Guntur
-
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై సోమవారం ‘ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ’ శీర్షికతో ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి జిల్లావిద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్ట ప్రకారం విడుదల చేసిన జీఓ నెం.53లో నిర్దేశించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అదేవిధంగా క్యాంపస్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు వంటి సామగ్రి విక్రయించరాదని స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు, యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తే యాజమాన్యంపై తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
డైయేరియాతో బహుపరాక్
అతిసార ప్రాణాంతకం గుంటూరు మెడికల్: డయేరియా సోకినప్పుడు పెద్దవారు చేసే కొద్దిపాటి నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అతిసార వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందించని పక్షంలో ప్రాణాలు పోతాయి. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఏడాది 4.3శాతం చిన్నారులు అతిసార వ్యాధితో చనిపోతున్నారు. జిల్లాలో 2024లో 93 మంది ఐదేళ్లలోపు చిన్నారులు , 2025లో 105 మంది, 2026 జనవరి నుండి మే నెల వరకు 66 మంది అతిసార వ్యాధి బారిన పడ్డారు. పిల్లల్లో డయేరియా మరణాలను నివారించడమే లక్ష్యంగా ఈనెల 16 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా డయేరియా (అతిసారవ్యాధి) నియంత్రణ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సాధారణ విరేచనం కంటే ఎక్కువ నీరు లేదా, పూర్తిగా నీళ్ల విరోచనం అవుతూ ఉంటే పిల్లలకు అతిసార వ్యాధి సోకినట్లు గుర్తించాలి. ఐదేళ్లలోపు పిల్లలకు రోజులో మూడు సార్లుకంటే ఎక్కువ సార్లు మోషన్స్ అవడం, విరేచనంలో నీటి శాతం ఎక్కువగా ఉంటే దానిని అతిసారగా గుర్తించి తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అతిసార వైరస్ద్వారా సోకుతోంది. ఈ వ్యాధి సోకిన వారిలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. బిడ్డకు చంచలత్వం, చిరాకు, మైకం, అపస్మారక స్థితి, కళ్లు లోపలికి వెళ్లినట్లు ఉండటం, చర్మం స్థితిస్థాపకత లేకపోవడం, సున్నితంగా నొక్కడం వల్ల చర్మం చాలా నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవడం, బిడ్డ చాలా దాహంతో ఉండటం, నీరు తాగులేకపోవడం, లక్షణాలు కనిపిస్తే తక్షణమే డయేరియాగా నిర్ధారించుకుని వైద్యులను సంప్రదించాలి. జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణ, డయేరియా మరణాల నివారణే లక్ష్యంగా 15 రోజులపాటు స్టాప్– డయేరియా పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందిస్తున్నారు. హ్యాండ్ వాష్పై ఆసుపత్రుల్లో, ఇళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ – జింక్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నాం. – డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, గుంటూరు డయేరియాను ఓఆర్ఎస్తో పూర్తిగా కట్టడి చేయవచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. శుభ్రమైన పాత్రలో ఒక లీటరు తాగునీటిని పోసి నీటిని కాచి చల్లార్చి అందులో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ను పోయాలి. పరిశుభ్రమైన స్పూన్తో ఓఆర్ఎస్ పొడిని కాచిచల్లార్చిన నీటినిలో కలిసిపోయేలా తిప్పాలి. పిల్లవాడి వయస్సు, శరీర బరువును బట్టి ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. రెండు నెలలకంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుకు ప్రతి విరేచనం తరువాత ఐదు స్పూన్ల ద్రావణం పట్టించాలి. రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత అరకప్పు, రెండు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత ఒక కప్పు ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. అతిసార వ్యాధి మొదలైన నాటి నుంచి విరేచనాలు తగ్గే వరకు పిల్లలకు ఓఆర్ఎస్ ఇవ్వాలి. తల్లులు పాలు తాగుతున్న పిల్లలకు తప్పనిసరిగా మోషన్స్ అవుతున్నా కూడా బ్రెస్ట్మిల్క్ ఆపకూడదు. దాంతోపాటుగా, గంజి, కొబ్బరి నీరు, పలుచని పప్పుచారు ఇవ్వడం మంచిది. ఓఆర్ఎస్తోపాటుగా జింక్ మాత్రలను కూడా పిల్లలకు ఇవ్వాలి. అతిసార వ్యాధి తీవ్రతను జింక్ మాత్ర తగ్గిస్తోంది. డయేరియా సోకిన చిన్నారులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలందిస్తున్నాం. డయేరియా వ్యాధిపై అవగాహన, చికిత్స ఏవిధంగా అందించాలనే విషయాలపై అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ – జింక్ కార్నర్లు ఏర్పాటు చేశాం. డయేరియా సోకిన చిన్నారులకు ఏవిధంగా వైద్యం అందించాలనే విషయాలపై వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,45,000 మంది ఉన్నారు. వీరికి 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ మాత్రలు గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచాం. అదనంగా రిజర్లు స్టాక్ను ఆయా ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ స్టోర్స్ విభాగంలో సిద్ధంగా ఉంచాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు -
నెలాఖరులోగా కాల్వల మరమ్మతులు పూర్తి
తెనాలి టౌన్: గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ప్రధాన పంట కాలువలు వాటి పరిధిలోని బ్రాంచ్ కెనాళ్లను ఈ నెలాఖరులోగా శుభ్రం చేసి రైతులకు జూలై మొదటి వారంలో సాగునీరు అందివ్వనున్నట్టు గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా తెనాలి కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్. సుధాకర్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. ఈ ఆయకట్టు పరిధిలో 5,72,000 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉన్నట్టు చెప్పారు. మొత్తం 10 ప్రధాన పంట కాలువలు, వాటి కింద 50 పైబడి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నట్టు వివరించారు. వీటి మెయింట్ నెన్స్కు ప్రభుత్వం రూ. 13.64కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రధాన పంట కాల్వలో గురప్రు డెక్క తొలగిస్తున్నట్టు తెలిపారు. బ్రాంచ్ కెనాల్స్కు అవసరమైనచోట్ల నూతన షట్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 20 సెక్షన్ల పరిధిలో 284 వర్కులు.. గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయ పరిధిలో 20 సెక్షన్లు ఉండగా మొత్తం 284 వర్కులు చేపట్టారు. ఇవన్నీ సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వర్కులు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఐదు వర్కులు, బాపట్ల జిల్లాలో 162, గుంటూరు జిల్లాలో 117 వర్కులు జరుగుతున్నాయన్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేసి పంటకాలువలను అందుబాటులోకి తేనున్నట్టు వివరించారు. అయితే గురప్రు డెక్కతో నిండిన ప్రధాన పంట కాలువల మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయ ఈఈ ఎస్.సుధాకర్ -
కుడికాలువకు నీరు నిలుపుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ కుడికాలువకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. గత నెల 25న తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణానది యాజమాన్య బోర్డు 10 టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తి అవ్వటంతో కుడికాలువకు పూర్తిగా నీటిని నిలుపుదల చేశారు. కార్యక్రమంలో డీఈఈ టి మురళీధర్, ఏఈఈ సుధ, డ్యాం సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు. పెదకాకాని: సినీ నటుడు వడ్డే నవీన్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ట్రానన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం వీవీఐటీయూలో సందడి చేసింది. ఈ చిత్రం జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. కార్యక్రమంలో హీరో వడ్డే నవీనన్తో పాటు హీరోయిన్ రాశి సింగ్ పాల్గొన్నారు. చిత్రబృందానికి వీవీఐటీయూ ప్రో–ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ స్వాగతం పలికారు. నవీన్ మాట్లాడుతూ ఈ చిత్రం బలమైన కథాంశంతో సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చిత్రబృందం విద్యార్థులతో కలసి నృత్యాలు, సెల్ఫీలతో సందడి చేసింది. బాపట్లటౌన్: బైండోవర్ బాండ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో నిందితుడిగా ఉన్న స్టువార్టుపురం గ్రామానికి చెందిన మాదిగాని రామచంద్రకుమార్ అలియాస్ పప్పును వెదుళ్లపల్లి పోలీసులకు సోమవారం కోర్టుకు అప్పగించారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ 30 రోజుల రిమాండ్, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు అనుమతితో సోమవారం రామచంద్రకుమార్ను బాపట్ల సబ్జైల్కు తరలించారు. గుంటూరు లీగల్: వృద్ధులకు ఏమైనా న్యాయపరమైన సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదే శాల మేరకు సోమవారం ఎస్వీఎన్ కాలనీ సమీపంలోని దాక్షిణ్య మానసిక వికలాంగుల స్కూల్, ఓల్డ్ ఏజ్ హోంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తొలుత దాక్షిణ్య స్కూల్ను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడారు. వారి సమస్యల గురించి అక్కడవున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కోయవారిపాలెం, గుంటూరులోని నవీన్ ఆదర్శ్ మహిళా మండలి ఓల్డ్ ఏజ్ హోంను సందర్శించి, వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నలందా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హైవే రోడ్డుపై గుర్తు తెలియని పాప తిరుగుతుండటాన్ని సత్తెనపల్లి పోలీసులు గుర్తించి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. పాప తన పేరు షేక్ జాన్, తండ్రి గౌస్ అని, గుంటూరు క్లబ్ వద్ద చినపలకలూరు గ్రామంగా చెబుతుందని ఎస్ఐ అమిరుద్దీన్ తెలిపారు. పాప ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ, ఎస్ఐ, పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
‘చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది’
తాడేపల్లి : రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ధ్వజమెత్తారు. దీనిపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శైలజానాథ్. ఈరోజు(సోమవారం, జూన్ 15వ తేదీ) రాయలసీమ లిఫ్టు నిలిపివేతపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ నేతలు సమావేశమయ్యారు. దీనికి సాకే శైలజానాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, కాకాని గోవర్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు. త్వరలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపునకు దిగారు. దీనిపై రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తాం. తొలుత అనంతపురం, నెల్లూరు జిల్లాలో తొలుత పర్యటిస్తాం. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఒత్తిడి చేస్తాం. మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. కృష్ణా, తుంగభద్ర మీద ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా రాయలసీమ ఎడారిగా మారుతోంది. చంద్రబాబు తక్షణం స్పందించాలి.వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్టును ఏర్పాటు చేస్తే చంద్రబాబు దాన్ని ఆపేశారు. రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను పనంగా పెట్టారు. ఏపీ హక్కులను కాలరాశారు. అదేమంటే బనకచర్ల ప్రాజెక్టు పేరు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే రాయలసీమ లిఫ్టును పూర్తి చేయకుండా బనకచర్ల అంటారెందుకు?, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుక పడిన ప్రాంతాల కన్నీటితో రాజధానిని కడతారా?, రాజధానిలో జరుగుతున్న అవినీతికి అడ్డూ అదుపు లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాలకంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయటం వెనుక భారీ అవినీతి ఉంది. అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం పెట్టినా మావిగన్, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనేదే లేదు’ అని ధ్వజమెత్తారు. -
భట్టికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలుతో వర్ధిల్లాలని కోరుకుంటూ’ విషెస్ చెప్పారు. Heartiest birthday greetings to Deputy Chief Minister Shri Mallu Bhatti Vikramarka garu. Wishing you a long, healthy, and happy life.@Bhatti_Mallu pic.twitter.com/8ExVWBQud7— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2026 -
ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి!
తెనాలిరూరల్: అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల లీలలు విచిత్రంగా ఉన్నాయి. అధునాతన వాహనాన్ని వెనక్కి తీసుకుని పాత వాహనాన్ని తెనాలికి పంపారు. ఏప్రిల్ 14వ తేదీన తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి ప్రత్యేక అగ్నిమాపక శకటాన్ని కేటాయించి పంపారు. పంపిన రెండు రోజులకే వెనక్కి పిలిపించి రాష్ట్ర సచివాలయంలో ఉంచారు. పరిధి పెద్దదైన తెనాలి కార్యాలయం కింద తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, బాపట్ల జిల్లా చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడ దశాద్దాల క్రితమే రెండు వాహనాలు అవసరముందని భావించిన అధికారులు రెండు వాహనాలను కేటాయించారు. ఒక వాహనం దశాబ్దంన్నర క్రితం శిథిలావస్థకు చేరుకోగా అప్పటి నుంచి కేవలం ఒక్క వాహనంతోనే నెట్టుకువస్తున్నారు. ఇటీవల రెండో వాహనం కేటాయించి పంపడంతో అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. ఈ ఆనందం కేవలం రెండు రోజుల్లోనే ఆవిరైపోయింది. -
వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేటర్గా సైతం గెలవని పిల్లి మాణిక్యరావుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత లేవని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర అన్నారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబుకు ఆ సామాజిక వర్గానికి రాజ్యాంగ పదవుల్లో సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్తో పోలికా అని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం గుర్తుకు రాదని, ఆయన్ను ఎవ్వరూ నమ్మరని ఆరోపించారు. యూటర్న్కు, వెన్నుపోటుకు, క్రెడిట్ చోరీకి ఆయన చిరునామా అన్నారు. మహానేత వైఎస్సార్ వేసిన పునాదులతో పైకి వచ్చిన వైఎస్ జగన్ రెండుసార్లు ఎంపీగా గెలవడంతోపాటు 151 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి, ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించారని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకుని, రూ.కోట్ల అవినీతికి పాల్పడిన డీఎస్సీ వ్యవహారంపై పిల్లి మాణిక్యరావుకు దమ్ముంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో హామీలు అమలు చేయని ఫలితంగా రాష్ట్ర ప్రజలు రూ.లక్షన్నర కోట్లు నష్టపోయారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అని తప్పుడు విమర్శలు చేస్తున్న పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సైతం అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైఎస్సార్ సీపీ తరఫున తాము చేసిన ఆరోపణలపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు లేక పిల్లి మాణిక్యరావుతో పదే పదే అబద్ధాలు, ఆరోపణలు చేయిస్తున్నారా అని మండిపడ్డారు. జిల్లాలో ఎస్సీ విభాగంలో టాపర్లుగా వచ్చిన అభ్యర్థులకు డీఎస్సీలో పోస్టులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకుని అనర్హులకు పోస్టింగ్స్ ఇచ్చారని ఆరోపించారు. ఎస్సీ విభాగ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ మాణిక్యరావు పదే పదే వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని, కార్పొరేటర్గా గెలుపొందని మాణిక్యరావుకు ఆ అర్హత లేదన్నారు. ప్రజా ప్రతినిధిగా గెలుపొందని మాణిక్యరావు లిడ్క్యాప్ చైర్మన్గా ఎస్సీల సంక్షేమం కోసం పని చేయడం మాని, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నిత్యం వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని మాణిక్యరావు తమపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని 66 లక్షల పెన్షన్లలో ఆరు లక్షల పెన్షన్లు ఎత్తేశారని, పిల్లి మాణిక్యరావు దళితుల్లో ఏ ఒక్కరికై నా పెన్షన్ ఇప్పించారా అని ప్రశ్నించారు. డీఎస్సీపై లోకేష్తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ మాణిక్యరావు అదే పనిగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ను, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మూతబడిన 400 చర్మకారుల కుటీరాలను తెరిపించడంలో లిడ్క్యాప్ చైర్మన్గా ఉన్న పిల్లి మాణిక్యరావు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
పట్నంబజారు: లిక్విడ్ గంజాయిని తరలిస్తూ.. బీటెక్ విద్యార్థితో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, లాలాపేట పోలీసు స్టేషన్ సీఐ ఏవీ శివప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన రామిశెట్టి మహవీర్, అబ్బు సాయిమణికంఠతేజ, షేక్ రెహ్మాతుల్లాలు స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడైన రామిశెట్టి మహావీర్ గంజాయికి అలవాటుపడి, డబ్బులు కోసం ఒడిశా ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. శనివారం ఐపీడీ కాలనీలో సమీపంలోని సత్యసాయి బాబా ట్రస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్యూవీ కారులో ముగ్గురు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించటంతో పాటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి దొరికింది. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామిశెట్టి మహావీర్ ఒక కళాశాలలో బీటెక్ అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2కిలోల 110 గ్రాముల గంజాయి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
వందేళ్ల బళ్లబాటకు పరిశ్రమ నిర్మాణంతో సమస్య
వందేళ్ల నుంచి రైతుల రాకపోకలకు ఉపయోగించే బళ్లబాటకు ప్రస్తుతం నిర్మించిన ప్లాస్టిక్ పరిశ్రమ వల్ల సమస్య వచ్చింది. నిర్మాణ సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – అడుసుమల్లి నరసింహారావు, రైతు, చేబ్రోలు పరిశ్రమ నిర్మాణంతో రాకపోకల కోసం ఉన్న బళ్లబాట మూసుకునిపోయి ఇబ్బందులు పడుతున్నామని రైతులు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. కంపెనీ ప్రతినిధులు, రైతులతో మాట్లాడి పొలాల్లో బళ్లబాటకు ఇబ్బందులు లేకుండా అందరితో మాట్లాడి పరిష్కరిస్తాం. – కె.శ్రీనివాసశర్మ, తహసీల్దార్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ వల్ల బళ్లబాట సమస్య, సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. నేను రైతును తోటి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హమీ ఇచ్చిన కంపెనీ యజమాని నిర్మాణం పూర్తి దశలో మీకు చేతనైంది చేసుకోండి అంటూ అహకారంతో చిన్న చూపుతో మాట్లాడుతున్నాడు. కంపెనీ ముందు ఉన్న సాగునీటి కాలువ మీద సిమెంటు తూము వేసి పూడ్చివేయటంతో సాగునీటి సమస్య ఏర్పడింది. రైతుల వాహనాలు, పంట ఉత్పత్తులు రాకపోకలు సాగించే బళ్లబాటకు ఆటంకం కలిగించే విధంగా ప్రహరీ నిర్మిస్తుండటంతో సుమారు 600ఎకరాల్లోని రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – శరణం మల్లికార్జునరావు, రైతు, చేబ్రోలు -
టెట్పై ప్రభుత్వం స్పందించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాహక్కు చట్టంలో మార్పులు చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ మాట్లాడుతూ 50 ఏళ్లుపైబడి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, పాఠశాలలో అననుకూల పరిస్థితుల మధ్య ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులకు ఏ ఇతర ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ఇన్ సర్వీస్ పరీక్ష పెట్టడం తగదన్నారు. ఉపాధ్యాయులు టెట్లో అర్హత సాధించడంపై ధ్యాసపెడితే బోధనకు విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ టెట్ రద్దు కోసం యూటీఎఫ్ చేపట్టే కార్యాచరణలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన టెట్లో ఉన్న అసంబద్ధ నిర్ణయాలు ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఇబ్బందికరమన్నారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, సాంబశివరావు, ఆంజనేయులు, అడవి శ్రీను, కె. కేదార్నాథ్, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కె.కామాక్షి పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
జాతీయ ఈత పోటీలకు టెక్నికల్ అధికారిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ 79వ సీనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలకు టెక్నికల్ అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. స్విమ్మింగ్ కోచ్గా కొనసాగుతున్న సురేష్ గతంలోనూ పలు అంతర్జాతీయ, జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఆక్వాటిక్స్లో సురేష్కు ఉన్న నైపుణ్యానికి, నిబద్ధతకు ఈ ఎంపిక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. సురేష్కు కళాశాల యాజమాన్య ప్రతినిధులు, పల్నాడు జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో నీటిలో గల్లంతైన బాలుడిని సాహసోపేతంగా పోలీసులు, మైరెన్ సిబ్బంది ఆదివారం కాపాడారు. మధ్యాహ్నం సమయంలో కర్లపాలెంకు చెందిన కంబం కమల్ దాస్ (17) తన నలుగురు స్నేహితులతో సూర్యలంక బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి లోతైన నీటిలోకి కొట్టుకుపోయాడు. విధుల్లో ఉన్న మైరెన్, బాపట్ల రూరల్ పోలీసులు బాలుడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఘటనలో.. చీరాల: చీరాల మండలం తోటవారిపాలేనికి చెందిన అఖిలేష్ (17) కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాడరేవు సముద్రతీరానికి వచ్చాడు. అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తెనాలి: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు కమిషన్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ సంతృప్తికరంగా అమలు జరిపేలా, బీసీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని, రాష్ట్రంలో బీసీల కుల గణన ద్వారా సరైన డేటా సేకరించి రిజర్వేషన్ల పెంపునకు కమిషన్ సహకరించాలన్నారు. జనగణన వివరాలను బీసీ కులగణన సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా చట్టసభలలో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు జనాభా దామాషాలో దక్కేలా తోడ్పడాలన్నారు. బీసీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జె.నాగమోహన్, జె.మురళి, ములికి జయకృష్ణ, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కరవేదిక(పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకురావద్దని సూచించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకొని రావాలి కోరారు. ‘మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100’ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. -
సర్చూసుకునేందుకు సిద్ధమా...
నెహ్రూనగర్: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)’పై అందరిలోనూ ఆందోళన నెలకొంది. సర్వేలో భాగంగా బీఎల్ఓలు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారం–2ను ఓటరు నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబం 23 ఏళ్లగా భారతదేశంలోనే ఉన్నట్టు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ పేరుతో భారీగా ఓట్లు గల్లంతు చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ‘సర్’ హాట్ టాపిక్గా మారింది. ‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం పలు అనుమానాలు నెలకొన్నాయి. 2002 తర్వాత మళ్లీ ఇప్పుడు... గుంటూరు జిల్లాలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలతో కలిపి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పురుషులు 8,69,950 మంది, మహిళలు 9,31,668, ట్రాన్స్జెండర్స్ 165, మొత్తం 18,01783 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 2002లో చివరిసారిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14 వరకూ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు. ఫారం–2లో ఏం నింపాలి.. ‘సర్’ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం–2 నింపి, బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఆ వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతర కుటుంబికుల పేరు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితోపాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తండ్రి / సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య / భర్త పేరు, వారి ఎపిక్ నంబర్ (అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించి బీఎల్ఓకు అందజేస్తే ఇందుకు రశీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. ‘సర్’లో ముఖ్యమైన తేదీలు బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర.. సర్ విషయంలో రాజకీయ పార్టీలు, వారి పార్టీల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) అప్రమత్తంగా ఉండాలి. తమ బూత్ పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎంత మంది ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి.. ఎంత మందివి మ్యాపింగ్ కాలేదు... అనే వివరాలు తెలుసుకుని ఉండాలి. మ్యాపింగ్ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలి. బీఎల్ఓ వచ్చినపుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంటిలో లేకపోతే.. ఇంటిలో ఉన్న ఓటరు తాలూకా బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్ చేయించాలి. ఈ విషయంలో తప్పులు దొర్లితే ఓట్లు గల్లంతు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ నెల 15 నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటరు వివరాల సర్వే చేస్తారు. వారు అప్పుడు అడిగే ఎపిక్ కార్డు (ఓటరు గుర్తింపు కార్డు), రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 2002 ఓటరు జాబితా వివరాలు, తల్లిదండ్రులు లేదా తాతల ఎపిక్ కార్డులు ప్రజలు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. ఒకటి నింపి వారికిచ్చి, మరొకటి రశీదుగా తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శక ఓటరు జాబితా కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. – కె.మయూర్ అశోక్, జీఎంసీ కమిషనర్ -
ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ!
గుంటూరు ఎడ్యుకేషన్ :‘‘గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన శ్రీరామ్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.22 వేల ఫీజుతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం అదనంగా రూ.4,500 వేలు చెల్లించాలని స్కూల్లో చెప్పారు. అదే విధంగా రెండో తరగతిలో చేర్పించిన కుమార్తెకు ఫీజు రూపంలో రూ.24 వేలతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం రూ.6 వేలు చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికీ రూ.500 లోపే కదా అని అడిగితే ప్రభుత్వ పుస్తకాలను మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన పుస్తకాలను క్యాంపస్లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం దబాయించింది. ఫలితంగా చిరుద్యోగం చేస్తూ నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్న శ్రీరామ్ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించడం పెనుభారంగా మారింది. వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించడంతోపాటు పిల్లలను ఏ విధంగా చదివించాలని ఆవేదన చెందుతున్నారు.’’ చంద్రబాబు పాలనలో పట్టించుకునే దిక్కేది? టీడీపీ పాలనలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై నియంత్రణ కరువైన ఫలితంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. గతేడాదితో పోల్చితే ఫీజులను 20 శాతం నుంచి 30 శాతం మేరకు అడ్డగోలుగా పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.20 నుంచి రూ.22 వేల మధ్యలో ఉంది. కార్పొరేట్ స్కూల్లో అది రూ.30 వేలు చేశారు. కార్పొరేట్ పాఠశాలలో 6వ తరగతికి రూ.40 వేల నుంచి రూ.45 వేలు, పదో తరగతికి రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు ఉన్నాయి. అదే విధంగా 6వ తరగతి నుంచి ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్న వివిధ ప్రోగ్రామ్లకు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 60 వేల మొదలు రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్లతో కూడిన పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60 వేలు, టెన్త్కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధనకు బదులుగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్యపుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించి, ముద్రించిన పాఠ్య పుస్తకాలనే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు తమ వద్ద లేవని, వాటిని బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధన చేస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు విద్యార్థులకూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పొడించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. సొంత సిలబస్ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పత్తా లేని యాజమాన్య కమిటీలు ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేందుకు నిబంధనలు అంగీకరించవు. పాఠశాల యాజమాన్య కమిటీ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి, బడిలో కల్పిస్తున్న సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత విద్యాసంవత్సరంలో వసూలు చేసిన ఫీజులకు ఐదు శాతమే పెంచాల్సి ఉంది. కానీ ఇవేమీ అమలు కావడం లేదు.విద్యార్థుల నుంచి ఫీజులు మొదలు ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను క్యాంపస్లలోనే దుకాణం తెరిచి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కనపెట్టి, ప్రైవేటు పబ్లిషర్లతో డీల్ కుదర్చుకుని పాఠ్య పుస్తకాలు, నోటుబుక్లు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో విద్యార్థికి విక్రయిస్తున్న పుస్తకాల ధరలో కనీసం 50 శాతం మేరకు లాభాలను ఆర్జిస్తున్నారు. వివిధ పాఠశాలలు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు యూనిఫాం, బెల్టు, టై సహా అన్ని రకాల సామగ్రిని క్యాంపస్లలోనే విక్రయిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని దండుకుంటున్నాయి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణం
గుంటూరు మెడికల్: అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణమే ప్రాణాధారమని జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా పరిణమించిందన్నారు. ప్రతి సంవత్సరం అతిసారం వల్ల ఐదు సంవత్సరాల పిల్లల్లో 4.3% మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. డయేరియా నివారణకు ముందస్తు గుర్తింపు, ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్రల వినియోగం ద్వారా ఈ మరణాలను నిరోధించవచ్చన్నారు. అతిసార వ్యాధి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం స్టాప్ – డయేరియా క్యాంపెయిన్ చేపట్టిందన్నారు. డయేరియా నివారణకు పరిశుభ్రత ఓఆర్ఎస్ పాకెట్స్ వినియోగంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 15 వ తేదీ వరకు సన్నద్ధత దశ అని పేర్కొన్నారు. జూన్ 16 నుంచి 31 వ తేదీ వరకు కార్యాచరణ దశ అన్నారు. జూన్ 16 వ తేదీ నుంచి జరిగే కార్యాచరణ దశలో భాగంగా చంటి బిడ్డలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించుట, రోటా వైరస్ వ్యాక్సిన్ అందజేయుట, చేతుల పరిశుభ్రత, రక్షిత తాగునీరు అందజేయుట, ఇంటింటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందజేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓఆర్ఎస్, జింకు కార్నర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 1,45,000 మంది ఐదేళ్లలోపు చంటిబిడ్డలకు అందజేయుటకు 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ టాబ్లెట్లు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. -
రెయిన్ట్రీ పార్క్ విల్లాలో భారీ చోరీ
సుమారు 475 గ్రాముల బంగారం చోరీ మంగళగిరి టౌన్: మంగళగిరి ప్రాంతంలోని ఓ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. మంగళగిరి మండలం కాజ గ్రామం రెయిన్ట్రీపార్క్లోని ఓ విల్లాలో అడ్వకేట్ శైలేంద్ర నివాసముంటున్నాడు. ఆయన భార్య చినకాకానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. శైలేంద్ర నివాసముంటున్న విల్లా సెకండ్ ఫ్లోర్లో అతడి తల్లిదండ్రులుంటున్నారు. శైలేంద్ర భార్య శనివారం రాత్రి ఆస్పత్రిలో నైట్ డ్యూటీకి వెళ్లింది. స్నేహితులను కలిసేందుకు శైలేంద్ర శనివారం సాయంత్రం విజయవాడ వెళ్లాడు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున తను విల్లాకు చేరుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న గదికి వెళ్లగా.. అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో పాటు, ఆల్మరాలు తెరిచి ఉన్నాయి. మెయిన్ బెడ్రూమ్లో ఉండాల్సిన ఐరన్ సేఫ్ కనిపించలేదు. సెకండ్ ఫ్లోర్లో శైలేంద్ర తల్లిదండ్రులు ఆ సమయానికి నిద్రపోతున్నారు. వారి గది తప్ప విల్లాలోని అన్ని గదుల్లో ఉన్న ఆల్మరాలు తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారని నిర్ధారించుకుని వెంటనే భార్యకు సమాచారం ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ సేఫ్ లాకర్, డెస్క్లో ఉన్న బంగారు ఆభరణాలు సుమారు 475.5 గ్రాములు, రూ.3 లక్షల విలువైన పలు వస్తువులు, 350 యూఎస్ డాలర్లు చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం విల్లాను పరిశీలించారు. పోలీసు జాగిలాల బృందం సాయంతో నిందితుల ఆనవాళ్లను గుర్తించాలని, సీసీ టీవీ ఫుటేజ్లను, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. -
దర్జాగా బళ్లబాట కబ్జా
చేబ్రోలు: చేబ్రోలు గ్రామంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయ ‘బళ్ల బాట’ మూసివేతపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో జీబీసీ రహదారి పక్కన సర్వే నెంబర్ 963–1బి లో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన అధికార పార్టీ పొన్నూరు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడు పరుచూరి సత్య కిషోర్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమను కొంతకాలం క్రితం నిర్మించాడు. వ్యవసాయ భూమిలో నిర్మాణాలు చేపట్టే సమయంలో బళ్లదారికి ఇరువైపులా ఉన్న రైతులందరితో సదరు యజమాని అనుకూలంగా మాట్లాడాడు. ప్రధాన రహదారి రోడ్డు నుంచి రైతులకు అనుకూలంగా ‘బళ్ల బాట’ (రైతుల రాకపోకలకు దారి) వదులుతానని నమ్మబలికాడు. అయితే కంపెనీ నిర్మాణం పూర్తయిన తర్వాత మాట మార్చడమే కాకుండా, ప్రస్తుతం రైతులకు ఉన్న ఏకై క దారిని సైతం మూసివేస్తూ అక్కడ శాశ్వత రక్షణ గోడను నిర్మించారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘నేను దారి ఇచ్చేది లేదు, మీకు చేతనైంది చేసుకోండి, నాకు అన్ని అనుమతులు ఉన్నాయి’ అంటూ సదరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 600 ఎకరాలపై ప్రభావం.. రైతుల పంట పొలాలకు ట్రాక్టర్లు, పంట ఉత్పత్తులు తరలించటానికి రాకపోకలకు ఉపయోగించే బళ్ల బాట మూసుకుపోవడం వల్ల దాదాపు 600 వందల ఎకరాలకు పైగా ఉన్న పంట పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. పొలాల్లో పండిన పంటను ఇంటికి లేదా మార్కెట్కు తరలించడానికి, వ్యవసాయ సామగ్రిని పొలాల్లోకి తీసుకెళ్లడానికి ఈ దారి తప్ప రైతులకు ప్రత్యామ్నాయ మార్గం లేదు. కంపెనీ యాజమాన్యం నిర్మాణ పనులను వేగవంతం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తూర్పు వైపు ప్రహారీ నిర్మాణం, ఉత్తరం వైపున ప్రహరీ నిర్మాణాలను కొంత భూమి బళ్లబాట కోసం రైతులకు ఉపయోగపడే విధంగా వదలకుండా పనులు పూర్తి చేస్తుండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు మాగాణి భూమిలో నిర్మాణం జరిగిన ప్లాస్టిక్ బకెట్లు, వస్తువుల తయారీ కంపెనీ వలన చుట్టుపక్కల భూములకు ముప్పు ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భవిష్యత్తులో చుట్టుపక్కల భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బళ్లబాట సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరగకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కంపెనీ ముందు భాగంలో ఉన్న సాగునీటి కాలువ పూడ్చివేతపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిమెంటు తూము వేసి పరిశ్రమలోకి రాకపోకలు చేస్తున్నారు. కాలువలోకి గ్రావెల్ జారిపోవటంతో కాలువ పూడిపోయింది. సిమెంటు తూమును తీసివేసి వంతెన కల్వర్టు నిర్మాణం చేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. -
క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి
ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెనాలి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన వందమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్కో డీఈఈ పాగోలు భవాని తదితరులు మా ట్లాడారు. విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2 వేల ఉపకార వేతనం, నోట్ పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ మెటీరియల్ తదితరాలు పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచారయ్య, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు. ‘పంచాయతీరాజ్ మినిస్టీరియల్’ అసోసియేషన్ సమావేశం గుంటూరు రూరల్: నగరంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి నిర్వహించాల్సిన ఎన్నికలను జూలై 31లోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గత కొంతకాలంగా రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగకపోవడం వల్ల అసోసియేషన్ కార్యక్రమాలు సరైన రీతిలో జరగలేదని దానివల్ల పంచాయతీరాజ్శాఖలో జరిగిన పరిపాలన సంస్కరణలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్కు సరైన న్యాయం జరగలేదని పలువురు జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోల పదోన్నతులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కు అన్యాయం జరిగిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దశాబ్దాలు గా పదోన్నతులు లేక అన్యాయానికి గురైన రికార్డు ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 30 సంవత్సరాల పైన ఒకే క్యాడర్లో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లకు ఒక్క ప్రమోషన్ కూడా లభించకపోవడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న జిల్లా పరిషత్ నాన్ టెక్నికల్ సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా సరెండర్ చేస్తున్నారని, ఈ ప్రక్రియను వెంటనే ని లుపుదల చేయకపోతే ప్రత్యక్ష కార్యచరణకు వెళ్లా లని కార్యవర్గంలో తీర్మానించారు. సంఘం రాష్ట్ర ట్రెజరర్ పి.దస్తగిరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మోహన్రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రా ఘవులు, సంఘం వివిధ జిల్లాల అధ్యక్షులు ముర ళి, సత్తిబాబు, శ్రీధర్రాజు, ప్రసాద్, నిర్మలభారతి, పెంచలయ్య, మురళీధర్రెడ్డి, శశిధర్, గుంటూరు జిల్లా కార్యదర్శి శామ్యూల్ పాల్,ఉద్యోగులు పాల్గొన్నారు. పైపుల వ్యాపారి బలవన్మరణం గుంటూరు రూరల్: ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో పైపుల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఏటుకూరుకు చెందిన ఎ.రాంబాబు(60) గ్రామంలోని బొంతపాడు రోడ్డులో పైపుల వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. ఇటీవల వ్యాపార లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో తన ఆఫీసులో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తెనాలిరూరల్: పట్టణ సుల్తానాబాద్లోని గాయత్రి వే బ్రిడ్జి సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. కూలి పనులకు వెళ్లే మరియమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గురువారం ఆమె బంధువుల ఇంటికి వెళ్లి.. శనివారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఆదివారం ఉదయం చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు.. తెనాలి ప్రాంతంలో ఇటీవల చోరీలు పెరుగుతున్నాయి. మండలంలోని కఠెవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 7వ తేదీ అర్ధరాత్రి వచ్చారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రూ. లక్ష నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు చేశారు. -
మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అత్యంత సున్నిత మనస్కులు.. ఘర్షణ లేని వాతావరణం కోరుకునేవారిలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ఇప్పుడు ఏపీలో ప్రశాంత వాతావరణం లేనే లేదు. కూటమి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నదంతా అరాచకమే. తమ పార్టీ కాని వారందరినీ వేధించి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారు. ప్రజల పక్షాన బలంగా ప్రశ్నించేది వైఎస్సార్సీపీ మాత్రమే. వైఎస్సార్సీపీ 10 వేల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. మహిళలు కూడా రాజకీయంగా బయటికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా వైఎస్ జగన్ అండగా నిలిచారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఒకప్పుడు ప్రభుత్వ బడులకు వెళ్లడం నామోషీగా భావించేవారు. ప్రభుత్వ బడులకు వెళ్లడం గొప్పగా భావించేలా చేసిన ఘనత జగన్కు దక్కింది. స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి అంశంలోనూ జగన్ కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అకడమిక్ ప్రారంభమైనప్పటికీ స్కూల్ బుక్స్, బ్యాగ్ల ఊసే లేదు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు’’ అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.సొమ్ము ఆర్యవైశ్యులది.. సోకు మాత్రం చంద్రబాబు, పవన్దిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘వాసవీమాత ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని జీవో తెచ్చిన ఘనత వైఎస్సార్ , రోశయ్యలదే. ఆర్యవైశ్యులకు సంబంధించి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్న ఆర్యవైశ్యుల ట్రస్ట్లపై వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకే హక్కులు కల్పించారు. ఎండోమెంట్ పరిధి నుంచి తప్పించి దుర్వినియోగం కాకుండా జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ చేసినంత మేలు ఆర్యవైశ్యులకు మరెవరూ చేయలేదు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆర్య వైశ్యుల ట్రస్ట్లపై ఆర్య వైశ్యులకే వైఎస్ జగన్ హక్కులు కల్పించారు...గతంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఆలయాల్లో దర్శనాలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆర్య వైశ్యులకు అవకాశం లేకుండా చేశారు. అమరావతిలో వృధాగా పడి ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంపై ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి డబ్బులిచ్చింది ఆర్య వైశ్య సంఘం. సొమ్ము ఆర్యవైశ్యులది సోకు మాత్రం చంద్రబాబు, పవన్ది’’ అంటూ వెలంపల్లి దుయ్యబట్టారు. -
కృష్ణా నదిలో పడవ ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కోనూరు వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఓ కుటుంబ వేడుకకు హాజరైన బంధువులు పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు గల్లంతవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. సహాయక బృందాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు. -
పల్నాడు జిల్లాలో విషాదం
సాక్షి,పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కుంకలగుంట నుంచి కోనూరులోని ఒక ఫంక్షన్కు వచ్చిన 10 మంది నది దాటేందుకు పడవ ఎక్కారు. మధ్యలో పడవ ఒక్కసారిగా బోల్తా పడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి మృత దేహం కోసం ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పడవ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇసుక కోసం తవ్విన గుంతలు పడవకు అడ్డంకిగా మారి ప్రమాదానికి కారణమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసం తవ్వకాలు జరగకపోయి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఇలాంటి తవ్వకాలను అధికారులు నియంత్రించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్ 14) వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు.‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32.92 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నేటి కాలంలో రక్తసంబంధాలు కూడా భారంగా మారాయి. కానీ ఏ బంధం లేకపోయినా మానవత్వం రక్తదాతల రూపంలో ఇంకా ఇతరులకు సాయం చేస్తోంది. ఇలాంటి వారు ప్రాణదాతలుగా మారుతున్నారు. అర్ధరాత్రి... అపరాత్రి... అని తేడా చూసుకోకుండా ఫోన్ చేయగానే సొంత ఖర్చులతో ఆస్పత్రికి తక్షణమే వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ క్షణంలో వారు చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ.. -
44 సార్లు రక్తదానం చేశా
నేను కేఎల్ యూనివర్సిటీలో 2007లో బీటెక్ చదువుతున్న సమయంలో ఎవరైనా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడిగితే స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రారంభించాను. గుంటూరు జీజీహెచ్లో ఎస్బీఐలో పనిచేస్తున్న సమయంలో ఆస్పత్రిలో రక్తం కొరత ఉందని, రక్తం సకాలంలో లభించక పలువురు చనిపోతున్న విషయం తెలుసుకున్నా. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రక్తం ప్రాధాన్యత గురించి వివరించారు. దాంతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాను. ఒడిశాలో రెండు రైళ్లు ఢీకొన్నప్పుడు ఆ రాష్ట్రం వెళ్లా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేశా. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కడంతోపాటు మంచి ఆరోగ్యం కూడా సొంతం అవుతుందని నా నమ్మకం. -
ప్రాణదానంతో సమానం
ఒకరు చేసే రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచిపోవాలి. జిల్లా జనాభాలో ఒక శాతం రక్తం సేకరణ చేయాల్సి ఉంది. జిల్లాలో 17 బ్లడ్ బ్యాంకుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు, సంస్థలను ఘనంగా సన్మానిస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
రూ. ఐదు వేల నగదు, కారు స్వాధీనం తెనాలిరూరల్: పట్టపగలు ఇంట్లో చోరీకి పాల్పడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం నిందితుడు కారులో పరారయ్యాడన్న ఆధారంతో సాంకేతికతను వినియోగించి అరెస్ట్ చేయడం గమనార్హం. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంతో సీఐ నాయబ్ రసూల్ శనివారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని హాఫ్ఫేట గ్రామానికి చెందిన రెడ్డి వెంకట రవికిరణ్ తన తల్లి లక్ష్మీసామ్రాజ్యంను ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. 11.50 గంటల సమయంలో అతని రెండో అక్క తోటకూర సామ్రాజ్యం ఫోన్ చేసి ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బయటకు వచ్చాడని, తనను చూసి వేగంగా వెళ్లి సమీపంలో ఉన్న తెల్ల కారులో పరారయ్యాడని చెప్పింది. రవికిరణ్ వెంటనే ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపల బీరువా తాళాలూ పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని రూ. 25 వేలు అపహరించుకెళ్లాడు. ఇదే విషయాన్ని రవికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారైన సమయంలో ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి కారు నంబరును గుర్తించగలిగారు. సాంకేతికతను వినియోగించి కారు కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. కారు విజయవాడ నుంచి తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి నందివెలుగు ప్రధాన జంక్షన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని ఖమ్మం జిల్లా మధిర మండలం మదుపల్లి గ్రామానికి చెందిన బండి గోపిగా గుర్తించారు. నిందితుడి నుండి రూ.ఐదు వేల నగదు, కారును స్వాధీన పర్చుకున్నారు. నిందితుడిపై తెలంగాణలో తొమ్మిది, ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు ఉన్నాయని, మరో 20 కేసులు కోర్టు కొట్టివేసిందని సీఐ తెలిపారు. సాంకేతికతను వినియోగించి నిందితుడిని అతి త్వరగా అరెస్ట్ చేసిన ఎస్ఐ ఆనంద్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
మంగళగిరి టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతోనే సాధ్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహర్షి పతంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, యోగా సాధన పట్ల ఆసక్తిని కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలని కోరారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, డీఎంహెచ్ఓ శాఖ అధికారులు, యోగా శిక్షకులు, సాధకులు, మహిళ, యువత తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
అగ్రిగోల్డ్ మోసానికి మరో బాధితురాలు మృతి
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ మోసానికి మరో వృద్ధురాలు బలైంది. భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్లో ఫిక్సిడ్ డిపాజిట్గా దాచుకున్న రూ.25,000 కోసం ఎదురుచూసి చివరికి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తన్నీరు పోలేరమ్మ(70) కూలి పనులు చేసుకుని జీవించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిపించింది. పిల్లలంతా తమ కుటుంబ సభ్యులతో ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటుండగా, భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని అప్పట్లో అగ్రిగోల్డ్ను నమ్మి రూ.25,000 కడితే చివరికి రూ.50,000 వస్తాయని ఆశతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంది. 2012లో కడితే 2018లో తనకు డబ్బు వస్తుందని ఆశ పడింది. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన దగ్గర నుంచి, అవసర పడతాయి అనుకున్నా డబ్బులు ఇక రావని దిగులుతో నిత్యం మదనపడుతూ ఉండేది. అప్పట్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు చూసి కొంత ధైర్యంగా ఉన్నా, వృద్ధాప్యంలో డబ్బులు లేక అనేక బాధలు పడుతూ ఉండేది. ఇప్పటికే 12 సంవత్సరాలు దాటి, ప్రభుత్వాలు మారుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ డబ్బులు తిరిగి బాదితులకు అందించే దిశగా కృషిచేస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి, రెండు సంవత్సరాలు అవుతున్న మాటలు చెబుతున్నారని, చేతల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోయిందని, మానసికంగా ఆలోచించి, గుండెనొప్పితో శనివారం మృత్యువాతకు గురైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టడంతో పాటు కంపెనీ డేటా ప్రకారం వడ్డీతో సహా ప్రతి బాధితునికి త్వరలో డబ్బులు ఇచ్చి న్యాయం చేసి మరో ప్రాణహాని జరగకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుంచాల అంకమ్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం స్వాధీనం
తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని అంగలకుదురు గ్రామం సమీపంలోని తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కలవకొల్లు మధుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. మొత్తం 79 బస్తాలలో సుమారు 3,950 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐతానగర్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు వెనుక గల రేషన్ షాపు నుంచి లోడ్ చేసి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని హరీష్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గొంది అశోక్, కలవకొల్లు మధుబాబు, ఐతానగర్ రేషన్ డీలర్ కుటుంబ సభ్యుడు, అనంతవరప్పాడు ప్రాంతానికి చెందిన రైస్ మిల్ నిర్వాహకుడు హరీష్లను నిందితులుగా గుర్తించినట్టు రూలర్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. -
ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్లో ఉచిత ఉర్దూ శిక్షణ
పెదకాకాని: విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేయడంపై కేసు నమోదు చేసినట్లు పెదకాకాని పోలీసులు శనివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఒక విద్యార్థిని గుంటూరు నగర శివారులోని ప్రైవేట్ కళాశాలలో డెంటల్ కోర్స్ చదువుతుంది. ఆ విద్యార్థిని విశాఖపట్నంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ యువకుడు ప్రేమిస్తున్నానని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. తన నెంబర్ బ్లాక్ చేయగా తన స్నేహితుల ద్వారా ఫోన్ చేసి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
2004 ఎన్నికల ముందు కేసుల సంగతేంటి?
తెనాలి: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ తెనాలిలో భారీగా విజయవంతం కావటంతో బెంబేలెత్తిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో తనను అహంకారిగా వ్యాఖ్యనించటాన్ని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఖండించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి శివకుమార్ మాట్లాడారు. హైదరాబాద్లో ఉంటున్న తెనాలికి చెందిన వ్యక్తి ఎన్నికలకు ముందుగానే ఇక్కడకు వచ్చి జనసేన/టీడీపీకి ప్రచారం చేశారని చెప్పారు. పోలింగ్ సమయంలో తనను అసభ్యంగా మాట్లాడటంతో ఇష్యూ జరిగిందని చెబుతూ ‘అదంతా నీవల్లే జరిగింది... ఆర్గనైజ్డ్గా చేయించావు’ అని మనోహర్ను ఉద్దేశించి అన్నారు. అయినా తాను కేసు పెట్టలేదని గుర్తుచేశారు. అదే తన అహంకారమైతే ఎన్నికల ముందు మనోహర్పై ఏడు కేసులు ఉన్నాయని, అవన్నీ 2004 ఎన్నికల అఫిడవిట్లో ఆయనే స్వయంగా ప్రకటించినట్టు ఆ పత్రాలను చూపారు. అందులో 420తో సహా సేవాట్రస్ట్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాల కోసం ఆడపిల్లల్ని నిర్బంధించటమనే 372–కే సెక్షన్ కూడా ఉందని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ వాళ్లు కరపత్రాలను కూడా పంచారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గంజాయి వీధివీధినా దొరికిందన్న మనోహర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘ఇప్పుడు నీ హయాంలో గంజాయితో పాటు డ్రగ్స్, న్యూడ్కాల్స్ సెంటర్ నడిచాయి’ అని చెప్పారు. హామీలు అమలు చేయలేని మంత్రి ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ద్వారా తెనాలి ప్రజలకు ఇప్పించిన హామీలను మంత్రి హోదాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎందుకు అమలు చేయటం లేదని శివకుమార్ ప్రశ్నించారు. కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్డ్యామ్ నిర్మిస్తామని, వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, తెనాలిలో పంటకాలువలను లాస్వెగాస్లా సుందరీకరిస్తామని హామీలనిచ్చినట్టు నాటి వీడియోను ప్రదర్శిస్తూ చెప్పారు. అలాగే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆరంభించి యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని కూడా గుర్తు చేశారు. తెనాలి– విజయవాడ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని మనోహర్ చెప్పారని వివరించారు. ఆ హామీల ప్రతిపాదనలున్నా చూపాలని డిమాండ్ చేశారు. తెనాలి వచ్చినప్పుడు పంటకాలువల వెంట తిరుగుతూ అధికారులు తన మాట వినటం లేదని మనోహర్ అనటాన్ని ఏమనాలని శివకుమార్ ప్రశ్నించారు. సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్ సీపీ హయాంలో ఎమ్మెల్యేగా తాను రూ.1800 కోట్ల సంక్షేమంతో పాటు 26 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు చెప్పారు. 170 రోడ్లు నిర్మించానని గుర్తుచేశారు. మార్కెట్ ధర లేనపుడు జొన్న/మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పే మంత్రి మనోహర్, గత రబీలో జొన్న, మొక్కజొన్న ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ న్యాయవాదులు చింకా సురేష్చంద్ర యాదవ్, మైలా విజయ్నాయుడు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వర్లు, కాకి దేవసహాయం, కొర్ర యశోద, కొంగర రాగమంజరి, షేక్ జకీరా, ఎం.ఇందిరా ప్రియదర్శిని, సిద్దాబత్తుని శాంతి, నీలి అజయ్, మల్లెబోయిన రాము, యలవర్తి సాంబశివరావు, ఉన్నం అనీష్, పొట్లూరి అశోక్, పల్లె రోహిత్శామ్యూల్, పిల్లి వీరయ్య, యాతాటి అనిల్, కాళిదాసు సత్యం, చుక్కా ఆనంద్, అక్కిదాసు కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
సహజ సంపదలను కొల్లగొడుతూ అక్రమార్జనకు అలవాటు పడ్డ పెదకూరపాడు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ఏమాత్రం పట్టించుకోకుండా నదీగర్భాన్ని చీల్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకాసురులు బరితెగించి దోచుకుంటున్నా అధికారులు స్పందించకపోవడంతో మరింత విర్రవీగిపోతున్నారు. సాక్షి కథనానికి స్పందించి ఇసుక రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా దారికి గాడి కొట్టిన అఽధికారులు సాక్షి, నరసరావుపేట: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కృష్ణా తీరంలో ‘మాన్సూన్ హాలీడే’ జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉండటంతో ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్ 1, 2వ తేదీలలో సైతం రాత్రీపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలతో ‘సాక్షి’ పత్రికలో జూన్ 3వ తేదీన ‘చెలరేగిపోతున్న ఇసుకాసురులు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందించి చర్యలకు ప్రారంభించారు. అచ్చంపేట మండలం చింతపల్లి, అమరావతి మండలం పొందుగల ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా గాడి కొట్టించారు. రీచ్లలో ఇసుక రవాణా జరిపేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. గాడి పూడ్చి అక్రమ రవాణా... ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా అధికారులు కొట్టిన గాడిని మాఫియా పూడ్చివేసింది. గత రెండు రోజులుగా చింతపల్లి, పొందుగల–2 రీచ్లలోకి నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పంపి తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు దారికి గాడి కొట్టిన తరువాత నది సమీపంలో భారీ యంత్రాలను అక్కడ నుంచి పంపేయాలి. వాటిని అక్కడే ఉంచడంతో రాత్రిపూట, సెలవు రోజుల్లో గాడిని పూడ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నా మైనింగ్, ఇరిగేషన్, పోలీసు, విజిలెన్స్, రవాణా శాఖల అధికారులు పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇసుక రీచ్లలో భారీ యంత్రాలతో గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్నా అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అడ్డుకుంటాం... పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా కొట్టిన గాడిని పూడ్చి ఇసుక రవాణా చేయడంపై పల్నాడు జిల్లా మైనింగ్ శాఖ ఏడీ నాగయ్యను వివరణ కోరగా... గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. అచ్చంపేట, అమరావతి మండలాల తహసీల్దార్లను ఇసుక తరలింపును అడ్డుకోమని ఆదేశిస్తానని తెలిపారు. ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదన్నారు. టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, వారు అక్రమ రవాణాను అడ్డుకుంటారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. ఈ టాస్క్ఫోర్స్ టీంలో మైనింగ్, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్, రవాణా శాఖల అధికారులు ఉంటూ కృష్ణానది తీరప్రాంతాల్లో నిఘా ఉంచాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు. అచ్చంపేట, అమరాతి మండలాల్లో నిషేధ సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా టాస్క్ఫోర్స్ టీం స్పందించి అక్రమ రవాణాను అడ్డుకొని చర్యలు తీసుకోవడం లేదు. -
పాఠశాల హెచ్ఎంకు సంజాయిషీ నోటీసు
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా గుంటూరు కొరిటెపాడులోని ఆర్సీఎం పాఠశాలలో విద్యార్థినులు చీపుర్లు పట్టుకుని పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసిన సంఘటనపై ‘చిట్టి తల్లులకు చీపురు కష్టాలు’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురించిన వార్తకు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జరిగిన సంఘటనపై ఎంఈవోతో విచారణ జరిపించామని, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా విద్యార్థినులు పాఠశాలను పరిశుభ్రం చేశారని తెలిపారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయునికి సంజాయిషీ నోటీసు జారీ చేశామని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి తప్పిదం జరగకుండా చూడాలని ఆదేశించామని చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 4,040 సీట్లకు కౌన్సెలింగ్ నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికవ్వగా, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నుంచి 188 మంది ఎంపికవగా, బాపట్ల జిల్లా నుంచి 120, గుంటూరు జిల్లా నుంచి 79 మంది ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థిని భవిరెడ్డి దివ్యతేజశ్రీ టాప్ టెన్లో చోటు దక్కించుకుంది. టాప్ 10 జాబితాలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 517.30 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
విజ్ఞాన్లో ఘనంగా ఆన్లైన్ ‘వాక్స్–2026’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విజ్ఞాన్ ఆన్లైన్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక వార్షిక విద్యార్థుల సమావేశం ‘వాక్స్–2026’ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 180 మంది ఆన్లైన్ విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు హాజరై విద్య, విజయాలు, పరస్పర అనుబంధాలను వేడుకగా జరుపుకున్నారు. వైస్ చాన్సలర్ కేవీ కృష్ణకిశోర్ మాట్లాడుతూ ఆన్లైన్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ వార్షిక సమావేశం ముఖ్యోద్దేశమన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై బ్యాచ్ల టాపర్లను సత్కరించారు. ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘తిరుపతి సభ విజయోత్సవం కాదు.. వెన్నుపోటు ఉత్సవం’
సాక్షి, తాడేపల్లి: తిరుపతిలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని, ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ప్రస్తుతం "క్యాష్–రాజేష్–లోకేష్" ఫార్ములాతో పాలన సాగుతోందని ఆరోపించిన ఆయన, డీఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో తాటిపర్తి చంద్రశేఖర్ ఏమన్నారంటే..అది వెన్నుపోటు పొడిచిన సభతిరుపతిలో ఈ నెల 12న జరిగినది కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్లో వెతికినా కనిపించవు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం పరీక్ష రాయకుండానే పాస్ అయినట్లు ఉంది. ఆ రోజు సూపర్ సిక్స్ అన్న చంద్రబాబు, ఈ రోజు సూపర్ సైలెంట్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను మూసేసి ఎర్రబుక్ పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పని జరగాలన్నా 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే కొత్త ఫార్ములానే అమలవుతోంది. రాజేష్ స్కెచ్ వేస్తే, లోకేష్ దాన్ని అమలు చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్ర వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.డీఎస్సీపై సమాధానం చెప్పలేని మంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తారా?డీఎస్సీ -2025 వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ప్రెస్మీట్ పెట్టి సమాధానం చెప్పలేని వ్యక్తి మంత్రి ఎలా అవుతారు? డీఎస్సీ అక్రమాలపై వివరణ ఇవ్వలేని సకల విఫల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా? అలాంటి వ్యక్తి విజయోత్సవ సభ వేదికపై నిలబడి వైఎస్ జగన్ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమాలో బ్రహ్మానందం పాత్రను ఎలా ఉపయోగించారో, అలాగే చంద్రబాబు–లోకేష్లు పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకుంటున్నారు.ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా పవన్ను రంగంలోకి దింపుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రత్యర్థులను దూషించడానికే పరిమితమయ్యారు. పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. తిరుపతిలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వారి ప్రసంగాలే నిరూపించాయి.సింగిల్ విండో పాలనరాష్ట్రంలో ప్రస్తుతం 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే సింగిల్ విండో పాలన నడుస్తోంది. ఈ కొత్త ఫార్ములాతో పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్లలోనే చంద్రబాబు రెండు చేతులు ఎత్తేశారు. రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు చెప్పుకునే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖలో అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడే రాష్ట్ర తిరోగమనం మొదలైంది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు అప్పగించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయి, ఫలితాలు పడిపోయాయి, పేపర్ లీకులు పెరిగాయి. ఉద్యోగాలు సూట్కేసులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. డీఎస్సీలో విద్యాశాఖ ఉద్యోగులకే మొదటి ర్యాంకులు రావడం, గోల్డ్ మెడలిస్టులకు ఉద్యోగాలు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలకు మంగళం పాడారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులను అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఒకవైపు తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని సినిమా డైలాగులు చెబుతుంటే, మరోవైపు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. సొంత పార్టీ నేతల తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపించగలరా?తిరుపతి విజయోత్సవ సభలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. రెండేళ్లలో ఒక్క రూపాయి అయినా కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా? పని కంటే ప్రచారానికే ఈ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం, పారదర్శకత, గ్రామ స్వరాజ్యం కనిపించాయి. కానీ రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేసింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలి.ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, అప్పులు–అవినీతితో పాలన సాగిస్తున్నారు. తిరుపతి విజయోత్సవ సభతోనే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను తానే అంగీకరించుకుందని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలపై సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించి తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు. -
మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి.. ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఎన్హెచ్ఆర్సీ, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాయి. ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, తెనాలి సీఐ రాములు నాయక్, పొన్నూరు అర్బన్ వీరనాయక్పై చర్యలు తీసుకోవాలని కమిషన్కు నేతలు ఫిర్యాదు చేశారు.వైఎస్సార్సీపీ పొన్నూరు ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనూజ రాణి నేతృత్వంలో మామిళ్లపల్లి మహిళ రైతులు.. మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని అంశాలు తమ దృష్టికి వచ్చాయని... మహిళల గౌరవం, పరువు భంగం కలిగించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్ పేర్కొంది. -
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్లు కలిసి ఓ మెగా స్కామ్కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గుండె మార్పిడి ఆపరేషన్
గుంటూరు మెడికల్: గుండెజబ్బుతో మూడేళ్లుగా బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి వైద్యులు పునర్జన్మిచ్చారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్ చేసి యువకుడికి నూతన జీవితం ప్రసాదించారు. వివరాలు.. గుంటూరు శారదాకాలనీ 25వలైనుకు చెందిన గుండిమెడ వేద ప్రకాష్, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిందట గుండె జబ్బు సోకింది. 2023 మార్చిలో తీవ్రమైన ఛాతీనొప్పి, స్పృహ కోల్పోవడం, సడన్ కార్డియాక్ట్కు అరెస్టు సంభవించింది. వైద్యులు తక్షణమే కార్డియో పల్మనరీ రీసెర్చ్స్టేషన్ (సీపీఆర్) చేసి ప్రాణాలు కాపాడారు. కార్డియాక్ట్ ఎమ్మారై పరీక్షలో గుండె ఎడమ జటరిక తీవ్రంగా బలహీన పడినట్లు, గుండె పంపింగ్ సామర్ధ్యం 30 నుంచి 35 మాత్రమే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రక్త ప్రవాహం మందగించినట్లు గుర్తించి 2024 మే నెలలో ఆటోమ్యాటెడ్ ఇంప్లాంట్బుల్ కార్డియో వర్కర్ ట్యూబ్లర్ (ఏఐసీడీ) పరికరాన్ని వేద ప్రకాష్కు అమర్చామన్నారు. ఎన్ని చికిత్సలు చేసినా గుండె పనితీరు మెరుగు పడలేదని, గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని నిర్ధారించామని వివరించారు. విజయవాడ మాచవరానికి చెందిన 17 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతూ అవయవదానం చేయగా ఆ యువకుడి గుండెను వేద ప్రకాష్కు మే 26న అమర్చి విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేశామన్నారు. వేద ప్రకాష్ మాట్లాడుతూ తనకు ఆసుపత్రి వైద్యులు పునర్జన్మిచ్చారని చెప్పారు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ హార్ట్ ఫెల్యూర్తో బాధపడేవారికి నేడు అత్యాధునిక వైద్య చికిత్సలు వచ్చాయన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రాయపాటి మమత, హాస్పిటల్ చైర్మన్ ఎంఎస్ రామోహన్రావు, మెడికల్ డైరెక్టర్ రవికాంత్, వైద్యులు నవీన్, కృష్ణ, రామారావు, మృత్యుంజయకుమార్, శ్రీకాంత్, అశోక్కుమార్, శివప్రసాద్, జయరామ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడికి మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: నాగార్జునసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మాచర్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన నిందితుడు యరసాని ఇమ్మానియేల్కు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడికి అప్పీల్ చేసుకునే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉన్నట్లు కూడా న్యాయస్థానం తెలియజేసింది. ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ బాధ్యతల స్వీకారం తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అభిషేక్ కుమార్ అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయం 2వ ఫ్లోర్లోని ఆయన చాంబర్ వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అభిషేక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత ఏపీ సీఆర్డీయే ఆఫీస్ మేనేజ్మెంట్ విభాగ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాస్, కమ్యూనికేషన్న్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అభిషేక్ కుమార్కి ఏపీ సీఆర్డీయేలోని పలు విభాగాల ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నేటి చిన్నారులే రేపటి భావిభారత పౌరులు గుంటూరు వెస్ట్: చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే చట్టరీత్యా నేరమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ తెలిపారు. ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జేసీతో పాటు డీఆర్వో షేఖ్ ఖాజావలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చిన్నారులందరూ విధిగా పాఠశాలలకు వెళ్ళి విద్యనభ్యసించాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు ఉప కార్మిక శాఖ కమీషనర్ ఎ.గాయత్రీ దేవి, సహాయ కమిషనర్ కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అర్హత పరీక్ష లేకుండా ఉపాధ్యాయ నియామకాలు న్యాయమా!
నెహ్రూ నగర్: డీఎస్సీ రాత పరీక్ష లేకుండానే క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా 382 మంది ఉపాధ్యాయులను నియమించడం విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీఓ నంబరు 4, 47 ద్వారా రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ప్రతిభ ఆధారంగా 421 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేపట్టిందని తెలిపారు. అస్మదీయులకు దొడ్డిదారిన 382 మందికి క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు ఇవ్వడం మంచిది కాదన్నారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 74 ప్రకారం క్రీడా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందాలంటే సంబంధిత రాత పరీక్షలు తప్పనిసరి అని, మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం రాత పరీక్ష లేకుండానే నియామకాలు చేపట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లకు ఇచ్చిన వెయిటేజీపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయని, నకిలీ లేదా వివాదస్పద సర్టిఫికెట్లపై పూర్తి పరిశీలన జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. అన్ని క్రీడలకు సమాన అవకాశాలు లభించాయా అనేది ప్రశ్నార్థకమన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి బోధనా నైపుణ్యం కూడా అవసరమని, కేవలం ఆటల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా 270 మందికి నియామకాలు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పారదర్శకత కరువైందని, ఇది వ్యవస్థాకత కుంభకోణమని అభివర్ణించారు. రాత పరీక్ష లేకుండా 382 ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారని తెలిపారు. నియామకాలు పూర్తయిన వెంటనే భవిష్యత్లో రాత పరీక్షల ఆధారంగానే స్పోర్ట్స్ కోటా నియామకాలు జరపాలని ఉత్తర్వులు ఇవ్వడం తమ తప్పులను సరిదిద్దుకోవడానికేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పోర్ట్స్ కోటా నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు. -
రైతుల శ్రమను తగ్గించే పరిశోధనలు అవసరం
గుంటూరు రూరల్: రైతుల శ్రమను తగ్గించి ఆదాయం పెంచే విధంగా పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్, ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ బోర్డు చైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. శుక్రవారం నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ భారత వ్యవసాయం ఇప్పటికీ వర్షాకాలంపై ఆధారపడి ఉందన్నారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, సాంకేతికత ఆధారితంగా, పర్యావరణ హితంగా, తక్కువ వ్యయంతో సాగుచేసే విధంగా రైతుల శ్రమను తగ్గించేలా తీర్చిదిద్దడంపై ప్రముఖ విద్యాసంస్థలు దృష్టి సారించాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్వర్మ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడంలో, ఆహారభద్రత కల్పించడంలో, పురుగుమందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని కోరారు. -
గుంటూరు
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 20267ర్యాలీలో పార్టీ గుంటూరు అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పోతిన మహేష్, శ్యామలప్రత్తిపాడులో జరిగిన నిరసన ర్యాలీలో బలసాని, పార్టీ శ్రేణులు పొన్నూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నాయకులు రెండేళ్ల మోసాలపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ నిరసన గళం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజాగ్రహ జ్వాల రేగింది. పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తదితరులువిజయపురి సౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది. మరోవైపు రాజధాని జిల్లాలో నిరసనలకు ప్రజలు రాలేదని చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ నిరసన ర్యాలీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. గతం వారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను తెలుగుదేశం నాయకులు దహనం చేస్తుంటే దగ్గరుండి కాపలా కాసిన పోలీసులే... ఈరోజు డీఎస్సీ దిష్టిబొమ్మను తగులబెట్టకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్తిపాడులో ఎస్ఐ నరహరి ఓవరాక్షన్ చేసి తగలబడుతున్న దిష్టిబొమ్మను కార్యకర్తల మీదకు వేయడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. -
పరీక్ష నోటిఫికేషన్లతో విద్యార్థుల్లో అయోమయం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అధికారులు పరీక్షల నిర్వహణ తేదీల నోటిపికేషన్ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇవ్వకుండానే రెండవ సెమిస్టర్ పరీక్షల తేదిలను ప్రకటించడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ ఆరు రోజులపాటు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. పరీక్షలు జరిగి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా పరీక్ష ఫలితాలు ప్రకటించని వర్సిటీ అధికారులు 2026 మే 20వ తేదీ నుండి 23 వరకూ బీఈడీ రెండవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పలువురు బీఈడీ కళాశాలల నిర్వాహకులు జోక్యంతో ఆ పరీక్షల తేదీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. అదే రెండవ సెమిస్టర్ పరీక్షలను జూన్ 22వ తేది నుండి 26వ తేది వరకూ నిర్వహిస్తున్నట్లు మే 2వ తేదీన ప్రకటన చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం సెమిస్టర్కి మరొక సెమిస్టర్కు మద్య కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలి. వర్సిటీ అధికారులు ఇటీవల ప్రకటిస్తున్న పరీక్షల తేదీలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఆయా సబ్జెక్ట్ల సిలబస్ పూర్తికాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరీక్షలకు వర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి దాదాపు 6000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికై నా వర్సిటీ ఉన్నతాధికారులు విద్యార్థుల భవిష్యత్ను, ఇబ్బందులను దృష్టి పెట్టుకుని పరీక్ష తేదీలను ఖరారు చేయాలని, పరీక్ష నిర్వహణ గడుపు పొడిగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఏఎన్యూ పరిధిలోని పలు కళాశాలల నిర్వాహకులు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి డీఆర్వో షేఖ్ ఖాజావలి గుంటూరు వెస్ట్: భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టినట్లు జిల్లా రెవెన్యు అధికారి షేఖ్ ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో ) లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ సమయంలో బీల్వో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , తెనాలి ఆర్డీఓ రమణి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. ఏపీఎం సోమశేఖర్కు రిమాండ్ కాకుమాను: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఏపీఎం సోమేశేఖర్ను కాకుమాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీఎం సోమశేఖర్ గతంలో కాకుమానులో పనిచేశారు. ఈ క్రమంలో గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుతో 2023లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏపీఎం సోమశేఖర్, అతడితోపాటు సీసీ సుబ్బారావుకు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. ఈక్రమంలో ఏపీఎం, సీసీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
నిరసనపై పోలీస్ జులుం
ప్రత్తిపాడు: ౖవెఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఖాకీలు జులుం ప్రదర్శించారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే పేరుతో మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తల వైపు ఎస్ఐ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించారు. వివరాలు.. ప్రత్తిపాడులో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బస్టాండు సెంటరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట పార్టీ శ్రేణులు డీఎస్సీ దిష్టిబొమ్మను దహనం చేసి, చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రత్తిపాడు ఎస్ఐ ఎన్.నరహరి మంటల్లో దహనమవుతున్న దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. అంతటితో ఆగకుండా మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని గుంపుగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల వైపు దూసుకొచ్చారు. ఎస్ఐ చేతిలో ఉన్న దిష్టిబొమ్మను లాక్కుని కింద పడేసేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలానికి చెందిన పార్టీ నాయకుడు రాంబాబు చేయికి అంటుకుని బొబ్బలు రావడంతో పాటు చొక్కాకు నిప్పు అంటుకుంది. అదే విధంగా గుంటూరు రూరల్ మండలానికి చెందిన లక్ష్మి చీరకు కూడా మంటలు అంటుకోవడంతో చీర కాలిపోయింది. పార్టీ శ్రేణులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. అత్యంత దుర్మార్గంగా ఎస్ఐ తీరు.. ప్రత్తిపాడు ఎస్ఐ తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో పాతమద్రాసు రోడ్డుపై వైఎస్సార్ కాంస్య విగ్రహం ఎదుట బైఠాయించారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం.. పోలీసుల జులుం నశించాలి.. డౌన్ డౌన్ పోలీస్.. ఉయ్వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు కిరణ్కుమార్ వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ మాట్లాడుతూ పోలీసులు ఇంత సెన్స్లెస్గా చేసిన పని వలన ఒక నాయకుడికి చేయి కాలిందని, మరో మహిళా నాయకురాలికి చీర కాలిందని, పొరబాటున ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటే బాధ్యులు ఎవ్వరని ప్రశ్నించారు. ఎస్ఐ నరహరి అసభ్య పదజాలంతో పార్టీ నాయకులు, శ్రేణులను దూషించడం బాధాకరమన్నారు. అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడిన ఎస్ఐపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బలసాని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్ మాట్లాడుతూ ఏమైనా తప్పు జరిగితే పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలే గానీ, ఇలా హత్యా ప్రయత్నం చేయడం ఏమటని ఎస్ఐ నరహరిని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా అని మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగించాలంటూ.. అంతకుముందు కూడా ప్రత్తిపాడు ఎస్ఐ గ్రామంలో రోడ్డుపై కట్టిన వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు తొలగించాలంటూ హడావుడి చేశారు. ఇందిరాగాంధీ బొమ్మ సెంటరులో విద్యుత్ స్తంభాలకు చిన్న చిన్న కట్టడంతో అసలు ఎవరిని అడిగి కట్టారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. ఆ సమయంలోనూ వాగ్వాదం చోటుచేసుకుంది. -
బాల్యం ఓ వరం
ఏఎన్యూ (పెదకాకాని): పరీక్ష ఫలితాలను ఏఎన్యూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఏ హిస్టరీ, సంస్కృతం, ఎంహెచ్ఆర్ఎం 1,2,3,4 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, డిప్లమా ఇన్ సైకాలజీ పరీక్ష ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా రీవాల్యుషన్ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
ఆ హామీలు ఏమయ్యాయి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం సక్సెస్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదు.. మోసాలను నిలదీస్తాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2YearsForCBNBackStabbing హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. రెండేళ్ల ‘నారాసుర’ పాలన-రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు.. ర్యాలీలు ప్రజాగ్రహానికి అద్దం పట్టాయని ఆయన ట్వీట్ చేశారు.‘‘రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో భయానక పాలన. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్రాజ్లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది...విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు...ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు...చంద్రబాబుకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు’’ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన… pic.twitter.com/07PTqq4ojb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 12, 2026 -
శరత్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
పార్వతీపురం : పార్వతీపురం మండలం వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ గుండెపోటుతో అకాల మరణం చెందడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు వైఎస్ జగన్. ఈ మేరకు శరత్ భార్య, తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శరత్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంచితే.. రాజ్యలక్ష్మిపురంలో శరత్ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పరామర్శించారు. -
ట్రెండింగ్లో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’
సాక్షి, తాడేపల్లి: 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' ట్రెండింగ్లో నిలిచింది. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ నిరసన వీడియోలు 'ఎక్స్'లో బాగా వైరల్ అవుతున్నాయి. #2yearsforTdpbackstabbing పేరుతో ట్రెండింగ్ అవుతోంది. చంద్రబాబు మోసాలపై జనం స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహించారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సమర శంఖం(ఫోటో గ్యాలరీ) -
‘రెండేళ్లలోనే బాబు పాలనపై జనం విసిగిపోయారు’
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్. చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.‘‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే మోసాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ను గద్దెదించి చంద్రబాబు సీఎం పీఠమొక్కారు. వైఎస్సార్ ఆదర్శవంతమైన పాలన అందించారు. వైఎస్ జగన్ ఆచరణలో మంచి పాలన తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో మార్పు వస్తుందని ఆశించాం.. కానీ అది జరగలేదు.సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగిపోయి.. వైఎస్ జగన్ వైపు చూస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించేలా ఇవాళ నిరసనలు బ్రహ్మాండంగా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డు మీదకు వస్తున్నారు. కూటమి సర్కార్ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులతో నిరసనలను అణచివేయాలని చూశారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజలు నిరసనలను విజయవంతం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
‘లోకేష్ ఆలిండియా.. పవన్ ఆంధ్రా మోసగాడు’
సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు. -
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
28న పల్స్ పోలియో చుక్కలు
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. సన్నాహాక కార్యక్రమంలో భాగంగా గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఆమె.. మాట్లాడుతూ ఈ నెల 28 బూత్ స్థాయిలో, 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని వెల్లడించారు. సుమారు 1,49,054 మంది 0 నుండి 5 ఏళ్ల పిల్లలు ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం 12,899 పోలియో వ్యాక్సిన్ వైల్స్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో 584 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు , డబ్ల్యుహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ జి.భవాని, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సురేష్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ ప్రియాంక, డెమో శివ సాంబిరెడ్డి, డీపీవో సైమన్, సూపర్వైజర్ శాస్త్రి పాల్గొన్నారు. -
నాలుక కోస్తాం..
పిల్లి కూతలు కూస్తే .. గుంటూరు ఎడ్యుకేషన్ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ హెచ్చరించారు. గురువారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్కుమార్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మాణిక్యరావుకు తగదని, వైఎస్ జగన్కు విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. టీడీపీలోని అగ్రవర్ణ నేతలు మాణిక్యరావును ముందు ఉంచి, విమర్శలు చేస్తున్నారని, టీడీపీలో మాణిక్యరావు బలిపశువేనని అన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై చవకబారు మాటలు, ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటన్నారు. ఎంఆర్పీఎస్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన మాణిక్యరావు ఉద్యమాన్ని వదిలేసి, డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, పిల్లి కూతలు కూస్తే, నాలుక కోస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ను తిడితేనే టీడీపీలో పదవి అని, చంద్రబాబు, లోకేష్ దిగువస్థాయి నాయకులతో పదే, పదే నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, పదవుల కోసం దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్న మాణిక్యరావు టీడీపీకి అధికారం మరో మూడేళ్లే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ డీఎస్సీలో తమకు నష్టం జరిగిందని 200 మందు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారనీ, మెరిట్జాబితాలను కలెక్టరేట్లలో ఎందుకు ప్రచురించలేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందనే విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడకపోవడంతోనే అర్ధమవుతోందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి.అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
వెన్నుపోటు పాలనకు రెండేళ్లు
చంద్రబాబు సర్కారు వచ్చాక సంక్షేమం శూన్యం చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్ సిక్స్ అంటూ అలవికాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయకపోగా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్నికల సమయంలోఊదరగొట్టి తర్వాత హామీలు అమలు చేయకపోవడం ఆయన నైజమని మరోసారి తేలింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెనాలి, పొన్నూరు, గుంటూరు, తాడికొండ, ప్రత్తిపాడు సభలతోపాటు బీసీ ఘర్జనలో పాల్గొన్ని సూపర్ సిక్స్ గురించి ఊదరగొట్టారు. తాము వస్తే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. గుంటూరులో ఏకంగా ఐటీ టవర్లు కట్టి ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సూపర్సిక్స్ పథకాల గురించి తమ అనుకూల పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. మంత్రి అనుమతితోనే కేసులు గుంటూరు జిల్లాలో పూర్తిగా మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. పోలీసులు ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా లోకేష్ అండ్ టీం అనుమతి ఉండాల్సిందే. లేకపోతే కేసు కూడా నమోదు కాని పరిస్థితి గుంటూరు జిల్లాలో నడుస్తోంది. ముఖ్యంగా సోషల్మీడియా ఫిర్యాదులైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతోంది. సోషల్ మీడియా కేసులు, వైఎస్సార్సీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలో వారి వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులు అక్షింతలు వేస్తున్నా పోలీసుల వైఖరి మారలేదు. చినబాబు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇక దాడులు కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏడున్నర గంటలసేపు చేసిన దౌర్జన్యం, హింసాకాండ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలో కూటమిలోని ఇతర పార్టీ నేతలతోపాటు ముఖ్యంగా కాపు సామాజికవర్గం వారిపై జరుగుతున్న దాడులతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పేరుకే పథకాలు తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15 వేలు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క మహిళకు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల తాలూకు డబ్బులు జమ కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి అందజేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. అన్నదాతకు అండగా ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత మాట మార్చారు. అసలు సూపర్ సిక్స్ హామీలను చూస్తుంటేనే భయం వేస్తుందంటున్నారు. సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్నా ఇప్పటికీ సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఉన్న చోట కూడా అరకొర మాత్రమే ఉన్నాయి. కొత్త బస్సులు లేవు. దీనివల్ల మహిళా ప్రయాణికులకు పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. యువతకు అన్యాయం ‘యువతకు ఉపాధి కల్పిస్తాం. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తాం. లేదంటే రూ. 3 వేలు భృతి ఇస్తామంటూ’ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే భృతి కూడా లేకుండా పోయింది. ప్రస్తుత పాలన సంక్షేమం నుంచి సంక్షోభం వైపునకు వెళ్తోంది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందేలా చూశారు. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను మాత్రమే పెంచిన కూటమి ప్రభుత్వం... మిగిలిన పథకాలకు తిలోదకాలు ఇచ్చింది. గుంటూరులో భూగర్భ డ్రైనేజీని పూర్తి చేస్తామని కూటమి నాయకులు చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై అడుగు ముందుకు పడలేదు. ‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామంటూ’ గుంటూరు పర్యటనలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్ ఆస్తులు, అంజుమన్ ఆస్తులను ఏపీఐఐసీకి ధారాదత్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి చేయకపోగా అవినీతికి గేట్లెత్తేశారు. నగరం నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని కూడా తక్కువ నిధులు వచ్చాయని ఫ్లైఓవర్ బదులుగా మళ్లీ బ్రిడ్జినే కడుతూ వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. అన్నదాతలను రోడ్డున పడేశారు. ఈ రెండేళ్లలో తుపాన్లు, వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. గుంటూరు చానల్, కొండవీటి వాగుల వల్ల పూర్తిగా మునిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. రాజధాని అమరావతిలో అవినీతి రాజ్యమేలుతోంది. భూములు ఇవ్వని రైతులను వేధిస్తుండటంతో వారందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మరోవైపు రెండోవిడత భూసమీకరణను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. -
ప్రభుత్వ విద్య మిథ్యే
నేడు పునఃప్రారంభం కానున్న పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. సెలవుల్లో సేదదీరి తిరిగి వచ్చే విద్యార్థులకు టీడీపీ సర్కారు తీరుతో తీవ్ర నిరాశే మిగలనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ ఉచితంగా పంపిణీ చేయాల్సిప విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ను సిద్ధం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చతికిలపడింది. అంతులేని నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. స్టూడెంట్ కిట్తోపాటు ఇవ్వాల్సిన సామగ్రిని సిద్ధం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం పాఠ్య పుస్తకాల పంపిణీకే పరిమితం కానుంది. గుంటూరు ఎడ్యుకేషన్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లో భాగంగా పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, వర్క్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయాలి. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెల రోజులకుపైగానే పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ప్రతి ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగలా విద్యాకానుక పంపిణీ నిర్వహించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం గుంటూరు జిల్లాలోని 18 మండలాల పరిధిలో 89,157 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇవ్వనున్నారు. కిట్లో భాగంగా అందించే పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నోటు బుక్స్, వర్క్బుక్స్, బ్యాగులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, పిక్టోరియల్ డిక్షనరీలు రావాల్సి ఉంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీకే పరిమితమైంది. వైఎస్ జగన్ చొరవతో రూపుదిద్దుకున్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లను పేద, మధ్య తరగతి విద్యార్థులకు 10 రకాల సామగ్రితో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టిన గత వైసీపీ ప్రభుత్వం నిరాటంకంగా విద్యార్థులకు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య 1,730 జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 3.49 లక్షలు ప్రభుత్వ బడుల సంఖ్య 1,074 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 89,157 ప్రైవేటు పాఠశాలల సంఖ్య 656 ప్రైవేటు బడులలోని విద్యార్థుల సంఖ్య 2,60,354 ప్రభుత్వ విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్యపుస్తకాలు: 15,26,181 -
వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) గా డాక్టర్ కోనేటి నాగరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డాక్టర్ నాగరాజు వైఎస్సార్ కడప జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పదోన్నతి కల్పించి గుంటూరు ఆర్డీగా బదిలీ చేశారు. డాక్టర్ నాగరాజు తిరుపతిలో 1983లో ఎంబీబీఎస్ అభ్యసించారు. కడప జిల్లా కదిరిలో 1993లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా 2010లో, సివిల్ సర్జన్గా 2021లో పదోన్నతి పొందారు. రాజంపేట డెప్యూటీ డీఎంహెచ్ఓగా, వైఎస్సార్ కడప జిల్లా జిల్లా ఆసుపత్రిలో 13 సంవత్సరాల పాటు, వైఎస్సార్ కడప రిమ్స్లో ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఫుల్ అడిషనల్ చార్జి ఆర్డీగా డాక్టర్ జి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె జులై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. డీఈఓ షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై మార్కెట్లోకి రాని పాఠ్య పుస్తకాలు శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల కొరత ఉన్న వాస్తవేమనని, త్వరలోనే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 30.4 మి.మీ. కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా మంగళగిరి మండలంలో 81.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మేడికొండూరు మండలంలో 6.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 77.6 మి.మీ., దుగ్గిరాల 70.8, తెనాలి 67.8, కొల్లిపర 47.4, చేబ్రోలు 45, తుళ్లూరు 28.8, పెదకాకాని 27.2, గుంటూరు పశ్చిమ 26.4, గుంటూరు తూర్పు 18.4, వట్టిచెరుకూరు 16.6, ఫిరంగిపురం 8.6, పొన్నూరు 8.6, తాడికొండ 8.2, ప్రత్తిపాడు మండలంలో 7.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కొరిటెపాడు(గుంటూరు): సబ్ జూనియర్ బాలబాలికల అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు బాక్సర్లు ఎంపికై నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరిలో ప్రజ్ణ దియా జోష్లిన్ ఎంపికై ందన్నారు. బాలుర విభాగంలో 70 కిలోల కేటగిరిలో శ్రీ కార్తికేయ, 55 కిలోల విభాగంలో జ్ఞాన సాయి, 35 కిలోల విభాగంలో చంద్రహౌస్ ఎంపికై నట్లు వివరించారు. ఈ క్రీడాకారులతో పాటు బాక్సింగ్ కోచ్ ఇమ్మానియేల్ రాజు కూడా పోటీలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న గుంటూరు జిల్లా బాక్సర్లు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కోలా చిరంజీవి మాట్లాడుతూ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అసోసియేషన్ తరపున ఆర్తిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
రాజధాని భూసేకరణలో పురోగతి ఉండాలి
గుంటూరు వెస్ట్: రాజధాని భూముల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతివారం ఖచ్చితమైన పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ్ , కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలసి రాజధాని భూసేకరణ గురించి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ–3, ఈ–13, ఈ–15 పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి తదితర నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో పెండింగ్ అంశాల గురించి చర్చించారు. భూసేకరణ ప్రక్రియలోని ప్రతి అంశానికి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్న్డ్ భూములు, పట్టా భూములు విషయంలో నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు ఇతర శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ సర్వే విషయంలో సంయుక్త తనిఖీలు త్వరగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, సీఆర్డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్ అత్యంత కీలకం ఎటువంటి లోపాలు, దొంగ ఓట్లు లేని ఒక సమగ్రమైన, పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం రాత్రి కలక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
నాడు–నేడు పనులపై నిర్లక్ష్యం
2014–19 మధ్య టీడీపీ పాలనలో సమస్యలతో కునారిల్లిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసిన వైఎస్సార్సీపీ సర్కారు నాడు–నేడు ద్వారా సకల వసతులతో పాఠశాలలను ఆధునికీకరించింది. ఈ విధంగా నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్లతో కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 పాఠశాలలను రూ.202 కోట్లతో 10 కాంపొనెంట్ల వారీగా చేపట్టిన పనులు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన 600 తరగతి గదుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే నాడు–నేడు పనులను అటకెక్కించింది. ఒక్కో పాఠశాలకు కేవలం రూ.ఐదు లక్షలు ఖర్చు పెడితే పూర్తయ్యే అవకాశమున్నచోట సైతం పట్టించుకోలేదు. అదనపు తరగతి గదులకు సిమెంట్, ఇసుక సరఫరా చేయకపోవడంతో సివిల్ పనులు మధ్యలోనే అగిపోయాయి. నాడు–నేడు మొదటి దశలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం పంపిణీ చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహణ లేక, వినియోగంచకుండా పక్కన పడేశారు. రెండో దశలో పాఠశాలలకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఇచ్చినా ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా రెండేళ్ల కూటమి పాలనలో కరువైంది. -
భారత్ – ఎ జట్టులో రషీద్కు చోటు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీ మెన్ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి శ్రీలంకలో జరగనున్న టోరీ్నలో భారత్– ఏ జట్టు తరఫున రషీద్ ఆడనున్నారన్నారు.గతంలో రషీద్ భారత అండర్– 19 వరల్డ్ కప్ పోటీల్లో వైస్ కెపె్టన్గా వ్యవహరించడమే కాకుండా, వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది రంజీ మ్యాచ్ల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించాడు. రషీద్కు త్రీమెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్బాబు, టీవీ శివరామకృష్ణ, సీహెచ్ నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
డీఎస్సీలో ఆరోపణలపై బాబు సర్కార్ పలాయనం
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీలో ఆరోపణలపై ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.. అధికారులతో మంత్రులు ప్రెస్మీట్ పెట్టించారు. అయితే, నవీన్కి మొదటి ర్యాంక్పై సమాధానం దాటవేశారు. నవీన్.. సోషల్లో ఫస్ట్ ర్యాంక్, టీజీటీలో ఆరో ర్యాంక్ పొందగా.. వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. నవీన్ లాగిన్ బ్లాక్ చేసిన ప్రభుత్వం.. లాగిన్ బ్లాక్పై సమాధానం చెప్పలేదు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఈఆర్ టి కన్వీనర్ ఒక్కరినే నియమించడంపై ప్రభుత్వం సమర్థించుకుంది.అన్ని విభాగాలు విద్యాశాఖ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయంటూ కవరింగ్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష ఎందుకు పెట్టలేదంటూ మీడియా ప్రశ్నించింది. క్వాలిఫికేషన్ లేకుండా ఎలా అర్హత కల్పించారంటూ మీడియా నిలదీయగా.. అది పాలసీ నిర్ణయం అంటూ చంద్రబాబు సర్కార్ తప్పించుకుంది. తమిళనాడులో పరీక్ష లేకుండా ఇస్తున్నారంటూ సమర్థించుకుంది. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.ఐదేళ్ల సమయం వాళ్లకి క్వాలిఫికేషన్ సాధించడానికి ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మళ్లీ ఎందుకు పాలసీ మార్చారంటూ మీడియా ప్రశ్నించగా.. అది ప్రభుత్వం పాలసీ అంటూ సమాధానం దాటవేశారు. అది డీఎస్సీ కోసం మారిన పాలసీ కాదు.. సాధారణంగా మార్చిన పాలసీ అంటూ అధికారులు బుకాయించారు. -
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు కాని పరిస్థితి ఏర్పడింది. జూన్ 12న పథకం అమలు జరగదని స్పష్టమైంది. రెండో ఏడాదికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని కొనసాగించలేక చేతులెత్తేశారు. ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే స్కూల్ తెరిచేనాటికి ప్రతిఏటా తల్లికివందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్లలో ప్రతి విద్యార్థికి రూ.17వేలు ఎగనామం పెట్టింది.రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నా ఇప్పటి వరకు ఈ ఏడాది తల్లికి వందనంపై చంద్రబాబు సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు జమచేస్తారో ప్రకటించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. గతేడాది ఏడాది తల్లికి వందనంలో 20లక్షలమంది విద్యార్థులకు కోత విధించింది. రూ.260 కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంతమందో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ఏడాదికి తల్లికి వందనం ఎప్పుడిస్తారో బాబు సర్కార్ చెప్పలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. -
టీడీపీ గేమ్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ కొత్త వేషం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్లు కూడా జెన్-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.నేపాల్లో కొంతకాలం క్రితం జెన్-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.అప్పటి నుంచే జెన్-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు పెడుతున్నారు.స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.పవన్ కళ్యాణ్తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఏపీలో జెన్-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్లో కూడా అలా చేయబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు పెట్టిన జనసేన జెన్-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్లు ఏదైనా మంచి పని చేస్తే పవన్ కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్ ప్లాన్లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ .. దుర్గయ్య ఏం అన్నారో విన్నారా
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు..చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు. -
బాబూ జాగ్రత్త.. కాక్రోచ్లు బయటకొస్తాయి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకుల మయమేనని.. ఇప్పుడు డీఎస్సీ విషయంలోనూ అదే జరిగిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గతంలో బాబు హయాంలో జరిగిన పేపర్ లీకేజీల చిట్టాను చదివి వినిపించిన వైఎస్ జగన్.. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబుగారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్. 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్. 2019లో టెన్త్ పేపర్ లీక్. 2025లో బీఈడీ పేపర్ లీక్, 2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్. ఇప్పుడు డీఎస్సీ టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది. ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది. అందుకే ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుగారూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది జెన్జీ కాలం. ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా నడుస్తోంది. దేన్నీ ఆపలేరు. మీరు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది. దగాపడ్డ యువత మిమ్మల్ని విడిచిపెట్టదు. తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఏపీలో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయి. జాగ్రత్త..! ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్ర్రబాబు ముందుకు రాడు. సరికదా.. ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘వారంరోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని.. ఒకవేళ అప్పటికీ కాకపోతే.. మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని హామీ ఇచ్చా’’ అని వైఎస్ జగన్ మీడియాకు తెలిపారు. -
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
వైఎస్ జగన్ మీడియా సమావేశం హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: ఏపీ డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. చంద్రబాబు సర్కార్ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు అని చెప్పుకొచ్చారు. డీఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో బయటపెట్టారు. తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ఎద్దేవా చేశారు. ఇది జెన్జీ కాలం.. దేన్నీ చంద్రబాబు ఆపలేడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.డీఎస్సీ అవకతవకల అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. అలాగే, రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరి తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..డీఎస్సీ విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా చాలా షాక్ కలిగిస్తున్నాయి.లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసింది.స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసింది.ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు.డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ. వారి భవిష్యత్తు.అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డం అత్యంత దారుణం.అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకు, స్కాముకు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు.చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా,ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.16వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయి.మెగా డీఎస్సీ అనడానికి అర్హత లేదు..మా ప్రభుత్వంలో ఒకే సమయంలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చాం.లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశాం.దేశ చరిత్రలోనే లేని విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చాం.2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే జీవో ఇచ్చాం.19 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్క తప్పు కూడా జరగలేదు.నాలుగు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భర్తీ పూర్తి చేశాం.ఇప్పుడు మాత్రం డీఎస్సీ పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారు. రికార్డు అంటే వైఎస్సార్సీపీదే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఐదు తొలి సంతకాలు అంటూ నానా హంగామా ఆర్భాటం చేశాడు.ఇదికూడా పెద్ద మోసమే.దీంట్లో మెగా డీఎస్సీ అనేది ఒక సంతకం.వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులకు మేం నోటిఫికేషన్ ఇచ్చాం.వాటిని భర్తీచేయకుండా రద్దుచేసి, రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు.పైగా ఆ 6,100 పోస్టులతో కలిపి, ఇస్తున్న 16వేల పోస్టులకే మెగా పేరుపెట్టి చివరకు లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారు.ఇదీ చంద్రబాబు మొదటి సంతకం పరిస్థితి. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా?రికార్డు అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలోనే జరిగింది.గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు.మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, జులై 19న జీవో ఇచ్చాం.జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం.జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం.సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం.2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు.ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం.ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు.అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసాం.అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు?మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు?డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి.కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు.డీఎస్సీ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది.పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ కన్వీనర్ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ పరీక్షల నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్కు అప్పగించి పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది.అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్.చంద్రబాబు వ్యాఖ్యలు హాస్వాస్పదం.. రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్నం తయారీ, అప్లోడ్ను ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు.ఆ విషయం తెలిసి కూడా వారికే అప్పగించారు.తప్పు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టాలనే ఈ పని చేశారు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్ అనే వ్యక్తికి..ఆ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం పెద్ద స్కామ్ కాదా?.ఔట్సోర్సింగ్ ఉద్యోగికి సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, టీజీటీ జోన్-2లో ఆరో ర్యాంకుఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణల్లో ఉండటం, అదే వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం స్కామ్ కాదా?.ఇదంతా కనిపించింది మాత్రమే.. కనిపించని ఎన్ని లీక్లు ఉన్నాయో.మెరిట్తోనే ర్యాంక్ సాధిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?.అతడి ఐడీ, డేటాను మాయం చేశారు.మెరిట్ లిస్టులో మార్పులు చేసి అతని పేరును మాయం చేశారు.తప్పు జరిగింది కాబట్టే అతని డేటాను మాయం చేశారు కదా?.మెరిట్ సాధిస్తే అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు?.చివరికి ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.మొదటి ర్యాంక్ వ్యక్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాలేదట. చంద్రబాబే పోలీసు.. లాయరు.. ఆదేశాలు...మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు?మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?ఒక కేండిడేట్కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాడా?మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు.పేపర్ లీక్ను దాచిపెట్టడానికే ఈ కబుర్లన్నీ చెప్తున్నారంటూ అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు మీ నుంచి సమాధానం ఏమిటి?మీరు చెప్పేవి నిజాలు అయితే ఆ అభ్యర్థి కోర్టుకు ఎందుకు పోయాడు?పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు?డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది?ఎంతమందికి లీక్ వెళ్లింది?ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు, ఆయనే పర్యవేక్షిస్తారు.అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?పైగా విద్యాశాఖ మంత్రి ఆయన కొడుకే. మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి?రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?పారదర్శకత ఎక్కడ?ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వెల్లడి అయినా అత్యంత పారదర్శకంగా ఉంటుంది.ఇప్పటికీ యూపీఎస్సీ-సివిల్స్ పరీక్ష ఫలితాలు చూస్తే చాలా పారదర్శకంగా మెరిట్లిస్టులు డిస్ప్లే చేస్తారు.కానీ, చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తి విరుద్ధంగా సాగింది.మెరిట్ లిస్టులు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు పబ్లిక్గా డిస్ప్లేలో పెట్టలేదు?సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకువచ్చారు.మరి పారదర్శకత అనేది ఎక్కడ ఉంది. ఇందులో స్కామ్ల కంపు కనిపించడం లేదా?అసలు డీఎస్సీ అంటేనే “డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ’’.. జిల్లాస్థాయిలో, కలెక్టర్ నేతృత్వంలో జరుగుతుంది.అలాంటి కలెక్టర్ కార్యాలయాల్లోనే పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు లిస్టు పెట్టలేదు.మొత్తం ప్రక్రియను దాదాపుగా సెంట్రలైజ్ చేశారు. ఎందుకు ఇలా చేశారు? దీనికి కారణం, మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా?ఉమ్మడి రాష్ట్రంలో కాని, ఈ రాష్ట్రంలో కాని అనేకమార్లు DSC పరీక్షలు జరిగాయి.జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులను డిస్ప్లే చేసేవారు.అక్కడ ఇచ్చిన కటాఫ్ మార్కులు, రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసినవారు, ఆ పోస్టు తనకు వస్తుందా? లేదా? అని దాదాపుగా ఒక అంచనాకు పారదర్శకంగా వచ్చే వాళ్లు.కానీ, ఇవాళ ఆ పరిస్థితి లేదు. అంతా దాపరికం, గందరగోళం. మెరిట్ లిస్టులు, రోస్టర్స్ను, మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. ఆన్లైన్ అంటూ సెంట్రలైజ్ చేశారు.ఆ ఆన్లైన్లో కూడా అనేక సార్లు, అనేక మార్పులు చేశారు..ఎవ్వరికీ ఏ సందేహం ఉన్నా, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే, వారు పట్టించుకోకుండా, పైన విద్యాభవన్కు వెళ్లాలని అని వారు చెప్తారు.తీరా ఇక్కడకు వస్తే, మీరు అక్కడికి పోండి, మాకు సంబంధం లేదని వీరు చెప్తారు. ఎవరి కోసం సర్దుబాట్లు..చివరకు ఒక పోస్టుకు ఒకరు, అంటే 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి, వారిని పిలిచి,వారి సర్టిఫికెట్లు వెరిఫై చేసిమరీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. 1:1 అంటే అర్థం కాదా?ఒక పోస్టుకు, ఒక అభ్యర్థి అనే కదా అర్థం? ముందుగానే మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్లెటర్లు జారీచేశారు?సెలెక్షన్స్ రూల్స్లో రూల్ నంబర్ 20 ఇదే చెప్తోంది.ఎందుకంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో మీకు తెలుసు, వారు ఓపెన్లోకి వస్తారా? లేక రిజర్వేషన్లోకి వస్తారా? అన్నది తెలుసు.వర్టికల్ రిజర్వేషన్ తెలుసు. హారిజాంటల్ రిజర్వేషన్ తెలుసు.ఎన్ని OC పోస్టులు ఉన్నాయో తెలుసు?ఎన్ని SC, ST, BC, EWS పోస్టులు ఉన్నాయి?ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు?స్పోర్ట్స్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద ఎన్నిపోస్టులు? ఇవన్నీ ముందుగానే చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు.ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు ఏ కోటా కిందకు వస్తారు?వారి ర్యాంకులు ఏంటి? అన్న విషయాలన్నీ ముందుగానే వారికి తెలుసు.ఇవన్నీ తెలిసిన తర్వాత, 1:1లో పిలిచిన తర్వాత, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోవడం ఏంటి?వెరిఫికేషన్లో సర్టిఫికెట్లు అన్నీ సరైనవి అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి?రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేకపోవడం ఏంటి?ఇది దగా కాదా? మోసం కాదా? దోపిడీ కాదా? స్కాం కాదా?ఇప్పుడేమో కాల్లెటర్ జారీచేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేంటి?మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు.సర్టిఫికెట్లలో ఏమైనా లోపాలు ఉంటే తప్ప 1:1లో కాల్లెటర్ వచ్చిన వాళ్లకు పోస్టు తప్పకుండా ఇవ్వాలా? వద్దా?1:1లో పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా?అన్ని సర్దుబాట్లు, అన్ని జీవోలు చూపిన తరువాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్లు, అన్నీ చూసిన తర్వాతే 1:1లో పిలిచి, సర్టిఫికెట్లు అన్నీ బాగున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.మళ్లీ సర్దుబాటు జరిగింది అంటే, ఎవరికోసం జరిగింది ఈ సర్దుబాటు? ఎవరికోసం వీరికి అన్యాయం చేశారు?స్పోర్ట్స్ కోటా పెద్ద స్కామ్..స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కాం. ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్కు కూడా అన్యాయం జరిగింది.జీవో నంబర్-4, జీవో నంబర్-47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన “స్కామ్ల పాలసీ స్కెచ్’’ ఇది.గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని..ఒక బ్యాక్డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు.దీని కోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, మీరు అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు, తెచ్చిన జీవోలను తీసేశారు.గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది.కాని, ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో మిగతా అభ్యర్థులతోపాటు వీరుకూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. అది రూల్.అలాంటి రూల్ను చంద్రబాబు మొత్తం మార్చేశాడు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచాడు.అసలు పరీక్షే రాయల్సిన అవసరం లేదంటూ జీవోలు ఇచ్చాడు.రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా, హిందీ, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, ఇంకా ఇలాంటి సబ్జెక్ట్లకు.. డీఎస్సీ పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా, స్కామ్లు చేస్తూ తన వాళ్ల కోసం చంద్రబాబు ఒక తప్పుడు దారి వేశాడు.దీనికి ముందుగానే, వారి వద్ద నుంచి వసూళ్లు చేసి, వారికి అడ్డగోలుగా గేట్లు ఎత్తడానికి ఈ జీవోలు జారీచేశారు.అందులో కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత, డీఎస్సీ పరీక్ష ఎలాగూ లేదు, నింపాదిగా డిగ్రీ కూడా సాధించడానికి ఐదేళ్ల సమయం కూడా ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది.క్రీడా ప్రతిభను కూడ చూడలేదు. పతకాలు చూడలేదు. బ్యాక్అప్ సర్టిఫికెట్లు కూడా లేవు.కేవలం ఆ ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు, ఉద్యోగాలు ఇచ్చేశారు.ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజ్, యూనివర్శిటీల తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఈ ఉద్యోగాలు ఇచ్చేశారు.ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీరే ఇచ్చారు.సమాధానం చెప్పాల్సిందే..బాల్బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆముదాలవలస టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్ కాగా, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్.వీళ్లే పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్లే వాటిని ధృవీకరిస్తారు.ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పోలవరంలోని మారుమూల ప్రాంతంకు చెందిన వ్యక్తి.ఆయనకు 1:1 కాల్ లెటర్ అందుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.కచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం ఇది. క్రీడాకారుల పేరుతో చేసిన స్కాం కాదా ఇది?ముందు తన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా, జీవో నంబర్ 4, జీవో నంబర్ 47తో గేటు తెరిచారు.వాళ్లు లోపలికి వెళ్లాక, జీవో నంబర్ 25, జీవోనంబర్ 56లతో గేటు మూసేశారు.తమ పని అయిపోయిన తర్వాత మళ్లీ ఆ జీవోను ఎత్తేశారు.మీరు ఇచ్చిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఈరెండూ సరైనవే అయితే ఎందుకు మళ్లీ వాటిని తొలగించారు?దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలడా?అలాంటి వారికి ఉద్యోగాలా?...ఎంపికైన అభ్యర్ధుల డేటాను చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్శిటీల తరఫున పార్టిసిపేట్ చేసినందుకే 270 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి.వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు.జస్ట్ పాల్గొన్నారు అంతే.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.ఇలా సర్టిఫికెట్ల ఇచ్చిన జాబితా చూస్తే ఆంధ్ర యూనివర్శిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి 31, నాగార్జున యూనివర్శిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్శిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్శిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి 14, యోగి వేమన 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్శిటీ 4, సంస్కృత యూనివర్శిటీ నుంచి 2, మిగతా యూనివర్శిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి.ఇంటర్ కాలేజ్ పోటీల్లో, అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీలలో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి.మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పాల్గొన్నందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.ఇక ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.జిల్లా తరఫున ఆడితే చాలు. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.ఈ స్పోర్ట్స్ కోటా కింద టీచర్ ఉద్యోగాలను ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా, బేరసారాలు జరుగుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీగా పెట్టుకుని, ఒక కేండిడేట్తో బేరాసారాలు చేస్తున్న వీడియో ఇది.ఈ వీడియో బయటకు రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.కేసు పెట్టినా విచారణ శూన్యం. ఈ విషయాలేవీ కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు.ఎఫ్ఐఆర్ కాపీని ఒక్కసారి చూస్తే, వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది.పోలీసులు తలచుకుంటే ఈ నంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లో కనిపెడతారు.కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో, వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి, సస్పెక్ట్ అని రాశారు.పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలమ్లో ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయ్యిందని పెట్టారు.దీని అర్థం. ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తని తేలుతోంది.ఈ స్పోర్ట్స్ కోటా వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.పైగా బలమైన సెక్షన్లు పెట్టి, గట్టిగా విచారణ చేయకపోగా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం వెనుక అసలు ఏ జరిగిందనేది తేల్చాలా? వద్దా?లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది...అసలు చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయమే ఉంటుంది.1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్.1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్.1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్.2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్.2019లో టెన్త్ పేపర్ లీక్.2025లో బీఈడీ పేపర్ లీక్,2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్.ఇప్పుడు DSC టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది.ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది.అందుకే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.చంద్రబాబు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.ఇది Gen-Z కాలం. Gen-Alpha కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు చంద్రబాబూ.నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది.దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు, నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచస్ లేస్తాయి.ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం.లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి.విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను.వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని చెప్పాను. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం.తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా.రేపు వైఎస్సార్సీపీ ర్యాలీలు..రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం.దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి.చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం.దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. -
మంత్రి లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ భైరవకోన సభ్యులు డిమాండ్ చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కడుగు శ్రీనివాసరావు, చింతా శ్రీనివాసరావు, పొన్నగంటి లక్ష్మి, వి.ఎం.సుహాసిని మాట్లాడుతూ తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే వయోభారంతో కొంతమంది అభ్యర్థులు చనిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, ఇప్పటి వరకు నారా లోకేష్ ఎన్నికల హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 4,072 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఎంటీఎస్ టీచర్లు 1500 మంది రిటైర్ అయ్యారని, ఈ పోస్టులను గత డీఎస్సీలో కలపలేదని, వారి స్థానంలో మిగిలిన వారికి ఇస్తే మిగిలిపోయిన 1,369 మందికి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిల్లా చంద్రయ్య, డి.ఆదినారాయణ, డి.నాగేశ్వరరావు, టి.ఏసుబాబు, సీహెచ్ఎల్వీ తులసి, ఆర్.రామారావు పాల్గొన్నారు. -
పొగాకు బాధితులకు చేదు వార్త
గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం స్మోకింగ్కు అలవాటు పడినవారు ఆ అలవాటు మానాలనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల విభాగంలో డీ అడిక్షిన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రం ఉన్నాయి. వీటిలో చికిత్స కోసం ప్రతి రోగి పది నుంచి 15 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు, ఖైనీ, గుట్కా, పాన్పరాగ్లాంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులు నమిలే అలవాటు ఉన్నవారు సైతం జీజీహెచ్కు వస్తున్నారు. వీరికి ఆ అలవాటును మాన్పించేందుకు శరీర భాగంలో ఛాతీకి లేదా భుజానికి లేదా తొడకు వెంట్రుకలు లేని ప్రాంతంలో నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటించి కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా ప్రతినెలా బాధితులు పొగాకు ఉత్పత్తులు విడనాడుతున్నారు. మందులు మింగే పనిలేకుండా కేవలం ఒక స్టిక్కర్ మాదిరిగా నికోటిన్ ప్యాచ్ను అంటించుకోవడం ద్వారా పొగాకు వినియోగాన్ని సునాయాసనంగా విడిచి పెట్టడంతో రోజూ జీజీహెచ్కు బాధితులు క్యూ కడుతున్నారు. కానీ ప్యాచ్లు ఆరు నెలలుగా జీజీహెచ్లో స్టాక్ లేవు. వాస్తవానికి ఈ ప్యాచ్లను ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు వినియోగించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో వీటి ఖరీదు నెలకు రూ.3 వేలకుపైగా ఉంటుంది. పలువురు బాధితులు వాటిని కొనుగోలు చేసే స్థోమత లేక కౌన్సిలింగ్ చేయించుకున్నప్పటికీ ప్యాచ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా రోజువారి కూలీలు, దిగువ మధ్యతరగతి వారు బాధితులుగా ఉన్నారు. ఆరు నెలలుగా స్టాకు లేక బయట కొనుగోలు చేసే స్థోమత లేక పొగరాయుళ్లు సతమతం అవుతున్నారు. గుంటూరు జీజీహెచ్కు కేవలం గుంటూరు జిల్లాకు చెందిన వారే కాకుండా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన వారు సైతం నికోటిన్ ప్యాచ్ల కోసం పొగ అలవాటును మానాలనే ఉద్దేశంతో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. జీతాలకు కూడా దిక్కులేదు... డీ అడిక్షన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు కూడా విడుదల కాలేదు. ఇరువురు కౌన్సిలర్లు, ఇరువురు నర్సింగ్ సిబ్బంది, ఇరువురు నాలుగో తరగతి ఉద్యోగులు, మెడికల్ ఆఫీసర్ ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ పొగరాయుళ్లుకు చెడు అలవాట్లు మాన్పించటంలో సహాయపడుతున్నారు. ఒక పక్క నికోటిన్ ప్యాచ్లు లేక, మరోపక్క పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు విడుదల కాక డీ అడిక్షన్ సెంటర్ పనితీరు దిగజారుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి పొగాకు వినియోగంలాంటి చెడు అలవాట్లు విడనాడాలనుకునే వారికి నికోటిన్ ప్యాచ్లు అందుబాటులో ఉండేలా చూడాలని, కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వేతనాలు విడుదల అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
గుంటూరు
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026గ్లాసులు గలగల.. అధికారంలోకి రాగానే సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తాం.... ఇదీ చంద్రబాబు ఎన్నికల ప్రకటన. ఆ సంపద ఏమోగానీ, దానిని తమ నుంచే కొల్లగొడుతున్నారని తెలియని ప్రజలు విస్తుపోతున్నారు. రేయింబవళ్లు గ్లాసులు గలగల అనేలా సర్కారు ప్రోత్సాహం ఇస్తోంది. ఖజానా కళకళలాడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. గత నెలలో భారీగా ఆదాయం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి రూరల్: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 -
వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు
గుంటూరు వెస్ట్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ను ఆధునికీకరించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో వెల్ఫేర్ హాస్టల్స్ సంక్షేమ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఆర్ అండ్బీ శాఖ అధికారులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 67 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయని, వాటిలో 32 హాస్టల్స్ ప్రభుత్వ భవనాలు కలిగి ఉన్నాయన్నారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వసతి గృహాల అభివృద్ధి, ఆధునికీకరణకు ‘మార్పు’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఎలాంటి సదుపాయాలు ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్ని హాస్టల్స్ ఒకే విధానంలో ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 28 నాటికి పనులకు సంబంధించి ఖచ్చితమైన అంచనాలు రూపొందించి సమర్పించాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, బీసీ కార్పొరేషన్ ఈడీ మంజుల, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్థసారథి, పంచాయతీరాజ్ ఎస్ఈ జి.శ్రీనివాసులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ల్యాడ్స్పై నివేదిక సమర్పించాలి ఎంపీ ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వి.సి. హాల్లో ఎంపీ ల్యాడ్స్ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారు తురకపాలెం వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలోని హిందూ శ్మశానవాటికలో కర్మశాల భవన నిర్మాణ పనులను విచారించారు. సమావేశంలో సీపీఓ శేషాశ్రీ, వివిధ కార్యనిర్వాహక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు అమరావతి రాజధానిలోని పెరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 21న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు పాల్గొంటారన్నారు.జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు
లక్ష్మీపురం: భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ డివిజనల్ సేఫ్టీ అధికారి బి.విజయకీర్త్తి హెచ్చరించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ పిలుపు మేరకు గుంటూరు రైల్వే డీఆర్ఎం సుధేష్ఠ సేన్ పర్యవేక్షణలో ఈనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాలు బుధవారంతో ముగిశాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణ, రహదారి వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా అధికారులు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది రక్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా పట్టాభిపురం, ఇన్నర్ రింగ్ రోడ్, పెదకపలకలూరు, మంగళగిరి ప్రాంతాల్లోని రైల్వే గేట్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే భద్రతా బృందాలు లెవెల్ క్రాసింగ్ల సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేడంతోపాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డివిజన్ అధికారులు, ఆర్పిఎఫ్ సిబ్బంది, పాల్గొన్నారు. సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయకీర్త్తి -
గుంతలోకి జారిపడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మంగళగిరి టౌన్: ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలోకి జారిపడడంతో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసముంటున్న శరత్బాబు (50) ట్రాక్టర్ డ్రైవర్గా మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో మెగా కంపెనీ కింద గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ట్రాక్టర్ ఇంజిన్తో డీవాటరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నీళ్లు ఉన్న గుంత అంచున ట్రాక్టర్ పెట్టి నీటి పైపును వేసి డీ వాటరింగ్ చేస్తున్నాడు. ట్రాక్టర్ను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుంత అంచున ఉండడంతో ప్రమావశాత్తూ పక్కనే ఉన్న 20 అడుగుల లోతున్న గుంతలో జారిపడిపోయింది. డ్రైవర్ సీట్లో ఉన్న శరత్బాబు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన శరత్బాబును మెగా కంపెనీ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శరత్బాబు మృతిచెందాడు. ఘటనపై మృతుడి కుమారుడు వంశీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కు కాపు నాడు వినతి నెహ్రూనగర్: కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సంకటి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి వద్ద ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 2017 డిసెంబర్లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు 100 నియోజకవర్గాల్లో కాపు భవనాలు, హాస్టళ్లు, కల్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చి కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్న్కు ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. కాపు విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కాపు మహిళా సాధికారత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.15,000, 5 సంవత్సరాలకు రూ.75,000 వరకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. 2019లో కాపులను బీసీల్లో చేర్చి 9వ షెడ్యూల్లో పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పూర్తిగా పరిశీలించి కాపులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. కాపునాడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, వ్యతిరేకం కాదని, రిజర్వేషన్, రాజ్యాధికార సాధన లక్ష్యంగా పోరాడే సంస్థ అని స్పష్టం చేశారు. -
ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
ఎస్పీ వకుల్జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని హాలులో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తు, పురోగతి, కేసు ఛేదించిన శాతం, నేరస్తుల అరెస్టులపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టప్రకారం బాధితుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కొందరు పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామాలు, వార్డుల వారీగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బైండోవర్ కేసులు నమోదు చేయాల్నారు. అంతేకాక వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ జి.వి.రమణమూర్తి, ఏటీవీ రవికుమార్, డీఎస్పీలు అళహరిశ్రీనివాస్, సంతూరయ్య పాల్గొన్నారు. డీలర్ల సమావేశంలో జేడీఏ పద్మావతి కొరిటెపాడు: ఏపీ ఏఐఎంఎస్ ద్వారా ఎరువుల విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్ కళ్యాణమండపంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రిటైల్ డీలర్లు ఇకపై ఏపీఏఐఎంఎస్ 2.ఓ పోర్టల్ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ ఆత్మ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమతుల్య ఎరువుల వాడకం ఆవశ్యకతను వివరించారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమికి, పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను డీలర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్. మోహనరావు, వి.రమాకోటేశ్వరి, ఆర్.విజయబాబు, పి.సంధ్యారాణి పాల్గొన్నారు. పుల్లలచెరువు మండలం శతకోడులో ఘటన పుల్లలచెరువు: భూముల క్రయవిక్రయాలు సాగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్(42) అనే వ్యక్తి పొలాలు విక్రయిస్తూ, కొలుగోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా శతకోడు గ్రామానికి చెందిన వరికూటి పోలిరెడ్డితో కలిసి చుట్టపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో శివాలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని రవికుమార్గా గుర్తించారు. గ్రామంలో ఇటీవల కాలంలో పోలిరెడ్డితో కలిసి రవికుమార్ తిరగడం చూశామని గ్రామస్తులు కొందరు చెప్పారు. హత్యకు పురిగొల్పిన కారణాలు తెలియాల్సి ఉంది. -
అటవీ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బొల్లాపల్లి: అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం వినుకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి చెందిన టీ శ్రీసాయి, ఎఫ్ఆర్ఓ శంకరయ్యలు తొలుత వినుకొండ పట్టణ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నగర వనాన్ని సందర్శించారు. ఈపూరు మండలం భద్రుపాలెం సమీపంలో ఆ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ పరిశీలించారు. రేమిడిచర్ల బీట్ పరిధిలో ఇటీవల వన్యప్రాణుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 5 సాసర్ ఫిట్స్ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదే బీట్ పరిధిలో పలకల క్వారీని తనిఖీ చేశారు. విజిలెన్స్ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రేంజర్ సి.మాధవరావు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో ఆయుష్ సేవలను బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో యోగ, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో బుధవారం ఆయుష్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ త్వరలోనే ఆయుష్ విభాగంలో మరో ఇద్దరు వైద్యాధికారులు చేరనున్నట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆయుష్ విభాగంతోపాటు ఎయిమ్స్లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు స్పోర్ట్స్ మెడిసిన్ విభాగాన్ని మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు పుష్పాంజలి, దేసు రామమోహన్, రాజశేఖర్ మోహన్, కల్నల్ శశికాంత్, సన్యాల్, ఆర్థిక సలహాదారులు డి.గోవిందరావు, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): హైదరాబాద్ కొంపల్లిలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు గుంటూరు నుంచి 14 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్ జోన్లో పాల్గొనే క్రీడాకారులకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్యలు క్రీడాకారులకు టీ–షర్ట్స్ అందజేశారు. సౌత్ జోన్ పోటీలలో కూడా మెడల్స్ సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుముడింప చేయాలని కోరారు. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు పి.ఆనంద్కుమార్, కె.అరుణ్కుమార్, డి.అభిరామ్, నల్లబోతు త్రిలోక్య (సంజు), నిహాల్, ఆకాష్, చరణ్, జీవీఎస్ ప్రసాద్, టీ నేహా, టి.నిహిత, ఏ.ఆరాధ్య, ఎన్. హవిష్మ్, పి.అమృత, కే.కళ్యాణ్. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ముస్తాబాద్–గన్నవరం సెక్షన్లలో పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్ల్లించినట్లు రైల్వే విజయవాడ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యర్నాకులం –పాట్నా (22643) ఈ నెల 15, 16, 22, 23, 29, 30, జూలై 6, 7 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడపనున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు – గౌహతి (12509) 10, 17, 24, జూలై ఒకటో తేదీ, భవ్నగర్ టెర్నినస్ – కాకినాడ పోర్టు (12756) రైలు 13, 20, 27, జూలై 4 తేదీల్లో దారి మళ్లించారు. -
ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదాపై పరిశీలన
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపజేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రింటింగ్ రంగాన్ని 4వ లేదా 5వ అతిపెద్ద పరిశ్రమగా గుర్తిస్తూ పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే డిమాండ్ వస్తోందని, దీనిపై తాము కూడా కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కాన్సెప్ట్లతో ముందుకు రావాలని, పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మంచి ప్రభుత్వానికి, మంత్రి వర్యులకు ముద్రణా రంగ పారిశ్రామికవేత్తల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రింటింగ్ రంగాన్ని ఇప్పటివరకు కేవలం ఒక వ్యాపారంగానే చూస్తున్నారని, దీనికి పూర్తిస్థాయిలో పరిశ్రమగా గుర్తింపు ఇవ్వాలని మంత్రి టీజీ భరత్ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కోలా వెంకటరమణ, సలహాదారులు మిక్కిలినేని వెంకట శివప్రసాద్, కార్యదర్శి కట్రగడ్డ మోహన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవీందర్ రెడ్డి, తెలంగాణ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సభ్యులు చక్కా శివప్రసాద్ హర్షారెడ్డి పాల్గొన్నారు. -
ఎట్టకేలకు చిక్కిన రిమాండ్ ఖైదీ
నగరంపాలెం: గుంటూరు జీజీహెచ్ నుంచి పరారైన రిమాండ్ ఖైదీ దాదాపు 70 రోజుల తర్వాత తమిళనాడు పోలీసులకు చిక్కాడు. వివరాలు.. ఏలూరు జిల్లా పెద్దయోగి మండలం కొప్పలవారిగూడెం గ్రామం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్కుమార్ (29) ఓ కేసులో ఒంగోలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2024లో గుంటూరు జిల్లా తెనాలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో వారెంట్ ముద్దాయి అయిన అతన్ని తెనాలి ఒకటో పట్టణ పోలీసులు ఈ ఏడాది మార్చి 24న ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం రేపల్లె సబ్ జైలుకి తరలించారు. పరారయ్యేందుకు జైల్లోనే పథకం రూపొందించాడు. మార్చి 25న ఆస్తమా ఉందని, గతంలో ఎడమ కాలికి శస్త్రచికిత్స చేయగా నొప్పిగా ఉందని సబ్ జైలు అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందే క్రమంలో 28న అజిత్కుమార్ మూత్రవిసర్జనకి వెళ్తున్నానని పరారైన విషయం విదితమే. రేపల్లె సబ్ జైలు అధికారికి ఆన్లైన్లో నగదు చెల్లించారనేది విచారణలో బహిర్గతమైంది. మొబైల్ ఫోన్ వాడకపోవడం, ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తూ జాగ్రత్త పడటంతో నెలలు గడిచాయి. తమిళనాడులోని తిరుపూర్లో క్రైం విభాగం పోలీసులు సుమారు వారం క్రితం ఓ కేసులో అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు సమాచారం. అతన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు పోలీస్ బృందం వెళ్లినట్లు తెలిసింది. పరారీ ఘటపై ఇప్పటి వరకు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. మరికొందరిపై ఇప్పటికి విచారణ చేస్తున్నారు. -
చేనేతల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. మంగళగిరి పట్టణం మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. గత ఫిబ్రవరి 22న చేనేత కార్మికులతో మంగళగిరిలో నిర్వహించిన చేనేత గర్జన, ప్రదర్శన, బహిరంగ సభ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న 48 గంటల నిరాహార దీక్ష చేపట్టినా పాలకుల వైఖరిలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ, మగ్గాలు లేని షెడ్ల కార్మికులు, అనుబంధ వృత్తులపై ఆధారపడిన వారిని విస్మరించిందని ఆరోపించారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి అందించాల్సిన 25 వేల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయకపోవడం వలన చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార చేనేత సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. చేనేత రంగ పరిరక్షణ కోసం చేపట్టనున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మంగళగిరి హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం వద్ద జూన్ 22వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, పి.బాలకృష్ణ, రామారావు, కోటేశ్వరరావు, రవి పాల్గొన్నారు. -
మార్కెట్లోకి రాని పాఠ్యపుస్తకాలు
ఎస్సీఈఆర్టీ నిర్లక్ష్యం వల్లే... గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడంలో టీడీపీ సర్కారు విఫలమైంది. 2026–27 నూతన విద్యాసంవత్సరం శుక్రవారం ప్రారంభం కానుండగా, అదే రోజు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మంది విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించిన పాఠ్య పుస్తకాలను ప్రైవేటు కేంద్రాల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసింది. దీంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు పుస్తకాలు ఇంకా రాలేదని దుకాణదారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠ్యాంశాల బోధన తప్పనిసరి ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలతో పూర్తిస్థాయిలో బోధన చేసేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్య పుస్తకాలను విధిగా కొనుగోలు చేసేలా తీసుకున్న చర్యలతో వ్యవస్థను గాడిలో పెట్టారు. వైఎస్సార్ సీపీ పాలనకు ముందు టీడీపీ హయాంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో యాజమాన్యాలు రూ.వేల ఖర్చుతో ప్రైవేటు పబ్లిషర్ల నుంచి పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలండర్కు విరుద్ధంగా సొంత సిలబస్ను బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో బోధన జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సేల్ టెక్ట్స్బుక్స్కు ఇండెంట్ తీసుకుంటున్న విద్యాశాఖ ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలకు అదనంగా సేల్ టెక్ట్స్బుక్స్ను ముద్రించి, విక్రయాలు జరిపింది. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను బహిరంగ మార్కెట్లో సిద్ధం చేయడంలో ఎస్సీఈఆర్టీ విఫలమైందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకునేందుకు పాఠ్య పుస్తకాలను అందించలేని దుస్థితి నెలకొందని, పాఠశాలలు తెరిచిన తరువాత పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులకు బోధన ఏ విధంగా చేయాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలవారీగా హెచ్ఎం లాగిన్ ద్వారా అవసరమైన పాఠ్య పుస్తకాలకు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టి, నేరుగా ముద్రణదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించారన్నారు. టీడీపీ పాలనలో పరిస్థితులు అధ్వానంగా మారాయని అంటున్నారు. పాఠశాలలు రీ ఓపెన్ చేసేందుకు వ్యవధి దగ్గర పడినప్పటికీ పాఠ్య పుస్తకాలు సైతం అందించలేని దుస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ఆరోపణలు చేస్తున్నారు. -
వెలుగులోకి మరో జనసేన నేత మోసం
సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని చేశాడని పేర్కొంది. ఆ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది.2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్ శేఖర్ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్శేఖర్ దాడి చేశారు.బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయ్శేఖర్కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
పొన్నూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి....పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
భారతీరాజా మరణం కళారంగానికి తీరని లోటు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా అని ప్రశంసలు కురిపించారు. ఆయన మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు.భారతీరాజా మృతి పట్ల వైఎస్ జగన్ స్పందిస్తూ..‘భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు ప్రగాఢ సానుభూతి. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని వ్యాఖ్యానించారు. -
లారీ యాజమానులపై అదనపు భారం మోపవద్దు
నగరంపాలెం: లారీ యజమానులపై అదనపు భారం మోపవద్దని న్యూ ఆంధ్ర మోటార్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ఏఎంటీఏ) జిల్లా ఇన్న్చార్జి సాంబశివరావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గూడ్స్ క్యారేజ్ వాహనాలపై వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైస్(వీఎల్టీడీ)ను తప్పనిసరి చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. తద్వారా లారీ యజమానులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం జారీ చేసిన రూల్ 125 హెచ్, 2018 నాటి వీఎల్టీడీ మార్గదర్శకాల్లో ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ గురించే ప్రస్తావించారని అన్నారు. గూడ్స్ క్యారేజ్ వాహనాలకు వీఎల్టీడీ తప్పనిసరి అమలుపై చట్టపరమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గతనెల 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలలో ప్రజా రవాణా వాహనాలలో వీఎల్టీడీ, పానిక్ బటన్ అమలుపై దృష్టి సారించిందని, గూడ్స్ వాహనాలపై తప్పనిసరి అమలుకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా అనే విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. డీజిల్ ధరల పెరుగుదల, టోల్ ఫీజులు, బీమా ప్రీమియంలు, టైర్లు, స్పేర్ పార్ట్స్ ధరలు, బ్యాంకు రుణాల వడ్డీలు పెరుగుతున్న దృష్ట్యా లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి వేళ ఒక వాహనానికి వీఎల్టీడీ పరికరం కొనుగోలు, అమరిక, వార్షిక నిర్వహణ, సిమ్, సాఫ్ట్వేర్ ఛార్జీల రూపంలో వేలాది రూపాయల అదనపు వ్యయం మోపడంతో చిన్న, ముధ్య తరహా లారీ యజమానులకు భారంగా మారుతుందని వాపోయారు. గూడ్స్ వాహనాలపై వీఎల్టీడీ తప్పనిసరి అమలుకు ఉన్న చట్టపరమైన ఆధారాన్ని ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని అన్నారు. రూల్ 125 హెచ్, 2018 వీఎల్టీడీ మార్గదర్శకాలపై అధికారిక స్పష్టీకరణ జారీ చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి ట్రాన్స్పోర్ట్ సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు ఫిట్నెస్, పర్మిట్, బ్యాక్స్, ఇతర పరిపాలనా చర్యలలో వీఎల్టీడీ నిబంధనను అమలు చేయరాదని డిమాండ్ చేశారు. చిన్న, మధ్య తరహా లారీ యజమానులకు ఆర్థిక భారం తగ్గించే చర్యలు చేపట్టాలని అన్నారు. లారీ యజమానుల న్యాయమైన ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రంలోని ట్రాన్న్స్పోర్ట్ సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రవాణా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధానాల కంటే, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
సచివాలయాల ఉద్యోగుల నుంచి ఫోన్ కాల్స్
లక్ష్మీపురం: యోగాంధ్ర రిజిస్ట్రేషన్ పేరుతో సచివాలయాల నుంచి ఫోన్ కాల్స్ చేసి ఓటీపీలు అడుగుతుండటంతో నగర వాసులు సైబర్ నేరాలకు ఎక్కడ గురవుతామోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా, నగరపాలక సంస్థ అధికారుల సూచన మేరకు గుంటూరు నగర వాసులకు సచివాలయాల ఉద్యోగులు ఓటీపీ చెప్పాలని ఫోన్ కాల్ చేస్తున్నారు. ఒక పక్క ఓటీపీలు చెబితే చాలు ఖాతాల్లోని రూ.లక్షల నగదు మాయం అవుతున్న రోజులివి. ఇప్పుడు యోగాంధ్రా కోసం సచివాలయాల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, దానికి సంబంధించి మీ సెల్ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చిందని సచివాలయ సిబ్బంది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొంత మంది చెప్పినప్పటికీ చాలామంది భయంతో వెనుకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ పదే పదే కాల్స్ చేస్తుండటంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని సచివాలయాల నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తుండటంతో ఇదే నమోదు అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. నమోదు చేస్తున్నట్లు చెప్పకుండా నేరుగా ఓటీపీ చెప్పమని అడుగుండటంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కారణంగానే సంబంధిత అధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ఇలా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం మంగళవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంఏ సోషియాలజీ, సోషల్ వర్క్, ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ కామర్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారన్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్ మొదటి, రెండవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వైబ్సెట్ నుండి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, వై వెంకటప్పారెడ్డి, సూపరింటెండెంట్ జవ్వాజి శ్రీనివాస్, ఉద్యోగులు, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో మార్చినెలలో ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి మంగళవారం తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రివైజ్ చేసి, ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల జాబితా రూపొందించామన్నారు. కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయిన వారు ఈనెల 10 తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కోసం హాజరు కావాలన్నారు. ఎస్ఎస్సీ సర్టిఫికెట్, మార్కుల మెమో, ప్రొవిజనల్లీ సర్టిఫికెట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆఫ్ ఏపీ ఎన్ఎంసీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, అపాయింట్మెంట్ఆర్డర్ కాపీ, సర్వీస్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అంగవైకల్యం ఉన్న వారు సంబంధిత సర్టిఫికెట్లు, కరోనా సమయంలో పనిచేసినందుకు శాలరీ పొందిన బ్యాంకు స్టేట్మెంట్ తీసుకుని రావాలన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు. -
పురుగు మందుల పరీక్షల్లో నాణ్యతకు పెద్దపీట
అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్ కొరిటెపాడు(గుంటూరు): రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించేందుకు పరీక్ష విధానాలను మరింత పటిష్టం చేయాలని అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు శనగల రామ్మోహన్ సూచించారు. గుంటూరులోని పురుగు మందుల పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వివిధ యంత్రాలపై పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి మాట్లాడుతూ పురుగు మందుల పరీక్షలకు అవసరమైన వివిధ రకాల మూల పదార్థాలను(టెక్నికల్స్) సరఫరా చేయాలని కోరారు. కొత్త జీఎల్సీ ఎక్విప్మెంట్ వచ్చిన వెంటనే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. రామ్మోహన్ మాట్లాడుతూ పురుగు మందుల పరీక్ష కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం పరీక్షించుకోవడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో నూతన అనాలసిస్ చేసే పరికరాలు అందించడం జరుగుతోందన్నారు. ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం వ్యవసాయ అధికారి విశ్వేశ్వరప్ప, ఏఓలు బి.సురేంద్రబాబు, ఎ.శ్రీనివాసులు, ఎన్.ప్రసన్న, బి.భారతి, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం కావాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీనివాసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గస్థాయిలో వెన్నుపోటుకు రెండేళ్లు టౌన్హాల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకరవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న సుధాకర్బాబు మాట్లాడుతూ టీడీపీ రెండేళ్ల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. అవినీతి, అక్రమాలు, రాజకీయ దాడులతో నిండిపోయిన టీడీపీ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని తెలిపారు. వైఎస్సార్ సీపీలో సమర్థుడైన నేతగా ఎదిగిన అంబటి రాంబాబు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి, వైఎస్ జగన్కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. గుంటూరు నగరంలో ఎంతో మంది ఉద్దండులైన నేతలు ఎంపీలుగా రాణించిన పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చిన పెద్దమనిషి రాజకీయ దాడులతో గుంటూరులో రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతో అధికార మదం దింపుతారని అన్నారు. వైఎస్ జగన్ అంటేనే భయం ఉండటంతో వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్కు జానియర్ ఎన్టీఆర్ అంటే భయమన్నారు. చిరంజీవిని తిట్టిన చింతకాయల విజయ్కు చంద్రబాబు రాజ్యసభ పదవిని కట్టబెట్టారని, టీడీపీ బినామీ లింగమనేనికి పవన్ కల్యాణ్ జనసేన తరఫున రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగాను చంపిన వాళ్లే, అంబటిని అంతం చేసేందుకు ఆయన ఇంటిపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన టీడీపీ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. సమష్టి కృషి అవసరం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీ యింబర్స్మెంట్, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేదని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ నోరు తెరవకపోవడంతోనే ఆ అక్రమాలు నిజమని నిర్ధారణ అయిందన్నారు. టీడీపీ మూడు కోతుల పాలన వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు మాట్లాడకుండా, పవన్ కల్యాణ్ వినకుండా, లోకేష్ కళ్లతో చూడకుండా మూడు కోతుల పాలన సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసాలతో నిండి పోయిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు తమను తాము నిందించుకుంటున్నారని అన్నారు. 2029లో వైఎస్ జగనన్న పాలన కోసం రాష్ట్రంలోని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ పాలనలో మహిళలపై దాడులు, నేరాలు పెరిగాపోయాయని అన్నారు. సదస్సులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకురాలు నల్లమోతు రూత్రాణి, జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి రఘుమహంతి వరలక్ష్మీదేవి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు వంగల వలివీరారెడ్డి, పోలే ముత్యం, కొల్లి శివరామిరెడ్డి, యర్రం హనిమిరెడ్డి, సింగు నరసింహారావు, మామిడిరాము, కె.విజయమాధవి, కె.చిన్నపరెడ్డి, పఠాన్ సైదాఖాన్, ఈమని రాఘవరెడ్డి, బాల వెంకట్రెడ్డి, షేక్ రాజియా బేగం, బాల మురళీకృష్ణ, చదలవాడ రవీంద్రనాథ్, వి.సుబ్బారెడ్డి, దేవరశెట్టి సత్యనారాయణ, సీహెచ్ ధన్వంతరీ భగవాన్, యేటి కోటేశ్వరరావు, పల్లపు మహేష్, వెంకాయమ్మ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పే చంద్రబాబు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన నేతగా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పేరుతో రూ.వేల కోట్లు దోచుకోవడం, అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపడం తప్ప చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రాంబాబుపై దాడితో రాష్ట్రంలో టీడీపీ పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. ఈ నెల 12న తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి ఎదురైందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన వాగ్దానాలు చేసినా అవేవీ సాధ్యం కాదని వైఎస్ జగన్ నాడే చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అదే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ... చంద్రబాబు వాగ్దానాలు అమలు కావని తెలిసే ఎక్కడా వాటి గురించి మాట్లాడలేదన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ తరఫున ప్రజలను చైతన్యం చేసేందుకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో టీడీపీ చేసిన రాజకీయ దాడులు, హత్యలతో అసలైన గొడ్డలి పార్టీగా అదే నిలిచిందని చంద్రబాబు తెలుసుకోవాలని చురకలు అంటించారు. జూలై 29న వినతి యాత్ర తన ఇంటిపై దాడికి తెగబడిన దుండగులపై ఇప్పటివరకు కేసులు లేవని అంబటి అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో నిరసన దీక్ష చేశానని చెప్పారు. జూలై 29న గుంటూరు నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి 29 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి డీజీపీకి వినతి పత్రం సమర్పిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లలో భాగంగా ఈ నెల 12న పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. -
మృతదేహంతో ఇంటి ముందు నిరసన
గుంటూరు రూరల్: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్ మెంట్లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. ఇరువర్గాలు అంగీకరించడంతో వివాదం సర్దుమణిగింది. -
పవర్ లిఫ్టింగ్లో షబీనాకు రజతం
తెనాలి: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 2025–26లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా అద్భుత ప్రతిభతో రజత పతకం సాధించింది. చైన్నెలోని హిందుస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) బే రేంజ్ క్యాంపస్లో ఈ నెల జూన్ 3 నుంచి 8 వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న షబీనా ఈ పోటీల్లో 84 కిలోల కేటగిరీలో తలపడి స్క్వాట్ 210 కిలోలు, బెంచ్ ప్రెస్ 110 కిలోలు, డెడ్ లిఫ్ట్ 207.5 కిలోలతో మొత్తం 527.5 కిలోల బరువులను ఎత్తి రజత పతకం గెలుచుకుంది. ప్రముఖ కోచ్ ఎం.అశోక్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన షబీనా, క్రమశిక్షణతో కూడిన కఠిన సాధనతో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధిస్తుండటం విశేషం. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమాన్కు 3000 మామిడిపండ్లతో మంగళవారం అర్చన నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు 3వేల మామడి పండ్లతో అర్చన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారని ఆయన తెలిపారు. గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగమంటే ఉపాధి మార్గం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్, ఎన్సీసీ తదితర శాఖలలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పొన్నూరు: గణితం, ఆంగ్లం సబ్జెక్టులు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని గుంటూరు ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో జి.ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒకటి, రెండు తరగతులు బాగా చదివితే పై తరగతుల్లో విద్యార్థులు రాణిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జీఎఫ్ఎల్ఎన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి. రాజు, కె.విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయురాలు వి.తులసిరాణి, డీఆర్పీలు శ్రీనివాసమూర్తి, కోటేశ్వరరావు, సద్గుణరావు, లక్ష్మీనారాయణ, పద్మజ, కళ్యాణి, రాంబాబు, దీక్ష కోఆర్డినేటర్లు బి.హనుమంత ప్రసాద్, పి.రవికుమార్ సీఆర్ఎంటీలు, పీటీఐలు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
చేబ్రోలు: న్యాయవాద వృత్తిలో విజయాన్ని సాధించాలంటే కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, పరిశోధనతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం అత్యవసరమని విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’ మంగళవారం కూడా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ దేశంలో సమర్థంగా పనిచేస్తోందని, దానిలో భాగస్వాములైన యువ న్యాయవాదులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయమూర్తులుగా ఎదగడం, మరొకటి కార్పొరేట్ రంగంలో న్యాయ నిపుణులుగా సేవలందించడం అని చెప్పారు. న్యాయమూర్తిగా ఎదగడం కష్టసాధ్యమైన మార్గమైనప్పటికీ, విజయవంతమైతే వందలాది మందికి న్యాయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పటికే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్యూ నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్, నల్లూరి మాధవరావు, కె.కుమార్, నర్రా శ్రీనివాసరావు, విశ్రాంత జిల్లా జడ్జి జీవీ క్రిష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు తుమ్మేటి రమేష్, తుమ్మల శ్రీకుమార్, న్యాయవాదులు సీవీఎల్ఎన్ మూర్తి, బైరపునేని నరేష్, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
12, 14 తేదీల్లో డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి
తెనాలి: పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలను ఈనెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహించనున్నారు. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో జరిగే వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వెంకప్పయ్య కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 10 గంటలకు శాఖాగ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో గల అన్నమయ్య వేదికపై వెలగా–అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఏస్టేట్లోని కుమార్పంప్స్ సత్సంగ్ హాలులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్, మానవత సంస్థ, తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో మొవ్వా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్, ఈఎల్వీ అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్.లావణ్యసుధ, కె.పద్మావతి పాల్గొన్నారు. 14న డాక్టర్ కె.రామ్చంద్కు జీవనసాఫల్య పురస్కారం -
సిరాజ్కు జాతీయ స్థాయి పురస్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. స్టీలు బ్రిడ్జి పనులు ప్రారంభం తాడేపల్లి రూరల్: రాజధాని ముఖద్వారమైన ప్రకాశం బ్యారేజ్ సమీపంలో బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి గతంలో స్వల్పంగా ఒరగడంతో ఆ బ్రిడ్జిలో కొంత భాగాన్ని సీఆర్డీఏ అధికారుల సూచనల మేరకు తొలగించారు. ఆ గడ్డర్లను సరిచేసి బకింగ్హామ్ కెనాల్పై అమర్చేందుకు కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం నాలుగు ఐరన్ గడ్డర్లు బిగించాల్సి ఉండగా సాయంత్రం సమయానికి మూడు గడ్డర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మరో గడ్డర్ను అమర్చి దానిపై కాంక్రీట్ వేసేందుకు ప్రత్యేకమైన రేకులు, స్టీలును అమర్చాల్సి ఉంది. 10–15 రోజుల్లో స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు పలువురు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్ఐ విజయ్కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు. -
గళమెత్తిన న్యాయవాదులు
చీరాల రూరల్: చినగంజాం మండలంలోని అన్ని సివిల్, క్రిమినల్ కేసులను చీరాల కోర్టుల నుంచి పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ బార్ అసోసియేషన్, అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. చినగంజాం మండల సివిల్, క్రిమినల్ కేసులను పర్చూరు కోర్టుకు బదలాయించడాన్ని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల–వాడరేవుపై ధర్నా నిర్వహించారు. న్యాయవాదులు చీరాల కోర్టుల్లోని చినగంజాం కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీనియర్ న్యాయవాదులు శ్రీకాంత్ ఠాకూర్, మిక్కిలి పుల్లయ్య, ఆకిశెట్టి పుల్లయ్య నాయుడు, పింజల ప్రసాద్, గౌరవ రమేష్బాబు మాట్లాడారు. చినగంజాం మండల కేసులను పర్చూరు కోర్టుకు మార్చినట్లయితే ఆయా మండలానికి చెందిన అనేక గ్రామాల కక్షిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడతాయని చెప్పారు. చినగంజాం పరిసర గ్రామాలకు చెందిన కక్షిదారులు పర్చూరు కోర్టుకు వెళ్లాలంటే అనేక వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాలన్నారు. పర్చూరుకు నిరంతరాయంగా బస్సు సౌకర్యం కూడా లేదని, కక్షిదారులు సుమారుగా 60 కిలో మీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుందని తద్వారా వారికి సమయంతో పాటు డబ్బు అధికంగా ఖర్చు అవుతాయని తెలిపారు. చినగంజాం పరిసర గ్రామాల కక్షిదారులు చీరాల చేరుకోవాలంటే అనేక రవాణా సదుపాయాలున్నాయని ముఖ్యంగా రైలుబండ్లు, బస్సులు నిరంతరాయంగా ఉంటాయని దూరం కూడా 20 కిలో మీటర్లులోపే ఉంటుందని వారు తెలిపారు. ఉన్నత న్యాయ స్థానాలు న్యాయం మన ఇంటి ముంగిటకే వస్తుందని చెప్పే మాటలన్నీ నీటి మూటలని ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో ఇలా జరిగితే అప్పుడు కూడా ఉద్యమాలు చేపట్టి చీరాల కేసులు పర్చూరు కోర్టులకు వెళ్లకుండా ఆపగలిగామని చెప్పారు. పర్చూరు కోర్టులో కేసులు తక్కువగా ఉండడం కారణంగానే చినగంజాం మండల కేసులన్నింటిని తరలించే కార్యక్రమాన్ని చేపట్టారని వారు విమర్శించారు. -
గొప్ప జీవన విధానం యోగా
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తాడేపల్లి రూరల్: ప్రపంచానికి గొప్ప జీవన విధానమైన యోగాను అందించినది భారతదేశమని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉద్భవించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన యోగా అని అన్నారు. యోగా అంటే శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), ధ్యానం, వివిధ భంగిమల (ఆసనాలు) ద్వారా శరీరాన్ని, మనస్సును ఏకం చేసే అద్భుతమైన ప్రక్రియ అని తెలిపారు. యోగా చేయడం ద్వారా ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈనెల 13వ తేదీన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పెను భారంగా మారిన ధరలు
లక్ష్మీపురం: ప్రధాని బాధ్యతారాహిత్యం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అసాధారణ రీతిలో పెరిగి సామాన్యులకు భారంగా మారాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆరోపించారు. పెంచిన వీటి ధరలు తగ్గించాలని స్థానిక హిమనీ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చి ప్రజలు వినియోగించే వంట గ్యాస్, ఇంధన ధరలను ప్రభుత్వం పెంచడం దుర్మార్గమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ఎన్డీఏ పాలనలో రూపాయి విలువ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షోభం వచ్చిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచామని ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేజీ బేసిన్లో రాష్ట్రానికి సగం ఉత్పత్తులు ఇవ్వాలని ప్రణాళిక సంఘం చెప్పినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కమిటీ సభ్యుడు నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, సురేష్ బాబు, గుండెబోయిన లక్ష్మి, బి.వెంకటేశ్వర రెడ్డి, చల్ల మరిదాసు, జంగాల చైతన్య, రత్నం, కోట్ల మరిదాసు, రాయల వెంకటేశ్వర్లు, ఆకిటి రామచంద్రుడు, పున్నయ్య, షేక్ వలి, మిరియాల కోటేశ్వరరావు, అప్పమ్మ, రాగం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఉండవల్లి సీఆర్డీఏ గ్రామసభలో గందరగోళం
గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చే లేదంటూ ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కోవద్దని, తాము భూములు ఇవ్వమంటూ స్పష్టం చేశారు. భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఉండవల్లిలో నిర్వహించిన సీఆర్డీఏ గ్రామసభలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని రాజధాని పరిసర ప్రాంతాల్లో వినిపిస్తున్నమాట ఇదే. అంతకుముందు కూడా ఇదే జరిగింది. గత నెలలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించగా అక్కడ కూడా అధికారులకు చుక్కెదురైంది. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. -
‘అది మా 28 ఏళ్ల కష్టం.. కబ్జా చేయడానికి చూస్తున్నారు’
తాడేపల్లి: కూటమి నేతల దౌర్జన్య కాండపై ఓ ఎన్ఆర్ఐ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ 28 ఏళ్ల కష్టాన్ని దోచుకోవడానికి అధికార పార్టీ నేతలు చూస్తున్నారని ఎన్ఆర్ఐ మురళి కుటుంబం.. వైఎస్సార్సీపీని ఆశ్రయించింది. దీనిలో భాగంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్ఆర్ఐ మురళీ భార్య కృష్ణకుమారి మీడియాతో మాట్లాడారు. ‘ 28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం. సినిమా థియేటర్లు, మాల్స్ మేము నిర్మించాం. మా మాల్ ని ఆపేశారు. 90 లక్షలు మేము దాని కోసం అప్పులు చేశాం. మేము మోసం చేసామంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా మాల్ చుట్టూ టెంట్లు వేసి, జనాన్ని పెట్టి బెదిరిస్తున్నారు. మేము పోలీసులు కి ఫిర్యాదు చేస్తే తిరిగి మాపై కేసు పెట్టారు. కోర్టు భద్రత కల్పించమని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. మాకు పోలీసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎవ్వరు రక్షణ ఇవ్వడం లేదు. ఎన్ఆర్ఐలకి ప్రభుత్వం ఇచ్చే సందేశం ఇదేనా?, దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన మద్దతు లేకపోతే ఇది జరుగుతుందా?, మా ప్రభుత్వం లో ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024, ఆగస్టు 4వ తేదీన ఎమ్మెల్యేకి చెప్పాము. వాళ్లంతా కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారు. ఆ మాల్ని లాక్కోవాలని చూస్తున్నారు. నా భర్త దీనికోసం పోరాడుతున్నందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన మీద డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారు. చిలకలూరిపేటలో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ కూటమిలో నేతలు నీచ, నికృష్టంగా ఉన్నారు. విపరీతంగా దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఎన్ఆర్ఐ ఆస్తులను అక్రమిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు బుద్ధి లేకుండా కబ్జాలు చేస్తున్నారు. టెంట్లు వేసి మనుషులను పెట్టి కబ్జా చేశారు. కోట్ల అస్థిని కాజేయాలని పుల్లారావు చూస్తున్నారు. కోర్టు చెప్పినా కూడా ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
ఏపీఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పెదకాకాని: రైతులు ఏపీ ఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు మన గ్రోమోర్, వెనిగండ్ల దనీత్ ఎంటర్ప్రైజెస్ ఎరువులు, పురుగుమందులు షాపుల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఏపీ ఏఐఎంఎస్(వ్యవసాయ సమాచార నిర్వహణ విధానం) యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారానే రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. పంటలు సాగు చేసే రైతులు తమ పంట నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా ఉండేందుకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది రైతుల అవసరాల మేరకు ఎరువుల లభ్యత ఉంటుందని చెప్పారు. రైతులు తమకు ఇష్టమైన ప్రాంతంలోని డీలర్ల ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంటుందని తెలిపారు. వర్షం పడితే పొలాలకు ఎరువులు చేరడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగానే ఎరువులు ఇవ్వాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందించారు. ఈ యాప్ ద్వారా ఆరుగురు రైతులకు 15 బస్తాలు యూరియా ఇచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ కార్యాలయం ఎస్ఈఐటీ సెల్ బాల సుబ్రహ్మణ్యం, ఏడీఏ ఫర్టిలైజర్స్ రాజన్, డీడీ ఫర్టిలైజర్ ఎం.ఆనంద్రావు, వ్యాసర్ ల్యాబ్ హరి, మండల వ్యవసాయ అధికారి రమణకుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మ పీడీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేత్ బాచావో అభియాన్ కార్యక్రమం పెదకాకాని సచివాలయంలో నిర్వహించారు. ఏడీఏ ఎన్ రామ్మోహన్రావు పాల్గొన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ గుంటూరు మెడికల్: బ్రెయిన్ ట్యూమర్లు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉందని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ అన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్మెడికల్ సెన్సెస్ హాస్పటల్లో బ్రెయిన్ ట్యూమర్స్పై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. డాక్టర్ నరేన్ మాట్లాడుతూ కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెదడులో ట్యూమర్ ఎంత వరకు వ్యాపించిందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఎమ్మారై ట్రాక్టోగ్రఫీ నేడు అందుబాటులో ఉందన్నారు. ట్యూమర్ స్వరూపాన్ని కచ్చితంగా నిర్ధారించే న్యూరో నావిగేషన్ గైడెడ్ బయాస్పి వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్లు ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చన్నారు. బ్రెయిన్ ట్యూమర్లు అని క్యాన్సర్కు దారి తీయవని, మెనిమ్జియోమా వంటి కొన్ని ట్యూమర్లను ఆపరేషన్ ద్వారా తొలగిస్తే జీవితాంతం మరలా రావని సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు అన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూష మాట్లాడుతూ తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ లక్షణం కాదని, తలనొప్పితోపాటు ఇతర నాడి సంబంధిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ ప్రారంభ దశలో ట్యూమర్లను గుర్తిస్తే కేవలం ఆపరేషన్ ద్వారానే 90 నుంచి 95 శాతం విజయవంతంగా నయం చేయవచ్చు అన్నారు. అవగాహన సదస్సులో 300 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు. బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన సోమవారం కొనసాగాయి. తొలి ప్రదర్శనగా ఆరభి యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్, రాప్తాడు వారి ‘డొక్కా సీతమ్మ’ నాటికను ప్రదర్శించారు. ఆముదాల సుబ్రమణ్యం రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మగా భావిక, పెద్ద సీతమ్మగా యశోదమ్మ, ఇతర పాత్రల్లో బాషా, అరుణ్బాబు తదితర 30 మందికి పైగా నటీనటులు నటించారు. తదుపరి గర్తపురి థియేటర్ ఆర్ట్స్, గుంటూరు వారి ‘5జీ కపుల్స్’ నాటికను ప్రదర్శించారు. ఎస్కేడీ హస్సన్ రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. చివరగా ఎన్ఎంఆర్ క్రియేషన్స్, అనకాపల్లి వారి ‘వేదాంతం’ నాటికను ప్రదర్శించారు. ప్రఖ్యాత సాహితీవేత్త గుడిపాటి వెంకటాచలం మూలకథకు మార్గశీర్ష నాటకీకరించగా, ముత్యాలరావు పొన్నాడ దర్శకత్వం వహించారు. తొలినాటిక ప్రఖ్యాత సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మ జీవితానికి సంబంధించినది కాగా, ఇతర నాటికలు సందేశాత్మక ఇతివృత్తంతో సాగాయి. -
గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే కఠిన చర్యలు
నగరంపాలెం: జిల్లాలో ఎవరి దగ్గరైనా గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గుంటూరు తూర్పు సబ్ డివిజన్లోని కొత్తపేట పీఎస్, పాతగుంటూరు పీఎస్, లాలాపేట పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి నేరస్తులకు సోమవారం బీఆర్ స్టేడియంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, గంజాయి కేసుల్లోని నేరస్తులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం ఏయే పనులకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ నివసిస్తున్నారనే అంశాలపై ఆరాతీశారు. ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తూర్పు సబ్ డివిజన్లోని రౌడీషీటర్స్, పాత గంజాయి కేసులున్న 120 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ (డిడికె)తో పరీక్షలు నిర్వహించగా అందులో 17 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు వీరయ్య (కొత్తపేట పీఎస్), వెంకటప్రసాద్ (పాత గుంటూరు పీఎస్), ఎస్ఐలు రెహమాన్ (పాతగుంటూరు పీఎస్), రవి (లాలాపేట పీఎస్) సునీల్ (ఈగల్ ఆర్ఎస్ఐ) పాల్గొన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,200, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. 7 -
రెవెన్యూ క్లినిక్స్పై సీఎస్ ఆరా
సిబ్బందికి సున్నితంగా హెచ్చరికలు గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికంలో భాగంగా స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సందర్శించారు. వచ్చే అర్జీలు, వాటి అప్లోడ్ విధానం, అధికారులు ఇచ్చే పరిష్కార మార్గాలు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి ఆయన కొంతమంది బాధితులతో మాట్లాడి. పరిష్కార మార్గాలను అధికారులకు సూచించారు. పాత రికార్డులు అడగవద్దు 1900 నాటి రికార్డుల కోసం అర్జీదారులను ఇబ్బంది పెట్టద్దని అధికారులకు సీఎస్ సూచించారు గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 1239లో ఎకరం 69 సెంట్లు రిజిస్టర్ భూమిని తొమ్మిది మంది కలిసి కొనుగోలు చేశామని, ఆ తర్వాత వాగు పోరంబోకుగా తేల్చి 22/ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆ ప్రాంతవాసులు పశ్చిమ మండల అధికారులకు అర్జీ అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న నివాసాలను కూల్చివేస్తున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. భూమి డాక్యుమెంట్లు 1900 సంవత్సరం నుంచి కావాలని అధికారులు అడగగా అక్కడే ఉన్న సీఎస్ స్పందించారు 1900 రికార్డులు వారి దగ్గర ఎలా ఉంటాయని, ఒకవేళ అవి తెస్తే మొగలుల కాలంనాటి రికార్డులు అడుగుతారా అని సిబ్బందికి చురకలంటించారు. అధికారులు ఉక్కిరి బిక్కిరి సీఎస్ సాయి ప్రసాద్ రావడం, అక్కడే మూడు గంటలపాటు ఉండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎస్ రెవెన్యూ క్లినిక్కు వచ్చే సమస్యలు వాటి అప్లోడ్ వంటి వివరాలను తెలుసుకునేందుకు వచ్చానని మీరు కంగారు పడకండి అని సిబ్బందికి ధైర్యం నింపారు. ముఖ్యంగా కొత్తగా తహసీల్దార్ బాధ్యతలు తీసుకునేవారు గతంలో ఉన్న భూ సమస్యల కేసులను స్టడీ చేయాలని సూచించారు. సర్వేలో ప్రైవేటు వ్యక్తుల జోక్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎస్ రావటం అదే సమయంలో యువతి ఆత్మహత్య, కరెంటు కోత వంటి ఘటనలతో అధికారులు ఇబ్బంది పడ్డారు. -
చిట్టీల పేరిట మోసగించారు
ఎస్పీకి నివేదించిన బాధితులునగరంపాలెం(గుంటూరు వెస్ట్) : చిట్టీల పేర్లతో మోసగించారంటూ పలువురు బాధితులు వాపోయారు. సోమవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు.ఆయా సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదిదారుల సమస్యలపై వెంటనే విచారణ చేపట్టాలని అన్నారు. తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), మధుసూదన్రావు (సీసీఎస్)లు అర్జీలు స్వీకరించారు. -
రెడ్బుక్ రాజ్యాంగం మేరకే బొల్లా అక్రమ అరెస్టు
నరసరావుపేట: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అక్రమ అరెస్టును గమనిస్తే ఆంధ్రాలో మాదిరిగానే చంద్రబాబునాయుడు శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేశారనిపిస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బాధితులపైనే కేసు పెట్టడమంటే కూటమి ప్రభుత్వం డైరెక్షన్లోనే రేవంత్రెడ్డి నడుస్తున్నాడన్నారు. కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన బొల్లాను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయటం అనైతికం అన్నారు. బొల్లా కుటుంబానికి పార్టీ, ఎస్సీ సెల్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు బొల్లా అండగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడుతూ ఒక తప్పుడు ఫేక్ కేసుతో బొల్లాను అరెస్టు చేశారన్నారు. బొల్లాకు 70 ఏళ్ల వయస్సుతో పాటు గుండె ఆపరేషన్ జరిగిందని, భూమి కొనుగోలులో బాధితుడైన బొల్లాను అరెస్టు చేయటం హేయం అన్నారు. తమ పార్టీ సమస్యలు, బెదిరింపులకు భయపడే పార్టీ కాదన్నారు. ఎదురెళ్లి ధమ్ము, ధైర్యంతో పోరాటం చేస్తోందని, కడిగిన ముత్యంలా బొల్లా బయటకు రావటం ఖాయమన్నారు. పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. -
ఆగస్టులో ప్రత్యేక అదాలత్
గుంటూరు లీగల్: సమాధన్ సమరో–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగష్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ షేక్ సికిందర్ బాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ సుప్రీంకోర్టులోనే నిర్వహిస్తారని, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో పరిశీలన కోసం, అంగీకార పత్రాలను సమర్పించడానికి గడువును 2026 జూలై 31వరకు పొడిగించారని తెలిపారు. లోక్ అదాలత్ ఫారాలు, హెచ్టీటీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీఐ.జీవోవి.ఇన్ సుప్రీంకోర్టు వెబ్ సైట్లోను, జిల్లా కోర్టు వెబ్సైట్లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–2224886లలో సంప్రదించవచ్చునని తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ పీ సెట్–2026 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 499 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 333 మంది హాజరయ్యారని ఏపీ పీ సెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న ఏపీ పీ సెట్ పరీక్షలకు 2858 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2147 మంది హాజరయ్యారు. అలానే 1179 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 813 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, సెటిల్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో ఆదివారం జరిగిన మూడవ ఏపీ స్టేట్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 17 మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా పికిల్ బాల్ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్య, కార్యదర్శి జీఎస్ ప్రసాదులు అభినందించారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులో జరిగే సౌత్ జోన్ పికిల్ బాల్ పోటీల్లో మెడల్ సాధించి జిల్లాకు కీర్తి ప్రతిష్టను సాధించాలని కోరారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఏవిధంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. రోగు లు, ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి కేస్ షీట్లు పరిశీలించి, రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తనిఖీలు చేశారు. గర్భిణులు, చిన్నా రులకు వైద్యసేవలు అందుతున్న తీరును పరిశీలించారు. మార్చురీని సైతం తనిఖీ చేసి మార్చురీలో ఏసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాలు పరిశీలించారు. తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సతీష్కుమార్ ఉన్నారు. -
బాధితులకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలి
దుగ్గిరాల: శుభం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వం వాగ్దానం మేరకు క్వింటాకు రూ.7వేలు పరిహారం వడ్డీతో సహా చెల్లించాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం దుగ్గిరాలలోని పసుపు యార్డు ముట్టడి కార్యక్రమం సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా యార్డుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో పసుపు రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు. ముందుగా యార్డు బయటకు వెళ్లే మార్గంలో బైటాయించారు. రైతులను ఉద్దేశించి శివశంకర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పసుపు ఽక్వింటాకు రూ.13,400 ఉండగా, ప్రభుత్వం రైతులు, వ్యాపారులతో చేసిన ఒప్పందం ప్రకారం రూ.7 వేలు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలు గడిచినా పసుపు రైతులకు పూర్తి పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ నిల్వ చేసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పసుపు దగ్ధం కావడానికి కారణమైన యజమానిని కఠినంగా శిక్షించాలని కోరారు. యార్డు ఇన్చార్జి కార్యదర్శి డి.చిన సుబ్బారావుకి వివతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానిని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వల్లూరి భారతి, గద్దె శ్రీహరి, కాజా వెంకటేశ్వరరావు, జెట్టి బాలరాజు, పి.రవికిషోర్, బి.చిన్న వెంకటరెడ్డి, ఎన్.యోగేశ్వర రావు, ఎస్.ఆంజనేయులు పాల్గొన్నారు. -
జిల్లాలో సగటున 11 మి.మీ వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మేడికొండూరు మండలంలో 36.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా కొల్లిపర మండలంలో 1.6 మి.మీ వర్షం కురిసింది. సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిరంగిపురం మండలంలో 19.2 మి.మీ., పెదకాకాని 16.2, మంగళగిరి 14.8, గుంటూరు పశ్చిమ 14.6, వట్టిచెరుకూరు 12.4, తాడికొండ 11.6, గుంటూరు తూర్పు 11.4, చేబ్రోలు 10.2, తాడేపల్లి 9.2, కాకుమాను 8.2, దుగ్గిరాల 7.4, పెదనందిపాడు 6.2, తెనాలి 5.6, ప్రత్తిపాడు 4.6, పొన్నూరు 4.6, తుళ్లూరు మండలంలో 4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం బంగారు దుకాణాల సముదాయం గంటాలమ్మ చెట్టు ఏరియాలో ఉంటున్న పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్ జిల్లా దాస్పూర్ గ్రామ వాసి బవానందదాస్ (72) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తలనొప్పితో బాధపడుతున్న అతను కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మధ్యాహ్నాం అతను ఇంటి పైభాగంలోని స్టోర్లో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుమార్తె రూపాలి దాసు ఫిర్యాదుతో లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: అత్యంత క్లిష్టమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే ఎక్ట్స్రా కార్బొరియల్ మోంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఏక్మో) సేవలు తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చినట్లు కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ డాక్టర్ లోకేష్ గుప్తా తెలిపారు. సోమవారం మణిపాల్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ లోకేష్ గుప్తా మాట్లాడుతూ అమరావతి ప్రాంతం తుళ్లూరుకి చెందిన గుమ్మా వెంకటరావు అత్యంత విషమ పరిస్థితుల్లో మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిపారు. రోగికి ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోయిందని, వివిధ రకాల పరీక్షల అనంతరం రోగికి హార్డ్స్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. వెంటిలేటర్ సహాయం, ప్రోన్ పొజిషనింగ్, యాంటీ బయాటిక్స్, అన్ని రకాల అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోగా మరింత దిగజారిందని వివరించారు. రోగికి సాధారణ చికిత్సలు ఫలితం ఇవ్వకపోడంతో ‘ఏక్మో’ సపోర్ట్తో వైద్యం ప్రారంభించారని, తాత్కాలికంగా ఊపిరితిత్తులు పనిని నిర్వహిస్తూ అవి కోలుకొనే సమయాన్ని కల్పించినట్లు తెలిపారు. 27 రోజులు రోగికి ఐసీయూలో చికిత్స అందించామని, చికిత్స సమయంలో భారీగా రక్తస్రావం జరిగిందని, వెంటనే రిజిడ్ బ్రోంకోస్కోపి నిర్వహించామని పేర్కొన్నారు. శ్వాసనాళానికి అడ్డుగా ఉన్న పెద్ద రక్తపు గడ్డలను తొలగించామని, రెండు వారాల పాటు ఏక్మో సపోర్ట్, నిరంతర పర్యవేక్షణ, రెస్పిరేటరీ రిహాబిలిటేషన్, ఫిజియోథెరపి వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సమగ్ర చికి త్స అందించామని వివరించారు. ప్రస్తుతం రోగి స్పృహలో ఉండి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండడం వలన ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ దినేష్కుమార్ గొంట్ల, టి.శ్రీనివాస్, దిలీప్ రట్టి, వరుణ్ పమ్మిడి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ... దేవుడితో రాజకీయాలా ?
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కాలనీల్లో వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను నిర్మించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన చర్యలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బ్రాహ్మణ విభాగ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. సోమవారం గుంటూరులోని బృందావన్గార్డెన్స్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై అమితమైన భక్తి, శ్రద్ధలతో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 216 ఆలయాలను పునరుద్ధరించి, పూర్వ వైభవం కల్పించారని చెప్పారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 1,342 శ్రీవారి దేవాలయాలను నిర్మించేందుకు గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిలిపివేసిందన్నారు. వీటిలో తిరుపతి జిల్లాలోనే 135 ఆలయాలు ఉన్నాయని తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆలయాలకు సంబంధించి యూసీలు లేవనే సాకుతో రూ.147 కోట్లు విడుదల చేయకుండా అడ్డుకుంటోందని, సంబంధిత యూటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దేవదాయ శాఖ సిద్ధంగా ఉన్నా సీఎం చంద్రబాబు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామన్న పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం తగదన్నారు. దేవుడితో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవని, ఆలయాల జోలికి రావొ ద్దని హెచ్చరించారు. రాజధాని నిర్మాణానికి భూ ములిచ్చిన రైతులకు దేవదాయ శాఖ భూము లను చదునుచేసి ప్లాట్లుగా ఇచ్చేలా టీడీపీ సర్కారు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లు వరుసగా రూ.22 కోట్లు, రూ.23 కోట్లు కేటాయించారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణమాచారి మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్)లో బ్రాహ్మణులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. -
కూటమి ప్రభుత్వం పనైపోయింది
తెనాలి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనైపోయిందని, రానున్నది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది గ్రహించినందునే చంద్రబాబు గొడ్డలి పార్టీ అంటూ దుష్రచారం చేస్తున్నారనీ, ఆయన తనయుడూ, విద్యాశాఖ మంత్రి ‘దగా డీఎస్సీ’పై నోరెత్తటం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ బహిరంగసభ సోమవారం స్థా నిక ఎం.కన్వెన్షను హాలులో నిర్వహించారు. పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల హామీలను నెరవేర్చకుండానే చంద్రబాబునాయుడు అమలుచేశానని చెబుతూ ప్రజలను వెన్నుపోటు పోడిచాడని విమర్శించారు. వెన్నుపోటు పదం ఆయనతోనే వచ్చిందనీ, వెన్నుపోటుతోనే ఆయన అధికారంలోకి వచ్చా డని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ స్వచ్ఛంగా ప్రజాక్షేత్రంలోంచి అధికారాన్ని చేపట్టిందని స్పష్టంచేశారు. పొత్తులేనిదే బాబు గెలవలేడు సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయలేదని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ మినహా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ ఇద్దరూ కూటమిలో ఉన్నారని గుర్తుచేశారు. తాడేపల్లి నుంచి తెనాలికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో వచ్చారని మంత్రి మనోహర్ చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కరకట్ట ప్యాలెస్ నుంచి సచివాలయానికి హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు గురించి మాట్లాడరేమని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు, నియోజకవర్గ పరిశీలకుడు కాకుమాను సదాశివరెడ్డి, తెనాలి, కొల్లిపర ఎంపీపీలు ధర్మరాజుల చెన్నకేశవులు, భీమవరపు పద్మావతి, పార్టీ బూత్కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణకిషోర్రెడ్డి, ప్రసాదం సురేష్, మర్రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, బూరెల నాంచారమ్మ, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి,శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, గోల్డ్ రహిమా, కొడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, టి.యల్లమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయ్నాయుడు, అవుతు శేఖర్రెడ్డి, కోలా వాసు, షేక్ వాసు, బొంతు గోపిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, కొర్ర యశోద, షేక్ దుబాయ్బాబు, నిట్టా బాలు, పి.అశోక్, కిరణ్కుమార్రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు మూడేళ్ల ముందే కూటమి ప్రభు త్వం గ్రాఫ్ పడిపోయిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇది గ్రహించిన చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిది గొడ్డలి పార్టీ అంటూ అన్పాపులర్ చేయాలని చూస్తున్నారని, అది ఆయ న వల్లకాదన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెడితే సంగతేంటో తేలిపోతుందన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసం చేసి అధికారంలోకి రావటం మినహా రుజుమార్గంలో ఏనాడూ రానేలేదని అంబటి రాంబాబు విమర్శించారు. మరోవైపు ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నట్టు చెబుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు కేఎన్నార్పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీని అణచాలని ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యం కాదన్నారు. క్రీడాకోటా శాతాన్ని ముందే పెంచుకుని దొంగ సర్టిఫికెట్లతో మెగా డీఎస్సీలో 421 పోస్టులు రిక్రూట్మెంట్ చేశారని ఆరోపించారు. ఈ మోసం విద్యార్థిలోకం ఉద్యమిస్తుంటే సంబంధిత శాఖామంత్రి నారా లోకేశ్ తేలుకుట్టిన దొంగలా మాట్లాడటం లేదన్నారు. లింగమనేని రమేష్ అక్రమ కట్టడంలో తండ్రీకొడుకులు ఉంటూ, ఆయన్ను జనసైనికుడుగా రాజ్యసభకు పంపుతున్నారని చెప్పారు. ఇందుకు ‘కలెక్షన్ కింగ్’ వంతపాడుతున్నారని అన్నారు. ఇల్లిస్తే, స్థలమిస్తే రాజ్యసభకు అర్హతగా తేల్చారని చెబుతూ జగన్మోహన్రెడ్డి పార్టీలో కష్టపడినవారినే రాజ్యసభకు పంపారని రాంబాబు గుర్తుచేశారు. -
మెగా కాదు దగా డీఎసీ
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన గుంటూరు వెస్ట్: ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం చేసే విధంగా మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు జి.సురేంద్ర డిమాండ్ చేసారు. బాధితులతో కలిసి సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో దళిత కుటుంబాలకు చెందిన కర్రా బేబి, మేడిద సుధారాణిలకు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు, రాష్ట్ర స్థాయిలో 140,143 ర్యాంకులు వచ్చాయన్నారు. వీరికి ఉద్యోగం ఇవ్వకుండా క్రీడా కోటా కింద ఇతరులకు ఉద్యోగాలివ్వడమేంటో అర్ధం కావడంలేదన్నారు. ఇద్దరు దళిత యువతులకు ఇక్కడే అన్యా యం జరిగిందన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంత అన్యాయం చేసారో గమనించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా కోటాలో 400 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్నారు. ఆ వివరాలు అడిగితే సమాధానం చెప్పడంలేదన్నారు. ప్రశ్నిస్తే దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు డీఎస్సీ ఎంపిక ప్రక్రియ విషయంలో ప్రశ్నించే వారిని దుర్మార్గులుగా చిత్రీకరించే యత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రశ్నా పత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా ఎంపిక తదితర అంశాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అనేక మంది అభ్యర్ధులు డీఎస్సీలో ఎంపికవుదామని అహర్నిశలు కష్టపడి చదువుకుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రతి అంశంలో ముందుకు వచ్చే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మాట్లాడడంలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేదిలేదన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న బాధితుల తరపున వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని సురేంద్ర హెచ్చరించారు. అది దగా డీఎస్సీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పెద్ద దగా డీఎస్సీగా వర్ణించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పూర్తి వైఫల్యం చెందారన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ప్రతిభకు ప్రభుత్వం నిలు వునా పాతరేసిందన్నారు. ఎందరో ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు వీరికి ఎవరి చ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల తరపున రాజీలేని పోరాటానికి సిద్ధపడ్డారని ఆయనకు అండగా రాష్ట్ర యువత నిలుస్తుందని చెప్పారు. పార్టీ ఎస్సీ విభాగం పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు జి.ప్రభు, అంకాల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, పార్టీ ఎస్సీ విభాగం నేతలు పున్నారావు, సిహెచ్ కిరణ్, టి.నాని, గేరా సంజీవ్, పి.కవిత, ఆర్.వరలక్ష్మి, పిల్లి మేరి, బత్తుల వెంకట్, జల్ది స్వామినాథన్ పాల్గొన్నారు. -
లోతైన అధ్యయనం చేయాలి
చట్టంలోని నిబంధనలు చేబ్రోలు: కోర్టులో తుది తీర్పు వెలువడే వరకు పక్షాల హక్కులను రక్షించేందుకు ఇంటర్ లాక్యుటరీ అప్లికేషన్స్ కీలక సాధనాలు, న్యాయవాదులు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సమర్థవంతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీహెచ్ఆర్సీ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మరియు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల ‘‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’’ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులను ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి, మాజీ ఏపీహెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య కలిసి ప్రారంభించారు. జస్టిస్ సీతారామమూర్తి మాట్లాడుతూ ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్స్ దాఖలు చేసే సమయంలో న్యాయవాదులు చట్టంలోని నిబంధనలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఏఐ యుగానికి న్యాయవాదులు సిద్ధం కావాలి విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ నేటి ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం న్యాయవృత్తిపైనా స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు అనుగుణంగా న్యాయవాదులు సిద్ధం కావాలని అన్నారు. భవిష్యత్ న్యాయరంగం, సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ నేరాలు, మానవ విలువల ప్రాధాన్యతపై విశదీకరించారు. కృత్రిమ మేధస్సు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా వైద్యం, విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, పరిపాలనతో పాటు న్యాయరంగంలోనూ వేగంగా ప్రవేశిస్తోందన్నారు. న్యాయపరమైన పరిశోధనలు, కేసుల విశ్లేషణ, చట్టాల అధ్యయనం, తీర్పుల అన్వేషణ, పత్రాల తయారీ వంటి అనేక అంశాల్లో ఇప్పటికే ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు కూడా తమ పనితీరును ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో సాంప్రదాయ నేరాల కంటే సైబర్ నేరాలే పెద్ద సవాలుగా మారనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జీ. ప్రతిభాదేవి, ఏఐఎల్యూ అఖిల భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, బెజవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి లక్ష్మీ నారాయణ, ఎం నాగేశ్వరరావు, ఏఐఎల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
రూ.25 కోట్ల భూమిలో పాగా.. కోర్ క్యాపిటల్లో స్కూల్ స్థలం కబ్జా
తాడికొండ: గుడి.. బడి అనే తేడా లేకుండా రాష్ట్రంలో పచ్చముఠాలు సాగిస్తున్న భూ దందాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడి కబ్జాలకు ఇది మరో నిదర్శనం! రాజధాని ప్రాంతంలో అసైన్డ్, లంక భూముల నుంచి చివరకు పాఠశాలల దాకా ఈ కబ్జాల కాండ విస్తరించింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ పరిధిలోని ఓ పాఠశాల స్థలాన్ని స్థానిక మండల టీడీపీ నేత కబ్జా చేయడం గమనార్హం. రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం జెడ్పీ హైస్కూల్కు చెందిన అత్యంత విలువైన స్థలంపై కన్నేసిన ఆ టీడీపీ నేత తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ఆయన దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేసినా బుట్టదాఖలు చేయిస్తున్నారు. మురుగు వెళ్లే దారిలేక.. మందడం జిల్లా పరిషత్ హైస్కూల్కు పూర్వం దాతలు ఇచి్చన 4.10 ఎకరాలతోపాటు పంచాయతీ తీర్మానం ద్వారా కేటాయించిన ఎకరం పొలంతో కలిపి మొత్తం 5.10 ఎకరాల స్థలం ఉంది. సచివాలయానికి కేవలం అర కిలోమీటరు దూరం లోపే ఉన్న ఈ ప్రాంతంలో ఎకరం రూ.25 కోట్ల వరకు పలుకుతోంది. పాఠశాలకు చెందిన ఎకరం స్థలాన్ని టీడీపీ నేత కబ్జా చేయడంతో మురుగు బయటకు వెళ్లే దారి లేక ఆవరణ చెరువులా మారింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. 2017–18లోనూ టీడీపీ నేత కబ్జాలపై ఓ హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ భూమి జోలికి రానని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే మరోసారి బరి తెగించాడు. చినబాబూ.. ఇకనైనా స్పందించండి! పాఠశాల స్థలం ఆక్రమణపై గ్రామానికి చెందిన పలువురు సీఆర్డీఏ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఎక్కువగా పేద విద్యార్థులు చదువుకునే జడ్పీ హైస్కూల్కు చెందిన విలువైన స్థలం కబ్జా వెనుక పెద్దల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఫిర్యాదు చేయడం.. అధికార యంత్రాంగం బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. సచివాలయానికి పక్కనే ఉన్న పాఠశాల స్థలం కబ్జాపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. బాధితులకు విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు అండగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.కాగా, ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్ర సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి -
ఏడాదిగా తలనొప్పి, చూపు మసక : బహుపరాక్
World Brain Tumour Day 2026 బాపట్ల జిల్లాకు చెందిన ఎస్.శ్రీహరి ఏడాదిగా తలనొప్పి, చూపు మసకగా కనిపించం లాంటి లక్షణాలతో బాధపడుతూ పలు ఆస్పత్రులు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. చిట్టచివరకు గుంటూరులో న్యూరోసర్జరీ వైద్యులను సంప్రదించగా తలలో గడ్డ ఉందని( బ్రెయిన్ట్యూమర్) నిర్ధారించి ఆపరేషన్ చేసి తలలో ఉన్న గడ్డను తొలగించారు.ఆధునిక జీవనశైలి వల్ల బ్రెయిన్ ట్యూమర్లు పెరిగిపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లను సకాలంలో గుర్తించక పోవటంతో అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెద్దవారితోపాటుగా చిన్నపిల్లల్లోనూ ట్యూమర్స్ కనిపిస్తూ ఉండటంతో ప్రతిఒక్కరు వ్యాధి పట్ల అవగాహన కల్గి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!బాధితులకు చికిత్స ఎలా..? బ్రెయిన్ ట్యూమర్ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం న్యూరోసర్జరీ వైద్య నిపుణులు, న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్నారు. జిల్లాలో 20 మంది న్యూరోసర్జన్లు, 25 మంది న్యూరాలజిస్టులు ఉన్నారు. వారంలో ఇరువురు లేదా ముగ్గురు బ్రెయిన్ ట్యూమర్స్ సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో న్యూరోసర్జరీ వైద్య విభాగంలో ప్రతినెలా 20 మందికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు చేస్తున్నారు. న్యూరో సర్జరీ వైద్య విభాగంలో 2023లో 2,011 మంది, 2024లో 2,603 మంది, 2025లో 8,795 మంది, 2026 జనవరి నుంచి మే వరకు 4597 చికిత్స పొందారు. న్యూరాలజీ వైద్య విభాగంలో 2023లో 16,176 మంది, 2024లో 40, 381 మంది, 2025లో 50994 మంది, 2026లో జనవరి నుంచి మే వరకు 21937 వివిధ రకాల బ్రెయిన్ సంబంధిత సమస్యలతో చికిత్స పొందారు. లక్షణాలు... బ్రెయిన్లో సర్వసాధారణంగా సెల్స్ చనిపోయి కొత్తవి పుట్టుకొస్తుంటాయి. కొన్ని సమయాల్లో కణాలు చనిపోకుండానే కొత్తకణాలు పుట్టుకొచ్చి కొత్తగా వచ్చిన కణాలు ట్యూమర్గా(గడ్డ) మారతాయి. కొన్ని గడ్డలు క్యాన్సర్గా మారి ప్రాణాలు తీస్తాయి. కొన్ని గడ్డలు ప్రమాదకరమైనవి కావు. ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో విపరీతమైన తలనొప్పి ఉండడం, వాంతులు అవ్వగానే తలనొప్పి తగ్గటం జరుగుతుంది. ఎక్కువగా ఉదయం వేళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. మాట్లాడటం కష్టంగా ఉంటుంది. వినికిడి సమస్య, చూపు మసకబారటం, నడవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ సైజును బట్టి, అది బ్రెయిన్లో ఏర్పడిన ప్రదేశం బట్టి, ట్యూమర్ రకాన్ని బట్టి లక్షణాలు ఒక్కో మనిషిలో ఒక్కో రకంలా కనిపిస్తాయి. ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్బ్రెయిన్ ట్యూమర్కు కారణాలు... బ్రెయిన్ ట్యూమర్లు జన్యుపరలోపాల వల్ల, వంశపారంపర్యంగా వస్తాయి. బ్రెయిన్కు రేడియేషన్ సోకటం వల్ల, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వల్ల రేడియేషన్ సోకి మెదడులో గడ్డ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి.జీజీహెచ్లో ఉచిత ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలను చేస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటల నుంచి ఎనిమిదిగంటల వరకు సమయం పడుతుంది. సుమారు రూ.3లక్షల ఖరీదు చేసే ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేస్తున్నారు.ఆధునిక సర్జరీలతో మెరుగైన జీవితం... బ్రెయిన్ సర్జరీలు గతంలో ఆరు గంటలకు పైగా సమయం పడితే ఆధునిక టెక్నాలజీ వల్ల నేడు కేవలం అరగంటలోనే పూర్తి చేస్తున్నాం. ఒకరోజు పట్టే ఆపరేషన్లు సైతం గంటలోనే పూర్తి చేస్తున్నాం. ఎండోస్కోపిక్ సర్జరీలు, కీహోల్ సర్జరీలు, నేవిగేషన్ గైడెడ్, మైక్రోస్కోపిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. న్యూరోసర్జరీలో వచ్చిన ఆధునిక వైద్య పద్ధతులతో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించుకున్న వారు గతంలో కంటే చాలా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. ఆధునిక వైద్యం ద్వారా నూటికి 95శాతం రోగికి మంచి జీవితాన్ని ప్రసాదించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్లో నూటికి 10శాతం మాత్రమే ప్రాణాంతకమైనవి. – డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, న్యూరోసర్జన్ ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు... బ్రెయిన్ ట్యూమర్లను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ప్రాథమిక దశలోనే తలలో గడ్డలను గుర్తిస్తే ఆపరేషన్లతో పనిలేకుండా మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. అన్ని ట్యూమర్లకు ఆపరేషన్లు చేయాల్సిన పనిలేదు. జనాభాలో ఒకశాతం మంది బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడుతున్నారు. ప్రజలకు బ్రెయిన్ ట్యూమర్స్పై అపోహలు చాలా ఉన్నాయి. అవగాహన చాలా తక్కువగా ఉంది. – డాక్టర్ పమిడిముక్కల విజయ, న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు -
యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
సెన్సారు బోర్డు సభ్యురాలిగా యార్లగడ్డ శైలజ
తెనాలి: దూరదర్శన్ విశ్రాంత డెప్యూటీ డైరెక్టర్ (ప్రోగ్రామ్స్) యార్లగడ్డ శైలజ కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. సెంట్రల్బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యురాలిగా, హైదరాబాద్ రీజియన్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారు. సొంతూరు రూరల్ మండలం గుడివాడ యార్లగడ్డ శైలజ సొంతూరు తెనాలి రూరల్ మండల గ్రామం గుడివాడ. తల్లిదండ్రులు పిన్నక వెంకటేశ్వరరావు తెలుగు పండితులు. అమ్మ చారుమతి హార్మోనియం ప్లేయర్. తెనాలిలో బీఎస్సీ, భీమవరంలో ఎంఏ (తెలుగు) చదివాక, మీడియాపై ఆసక్తితో 1984లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో టెలివిజన్ ప్రోగ్రాం ప్రొడక్షన్ కోర్సు చేశారు. అనంతరం హైదరాబాద్లోని దూరదర్శన్ కేంద్రంలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా ఉద్యోగజీవితం ఆరంభించారు. 1990–99 వరకు కర్ణాటకలోని గుల్బర్గా దూరదర్శన్లో పనిచేశారు. అక్కడ్నుంచి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా పదోన్నతిపై విజయవాడ దూరదర్శన్ కేంద్రానికి బదిలీపై వచ్చారు. 2005లో మళ్లీ పదోన్నతిపై డెప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే 2015లో రిటైరయ్యారు. విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన దూరదర్శన్లో విభిన్న కార్యక్రమాలు, డాక్యుమెంటరీల రూపకల్పన చేశారు. 1992–93లో ఉత్తమ టీవీ ప్రొడ్యూసర్గా ఈసీటీవీ అవార్డు అందుకున్నారు. ‘పెంబర్తి కళారూపాలు’పై చేసిన డాక్యుమెంటరీకి 1994లో రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు దక్కింది. శైలజ రూపొందించిన ‘మనసంటూ ఉంటే’ ఉత్తమ మహిళా కార్యక్రమంగా 2001లో దూరదర్శన్ జాతీయ అవార్డు లభించింది. కలంకారి కళపై తీసిన డాక్యుమెంటరీకి కూడా అదే ఏడాది దూరదర్శన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. వరించిన బంగారు నంది క్లిష్టమైన శాసీ్త్రయ నాట్యాన్ని సాధారణ ప్రజలకు కూడా అర్థమయేలా 2005లో ‘మువ్వల సవ్వడి’ని రూపొందించారు. వంద ఎపిసోడ్లుగా ప్రసారం చేసిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపుతోపాటు 2007లో బంగారు నందిని అందుకున్నారు. ఇందులోనే రిలేటివ్ స్పెషల్, తర్వాత 15 ఏళ్ల బాలల కోసం ‘చిరుమువ్వల సవ్వడి’ని రూపొందించి మరో వంద ఎపిసోడ్లను ప్రసారం చేశారు. ఈ పరంపరంలోనే ‘గానగంధర్వం’ మరో యాభై ఎపిసోడ్లు వచ్చింది. రైతుల కోసం ‘రైతే రాజు’, ‘గామదర్శిని’ తీసుకొచ్చారు. ప్రసారభారతి ప్రారంభించిన ‘ఇండియా ఇన్నోవేషన్స్’లో భాగంగా చింతకింది మల్లేశం, బొమ్మగాని మల్లేష్ వంటి సృజనకారుల్ని పరిచయం చేశారు. రిటైరయ్యాక 2016 నుంచి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఓ విభాగానికి అధిపతిగా ఉంటున్నారు. ఇప్పుడు కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా మరో బాధ్యతల్లోకి వచ్చారు. -
మోటరోలా సొల్యూషన్స్ ఎండీ, కంట్రీ హెడ్గా అనుదీప్
తెనాలి: మోటరోలా సొల్యూషన్స్లో ఆర్నెల్ల క్రితం అతి పిన్నవయసులోనే సీనియర్ డైరెక్టర్గా ఎదిగి, భారత ప్రభుత్వంచే ‘యూత్ ఐకాన్–2025’ గౌరవాన్ని స్వీకరించిన ముత్తవరపు అనుదీప్ ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా, కంట్రీ హెడ్, ఇండియాగా పదోన్నతిని పొందారు. తన కార్యస్థానం అమెరికా నుంచి బెంగళూరుకు మారింది. దేశం అంతటా కంపెనీ ఉనికిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తారు. అనుదీప్ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ చేశాడు. అమెరికాలోనే డల్లాస్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో టెలీకమ్యూనికేషన్స్లో మరో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశాడు. తదుపరి ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కాలేజిల్లో ఒకటిగా, అమెరికాలో సెకండ్ ర్యాంకులో ఉన్న నార్త్వెస్టర్న్ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేరిన పదేళ్లలోనే ఫార్ూచ్యన్ 500 కంపెనీల్లో ఒకటైన మోటారోలాలో అతి పిన్నవయస్కుడైన సీనియర్ డైరెక్టర్గా ఎదిగిన అనుదీప్, ఇప్పుడు అదే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా, కంట్రీ హెడ్, ఇండియాగా పదోన్నతిని పొందటం విశేషం. -
మద్యం మత్తులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: మద్యం మత్తులో ఈతకు వెళ్లి వాచ్మెన్ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మధుపవన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామలానగర్ సీతమ్మకాలనీ సమీపంలో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న బొబ్బుల ప్రసాద్ (35) అదే కాలనీలో పలు అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న తన స్నేహితులైన బొడ్డుపల్లి బ్రహ్మయ్య, మరో ఇద్దరుతో కలిసి ఆదివారం మద్యం సేవించేందుకు వెంగళాయపాలెం సమీపంలోని కాలువ వద్దకు చేరారు. మద్యం సేంచి సమీపంలోని కాలువలో ఈతకు వెళ్లారు. అనంతరం నలుగురు మరలా మద్యం సేవించేందుకు పక్కనే ఉన్న ఫ్లాట్లులోకి వెళ్ళారు. మిగిలిన ముగ్గురు మద్యం సేవిస్తుండగా ప్రసాద్ తాను మద్యం సేవించనని ఈతకొడుతూ ఉంటాను మీరు రండి అంటూ మరలా కాలువలో ఈతకు దిగాడు. మద్యం సేవించిన మిగిలిన ముగ్గురు కాలువ వద్దకు చేరి చూడగా ప్రసాద్ కనిపించలేదు. చుట్టు చూసి కాలువలో వెతకగా కొంతదూరంలో ప్రసాద్ మృతదేహం కాలువలో కనిపించింది. దీంతో ముగ్గురు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సందేశాత్మకంగా సాగిన నాటికలు
తెనాలి: స్థానిక డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ● తొలిగా కళాహారతి, తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించారు. ఆన్లైన్ యాప్ల రుణాల ఉచ్చులో చిక్కుకుంటే జీవితాలే నాశనమవుతున్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఉమా రచనకు ‘నాట్యాచార్య’ ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో కుమార్బాబు, రచయిత డి.ఉమాశంకర్, దర్శకుడు ఎంవీ రమణ, డి.వినయ్, ఎం.సౌమ్య నటించారు. సంగీతం సింహాద్రిపురం రమణ, బాషా అందించారు. ● అనంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటికను ప్రదర్శించారు. ప్రముఖ నాటక రచయిత స్నిగ్ధ రచనకు టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు. ● చివరిగా ఆరాధన ఆర్ట్స్, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు ఈ నాటికను రచించగా నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ● ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్, తెనాలి కళాకారుల సంఘం–తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలను నిర్వహించారు. అధ్యక్షులు ఆరాధ్యుల కన్న, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. -
అమ్మబాబోయ్.. రాజధాని లారీలు
తాడికొండ: రాజధానికి మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న లారీలను తాడికొండలో గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రిళ్లు అధిక వేగంతో వస్తున్న లారీ మలుపు వద్ద యువకుడిని ఢీకొట్టబోవడంతో అప్రమత్తమైన అతను త్రుటిలో తప్పుకున్నాడు. గతంలో సైతం గ్రామంలో అధిక వేగంతో వెళుతున్న లారీల కారణంగా ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగిన నేపధ్యంలో స్థానిక ట్యూబ్లైట్ సెంటర్లో బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద యువకులు రోడ్డుపై లారీలను అడ్డుకొని నిరసన తెలియజేశారు. రాజధానికి వెళ్లే పలు లారీలు బారులు తీరి నిలిచిపోవడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులతో చర్చించగా గ్రామంలో లారీలు అధిక వేగంతో వెళుతున్న కారణంగా పడుతున్న ఇబ్బందులు తెలియజేశారు. పేరేచర్ల ప్రాంతం నుంచి రాజధాని నిర్మాణాలకు వెళ్ళే కంకర, ఫ్లైయాష్తో వెళ్లే లారీలతో పాటు ఇతర సామగ్రి రవాణా లారీలు, రాజధాని నుంచి అక్రమంగా తరలిస్తున్న నల్లమట్టి, ఇసుక లారీలు రోడ్లపై నిత్యం హోరెత్తిస్తున్నాయని, అధిక శబ్ధంతో కూడిన వాహనాలు అధిక వేగం కారణంగా రోడ్డుపై నడవాలంటే భయందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు పెరిగిన రద్దీ దృష్ట్యా లారీలు, ఇతర రాజధాని వాహనాల రవాణా కోసం గ్రామ శివారు నుంచి బైపాస్ రహదారి నిర్మించిలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తాడికొండ పోలీస్ స్టేషన్లో మితిమీరిన వేగంతో వస్తున్న లారీలపై ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతానికి మట్టి, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి తరలిస్తూ అధిక వేగంతో వెళ్తున్న లారీలు ప్రమాదాలబారిన ప్రజలు తాడికొండలో లారీలను ఆపి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన పోలీసులు -
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్ 5వ లైన్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్ సెంటర్ మెయిన్ రోడ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఆదివారం తెనాలి నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాపట్లలో బస్సు ఎక్కాడు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకున్నాడు. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తోంది. టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని పలు మార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. తెలుపు గళ్ల నలుపు చొక్కా, జీన్స్ నిక్కర్ ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారం కట్టుకుని ఉన్నాడు. చిల్లర డబ్బులు, ఈనో ప్యాకెట్ తప్ప మరే గుర్తింపు కార్డులు అతని వద్ద లభించలేదు. అలానే మృతుడి వద్ద రెండు టికెట్లు లభించాయి. గుంటూరు నుంచి చీరాలకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ఒకటి, బాపట్ల నుంచి చీరాలకు తీసుకున్న టికెట్ ఒకటి లభించాయి. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకోవడంతో అతడు బాపట్లకు చెందిన వ్యక్తా, చీరాలకు చెందిన వ్యక్తా అనేది తెలియడంలేదు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు కర్నూలు వాసి మృతి విషయం మీడియా మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో హల్చల్ కాగా ఆదివారం సాయంత్రం వివరాలు లభించాయి. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుడి పేరు కుమ్మరి కిరణ్ (38) కర్నూలులోని ప్రకాష్నగర్ వాసిగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురు వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
అర్చకులపైనా ఆగడాలు
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆలయ అర్చకులపై కూడా అమలు చేస్తున్నారు. ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే గుడి నుంచి బయటకు వెళ్లాలని అర్చకులకు హుకుం జారీ చేస్తున్నారు. శాస్త్ర విరుద్ధంగా తాము పనిచేయలేమని చెప్పినందుకు కక్ష సాధిస్తున్నారు. వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్న కంకణధారణను రద్దు చేయించారు. ఆలయంతో సంబంధం లేని పూజారులతో ఆదివారం కంకణధారణకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రయత్నించారు. వారిని ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. దీంతో ఆలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న కంకణధారణలో రద్దీ ఎక్కువగా ఉండే ఆదివారాలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లో అర్చక కుటుంబ సభ్యులు పాల్గొంటారు. దీనిపై కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు పాల్గొనకూడదంటూ తేల్చిచెప్పారు. తమ తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని ఎలా వదలుకుంటామంటూ అర్చకులు కంకణధారణను కొనసాగిస్తున్నారు. దీనిపై కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆలయంలో కంకణధాణను రద్దు చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వీవీఎస్కే ప్రసాద్ ఈనెల 2వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. ఇరువర్గాల వాగ్వాదం ఆదివారం ఉదయం ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్లు ప్రైవేటు అర్చకులతో కంకణధారణ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజాదికాలు నిర్వహించాలని అర్చకులను కోరారు. దీనికి అర్చకస్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారికి నివేదనతో పూజాదికాలు నిర్వహించిన అనంతరమే కంకణాలను ఇస్తామని స్పష్టంచేశారు. భక్తుల నమ్మకాలతో వ్యాపారం చేయలేమని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన కంకణాలనే భక్తులకు అందిస్తామని తేల్చిచెప్పారు. కంకణాలకు పూజలు జరిపేందుకు ప్రైవేటు అర్చకుడిని గర్భగుడిలోకి పంపేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించారు. దీనిని ఆలయ అర్చకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్వ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ అర్చకులకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇస్సపాలెం ఆలయ అర్చకులకు టీడీపీ నేతల వేధింపులు తాజాగా కంకణధారణ రద్దు చేయించిన నాయకులు ప్రైవేటు అర్చకులతో నిర్వహించేందుకు కుటిల ప్రయత్నాలు అడ్డుకున్న ఆలయ అర్చకులు... ఆలయంలో ఉద్రిక్తత -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
బాపట్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 7వ తేదీ నుంచి 21 వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానిలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించారు. డీఆర్ఓ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందవచ్చన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, నోడల్ ఆఫీసర్ చంద్ర శేఖర్, డీపీఓ ప్రభాకరరావు, డీఎస్డీఓ శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ జె డి.వేణుగోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, సమాచార శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకట్రమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, బి.సి సంక్షేమ, సాధికారత అధికారిణి శివలీల పాల్గొన్నారు. తెనాలిరూరల్: ఉరి వేసుకుని తాపీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ గంగానమ్మపేటకు చెందిన పఠాన్ చాన్బాషా(37) తాపీ పనులకు వెళుతుంటాడు. మద్యం తాగి వచ్చి తరచూ భార్య, పిల్లలతో ఘర్షణ పడి కొడుతూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వచ్చి ఘర్షణ పడుతుండడంతో భార్య పక్క ఇంటికి వెళ్లింది. గదిలోకి వెళ్లిన అతను నైలాన్ తాడుతో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్తె కిటికీలో నుంచి చూసి చుట్టుపక్కల వారికి చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని దింపి, వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా అభ్యర్థులకు పరీక్షలు
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీ సెట్–2026కు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. పోటీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి ప్రారంభించారు. 680 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 470 మంది హాజరయ్యారని ఏపీ పీసెట్ కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. ఏపీ పీ సెట్ 2026 పరీక్షల్లో చివరి రోజు సోమవారం హాల్ టికెట్ నంబరు 30681 నుంచి 31179 వరకూ మొత్తం 499 మంది మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీ సొత్తును అపహరించుకుపోయిన ఘటన మంగళగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ కుమారుడు, కోడలితో కలసి నివాసముంటున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు నవీన్ ఓ ప్రభుత్వరంగ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలసి పెనుగంచి ప్రోలులోని ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కుమారుడు నవీన్ కూడా అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన వెండి వస్తువులతో పాటు, రూ.లక్ష నగదు దోచుకు వెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కుమారుడు నవీన్ ఇంటికి వచ్చి, లోపల డోర్కు వేసిన తాళాలు పగలకొట్టి ఉండడంతో గదిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉండడం గమనించాడు. మరో గదిలో గడ్డపలుగు ఉండడంతో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక గోడ దూకి వచ్చి గడ్డపలుగు సాయంతో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడినట్లు భావించి, పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదు మాయం -
గుంటూరు
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026అంతా మమ.. శుభ్రత భ్రమ! ● స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం అధికారుల ప్రయత్నాలు ● ఆప్కాస్ కార్మికులపైనే మొత్తం పని ఒత్తిడి ● 293 మందికిపైగా పర్మినెంట్ వర్కర్లకు మస్టర్ వేసి ఇళ్లకు పంపుతున్న వైనం ● ఇందుకుగాను ప్రతినెలా కార్మికుల నుంచి డబ్బులు వసూలు ● మరికొంతమంది అధికారుల ఇళ్లల్లో పనులకు పరిమితం ● ఇంకొంతమందికి నగరపాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటేషన్ ● అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ సక్రమంగా పనులు చేయించలేని పరిస్థితి నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థలో 57 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు రెగ్యులర్, ఇద్దరు ఇన్చార్జి పారిశుద్ధ్య సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులు 293 మంది ఉన్నారు. వీరితోపాటుగా ఆప్కాస్ వర్కర్లు 1897 మంది, అదనపు వర్కర్లు 420 మంది విధులు చేపడుతున్నారు. ఇందులో పనిచేసే పర్మినెంట్ వర్కర్లను వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. వీరికి మస్టర్లు వేసి ఇంటికి పంపించాలని శానిటరీ సూపర్వైజర్లే సంబంధిత ఇన్స్పెక్టర్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీనికోసం కార్మికుల నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగర పరిధిలో 1,897 మంది ఆప్కాస్ వర్కర్లు ఉంటే వారిలో కూడా రెగ్యులర్గా విధులు నిర్వహించేది 1,500 మందే అని సమాచారం. మిగతా వారంతా డెప్యూటేషన్పై నగరపాలక సంస్థ కార్యాలయంలో, పాఠశాలల్లో, రిజర్వాయర్లలో, పలు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనే పదుల సంఖ్యలో ఉన్నారు. ఒక్కో అధికారి వద్ద వీరు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు శానిటరీ ఇన్స్పెక్టర్ల ఇళ్లల్లో, ఇతర అధికారుల నివాసాల్లో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో నిత్యం 3 లక్షలకుపైగా ఇళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే 470 మెట్రిక్ టన్నుల చెత్తను కేవలం కొంత మంది ఆప్కాస్ వర్కర్లే తరలించాలంటే తలకు మించిన భారంలా మారుతోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రతి డివిజన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. అందరూ సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూస్తేనే స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకుతోపాటు నగరవాసులకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యఅప్కాస్ వర్కర్లుఅదనపు కార్మికులురోజుకు ఉత్పత్తి అయ్యే చెత్తమొత్తం కార్మికుల సంఖ్యమాట్లాడుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎన్.రవీంద్రరెడ్డికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్న దృశ్యం 7ఆలయ చైర్మన్ తమ ఆచార వ్యవహారాల్లో కలుగజేసుకుని ఇబ్బందులు పెడుతున్నారు. కంకణధారణ కార్యక్రమాల్లో మా నాన్నమ్మ, అమ్మ పాల్గొన్నారు. ఇప్పుడు మా అక్క పాల్గొంటుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంకణధారణలను ఇంటిలో తయారు చేసి ఆదివారం ముందు రోజు పూజలో ఉంచి అభిషేకాలు నిర్వహించి భక్తులకు కడతాం. ఇప్పుడు అలాంటి పూజాదికాలు లేకుండా కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి భక్తులకు విక్రయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వ్యాపారం అవుతుంది. మేం చేయలేమని చెప్పడంతో అధికారం ఉందని పేర్కొన్నారు. మమ్మల్ని బయటకు వెళ్లండని బెదిరిస్తున్నారు. – కె.కార్తికేయ, ఆలయ అర్చకుడు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఈ సంస్కృతి మరింత పెచ్చుమీరుతోందనే చెప్పుకోవచ్చు. దీంతో నగరంలో చెత్త తరలించే భారం అంతా ఆప్కాస్ వర్కర్లపైనే పడుతోంది. అధికారులు చెప్పిన ప్రతి పనిని వారే చేయాల్సి వస్తోంది. అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఏదైనా డివిజన్లో ఆప్కాస్ వర్కర్లు సెలవు పెడితే సదరు డివిజన్కు అదనపు వర్కర్లును పంపించాలంటే శానిటరీ ఇన్స్పెక్టర్లను సంబంధిత సూపర్వైజర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం నగరపాలక సంస్థ పాట్లు పడుతుంటే మరో పక్క పారిశుద్ధ్య సూపర్వైజర్లు కొంత మంది తమ జేబులు నింపుకొనే పనిలో నిమగ్నమయ్యారు. పర్మినెంట్ వర్కర్లు ఉన్నప్పటికీ వారికి మస్టర్ వేసి ఇంటికి పంపుతున్నారు. ప్రతిఫలంగా వారి నుంచి ప్రతి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాఽధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిపోయి జేబులు నింపుకొనేందుకు యత్నించడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు
నగరంపాలెం: వాహనాల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని జిల్లా ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై జిల్లా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బీవీ నారాయణ ప్రారంభించారు. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్ వరకు సాగింది. అక్కడి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ సైక్లింగ్ను ప్రోత్సహించాలని అన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ సంకురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని తెలిపారు. ర్యాలీలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, రామకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): రాష్ట్ర స్థాయి సిలంబం సబ్ జూనియర్, సీనియర్ చాంపియన్షిప్ విజేతగా గుంటూరు జిల్లా నిలిచింది. స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ ఆదివారం ప్రారంభించారు. సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ క్రిస్టఫర్ మాట్లాడుతూ పోటీల్లో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారన్నారు. ప్రథమ స్థానంలో గుంటూరు జిల్లా, ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచాయన్నారు. అనంతరం విజేతలకు అఫ్రోజ్ ఖాన్తోపాటు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇ. అశోక్బాబు, క్రిస్టఫర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోచ్లు కాశీనాథ్రెడ్డి, సీహెచ్ శ్రీరామ్, ఎం.శ్రీనివాసరావు, కె.కిరణ్, వెంకటసాయి, నాంచారయ్య, నవీన్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని తన కుటుంబ సభ్యులు నలుగురిని కిందకు దించారు. క్షణాల్లో కారు తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు అదుపుచేశారు. అరగంటపాటు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాతూరు రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలి
మంగళగిరి టౌన్: సెక్యూరిటీ గార్డ్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్ జాతీయ కన్వీనర్ ఎం.సాయిబాబా పిలుపునిచ్చారు. మంగళగిరి సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం సెక్యూరిటీ గార్డ్స్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సాయిబాబా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యవసాయ కార్మికుల తర్వాత కోటిమందికి పైగా సెక్యూరిటీ గార్డ్స్గా పని చేస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వ రంగంలో సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రెగ్యులైజేషన్ ఉద్యోగులుగా కూడా పనిచేశారని, ప్రస్తుతం సెక్యూరిటీ రంగం మొత్తం ప్రైవేటుపరం అయిందన్నారు. ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏజెన్సీల ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టుకోవడం జరుగుతుందని, దీనివలన ఏజెన్సీ నిర్వాహకులు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో కనీస వేతన చట్టం చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలైనా కనీస వేతన చట్టం సవరణ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో సంస్థలలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి ఆయా ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.893 ల నుంచి 1065 వరకు వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐలను అమలు చేయాలని, ఈఎస్ఐ కార్డులను సెక్యూరిటీ గార్డులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా సెక్యూరిటీ గార్డులకు చట్టపరమైన భద్రత కల్పించాలని అన్నారు. ఏజెన్సీలు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో యూనియన్ రాష్ట్ర గౌరవ అధక్షుడు ముజఫర్ అహ్మద్, సీఐటీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, మంగళగిరి ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ కార్యదర్శి కె.బుజ్జిబాబు, సీఐటీయూ సీనియర్ నాయకుడు జేవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు: సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతుల ఆందోళన చేపట్టారు. ఉండవల్లి రైతులను ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఇప్పటివరకు అవకాశం దొరకలేదన్నారు. విజయవాడ కిలోమీటరు దూరం. ఇక్కడ 2015లోనే విల్లాలు, 2014కి ముందే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన ఊర్లో మమ్మల్ని రైతులే కాదంటే ఎలా అంటూ ప్రశ్నించారు.ఉండవల్లిని ఎల్పీఎస్, ఎల్ఏ నుంచి విరమింప చేయాలని డిమాండ్ చేశారు. సన్న, చిన్నకారు రైతుల భూముల్ని ప్రాజెక్టు లేకుండా అనవసరంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘మా భూముల్ని ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ నుంచి పూర్తిగా తప్పించండి. 2014లో రాజధాని రాకముందే ఉండవల్లి హై లెవెల్లో ఉంది. తాడేపల్లి తర్వాత టాప్ ఊరు ఉండవల్లి గ్రామం అని రైతులు అన్నారు.మా సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిస్తే తప్పేంటి? అంటూ రైతులు ప్రశ్నించారు. వైఎస్ జగన్ని కలిశామనే అక్కసుతో తమను టార్గెట్ చేస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. తమ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కులం పేరుతో దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. కావాలనే తమపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రాజధాని నుంచి ఉండవల్లిని మినహాయించాలి. ఉండవల్లిలో వెంటనే భూసేకరణ నిలిపేయాలి. ఇంకా మేము భూములు ఇచ్చే పరిస్థితి లేదని రైతులు తేల్చిచెప్పారు. -
పక్కాగా జిల్లా ఎగుమతుల ప్రణాళిక
గుంటూరు వెస్ట్: జిల్లా ఎగుమతుల ప్రణాళిక పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక, బలోపేతానికి చేపట్టాల్సిన అంశాలను తయారు చేయాలని సూచించారు. తద్వారా విలువ ఆధారిత పెరుగుతుందని, తలసరి ఆదాయంలో వృద్ధి వస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కోసం ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలో అనవసర ప్రక్రియ అనే విధానాన్ని ప్రభుత్వం తొలగించి మరింత సులభతరం, వేగవంతం చేసిందని వివరించారు. కనీస తనిఖీలు విధానంలో ప్రభుత్వం పాలసీ తీసుకువచ్చి ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమం అనంతరం సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ఆర్జీలు స్వీకరించాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పాలసీ కింద 1,848 దరఖాస్తులు అందాయని, అందులో 1,827 నిర్ణీత గడువులోగా పరిష్కరించామని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలో చేపట్టిన వివరాలు తెలిపారు. ఇ కామర్స్పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసినవారికి రూ.83 లక్షల ప్రోత్సాహకాలను కమిటీ ఆమోదించింది. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహేంద్రపాల్రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్, వివిధ ఆర్థిక సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ -
బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ గుంటూరు వెస్ట్: బాలింతల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ శాఖలు సంయుక్త బాధ్యత తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలవుతున్న చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ బాలింతలకు అవసరమైన వైద్యాన్ని ప్రతినెలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సరైన పోషకాహారాన్ని అందించటం, వారికి ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ ఉన్న సందర్భాలలో జాప్య నివారణకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలన్నారు. గృహ హింస జరిగిన కేసుల్లోని బాధితులకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు అందించాలన్నారు. సమాజంలో జరుగుతున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా బడి ఈడు పిల్లలు ప్రవర్తన గురించి ఉపాధ్యాయులు గమనించాలన్నారు. సంక్షేమ హాస్టల్స్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులు ప్రవర్తన గురించి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వరకట్న నిషేధం గురించి కాలేజీ స్థాయిలోనే సంపూర్ణ అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసూన, డీసీపీఓ విజయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
టెక్స్టైల్ పరిశ్రమకు అండగా ఉంటా
కొరిటెపాడు(గుంటూరు): టెక్స్టైల్ పరిశ్రమకు అండగా ఉంటానని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. టెక్స్టైల్ రంగంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసోసియేషన్ నాయకులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఇప్పటికే సుమారు రూ.500 కోట్ల సబ్సిడీని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న రూ.50 కోట్ల క్లెయిములను త్వరలో విడుదలయ్యేలా చేస్తామని పేర్కొన్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఏపీలోనూ గ్రీన్ ఎనర్జీ పాలసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. టెక్స్టైల్ పరిశ్రమను పరిశ్రమల శాఖ పరిధిలోకి బదిలీ అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. పత్తి కొనుగోలు, సీసీఐ, విద్యుత్ సమస్యలపై లోతుగా చర్చించామని, పరిశ్రమకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారం చిరస్మరణీయమని, భవిష్యత్లోనూ ఆయన మార్గదర్శకత్వం కావాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ను అసోసియేషన్ నాయకులు సత్కరించారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు కోటి రావు, సత్యనారాయణ, వీర నారాయణ, బ్రహ్మానందం పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
ఆహార భద్రతపై అవగాహన ఉండాలి
గుంటూరు లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, నాలుగో అదనపు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) సి.రమణా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించటం అనారోగ్యాలను గుర్తించటమని, మనం తినే ఆహారం ఎటువంటి కలుషితం కాకుండా సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి.ఆర్. రాజీవ్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్ల వలన మన దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో ఫుడ్ స్టాల్ను ప్రారంభించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి.నరసింహుడు, గవర్నమెంట్ ప్లీడర్ ఎం.సురేష్ బాబు, సి.డబ్ల్యూ.సి. శాఖ శ్రీవాణి, డిస్ట్రిక్ట్ సప్లయి ఆఫీసర్ కోమలి పద్మ పాల్గొన్నారు. -
రేపు లలిత పీవీఎస్ ఆస్పత్రిలో అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా లలితనగర్లోని లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జూన్ 8న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిమక్కల విజయ తెలిపారు. మెదడు కణితుల లక్షణాలు, ట్యూమర్ పరిమాణం, రకం, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయని, తరచూగా తలనొప్పి, మూర్చ రావడం, ఉదయం వేళల్లో వికారం, వాంతులు, చూపు మందగించడం, చేతులు, కాళ్లల్లో బలహీనత, మాట్లాడడంలో ఇబ్బంది, జ్ఞాపక శక్తి తగ్గడం, నడకలో సమతుల్యత కోల్పోవడం, వినికిడి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అత్యాధునిక న్యూరో ఇమేజింగ్, ఇమేజ్ గైడెడ్, మినిమల్లి ఇన్వేసీవ్, న్యూరో సర్జరీ, న్యూరో నావిగేషన్, ఇంట్రా ఆపరేటీవ్ ఎమ్మారై, ఎండోస్కోపిక్ బ్రెయిన్ సర్జరీలో నేడు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బ్రెయిన్ ట్యూమర్లపై అవగాహన పెంపొందించుకుని వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రివెంటీవ్ మెడిసిన్లో భాగంగా తమ హాస్పిటల్లో నిర్వహించే అవగాహన సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. -
అలా అమిర్చికున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మనోడైతే చాలు ఎటువంటి నిబంధనలు, టెండర్లు వంటి ఏ ప్రక్రియ అవసరం లేదు. ఒక జీఓ ఇచ్చేయడమే... ప్రభుత్వ స్థలాన్ని ధారాదత్తం చేసేస్తారు. పైగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి చినబాబుకి దగ్గరైతే ఇంక అడ్డేముంది. మంగళగిరికి చెందిన తెలుగుదేశం నాయకుడు పోతినేని శ్రీనివాసరావుతో పాటు పోతినేని సుబ్బారావుకు గుంటూరు మిర్చియార్డులో అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం 70 సెంట్ల స్థలాన్ని 30 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ఇటీవల జీఓ జారీ అయ్యింది. మంగళగిరి తెలుగుదేశం నాయకుడిగా ఉన్న పోతినేని శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్కు అన్ని తానై వ్యవహరించారు. ఇప్పటికి కూడా మంగళగిరిలో అన్ని వ్యవహారాలను ఆయనే చక్కదిద్దుతుంటారు. దీంతో దానికి రుణం తీర్చుకోవడం కోసమే రూ. 20 కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఎటువంటి టెండర్లు లేకుండా పోతినేని శ్రీనివాసరావుకు కట్టబెట్టేశారు. రైతులకు ప్రయోజనం శూన్యం మిర్చియార్డులో ఇప్పటికే ఒక కోల్డ్స్టోరేజీ ఉంది. గతంలో దీన్ని కూడా 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. దీనివల్ల మిర్చియార్డుకు వస్తున్న ఆదాయం నామమాత్రమే. అయితే రైతులకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఇప్పుడు దీనికి కూడా లీజు పొడిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూ.వేల కోట్ల వ్యాపారం జరిగే మిర్చియార్డులో ప్రభుత్వం తరఫున కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు రైతులకు కూడా తక్కువ ధరకు తమ మిర్చిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి భిన్నంగా ప్రైవేటు వారికి, ముఖ్యంగా తమ అనుచరులకు కట్టబెట్టుకుంటూ పోతే దీని వల్ల రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన తర్వాత ఆ భూమిని మళ్లీ వెనక్కి తీసుకోవడం జరిగే పనికాదు. ఆగమేఘాలపై జీఓ.. 2018లో ప్రభుత్వం తరపున కోల్డ్స్టోరేజీ నిర్మాణం కోసం పనులు చేపట్టారు. అయితే అవి పిల్లర్ల వరకూ వచ్చి వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిపోయింది. ప్రస్తుతం అదే స్థానంలో కొత్తగా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం ప్రైవేటువారికి కట్టబెట్టారు. కొత్తగా కోల్డ్స్టోరేజీ కేటాయించాలంటే కనీసం టెండర్లు పిలవడం కాని, పాలకవర్గం ఆమోదించడం గాని జరగాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఏకంగా ప్రభుత్వం నుంచి ఫలానా వారికి మిర్చియార్డులో 70 సెంట్ల స్థలం కేటాయిస్తున్నట్లు జీఓ ఇచ్చేయడం గమనార్హం. 1995లోని మార్కెటింగ్ శాఖ జీవో 448, 1999లోని జీఓ 280 ప్రకారం నియమనిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కనీసం ఫలానావారు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కేటాయించాలని కోరుతూ తీర్మానాలు కూడా ఏమీ లేకుండానే కేవలం లోకేష్ ముఖ్యఅనుచరుడు కావడంతో కేటాయించడాన్ని వ్యాపారులు తప్పు పడుతున్నారు. -
నేడు శివాలయం తలుపులు మూసివేత
పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయం ఎదురుగా రోడ్డులో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి మృతి చెందడంతో శైవాగమ పద్ధతి ప్రకారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకస్వాముల సూచన మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి రాహుకేతుల పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు పెదకాకాని: ఏపీ పీసెట్–2026లో భాగంగా పురుష అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆరు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. నాల్గవ రోజు శనివారం 714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 557 మంది హాజరయ్యారు. ఆదివారం నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్ నెంబరు 30001 నుంచి 30680 వరకూ మొత్తం 680 మంది మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన త్రీమెన్ కమిటీ సారధ్యంలో నెల రోజుల నుంచి స్థానిక అరండల్పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. త్రీమెన్ కమిటీ సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 మంది చిన్నారులు ఈ క్యాంప్లో పాల్గొన్నారన్నారు. అనుభవజ్జులైన కోచ్ల పర్యవేక్షణలో చిన్నారులు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ టీంకు కో ఓనర్ ఓ.సాయికృష్ణ తేజ, హిందూ కళాశాల విద్యా సంస్థల సెక్రటరీ రామకృష్ణమూర్తి, త్రీమెన్ కమిటీ సభ్యులు నాగరాజు, శరత్బాబు, రామకృష్ణ పరమహంస, చిన్నారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 111 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి పి.శామ్యూల్ పర్యవేక్షణలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనాధికారి ఎన్. నిర్మల భారతి, సీహెచ్ శ్రీనివాసరావు, జె.శోభారాణి, రాజారత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.20 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,483 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఫిజియోస్ క్రికెట్ లీగ్–2026 విజేత ‘హంగ్రీ చీతాస్’
గుంటూరు మెడికల్: ఆంధ్ర ఫిజియోస్ స్పోర్ట్స్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డాక్టర్స్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, ఎంఎస్కే క్రికెట్ గ్రౌండ్స్లలో నిర్వహించిన ‘ఫిజియోస్ క్రికెట్ లీగ్–2026’ టీ–20 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. పది టీములు డే అండ్ నైట్ మ్యాచ్లో పాల్గొనగా హంగ్రీ చీతాస్ గుంటూరు టీం విన్నర్స్గా నిలిచి రూ.లక్ష నగదు రోలింగ్ షీల్డ్, వైజాగ్ మార్వెల్ ఫిజియో క్రికెట్ క్లబ్ రన్నర్స్గా రన్నర్స్ షీల్డ్ రూ.50 వేల నగదు పారితోషికం అందుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యార్లగడ్డ రవితేజ మాట్లాడుతూ క్రీడలు దేశభక్తి, జాతీయ సమైక్యత, విశాలమైన ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండాలన్నారు. ఆంధ్ర ఫిజియోస్ క్లబ్ అమరావతి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి.నాగ సతీష్ కుమార్, మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ టీ20 క్రికెట్ టోర్నమెంట్స్ విజయవంతం కావటంలో స్పోర్ట్స్ క్లబ్ కమిటీ కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్స్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిత్వేద లైఫ్ సైన్సెస్ సీఈఓ, విన్నర్స్ ప్రైస్ షీల్డ్ స్పాన్సర్ ముప్పరాజు వెంకట్రావు, తులసి సర్జికల్స్ అధినేత సంజీవ్ కుమార్, క్లబ్ గౌరవ సలహాదారు పొందూరి శివరాం ప్రసాద్, ఉపాధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ విజయ సాగర్ సంయుక్త కార్య దర్శులు డాక్టర్ బాజీ, డాక్టర్ నాగేంద్ర బాబు, సభ్యులు డాక్టర్ కిరణ్ డాక్టర్ ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు. స్ఫూర్తిదాయకంగా కొనసాగిన టీ–20 క్రికెట్ పోటీలు క్రీడల ద్వారా స్నేహభావం, దేశభక్తి, జాతి సమైక్యత పెంపొందాలి శ్రీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ యార్లగడ్డ రవితేజ -
గుంటూరు
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో సవాలక్ష నిబంధనలుతెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్ ధర రూ.2,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: సంగీతం భక్తిభావంతోపాటు సాధకుడి ఆయుర్దాయాన్ని పెంచుతుందని ప్రముఖ నాదస్వర విద్వాంసుడు ‘నాదసుధార్ణవ’ అన్నవరపు రామస్వామి అన్నారు. అందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవాన్ని శనివారం సాయంత్రం బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని కళావేదికపై నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుట్ల విశ్వనాధశర్మ అధ్యక్షత వహించారు. గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం–2026ను ప్రముఖ వయొలిన్ విద్వాంసులు డీవీకే వాసుదేవన్, ఫ్లూట్ విద్వాంసులు డి.ఫణికుమార్ (దేవన్ద్రోణ్ ద్వయం)కు ప్రదానం చేశారు. ముఖ్యఅతిథి రామస్వామి మాట్లాడుతూ గద్దె రామకుమారి గొప్ప సంగీత గురువుగా చెప్పారు. ఏటా ఆమె వర్ధంతిని తెనాలిలో వైభవంగా నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడుతూ, సంగీతంలో తనదైన ఒరవడిని సృష్టించుకున్న రామస్వామి కొత్త రాగాలు, తాళాలను రూపకల్పన చేశారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు పాల్గొంటారు. వినూత్న వాద్య ద్వయం దేవన్ ద్రోణ్ల సంగీత సేవను అభినందించారు. సభానంతరం సభానంతరం డి.ఫణికుమార్ వేణువుపై, డీవీకే వాసుదేవన్ వయోలిన్పై సంగీత కచేరీ కొనసాగింది. వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు ఇవ్వాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. అలాగే కౌలు రైతులనూ దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా కూడా అందడం లేదు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చి, వారి పంటలను నమోదు చేసి సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేయాలి. – కంచుమాటి అజయ్కుమార్, ఏపీ రైతు సంఘం, జిల్లా అధ్యక్షుడు, గుంటూరుకొరిటెపాడు(గుంటూరు): యంత్రాల సబ్సిడీ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తోంది. నిబంధనల పేరుతో రైతులకు రాయితీ యంత్రాలను దూరం చేస్తోంది. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ గొప్పలు పలికిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సబ్సిడీ యంత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే రైతుల మెడపై నిబంధనల కత్తి వేలాడదీస్తూ మరోసారి కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు 849 పరికరాలు మంజూరు పంటకోత, నూర్పిడి పరికరాలు 11, మొక్కల సంరక్షణ పరికరాలు 560, పంట కోత అనంతరం ప్రాసెసింగ్, విలువ జోడించు యంత్రాలు 12, పవర్ ట్రిల్లర్స్ 40, పశుగ్రాసం కట్టకట్టే పరికరాలు 40, స్వీయ చోదక యంత్రాలు 67, మొక్కలు నాటడం, తవ్వే యంత్రాలు 9, ట్రాక్టర్ పవర్ టిల్లర్ నడిచే పరికరాలు 81, ట్రాక్టర్లు 29 కలిపి మొత్తం 849 యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.3.39 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేదా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పినవారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా.. అవన్నీ టీడీపీ వారికే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పథకం ఏదైనా పచ్చ చొక్కాలకే వెళ్తున్నాయి. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిబంధనల శరాఘాతం.. చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ యంత్ర పరికరాలు పొందేందుకు పలు నిబంధనలు విధించి సామాన్య రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. మూడేళ్లలో మూడు సార్లు ఈ–పంట నమోదు చేసి ఉండాలన్న నిబంధన విధించడం చాలామంది రైతులకు శరాఘాతంలా మారింది. ఒకవేళ అర్హత సాధించినా లాటరీలో అదృష్టం వరించాలి. ఆపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతోనే జాబితా తయారవుతుంది. ట్రాక్టర్ మంజూరై డిపాజిట్లు మొత్తం ముందే చెల్లించినా సబ్సిడీ మాత్రం జూలైలో అందజేస్తామని పేర్కొనడం గమనార్హం. ఇన్చార్జ్ మంత్రి ఆమోదం ఉంటేనే..! నిబంధనల పేరిట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అర్హులకు దూరం చేయనుందనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా మూడేళ్ల పాటు ఈ–క్రాప్ నమోదు కలిగి ఉండాలి, కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తప్పనిసరి చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 4,13,604 ఎకరాల్లో రైతులు ఈ–క్రాప్ కలిగి ఉన్నారు. సన్న చిన్నకారు రైతులు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగున్నా.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎంపిక చేయనున్నారు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. లాటరీలో టీడీపీకి చెందని వారి పేరు వస్తే వారికి యంత్ర పరికరాలను అందించేందుకు ఇన్చార్జ్ మంత్రి ఆమోద ముద్ర వేస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కాదని ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారికి యంత్రాల పంపిణీ కలగానే మిగలనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమృద్ధి కేంద్రం ప్రారంభించిన పెమ్మసాని9మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే ప్రతి ఏటా సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్ పనిముట్లు, వ్యవసాయ పరికరాలను పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వందలాది మంది ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పనిముట్లు అడిగిన రైతులందరికీ మంజూరు చేశారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్ పనిముట్లు, రోటో వేటర్, స్పేయర్లు అందజేశారు. రైతులు ఎంతో ఆశతో సబ్సిడీ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కూటమి పాలనలో అర్హులకు యంత్ర పరికరాలు అందుతాయనే నమ్మకం కలగడం లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. అర్హులైన రైతులకు యంత్ర సాయం చేయాలి. –తియ్యగూర పేరిరెడ్డి, వట్టిచెరుకూరు మండలం, రైతు, గారపాడు -
నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజులపాటు నిర్వహించనున్న పోటీల బ్రోచర్ను శనివారం గంగానమ్మపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. నాలుగురోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల్నుంచి 10.30 గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం ప్రారంభసభకు ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సభాధ్యక్షులుగా అజో విభో కందాళం ఫౌండేషన్ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు. ఇదే సభలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ రంగస్థల దర్శకులు, నటుడు ఎన్.రవీంద్రరెడ్డికి ప్రదానం చేయనున్నారు. తొలిరోజున ఆరు గంటలకు కళాహారతి తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించనున్నారు. ఉమా రచించిన ఈ నాటికకు నాట్యాచార్య ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. సభానంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక ఉంటుంది. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి టీవీ పురుషోత్తం దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 9.15 గంటలకు ఆరాధనా ఆర్ట్స్, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శిస్తారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహిస్తారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణ్, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు జి.వేణుగోపాలరెడ్డి, అక్కిదాసు కిరణ్కుమార్, మైలా విజయ్నాయుడు, చుక్కా ఆనంద్ పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం (ఏపీ ఏఓ) గుంటూరు, పల్నాడు జిల్లాల సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కోసం గుంటూరు కిమ్స్– శిఖర హాస్పిటల్లో శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ వైద్య శిబిరంలో ప్రతి వ్యక్తికి 26 అంశాలలో పరీక్షలు నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన మొత్తం 150 మంది సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.బాల భాస్కర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ డి.ప్రవీణ్, ట్రెజరర్ డాక్టర్ బి.మురళి కిశోర్, సెక్రటరీ డాక్టర్ కె.అమల కుమారి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. రూ.ఏడు లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు అపహరణ నాదెండ్ల: నాదెండ్ల పోలీస్స్టేషన్లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె. నిరంజన్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్ఐలు ఆర్.వెంకటేశ్వరరావు, అనిల్కుమార్, శివరామకృష్ణ సత్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారంపై అంకితభావం ఉండాలన్నారు. -
నర్సింగ్ ఉద్యోగాల మెరిట్లిస్టు రివైజ్ చేస్తాం
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్టును సవరించి తిరిగి విడుదల చేస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. పిడుగురాళ్ల జీజీహెచ్లో కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు నకిలీ అర్హత ధ్రువపత్రాలు పెట్టి ఉద్యోగాలు పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఈనెల 3వ తేదీన ‘నర్సింగ్ ఉద్యోగాల్లో నకి‘లీల’లు’ అనే శీర్షికన, ఈనెల 5న ‘చదివింది ఒకటి– సర్టిఫికెట్ మరొకటి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పలువురు అభ్యర్థులు గుంటూరు ఆర్డీ కార్యాలయం వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫైనల్ మెరిట్ లిస్టు అభ్యంతరాలు తెలిపేందుకు ఆర్డీ అధికారులు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్టులో పలు తప్పిదాలు సాక్షి వెలుగులోకి తీసుకు రావడంతో వాటిని సరిచేసి తిరిగి జాబితా ప్రచురిస్తామని ఆర్డీ డాక్టర్ శోభారాణి శనివారం వెల్లడించారు. స్టాఫ్నర్సు ఉద్యోగానికి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఇద్దరూ అర్హులేనని పేర్కొన్నారు. ఎంఎల్హెచ్సీ, సీహెచ్ఓ, యూపీహెచ్సీలో చేసిన స్టాఫ్నర్సు, ఆరోగ్య మిత్ర, 104, 108 స్టాఫ్, రెసిడెన్షియల్ కాలేజ్ స్టాఫ్కు సర్వీసు మార్కులు ఇస్తున్నామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యంతరాల సర్టిఫికెట్లు మరలా ఉన్నతాధికారులతో స్క్రూట్నీ చేసి డీఎంహెచ్ఓలు, సూపరింటెండెంట్ల నుంచి జన్యునిటీ ఆధారంగా సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని వెల్లడించారు. -
పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
గుంటూరు మెడికల్: ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి తన ఛాంబర్ నుంచి ప్రోగ్రామ్ అధికారులకు, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 8 నుండి నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమం గురించి వివరించారు. ఈనెల 8న గ్రామ/వార్డు స్థాయిలో ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎంల ద్వారా ఫ్రీ పీఎంఎస్ఎంఏను, 9న వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యులతో ఆరోగ్య కేంద్రాలలో, 10న ఎక్సెండెడ్ పీఎంఎస్ఎంఏను సీ్త్ర శిశు సంక్షేమశాఖ, ఇతర శాఖల సహకారంతో పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. 8వ తేదీ ఉండవల్లి, 13వ తేదీ మంగళగిరిలో నిర్వహించే యోగా కార్యక్రమంలో సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు నెల చివరి వరకు పొడిగించిన హెచ్పీవీ టీకా కార్యక్రమం లక్ష్యాల్లో ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని, ఈనెల నుంచి జరిగే స్టాప్ డయేరియా కార్యక్రమం కోసం తగిన ప్రణాళికలను సిద్ధం చేసికొని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ అమర్తలూరి శ్రావణబాబు, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, సుబ్బరాయణం, అధికారులు పాల్గొన్నారు. -
క్రికెటర్ కేఎస్ భరత్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఏపీకి చెందిన బ్యాటర్-వికెట్ కీపర్ కేఎస్ భరత్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న భరత్కు శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ కేఎస్ భరత్ అంటూ పోస్ట్ చేశారు వైఎస్ జగన్.ఆంధ్రప్రదేశ్కు చెందిన టీమిండియా వికెట్కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్.. గురువారం తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు భరత్,. Wishing K.S. Bharat all the best as he embarks on a new Journey after announcing his retirement from international cricket. Good luck for the future!@KonaBharat pic.twitter.com/uy5XpUI3h8— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2026 కాగా, 2023లో ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్కీపర్గా 18 క్యాచ్లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్కు దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.లిస్ట్-ఏ క్రికెట్లో భరత్ 82 మ్యాచ్లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్లో భరత్ 11 మ్యాచ్ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు. -
‘చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పోరాటం చేయాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. మైనారిటీల సమస్యలు, పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మైనారిటీ నేతలు ఖాదర్ భాషా, హసీఫ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, నిస్సార్ భాషా, నూరీ పాథిమా సహా పలువురు మైనారిటీ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తే.. చంద్రబాబు అందరినీ మోసం చేశారని.. వివిధ రాజకీయ శక్తులు ఏకమై అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా వంచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా గాలిలో కలిపేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘చివరికి మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయటం దుర్మార్గం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా భర్తీ చేశాం. కానీ చంద్రబాబు పదహారు వేల ఉద్యోగాలకు కూడా సరిగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. మైనారిటీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
విజయదుర్గ పీఠాధిపతి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పీఠాధిపతి మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. ఆధ్యాత్మిక రంగానికి విశిష్ట సేవలందిస్తూ వేలాది మంది భక్తులకు మార్గదర్శకులుగా నిలిచారు. ధర్మ పరిరక్షణ, సనాతన ఆధ్యాత్మిక విలువల ప్రచారం.. భక్తి మార్గ బోధన కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.‘‘సుబ్రహ్మణ్యం గారి సేవలు, బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మరణం భక్తజనులకు తీవ్ర వేదన కలిగించింది. సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, భక్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఎన్జీరంగా వర్శిటీలో ఖేత్ బచావో అభియాన్
గుంటూరురూరల్: సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం పరిరక్షించబడటమే కాకుండా పంటల నాణ్యత, దిగుబడులు, రైతుల ఆదాయం పెరుగుతుందని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.రామచంద్రరావు అన్నారు. నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం విశ్వవిద్యాలయం, వ్యవసాయ సాంకేతికత అనువర్తన పరిశోధనా సంస్థ(అటారీ) జోన్–పది సంయుక్తంగా ఖేత్ బచావో అభియాన్(పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం) నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేల ఆరోగ్య కార్డుల ఆధారంగా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ విచక్షణ రహితంగా రసాయనాలు వాడటం వలన ఐదు నిముషాలలో దీనిని నాశనం చేస్తున్నామని చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడకోవాలని సూచించారు. లాం పరిశోధన స్థానం మృత్తికాశాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విన్నకోట, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము పంటలు తొలకరిలో వేసుకొని భూమిలో కలియ దున్నడం ద్వారా నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, నేల నీటి నిల్వ సామర్థ్యం సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయన్నారు. రసాయన ఎరువుల అవసరం కొంత మేర తగ్గి, సాగు వ్యయాలు కూడా నియంత్రణలో ఉంటాయని తెలిపారు. యడ్లపాడుకు చెందిన ప్రగతిశీల రైతు శివరామకృష్ణ మాట్లాడుతూ ఎరువుల వాడకంలో సమన్వయం పాటించి సమతుల్యతను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో అటారీ జోన్–పది శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ భాస్కరన్, ఏడీఆర్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, ప్రగతి శీల రైతులు పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు):మిర్చి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు స్పష్టం చేశారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో చైర్మన్ అప్పారావు అధ్యక్షతన శుక్రవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మిర్చి యార్డుకు సంబంధించి 2026 మార్చి వరకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను ఆమోదించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి యార్డుకు వచ్చే మిర్చి రైతులకు మెరుగైన వసతులు, రైతు విశ్రాంతి భవనంలో రైతు ఉపయోగార్థం గ్రంథాలయం ఏర్పాటు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, గుంటూరు కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీడీసీఎంఎస్) చైర్మన్ వడ్రాణం హరిబాబు, వైస్ చైర్మన్ బి.మల్లిక, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సుమయ మృతదేహానికి రీపోస్టుమార్టం
పట్నంబజారు: బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహానికి శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండకు చెందిన సుమయ(44)కు 20 సంవత్సరాల కిందట మొహమ్మద్ షౌకత్ అలితో వివాహం జరిపారు. గతనెల 31న సుమయ హార్పిక్ తాగి మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులకు భర్త షౌకత్ అలి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు వచ్చే సరికి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతురాలి సోదరుడు షేక్ షఫీ తన సోదరి సుమయ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నేళ్లుగా భార్య, భర్తల మధ్య వివాదం జరుగుతోందని, ఈనేపథ్యంలో తన సోదరిని చంపి పడేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తహసీల్దారు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో శుక్రవారం ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికలో సుమయ మృతదేహాన్ని రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
నేడు ‘దేవన్ ద్రోణ్’ వినూత్న కచేరి
‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారంతెనాలి: పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవంలో భాగంగా ఈనెల 6వ తేదీన తెనాలిలో శాసీ్త్రయ సంగీత సభ నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 6.15 గంటలకు బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని కళావేదికపై గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం–2026ను ప్రముఖ విద్వాంసులు డీవీకే వాసుదేవన్, డి.ఫణికుమార్(దేవన్ద్రోణ్)కు ప్రదానం చేయనున్నారు. వినూత్న వాద్య ద్వయం... తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక సంగీతం, ఫ్యూషన్ సంగీతం, సంగీత విద్యలో రెండున్నర దశాబ్దాలుగా విశిష్ట సేవలను అందిస్తున్న వయోలిన్, వేణువు ద్వయం ‘దేవన్ ద్రోణ్’. విజయవాడకు చెందిన డాక్టర్ వయోలిన్ వాసుదేవన్, మచిలీపట్నం ఫ్లూట్ విద్వాంసుడు ద్రోణేంద్ర ఫణికుమార్ ఈ ప్రత్యేక సంగీత ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ‘నాదసుధానిధి’ డాక్టర్ అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను అభ్యసించిన వీరు, సంగీత చరిత్రలో తొలిసారిగా వయోలిన్–ఫ్లూట్ ద్వయాన్ని సంగీతాభిమానులను రంజింపజేసే స్థాయికి తీసుకొచ్చారు. డాక్టర్ వాసుదేవన్ ఐఐటీ విజిటింగ్ ఫ్యాకల్టీగానూ.. డాక్టర్ వాసుదేవన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వయోలిన్ విద్వాంసుడు, పరిశోధకుడు, విద్యావేత్త, సంగీతంలో పీహెచ్డీతోపాటు భారతీయ సంగీతం, సమాచార సాంకేతికతలో ఉన్నతవిద్యను అభ్యసించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సంగీత అధ్యాపకునిగా సేవలందించారు. ప్రస్తుతం ఐఐటీ, ఐఐఐటీ వంటి విద్యాసంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు. సంగీత విద్య, పరిశోధన, సంస్కృతి పరిరక్షణ రంగాల్లో విశేష సేవలను అందిస్తూ, పలు పుస్తకాలను రచించారు. సంస్కృతి ఫౌండేషన్తో వేలాదిమందికి సంగీత శిక్షణ, సాంస్కృతిక అవగాహనను నిర్వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫణికుమార్ ‘ఫ్లూట్ ఫణి’గా గుర్తింపు పొందిన ద్రోణేంద్ర ఫణికుమార్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీరు. సంగీతాన్ని జీవన సాధనంగా స్వీకరించారు. బాల్యం నుండే సంగీతాభ్యాసం ప్రారంభించి, పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చారు. ‘ఘంటసాల పురస్కారం’, ‘బెస్ట్ యంగ్ టాలెంటెడ్ మ్యూజీషియన్’ గౌరవాలను అందుకున్నారు. ‘లెర్న్ ఫ్లూట్ బై యువర్సెల్ఫ్’ అనే శిక్షణ కార్యక్రమం, ‘నాదయోగ’ ఆల్బమ్తో సంగీతాన్ని విద్య, ధ్యానం, వ్యక్తిత్వ వికాసంతో అనుసంధానించారు. ‘సిరాజ్’ సంస్థతో కర్ణాటక సంగీత ప్రచారానికి కృషిచేశారు. ఈ ఇద్దరు సంగీత విద్వాంసులు కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీత అంశాలను సమన్వయపరుస్తూ వయొలిన్, ఫ్లూట్, కీబోర్డు, ఘటం వంటి వాద్యాలతో వినూత్న సంగీతానుభూతిని అందిస్తున్నారు. పండితులతో సహా సాధారణ ప్రజల ఆదరణ పొందుతున్నారు. శాసీ్త్రయ సంగీతానికి భంగం కలగకుండా ఆధునిక శైలిలో ప్రజలకు చేరువవుతున్నాయి వీరి ప్రదర్శనలు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఫ్రాన్స్, యూరప్ దేశాల్లోనూ అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్, నమస్తే ఫ్రాన్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, గోవా, తెలుగు కల్చరల్ ఫెస్టివల్స్, లివింగ్ హెరిటేజ్ ఫెస్టివల్, నాదనీరాజనం వంటి ప్రముఖ వేదికలపై తెలుగు సంగీత వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రశాంతి నిలయం, కంచి మఠం, శివానంద ఆశ్రమం వంటి ఆధ్యాత్మిక వేదికల్లోనూ వీరి సంగీతం విశేష ఆదరణ పొందింది. స్వయంకృషితో ఎదిగి ‘దేవన్ ద్రోణ్’ పేరుతో తెలుగు సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సంగీత ద్వయం, తెలుగు సంస్కృతి, సంగీత వైభవాన్ని ప్రపంచ వేదికలపై చాటుతున్న ఈ కళాకారులు స్ఫూర్తిప్రదాతలు. తొలిసారిగా వీరు తమ వినూత్న వాద్య కచేరీని తెనాలి ప్రేక్షకులకు పరిచయం చేయనుండటం విశేషం! సభానంతరం ఏడు గంటలకు వినూత్న వాయిద్య ద్వయం డి.ఫణికుమార్ వేణువుపై, డి.వాసుదేవన్ వయోలిన్పై సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ నాదస్వర విద్వాంసులు, పద్మశ్రీ అవార్డుగ్రహీత డాక్టర్ అన్నవరపు రామస్వామి, శ్రీవివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు పాల్గొంటారు. అనంతరం సంగీత సభను నిర్వహిస్తారు. మృదంగంపై కె.అరవింద్, ఘటంపై ఎం.హరిబాబు వాయిద్య సహకారం అందిస్తారు. డీవీకే వాసుదేవన్డి.ఫణికుమార్ -
మొక్కలు నాటుదాం... పచ్చదనాన్ని కాపాడుదాం
మేడికొండూరు: ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పేరేచర్ల వద్ద నగర వనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేశారు. మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వలన కాలుష్య కోరల నుంచి బయటపడవచ్చని, ఎండ వేడిమి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ మాట్లాడుతూ సీడ్ బాల్స్తో మొక్కలు పెరుగుటకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం మాట్లాడుతూ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించుటకు లక్ష మొక్కలు నాటాలని తెలిపారు. మిషన్ కూల్ గుంటూరు పోస్టర్ను ఆవిష్కరించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, సి.ఎస్.ఆర్. ఆర్గానిక్స్ నిర్వాహకులు మొక్కల సీతారామయ్య, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ


