breaking news
Guntur
-
నేటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల మూత
కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 24వ తేదీన నాలుగో శనివారం, 25న ఆదివారం సెలవు. ఇక 26న రిపబ్లిక్ డే సందర్భగా సోమవారం అధికారికంగా సెలవు ఉంటుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కారణంగా 27న మంగళవారం కూడా బ్యాంకులు మూతపడనున్నట్లు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సమ్మె విరమణకు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నందున ఇంకా స్పష్టత లేదన్నారు. ఇప్పటికైతే అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపాయి. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?
మడకశిర: చంద్రబాబు సర్కార్ పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తోంది. భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగిస్తోంది. అక్రమ కేసులతో తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మంగళగిరికి చెందిన ఇంద్రాసేనారెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని గుడిబండ మండలం సీసీగిరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మంజునాథ్ గురువారం గుడిబండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇంద్రాసేనారెడ్డిపై కేసు నమోదు చేశారు. మడకశిర పోలీసులు గురువారం రాత్రే మంగళగిరికి వెళ్లి ఇంద్రాసేనారెడ్డిని అదుపులోనికి తీసుకుని శుక్రవారం మడకశిరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ... తాను ఎవరినీ కించపరిచేలాగానీ, అభ్యంతరకరంగా వ్యాఖ్యలుగానీ చేస్తూ పోస్టు పెట్టలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే పోస్టు పెట్టానని తెలిపారు. పోలీసులు తనను ఇలా వేధించడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్దన్రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, మడకశిర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి, నాయకులు రంగనాథ్, నరేష్రెడ్డి, మంజునాథ్, చిరంజీవి తదితరులు రూరల్ సీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంద్రాసేనారెడ్డికి అండగా నిలబడ్డారు. రూరల్ సీఐ రాజ్కుమార్, గుడిబండ ఎస్ఐ రాజ్ కుళ్లాయప్పతో మాట్లాడారు. వెంటనే ఇంద్రసేనారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈర లక్కప్ప స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి మాట్లాడారు. టీడీపీ నాయకుల ఆదేశాలతో పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం పోలీసులు ఇంద్రసేనారెడ్డికి నోటీసు ఇచ్చి పంపారు. మడకశిర పోలీసుల అత్యుత్సాహం మంగళగిరి నుంచి సోషల్మీడియా యాక్టివిస్టును తీసుకువచ్చిన వైనం -
ఇష్టపడే పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదు
మంగళగిరి టౌన్ : ప్రతి ఒక్కరు తమ జీవితంలో వారు ఇష్టపడే పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదని విజయం సాధిస్తారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్లో శుక్రవారం నూతన క్యాథల్యాబ్ను కై కలూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావుతో కలసి ఆయన ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి నూతనంగా నిర్మించబోయే ఆడిటోరియం భవనానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ● ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పూర్తి సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న కొత్త వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్యవిద్యార్థులు నిరంతరం అప్డేట్ కావాలని సూచించారు. టెక్నాలజీ పెరుగుతున్న కొలది సామాన్యుడికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. వైద్యులు రోగులకు న్యాయమైన విధంగా సేవ చేయాలని, రోగులు చెప్పేది పూర్తిగా విని అవసరమైతేనే సంబంధిత వైద్యపరీక్షలు రాయాలని సూచించారు. ఈ మధ్యకాలంలో కొందరు వైద్యుల తీరు పలుకే బంగారమాయేలే అన్న చందంగా మారిందని రోగులతో, వారి సహాయకులతో తెలుగులో మాట్లాడి వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అడ్మినిస్ట్రేటర్ విష్ణువర్ధనరావు, డీన్ డాక్టర్ లక్ష్మి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు -
నేటి నుంచి అప్రెంటిస్షిప్నకు ధ్రువపత్రాల పరిశీలన
పట్నంబజారు: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన తేదీలు ఖరారు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం సాబ్రాంజ్యం తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సిన అభ్యర్థుల వివరాలను ట్రేడ్ల వారీగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24, 26, 29వ తేదీల్లో విజయవాడలోని విద్యాధరపురంలో ఉన్న ఆర్టీసీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. 24న మోటారు మెకానిక్, ఫిట్టర్, సివిల్, వెల్డర్, పెయింటర్, 26, 27న ఎలక్ట్రీషియన్, 29, 30న డీజిల్ మెకానిక్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. 30న ‘చలో విజయవాడ’ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న చేపట్టిన హలో యువత.. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.వలి పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో విజయవాడ నిరుద్యోగ రణభేరి పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. వలి మాట్లాడుతూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
అంతరిక్షం మన జీవితంలో భాగం
చేబ్రోలు: ‘అంతరిక్షం కేవలం పరిశోధనలకే పరిమితం కాదు, అది నేడు దేశ రక్షణలో అంతర్భాగమైంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తర్వాత అంతరిక్షమే నాలుగో యుద్ధ క్షేత్రం’ అని డీఆర్డీవో మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026’లో భాగంగా నిర్వహించిన సౌత్ ఇండియా రాక్రెటీ ఛాలెంజ్ రెండో రోజు శుక్రవారం ఘనంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. విజ్ఞాన్ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు చేతుల మీదుగా అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ● కార్యక్రమంలో డాక్టర్ జి. సతీష్రెడ్డి మాట్లాడుతూ... స్పేస్ అనేది మన జీవితంలో ఒక భాగం అవుతుందని దశాబ్దాల క్రితమే చెప్పారని, నేడు అది అక్షరాలా నిజమైందన్నారు. ఒక్క క్షణం అంతరిక్ష సాంకేతికత నిలిచిపోతే మన కమ్యూనికేషన్ వ్యవస్థ, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయం, చివరికి టీవీ చానల్స్ కూడా మూతపడతాయన్నారు. సామాన్యుడి దైనందిన జీవితం అనేది స్తంభించిపోతుందన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అందుకు బెల్లాట్రిక్స్, దిగంతర సంస్థలు ఉదాహరణలుగా వివరించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా స్వయంగా ఒక శాటిలైట్ను తయారు చేసి ప్రయోగించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ● చాన్సలర్, అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు, మాట్లాడుతూ దేశం అంతరిక్ష రంగంలో ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందన్నారు. ఉపగ్రహాల ద్వారా హైస్పీడ్ డేటా కమ్యూనికేషన్ అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ● ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనల్లో అపజయాలను చూసి కుంగిపోకూడదని, వైఫల్యాలను ఎదుర్కోవడం నేర్చుకున్నప్పుడే గొప్ప విజయాలు లభిస్తాయన్నారు. విద్యార్థులు పూర్తి సామర్థ్యంతో తమ రాకెట్లను ప్రయోగించి సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. విద్యార్థులు అసాధారణ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారని, కెమికల్ రాకెట్ను ఏకంగా 1.5 కిలోమీటర్ల ఎత్తుకు విజయవంతంగా ప్రయోగించి ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు. ● కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఏపీ స్పేస్ టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శేషగిరిరావు, సీఈవో కూరపాటి మేఘన, ఇన్చార్జి వైస్ చాన్సలర్ కేవీ కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఆర్డీవో మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి విజ్ఞాన్లో రెండో రోజు ఘనంగా కొనసాగిన ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ -
ఫాసిజానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఫాసిజం ప్రమాదకర స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్, అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఉపాధ్యక్షులు డి.రమేష్ పట్నాయక్ అన్నారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలంయలో శుక్రవారం ఆల్ ఇండియా దళిత రైట్స్ మూమెంట్ (ఏఐడీఆర్ఎం)– దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) జాతీయ సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాసిజం వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవడం అసాధ్యమని, అది రాకముందే అడ్డుకోవడమే ఏకై క మార్గమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని ఎన్నికల్లో ఒంటరిగా చేసి ఓడించడమే కాకుండా, రోజువారీ సామాజిక జీవితంలోనూ బీజేపీ–ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగాలని పిలుపునిచ్చారు. ఎస్.వి యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బి.వి.మురళీధర్ మాట్లాడుతూ వైవిధ్యభరిత సమాజంలో ఒకే ధర్మాన్ని ఆధారంగా తీసుకొని ప్రభుత్వం లేదా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రమాదకరమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర య్య మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, పేద వర్గాల ప్రజలను భక్తి పేరుతో, వివిధ రూపాలలో దోపిడీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఏఐడిఆర్ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వి.ఎస్. నిర్మల్, ఏఐడీఆర్ఎం జాతీయ అధ్యక్షులు రామమూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ కోటేశ్వరరావు, బీకేఎంయూ జాతీయ నాయకులు గుల్జార్ సింగ్ గోరియా, జానకీపాశ్వన్ తదితరులు మాట్లాడారు. గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, తెలంగాణ డీహెచ్పీఎస్ అధ్యక్ష కార్యదర్శులు ఏసురత్నం, అనిల్ కుమార్, బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్ తదితర రాష్ట్రాల డీహెచ్పీఎస్ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.గుంటూరులో ప్రారంభమైన ఆల్ ఇండియా దళిత రైట్స్ మూమెంట్ జాతీయ సమావేశాలు -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో పలువురుని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మునిపల్లె సంపత్కుమార్ను రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా పాటిబండ్ల కవిత, రాష్ట్ర మహిళా విభాగం సహాయ కార్యదర్శిగా కందుకూరి జ్యోతిలను నియమించారు. తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ గుంటూరు ఎడ్యుకేషన్: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేసేందుకు రూ.44 లక్షలు విరాళంగా అందజేసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ శుక్రవారం తిరుమలలోని శ్రీతరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. భాష్యం రామకృష్ణతో పాటు భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. గుంటూరులో సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ ప్రారంభం నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరులో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్–కన్వెన్షన్ నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బృందావన్గార్డెన్స్ మూడో వీధిలో సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్–కన్వెన్షన్ను శుక్రవారం మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అన్నిరకాల వేడుకలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉందని అన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మన్నవ యుగంధర్ మాట్లాడుతూ సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్–కన్వెన్షన్ను సరికొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. వెజ్, నాన్వెజ్ రెస్టారెంట్, బాంకెట్/ కాన్ఫరెన్స్ హాల్, ఫంక్షన్ హాల్, గ్రాండ్ బెడ్రూమ్, గ్రాండ్ కంఫర్ట్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, గ్రాండ్ క్లబ్ సూట్ రూమ్స్ అన్ని రకాల వసతులతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కో–ఆర్డినేటర్ (ఏఏఎస్ఎల్సీ) పోస్టులో ఫారిన్ సర్వీసు నిబంధనల ప్రకారం డిప్యూషన్ పై పని చేసేందుకు 55 ఏళ్లలోపు వయసు కలిగిన ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లు సర్వీసు కలిగిన స్కూల్ అసిస్టెంట్, ఎనిమిదేళ్ల సర్వీసు కలిగిన ఎస్జీటీలలో ఆసక్తి గల వారు ఈనెల 31లోపు గుంటూరులోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయం నందు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు సమగ్రశిక్ష గుంటూరు.బ్లాగ్స్పాట్.కామ్తో పాటు డీఈవో కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో సంప్రదించాలని తెలిపారు. -
లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
మంగళగిరి టౌన్ : మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో ఈఓ సునీల్ కుమార్ సమక్షంలో ధర్మకర్తల మండలి సభ్యులు దామర్ల నాగలక్ష్మీ, మల్లాది వేదవతి, బళ్ళ ఉమా మహేశ్వరరావు, భీమవరపు శేషి రెడ్డి, మాజేటి కృష్ణ కుమారి, మేకల మోహనరావు, పేరం లీలావతి, కొక్కెరపాటి పూర్ణచంద్రరావు, గురప్రుశాల శ్రీలక్ష్మీ, చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, తుల్లిమిల్లి రామకృష్ణ, రుద్రుడు త్రిశూల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన పాలకమండలి సభ్యులు సాంప్రదాయబద్ధంగా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలకమండలి సభ్యులు చురుకుగా పాల్గొని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఈవో కోగంటి సునీల్ కుమార్ కోరారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, వేదపండితులు, ధర్మకర్తల కుటుంబసభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
గెలుపోటముల కన్నా క్రీడాస్ఫూర్తి ముఖ్యం
గుంటూరు రూరల్: గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె.మురళీమోహన్, డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. చౌడవరంలోని కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సాఫ్ట్బాల్ పురుషుల టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఉత్కంఠంగా సాగిన ఈ టోర్నమెంట్లో సి.ఆర్. డిగ్రీ కాలేజీ (చిలకలూరిపేట) జట్టు విజేతగా నిలిచింది. కె.హెచ్. అండ్ ఎల్.ఎస్. స్కాలర్స్ డిగ్రీ కాలేజీ (పిడుగురాళ్ల) జట్టు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. తృతీయ స్థానంలో ఆర్.వి.ఆర్.జె.సి.ఇంజినీరింగ్ కళాశాల, నాలుగో స్థానంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ (నరసరావుపేట) జట్లు నిలిచాయి. మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్యూ సాఫ్ట్బాల్ జట్టును సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్.గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె.కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె.రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పీ గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఏఎన్యూ టోర్నమెంట్ అబ్జర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ ప్రీతంప్రకాష్, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల ప్రతినిధులు ముగిసిన అంతర్ కళాశాలల సాఫ్ట్బాల్ టోర్నీ -
రాజీ చేసేలా కృషి చేయాలి
ఎక్కువ కేసులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కల్యాణ్ చక్రవర్తి గుంటూరులీగల్: శిక్షణ పూర్తయిన న్యాయవాదులు మధ్యవర్తిత్వాన్ని వృత్తిగా ఎంచుకొని ఎక్కువ సంఖ్యలో కేసులను రాజీ చేసే దిశగా కృషి చేయాలని, కక్షిదారులకు సరైన న్యాయం చేసేదిశగా మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వం మీద 40 గంటలపాటు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ శిక్షకులు శ్రీలాల్ వారియర్, నీనా ఖరేలు శిక్షణ ఇచ్చారు. పలు అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులకు అభినందనలు తెలిపి సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారి అనుభవాలను పంచుకొని మధ్యవర్తిత్వంపై మరింత అవగాహన పెంచుకొనే దిశగా కృషి చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
కన్నా అనుచరుడి అరాచకం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలంలో సత్తెనపల్లి శాసనసభ్యుడు, మాజీ మంత్రి కన్నా అనుచరుడు, పీవీఆర్ చలపతి మెటల్ ఇండస్ట్రీస్ అధినేత పి వెంకటేశ్వరరావు అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబునాయుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలకలూరులోని క్వారీలలో అనుమతులు ఉన్న ఎవరిని తవ్వనీయకుండా తానే ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నాడని మిగిలిన క్వారీ యజమానులు ఆరోపిస్తున్నారు. క్వారీకి వెళ్లే దారిని తవ్వేయడంతోపాటు మిగిలిన క్వారీ యజమానులను బెదిరిస్తున్నాడని, ఆయనకు మాజీ మంత్రి అండదండలు ఉండటంతో పార్టీ నాయకులు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 క్వారీలు ఉన్నా పక్కన ఉన్న క్వారీలపై కన్నేసిన ఆ నాయకుడు మిగిలిన క్వారీల వారికి దారి లేకుండా చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న క్వారీ యజమానులు మొరపెట్టుకున్నా అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పేరేచర్ల తెల్ల క్వారీ వడ్డెర క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్టర్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కు గుంటూరు రూరల్ మండలం చినపలకలూరు గ్రామంలో సర్వే నెంబర్ 155/ఎ1లో 1.214 హెక్టార్ల క్వారీ లీజు ఉంది. దీన్ని 13 నెలలుగా జరగనీయకుండా సదరు నాయకుడు అడ్డు పడుతున్నాడు. తనకు కేటాయించిన స్థలంతోపాటు వడ్డెర క్వారీలో కూడా అనుమతులు కూడా లేకుండా తవ్వడంపై ఆ వడ్డెర క్వారీ వారు ఫిర్యాదు చేయడంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. బాధితులు ఇబ్రహీంపట్నం రాష్ట్ర మైనింగ్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఒంగోలు మైనింగ్ అఽధికారితో విచారణ జరిపించారు. ఆయన పరిశీలన చేసి ఇరువర్గాలతో మాట్లాడిన తర్వాత గత ఏడాది నవంబర్ 26న మైనింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మంత్రి వద్దకు వెళ్లిన సదరు నేత స్టే తీసుకువచ్చారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో పంచాయితీ ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో కూడా పంచాయితీ జరిగింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే బయటకు రాగానే సదరు నాయకుడు అడ్డం తిరిగాడు. క్వారీకి వెళ్లే దారిని పొక్లెయిన్తో తవ్వేయడంతో మిగిలిన క్వారీలకు దారి లేకుండా పోయింది. దీంతో 13 నెలలుగా 50 వడ్డెర కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. గతంలో కూడా ఇలానే అడ్డుకుంటే గత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో వారి ఆదేశాల మేరకు క్వారీలు సవ్యంగా నడిచాయి. మళ్లీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారి తవ్వేయడంతో పాటు ఆ క్వారీ వారు ఎవరూ రాకుండా తన మనుషులతో అడ్డుకుంటున్నాడు. తాజాగా శుక్రవారం వడ్డెర క్వారీ నిర్వాహకులతోపాటు వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టు నాగేశ్వరరావు మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు. మంత్రి వారి వద్ద ఉన్న కాగితాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే వద్ద నుంచి లేఖ తెచ్చుకోవాలని సూచించా రు. స్థానిక ఎమ్మెల్యే నుంచి కూడా లేఖ తెచ్చామని వారు చూపించగా సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణను కలవాలని సలహా ఇచ్చారు. దీనిపై వడ్డెర క్వారీ నిర్వాహకులు ఇక్కడ ఆయనకేం పని అని ప్రశ్నించారు. తాము పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారని నాగేశ్వరరావు తెలిపారు. తమ క్వారీ నిర్వహణకు పార్టీ నాయకులతో పనేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ధోరణి మారకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఆయన సాక్షికి తెలిపారు. -
తుక్కు తరలింపులో మెక్కేస్తున్నారు
గుంటూరు మెడికల్: రౌతు మెతకనైతే గుర్రం మూడుకాళ్ల మీద నడిచిందన్న చందాన గుంటూరు పెద్దాసుపత్రి(జీజీహెచ్)లో అధికారుల పరిపాలన సాగుతోంది. కొంత మంది సిబ్బంది, కొంత మంది అధికారులతో మిలాఖతై ప్రతిదాంట్లో అందిన కాడికి నొక్కేసి జేబులు నింపుకుంటున్నారు. బుధవారం రాత్రి ఎవరి కంట పడకుండా హడావుడిగా ఆసుపత్రిలోని తుక్కును తరలించి వారికి నచ్చినచోట తూకాలు వేయించి, అందిన కాడికి జేబుల్లో పెట్టేసుకున్నారు. తాజాగా బుధవారం రాత్రి జరిపిన అమ్మకాలకు సంబంధించి డబ్బు సైతం కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో హెచ్డీఎస్ (ఆసుపత్రి అభివృద్ధి సంఘం) అకౌంట్కు జమ చేయలేదు. అయినప్పటికీ యథేచ్ఛగా తుక్కును తీసుకెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయడం విమర్శలకు తావిస్తుంది. పరిపాలనా అధికారి పనితీరు బాగోకపోవడంతో రెండు నెలల క్రితం సరెండర్ చేశారు. సదరు బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో ఎవరికి తెలియదు. తుక్కు తరలింపులో ఏవో, వర్క్షాపు ఉద్యోగుల పాత్ర కీలకం. వీరివురు లేకుండా మరో అధికారి స్వయంగా తనకు నచ్చిన వేయింగ్ మిషన్ సెంటర్కు తుక్కు లారీని తరలించినట్లు ఆసుపత్రి ఉద్యోగులు చెవులు కొర్కుంటున్నారు. -
పోలీసుల తనిఖీల్లో భారీగా సొత్తు స్వాధీనం
తెనాలిరూరల్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీ ఎత్తున సొత్తు లభించింది. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు వచ్చిన సమాచారంతో తెనాలి పట్టణ బాలాజీరావుపేట మహేంద్ర కాలనీలో గుంటూరు నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు, ఇక్కడి త్రీ టౌన్ పోలీసులతో కలసి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు ఇళ్లలో ఏకధాటిగా నాలుగు బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. ఓ రేకుల షెడ్డులో నివసిస్తున్న పేరుబోయిన గురవమ్మ వద్ద 700 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి, రూ.5.60 లక్షల వరకు నగదు లభించింది. మహేంద్ర కాలనీలోని ఓ ఇంట్లో అతి విలువైన పురాతన దేవతా విగ్రహాలు, పురాతన విగ్రహాలు ఉన్నట్టు ఎస్పీకి వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఇంత భారీ మొత్తంలో సొత్తు లభించడంతో పోలీసులు అవాక్కయ్యారు. గురవమ్మ అల్లుడు గురునాథం ఇతర రాష్ట్రాల నుంచి బంగారం, వెండి తెచ్చి విక్రయాలు జరుపుతుంటాడని, ఓ కేసులో నిందితుడిగా ఉన్న క్రమంలో పోలీసులు అతని ఇంటికి తనిఖీలకు వెళ్లే సమయానికి మూట ముల్లె సర్దుకుని పరారయ్యాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ జిందాల్కు వచ్చిన సమాచారంతో మహేంద్ర కాలనీలో తనిఖీలకు ఎస్పీ ఆదేశించగా గురునాథం అత్త వద్ద ఈ సొత్తు లభించింది. గుంటూరు నుంచి పోలీసుల బృంద సభ్యులు తెనాలి పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు రైల్వేస్టేషన్ వద్దకు రావాలని సమాచారమిచ్చి హుటాహుటిన ఇక్కడకు వచ్చారు. స్థానిక పోలీసులను వెంటబెట్టుకుని తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసులకు కేసుకు సంబంధించిన వివరాలు చెప్పకుండానే గుంటూరు నుంచి వచ్చిన బృందం లభించిన సొత్తుతో నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లిపోయింది. -
నేటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల మూత
కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 24వ తేదీన నాలుగో శనివారం, 25న ఆదివారం సెలవు. ఇక 26న రిపబ్లిక్ డే సందర్భగా సోమవారం అధికారికంగా సెలవు ఉంటుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కారణంగా 27న మంగళవారం కూడా బ్యాంకులు మూతపడనున్నట్లు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సమ్మె విరమణకు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నందున ఇంకా స్పష్టత లేదన్నారు. ఇప్పటికై తే అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపాయి. -
గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
తాడికొండ: రాజధాని ప్రాంతంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ శుక్రవారం పరిశీలించారు. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా ఉన్న పెరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించనున్నారు. 22 ఎకరాల్లో పెరేడ్ కోసం గ్రౌండ్, వీవీఐపీ, వీఐపీ పార్కింగ్కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు కేటాయించారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడంతోపాటు వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలను అధికారులు పంపుతున్నారు. ఈ వేడుకలకు మొత్తం 13 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు మంత్రికి వివరించారు. వేడుకలకు హాజరయ్యే వీఐపీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. -
వైభవంగా వసంత పంచమి
నరసరావుపేట ఈస్ట్: వసంత పంచమిని పురస్కరించుకొని భక్తులు ఆలయాల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ శుద్ధ పంచమి రోజున శ్రీసరస్వతీ దేవి జన్మదినం సంద ర్భంగా శుక్రవారం తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరా భ్యా సం నిర్వహించారు. నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠంలోని శ్రీశారదాంబ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పెన్నుల తో అలంకరించి పూజలు జరిపారు. వినుకొండరోడ్డులోని త్రిశక్తి దేవాలయల సముదాయంలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాలతో పాటు పాఠశాలల్లో సరస్వతీ పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపారు. రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176వ వార్షిక మహోత్సవంలో భాగంగా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయని విచారణ గురువులు ఏరువ లూర్ధుమర్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు జెండా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం చర్చి ప్రాంగణంలో సిల్వర్ జూబిలేరియన్స్ రెవ.ఫాదర్ పుట్టి అంతోనిరాజు, రెవ.ఫాదర్ తుమ్మా మర్రెడ్డి, రెవ.ఫాదర్ చింతపల్లి అబ్రహాం, రెవ.ఫాదర్ పోతిరెడ్డి ఇన్నారెడ్డిలచే దివ్యపూజాబలితో పండుగ మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తెనాలి:ఆంధ్రవాల్మీకి శ్రీవాసుదాస స్వామి వా రి పరంపరపీఠం దాసకుటి, అంగలకుదురులో పీఠాధిపతి శ్రీ సీతారామదాసస్వామి వారి ఆధ్వర్యంలో 164వ శ్రీ వాసుదాసు స్వామి జయంతిని ఘనంగా జరుపుతున్నారు. మూడు రోజుల వేడుకల్లో రెండవ రోజైన శుక్రవారం రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. జాగర్లమూడి రఘురాం ఆచార్యులు పూజా కార్యక్రమాలను చేయించారు. ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథశాస్త్రి శ్రీ సత్యనారాయణ స్వామివ్రత కథను వివరించారు. ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి దంపతులు, పులిపాక అప్పారావు దంపతులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. తెనాలి: ఈనెల 25వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని తెనాలి బాలాజీరావుపేటలోని అయ్యప్ప దేవాలయం నిర్వాహకుడు దుర్భా హరిబాబు స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో సహస్ర దళ సూర్యయంత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రథసప్తమికి అందుబాటులోకి వస్తుందని, భక్తులందరూ దర్శించుకోవాలని సూచించారు. నాదెండ్ల: కనపర్రు గ్రామంలోని పురాత న ఆర్సీఎం చర్చిలో పునీత, జోజప్ప కల్యాణ నిశ్చితార్థ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చర్చి నిర్మించి 128 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమానికి విచారణ గురువు ఫాదర్ చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరయ్యారు. స్థానిక విచారణ గురువు బంధనాథం లూర్దురాజు ఆధ్వర్యంలో ఉదయం సమష్టి దివ్య పూజాబలి నిర్వహించా రు. కానుకలు, కొవ్వొత్తులు సమర్పించారు. రాత్రి తేరు ఊరేగింపు నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చి వద్ద ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభ ఆకట్టుకుంది. -
వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు ప్రశంసలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ప్రశంసల జల్లు కురిసింది. క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం వైఎస్ జగన్ కృషి చేశారని డిబేట్లో ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అభినందించారు. ఏపీ క్లీన్ ల్యాండ్ టైటలింగ్ కోసం కృషి చేసిందని గీతా కితాబునిచ్చారు.చాలా మంచి భూ సంస్కరణలు తీసుకొచ్చారని.. ఆంధ్రప్రదేశ్ చాలా బాగా చేసింది.. చాలా క్రియేటివ్ గా చేసిందన్న గీతా గోపినాథ్.. ల్యాండ్ కన్వర్షన్ కోసం మంచి విధానాలు అవలంభించారని పేర్కొన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం చర్చా గోష్టిలో కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ సమక్షంలోనే గీతా గోపినాథ వెల్లడించారు. కాగా, వైఎస్ జగన్ ల్యాండ్ టైటిల్ సంస్కరణలపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేయగా.. వైఎస్ జగన్ పారదర్శక విధానానికి ప్రశంసలు రావడంతో చంద్రబాబు అండ్ కో అభాసుపాలైంది. -
రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం
సాక్షి, గుంటూరు: రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. గతంలో సీఆర్డీఏ కేటాయించిన అభ్యంతరకరమైన ప్లాట్లపై అధికారులు మళ్లీ లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో ఈసారి కూడా తమకు వీధి శూల ప్లాట్లు వచ్చాయంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానికి భూములు ఇచ్చి ప్లాట్ కోసం మీ చుట్టూ 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నామని రైతులు మండిపడుతున్నారు. తాము కేటాయించిన ప్లాట్లే తీసుకోవాలని.. ఇష్టం ఉంటే తీసుకోండి.. లేకపోతే లేదని చెబుతున్నారంటూ సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహంతో ప్లాట్ల లాటరీ నిలిచిపోయింది. -
జగన్ ఇచ్చిన పాస్బుక్కులే అవి.. మీరు చేసిందేమిటీ?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి రెండేళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేనే చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు అని తెలిపారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్ల మీద అనగాని పచ్చి అబద్ధాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ బుక్ అయినా ఇచ్చారా?. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్లు తీసుకుని కొత్త పాస్ బుక్లు ఇస్తున్నారు. పాస్ బుక్ల మీద వైఎస్ జగన్ ఫొటో తీయడం తప్ప మీరు చేసిందేమిటీ?. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా?. 1802లో మొట్టమొదటి సారి ఇండియాలో సర్వే చేశారు. 1926-32 వరకు తరువాత బ్రిటీషర్లు సర్వే చేశారు. ఈ సర్వేనే ఇప్పటి వరకు ఇండియాలో కొనసాగుతోంది. రెవెన్యూ మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడారు. మంత్రి అనగాని ఆటవిక సమాజంలోకి పయనిస్తున్నారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి అయ్యారు. రూ.25 కోట్లు తీస్తే పార్టీ మారుతానని చెప్పిన వ్యక్తి అనగాని అని ఎద్దేవా చేశారు.1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రైతులు ఇబ్బందుల గురించి ఆలోచన చేశారా?. తక్కెళ్లపల్లిలో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వే మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు. మంత్రి అనగాని తన డిపార్ట్మెంట్ మీద దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేలో కొంచెం కూడా తేడా రాదు. జగన్ ఆరు వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి చేశారు. ఈ ఆరువేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన పరికరాలనే బాబు వాడుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ శాఖ కలిపి ఏపీలో భూ సమగ్ర సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన డ్రోన్ ప్లే డేటా, ఓఆర్ఐ కాపీలను బాబు ప్రభుత్వం వాడుతుంది. శాలిలైట్తో లింక్ చేసి వైఎస్ జగన్ సమగ్ర భూ సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు. వైఎస్ జగన్ తెచ్చి సిస్టం ప్రపంచంలోనే అద్భుత భూ సర్వే అని చెప్పుకొచ్చారు. -
‘గోవిందరావు మృతికి టీడీపీ నేత పట్టాభినే కారణం’
తాడేపల్లి : జీవీఎంసీ అధికారి గోవిందరావు మృతికి టీడీపీ నేత, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభే కారణమన్నారు వైఎస్సార్సీపీ ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్రెడ్డి. గోవిందరావుపై పట్టాభి జులుం ప్రదర్శించి మరణానికి కారణమయ్యారన్నారు. అధికారి చావుకు కారణమైన పట్టాభిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈరోజు(శుక్రవారం, జనవరి 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్రెడ్డి..గోవిందరావు మృతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ పట్టాభిని వెంటనే పదవి నుండి తొలగించాలి. గోవిందరావు చెప్పే మాటలు కూడా వినకుండా పట్టాభిరామ్ జులుం ప్రదర్శించారు. చంద్రబాబు తన తొత్తులను అధికారుల మీదకు ఉసి గొల్పారు. జన్మభూమి కార్యక్రమం పేరుతో అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే ఉద్యోగుల ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఆయన శిష్యులు ఆ పని చేస్తున్నారు. పెద్ద అధికారులకే దిక్కు లేకపోతే ఇక చిరుద్యోగుల పరిస్థితి ఏంటి?, ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకుంటామన్న చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, రూల్స్ ప్రకారం అడిగితే అధికారులు, ఉద్యోగులు సమాధానం చెప్తారు. అంతేగానీ అందరి ముందూ అవమానిస్తే ఊరుకోం. ఇంకా ఎంతమంది ఉద్యోగులను బలి తీసుకుంటారు?, చంద్రబాబు గోవిందరావు మృతికి బాధ్యత వహించాలి. చంద్రబాబుకు ఉద్యోగులపై ప్రేమ ఉంటే వెంటనే పట్టాభిని పదవి నుండి తొలగించాలి. పూర్తి స్థాయి విచారణ జరపాలి. గతంలో అటవీ శాఖ అధికారులపై దాడి చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే కూటమి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పట్టాభిరామ్.. ఉద్యోగులతో పెట్టుకోవద్దు. రాష్ట్రం మీద పడి ఉద్యోగులను చంపే అధికారం మీకు ఎవరిచ్చారు?, ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సిన ఏ బకాయినీ చెల్లించకుండా వేధిస్తున్నారు. ఇప్పుడేమీ ఏకంగా ఉద్యోగులను చంపుకుంటూ పోతారా?’ అని మండిపడ్డారు. -
నేతాజీ జయంతి.. వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ఈ సందర్భంగా.. వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నివాళుల్పించారు. స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశభక్తి, ధైర్యం, పోరాట పటిమ, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. `స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశభక్తి, ధైర్యం, పోరాట పటిమ, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం. నేడు ఆ… pic.twitter.com/N7XdSKBGV2— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2026భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అజరామర నాయకుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ముద్రపడింది. ఆయన జీవితం ధైర్యం, త్యాగం, దేశభక్తి అనే మూడు మూలస్తంభాలపై నిర్మితమైంది. ఒడిశా(పూర్వపు ఒరిస్సా)లోని కటక్లో 1897 జనవరి 23న ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే బోస్ అసాధారణ ప్రతిభను ప్రదర్శించేవారు. ఐసీఎస్ (Indian Civil Services) పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడం ఆయనకు నచ్చలేదు. అందుకే దేశ సేవే తన ధ్యేయమని భావించి.. ఆ ఉద్యోగాన్ని వదిలి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, తరువాత ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం కోసం కేవలం అహింసా మార్గం సరిపోదని భావించి, ఆయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ ఆలోచనతోనే ఆయన భారతీయ జాతీయ సైన్యం (INA)ని ఏర్పాటు చేసి, “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా(మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను)” అనే నినాదంతో ప్రజల్లో ఉత్సాహాన్ని రగిలించారు. బోస్ 1945లో విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారికంగా చెబుతారు. అయితే ఆ ప్రచారంపై అనేక సందేహాలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. -
వైఎస్ జగన్ దృష్టికి అంజుమన్ భూముల విషయం తీసుకెళ్లాం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): చినకాకానిలోని అంజుమన్ భూముల విషయాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా చెప్పారు. అంజుమన్ భూముల పరిరక్షణకు ఆయన పూర్తిస్థాయిలో అండగా ఉంటానని భరోసానిచ్చారని తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. అంజుమన్ భూములను కాపాడుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, దీనిపై ఇప్పటికే తాను స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగిందన్నారు. ఈ నెల 30న గుంటూరు నగరంలో భారీ నిరసన శాంతి ర్యాలీ జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీలలో నగరంలో సంతకాల సేకరణ చేపడుతున్నామని వివరించారు. మసీదుల వద్ద మొదలుకుని ముస్లిం మైనారిటీ వర్గాలు అధికంగా నివసించే ప్రాంతాలకు వెళ్లి అంజుమన్ భూములను టీడీపీ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నాన్ని వివరించి సంతకాలు సేకరిస్తామని తెలిపారు. 30వ తేదీన జరిగే ర్యాలీకి సంబంధించి 26, 27, 28 తేదీల్లో ముఖ్య సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 29వ తేదీన మంగళగిరిలోని అంజుమన్ భూముల స్థలాన్ని స్వయంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీ జరుగుతున్నట్లు వివరించారు. అంజుమన్ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్అహ్మద్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లీం మైనారిటీ సమాజమంతా చినకాకానిలో 71.57 ఎకరాల అంజుమన్ భూముల పరిరక్షణ కోసం పరితపిస్తోందన్నారు. -
ఏపీ గ్రామీణ బ్యాంక్తో యూనియన్ ఎంఎఫ్ భాగస్వామ్యం
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డై–ఇచి లైఫ్ హోల్డింగ్ ఇన్ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తున్న యూనియన్ మ్యూచువల్ ఫండ్(యూనియన్ ఎంఎఫ్), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ)తో పంపిణీ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు గురువారం గుంటూరులోని ఓ హోటల్లో ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్కుమార్ రెడ్డి, యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంసీ) సీఈఓ మధు నాయర్లు ఒప్పందంపై సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ సీఈఓ మధు నాయర్ మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి యూనియన్ మ్యూచువల్ ఫండ్ సుమారు రూ.25,636 కోట్ల సగటు నిర్వహణలో ఉన్న ఆస్తులను నిర్వహిస్తోందని తెలిపారు. ఏపీజీబీ చైర్మన్ కె.ప్రమోద్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,351 శాఖలు, సుమారు 1.20 కోట్ల మంది ఖాతాదారులతో రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్గా ఏపీజీబీ ఉందన్నారు. -
ఐస్ స్కేటింగ్లో రజతం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన లడఖ్లో ఈ నెల 20న జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్–2026లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. జెస్సీరాజ్ విజయవాడలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని. ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అమితాబ్ శర్మ, సెక్రటరీ జగరాజ్ సింగ్ సహానీ, ఫిగర్ స్కేటింగ్ హెడ్ నటాలి, ఏపీ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సెక్రటరీ ఖాజా, కోచ్ అబ్దుల్ హఫీజ్ వెండి పతకాన్ని సాధించిన జెస్సీరాజ్ను అభినందించారు. తెనాలి: శాలివాహన సంఘం (కుమ్మరి), తెనాలి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల మొదటి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించనున్నారు. శాలివాహన సంఘం (కుమ్మరి) నాయకులు గురువారం చెంచుపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. ఫిబ్రవరి 22వ తేదీన తెనాలి ఎన్జీవో కల్యాణమండపంలో జరిగే వధూవరుల పరిచయవేదిక, శాలివాహన సంఘం, తెనాలి గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, ఆర్గనైజర్ వేజండ్ల శివన్నారాయణ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం72044 95747, 92472 71344, 70135 01766 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
న్యాయమూర్తులకు శిక్షణ కార్యక్రమం
గుంటూరు లీగల్: మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా స్థానిక కోర్టుల ప్రాంగణంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ నియమించిన శిక్షకులు శ్రీలాల్ వారియర్, మిస్ నీనా ఖరే ట్రైనీ అడ్వకేట్లు గుంటూరు జిల్లా న్యాయమూర్తులకు మీడియేషన్పై అవగాహన కల్పించారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ, న్యూఢిల్లీ.. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం అనేది పూర్తిగా కక్షిదారుల స్వచ్ఛంద ప్రక్రియ అన్నారు. సమస్య పరిష్కారంలో కక్షిదారులే కీలక పాత్ర దారులని, మధ్యవర్తిత్వంలో కక్షిదారుల ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఉంటుందన్నారు. తమకు అనుకూలమైన రీతిలో కక్షిదారులు కేసులు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సెటిల్ అయితే కోర్టు ఫీజు రిటర్న్ ఇవ్వబడుతుందని, అగ్రిమెంట్ రాసుకుని సెటిల్ అయితే జడ్జిమెంట్ కూడా అదేవిధంగా ఇవ్వబడుతుందన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ అయిన కేసులపై ఎలాంటి అప్పీల్ ఉండదని మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.శివ సూర్య నారాయణ, ట్రైనర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
గుంటూరు రూరల్: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను చేరాలని గుంటూరు సీజీఎస్టీ కమిషనర్ సుజిత్మల్లిక్ తెలిపారు. గురువారం నల్లపాడు గ్రామంలోని పీఎం కేంద్రియ విద్యాలయం వార్షికోత్సవం నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని కమిషనర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విలువలతో కూడిన విద్యతోపాటు, సమాజాభివృద్ధికి అవసరమైన మానవీయ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ లక్ష్య సాధన దిశగా కృషిచేయాలని తెలిపారు. సీజీఎస్టీ జాయింట్ కమిషనర్ దాసరి రామకృష్ణ మాట్లాడుతూ వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శనలు, నృత్యాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు. ఇదే ఉత్సాహంతో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత, ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బొంతా శేఖర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా విద్యాబోధన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆహూతులను అలరింపజేశాయి. వివిధ పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రియ విద్యాలయం వార్షికోత్సవంలో సీజీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ -
విజ్ఞాన్లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్’
సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 పోటీలుచేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్టెక్ అకాడమీ మరియు హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026’ను గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ను ‘లెవరేజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఏపీ స్పేస్ టెక్ అకాడమీ ఆధ్వర్యంలో పబ్లిష్ చేసిన ‘స్పేస్ టెక్ స్పెక్ట్రమ్ జర్నల్’ను ఆవిష్కరించారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెట్రీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ మాట్లాడుతూ భారత్ ‘స్పేస్ యుబిక్విటీ’ దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్ సమ్మిట్లో భాగంగా నిర్వహించిన ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యాసంస్థల విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో భాగంగా విద్యార్థులు స్వయంగా చిన్న రాకెట్ల నమూనాలను రూపకల్పన చేసి, తయారు చేసి, లాంచ్ చేశారు. సమ్మిట్లో భాగంగా నిర్వహించిన స్టార్టప్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు, విజ్ఞాన్ సీఈఓ డాక్టర్ కూరపాటి మేఘన, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, మాజీ డీజీపీ మాలకొండయ్య పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లకు డైట్ బిల్లులు జమ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు గత సంవత్సరం అక్టోబర్ నుంచి డైట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్ ఉన్నప్పటికీ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్లు అప్పు చేసి విద్యార్థులు భోజనం పెడుతున్నారు. దీనిపై సాక్షి దినపత్రికలో ఈ నెల 21వ తేదీన ‘సంక్షేమం’లో సంక్షోభం అనే కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించి హాస్టళ్లకు డైట్ బిల్లులను 22వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. వార్డెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. డైట్ బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యమైతే, మెను సక్రమంగా అమలు చేయని పక్షంలో వార్డెన్లతో పాటు ఏఎస్డబ్ల్యూఓలు, ఆపై అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. గుంటూరు జిల్లా సాంఽఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోకపోతే బదిలీ చేయక తప్పదని డెప్యూటీ డైరెక్టర్కు చురకలు అంటించారని సమాచారం. -
‘పది’ పైనే గురి
గుంటూరు ఎడ్యుకేషన్: మార్చి 16 నుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు తదేక దీక్షతో సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పరీక్షల్లో అధిక మార్కుల సాధన దిశగా వారిపై శ్రద్ధ చూపిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 490 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 27,260 మంది విద్యార్థుల కోసం 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ● ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. ● మారుమూల ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వచ్చి సాయంత్రం వరకు తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం లేక అర్ధాకలితో ఉంటున్నారు. ● దీనిపై తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశాలతో ఇటీవల పలు మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని అల్పాహారం అందజేత ప్రారంభించారు. ● పరీక్షల్లో అధిక మార్కుల సాధన కోసం జిల్లా పరిషత్ ద్వారా ముద్రించిన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ను ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ● జెడ్పీ నిధులతో ప్రతి ఏటా స్టడీ మెటీరియల్తో పాటు అల్పాహారానికి సైతం నిధులు కేటాయిస్తున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు జెడ్పీ నుంచి అల్పాహారం కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం -
తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీటీడీ నిత్యాన్నదానానికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు గురువారం తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒక రోజు అన్నదాన నిమిత్తం ఈ విరాళాన్ని అందించామని తెలిపారు. రొంపిచర్ల: స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం కనపడింది. ఉదయం వేళ గర్భగుడిలో ఉన్న అమ్మవారి మూలవిరాట్ను తాకుతూ సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వచ్చారు. పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేముల బాబు శర్మ పర్యవేక్షించారు. నరసరావుపేట రూరల్: వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం కోటప్పకొండ క్షేత్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాదెండ్ల: గణపవరం శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఇరువురు దాతలు రూ.1.05 లక్షల విరాళాన్ని హెచ్ఎం కృష్ణానాయక్కు అందించారు. గ్రామానికి చెందిన జంపని శ్రీనివాసరావు, కాట్రు కృష్ణారావు గురువారం పాఠశాలను సందర్శించి, విరాళం అందజేశారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ప్రహరీ, ప్రార్థన వేదిక, ఓపెన్ ఆడిటోరియం, తదితర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని రైల్వే గేటును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు రైల్వే అధికారి కన్నబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు అత్యవసర రహదారి పనుల నిమిత్తం అంజిరెడ్డి కాలనీ, కేసీసీ యార్డ్ మధ్య గల రైల్వే గేటు మీదుగా రాకపోకలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల సాధనలో భాగంగా గురువారం గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు వారి డిమాండ్ల సాధనకు ఈనెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా బ్యాంకు యూనియనన్స్ యునైటెడ్ ఫోరం తరఫున దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో నిర్వహించిన ప్రదర్శనలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు రోజుల పనిని అమలు చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరారు. ప్రస్తుతం 2, 4వ శనివారాలు ఇప్పటికే సెలవులుగా ఉన్నాయి. మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించాలని కోరారు. గుంటూరులో యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో గుంటూరు మాడ్యూల్ ఎస్.బి.ఐ. ఆఫీసర్స్ అసోసియేషన్ సీఆర్ఎస్ కె.ఆర్.వి.జయకుమార్, ఎస్.బి.ఐ.స్టాఫ్ యూనియన్ డీజీఎస్ కె. కోటిరెడ్డి, ఎ.జి.ఎస్. పి.ఎస్. రంగసాయి, యు.ఎఫ్.బి.యు.అడ్వైజర్ పి.కిషోర్, యు.ఎఫ్.బి.యు. ప్రెసిడెంట్ రవిచంద్రా రెడ్డి, యు.ఎఫ్.బి.యు. జిల్లా కన్వీనర్ మహమ్మద్ సయ్యద్ బాషా, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ సెక్రటరీలు ఎం. రాంబాబు, పి. కళ్యాణ్, ఎ.పి.టి.బి.ఇ.ఎఫ్. ప్రెసిడెంట్ రామకృష్ణ, బెఫి స్టేట్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు, ఇతర నాయకులతో పాటు వివిధ శాఖల లోకల్ సెక్రటరీలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొని పెద్దఎత్తున తమ నిరస తెలిపారు. -
అక్రమ వసూళ్లు
బాపట్ల జిల్లా చుండూరు మండలం కొత్త నారికేళపల్లి సర్పంచ్పై హత్యాయత్నం చేసి, ఆయన తప్పించుకోవటంతో ఆగ్రహం చెందిన టీడీపీ నాయకుడు గుదేటి బాలకోటిరెడ్డి తన అనుచరులతో సర్పంచ్ ఇంటిని ధ్వంసం చేశాడు. ఈ కేసులో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. రేపల్లె డీఎస్పీతో తనకు గల ఆర్థిక లావాదేవీలను అతడే స్వయంగా బహిర్గతం చేసి, తాను సాగిస్తున్న అరాచకాలకు పోలీసులతో తనకున్న లాలూచీ వ్యవహారాలను చాటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. కోడి పందేల కోసం పోలీసు శాఖలో ఒక ఉన్నతాధికారికి రూ.పది లక్షలు ఇచ్చానని బహిరంగంగా చెబుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.సాక్షి టాస్క్ఫోర్స్: చుండూరుకు చెందిన గుదేటి బాలకోటిరెడ్డి టీడీపీలో తొలుత సాధారణ కార్యకర్త. ప్రస్తుతం బాపట్ల జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదిగాడు. పదవితోపాటే అతడి ఆగడాలు, అరాచకాలు పెరుగుతూ వచ్చాయి. ఇందుకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అండదండలు ఉన్నాయని నియోజకవర్గంలో దాదాపు అందరికీ తెలుసు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై 2020లో జరిగిన దాడితో బాలకోటిరెడ్డి వెలుగులోకి వచ్చాడు. వైఎస్సార్సీపీ అధినేత, అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బాలకోటిరెడ్డి విమర్శలు చేశాడు. పత్రికల్లో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చెలరేగిపోయాడు. ఆయన వ్యాఖ్యలను పచ్చ మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. ముఠా ఏర్పాటు చేసుకుని మరీ.. మండలంలోని ఒక్కో కులానికి చెందిన ఇద్దరు, ముగ్గురు చొప్పున యువకులను దగ్గరకు చేర్చుకుని తనకు తానే బాస్ అయ్యాడు. చిన్న చిన్న పంచాయితీలతో మొదలుపెట్టి ఆర్థిక అవసరాలను తీర్చుకోవటం మొదలుపెట్టాడు. భయానక వాతావరణం సృష్టించి, అందరినీ భయభ్రాంతులు చేయటం ద్వారా పబ్బం గడుపుకోవటం అలవరచుకున్నాడు. ఈ క్రమంలో 2023 జూన్లో మోదుకూరులో సొంత మేనత్త ఇంటిపైనే దాడి చేశాడు. మేనత్త కొడుకును కొట్టి, ఆ ఇంటిపై పెట్రోలు బాంబులు వేశాడు. దీనిపై కేసు నమోదైంది. మండలంలోని ఓ గ్రామంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నపుడు బాలకోటిరెడ్డి కేక్ కట్ చేయకముందే కత్తితో, మరో అనుచరుడు గొడ్డలితో సవాళ్లు చేసిన వీడియో ఇప్పటికీ సోషల్మీడియాలో ఉంది. చుండూరు మండలంలో టీడీపీకి అతడో కీలక వ్యక్తి అయ్యాడు. అధికార పార్టీ అవసరాలకు నాయకులు అతడిని చేరదీశారు. అధికారమే అండగా... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రౌడీషీటర్ బాలకోటిరెడ్డి మరింత రెచ్చిపోతున్నాడు. వైఎస్సార్సీపీ హయాంలో చుండూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి త్రీమెన్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన రామిరెడ్డి సుబ్బారెడ్డిపై కొత్తపాలెం రోడ్డులో బాలకోటిరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. పోలీసు కేసు పెడితే చంపుతామని బెదిరించారు. సుబ్బారెడ్డి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోగా, పోలీసులే అతడిని తీసుకెళ్లి తాడేపల్లిలోని బంధువుల ఇంటి వద్ద విడిచిపెట్టారు. మళ్లీ ఊరిలోకి రావొద్దని ఉచిత సలహా ఇచ్చారు. గత డిసెంబరు 24వ తేదీ రాత్రి అధిక లోడుతో వెళుతున్న లారీ రోడ్డు మార్జినులో ఒరిగింది. ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అటుగా కారులో వెళుతున్న చుండూరు సీఐ ఆనందరావు కారు ఆపి దిగారు. ఎదురుగా వస్తున్న బాలకోటిరెడ్డి తన వాహనంలో దూసుకొచ్చాడు. ‘కారు రోడ్డు మీద ఆపిందెవర్రా’ అంటూ గద్దించాడు. ఆ సమయంలో సీఐతో వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో సీఐ కాలర్ను పట్టుకున్నాడని ప్రచారం జరిగింది. పైగా సీఐపైనే పోలీస్స్టేషనులో ఎదురు కేసు పెట్టటం గమనార్హం. దీనిపై చుండూరు మండలంలో పెద్ద చర్చ నడిచింది. కోడి పందేల నిర్వహణ సంక్రాంతి కోడిపందేలు బాలకోటిరెడ్డికి కలిసొచ్చాయి. కొత్తనారికేళ్లపల్లికి దగ్గర్లోనే బరులు ఏర్పాటు చేశాడు. బరి దగ్గరకు ప్రవేశం కూడా టాక్ ఆఫ్ ది మండల్ అయింది. ముందు ఒక వాహనంలో సెక్యూరిటీ వాళ్లు, తర్వాత వాహనంలో గన్మెన్ వచ్చాక మూడో వాహనంలో రంగప్రవేశం చేయటం చూసి, అంతా ముక్కున వేలేసుకున్నారట! కోడిపందేలకు బౌన్సర్లనూ నియమించుకున్నాడు. ఆ పందేల తర్వాతనే కొత్తనారికేళపల్లి సర్పంచ్పై దాడికి దిగాడు. ఆ చిన్న గ్రామంలోని యాదవ వర్గీయుల్లో పార్టీల విభేదాలను ఆసరాగా తీసుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఇంటిపై అనుచరులతో దాడికి తెగబడ్టాడు. ఆ రోజుతో సర్పంచ్ వర్గమంతా గ్రామాన్ని విడిచివెళ్లింది. దాడికి ముందు, తర్వాత కూడా రేపల్లె డీఎస్పీతో ఫోనులో మాట్లాడాడు. ఆ కాల్ హిస్టరీని, డీఎస్పీతో ఆర్థిక లావాదేవీలను బహిర్గతం చేయటం ద్వారా తనను ఈ కేసులోంచి బయటకు తేవాలని పోలీసు అధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్టేనని చెబుతున్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో రేషను బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్తో విక్రయిస్తుండే ఒక రైస్మిల్లరు నుంచి నెలకు రూ.లక్షకుపైగా మామూళ్లను బాలకోటిరెడ్డి వసూలు చేస్తారని చెబుతారు. మామూళ్లు అందటం ఆలస్యమైతే అసలు సహించడట! అలా జరిగితే మిల్లుకు వెళ్లే విద్యుత్ సరఫరా ఆపించిన ఘనుడని చెప్పుకొంటారు. దీంతోపాటు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో చుండూరులోని సిండికేట్ చేసిన నాలుగు మద్యం షాపుల్లోనూ ప్రధాన వాటాదారుడని సమాచారం. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆశీస్సులు ఉండటం, పోలీసు అధికారుల సహవాసం, కావాల్సిన ఆదాయం అందుబాటులో ఉండటంతో తన అరాచకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. -
ఆ బాధ్యత మీదే.. ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్థవంతంగా, ధైర్యంగా లేవనెత్తాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైఎస్సార్సీపీ ఎంపీలదేనని ఆయన గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..ఏపీలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదలు, బడుగు–బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్న వైఎస్ జగన్.. ఈ వర్గాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో రాష్ట్రం భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుందన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అమలు చేస్తున్న “రెడ్ బుక్ పాలన” కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోయిందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రస్తావించిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను కలసి సమగ్ర నివేదికతో కూడిన వినతిపత్రం అందజేయాలని వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు.పార్లమెంట్ను ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించాలని, కేంద్రంపై నిరంతర ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఎంపీలు పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
జూదం చట్టబద్ధమా?
సాక్షి, అమరావతి: ‘జూదం అనేది చట్టబద్ధమా..?’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ దగ్గరుండి జూదాలు (గ్యాంబ్లింగ్) నడిపించారని.. ఈ వ్యవహారంలో రూ.2 వేల కోట్లు చేతులు మారాయని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇందులో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, పోలీసులు కూడా వాటాలు పంచుకున్నారని ఆరోపించారు.ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏమిటని నిలదీశారు. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా..? ఇది అవినీతి కాదా..? ఇది లూటీ కాదా..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్... విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పారు. ఇవన్నీ అవినీతి కాదా..? కళ్ల ముందు టీడీపీ కూటమి నేతలు చేస్తున్న అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము నిజాయితీపరులమనే భ్రమను కల్పించే యత్నాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, వాడవాడనా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. పర్మిట్ రూమ్లు వెలిశాయి. వాటిలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతూ దోచుకుంటున్నారు. ఇది అవినీతి కాదా? ఇసుక అమ్మకాలతో వైఎస్సార్సీపీ హయాంలో ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక అని మభ్యపెడుతూ ఎడాపెడా దోచేస్తున్నారు. నాటికీ, నేటికీ ఇసుక ధర చూస్తే రెట్టింపు అయ్యింది. ప్రభుత్వ ఖజానాకు పైసా ఆదాయం రావడం లేదు. దోచేస్తున్న డబ్బు అంతా చంద్రబాబు, టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇది అవినీతి కాదా? ఇసుకే కాదు.. సిలికా, క్వార్ట్ ్జలేటరైట్ లాంటి సహజ వనరులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తూ టీడీపీ మాఫియా దోచుకుంటోంది. ఇది అవినీతి కాదా..? మా హయాంలో విద్యుత్ యూనిట్ అత్యంత చౌకగా రూ.2.49 చొప్పున కొనుగోలు చేస్తే చంద్రబాబు రాద్ధాంతం చేశారు. మరి ఇప్పుడు యూనిట్ రూ.4.60 వంతున కరెంట్ కొనుగోలు చేస్తున్నారు. రూ.2.49 ఎక్కడ..? రూ.4.60 ఎక్కడ..? ఇది అవినీతి కాదా..? అమరావతిలో నిర్మాణాల పేరుతో జరుగుతున్నది ఏమిటి..? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? చదరపు అడుగుకు రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి.. రాజధాని నిర్మాణంలో జరుగుతోంది అవినీతి కాదా..? ఈ అవినీతిపై జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని వైఎస్ జగన్ కోరారు. బాబు సర్కారు అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తామనే భయంతోనే.. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ సభ్యులు హాజరవడంపై అనేక సందర్భాల్లో గతంలోనే స్పష్టమైన సమాధానాలు చెప్పానని మరో ప్రశ్నకు జవాబుగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు.. ఒకటి అధికారపక్షం.. రెండోది ప్రతిపక్షం వైఎస్సార్సీపీ. మరి.. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా స్పీకర్ను అడ్డుకుంటున్నదెవరు? ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, సభా నాయకుడికి మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంత సమయం నాకూ ఇవ్వాల్సి వస్తుంది.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తాననే భయంతోనే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు జంకుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా 175 మంది ఎమ్మెల్యేల తరహాలోనే కేవలం 5 నిమిషాలే సమయం ఇస్తామంటే ప్రజల గొంతును వినిపించే అవకాశం ఉండదు. ప్రజల గొంతుకను బలంగా వినిపించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది..’ అని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. -
సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ మూకలు సాగిస్తున్న రాక్షస దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళితుడు సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి అని స్పష్టంచేశారు. ‘రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఏ స్థాయికి పోయిందనటానికి ఇదో ఉదాహరణ. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో సర్పంచ్, ముగ్గురు ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందినవారు. ఈ నలుగురితోపాటు 300 పైచిలుకు కుటుంబాలు ఊరు విడిచిపెట్టి వెళ్లేలా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఊరిలో వారికున్న ఆస్తులు, పొలాలు అన్నింటినీ వదిలేసేలా దౌర్జన్యం చేసి గ్రామాన్ని వీడేలా సాక్షాత్తు చంద్రబాబునాయుడే ప్రోత్సహిస్తున్నారు. పోలీసు భద్రతతో పికెట్ ఏర్పాటుచేసి వారు గ్రామంలోకి తిరిగి వచ్చేలా ఆదేశించాలంటూ హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో ఆ గ్రామాన్ని వీడి వెళ్లిపోయిన ఒక దళితుడు, పేదవాడు అయిన సాల్మన్ భార్య తన ఇల్లు చూసుకునేందుకు అక్కడకు వెళ్లింది. అయితే అనారోగ్యం బారిన పడి అక్కడే ఉండిపోవడంతో తన భార్యను చూడటానికి వెళ్లిన సాల్మన్పై దాడిచేసి రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. చంపేందుకు పావులుగా వాడిన వ్యక్తులకు, సాల్మన్కు ఎలాంటి గొడవలు లేవు. పైనుంచి చెప్పి అతడిని చంపించారు. ఈ హత్యలో సీఐ, ఎస్ఐలు, ఎస్పీ, చంద్రబాబునాయుడి ఎమ్మెల్యేలు, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు.. వీరంతా దోషులే. చంద్రబాబు ఓ తప్పుడు మనిషి ..!ఈ మనిషి చంద్రబాబు.. నాయకుడు, పాలకుడు కాదు. అన్నీ చెడ్డ గుణాలు, చెడ్డ అలవాట్లున్న ఒక తప్పుడు మనిషి. భగవద్గీత చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా దేవుళ్లు మనకు చెప్పిందేమిటి..? మోసం చేయకండి, అబద్ధం ఆడకండి.. నిజాయితీగా బతకాలని నేర్పిస్తారు. కానీ చంద్రబాబునాయుడుకున్న అలవాటు, తన కుమారుడికి నేర్పించిన అలవాటు.. చివరికి ఆయన పార్టీ వారికి కూడా చంద్రబాబు చెప్పేదేంటంటే.. దౌర్జన్యం చేయండి, మోసం చేయండి తప్పులేదు! అబద్ధాలు ఆడినా తప్పులేదు... వెన్నుపోటు పొడిచినా తప్పులేదు... అధికారమే ముఖ్యం..! ఇవీ ఆయన నేర్పించేవి! జరుగుతున్న పరిణామాలు కోర్టుల దృష్టికి తీసుకొస్తాం. ఎన్హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల కమిషన్)కి కూడా ఫిర్యాదు చేస్తాం. కోర్టుల రక్షణ ద్వారా గ్రామస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. తిరిగి గ్రామంలోకి పునఃప్రవేశం కూడా జరుగుతుంది. ఎల్లకాలం చంద్రబాబునాయుడు రోజులుండవు. ఇప్పటికే రెండేళ్లయిపోయింది. మరో మూడేళ్లు కూడా అయిపోతాయి. తర్వాత ఇదే చందబ్రాబునాయుడికి తాను వేసిన విత్తనాలు వృక్షాలైతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. పాలకులుగా న్యాయం, ధర్మం వైపు నిలబడాలి దెబ్బలు తిన్న సాల్మన్ను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆరో రోజు మరణించాడు. చనిపోయిన ఆ మనిషిని సొంత గ్రామంలో ఖననం చేయడానికి కూడా గ్రామంలోకి వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలా అడ్డుకుంటారని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మృతుడి బంధువులు, వేలమంది నిలదీస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామంలోకి ప్రవేశానికి అనుమతించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా? అని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచించాలి. ఇలా చేసి తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే చంద్రబాబు వేసిన విషపు విత్తనాలు రేపు చెట్లు అవుతాయి. మీరు ఏవైతే నాటారో.. అవే పండుతాయి. నష్టపోయిన వారు చూస్తూ ఊరుకోరు. సహజంగా ఇది మానవ నైజం. పాలకులుగా ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. న్యాయం ధర్మం వైపు నిలబడాలి. పాలకులు న్యాయం, ధర్మం తప్పితే విషపు గింజలు నాటినట్లవుతుంది. రేపు ఎవరూ నియంత్రించలేని విధంగా ఆ విషపు బీజాలు చెట్లు అవుతాయి. -
ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు: వైఎస్ జగన్
తాడేపల్లి: భూ సర్వే అంటే ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియదన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. ఈరోజు(గురువారం, జనవరి 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు సర్వేలో అసలు సర్వే రాళ్లు లేవన్నారు. ‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్ బుక్ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే. ట్యాంపర్ చేయలేని పాస్బుక్లు ఇవ్వాలన్నదే మా తపన. పైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. కమీషన్లు తీసుకుని పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నారు. 22ఏ గురించి బాబు మాట్లాడం ఆశ్చర్యమేస్తోంది. 22ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర బాబుది. 35లక్షల 40 వేల ఎకరాలపై 20.24 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించాం. 27.40 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు కల్పించాం. చుక్కల భూముల సమస్యలను కూడా మేం పరిష్కరించాం. ఇనాం భూములపై లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించాం. 1.54 లక్షల ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాం. రూ. 55.79కు మేం పట్టాదార్ పాస్బుక్ ఇస్తే.. చంద్రబాబు రూ. 76కు పాస్బుక్ ఇస్తున్నారు. మేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు.. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్ వ్యవహారం. సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్’ అని ధ్వజమెత్తారు వైఎస్ జగన్.ఇవీ చదవండి:వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా? -
అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఫిబ్రవరి 17 నుంచి 27వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లను ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణతో కలసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు ర్యాలీ నిర్వహిస్తారన్నారు. కల్నల్ రజత్ సువర్ణ మాట్లాడుతూ ఫిబ్రవరిలో 17 నుంచి 27వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి ఈ–మెయిల్కు నియామక ఉత్తర్వులు పంపించడం జరుగుతుందన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ డైరెక్టర్ సత్య పాల్, ఆర్మీ మేజర్ అమర్దీప్ కుమార్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారిని బుధవారం పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అమ్మవారి ఆలయానికి వచ్చిన స్వామిజీకి ఆలయ అర్చకులు, కార్యనిర్వాహణాధికారి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. ముందుగా విద్యా శంకర భారతి మహాస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పూజలు చేశారు. ఆయన అనుగ్రహణ భాషణం చేశారు. అనంతరం స్వామిజీని ఆలయ కార్య నిర్వాహణాధికారి నరసింహమూర్తి ట్రస్టుబోర్డు చైర్మన్ చక్రధర్రెడ్డి సన్మానించి అమ్మవారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందించి తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు. రైల్వే చీఫ్ జోనల్ మేనేజర్ ఇలా వచ్చి... అలా వెళ్లారు వినుకొండ: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ జోనల్ మేనేజర్ సంజయ్ శ్రీవాత్సవ్ వినుకొండ రైల్వేస్టేషన్ సందర్శన కేవలం ఐదు నిమిషాల్లో ముగిసింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరిన ఆయన నంద్యాల, దొనకొండ మీదుగా వినుకొండ చేరుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రజ ల నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఎన్నో సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన స్థానికులకు ఎక్కువ సమ యం కేటాయించకపోవడంతో నిరాశ మిగిలింది. ముఖ్యంగా నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో గూడ్స్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని, 45 పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు వినుకొండ మార్గంలో నడుస్తున్నప్పటికీ ప్యాసింజర్ రైలు లేకపోవ డంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నడికుడి కాళహస్తి డబ్లింగ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని సమస్యలను అడిగేందుకు వచ్చిన ప్రయాణికులకు నిరాశ మిగిలింది. ఆయన వెంటనే గుంటూరు వెళ్లారు. ఉపాధ్యాయుల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి చిలకలూరిపేట: ఉపాధ్యాయుల డీఏ బకాయి లు జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రూ.1100 కోట్లు విడదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ నేటికీ చాలామంది ఖాతాల్లో మూడు విడతల డీఏ బకాయిలు జమ కాలేదని విమర్శించారు. ఎస్టీయూ నాయకులు పలువురు పాల్గొన్నారు. -
ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కెఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బుధవారంతో ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి అమరావతి బోటింగ్ క్లబ్ అధ్యక్షులు తరుణ్ కాకాని ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ● ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని అన్నారు. ● వర్శిటీ వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నాలుగు జోన్లలో విజేతలైన 16 యూనివర్శిటీల నుంచి 16 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. చివరి ఫైనల్ మ్యాచ్లో ప్రథమ విజేతగా కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్శిటీ జట్టు, ద్వితీయ విజేతగా పంజాబ్కు చెందిన చండీఘర్ యూనివర్శిటీ నిలిచిందని పేర్కొన్నారు. ● కేరళకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ కాలికట్, చైన్నెకు చెందిన ఎస్ఆర్ఎం ఐఎస్టి యూనివర్శిటీలు రెండు మూడు స్ధానాల్లో నిలవగా తృతీయ బహుమతిని రెండు వర్శిటీలకు కలిపి అందజేశామని తెలిపారు. ● అనంతరం తరుణ్ను వర్శిటీ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ● కె.ఎల్.యూ క్రీడల డైరెక్టర్ కె. హరికిషోర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా యూనివర్శిటీల పరిశీలకులు డాక్టర్ కిరణ్, కె.ఎల్.యూ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ కెఆర్ఎస్ ప్రసాద్, డీన్ సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, వ్యాయామ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో రెవెన్యూ లీలలపై ఆగ్రహం
●సాక్షి కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు ●నివేదిక సమర్పించాలనే ఆదేశాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి ●ఎట్టకేలకు సాయంత్రానికి ఓ నివేదిక సిద్ధం చేసిన అధికారులు తాడికొండ: రాజధానిలో రూ.కోట్ల విలువైన భూమికి ఎసరు పెట్టిన వైనంపై సాక్షి దినపత్రికలో ‘బతికుండాగానే చంపేశారు...’శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాఽధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడి సాయంత్రానికి ఓ నివేదిక సిద్ధం చేశారు. ఇందులో సదరు మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడ దరఖాస్తు చేసింది. ఆమె వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశారా లేదా... పొలం చుట్టు పక్కల ఉన్న రైతులను ఈ భూమి ఎవరిది అని అడిగి హద్దు దారుల స్టేట్మెంట్లు రికార్డు చేశారా లేదా అనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. అంతా మేమేగా అంటూ .... ఇవేమీ లేకుండా రికార్డుల్లో పేర్లు తొలగించి తాపీగా మరో పేరు ఎక్కించారా అనే దానిపై రెవెన్యూ వర్గాల్లోనే తీవ్ర చర్చ నడుస్తుంది. ● తెనాలికి చెందిన ఓ టీడీపీ బ్రోకర్ కనుసన్నల్లోనే ఈ తంతు అంతా నడిచిందని అందరూ చర్చించుకుంటుండగా దరఖాస్తును తాడికొండలో కాకుండా వేమూరు నియోజకవర్గంలో ఆన్లైన్లో నమోదు చేయించినట్టు అధికారులు చెబుతున్నారు. ● తాడికొండకు చెందిన పొలానికి భీమవరంలో వీలునామా, రాజమండ్రిలో డెత్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పుట్టించి ఊరు, పేరు లేని ఓ మహిళను తీసుకొచ్చి ఆన్లైన్లో నమోదు చేయడం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇందులో బోగస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో దిట్ట అయిన ప్రస్తుతం రాజధానిలో పనిచేస్తున్న ఓ వీఆర్వో పాత్ర పూర్తిగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం కాగా ఆయన గతంలో తాడికొండ మండలంలో పనిచేసినపుడు పలు తప్పుడు పొజిషన్న్ సర్టిఫికెట్లు ఇచ్చి రూ. లక్షలు కొల్లగొట్టాడు. ● అప్పట్లో ఇవన్నీ విచారణలో తప్పుడు ధృవపత్రాలు అని తేలడంతో లాం గ్రామంలో పలు ఇళ్ళను అధికారులు నేలమట్టం చేశారు. ● ఆయనే మళ్ళీ రూ. కోట్ల రూపాయల స్కామ్కు శ్రీకారం చుట్టడంతో తాడికొండ మండలం ఉలిక్కిపడింది. ● ప్రస్తుతం జరిగిన కుంభకోణంలో ఉన్న టీడీపీ నాయకులు, ఎవరు, వారి పాత్ర ఎంత అనేదానిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంతో కలకలం రేగింది. ● దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన పత్రాలు మీడియాకు ఇవ్వాలని కోరగా ఇచ్చేందుకు తహసీల్దార్ నిరాకరించడం కొసమెరుపు. -
నృసింహుని మండల దీక్షలు స్వీకరణ
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల స్వామివారి ముఖ మండపం వద్ద బుధవారం భక్తులు నృసింహుని మాలధారణ మండల దీక్షలు స్వీకరించారు. ప్రధాన అర్చకులు గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలధారణ వేసి దీక్ష ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల సేవా ట్రస్ట్ చైర్మన్ తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాలధారణ స్వీకరించే సుమారు 150 మంది భక్తులకు దీక్షా వస్త్రాలు ఉచితంగా అందజేశారు. భక్తబృందం ప్రతినిధులు పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ. 66.66 లక్షలు మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను బుధవారం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి మొత్తం రూ. 66,66,337 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.10,87,494 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని శ్రీ జగన్నాధ శ్రీఆంజనేయ శ్రీ వెంకటేశ్వరస్వామి వార్ల గ్రూప్ దేవస్థానాల కమిషనర్, కార్యనిర్వహణాధికారి సుభద్ర పర్యవేక్షించారు. -
జేఈఈ మెయిన్స్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2026 మొదటి సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించారు. బీటెక్, బీఈ, బీ ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు ఈనెల 29 వరకు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీబీటీ విధానంలో ఆన్లైన్ పరీక్షల కోసం గుంటూరులో పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉదయం గంటల పరీక్షకు 7 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ నిర్ధేశించడంతో దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు సకాలంలో చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. -
గూండా‘గిరి’.. చావే మరి!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండురోజుల కిందట సంక్రాంతి కోడిపందేల బరి నిర్వహించిన తెలుగుదేశం పార్టీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి తన వర్గంతో కేఎన్ పల్లితో పాటు చుండూరు, మరో రెండు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు దిగారు. ఇళ్లలో సామాన్లు, వాహనాలు ధ్వంసం చేశారు. ఇదంతా పోలీస్ పికెట్ ఉండగానే జరగడం గమనార్హం. వినాయకచవితి నిమజ్జనం సందర్భంగా కూడా వీరే వైఎస్సార్సీపీ గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు ఇంటితో పాటు పలువురిపై దాడులకు దిగారు. అప్పుడు ఏడు ఫిర్యాదులు చేశారు. పోలీసులు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. మరోవైపు ఏ రౌడీషీటర్ ఆధ్వర్యంలో దాడి జరిగిందో ఆ బాలకోటిరెడ్డి తనకు ఒక పోలీసు అధికారితో జరిగిన వాట్సప్ ఛాటింగ్ను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. అందులో ఆ అధికారితో దాడికి ముందు, దాడికి తర్వాత మాట్లాడిన వాట్సప్ కాల్స్తో పాటు ఒక సీఐపై ఫిర్యాదు, ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల సమాచారం ఉంది. కొద్దిసేపటి తర్వాత ఈ చాట్ను బాలకోటిరెడ్డి తొలగించడం గమనార్హం. పోలీసులతో ఉన్న సంబంధ బాంధవ్యాల కారణంగానే వారు పూర్తిగా నిందితులకు కొమ్ము కాస్తున్నారని బాఽధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మహిళలను కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు. వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శకు కూడా గ్రామానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బాధితులందరూ బుధవారం గుంటూరు వచ్చి మీడియాతో మాట్లాడారు. మాకు తెలుగుదేశం గూండాల చేతుల్లో చావాలని లేదు. మాకు పోలీసులు భద్రత కల్పించకపోతే మేమే ఆత్మహత్య చేసుకుని చనిపోతాం అనుమతించండి.. పోలీసుల సమక్షంలో ఇప్పటికి రెండుసార్లు దాడులు చేశారు. దాడుల భయంతో మా మగవారు ఊరు వదిలి వెళ్లిపోయారు. వారు ఏమయ్యారో తెలియదు. దాడులు చేసిన గూండాలు మాత్రం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పక్కన ఇప్పటికీ తిరుగుతున్నారు. పోలీసులు మాపై నిఘా పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యకు అనుమతి ఇవ్వమని కోరాం. ఇప్పటికై నా ఈ దాడులు ఆపకపోతే మాకు చావే శరణ్యం. – వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కేఎన్ పల్లి మహిళలు -
పెట్రోలు పోసుకుని తగలపెట్టుకుంటాం
నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. ఆడవాళ్లమని కూడా చూడడం లేదు. మా మగవారు రెండేళ్లుగా ఊళ్లో లేకుండా వెళ్లిపోయారు. మమ్మల్ని చంపినా దిక్కులేదు. ఎనిమిది మంది పోలీసులు ఉన్నా గడ్డివాము తగలపెడుతున్నా చూస్తుండిపోయారు. వాళ్లు చంపేకన్న, మాకుగా మేము చచ్చిపోయేందుకు అనుమతి కోరాం. మేము యాదవులం. మాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే ఆనందబాబు కొట్టమన్నాడని బెదిరిస్తే మహిళలంతా భయపడిపోయాం. సర్పంచ్ నాగేశ్వరరావును చంపితే వైఎస్సార్సీపీ అనేది ఉండదు. అప్పుడు అంతా టీడీపీలోకి వస్తారని వాళ్లు భావిస్తున్నారు. పెద్ద పెద్ద కత్తులు, రాడ్డులు తీసుకువచ్చారు. మగవారు ఎవరు దొరికినా, చంపి అక్కడ పడేసి వెళ్లిపోయేవాళ్లు. మాకు ఏ న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకుని తగలపెట్టుకుంటాం. – శివకుమారి, బాధితురాలు -
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా
ఆ దాడి జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ సమయంలో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి గేటు కొట్టి ఇంట్లో ఎవరు ఉన్నారని అడిగారు. నేను, పిల్లలు ఉన్నామని చెప్పాను. మీ ఆయన ఎక్కడకు వెళ్లారంటే పొలానికి నీరు పెడుతున్నారని చెప్పాను. సర్పంచ్ నాగేశ్వరరావు ఇంటికి తాళాలు వేసి ఉంది ఎక్కడకు వెళ్లారని అడిగారు. నాకు తెలియదండి అన్నాను. పది నిమిషాల్లో జనాలు వచ్చి రాడ్డులు, కర్రలతో ఇల్లు, సామాన్లు పగులగొట్టి తలుపులు పగులగొడుతుంటంతో పిల్లలను దుప్పట్లో గట్టిగా కప్పి వారిని కాపాడుకున్నాను. నా భర్త పొలం నుంచే ఎటు వెళ్లిపోయాడో తెలియదు. –తిరుపతమ్మ -
ఇళ్ల మీదకు వచ్చి భయ బ్రాంతులకు గురిచేశారు
గతంలో వినాయకచవితి నిమజ్జనం సందర్భంగా కూడా సుమారు 50 మంది వచ్చి ట్రాక్టర్లో ఉన్న మహిళలు, చిన్నా పెద్ద అని కూడా చూడకుండా మెడలోని గొలుసులు లాక్కొని దాడికి పాల్పడ్డారు. అప్పుడూ పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. మాకు అప్పుడు న్యాయం చేయకపోవడంతోనే ఇప్పుడు ఈ దాడి జరిగింది. మాకు రక్షణ లేదు, కాబట్టి మేం చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను గ్రామాల్లో ఉండకుండా చేయాలనుకుని టీడీపీ మూకలు దాడికి యత్నిస్తున్నారు. పోలీసుల అండతో వారి సమక్షంలోనే మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. – లక్ష్మి, బాధితురాలు -
గంజాయి ముఠా అరెస్ట్
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయించే ముఠాను గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసుల వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో టోల్ప్లాజా మధురానగర్లోని ఓ వెంచర్లో మంగళవారం మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ బ్రహ్మం, ఎస్ఐ వెంకటేశ్వర్లు తనఖీలు చేశారని అన్నారు. ఈ క్రమంలో పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. దాసరి వినయ్బాబు (మంగళగిరి యర్రబాలెం), కొల్లిమర్ల లోకేష్ (నవులూరు), రామిదేని సాయికృష్ణ (అంబటినగర్), తట్టుకోళ్ల దానియల్రాజు అలియాస్ బడాయి (పుల్లయ్యనగర్, కాజ), బండిరెడ్డి నంద్ (తాడేపల్లి), చిరుుబోయిన హరికృష్ణ (కాజ), నల్లగొర్ల సాయితేజ (దుగ్గిరాల), మైనర్ (తాడేపల్లి) స్నేహితులని అన్నారు. వీరంతా గంజాయి, చెడు అలవాట్లకు బానిసయ్యారని చెప్పారు. రామిదేని సాయికృష్ణకు విజయవాడ జైల్లో ఒకరు పరిచయమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒడిశాలో డొరా అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తాడని ఫోన్ నంబర్ ఇచ్చాడని పేర్కొన్నారు. అనంతరం సాయికృష్ణ, మిగతా ఆరుగురు, మైనర్ కలిసి ఒడిశాలో కిలో రూ.8 వేలకు గంజాయి కొనుగోలు చేశారని చెప్పారు. కొంత తాగి, మిగతాది యాభై గ్రాముల ప్యాకెట్లుగా చేశారని అన్నారు. మిగతా విక్రయిస్తున్నారని తెలిపారు. చినకాకాని హాయ్ల్యాండ్ సమీపాన గంజాయి తాగే సాధం పవన్మాధవ్ (దుగ్గిరాల), సొంటి విష్ణువర్ధన్ (పెద్దపాలెం), కుందేటి చెన్నకేశవ (పెరికలపూడి), సాయన అనంతకుమార్ (కానూరు, విజయవాడ), మందా అమాన్ (లింగంపల్లి, తెలంగాణ), మలబండి చంద్రశేఖర్ (కాజ), మరో మైనర్ను అదుపులోకి తీసుకుని విచారించారని అన్నారు. ఈ మేరకు పదిహేను మందిని అరెస్ట్ చేసి, 4.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పరారీలో ఉన్న డొరాను పట్టుకుంటామని తెలిపారు. నిందితుల్లో పలువురిపై గతంలోనూ వివిధ కేసులు ఉన్నట్లు చెప్పారు. కేసును ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐ సీహెచ్ వెంకటేశ్వర్లు, హెచ్సీలు రత్న రాజు, డి.శ్యాంకుమార్, బి.రామలింగేశ్వరరావు, చలమరావు, పి.మణికుమార్, పీసీలు సాగర్బాబు, కేవీ శ్రీనివాసరావు, ఎం.రాములను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. -
భర్తను చంపేసి.. రాత్రంతా పోర్న్ వీడియోస్ చూస్తూ గడిపిన మాధురి..
గుంటూరు జిల్లా: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఆ తర్వాత భర్త మృతదేహం వద్దే ఒంటరిగా కూర్చుని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.. వివరాల్లోకెళ్తే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన లోకం శివనాగరాజు(45), లక్ష్మీ మాధురి దంపతులు. ఉపాధి నిమిత్తం వీరు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ సినిమా హాల్లో పనిచేస్తున్న మాధురికి తరచూ సినిమాలకు వచ్చే గోపీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపీ హైదరాబాద్లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తుండడంతో, శివనాగరాజుకు డ్రైవింగ్ రావడంతో, అతన్ని డ్రైవర్గా పంపించి గోపీ మాధురితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. విషయం బయట పడడంతో శివనాగరాజు తన భార్యను తీసుకుని చిలువూరులో నివాసముంటున్న తన తండ్రి, మాజీ ఎంపీటీసీ లోకం గాంధీ వద్దకు వచ్చారు. అయితే, మాధురి ఇక్కడికి వచ్చాక కూడా గోపీతో వివాహేతర సంబంధం కొనసాగించింది. మరోసారి వీరిద్దరి వ్యవహారంపై శివ నాగరాజు ప్రశి్నంచడంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య హత్యకు పథకం రచించింది. ప్రియుడితో నిద్ర మాత్రలు తెప్పించి ఈనెల 18న రాత్రి శివనాగరాజుకు భోజనంలో కలిపి ఇచ్చింది. దీంతో శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం ప్రియుడు గోపీని పిలిపించి ఇద్దరూ కలిసి శివనాగరాజు ముఖంపై దిండు పెట్టి నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో హత్యగా నిర్ధారించి లక్ష్మీ మాధురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య ఉదంతం మొత్తం వెల్లడించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసును హత్య కేసుగా మార్చి, నిందితుడు గోపీ కోసం గాలింపు చేపట్టారు. -
రేపు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. కాగా, ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ) ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జయ ప్రకాశ్, కారుమూరి సునీల్, కార్యకర్తలు హాజరయ్యారు. ఇదీ చదవండి:ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర: వైఎస్ జగన్ -
‘సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ హత్యపై న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్న కాసు మహేష్రెడ్డి,..ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం సాగుతుందన్నారు. ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ) సాల్మన్ కుటుంబ సభ్యులతో కలిసి మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కాసు మహేష్రెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కాసు మహేష్రెడ్డి. ఈ సందర్భంగా కాసు మహేష్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..న్యాయ పోరాటం చేస్తాం మంద సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుంది. వచ్చే ఆదివారం పిన్నెల్లిలో పార్టీ ఆధ్వర్యంలో సాల్మన్ సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు హాజరై నివాళులు అర్పిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించాల్సింది పోయి టీడీపీ నాయకుల అరాచకాలకు వంత పాడుతున్నారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ పోరాడుతుంది. అందుకోసం న్యాయస్థానాలతో పాటు, జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ), జాతీయ ఎస్సీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తాం. సాల్మన్పై దాడి కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చూపిన పోలీసులపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రేపు మా ప్రభుత్వం వచ్చాక, వారిని కచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తాం.పిన్నెల్లిలో టీడీపీ అరాచకంరాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతోనే, ఆ పార్టీ నాయకుల అరాచకాలకు భయపడి పిన్నెల్లిలో దాదాపు 300 కుటుంబాలకు చెందిన వెయ్యి మందికి పైగా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 9 వేల మంది జనాభాతో ప్రశాంతంగా ఉన్న పిన్నెల్లి గ్రామాన్ని శ్మశానంగా మార్చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మంద సాల్మన్ మీద ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. దారుణంగా చంíపడమే కాకుండా స్వగ్రామంలో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవాలని చూశారు. టీడీపీ చేస్తున్న అరాచకాల కారణంగా గ్రామాల్లో పనులు లేక వలసలు పెరిగిపోతున్నా, దీన్ని అడ్డుకుని శాంతి నెలకొల్పాలన్న ఆలోచన సీఎం చంద్రబాబు చేయడం లేదు. వ్యాపారులు కూడా గ్రామంలో ఉండటానికి భయపడిపోతున్న భయంకరమైన పరిస్థితులు పిన్నెల్లిలో నెలకొన్నాయని కాసు మహేష్రెడ్డి వివరించారు.గ్రామంలో శాంతి నెలకొనాలికక్షలు, దాడులతో గ్రామం అభివృద్ధి చెందదు. మంద సాల్మన్ హత్య మా గ్రామంలో చివరి హత్యగా మిగిలిపోవాలి. పగలు ప్రతీకారాలతో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునే సంస్కృతికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టాలి. ఇకనైనా హత్యా రాజకీయాలు విడనాడాలని అధికార పార్టీని వేడుకుంటున్నా. శాంతి చర్చల ద్వారా గ్రామంలో తిరిగి ప్రశాంత వాతావరణం రావాలనేది మా ఆకాంక్ష. అందుకే ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు కలగ జేసుకుని గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ చూపాలి. మా అన్న సాల్మన్ హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలి.-మంద అన్నోజిరావు. మంద సాల్మన్ తమ్ముడుఇదీ చదవండి:వైఎస్ జగన్ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు -
‘దావోస్లో చంద్రబాబు, లోకేష్లు బేతాళ కథలు వినిపిస్తున్నారు’
తాడేపల్లి : దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు బేతాళ కథలు వినిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. వారు తెచ్చే పరిశ్రమల సంగతి ఏమో కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్లో ఉందని మండిపడ్డారు. పనిలో పనిగా ట్రంప్ స్వయంగా వచ్చి చంద్రబాబును కలిశారని కూడా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు శైలజానాథ్. అసలు ఇప్పటివరకూ చేసుకున్న ఎంవోయూలకు సంబంధించి ఎన్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించారు. ఈరోజు( బుధవారం, జనవరి 21వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ఎంవోయూల కోసం వచ్చేదంతా టీడీపీ ఏర్పాటు చేసిన మనుషులేనని స్పష్టం చేశారు. ‘ వాళ్ళ కోటు రంగులు మారతాయే కానీ కంపెనీలు మాత్రం రావు. చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి. ఏమైనా అడిగితే పెట్టుబడుల కోసం కాదు.. బ్రాండ్ వాల్యూ పెంచటం కోసం వెళ్తున్నామని లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆర్ఎంజెడ్ సంస్థతో లక్ష ఒప్పందం కుదుర్చుకున్నామని.. లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అసలు లక్ష ఉద్యోగాలు ఎలా ఇస్తుంది?, లక్ష ఉద్యోగాలు ఆ సంస్థ ఇవ్వకుంటే ఏం చేయాలి?, అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ ఏర్పాటు చేస్తాం అన్నారు. దొనకొండలో డ్రోన్స్ యూనిట్ అన్నారు. వారు చెప్పిన ఏ ఒక్క కంపెనీ కనిపించటం లేదు. వీటి ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదు. చంద్రబాబు, వారి మంత్రులు తిరిగే ప్రత్యేక హెలికాఫ్టర్ల ఖర్చుతో అనేక పరిశ్రమలు పెట్టవచ్చు. మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి.. దేనికి ఖర్చు పెట్టారో కూడా లెక్కలు లేవు. గత ప్రభుత్వ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో 90 శాతం గ్రౌండ్ అయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో దక్షిణ భారత దేశంలో సేవారంగంలో మొదటి స్థానం, ఉత్పత్తి రంగంలో 5వ స్థానం సాధించాం. చంద్రబాబు పరిశ్రమల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములు మొత్తం ప్రజలవే. దావోస్ వెళ్ళినా కూడా జగన్ నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ధ్వజమెత్తారు. -
వైఎస్ జగన్ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
సాక్షి, తాడేపల్లి: గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ గూండాల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన సాల్మన్ ఉదంతాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించి.. బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటామని ప్రకటించారు కూడా. ఈ క్రమంలో పిన్నెల్లి గ్రామస్తులు బుధవారం వైఎస్ జగన్ను కలిశారు. పిన్నెల్లి గ్రామస్తులతో పాటు బాధిత కుటుంబం కూడా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి వచ్చింది. తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం(ప్రవీణ్), కుమార్తె రాహేలు జగన్ వద్ద వాపోయారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను ఓదార్చిన జగన్.. అధైర్య పడొద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. అక్రమ కేసులు పెడతామని టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించారనే విషయాన్ని గ్రామస్తులు జగన్కు తెలియజేశారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారాయన. ఎవరూ భయపడవద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని.. పార్టీ తరఫున లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. పిన్నెల్లి గ్రామస్తుల వెంట గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.చల్లా నాగరాజుకు భరోసా.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చల్లా నాగరాజు.. 2024 అక్టోబర్లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్నందుకు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు. తనపై టీడీపీ గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్ జగన్కు వివరించాడు. రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్ ఛైర్కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. నాగరాజు పరిస్థితికి చలించిపోయిన వైఎస్ జగన్.. పార్టీ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: రేపు(జనవరి 22, గురువారం) వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సహా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత తదితర అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.ఇవాళ(జవనరి 21, బుధవారం) ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైఎస్సార్సీపీ వైపే చూస్తున్నారు. కేడర్ అంతా.. తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ) ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జయ ప్రకాశ్, కారుమూరి సునీల్, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్కు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ప్రభుత్వం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది. విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నాం. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్ ఉంటే, ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటాను.ప్రశ్నిస్తే కేసులు పెడతారా?..ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతాను. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను. ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలే.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందిజగన్ ఉన్నప్పుడే బాగుండేది, ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు. చెప్పింది చేసే వాడు. మాట నిలబెట్టుకునేవాడు. అన్నీ ఇచ్చేవాడు అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నా ప్రజలను ఇబ్బందిపెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారు. మరోవైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూల్స్ పూర్తిగా కళ తప్పాయి. మన హయాంలో గవర్నమెంటు స్కూల్స్, ప్రైవేటు పాఠశాలతో పోటీ పడే స్థితి ఉంటే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది.కూటమి పాలనలో సంక్షేమం సున్నా.. నాడు మన హయాంలో గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు. ఇక, ఫీజు రీయింబర్స్మెంట్ ఎనిమిది క్వార్టర్లు పెండింగ్లో పెట్టారు. రూ.5600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు ఇచ్చారు. వసతి దీవెన కింద రూ.2200 కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్య శ్రీ కనుమరుగు చేశారు. 108, 104 సర్వీసులు నిర్వీర్యం చేశారు. కోవిడ్ టైమ్లో కూడా అన్ని సదుపాయాలతో మనం కొత్త వాహనాలు ప్రవేశపెడితే.. వాటిని ఇవాళ పడకేయించారు. ఇప్పుడు టీడీపీకి, డాక్టర్ల వింగ్కు చెందిన వారికి సర్వీసులు అప్పగించారు. ఇప్పుడు ఆ సర్వీసుల కోసం ఫోన్ చేస్తే, మూడు గంటలైనా రావడం లేదు.ప్రైవేటుకు ప్రభుత్వ జీతాలా?మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో పెద్ద కుంభకోణానికి తెరతీశారు. మన ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూర్తైన 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్ కాలేజీల్లో రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వడమే కాకుండా, రెండేళ్ల పాటు జీతం కూడా చెల్లిస్తారట. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్. ఇంకా నిర్వహణ ఖర్చు ప్రభుత్వానిది. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి వెళ్తాయి. ఇలాంటి స్కామ్కు పాల్పడిన వారిని, మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్లో కొనాల్సి వస్తోంది. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నాశనం కాగా, తాజాగా నాలుగో వ్యవస్థ శాంతి భద్రతలను కూడా నాశనం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మొత్తం ప్రైవేటీకరణ.. అదే అనుకుంటే చివరకు సీఎం పదవిని కూడా ప్రైవేటుకు ఇవ్వొచ్చు కదా?. అన్నింటా విఫలమైన ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతు నొక్కుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసులతో వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రజలకు తోడుగా నిలబడుతోంది. విద్యార్థులు, యువత, రైతులు, అక్క చెల్లెమ్మలు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారందరి తరపున జెండా పట్టుకుని నిలబడుతున్నాం. గట్టిగా పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగాలి. ఆ దిశలో మీరంతా కలిసికట్టుగా పని చేయాలి’ అని అన్నారు. -
కాజా టోల్గేట్ వద్దఅదుపు తప్పిన లారీ
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద ఓ లారీ అదుపు తప్పిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు విజయవాడ నుంచి కేరళ వైపు వెళ్తున్న కాటన్ బెయిల్ లోడ్ తో ఉన్న లారీ బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ అప్రమత్తతో టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు వసూలు చేసే ఒక కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ని ఢీ కొట్టి ఆగిపోయింది. దాంతో టోల్గేట్ కు సంబంధించిన కొంత సామగ్రి దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో టోల్ ప్లాజా సిబ్బందితో పాటు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరగడంతో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఏఐబీఈ– 2025లో వీఎస్ఎల్ నూరుశాతం ఉత్తీర్ణత తాడికొండ: వీఐటీ–ఏపీ వర్సిటీలోని వీఐటీ–ఏపీ స్కూల్ ఆఫ్ లా (వీఎస్ఎల్) విద్యార్థులు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) 2025లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు యాజమాన్యం మంగళవారం తెలిపింది. ఇది న్యాయ విద్యలో రాణించడానికి వీఐటీ–ఏపీ స్కూల్ ఆఫ్ లా నిబద్ధతను ప్రతిబింబించే ఒక అద్భుతమైన మైలురాయి అన్నారు. వీఐటీ–ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ బెనార్జీ చక్కా మాట్లాడుతూ వీసీ డాక్టర్ అరుళ్ మౌళి వర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి సహకారం, వర్సిటీ చాన్స్లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మద్దతు, అధ్యాపకుల అంకితభావంతో కూడిన ప్రయత్నాలతో, వీఎస్ఎల్ విద్యార్థులు అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. కాలువలో పడి వృద్ధురాలు మృతి చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు కాలువలో పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందోలు ఎస్ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు పంచాయతీ పెద దళితవాడ గ్రామానికి చెందిన మండే భూలక్ష్మి(70) చందోలు గ్రామంలోని వైన్ షాపు సమీపంలో ఉన్న ఆర్మండ్ కాలువలో పడి మృతిచెందినట్లు తెలిపారు. భూలక్ష్మి ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం నుంచి కనిపించటం లేదని కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఆర్మండ్ చానల్లో మృతదేహం ఉన్న విషయం తెలుసుకుని బయటకు తీయించి కుటుంబ సభ్యుల సమక్షంలో భూలక్ష్మిగా గుర్తించామని తెలిపారు. -
విద్యుత్ శాఖ విజిలెన్స్ తనిఖీలు
గుంటూరు రూరల్: విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షక ఇంజినీర్ రమేష్ ఆధ్వర్యంలో డీ10 సెక్షన్ నందున్న గుంటూరు, బుడంపాడు గ్రామాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు డీపీ కేఏ కరీమ్, జి.సుందరబాబు, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీహెచ్ ఖాన్లు తెలిపిన వివరాల ప్రకారం.. తనిఖీలలో 56 మంది అధికారులు, 168 మంది సిబ్బంది, 56 బృందాలుగా ఏ్పడి 5,298 సర్వీసులను తనిఖీ చేయటం జరిగిందన్నారు. అనుమతించిన కేటగిరీ కాకుండా ఇతర కేటగిరిలలో విద్యుత్ వినియోగిస్తున్న నలుగురికి రూ 38 వేలు, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వినియోగిస్తున్న 212 మందికి రూ10.08 లక్షలు మొత్తం రూ 10.46 లక్షలు అపరాధ రుసుంను విధించారని తెలిపారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదులు చేసేందుకు 9440812263, 9440812361 నెంబర్లకు నేరుగా కానీ వాట్సప్ ద్వారా కానీ సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దాడులలో ఆపరేషన్ విభాగం డీఈఈ షేక్ ముస్తాక్ అహ్మద్, డీపీఈ, డీఈఈ కె.రవికుమార్, ఎస్.శ్రీనివాసరావు, ఏఓ దేవదాస్, ఎం.సతీష్కుమార్, శివశంకర్, కె.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో క్రైం బ్రాంచ్ ఎస్ఐ మృతి
వినుకొండ: వ్యక్తిగత పనులపై వినుకొండ వచ్చిన ఎస్ఐ గుండెపోటుతో మృతిచెందిన ఘటన వినుకొండలో మంగళవారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన డి.లక్ష్మీప్రసాదు (60) గతంలో వినుకొండలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నర్సరావుపేట జిల్లా క్రైం బ్రాంచ్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే స్వగ్రామం కురిచేడు నుంచి వ్యక్తిగత పనులపై వినుకొండ రైల్వేస్టేషనుకు వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వినుకొండ పోలీస్టేషనుకు సమాచారం ఇవ్వగా లక్ష్మీప్రసాదును స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు సబ్ జైల్కు అమృతలూరు ఎస్ఐ తరలింపు వేమూరు: అమృతలూరు ఎస్ఐ రవితేజను నెల్లూరు సబ్జైలుకు తరలించారు. యువతిని మోసగించిన కేసులో న్యాయమూర్తి సోమవారం పదేళ్ల శిక్ష విధించిన విషయం విధితమే. నగరపాలెం పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి సబ్జైలుకు తరలించారు. 2023 నగరంపాలెం ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో రవితేజపై గుంటూరు జీజీహెచ్లో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న యువతి రవితేజ మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి ఐద్వా ప్రతి నిధులను ఆశ్రయించింది. ఐద్వా సహకారంతో గుంటూరు ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించగా సబ్ జైల్కు తరలించారు. -
బతికుండగానే చంపేశారు...
● రాజధానిలో రెవెన్యూ లీలలు ● తప్పుడు పత్రాలు సృష్టించి రూ.25 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నం ● రాజమండ్రిలో మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ● భీమవరంలో వీలునామా సర్టిఫికెట్ ● తాడికొండలో పనిచేసి రాజధానికి బదిలీ అయిన వీఆర్వో సహకారంతో 8.32 ఎకరాలకు ఎసరు ● తప్పుడు పత్రాలతో ఆన్లైన్లో నమోదుకు పచ్చజెండా ఊపిన రెవెన్యూ అధికారులు ● దత్త పుత్రిక అని రాసిన వీలునామా ఆధారంగా ఆధార్ కార్డు లేకుండానే ఆన్లైన్లో పేరు మార్పు ● రూ.కోట్లలో చేతులు మారినట్లు ఆరోపణలు ● తాడికొండకు చెందిన పలువురు హస్తం ఉన్నట్లు సమాచారం ● ఆమెరికా నుంచి బయలుదేరిన అసలైన హక్కుదారుడు తాడికొండ: తాడికొండ గ్రామానికి చెందిన వంగర హనుమంత సుబ్రహ్మణ్య శాస్త్రికి స్థానికంగా సర్వే నెంబర్ 1151లో 8.32 ఎకరాల భూమి ఉంది. ఆయన ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. స్థానికంగా తనకున్న పొలం మాత్రం పెదపరిమి గ్రామానికి చెందిన రైతుకు కౌలుకు ఇవ్వగా ప్రతి ఏటా ఆయన కౌలు నగదును ఆన్లైన్ ద్వారా హక్కుదారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రికి పంపిస్తుంటాడు. వ్యవహారం నడిచిందిలా... ఈ భూమిపై కన్నుపడిన తాడికొండలో గతంలో పనిచేసిన ఓ వీఆర్వో స్థానికంగా పట్టించుకునే నాథుడు లేడని తెలిసి డాక్యుమెంట్ రైటర్ వద్ద సహాయకులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తిని ఎంచుకొని పక్కాగా స్కెచ్ గీశాడు. ఇందులో భాగంగా తనకు గతంలో నుంచి అనుభవం ఉన్న తప్పుడు పత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టి పదునుపెట్టి తెనాలి ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ద్వారా కథ నడిపించాడు. రాజధాని ప్రాంతంలో ఎకరం రూ.2–3 కోట్లకు పైగా ధరలు పలుకుతున్న నేపథ్యంలో ఆన్లైన్లో పేరుమార్చి ఎవరో ఒకరిని ఏ మార్చి అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే యోచనతో ఓ పెట్టుబడిదారుడిని వెదికి పట్టుకొచ్చి కథంతా నడిపించారు. ఇందులో భాగంగా వంగర హనుమంత సుబ్రహ్మణ్య శాస్త్రికి పిల్లులు లేని కారణంగా బంధువుల అమ్మాయి వరలక్ష్మిని దత్తత తీసుకొని ఆమెకు పొలం రాసినట్లు 1997లో భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీలునామా చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. దీనికి తోడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఈనెల 6వ తేదీన దరఖాస్తు చేయగా అదే తేదీన రాజమండ్రిలో పత్రం ఇచ్చినట్లు జతచేయడం మరో విశేషం. మరణ ధ్రువీకరణ పత్రంలో ఆయన 2019లో మరణిస్తే ఈనెల 11వ తేదీన ధ్రువీకరణ పత్రం జారీ చేయగా ఇవన్నీ తీసుకున్న కేవలం రెండే రోజుల్లో అంటే ఈ నెల 13వ తేదీన ఆన్లైన్లో సుబ్రహ్మణ్య శాస్త్రి పేరు తొలగించి సలుమూరి వరలక్ష్మి పేరును ఎక్కించారు. ఈ వ్యవహారంలో సదరు నిందితులు ఎక్కడా కూడా ఆ మహిళ అడ్రస్ కానీ, ఆధార్ నంబర్ లేదా ఆధార్ కార్డు జతచేసిన దాఖలాలు కనిపించకుండా జాగ్రత్త పడటం విశేషంవ్యవహారం బయటకు పొక్కిందిలా... గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులకు ఈ వ్యవహారంలో ముడుపులు ముట్టజెబుతామని చెప్పిన సదరు వ్యక్తులు ఆన్లైన్లో పేరు మార్చిన అనంతరం వారిని లెక్కచేయకపోవడంతో వ్యవహారం బయటకు పొక్కింది. రూ.కోట్ల విలువైన భూముల వ్యవహారంలో తమను పక్కనబెట్టడంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు విషయం బయటకు కక్కడంతో వ్యవహారం బయటకు పొక్కింది. తమకేమీ తెలియదు అంటున్న సిబ్బంది తమకేం తెలియదు పైఅధికారి చేయమని ఇస్తే అన్నీ ఉన్నాయి కదా అని చేశామని చెబుతుండగా పై స్థాయి అధికారి మాత్రం ఎమ్మెల్యే సమక్షంలో మంగళవారం టీడీపీ నాయకులు ప్రశ్నించగా అన్ని పత్రాలు ఉన్నాయి కనుకే ఆన్లైన్లో చేర్చామని, హక్కుదారుడు వచ్చి ఓ స్టేట్మెంట్ ఇస్తే తొలగిస్తాం అంటూ నింపాదిగా సమాధానం చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అసలు భూమి ఉన్న హక్కుదారుడే మరణించలేదని, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని, దరఖాస్తు వచ్చినప్పుడు గ్రామంలో కనీసం విచారించకుండా బతికున్న మనిషిని చనిపోయినట్లు చూపిస్తే గుడ్డిగా ఎలా చేశారంటూ పలువురు ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నములుతున్నారు. తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్కు స్థానిక నాయకులు పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్డీవోతో విచారణ చేయించి బాధ్యులను సస్పెండ్ చేయిస్తానని ఆయన నాయకులకు హామీ ఇచ్చారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఈ వ్యవహారంలో ఉండటంతో పలువురు నాయకులు మీకేం కాదులే మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నట్లు సమాచారం. రాజధానిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను పడింది. ప్రజల, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారు. డబ్బుకు ఆశపడి ఎంతటి నీచానికై నా దిగజారుతున్నారు. మనిషి ప్రాణాలతో ఉన్నప్పటికీ చనిపోయినట్లు తప్పుడు ఽధ్రువీకరణ పత్రం, వీలునామా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ చూపించడంతోపాటు ఓ మహిళను దత్తత తీసుకున్నట్లు చూపించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8.32 ఎకరాల భూమిని ఆన్లైన్లో పేరు మార్చి కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాలు తెలిసి అవాకై ్కన స్థానికులు అమెరికాలో ఉన్న భూమి హక్కుదారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన బయలుదేరి వస్తున్నారు. ఈ తంతులో తెనాలికి చెందిన టీడీపీ నాయకుడు పాత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఓ భూమి వ్యవహారంలో రూ.30 లక్షలు తీసుకొని పనిచేయకుండా తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో సహకరించిన పెద్దలకు రూ.కోటికి పైగా ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడికొండలో వీఆర్వోకు సహకరించిన వ్యక్తులకు రూ.50 లక్షల వరకు నగదు చేతులు మారగా ఈ తంతు నడిపించిన వీఆర్వోకు కూడా భారీగా ముట్టినట్లు చెబుతున్నారు. కింది స్థాయి అధికారులు సంతకాలు చేసినందుకు కూడా భారీ నజరానాలు అందాయని రెవెన్యూ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఉద్యోగులను తొలగిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
పిడుగురాళ్ల: సీ్త్రశక్తి పథకంపై తనిఖీలు అంటూ ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు తెలిపారు. పట్టణంలోని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ పల్నాడు జిల్లా నిర్మాణ కమిటీ సమావేశం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించారు. పిడుగురాళ్ల ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో ఈ మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిన సీ్త్రశక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఏపీపీటీడీ(ఆర్టీసీ) సిబ్బంది అంకిత భావంతో కృషి చేస్తున్నారన్నారు. బస్సుల కండీషన్ బాగాలేకపోయినా, టిమ్స్ సరిగా పనిచేయకుండా.. ఇబ్బంది పెడుతున్నా పని చేస్తున్నామన్నారు. ఈ పథకం అమలులో రోజువారి డ్యూటీల్లో కండక్టర్లు, డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను గాని, పెరుగుతున్న తీవ్రమైన పని ఒత్తిడిని గానీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీ తనిఖీ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ విధి నిర్వహణలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లపై కేసులు రాస్తూ.. ఉద్యోగులను సస్పెండ్లు చేయడమే కాకుండా తీవ్రమైన పనిష్మెంట్లు ఇస్తున్నారని, ఇలాగైతే భవిష్యత్లో కండక్టర్లు, డ్రైవర్లు డ్యూటీలు చేయడమే కష్టం అవుతుందన్నారు. ఇప్పటికై నా సీ్త్ర శక్తి పథకం కేసుల్లో సస్పెండ్ చేసే విధానాలు మానుకోవాలని, లేకపోతే భవిష్యత్లో రాష్ట్రవ్యాప్తంగా ఈయూ ఆధ్వర్యంలో ఉద్యమాల బాట పట్టక తప్పదని హెచ్చరించారు. -
నత్త నడకన రీ సర్వే
గుంటూరుబుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026● భూ సర్వేలతో చరిత్ర సృష్టించిన గత ప్రభుత్వం ● అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సాంకేతికత ● దేశంలోనే ఆదర్శంగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ● 62 గ్రామాల్లో సుమారు 1.46 లక్షల ఎకరాల భూమి రీసర్వే ● ప్రస్తుతం అంతంత మాత్రంగానే జరుగుతున్న సర్వే పనులు.. ● టీడీపీ ప్రభుత్వంలో 24 గ్రామాల్లో కూడా పూర్తి కాని సర్వే... ‘సంక్షేమం’లో సంక్షోభం ఫిరంగిపురం: స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామికి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. -
ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శనలో విజేతలు
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని గోల్కొండ గార్డెన్స్లో జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ ఎడ్లజతలను తీసుకువచ్చి పోటీలలో పాల్గొంటున్నారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పోటీలలో రెండు పళ్ల, నాలుగు పళ్ల విభాగాల్లో విజేతలైన ఎడ్లజతల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. వారికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, శ్రావణ్కుమార్లు నగదు, జ్ఞాపికలను అందజేశారు. కాలువలోకి దిగిన యువకుడు గల్లంతు బాపట్లటౌన్: స్నానం చేసేందుకు కాలువలోకి దిగిన యువకుడు గల్లంతైన ఘటన మండలంలోని నరసాయపాలెం శివారులో చోటుచేసుకుంది. నరసాయపాలెం గ్రామానికి చెందిన మిక్కిలి శరత్బాబు మంగళవారం సాయంత్రం నరసాయపాలెం లాకులు సమీపంలో కొమ్మమూరు కాలువలో స్నానం చేసేందుకు దిగారు. కాలువ నీరు ఉధృతంగా రావడంతో కాలువలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు శరత్ కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. -
ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులు దహనం
విషపు రాతలపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): పచ్చ పత్రికల విషపు రాతలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువెల్లా రాతల్లో అబద్ధాలు తప్ప.. ఒక్క నిజం లేదని మండిపడ్డారు. అబద్ధాల పుత్రిక ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరించాలన్నారు. పథకాల అమలుపై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన, మహిళా విభాగంతో పాటు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ శ్రేణులు కన్నెర్రజేశాయి. గుంటూరు లాడ్జి సెంటర్ వేదికగా కదం తొక్కాయి. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు యర్రెడ్ల వెంకటేష్రెడ్డి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబ్బులు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తప్పుడు రాతల ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. -
గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: గుంటూరు జిల్లా రాయపూడిలో రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు పరిశీలించారు. ఈ మేరకు ఆయన మంగళవారం గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఐజీ రాజకుమారి, ఎస్పీ వకుల్ జిందాల్, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. గవర్నర్, ముఖ్యమంత్రి వచ్చే మార్గాలతో పాటు స్టేజీ, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ తదితరులు పాల్గొన్నారు. -
ఆ..బాలికను గుర్తించాం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : కుమార్తె అదృశ్యం అయిందని పీజీఆర్ఎస్లో పిల్లా ఏసోబు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన అంశంపై గుంటూరు ఈస్ట్ సబ్డివిజన్న్డీఎస్పీ షేక్ అబ్దుల్అజీజ్ లాలాపేట పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆర్.అగ్రహారం నిమ్మలపేటకు చెందిన పిల్లా ఏసోబు దివ్యాంగుడు. తన కుమార్తె గత ఏడాది మార్చి 15వ తేదీ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని, పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడన్నారు. ఈ అంశంలో వాస్తవానికి ఏసోబు అంజలి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 14 సంవత్సరాల బ్లెస్సీ అనే కుమార్తె ఉన్నది. ఏసోబు తన భార్యతో కలిసి గుంటూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఏసోబు తన భార్య అంజలి, కుమార్తె బ్లెస్సీని కూడా తనతో కలిసి భిక్షాటనకు రావాలని బలవంతం చేయడం ప్రారంభించాడు. వారిద్దరు అందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే తల్లి అంజలి, కుమార్తె బ్లెస్సీ కలిసి గత ఏడాది జవనరి 2వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే ఏడాది ఏప్రిల్ 22న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అంజలి, బ్లెస్సీల ఆచూకీ తెలిసిందని, గత సంవత్సరం మే 8వ తేదీన అంజలి లాలాపేట పీఎస్కు హాజరుకాగా, తన భర్త భిక్షాటన చేయమంటున్నాడని, అందుకే తాము వెళ్ళిపోయామని, తన కుమార్తెను తానే చూసుకుంటానని చెప్పిందన్నారు. తన భర్త మరో మహిళను వివాహం చేసుకుని, తనని మానసిక రోగిగా చూపిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని ఆమె చెప్పటం జరిగిందన్నారు. కుమార్తె బ్లెస్సీ కూడా తన తల్లి చెప్పిన విషయాలతో ఏకభవిస్తూ.. తన తండ్రితో కలిసి ఉండడానికి ఆసక్తి చూపలేదని వెల్లడించింది. దీంతో కేసును నిలిపివేయటం జరిగిందన్నారు. ప్రస్తుతం, అదృశ్యమైన బాలిక ఆచూకీ రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో గుర్తించబడిందని, ఆమెను ఇక్కడకు తీసుకురావడానికి సిబ్బందిని పంపటం జరిగిందన్నారు. ఈ అంశంలో పోలీసులు నిర్లక్ష్యం వహించలేదని తెలిపారు. తండ్రి భిక్షాటన చేయమంటున్నాడనే ఇల్లు వదిలి వెళ్లిపోయినట్టు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడి -
వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్నందు సమరసత సేవా ఫౌండేషన్ వారి పూజ్య ధర్మాచార్య సదస్సును మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహోబిల రామానుజ జీయర్ స్వామి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు, ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా రాజశ్యామలా నవరాత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహోత్సవాలలో భాగంగా మంగళవారం బగళాముఖి అమ్మవారు కళ్యాణ రాజశ్యామలాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 28వరకు అమ్మవారి ఆలయంలో రాజశ్యామలా నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి, చైర్మన్ చక్రధర్రెడ్డి తెలిపారు. -
ప్రతిభ చాటిన మంగళగిరి కోచ్
మంగళగిరి టౌన్: పంజాబ్ రాష్ట్రం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ పాటియాలాలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈనెల 14,15,16 తేదీల్లో నిర్వహించిన ఏఎఫ్ఐ స్టాటర్స్ సెమినార్ కం ఎగ్జామినేషన్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన డాక్టర్ సాతులూరి రాజు ఉత్తీర్ణత సాధించారని ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరి గౌతమ్కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 44 మంది మాత్రమే పాల్గొనడానికి అర్హత సాధించగా వారిలో 32 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. డాక్టర్ రాజు ప్రస్తుతం హైదరాబాద్లోని సీబీఐటీ కళాశాలలో అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఖేలో ఇండియా అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స పోటీల్లో స్టాటరుగా వ్యవహరించారని, జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజును పలు క్రీడల అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. -
రేపటి నుంచి విజ్ఞాన్ వర్సిటీలో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026ను నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్కు సంబంధించిన బ్రోచర్ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకట్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సమ్మిట్కు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ రోడ్లు, భవన నిర్మాణాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొననున్నట్లు తెలిపారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ను కూడా మూడు రోజుల పాటు ఇదే సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 ప్రధాన ఆకర్షణ సమ్మిట్లో భాగంగా నిర్వహించే ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యార్థి బృందాలు పాల్గొననున్నాయని ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకట్ తెలిపారు. విజేతలకు ప్రత్యేక ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, ఇంటర్న్షిప్ అవకాశాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు యూనివర్సిటీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 -
పెట్టుబడులు బూటకం.. దోపిడీ నిజం: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పెట్టుబడుల పేరుతో తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ చేసుకుంటున్న ప్రచారమంతా వట్టి బూటకమేనని, కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తున్నది మాత్రమే నిజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్రెడ్డి అన్నారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనలన్నీ బోగస్ అని, లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయన చెప్పడమే తప్ప వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు చెప్పే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తమను తాము పొగుడుకోవడానికో, వైఎస్ జగన్ని తిట్టడానికే దావోస్ వెళ్లడం దేనికని సతీష్ రెడ్డి మండిపడ్డారు.పక్క రాష్ట్రం తెలంగాణలో భూములను వేలం వేసి మరీ కంపెనీలకు అప్పజెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం దోపిడీకాక ఇంకేమిటని ప్రశ్నించారు. దీనిపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. మా ఇష్టం నేనిస్తా అని చెబుతున్న నారా లోకేష్కి అధికార మదం తలకెక్కిందని మండిపడ్డారు. అంతగా ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకోవాలని సూచించారు. ఇలాంటి నిరంకుశ నియంత పోకడలతోనే ఫ్రెంచి విప్లవం పుట్టిందనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ విధానాలపై తెలుగుదేశం అనుకూల మీడియాలోనే తీవ్రమైన వ్యతిరేక కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నారా లోకేష్కి అధికార మదం తలకెక్కిందికూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిగా పెట్టుబడుల పేరుతో దావోస్ పర్యటనలు చేసే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ పబ్లిసిటీ పిచ్చికి వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి తమను తామే పొగుడుకోవడం, వైఎస్ జగన్ని తిట్టడం తప్ప, రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు మాత్రం శూన్యం. 2014-19 మధ్య జరిగిందే ఇప్పుడూ జరుగుతోంది. లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ఎల్లో మీడియాలో ఇబ్బడిముబ్బడిగా రాయిస్తారే కానీ, వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు మాత్రం ఎప్పటికీ చెప్పరు.కానీ వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషితో ఏర్పాటైన పరిశ్రమలకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేసి తామే సాధించినట్టుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతుంటారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం వైఎస్ జగన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సీఎంగా చంద్రబాబు రూ.23 లక్షల కోట్ల ఎంవోయూలు చేసుకుంటే వాటిలో కార్యరూపం దాల్చినవి 5 శాతం కూడా లేవు. పారిశ్రామిక అభివృద్ధి, కంపెనీల ఏర్పాటు పేరుతో ఊరూపేరులోని కంపెనీలకు విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99పైసలకు కట్టబెడుతున్నారు.తెలంగాణలో ప్రభుత్వ స్థలం ఓపెన్గా వేలం వేసి ఎకరం రూ.170 కోట్లకు విక్రయిస్తుంటే, చంద్రబాబు మాత్రం పెట్టుబడుల పేరుతో తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు. భూ పంపిణీ రూపంలో ఏడాదిన్నరలోనే చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అప్పనంగా భూములు కట్టబెట్టడంపై జర్నలిస్టులు నారా లోకేష్ని ప్రశ్నిస్తే.. విమర్శలకు సమాధానం చెప్పకుండా నా ఇష్టం, నేనిస్తా అంటున్న నారా లోకేష్ అహంకారాన్ని ప్రజలే దించుతారు. అప్పనంగా ఇచ్చుకోవాలంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకో, ప్రజల సంపదను దోచిపెట్టడానికి నారా లోకేష్ ఎవరు?విదేశీ పర్యటనను రహస్యంగా ఎందుకు ఉంచారు?ప్రైవేట్ కార్యక్రమం అంటూనే నారావారిపల్లెలో కుటుంబంతో కలిసి జరుపుకున్న సంక్రాంతి సంబరాలను టీవీల్లో లైవ్ ఇచ్చుకున్న చంద్రబాబు, వారం రోజులు తండ్రీకొడుకులు విదేశీ పర్యటనకు వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? కనీసం ఏ దేశానికి వెళ్లిందీ ఎందుకు చెప్పలేదు? పర్యటన వివరాలను అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా బాధ్యతమరిచి వ్యవహరించడంపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి.రాష్ట్రంలో దోచుకుంటున్న అవినీతి సంపదను పెట్టుబడుల రూపంలో దాచుకోవడానికే విదేశీ పర్యటనలు చేశారని ప్రజలంతా అనుకుంటున్నారు. దీనికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పి తీరాల్సిందే. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో సైతం ప్రభుత్వ పెద్దల అవినీతిపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజనీతి అనే టీడీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్లో రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఐఏఎస్ అధికారులు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అభియోగం మోపారు. ఈ 19 నెలల కూటమి పాలనలో ఒక్కో అధికారి రూ. 300 నుంచి రూ. 500 కోట్ల వరకు దోచుకున్నాడని అందులో సీనియర్ జర్నలిస్ట్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.నిజాయితీ ఉంటే టీడీపీ మీడియా చేసిన ఆరోపణలకైనా చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని చంద్రబాబే ఐఏఎస్ అధికారుల సమావేశంలో స్వయంగా ఒప్పుకున్నాడు. చంద్రబాబే దోపిడీకి డోర్లు బార్లా తెరవడంతో ఆయన బాటలోనే కూటమి ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారు. కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి సంబరాలను సైతం దోపిడీ మార్గంగా మార్చకున్నారు.కోడి పందేలకు బరులు ఏర్పాటు చేసి కేసినోల తరహాలో పేకాట ఆడించి మద్యం ఏరులై పారించారు. కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచుకుతిన్నారు. కూటమి ప్రభుత్వం లాంటి విధానాలను అవలంభించడం వల్లనే ఆనాడు ఫ్రెంచి విప్లవం వచ్చిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి జరిగితే నేనే అని, అవినీతి జరిగితే పక్కనోళ్ల మీదకు నెట్టే చంద్రబాబు విధానం మార్చుకోవాలని సతీష్ రెడ్డి హితవు పలికారు. -
చంద్రబాబు ఎక్కడికెళ్లిన జగన్ నామస్మరణే: కోరుముట్ల
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎక్కడకు వెళ్ళినా జగన్ నామస్మరణే చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ వెళ్లినా చంద్రబాబు జగన్ భజనే చేస్తున్నారన్నారు. బాబు ప్రభుత్వంలో ల్యాండ్, మైనింగ్ మాఫియాలు పెరిగిపోయాయని.. సంక్రాంతి వేడుకల్లో లిక్కర్ మాఫియా రెచ్చి పోయిందని కొరుముట్ల మండిపడ్డారు.‘‘ప్రభుత్వం పది రూపాయలు పెంచగా, లిక్కర్ మాఫియా మరో రూ.60 పెంచి దోపిడీ చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ అమ్మకాలు చేశారు. మందా సాల్మన్ హత్యతో దేశమే ఉలిక్కి పడింది. వైఎస్ జగన్కు ఓటేశారని పిన్నెల్లి గ్రామం నుంచి 15 వందల కుటుంబాలను బహిష్కరించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఏం చేస్తున్నారు?. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలమైంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు తన బినామీలకు వేల కోట్ల విలువైన భూములను దోచి పెడుతున్నారు’’ అని కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. -
పేద రోగుల సేవలో జింకానా
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి చదువుకున్న మాతృ సంస్థ రుణం తీర్చుకుంటూ సంస్థ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారు. ఆ సంఘం పేరే జింకానా. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడి తాము చదువుకున్న కళాశాలను మరిచిపోకుండా అభివృద్ధికి కృషి చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా (జింకానా) 1981లో ఏర్పడింది. సుమారు 2,500 మంది పూర్వ విద్యార్థులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతి ఏడాది గుంటూరు వైద్య కళాశాలకు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు అందజేస్తున్నారు. – గుంటూరు మెడికల్ గుంటూరు జీజీహెచ్లో, వైద్య కళాశాలలో ఏళ్ల తరబడి అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తున్న జింకానా తాజాగా జీజీహెచ్లో ఎంసీహెచ్ (మాతా శిశు సంరక్షణ కేంద్రం) వార్డు నిర్మాణం కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. భవన నిర్మాణం పూర్తవడంతో ఈనెల 30న ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జింకానా ఆధ్వర్యంలో కళాశాల, ఆసుపత్రికి ప్రతీ ఏడాది నిధులు అందుతున్నా 2004లో కళాశాలలో జింకానా ఆడిటోరియం నిర్మాణంతో పూర్వ విద్యార్థుల సేవలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.2.50 కోట్లతో 850 సీటింగ్ సామర్థ్యంతో జింకానా ఆడిటోరియం నిర్మించారు. 2009లో రూ.35 కోట్లతో డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ, ట్రామా సెంటర్ భవన నిర్మాణం జరుగ్గా అందులో రూ.20 కోట్లు జింఖా నా సభ్యులు విరాళంగా అందజేశారు. డాక్టర్ పొదిల ప్రసాద్ ఒక్కరే రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో పొదిల ప్రసాద్ భవన నిర్మాణం జరిగింది. ప్రపంచ స్థాయి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ నిర్మించడంతో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేయడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తాజాగా ఎంసీహెచ్ నిర్మాణం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్లో మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్ వార్డు) నిర్మించాలని నిర్ణయించాయి. సుమారు పదేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ఎంసీహెచ్ నిర్మాణం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమై చివరి దశకు చేరుకుంది. భవన నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అడ్డంకులన్ని తొలగిపోయేలా గత ప్రభుత్వం చేయూతనివ్వడంతో జింఖానా సభ్యులు రూ. 100 కోట్లు విరాళం ఇచ్చి భవన నిర్మాణం పూర్తి చేశారు. గతంలో జీజీహెచ్లో డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ మిలీనియం బ్లాక్ నిర్మాణం కోసం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ పాదిల ప్రసాద్ ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం మరో రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు. అతేకాకుండా డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్పైన రెండంతస్తులు నిర్మాణం చేసేందుకు రూ. 10 కోట్లు విరాళం అందజేశారు. జింకానా సభ్యుల్లో 200 మంది విరాళాలు అందించారు. వీరిలో అత్యధికంగా డాక్టర్ ఉమ గవిని రూ. 20 కోట్లు అందజేయడంతో ఆమె భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరుతో ఎంసీహెచ్ వార్డు నిర్మాణం చేస్తున్నారు. డాక్టర్ కె.వెంకట్రావు, రమాదేవి వాసిరెడ్డి దంపతులు రూ.4.3 కోట్లు, డాక్టర్ మువ్వా వెంకటేశ్వరరావు, వేదవతి దంపతులు రూ.4 కోట్లు, తాతినేని గోపాలరావు రూ. 4 కోట్లు ఎంసీహెచ్ నిర్మాణం కోసం అందజేశారు. ఎంసీహెచ్ ప్రత్యేకతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా లేని విధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) 600 పడకలతో ఐదంతస్తులు భవనాన్ని నిర్మించారు. అప్పుడే పుట్టిన పసికందులకు, గర్భిణులు, బాలింతలకు కార్పొరేట్ వైద్యసేవలు ఎంసీహెచ్ వార్డులో ఉచితంగా అందనున్నాయి. ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో నిర్మించిన అత్యాధునిక మాడ్యూలర్ ఆపరేషన్ థియేటర్లు తొమ్మిది ఉన్నాయి. 29న జింకానా సభ్యులంతా ఎంసీహెచ్ వార్డులో హాజరు కానున్నారు. -
పీఎంఈవై ఇళ్ల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో పీఎంఈవై ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయల సేవలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లే–అవుట్లు లోని ఆప్షన్ 1, 2లోని ఇళ్ల నిర్మాణాలు ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సరస్ మేళా విజయం... ప్రజలది సరస్ మేళా విజయం ప్రజలదేనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సరస్ మేళా విజయవంతం కావడం పట్ల సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరులో సరస్ మేళా గొప్ప విజయవంతమైందన్నారు. సరస్లో 343 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసి రూ.25 కోట్లకు పైగా విక్రయాలు చేశారని తెలిపారు. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం అన్నారు. గుంటూరు ప్రజలు విజయవంతం చేయడంలో గొప్ప భాగస్వామ్యం వహించారని ప్రశంసించారు. -
సమాజాన్ని జాగృతం చేసిన యోగి వేమన
నగరంపాలెం: సమాజాన్ని జాగృతం చేసిన మహానుభావుడు యోగి వేమన అని జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో యోగి వేమన జయంతి నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఏఎస్పీ హనుమంతు మాట్లాడుతూ యోగి వేమన బోధించిన నీతి సూత్రాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. యోగి వేమన ప్రజాకవిగా, సామాజిక సంస్కర్తగా సమాజంలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కుల, మత భేదాలు, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు ఆయన తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. సమానత్వం, మానవ విలువలు, నైతికతలను సమాజంలో పెంపొందించడంలో వేమన చేసిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాసులు (ఎస్బీ), సుంకరయ్య (ఏఆర్), ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్, ఏఏఓ జగన్నాథరావు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు -
ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టును పరిశీలించిన ఇజ్రాయెల్ ప్రతినిధి
నకరికల్లు: నకరికల్లు మండలం నర్శింగపాడు సమీపంలోని బాలాజీనగర్తండా వద్ద నిర్మాణదశలో ఉన్న ఇండో–ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు పనులను ఇజ్రాయెల్ దేశపు పొలిటికల్ అఫైర్స్ సెక్రెటరీ సారా వోల్గా మెలిండా ఎనౌస్కి సోమవారం పరిశీలించారు. అగ్రికల్చర్ ట్రైనింగ్ సెంటర్, ఫార్మర్స్ హాస్టల్ తదితర పనుల పురోగతి, నిధుల వినియోగం, ప్రాజెక్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్న అంశాలపై హార్టికల్చర్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ మునిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. ఆమె వెంట జిల్లా హార్టికల్చర్ అధికారి వి.వెంకట్రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. తెనాలి: శ్రీవాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం తెనాలిలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా నిర్వహించనున్నారు. సంబంధిత ఆహ్వానపత్రికను వాసవి యూత్, తెనాలి నాయకులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ‘శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై వాసవీ యూత్, తెనాలి నాయకులు హర్షం వ్యక్తంచేశారు. తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్స వానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. వాసవీ యూత్ నాయకులు నాళం రజనీకుమార్, కొప్పురావూరి కిషోర్, కనమర్లపూడి శ్రీనివాస్, మాజేటి బదరికిరణ్, చీమకుర్తి సతీష్, దేసు రవి, వలివేటి సురేష్, పొన్నూరు తుక్కయ్య, పాల్గొన్నారు. తెనాలి: ప్రముఖ హైకోర్టు న్యాయవాది నారపరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో ‘లాయర్స్ వాయిస్’ మాస పత్రిక విజయవాడ కేంద్రంగా గత పదేళ్లుగా నడుస్తోంది. ఆ పత్రిక ఆధ్వర్యంలో 2026 సంవత్సర కేలండర్ను సోమవారం స్థానిక గంగానమ్మపేటలోని నవోదయ విద్యానికేతన్లో ఆవిష్కరించారు. నవోదయ విద్యానికేతన్ కరెస్పాండంట్ రాంబాబు, వివేకానంద అసోసియేట్స్ (జాబ్ కాన్సల్టెన్సీ) చైర్మన్ నాగిశెట్టి సాయిచరణ్, లాయర్స్ వాయిస్ ఎడిటర్ ఎన్.రాజారెడ్డి పాల్గొన్నారు. రాంబాబు, సాయిచరణ్ మాట్లాడుతూ రాజారెడ్డి ఆధ్వర్యంలో పదేళ్లుగా పత్రికను నడపడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలంటూ కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ఎ.స్వాతికి ఆహ్వానం అందింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ వివిధ రకాల దేశీయ వరి రకాలు భర్తతో కలిసి 20 ఎకరాలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు పూర్తిగా పాటిస్తూ ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడకుండా రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నారు. స్వాతి సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను పీజీఆర్ఎస్ హాలులో కలిసింది. కలెక్టర్ ఆమెను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ప్రాజెక్టు అధికారి రాజకుమారి స్వాతిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
21న హుండీ కానుకల లెక్కింపు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమం ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎగువ, దిగువ సన్నిధులతో పాటు ఘాట్రోడ్లో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను 21వ తేదీ ఉదయం 9 గంటలకు లెక్కింపు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గుంటూరు ఎడ్యుకేషన్: తన రచనలతో సమాజాన్ని జాగృతం చేసిన యోగి వేమన చిరస్మరణీయుడని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో ప్రముఖ కవి, తత్వవేత్త యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ యోగి వేమన రచనలు ప్రస్తుత తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, పరిపాలనాధికారులు నిర్మల భారతి, రత్నబాబు, పూర్ణచంద్రారెడ్డి, మల్లేశ్వరరావు, నాగరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు. చిలకలూరిపేట టౌన్: తల్లి మందలించిందన్న చిన్న కారణంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఎలుకల మందు తిని ప్రాణాలు విడిచిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పట్టణంలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన బోగుమళ్ల అనురాధ (18) ఈ నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల నివారణకు వాడే ’పేస్టు’ తినింది. మరుసటి రోజు ఆమెకు తీవ్రమైన జ్వరం రావడంతో అనుమానం వచ్చిన తల్లి పావని గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన మరియదాసు, పావని కుటుంబం మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం చిలకలూరిపేటకు వలస వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పసి బిడ్డను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : మూడు రోజుల పసిబిడ్డను గుంటూరు పట్టాభిపురంలోని మాతృశ్రీ అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు మూడు రోజుల పసి బిడ్డను ఆశ్రమం బయట వదిలేసి వెళ్ళడంతో ఏడుపు విన్న ఆశ్రమం నిర్వాహకులు సీఐకు సమాచారం తెలియజేశారు. అనంతరం ఐసీడిఎస్ అధికారులకు అప్పగించారు. -
మీ అబ్బాయి చదువు మా బాధ్యత..
సాక్షి, అమరావతి: ‘పిల్లలను చదివించుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, కుటుబం కూడా మెరుగైన ప్రయోజనం పొందుతుంది, మీ అబ్బాయిని పనికి కాదు.. బడికి పంపండి. చదివించే బాధ్యతను మేం తీసుకుంటాం’.. ఇది బడి బయటి పిల్లాడి తండ్రితో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్న మాటలు. సోమవారం ఆయన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో చినకాకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ఆటిజం సపోర్ట్ సెంటర్’ను పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించి సెంటర్ అందిస్తోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆదే పాఠశాలలో గతంలో చదువుకుని కొద్దిరోజులుగా బడికి రాని ఓ విద్యార్థి గురించి ఆరా తీశారు. ఆ విద్యార్థి బడి మానేసి మెకానిక్ పనికి వెళ్తున్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఆ విద్యార్థి తండ్రి నాగమల్లేశ్వరరావును పిలిపించి మాట్లాడగా, ‘చదువు కంటే పని చేసుకుంటే డబ్బులొస్తాయి?’ అని సమాధానమిచ్చారు. అయితే, బడికి వెళ్లి చదువుకుంటే పిల్లాడి భవిష్యత్తు బాగుటుందని, చదువు ద్వారా ప్రయోజనాలను వివరించి కౌన్సెలింగ్ చేశారు. దీంతో రేపటి నుంచి బాబుని బడికే పంపిస్తానని, పనికి పంపనని సదరు విద్యార్థి తండ్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ వెంకట రమణ పాల్గొన్నారు. బడి మానేసిన విద్యార్థి తండ్రికి కోన శశిధర్ కౌన్సెలింగ్ -
బైబిల్ మిషన్ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు
●25 నుంచి 27వ తేదీ వరకు మహోత్సవాలు ●భక్తుల కోసం భారీ పందిళ్లు ●కన్వీనర్. రెవరెండ్ జె. శామ్యూల్ కిరణ్ పెదకాకాని: దైవజనులు ఫాదర్ ఎం.దేవదాస్ బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె. శామ్యూల్ కిరణ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భక్తులకు సకల సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, కేరళ, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ మహాసభకులకు తరలివస్తారన్నారు. అలానే సింగపూర్, మలేషియా, అమెరికా, దుబాయ్ వంటి తదితర దేశాల నుంచి భక్తులు, దేవుని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో మహోత్సవంలో పాల్గొంటారన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో సువిశాల పందిరిలో ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు మహోత్సవాలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తిరిగి సాయంత్రం 6:00 నుంచి రాత్రి 10 గంటల వరకు దైవ వర్తమానాలు అందిస్తారన్నారు. ఏసుప్రభువు చూపిన ప్రేమ, దయ, జాలి, త్యాగం క్షమాగుణం వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకునేందుకు మహోత్సవాల ప్రాంగణం దోహదపడుతుందన్నారు. 26 సంవత్సరాలుగా బైబిల్ మిషన్ మహోత్సవాలను ఆదర్శనీయంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహోత్సవాల వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి. జాన్ దేవదాసు , సెక్రటరీ రెవరెండ్ కె. ప్రశాంత్ కుమార్ , జాయింట్ సెక్రటరీలు రెవరెండ్ డి. సుధాకర్, రెవరెండ్ జె. ఆగమనరావు , రెవరెండ్ ఎం. రవి, గవర్నింగ్ బాడీ సభ్యులు సారధ్యంలో వివిధ కమిటీల కృషితో ఈ ఏడాది ఆధ్యాత్మిక క్రై స్తవ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రెవరెండ్ జె.శామ్యూల్ కిరణ్ వివరించారు. -
తెగుళ్ల దిగులు
మొక్కజొన్న తోటలో తెనాలి టౌన్: ఆరుగాలం కష్టించే రైతుకు పండించిన పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తెనాలి మండలంలో దాదాపు 20 వేల ఎకరాల్లో ఖరీఫ్లో వరి సాగు చేపడితే ఆదిలోనే మోంథా , పంట చేతికి వచ్చే సరికి దిత్వా తుఫాన్లు ముంచేశాయి. ఎకరాకు రూ. 30 వేల నుంచి 35 వేల కౌలు చెల్లించి రూ.10వేల నుంచి రూ.15వేలు పెట్టుబడి పెట్టి దిగుబడి రాక సరైన గిట్టుబాటు ధర లేక వరి పైరు వేసిన రైతులు డీలా పడ్డారు. ఎకరాకు 20 నుంచి 25 వేల రూపాయలు నష్టం చవిచూశారు. రబీ సాగుగా ఈ ప్రాంతంలో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర చేపట్టారు. ప్రస్తుతం 30 నుంచి 40 రోజుల దశలో జొన్న, మొక్కజొన్న పైరు ఉంది. మొక్కజొన్నను కతైర పురుగు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. మూడు తడుల నీళ్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ఖర్చు అవుతుందని వివరించారు. మార్చి చివరి వారం, ఏప్రిల్ నెలలో పంట చేతికి వస్తుందని అన్నారు. జొన్న, మొక్కజొన్నకై న ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. కతైర పురుగు ..సమగ్ర యాజమాన్య పద్ధతులు మొక్కజొన్న సాగు చేసే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని, పురుగు ఉధృతి అధికంగా ఉంటే యాజమాన్య పద్ధతులతో నివారించకుంటే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో సుధీర్బాబు సూచించారు. మొక్కజొన్న, మినుము, పెసర పైరు నిండా మునిగిన రైతాంగం రాకుంటే అప్పుల ఊబిలోకి రైతులు -
కుమార్తె అదృశ్యంపై తండ్రి ఫిర్యాదు..
గత ఏడాది మార్చి 15న కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తెలిసిన వ్యక్తులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లేదు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. నెలలు గడిచినా పట్టించుకోలేదు. నాలుగైదు నెలలు తర్వాత కుమార్తె వేరే మొబైల్ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ ఫోన్ నంబర్ను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. కనీసం ఆ ఫోన్ ఎవరిది, ఏ ఏరియా నుంచి వచ్చిందనేది ఆరాతీయలేదు. అప్పటి నుంచి పలుమార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. ఒకే ఒక్క కుమార్తె కావడంతో గారాబంగా పెంచుకున్నా. ఏడాది నుంచి కుమార్తె ఆచూకీ తెలియరాలేదు. కుమార్తె చిరునామా గుర్తించగలరు. – దివ్యాంగుడు పి.ఏసోబు, ఆర్.అగ్రహారం -
సాహిత్య సేవలు స్ఫూర్తిదాయకం
నగరంపాలెం: తెలుగు వాడైన యూపీ ఏసీబీ ఏడీజీపీ కిల్లాడి సత్యనారాయణ సాహిత్య సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకాతిరుమలరావు అన్నారు. నగరంపాలెం బొమ్మిడాల ఆర్యవైశ్య వసతి సమావేశ మందిరంలో విశ్వనాథ సాహిత్య అకాడమీ, మెట్టు సత్యనారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మెట్టు సత్యనారాయణరెడ్డి స్మారక సాహిత్య పురస్కారం సభ ద్వారా ప్రముఖ సాహితీవేత్త రచయిత కిల్లాడి సత్యనారాయణను సత్కరించారు. ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సాహిత్యపరంగా ఉన్నతంగా రాణించి, కీర్తి గడించడం తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. సభకు సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ అధ్యక్షుడు వహించగా, కిల్లాడి సత్యనారాయణ సాహిత్య ప్రస్థానంపై కవి డాక్టర్ సుంకర గోపాలయ్య సాహిత్య సమీక్ష నిర్వహించారు. సభలో వీవీఐటి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఎస్వీ రామారావు, మెట్టు సత్యనారాయణరెడ్డి, రెడ్డి విద్య కళాశాల ప్రిన్సిపల్ సెట్లం చంద్రమోహన్, జన చైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీతలు డాక్టర్ పాపినేని, పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ సీహెచ్.సుశీలమ్మ, డాక్టర్ నాగరాజ్యలక్ష్మి, బండ్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు -
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి
లక్ష్మీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలితో కలసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్లో వస్తున్న అర్జీలను పరిశీలించారు. మొత్తం 195 అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్లో అందిన అర్జీల ను కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్కు నాలు గు కౌంటర్లు ఏర్పాటుచేశారు. పీజీఆర్ఎస్లో అందిన కొన్ని అర్జీల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.. డీఆర్వో శ్రీనివాసరావు, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగసాయికుమార్, డీఆర్డీఏ పీడీ వి.విజయలక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి.సత్యనారాయణ, జిల్లా ఉపా ధి కల్పన అధికారి డి.దుర్గాభాయి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల పడిగాపులు
దుగ్గిరాల: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. దుగ్గిరాలలోని ప్రాథమిక వ్వవసాయ కేంద్రం వద్ద రైతులు సోమవారం యూరియా కోసం క్యూలైనులో బారులు తీరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు రైతులను వారి కష్టాలు గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పనులు మానుకొని యూరియా కోసం నిత్యం లైనులో నిల్చోవాల్సి రావడం దారుణం అని అన్నారు. ఆధార్ కార్డుకి ఐదు కట్టలు ఇవ్వటం, సిఫార్సు ఉంటే ట్రాక్టరు నిండా తీసుకెళుతున్నారని అన్నారు. డీఏపీ లిక్విడ్ కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని షరతులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికై నా రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎరువులను సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో జెట్టి బాలరాజు, వై.బ్రహ్మేశ్వరరావు, వెంటేశ్వరరావు, జానీ, లక్ష్మణరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకలపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయపూడిలో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ, అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు సూచించిన మేరకు శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు నీరు, పారిశుధ్యం పక్కాగా ఉండాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఏఆర్ డీఎస్పీగా సంకురయ్య
నగరంపాలెం: జిల్లా ఏఆర్ డీఎస్పీగా కె.సంకురయ్య సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఏఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్కు చెందిన ఆయన ఆర్ఎస్ఐగా విధుల్లో చేరారు. 2014లో ఆర్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. అప్పటి నుంచి 2019 వరకు గుంటూరు రూరల్ జిల్లా ఆర్ఐగా విధులు నిర్వర్తించారు. 2019 నుంచి 2022 వరకు సీఏఆర్ విజయవాడలో విధులు నిర్వర్తించగా, 2022లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం నంద్యాల, విజయవాడ, అక్టోపస్ మంగళగిరి డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ గుంటూరు ఏఆర్ డీఎస్పీగా బదిలీయ్యారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందించారు. -
పెళ్లిళ్ల పేరుతో మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడిన నిత్య పెళ్లి కొడుకుపై బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. పెళ్లి కాలేదని చెప్పి రెండు వివాహాలు చేసుకున్నాడని వాపోయారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదిదారులతో మాట్లాడి, వారి వినతులను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం బాధితుల ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. పోలీస్ ప్రజా వినతుల పరిష్కార వేదికలో మహిళల ఫిర్యాదు -
మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభం
గుంటూరు లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. శిక్షకులుగా సుప్రీం కోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ కేరళ నుంచి లాల్ వారియర్ అడ్వకేట్, మధ్యప్రదేశ్ నుంచి మిస్ నీనాఖరే అడ్వకేట్లను నియమించారు. మొదటిరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణచక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
మాజీ సీఎం నివాసం వద్ద భద్రతా లోపం
తాడేపల్లి రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద ప్రభుత్వ భద్రతా లోపం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద నిత్యం భద్రతను పర్యవేక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా... ఆ ప్రాంతంలో దొంగలు చెలరేగిపోతున్నారు. రోడ్డు వెంబడి ఉన్న ఫుట్పాత్ లైట్లు, ఐరన్ గ్రిల్స్ను కట్ చేసి తీసుకువెళుతున్నా పోలీసులు గుర్తించలేకపోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని భరతమాత సెంటర్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం మీదుగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వరకు రహదారికి ఇరువైపులా మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో గతంలో రోడ్డు నిర్మించారు. రహదారి ఫుట్పాత్ వెంబడి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ లైట్లకు భద్రత కోసం డిజైన్ కలిగిన ఐరన్ గ్రిల్స్ను పెట్టారు. కొద్దిరోజులుగా గ్రిల్స్ సహా లైట్లను వచ్చినంత వరకు దొంగలు కట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ తీగలను ఫుట్పాత్పై వదిలివేయడంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. పొరపాటున విద్యుత్ సరఫరా అయితే ఫుట్పాత్పై ప్రయాణించే వారితోపాటు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసేవారికి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దర్జాగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి దొంగిలిస్తుంటే కార్పొరేషన్ అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. -
గుంటూరులో సంచలనం.. ఎస్ఐకి పదేళ్ల జైలు శిక్ష
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐ రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఎస్ఐ రవితేజ నగరంపాలెంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో, బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును గుంటూరు నాలుగో జిల్లా అదనపు న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో నిందితుడి చేసిన మోసం రుజువు కావడంతో అతడికి 10 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. కాగా, ఎస్ఐ రవితేజ ప్రస్తుతం అమృతలూరు పనిచేస్తున్నాడు. అయితే, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని.. బాధిత యువతికి న్యాయం జరిగిందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. -
‘కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణం తీస్తారా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో దళితులకు రక్షణ లేదంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు. ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటు వేశారనే కారణంతో దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పని చేయడం లేదని కూటమి నేతలపై ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు, దళితులు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితి అదే. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు.. రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు. ఓటు వేశారా? లేదా? అనే తారతమ్యాలు లేవు.కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మందా సాల్మన్ హత్య ప్రభుత్వం చేసిన హత్యే. ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సాల్మన్ హత్యను కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం ఉంది. దళితులంతా ఒకసారి ఆలోచన చేయాలి. పోరాటమా.. శరణమా తేల్చుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్యలపై ప్రజా ఉద్యమం చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
సాల్మన్ది కూటమి ప్రభుత్వ హత్యే: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని.. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. దళిత కార్యకర్త సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేయడానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లగా.. డీజీపీ కార్యాలయం స్పందించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. చివరికి ఫిర్యాదును ఏడీజీ తీసుకున్నారు.డీజీపి ఆఫీసుకు వచ్చిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణమని.. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ‘‘సాల్మన్ను హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయితాలు పెరిగాయి. సాల్మన్ది ప్రభుత్వ హత్యే.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలి’’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.‘‘పిన్నెల్లి గ్రామం పోలీసుల జాగీరా?. అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలట..!. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడలేనివారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారు?. సాల్మన్ను హత్య చేసిన వారికి శిక్ష పడేవరుకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే యరపతినేనికి దళితులు అంటే చులకన. ఒక మనిషి ప్రాణం విలువ ఎమ్మెల్యే యరపతినేనికి తెలియడం లేదు. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు.మందా సాల్మన్ది ప్రభుత్వం చేసిన హత్యే: మేరుగ నాగార్జునమందా సాల్మన్ ది ప్రభుత్వం చేసిన హత్యే. సీబిఐతో విచారణ జరపాలి. హత్య గురించి ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా సాల్మన్ మీదే కేసు నమోదు చేశారు, సాల్మన్ మృతదేహాన్ని చూడటానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. వైఎస్ జగనే స్వయంగా వస్తానన్నారు. సాల్మాన్ మృతదేహాన్ని ఖననం చేస్తానని చెప్పటంతో పోలీసులు స్పందించారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది?...దీనిపై ఫిర్యాదు ఇవ్వటానికి వస్తే డీజీపి ఆఫీసులో అనుమతి లేదన్నారు. మేము ధర్నా చేస్తేగానీ డీజీపి కార్యాలయం స్పందించలేదు. ఏడీజీ మా ఫిర్యాదు తీసుకున్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కేసులు కూడా నమోదు చేయటం లేదు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందిడీజీపీ అసలే మాత్రం స్పందించలేదు: అంబటి రాంబాబుసాల్మన్ హత్య కేసులో పోలీసుల వైఖరి వివాదాస్పదంగా ఉంది. సాల్మన్పైనే పోలీసులు కేసు పెట్టారు. డీజీపి ఆఫీసుకు వస్తే కనీసం సమాధానం లేదు. డీజీపీ అసలే మాత్రం స్పందించలేదు. అందుకే డీజీపి ఆఫీసు బయట ధర్నా చేశాం. ఇప్పటికి 10, 15 సార్లు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదు. డీజీపి వైఖరి దారుణంగా ఉంది. సాల్మన్ హత్యపై ఉన్నతస్థాయి విచారణ చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి హైకోర్టులో పిల్ వేస్తాం: కాసు మహేష్ రెడ్డిఏపీలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తోంది. దళిత నాయకుడు సాల్మన్ హత్య జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి చేసిన వారిమీద కాకుండా చనిపోయిన వ్యక్తి మీదే కేసు పెట్టారు. మత సంప్రదాయం ప్రకారం కూడా సాల్మన్ మృతదేహానికి ఖననం చేయనీయకుండా చేశారు. శ్మశానానికి వెళ్లేటప్పుడు కూడా ఆధార్ కార్డు తీసుకు రావాలన్న దిక్కు మాలిన ప్రభుత్వం ఇది. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయబోతే ఆయన నిరాకరించారు. బాధితుల గోడు వినే స్థితిలో కూడా పోలీసు అధికారులు లేరు. దీనిపై హైకోర్టులో పిల్ వేస్తాం. దళిత కార్యకర్త సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాంఅవమానించారు: టీజేఆర్ సుధాకర్ బాబుడీజీపీ ఆఫీసుకు వెళ్తే తమను అవమానించారు. డీజీపీ చంద్రబాబుకు ఏజెంట్గా పని చేస్తున్నారా?. రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తున్నారా?. రాష్ట్రంలో దళితులను ఊచకోత కోస్తున్నారు. మాకు ఈ రాష్ట్రంలో బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. అయినా సరే మా పోరాటం ఆగదు. సాల్మన్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. యరపతినేని శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలిఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేదు: విడదల రజినిపోలీసు అధికారులు తమ విధులను కూడా మర్చిపోయారు. ప్రజలను గాలికి వదిలేసి చంద్రబాబు, లోకేష్కి సేవలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేదు. టీడీపీ గూండాలు ఇళ్ల మీదకి వచ్చి హత్యలు చేస్తున్నారు. ఈ 20 నెలలుగా ఎంతో మంది హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో ఏ సామాన్యుడు కూడా పోలీసు స్టేషను కు వెళ్లే పరిస్థితి లేదు. లోకల్ టీడీపీ ఎమ్మెల్యే చెప్తేనే స్టేషన్లోకి అడుగు పెట్టనిస్తున్నారు. డీజీపీ ఆఫీసులోకే మమ్మల్ని రానివ్వని పోలీసులు ఇక సామాన్యులకు ఏం న్యాయం చేస్తారు?. పోలీసులే దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారుఆటవిక పాలనకు చెక్ పెడతాం: మొండితోక అరుణ్ కుమార్ఒక దళితుడిని హత మార్చితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?. నేనే పెద్ద మాదిగనని ఎన్నికల సమయంలో చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాల్మన్ హత్యపై ఎందుకు మౌనం వహించారు?. దళితులే చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే టైం వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు చెక్ పెడతాం -
మహాకవి యోగి వేమనకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి: మహాకవి యోగి వేమన జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు’అని పేర్కొన్నారు. యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే… pic.twitter.com/XuHxEsujkp— YS Jagan Mohan Reddy (@ysjagan) January 19, 2026 -
ఏపీ డీజీపీ ఆఫీస్ ముందు వైఎస్సార్సీపీ నేతల ధర్నా
సాక్షి, అమరావతి: డీజీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. ఆయన అపాయింట్మెంట్ను కోరారు. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు డీజీపీ గుప్తా నిరాకరించారు. డీజీపీ కార్యాలయం స్పందించకపోవడంతో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు తలొగ్గి అనుమతినిచ్చారు. ఏడీజీ ఫిర్యాదు తీసుకున్నారు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని.. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణమని.. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ‘‘సాల్మన్ను హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయితాలు పెరిగాయి. సాల్మన్ది ప్రభుత్వ హత్యే బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలి’’ అని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి వినతిపత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తమకు సోమవారం అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ డీజీపీకి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన మందా సాల్మన్ను పిన్నెల్లిలో దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేశారని, రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని అప్పిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
గండాలయ స్వామికి ప్రత్యేక పూజలు
మంగళగిరి టౌన్: మంగళగిరి కొండపై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఉన్న గండాలయ స్వామి వారికి అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నూనె సమర్పించి దీపాలు వెలగించారు. గండాలు రాకుండా స్వామి వారి రక్షణ కోరారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు కొండ మెట్ల మార్గంలోను, ఎయిమ్స్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న కొండ ఘాట్రోడ్ మార్గం ద్వారా స్వామిని చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం మంగళగిరి పట్టణంలోని శివాలయం వద్ద అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పలువురు ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతోందని, గత మూడు సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేస్తున్నామని చెప్పారు. సుమారు 4 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. 40 మంది దాతల సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు, సభ్యులు శివసత్యనారాయణ, ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ తైక్వాండో పోటీలకు చిన్నారుల ఎంపిక
చీరాల రూరల్/వేటపాలెం: జాతీయ స్థాయిలో నిర్వహించే తైక్వాండో పోటీలకు చీరాలకు చెందిన మల్లెల రంజయ్ లోచన్, మల్లెల నిక్షిప్త విజయ్లు ఎంపికయ్యారు. గతేడాది డిసెంబర్ 28న గుంటూరు జిల్లా తెనాలిలో ఏపీ తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన రెండో ఏపీ స్టేట్ కిడ్స్, ఫెడరేషన్ కప్లో చీరాలకు చెందిన చిన్నారి క్రీడాకారులు మల్లెల రంజయ్ లోచన్, మల్లెల నిక్షిప్త విజయ్లు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచారు. దీంతో సెలక్టర్లు వీరిరువురిని ఈ ఏడాది జనవరి 18 నుంచి 23 వరకు జైపూర్లో జరిగే ఇండియన్ తైక్వాండో మూడో కిడ్స్ చాంపియన్ షిప్–2026 జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జైపూర్కు పయనమైన వీరిని ఆదివారం ఏర్ డీఎస్పీ విజయ సారధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ వరికూటి అమృతపాణిలు అభినందించారు. భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగి దేశానికి పాతినిథ్యం వహించాలని వారు ఆకాంక్షించారు. క్రీడాకారులు జైపూర్ వెళ్లేందుకు డాక్టర్ అమృతపాణి కొంత ఆర్థిక సాయం అందించారు. కొత్తపేట బీఆర్కే హైస్కూల్లో 2,4 తరగతులు చదువుతున్న మల్లెల నిక్షిప్త విజయ్, మల్లెల రంజయ్ లోచన్ పోటీల్లో సబ్ జూనియర్స్ విభాగంలో ప్రతిభ కనబర్చి విజేతలగా నిలిచి గోల్డ్ మెడల్స్ సాధించారని స్కూలు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ రాధాకృష్ణమూర్తి ఆదివారం తెలిపారు. నేటి నుంచిి 23 వరకు జైపూర్లో జరిగే పోటీలకు పయనమైన రంజయ్ లోచన్, నిక్షిప్త విజయ్ చిన్నారులను అభిందించిన ఏఆర్ డీఎస్పీ విజయ సారధి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు డాక్టర్ అమృతపాణి -
మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఫిట్జోన్ జిమ్లో సీనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్లిఫ్టింగ్ టీమ్ సెలక్షన్ పోటీలు నిర్వహించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి యస్కె. సంధాని తెలియజేశారు. వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఈ సెలక్షన్ పోటీల్లో గెలుపొందిన వారు ఫిబ్రవరి 14,15 తేదీల్లో రాజమండ్రిలో జరిగే 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సెలక్షన్ పోటీల్లో మెన్ టీం నుంచి ప్రదీప్కుమార్, జస్వంత్, రాజు, దినేష్, మొహిద్దీన్, కౌషిక్, పృధ్వికుమార్లు, ఉమెన్ టీం నుంచి చంద్రిక, హర్షిత, చాతర్యలు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ వంశీకృష్ణ, సభ్యులు పవన్కుమార్, సందీప్ తదితరులు అభినందించారు. -
రాహు కేతు పూజలకు పోటెత్తిన భక్తులు
పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రాహుకేతు పూజలు జరిపించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం మౌళి అమావాస్య పురస్కరించుకుని పెదకాకాని శివాలయంలో రాహు కేతు పూజలు భక్తులు అధిక సంఖ్యలో జరిపించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం రాహుకాలం 4:30 గంటల వరకూ 1276 టికెట్లు విక్రయించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. రాహు కేతు పూజల ద్వారా ఆదివారం రూ.6,38,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆదివారం ఆలయంలో అంత్రాలయ అభిషేకాలు, అంత్రాలయ దర్శనాలు, వాహనపూజలు, అన్నప్రాసనలు, నవగ్రహ పూజలు అధికసంఖ్యలో జరిగాయి. భక్తులందరికీ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
మంగళగిరి టౌన్: మనస్తాపానికి గురై ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం ఇందిరానగర్కు చెందిన కోలా రాజేష్కుమార్ (22) ఇంట్లో తన తండ్రితో గొడవపడి వచ్చిన రాజేష్కుమార్ నాలుగు రోజుల నుంచి బాబాయ్ దగ్గర ఉంటున్నాడు. ఆదివారం తిరిగి ఇంటికి వెళ్లిన క్రమంలో మరల తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది నిడమర్రు రైల్వేగేటు సమీపంలో ట్రాక్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గుంటూరు రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్టీ సంస్థాగత నిర్మాణం అత్యంత కీలకం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయాలనేది.. అత్యంత కీలకమైన బాధ్యత అని, మన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం అంశంపై సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, టాస్క్ఫోర్స్ సభ్యుడు టీజేఆర్ సుధాకర్బాబు హాజరయ్యారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏ మాత్రం గురి తప్పకుండా పూర్తి చేయాల్సిన కార్యక్రమం కమిటీ నిర్మాణామని తెలిపారు. డివిజన్ల వారీగా కమిటీలను డివిజన్ అధ్యక్షుడు, ఆయా విభాగాల అధ్యక్షులు చర్చించి ఏర్పాటు చేయాలని సూచించారు. 26 డివిజన్లు ఉన్న పశ్ఛిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో అన్ని అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. దీనితో పాటుగా ముఖ్యంగా డివిజన్ పరిధిలో ఎన్ని సచివాలయాలు ఉంటే.. అన్ని సచివాలయాల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు డిజిటైలేజ్ అయి వైఎస్ జగన్ డ్యాష్ బోర్డుకు వెళ్తాయని వివరించారు. భారతదేశంలో వైఎస్సార్ సీపీకి ఉన్న మాస్ బేస్ ఎవరికీ లేదని, దీనిని పార్టీ నిర్మాణం చేయాలన్నదే వైఎస్ జగన్ తలంపు అని చెప్పారు. కమిటీ నిర్మాణ బాధ్యత డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నేతలపై ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఉదయం ఒక డివిజన్, సాయంత్రం మరో డివిజన్లో తాను కూడా పర్యటిస్తానన్నారు. గుంటూరు పశ్చిమలో గతంలో మూడు సార్లు ఓటమి పాలయ్యామని, వాటిని అధ్యయం చేసి, ఆ చిక్కులను తప్పుకుని ముందుకు వెళ్లాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను పోటీ చేయాలని వైఎస్ జగన్ ఇక్కడకు పంపారని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, టాస్క్ఫోర్స్ సభ్యుడు టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో, డివిజన్లో, వార్డులో పదవి పొందే ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యుడేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉగాది పండుగ లోపల పార్టీ సంస్థాగతంగా నిర్మించుకుని, ఐడీ కార్డులు ఇవ్వాలన్నదే వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. మరో 700 రోజులు దాటితే వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని, తాను ఎక్కడికి వెళ్లినా, పార్టీ నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బాధ్యతతో పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. కమిటీల్లో మహిళలకు పెద్దపీట వేయటంతో పాటు, యువత ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కచ్చితంగా అనుకున్న సమయానికి కమిటీ నిర్మాణం పూర్తి అయ్యేలా పాటుపడదామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు మామిడి రాము, వంగల వలివీరారెడ్డి, ఈమని రాఘవరెడ్డి, పఠాన్ సైదాఖాన్, యేటి కోటేశ్వరరావుయాదవ్, చదలవాడ వేణు, చింతపల్లి వెంకటరమణ, దేవా, సింగు నరిసింహారావు, పల్లపు మహేష్, దేవరశెట్టి చిన్ని, వేలూరి అనిల్రెడ్డి, కీసరి సుబ్బులు, కీసరి సుబ్బారెడ్డి, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, సూరగాని వెంకటరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, ఆలా కిరణ్, షరీఫుద్దీన్, షేక్ హుస్సేన్వలి, ప్రభు, కొరిటిపాటి ప్రేమ్, కార్పొరేటర్లు ఆచారి, రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, గురవయ్య, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నగర, జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
మతోన్మాద విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలి
లక్ష్మీపురం: కేంద్రంలో బీజేపీ నాయకత్వంతో అధికారంలో వున్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలకు నిరసనగా ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. పాతగుంటూరులోని ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాద చర్యలను రెచ్చగొడుతుందన్నారు. కార్మిక వర్గం దీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కృషి చేస్తుందన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా వున్న ఓట్లను తొలిగిస్తుందన్నారు. ఇది అప్రజాస్వామిక చర్యలన్నారు. జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించిన గాంధీ, నెహ్రూ, సుభాష్చంద్ర బోస్ వంటి వారి చరిత్రలను మరుగున పర్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, నల్లమడ ఆధునికీకరణ కోసం నిధులు కేటాయించాలని కోరారు. జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ విస్తృత సమావేశాలను జయప్రదం చేయాలని, దీనికోసం విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎం.రవి, బూరుగు వెంకటేశ్వర్లు, ఎన్.భావన్నారాయణ, కె.నళీనికాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్.అరుణ, కె.అజయ్కుమార్, దుర్గారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి -
సరస్ మేళా ద్వారా రూ.25 కోట్ల ఆదాయం
గుంటూరు రూరల్: గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా–2026 అఖిల భారత డ్వాక్రా బజార్ ఆదివారంతో ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారన్నారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు. 13 రోజుల్లో 25లక్షల మంది సందర్శించారు ముగింపు సభలో కలెక్టర్ తమీమ్ అన్సారియా -
ఏసీ మెకానిక్ హత్యకేసులో ఐదుగురు అరెస్ట్
తెనాలిరూరల్: పట్టణంలో ఇటీవల జరిగిన ఏసీ మెకానిక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు ఆదివారం రాత్రి వెల్లడించారు. పట్టణ నందులపేటకు చెందిన షేక్ ఫయాజ్ అహ్మద్కు 2016లో వ్యభిచార వృత్తిలో ఉన్న పల్లప్రోలు హిమబిందు అలియాస్ మాధవి పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె వద్దకు వెళుతూ ఆమె వ్యభిచార వృత్తికి సహకరించేవాడు. హిమబిందుకు గుంటూరుకు చెందిన జొన్నకూటి క్రాంతికిరణ్తో 2016కు ముందే పరిచయముంది. ఇద్దరూ కలసి వ్యభిచార వృత్తి నిర్వహిస్తూ ఉండేవారు. ఫయాజ్తో పరిచయమయ్యాక హిమబిందు వ్యభిచారం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లింది. తనకు బెయిలు ఇప్పించకపోవడం, తన వద్దే డబ్బులు తీసుకుంటుండడంతో హిమబిందు తిరిగి తనకు గతంలోనే పరిచయమున్న క్రాంతికిరణ్తో ఫోన్లో మాట్లాడడం చేస్తోంది. ఇది గమనించిన ఫయాజ్ ఆమెను హెచ్చరించాడు. ఫయాజ్ను అడ్డు తొలగించుకుని తాము ఇద్దరం కలసి వ్యభిచార వృత్తిని కొనసాగించుకోవచ్చని హిమబిందు, క్రాంతికిరణ్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఫయాజ్ హిమబిందు ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి వెళ్లాడు. ఇదే విషయాన్ని హిమబిందు క్రాంతికిరణ్కు చేరవేసింది. రాత్రి వరకు ఫయాజ్ అక్కడే ఉంటాడని తెలిసిన క్రాంతికిరణ్, మారిస్పేట సీఎం కాలనీకి చెందిన షేక్ నాగూర్వలి అలియాస్ చోటు, కమాదుల జయంత్, ఉప్పు రంగారావులతో ఫయాజ్ను హత్యచేస్తే రూ. 10 వేలు ఇస్తానని ఒప్పించి తన వెంట తీసుకెళ్లాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఫయాజ్ ఇంటి నుంచి బయలుదేరగా అదే విషయాన్ని హిమబిందు క్రాంతికిరణ్కు చేరవేసింది. ఇంటి సమీపంలోనే మాటు వేసి ఉన్న నిందితులు ఫయాజ్పై కర్రలు, సిమెంటు రాయితో దాడి చేసి హతమార్చారు. న్యాయవాది ద్వారా లొంగిపోదామని నిందితులు వస్తున్న సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదుగురు నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్ఐలు ప్రకాశరావు, కరిముల్లా ఉన్నారు. సహజీవనం చేస్తున్న మహిళ మాజీ ప్రియుడితో కలిసి అంతమొందించిన వైనం -
సమాజాన్ని మేల్కొలిపేవి నాటికలే..
యద్దనపూడి: నాటికల్లోని పాత్రల్లో ప్రేక్షకులు తామను తాము చూసుకోవటం ద్వారా సామాజిక చైతన్యం పెరుగుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ప్రదర్శిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీల్లో భాగంగా చివరిరోజు ప్రదర్శించిన నాటిక పోటీలు ఆధ్యంతం ప్రేక్షకులను రంజింపచేశాయి. తొలుత మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. విశ్రాంత డీజీపీ ఎం. మాలకొండయ్య మాట్లాడుతూ భాషా ఉన్నతికి చిరునామాగా, సామాజిక హితాన్ని కాంక్షిస్తూ ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని వాస్తవ పరిస్థితులను తెలిపే నాటికలకు పూర్వవైభవం రావాలని ఆకాంక్షించారు. కళాపరిషత్ల ద్వారా నాటికల పోటీలు నిర్వహించి కళాకారులను అభినందిస్తూ గౌరవించటం అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా సీ్త్రల ఔనత్యాన్ని ఇనుమడింపజేసేలా మంచి నాటకాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, తారక రామారావు, కొరిటాల వంశీకృష్ణ, ఈశ్వరప్రసాద్, పోపూరి హనుమంతరావు, సాంబశివరావు, రావి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాటిక పోటీలు.. న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియోషన్ వారి అఖండపర్వం, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ధర్మో రక్షతి, శ్రీకారం రోటరీ కళాపరిషత్ మార్టూరు వారి నాలుగుకాళ్ల మండపం నాటికలు ప్రేక్షకులను అలరించాయి. అనంతవరంలో ముగిసిన నాటిక పోటీలు -
కపోతేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
నకరికల్లు: నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలోని శ్రీ కపోతేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం దర్శించుకున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఆయన వెంట నరసరావుపేట అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎ.సలోమి ఉన్నారు. వీరికి ఆలయ అర్చకులు కొండకావూరి వెంకట్రామయ్య శర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనాలు అందించారు. నరసరావుపేట అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎ.సలోమి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎస్ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీబగళాముఖి అమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత దర్శించుకుని, పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా జరిగిన కుంకుమ పూజలలో జస్టిస్ సుజాత పాల్గొని గుమ్మడి కాయతో దీపారాధన చేసి హారతులిచ్చారు. న్యాయమూర్తికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేయగా, ఈవో నరసింహమూర్తి, ట్రస్ట్బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, న్యాయమూర్తికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమావాస్య సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మహిళలు పొంగళ్లు పొంగించి అమ్మవారికి సమర్పించారు. భక్తులతో ఆలయ క్యూలైన్లో రద్దీ నెలకొంది. ఆలయంలో నిర్వహించిన చండీహోమం, పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ,ప్రసాదాలు భక్తులు స్వీకరించారు. ఆలయంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని పుణ్య క్షేత్రం శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం పుష్ప అమావాస్య కోటి కుంకుమార్చన, సామూహిక లలిత సహస్ర నామ పారాయణ మహోత్సవం నిర్వహించారు. ఓం నమో భగవతే మలయాళ యాతీన్మాయ సద్గురు మలయాళ స్వాముల సాధురత్నాంబ ఆశీస్సులతో గూడవల్లి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ శ్రీ మైత్రేయాశ్రమంలో ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, చైర్మన్ పావులూరి రమేష్, ఎస్ఎస్ఎఫ్ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, మైత్రేయి ఆశ్రమ నిర్వహకురాలు గంటా నిర్మలమ్మ, ఉప్పల పద్మజ, మండవ నాగమల్లేశ్వరి, ఇంకొల్లు రంగారావు, ఎస్ఎస్ఎఫ్ నిర్వాహకులు పడమటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్భూములు ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదు
తెనాలి: వక్ఫ్ భూములు ముస్లిం సమాజానికి కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించటానికి వీల్లేదని ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీం స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, గుంటూరు పార్లమెంటు కమిటీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం మారీసుపేటలోని కాంగ్రెస్పార్టీ సమావేశ మందిరంలో జరిగింది. ఫ్రంట్ పార్లమెంట్ కన్వీనర్ షేక్ ఖలీల్ అధ్యక్షత వహించారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. వక్ఫ్ భూములను ఇతర అవసరాలకు వినియోగించరాదనీ, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదని తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం ముస్లిం అమ్మాయిల పెళ్లికి రూ.లక్ష, రంజాన్ పండుగకు తోఫా, మైనారిటీ రుణాలు వెంటనే అమలుచేయాలని కోరుతూ తీర్మానం చేశారు. 45 వేల ముస్లిం జనాభా ఉన్న తెనాలిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుచేయాలని, రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు అధిక సీట్లను కేటాయించాలని కోరుతూ తీర్మానం చేశారు. బంగ్లాదేశ్లోని మైనారిటీ మతస్తుల హక్కులను కాపాడాలని తీర్మానించారు. సమావేశంలో అంతర్జాతీయ పవర్లిఫ్టర్ షేక్ షబీనాకు ఆర్థికసాయం అందజేశారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీంతోపాటు గౌస్ బాషా, ఆదంసాహెబ్, కరిముల్లా, మెమన్బాషా, మాజీ ఎంపీటీసీ కరిముల్లాఖాన్, బాబా రహీమ్ఖాన్, కరిముల్లాఖాన్, జమయతుల్ ఉల్మా, షబ్బీర్బాషా, ఖాజి అబ్దుల్ రవూఫ్, నాగూర్, మస్తాన్ షరీఫ్, షంషుద్దీన్, దావూద్, జానిబాషా, షేక్ సలాం పాల్గొన్నారు. ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీం -
దూరవిద్య విభాగంలో కదలిక
మంగళగిరి టౌన్: ఈ నెల 17వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన ‘దూరవిద్యలో అవినీతి దందా’ అనే ప్రత్యేక కథనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తీవ్ర చర్చకు దారితీసింది. దూరవిద్యలో గత పరీక్షల్లో పలు ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అతిథి అధ్యాపకులను తొలగించి వారి స్థానంలో వేరే వారిని అబ్జర్వర్లుగా విధులు కేటాయిస్తున్నట్లు దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు ఆదివారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ కథనానికి స్పందించి అధికారులు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియవచ్చింది. గతంలో కొంతమంది పరిశీలకులుగా వెళ్లినవారు ఆయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులను మభ్యపెట్టి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ పలు చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల కేటాయింపు విషయంలో వర్సిటీ నియమించిన కమిటీ ఆయా కేంద్రాలను పరిశీలించి, అన్ని వసతులు ఉన్న వాటినే ఎంపిక చేసినట్లు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ పరీక్షలకు మొత్తం 114 కేంద్రాలను ఎంపిక చేశామని, వాటికి ఒక్కొక్కరు చొప్పున అబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏదైనా అవకతవకలు జరిగితే అబ్జర్వర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వర్సిటీలో పనిచేసే అధ్యాపకులకు మాత్రమే విధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దూరవిద్య పరీక్షలకు యూజీ, పీజీ కోర్సులకు సుమారు 63 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ విధివిధానాలపై సోమవారం పరిశీలకులుగా నియమించిన వారికి ప్రత్యేక సూచనలు చేయనున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్ నిర్లక్ష్యం ఇదిలా ఉండగా పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో దూరవిద్య కేంద్రంలో కీలకంగా వ్యవహరించే కో ఆర్డినేటర్ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆయా కేంద్రాల నిర్వాహకులు, పరిశీలకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వర్సిటీలో విద్యార్థి కాని మంగళగిరికి చెందిన ఓ వ్యక్తికి గత పరీక్షల్లో పరిశీలకులుగా కృష్ణా జిల్లాలో నియమించినట్లు సమాచారం. అయితే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో పలువురిని మాత్రమే తొలగించి, మిగిలిన వారిని కొనసాగించారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీటన్నింటికీ యూనివర్సిటీలో పలువురు కీలకపదవుల్లో ఇన్చార్జులుగా ఉండటమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమందికి విధులు కేటాయించినా హాజరు కాకుండా రెండుమూడు రోజులు ఎక్కడో ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. దూరవిద్య కేంద్రం వ్యవహారాలను గాడిలో పెట్టాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు. వివరణ కోరేందుకు కో ఆర్డినేటర్కు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. -
రద్దీ వేళ అడ్డగోలు దోపిడీ
బస్టాండు కిటకిట సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలు, నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు బస్టాండుకు రావడంతో ప్రాంగణం ఆదివారం కిటకిటలాడింది. బస్సులు తక్కువగా ఉండటం, సమయానికి రాకపోవటంతో ప్రయాణికులు ఎదురు చూపులు చూశారు. గంటల తరబడి పడిగాపులు తప్పలేదు. ఎక్కాల్సిన బస్సు రాగానే అందులోకి వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కావటంతో మహిళల సంఖ్య ఎక్కువగా కనిపించింది. చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరుసంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వగ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణం అయ్యారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ప్రస్తుతం సుమారు వంద దుకాణాల వరకు ఉన్నాయి. వీటిలో కనీసం నలభై వరకు కూల్డ్రింక్స్, వాటర్ బాటిల్స్, పాప్కార్న్, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి తినుబండారాలు విక్రయించే దుకాణాలే. సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని దుకాణాలు నిబంధనలను పూర్తిగా చెత్తబుట్టలో వేసి, ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఎమ్మార్పీ అనే పదం మచ్చుకై నా కనపడటం లేదు. అత్యంత ప్రముఖ కంపెనీలు అయిన కిన్లే, బెయిలీ, ఆక్వామైన్, బిస్లరీ వంటి కంపెనీల వాటర్ బాటిళ్లపై రూ. 20 ఎమ్మార్పీ ఉంటే.. ఇక్కడ ఆక్సిజెమ్, ఆక్వా ఫ్రెప్తోపాటు ఇతర లోకల్ కంపెనీలకు చెందిన వాటర్ బాటిళ్లు నేరుగా రూ. 30 ముద్రించి విక్రయించటం కొసమెరుపు. ప్రముఖ కంపెనీల వాటర్ బాటిళ్లు సైతం డూప్లికేటు తయారు చేయించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూల్డ్రింక్ చిన్న బాటిల్ అయితే రూ.5, అరలీటర్ రూ.10, లీటర్కు రూ.25 వరకు అధికంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా విక్రయాలు జరుగుతున్నా.. ఈ పది రోజులలో లీగల్ మెట్రాలజీ అధికారులు కనీస తనిఖీ చేసిన పాపాన పోలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్నంబజారు: సంక్రాంతి పండుగ కోసం ఊరికి బయలుదేరిన ఓ సాధారణ కుటుంబానికి గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఎదురైన అనుభవంతో ఇది బస్టాండా.. దోపిడీ అడ్డానా..? అనే ప్రశ్న లేవనెత్తింది. పిల్లల దాహం తీర్చేందుకు రెండు వాటర్ బాటిళ్లు కొనాలనుకున్న ఆ కుటుంబం.. రూ. 20 ఎమ్మార్పీ ఉన్న ఒక్కో బాటిల్కు రూ.30 చెల్లించాల్సి వచ్చింది. ఆఖరికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్వయంగా దుకాణదారులు వాటర్ బాటిల్పై ముద్రించి విక్రయాలు జరుపుతున్నారు. ప్రశ్నిస్తే దుకాణదారుడి సమాధానం మరింత ఘోరం. ‘‘ఇక్కడ అంతే. కావాలంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి.’’ అని అతడు పేర్కొనడం గమనార్హం. ఇదీ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో నడుస్తున్న దోపిడీ రాజ్యం. నాణ్యత ప్రశ్నార్థకం ధరల దోపిడీకి తోడు నాణ్యత లేని, కాలపరిమితికి చేరువైన తినుబండారాలు ప్రయాణికుల చేతిలోకి వెళుతున్నాయి. చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాప్కార్న్లపై అసలు ధరలు లేవు. నిల్వ ఉన్నవి వేడి చేసి అమ్మేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఇది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కానీ దుకాణదారులకు లాభం తప్ప ప్రయాణికుల ఆరోగ్యం అవసరం లేనట్టుగా వ్యవహారం సాగుతోంది. బస్టాండ్ బయటకు వెళ్లి కొనుగోలు చేసే అవకాశం లేకపోవడం ప్రయాణికుల బలహీనతగా మారింది. ‘‘బస్టాండ్లోనే కొనాలి’’ అనే పరిస్థితిని ఆయుధంగా మార్చుకుని, దుకాణదారులు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రశ్నించే ప్రయాణికులపై నిర్లక్ష్యపు చూపు, అహంకారపు మాటలే సమాధానంగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు కనీసం స్పందించడం లేదు. బస్టాండ్లోని దుకాణాలలో తరచూ తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా పండుగ సమయంలో కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చర్యలు లేకపోవడం వల్లే ఈ దోపిడీ మరింత పెరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజల అవసరాలను లాభంగా మార్చుకునే ఈ దోపిడీకి ఇకనైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ధరల నియంత్రణ, నాణ్యత తనిఖీలు, కాలపరిమితి లేని ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. -
బ్యాడ్మింటన్లో సెమీస్కు చేరిన ఆరు జట్లు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ 2026 ఆదివారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సౌత్ జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ మొదటి, రెండవ రోజులు మొత్తం 16 జట్లు పోటీపడ్డాయని, ఆదివారానికి 8 జట్లు గెలుపొందాయని తెలిపారు. క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న వాటిలో కేరళకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, ఆర్ఎన్టీయూ భోపాల్ జట్లతో పాటు మరో ఆరుజట్లు సెమీ ఫైనల్స్కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సెమీ ఫైనల్స్ అనంతరం మంగళవారం ఫైనల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వేమూరు సీఐకి గాయాలు కొల్లూరు: బందోబస్తు కోసం వెళుతున్న వేమూరు సీఐ కారు ప్రమాదానికి గురైన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వేమూరు సీఐగా విధులు నిర్వర్తిస్తున్న పసుపులేటి వీరాంజనేయులు కొల్లూరులో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి చుండూరు మండలంలో వైఎస్సార్ సీపీ వర్గీయుల గృహాలపై ఆ మండల టీడీపీ నాయుకులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడి అలజడి సృష్టించారు. దాడుల సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అదనపు బందోబస్తు నిమిత్తం వేమూరు సీఐని సంఘటనా ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించారు. అర్ధరాత్రి సమయంలో సీఐ కారును స్వయంగా నడుపుకుంటూ బందోబస్తుకు పయనమయ్యారు. వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామంలోని మలుపు వద్ద పొగమంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతో రోడ్డు వెంబడి భవనం గోడను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కారు ధ్వంసమవడంతోపాటు, సీఐ వీరాంజనేయులు గాయాలబారిన పడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును గమనించిన స్థానికులు కొద్ది సమయానికి అదే మార్గంలో చుండూరు మండలం వెళుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు వాహనాన్ని ఆపి కారు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి గాయాలకు గురయ్యాడని తెలియజేశారు. డీఎస్పీ తన సిబ్బందితో కలసి ప్రమాద స్థలంలో కారును పరిశీలించగా వేమూరు సీఐగా గుర్తించారు. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న సీఐను గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించినట్లు సమాచారం. -
చంద్రబాబూ.. ఇవేం మాటలు?: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: సంతాప సభలో చంద్రబాబు సైతాన్ మాటలు మాట్లాడారని.. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది కేవలం 700 రోజులే.. ఈలోపు వీలైతే మంచి చేయాలే తప్ప హత్యా రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు.‘‘వంగవీటి రంగా నుంచి సాల్మన్ హత్య వరకు అనేక మంది చావులకు చంద్రబాబే కారణం. ఎన్టీఆర్ని పదవీచ్యుతుని చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి రావటం లేదు. లక్ష్మీపార్వతి తాళిబొట్టును తెంచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ బతికి ఉండగా ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారు. వంగవీటి మోహనరంగాను హత్య చేయించింది ఎవరు?. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తాళి బొట్టు తెంచింది ఎవరు?. పిన్నెల్లిలో సాల్మన్ భార్య తాళిని తెంచింది ఎవరు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘చంద్రబాబు అంతటి నీచుడు రాజకీయాల్లో ఉండటం ఏపీ ప్రజల దురదృష్టకరం. ఎన్టీఆర్ జీవిత చరిత్ర చదివితే చంద్రబాబు నీచ బతుకు తెలుస్తుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ఎందుకు రానీయలేదు?. సాల్మన్ను హత్య చేసిన వారిని శిక్షించమని కోరాం. ఆ కుటుంబాన్ని ఆదుకోమని కోరాం. కానీ దేనికీ చంద్రబాబు అంగీకరించలేదు. సాల్మన్ని చంపిందే కాకుండా కులాల పేరుతో మాట్లాడతారా?..టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని యరపతినేని గుర్తుంచుకుంటే మంచిది. రాజధానిలో అడుగుకు పది వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని అడిగితే తప్పా?. రాజధాని పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. చంద్రబాబుకు రాజధానిలో ఇల్లే లేదు. గూగుల్ డేటా సెంటర్ని రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. కియో మోటర్స్ రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. రాజధాని రైతులను తీవ్రంగా అన్యాయం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అంటేనే జగన్ గుర్తుకు వస్తారు. దానిని కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయటానికి ప్రయత్నించారు...సంక్రాంతి పండుగ పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేశారు. మద్యం సీసా మీద వంద రూపాయలు ఎక్కువ వసూలు చేసి దోపిడీ చేశారు. ఆ సొమ్మంతా చంద్రబాబు, లోకేష్ జేబులో వేసుకున్నారు. చంద్రబాబు అలివికాని అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల మీద ఒక్కొక్కరి మీద పది లక్షల భారం వేశారు. కూటమి నేతల వలనే రాష్ట్రంలోకి యథేచ్ఛగా డ్రగ్స్, గంజాయి దిగుమతి అవుతున్నాయి’’ అని సుధాకర్బాబు మండిపడ్డారు. -
ఏపీ డీజీపీకి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మంద సాల్మన్ దారుణ హత్యపై రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తమకు సోమవారం (19వ తేదీ)నాడు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్ రాడ్లతో కొట్టి హత్య చేశారని.. రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోందని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు.రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతోందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తలు ప్రాణ భయంతో బిక్కుబిక్కు మంటున్నారని ఆయన తెలిపారు. సాల్మన్ హత్య కేసులో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులకు తగిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని కోరనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
సంస్కతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు నాటికలు
యద్దనపూడి: మన సంస్కతి, సంప్రదాయాలతోపాటు సమాజంలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రతిబింబాలే నాటికలని తెలుగు టీవీ, నిర్మాతల మండలి అధ్యక్షుడు ఆరెకట్ల ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నాలుగో ఉభయ తెలుగురాష్ట్రాల నాటిక పోటీలు మూడో రోజు పోటీలను ఎన్టీఆర్ పురస్కార గ్రహీత డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు దంపతులు ప్రారంభించారు. ఆరెకట్ల ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజాన్ని మేల్కోల్పటంలో నాటికలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. నాటికల్లోని పాత్రల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకోవటం ద్వారా సామాజిక చైతన్యం పెరుగుతుందన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపటానికి నాటక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రఖ్యాత టీవీ దర్శకులు మలినేని రాధాకృష్ణ మాట్లాడుతూ నాటకాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక అంశాలు ఎన్నో మిళితమై ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచరిత, సీఆర్ క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ నిర్వాహకులు గుదే పాండురంగారావు, గుదే తారక రామారావు, కొరిటాల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాటికలు.. తొలి నాటికగా విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బతకన్విండి, రెండో నాటికగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారిచే ఇది అతని సంతకం, ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారిచే మంచి మనస్సులు నాటికలు ఆహుతులను అలరించాయి. -
ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్స్నన్వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళా వేదికపై మూడు రోజులపాటు జరగనున్న ఎన్టీఆర్ కళాపరిషత్ 21వ నాటకోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు సంస్థ ఉపాధ్యక్షుడు వేములపల్లి విఠల్ అధ్యక్షత వహించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్యను ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. అనంతరం కళాంజలి (హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీశైలమూర్తి రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన యాగం నాటకం ప్రదర్శించారు. దేశభక్తిని నాటకంలో చాటారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సంస్థ అధ్యక్షుడు ఘంటా పున్నారావు, గౌరవాధ్యక్షుడు అంబటి మధుమోహన్కృష్ణ, డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి సభ్యుడు యర్రా ఈశ్వరరావు, ఎల్వీఆర్ సన్స్ క్లబ్ అధ్యక్షుడు నూకవరపు వెంకటేశ్వరరావు, పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కేతేపల్లి సాంబశివరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమా మహేశ్వరరావు, సంస్థ నిర్వాహకులు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ, బొప్పన నరసింహారావు (బుజ్జి), జి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
● వృద్ధురాలి మెడలో 27 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేసిన వాహన చోదకుడు ● పెదకూరపాడు పోలీస్ స్టేషనలో ఫిర్యాదు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా కె.మయూర్ అశోక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గుంటూరు నగరంలో సుమారు 10 లక్షల మంది జనాభా ఉన్నారని, సీఆర్డీఏ పరిధిలో కీలక నగరంగా ఉందని, దానికి తగ్గట్టు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలని, అందుకు తగిన విధంగా నగర అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్అన్సారియా, ఎస్పీ వకుల్జిందాల్ల మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ధ్రువ పత్రాలను ఈనెల 20వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా పత్రాల ధ్రువీకరణ కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ప్రకటన కోసం www.bre.ap.gov.in వెబ్సైట్ను గమనిస్తుండాలని స్పష్టం చేశారు. పరీక్ష ఫలితాల ప్రక్రియలో భాగంగా విద్యార్థుల పత్రాల పరిశీలనకు జాబితా డీఈఓ కార్యాలయానికి త్వరలో వస్తుందన్నారు. అప్పటికి విద్యార్థుల హాల్టికెట్ జిరాక్స్ కాపీతో సహా కుల, ఆదాయ, 7వ తరగతి ఉత్తీర్ణత తదితర సర్టిఫికెట్లు అందుబాటులో ఉండాలన్నారు. లేని పక్షంలో విద్యార్థుల వివరాలు తుది జాబితా నుంచి తొలగించబడతాయని తెలిపారు. దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ విద్యార్థులకు గ్రూప్–1 నుంచి గ్రూప్–3 వరకు ఏదో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థనలు అంగీకరించబడవని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సర్టిఫికెట్లను గడువు తేదీలోగా డీఈఓ కార్యాలయంలో అందచేయాలని కోరారు. పెదకూరపాడు : సాయం చేసినట్లు చేసి వృద్ధురాలు మెడలోని 27 గ్రాముల బంగారం గొలుసుని లాక్కొని ద్విచక్ర వాహనదారుడు ఉడయించిన సంఘటన మండలంలోని పరస – ఖమ్మంపాడు గ్రామంపాడు గ్రామాల మధ్య శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని 75 త్యాళ్లూరు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల ఈదా సామ్రాజ్యం పరస గ్రామంలో ఉంటున్న తన మనవడు అంజిరెడ్డి గృహానికి శనివారం ఉదయం వచ్చింది. అంజిరెడ్డి కంభంపాడు, జనాలపురం గ్రామాల మధ్య ఒక ఎకరం మిరప తోట సాగు చేస్తున్నాడు. సామ్రాజ్యం మధ్యాహ్న భోజనం ముగించుకొని తన మనవడు మిరప పొలాన్ని చూసేందుకు బయలుదేరారు. పరస జంక్షన్ వద్ద మిరప పొలానికి వెళ్లేందుకు నిలిచి ఉండగా కంభంపాడు గ్రామం వైపు వెళుతున్న యువకుడి ద్విచక్ర వాహనాన్ని లిఫ్ట్ అడిగింది. వాహనదారుడు వృద్ధురాలను ఎక్కించుకొని మార్గమధ్యంలో ఆమె మెడలో ఉన్న 27 గ్రాముల బంగారం గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. వెంటనే వృద్ధురాలు సామ్రాజ్యం తన మనవడు అంజిరెడ్డికి సమాచారం ఇచ్చి పెదకూరపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని వృద్ధురాలు వద్ద వివరాలు సేకరించి, దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు. -
మహిళలు, చిన్నారుల రక్షణ భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత మూడు నెలల్లో పాఠశాలలు, కళాశాల లు, ముఖ్యమైన కూడళ్లల్లో సుమారు 99 అవగాహన సదస్సులు నిర్వహించి, 2 వేల మందికి అవగాహన కల్పించామని అన్నారు. శక్తి యాప్లను 821 మంది మొబైల్ఫోన్లల్లో ఇన్న్స్టాల్ చేసుకున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది శక్తి బృందాలు ఉన్నాయని, ప్రతి పోలీస్ సబ్ డివిజనన్్ కు ఒకటి చొప్పున నెలకొల్పామని అన్నారు. గుంటూరు నగరంలో రెండు బృందాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నగర నూతన కమిషనర్ గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను శనివారం గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కె.మయూర్ అశోక్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ప్రజలకు ఉత్తమమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్), మీడియా సెల్ నూతన భవనాన్ని శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, పీజీఆర్ఎస్ సీఐ బిలాలుద్దీన్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, ఎంటీ ఆర్ఐ శ్రీహరిరెడ్డి జిల్లా ఎస్పీ వెంట ఉన్నారు. మూడు నెలల్లో 99 అవగాహన సదస్సులు.. రెండు వేల మందికి అవగాహన -
కేఎల్యూలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో శనివారం అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైనట్లు వర్సిటీ వీసీ డాక్టర్ పార్ధసారధి వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ ఎస్.సంతోష్కుమార్ విచ్చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, జాతీయస్థాయి ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్కు అర్హత సాధించడానికి ఈ టోర్నమెంట్ ఒక గొప్ప అవకాశమన్నారు. వర్శిటీ వీసీ డాక్టర్ పార్ధసారధి వర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జోన్లలో విజేతలైన జట్లు ఒక్కో జోన్కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 16 విశ్వవిద్యాలయాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. శనివారం నుంచి మూడు రోజలు పాటు జరిగే టోర్నమెంట్లో క్రీడాకారులకు అన్ని రకాల వసతి, భోజనం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేఎల్యూ క్రీడల డైరెక్టర్, సౌత్జోన్ బ్యాడ్మింటన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ తొలిరోజు 16 జట్లు ఆడిన తరువాత కేఐఐటీ యూనివర్సిటీ ఒడిశాపైన బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్శిటీ విజయం సాధించిందని, దీన్దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీపై యూనివర్సిటీ ఆఫ్ కాళికట్ విజయం సాధించిందని, వీటితో పాటు మరో ఆరు జట్లు విజేతలుగా నిలిచాయని ఆదివారం నాడు ఎనిమిది జట్లు తలపడనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా యూనివర్సిటీల పరిశీలకులు డాక్టర్ కిరణ్, వర్సిటీ వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మంగళగిరి టౌన్ : మంగళగిరిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి పట్టణం ఇందిరానగర్లో నివాసముంటున్న పెండెం రామకృష్ణ బంగారపు పనిచేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెతో జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు జయంత్ బవన్ (21) బీబీఏ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు స్నేహితులో కలసి బయటకు వెళుతున్నాని చెప్పి శుక్రవారం సాయంత్రం కారు తీసుకుని వెళ్ళాడు. శుక్రవారం రాత్రి సమయంలో తమ కుమారుడు జయంత్తో పాటు అతని స్నేహితుడు నాగార్జున విజయవాడ వైపు నుంచి గుంటూరు వెళుతుండగా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొడుతూ రోడ్డుకు అవతలవైపు పడింది. దీంతో కారు డ్రైవ్ చేస్తున్న జయంత్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జయంత్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించగా, స్నేహితుడు నాగార్జునకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. జరిగిన ఘటనపై మంగళగిరి పట్టణ ఎస్ఐ శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దత్త పీఠంలో ముగిసిన సంక్రాంతి సంబరాలు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు సంబంధించి ఎగువ, దిగువ సన్నిధుల్లో స్వామివారికి, రాజ్యలక్ష్మి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన వస్త్రాలను నేడు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేలం పాట ఆదివారం ఉదయం 9 గంటలకు దిగువ సన్నిధిలోని ఆలయ ఆవరణలో జరుగుతుందని, ఆసక్తిగల భక్తులు వేలంపాటలో పాల్గొనాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. గుంటూరురూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఇలవేల్పుదేవత శ్రీ పుట్టలమ్మతల్లి, శ్రీ ఘంటాలమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలందుకున్న లడ్డూ వేలంను శ్రీరామ్శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఏటా హోరాహోరీగా సాగే వేలంలో భక్తులు పాల్గొని అమ్మవారి 9 కిలోల ప్రసాదం లడ్డూను దక్కించుకుంటారు. ఈ సారీ పోటాపోటీగా సాగిన వేలంలో గ్రామాని కి చెందిన అమ్మవారి భక్తుడు ఇమడాబత్తిని నాగేశ్వరరావు రూ.15,50,000లకు సొంతం చేసుకున్నారు. అనంతరం లడ్డూను వేలంలో పాడుకున్న భక్తునికి ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి దాతలు ఇంటూరి వీరారెడ్డి, రాజశేఖర్రెడ్డిలు అందజేసిన 9 గ్రాముల అమ్మవారి బంగారు లాకెట్ను అందజేశారు. తెనాలిఅర్బన్: తెనాలి మారీసుపేటలోని దయామణి ఇంగ్లిషు మీడియం స్కూల్ 16వ వార్షికోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఆస్ట్రేలియా దేశంలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అత్తోట విద్యాసాగర్, ఆయన బృందం పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఉపాధ్యాయులు తెలుగు సంప్రదాయ పద్ధతిలో చీరలు, పంచెలు ధరించి సందడి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అత్తోట హేమలత, ప్రవాస భారతీయులు దాసరి చంద్రమౌళి, టి.రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లలకు కట్నం కింద ఇచ్చామయ్యా...
నాకు మొత్తం 2 ఎరాలు ఉంది. ఇటీవల ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి చెరో అర ఎకరం ఇచ్చాం. మిగిలిన నా పొలంతోపాటు ఆడపిల్లలకిచ్చిన పొలాలు కూడా ఓఆర్ఆర్ కింద తీసుకుంటారంట. ఇలా అయితే వాళ్ళ సంసారాలు ఏం కావాలి. అల్లుళ్లు ప్రశ్నించరా. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కూడా చాలా తక్కువంటున్నారు. నాలుగు రోజల నుంచి మనస్సు ఏమీ బాగుండడం లేదయ్యా. నాకు 70 సంవత్సరాల వయస్సు. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఇలా మోసం చేస్తుందనుకోలేదు. – ఎన్.సరస్వతి, డోకిపర్రు -
భూములు ఇచ్చేందుకు సిద్ధమే
అభివృద్ధికి మేం పూర్తిగా సహకరిస్తాం. మా వాళ్లు చాలా మంది అమరావతి రాజధాని కోసం భూములిచ్చారు. వారిలో ఇప్పటికీ కొందరికి ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదు. ఓఆర్ఆర్కు భూమిలిచ్చేందుకు సిద్ధం. కానీ సుమారు రూ.2 కోట్లకు పైగా విలువ ఉన్న భూములకు కేవలం రూ.30 లక్షలు ఇస్తామంటున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకున్న భూమిలో మిర్చి, పత్తి పండిస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాను. భూములు కోల్పోతే మా పరిస్థితి ఏంటో తెలీడంలేదు. – అనిల్ కుమార్, రైతు, డోకిపర్రు -
జేఈఈ మెయిన్స్కు ఇలా..
రెండు గంటల ముందుగా కేంద్రానికి ఈనెల 21 నుంచి 29 వరకు వివిధ షిఫ్ట్లలో నిర్వహణ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైట్లో అడ్మిట్ కార్డులు ప్రతి షిఫ్ట్కు మూడు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులు విడుదల నీట్ తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్టీఏ విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు ఉమ్మడి జిల్లాలో హాజరు కానున్న 15వేల మందికి పైగా విద్యార్థులు -
మందా సాల్మన్ది ప్రభుత్వ హత్యే
గుంటూరు● పాలకులపై వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు ● చంద్రబాబు సర్కార్ వైఖరికి నిరసనగా ప్రదర్శన 7ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026 బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, ఎస్సీ విభాగ నేతలు గుంటూరులో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై మారణహోమం కొనసాగుతూనే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపేనని.. నిండు ప్రాణాలను బలిగొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నేతలు మందా సాల్మన్ను హత్య చేయడంతో నిరసన కార్యక్రమం వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ముందుగా బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వరకు నిరసన పదర్శన సాగింది. అనంతరం అక్కడ బైఠాయించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. భట్టిప్రోలు: పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారు శనివారం మూలానక్షత్రం సందర్భంగా 27 నక్షత్రాల ప్రతీకగా నక్షత్ర దీప సౌందర్య కాంతుల అలంకారంతో విశేష దర్శనమిచ్చారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.3148 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 553.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 33,138 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
రైతు గుండైపె ఓఆర్ఆర్
● ఆదుకుంటారనుకుంటే ఆడుకుంటున్నారు... ● కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నోటీస్ బోర్డుల్లో పెట్టారు ● మార్కెట్ విలువలో పదోవంతు కూడా రాదు ● నిన్న నారాకోడూరు, నేడు మేడికొండూరు మండలం డోకిపర్రు రైతుల ఆందోళన ● డోకిపర్రులో ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 365 ఎకరాలు సేకరణ ● పాస్ పుస్తకాలు కోసం వెళ్లిన రైతులకు షాక్ ఇచ్చిన అధికారులు ● గుంటూరు కలెక్టరేట్కు పెద్దఎత్తున తరలి వచ్చిన రైతులు సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: రాజధాని చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఓఆర్ఆర్ భూసేకరణ రైతులపై పిడుగులా పడింది. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా సచివాలయాల్లో సమాచారాన్ని అతికించి వదిలివేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేకపోగా ఉన్న భూములను కూడా లాక్కుని రైతుల నోట్లో మట్టి కొట్టి రోడ్లపైకి లాగుతున్నారని వాపోతున్నారు. చడీచప్పుడు లేకుండా కనీసం పొలం సరిహద్దుకు కూడా తెలీకుండా రైతుల భూములను లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల చేబ్రోలు మండలం, నారాకోడూరు రైతులకు సంబంధించిన భూముల విషయంలో ఇదే జరిగింది. తాజాగా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ రైతులు శనివారం గుంటూరు కలెక్టరేట్కు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. పేరేచర్ల–మేడికొండూరు మధ్యలో ఉన్న డోకిపర్రు గ్రామంలో 365 ఎకరాల భూమిని ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తున్నట్లు తెలుసుకున్న రైతులు ఆగమేఘాలపై తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఏదో ఒరగబెడతారని అందరూ చంద్రబాబు సర్కారును గద్దెనెక్కిస్తే చివరికి మా నోటి దగ్గర కూడు లాక్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి కోల్పోతున్న రైతులకు రూ.20–30 లక్షల మధ్యలో నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. వాస్తవానికి ఇక్కడ కమర్షియల్ భూమి విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్లు మధ్యలో నడుస్తుంది. ఓఆర్ఆర్కు భూమి ఇచ్చేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాని ప్రభుత్వం తమకిచ్చే పరిహారం విషయంలో తమకు జరిగే అన్యాయాన్ని ఎట్టిపరిస్థితిలో అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. చడీచప్పుడు కాకుండా కాజేసేందుకు స్కెచ్ ... సుమారు 350 మంది రైతుల జీవితాలు ఆగమవుతుంటే తనకేమీ తెలియదని తాడికొండ ఎంఎల్ఏ తెనాలి శ్రావణ్ కుమార్ అంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మొదట విడత గెజిట్లో 70 మీటర్ల రోడ్డుగా నమోదు చేశారు. దానిని 140 మీటర్లుగానూ ఇప్పుడు అవీ ఇవీ కలుపుకుని ఇప్పుడు 250 మీటర్ల ఓఆర్ఆర్ అవసరమని అధికారులు తేల్చారు. వాస్తవానికి ఇంత వెడల్పున రోడ్డు రాష్ట్రంలో ఎక్కడాలేదు. ఇటీవల ప్రభుత్వం భూమి ఉన్న రైతులకు పాస్పుస్తకాలు అందజేసింది. దీంతో నాలుగు రోజుల క్రితం పాస్బుక్స్ తీసుకునేందుకు సచివాలయానికి వెళితేగాని వారికి అస్సలు విషయం అర్థం కాలేదు. తనకున్న రెండు ఎకరాలు ఓఆర్ఆర్ కింద తీసుకునేందుకు అధికారులు నోటీసు బోర్డులో అతికించేసరికి ఒక్కసారిగా షాక్కు గురి అయినట్లు డోకిపర్రుకు చెందిన గట్టు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి మా ఇబ్బందులు చెప్పుకున్నాం. అక్కడకు అధికారులను పంపి విచారించి న్యాయం చేస్తామంటున్నారు. అసలు రైతులకు తెలీయకుండా ఈ భూములను తీసుకోవడమేంటో అఽర్థం కావడంలేదు. రైతులు ఏమీ చేయలేరనే ధీమా ప్రభుత్వానికి ఉంది. – కె.సుబ్రమణ్యం, డోకిపర్రు -
మొన్న నారాకోడూరు.. నేడు డోకిపర్రు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: అమరావతి చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిచ తలపెట్టిన ఓఆర్ఆర్ కోసం చంద్రబాబు సర్కారు రైతులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ రైతులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి భూములు లాక్కునేందుకు ప్రయతి్నస్తోంది. కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా కేవలం సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అతికించి వదిలేయడంతో రైతులు ఇది చూసి అవాక్కవుతున్నారు.పాస్బుక్స్ తీసుకునేందుకు సచివాలయానికి వెళ్తే ఈ విషయం వెలుగుచూసింది. పేరేచర్ల–మేడికొండూరు మధ్యలో ఉన్న తమ గ్రామంలో 365 ఎకరాల భూమిని ఔటర్ రింగ్రోడ్డు కోసం సేకరిస్తున్నట్లు తెలుసుకున్న రైతులు శనివారం ఆగమేఘాల మీద గుంటూరు కలెక్టరేట్కు చేరుకుని నిరసన వ్యక్తంచేశారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. ఏదో ఒరగబెడతారని అందరూ చంద్రబాబును గద్దెనెక్కిస్తే చివరికి మా నోటి దగ్గర కూడును లాక్కోవడం దారుణమని వారు ముక్తకంఠంతో మండిపడ్డారు. ఇటీవల గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, నారాకోడూరు భూముల విషయంలోనూ రైతుల నుంచి ఇలాగే తీవ్ర వ్యతిరేకత వచి్చంది. ఇంత తక్కువ నష్టపరిహారమా!?.. మరోవైపు.. భూమి కోల్పోతున్న రైతులకు కేవలం ఎకరం రూ.20–30 లక్షలతో నష్టపరిహారం సరిపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, ఇక్కడ కమర్షియల్ భూమి విలువ రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య పలుకుతోంది. ప్రభుత్వం ఇలా అతితక్కువ పరిహారం ఇస్తే ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేదిలేదని రైతులు కుండబద్దలు కొడుతున్నారు. అవసరమైతే ఆందోళనలతో పాటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.సుమారు 350 మంది రైతుల జీవితాలు రోడ్డునపడుతుంటే తనకేమి తెలీదని తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అంటున్నారని రైతులు దుమ్మెత్తిపోశారు. మొదటి విడత గెజిట్లో 70 మీటర్ల రోడ్డుగా నమోదుచేశారని.. దానిని 140 మీటర్లకు పెంచి ఇప్పుడు 250 మీటర్లుగా తేల్చడంపై వారు మండిపడుతున్నారు. ఇంత వెడల్పైన రోడ్డు రాష్ట్రంలో ఎక్కడాలేదని.. దీనిపై ఎమ్మెల్యే స్పందించకపోవడం ఏమిటని వారు రగిలిపోతున్నారు. -
తెనాలిలో హాట్ టాపిక్గా మారిన అత్తారింటి మర్యాదలు
గుంటూరు జిల్లా: ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు అత్తవారింట అతిథి మర్యాదలకు లోటుండదు... రకరకాల పిండి వంటలతో భారీస్థాయిలో విందు భోజనాలు పెడుతుంటారు. ఒక్కోసారి ఆహార పదార్థల సంఖ్య వందల్లో ఉంటూ ఆశ్చర్యపరుస్తుంది. గోదావరి జిల్లాకు చెందిన అల్లుడు గుంటూరు జిల్లా తెనాలిలోని అత్తారింటికి వస్తే మర్యాదలు ఆస్థాయిలోనే ఉండాలి కదా. .అనుకున్నారు కామోసు! తెనాలి చెంచుపేటలోని శ్రీవేంకటేశ్వర గ్యాస్ కంపెనీ నిర్వాహకులు వందనపు మురళీకృష్ణ దంపతులు తమ అల్లుడు శ్రీదత్తకు సంక్రాంతి పర్వదినం రోజున 158 రకాలతో విందు భోజనం పెట్టారు. మురళీకృష్ణ కుమార్తె మౌనికకు, రాజమండ్రి యువకుడు శ్రీదత్తకు గత ఏడాది వైభవంగా వివాహం జరిగింది. వివాహం తర్వాత వచ్చిన పెద్ద పండగ సంక్రాంతికి అల్లుడిని ఆహ్వానించారు. గోదావరి జిల్లా నివాసి అయిన అల్లుడికి ఆస్థాయి మర్యాద చేయాలనే భారీ విందు ఇచ్చారు. ఈ విందును గురించి పట్టణవాసులు ఆసక్తిగా చర్చించుకున్నారు.కొత్త అల్లుడికి 145 రకాలతో విందు భోజనం తెనాలి: సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లకు ఇచ్చే మర్యాదల్లో తెనాలి వాసులు గోదావరి జిల్లాలతో పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పట్టణానికి చెందిన బదరీ బేకరీ నిర్వాహకుడు కనిగిచర్ల రమాకాంత్, సంక్రాంతి రోజున ఆహ్వానించుకున్న అల్లుడు సుదీష్ కుమార్కు 145 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించారు. రమాకాంత్ కుమార్తె భవ్య నిఖిత, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన సుదీష్కు గత ఆగస్టు 13న వివాహమైంది. పెళ్లయ్యాక వచ్చిన తొలి సంక్రాంతికి కుమార్తెను, అల్లుడిని రమాకాంత్ను ఆహ్వానించారు. పట్టణ నందులపేటలోని తన నివాసంలో పిండివంటలు, కమ్మని భోజనంతో అల్లుడికి ఘనమైన విందు ఇచ్చారు. తమ ప్రేమను చాటారు. -
నృసింహుని ఆలయంలో సంక్రాంతి శోభ
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురు, శుక్రవారాల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నృసింహస్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి దర్శనానంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు గంగిరెద్దులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికి కె. సునీల్ కుమార్ ప్రత్యేక ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. భక్తిశ్రద్ధలతో పారువేట ఉత్సవం.. ఘనంగా గోపూజ మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారువేట ఉత్సవం శుక్రవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో గోపూజ చేశారు. గోపూజ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి పారువేట ఉత్సవం ప్రారంభమయ్యింది. స్వామివారితో గిరి ప్రదక్షణ చేశారు. గిరి ప్రదక్షణ ఆలయం నుంచి ప్రారంభమై గౌతమ బుద్ధ రోడ్, ఎయిమ్స్ హాస్పిటల్ మీదుగా స్వామివారి కొండచుట్టూ సాగి నాలుగుకాళ్ల మండపం మీదుగా తెనాలి రోడ్డు, వడ్లపూడి సెంటర్, మిద్దె సెంటర్ మీదుగా తిరిగి దేవస్థానం వద్దకు చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో పారువేట ఉత్సవంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికి కె. సునీల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించి పారువేట ఉత్సవంలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల వస్త్రాలు వేలంమంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రెండు రోజుల పాటు అధికారులు భక్తులు సమర్పించిన వస్త్రాలకు బహిరంగ వేలం నిర్వహించారు. బుధ, గురు వారాల్లో జరిగిన వేలం పాటలో సుమారు వెయ్యిమందికిపైగా భక్తులు పాల్గొన్నారు. సుమారు 200 వస్త్రాలను విక్రయించగా మొదటి రోజు రూ. 25,800లు, రెండవ రోజు రూ. 27,200లు మొత్తం రూ. 53,000లు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. పోటెత్తిన భక్తులు -
ఎడ్ల పందేలు చూసేందుకు వెళ్తూ అనంత లోకాలకు..
బైక్లు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చిలకలూరిపేటటౌన్: వినోదం కోసం వెళ్తున్న ఆ ప్రయాణం విషాదాంతమైంది. ఎడ్ల పందేల సందడిని చూడాలన్న కుతూహలం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన గాండ్రు వేణుగోపాల కృష్ణ ప్రస్తుతం చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో నివసిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అన్నంబోట్లవారిపాలెంలో జరుగుతున్న ఎడ్ల పందేలను చూసేందుకు ఆయన శనివారం తన బుల్లెట్పై బయలుదేరారు. పసుమర్రు గ్రామ పరిధిలోని లక్ష్మి లలిత కోల్డ్ స్టోరేజ్ సమీపానికి చేరుకోగానే, ఎదురుగా అన్నంబోట్లవారిపాలెం వైపు నుంచి వస్తున్న బైక్ వేగంగా వచ్చి బుల్లెట్ను బలంగా ఢీకొట్టింది. దీంతో వేణుగోపాలకృష్ణ(48) రోడ్డుపై పడిపోగా, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి.అనిల్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దీప్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పండుగ పూట ఇంట యజమాని మృతి చెందడంతో పండరీపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ముగిసిన రాష్ట్రస్థాయి వృషభ రాజాల బండలాగుడు ప్రదర్శనలు
ఘంటసాల: ఒంగోలు జాతి వృషభాల సంరక్షణకు ఘంటసాల గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వృషభ రాజాల ప్రదర్శన ఆదర్శంగా నిలుస్తుందని ఎన్నారై గొర్రెపాటి రంగనాథబాబు అన్నారు. మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా డాక్టర్ గొర్రెపాటి నవనీతకృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, దాతల సహకారంతో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజాల బండలాగుడు ప్రదర్శనలు శుక్రవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యూ కేటగిరి, రెండు పళ్ల విభాగం బండలాగుడు ప్రదర్శనలను ఎన్నారై రంగనాథబాబు, మూల్పూరి వెంకట్రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావు, టీడీపీ నేత బొబ్బా గోవర్థన్, ఏఏంసీ చైర్మన్ తోట కనకదుర్గ, పలువురు ప్రముఖులు పోటీలను ప్రారంభించి ప్రసంగించగా నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. న్యూ కేటగిరి విభాగం విజేత ఎంకేఎం బుల్స్.. గురువారం జరిగిన న్యూ కేటగిరి విభాగంలో విజయవాడ – ఘంటసాలకు చెందిన ఎంకేఎం బుల్స్ అధినేత మేకా కృష్ణ మోహన్ ఎడ్లజత మొదటిస్థానం సాధించగా, గుంటూరు జిల్లా కొండవాలవారిపాలెంకు చెందిన జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి జత రెండో స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పోతిన లక్ష్మిత్ చౌదరి జత మూడో స్థానం సాధించాయి. నాల్గవ స్థానంలో గుంటూరు జిల్లా తోటపాలెంకు చెందిన రామినేని రత్తయ్య చౌదరి జత, ఐదో స్థానంలో కృష్ణాజిల్లా కళ్లంవారిపాలెంకు చెందిన బదిగం సుబ్బారెడ్డి జత, 6వ స్థానం సుఖవాసి సతీష్ బాబు జత, 7, 8 స్థానాల్లో కృష్ణాజిల్లా చినపులిపాకకు చెందిన ఆర్వీఎస్ బుల్స్ నిలిచాయి. రెండు పళ్ల విజేత ఆర్కే బుల్స్ జత.. శుక్రవారం సాయంత్రం జరిగిన రెండు పళ్ల విభాగంలో బాపట్లజిల్లా వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి జత విజేతగా నిలవగా, కృష్ణాజిల్లా అయినపూడికు చెందిన మేడిశెట్టి వెంకటేశ్వరరావు జత, కొల్లిపరకు చెందిన ఆరేపల్లి ముక్తేశ్వరరావు జత ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాపట్ల జిల్లా క్రాపకు చెందిన టీఎస్ఆర్ బుల్స్ తలశిల రవితేజ, సాయితేజల జత నాల్గవస్థానం, ఘంటసాల గ్రామానికి చెందిన వీవీఆర్ బుల్స్ వేమూరి చిన్మయి ఎడ్ల జత, వల్లూరిపాలెంకు చెందిన చెన్నుపాటి నాగేంద్రం జత తర్వాత స్థానాల్లో నిలిచాయి. విజేతలైన వృషభాల యజమానులకు జీఎస్టీ డెప్యూటీ కమిషనర్ గొర్రెపాటి రవీంద్ర బాబు, రాధిక దంపతుల చేతుల మీదుగా నగదు బహుమతులను అందించారు. -
కొత్త అల్లుడికి ‘సంక్రాంతి’ మర్యాద
ప్రత్తిపాడు: తెలుగు సంస్కృతిలో కొత్త అల్లుళ్లకు సంక్రాంతి పండుగకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అల్లుడికి ఘనమైన మర్యాదలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ సంప్రదాయం గుంటూరు జిల్లాలోనూ కనిపించింది. ప్రత్తిపాడుకు చెందిన అరవపల్లి నాగేశ్వరరావు రేణుక దంపతులు తమ కుమార్తె సరయును రెండు నెలల కిందట పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ప్రణీత్కు ఇచ్చి వివాహం చేశారు. వివాహానంతరం అల్లుడు ప్రణీత్ తమ ఇంటికి తొలి సంక్రాంతికి వచ్చిన నేపథ్యంలో మరిచిపోలేని విందు ఇచ్చారు. ఏకంగా 75 రకాలకు కు పైగా సంప్రదాయ వంటకాలతో అల్లుడిని ముంచెత్తారు. సరయు తల్లి రేణుక గోదావరి జిల్లాకు చెందిన మహిళ కావడంతో తన అల్లుడికి తమ ప్రాంతం మర్యాద చేశారు. -
సచ్చిదానంద ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు
తెనాలి రూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలో గల శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ రోజైన గురువారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వాజీ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సూర్య హోమం, యజుర్వేద పారాయణం, చక్ర పూజ, ధాన్యలక్ష్మి పూజ, లక్ష రుద్రాక్ష అర్చన, కూష్మాండ దానం, మహా హారతి నిర్వహించారు. సాయంత్రం దివ్య నామ సంకీర్తన కార్యక్రమాన్ని భక్తిఽశ్రద్ధలతో జరిపించారు. శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా నారాయణ హోమం, యజుర్వేద పారాయణం, శ్రీనివాస కళ్యాణం, దివ్య నామ సంక్త్రీన, మంంగళ హారతి వైభవంగా నిర్వహించారు. పండుగ వేడుకల సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. బంగారం చోరీ కేసులో అరెస్ట్ కేజీఎఫ్ : కర్ణాటకలోని కోలారు జిల్లా బంగారుపేట పట్టణంలోని నగల దుకాణంలో 2025 ఆగస్టు 4న జరిగిన దోపిడీ కేసును బంగారుపేట పోలీసులు ఛేదించారు. నిందితుడిని ఏపీలోని గుంటూరు జిల్లా కొరిటెపాడు, చైతన్యపుర నివాసి రాయపాటి వెంకన్న (49)గా గుర్తించారు. ఇతను పలమనేరు పోలీస్స్టేషన్లో నమోదైన ఒక కేసులో చిత్తూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు తెలుసుకొని బంగారుపేట పోలీసులు వెళ్లి అతన్ని బాడీ వారెంట్పై కోలారుకు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. అతను ఇచ్చిన సమాచారంతో రూ. 1.05 కోట్ల విలువైన 879 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య తెనాలిరూరల్: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో శుక్రవారం జరిగింది. మండలంలోని సోమసుందరపాలెం గ్రామానికి చెందిన మల్లోలు ఏడుకొండలు(65) తెనాలిలోని యడ్లలింగయ్య కాలనీ రైల్వే గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎల్.సరస్వతి తెలిపారు. నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ప్రముఖ సాహితీవేత్త, మహిళా పక్షపాతి త్రిపురనేని రామస్వామి చౌదరికి ఘనంగా నివాళులు అర్పించారు. త్రిపురనేని జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు రెవెన్యూ, పర్యాటక శాఖల ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామస్వామి సాహిత్యాలు, స్వాతంత్య్ర ఉద్యమం మీద ప్రభావం, మహిళల పట్ల గౌరవభావం, కుల వివక్ష, అంటరానితనం, అందవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమాలు, చేసిన పోరాటాల గురించి తలుచుకున్నారు. చెరుకుపల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొని ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం చందోలు నుంచి పిట్లవానిపాలెం వెళ్లే రహదారిలో రాంబొట్ల పాలెం పంచాయతీ పరిధిలో గురువారం ఒంటి గంట సమయంలో నిజాంపట్నం గ్రామానికి చెందిన ఏమినేని రామకృష్ణ(42) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై నిజాంపట్నం వెళుతుండగా అదే మార్గంలో చందోలు గ్రామానికి చెందిన కంకణాల శ్రీను అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి రామకృష్ణ వాహనాన్ని ఢీ కొనటంతో తీవ్ర గాయాలైన రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై టి.అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రేపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఆవరణలో మంటలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి మధ్యలో కనకదుర్గ వారధి వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా శుక్రవారం మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో వివిధ కేసుల్లో వున్న 12 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా, ఒక ద్విచక్ర వాహనం పాక్షికంగా దగ్ధమయింది. ఉదయం 11 గంటల సమయంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ వెనుకభాగంలో ఎండిపోయిన గడ్డి ఉన్న ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. జాతీయ రహదారికి సంబంధించిన విద్యుత్లైట్లు ఆపరేట్ చేసేందుకు విద్యుత్వైర్లు ఉన్నాయి. కనకదుర్గ వారధి వద్ద ఈ పోలీస్స్టేషన్ ఆవరణ ప్రహరీ అడ్డులేకుండా, జాతీయ రహదారి సేఫ్టీ గ్రిల్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా పొరపాటున సిగరెట్ తాగి విసిరివేస్తే మంటలు చెలరేగాయా? లేదా అక్కడ వున్న విద్యుత్వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయా అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. అదే సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అక్కడ ఉండడంతో వారిని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ద్విచక్రవాహనాలకు ఉన్న టైర్లు, సీట్లు, పెట్రోల్ ట్యాంకులు తగలబడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సిబ్బంది అక్కడే ఉన్న వాటర్ పాండ్లో నుంచి బకెట్లలో నీళ్లు తీసుకువచ్చి మంటలను అదుపుచేశారు. జరిగిన సంఘటనపై ట్రాఫిక్ పోలీసులు, తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. వివిధ కేసుల్లో ఉన్న 12 బైక్లు దగ్ధం వారధి వద్ద ఉన్న స్టేషన్లో ఘటన -
కడచూపునకు ఖాకీల ఆంక్షలు
దాచేపల్లి /పిడుగురాళ్ల /పిడుగురాళ్ల రూరల్: టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త దళితుడైన మందా సాల్మన్ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్మార్టం పూర్తి అయిన తరువాత సాల్మన్ భౌతికకాయాన్ని స్వగ్రామమైన పిన్నెల్లికి తీసుకెళ్లారు. వేలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సాల్మన్కు నివాళులు అర్పించారు. జోహార్ సాల్మన్ నినాదాలతో పిన్నెల్లి మారుమ్రోగింది. బంధువులు, కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ శ్రేణుల అశ్రునయనాల మధ్య సాల్మన్ అంత్యక్రియలు జరిగాయి. బరువెక్కిన హృదయంతో.. సాల్మన్ అంత్యక్రియల్లో గురజాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి బరువెక్కిన హృదయంతో పాల్గొన్నారు. సాల్మన్ భౌతిక కాయాన్ని చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. పూలదండలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటుగా తామంతా అండగా ఉంటామని కాసు భరోసా ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరి గౌతంరెడ్డితో కలిసి సాల్మన్ పాడె మోశారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశం వరకు ముందుకుసాగారు. పిన్నెల్లిలో స్వగృహం వద్దకు సాల్మన్ భౌతికకాయం చేరుకున్న తరువాత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాల్మన్ భార్య కుమారి, కుమారులు మరియదాసు, బిక్షం, కుమార్తెలు జ్యోతి, రాహేలు విలపించిన తీరు చూసి స్థానికులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ‘నాన్న.. మా కోసం లే... నాన్న’ అని కుమారులు, కుమార్తెలు గుండెలు పగిలేలా ఏడ్చారు. ‘అయ్యా నా కోసం వచ్చి హత్యకు గురయ్యావా’ అంటూ భార్య కుమారి విలపించిన తీరు చూపరుల గుండె బరువెక్కెలా చేసింది. కుమారి స్పృహతప్పి పడిపోవటంతో వైద్యసేవలు అందించారు. వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకుడు ఎం. మురళీధర్రెడ్డి, సీనియర్ నేత కొమ్మినేని వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ ప్రసాద్, సొసైటీ మాజీ అధ్యక్షుడు చింతపల్లి పెదసైదా, వైస్ ఎంపీపీ చింతపల్లి నన్నే, మాజీ ఎంపీపీ దారం లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీ మోషే, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ మహ్మద్ జానీ, నాయకులు మందపాటి రమేష్రెడ్డి, చింతపల్లి పెదసైదా, తదితరులు పాల్గొన్నారు. పోలీసుల వైఖరికి నిరసన అంతకుముందు సాల్మన్ అంత్యక్రియలకు పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గుంటూరు జీజీహెచ్లో పోస్ట్మార్టం పూర్తి చేసిన తరువాత పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లికి సాల్మన్ భౌతికకాయాన్ని తీసుకువచ్చేంత వరకు పోలీసులు అందర్నీ వేధింపులకు గురిచేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాకుండా నిర్బంధం చేశారు. వచ్చే వారిని అడ్డుకునేందుకు రోడ్లపై మకాం వేశారు. తనిఖీ పేరుతో అడ్డుకుని, ఆధార్ కార్డు ఉండాలంటూ వేధించారు. పిన్నెల్లి గ్రామం నిర్మానుష్యంగా మారింది. దుకాణాలను పోలీసులు మూసివేయించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరి భాస్కర్ ప్రొద్బలంతోనే సాల్మన్ని టీడీపీ నాయకులు హత్య చేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పిన్నెల్లి వెళ్లే ప్రతి మార్గంలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేశారు. గురజాల, సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వందలాది పోలీసులు అన్ని మార్గాలను నిర్బంధం చేశారు. అద్దంకి–నార్కెట్పల్లి హైవే నుంచి పిన్నెల్లికి వెళ్లే రెండు ప్రధాన రోడ్లపై పోలీసులు బారికేడ్లు పెట్టారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతంరెడ్డి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి, కార్యకర్తలు, నాయకులతో గుంటూరు నుంచి సాల్మన్ భౌతికకాయంతో బయలుదేరి మాచవరం మండలంకు చేరుకున్నారు. పోలీసులు అంబులెన్స్తో పాటుగా ఐదు కార్లు వెళ్లాలని హుకుం జారీ చేశారు. దీంతో అందరూ రోడ్డుపైనే బైఠాయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారిని వెళ్లనిచ్చారు. డ్రోన్ కెమెరాలతో అంత్యక్రియలను పోలీసులు చిత్రీకరించారు. తుమ్మలచెరువు, కామేపల్లి వైపు నుంచి వచ్చిన వారిని పోలీసులు అటు ఇటు తిప్పుతూనే ఉన్నారని బంధువులు, స్నేహితులు వాపోయారు. చివరిచూపునకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
నరసింహ స్వామి వారి గ్రామోత్సవం
మంగళగిరి టౌన్ : సంక్రాంతి వేళ మంగళగిరి పట్టణంలోని వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గ్రామోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవం దేవస్థానం నుంచి బయలుదేరి ఆయా ప్రాంతాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో సునీల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్తిపాడు: కాకుమాను మండలం కొండపాటూరులోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో గురువారం ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన హరీష్కు దేవస్థానం చైర్మన్ పొన్నం వీరయ్య చౌదరి, కార్యనిర్వహణ అధికారి జక్కా శ్రీనివాసరావులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. వెంట కాటూరి మెడికల్ కళాశాల, హాస్పిటల్ అధినేత కాటూరి సుబ్బారావు ఉన్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : క్రెడాయ్ గుంటూరు చాప్టర్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ శుక్రవారం ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆవిష్కరిస్తున్న డైరీలో పలు జీవోలు ఉంటాయన్నారు. దాంతోపాటు ప్రభుత్వ బిల్డింగ్ రూల్స్ కు సంబంధించిన వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. గుంటూరు చైర్మన్ ఆరుమళ్ళ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా క్రెడాయ్ గుంటూరు డైరీ ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. డైరీ ప్రింటింగ్కు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు చాప్టర్ అధ్యక్షుడు మామిడి రాము మాట్లాడుతూ గుంటూరు సభ్యులందరూ నేషనల్ క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం భవనాలు నిర్మిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి, ఉపాధ్యక్షులు వి శివ నాగేశ్వరరావు, గోన శివ నాగబాబు, బడే సుబ్బారెడ్డి, ఎం. శంకర్ రాజగోపాల్, పి సాహిత్, మెట్టు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : యుటీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) మంగళగిరి ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉండవల్లి సెంటర్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యు.రాజశేఖరరావు మాట్లాడుతూ గంజాయి మహమ్మారి నుంచి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లరాదని తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకున్న ఆశలను నిరాశపరచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ తాడేపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి సత్య శివనాగేశ్వరరావు, మంగళగిరి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుణ్ కుమార్, చింత శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి యు. ఏడుకొండలు, సీఐటీయు నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, బాబూరావు, దుర్గారావు, మేరి తదితరులు పాల్గొన్నారు. -
దూరవిద్యలో అవినీతి దందా
పరీక్ష కేంద్రాల పేరుతో నగదు దండుకోవాలన్నా... పీసీసీల పేరుతో సొమ్ము స్వాహా చేయాలన్నా దూరవిద్యలో కొందరు నాన్ టీచింగ్ సిబ్బందికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. పరీక్ష కేంద్రాల యాజమాన్యాలు సదరు సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోటల్కు వచ్చి ముడుపులు ఇచ్చుకోవాలని సిబ్బంది చెబుతున్న తీరు వివాదాస్పదంగా మారింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ దుస్థితి నెలకొంది. మంగళగిరి టౌన్: దూరవిద్య కేంద్రంలో కొందరు నాన్ టీచింగ్ ఉద్యోగులు షాడో అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారి తన జేబులో మనిషి అని, ఎంపీ బంధువునని, ఒక అధికారికి అత్యంత సన్నిహితుడినని ఓ ఉద్యోగి బెదిరిస్తూ బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. మహిళా ఉద్యోగి ఒకరు కూడా దూరవిద్య కేంద్రంలో సర్వం తానే అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. సైన్స్ కళాశాలకు చెందిన ఒక అతిథి అధ్యాపకుడు కూడా ఒక అధికారి మనిషినని, స్కాలర్ను అంటూ బెదిరిస్తున్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, పీసీసీల వసూళ్లు, బఫర్ల అమ్మకాలు, పరిశీలకులకు కమీషన్ల ప్రాతిపదికన నియమించడంలో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అడ్డగోలుగా దోపిడీ దూరవిద్యలో కొందరు నాన్టీచింగ్ ఉద్యోగుల అవినీతికి అడ్డే లేకుండా పోయింది. గతంలో సస్పెండ్ అయ్యి, పోలీసు విచారణ ఎదుర్కొన్న ఒక ఉద్యోగి దూరవిద్య అవినీతిలో కీలక వ్యక్తిగా మారినట్లు సమాచారం. ఇటీవల ఒక ఉన్నతాధికారికి సన్మానం పేరిట వివిధ సెంటర్ల నుంచి ఖర్చు పేరుతో రూ.లక్షలు వసూలు చేసినట్లు వెలుగులోకి రావడం, ఇతనిపై అధికార పార్టీలోని ఒక వర్గం శాసనసభ్యునికి ఫిర్యాదు అందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్సిటీలోని ఒక బీసీ వర్గానికి చెందిన ఉద్యోగి కూడా తనను కులం పేరుతో దూషించారంటూ పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన దూరవిద్య పరీక్షల్లో సైన్స్ కళాశాలకు చెందిన ఒక అతిథి అధ్యాపకుడు చీరాల, బాపట్లలో స్టడీ సెంటర్లలో బినామీగా వ్యవహరించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఈ వ్యక్తి నకిలీ రిలీవింగ్ ఇప్పించిన స్కాలర్కు రాయలసీమలో దేహశుద్ధి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీలోనే ఒక హాస్టల్ కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. సైన్సు కళాశాలలో గత వీసీ హయాంలో జీతాల పెంపుదల చేయించుకున్న ఒక అతిథి అధ్యాపకుడు... తూర్పు గోదావరి, ఉత్తరాంధ్రలో ఒక సెంటర్లో గత పరీక్షల్లో పరిశీలకుడిగా వెళ్లి రూ. 11 లక్షలు వసూలు చేసినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు. సమావేశం ఏర్పాటు..... ఈ నెల 20వ తేదీ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యలో దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు, పరీక్షల కో ఆర్డినేటర్ రామచంద్రన్లు సోమవారం పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు వర్సిటీలో సమావేశం నిర్వహించారు. గతంలో అవకతవకలు జరిగిన పరీక్ష కేంద్రాలనే కొనసాగిస్తారా? లేదంటే మారుస్తారా? అనేది వేచి చూడాలి. ఈ విషయమై వివరణ కోరేందుకు పరీక్షల కో ఆర్డినేటర్ రామచంద్రన్కు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. దూరవిద్య కేంద్రంలో అక్రమాల వెలుగు చూడకుండా ఉండడానికి కొన్ని విద్యార్థి సంఘాల నాయకులకు తాయిలాలు ఇస్తున్నట్లు తెలిసింది. కొందరు నాన్ టీచింగ్ సిబ్బందికి, వారి బంధువులకు విధులు కేటాయిస్తూ పరీక్షల నిబంధనలకు పాతర వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుబంధ కళాశాలల అధ్యాపకులంటూ రాజకీయ నిరుద్యోగులకు రూ.లక్షలు వచ్చేలా కేంద్రాలను కేటాయిస్తున్నారు. దూరవిద్యలో తిష్టవేసిన ఒక అవినీతి బాబు, ఒక సైన్స్ అతిథి అధ్యాపకుడు కమీషన్లు తీసుకుని పరిశీలకుల నియామకంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. తాజాగా ఓ ఉన్నతాధికారి పరీక్ష కేంద్రాల విధులు తానే దగ్గరుండి పరిశీలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెలలో జరిగే పరీక్షల్లోనైనా పారదర్శకత వస్తే బాగుంటుందని పలువురు ఆశిస్తున్నారు. మరోవైపు డిగ్రీ దూరవిద్యకు సంబంధించి మూడో, ఐదో సెమిస్టర్కు సంబంధించి హాల్టిక్కెట్లు విడుదల చేశారు. వర్సిటీ దూరవిద్య వెబ్సైట్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
ఆతిథ్యంలో తగ్గేది లేదండి
గోదావరి జిల్లా అల్లుడికి 158 రకాల వంటలతో విందు భోజనంకొత్త అల్లుడికి 145 రకాలతో విందు భోజనం తెనాలి: ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు అత్తవారింట అతిథి మర్యాదలకు లోటుండదు...రకరకాల పిండి వంటలతో భారీస్థాయిలో విందు భోజనాలు పెడుతుంటారు. ఒక్కోసారి ఆహార పదార్థల సంఖ్య వందల్లో ఉంటూ ఆశ్చర్యపరుస్తుంది. గోదావరి జిల్లాకు చెందిన అల్లుడు గుంటూరు జిల్లా తెనాలిలోని అత్తారింటికి వస్తే మర్యాదలు ఆస్థాయిలోనే ఉండాలి కదా..అనుకున్నారు కామోసు! తెనాలి చెంచుపేటలోని శ్రీవేంకటేశ్వర గ్యాస్ కంపెనీ నిర్వాహకులు వందనపు మురళీకృష్ణ దంపతులు తమ అల్లుడు శ్రీదత్తకు సంక్రాంతి పర్వదినం రోజున 158 రకాలతో విందు భోజనం పెట్టారు. మురళీకృష్ణ కుమార్తె మౌనికకు, రాజమండ్రి యువకుడు శ్రీదత్తకు గత ఏడాది వైభవంగా వివాహం జరిగింది. వివాహం తర్వాత వచ్చిన పెద్ద పండగ సంక్రాంతికి అల్లుడిని ఆహ్వానించారు. గోదావరి జిల్లా నివాసి అయిన అల్లుడికి ఆస్థాయి మర్యాద చేయాలనే భారీ విందు ఇచ్చారు. ఈ విందును గురించి పట్టణవాసులు ఆసక్తిగా చర్చించుకున్నారు. తెనాలి: సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లకు ఇచ్చే మర్యాదల్లో తెనాలి వాసులు గోదావరి జిల్లాలతో పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పట్టణానికి చెందిన బదరీ బేకరీ నిర్వాహకుడు కనిగిచర్ల రమాకాంత్, సంక్రాంతి రోజున ఆహ్వానించుకున్న అల్లుడు సుదీష్కుమార్కు 145 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించారు. రమాకాంత్ కుమార్తె భవ్య నిఖిత, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన సుదీష్కుమార్కు గత ఆగస్టు 13న వివాహమైంది. పెళ్లయ్యాక వచ్చిన తొలి సంక్రాంతికి కుమార్తెను, అల్లుడిని రమాకాంత్ను ఆహ్వానించారు. పట్టణ నందులపేటలోని తన నివాసంలో పిండివంటలు, కమ్మని భోజనంతో అల్లుడికి ఘనమైన విందు ఇచ్చారు. తమ ప్రేమను చాటారు. -
సాల్మన్ కుటుంబానికి అండగా వైఎస్సార్సీపీ .. రూ. 5 లక్షల సాయం
తాడేపల్లి : పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలబడింది. సాల్మన్ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించింది వైఎస్సార్సీపీ. ఇఘ్పటికే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సాల్మన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. అదే సమయంలో సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా సాల్మన్ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించింది వైఎస్సార్సీపీ. కాగా, టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్.. చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే..వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత కన్నుమూశాడు. -
సాల్మన్ కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సాల్మన్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో సాల్మన్ హత్యకు గురైన సంగతి తెలిసిందే.. జరిగిన దారుణాన్ని వైఎస్ జగన్కు సాల్మన్ కుటుంబసభ్యులు వివరించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.‘‘దళిత కార్యకర్త మందా సాల్మన్ను టీడీపీ గూండాలు పొట్టనపెట్టుకున్నారు. ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో మనుషుల భద్రతకు భరోసా లేని పరిస్థితి ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. సాల్మన్ ఘటనలో బాధ్యులను కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. వైఎస్సార్సీపీ క్యాడర్ ఎవరూ ఆందోళన చెందవద్దు. పార్టీ నుంచి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
సంక్రాంతి రద్దీ.. ఏపీ నుంచి వచ్చేవారికి బిగ్ అలర్ట్..
సాక్షి, నల్లగొండ జిల్లా: హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు పోలీసులు చేపట్టారు. ఎన్హెచ్- 65పై రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుగుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుమాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలునల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలుకోదాడ- హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.ఎన్హెచ్ 65 (విజయవాడ-హైదరాబాద్) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ -
ఖాకీల అరాచకం.. పిన్నెల్లి గ్రామ శివారులో హైటెన్షన్
సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామ శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాసు మహేష్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాల్మన్ అంత్యక్రియలకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్రెడ్డి సహా పార్టీ నేతలను అడ్డగించారు. బారీకేడ్లతో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.అంత్యక్రియలకు వెళ్తే పోలీసులకు వచ్చిన నష్టమేంటి? అంటూ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బెఠాయించారు. అంత్యక్రియలు కూడా చేసుకోనివ్వరా అంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి చూపు కూడా చూసుకోనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కాసు మహేష్రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్సాల్మన్ అంత్యక్రియలను అడ్డుకోవద్దంటూ వైఎస్ జగన్ పోలీసులను హెచ్చరించారు. పిన్నెల్లి గ్రామంలోకి వైఎస్సార్సీపీ నేతలను అనుమతించాలన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. ‘‘గురజాల నియోజకవర్గంలో 7 రాజకీయ హత్యలు జరిగాయి. పిన్నెల్లిలో 300 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. సాల్మన్పై దాడి చేసి చంపేశారు. తిరిగి బాధితుడిపైనే పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్తాం. మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేయిస్తాం. బాధితుల కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు.పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే.. వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశారు. -
బాబుగారూ.. ఇలాంటి దారుణాలు చేయడానికేనా అధికారంలోకి వచ్చింది?
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ హత్యా రాజకీయాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మాన్ హత్యను ఖండిస్తూ ట్వీట్ చేసిన జగన్.. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు? అంటూ నిలదీశారు.‘‘ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా?. మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు?. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా?. పైగా సాల్మన్పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా?. ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘ఈ ఘటన ముమ్మాటికీ వైఎస్సార్సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ, ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు...ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గులేకుండా మారణకాండను ప్రోత్సహించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా?. అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా?. మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా?..చంద్రబాబూ.. హింసారాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీవారి చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు..@ncbn గారూ.. మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా… pic.twitter.com/sCLioenEcU— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2026 -
సాల్మన్ను పథకం ప్రకారమే హత్య చేశారు: కాసు మహేష్రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిన్నెల్లి గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని.. గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు భయంతో బయటికి వెళ్లిపోయాయని కాసు మహేష్రెడ్డి అన్నారు.‘‘సాల్మన్ కూడా భద్రత లేక గ్రామాన్ని వదిలి బయట జీవనం సాగిస్తున్నాడు. భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెతో మాట్లాడేందుకు సాల్మన్ పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు. అతను గ్రామానికి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాల్మన్ మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బదులు, కోమాలో ఉన్న సాల్మన్పైనే కేసులు పెట్టడం ఎంత దారుణం? సాల్మన్ను హత్య చేయడానికి ప్రయత్నించినా సీఐ పనికిమాలిన సెక్షన్లు మాత్రమే పెట్టారు...రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రబాబు, లోకేష్ నీతులు చెప్పడం కాదు. పిన్నెల్లి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయిన 1500 మంది పరిస్థితిపై సమాధానం చెప్పాలి. ఈ హత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలి’’ అని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. -
పల్నాడు: ఎస్ఐ నిర్లక్ష్యపు డ్రైవింగ్కు వ్యక్తి బలి
సాక్షి, పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగొండపాలెం ఎస్ఐ నిర్లక్ష్యపు డ్రైవింగ్కు వ్యక్తి బలయ్యాడు. ఎస్ఐ చౌడయ్య నిద్రమత్తులో కారుతో రెండు బైక్లను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.మరో ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలైన ఘటన నిన్న(జనవరి 14, బుధవారం) మండలంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన అంచా వెంకట సువర్ణ అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం ప్రత్తిపాడు మండలం గనికపూడిలో దేవర కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తరువాత మహేంద్ర ఎక్స్యూవీ వాహనంలో గుంటూరుకు తిరుగు పయనమయ్యారు.మార్గ మధ్యలో ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకట సువర్ణతో పాటు కారు నడుపుతున్న అంచా శ్రీనివాసరావులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో గుంటూరుకు తరలించారు. కాగా అందులో ప్రయాణిస్తున్న అంచా భాను ప్రసాద్ (60) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులది స్వగ్రామం గనికపూడి కాగా కొన్నేళ్లుగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్ఐ ఎన్.నరహరి తెలిపారు. -
కోడికత్తుల తయారీ ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: కోడి కత్తుల తయారీ ముఠాను నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది జిల్లావ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కోడి పందేల నిర్వహకులు, కోడి కత్తులు తయారు చేసి సరఫరా చేసే వ్యక్తులు, కోడి పందేల కోసం బరులు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తిస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీస్లకు అందిన సమాచారం మేరకు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయుడుపేట, అంబేడ్కర్ కాలనీ (జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో)లో ఒక నివాసంలో కోడి కత్తులు తయారు చేస్తూ, వాటికి సాన పెట్టి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో సీఐ ఆదేశాలమేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ఇంటిపై దాడి నిర్వహించారు. దాడిలో గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన బండి బాలచంద్ర కోడి కత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తయరు చేసిన 60 కోడి కత్తులు, మూడు కోడి కత్తులకు సాన పెట్టే మిషన్లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం నిందితుడిని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తూ జీవ హింసకు పాల్పడే వారిపట్ల ఎలాంటి సడలింపు ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. -
అమరేశ్వరునికి భోగి సేవ
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం భోగి పండుగ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారికి వారు పోసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. అలాగే అమరావతి పాండురంగస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నకరికల్లు: భోగి పండుగ సందర్భంగా స్థానిక ఆదిలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పురవీధుల్లో సాగింది. యువకులు, భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ముందుగా అర్చకులు కొడవటికంటి మధుసూదనాచార్యులు, పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. రేపల్లె: పట్టణంలోని ఉప్పూడి రహదారిలోని రాజ్యలక్ష్మి, గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని, రంఘనాథస్వామి వారిని వధూవరులుగా తీర్చిదిద్ద వేదమంత్రాల నడుమ కళ్యాణం కనుల పండువగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు రూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఇలవేల్పు దేవత శ్రీ పుట్టలమ్మతల్లి శ్రీ ఘంటాలమ్మ తల్లి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గత ఏడాది అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలందుకున్న 9 కిలోల లడ్డూను వేలంలో రూ.15 లక్షలకు పాడుకున్న భక్తుడు దుగ్గెంపూడి సుధాకర్రెడ్డి, శ్రీవాణి దంపతులు ఆలయానికి అందించిన నగదుతో ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి, కమిటీ సభ్యులు అమ్మవారికి కెంపు, పగడాలు పొదిగిన హారాన్ని తయారు చేయించారు. సుధాకర్రెడ్డి దంపతులు ఆలయ కమిటీ సమక్షంలో బుధవారం అమ్మవారికి బహూకరించారు. కార్యక్రమంలో దుగ్గెంపూడి యోగేశ్వర్రెడ్డి, గౌతమ్ కార్తికేయరెడ్డి, తరుణ్ కార్తికేయరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాచర్ల : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దంతవైద్యులు సిద్దూ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు పేద మహిళలకు చీరెలు పంపిణీ చేయటం ప్రశంసనీయమన్నారు. అనంతరం 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు కేళం శ్రీనివాసరావు, ఆవుల ఉదయ్కుమార్, అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు పాషావలి, వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెం పాండురంగారావు, మోరా భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
తెనాలిరూరల్: వరుస చోరీలకు ప్పాడుతున్న అంతర్ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన తెనాలి ఆటోనగర్లోని స్టీలు కంపెనీతో పాటు త్రీ టౌన్ పరిధిలోని ఏపీ గ్రామీణ బ్యాంకు, వైన్ షాపులు, మరో రెండు దుకాణాల్లో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే.. ఆటోనగర్ కేసును దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు నిందితులను గుంటూరు శారదా కాలనీకి చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్వలిగా గుర్తించారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తెనాలి రూరల్, త్రీ టౌన్ పోలీస్స్టేషన్ల పరిధితో పాటు అమరావతి పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాది గ్రామంలోని ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, అమరావతిలో ఓ దుకాణంలో నగదు అపహరించుకెళ్లినట్లు ఒప్పుకొన్నారు. చెడు అలవాట్లకు బానిసలై చోరులుగా మారిన వీరిద్దరూ డిసెంబరులోనే జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే నేరాలకు పాల్పడడం ప్రారంభించినట్టు సీఐ తెలిపారు. సందీప్ 28 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, మస్తాన్ వలి 12 కేసుల్లో జైలుకెళ్లాడని చెప్పారు. నిందితుల నుంచి 8.50 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ. 17 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పండుగ సందర్భంలో ఊరు వెళ్లే వారు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలానే ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని సీఐ సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
వెంకటపాలెం వెస్ట్ బైపాస్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
తుళ్ళూరు ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు మృతి తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం వద్ద పశ్చిమ బైపాస్ బ్రిడ్జిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తుళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన బుద్దా మార్క్ (50), పౌలు (65) లు మరణించారు. ద్విచక్ర వాహనంపై తుళ్లూరు మండలం వెంకటపాలెం పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి వైపు వెళుతుండగా రాంగ్ రూట్లో వెళ్లి లారీని ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మార్క్కు కుమార్తె, కుమారుడు ఉండగా, పౌలు విశ్రాంత ఉద్యోగి అని వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారని స్థానికులు తెలిపారు. -
తాడికొండలో ‘బరి’ తెగించారు..!
తాడికొండ: సంక్రాంతి పండుగ మాటున తాడికొండ మండలంలో పందేల బరులు కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహించడంతో పాటు పేకాట, గుండాట యథేచ్ఛగా కొనసాగింది. మోతడకలో జోరుగా కోడి పందేలు వేయడంతో పండుగ మాటున మూగజీవాలు హింసకు గురై మృత్యువాత పడ్డాయి. నియంత్రించాల్సిన పోలీసు అధికారులు అటువైపు తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో నిర్వాహకులు పందేల మాటున జోరుగా జేబులు నింపుకొన్నారు. అధికార పార్టీ కావడంతో అదుపుచేసే పరిస్థితి లేకపోయిందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా హజరు కావడంతో ఆ ప్రాంతం కోలాహాలంగా మారింది. -
అన్ని పథకాల్లో బాబు కోతలే
అబ్బాయ్: బాబాయ్ ఎలా ఉన్నావు. పిన్ని, పిల్లలు అంతా బాగున్నారా. బాబాయ్: మా సంగతి సరే.. నువ్వు ఎప్పుడు వచ్చావ్ సిటీ నుండి. అబ్బాయ్: నిన్న రాత్రి వచ్చాను బాబాయ్. ఊరికొచ్చి రెండేళ్లపైనే అయ్యింది కదా.. అలా చూసొద్దామని వెళుతున్న. ఏంటీ ఊర్లో విశేషాలు. ఊరంతా రచ్చబండ దగ్గర ఉన్నట్లుందిగా బాబాయ్. ప్రకాశం తాత, సుబ్బన్న బాబాయ్, సందెపూడి పెద్దయ్యన్న, శీను గాడు, నరసాలుగాడు.. అంతా ఈడే ఉన్నారే. ఎలా ఉన్నారంతా. అందరూ..: బానే ఉన్నాంలే అబ్బాయ్. అబ్బాయ్: అయినా నీకేంటి ప్రకాశం తాత. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా ఒకటో తారీకే ఇంటొకొచ్చే పింఛను.. షుగర్, బీపీలకు నెలకు సరిపడా మాత్రలిచ్చే ఊరికొచ్చే 104 బండి, ఇంటి ముందుకొచ్చే రేషన్బండి, నీ పని బానే ఉంటాదిగా. ప్రకాశం: ఓరబ్బాయ్.. అయన్నీ పోయి రెండేళ్లయ్యిందిరా అయ్యా. పింఛను ఇంటికి వత్తారా.. మనమే వాళ్ల కాడికెళ్లాలా అన్నది ఆళ్ల దయ. మాత్రలంటావా.. నెలకు కాదు వారానికి పది రోజులకు చేతిలో పెట్టి పోతన్నారు లేవని. మిగిలిన ఇరవై రోజులకు నేనే కొనుక్కోవాలిరా అయ్యా. పింఛను వచ్చే నాలుగేలలో సగందాకా ఈ మందుబిళ్లలకే పోతాయి. ఇక రేషన్ బండ్లూ ఎత్తేసినారు. చౌకధరల దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకోవాలా. కాళ్లు పట్టేయకుంటే సచ్చీ, చెడీ తెచ్చుకుంటున్నా. అయినా దూరంగా ఉండి చూత్తే కొండలు కూడా నున్నగా అగుపిత్తాయి. మా బతుకులు కూడా అంతేరా అబ్బాయ్. అబ్బాయ్: సుబ్బన్న బాబాయ్.. ఎలా ఉంది పొలం? ఈ ఏడు ఏమేం పంటలేశావేంటి? సుబ్బన్న: ఎందకడుగుతావులే రా అబ్బాయ్ ఎవసాయం గురించి. చావలేక, బతకలేక ఎవసాయం చేయడమే. నాకున్న ఐదెకరాలకు తోడు ఏదో పాముకుందామని ఓ పదిహేను ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని ఎలగబెట్టాలే. సగం పత్తి, సగం మిరప ఏశాను. నల్లతామరతో మిరప ఊడ్సిపెట్టుకుపోయింది. గులాబీరంగు పురుగు పత్తిని ముంచేసింది. ఏదో పత్తి ఎకరాకు నాలుగైదు కింటాలొచ్చినా.. ఉపయోగం లేకుండా ఉంది. సీసీకి తీసకెళితే బాలేదని కొనలేదు. బయట బోకర్లకమ్మి వచ్చాను. తుపాను వచ్చింది. మిర్చి మునిగింది. కానీ రూపాయి కూడా ఇయ్యడం అవ్వదన్నారు. ఏం చేత్తం ఈ ఏడాది పదిలచ్చల దాకా ఎవసాయంలో నట్టాలొచ్చినట్టే. గత పెభుత్వంలో అయినా రైతు భరోసా అని, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాల్లో ఎరువలని, మందులనీ వచ్చేటివి. ఇప్పుడు ఏదీ లేదు. అబ్బాయ్: సందెపూడి పెద్దయ్యన్న గారూ.. మీ మనవడిని ఎంబీబీఎస్ చదివించాలన్నారుగా . పెద్దయ్యన్న: ఏంది బాబూ చేర్పిచ్చేది. అప్పుడు అంటే అవన్నీ ప్రభుత్వానివి కదా.. ఎట్టాగూ మనవడికి మంచి మార్కులొస్తాయి. అందులో సీటు వచ్చిద్దని అనుకున్నా. ఇంతలో సర్కారు మారిందిగా. ప్రబుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారంట. ఇప్పుడు వాటిల్లో సీట్లు కొనాలంటే ఎకరాలమ్ముకోవాలి. నీకు తెలిసిందేగా మా పెద్దోడు వ్యాపారమంటే అప్పుట్లో మూడెకరాలమ్మాను. ఇంకా ఉన్న రెండు కూడా అమ్మి డాక్టరు చదివిస్తే రేపు పిల్లల పరిస్థితి ఏమిటని ఊరుకున్నాను బాబు. వాడిని కూడా ఏదో ఒకటి చేయాలి. అబ్బాయ్: ఏం శీనుగా.. ఏం చేస్తున్నావురా నువ్వు. నిన్న సాయంత్రం మీ ఇంటికొచ్చాను. ఏక్కడికెళ్లినావ్? శీను: చెల్లి చెప్పిందిరా వచ్చి ఎళ్లినావని. నిన్న ఉదయం మిర్చికి నీళ్లెట్టినాలే. ఇయ్యాల యూరియా సల్లాల. మొక్కలకు యూరియా కొందామని మండలానికి పోయి వచ్చినాను. అబ్బాయ్: అదేంటిరా మండలం దాకా ఎందుకు. మన ఊరిలో రైతు భరోసా కేంద్రం ఉంది కదా. శీను: ఆ ఆ ఉందిలే. అదిప్పుడు రైతు సేవ. కానీ ఆడ యూరియా దొరకదు. బుకింగ్ సేసేటి మిసన్లు దుమ్ముకొట్టుకోయి పడిన్నయి. అసలు ఎప్పుడు తీత్తారో, ఎప్పుడు ఉంటారో కూడా తెల్దు. బయటకెళ్లి బ్లాక్లో కొనాల్సిందే. అబ్బాయ్: పిన్నమ్మ బాగున్నావా.. ? పిన్ని: ఏముందిరా.. ఆరోగ్యమే ఏమీ బాగుండట్లేదు. నెలనెలా పట్నం పోయి ఆస్పత్రిలో చూయించుకుంటున్నా. ఉన్న నాలుగు రూపాయలూ ఈ రోగాలకే పోతాన్నాయిరా.. అబ్బాయ్: అదేంటి.. మన ఊర్లో అంత పెద్ద విలేజ్ క్లినిక్ కట్టారుగా! పిన్ని: ఆ.. కట్టారుగానీరా. అప్పట్లో ఆడికి పెద్ద పెద్ద డాటర్లు వచ్చేవాల్లు, మనం ఆడదాకా పోలేకపోతే వాళ్లే ఇంటికొచ్చి పరీచ్చలు చేసి మందులిచ్చి పోయేటోళ్లు. పెబుత్వం మారింది. ఇప్పుడేమో అక్కడున్న వాళ్లే ఎప్పుడుంటారో తెలియట్లా. ఇక డాటర్లు రాడమే మానేశారు. అందుకని పట్నం పోయి చూయించుకుంటున్నా. అబ్బాయ్: అవును పిన్నమ్మ... ఈ పక్కనిల్లు అప్పుడు రెండేళ్ల కింద నేనొచ్చినప్పుడే పడేత్తన్నారు కదా.. ఇంకా కట్టుకోలేదేంటీ.. పిన్ని: అదా.. అలా వదిలేసిండులే. పాత పెభుత్వం లచ్చాముప్పాతిక దాకా ఇచ్చేదంట. ఈ పెభుత్వం నాలుగు లచ్చలిత్తదని ఎలచ్చన్లప్పుడు చెప్పిండ్రంటా. ఇత్తే కట్టేసుకుంటారు. అబ్బాయ్: ఏమో పిన్నమ్మా.. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలకు, ఇందాక అక్కడ రచ్చబండ దగ్గర బాబాయ్ వాళ్లు చెప్పే మాటలు చూస్తుంటే.. బాధగా ఉంది. రైతులు, మహిళలు, వృద్ధులు, చదువుకునే పిల్లలు.. ఇలా ఎవ్వరి పరిస్థితీ బాలేనట్లుగా ఉంది. ఏం చేస్తాం. ప్రభుత్వాలు సరిగా ఉంటేనే మనలాంటి ప్రజల పరిస్థితి బాగుంటుంది. – సాక్షి, గుంటూరు -
కనులారా మకరజ్యోతి దర్శనం
నగరంపాలెం: గుంటూరు సంపత్నగర్లోని క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ వారి శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనం ఘనంగా జరిగింది. ట్రస్ట్, క్రేన్ సంస్థల చైర్మన్ గ్రంధి వెంకట సత్యలక్ష్మీకాంతారావు, లక్ష్మీహైమావతి దంపతులు, కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి తిరువాభరణాలను సంపత్నగర్లోని ఫ్యాక్టరీ నుంచి దేవాలయానికి కాంతారావు దంపతులు, ఆయన అల్లుడు చక్కా వినోద్రామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు దేవాలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి అలంకరించారు. రాత్రి భక్తుల స్వామి వారి శరణ ఘోష నడుము గ్రంధి కాంతారావు దంపతులు మకర జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భక్తి గీతాల సంగీత విభావరి నిర్వహించారు. అయ్యప్ప భక్తులు, క్రేన్ గ్రూప్ సంస్థల సిబ్బంది, టంగుటూరి మణి, పుర ప్రముఖులు హాజరయ్యారు. -
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి మృతి: ఇద్దరికి గాయాలు
ప్రత్తిపాడు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన అంచా వెంకట సువర్ణ అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం ప్రత్తిపాడు మండలం గనికపూడిలో దేవర కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తరువాత మహేంద్ర ఎక్స్యూవీ వాహనంలో గుంటూరుకు తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకట సువర్ణతో పాటు కారు నడుపుతున్న అంచా శ్రీనివాసరావులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో గుంటూరుకు తరలించారు. కాగా అందులో ప్రయాణిస్తున్న అంచా భాను ప్రసాద్ (60) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులది స్వగ్రామం గనికపూడి కాగా కొన్నేళ్లుగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్ఐ ఎన్.నరహరి తెలిపారు. -
భోగిమంటల్లో పీపీపీ జీఓ ప్రతుల దహనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలో ‘పిపిపి’ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, జీఓలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్ సీపీఐ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భోగిమంటలలో జీఓ పత్రాలను దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లో 107, 108 జీఓలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ జీవోలను రద్దు చేయకపోగా 100 శాతం వైద్య విద్యను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, షేక్, వలి మాట్లాడుతూ.. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేసి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించి, ప్రతి జనవరిలో విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు యశ్వంత్ రఘువీర్, అమర్నాథ్, చల్లా మరియదాసు, అజయ్, సాయి గణేష్, జోస్ మాథ్యూస్, సులేమాన్, శశిధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం
తెనాలిటౌన్: త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో మంగళవారం ఆయన అధికారులతో కలసి పర్యటించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సెంట్రల్ స్కీమ్ ద్వారా సొంత ఇంటి స్థలం కలిగిన 91 మంది పేదలకు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. గ్రామంలోని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం జగ్గడిగుంటపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ లే అవుట్ను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు పరిశీలించి కాంట్రాక్టర్లతో ముచ్చటించారు. నిర్మాణం ఏ దశలో ఉంది, లబ్ధిదారులకు మేలు కలిగేలా నిర్మాణాలు జరుగుతున్నది లేనిది వాకబు చేశారు. నాణ్యత ప్రమాణాలకు లోటు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట చీఫ్ ఇంజనీర్ జయరామాచారి, ఎస్ఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడీ ప్రసాద్, తెనాలి హౌసింగ్ ఈఈ భాస్కర్, ఏఈ బాలాజీ, తదితరులు ఉన్నారు. -
తెనాలి దేవదాయశాఖ ఈఓపై మంత్రి ఫైర్
తెనాలి: విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తెనాలిలో అధికారుల పరిస్థితి తయారైంది. దేవదాయ శాఖ ఈవో తమ్మా శివారెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ కావడం, సెలవుపై వెళ్లాలని ఆదేశించడం ఇందుకో నిదర్శనం. దేవదాయ పరిధిలోని శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారమే ఇందుకు కారణం. డిపాజిట్ చెల్లించకపోయినా డిఫాల్టర్ అయినప్పటికీ బినామీకి థియేటర్ లీజు అప్పగించడమే ఈవో పొరపాటు. నాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి అక్షింతలు వేయించుకోని మరీ మౌనంగా వుండిపోయినందుకు ఈవో శివారెడ్డికి ఇప్పుడు మంత్రి మనోహర్చే చివాట్లు పడాల్సి వచ్చింది. పైగా బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది సంక్రాంతి కోడిపందాలు వ్యవహారంలో అప్పట్లో ఒక సీఐ సెలవుపై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు ఈవోకు ఆ పరిస్థితి తప్పటం లేదు. దేవాదాయ పరిధిలోని స్థానిక బోసురోడ్డులో గల శ్రీ కాకుమాను శంకరుని సత్రానికి చెందిన శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు పేరుతో టీడీపీ వర్గీయుల ఆదీనంలో కొనసాగుతోంది. కొన్నేళ్లుగా అందులో ఫంక్షన్ హాలు నడుపుతున్నారు. 2025 ఏప్రిల్ నాటికి టాకీస్ లీజు కాల పరిమితి ముగిసింది. లీజుదారుడు అప్పటికీ రూ.12 లక్షలు అద్దె బకాయిలు వున్నారు. బకాయిలు వసూలుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. దేవదాయశాఖ హాలు వేలంకు ప్రకటన చేసింది. డిఫాల్టర్ అయిన శ్రీనివాస్కు వేలంలో పాల్గొనే అర్హతను కోల్పోవటంతో, అతడి బినామీ వీరయ్య చౌదరి వేలంలో పాడుకున్నారు. నెలకు రూ.1.28 లక్షల వేలంతో దక్కించుకున్నారు. వేలంలో పాల్గొన్న ఇతరులను అంతకుమంచి పాడనివ్వకుండా చేశారని అప్పట్లో ఆరోపణ లొచ్చాయి. ఏదైమైనా డిఫాల్టరయిన శ్రీనివాస్, వీరయ్య చౌదరి ద్వారా మళ్లీ లీజు దక్కించుకున్నారు. నిబంధనలు ప్రకారం రూ.5లక్షల డిపాజిట్ను చెల్లించకుండానే వేలంకు అనుమతించటం, అతడు పేరిట కొట్టేయడం జరిగిపోయింది. దీనికి కారణం ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు పుట్టి శ్రీనివాస్కు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అండదండలు వుండటమేనని అందరికీ తెలుసు. గతంలోని అద్దెను స్వల్పంగా పెంచి శ్రీనివాస్కు ఇవ్వాల్సింది పోయి, వేలం ఎందుకు పెట్టావంటూ అప్పట్లో ఈవోపై ఆలపాటి ఆగ్రహించినట్లు కూడా చెబుతారు. ఆలపాటి ఆశీస్సులతో శ్రీ సత్యనారాయణ టాకీస్ను వీరయ్య చౌదరి పేరుతో లీజు దక్కించుకున్న పుట్టి శ్రీనివాస్ నెలనెలా చెల్లించాల్సిన అద్దె రూ.1.28 లక్షలు యధాప్రకారం బకాయిల జాబితాలో చేరాయి. 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 9 నెలలకు రూ.10లక్షలకు పైగా చెల్లించాల్సి వుండగా, కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. పాట సమయంలో చెల్లించాల్సిన రూ.5 లక్షలు డిపాజిట్ అతీగతీ లేదు. ఇదిలావుంటే మూడేళ్ల లీజుకు అనుమతిస్తూ దేవదాయశాఖ కమిషనర్ నుండి ఉత్తర్వులు కూడా వచ్చాయి. రాజకీయ సిఫార్సుల్లేకుండా నిబంధనలకూ విరుద్ధంగా అనుమతులు ఎలా వస్తాయనేది ప్రశ్న! శ్రీ సత్యనారాయణ టాకీస్కు ఫంక్షన్ హాలుగా నడుపుతున్న పుట్టి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. థియేటర్ వేలం పాటలో డిఫాల్టర్ తరపున బినామీ లీజులో పాల్గొన్నారని, టీడీపీ మద్దతతో ‘మనోడు’ దక్కించుకున్నాడని ‘సాక్షి’లో అప్పట్లోనే కథనం ప్రచురితమైనంది. ఆ సమయంలో పట్టించుకోని మంత్రి మనోహర్ దాదాపు 10 నెలలకు శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారంపై ఈవోను సెలవుపై వెళ్లాలంటూ ఆదేశించడం విశేషం. ఇటీవల ఫ్లెక్సీల వివాదం తరువాత ఈ ఘటన చోటుచేసుకోంది. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న అధికారులు ఇంకెందరో? అన్న చర్చ పట్టణంలో నడుస్తోంది! సెలవుపై వెళ్లాలని ఆదేశం సత్యనారాయణ టాకీస్ వేలం వ్యవహారంలో మంత్రి మనోహర్ ఆగ్రహం వేలం నాడే ‘సాక్షి’ హెచ్చరించినా ఎవరికీ పట్టని వైనం ఎమ్మెల్సీ రాజా వర్సెస్ మంత్రి మనోహర్ మధ్య మరో అధికారి బలి? -
ఆడబిడ్డను హింసిస్తుంటే మాట్లాడవేం నరేంద్ర ?
పట్నంబజారు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర...నీ దగ్గర పని చేసే వ్యక్తి తన భార్యను వేధింపులకు గురిచేస్తూ.. విపరీతంగా హింసిస్తుంటే.. సర్దిచెప్పాల్సింది పోయి స్వయంగా నువ్వు.. నీ కుమార్తె మేమున్నామని ప్రోత్సహించడం వల్ల ఒక బాధితురాలికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర వద్ద పని చేసే పౌల్రాజ్ అనే వ్యక్తి తన భార్య వెంకటేశ్వరమ్మను చిత్రవధ చేస్తుంటే ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసు పెట్టించిన ఎమ్మెల్యే వారం రోజులుగా వెంకటేశ్వరమ్మ కనపడటంలేదని, ఆమె తల్లి నంబూరి లక్ష్మి పెడుతున్న కన్నీటికి సమాధానం చెపుతారా? అని ప్ర శ్నించారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంళవారం విలేకరుల సమావేశంలో మురళీకృష్ణ బాధితురాలు తల్లి లక్ష్మితో కలసి మాట్లాడారు. ఆస్తి కోసం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుడు పౌల్రాజ్ బరితెగించాడని ఆరోపించారు. వెంకటేశ్వరమ్మను ప్రేమ వివాహం చేసుకున్న పౌల్రాజ్ ఆస్తి కోసం తొలి నుంచి ఆమెను అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. ఒక తోటలో చెట్టుకు కట్టేసి కొడుతూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఆమె తల్లి నంబూరి లక్ష్మికి ఫోన్ చేసి వినిపిస్తూ హింసించాడని పేర్కొన్నారు. బాధ్యత గత ఎమ్మెల్యేగా మహిళను కాపాడాల్సిపోయి పౌలరాజ్ అరాచకాలను ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని, నన్ను ఎవరు ఏమి చేయలేరని, నీకు చేతనైంది చేసుకో అని పౌలరాజ్ బెదిరింపులకు దిగిన ఆడియోలు ఉన్నాయన్నారు. వెంకటేశ్వరమ్మను కిడ్నాప్ చేసి, మాచవరంలోని పౌల్రాజ్ సోదరుడు రాజేష్ నివాసంలో పెట్టారని చెబుతున్నారని, తక్షణమే ఆ యువతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందన్నారు. తక్షణమే బాధితురాలు ఎక్కడ ఉందో ఆచూకీ తెలపాలని, పౌలరాజ్ నుండి వెంకటేశ్వరమ్మను రక్షించాలని, లేకుంటే ఆమె తల్లి నిరాహారదీక్షకు కూడా కూర్చుంటుందని చెబుతోందన్నారు. ఆస్తికోసం భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న పౌలరాజ్ పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా కుమార్తెను చంపే ప్రయత్నం జరుగుతోంది.. కిడ్నాప్కు గురైన బాధితురాలు వెంకటేశ్వరమ్మ తల్లి నంబూరి లక్ష్మి మాట్లాడుతూ తన కుమార్తెను చంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే బంగారం, డబ్బులు ఎన్నోసార్లు పౌల్రాజుకు ఇచ్చా మని అయినా తన కుమార్తైపె వేధింపులు ఆగటం లేదన్నారు. ఎకరం ఆస్తి కోసం ప్రేమ వివాహం చేసుకుని, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండతో అల్లుడు పౌల్రాజ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. ఉన్న ఎకరం ఆస్తి కూడా ఇస్తానని, తన కూతురును ప్రాణాలతో అప్పజెప్పాలని వేడుకుంది. ఎమ్మెల్యే నరేంద్ర, పోలీసు అధికారులు స్పందించాలని తన కుమార్తెను క్షేమంగా తీసుకుని రావాలని విన్నవించారు. పౌల్రాజ్ బెదిరింపుల ఆడియోకాల్స్ రికార్డింగ్లు, ఎమ్మెల్యే ధూళిపాళ్ళతో ఉన్న ఫొటోలను ప్రదర్శించారు. అభివృద్ధికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకంగా కాదు వైఎస్సార్ సీపీ ఏ రోజు అభివృద్ధికి వ్యతిరేకం కాద న్న విషయాన్ని గుర్తించాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ స్ప ష్టం చేశారు. రైతులు నష్టపోకుండా అభివృద్ధి చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో నుంచి వెళ్తున్న ఔటర్ రింగ్ రోడ్డుకు అంత భూమి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నారాకోడూరు వద్ద ఉన్న 80 ఎకరాలు సరిపోతుందని రైతులు చెప్తుంటే, అధికారులు 650 ఎకరాలకు మార్కింగ్ పెట్టారని, ఎలాంటి ముందస్తు నోటీసులు, గ్రామసభలు లేకుండా భూసేకరణ చేపట్టడం సరైన విధానం కాదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న కాలనీలకు అవసరం మేరకు మాత్రమే తగిన నష్ట పరిహారం చె ల్లించి భూములు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నారాకోడూరు రైతులు వైఎస్ జగన్ను కలవాలి అనుకుంటే.. వారిని కలిసేందుకు కావాల్సిన ప్రయత్నం చే స్తామని హామినిచ్చారు. వ్యాపార దక్పథంతో, ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర కోరిక మేరకు మాత్రమే భూ సేకరణ జరుగుతోందని ఆరోపించారు. రైతుల సంతృప్తి మేరకు భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల పాలిట శాపంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల మారారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ


