వం ఆర్టీసీకీ చెల్లించాల్సి ఉంటుంది. అసలే డబ్బుల్లేవ్ అని చెబుతున్న చంద్రబాబు ఉచిత ప్రయాణ హామీని ఏ రకంగా అమలు చేస్తారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మాట మరిచిన కూటమి సర్కారు రోజుకో అబద్ధం చెబుతూ హామీ అమలు దాటవేత అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా చిత్తశుద్ధి కరువు కూటమిని నమ్మి మోసపోయామని వాపోతున్న మహిళలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీని అమలు చేశాయి. తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయితే ఏపీలో మాత్రం ఈ సదుపాయం అందని ద్రాక్షగా మారింది. ఏపీలో కూటమి ఎన్నికల సమయంలో ఉచిత బస్సు అంటూ జోరుగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేకుండా పోయింది. -
కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉన్నట్లు మత్స్యకారులు బుధవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్ఐ శ్రీనివాసరావు కృష్ణానది దిగువ ప్రాంతంలోని లాకుల వెంబడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతుడి ఒంటిపై నల్లని హాఫ్ నిక్కర్ మాత్రమే ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వయస్సు 30 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే 08645272186 ఫోను నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
ప్రత్తిపాడు: ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐటీఐ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన మన్నవ జేమ్స్, ఏసుకుమారిలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మన్నవ స్టాలిన్ (17) గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్లపాడులోని ఎంజీఎస్ కళాశాలలో ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు స్టాలిన్ను గారాబంగా పెంచుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ 27వ తేదీ రాత్రి ఏసుకుమారి పనిపై బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి స్టాలిన్ ఇంటి వరండాలోని సీలింగ్ ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి స్టాలిన్ను కిందకు దింపి తండ్రికి సమాచారం అందించారు. అపస్మారక స్థితిలోనికి వెళ్లిన స్టాలిన్ను తీసుకుని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే స్టాలిన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జేమ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. నాగేంద్ర తెలిపారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
జీజీహెచ్లో కరోనా వైద్య సేవలు
గుంటూరు మెడికల్: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ప్రభావం చూపుతోంది. పలువురు బాధితులు కరోనాతో బాధపడుతుండటంతో గుంటూరు జీజీహెచ్లో వారి కోసం ప్రత్యేకంగా 15 పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో బీ క్లాస్ రూములో కూడా బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అత్యవసర విభాగం వల్ల నూతనంగా నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూ గదిని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఇప్పటికే కరోనా అనుమానంతో వచ్చిన ఐదుగురికి వైద్య పరీక్షలు చేశామని, రిపోర్టు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. జీజీహెచ్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఓపీని ప్రారంభించామన్నారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు, సీక్యాప్ మిషన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్య సేవలకు సిద్ధంగా ఉండండి రాష్ట్రవ్యాప్తంగా బోధన ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎక్కువ మంది చికిత్స పొందేలా చూడాలన్నారు. ఈ – హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలని సూచించారు. సమావేశానికి హాజరు కాని జీజీహెచ్ వైద్యులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతోపాటు పలు వైద్య విభాగాధిపతులు, ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట పైరుతో ఎన్నో ప్రయోజనాలు
వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు తెనాలి టౌన్: ఖరీఫ్ సాగుకు ముందు పచ్చిరొట్ట పైరు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ రాష్ట్ర సంచాలకులు ఎస్.ఢిల్లీరావు రైతులకు సూచించారు. రూరల్ మండలం ఎరుకలపూడి గ్రామంలో రైతు ముళ్ళపూడి రంగయ్య ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రాన్ని బుధవారం పలువురు అధికారులతో కలిసి ఎస్.ఢిల్లీరావు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ ఎన్నో సంవత్సరాలు పరిశోధించి 32 రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని సాగు చేయడం వలన సేంద్రియ కర్బనం భూమిలో పెరుగుతుందని తెలిపారు. ఎరువుల వినియోగం కూడా తగ్గించుకోవచ్చని వివరించారు. జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం వలన కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని అన్నారు. భూమి గుల్లబారి ఆరోగ్యంగా ఉంటుందని, సూక్ష్మపోషకాలు త్వరగా పంటకు అందుతాయని తెలిపారు. ప్రతి రైతును చైతన్యపరచాలని, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, ఏడీఏ ఎన్.ఉషారాణి, ఏవో జి.ప్రేమ్సాగర్, ఏఈవోలు, వీఏఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
మాయమాటల్లో సీఎం దిట్ట
ఎన్నికల్లో అసత్య ప్రచారాలు, మాయమాటలు చెప్పటంలో చంద్రబాబు దిట్ట. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, అమ్మ ఒడితోపాటు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వంచించారు. పూట గడిస్తే చాలన్నట్లు కూటమి పరిపాలన ఉంది. ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఏ ఒక్కటీ అమలు చేయని ప్రభుత్వం ప్రపంచంలోనే కూటమి సర్కార్ మాత్రమే. 2014 –19 వరకు జరిగిన గ్రాఫిక్స్ పాలనే ఇప్పుడు కొనసాగుతోంది. – షేక్ నూరిఫాతిమా, నగర అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి
గుంటూరు లీగల్: లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్చక్రవర్తి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగనున్న లోక్ అదాలత్పై బుధవారం కోర్టు ప్రాంగణంలో కంపెనీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి చర్యల గురించి వివరించారు. అందరూ సహకరించాలని సూచించారు. ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, గుంటూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి జి. చక్రపాణి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్ బాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, పోక్సో కోర్ట్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ అధ్యక్షుడు వై.సూర్య నారాయణ పాల్గొన్నారు. -
జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా విజయలక్ష్మి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా కుమ్మమూరు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చేశారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1991లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1992లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కృష్ణకిషోర్ వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఒకటిన జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): జిల్లా క్రికెట్ సంఘం త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంటలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు యు.మహతి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19 యువకులు జట్టుకు ఉదయం 8 గంటలకు, అండర్–19 యువతులకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1,2006 తర్వాత జన్మించినవారై ఉండాలి. అండర్–15 బాలికలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అండర్–23 ఉమెన్స్కు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. వీరు నవంబర్ 1,2001 తర్వాత జన్మించినవారై ఉండాలి. పోటీలకు హాజరయ్యే క్రికెటర్లు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ కలిగి ఉండాలి. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ను తీసుకురావాలన్నారు. వివరాలకు మహతి శంకర్ను 98491 50249 లో సంప్రదించాలన్నారు. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష గుంటూరు లీగల్: అత్యాచార యత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 86 సంవత్సరాల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన పాలపర్తి మంజు అనే 21 సంవత్సరాల యువకుడిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ మేరకు తీర్పు వచ్చింది. నిందితుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా పల్లపు కృష్ణ వాదనలు వినిపించారు. -
ప్రజా పాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర
గుంటూరు వెస్ట్: సంక్షేమ పాలనతో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఎప్పటికీ మరచిపోలేమని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కొనియాడారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఇన్చార్జి కలెక్టర్తోపాటు శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ చంద్రముని, మెప్మా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు స్మిత పద్మజ, వెంకట రమణ, చిష్టీ, మీరావలి, పాల్గొన్నారు. తెలుగు వారి ఖ్యాతి చాటిన ఎన్టీఆర్ నగరంపాలెం: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం దివంగత సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాజకీయాల్లో అరంగేట్రం చేసి సీఎంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో... నెహ్రూనగర్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ.మారయ్య బాబు పాల్గొన్నారు. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ -
కేశవకుమార్ సాహిత్యంలో ధిక్కార స్వరం
కవితా సంపుటాల ఆవిష్కరణలో వక్తలు తెనాలి: గత మూడున్నర దశాబ్దాల తెలుగు కవిత్వంలో కేశవకుమార్ది ముఖ్యమైన గొంతుక అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విప్లవాత్మక భావజాలం ద్వారా ప్రేరణ పొందిన కవి అని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ప్రొఫెసర్ బి.తిరుపతిరావు ప్రశంసించారు. ఆయన కవిత్వం సామాజిక– రాజకీయ విమర్శ, తాత్విక అన్వేషణల శక్తిమంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర ప్రొఫెసర్, తెనాలి సమీపంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కేశవకుమార్ రచించిన కవితలతో తీసుకొచ్చిన రెండు కవితా సంపుటాలను బుధవారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ‘భిన్నస్వరాలు’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేశవకుమార్ కవితా సంపుటి ‘ఆదిమ పౌరుడు’ను బి.తిరుపతిరావు, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూనిరాగం’ సంపుటిని ప్రముఖ కవి సీతారాం ఆవిష్కరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అమృతలూరులో పుట్టి, దళిత ఉద్యమాలు, దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను చూస్తూ పెరిగిన క్రమంలో కేశవకుమార్ వాటిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఆయన భావాలన్నీ అంబేడ్కర్ ఆలోచనల చుట్టూ తిరుగుతుంటాయన్నారు. రాడికల్గా సమీక్షించటం, విమర్శించటం ఆయన రచనల్లో గోచరిస్తుందని చెప్పారు. విస్తృతంగా రాస్తున్న కవితలు, వ్యాసాల్లో వ్యంగ్యాన్ని జోడించి విమర్శనాత్మకంగా రాయటం కేశవకుమార్ శైలి అన్నారు. సమకాలీన విషయాలపై తక్షణం స్పందించి రాయటం ఆయన ప్రత్యేకతగా చెప్పారు. కవి సీతారాం మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ప్రతిఘటన, నిరసన ఉద్యమాల్లో కేశవకుమార్ ముందుండి గొంతెత్తారని చెప్పారు. అంబేడ్కర్, పూలే భావధారలో తనను తాను రూపుదిద్దుకున్న కేశవకుమార్ రచనలు, తెలుగునాట దళితవాద సాహిత్యానికి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తాయని చెప్పారు. ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి తన ప్రసంగంలో విప్లవ సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కేశవకుమార్ కవితా సంపుటాల్లో దళిత, బహుజన సాహిత్యంలో వచ్చిన ధోరణులు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కేశవకుమార్ కవిత్వంలో నిరసన, ధిక్కారం, వ్యంగ్యం ప్రదర్శిస్తూ సమాజానికి అనేక ప్రశ్నలు సంధించారని చెప్పారు. సభలో శిఖా–ఆకాష్, నూకతోటి రవికుమార్, ఎన్జే విద్యాసాగర్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, తంగిరాల సోని మాట్లాడారు. కేశవకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్నస్వరాలు బాధ్యులు జుగాష్విలి, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది
చిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్ల మీదకు వస్తే రాష్ట్రం స్తంభించి పోతుందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు చెప్పారు. బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్ష బుధవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రైతాంగ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బర్లీ పొగాకు కలపకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ సిగరెట్లు తయారు కావన్నారు. సువాసన కోసం బర్లీ పొగాకును విదేశాలు సిగరెట్లలో ఉపయోగిస్తాయని తెలిపారు. పొగాకు కంపెనీలు కుట్రపూరితంగా ఏకమై ధరలను పతనం చేసేందుకు బర్లీ పొగాకు కొనుగోళ్లను నిలిపివేశాయని ఆరోపించారు. ఆ చర్చలకు విలువ లేదా? రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే చర్చలతో సరిపెడుతున్నారని, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన చర్చలకు సైతం విలువలేకుండా పోయిందని వెల్లడించారు. పొగాకు కంపెనీలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది బర్లీ పొగాకు క్వింటా రూ. 18 వేల వరకు కొన్నారని, ఈ ఏడాది కనీసం రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడెల్లా కొనుగోళ్లు చేస్తాం అనడం తప్పించి, అడుగు ముందుకు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలకు రైతులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రైతు సంఘాల నాయకులు తాళ్లూరి బాబురావు, దాసరి వరహాలు, పేలూరి రామారావు, షేక్ సుభాని, ఇంటూరి భవాని వెంకటేష్, దోమల మరియదాసు, రెడ్డమ్మ నరిసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.రాధాకృష్ణ, లోక్ సత్తా మాదాసు భానుప్రసాద్ పాల్గొన్నారు. నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన దీక్ష -
‘చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయం’
సాక్షి,తాడేపల్లి: పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారంటూ’ చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్న చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు పొడవడం.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారు?. హత్యకు గురైన వారు, చేసినవారు టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీ చెప్పారు. గ్రామంలోని రెండు టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్యపోరులోనే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో వైసీపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్నారా?. ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా?. ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదే కారులో వెళ్ళి చంద్రబాబును కలిశారు. అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ అని ఎలా చెప్తారు?.అంతులేని పాపాలను మూట కట్టుకుంటున్నారు. శిశుపాలుడులాగా పాపాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్.. చంద్రబాబును పొడుస్తాడు. పార్టీనీ, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు. చంద్రబాబు అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?. ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా?. హైదరాబాద్, కుప్పం, అమరావతిలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే అక్కచెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా?. రాజమహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు?. కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే. మరి ఏనాడైనా ఆ ఆడపిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు?. నారా లోకేష్ తన తాత ఖర్జూరనాయుడు అని ఎందుకు చెప్పుకోలేక పోతున్నారు?. ఇలాంటివేమీ మేము అడగ దలచుకోలేదు.రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు. పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని దియేటర్లపై విచారణ చేస్తున్నారు. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ నిర్ణయం తీసుకుంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ విషయం తెలీదు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఆ విషయం తెలియదురాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం పని చేస్తోంది?. పోలీసులందరినీ వైఎస్సార్సీపీ నేతలను వేధించటానికి మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోంది. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులను వాడటం లేదు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మా నిర్ణయాలు తప్పయితే ఈ సంవత్సరకాలంగా ఎందుకు అమలు చేస్తున్నారు?.పవన్ సినిమా వచ్చే ముందు ధియేటర్లలో విచారణ చేయటానికి సిగ్గు లేదా?’ అని వ్యాఖ్యానించారు. -
రాసిపెట్టుకోండి.. రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో.. వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలవుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవ్వరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవ్వరో తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు మన పార్టీ ఇన్ఛార్జి పిన్నెల్లిమీద కేసులు పెట్టారు. ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే.. తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రిని కాకాణిని అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆర్కేమీద కేసు పెడుతున్నారు.ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది అని అన్నారాయన. రిటర్న్ గిఫ్ట్ తప్పదుఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీ సమా రిటర్న్ గిఫ్ట్(return Gifts)లు ఇస్తాం. చేసినవాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించనవారినికూడా సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా సరే చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానిక వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫాం ఇచ్చింది’’ అని జగన్ అన్నారు.ఇదీ చదవండి: తెలుగు డ్రామా పార్టీ.. మహానాడుపై జగన్ సెటైర్లు -
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్ అన్నారు... చంద్రబాబు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్మెంట్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లు, రేషన్ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్సీ లేదు. మూడు డీఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, రాజధాని పనులు.. లిక్కర్ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్ అన్నారు.క్లిక్ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన -
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్ ఉండి ఉంటేనా.. -
యోగాపై ప్రజలకు అవగాహన
నెహ్రూ నగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు అవగాహన కల్పించనుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుంచి లక్ష్మీపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకు యోగాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు చేపట్టిన యోగాంధ్రలో గుంటూరు జిల్లా, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పర్యాటక ప్రాంతాలైన ఉండవల్లి గుహలు, మంగళగిరి ఎకో పార్క్లలో కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనేలా చేయడమే కార్యక్రమాల ఉద్దేశం అన్నారు. గుంటూరు నగపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బుధవారం నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. వైజాగ్, గుంటూరులో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారు యోగాంధ్ర వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీపీఓ డా.సైమన్, డీపీఎం(ఇన్చార్జి) డా.జయరామ్ కృష్ణ, డెమో జయ ప్రసాద్, డిప్యూటీ డెమో ఎన్.వెంకటేశ్వర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి గుహల వద్ద బుధవారం యోగాపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరు ఇన్చార్జి జిల్లా కలెక్టర్ భార్గవ్ తేజ పలువురు అధికారులతో కలిసి గుహలను పరిశీలించారు. -
యువకులపై టీడీపీ నాయకుడి దాడి
అనుచరులతోనూ దాడి చేయించి గాయపరిచినవైనం సాక్షి టాస్క్ఫోర్స్: యువకులపై టీడీపీ నేత దాడి చేసి, అనంతరం అనుచరులతో కూడా తీవ్రంగా కొట్టించి గాయపరిచిన సంఘటన గుంటూరు నగరంలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్కు సంబంధించి సెవెన్ హిల్స్ మెడికల్ షాపు కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్సు వద్ద ఉంది. ఈ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు కొన్ని నెలల కిందట అక్కడ మానేసి వేరే షాపులో చేరాడు. హోల్సేల్ మెడికల్ షాపు నుంచి అతడు సరకు తీసుకొస్తున్న సమయంలో వాటికి సంబంధించిన బిల్లులను సెవెన్హిల్స్ షాపునకు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ పంపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆ యువకుడిని షాపు వద్దకు పిలిపించారు. డేగల ప్రభాకర్తోపాటు కొంత మంది వ్యక్తులు ప్రశ్నించడంతోపాటు కొట్టినట్లు సమాచారం. దాడికి గురైన యువకుడు తన బంధువులు తదితరులతో కలిసి మంగళవారం ఉదయం షాపు వద్దకు వెళ్లారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ డేగల ప్రభాకర్, అతని అనుచరులు మరోమారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిసింది. టీడీపీ నేత కొత్తపేట పోలీసులకు ఫోన్ చేయగా, గాయపడిన యువకుడిని పోలీసులు స్టేషన్కు తరలించినట్లు సమాచారం. యువకుడిని బెదిరించి కేసు రాజీ చేసినట్లు తెలిసింది. గాయపడిన యువకుల పేర్లు, వివరాలు తెలియరాలేదు. దీనిపై కొత్తపేట పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం.వీరయ్యచౌదరిని వివరణ కోరగా గొడవ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. -
● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 39,693 మంది విద్యార్థులు హాజరు
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే... ● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షకు 21,590 మందికిగాను 20,765; అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు. ● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 9,214 మందికిగాను 8,944 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగాను 1,802 మంది హాజరయ్యారు. ● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు. -
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్క్యాష్మెంట్కు సంబంధించిన ఆర్డర్ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను క్రీడాకారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్ శిక్షణలో క్రీడాకారులు ఈ ఘన విజయం సాధించారని తెలిపారు. -
నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం
తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్ హబ్ తుళ్ళూరులో పెయింటింగ్ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 30 మంది, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు. -
ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం గ్రేడ్–2 హెచ్ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్, రోస్టర్ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్ హెచ్ఎం పోస్టులకు... గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్–8, కార్పొరేషన్–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ప్రతిభ ఉన్న పేద వైద్య విద్యార్థులకు మంగళవారం స్కాలర్షిప్పులు పంపిణీ చేశారు. కళాశాల 1972 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి రూ. 15 వేల చొప్పున ఏడుగురికి స్కాలర్షిప్పుగా అందించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి వాటిని అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మరొకరికి చదువుకునేందుకు సాయం చేయాలని సూచించారు. దాతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, జింకానా కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి.హనుమంతరావు, డాక్టర్ కె.ఎల్.ప్రసాద్, డాక్టర్ దక్షిణామూర్తి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
దురాచారాల నిర్మూలనలో పరిషత్ల కృషి భేష్
నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్లను కళాపరిషత్ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి జ్యోతిరాజ్ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. నేటి ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘కిడ్నాప్’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.కొనసాగుతున్న జాతీయస్థాయి నాటిక పోటీలు -
సహకార సంఘాల అభివృద్ధికి కృషి ముఖ్యం
జిల్లా సహకార అధికారి వెంకటరమణ నరసరావుపేట: సహకార సంఘాల సమగ్రాభివృద్ధికి కమిటీ సభ్యులు, సీఈఓలు తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులకు సామర్ధ్య నిర్మాణం – సుపరిపాలనపై ఏపీ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీడీసీసీ బ్యాంకులో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ సహకార సంఘాల కమిటీ సభ్యులు, సీఈఓలు సహకార సంఘాలు అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని అన్నారు. విజయవాడ సహకార శిక్షణా కేంద్ర వైస్ ప్రిన్సిపాల్ వేదాంతరెడ్డి మాట్లాడుతూ సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, సరైన పాలనకు మార్గనిర్దేశం చేయడం కమిటీ సభ్యుల ముఖ్యవిధి అన్నారు. జిల్లాలో అన్ని సహకార సంఘాలను ఈ–పీఏసీఎస్గా మార్చి సభ్యులకు డిజిటల్ సేవలు అందిస్తున్నామని, దీనివల్ల సంఘాల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారు. కంప్యూటీకరణ మూలంగా సంఘాల ఆడిట్ సులభం అవుతుందని అన్నారు. శిక్షణలో సహకార సంఘాల పర్సన్ ఇన్ చార్జీలు, సంఘాల సీఇఓలు పాల్గొన్నారు. -
చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు
తెనాలి: నిందితుల అరెస్టు విషయంలో తెనాలి పోలీసులు చట్టవిరుద్ధంగా, అమానుషంగా వ్యవహరించారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్పై దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో నడిరోడ్డుపై లాఠీలతో జులుం ప్రదర్శించటాన్ని ఖండించారు. బాధిత కుటుంబాన్ని ఈ మేరకు మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ పరామర్శించింది. అయితానగర్కు చెందిన నిందితుల్లో ఒకరైన దోమ రాకేష్ నివాసానికి వెళ్లి, ఆయన తండ్రిని కలిసింది. కుటుంబ నేపథ్యాన్ని, ఘటన వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నేతాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. గత నెల 24వ తేదీన రాత్రి వేళలో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై నిందితులు దాడి చేశారని, ఆ క్రమంలో దాడికి గురైన కానిస్టేబుల్ను వెంటపెట్టుకొని పోలీసులు 25న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 27న మధ్యాహ్నం వరకు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబికులు చెప్పారని తెలిపారు. దానికి తోడు బహిరంగంగా నిందితులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన వీడియో వారి నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. దళితులు, మైనారిటీలు అనే కోణంలోనే పోలీసులు దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై విచక్షణారహితంగా దాడి చేయాలని ఏ చట్టంలోనూ చెప్పలేదన్నారు. అయినా పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కానిస్టేబుల్పై యువకులు దాడికి పాల్పడిన ఘటన వెనుకనున్న ఆంతర్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు వెలికితీయాలన్నారు. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు అభియోగాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భావన్నారాయణ, తెనాలి ఏరియా కార్యదర్శి కె. బాబుప్రసాద్, ములకా శివసాంబిరెడ్డి పాల్గొన్నారు. పోలీసుల తీరుకు బీఎస్పీ ఖండన తెనాలి: ఒక కేసులోని ముద్దాయిలను తెనాలి పోలీసులు అత్యుత్సాహంతో బహిరంగంగా హింసించటాన్ని బీఎస్పీ నాయకులు ఖండించారు. స్థానిక అయితానగర్లోని పొట్టి శ్రీరాములు పార్కులో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు, గుంటూరు జిల్లా పార్లమెంటు ఇన్చార్జి తెనాలి ప్రకాష్, జిల్లా నాయకులు గూడవల్లి. మణికుమారి, చిరుతనగండ్ల వాసు, తెనాలి బాధ్యుడు కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడారు. నిందితులను చిత్రహింసలకు గురిచేయడం దారుణం కానిస్టేబుల్ చిరంజీవిపైనా ఇప్పటికే పలు అభియోగాలు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ బాధిత కుటుంబానికి పార్టీ జిల్లా కమిటీ నేతల పరామర్శ -
నేడూ పొగాకు రైతుల నిరసన
చిలకలూరిపేట: నల్లబర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ చిలకలూరిపేటలోని ఐటీసీ కంపెనీ వద్ద పొగాకు రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. క్వింటా ధర రూ.15వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకును కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలని కోరారు. దీక్షకు రైతులు, రైతు సంఘాల నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.నేడు కోటప్పకొండలో యోగాంధ్రనరసరావుపేట: కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద యోగాంధ్ర కార్యక్రమం బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు.విజయకీలాద్రిపై సుదర్శన హోమంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుపట్నంబజారు(గుంటూరుఈస్ట్) : బక్రీదు పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ కె.సీతారామిరెడ్డి హెచ్చరించారు. జూన్ 7న జరిగే బక్రీదు పండుగ సందర్భంగా గేదెలు, ఇతర పశువులను అధిక సంఖ్యలో వాహనాల్లో తరలించి వధకు పాల్పడితే వారిపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడంతోపాటు, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో పశువులను తరలించే వారు ఎంవీఐ యాక్ట్ 1989, రూల్ 253 ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అనంతరం తరలించాలని సూచించారు.శని జయంతి పూజలుమంగళగిరి టౌన్: శ్రీశనైశ్చర స్వామి జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో మంగళవారం శనిజయంతి పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి తైలాభిషేకం, అర్చనలు, జపాలు, పూజలు నిర్వహించి పురోహితులకు నువ్వులు దానాలు ఇచ్చారు. దేవస్థానంలోని మల్లేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ తగు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.ఎంపీహెచ్ఏలకు బదిలీగుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ కేడర్కు చెందిన 172 మందికి డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి మలేరియా, డెంగీ, చికున్ గున్యా ప్రబలి ఉన్న పలు ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో డీఎంహెచ్ఓతోపాటు, పరిపాలన అధికారి లక్ష్మీకుమారి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, భక్తవత్సలం, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్, రహీం పాల్గొన్నారు. -
మళ్లీ కరోనా కలవరం
జిల్లాలో ఇప్పటివరకు మూడు కేసులు నమోదు కరోనా పేరు చెబితేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. మళ్లీ ఇటీవల దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కూడా మూడు కరోనా కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నూతనంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్, తదితర ప్రదేశాల్లోకి వెళ్లకుండా దూరంగా ఉండండి. ఏదైనా అనుమానం ఉంటే గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ గుంటూరు మెడికల్ కరోనా వ్యాప్తి చెందకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొవిడ్–19 నాటి నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశాల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నూతన కరోనా వైరస్ సైతం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెనాలిలో ఫీవర్ సర్వే జిల్లాలో తెనాలికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తెనాలిలో ఫీవర్ సర్వే చేయిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఏలూరుకు చెందిన మరో ఇరువురు సైతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. లక్షణాలు ఇవీ... చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. తుమ్ములు, దగ్గుతో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు, ఆయాసం, ఛాతీ పట్టివేయడం వంటివి కరోనా వ్యాధి బాధితుల్లో కనిపిస్తున్నాయి. వారం దాటితే వైద్యులను సంప్రదించాలి నార్మల్ ఫ్లూ మాదిరిగానే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారానికి మించి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పల్మనాలజిస్టులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పదేళ్లలోపు పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తమా, డయాలసిస్, షుగర్, బీపీ, కిడ్నీ, గుండె జబ్బు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మాస్క్లు ధరించడం, తగినంత నీటిని తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ బి.దుర్గాప్రసాద్, పల్మనాలజిస్ట్, గుంటూరు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు ఆదేశాలు ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల సూచన వ్యాధి బాధితులకు గుంటూరు జీజీహెచ్లో నిర్ధారణ పరీక్షలు జాగ్రత్తలు తీసుకుంటే మేలు.. దగ్గినా, తుమ్మినా తప్పనిసరిగా ముఖానికి చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. చేతులను తరచుగా సబ్బుతో, శానిటైజర్తో మంచిగా శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. సరిపడా నీరు తాగాలి. కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల వరకు నిత్యం తాగడం మంచిది. తగినంత నిద్రించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. వైద్యుల సలహాలు లేకుండా సొంతంగా ఔషధాలు వేసుకోవద్దు. -
జంట హత్యలపై కట్టు కథలు
సాక్షి, టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో జరిగిన జంట హత్యలపై ప్రభుత్వం, పోలీసులు కట్టు కథ అల్లారు. కేసు ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అందుకు బలం చేకూరుస్తున్నాయి. టీడీపీలో ఆధిపత్య పోరుతో జరిగిన హత్యలను ఎలాగైనా వైఎస్సార్ సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై నెట్టాలన్న దురుద్దేశంతో పెట్టిన అక్రమ కేసుగా స్పష్టమవుతోంది. హత్యలపై మృతుల అల్లుడు, టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో హత్యకు గల కారణం గ్రామ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతోనే జరిగిందని తన తొలి మాటల్లోనే తెలిపాడు. మృతుడు జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్యను హతమారిస్తే టీడీపీలో నాకు ఎదురు ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో ఓ కట్టుకథకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హత్యలో పాల్గొన్న నిందితులు జెవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజులు హత్య చేసిన అనంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును చూసి కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజంగా కారులో కత్తులే ఉంటే బండరాళ్లతో ఎందుకు మోది చంపుతారు, కత్తులే వాడే వారు కదా అనే ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. పోతూ పోతూ ‘‘ నా కొ..రా వచ్చేది మా వైఎస్సార్ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం, మాతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలు చెబితేనే మేము చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు.’’ అంటూ కత్తులు చూపి బెదిరిస్తూ పోయారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరు లు కుట్ర పన్ని ఉంటే ఎవరైనా ఇలా చెబుతారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను కేసులో అక్రమంగా చేర్చడానికి ప్రభుత్వం, పోలీసుల కుట్రగా అర్థమవుతోంది. మరోవైపు హత్య జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడైన తోట ఆంజనేయులు మీడియాతో మాట్లాడిన వీడియోలో మేము రావడం చూసి పారిపోయారని చెప్పాడు తప్ప నిలబడి బెదిరించారని ఎక్కడా చెప్పలేదు. ఎమ్మెల్యే ఒత్తిడితో మరుసటి రోజు ఫిర్యాదు సమయానికి మాట మార్చాడని అర్థమవుతోంది. నిందితులు పోతూపోతూ అన్నారని చెబుతున్న కట్టుకథలు తప్ప పన్నెల్లి సోదరుల పాత్రపై ఆధారాలు దొరకలేదు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ అని పసుపు పచ్చ రంగులో స్టిక్కర్ ఉన్న టీడీపీ నేత తోట వెంక్రటామయ్య కారు దొరికింది. ఆధిపత్య పోరు కారణంగానే హత్యలు జరిగినట్లు ఎస్పీ ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షి హత్యలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలే అని స్పష్టం చేశాడు. ఇన్ని ప్రాథమిక ఆధారాలున్నా రాజకీయ కక్షతోనే పిన్నెలి సోదరులపై కేసు నమోదు చేసినట్టు అర్థమవుతోంది. ఎస్పీపై ఆగ్రహం పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావుపై పలు రకాలుగా ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అని ప్రాథమిక విచారణ తర్వాత ఎస్పీ తెలిపారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలో ఎస్పీపై వ్యతిరేక కథనాలు రాయించి బెదిరించే ధోరణిని ఎమ్మెల్యే జూలకంటి అవలంబించాడు. వైఎస్సార్ సీపీ నేతలపై తాను చెప్పినట్టు కేసులు నమోదు చేయకపోవడం వల్లే హత్యలు జరిగాయంటూ ఆరోపించారు. ఎస్పీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియాలో లీక్లు ఇచ్చి బెదిరించి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుస్తోంది. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అంటూ తేల్చిన పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎవరి ఒత్తిడితో మాట మార్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూలకంటి అసమర్థతే కారణం మా వెంట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడంటూ హంతకుల బెదిరింపు మేము రావడం చూసి హంతకులు పారిపోయారంటూ చెప్పిన ప్రత్యక్ష సాక్షి మరుసటి రోజు మాట మార్చి తప్పుడు ఫిర్యాదు టీడీపీలో ఆధిపత్య పోరుతోనే జెవిశెట్టి సోదరుల హత్య అంటూ ఎఫ్ఐఆర్లో ప్రస్తావన జెవిశెట్టి వెంకటేశ్వర్లుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఎమ్మెల్యే జూలకంటి తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన వ్యక్తికి రెండు కాళ్లు విరగొట్టినా పట్టించుకోని ఎమ్మెల్యే దీంతో హత్య చేసేందుకు సిద్ధపడిన తోట వెంకట్రామయ్య ఇరువర్గాల మధ్య రాజీ చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటూ తెలుగు తమ్ముళ్ల ఆరోపణ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పిన్నెల్లి సోదరులపై కుట్ర గుండ్లపాడు టీడీపీ నాయకుల హత్యకు స్థానిక ఎమ్మెల్యే అసమర్థతే కారణమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కొంత కాలంగా గుండ్లపాడు పార్టీలో తారస్థాయికి చేరిన వర్గపోరును జూలకంటి పరిష్కరించి ఉంటే దశాబ్దకాలంగా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు హత్యకు గురయ్యేవారు కాదంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య వర్గానికి, తోట వెంకట్రామయ్య వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు నెలలుగా అది ముదిరి దాడుల వరకు దారి తీసింది. అందులో భాగంగా గత నెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీనుపై హత్యకు గురైన జెవిశెట్టి మొద్దయ్య వర్గీయులు దాడి చేసి రెండు కాళ్లు విరిగగొట్టారు. అయినా మొద్దయ్యను ఎమ్మెల్యే ఏమనకపోవడం, పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నాడన్న బాధ తోట వెంకట్రామయ్య వర్గంలో బలంగా నాటుకుపోయింది. మరోవైపు తాను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే లిఫ్ట్ చేయడం లేదని, మొద్దయ్య మాటకే విలువిస్తున్నాడని వెంకట్రామయ్య ఒకరిద్దరు టీడీపీ స్థానిక నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. -
అసలు ప్రభుత్వం ఉందా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? మా పిల్లలను దారుణంగా హింసిస్తారా? ఇదేం ఘోరం? మా గుండెలు బద్దలయ్యాయి..! రాజ్యాంగం మీకేమైనా ప్రత్యేక రక్షణ కల్పించిందా? లక్షల మందిపై కేసులున్నాయి.. కానీ ఇలా ఎవరినైనా, ఎక్కడైనా కొట్టారా? ఇది ప్రభుత్వ ఉగ్రవాదమే..!’ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన బాధిత యువకుల తల్లితండ్రుల ఆక్రోశం ఇదీ!! పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారనడం బూటకమని, తమ పిల్లలపై తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు. కానిస్టేబుల్ మామూళ్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే ఘర్షణ చోటు చేసుకుందని, తమ బిడ్డలను నడిరోడ్డుపై గొడ్డును బాదినట్లు చితక బాదడం ఏమిటని నిలదీస్తున్నారు. ఈ దౌర్జన్యాలు, అరాచక పాలనను ప్రశి్నస్తూ దళిత, ప్రజాసంఘాలు తమతో కలసి రావాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమనడంతో పోలీసులు నష్ట నివారణ చర్యలకు దిగారు. రాజీ పడదామంటూ బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపారు. తెనాలిలో పర్యటించిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడిని పోలీసులు దారుణంగా కొడుతున్న వీడియోను చూసి విలపిస్తున్న బాబూలాల్ తల్లి షేక్ రెహ్ముతుల్లా అక్రమ కేసు పెట్టి చిత్రహింసలా?నాకు నలుగురు మగ పిల్లలు. నాలుగో కుమారుడు బాబూలాల్ మెకానిక్గా పని చేస్తున్నాడు. జాన్ విక్టర్ తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుక ఉందని ఆహా్వనించడంతో బాబూలాల్ వెళ్లాడు. తరువాత రోజు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లాం. పుట్టిన రోజు పార్టీ తరువాత బండి మీద వచి్చన ఓ వ్యక్తితో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఆ వ్యక్తి పోలీస్ దుస్తుల్లో లేకపోవడం, పోలీస్నని చెప్పకపోవడం, నోటికి వచి్చంది మాట్లాడి చేయి చేసుకోవటం దీనికి కారణం.ఆ కానిస్టేబుల్ అది మనసులో పెట్టుకుని వారంతా గంజాయి తాగినట్టు, ఒక కత్తి కూడా పక్కన పెట్టి, చేయని నేరాలు మోపి అక్రమ కేసు పెట్టారు. మా అబ్బాయి, వాడి స్నేహితులను నడి రోడ్డు మీద కూర్చోబెట్టి దారుణంగా చితకబాదిన వీడియో చూశా. అక్రమ కేసు పెట్టటమే కాకుండా ఇలా కొట్టటం ఎంత వరకు సమంజసం? – రెహ్ముతుల్లా షేక్ (బాధితుడు బాబూలాల్ తల్లి, మంగళగిరి)ఇదేం ఘోరం? ఇంత క్రూరత్వమా? చేబ్రోలు ఇశ్రాయెల్ (బాధితుడు జాన్ విక్టర్ తండ్రి) మా సొంతూరు చుండూరు మండలం ఆలపాడు. ప్రస్తుతం మంగళగిరిలో ఉంటున్నా. ఎల్ఐసీ ఏజెంటుగా పని చేస్తున్నా. నా కుమారుడు జాన్విక్టర్ న్యాయవాదిగా నమోదు చేసుకుని గుంటూరు కోర్టుకు వెళుతున్నాడు. కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీరు. తెనాలిలో చదివే సమయంలో అయితానగర్కు చెందిన వేము నవీన్ నా కుమారుడికి స్నేహితుడు. గత నెల 24న పుట్టినరోజు పార్టీ అంటూ నవీన్ పిలిస్తే నా కుమారుడు తన స్నేహితుడు బాబూలాల్తో కలసి తెనాలి వెళ్లాడు. అయితానగర్ పల్లెకొండవారి వీధిలో నవీన్, రాకేష్ వారిని కలిశారు.రాత్రి 9.30 గంటలకు అక్కడకు వచి్చన త్రీటౌన్ పోలీస్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ‘గంజాయి అమ్ముతున్నారు కదా! మామూలు ఇవ్వండి... సీఐ అడిగి రమ్మన్నారు’ అని చెప్పాడు. ‘మేమెందుకివ్వాలి..? మాకేం సంబంధం..?’ అంటూ నవీన్ ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అడ్డుకోవటానికి ప్రయతి్నంచిన నా బిడ్డపై కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడు. తెల్లవారుజామున వన్టౌన్ కానిస్టేబుల్ రమే‹Ùనాయక్తో కలసి చిరంజీవి మా ఇంటికి కారులో వచ్చాడు. సీఐ రమ్మన్నారంటూ నా కుమారుడిని తీసుకెళ్లారు.మర్నాడు నేను, నా భార్య స్టేషనుకు వెళ్లినా మా బిడ్డను చూపించలేదు. తర్వాత మూడు రోజులకు అరెస్టు చేశారని తెలిసింది. త్రీటౌన్ కానిస్టేబుల్ చిరంజీవిపై హత్యాయత్నం చేశారంటూ కేసు పెట్టారు. ఇలా నడిరోడ్డుపై ప్రజల సమక్షంలో దారుణంగా హింసించిన విషయం వైరల్ అయిన వీడియోతోనే తెలిసింది. మా గుండెలు బద్దలయ్యాయి. ఇదేం ఘోరం? పోలీసు అధికారులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? సభ్య సమాజంలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా? మేం దళితులం అయినందునే కదా ఇంతటి దారుణానికి ఒడిగట్టారు? రకరకాల కేసుల్లో ఉన్న ఇతర వర్గాలకు చెందినవారిని ఏనాడైనా ఇలా శిక్షించారా? మా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. దీనిపై పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేస్తాం. తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటికే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు పంపాం.అక్రమ కేసు బనాయించారునా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు. అక్రమ కేసులో ఇరికించి గొడ్డుని బాదినట్టు బాదారు. ఆ కానిస్టేబుల్ తాను పోలీసునని చెప్పలేదు. పోలీస్ మీదకు వెళ్లారంటూ అక్రమ కేసు బనాయించారు. దారుణమైన నేరాలు చేసిన వారిని కూడా ఇలా చిత్రహింసలకు గురి చేయలేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. – సాంబశివరావు (బాధితుడు బాబూలాల్ సోదరుడు, మంగళగిరి) కానిస్టేబుల్ బ్యాంకు ఖాతా పరిశీలించాలి..నేను పెయింటింగ్ మే్రస్తిగా పని చేస్తున్నా. మా అమ్మాయి బీ.టెక్ చేసింది. కుమారుడు దోమా రాకేష్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేస్తున్నాడు. ఐదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. గతంలో యాక్సిడెంటులో గాయపడటంతో కుడి కాలు, కుడి చేతిలో రాడ్లు వేశారు. గత నెలలోనే ఇక్కడకు వచ్చాడు. ఏప్రిల్ 24న రాత్రి స్నేహితులను కలిసేందుకు అయితానగర్ పల్లెకొండవారి వీధికి వెళ్లాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో త్రీటౌన్ కానిస్టేబుల్ చిరంజీవి వారి దగ్గరకు వెళ్లాడు. నవీన్కు, కానిస్టేబుల్కు మధ్య ఘర్షణ జరిగింది.కానిస్టేబుల్ అక్కడే ఉన్న మావాడి చొక్కా పట్టుకోవడంతో విడిపించుకుని ఇంటికి వచ్చాడు. మామూళ్ల కోసమే ఆ కానిస్టేబుల్ అక్కడకు వచ్చాడు. పట్టణంలో చాలామంది దగ్గర మామూళ్లు వసూలు చేస్తుంటారు. కొందరు డబ్బులిస్తే మరికొందరు ఫోన్ పే చేస్తుంటారు. కానిస్టేబుల్ బ్యాంకు ఖాతా పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి.కానిస్టేబుల్ గాయపడితే ఆస్పత్రిలో చికిత్స పొందకుండా కొద్ది గంటల్లోనే మా ఇంటికి ఎలా వచ్చాడు? కావాలనే కేసు అక్రమ కేసు పెట్టారు. నా కుమారుడిని పోలీసు అధికారులు నడిరోడ్డుపై చిత్రహింసలకు గురి చేశారు. కాలులో రాడ్ ఉందని వేడుకున్నా వినలేదు. ఒక సీఐ బూటుకాలితో తొక్కిపెడితే మరో సీఐ విచక్షణారహితంగా చితకబాదాడు. మా బిడ్డను కొట్టిన పోలీసులకు తగిన శాస్తి జరగాలి. ఇందుకోసం న్యాయపోరాటం చేస్తాం. – దోమా వాసు (బాధితుడు రాకేష్ తండ్రి, తెనాలి, అయితానగర్) -
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?: వైఎస్ జగన్
తాడేపల్లి: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై ఏపీ పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఎలా ఉల్లంఘిస్తుందో అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ వేదికగా ఆ యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు అపరిమిత అధికారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చి భారత రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తోంది. చట్ట పరంగా పాలనను సాగించడానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మానవ హక్కులను వారి రక్షణను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యధేచ్ఛగా అమలు చేస్తుంది. పోలీసులు చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో సహా ప్రతి పౌరుడి హక్కులను కాలరాస్తున్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులైన జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్లను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. నడిరోడ్డుపై కూర్చోపెట్టి పట్టపగలే అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. ఒక సిఐ వారి కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టారు మిగతా పోలీసులు పక్కనే ఉండి ఆ దారుణాన్ని చిత్రీకరించారు. పైగా లాఠీలు విరిగితే కొత్తవి అందించారు. నెల క్రితం ఈ సంఘటన జరిగినా ఈ విషయంపై మాట్లాడటానికి కూడా జనం భయ పడ్డారు. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ మరోసారి తెలిసింది. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి. ఏపీలో ఒక భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమే. ఇది రాజ్యాంగ విలువలపై ప్రత్యక్షంగా జరిగిన దాడి. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్లాలి.అంతేగానీ ఇలా బహిరంగంగా దాడి చేయటానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. భారత రాజ్యాంగాన్ని బాబు సర్కారు బహిరంగంగానే ఉల్లంఘించి అరాచక పాలన సాగిస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. జరగిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్ చేశారు వైఎస్ జగన్.The @ncbn-led government in Andhra Pradesh is openly violating the Indian Constitution by allowing police to exercise unchecked power. Rather than upholding the rule of law, the state is being run under a harsh “Red Book Constitution” that disregards the rights and protections… pic.twitter.com/zqvwxWXolJ— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025 చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ -
‘పద్మ’ పురస్కార గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: 'పద్మ’ పురస్కార గ్రహీతలకు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తమ రంగాల్లో విశిష్ట సేవలందించి పద్మ అవార్డులు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డులు స్వీకరించిన మంద కృష్ణమాదిగ, కేఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇవాళ పద్మ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి భవన్లో ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహితలకు పద్మ పురస్కారాలను అందజేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే, ఏపీ నుంచి వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. -
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి,తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండల నేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
‘సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో సైతం..’
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపైన దాడులు కామన్గా మారాయని, వారిపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్రావు ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారన్న ఆయన, తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై థర్డ్ డిగ్రీ దారుణమన్నారు. ఈరోజు(మంగళవారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జూపూడి. సంక్షేమానికి అర్థం చెప్పిన వైఎస్ జగన్ పాలన2019–24 మధ్య శ్రీ వైఎస్ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశానికి రోల్ మోడల్గా నిలిచాయి. పేదలకు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఒక్క అమరావతిలోనే 50 వేల మంది కోసం ఏకంగా 900 ఎకరాలు కేటాయించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు ప్రపంచాన్ని ఏలగలరన్న నమ్మకం కలిగించారు. నాడు– నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో సమూల మార్పులు, కొత్తగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, మారుమూల గ్రామాల్లో కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదే ఇప్పుడుక్ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1.5 లక్షల కోట్లకుపైగా అప్పు చేసినా, ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అరాచకాలపై మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ నిలదీస్తే, కూటమి పార్టీలకు ఇప్పటికీ సమాధానం చెప్పే ధైర్యం లేదు.వేధిస్తున్నామని మహానాడులో ఒప్పుకున్నారుఎన్నికల్లో గెల్చేందుకు అడ్డగోలుగా హామీలు గుప్పించిన టీడీపీ కూటమి, అ««ధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజలను దారుణంగా వంచించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు.ఈ ఏడాదిలో మేము చాలా తక్కువ మందినే కొట్టాము. తక్కువ మందినే జైల్లో పెట్టాం. అందుకే రెడ్ బుక్ ఓపెన్ చేశామని సిగ్గు లేకుండా మహానాడులో చెప్పుకుంటున్నారు. శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకుని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకొని.. మహానాడు పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు’. నిజానికి కూటమి ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదు. సూపర్ సిక్స్ హామీల అమలు ఊసెత్తడం లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుందని చెప్పడం ప్రజలను మోసం చేయడమే.పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారురాష్ట్రంలో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కూటమి నాయకులు తమకు గిట్టని వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. రాజ్యాగం కల్పించిన మాట్లాడే హక్కు, జీవించే హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. నోరెత్తితే కొట్టడం, కేసులు పెట్టడం, ప్రాణాలు తీసేయడానికి కూడా వెనుకాడటం లేదు. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కట్ట కట్టి బంగాళాఖాతంలో విసిరేసే రోజు త్వరలోనే వస్తుంది.తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై నడిరోడ్డు మీద పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ తాజాగా వెలుగులోకి వచ్చింది. కొట్టొద్దని వేడుకుంటున్నా పోలీసులు లాఠీలతో యువకుల అరికాళ్లపై చితకబాదారు. ఒక సీఐ ఒక యువకుడి కాళ్లను బూటు కాలితో తొక్కి పెట్టగా, మరో సీఐ ఆ యువకుడి అరికాళ్లపై కొట్టడం.. మరో ఇద్దరిని కూడా అదే విధంగా అరికాళ్లపై లాఠీలతో చితకబాదడం, రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. పైగా ఎస్సీ నా కొడకల్లారా అంటూ పోలీసులు దుర్భాషలాడారు.స్థానిక సమస్యల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడన్న కారణంతో రాజమండ్రికి చెందిన పులి సాగర్ అనే దళిత యువకుడ్ని పోలీసులు స్టేషన్కి పిలిపించి కొట్టి బెదిరించారు. అంతటితో ఆగకుండా విద్యావంతుడైన ఆ యువకుడ్ని అర్థనగ్నంగా లాకప్లో నిలబెట్టారు. అక్కడ మహిళా కానిస్టేబుల్ ని కాపలాగా ఉంచి మానసికంగా వేధించారు. సాగర్ను ఉద్దేశించి బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు.గుంటూరు జిల్లా కంతేరులో కల్పన అనే దళిత ఎంపీటీసీని చీర మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్థరాత్రి 20 మంది పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి లాక్కెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందన్న కారణంతో పాలేటి కృష్ణవేణి అనే మహిళను హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆమెను కలిసే అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కే తాళాలు వేశారు. ఇదంతా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగ ఫలితమే.సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలో.మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొడుతుంటే, వారి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఏకంగా దళితులను అంతం చేస్తున్నారు. 1989 యాక్ట్ ప్రకారం దళితులను లక్ష్యంగా చేసుకుని మానసికంగా శారీరకంగా వేధించడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలుంటాయి.తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను కొట్టిన పోలీసులను తక్షణం సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేయాలి. లేదంటే వారిపైన వైయస్సార్సీపీ తరఫున ప్రైవేటు కేసు పెడతాం. ప్రజలిచ్చిన అధికారాన్ని పాలన వరకే పరిమితం చేస్తే మంచిది. ప్రతీకార రాజకీయాలకు వాడితే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జూపూడి ప్రభాకర్రావు స్పష్టం చేశారు. -
‘మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’
ప్రకాశం జిల్లా: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు ఆదిమూలపు.ఈ మేరకు మంగళవారం మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. ‘దళిత యువకులపై పోలీసులు పాశవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రెడ్ బుక్ ర్యాజ్యాగం శ్రుతిమించి అమలు చేస్తున్నారు. నడిరోడ్డు పై కర్రలు విరిగే దాకా పోలీసులు కొట్టడం చూస్తుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోంది. ఆత్మగౌరవం దెబ్బతినేలా, సభ్య సమాజం తలదుంచుకునేలా పోలీసులు తీరు ఉంది. తెనాలి ఘటనపై హోంమంత్రి బాధ్యత వహించాలి. తక్షణమే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ను, మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తాం. కూటమి ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు. పోలీస్ స్టేషన్ లు ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయి’ అని మండిపడ్డారు ఆదిమూలపు సురేష్.కాగా, ముగ్గురు దళిత, మైనారిటీ యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి.. ఇద్దరు పోలీసు అధికారులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలాకా గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. యువకుల అరికాళ్లపై పోలీసులు కర్కశంగా లాఠీలతో చితకబాదారు. -
గడ్కరీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. దేశానికి సేవ చేయటంలో మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Warm birthday wishes to the Hon’ble Union Minister Shri @nitin_gadkari ji. Wishing you good health and continued strength in your service to the nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025 -
పరాకాష్టకు రెడ్ బుక్ పాలన: విడదల రజిని
సాక్షి, గుంటూరు: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే.. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు.‘‘రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో మర్డర్ జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు...డబుల్ మర్డర్లకు ఉపయోగించిన కారు వెనక జూలకంటి బ్రహ్మారెడ్డి అనే స్టిక్కర్ కూడా ఉంది. చనిపోయిన వారు చంపిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్కు ఏంటి సంబంధం?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ మారుస్తున్నారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.కట్టుకథలతో కేసులో ఇరికించారు..మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు మర్డర్ అయ్యారు. చంపింది తెలుగుదేశం నాయకులు.. చనిపోయింది తెలుగుదేశం నాయకులే అని పల్నాడు SP ప్రకటించాడు. కట్టుకథలతో అద్భుతంగా ఫిర్యాదు ఇచ్చారు. అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని కేసులో ఇరికించారు. -
కోనసీమలో విషాదం.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
తాడేపల్లి: గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచి్చన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి వరుసగా.. కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు.గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే.. విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు çఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలెక్టర్ ఆర్. మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు.గ్రామస్తుల ఆగ్రహం.. ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
● తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజీ 1995–97 బ్యాచ్ ఇంటర్ పూర్వ విద్యార్థుల సమావేశం ● 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు గుంటూరు మెడికల్: తెనాలి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో 1995–97 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో వివిధ వృత్తుల్లో, హోదాల్లో స్థిరపడిన మిత్రులంతా 28 సంవత్సరాల అపూర్వ వేడుకలకు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ కుటుంబ సభ్యులతో హాజరై కాలేజీ రోజుల్లో చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాల్లో విహరించారు. సీఐలు రాంబాబు, రమేష్, ఎస్ఐ రాజారావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఆనంద్, బాబూరావు, కోటి, సుబ్బు, సీఆర్పీఎఫ్కు చెందిన అనిల్, పలువురు వైద్య సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. -
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడిజిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నియోజకవర్గస్థాయి సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ భాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. -
‘సాతి’పై అవగాహన కార్యక్రమం
గుంటూరు లీగల్: హైకోర్ట్ ఆదేశాల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్టేక్ హోల్డర్స్కు ‘సాతి’ (సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సిస్ త్రూ ట్రాకింగ్, హాలిస్టిక్ ఇంక్లూషన్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొని సాతి డిస్ట్రిక్ట్ కమిటీ విధి, విధానాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఆధార్ నమోదు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలతో అనుసంధానం ద్వారా అనాథ పిల్లలను గుర్తించి, వారికి సహాయం చేయడానికి సాతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క బిడ్డ గుర్తింపు లేకుండా, వారి హక్కులు, అర్హతలకు దూరంగా ఉండకుండా చూసు కోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. వీధి బాలలు, అనాథలు, రక్షించబడిన పిల్లలు వంటి 18 సంవత్సరాల లోపు నిరాశ్రయులైన పిల్లలందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం, వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలో సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్ పర్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి యూఐడీఏఐ ప్రతినిధి, ప్రతి తాలూకా తహసీల్దార్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఆరోగ్య అధికారి, సివిల్ సర్జన్, జిల్లా శిశు అభివృద్ధిశాఖ అధికారి, జువైనెల్ యూనిట్ నుంచి పోలీస్ అధికారి, అనాధ శరణాలయాలు, బాలల సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఐదుగురు, ప్యానల్ లాయర్లు నలుగురు, పారా లీగల్ వలంటీర్లు నలుగురు సభ్యులుగా ఉంటారన్నారు. -
డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం దక్కాయని అవర్ స్టేట్.. అవర్ లీడర్ సభ్యుడు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ పర్యటనలో ఉన్న కిరణ్కుమార్ రెడ్డి సోమవారం డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజల్లో విశ్వసనీయత, ఆదరాభిమానాలు పొందారని అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు వారి కుటుంబాలు, పిల్లల అభివృద్ధిని తన ఆనందంగా భావించి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆశించారని అన్నారు. యుఎస్ఏలోని అవర్ స్టేట్ – అవర్ లీడర్ సభ్యుడు శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేసేందుకు కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు ఎన్నో ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొన్నారని తెలిపారు. సంతమాగులూరు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, అరెస్టుల పర్వం మినహా ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఆలోచన లేకుండా పోయిందన్నారు. ఈసందర్భంగా అవర్ స్టేట్ – అవర్ లీడర్, ఇంటలెక్చువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గ్రూపునకు చెందిన 700కు పైగా సభ్యులు రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రమణారెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, ప్రసాద్ భీమవరపు, సాంబిరెడ్డి, పాల్ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్లతో కీటక జనిత వ్యాధుల నివారణపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మెజర్స్ అమలు చేయాలన్నారు. అడల్డ్ మస్కిటో మెజర్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధులను గణనీయంగా తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజునాయక్, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్రబాబు, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శేషగిరిరాజు, శ్రీమన్నారాయణ, శిగణేష్ పాల్గొన్నారు. -
ప్రారంభం కాకుండానే పగుళ్లు
● నాసిరకంగా ప్రత్తిపాడు పీహెచ్సీ నిర్మాణ పనులు ● రూ.6కోట్లతో నిర్మాణం ● నెర్రెలిచ్చిన గోడలు, పిల్లర్లు.. పగిలిన ప్రహరీ ● చెమ్మగిల్లుతున్న గోడలు ప్రత్తిపాడు: ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టరు ఇష్టారాజ్యం.. వెరసి రూ.6 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఆస్పత్రి భవనం పగుళ్లిస్తుంది. 2022లో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణకు రూ.6కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేశారు. శిథిల భవనం స్థానంలో పెద్ద నూతన భవనం నిర్మించడంతో పాటు పక్కనే ఉన్న మరో భవనంపై రెండవ అంతస్తును కూడా నిర్మించారు. ఇంకా భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు. చివరి దశలో ఉన్న ఈ నిర్మాణ పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల వైఫల్యం బయట పడుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు భవనాలను జాయింట్ చేసిన చోట నుంచి వాటర్ లీక్ అవుతుంది. వాననీరు ఆస్పత్రి గదుల్లోకి చేరుతుంది. అంతేకాకుండా అనేక గదుల్లో గోడలు పగిలిపోయి, చెమ్మగిల్లి పెయింట్లు పెచ్చులూడి కనిపిస్తుంది. కాగా ఓ చోట ఏకంగా పిల్లరు పగుళ్లిచ్చింది. మరో చోట పిట్టగోడ పగిలిపోయి దర్శనమిస్తుంది. కేవలం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వలనే పగుళ్లు, చెమ్మలు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా భవనం ప్రారంభం కాకముందే ఇన్ని లోపాలు బయటపడుతుండటంతో భవనం నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. జూన్ నెల నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు. అన్నింటా మోసం.. విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో వేసుకున్న తర్వాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తమను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలు అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి. పరిశీలన తప్పనిసరి.. ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు(బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి. పొలంలో విత్తనాలు వేసుకున్న తర్వాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు సమయంలో రశీదు తప్పనిసరి నకిలీలను గుర్తిస్తే.. పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, డీఏఓ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. ధ్రువీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకువస్తారు. పోలీసులు, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. –నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు -
స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వ చేయండి
లక్ష్మీపురం: జిల్లాలో వర్షాకాలంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుంచి వైకుంఠపురం వరకు నావిగేషన్ ఛానల్–4లో ఇసుక తవ్వకాలకు సంబంధించి సర్వే పూర్తి అయిన వెంటనే పెనుమాక, రాయపూడి, వెంకటాయపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెంలో ఇసుక పూడికతీతకు బోట్స్మెన్ సొసైటీకి కేటాయింపుపై సాంకేతిక నివేదికను వారంలో అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. లింగాయపాలెం స్టాక్ పాయింట్ను నిర్వహించిన స్వయం సహాయక సంఘాలకు పెండింగ్లో ఉన్న ఇసుక లిఫ్టింగ్ చార్జీలను తహసీల్దారు నుంచి నివేదిక అందించిన వెంటనే మంజూరు చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల సర్వే పూర్తి చేయాలి రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి అందరికీ ఇళ్లు పథకం సర్వేపై సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరైన లబ్ధిదారుల సర్వేను పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి పాల్గొన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డులపై వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు, అన్నదాత సుఖీభవ పథకంపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఏఓ నున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డీఆర్సీ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
అద్దంకి: పొగాకు రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి చెప్పారు. మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పొదిలి వస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతు లు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నల్ల బర్లీ సాగు చేసిన రైతు పరిస్థితి జీవన్మరణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు దిగుబడులు పడిపోవడం, మరో వైపు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. అందుకే పొగాకు రైతుల తరఫున పోరాటం చేసేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు వైఎస్ జగన్ పొదిలి రాను న్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నాయకులు, అక్కడ హడావుడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కానీ తమ నేత అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తా రని స్పష్టం చేశారు. చేతనైతే రైతులకు సాయం చేసే విధంగా ఉండాలే తప్ప వారికి మేలు జరిగే పనిని అడ్డుకోవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ పులికం కోటిరెడ్డి, ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కోయి అంకారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు జి.రఘురామగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
లక్ష్మీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సత్వరం పరిష్కరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజతో కలిసి కేంద్ర మంత్రి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 222 అర్జీలు వచ్చాయి. అర్జీల స్వీకరణ అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందన్నారు. ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇకపై గోల్డెన్ డే గా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని కొందరు దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, స్టెప్ సీఈఓ ఆర్.చంద్రముని, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు ఇవ్వాలి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నా, జిల్లాలో ఇప్పటికీ విత్తనాల పంపిణీ, కౌలురైతుల గుర్తింపు, గ్రామసభల నిర్వహణ వంటి ప్రక్రియలు చేపట్టలేదు. రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వెంటనే 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు రైతులకు అందజేయాలి. – కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీయానిమేటర్ పై చర్యలు తీసుకోవాలి డ్వాక్రా గ్రూపుల నుంచి ప్రతి నెల బ్యాంక్లో జమ చేయాల్సిన నగదును, శ్రీనిధి, ఉన్నతి వంటి బ్యాంక్ రుణాలకు సంబంధించి కొన్ని నెలలుగా కట్టాల్సిన రూ.15లక్షలను మా గ్రూపు నుంచి వసూలు చేసుకున్న యానిమేటర్ బి.శ్యామల వాటిని బ్యాంకులో జమచేయలేదు. బ్యాంక్లో మళ్లీ రుణం పొందేందుకు వెళ్లిన మాకు బ్యాంకు వారు విషయం చెప్పడంతో ఆమెను నిలదీస్తే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. తీరా ఇప్పుడు పరారీలో ఉంది. కాకుమాను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సదరు యానిమేటర్ ఎక్కడుందో మమ్మల్నే వెతికి సమాచారం చెప్పాలని బదులు చెబుతున్నారు. అధికారుల వద్దకు వెళ్లితే కేసు పెట్టుకోమని చెబుతున్నారు. యానిమేటర్ను పట్టుకుని, మాకు న్యాయం చేయాలి. – ప్రశాంతి డ్వాక్రా గ్రూపు, శ్రీ సత్యన్నారాయణ గ్రూపు సభ్యులు, గరికపాడు, కాకుమాను మండలం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పీజీఆర్ఎస్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్తో కలిసి అర్జీలు స్వీకరణదివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి స్థానిక బృందావన్ గార్డెన్స్లో వున్న దివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి. అంధులు, దివ్యాంగులను వసతి గృహాంలోకి రానివ్వకుండా మనోవేదనకు గురి చేస్తున్నారు. విచారించి, వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా లో 2016 వికలాంగుల చట్టం అమలు కావడం లేదు. చట్టం అమలు అయ్యేలా చూడాలి. విభిన్న ప్రతిభావంతులకు అన్ని కార్యాలయాల్లో స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి. – విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సంస్థ ప్రతినిధులు -
విద్యాశాఖ బదిలీలలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలకు తెరలేచిందనే ఆనందం ఉపాధ్యాయుల్లో ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే బదిలీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో కోరుకున్న పాఠశాలకు వెళ్లడం గగనమవుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతున్నామంటూనే మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో విధించిన నిబంధనలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగియనుంది. ఇందుకు సంబంధించి జీఓ 22 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. పుట్టుకతో శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ద్వారా వారు కోరుకున్న పాఠశాలకు వెళ్లే సదుపాయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శారీరక వైకల్యం 70 శాతం లోపు ఉంటే ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు, 70 శాతానికి పైగా ఉంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో సంబంధిత ఉపాధ్యాయులు వారు పని చేస్తున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లవచ్చు. గత 25 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని మార్చివేసి ఎస్జీటీలకు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లకు 50 శాతం సీలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కక్షపూరితంగానే..! శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఒకే పాఠశాలలు ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్–2 హెచ్ఎం, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. ● ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకరు లేక ఇద్దరు ఎస్జీటీలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాంగ్ స్టాండింగ్ విధానంలో బదిలీపై వెళ్లేందుకు పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం లేదు. ముగ్గురి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉంటేనే సదరు పాఠశాలలను కోరుకోవాలని లేకుంటే మరో పాఠశాలకు వెళ్లాలంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం, సీలింగ్ పరిధికి మించిన పాఠశాలలను బ్లాక్ చేసింది. ● పుట్టుకతో అంధత్వం, వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో తాము పని చేస్తున్న పాఠశాలల్లోనే బదిలీ కాకుండా ఉండటంతో పాటు కోరుకున్న చోటకు బదిలీపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ● శారీరక వైకల్యంతోపాటు దీర్ఘకాలిక జబ్బులు, కేన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు హైస్కూళ్లలో సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. బ్లైండ్, వినికిడి లోపం, నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు విధించారు. ప్రతి మండలంలో 15 వరకు ఖాళీలు ఉండగా, వాటిలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే కోరుకునే విధంగా ఉంచి, మిగిలిన వాటిని బ్లాక్ చేశారు. ● దూరప్రాంతాల్లో మగ్గుతూ వైద్య సదుపాయాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతున్న టీచర్లకు మొండిచెయ్యి చూపారు. భర్త చనిపోయిన మహిళా ఉపాధ్యాయులకు విడాకులు తీసుకున్న ఉపాధ్యాయినులకు సైతం నిరాశే ఎదురవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం అన్యాయానికి గురవుతున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆర్థికంగా భారం లేని బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకింద కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలతో జరిపిన చర్చలకు, మార్గదర్శకాలకు పొంతన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బదిలీలకు అవకాశం ఇచ్చి.. కఠిన నిబంధనలతో మోకాలొడ్డి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం కరవు 25 ఏళ్లుగా అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీపై ఆంక్షలు ఉపాధ్యాయ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాఖలైన దరఖాస్తులు 6,870 లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉమ్మడి జిల్లాలో 6,870 దరఖాస్తులు ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగియనుండగా, సోమవారం నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,870 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు దరఖాస్తు చేశారు. వీరిలో లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉన్నారు. మానవత్వం లేకుండా మార్గదర్శకాలు బదిలీల మార్గదర్శకాల్లో విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించారు. పీహెచ్ కేటగిరీతో పాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ పాఠశాలల్లో ఖాళీలను బ్లాక్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీడబ్ల్యూడీ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందిన వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సినది పోయి ఈ విధంగా కఠిన నిబంధనలు విధించడం దారుణం. – కె.బసవలింగారావు, ఏపీటీఎఫ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడువైకల్యంతో పుట్టడం మా తప్పా ? నేను గుంటూరు రూరల్ ఓబులనాయుడుపాలెంలోని ఎంపీయూపీఎస్లో పని చేస్తున్నాను. 70 శాతానికి పైగా శారీరక వైకల్యానికి గురైన నేను బదిలీల్లో గుంటూరుకు సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. ఉపాధ్యాయ బదిలీల చట్టంలో లేని విధంగా జీఓలో అనేక కఠిన నిబంధనలు విధించారు. శారీరక వైకల్యంతో జన్మించడం నా తప్పా ? మానవత్వాన్ని చూపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఈ విధంగా నిబంధనలు విధించి పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు. – పి.నాగశివన్నారాయణ, ఎస్జీటీ, గుంటూరు -
ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏపీఆర్జేసీ సెట్–2025లో అర్హత సాధించిన విద్యార్థులకు సంస్థ కార్యదర్శి బీఎన్ మస్తానయ్య ఆదేశాల మేరకు ఆంధ్ర రీజియన్లోని ఏపీఆర్ జూనియర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను ఏపీఆర్జేసీ సెట్ కన్వీనర్ హెచ్ఎండీ ఉబేదుల్లా పర్యవేక్షించారు. ఆంధ్ర రీజియన్ పరిధిలోని తాటిపూడి బాలికల కళాశాల, నిమ్మకూరులోని కో–ఎడ్యుకేషన్, నాగార్జునసాగర్లోని బాలుర కళాశాల, గుంటూరు, వెంకటగిరిలోని బాలుర జూనియర్ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 299 సీట్లకు 1:5 నిష్పత్తిలో 1,328 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలువగా, వారిలో మొదటి రోజు ఎంపీసీ, ఐఐటీ కోర్సులకు 131 బాలురు, 33 మంది బాలికలు హాజరై ఆయా కళాశాలల్లో సీట్లను కోరుకున్నారు. కాగా మంగళవారం బైపీసీ, బుధవారం ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఉబేదుల్లా తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు భోజన, తాగునీటి వసతులు కల్పించారు. తుళ్లూరులో 28.8 మి.మీ వర్షం కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా తుళ్లూరు మండలంలో 28.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తాడేపల్లిలో 0.6 మి.మీ వర్షం పడింది. సగటున 3.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఫిరంగిపురం మండలంలో 17.4 మి.మీ., తాడికొండ 8.2, ప్రత్తిపాడు 5.8, గుంటూరు తూర్పు 1.2, గుంటూరు పశ్చిమలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. -
‘రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైఎస్సార్సీపీ లీగల్సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు కేసుల్లో భాగంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం కాకాణి గోవర్థన్రెడ్డిని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోనే మైనింగ్ అధికారి బాలాజీనాయక్తో తప్పుడు ఫిర్యాదు చేయించి, కేసు పెట్టించారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టవిరుద్దమైన అన్ని పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మీద అక్రమ మైనింగ్ అంటూ ఓ తప్పుడు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీని వెనుక కారణం ఏంటని చూస్తే పొదలకూరు దగ్గర క్వార్ట్జ్ మైనింగ్కి రుస్తుం మైకా అనే కంపెనీ లీజు హోల్డర్లు. వారికి 2009 నుంచి 2023 ఏప్రిల్ 1 వరకు లీజు గడువు ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వ పాలసీ మారిన తర్వాత తిరిగి ఎవరికీ లీజుకివ్వలేదు.అయితే అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధర్నాలు చేసి ఫిర్యాదులు చేస్తే, అప్పట్లోనే మైనింగ్ అధికారులు విచారణ చేసి ఎటువంటి అక్రమ మైనింగ్ జరగలేదని నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే అంశంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కాకాణి గోవర్ధన్రెడ్డిపై తాజాగా ఫిర్యాదు చేయించి కేసు పెట్టడం రాజకీయ కక్షసాధింపు కాదా?కుట్రపూరితంగానే అక్రమ మైనింగ్ కేసుకూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేయడం మొదలైంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 14, 2025లో మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ అనే వ్యక్తితో అక్రమ మైనింగ్ చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో ముద్దాయిలుగా ముగ్గుర్ని చేరిస్తే వారందరికీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు అయ్యింది. ఇందులో కాకాణి గోవర్థన్రెడ్డి పేరు ఎక్కడా లేదు. ఎఫ్ఐఆర్లో అదర్స్ ప్లేస్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేరును చేర్చారు. కొంతమందిని అరెస్ట్ చేసి వాంగ్మూలం తీసుకున్నారు.మైనింగ్ చేసుకోండి, మీ వెనుక నేనున్నాను అని కాకాణి అభయం ఇచ్చినట్టుగా ఏ6 అరవిందకుమార్రెడ్డి అనే వ్యక్తిని బెదిరించి, కొట్టి ఆయనతో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత జూలై 2025న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో ఫిర్యాదు చేయించారు. కాకాణికి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో సెక్షన్లు మార్చి నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ తప్పుడు కేసులోనే ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులోనూ జరిగింది ఇదే. మొదట ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టయిన తర్వాత పీసీఐ యాక్ట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు.పల్నాడు జంట హత్యలతో పిన్నెల్లి సోదరులకు ఏం సంబంధం?మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకులు బైకుపై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి చంపారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఈ దాడి జరిగిందని, దాడి చేసిన వారు కూడా టీడీపీ వారేనని ఎస్పీ ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇదే విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. కానీ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేకపోయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మీద అక్రమ కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వారిపై తప్పుడు కేసు నమోదు చేశారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న కారుపై కూడా జేబీఆర్ (జూలకంటి బ్రహ్మారెడ్డి) పేరు కూడా ఉంది. హత్యను కళ్ళారా చూసిన మృతుడి బంధువు తోట ఆంజనేయులు సైతం టీడీపీ వారే చంపారని పోలీసులతో చెప్పారు. దీనికి సంబంధించి వారు మాట్లాడిన వీడియోలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఇది అక్రమ కేసేనని రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెబుతారు.కల్తీ లిక్కర్ మరణాలను మద్యం కేసుకి లింక్ చేస్తున్నారుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలతో కొందరు చనిపోయారని టీడీపీ నాయకులు అసెంబ్లీలో ఆరోపిస్తే ఇదంతా అవాస్తవమని దానిపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ అంశాన్ని తీసుకొచ్చి కొత్తగా కేసులు నమోదు చేస్తున్నారు. కల్తీ మద్యం తాగి చనిపోయారని కుటుంబసభ్యులే స్టేట్మెంట్ ఇచ్చినా, ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం వల్లే ఆ మరణాలు సంభవించినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.మొత్తం 25 మంది చనిపోయినట్టు కొత్త కథలు రచించి భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల్లో విషం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై నాటి సీఎం జగన్ మాట్లాడుతూ సహజ మరణాలను కూడా కల్తీ లిక్కర్ మరణాలుగా మార్చి ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు.లిక్కర్ లో విషపూరిత అవశేషాలనున్నట్టు తప్పుడు ప్రచారంఏపీలోని మద్యం శాంపిళ్లను పరీక్షించిన ఎస్జీఎస్ లేబొరేటరీ అందులో విషపూరిత అవశేషాలున్నట్టుగా తేల్చిందని టీడీపీ నాయకులు విష ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన నాటి వైయస్సార్సీపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని బేవరేజెస్ కార్పొరేషన్ తరఫున నేరుగా లేబొరేటరీకి లేఖ రాసింది. దీనిపై ఎస్జీయస్ లేబొరేటరీ స్పందించి తాము అలాంటి నివేదికే ఇవ్వలేదని లిఖితపూర్వకంగా చెప్పినా ఇంకా అసత్యాలనే టీడీపీ ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అబద్ధాల ఫ్యాక్టరీగా మారిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని తమకు గిట్టని వారి మీద అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు.నడిరోడ్డుపై పోలీసుల అరాచకంరాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడి రోడ్డు మీదనే దళిత యువకులను పోలీసులు దారుణంగా కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై మానవహక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. కూటమి నాయకులు ఏది చెబితే అది చేయడానికి పోలీసులు వెనుకాడటం లేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ప్రజాస్వామ్య వాదులు మేథావులు ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. -
వాస్తవాలన్నీ త్వరలోనే బయట పడతాయి: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో యథేచ్చగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని... చివరికి డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జత్వానీ అనే మహిళతో అక్రమ ఫిర్యాదు చేయించి పీఎస్ఆర్ని అరెస్టు చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు అంటూ మరొక కేసు ఆయనపై పెట్టారు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెప్తేనే ఏపీపీఎస్సీ నిర్వహించింది. కానీ అక్రమంగా చేశారంటూ కేసులు పెట్టారు’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.‘‘వాస్తవాలన్నీ త్వరలోనే బయట పడతాయి. చంద్రబాబు 21 నోటిఫికేషన్లను సంబంధించి ఏమాత్రం ముందుకు తీసుకుపోవటం లేదు. ఇటీవల గ్రూపు-2 లో ఎన్ని అక్రమాలు చేశారో జనం చూశారు. వైఎస్ జగన్ హయాంలో ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా అన్ని నియామకాలు గొప్పగా జరిగాయంటూ కేంద్రమే మెచ్చుకుంది. చంద్రబాబు 1995లో సీఎం అవగానే టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయి. 1997లో ఇంటర్ పరీక్ష పేపర్లు లీకే చేశారు. 2017 లో కూడా నారాయణ విద్యాసంస్థల కోసం ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయి. ఆ విషయాన్ని ఈనాడు పత్రికలో కూడా వార్తలు వచ్చాయి...పేపర్ల లీకేజీలో అప్పటి మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు పాత్ర ఉంది. అయినప్పటికీ వారిని చంద్రబాబు ఎందుకు అరెస్టు చేయలేదు?. 2022లో నారాయణ సంస్థల వారు ప్రశ్నాపత్రాల లీక్ చేయాలని చూస్తే జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అంత పకడ్బందీగా జగన్ పాలనలో పరీక్షలను నిర్వహించారు. చంద్రబాబు హయాంలో మూడు లీకులు, ఆరు అక్రమాలు ఉంటాయి. చివరికి హాఫ్ ఇయర్లీ పరీక్షా పత్రాలు కూడా చంద్రబాబు హయాంలో లీకయ్యాయిజగన్ హయాంలో ఆరి నెలలోనే లక్షా యాభై వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి అక్రమాలు లేకుండా నియామకాలు చేశారు. జగన్ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు వ్యవహరించాలి. ఇకనైనా ఆరోపణలను కట్టిపెట్టి కక్షసాధింపు రాజకీయాలను మానుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ హితవు పలికారు. -
వంశీకి తీవ్ర అస్వస్థత.. జీజీహెచ్ వద్ద పంకజశ్రీతో పోలీసుల వాగ్వాదం
సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీని సోమవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ సతీమణి పంజశ్రీకి కాసేపటి క్రితమే ఆమె జీజీహెచ్కు చేరుకున్నారు. ఆమెను గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక, వంశీని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే జీజీహెచ్ గేట్లను మూసివేశారు పోలీసులు.మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో, వంశీని సోమవారం ఉదయం జీజీహెచ్కు తీసుకువచ్చారు. అనంతరం, వంశీకి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక, వంశీకి జీజీహెచ్కు తరలించిన వెంటనే పోలీసులు.. ఆసుపత్రి ప్రధాన గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆసుప్రతికి వచ్చి పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు సైతం వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా ఆమెను గేటు వద్దనే నిలిపివేశారు. ఈ క్రమంలో పంకజశ్రీతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో, వంశీ ఆరోగ్య పరిస్థితిపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా సైతం చేరుకున్నారు. ఫాతిమాను కూడా ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. -
పచ్చ నేతలకు చంద్రన్న తోఫా!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడ భూములు కనిపించినా కబళిస్తున్న కూటమి సర్కారు వక్ఫ్ భూములనూ వదలడం లేదు. నిరుపేద ముస్లింల సంక్షేమం కోసం వినియోగించేందుకు దాతలు అల్లా పేరుతో వక్ఫ్ చేసిన ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా అన్యాక్రాంతం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వక్ఫ్ భూములు కబ్జాలకు గురి కాగా తాజాగా రాజధాని ప్రాంతంలో రూ.వందల కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకు పచ్చ నేతలు స్కెచ్ వేశారు. గుంటూరు జిల్లాకు చెందిన కీలక ప్రజా ప్రతినిధులు వక్ఫ్ భూములను అక్రమ మార్గంలో దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. గుంటూరులోని షాయి జామియా మసీదు (పెద్ద మసీదు), అంజుమన్ ఏ ఇస్తామీయా సంస్థలకు చెందిన 300 ఎకరాలకుపైగా వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్కుల కోసం ఏపీఐఐసీకి బదలాయించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.గుంటూరు పెద్ద మసీదుకు ప్రత్తిపాడు మండలంకొత్తమల్లాయపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 232–1, 2లో 233.18 ఎకరాల భూములున్నాయి. వీటిని ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీకి అప్పగించాలంటూ వక్ఫ్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. ఈమేరకు గుంటూరు ఆర్డీవో కె.శ్రీనివాసరావు వక్ఫ్ కార్యనిర్వహణ అధికారి (సీఈవో)కి లేఖ రాశారు. ఇక అంజుమన్ ఏ ఇస్లామీయ వక్ఫ్ సంస్థకు చినకాకాని గ్రామంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి వెనుక ఉన్న 78 ఎకరాల వక్ఫ్ భూమిని సైతం ఇండస్ట్రియల్ పార్కు కోసం అప్పగించాలని తెనాలి ఆర్డీవో లేఖ రాశారు.ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఆగమేఘాలపై రంగంలోకి దిగిన అధికారులు మూడు పర్యాయాలు మల్లాయపాలెం, చినకాకాని భూములను సందర్శించి ఇండస్ట్రియల్ పార్కుకు అప్పగించేలా చర్యలు చేపట్టారు. ఈ భూములను అప్పగించేలా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలిసి పెద్ద మసీదు కమిటీ పెద్దలపై ప్రభుత్వ పెద్దల తరఫున తీవ్ర ఒత్తిడి తెచ్చి ఒప్పించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన పట్ల ముస్లిం సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పోరుబాటకు సన్నద్ధం అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధం ⇒ వక్ఫ్ భూములను లీజుకు ఇవ్వడం, విక్రయించడం, బహుమతి(గిఫ్ట్)గా ఇవ్వడం చెల్లదని వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 51 స్పష్టం చేస్తోంది. కూటమి సర్కారు నిర్భీతిగా వక్ఫ్ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు రూ.500 – 600 కోట్ల విలువ చేసే 311.18 ఎకరాలను భూ సేకరణ పేరుతో ఏపీఐఐసీకి కారుచౌకగా అప్పగించేందుకు సిద్ధమైంది. కీలక నేత ఆదేశాలతో రిజిస్ట్రేషన్ విలువలో 25 శాతం ధరకే అప్పగించేలా ప్రతిపాదనలు రూపొందించడం విస్తుగొలుపుతోంది.⇒ గుంటూరు పెద్ద మసీదు, అంజుమన్ ఏ ఇస్లామియాకు చెందిన రూ.వందల కోట్ల విలువైన భూములను ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఆంధ్రప్రదేశ్ భూ సేకరణ చట్టం 2018 సెక్షన్ 22 ప్రకారం అతి తక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఆ భూములను తన వ్యాపార సామ్రాజ్యానికి ‘కేంద్ర’ బిందువుగా చేసుకోవాలని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నారు. సంగం డెయిరీ తరహాలో భారీగా పాల శీతలీకరణ ప్లాంటు, అనుబంధ యూనిట్లతోపాటు కారం పొడి తయారీ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు.⇒ ముస్లింల సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబు ఆది నుంచి రెండు నాలుకల ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించిన రోజే రాష్ట్రంలో వక్ఫ్ భూములను లీజుకు ఇచ్చేందుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ పత్రికా ప్రకటన ఇవ్వడంపై ‘వక్ఫ్ ఆస్తులకు ఎసరు’ పేరుతో ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కలకలం రేగడంతో రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను లీజుకు ఇచ్చేది లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు లీజుకు ఇచ్చేది లేదన్న సీఎం ఇప్పుడు ఏకంగా వక్ఫ్ భూములను కారుచౌకగా ఇతరులకు కట్టబెట్టేందుకు సిద్ధం కావడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది.భూములు దోచుకునేందుకే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూములు దోచుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్ది ఎకరాల్లో మాత్రమే ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి, మిగతాది కమర్షియల్గా దోచుకునే ప్రయత్నానికి తెర తీశారు. వక్ఫ్ భూములను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. ఎంతటి పోరాటాలకైనా వెనుకాడం.– షేక్ నూరి ఫాతిమా, వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలుఇది దుర్మార్గ చర్య వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ కూటమి ప్రభుత్వం మద్దతివ్వడమే కాక రాష్ట్రంలో వక్ఫ్ భూములను ప్రైవేట్ వారికి అప్పగించే కుట్రలు ప్రారంభించడం దుర్మార్గం. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తే కచ్చితంగా ఆ మొత్తం భూమిని ముస్లిం సమాజానికే కేటాయించాలి. ఏ ఇతర కార్పొరేట్ సంస్థలకు అప్పగించినా సహించేది లేదు. – గులాం రసూల్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకుడుముస్లింల సంక్షేమం కోసమే వినియోగించాలిప్రభుత్వం వక్ఫ్ లీజు నిబంధనలకు అనుగుణంగా వక్ఫ్ భూములను లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏకపక్షంగా ఇవ్వడానికి కుదరదు. ఇదే 233 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం పరిశీలిస్తే ముస్లిం సంఘాలు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీకి ఈ భూములు ఇస్తే వాటిని కేవలం ముస్లిం సంక్షేమం కోసం మాత్రమే వినియోగించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. – మొహమ్మద్ ఖలీం, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు
చిలకలూరిపేట: కన్నుల పండువగా సంప్రదాయ నృత్యాలు, వీనుల విందుగా సుమధుర సంగీత కీర్తనలు, నాట్య కళాకారుల ఉత్సాహపూరిత ప్ర దర్శనల మధ్య కళా నిలయం 40వ జాతీయ స్థా యి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు సూర్య, చంద్ర విభాగాల్లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి ,చక్కటి హావభావాలతో నాట్యకళ ప్రదర్శించి, నటరాజ వారసులమని నిరూపించారు. కీర్తన, మూషిక వాహన, గణపతి కౌతం, వినాయక కౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతార శబ్దం,జనుత శబ్దం,కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహ వైభవం, హిమగిరి తనయ, అలవేల్ మంగ వంటి కీర్తనలకు లయబద్ధంగా నర్తించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేసి వారి ప్రశంసలను అందుకున్నారు. ఒకవైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యకళ బోధించిన నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు. నేటి కార్యక్రమాలు సూర్య, చంద్ర విభాగాల్లో జానపద నృత్య పోటీలతో పాటు శాసీ్త్రయ జంట నాట్యాలు, అశాసీ్త్రయం జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, అశాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్యనాటికల పోటీలు సోమవారం నిర్వహిస్తారు. వీటితో పాటు నాట్యాచార్యులకు సన్మానాలు ఉంటాయి. రెండో రోజు ఆకట్టుకున్న నాటికలు నాదెండ్ల: మండలంలోని సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయ నాటికల పోటీలు ఆదివారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శన నిలిచిపోయింది. ఆదివారం తొలిగా ప్రదర్శించారు. అనంతరం కొలకలూరి శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘జనరల్ బోగీలు’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘దొందూ దొందే’ నాటిక ప్రదర్శించారు. రచనా దర్శకత్వం డేవిడ్రాజు వహించారు. ఏలూరు హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సారీ రాంగ్ నంబర్’ నాటికకు రచయితగా చింతల మల్లేశ్వరరావు, దర్శకుడిగా మహమ్మద్ ఖాజావలి వ్యవహరించారు. సామాజిక రుగ్మతలు, సందేశాలను నాటికలు ప్రస్ఫుటించాయి. జ్యోతి ప్రజ్వలన బండారుపల్లి మస్తాన్రావు, సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు చేయగా, సభాధ్యక్షత గరికపాటి వెంకట రామారావు వహించారు. నేటి ప్రదర్శనలు : బాపట్ల సహృదయ ద్రోణాదుల వారి ‘వర్క్ఫ్రం హోమ్’, సాతులూరు వజ్జా రామనాథం ఆర్ట్స్ ‘రారాజు సుయోధన’, వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ‘ఏకాకి’ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రెండో రోజు కొనసాగిన కళానిలయం జాతీయ స్థాయి పోటీలు -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి వారితో ఆసనాలను వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం కూడా శిక్షణ కొనసాగింది. ఆన్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఇందులో యోగా గురువులు, టీఓటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న కోటప్పకొండ, జూన్ 5న నాగార్జునసాగర్, 11న కొండవీడు కోట, 18న అమరావతి వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్ ఐదున యోగా ప్రదర్శనను నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందినవారితో బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు. పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం ఉదయం నరసరావుపేటలోని కలెక్టర్ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఐదున రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొనసాగుతున్న శిక్షణ