Guntur
-
తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు.ఫోన్ సంభాషణలో సీఎం విజయ్తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్ జగన్ ఆకాంక్షించారు A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్కు వైఎస్ జగన్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. తాజాగా, ఇవాళ వైఎస్ జగన్ విజయ్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
వైఎస్ జగన్ని కలిసిన పూడి శ్రీహరి
సాక్షి,తాడేపల్లి: ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ, అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో వైఎస్ జగన్తో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి కలిశారు. అక్రమ కేసుల్లో పోలీసుల విచారణను ఎదుర్కొన్న శ్రీహరి, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసుల వివరాలను వైఎస్ జగన్కు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీహరికి అండగా నిలిచిన వైఎస్ జగన్.. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చట్టపరంగా వాటిని ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం చంద్రబాబు సర్కార్ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. -
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
రైల్వే సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసే యత్నం
తెనాలిరూరల్/పొన్నూరు: రైల్వేసిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసి రైలులో దోపిడీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. దీన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో వారిపై దుండగులు రాళ్లు రువ్వారు. పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపగా, దుండగులు పరారయ్యారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి గుంటూరు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మంగళవారం విలేకరులకు వివరించారు. నరసరావుపేట జీఆర్పీ ఎస్ఐ రాజమోహనరావు, కానిస్టేబుళ్లు సదా, ఆంజనేయులు సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున సిగ్నల్ టాంపరింగ్కు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులు తారసపడ్డారు.వారిని ఆపి ప్రశ్నించే ప్రయత్నం చేయబోగా వారు రాళ్లు రువ్వారు. వెంటనే ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కాల్పులు జరిపారు. వారు తప్పించుకొని సమీపంలోని పొలాల వైపు పారిపోయారు. ఘటన అనంతరం జీఆర్పీ, ఆర్పీఎఫ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని డీఎస్పీ అక్కేశ్వరరావు, గుంటూరు ఎస్హెచ్ఓ అంజిబాబు, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు పరిశీలించారు. ఘటనా స్థలంలో అనుమానితులు వదిలివెళ్లిన వైర్ కట్టర్ (స్లీవ్ కట్టర్), టెస్టర్, జత గ్లౌజులు స్వా«దీనం చేసుకున్నారు.ఘటనపై తెనాలి రైల్వే పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. తమ సిబ్బందికి కనిపించిన ఇద్దరు దుండగులతోపాటు మరికొంత మంది ఉంటారని, అందరి ఆచూకీ గుర్తించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు చెప్పారు. సిగ్నల్ టాంపర్ చేసి రైలు నిలిచిపోగానే దోపిడీకి పాల్పడాలన్నదే దుండగుల ముఖ్యోద్దేశంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల కిందట ఇక్కడే దొంగల బీభత్సం ఏప్రిల్ 19న బెంగళూరు–నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్ప్రెస్ నాలుగు కోచ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాపట్ల–అప్పికట్ల మధ్య ఈ ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు ఆపి వారు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. -
క్వాంటం కంప్యూటర్ను సందర్శించిన మంత్రి
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నీరుకొండలోని ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఈ మేరకు ఇటీవల వర్సిటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన క్వాంటం కంప్యూటర్ సర్వీస్ సెంటర్ను పరిశీలించారు. వర్సిటీ అధికారులను కలసి క్వాంటం కంప్యూటర్ వివరాలను తెలుసుకున్నారు. క్వాంటం కంప్యూటర్ల పనితీరు, ఏ ఏ రంగాల్లో కంపోనెంట్లు తయారీ, వాటి ప్రాముఖ్యతల గురించి ఏపీ క్వాంటం మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ మంత్రికి వివరించారు. ప్రపంచ దేశాల్లో క్వాంటం కంప్యూటర్లకు పెరుగుతున్న ఆదరణ గురించి తెలిపారు. అనంతరం వర్శిటీలోని పలు ల్యాబొరేటరీలను సందర్శించారు. కార్యక్రమంలో వర్శిటీ వీసీ ఆచార్య సీహెచ్ సతీష్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ వినాయక్, క్వాంటం డీన్ డాక్టర్ సోమనాధ్, ప్రొఫెసర్ వర్ష తదితరులు పాల్గొన్నారు. తెనాలిరూరల్: తెనాలిలో ఓ శిల్పశాలలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి నిజాంపట్నం కాల్వకట్ట వద్దగల ఓ శిల్పశాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శిల్పశాలలోని ఫైబర్ విగ్రహాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి నల్లటి దట్టమైన పొగతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల వారు స్పందించి విగ్రహాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా శకటం తెనాలిలో అందుబాటులో లేదని, మంగళగిరి నుంచి తెప్పిస్తామని చెప్పినట్టు సమాచారం. నిజాంపట్నం కాల్వ నుండి బకెట్లతో నీళ్లు తోడి స్థానికులు, శిల్పశాల యజమానులు, వర్కర్లు మంటలను ఆర్పేందుకు ప్రయల్నించారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిదని చెబుతున్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు నరసరావుపేట ఈస్ట్: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు విద్యా ప్రణాళిక షెడ్యూల్ను వాయిదా వేయాలనీ, లేని పక్షంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు పక్కనే అదే గ్రామానికి చెందిన యువకుడు రుద్రపాటి చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... క్రోసూరు మండలంలోని 88 తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్ సైదాబీ(39) చాగంటివారిపాలేనికి చెందిన రుద్రపాటి చంద్రశేఖర్ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. మధ్యాహ్న సమయంలో ఇంటి యజమాని అంకమ్మ ఇంట్లోకి వెళ్లే సరికి చంద్రశేఖర్, సైదాబిలు పక్కపక్కనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా, సైదాబి మృతి చెందింది. చంద్రశేఖర్కు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. -
ఐఓబీ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఒప్పందం
కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు. -
టార్గెట్ గుంటూరు !
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైల్వే ప్రయాణికుల భద్రత రైల్వే, పోలీస్ శాఖకు సవాల్గా మారింది. దొంగలు ఉమ్మడి గుంటూరులో తమకు అనువైన ప్రాంతాలను టార్గెట్గా పెట్టుకోవడంతో వారి నుంచి ప్రయాణికులను కాపాడటం రైల్వే పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో దుండగులు రైలు దోపిడీకి విఫలయత్నం చేయడం, పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపడటం కలకలం సృష్టించింది. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు రైల్వే సిగ్నల్ వద్ద రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బృందానికి ఇద్దరు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్పై ఉండటం కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసి రైలును నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వారు అక్కడ వదిలిపెట్టి వెళ్లిన పరికరాలను చూస్తే అర్ధం అవుతోంది. సిబ్బంది కొరతే పెనుసవాలు రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నేరాలు అధిగమించేందుకు ఉన్నంత సిబ్బందితోనే దొంగతనాలకు పాల్పడిన వారిపై కాల్పులు జరిపి ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఈసారి విజయం సాధించారు. సిబ్బంది కొరత వల్ల, సరైన సదుపాయాలు లేకనే ఇలాంటి పరిస్థితి నెలకొందని రైల్వే పోలీస్ అధికారులు వాపోతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐఆర్పీ విభాగాలు ఉన్నాయి. వాటిలో డివిజన్కు కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడం పోలీసులకు పెను సవాల్గా మారుతుంది. ప్రధానంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని జీఆర్పీ పరిధిలో 56 మంది సిబ్బంది ఉండాల్సింది ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్నారు. వారిలో డీఎస్పీ ఆఫీస్, కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు అంటూ సిబ్బందిని కేటాయించగా 12 మంది మాత్రమే సిబ్బంది ఉండటంతో పక్క జిల్లా నుంచి వచ్చిన సిబ్బందితో రాత్రిళ్లు గస్తీ కాయాల్సి వస్తోంది. అదేవిధంగా ఆర్పీఎఫ్ గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలోని 55 మందికి గాను ప్రస్తుతం 33 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వారిలో గుంటూరు ఆర్పీఎఫ్ పరిధిలో రెండు రైళ్లకు సిబ్బందిని బందోబస్తుకు పంపించాల్సి ఉంటుంది. అయితే 33 మందిలో సుమారు పూర్తి స్థాయిలో 25 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో కూడా సిబ్బంది కొరత ఉంది. దీంతో పక్కజిల్లాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి విధులు కేటాయిస్తున్నారు. అసలేం జరిగింది రోజు మాదిరిగానే ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నిడుబ్రోలు పరిసర ప్రాంతంలోని ఆలూరు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పూర్తి స్థాయిలో చేతులకు గ్లౌజులు, మాస్కులు ధరించి, కటర్లతో సహా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తుండగా.. అదే సమయంలో నరసరావుపేట ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్లు తుపాకులతో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను చూసి ముందుగా గాల్లో కాల్పులు జరపగా ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై పట్టాలపై ఉండే కంకర రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయినప్పటికి జీఆర్పీ పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి పది రౌండ్లు కాల్పులు జరిపి వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులు తప్పించుకుని పరారయ్యారు. అయితే ఈ ఘటన అంతా గుంటూరు జీఆర్పీ పరిధిలో చోటు చేసుకున్నప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మాత్రం విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది. దీంతో ఇటు విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు, గుంటూరు జీఆర్పీ పోలీసులతో పాటు పొన్నూరు రూరల్ పోలీసులు సహా గాలింపులు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. -
‘నీట్’ కల చెదిరిన వేళ
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. నిరాశ, నిస్పృహలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే నీట్కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు. నీట్ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు. – వల్లెపు ధీరజ్కృష్ణ, విద్యార్థి, గుంటూరు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 7 -
నర్సింగ్ వృత్తి పవిత్రమైనది
గుంటూరు మెడికల్: నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, రోగి వ్యాధి నుంచి కోలుకోవడంలో నర్సుల పాత్ర చాలా కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ విజయవాడ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబంలో సోదరి ఏవిధంగా ఇతర కుటుంబ సభ్యులను ఆదరించి ప్రేమగా చూస్తుందో అదే తరహాలో సిస్టర్స్గా పిలువబడే నర్సులు సైతం చికిత్స కోసం వచ్చే రోగులను ప్రేమగా ఆదరించి వ్యాధి నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. లక్షలాది మంది రోగుల కేర్ తీసుకునే నర్సింగ్ సిబ్బంది వృత్తిలో సేవాభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. యుద్ధంలో నిస్వార్థంగా సేవలందించిన ప్లారెన్స్ నైటింగేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వృత్తి పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలన్నారు. వ్యాధి బాధలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సు గైడ్, ఎడ్యుకేటర్, మెంటార్గా వ్యవహరిస్తూ తన చేతులతో మ్యాజిక్ చేసి వ్యాధి నుంచి కోలుకుని నవ్వుతూ రోగి ఇంటికి వెళ్లేలా చేస్తారన్నారు. నర్సులు దేశ,విదేశాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రభుత్వం నర్సింగ్ సిబ్బంది నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు. అందులో భాగంగా గత ఏడాది విజయవాడలో నర్సింగ్ సిబ్బందికి అవార్డులు అందజేశామని, నేడు గుంటూరులో అవార్డులు అందిస్తున్నట్లు వెల్లడించారు. నర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నర్సింగ్ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అవార్డులు అందజేశారు. ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డులను సోమలపూరి చిన్నమ్మి, కొత్తమిద్దె సావిత్రి, డాక్టర్ వనజకుమారి, డాక్టర్ కంద స్వామి సుగంది, ప్రొఫెసర్ సి.ఆర్.షంషీర్ బేగంలు అందుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డీఎంఈ డాక్టర్ వి.రాధికారెడ్డి, ఏపీ నర్సెస్ అండ్ మిడ్వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, పలు జిల్లాలకు చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్జాతీయ పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్ సబ్ జూనియర్, జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులు -
జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు. – బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్, భాష్యం మెడెక్స్ కళాశాల, గుంటూరు -
విజయకీలాద్రిపై హనుమజ్జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్లో స్వదేశ్ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన జాతీయ అన్ఎక్విప్డ్ ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అభినందించారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్కుమార్ రజత పతకం గెలుపొందారు. కోచ్ ఖమురుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్ఖాన్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
రేపు ‘చలో మామిళ్లపల్లి’కి వైఎస్సార్సీపీ పిలుపు
సాక్షి, తాడేపల్లి: మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ స్పందించింది. మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు రేపు(మే 13, బుధవారం) చలో మామిళ్ళపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర దళారీలకే గ్యాంగ్స్టర్గా మారారంటూ మండిపడ్డారు.‘‘మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారు. మామిళ్ళపల్లిలో రైతుల గోదాముపై దాడి చేయటం దారుణం. మొక్కజొన్నకు కేంద్రం రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే నరేంద్ర మాత్రం రూ.1,652కే కొనుగోలు చేస్తున్నారు. తన సంగం డెయిరీకి అనుబంధ సంస్థల కోసం అతి తక్కువకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. తనకు మొక్కజొన్న అమ్మకపోతే దాడులు చేయిస్తారా?. టీడీపీ మండల స్థాయి నేతలే ఈ దాడుల్లో పాల్గొన్నారు. అది నా గోదామని ధూళిపాళ్ళ అబద్దాలు చెప్తే అధికారులే నమ్మలేదు. దాడులు చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మైండ్ బ్లాంక్ అయింది..అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రతీకారంగా మా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మొక్కజొన్న దాచుకున్న ఐదుగురు రైతులు సహా మొత్తం 15 మంది రైతులపై కేసులు పెట్టించారు. కర్ణాటక, తెలంగాణలో మొక్కజొన్నకు రూ.2400 కొంటుంటే ఏపీలో ఎందుకు కొనటం లేదు?. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకురావద్దు. అక్రమంగా నిల్వలు ఉంచిన ధూళిపాళ్ళపై డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదు?. అప్పట్లో సీజ్ ద షిప్ అన్నట్టుగా ఇప్పుడు సీజ్ ద సంగం డెయిరీ అని ఎందుకు అనటం లేదు?’’ అంటూ అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు. -
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ జగన్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా "దాసోహం కౌసలేంద్రస్య" అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు. రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న రామభక్తుడు హనుమాన్. రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా "దాసోహం కౌసలేంద్రస్య" అన్న వినయమూర్తి.. అపారబలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు. రామనామాన్ని ప్రతి శ్వాసలో నింపుకున్న రామభక్తుడు హనుమాన్. రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.#HanumanJayanti— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2026 -
గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం
సాక్షి, గుంటూరు: నిడబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్ దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో జీఆర్పీఎఫ్ పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. నిడుబ్రోలు సమీపంలో రైల్వే సిగ్నల్స్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గస్తీ కాస్తున్న జిఆర్పీ పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఈ క్రమంలో పోలీసులు.. పది రౌండ్లు కాల్పులు జరిపారు. సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ పాల్పడితే కాల్పులు జరుపుతామని గతంలో జీఆర్పీఎఫ్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే మార్గంలో నెల రోజుల క్రితం రైలు ఆపిన దొంగలు.. దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో జీఆర్పీఎఫ్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. -
‘మా పంట మాకు ఇప్పించండి’
నగరంపాలెం: ఈ ఏడాది మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాట ధర లభించలేదు. దీంతో మొక్కజొన్న బస్తాలను తెలిసిన రైతు గోదాములో నిల్వ చేసుకున్నాం. అయితే వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు సంబంధించి గోదాము మంటూ సీజ్ చేశారు. వారం రోజులుగా అన్నం లేదని, మా మొరను ప్రభుత్వమైనా అలకించాలని పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు విన్నవించారు. సోమవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్(గ్రీవెన్స్)లో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలసి జిల్లా ఏఎస్పీ(పరిపాలన) జీవీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. షెడ్కు వేసిన సీజ్ను తొలగించి, ఆరుగాలం పండించిన మొక్కజొన్న, వ్యవసాయ సామగ్రిని ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్యే దాడి చేయించారు... పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదని, దీంతో షెడ్లో మొక్కజొన్నను నిల్వ చేసుకున్నామని చెప్పారు. అయితే ఆ షెడ్ వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు చెందిందని ప్రచారం చేశారని వివరించారు. ఈ క్రమంలో పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర కొంతమందిని పంపించి తమపై దాడి చేయించారని వాపోయారు. రైతులు అందరూ కన్నీరు పెడుతున్న ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ షెడ్ను పగులకొట్టారని అన్నారు. షెడ్ సూద సముద్రయ్యదని, అంబటి మురళీకృష్ణది కానేకాదని స్పష్టం చేశారు. షెడ్ యాజమాని, రైతు సూద సముద్రయ్య మాట్లాడుతూ మేం ఎప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడలేదని, వారం రోజులుగా అన్నంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మా మొరను కూటమి ప్రభుత్వం అలకించడలేదన్నారు. నాలుగు ఎకరాల పొలం ఉందని, అయితే షెడ్లో 320 టిక్కిలు ఉన్నాయని తెలిపారు. దీనిపై స్థానిక తహసీల్దార్ కూడా న్యాయం చేయడం లేదని వాపోయారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని, దౌర్జన్యంగా పగులకొట్టారని వాపోయారు. అందులో వ్యవసాయ పనిముట్లు ఉన్నాయని చెప్పినా ఆలకించలేదన్నారు. ఎమ్మెల్యే నరేంద్రకు ముఫ్పై ఏళ్లుగా సేవ చేశానని, ప్రస్తుతం నా సోదరులు టీడీపీలోనే ఉన్నారని అన్నారు. మొక్కజొన్న రైతు సూరిశెట్టి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సుమారు 500 మంది వచ్చి షెడ్ను పగులకొట్టారని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి మా ధాన్యం ఇప్పించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. రైతులపై అన్యాయంగా బనాయించిన కేసులను తొలగించాలని కోరారు. మొక్కజొన్న రైతులు ఇక్కుర్తి శ్రీనివాస్, అంబటి పోలీస్ పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు పదోన్నతులు
గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
అంతర్ జిల్లాల బాస్కెట్ బాల్ జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: బాస్కెట్ బాల్ అంతర్జిల్లాల సబ్జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఎంపిక ప్రక్రియను ఏపీ స్టేట్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు కోరగంటి రవి, చావల శ్రీను, సురేష్, అనిల్ సూర్య నిర్వహించారు. అంతర్ జిల్లాల సబ్–జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్న్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుఫున బాలుర విభాగం నుంచి లోహిత్ కుమార్, నిమేష్ రెడ్డి, అథర్వ్, లోహిత్, ప్రీతం పాల్, శశాంక్, తనీష్, ఇషాంత్, మోక్షిత్, సాయి శివ నాగ్, కార్తికేయ, నాగార్జున, అలీ, షాజాద్, బోడేశ్వర్, ధ్రువేష్ చౌదరి ఎంపికయ్యారు. బాలికల విభాగం నుంచి భూమి, మహిత, దీప్తి, దీక్షిత, పార్నవి, బృంద సాయి, సాన్విత, వేధన్షి, పల్లవి, రాగ వర్షిణి, తన్వి, కావ్య, యాషిక, లీష్మ లను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు చిత్తూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. -
పాఠశాలల బస్సులు తనిఖీ
పట్నంబజారు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆర్టీఏ డీటీసీ కె.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సుల తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ క్షీణించడంపై సోమవారం ‘సాక్షి’లో ‘ఫిట్లెస్ బస్సు.. భద్రత తుస్సు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో పాఠశాలలకు చెందిన 284 బస్సులు తనిఖీ చేయగా భద్రతా ప్రమాణాలు సరిగా లేని 78 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా బస్సులు రోడ్డుపైకి వస్తే చర్యలు ఉంటాయన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు. లేని పక్షంలో బస్సులు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. -
జనగణనకు అధిక ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: జిల్లాలో జన గణనను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులు సమన్వయంతో పనిచేయా లని పేర్కొన్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం ఇళ్ల వద్ద అందుబాటులో ఉంటారని గమనించాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్యుమరేటర్లు రెండు పూటలా గృహ సందర్శన చేయడం మంచిదన్నారు. జలధార – జల హారతి పనులు పూర్తి చేయాలి కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన జలధార–జల హారతి పనులు పూర్తి చేయాలన్నారు. మంజూరు చేసిన పనులలో ఇంకా ప్రారంభం చేయడంలో జాప్యం జరుగుతుండటం పట్ల చేబ్రోలు, కాకుమాను, పొన్నూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ప్రశ్నించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పనులను పూర్తి చేయడంలో చురుకై న పాత్ర పోషించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. పూర్తి సామర్థ్యంలో చెరువులలో నీటి నిలువ చేయాలని పేర్కొన్నారు. చెరువు గర్భం మాత్రమే కాకుండా కాలువలు, స్లూయిస్ లలో గురప్రు డెక్క ఉండరాదని, పూడికలు లేకుండా చూడాలని అన్నారు. యంత్ర పరికరాల వినియోగం అవసరం ఉన్న పనులను గుర్తించి, జాబితాను రూపొందించాలన్నారు. డివిజనల్ అభివృద్ధి అధికారులు జలధార పనులను పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెనన్స్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏఐ ద్వారా వృత్తి నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంతో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏఐపై జిల్లా అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ స్వయంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏఐలో పొందుపరచకూడని అంశాలను కూడా వివరించారు. -
ట్రాక్టర్ ఢీ కొని రైతు దుర్మరణం
చేబ్రోలు: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అతివేగంగా ఢీ కొట్టడంతో రైతు దుర్మరణం చెందిన ఘటన మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లేమల్లెపాడుకు చెందిన వల్లపు రఘురామయ్య(48) కొత్తరెడ్డిపాలెంలో పొలం పనులు ముగించుకొని టీవీఎస్పై ఇంటికి బయలు దేరాడు. పాతరెడ్డిపాలెం గ్రామ శివారులో లేమల్లెపాడు వెళ్లే దారిలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రఘురామయ్యకు ముఖానికి, తలకు, కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. బిహార్ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పేద కుటుంబానికి చెందిన రఘురామయ్య మృతికి కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేబ్రోలు ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రేపు చలో మామిళ్లపల్లి
గుంటూరు ఎడ్యుకేషన్: పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ గూండాలతో చేయించిన దాడితో బాధితులైన రైతులను పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 13న ఛలో మామిళ్లపల్లి పేరుతో రైతు పరామర్శ యాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా పొన్నూరు నియోజకవర్గంలో 40వేల ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ల మేరకు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చిందని, కేంద్రం ప్రకటించిన విధంగా క్వింటా రూ.2,400 మద్దతు చొప్పున పంటను కొనుగోలు చేయాలని రైతుల పక్షాన నిలిచి వైఎస్సార్ సీపీ ఉద్యమం చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వందలాది మంది రైతులతో కలిసి, వైఎస్సార్ సీపీ చేపట్టిన మొక్కజొన్న పోరాటదీక్షకు వచ్చిన స్పందన ప్రభావంతోనే సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. అయితే రైతాంగం ఎదురు చూస్తున్న విధంగా కొనుగోలు కేంద్రాలను తెరవలేదని, దీంతో చేతికి వచ్చిన పంటను అమ్ముకునే అవకాశం లేకుండా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో పెద్ద దళారీగా మారిన ఎమ్మెల్యే నరేంద్ర సంగం డెయిరీలో పశువుల దాణా ఉత్పత్తి కోసం మద్దతు ధర కంటే తక్కువకు రూ.2,100లకు పంటను కొనుగోలు చేసినట్లుగా స్వయంగా అంగీకరించారన్నారు. దీంతో పాటు తన అనుచరులతో రైతుల నుంచి క్వింటా రూ.1,600కు కొనుగోలు చేయిస్తూ రైతులను తీవ్రంగా మోసగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తీరు మార్చుకోవాలి మామిళ్లపల్లి, మంచాల, వెల్లలూరు గ్రామాల్లో తనకు ఆధిక్యం ఉన్న చోట కాపులను అణిచివేయాలని పన్నిన కుట్రలో భాగంగానూ ఎమ్మెల్యే నరేంద్ర ఈ వ్యవహారాన్ని నడిసిస్తున్నారన్నారు. సెలవు రోజు వచ్చి గోదాముకు సీల్ వేసిన తహసీల్దార్, అందుకు శాంతిభద్రతల సమస్య ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేను సంతృప్తి పర్చడం కోసం గోదాముకు తాళం వేశారన్నారు. ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర సేవలో తరిస్తూ, చట్టాన్ని అతిక్రమిస్తున్న పొన్నూరు, చేబ్రోలు రూరల్ సీఐలు తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. మొక్కజొన్న గిట్టుబాటు ధర కల్పనతోనే ఉద్యమం ఆగదని, గుంటూరు ఛానెల్, కొమ్మమూరు బ్రిడ్జిపై ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలుస్తాం రైతులకు అండగా నిలవాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈనెల 13న ఛలో మామిళ్లపల్లి – రైతు పరామర్శ యాత్రలో వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో కలసి రైతులను పరామర్శించి, మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెనుమాల అరుణ్కుమార్, పొన్నూరు నియోజకవర్గ నాయకుడు తురిమెళ శ్రీనివాసరావు, చాగంటి మురళీమోహన్, బద్దెపూడి రమేష్, చింతలపూడి మురళీకృష్ణ, లంకపోతు పిచ్చెయ్య, చిర్రా అంకిరెడ్డి, గోళ్ల జ్యోతి పాల్గొన్నారు. మామిళ్లపల్లి గ్రామంలో సూడా సముద్రయ్య కోడలు త్రివేణి పేరుతో ఉన్న గోదాములో రైతులు నిల్వ చేసుకున్న మొక్కజొన్న పంటను అంబటి మురళీకృష్ణ దాచారంటూ తనకు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే నరేంద్ర ప్రోద్బలంతో మామిళ్లపల్లితో సంబంధం లేని, బయట గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, గూండాలు గోదామును ధ్వంసం చేసి, అడ్డువచ్చిన రైతులపై దాడికి తెగబడ్డారని మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మామిళ్లపల్లి గ్రామంలో ఎకరం పొలం లేదని, తాను మొక్కజొన్న పంట ఉత్పత్తి దారుడిని, కొనుగోలుదారుడిని సైతం కాదని స్పష్టం చేశారు. మామిళ్లపల్లిలో జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి వాస్తవాలను వారి దృష్టికి తీసుకువచ్చిన తరువాత 31 మంది టీడీపీ నాయకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, వారందరు మామిళ్లపల్లి గ్రామంతో సంబంధం లేని బయటి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులేనని చెప్పారు. -
14న నాట్కో సెంటర్లో పెట్ స్కాన్ ప్రారంభం
గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు. -
23న ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: అధ్యాపక ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను ఈనెల 23న గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో శత జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ అధ్యాపకుల సంక్షేమం కోసం ఎంజే మాణిక్యరావు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఈనెల 23న జరిగే శత జయంతి ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏఎన్యూ మాజీ వీసీ ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హాజరు కానున్నారని తెలిపారు. ఎంజే మాణిక్యరావు స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.మోజెస్, ఉపాధ్యక్షుడు ఎం.విజయకుమార్, ప్రతినిధులు డీవీ సోమయ్యశాస్త్రి, ప్రమీల, హేమలత, బోసుబాబు, దుర్గాప్రసాద్, గంగాధర్రావు పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ గ్రామోత్సవం
పట్నంబజారు: అంజనీ సుతుడు ఆంజనేయస్వామి గ్రామోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. గుంటూరు నగరం నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఆంజనేయ దీక్షాపరులు, భక్తులు భారీ ఊరేగింపు నడుమ ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా క్రేన్తో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, స్వామి వారి వేషధారణలు, డప్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాజ్ సెంటర్లో ప్రారంభమైన ఊరేగింపు భాస్కర్ డీలక్స్, కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్, శివాలయం, భగత్ సింగ్ బొమ్మ సెంటర్ మీదుగా లాలాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని తిరిగి అక్కడ నుంచి హిమని కూల్ డ్రింక్ సెంటర్, జిన్నాటవర్ సెంటర్ మీదుగా తిరిగి ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకుంది. అశేష భక్త సందోహం మధ్య జరిగిన ప్రదర్శన కార్యక్రమంలో నగర ప్రజలు స్వామివారినీ మనసారా స్మరించుకుంటూ నమస్కరించుకున్నారు. ఆలయ ఈవో టి సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు టీవీ సుబ్బారావు ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రూప్ ఆలయాల పాలకమండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు ఘటాభిషేకం హనుమజ్జయంతి పురస్కరించుకుని నాజ్సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిఏటా సాంప్రదాయంగా నిర్వహించే ఘటాభిషేకం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతోందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ, దీక్ష సమాజం సభ్యులు కోరారు. -
పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్
పెదకాకాని: ఇన్స్ట్రాగామ్లో స్థానిక ఎమ్మెల్యేపై పోస్ట్ చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ చేబ్రోలు మండల సోషల్ మీడియా కన్వీనర్, చేబ్రోలు 4వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు ఇంటూరి జైపాల్రెడ్డిని పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు మండలానికి చెందిన జైపాల్రెడ్డి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్పై అసభ్యకరమైన పోస్టు పెట్టారని పెదకాకానికి చెందిన టీడీపీ కార్యకర్త దాసరి నరసింహారావు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కార్యకర్త ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం జైపాల్రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా కన్వీనర్పై కేసు నమోదు చేసి ఉపయోగించిన రెండు ఫోన్లు, లాప్టాప్ సీజ్ చేసినట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. అలానే ఎమ్మెల్యేపై మొక్కజొన్న దొంగల గ్యాంగ్ లీడర్ నరేంద్ర, రైతులు రేటు లేదు దొంగలకు డబ్బుల ముద్ద అనే పోస్ట్లు పెట్టారని రామాంజనేయులు, వినోద్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు గుంటూరు లీగల్: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. పల్నాడు జిల్లా కోసూరు మండలం పెరికపాడుకు చెందిన మందా నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్నేహంగా ఉన్నాడు. నాగరాజు మద్యం తాగేందుకు అతడిని పిలవడంతో భార్య మందలించింది. నాగరాజు ఒంటరిగా మద్యం తాగాడు. అనంతరం రాత్రి సుమారు 12 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి, అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.కె.షమీ పర్వీన్ సుల్తానా బేగం నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించారు. కేసు దర్యాప్తులో ఎస్ఐలు ఎం.నారాయణ, బి. అనంతకృష్ణ, కోర్టు కానిస్టేబుల్(ప్రస్తుతం ఏఎస్ఐ) శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం సంయుక్తంగా గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో గుంటూరు డీ–1 సెక్షన్ పరిధిలోని బ్రాడీపేట, అరండల్పేటలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 4,750 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 108 మందికి రూ.5.05 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఐదుగురికి రూ.26 వేలు కలిపి మొత్తంగా రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎస్ఏ కరీం, పఠాన్ హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ సర్వీసుల తనీఖీలు భారత విద్యుత్ చట్టానికి లోబడి ఉంటాయన్నారు. ఫిర్యాదుల కోసం 9440812263, 9440812361 నంబర్లును సంప్రదించాలని వారు కోరారు. తనిఖీల్లో డీఈఈలు షేక్ ముస్తాక్ అహ్మద్, మల్లికార్జున ప్రసాద్, రవికుమార్, ఏఈఈలు, కె.అక్కిరెడ్డి, శివశంకర్, సతీష్కుమార్ పాల్గొన్నారు. ఏఎన్యూ ప్రొఫెసర్కు అరుదైన గౌరవం ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏఎన్యూ సోషియాలజీ సోషల్ వర్క్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్, జెండర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ వారి గ్లోబల్ రోస్టర్ ఆఫ్ జెండర్ ఎక్స్పర్ట్గా ఎంపికయ్యారు. ఆ సంస్థ యొక్క డైరెక్టర్లు, వ్యవస్థాపకులైన నికోలా, లీ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.గంగాధరరావు సోమవారం ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్ను అభినందించారు. -
గంజాయి కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన గుండిమెడ అంథోని గంజాయి విక్రయిస్తున్న సమయంలో మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. కేసులో ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.అశోకవాణి వాదనలు వినిపించారు. బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలి కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్బీఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. నగరంపాలెం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సెంట్రలైజ్డ్ లంచ్ టైమ్ డిమాన్స్ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్బీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ సెక్రటరీ కాకుమాను కోటి రెడ్డి, నరేంద్ర కుమార్, సంపత్ పాల్గొన్నారు. -
ఎన్జీ రంగా వర్సిటీలో ఎస్ఎల్టీపీ ప్రోగ్రాం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో స్ట్రేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం ప్రారంభించారు. సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశోధన స్థానాలలో గత సంవత్సరం నిర్వహించిన పరిశోధనలను సమీక్షించారు. పరిశోధనల ఫలితాలను విశ్లేషించి, రైతుల సమస్యలను, వారి అవసరాలను గుర్తించి, వాటికనుగుణంగా రాబోవు సంవత్సరంలో నిర్వహించాల్సిన పరిశోధనలకు ప్రణాళికలను రూపొందించారు. నేటి నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. జన్యుశాస్త్రం, మొక్కల ప్రజననం, అణు జీవశాస్త్రం, జీవ సాంకేతికత విత్తన విజ్ఞానశాస్త్రం, సాంకేతికత తదితర విషయాలపై చర్చించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ జెర్మ్ ప్లాజమ్ డిజిటలైజ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. పరిశోధనలకై డిబిటీ, డీఎస్టీ వంటి సంస్థల నుండి బాహ్య నిధులు సమీకరించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్.వసుంధర గత సంవత్సర నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వరి, వేరుశనగ, అపరాల పరిశోధనలో అగ్రగామి విశ్వవిద్యాలయం మరింత మెరుగ్గా పనిచేసి యూనివర్సిటీ ఖ్యాతిని పెంచి, రైతులకు సేవనందిచాలని తెలిపారు. కార్యక్రమం ఐసీఏఆర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.పి.భదానా, ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.మురళీధరన్, టీఎన్ఏయూ రిటైర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు, డాక్టర్ జి. రామచంద్రరావు, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రాధిక పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో పది లక్షలు కాజేశాడు..
నగరంపాలెం: రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని లోకో పైలెట్ మోసగించాడని, అతడికి చెల్లించిన రూ.10.5 లక్షలు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నట్లు ఓ నిరుద్యోగి వాపోయారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్(గ్రీవెన్స్)లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుల వినతులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదు చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన)రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి(మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్(ట్రాఫిక్), మధుసూదన్రావు (గుంటూరు సీసీఎస్) అర్జీలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో బాధితుడి ఆవేదన -
అమరావతిలో ఏబీఎన్ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?
సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్ జగన్ని దూషిస్తున్నారు.అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయిపనులన్నీ ఆగిపోతాయి, మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు వైఎస్సార్సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారుసంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా? అని ప్రశ్నించారు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి కొల్లు రవీంద్ర పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబులాగా అబద్దపు హామీలు జగన్ ఇవ్వలేదు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేమంటూ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఎన్టీఆర్ నుండి రాష్ట్ర ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచారు.రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్ హయాంలోనే జరిగింది. జగన్ తెచ్చిన పది హార్బర్లు, మూడు పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా?. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా?. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందటం ఇష్టం లేదా?. విజయవాడ సిద్దార్థ కాలేజీకి కూడా లీజు పద్ధతిలో భూములు ఇచ్చారు. అక్కడ పేద విద్యార్థులకు సీటు కూడా దొరకదు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. డిజైన్ల పేరుతో వందల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నారన్నారని, కానీ అసలు ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు అని అన్నారు. మీ పరిపాలన మీద సగం మార్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. మొదటి ర్యాంకు ఇచ్చిన వ్యవసాయ రంగంలోనే రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కనీసం గోనె సంచులు కూడా దొరకడం లేదన్నారు. ఈ సమస్యలు కలెక్టర్ల మీటింగ్లో కనీసం చర్చకు నోచుకోలేదన్నారు. ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలు 2027 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్పా నిర్ధిష్ట కార్యాచరణ లేదని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయని, గ్యాస్ ధరలు పెద్దఎత్తున పెంచినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేకపోతే వాటి సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాగ్ధానం చేసిన విధంగా గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఓ.ఆర్.ఆర్ వల్ల భూముల కోల్పోతున్న రైతులకు అమోధ్యయోగమైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా నాయకులు ఎన్.శివాజీ, పి.కృష్ణ, జి.రమణ, పి.బాలకృష్ణ, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు -
అన్ని వర్గాలకు అందుబాటులో ఇగ్నో కోర్సులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇగ్నో దూర విద్య కోర్సులు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ ప్రాంగణంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ (ఇగ్నో) అధ్యయన కేంద్రంలో 2026 జనవరి సెషన్లో చేరిన విద్యార్థులకు ఇగ్నో ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ వివిధ వర్గాలకు అవసరమైన విధంగా అన్ని రకాల కోర్సులను ఇగ్నో అందిస్తోందని చెప్పారు. యూజీ, పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాన్వేషణలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుంటుందని అన్నారు. స్టడీ మెటీరియల్స్, ప్రాజెక్టు వర్క్ గురించి వివరించారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ అసైన్మెంట్స్, పరీక్షలకు సన్నద్దత గురించి వివరించారు. అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న కోర్సులు, విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, అధ్యయన కేంద్ర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి తాడికొండ: తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పకీరయ్యపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. గతంలో కూడా ఇతనిపై దాడికి పాల్పడటంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇటీవల మళ్లీ ఫకీరయ్య వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా తిరుగుతుండటంతో కట్టెపోగు నవీన్, కావూరి అశోక్లు ఆయన ఇంటికి దాడి చేశారు. దాడి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా రోడ్డుకు అడ్డుగా నిలబడటంతో 112కు కాల్ చేసి ఫిర్యాదు చేసి స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. మూడో అంతస్తులో వివాహాల సందడి సాయంత్రం పెరిగిన రద్దీ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ -
భద్రత తుస్సు!
గుంటూరుసోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026ఫిట్‘లెస్’ బస్సు..● ఈ నెల 10వ తేదీతో ముగిసిన విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షల గడువు ● కనీసం 30శాతం బస్సులకు కూడా పూర్తికాని పరీక్షలు ● 50శాతంకు పైగా బస్సులు ప్రజాప్రతినిధులవే.. ● తూతూ మంత్రంగా తనిఖీలు ● ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పమంటే నీళ్లు నములుతున్న వైనం దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్ రమేష్, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పట్నంబజారు: ప్రతి తల్లి, తండ్రి కలలు కనేది.. కష్టపడేది వారి చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసమే. బస్సెక్కి స్కూళ్లకు వెళ్లిన తమ చిన్నారులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేవరకు వారు పడే ఆదుర్దా అంతాఇంతా కాదు. వీటికి తోడు జిల్లాలో వరుసగా జరుగుతున్న స్కూల్ బస్సుల ప్రమాదాలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. చర్యలు చేపట్టాల్సిన రవాణాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అసలు స్కూల్ బస్సులను వదిలేసి.. కేవలం ఆదాయ మార్గాల వనరులను వెతుక్కునే పనిలో పడ్డారనే విమర్శలు లేకపోలేదు. పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభయ్యే సమయానికి పూర్తిస్థాయిలో విద్యా సంస్థల వాహనాలకు ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారుగా 2500పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. వీటిలో సుమారు 400 నుంచి 600 బస్సుల వరకు స్క్రాప్కు వెళ్లటంతో ప్రస్తుతం 1900 నుంచి 2వేల బస్సుల వరకు ఉన్నాయి. మే 10వ తేదీలోగా ఫిట్నెస్ సెంటర్లలో వాహన సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలని, పూర్తిస్థాయిలో అన్ని ధ్రువీకరణ పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. అయితే ఇప్పటివరకు కనీసం 400 బస్సులు కూడా ఎఫ్సీ పొందలేదని తెలుస్తోంది. బస్సులకు ఇంకా ఎఫ్సీ చేయించకపోవడం, కేసుల నమోదు సంఖ్యపై అధికారులను ‘సాక్షి’ వివరణ కోరబోగా స్పందించలేదు. ● గత కొద్ది రోజుల క్రితం చుట్టుగుంట సెంటర్లోని వీఐపీ రోడ్డులో ఒక పాఠశాల బస్సు డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి వెనుక నుంచి ముందుకు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టాడు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆటో బాగు చేయిస్తానని చెప్పటంతో.. వివాదం సద్దుమణిగింది. ఇందులో ఆలోచించాల్సింది మాత్రం ఒక్కటే.. ఎదురుగా ఆటో కాకుండా లారీ, బస్సు లాంటి భారీ వాహనం అయితే పరిస్థితి ఏంటీ..? ● ఉండవల్లి– పెనుమాక దారి మధ్యలో గుహల సమీపంలోని ఓ విద్యా సంస్థ బస్సుల డ్రైవర్ అతి నిర్లక్ష్యంతో నడిపి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. అయితే అందులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులోని ఇద్దరికి మాత్రం గాయాలయ్యాయి. ● గత కొద్ది రోజుల క్రితం కొరిటెపాడు రోడ్డులో సైతం అతి వేగంగా ఒక విద్యా సంస్థ బస్సు వేగంగా వెళుతూ.. స్పీడ్ బ్రేకర్ ఎక్కించటంతో బస్సులోని కొంత మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇటువంటి ఘటనలు.. ఎక్కడో అక్కడ పునరావృతం అవుతూనే ఉన్నాయి. చిత్రలేఖనంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు 7గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సంబంధించి కూటమికి చెందిన కొంత మంది ప్రజాప్రతినిధుల విద్యాసంస్థల బస్సులే అధికంగా ఉంటున్నాయి. వీటిపై తనిఖీలు నిర్వహించే ధైర్యం లేని అధికారులు.. చిన్నాచితక విద్యాసంస్థల బస్సుల్లో చిన్న తప్పులు పట్టుకుని వాటిని తనిఖీలు నిర్వహించామని ఊదరగొడుతున్నారు. ప్రధాన యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలల బస్సులను ఎందుకు తనిఖీ చేయరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 60 సంవత్సరాలు వయో పరిమితి దాటిన వ్యక్తి డ్రైవింగ్కు అనర్హుడు. డ్రైవర్కు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డ్రైవర్ ఆరోగ్య పరీక్షలు ఆయా యాజమాన్యాలు విధిగా చేయించి, ఆ రికార్డులను భధ్రపరచాలి. డ్రైవర్ల నియామకాన్ని ఆర్టీఓ అధికారులు తెలియజేయటంతో పాటు, 5 సంవత్సరాల అనుభవం, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి డ్రైవర్లు మాత్రమే అర్హులు. కళాశాల, స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లితండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు, ప్రతి నెల వాహనానికి సంబంధించి స్థితిగతులను రిజిష్టర్ చేయటంతో పాటు, ప్రతి వాహనంలో ఫిర్యాదు పుస్తకాన్ని ఉంచాలి. అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం, బ్యాగులు భధ్రపరుచుకునే బాక్సులు సబ్రూల్ ‘ఏ’, ‘బి’ ప్రకారం తప్పని సరిగా పాటించాలి. ప్రతి బస్సులో ఒక అటెండర్ ఉండాలి. ప్రతి వాహనంలో ప్రయాణించే విద్యార్థుల వివరాలను తప్పనిసరిగా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు నోట్ చేసుకోవటంతో పాటు, తల్లితండ్రులకు డ్రైవర్ వివరాలను తెలియజేయాలి. 15 సంవత్సరాలు దాటిన బస్సులకు అనుమతి ఉండదు. ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ.. బస్సులు నడపాలి. ఏౖదైనా ఘటన జరగక ముందే అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టడంతో పాటు, విస్త్రృత తనిఖీలు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు. వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. -
‘ఇంజినీరింగ్’ పరీక్షలకు వేళాయె!
● రేపటి నుంచి 20 వరకు ఏపీ ఈఏపీసెట్–2026 ● 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ● 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ● ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 46,168 మంది విద్యార్థులు ● మూడు జిల్లాల్లో 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి. కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2026ను నిర్వహిస్తోంది. ● గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో ఆయా తేదీల వారీగా ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46,168 మంది విద్యార్థులు ● ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 46,158 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 33,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 28,158, అగ్రికల్చర్, ఫార్మసీ 5,068, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 55 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 4,059 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 2,899, అగ్రికల్చర్, ఫార్మసీ 1,159, రెండు కలిపి రాస్తున్న విద్యార్థి ఒక్కరు ఉన్నారు. ● బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల పరిధిలో మొత్తం 8,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 7,684, అగ్రికల్చర్, ఫార్మసీ 1,120, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 24 మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్లో విద్యార్థి కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు.గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్ట్, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫోటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటన వేలి ముద్ర వేయాలి. -
రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి
నరసరావుపేట: బాలలకు విజ్ఞానం, వికాసం, వినోదం అందించే సమ్మర్ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో నిర్వహించాలని చిల్డ్రన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘చిల్డ్రన్స్ క్లబ్ ఏర్పాటు– నిర్వహణ ఫలితాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఐద్వా సీనియర్ నాయకురాలు గద్దె ఉమశ్రీ అధ్యక్షత వహించారు. రమాప్రభ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ, మిషనరీ పాఠశాలలే ప్రధానంగా ఉండేవని, ప్రస్తుతం కార్పొరేట్ విద్యా వ్యవస్థ విస్తరించడంతో చిన్నారుల్లోని సహజ సృజనాత్మకత, కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, పాలకవర్గాలే కార్పొరేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విజ్ఞాన కేంద్రాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందుకు వచ్చి సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 1935లో కేరళలో ప్రారంభమైన చిల్డ్రన్స్ క్లబ్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ వేదికల ద్వారా అనేక మంది ఉత్తమ పౌరులుగా ఎదిగారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో కూడా చిల్డ్రన్స్ క్లబ్లను విస్తృతంగా ఏర్పాటు చేసి చిన్నారుల్లో అభ్యుదయ భావాలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్నాడు బాలోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ కన్వీనర్ షేక్ మస్తాన్వలి, పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, టి.అంజిరెడ్డి, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ సభ్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని, అధ్యక్షులు అనూష, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డి.శివకుమారి, కౌలు రైతు సంఘం నాయకులు కామినేని రామారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు జి.మల్లేశ్వరి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు అమూల్య పాల్గొన్నారు. చిల్డ్రన్ ్స క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ -
రైతులకు షాక్ ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే సోదరుడు
తాడేపల్లి రూరల్: గత పది సంవత్సరాల నుంచి 120 మంది రైతులకు చెందిన 92 ఎకరాల భూములను డెవలప్మెంట్ చేస్తామంటూ నమ్మించి అగ్రిమెంట్ చేయించుకుని వేధింపులకు గురి చేస్తున్న టీడీపీ తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ భూములు ఇచ్చిన రైతులతో పాటు మిగిలిన వారికి ఆదివారం షాక్ ఇచ్చాడు. 92 ఎకరాల భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని రైతులు మంత్రి లోకేశ్ను మీడియా ముఖంగా కోరారు. ఆ మరుసటి రోజే రైతులకు షాక్ ఇస్తూ మంగళగిరి తాడేపల్లి జాతీయ రహదారి వెంబడి నుంచి ఉన్న సర్కార్ డొంకను ఆక్రమించుకుని ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా రోడ్డు చుట్టూ రేకులు ఏర్పాటు చేసేందుకు లారీల్లో రేకులు తెచ్చి ఐఓసీ వెనుక దించారు. ఇది గమనించిన 92 ఎకరాల రైతులతో పాటు ప్రస్తుతం అక్కడ పొలాలు ఉన్న రైతులు వచ్చి రేకులు ఏర్పాటు చేయడానికి వీలు లేదని అడ్డుకున్నారు. ఇది ప్రభుత్వ డొంక అని, ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని రైతులు వారితో వాగ్వివాదానికి దిగారు. ‘మాకు తెలియదు.. సార్ ఇక్కడ దించమన్నారు’ అని చెప్పగా.. ఆ సార్ ఎవరో చెప్పాలని రైతులు ప్రశ్నించినా.. రేకులు దించి వెళ్లిపోయారు. గతంలో ఎమ్మెల్యే రామకృష్ణ సోదరుడు రైల్వే డంప్ యార్డ్ దగ్గర నుంచి పంట పొలాల మీదుగా ఉన్న సుమారు రెండు ఎకరాల డొంక భూమిని కూడా ప్రభుత్వం నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు ఆ డొంకను అమ్మే ఆలోచనను పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ రోడ్డును వారికి అమ్మితే ఎలా అని నిలదీసినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజాగా రైతులను పంట పొలాల్లోకి వెళ్లనీయకుండా రోడ్డును ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం వెనుక అధికారులు ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా భూములను డెవలప్మెంట్కు తీసుకుని చేయకుండా వేధిస్తున్న వైనం ఇప్పుడు ఆ భూములతో పాటు వ్యవసాయ పొలాల్లోకి వెళ్లకుండా రోడ్డు ఆక్రమించుకునేందుకు యత్నం అడ్డుకున్న అన్నదాతలు.. న్యాయం చేయాలని వేడుకోలు -
మత విద్వేషపూరిత పోస్టులు వ్యాప్తి చేయవద్దు
నగరంపాలెం: సోషల్ మీడియాలో మతవిద్వేషపూరిత పోస్టులు, వదంతులు వ్యాప్తి చేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఘటనల దృష్ట్యా సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్/ ఇతర సాషల్ మీడియా వేదికల్లో మతపరమైన ద్వేషపూరిత సందేశాలు, ఛాయచిత్రాలు, వీడియోలు లేదా రెచ్చగొట్టే కంటెంట్ను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. గ్రూప్ అడ్మిన్న్లు ఆయా గ్రూప్ల్లో షేర్ చేసే ప్రతి సందేశం(మెసేజ్) నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఏవైనా ద్వేషపూరిత, అభ్యంతరకరమైన లేదా రెచ్చగొట్టే కంటెంట్ ఉంటే వెంటనే ఆ సందేశాలను తొలగించి, సంబంధిత వ్యక్తులను గ్రూప్ల నుంచి తొలగించాలని సూచించారు. గ్రూప్ అడ్మిన్లు బాధ్యతాయుతంగా ఆలోచించాలని కోరారు. ప్రతి గ్రూప్ అడ్మిన్ తమ గ్రూప్ల్లో చట్టవిరుద్ధమైన ప్రచారం కాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. తప్పుడు ప్రచారం, మతద్వేషపూరిత పోస్టులు, నకిలీ వార్తలు, మార్ఫింగ్ ఫొటోలు లేదా వీడియోలను సృష్టించే, ఫార్వార్డ్ చేసే లేదా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏ సోషల్ మీడియా వేదికలైనా సరే వదంతులను వ్యాప్తి చేయవద్దుని అన్నారు. ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు లేదా ఫార్వార్డ్ చేసేటప్పుడు సంబంధిత అధికారులు ద్వారా లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా వాస్తవాలు ధ్రువీకరించుకోవా లన్నారు. ఎవరైనా వదంతులు, మతద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా ఎస్పీ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దృష్టికి ప్రజలు తేవాలన్నారు. అటువంటి వారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
జూన్ ఒకటి నుంచి ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు
లక్ష్మీపురం: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జూన్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగ విలువలు, లౌకికత, ప్రజాస్వామ్య పరిరక్షణ, శ్రమజీవుల హక్కులు, విద్య– ఉపాధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి కీలక అంశాలపై బోధనలు, చర్చలు ఉంటాయని వివరించారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. ఫీజుల పెంపు, నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాల లేమి, కాంట్రాక్టు ఉద్యోగుల అనిశ్చితి వంటి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, విద్యుత్ చార్జీల భారాలు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి యువతపై మరింత ప్రభావం చూపుతోందని తెలిపారు. యువతను ఉద్యమ దిశగా తీసుకువెళ్లడం, వారి సమస్యలకు సంఘటిత పోరాటం నిర్మించడం ఈ శిక్షణ తరగతుల ముఖ్య లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.సుభాని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, వలి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యువజన సమాఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బి.యశ్వంత్, అరుణ్, సద్దాం, మహేష్ పాల్గొన్నారు. -
ఆంధ్రనాట్యం భారతీయ సాంస్కృతిక వైభవ చిహ్నం
ఏఎన్యూ(పెదకాకాని): భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అత్యాద్భుతంగా ఆవిష్కరించే నాట్యరీతుల్లో ఆంధ్రనాట్యం ఒకటని ఏఎన్యూ రెక్టార్ ఆచార్య రామినేని శివరాంప్రసాద్ అన్నారు. శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పంచశత ఆంధ్రనాట్య సంగమం పేరుతో 500 మంది ఆంధ్రనాట్య కళాకారులు చేసిన నృత్యాంశాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైన సందర్భంగా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య రామినేని శివరాంప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక నాట్యకళలు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. అందులోనూ తెలుగు వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే ఆంధ్రనాట్యానికి మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు పంచశత ఆంధ్రనాట్య సంగమం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావటం ఆనందంగా ఉందన్నారు. తమ విశ్వవిద్యాలయం సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించే దిశగా పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఆంధ్రనాట్యాన్ని విద్యార్థులకు అందించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్రనాట్యానికి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రఖ్యాత నాట్యాచార్యులు, అభినవ సత్యభామ కళాకృష్ణ, కళారత్న పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు తదితరులు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రఖ్యాత నాట్యకళాకారులు కళాకృష్ణ మాట్లాడుతూ తమ గురువు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ మరుగున పడిన ఆంధ్రనాట్యానికి పునరుజ్జీవం తీసుకురావడం కోసం పాటుపడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ కళల వికాసానికి పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు అపూర్వమైన సేవలందిస్తున్నారన్నారు. సంస్థ వ్యవస్థాపకులు కళారత్న పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కళాకారులు పంచశత ఆంధ్రనాట్య సంగమంలో భాగస్వాములు కావడం విశేషమన్నారు. సుమధుర కళానికేతన్ప్రధాన కార్యదర్శి పసుమర్తి భాస్కరశర్మ, మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఆ సంస్థ ప్రతినిధులు గుర్తింపు పత్రాలను నిర్వాహకులకు అందించారు. పలువురు కళకారులు వివిధ నృత్యాంశాలను ప్రదర్శించారు. ఏఎన్యూ రెక్టార్ ఆచార్య రామినేని శివరాంప్రసాద్ -
విజ్ఞానం... వినోదం
● చదువుల ఒత్తిడి నుంచి విద్యార్థులకు ఉపశమనం ● క్రీడలు, ఆటలతోపాటు సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసే విధంగా శిక్షణ ● నగరంలోని వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులు ● ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ● ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు -
శోకసంద్రమైన ఎండుగుంపాలెం
నాదెండ్ల: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె, తండ్రి మరణవార్త విని తిరిగివచ్చిన ఉదంతం ఎండుగుంపాలెంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్ఎస్పీ తుర్లపాడు మేజర్ కాలువ డీసీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు(52), తన కుమార్తె అంజలిని విదేశీ విద్య కోసం శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సాగనంపి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అంజలి తన ప్రయాణ వివరాలు తెలిపేందుకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులెవరూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను ఆరా తీసింది. తండ్రి మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. తిరిగి ప్రయాణమై ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. అంజలి తండ్రి భౌతికకాయాన్ని చూసి విలపించిన తీరు చూపరులకు కంట నీరు తెప్పించింది. తల్లి రాంపూర్ణమ్మ, తమ్ముడు ఈశ్వరప్రసాద్లను ఓదార్చడం సాధ్యం కాలేదు. తనను ప్రయోజకురాలిని చేయాలన్న తండ్రి కలలను తలచుకుంటూ, దశదిన కర్మల అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తానని, అదే తన తండ్రికి ఇచ్చే అసలైన నివాళి అని అంజలి ధైర్యంగా చెప్పింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్ఎస్పీ అధికారులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హనుమజ్జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసియున్న ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం పంచామృత స్నపన, లక్ష తులసి పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి.సుభద్ర కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీహనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షుడు తిరువల్లూరి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 8 గంటలకు గ్రామోత్సవ హనుమాన్ దీక్ష సమాజం వారిచే ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున పురవీధుల్లో దీక్ష సమాజం సభ్యులు, దీక్షాపరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సీహెచ్ మారుతి, వెంకటరమణ, వంశీ ప్రసాద్, బాపిరాజు, కిషోర్, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపాలి
గుంటూరు వెస్ట్: జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా అధికారులతో కలసి శనివారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాలలో జిల్లా ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రధానంగా కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్, ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అందిన అర్జీలు నూరు శాతం పరిష్కారం, కేటాయించిన బడ్జెట్ మురిగిపోకుండా చూడాలని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను వివరించారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను అనుసంధానం చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశిత సమయానికి నివేదికలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలను గురించి ఆలోచించాలని, సంబంధిత ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు దీనికి అనుగుణంగా ఏ పంటలు వేసుకోవాలో వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలన్నారు. ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కే శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
రేషన్ మాఫియా దందా
గుంటూరుఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ప్రతి నియోజకవర్గంలో మండలానికి ఒక టీడీపీ నేత రేషన్ మాఫియా నిర్వహణను పంచుకున్నారు. గుంటూరు నగరంలో, రూరల్ మండల పరిసరాల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చేతుల్లో రేషన్ మాఫియా నడుస్తోంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్కు చేరేలోగానే బియ్యాన్ని మాఫియా దోచేస్తోందని డీలర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,500, మోడల్ ధర రూ.4,000 వరకు పలికింది.దుగ్గిరాల: దుగ్గిరాలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో అక్రమ రేషన్ దందాకు అంతులేకుండా పోయింది. ముఖ్యంగా మురళి.. ఈ పేరు చెబితేనే ప్రతి రేషన్ డీలర్ భయపడుతున్నాడంటే మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. బియ్యం గోడౌన్ నుంచి లారీ బయలుదేరగానే సంబంధిత అధికారులు ఆ వ్యక్తికి సమాచారం ఇస్తారు. వెంటనే ఆ వ్యక్తి తమ మాఫియా గణంతో ఆయా డీలర్లకు ఆదేశాలు జారీ చేస్తాడు. తమ వాహనాల్లో ఇన్ని బస్తాలు లోడు చేయాలని ఆదేశిస్తాడు. అతని మాట ఎవరైనా వినకుంటే రోజుల వ్యవధిలో అధికారులు ఆయా షాపుల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తారు. చేసేది లేక ఆ వ్యక్తి చెప్పినట్లుగానే లబ్ధిదారులకు బియ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా అతని వాహనాల్లో చెప్పినన్ని బస్తాలు లోడు చేసి పంపాల్సిందే. డిప్యూటీ తహసీల్దార్లపై ఆరోపణలు పేదలకు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సిన పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం అవినీతి కుంపటిలో కూరుకుపోయింది. కింది స్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 5,90,546 రేషన్ కార్డులున్నాయి. 972 డిపోల ద్వారా ప్రతి నెలా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతోపాటు పంచదార, గోధుమ పిండి సరఫరా చేస్తారు. మొదటి 15 రోజులు ఈ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. చాలా రేషన్ దుకాణాల్లో కొలతల వ్యత్యాసం ఉంటుంది. దీనిని సివిల్ సప్లైస్ అధికారులు పట్టించుకోరు. దానికిగాను కొన్ని రేషన్ దుకాణాల నుంచి ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. గతంలో వెస్ట్ డీటీ మొహమ్మద్ ఖాదర్ బాషాపై ఓ రేషన్ దుకాణదారుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈస్ట్ డీటీపైనా ఫిర్యాదులు అందాయి. ఇలా మరికొందరిపైనా నిత్యం ఏదో ఒక సమయంలో ఫిర్యాదులొస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉండగానే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కీ బోర్డుపై ‘గిన్నిస్’ రికార్డు 7జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మరేషన్ గోడౌన్ల నుంచి డీలర్లకు వచ్చే బియ్యం బస్తా ఒకొక్కటి 50 కిలోలు ఉండాలి. కానీ 40, కిలోలు, ఇంకా కొన్నింటిలో 35 కిలోలు ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. తమకు వచ్చే బియ్యంలోనే కోతలు వేసి, మళ్లీ టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న మాఫియాకు వారు అడిగినన్ని బస్తాలు పంపితే ఇక లబ్ధిదారులకు ఏ విధంగా రేషన్ పంపిణీ చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల నుంచి వచ్చే బస్తాల్లో తమ వాటాగా అధికారులు బస్తాకు పది కిలోలకుపైగా దోచుకుంటుంటే, మాఫియా కూడా తామేం తక్కువ కాదని బస్తాలకు బస్తాలు దోచుకుపోతున్నారు. మాఫియా సైతం కిలో రూ.16కు కొనుగోలు చేస్తోందని, ప్రజలకు ఇచ్చి మళ్లీ వారి వద్దే రూ.15 బియ్యం కొని మాఫియా అడిగినన్ని బస్తాలు ఇస్తున్నామని డీలర్లు వాపోతున్నారు. -
రాజరాజేశ్వరి దేవిగా మహంకాళి దర్శనం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠం రాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజుకు చేరాయి. శనివారం అమ్మవారికి సారెను మంచికలపూడి గ్రామస్తులు సమర్పించారు. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శంకర్ తదితర స్థానిక అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.రత్నకుమార్, కె.శ్రీధర్కుమార్లు ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్రశాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్.రాజేష్ ప్రభుకుమార్, సహాధ్యక్షుడిగా ఎన్.తిప్పేస్వామి, ఉపాధ్యక్షులుగా ఆర్బీవీ కృష్ణారావు, జి.రాంజీ అంబేడ్కర్, ఒ.చిట్టిబాబు, డీఎన్వీ కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కె.జగన్నాఽథ్, ఆర్.మధు వెంకటేశ్వరరావు, ఎస్పీ ప్రసన్నకుమార్, కె.సాయి ప్రకాష్, కోశాధికారిగా ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి.సూరజ్, బి. రవికుమార్, ఎస్.వెంకటేష్, కో ఆప్షన్ సభ్యుడిగా బీఆర్ అంబేడ్కర్ ఎన్నికయ్యారు. తెనాలిటౌన్: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వి.అనుపమ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. -
31 మంది టీడీపీ నాయకులపై కేసు
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలోని రైతుల గొడౌన్పై జరిగిన దాడి ఘటనలో 31 మంది టీడీపీ నేతలపై శనివారం కేసు నమోదు చేశారు. రబీలో మొక్కజొన్న సాగు చేసి మద్దతు ధర లేక... ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులైన దళారుల దోపిడీతో నష్టపోతున్న రైతులకు వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. రైతులకు ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తూ, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష చేశారు. మురళీకృష్ణపై బురద జల్లాలనే తలంపుతో రైతులు మొక్కజొన్న నిల్వ చేసుకున్న గోదామును మురళీకృష్ణకు చెందినదిగా చిత్రీకరించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర ప్రోత్సాహంతో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలు నిల్వ చేసుకున్న రైతు సుదా సముద్రయ్య, త్రివేణికి చెందిన గొడౌన్పై దాడి చేశారు. షట్టరు పగలగొట్టి అడ్డు వచి్చన రైతులపై విరుచుకుపడ్డారు. సముద్రయ్యపై దాడి చేసి గాయపరిచారు.అధికారులకు సమాచారమిచ్చి అక్రమ నిల్వలని తేల్చాలని ఒత్తిడి చేశారు. గొడౌన్ను సీజ్ చేయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జరిగిన నష్టం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దారు, రూరల్ పోలీసు స్టేషన్లో రైతు సముద్రయ్య ఫిర్యాదు చేయడంతో... టీడీపీ పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాల అధ్యక్షులు బండ్లమూడి బాబూరావు, వలివేటి మురళీకృష్ణ, మైలా వెంకటరాజుతోపాటు ముఖ్య నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బొర్రు రామారావు, ఆరె వరప్రసాద్, షేక్.బాజి సాహెబ్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, ఫైజుల్లా ఖాన్, బోయపాటి రామ్మోహన్, దర్శి భాస్కరరావుతోపాటు మరో 22 మందిపై రూరల్ ఎస్సై శ్రీహరి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
‘చంద్రబాబు బడాయి మాటలు తప్పితే చేసిందేమీ లేదు’
తాడేపల్లి : ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి మాటలు చెబుతూ మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రజలకు చేసేంది మాత్రం ఏమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ఒక్కో కాన్ఫరెన్స్ లో ఒక్కో అంశంపై బడాయి మాటలు చెప్పారు. కానీ ఈ ఏడు సమావేశాల్లో చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మోదీ కన్నా చంద్రబాబు పరిపాలనాదక్షుడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు ఇంకేం చేశారు?, ప్రపంచానికి పాఠాలు చెప్తాననే చంద్రబాబు మంత్రులు బృందాన్ని సింగపూర్ ఎందుకు పంపారు?, సింగపూర్లో స్టడీ చేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారా?, ఇప్పుడు ఆ హామీలన్నీ ఎగ్గొట్టి సింగపూర్ లో ఏం చేశారు?, ఎన్నికలకు ముందు చూపించిన మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడుంది?, ఈ రెండేళ్లలో ఒక్క పేదోడికీ గజం స్థలం కూడా ఇవ్వలేదు. వార్డు, గ్రామ సచివాలయాలను సర్వ నాశనం చేశారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడి పోతున్నారు. ఆరోగ్యశ్రీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమయ్యాయి?, సింగపూర్ పర్యటన కేవలం షికారు కోసమే. ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ చేయలేదు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. జగన్ హయాంలో జరిగినంత వేగంగా పనులు జరగటం లేదు. ఇచ్చిన డబ్బులు కూడా ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్రమే ప్రశ్నించింది. రాయలసీమ లిఫ్టును రేవంత్రెడ్డికి గిఫ్టుగా ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై మళ్ళీ అక్రమ కేసులు పెట్టటం దుష్ట సంప్రదాయం. ఎంతమందిని అరెస్టు చేసినా వెనక్కు తగ్గేదే లేదు. క్రిమినల్స్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సోషల్ మీడియా వాళ్ల మీద ప్రయోగిస్తారా?, వెలిగొండలో మంత్రి రామానాయుడు చాలా డ్రామాలు చేస్తున్నారు. ఫోటోలకు స్టిల్ ఇవ్వటం తప్ప ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. రెండేళ్లలో రైతులకు చెప్పుకోదగ్గ ఒక్క మేలు చేయలేదని మండిపడ్డారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.ఈరోజు(శనివారం, మే 9 వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కైలే అనిల్ కుమార్.. ‘ మోంథా తుపానుకు నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయశాఖ మంత్రి సింగపూర్లో విహరిస్తున్నారు. రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలి?, ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పంటల బీమా లేదు. చంద్రబాబు ఏడుసార్లు ఇప్పటివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి ఏం సాధించారు?, ఒక్క సమావేశంలోనైనా రైతుల గురించి చర్చించారా?, జగన్ తెచ్చిన వ్యవస్థల పేర్లు మార్పు కోసమే సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. రైతుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం.’ అని హెచ్చరించారు. -
చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ రాజ్ మాత్రమే నడుస్తోంది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారు. చంద్రబాబు బలం మీడియానే. మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని పొన్నవోలు మండిపడ్డారు. -
జల గరళం
కలుషితమవుతున్న గుంటూరు చానల్ నీరు ● పలు గ్రామాలకు తాగునీటి అవసరాలకు అవే దిక్కు ● వ్యర్థాలు, పూడిక, రసాయనాల చేరికతో ప్రజారోగ్యంపై ప్రభావం ● నిద్రావస్థలో నీటిపారుదల, ప్రజారోగ్య శాఖ అధికారులు శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026కృష్ణానది, కొండవీటి వాగు హెడ్ స్లూయిజ్ నుంచి గుంటూరు వరకు గుంటూరు చానల్ 47 కిలోమీటర్ల పొడవున ఉంది. కృష్ణా, పశ్చిమ డెల్టాలోని ఓ ముఖ్యమైన తాగునీటి వనరుగా మారింది. గుంటూరు చానల్ను పొడిగించాలని, ఆధునికీకరించాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఈ చానల్లో పలు ప్రాంతాల్లో మురుగు కలవడంతో నీరు కలుషితం అవుతోంది. కాలువను పొడిగించేందుకు అనేకసార్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ప్రస్తుత టీడీపీ సర్కారు కూడా పొడవు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ నిమిత్తం నిధులను కూడా కేటాయించింది.దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసిన మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. చిలువూరు గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకరగుంట ప్రాంతాలను పరిశీలించారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే సంప్రదాయం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన శుక్రవారం సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అలంకరణ, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11న ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మన్యుసూక్త సహిత చతుర్దశ కలశ స్నపన, అలంకారాలు, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, నివేదన, నీరాజనం, సాయంత్రం స్వామి వారి ఉష్ట్ర వాహనంపై గ్రామోత్సవం, 12న తెల్లవారుజామున విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత విశేష అభిషేకం, అలంకరణ, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 4గంటలకు నివేదన, నీరాజనం, తీర్థ్ధప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. రాత్రి సువర్చలా సమేత స్వామి వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 13న స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. – అఫ్రోజ్ఖాన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి – డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జీవితఖైదు గుంటూరు లీగల్/చిలకలూరిపేట టౌన్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి గుంటూరు పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాయపూడి మరియదాసు(57) బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. బాలికతో మరియదాసు అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. నిందితుడి ప్రవర్తన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అతడు తన వైఖరి మార్చుకోలేదు. దీంతో బాధితురాలి తల్లి నిందితుడి నుంచి దూరంగా నివసించడం ప్రారంభించింది. అనంతరం బాలిక చదువుతున్న పాఠశాలలో శక్తి టీం సభ్యులు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో బాలిక తనపై జరుగుతున్న వేధింపులను టీం సభ్యులకు వివరించింది. శక్తి టీం సభ్యులు బాలిక తల్లిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షేక్ షమ్మి పర్వీన్ సుల్తానా బేగం నిందితుడు రాయపూడి మరియదాసుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ అధికారులుగా సీఐ వి.సూర్యనారాయణ, ఎస్సై శివరామయ్య, కోర్టు కానిస్టేబుల్ ఎం.బాలాజీ నాయక్లు కేసు పురోగతికి సహకరించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. జిల్లాలో సగటు వర్షపాతం 4.1 మి. మీ. -
ఆగస్టులో ప్రత్యేక లోక్ అదాలత్
గుంటూరు లీగల్: సుప్రీంకోర్టులో ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. సమాధన్ సమరో 2026లో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావొచ్చని తెలిపారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–222448 లను సంప్రదించవచ్చునని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి -
ఈసెట్లో ప్రథమ ర్యాంక్ మనదే
గుంటూరు ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ విద్యార్హతతో బీటెక్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన ఏపీ ఈసెట్–2026 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 92.92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 23న రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అనంతపురం సంయుక్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాలో పరీక్షలు రాసిన 1,625 మంది విద్యార్థుల్లో 1,510 మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ బ్రాంచ్లో గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన అంగలకుదితి నాగ అపరాజిత భవానీ లక్ష్మీ శరణ్య రాష్ట్రస్థాయిలో 1వ ర్యాంకు కై వసం చేసుకుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్లో తెనాలి ఐతానగర్కు చెందిన ఆలూరి దుర్గా సిరి 7వ ర్యాంకు సాధించింది. ఆలూరి దుర్గా సిరి అంగలకుదితి నాగ అపరాజిత భవానీ లక్ష్మీ శరణ్య 92.92 శాతం ఉత్తీర్ణత -
13న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కార్యక్రమ ఇన్చార్జి అధికారి, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. ఈనెల 13న నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్న నేపథ్యలో వేదిక ప్రాంతాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. మయూర్ అశోక్ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ డెప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, డీసీపీ అశోక్కుమార్, రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాదరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, రూరల్ సీఐ వెంకట బ్రహ్మం, తహసీల్దార్ రాఘవేంద్ర పాల్గొన్నారు. -
‘ఆట’విడుపు.. మేలుకొలుపు
● క్రీడలకు పూర్తిగా దూరమవుతున్న నేటి బాలలు ● ఇకనైనా కన్నవారు మేల్కొంటేనే బంగారు భవిష్యత్తు ● ఆటల్లోనే చిన్నారులకు ఆనందం... ఆరోగ్యం ● ఏదోకటి ఆడితేనే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు ● వేసవిలోనైనా శిక్షణ శిబిరాల్లో చేర్చాలని వైద్యుల సూచన ● ఇప్పటికే వివిధ సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు బాల్యం ఒక అద్భుతం -
ఎస్బీఐ ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం
కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్– గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద ‘సైలెంట్ సిట్ ప్రొటెస్ట్‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్ సర్కిల్ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కేఆర్వీ జయకుమార్, వి.నరేంద్రకుమార్, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్, యూఎఫ్బీయూ అడ్వైజర్ పి.కిషోర్, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
నువ్వు నా దగ్గరకు రా... నేను చూసుకుంటాను..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘‘నిజాంపట్నం టీడీపీ జెడ్పీటీసీ నర్రా వెంకటసుబ్బయ్య తరచూ ఫోన్లు చేసి నా దగ్గరకు రా.. నేను ఉన్నాను.. చూసుకుంటాను.. అసలు నువ్వు నా మాట ఏదీ వినడం లేదు ఎందుకు? నీ కళ్లకు నేను కనపడడం లేదా? నువ్వు వస్తావా రావా ? అంటూ వేధిస్తున్నాడు. అతని ఫోన్ తీయడం లేదని వేరే వాళ్ల ఫోన్లతో కాల్స్ చేస్తున్నాడు. అతని వద్ద ఉండే గంగరాజు ఫోను నుంచి చేస్తున్నాడు. లేకపోతే గంగరాజుతో ఫోన్ చేయించి అమ్మాయి వస్తుందో లేదో కనుక్కో? అమ్మాయికి ఎంతకావాలో నా దగ్గరకు రావాలంటే అంటూ మాట్లాడుతున్నాడు.. ఈ వేధింపులు తట్టుకోలేకే పురుగుమందు తాగాను’’ అంటూ నిజాంపట్నంకు చెందిన ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. నిజాంపట్నంలోని ఓ మండల అధికారి కారణంగా తన భర్త దూరమయ్యాడని, ఆ అధికారి తనను నమ్మించి చర్చిలో పెళ్లి చేసుకుని.. ఇప్పుడు జెడ్పీటీసీ నర్రా వెంకటసుబ్బయ్యతో కలిసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో గురువారం అర్ధరాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.చెరుకుపల్లి ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత నియోజకవర్గంలో ఆయన అనుచరులే వేధింపులకు పాల్పడడాన్ని బాధితురాలి బంధువులు తప్పు పడుతున్నారు. నర్రా వెంకటసుబ్బయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : పోలీసుల ఏకపక్ష వైఖరి, సోషల్ మీడియా గొంతు నులుమే ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు హలో ఇండియా.. ఏపీలోని పోలీస్ వ్యవస్థ పనితీరును చూడమంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ‘రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణిచి వేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటి వాక్ స్వాతంత్య్రం. దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టికల్–19 లో పొందుపర్చారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైయస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు, సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి.Hello India !!!!!AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026 తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతూ, అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏ మాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్ట విరుద్ధంగా, కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు పట్టినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, పూర్తి ఏకపక్షంగా, కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు.అలా తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులు ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు ఇస్తుంది. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం, ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అని చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావం వల్ల పెల్లుబికుతున్న అసహనం. దాని వల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలు. ఆ దిశలో ప్రభుత్వ చర్యలు తేటతెల్లం అవుతున్నాయి. అదే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజూ వైయస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది.ఆ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది.వాటిపై విపక్ష వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు.ఆ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు, పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం, ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. అందుకే హేయమైన చర్యలు, అణిచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీస్లను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ.. మొత్తంగా అసమ్మతిని అణచి వేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలి’ అని డిమాండ్ చేశారు. -
అధికారుల ఉరుకులు పరుగులు
తాడికొండ: ‘పరిహారానికి పదేళ్లా’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. బాధితుడు చుండు నర్సిరెడ్డి, సోదరుడు చుండు వెంకటరెడ్డిలకు కలిపి ఉన్న 14 ఎకరాల భూమికి సంబంధించి సర్వే చేశారు. సర్వే రిపోర్టును అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ భూమికి సంబంధించి 1962 లోనే వారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని సుమారు 70 సంవత్సరాలుగా స్వాధీనంలో ఉంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి, 1956 ఈనాం యాక్ట్ చట్టం ప్రకారం రైతువారీ పట్టా ఉంది, ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని పంటలు పండించుకుంటూ ప్రతిఏటా పంట రుణం కూడా తీసుకుంటున్నారు. అయితే తమకు తెలియకుండా కనీసం నోటీసు ఇవ్వకుండా ఆన్లైన్లో భూమిని ఎలా తొలగిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో ఎందుకు తొలగించారంటే తహసీల్దార్ సైతం తమకు తెలియదంటున్నారని, ఒక్క వడ్డమాను గ్రామంలోనే ఈనాంకు చెందిన 100 ఎకరాలను ఆన్లైన్లో ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. పూలింగ్కు ఇచ్చిన 2 ఎకరాల కోళ్ల ఫారం పరిహారం విషయంలో ఇంకా అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తన భూమిని తనకి తిరిగి ఇచ్చేయాలని బాధితుడు కోరుతున్నాడు. బాధితుడి ఈనాం భూములకు సర్వే నిర్వహించిన రెవెన్యూ, సర్వే సిబ్బంది 1962 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తమ స్వాధీనంలోనే ఉన్నట్లుగా తెలిపిన బాధితులు -
ఘాటెక్కిన మిర్చి వాటాలు!
మిర్చి యార్డులో పాలకవర్గం, అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిర్చి యార్డులో భారీగా జరుగుతున్న జీరో వ్యాపారంపై వచ్చే నగదులో తమకు కూడా వాటా ఇవ్వాలని పాలకవర్గం పట్టుపడుతుండటం, దీనిపై గురువారం కార్యవర్గం సమావేశం కావడం యార్డులో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి కార్యదర్శి గైర్హాజరు అయ్యారు. ఎప్పుడుపడితే అప్పుడు సమావేశాలు పెడితే తాను రానని కార్యదర్శి చెప్పినట్లు పాలకవర్గ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కార్యదర్శి వైఖరిపై మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి మార్కెట్ యార్డుకు సెలవులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన డబ్బుల్లో తమ వాటా చెల్లించాల్సిందేనని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మిర్చి యార్డు కార్యదర్శి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బంధువు కావడంతో తమను అసలు లెక్క చేయడం లేదని పాలక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఖాతాకు గండి యార్డులో గత రెండేళ్లుగా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో యార్డుకు రావాల్సిన సెస్ రాకపోవడంతో ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఏడాదిన్నర తర్వాత పాలకవర్గం వచ్చినా అధికారులు మిర్చి యార్డుపై తమ పెత్తనం కొనసాగిస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ.కోట్లల్లో వ్యాపారం జరిగే ఇక్కడ సెస్ రూపంలో ఆదాయం కూడా ఎక్కువగానే రావాలి. కానీ ఇది యార్డ్ ఖాతాలో జమ కావడం లేదని పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలను పట్టించుకోకుండా మిర్చి కొనుగోలు చేస్తూ రైతులను ముంచేస్తున్నారు. మిర్చి యార్డులో జరుగుతున్న జీరో వ్యాపారం, దానిపై వచ్చే ఆదాయం విషయంలోనే అధికారులు, పాలకవర్గం మధ్య గొడవలు తలెత్తాయి. జీరో వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నో విధాలుగా... ఇదే కాకుండా బిల్ టు బిల్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. మిర్చి యార్డులో రైతులు, ఎగుమతి వ్యాపారులకు మధ్యవర్తిత్వం చేసి కోనుగోళ్లు జరపడానికి కమీషన్ ఏజెంట్లు పని చేస్తుంటారు. రైతులకు కొనుగోలు చేసిన రోజే డబ్బులు చెల్లిస్తారు. వీరు మార్కెట్ యార్డు నుంచి లైసెన్స్ కలిగి ఉంటారు. లైసెన్స్ లేనివారు ఇప్పటికే ఉన్న వారి పేరుతో వ్యాపారం చేస్తూ వాస్తవంగా వసూలు చేయాల్సిన రెండు శాతానికి బదులుగా రెట్టింపు తీసుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న వేమెన్లు, సూపర్వైజర్లు, యార్డు యంత్రాంగానికి కాసుల వర్షం కురుస్తోంది. బిల్ టు బిల్ విధానానికి సహకరించినందుకు బస్తాకు రూ.పది వరకూ వసూలు చేస్తున్నారు. యార్డులో వచ్చే అవినీతి డబ్బుల కోసం పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య రచ్చ జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విజిలెన్స్ శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
నగరంపాలెం: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. గురువారం స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించారని అన్నారు. అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు సేవా భావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), పోలీస్ కార్యాలయ ఏఓ ఎం.వసంతరావు, ఏఏఓ జగన్నాథ రావు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్జీరంగా వర్సిటీలో అల్లూరికి నివాళి గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో గురువారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ, బయో టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ పి ఆనంద్కుమార్లు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ అల్లూరి స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం చేసిన త్యాగాలు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ తెగువ, నిబద్దత, దేశభక్తికి అల్లూరి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఎంవీ రమణ, కంప్ట్రోలర్ డాక్టర్ బి ముకుందరావు, పీజీ డీన్ డాక్టర్ పీ మునిరత్నం, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ డి సంపత్కుమార్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ జి కరుణసాగర్, లైబ్రెరియన్ డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, పాలిటెక్నిక్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేవ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ పీ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్
తెనాలిరూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. తెనాలి మార్కెట్ యార్డు వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో త్రీ టౌన్ ఎస్ఐ షేక్ కరిముల్లా, సిబ్బంది గురువారం రాత్రి దాడులు నిర్వాహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఊట్ల భార్గవ్, మరో వ్యక్తి ‘లేసర్ 247’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వీరికి గూగల్ పే, ఫోన్పే ద్వారా నాగేశ్వరరెడ్డి, లక్ష్మీ చెన్నరెడ్డి, రామ, గుణ పవన్, రామకృష్ణ, అతని సోదరుడు, యశ్వంత్, భార్గవ్రెడ్డి, వివేక్రెడ్డి నగదు బదిలీ చేసి బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు గుర్తించారు. బెట్టంగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఎనిమిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. -
15 నుంచి రంగస్థల నటనాభినయ ప్రత్యేక శిక్షణ శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్ భావితరాలకు భారతీయ రంగస్థల కళా వైభవాన్ని తెలియజేసే విధంగా ‘భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‘ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రంగస్థల నాటనాభినయ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. గురువారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో వర్క్షాప్ ఆన్ థియేటర్ ఆర్ట్ పోస్టర్లు ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ గుంటూరు నగర యువత, విద్యార్థులతోపాటు ఔత్సాహికులకు రంగస్థల నటన, ముఖాభినయం, గాత్ర, ధ్వని అనుకరణ కళ, నాటక సృజనాత్మకత, నైపుణ్యతపై లబ్ద ప్రతిష్టులైన రంగస్థల నిపుణులు, నంది పురస్కార గ్రహీతలతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయా కళల్లో శిక్షణ పొందదలచిన అభ్యర్థులు రోజుకు మూడు గంటలు చొప్పున నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో శిబిరంలో పాల్గొనేందుకు 0863–2234802, 9124519444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ ఎన్.రవికుమార్, రంగస్థల నటుడు, రచయిత కందిమళ్ల సాంబశివరావు, హిందూ కళాశాల పూర్వ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గాప్రసాద్, పూర్వ తెలుగు విభాగాధిపతి డాక్టర్ వై.మల్లికార్జునరావు, రవిశంకర్, సీరియల్ నటులు ముత్తవరపు పద్మారావు, మల్లెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
రోడ్లపైనే నేలకొరిగిన వృక్షాలు తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి రూరల్ పెనుమాక, ఉండవల్లి, పట్టణ పరిధిలోని నులకపేట, ప్రకాష్నగర్, డోలాస్నగర్, శర్మ డాబా ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వెళ్లే పాత జాతీయ రహదారి వెంబడి శర్మ డాబా వద్ద నుంచి ప్రకాష్నగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వర్షం తగ్గిన తరువాత ఈ రహదారిలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా కార్పొరేషన్ సిబ్బందితో జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలను తొలగింపజేశారు. 2 కి.మీ. వ్యవధిలో పలుచోట్ల భారీ వృక్షాల కొమ్మలు తొలగించడానికి 2 గంటల సమయం పట్టింది. వాటిని తొలగించే క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోయి, ద్విచక్రవాహనాలు సైతం కార్పొరేషన్ సిబ్బంది అనుమతించలేదు. గాలివానకు ఎగిరిపడిన రేకులు మంగళగిరి టౌన్ : మంగళగిరిలో గురువారం అకాల వర్షం కురవడంతో మండల పరిధిలోని యర్రబాలెం గ్రామంలో ఓ ఇంటి రేకులు ఎగిరి వీధిలో పడ్డాయి. హఠాత్తుగా వీచిన భారీ ఈదురు గాలుల వల్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. రేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిలువ నీడను కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన వై.హర్ష (20) వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6.30 సమయంలో తన స్నేహితుడైన నిఖిల్ సిద్ధార్థతో కలసి ద్విచక్రవాహనంపై తాడేపల్లి వస్తుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద నిఖిల్ సిద్ధార్థ అతివేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీకొనడంతో నిఖిల్ సిద్ధార్థ నడుపుతున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో హర్ష డివైడర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై హర్ష చెల్లి శ్రీ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అపర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చిన్నారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో జరిగిన 5వ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్షిప్ పోటీలకు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన 26 మంది క్రీడాకారులు హాజరయ్యారని అకాడమీ నిర్వాహకుడు కాశీనాఽథ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు అకాడమీ క్రీడాకారులకు మూడు బంగారు, ఐదు రజతాలు, 14 మంది కాంస్య పతకాలతో సహా మొత్తం 22 పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. తమ అకాడమీ ద్వారా ఇప్పటికే ఎంతోమంది జాతీయస్థాయి పోటీలకు హాజరై ఎన్నో మెడల్స్ సాధించారన్నారు. రానున్న రోజుల్లోనూ జాతీయస్థాయి పోటీలకు కూడా ఇదే స్థాయిలో ఎక్కువమంది ఎంపికయ్యేలా శిక్షణ ఇస్తామన్నారు. -
అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిషు పాలకులను ఎదురించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మరుపురానిదని, స్వాతంత్య్రం పొందడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి తన పోరాటపటిమతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని కొనియాడారు. అల్లూరి వంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని చెప్పారు. అల్లూరి ఆశయ సాధనకోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలన అధికారులు రాజా రత్నం, ఉమా సుమంత్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చిలువూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మ వారికి సారె సమర్పించారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. కొరిటెపాడు(గుంటూరు): స్పైసెస్ బోర్డు ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సంగీత విశ్వనాథన్ గురువారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి యార్డులో రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ప్రస్తుత మిర్చి వ్యాపార పరిస్థితులు, నాణ్యత పరిరక్షణ చర్యలు, ప్రాసెసింగ్ విధానాలు, మిర్చి ఎగుమతులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యార్డు అధికారులు, వ్యాపార వర్గాలతో అభిప్రాయాలు పంచుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచే దిశగా స్పైసెస్ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ముందుగా సంగీత విశ్వనాథన్ను యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు సభ్యుడు కొత్తూరి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, పలువురు యార్డు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తొలిరోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవం జరిపారు. స్వామి వారి భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక అంశాలను కళాకారులు ప్రదర్శించారు. -
రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలి
తాడికొండ: రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలని సీఆర్డీయే కమిషనర్ వి విజయరామరాజు అన్నారు. భూసేకరణ కార్యకలాపాలలో భాగంగా రాయపూడి, నేలపాడు గ్రామాలలో ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, ఎల్పీఎస్ జోన్లు, పలు అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్ ) చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానందున పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ తెలిపారు. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున రాజధాని గ్రామాల రైతులు అధికారులకు సహకరించాలన్నారు. గ్రామ కంఠాల, లంక భూముల వ్యవహారంపై రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నా ఎలాంటి హామీ లభించలేదు. మా సమస్యలు తీర్చితే ఇస్తామని పలువురు బాధితులు మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు ఏభార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్ వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కెఎస్ భాగ్యరేఖ, బి సాయి శ్రీనివాస నాయక్ ఇతర సీఆర్డీయే అధికారులు పాల్గొన్నారు. -
ఏఎన్యూ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ పరిధిలో జరిగిన ఎంబీఎ ఇంటర్నేషన్ బిజినెస్, ఎల్ఎల్బీ, ఎంపీఈడీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫిబ్రవరిలో జరిగాయి. ఈ పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 46 మంది ఉత్తీర్ణులయ్యారు. 2025 నవంబరులో జరిగిన ఎల్ఎల్బీ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు, 2025 డిసెంబరులో జరిగిన ఎంపీఈడీ మూడవ సెమిస్టర్ రీవాల్యేషన్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సీఈ తెలిపారు. క్యాష్ డిపాజిట్ చేస్తామంటూ మోసం తెనాలిరూరల్: ఏటీఎం సెంటరులోని క్యాష్ డిపాజిటట్ మెషిన్లో డబ్బు వేసేందుకు వెళ్లిన వ్యక్తి మోసం చేసి రూ. 50 వేలు తీసుకెళ్లిన ఘటన తెనాలిలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి తన కుమారుడి చదువు అవసరాల కోసం ఏటీఎంలో నగదు జమ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సహాయం చేస్తామంటూ అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్టు నమ్మించారు. అనంతరం చాకచక్యంగా రూ.50 వేల నగదును తీసుకుని పరారయ్యారు. మోసపోయిన విషయం గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. ఏటీఎంలోని సెక్యూరిటీ గార్డు అని భావించి బాధితుడు మోసపోయినట్టు సమాచారం. రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి తెనాలిరూరల్: రైలు నుండి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి–విజయవాడ రైలు మార్గంలోని చిలువూరు స్టేషన్కు కిలోమీటరు దూరంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి గురువారం వెళ్లారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎరుపు టీషర్టు, ఎరుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
ఉద్యోగుల పోరుబాట
ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనాపాలన, పాఠశాల నిర్మాణం .. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సత్తెనపల్లి: జిల్లాలో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం. విద్యాశాఖ కార్యకలాపాలు అనేకం వీరి సేవలతోనే కొనసాగుతున్నాయి. అటువంటి ఉద్యోగులు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి సుమారు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 373 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. విసిగిపోయి.. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా డిమాండ్లను విస్మరించారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి మహా పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు. అందిస్తున్న సేవలివీ... మండల విద్యా వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కార్యాలయం నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) నిలుస్తారు. వారికి కేర్వింగ్ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్, పీఈటీ, తదితర విధుల నిర్వహణలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీరు పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ● ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి. ● రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ● హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ● మినిమం టైం స్కేల్, ఇంటి అద్దె, కరువు భత్యం ఇవ్వాలి. ● రూ. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. ● ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● వేతనంతో కూడిన మెడికల్ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలి. ● మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి. ● కారుణ్య నియామకాలు చేపట్టాలి. ● డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి. -
పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితోదాడి
చిలకలూరిపేటటౌన్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ సమీపాన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుభానినగర్కు చెందిన తాపీమేస్త్రి అయిన షేక్ జానీబాషా గుర్రాల చావిడికి చెందిన వెల్డింగ్ వర్కర్ బషీర్ల మధ్య గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ సమీపంలో గురువారం సాయంత్రం టీ తాగుతున్న క్రమంలో బషీర్ కత్తితో దాడి చేశాడు. బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా పలుచోట్ల కత్తితో పొడిచాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. రక్తస్రావం తీవ్రంగా కావడంతో బాధితుడు బాషాను తొలుత స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు బషీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అత్త ఇంట్లో దొంగతనం చేసిన అల్లుడు
చేబ్రోలు: భార్య పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలు గడిచినా తిరిగిరాకపోవటంతో ఓ అల్లుడు అత్త ఇంట్లోనే చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో జరిగింది. చేబ్రోలు పోలీసుస్టేషన్లో పొన్నూరు రూరల్ సీఐ పి కృష్ణయ్య, స్థానిక ఎస్ఐ పి వీరనారాయణ గురువారం వివరాలను వెల్లడించారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల గోపికి వేజండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మతో 2010లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మద్యానికి అలవాటు పడిన గోపి భార్య మీద అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధలు భరించలేక నాలుగు నెలల కింద తిరుపతమ్మ వేజండ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పేకాట, మద్యానికి డబ్బులు అవసరమై, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గోపి వేజండ్లలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఐదు రోజుల కిందట భార్య తిరుపతమ్మతోపాటు వారి అత్త కలిసి ధూళిపాళ్లలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి వెళ్లారు. 4వ తేదీన వేజండ్లలోని అత్త ఇంటికి వచ్చిన అల్లుడు గోపి ఇంటిలో ఎవరూ లేకపోవటంతో తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి అందులోని బంగారు, వెండి వస్తువులను అపహరించుకొని పారిపోయాడు. సుమారు రూ.9 లక్షల విలువ చేసే బంగారు హారం, నెక్లెస్, చైన్లతో పాటు ఒక జత వెండి కాళ్ల పట్టీలను తీసుకువెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించిన తిరుపతమ్మ చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కొత్తరెడ్డిపాలెం అడ్డరోడ్డు వద్ద నిందితుడు సాతర్ల గోపిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. త్వరతగతిని కేసును చేధించిన చేబ్రోలు ఎస్ఐ పి.వీరనారాయణ, సిబ్బందిని ఎస్పీ వకుల్ జింధాల్, తెనాలి డీఎస్పీలు అభినందించారు. రూ.9లక్షలు విలువచేసే బంగారు, వెండి నగల అపహరణ -
సర్కారు మద్దతే లేదయా..
నేలతల్లిని నమ్ముకున్న కర్షకుడి కంట చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కన్నీరే మిగిలింది. రెండేళ్లుగా ఏ పంట వేసిన కనీస మద్దతు ధర మాటలకే పరిమితం కావడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమ గోడు చెప్పుకొనే దిక్కు లేక.. దయ లేని పాలకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణా డెల్టా ప్రాంతమంటే పంటలు పండించడంలో ఎంతో పేరుంది. కానీ రెండు సంవత్సరాల నుంచి రైతులు నష్టాలపాలవుతున్నారు. అయినప్పటికీ నేల తల్లిని నమ్ముకున్న అన్నదాతలు ఇప్పుడైనా కలిసి రాకపోదా.. అనే ఆశతో సాగు కొనసాగిస్తూనే ఉన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను పండించిన వారికి ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన తప్పడం లేదు. భూమి కలిగిన రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంట చేతికి రాగానే గ్రామాల్లో అప్పులు ఇచ్చిన వారితోపాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు నగదు కోసం అడగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట విక్రయించి బాకీలు తీరుద్దామన్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి మద్దతు ధరకు కొనుగోళ్లు లేకపోవడంతో దళారులకు అయినకాడికి అమ్మేస్తున్నారు. పెట్టుబడులు కూడా రాని దైన్యం మంగళగిరి ఒక్క నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న పంటలను వేలమంది రైతులు కౌలుకు తీసుకుని పండించారు. గతంలో వరి 70 కేజీల బస్తా రూ.1,900 నుంచి రూ.2,100 ఉంది. ప్రస్తుతం దాని ధర రూ. 1,250 నుంచి రూ. 1,350 పలుకుతోంది. బస్తాకు రైతు సుమారు రూ.700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నాడు. ఎకరానికి 40 బస్తాలు దిగుబడి ఉంటే సగటున రూ.28 వేల నుంచి రూ.32 వేలు నష్టం వాటిల్లుతోంది. గతంలో మొక్కజొన్న రూ.2,600 ఉండగా ప్రస్తుతం క్వింటా రూ. 1,700 ఉంది,. బస్తాకు రూ.900 వరకు రైతులు నష్టపోతున్నారు. ఎకరానికి 35 బస్తాలు పండిస్తే రూ. 31,500 నష్టమే మిగులుతోంది. జొన్న గతంలో రూ. 2,400 ఉంటే ప్రస్తుతం రూ.1,500 ఉంది. క్వింటా బస్తాకు రూ.900 నష్టపోతున్నారు. అంటే ఎకరానికి 35 బస్తాలు అయితే రూ. 31,500 నష్టం తప్పడం లేదు. దీంతో ప్రతి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇక బతుకు ‘సాగే’దెలా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేనే మూడు ఎకరాలలో మొక్కజొన్న పంట వేశాను. ఎరువుల నుంచి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు అన్ని విషయాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.2,400 ప్రకటించినా నేటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు లేకుంటే రైతులకు అస్సలు ఏమీ ఖర్చులు కూడా రావు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. లేదంటే దళారుల వల్ల రూ.900 నష్టంగా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. – కొండూరి అబ్రహం, దుగ్గిరాలగ్రామంలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఎకరం కౌలు రూ.40 వేలు చెల్లించాలి. కొంత డబ్బును వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుగా తీసుకున్నా. కొనుగోలు కేంద్రాలు లేవు, గిట్టుబాటు ధర ఊసే లేదు. ఏమీ తోచని పరిస్థితి. దళారులకు అమ్మితే క్వింటాకు రూ.900 వరకు నష్టపోవాల్సి వస్తోంది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాలి. ఎరువులు కోసం ఎన్నో కష్టాలు పడి మరీ వ్యవసాయం చేశాం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – సిద్దాబత్తుని ఆంజనేయులు, దుగ్గిరాల -
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ లేఖలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పలు అంశాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖలు రాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ లెవల్ ఆఫీసర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని లేఖ రాశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కోసం ఉపయోగించే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్లో అందించాలని మరొక లేఖ రాశారు.ఎస్ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరో లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున బీఎల్ఎ ల నియామకానికి సంబంధించిన ఫారాలను ఈఆర్వోలు స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు. -
‘జావా డిస్కవర్’ పరువు పాయే.. ఆ డాక్యుమెంటరీ తొలగింపు
సాక్షి, తాడేపల్లి: తప్పుడు కథనం ప్రసారం చేసి పరువు పోగొట్టుకున్న జావా డిస్కవర్.. వెనక్కి తగ్గింది. ఆ ఛానల్.. ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించింది. డాక్యుమెంటరీలో జగన్ ఫోటోని ఆ ఛానల్ తప్పుగా చూపించగా.. దీనిపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్సార్సీపీ నోటీసులు పంపింది. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండల్స్ పుస్తకం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే, జర్నలిస్ట్ సుధాకర్రెడ్డి రాయని అంశాన్ని జావా డిస్కవర్ ఛానల్ ప్రస్తావించింది. ఆ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుధాకర్రెడ్డి.. లీగల్ చర్యలకు దిగారు. తప్పు తెలుసుకున్న ఆ ఛానల్ డాక్యుమెంటరీని తొలగించింది. వైఎస్ జగన్ పై తప్పుడు ట్రోల్స్ చేసి టీడీపీ అభాసుపాలైంది.ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ను ఇరికించేందుకు పచ్చ పార్టీ కుట్రలు పారలేదు. తప్పుడు కథనాలు చేసిన జావా డిస్కవర్ ఛానల్.. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీని మార్చడంతో పాటు వక్రీకరించింది. 2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ఉడుముల సుధాకర్ రెడ్డి పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే తాను చెప్పని.. పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రవీంద్రనాథ్ ఠాగూర్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2026 -
పవన్ కళ్యాణ్ శాఖకి చిట్ట చివరి ర్యాంక్
సాక్షి, విజయవాడ: పనీతీరు ర్యాంకుల్లో పవన్ కల్యాణ్ వెనుకబడ్డారు. ఆయన శాఖకి చిట్ట చివరి ర్యాంక్ లభించింది. కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ర్యాంక్లలో అటవీ, పర్యావరణ శాఖ చివరి స్థానానికి పడిపోయింది. శాఖల వారీగా ర్యాంకులను ప్రకటించగా... కీ పెర్ఫార్మెన్స్ ఇండికెటర్ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.ఏబీసీడీగా ర్యాంకులను వర్గీకరించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖకి ప్రథమ స్థానం లభించింది. 67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ, పర్యావరణ శాఖ నిలిచింది. 90 శాతం పైగా పాయింట్లతో 18 శాఖలు నిలిచాయి. -
నేటి నుంచి మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 49 వారికోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో కె.సునీల్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఐదు రోజులపాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు అమ్మవారికి విశేష అలంకారాలు, విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీన చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరులలో గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: ముస్లిం విద్యార్థులను ప్రోత్సహించేందుకు వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్(ఐఐటీ–జేఈఈ మెయిన్స్, ఎన్ఈఈటీ, ఎంసెట్) అందించనున్నట్లు వివరించారు. 250 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాల కోసం 6303325356, 8978452495 సంప్రదించాలని కోరారు. తెనాలి: తెలంగాణ సారస్వత పరిషత్ ముద్రించిన బాల సాహితీ కథా సంకలనంలో పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీంజాని రచన ‘ప్రగతి పథం’ కథ ప్రచురితమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 180 కథలు రాగా వాటిలో ఎంపిక చేసిన 70 కథలతో ‘బాలసారస్వతం’ పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. వాతావరణ, జల కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలి, భూగర్భ జలాల్ని ఎలా పెంచుకోవాలి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి యువత ఎలా దోహదపడాలనే అంశాలపై ఈ కథనం రాశారు. హకీంజాని ఇప్పటి వరకు పిల్ల్లల కోసం 36 పుస్తకాలు, 290 కథలు రచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం హకీంజాని కథలను 2019లో 11వ తరగతికి, 2020లో 12వ తరగతికి పాఠ్యాంశాలుగా ప్రచురించింది. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్ర చెస్ అసోసియేషన్, గుంటూరు చెస్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు 8వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రవీంద్ర రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని ఐడీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం రూ.50,000 నగదు బహుమతులు, మొమెంటోలు, సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లోని వారికి ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 99481 98809 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
పవర్లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: చైనాలో జరిగే పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు భారత్ తరఫున గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. స్ధానిక జిమ్లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరిగే సబ్ జూనియర్ అండ్ జూనియర్(మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు మహిళా పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని, క్రీడాకారులు బుధవారం భారతదేశం నుంచి పోటీలకు బయలుదేరి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న మహిళా పవర్ లిఫ్టర్లు ఎం. షానూన్ 47 కేజీల విభాగం, జూనియర్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్, ఇ.ఎల్. వినయశ్రీ 84 కేజీల విభాగం, సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, నాగం జ్ఞాన దివ్య +84 కేజీల విభాగం,జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో తలపడనున్నారని వివరించారు. -
భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
కేవీకే శాస్త్రవేత్త గంగాదేవి చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయి పేటెంట్ లభించినట్లు ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిశోర్ బుధవారం తెలిపారు. వీసీ మాట్లాడుతూ విజ్ఞాన్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రతిపాదించిన పరిశోధనకు ఈ పేటెంట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పోర్టబుల్ సాయిల్ ఫెస్టిసైడ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ కిట్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ సంస్థ పేటెంట్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పేటెంట్కు 20 సంవత్సరాలపాటు హక్కులు ఉంటాయని వివరించారు. ఈ కిట్ వ్యవసాయ భూముల్లో పురుగు మందుల అవశేషాలను తక్షణమే గుర్తించి విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని వివరించారు. బయోటెక్ విభాగానికి చెందిన డాక్టర్ కే చంద్రశేఖర్(హెచ్–ఇండెక్స్–43), ఫార్మసీ విభాగానికి చెందిన డాక్టర్ మిథున్ రుద్రపాల్(హెచ్–ఇండెక్స్–36) స్కోపస్లో అత్యుత్తమ హెచ్–ఇండెక్స్ను సాధించినట్లు చెప్పారు. జాతీయ స్థాయి పేటెంట్ సాధించిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్, అలాగే ఉత్తమ హెచ్–ఇండెక్స్ సాధించిన డాక్టర్ మిథున్ రుద్రపాల్, డాక్టర్ కె.చంద్రశేఖర్లను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిశోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావులు అభినందించారు. -
మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
మేడికొండూరు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు అన్నారు. మేడికొండూరు మండల పరిధిలోని జంగంగుంట్ల పాలెంలో మొక్కజొన్న రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొక్కజొన్నలను గ్రామాల్లోకి తమ ఇంటి వద్దకు వచ్చి కొనుగోలు చేసే వారని రైతులు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేవారని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ఈ క్రాప్ చేసిన తర్వాత గిట్టుబాటు ధరకు కేంద్రానికి లెటర్ రాయాలని రైతులకు కలబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.2,400లకు రైతుల వద్ద కొనుగోలు చేయకపోతే రాబోయే రోజులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. అదేవిధంగా మేడికొండూరులో పంట కొనుగోలుపై స్పష్టత కొరవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ధరలు నేలచూపు రబీలో కష్టపడి పండించిన మొక్కజొన్న పంట విక్రయానికి రైతులు ఎదురుచూస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడంతో ధరలు నేల చూపు చూస్తున్నాయని వాపోతున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మేడికొండూరు మండలంలో 1,295 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు ఎకరానికి 45 నుంచి 50 క్వింటాలు వరకు దిగుబడి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికే 90 శాతం కోతలు పూర్తయినా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి వంశీకృష్ణ, రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి ఆవుల రమణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, బొడ్డు పెద్ద సాంబయ్య, బొడ్డు చిన్న సాంబయ్య, ఆమతి రాఘవరావు, సాంబిరెడ్డి, రవికృష్ణ, రవికిషోర్రెడ్డి, అచ్యుతరామయ్య, షేక్ రబ్బాని, ఉడత శ్రీనివాసరావు, అబ్బాస్, కొరివి చెన్నయ్య, కొరివి కిషోర్, తమనపల్లి శాంతయ్య, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, లుర్డు రాజు, నోసిన కోటేశ్వరరావు, షేక్ జిలాని, షేక్ బుడే, మక్బూల్, ఆలూరి శ్రీనివాసరావు, జగదీష్, సూర్యనారాయణ రెడ్డి, డేవిడ్, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రతినిధుల బృందం సందర్శన
తెనాలి: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం ప్రతినిధి బృందం తెనాలి చెంచుపేటలో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని జిల్లా సత్వర చికిత్సాలయం (డైక్) సెంటర్ను సందర్శించింది. ‘రాష్ట్రీయ బాల స్వస్థ’ కార్యక్రమం అమలుపై పరిశీలనకు నాలుగురోజులపాటు ఈ బృందం షెడ్యూలును నిర్ణయించింది. తొలిరోజున గుంటూరును సందర్శించింది. రెండో రోజైన బుధవారం తెనాలి ‘డైక్’ను పరిశీలించింది. అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ నేతృత్వంలోని బృందం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు ప్రధాన అంశాలపై సమీక్షించారు. పిల్లల పుట్టుకలో లోపాలు, వ్యాధులు, కొరతలు, ఎదుగుదల లోపాలు, వైకల్యం అంశాలను ముందుగా గుర్తించటంపై సమీక్షించారు. రిఫరల్ మెకానిజం బలోపేతం చేయటం ద్వారా నిర్ణీత సమయాల్లో పరిశీలన చేయటం, ‘డైక్’ ద్వారా మెరుగైన సేవలను అందించటం, క్షేత్రస్థాయి సవాళ్లపై చర్చించారు. అధికారుల సమన్వయం, నివేదించటంపై తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, ‘డైక్’ పీడియాట్రిషన్ డాక్టర్ మధుబాబు, డైక్ మేనేజరు శిరీష తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఉద్యోగిపై పోలీసుల దాడి హేయం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ కార్యాలయ ఆఫీస్ సబార్డినేట్ పై నగరపాలెం పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఆర్ఎస్ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సదరు పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, డీఆర్వోలకు వినతిపత్రం అందజేసారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో (ఆఫీస్ సబార్డినేట్) వాచ్మెనన్గా పని చేస్తున్న జి.సురేష్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సురేష్ తాను కలెక్టరేట్ వాచ్మన్ అని, విధులకు ఆలస్యమవుతుందని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని, ఈ క్రమంలో బైక్ ముందుకు నడుపుతుండగా ఏఎస్ఐ కాలికి టైరు ఆనుకుందని వివరించారు. వెంటనే అక్కడ సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ లాఠీతో సురేష్ చెవిపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైందని, సురేష్ చేతిలో ఉన్న ఫోన్, బైక్ లాగేసుకుని పంపించేసారన్నారు. వెంటనే కలెక్టరేట్ ఏఓకి సమాచారం అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. సహచర ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్యలు ఎంతమాత్రం తగవని, ఇవి ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతాయని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని కలెక్టరేట్ ఉద్యోగస్తులు విస్తుపోతున్నారన్నారు. కొందరు పోలీస్ అధికారుల దుందుడుకు చర్యలు మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డపేరు తెస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై దాడులను ఏపీఆర్ఎస్ఏ సహించబోదని స్పష్టం చేశారు. గాయపడిన సురేష్కు పూర్తి వైద్యం అందించాలని, దాడికి పాల్పడిన కానిస్టేబుల్పై, అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐల పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, రాష్ట కార్యదర్శి దివ్య దుర్గాదేవి, సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని జేసీకి ఉద్యోగ సంఘాల ఫిర్యాదు -
హనుమజ్జయంతి వేడుకలకు ఏర్పాట్లు
తాడేపల్లి రూరల్: ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు బుధవారం పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో 10వ తేదీ ఉదయం సంపూర్ణ సుందరకాండ పారాయణ, 11న ఉదయం 9 గంటలకు శ్రీ దాసాంజనేయ స్వామి వారికి అభిషేక మహోత్సవం, మన్యుసూక్త హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాదగోష్టి కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న ఉదయం 9 గంటలకు యోగాంజనేయ స్వామి వారికి నవకలశ స్నపనం, విశేష అలంకరణ, 27 అడుగుల ఏకశిల శ్రీ విఘ్న విమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో విశేష సహస్రనామార్చన నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్చాలీసా పారాయణ, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. మూడు రోజులు కై ంకర్యాలు జరుగుతాయని, పుష్ప కై ంకర్యానికి రూ. 11,000, ప్రసాద కై ంకర్యానికి రూ. 5,000, ఉత్సవ కై ంకర్యానికి రూ. 3000గా నిర్ణయించామని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. -
హోరాహోరీగా ఎడ్లబండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. -
రేపటి నుంచి మిర్చి యార్డుకు సెలవులు
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం నుంచి జూన్ 6 వరకు వేసవి సెలవులు ఉంటాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా మిర్చి ఎగుమతి, దిగుమతి షాపుల కార్మిక సంఘాలు, మిర్చి యార్డు కాపలా వర్కర్స్ యూనియన్, ది గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రైతుల మిర్చి బస్తాలను గురువారం వరకే యార్డులోకి అనుమతిస్తామని తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి యార్డులో యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వివరించారు. -
సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మగుంటూరు వెస్ట్: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ ఆకాంక్షించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందరిరం నుంచి విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 8 నుండి 12 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి హాజరు కావాలని స్పష్టం చేశారు. 20 రోజులపాటు జరిగే స్టడీ అవర్స్లో విద్యార్థి ఏ విభాగంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించాలని, మంచి తర్ఫీదు అందించి వారిలో విజ్ఞాన తృష్ణ పెంచడంతో పాటు సమర్ధత పెంచాలన్నారు. ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రద్ధ వహించాలని చెప్పారు. విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినా, ఉపాధ్యాయులు అందరూ బాధ్యత వహిస్తారని హెచ్చరించారు. పదవ తరగతిలో తప్పిన విద్యార్థులు అందరూ సప్లిమెంటరీ పరీక్షలలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రతి చిన్నారి ఒకటవ తరగతికి ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది అంచనాల మేరకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన చిన్నారులు 22,672 మంది ఉన్నారని, అయితే కనీసం 12,470 మంది పిల్లలను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మంగళగిరి, గుంటూరు, తెనాలి, కొల్లిపర, చేబ్రోలు మండలాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుండి ఐదు సంవత్సరాలు నిండి బయటకు వస్తున్న చిన్నారులు 10,679 మంది ఉన్నారని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త, ప్రధాన ఉపాధ్యాయుడు సమన్వయం చేసుకోవడం ద్వారా ఆ చిన్నారులు అందరిని ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఈఓ డా.షేక్ సలీం బాషా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన పాల్గొన్నారు. -
శనగ రైతుకూ
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇదీ గుంటూరు జిల్లాలో శనగ రైతుల పరిస్థితి. రబీ సీజనులో దిగుబడులు చేతికొచ్చాయి. బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో సేకరణ నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం శనగకు మద్దతు ధర క్వింటాకు రూ.5,875 గా ప్రకటించింది. మార్కెట్లో మాత్రం రూ.4,800 నుంచి రూ.5,000 మధ్యే ధర పలుకుతోంది. పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాఫెడ్ కొనుగోళ్లు పరిమితంగా ఉండటంతో ఎక్కువ మంది దళారులు, ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్ళూరు తదితర మండలాల్లో ఈ ఏడాది గణనీయంగా శనగ పంట సాగైంది. వర్షాలు అనుకూలంగా ఉండటంతో దిగుబడులు బాగానే వచ్చాయి. ధర లేకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ క్వింటా కనీస మద్దతు ధర రూ.5,875కు తొలిదశలో 5,600 మెట్రిక్ టన్నులను సేకరించింది. కోటా పూర్తయిందని కొనుగోళ్లు నిలిపేసింది. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండటం, జిల్లాలో 55 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తే అందులో కనీసం 10 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. అంతేకాకుండా నమోదు ప్రక్రియ ఆలస్యం కావడం, గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడం, తేమ శాతం, నాణ్యత పేరుతో శనగలు కొనకుండా తిరస్కరించడం వంటి చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నామమాత్రంగా కొనుగోలు.. గుంటూరు జిల్లాలో రబీ సీజనులో శనగ సాగు సాధారణ విస్తీర్ణం 20,302.5 ఎకరాలు కాగా, జిల్లాలో 48,797.5 ఎకరాల్లో సాగు చేశారు. సుమారు 55 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నాఫెడ్ జిల్లాలో తొమ్మిది కొనుగోలు సెంటర్లు (పెదనందిపాడు–3, కాకుమాను–1, ప్రత్తిపాడు–1, వట్టిచెరుకూరు–1, తాడికొండ–1, తుళ్ళూరు–1, ఫిరంగిపురం–1) ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాళ్లకు రూ.5,875 చొప్పున 1,122 మంది రైతుల నుంచి 5,600 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. అందులో ఇప్పటి వరకు 721 మంది రైతులకు రూ.14.50 కోట్లు చెల్లించారు. ఇంకా 421 మంది రైతులకు సుమారు రూ.15 కోట్లు మేర డబ్బులు చెల్లించాల్సి ఉంది. మరో 200 టన్నులు కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాకు మొదటి విడతలో 5,600 టన్నుల కొనుగోళ్లకు అనుమతి లభించిందని, ఆ మేరకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోళ్లు చేశామని వెల్లడించారు. రైతుల నుంచి డిమాండ్ ఉండడంతో మరో 15 వేల మెట్రిక్ టన్నులు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శనగలను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడం వరకే పరిమితమవుతోంది. కొనుగోళ్లు మాత్రం సక్రమంగా జరగడం లేదు. నమోదు చేసుకున్నా రోజుల తరబడి కాల్ రావడం లేదని, అప్పులు తీర్చాలి కాబట్టి దళారులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నామంటూ రైతులు వాపోతున్నారు. మద్దతు ధరతో శనగలు అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. శనగల కొనుగోళ్లు ముగిసి నెలన్నర రోజులవుతున్నా ఇప్పటికీ సుమారు 401 మంది రైతుల ఖాతాలకు నగదు జమ కాలేదు. మామూలుగా అయితే విక్రయించిన 10 రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంది. కానీ 45 రోజులు గడుస్తున్నా .. నగదు జమ కాకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కుతాయి. రబీలో మొక్కజొన్న దిగుబడులు బాగున్నా.. ధరల్లేకపోవడం సమస్యగా మారింది. శనగ రైతులదీ ఇదే పరిస్థితి. జిల్లాలో 48,797.5 ఎకరాల్లో శనగ సాగవ్వగా సుమారు 55 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో కనీసం 20 వేల టన్నులైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకు ఊరట లభిస్తుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు క్వింటా రూ.5,875కు విక్రయించినా గిట్టుబాటు కాదంటూ కొంతమంది రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. -
టెక్స్టైల్ రంగాన్ని ఆదుకోవాలి
కొరిటెపాడు: టెక్స్టైల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావడం అభినందనీయమని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు కాటన్ అసోసియేషన్ కార్యాలయంలో టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ నిపుణుల(ఢిల్లీ) బృందం బుధవారం భేటీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పిన్నింగ్, జిన్నింగ్, వివింగ్ పరిశ్రమలకు అండగా నిలబడాలని అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు కోరారు. ఎగుమతులను 37 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంపొందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల అవసరమని తెలిపారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సులువుగా చేరుతాయని పేర్కొన్నారు. జిన్నింగ్ పరిశ్రమ ఏపీలో ఉండగా, పంట తెలంగాణలో ఉంటుందని, తద్వారా వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు వేర్వేరుగా సెస్సు చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో క్యాండీకి రూ.600కుపైగా వ్యాపారస్తులు నష్టపోతున్నారని అన్నారు. ఏపీలో చెల్లించే చెస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెరిగిన ముడి సరుకు ధర, విద్యుత్ ఛార్జీలతో వివింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వాటిపై రాయితీచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వివింగ్ పరిశ్రమకు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిత్వ మంత్రిత్వ శాఖ 2013–14 ఇచ్చిన 20 శాతం రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి గ్రీన్ ఎనర్జీ పవర్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు స్థలాన్ని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు యాభై శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెక్స్టైల్స్ను విద్యుత్ ఆధారిత పరిశ్రమగా గుర్తించాలని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రోత్సహకాలు ప్రకటిస్తే ఎగుమతులతోపాటు యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ భేటీలో ఢిల్లీ ప్రతినిధి ధ్రువ మంగళ, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ జేడీ రాజారావు, అసోసియేషన్ సభ్యులు ఉప్పుటూరి సాంబశివ రావు, మాఘం సురేంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు -
తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ
మంగళగిరి టౌన్: తండ్రి అంత్యక్రియలు కుమార్తె నిర్వహించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన ఆళ్ల శంకరరెడ్డి(74) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. శంకరరెడ్డికి కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు చేసే విషయంలో బంధువుల మధ్య చర్చ జరిగింది. అయితే తన తండ్రికి అంత్యక్రియలు చేసే బాధ్యతను తనకు ఇవ్వాలని కుమార్తె నందీశ్వరి ధైర్యంగా ముందుకొచ్చింది. నందీశ్వరి అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేశారు. ఆమె భర్త బొంతు వీరారెడ్డి నూతక్కి గ్రామంలో ఆర్ఎంపీగా సుపరిచితులు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ తన తండ్రికి నందీశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆమె ఎలా చనిపోయింది..?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా క్రోసూరు పోలీసుస్టేషన్కు విచారణ నిమిత్తం వచ్చిన ఒక మహిళ తీవ్ర గాయాలపాలై మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందడం తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... విడాకుల విషయంలో బాపట్ల కోర్టుకు తిరుగుతున్న క్రమంలో చీరాలకు చెందిన పల్లపు రేణుక (39)కు వెంకటేశ్వరరెడ్డి అనే కోర్టు కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. మొదటి భర్త విడాకుల అనంతరం వెంకటేశ్వరరెడ్డితో రేణుక కొంతకాలం సహజీవనం చేసింది. అప్పటికే రేణుకకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకకు పిల్లలు పుట్టరనే నెపంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరెడ్డి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు, కేసుల దాకా వెళ్లింది. పొన్నూరులో పనిచేస్తున్న సమయంలో ఇదే వివాదంపై సస్పెండ్ అయిన వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం గురజాలలో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులో శాఖాపరమైన విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం క్రోసూరు సీఐ సురేష్ ముందు ఇద్దరు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో అల్పాహారం తిన్న తరువాత రేణుకకు ఫిట్స్ రావడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది. ఎయిమ్స్ వద్ద బంధువుల ఆందోళన రేణుక మృతిపై ఆమె బంధువులు మంగళగిరి ఎయిమ్స్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. రేణుకను పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి కొట్టడంతోనే మరణించిందని ఆరోపించారు. రేణుక కింద పడిన వెంటనే ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, మంగళగిరికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కానిస్టేబుల్పై హత్య కేసు నమోదు చేసి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. సీఐల చర్చలతో మారిన సీన్ ఈ క్రమంలో బంధువులు, కులసంఘం నేతలతో పెదకూరపాడు, అచ్చంపేట సీఐలు చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్ వేదికగా హైడ్రామా నడిచిన అనంతరం సాయంత్రానికి పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘రేణుకకు ఫిట్స్ ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల కళ్లు తిరిగి కిందపడిపోయింది. మా బిడ్డ మృతిపై అనవసర రాద్దాంతం చేయొద్దు’ అని మృతురాలి తండ్రి చంద్రబాబు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకూరపాడు పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. -
పరిహారానికి పదేళ్లా?
తాడికొండ: ‘రాజధాని కోసం నేను రెండో విడతలో 13 ఎకరాల భూమి పూలింగ్కు ఇచ్చాను. అందులో రెండు ఎకరాల్లో కోళ్ల ఫారాలున్నాయి. వాటికి పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ చెబుతున్నారు. నా జీవనాధారాన్ని పోగొట్టుకుని ఎలా బతకాలి? ఇలాగైతే ఎలా?’ అని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానుకు చెందిన రైతు చుండు నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పూలింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అధికారులు రైతుల గోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల రెండో విడత ప్రారంభించిన పూలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంపై నమ్మకంతో తాను 13 ఎకరాలు ఇచ్చానన్నారు. ఇందులో సర్వే నెంబర్ 230/బీ, ఏ లలో 2.02 ఎకరాలలో కోళ్ల ఫారాలు ఉన్నాయని, వాటికి తొలి విడత పూలింగ్లో రైతులకు ఇచ్చినట్లే తనకు పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. అడిషనల్ కమిషనర్, ఇతర అధికారులు చెప్పిన మాటలు వింటుంటే బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. కోళ్ల ఫారం నిర్మాణం కోసం అప్పట్లో చాలా ఖర్చు చేశానని.. ల్యాండ్ కన్వర్షన్, ఇతర ఫీజులు చెల్లించానని చెప్పారు. అప్పట్లో మరో రెండెకరాల భూమి కొనుగోలు చేసేంత ఖర్చు చేశానన్నారు. కానీ ఇప్పుడు అధికారులు పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని చెప్పడం దారుణం అని అన్నారు. అయ్యా.. నా భూమి నాకిచ్చేయండి తన భూమి తనకు తిరిగిస్తే 10 సంవత్సరాల తర్వాతే పూలింగ్కు ఇస్తానని రైతు చుండు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ల్యాండ్ పూలింగ్ను తాను వ్యతిరేకిస్తున్నానని, కోళ్ల ఫారాలను ఏసీ ఫారాలుగా మార్చుకొంటే తనకు నెలకు రూ.5–6 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. తన భూమి తనకు ఇప్పించాలన్నారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్ను కలసి అర్జీ ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్మి పొలం ఇస్తే ఇలా నట్టేట ముంచుతారనుకోలేదని మండిపడ్డారు. రాజధానిలో ఈనాం భూములు, నిషేధిత భూములను ఆన్లైన్లో తొలగించి, ఇతర రైతులను పూలింగ్కు ఒప్పించడం కోసం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఆ జాబితాలో తాను ఉన్నానని చెప్పారు. 22ఎ/1సీలో తనకు ఈనాం భూమి ఉందని, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఆన్లైన్లో కనిపించకుండా చేశారని, అడిగితే తమకు సంబంధం లేదని, సీసీఎల్ఏ అధికారులు చేశారని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా వీరి లాగిన్లో వారు ఎలా వచ్చి ట్యాంపరింగ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన భూమిని తనకిస్తే వ్యాపారమో, వ్యవసాయమో చేసుకుంటానని లేదా ల్యాండ్ కన్వర్షన్ చేసిన రెండెకరాల భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఎస్ఐఆర్పై అలర్ట్గా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ(మే 6, బుధవారం) జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్) మెంబర్లతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై మరింత అప్రమత్తంగా ఉండాలని.. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ను పెంచుకోవాలని సూచించారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా(బెంగాల్, తమిళనాడు)లో తొలగించడం జరిగింది. మనం వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరం’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీ ఓటర్లపై చంద్రబాబు, ఆయన టీమ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కావున మన తరుపున ఉండే బీఎల్ఏలు కూడా సమర్థుడై, బీఎల్వోతో సమన్వయం చేసుకోవాలి. మనం ఎస్ఐఆర్ను అవకాశంగా తీసుకుని మన ఓటర్లను కాపాడుకోవాలి. బీఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్ చేశారు.. కావున మనం ఏర్పాటుచేసుకున్న బీఎల్ఏలు కూడా అందుకు సన్నద్దంగా ఉండాలి. ఎస్ఐఆర్ మొదలయ్యోలోగా మనం అందుకు అవసరమైన విధంగా సిద్దంగా ఉండాలి. బీఎల్ఏలు సాంకేతికపరంగా ఎక్స్పర్ట్ అయి ఉండి అందరితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్దంగా ఉంటుంది. బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇద్దాం. మనం నిరంతరం దీనిపై దృష్టిపెడితే సార్వత్రిక ఎన్నికలను సులువుగా గెలవచ్చు. అంతేకాక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం విజయం సాధించవచ్చు. ఎస్ఐఆర్ పై చర్చ అనంతరం రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈ వారంలో వచ్చేవారం ఆసుపత్రుల సందర్శన, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వంటి కార్యక్రమాలను మనం షెడ్యూల్ చేసుకున్నాం. అందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి.కమిటీల వెరిఫికేషన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తోంది, మీరు మరింత వేగవంతం చేయాలి. అందుకు అవసరమైన సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ, ఉన్మాదం, అవినీతి, రెడ్ బుక్ పాలనపై కూడా నియోజకవర్గాల్లో మీరు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఈ సమావేశంలో మాట్లాడిన కన్నబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, వరికూటి అశోక్ బాబు, అబ్బయ్య చౌదరి, కొరుముట్ల శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మల్లాది విష్ణు ఎస్ఐఆర్పై తమకు ఉన్న అవగాహన, అనుమానాలపై చర్చించి పార్టీ క్యాడర్ అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎస్ఐఆర్ పూర్తయ్యేవరకు ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. -
యువ లాయర్పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. వీడియో వైరల్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ యువ న్యాయవాదిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్రావు.. ఓ యువ న్యాయవాది చేసిన చిన్నపాటి తప్పిదం కారణంగా పోలీసు కస్టడీకి పంపాలంటూ ఆదేశించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ బీసీఐ.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్కు లేఖ రాసినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది. ఆ యువ న్యాయవాది చేతులు జోడించి సారీ.. క్షమించాలంటూ వేడుకుంటుండగా.. న్యాయమూర్తి ఆగ్రహంతో పోలీసులను చర్య తీసుకోవాలని ఆదేశిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.. ఆ కస్టడీ ఉత్తర్వు అమలులోకి రాకముందే బార్ అసోసియేషన్ జోక్యంతో దానిని ఉపసంహరించుకున్నారు.Bar Council of India writes to CJI against over Andhra Pradesh High Court judge who sent lawyer to police custody pic.twitter.com/OVS9uPhVuU— Bar and Bench (@barandbench) May 6, 2026ఇది యువ న్యాయవాదులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అన్నారు. చివరికి బార్ అసోసియేషన్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.What on earth is this?!! Is there something we are missing, that this lawyer could actually be arrested?? The Bar is due a fuller report. To start with. https://t.co/GU7N5Xur0t— Karuna Nundy (@karunanundy) May 6, 2026 -
గుంటూరు
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026పచ్చ దందా... అడ్డుందా? అధికారులకే సవాలు విసురుతున్న తెలుగు తమ్ముళ్లు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.20 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,500 వరకు పలికింది. తెనాలి: తెనాలి పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా రాష్ట్రస్థాయి చాంపియన్షిప్లో మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్–జూనియర్, జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో షబీనా జూనియర్ విభాగంలో చాంపియన్గా నిలిచింది. జూనియర్స్లో 84 కిలోల విభాగంలో పోటీపడిన షేక్ షబీనా స్క్వాట్లో 200 కిలోలు, బెంచ్ప్రెస్లో 110 కిలోలు, డెడ్ లిఫ్ట్లో 200 కిలోల బరువును ఎత్తి ఓవరాల్గా 510 కిలోలు బరువులతో బంగారు పతకం కై వసం చేసుకోవటం విశేషం. అదనంగా ‘ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్’ను కూడా సాధించారని గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టింగ్ కోచ్ ఎం.అశోక్కుమార్ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు పలువురకు షబీనాను అభినందించారు. గుంటూరు మెడికల్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ ఆధ్వర్యంలో జనాభా పరిశోధన సంస్థ బృందం మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ నెల 5,6,7,8 తేదీలలో సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా జరిగే స్క్రీనింగ్పై సమీక్షించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు, లోపాలు, ఎదుగుదలలో జాప్యం ఉన్న పిల్లలను పరీక్షించి, తక్షణ చికిత్సకై జిల్లా సత్వర చికిత్స కేంద్రాలకు రిఫర్ చేయడం, ఫాలో అప్ చేయడం, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యల గురించి సమీక్షించారు. జిల్లా ప్రగతికి తగిన మార్గదర్శకాలు సూచించారు. గుంటూరు, తెనాలిలో సత్వర చికిత్స కేంద్రాలను, గుంటూరు జీజీహెచ్ని, ఎన్ఆర్సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర సుజాత, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్, మేనేజర్ శిరీష పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24న గుంటూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలు గుంటూరులోని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషను స్వీకరిస్తారని, 10 – 11 గంటలకు పరిశీలన, 11 – 12 గంటలకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 – ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన సభ్యుల వివరాలను ఎన్నికల అధికారి మధ్యాహ్నం 2 గంటలకు తెలియజేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలతో ఫుట్బాల్ క్లబ్ రిజిస్ట్రేషన్ పత్రాలు, రెన్యువల్ పత్రాలు తీసుకురావాలని కోరారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్బాబు కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని వారు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరంఆలయ అధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గుంటూరు రూరల్: రూరల్ మండలంలో ఓబులునాయుడుపాలెం, నాయుడుపేట, వెంగళాయపాలెం, చిన్నపలకలూరు, గోరంట్ల తదితర గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో మాఫియా అక్రమ మైనింగ్ సాగుతోంది. ప్రజాప్రతినిధి అల్లుడు పేరుతో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం. ఏకంగా ప్రజా ప్రతినిధి కార్యాలయం నుంచి ఒకరిద్దరు వచ్చి తవ్వకాలు జరిపే ప్రాంతంలో రాత్రి, పగలు వాహనాల లెక్కలు రాసుకుంటున్నారంటే ఏ స్థాయిలో మైనింగ్కు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తూ లారీ ఒకొక్కటి రూ. 8 వేలు – రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు భూమిలో హక్కుదారుడికి తెలియకుండా తవ్వి మట్టి స్వాహా చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించారు. అయినా అక్రమ మట్టి దందాను మాత్రం ఆపలేదు. స్థానిక టీడీపీ నాయకులతో కలిపి ప్రజాప్రతినిధులే ఇలా చేస్తుండటం చర్చశనీయాంశంగా మారింది. భారీగా తవ్వకాలు తవ్వకం మొదలుపెట్టారంటే నీరు ఊరినా ఆపడం లేదు. రూరల్ మండల పరిసర ప్రాంతాల్లో సుమారు 50 నుంచి 60 అడుగులు తవ్వితే నీరు ఊరుతుంది. అంటే ఏ స్థాయిలో తవ్వకాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నీటిని మోటార్లతో తోడి అక్కడే మరో పది అడుగులు తవ్వుతున్నారు. నిబంధనలకు ఇంతలా తూట్లు పొడుస్తున్నా మైనింగ్ అధికారులుగానీ, పోలీసులుగానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రూ.కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు రూ.లక్షల్లో మామూళ్లు వెదజల్లి పని కానిచ్చేస్తున్నారని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ముగిసిన ఆహ్వాన నాటికల పోటీలు తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరు పంచాయతి పరిధిలోని ఖాజీపేట కళావేదికపై జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. చిటుమడుగుల సాంబయ్య కళాప్రాంగణంలో చిటుమడుగుల భాస్కరరావు జ్యోతి ప్రజ్వలనతో చివరిరోజు ప్రదర్శనలు ఆరంభించారు. రాత్రి ఏడుగంటలకు స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, హైదరాబాద్ వారి ‘సీ్త్రమాత్రే నమః’ నాటికను ప్రదర్శించారు. పూర్ణిమ పెమ్మరాజు మూలకథకు ఉదయ్ భాగవతుల నాటకీకరించి, దర్శకత్వం వహించారు. రాత్రి 8 గంటలకు ఏర్పాటైన సభకు కళాపరిషత్ ఉపాధ్యక్షులు సుద్దపల్లి మురళీధర్ అధ్యక్షత వహించారు. సభలో గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని కాకినాడకు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ సీఎస్.ప్రసాద్కు బహూకరించారు. సభానంతరం స్నేహ ఆర్ట్స్–చంద్రమాంపల్లి, దివిలి వారి ‘పుట్టింటి సంపద’ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్నిగ్ధ రచనకు, బి.రాజు దర్శకత్వంలో పి.బాలాజీనాయక్ పర్యవేక్షణలో ప్రదర్శించారు. నిర్వాహక కమిటి తరపున గోపరాజు రమణ, గోపరాజు విజయ్, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. 7పాలిసెట్లో జిల్లాలో 92.95 శాతం ఉత్తీర్ణతగుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి విద్యార్హతతో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2026 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 92.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 25న జరిగిన పాలిసెట్–2026కు జిల్లా వ్యాప్తంగా హాజరైన 4,894 మంది విద్యార్థుల్లో 4,549 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 3,032 మంది బాలురులో 2,797, 1,862 మంది బాలికల్లో 1,752 మంది చొప్పున ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 92.25 శాతం, బాలికల ఉత్తీర్ణత 94.09 శాతంగా నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఇసునూరి చేతన్ ఆనంద్ రామ్ రాష్ట్రస్థాయిలో 132వ ర్యాంకు, చిలకా సుజిత్ ప్రహర్ష్ 159వ ర్యాంకు, సంపతి యశ్వంత్ 322వ ర్యాంకు సాధించారు. రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండలంలో అనంతవరం, వడ్డమాను అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకులు, టీడీపీ నాయకులు కలిసి దందాకు పాల్పడుతున్నారు. తాడికొండ మండలంలోని లచ్చన్నగుడిపూడి, మోతడక, పాములపాడు గ్రామాలలో మైనింగ్ రాత్రి సమయంలో నిర్వహిస్తూ తెలుగు తమ్ముళ్ళు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. రాజధాని గ్రామాల్లో సైతం నిత్యం వందల సంఖ్యలో లారీలలో నల్లమట్టి ఇతర ప్రాంతాలకు తరలుతూనే ఉంది. చేబ్రోలు మండలంలోని శేకూరు, వీరనాయునిపాలెం, వడ్లమాను గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ నడుస్తూనే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో గ్రామ, మండల స్థాయి నాయకులు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. యడ్లపాడు మండలం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో రాత్రి సమయాల్లో మైనింగ్ జరుగుతూనే ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారంలో ఉన్నవారిని కూడా ఇలా అడుగుతారా? అని పేర్కొంటున్నారు. వారి బెదిరింపులకు భయపడి అధికారులు అటు వెళ్లడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. -
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం
తాడికొండ: భూ సమస్యలకు త్వరలోనే పూర్తి పరిష్కారం చూపుతామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని రైతుల భూ సమస్యలపై మంగళవారం సీఆర్డీయే కమిషనర్ విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లతో త్రిసభ్య కమిటీ సభ్యులైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్లతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి పెమ్మసాని విలేకరులతో మాట్లాడుతూ సీఆర్డీయే కొత్త కమిషనర్గా విజయరామరాజు ఇటీవలే బాధ్యతలు స్వీకరించారని, నూతన కమిషనర్కు రాజధాని సంబంధిత పలు అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా సమీక్ష నిర్వహించుకున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న కొన్ని గ్రామ కంఠాల సమస్యలు, కొన్ని ఎఫ్ఎస్ఐ గ్రామాల్లోని మౌలిక వసతులు, తదితరాంశాలపై అధికారులు గ్రౌండ్ లెవెల్కు వెళ్లి పరిశీలిస్తే స్థానిక సమస్యలు తెలుస్తాయని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక సమస్యలు అర్థం అవుతాయని కమిషనర్కు సూచించారు. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాల వల్ల ఇళ్లు కోల్పోతున్న వారికి ఎన్ఎస్పీ పాలసీ ద్వారా ఎన్హాన్స్ చేయాలని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ -
ఇదేంటి.. అతిథి అధ్యాపకా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అతనో అతిథి అధ్యాపకుడు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో అతని ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి సర్వేలు చేశానని.. పార్టీ శిక్షణ శిబిరాలలో పాల్గొన్నానని.. ఆ పార్టీలో నేతలు అందరూ తనకు సన్నిహితులే అంటూ వర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిన్నాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం.. ఒక వర్గ సంప్రదాయాలను హేళన చేయటం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. యూనివర్సిటీలోని ఒక కళాశాలలో పని చేస్తున్న ఈ అతిథి అధ్యాపకుడి తీరుతో ఆ విభాగంలోని విద్యార్థులు విలవిలలాడుతున్నారు. విభాగ పెద్దల అండదండలతో నియమితుడైన తర్వాత అడ్డగోలుగా వ్యవహరిస్తుడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పేరు చెప్పుకొని అందర్నీ బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి దశ నుంచి టీడీపీలో ఉన్నానని... తనను ఎవరూ ఏమీ చేయలేరని రెచ్చిపోతున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. అధికార పార్టీకి చెందిన ఒక కుల కార్పొరేషన్ చైర్మన్ తనకు అత్యంత ఆప్తుడని హల్చల్ చేస్తున్నా సరిచేసేవారు కనిపించడం లేదు. తాను ఎంత చెబితే అంత అంటూ మిగిలిన సిబ్బందిని కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం. వేధింపులు... దూషణలు.. గతంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్న ఈ అతిథి అధ్యాపకుడు.. తాజాగా అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు. ఒక విద్యార్థిని వ్యవహారంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థిని పాదరక్షలు తీసివేసి క్లాస్కు రావాలంటూ ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారుల పరిశీలనకు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఇతను మూల్యాంకన విభాగంలో పనిచేసినప్పుడు వెహికల్ తాళాలు కావాలంటే తన గదికి రావాలని వికృతంగా మాట్లాడినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఎగ్జామినర్ల పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు మహిళా ఎగ్జామినర్లతో తన పరిధి దాటి వ్యవహరించినట్టు అప్పటి అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక మహిళా లెక్చరర్ను ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చోబెట్టి మూల్యాంకనం చేయించారనే ఆరోపణ ఉంది. మరికొందరు మహిళా లెక్చరర్లను ప్రత్యేకంగా ఎక్కువ పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయించడంతో వారు ఆందోళనకు దిగారు. గత శుక్రవారం విభాగ ఆవరణలో ఒక వర్గ సంప్రదాయాలను హేళన చేశారని విద్యార్థి బంధువులు వచ్చి నిలదీయడమే కాకుండా, ఆందోళన కూడా చేశారు. ఉన్నతాధికారులు ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ చేసినట్లు చెబుతున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నామని యూనివర్సిటీ అధికారులు కొందరు వాపోతున్నారు. -
ఆచార్యా... అన్నీ అయినోళ్లకేనా!
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక పరిపాలనలో సొంత సామాజిక వర్గానికే పదవులన్నీ పప్పుబెల్లాల్లా పంచుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏక కాలంలో ఒకరికి పలు బాధ్యతలు అప్పగించడం వలన వారు తరగతులు నిర్వహించలేకపోతున్నారనేది స్పష్టమవుతోంది. కూటమి పాలనలో ఎక్కువ పదవులు అనుభవిస్తున్న వారు ఆర్థిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పాలకుల తీరు చూస్తే వర్సిటీలో పదవులు అనుభవించే వారు మనవారేనా... అయితే అప్పగించెయ్ అనేలా పరిస్థితి మారింది. సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో ఉన్న విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరికే 12 ఉద్యోగ బాధ్యతలు ఏఎన్యూలో రీసెర్చ్ సెల్ కో ఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఏకకాలంలో 12 ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సామాజిక న్యాయం ఏ విధంగా అమలు చేస్తున్నారో దీని వలన తెలుస్తోంది. ఈ వ్యక్తి 12 సంవత్సరాలుగా వర్సిటీలోని పరీక్షా భవన్లో యూజీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏసీటీఏగా (డిగ్రీ జవాబు పత్రాల కోడింగ్) విధులు నిర్వహిస్తున్నారు. ఆయనే ఆన్లైన్ పరీక్షల ఇన్చార్జి, ఓ విభాగానికి విభాగాధిపతిగా, పీజీ అడ్మిషన్ సెట్ కో కన్వీనర్గా, వర్సిటీ సాంకేతిక విభాగం పర్యవేక్షకుడిగా, దూర విద్యాకేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్గా, ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాలకు తనిఖీ బృందం సభ్యుడిగా, ఎగ్జామ్ సెంటర్ల సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా, ఏఎన్యూ ఇంటర్ నెట్ వర్క్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే వ్యక్తికి వర్సిటీ పనులపై పలుమార్లు ఢిల్లీ వెళ్లే బాధ్యతలు కూడా అప్పగించడం విశేషం. దీనిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకరికి ఇలా... ఏఎన్యూలోని అదే విభాగంలో ఐక్యూఏసీ కో ర్డినేటర్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కూడా పలు బాధ్యతలు అప్పగించారు. సీటీఏగానూ, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాల్లో తనిఖీ సభ్యుడిగా, పీజీ, డిగ్రీ పరీక్షల పరిశీలకుడిగా, రెగ్యులర్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా బాధ్యతలు చూసుకుంటున్నారు. రెగ్యులర్ విధానంలోనే కాకుండా దూర విద్యా కేంద్ర పరీక్షల్లోనూ పరిశీలకుడిగా, తనిఖీ బృందం సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల్లోనూ, దూర విద్యాకేంద్రాల తనిఖీల్లోనూ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పలు వర్సిటీ అంతర్గత కమిటీల్లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లెక్కకు మించిన బాధ్యతలు నిర్వహించే ఈ అధ్యాపకులు తరగతులు ఎప్పుడు నిర్వహిస్తున్నారో అప్పగించిన వారికే తెలియాల్సి ఉంది. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయం ఉండదని తెలియదా? కొందరు అధ్యాపకులకు ఒకటి కంటే ఎక్కువ బాధ్యతలు కట్టబెడుతున్న తాత్కాలిక వీసీకి ఆయా అధ్యాపకులకు పాఠాలు చెప్పే వెసులుబాటు, సమయం ఉన్నాయా? అని ఆలోచించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే తాత్కాలిక వీసీ ఆచార్య కె.గంగాధరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. కనీస చర్యలు కూడా లేవు. గతంలో వీసీలు తనిఖీలు చేసి అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేవారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే బాధ్యతగా భావించేవారని పలువురు విద్యావేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. తాత్కాలిక వీసీ వచ్చిన 23 నెలల్లో ఏ రోజూ మచ్చుకై నా తనిఖీలు లేవని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని వర్సిటీ వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది. వర్సిటీలోని ఓ కళాశాల ప్రిన్సిపల్ విభాగాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు పలు తరగతులు జరగడం లేదని వాపోయారు. అధ్యాపకులకు తప్పనిసరిగా బోధన చేయాలని సూచించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు లేదు. ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో కొందరు హోదాను చూసుకుంటుండగా... మరికొందరు ఆర్థిక సంబంధమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వర్సిటీలోని తాత్కాలిక పాలకులకు సైతం విద్యార్థుల ఇబ్బందులు పట్టడం లేదు. దీనిపై పలువురు ప్రిన్సిపాల్స్ చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐదు దశాబ్దాలుగా మంచి పేరున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. కొందరు అధికారుల పనితీరు, స్వార్థం, ఓ సామాజిక వర్గంపై ప్రేమతో నేడు దిగజారుతోంది. ఏ విద్యాకేంద్రంలోనైనా విద్యార్థులకు సామాజిక విలువలతో కూడిన విద్యాబోధనలు, నైతిక విలువలను నేర్పించడం ప్రథమ కర్తవ్యం. కానీ వర్సిటీలో 23 నెలల తాత్కాలిక పాలనలో విద్యార్థులకు తరగతులే సరిగా నిర్వహించడం లేదు. పాఠాలు చెప్పకుండా పరీక్షలు రాసేదెలా అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. -
భూగర్భ జలాలు పెరగాలి
గుంటూరు వెస్ట్: జలధార–జలహారతి కార్యక్రమంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరగాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. జలధార–జలహారతి కార్యక్రమంపై మంగళవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పనులు నీటి వనరుల నిల్వలు పెంచడానికి, నీటిని సంరక్షించడానికి, సాగు నీటి వ్యవస్థ బలోపేతం కావడానికి తోడ్పడాలన్నారు. ప్రతి మండలంలో చిన్న నీటి తరహా చెరువులు, వాటికి సంబంధించిన ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు, ప్రస్తుత భూగర్భ జలాలు విశ్లేషించి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న మండలాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార– జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఫీడర్ కాలువల పునరుద్ధరణ పనులను ఉపాధి హామీ పథకం కింద వేతనదారుల ద్వారా చేపట్టాలన్నారు. కాలువలపై ఆక్రమణలు, కాలువలు మూసుకుపోవడం, లేదా పంటలు వేసి వాటిని వినియోగించడం వంటి అంశాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని, ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచాలన్నారు. గొలుసుకట్టు చెరువులపైనా శ్రద్ధ వహించాలన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తద్వారా వర్షాలు కురిసే సమయంలో మంచి ఫలితాలు సాధించగలమని, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని కలెక్టర్ వివరించారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారికి చెంపపెట్టు లాంటిది’
తాడేపల్లి : మార్గదర్శి బాధితులకు న్యాయం జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈనాడు కిరణ్కు చెంపపెట్టులాంటిదన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. మార్గదర్శి బాదితులకు న్యాయం జరగాలని సుప్రీం ఇచ్చిన తీర్పు అద్భుతమైనదన్నారు. రామోజీరావు చనిపోయినందున కేసు కొట్టేయాలంటూ కిరణ్ కోర్టును అడగటం సిగ్గుచేటన్నారు. ‘రూ.600 కోట్లు ప్రజల నుండి అక్రమంగా డిపాజిట్టు తీసుకున్నారు. ఆ డబ్బంతా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ లాంటి వాడినే మానసికంగా చంపేశారు. మద్యపాన నిషేధాన్ని తనకు అవసరమైనట్టుగా వాడుకున్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలనే బెదిరించారు. మార్గదర్శి ద్వారా అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో ఇష్టానుసారం చేశారు. తనకు నచ్చని నేతల వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. అలాంటి కిరణ్కు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ వాదనలకు బలం చేకూరింది. ఆర్బిఐతో సహా రెండు తెలుగు రాష్ట్రాల వివరణ కోరటం అభినందనీయం. మార్గదర్శి బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే!
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తూంటే.. అప్పుచేసి పప్పు కూడు అన్న పాత సామెతను అప్పు చేసి అమరావతి సోకులు అని మార్చాల్సి వస్తుంది. పేదవాడికి అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ గతి తప్పుతోంది. అమరావతిలో గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోట్లు వెచ్చించగల ధనికులకే పరిమితమన్న అభిప్రాయం బలపడుతోంది.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని గ్రామాలలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు కలుగుతుందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అవసరానికి తగ్గట్టు నిర్మాణాలు జరిపేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ... అవగాహన లేకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక నగరాన్ని సృష్టిస్తామన్న పాలకుల వ్యవహారమే మింగుడుపడటం లేదు.ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ నిర్ణయాలను పరిశీలిస్తే సామాన్యుడు ఎవరైనా విస్తుపోవాల్సిందే! అమరావతి నిర్మాణాల్లో కేవలం అద్దాలకు మాత్రమే రూ.2540 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది మంత్రివర్గం. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ వంతెనలకు రూ.798 కోట్ల వ్యయం చేయున్నారు. విశేషం ఏమిటంటటే ఇక్కడ నిర్మాణాల టెండర్లను మంత్రివర్గంలో ఆమోదించారట.సాధారణంగా టెండర్ల ఆమోదం కేబినెట్ వరకు రాదు. కాని మంత్రులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదో సందేహం ఉండి ఉండాలి. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ దోపిడీపై విచారణ చేస్తే మంత్రివర్గ నిర్ణయంగా తోసివేయడానికి ఉపయోగపడుతుందన్న భావన కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని పేరుతో ఏ రాష్ట్రంలోను ఇంతలా డబ్బు వృథా చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పార్లమెంటు భవన నిర్మాణానికి కేవలం రూ.1100 కోట్ల లోపు వ్యయం అయితే, ఏపీలో భవనాల అద్దాలకే రూ.2540 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్టిన తెలంగాణ సచివాలయ భవనానికి అయిన ఖర్చు కూడా రూ.వెయ్యి కోట్ల లోపే.డబ్బు ఉంటే ఎన్ని సోకులు అయినా చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. కానీ... ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆంద్రప్రదేశ్లో ఈ దుబారా చేయడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఏ పని చేయాలన్నా, ఏ హామీ గురించి ప్రశ్నించినా, మెడికల్ కాలేజీల వంటి వాటిని ప్రైవేటు పరం చేయవద్దని చెప్పినా, డబ్బులు లేవని చెబుతారు. కాని అమరావతిలో మాత్రం లక్షల కోట్లు వ్యయం చేయడానికి రెడీ అయిపోయారు. ఇందుకోసం వేల కోట్ల అప్పులు చేసేశారు. రాజధానిలో సచివాలయ సిబ్బంది కూడా మూడువేల మందికి మించి ఉండరు.కాని సచివాలయం కోసం చదరపు అడుగుకు రూ.15 వేల వ్యయంతో నలభై, ఏభై అంతస్తుల భవనాలు నిర్మించడం అంటే అంతా విస్తుపోతున్నారు. నలభై ,ఏభై లక్షల చదరపు అడుగుల భవనం నిర్మించడమేమిటో తెలియకుండా ఉంది. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, కిక్బ్యాక్లు పొందడానికే అని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అది చాలదన్నట్లుగా ప్లంబింగ్, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయల కల్పనకు మరికొన్ని వేల కోట్లు, చివరికి అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.ఈ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వపరంగా వాడుకోవడానికి ఆ స్థాయిలో సిబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల ఈ భవనాలలో అత్యధిక భాగం అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. జాతీయ రహదారికి నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కంపెనీలు అద్దెకు తీసుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు.పైగా ప్రభుత్వ భవనాలలో ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అలాంటప్పుడు ఇన్ని భారీ భవనాల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో తెలియదు.ఇక అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా వేల కోట్ల వ్యయం జరుగుతుంది.నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి ముప్పై రోజులు కూడా ఉండడం లేదు. ఒకప్పుడు 45 రోజులైనా సభ జరగాలని అనేవారు. ఇప్పుడు అడిగేవారు కూడా లేరు. మొత్తం 300 లేదా 400 మంది కూర్చోవడానికి, భారీ స్థాయిలో భవంతి నిర్మించడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. పోనీ కమిటీ సమావేశాలకు అవసరమవుతాయని అనుకున్నా, అవి కూడా ఎంత మేర పని చేస్తాయో చెప్పలేం. ఆ సమావేశాలకు జరగడానికి రెండు లేదా మూడు సమావేశ మందిరాలు సరిపోతాయి. అయినా అసెంబ్లీ భవనానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు.అమరావతి భవనాల డిజైన్ కోసమే రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.ఈ టవర్లపై ఎక్కి నగరాన్ని చూసే సదుపాయం కల్పిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. దానికోసం ఇన్నివేల కోట్లు వ్యయం చేయాలా? ప్రభుత్వం తన సొంత భూములలో నిర్మాణం చేస్తే అదో పద్దతి. రైతుల నుంచి వారి ఇష్టపూర్వకంగానో,లేక బలవంతంగానో భూమి సమీకరించారు.వారికి కౌలుతోపాటు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో లే అవుట్ లు వేసి, మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి.ఇందుకోసం ఒక ఎకరాకు రూ.రెండు కోట్లు అవుతుందని, ఏడేళ్ల క్రితమే చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. కేంద్రం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఈ టర్మ్లో ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పు తీర్చవలసిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. అంటే ఏపీ ప్రజలు వడ్డీతో సహా అప్పులు చెల్లించవలసిందే. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు ఐదు కోట్ల మంది ఈ మొత్తానికి బాధ్యులైతే, ఇక్కడ పెరిగే భూముల విలువ వల్ల లబ్ది పొందేది కొన్నివేల మంది మాత్రమే. ఇదంతా ఉపాధి కేంద్రం అవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆ స్థాయిలో ఇక్కడకు వస్తున్న కొత్త సంస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ వచ్చినా ఇక్కడ కూడా అలాగే ఉచితంగా భూములు ఇవ్వగలుగుతారా? అలా చేస్తే అమరావతి ద్వారా ఆదాయం కూడా రాదు కదా! విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు.దానికితోడు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని గొప్పగా చెప్పి రాజధాని పరువు తీశారు. ఇతర సామాజికవర్గాలలో ఆమెకు తెలియకుండానే వ్యతిరేకత సృష్టించారు. ఇది ఒక కోణం అయితే ఇప్పటికే ఉన్న అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని మళ్లీ నిర్మించడం ద్వారా వృథా వ్యయం చేస్తున్నారన్న విమర్శ ఉంది.ఇవే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న రైల్వేస్టేషన్లు కాదని అమరావతి గ్రామాలలో కొత్త రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న విమానాశ్రయం కాకుండా ఇంకో ఎయిర్ పోర్టు నిర్మించాలని తలపెట్టడం ఏ మేరకు తెలివైన నిర్ణయం అవుతుంది? టీడీపీకి గట్టి మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి వెంకటేశ్వరరావు రెండో దశ పూలింగ్ నిమిత్తం భూములు తీసుకోవడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం వేల ఎకరాల సేకరణకు ముందుకు వెళుతుంటే రైతులు అల్లాడుతున్నారు.ఇంతవరకు తొలిదశ రైతులకు హామీ ఇచ్చిన రీతిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. మరో వైపు పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇచ్చిన 50వేల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలియచేస్తుంది.రాజధానిలో పెద్ద, పెద్ద ప్లాట్లు మాత్రమే ఉండాలన్న వారి ధనిక మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి గ్రామాలలో భూములలో మట్టి స్వభావం కారణంగా పునాది నుంచి అధిక వ్యయం చేయవలసి వస్తోంది. చాలామంది విజయవాడ-గుంటూరు మద్య గట్టి నేలల్లో అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చినా వినకుండా చంద్రబాబు సర్కార్ తన ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు ఒక ప్రాంతంలోనే ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది.జగన్ చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ వల్ల ఇన్ని లక్షల కోట్ల అవసరం ఉండదు.ఆ విషయం జనంలోకి వెళుతుండడంతో దానిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోంది. సాధారణంగా ఆర్థిక కష్టాలలో ఉన్నవారు పొదుపుగా వ్యవహరించాలని అంతా సలహా ఇస్తారు. కాని ప్రభుత్వమే ఇలా దుబారా వ్యయం చేస్తుంటే, ఎవరి మాట విననంటుంటే ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సిందేనా? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పునర్విభజన చిచ్చు!
గుంటూరుమంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో కూటమి పార్టీల మధ్య విబేధాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మొదట్లో ఏడాదిపాటు కలిసి ఉన్నా తర్వాత రాను రాను జనసేన పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తి మొదలైంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తమకు అన్యాయం జరిగిందన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మిర్చియార్డు చైర్మన్ పదవిని ఆశించిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుకు అసంతృప్తే మిగిలింది. ప్రస్తుతం నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన వ్యవహారం కూడా రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. పునర్విభజన ప్రక్రియ పేరుకే అధికారులు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలే చూసుకుంటున్న సంగతి తెలిసిందే. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో కొంతమేర జనసేనకు సమాచారం ఇచ్చి చేసినా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పునర్విభజన ప్రక్రియలో కనీస సమాచారం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేను అడిగినా పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పశ్చిమ నియోజకవర్గ నేతలతో జనసేన పార్టీ నేత బోనబోయిన శ్రీనివాసరావు మీటింగ్ పెట్టారు. దీనిపై అమితుమీకి జనసైనికులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ● చుట్టుగుంట రైతు బజార్లో తమ పార్టీకి చెందిన వారికి షాపులు కేటాయించాలని కోరితే ఒక్క షాపు కూడా కేటాయించలేదు. కొత్తగా కేటాయించిన రేషన్ షాపుల్లో జనసేన వారికి అవకాశమే లేకుండా పోయింది. పైగా గుంటూరు నగరంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో 28 రోడ్లు వేయాలని ప్రతిపాదనలు ఇవ్వగా ఒక్క ప్రతిపాదన కూడా ఆమోదించకపోవడంపై జనసేన తాజా మాజీ కార్పొరేటర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు అధికారులు కూడా జనసేన నాయకులను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. నల్లపాడు సీఐ వంశీధర్ ఏకపక్షంగా పనిచేస్తూ, అవినీతికి పాల్పడుతున్నా అతనిపై చర్యలు లేవు. ప్రైవేటు ఆసుపత్రిపై దాడి చేసిన కేసులో దాడి చేసిన వారికి సీఐ మద్దతుగా నిలబడటంతో జనసేన నాయకులు ఏకంగా ప్రెస్మీట్ పెడితేగాని అతన్ని మార్చని పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలులో పెట్టిన వ్యవహారంలో కూడా రాంబాబును జైలులో ఉంచడానికి జనసేన నాయకులు 2022లో ఇచ్చిన ఫిర్యాదును బయటకు తీసి తమను ఇబ్బంది పెట్టారన్న భావన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నేతలు పైకి కలిసి పనిచేస్తున్నట్లు కనపడుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపై మండిపడుతున్నారు. నల్లపాడు సీఐ వంశీధర్ అవినీతిపై ప్రెస్మీట్ నిర్వహించి, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు (ఫైల్) గుంటూరు పశ్చిమ పరిధిలో జనసేన నాయకులు వస్తే అసలు పనులు చేయవద్దని ఎమ్మెల్యే చెప్పడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సచివాలయ అడ్మిన్లతో సమావేశంలో జనసేన వారికి తనకు సమాచారం ఇవ్వకుండా అసలు పనులు చేయడానికి వీలు లేదని చెప్పడంతో అసలు జనసేన నాయకులుకు పనులు కావడం లేదు. ఈ వ్యవహారంపై జనసేన నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆఖరికి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారం వెనుక గల్లా మాధవిని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం నాయకులు ఉండి జనసైనికులను రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవగానే ఆమెకు పొలిట్బ్యూరోలో స్థానం ఇవ్వడాన్ని సొంత పార్టీ నాయకులే జీర్ణించుకోవడం లేదు. పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేద పండితులు అగ్నిహోమం నిర్వహించారు. తమను పట్టించుకోవడం లేదంటూ జనసేన నేతల అసంతృప్తి నామినేటెడ్ పదవుల్లోనూ చిన్నచూపు క్యాడర్తో సమావేశం నిర్వహించిన పశ్చిమ జన సైనికులు పోలీసుల తీరుపై అసహనం అవినీతి అధికారులపై ప్రెస్మీట్ పెట్టాకే నల్లపాడు సీఐకి స్థానచలనం -
మాన్యువల్ మాయాజాలం
● రాష్ట్రమంతా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు ● జీఎంసీలో మాత్రం మాన్యువల్ గానే.. ● మాన్యువల్గా ఫైళ్లు చూసి సంతకం చేసిన తరువాతే ఆన్లైన్లో పెడుతున్న రెవెన్యూ సిబ్బంది ● ఆన్లైన్లో ఫైళ్లు సకాలంలో పెట్టకపోవడంతో సమయం వృథా అవుతుందంటూ లబోదిబోమంటున్న అర్జీదారులు ● రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చే ఆన్లైన్ ఫైల్స్ను కూడా రిజెక్ట్ చేస్తున్న వైనం ● గడువు తీరేదాకా అప్రూవ్ చేయని దరఖాస్తులు వందకు పైగానే.. తిరస్కరించిన దరఖాస్తులు 2,970 రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చే దరఖాస్తులు సైతం.. -
గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్లకు పతకాలు
మంగళగిరి టౌన్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల 1వ తేదీ నుంచి 3 వరకు ఏపీ పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని స్థానిక జిమ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో విజేతలను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. విజయభాస్కరరావు మాట్లాడుతూ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ (మెన్ అండ్ ఉమెన్) ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో గుంటూరు జిల్లా నుంచి 17 పతకాలు సాధించారని తెలియజేశారు. అందులో 11 బంగారు పతకాలు, 2 రజత, నాలుగు కాంస్య పతకాలు పవర్ లిఫ్టర్లు సాధించారని పేర్కొన్నారు. సబ్ జూనియర్ బాయ్స్ జట్టు మొదటి స్థానం, జూనియర్ మెన్టీమ్ చాంపియన్ షిప్ మొదటి స్థానం, సబ్ జూనియర్ గర్ల్స్ టీమ్ చాంపియన్ షిప్ మూడవ స్థానం, జూనియర్ ఉమెన్స్ టీమ్ మొదటి స్థానం, మొత్తం నాలుగు విభాగాల్లో టీమ్ చాంపియన్ షిప్ సాధించారని తెలిపారు. బెస్ట్ లిఫ్టర్ సబ్ జూనియర్స్ విభాగంలో లిఖిత మూడవ స్థానాన్ని, జూనియర్ ఉమెన్స్లో షబీనా మొదటి స్థానాన్ని, జూనియర్ మెన్లో కౌషిక్ మూడవ స్థానాన్ని, మాస్టర్స్ ఉమెన్లో జ్యోతివర్మ మొదటి స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పవర్ లిఫ్టింగ్ ఇండియా సౌత్జోన్ సెక్రటరీ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ వంశీకృష్ణ, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. -
మంత్రి ఇలాకాలో పరేషన్
● తెనాలి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో నిండుకున్న రేషన్ బియ్యం నిల్వలు ● నాలుగు రోజులైనా రేషన్ దుకాణాలకు చేరని వైనం ● దాదాపు 80 షాపులకు మూడో తేదీకి మాత్రమే చేరిన సరుకులు ● ఇంకా రేషను అందని 40 షాపులు ● బియ్యం కోసం వచ్చి తిరిగి వెళుతున్న పేదలు వైఎస్సార్ సీపీ హయాంలో ఠంఛనుగా.. గుడివాడ నుంచి తోలటమే జాప్యానికి కారణం ! -
రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం
తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన ఆదివారం రాత్రి కొనసాగాయి. కొలకలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రత్యేక వేదికపై జరుగుతున్న ఈ నాటిక పోటీలు గడ్డం ప్రకాష్ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటులు డాక్టర్ గోవాడ వెంకట్కు కరణం సురేష్ జ్ఞాపకార్థం ‘సవ్యసాచి’ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. విజయనగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని గోపరాజు శివరామకృష్ణ హనుమత్ శేఖర్, కుటుంబసభ్యులు ప్రదానం చేశారు. సభకు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ కార్యదర్శి డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. కళారంగ ప్రముఖులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు (చిలకలూరిపేట), గుదె పాండురంగారావు (అనంతపురం), కూచి రామాంజనేయులు (వినుకొండ), ఏటూరి రోహిణీకుమార్ (హైదరాబాద్), చెరుకూరి సాంబశివరావు (గుంటూరు) పాల్గొన్నారు. కళారంగంలో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్, వైఎస్కేఎన్ స్వామి, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. నాటక పోటీల్లో భాగంగా తొలుత కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు. అగస్త్య రచనకు వైబీ చౌదరి దర్శకత్వం వహించారు. తదుపరి హేలాపురి కల్చరల్ అసోసియేషన్–ఏలూరు వారి ‘అనగనగా ఓ రాత్రి’ నాటికను ప్రదర్శించారు. పీవీ సత్యనారాయణ రచనకు మహమ్మద్ ఖాజావలి దర్శకత్వం వహించారు. చివరగా ఎస్ఎంఆర్ క్రియేషన్స్–అనకాపల్లి వారి ‘మలిసంధ్య’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు ముత్యాలరావు దర్శకత్వం వహించారు. -
అగ్ని కీలలకు ఆహుతైన మొక్కజొన్న
ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తూ పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో పంటలు ఆహుతయ్యాయి. తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ అందించిన వివరాలు మేరకు.. మండలంలోని పావులూరు, చిన్ననక్కలపాలెం గ్రామాల మధ్య పంట పొలాల్లో ఆదివారం ఉదయం 9 గంటలు నుంచి 10 గంటల సమయంలో మూడు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొనివచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలానికి ఇంకొల్లు సీఐ రామానాయక్, ఎస్ఐ జీ సురేష్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారులు హాజరయ్యారు. అగ్ని ప్రమాద ఘటనలో రైతు సింగంశెట్టి వెంకటరత్నానికి చెందిన 4 ఎకరాలు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. మిగిలిన 96 ఎకరాల్లో రైతులు ముందుగానే పంటను కోయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా కోసిన తర్వాత మిగిలిన చొప్ప కూడా అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. -
ప్రశాంతంగా ముగిసిన నీట్
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను నీట్ టెన్షన్ పెట్టింది. మండుటెండలో సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆలస్యమైతే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతామోననే ఆందోళన విద్యార్థులలో కనిపించింది. ఆదివారం వైద్య విద్య కోర్సుల జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2026)కు గుంటూరు జిల్లాలో 98.06 శాతం హాజరు నమోదైంది. పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 24 కేంద్రాల పరిధిలో కేటాయించిన 8,417 మంది విద్యార్థుల్లో 8,299 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 11 నుంచే ఆయా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులతో సందడి నెలకొంది. ఉదయం 11.30 నుంచి విద్యార్థులను ఆయా కేంద్రాల్లోనికి అనుమతించారు. అంతకుముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆభరణాలు, వాచీలు, టోపీలను తొలగింపచేశారు. అన్ని కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాన గేట్లు మూసివేస్తామని ఎన్టీఏ నిబంధనల్లో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 1.45 గంటలకు వచ్చిన ఓ విద్యార్థినిని లోనికి అనుతించలేదు. దీంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయిన ఆమె కన్నీరు పెట్టుకుంది. గుంటూరు సాంబశివపేటలోని ఏసీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. వసతులు కల్పించలేదని తల్లిదండ్రుల ఆగ్రహం ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నీట్ రాసేందుకు పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. మొత్తం 2,976 మందికిగాను 2,911 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. కానీ పరీక్ష సమయం 2 గంటలకు అని స్థానికులు చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లింది. ఇంటి నుంచి వర్సిటీకి చేరుకునే క్రమంలో 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ప్రధాన ద్వారం గేటు వేశారు. ఆ విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా అవకాశం లేదని, పరీక్ష రాసే విద్యార్థి తంబ్ (వేలిముద్ర) తీసుకోదంటూ వెనక్కి పంపించారు. 30 సెకన్లు ఆలస్యంగా వచ్చిన మరో విద్యార్థిని విషయంలో డీఎస్పీ మురళీకృష్ణ చెప్పడంతో లోనికి అనుమతించారు. వేలాదిగా తల్లిదండ్రులు వర్సిటీ వద్దకు తమ పిల్లలతో చేరుకున్నారు. నిర్వాహకులు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడం, తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయడకపోవడంతో చెట్ల కింద, జాతీయ రహదారి అండర్పాస్ కింద వారు గడపాల్సి వచ్చింది. విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులకు వసతులు కల్పించడంతో వర్సిటీ అధికారులు విఫలమయ్యారని, కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల కింద, ప్రధాన ద్వారం ఎదుట కూర్చోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు మండిపడ్డారు. వర్సిటీ ఏఐఎస్ఎఫ్ నాయకులు నాసరయ్య తదితరులు కూడా విషయంలో అధికారుల తీరును ఖండించారు. పెదకాకాని సీఐ టి. పెద నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట రూరల్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి సమాచారంతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొని వినతులు స్వీకరిస్తారని వివరించారు. రూ.25 లక్షల ఆస్తి నష్టం గుంటూరు రూరల్: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. పొలం సమీపంలో నాలుగు వరిగడ్డివాములు, ఒక లారీ దగ్ధం కావ్వటంతో భారీ నష్టం జరిగిందని బాధితులు గరికపాటి లక్ష్మయ్య తెలిపారు. పందెం ఎద్దులకు చెందిన వరిగడ్డి వాములు కావటం, దానితోపాటు ఒక లారీ, లారీలోని ఎద్దుల పందేలకు వినియోగించే సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): కుడొ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ ఆధ్వర్యంలో స్థానిక టీజేపీఎస్ కళాశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకుడు రిషి వర్మ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా సిద్ధార్థ, కోశాధికారిగా రిషి వర్మ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిక్ట్ స్పోట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్గా బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, స్టేట్ అసోసియేషన్ నుంచి కోటిరెడ్డి హాజరయ్యారన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్గా శ్రీనివాసరావు వ్యవహరించారని చెప్పారు. ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్’లో ప్రముఖ వైద్యులు తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్–2026’ పేరుతో ప్రత్యేక అకడమిక్ ఈవెంట్ను నిర్వహించారు. విజయవాడలోని వరుణ్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లు హాజరై తమ అనుభవాలను వివరించారు. మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు మాట్లాడుతూ ఊబకాయం ప్రధాన సమస్య కాదని, దీనికి సరైన ప్లానింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో చికిత్స అవసరమని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ బేరియాకాన్ ద్వారా ఆధునిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ సర్జరీ సేవలు, వైద్య సమాజానికి దగ్గర చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బత్తిని రాజేష్, రాజేష్ చండ్ర, వరుణ్ దాసరి, రవి దాస్యం, అమిత్ , భానుప్రవీణ్ నాయుడు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: మండుతున్న ఎండల వేళ ఆదివారం వర్షం కురిసింది. కాకుమాను, పెదనందిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో మబ్బులతో కూడిన వర్షం పడింది. కాకుమాను గ్రామంలో అక్కడక్కడ చిన్నపాటి వడగడ్లు పడ్డాయి.. -
మున్సిపల్ ట్రాక్టర్ను ఢీకొన్న కారు
పిడుగురాళ్ల: మున్సిపల్ ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో తెలంగాణ రాష్ట్రంలోని జానపాడు దర్గా దర్గకు వెళ్తున్నారు. ఈక్రమంలో కొండమోడు డంపింగ్ యార్డులో చెత్తను వేసి పిడుగురాళ్లలోని ఓటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసేందుకు వస్తున్న ట్రాక్టర్ను పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరలో కారు వెనుకగా ఢీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. ఘటనలో ఇమామ్ హుస్సేన్ (38) అక్కడిక్కడే మృతి చెందగా కరిముల్లా, షకీరా, నజీమా, నూర్జహాన్, హసీమా, జానీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచే తేదీని ప్రకటించాలి
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణగుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిచే తేదీలను తక్షణమే ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఎప్పటి నుంచి ప్రారంభించేది రైతులకు వివరణ ఇవ్వకుంటే, మొక్కజొన్న అమ్మకాల్లో తీవ్రమైన సందిగ్ధత, నిరాశ నెలకొనే అవకాశముందన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు నినియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్పత్తి వచ్చిన నేపథ్యంలో తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. రాజకీయ విందు సమావేశాలను పక్కన పెట్టి, రైతుల కడుపు నింపే విధంగా మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన విధంగా రూ.2,400 మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గ బోర్డర్ అయిన వడ్లమూడిలోని సంగం డెయిరీలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరతో కొని, నిల్వ ఉంచి, అధిక ధరకు విక్రయించేందుకు సిద్ధం చేసిన భారీ మొక్కజొన్న నిల్వలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను తీసుకువచ్చి సీజ్ చేయించి, సంగం డెయిరీ ద్వారా అక్రమ నిల్వలకు సంబంధించి వ్యత్యాసం డబ్బులను రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అక్రమ కొనుగోళ్ల దళారీల గ్యాంగ్ లీడర్ పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై చర్యలు తీసుకోకపోవడం, రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశం సీఎం చంద్రబాబుకు, డీసీఎం పవన్ కళ్యాణ్కు లేదని అర్ధమవుతోందన్నారు. ఇప్పటికే రైతాంగం కళ్లు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తున్న మొక్కజొన్న పంట కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించకుంటే, రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి గల తీరు ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. -
ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాల్సిందే
పట్నంబజారు: ‘మీరు ప్రతి నెల డబ్బులు ఇవ్వాల్సిందే... ఒక వేళ ఇవ్వలేకపోతే... నా దగ్గర వేరే మార్గం ఉంది’ అంటూ గుంటూరు ఈస్ట్ డీటీ భాస్కర్ ఒక డ్వాక్రా గ్రూప్ ద్వారా నడుపుతున్న రేషన్ డీలర్ తిరుమలశెట్టి శివలీల, ఆమె బంధువు ఉప్పుతల విజయలక్ష్మి పట్ల అసభ్యకరంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిర ప్రియదర్శిని కాలనీలోని రేషన్ దుకాణం వద్ద వారిద్దరు నిరసన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఉన్న 183 నెంబర్ రేషన్ డిపోను తిరుమలశెట్టి శివలీల ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఆమె ప్రస్తుతం డ్వాక్రా గ్రూప్ లీడర్గా ఉన్నారు. ఈస్ట్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే డీటీ భాస్కర్కు నెల రూ.5 వేల చొప్పున ఇస్తున్నామని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రీవెన్స్లో డీటీ భాస్కర్పై ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే 18వ తేదీన రూ 1.50 లక్షలు ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది కూడా ఇవ్వాలని అడుగుతున్నారని, తమకు ఆ పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా ఫోన్లు చేసిన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 8వ తేదీలోగా ఇవ్వాలని, అందులో జిల్లా పౌరసరఫరాల అధికారికి రూ. లక్ష వాటా వెళ్తుందని, అన్ని రేషన్ షాపులు వారు ఇస్తున్నారని, మీరెందుకు ఇవ్వరని వేధిస్తున్నారని తెలిపారు. అది ఇవ్వలేదనే కోపంతోనే, పైగా తాను కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాననే కక్షతో ఈ నెల 2వ తేదీ రాత్రి ఒక ఆటోలో కొంత మంది వ్యక్తులతో బియ్యం తీసుకుని వచ్చారని చెప్పారు. అవి తమ షాపులో పెడుతున్న సమయంలో ప్రశ్నించినా ఏం ఫర్వాలేదు తాను చూసుకుంటామని చెప్పారని తెలిపారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కథంతా మార్చేసి.. బియ్యం తమ షాపులో అధికంగా ఉందని చెప్పి అక్రమంగా కేసు నమోదు చేసి, బలవంతంగా సంతకం చేయించుకున్నారని కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్రమంగా షాపుకు తాళం వేసి వెళ్లిపోయారని తెలిపారు. ప్రతి నెలా రేషన్ మాఫియాకు సైతం తాను చెప్పిన వారికే బియ్యం విక్రయించాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. డీటీ భాస్కర్ తీరుకు స్థానికులంతా ప్రత్యక్ష సాక్షులని చెప్పారు. స్థానికులు, రేషన్ డిపో ఇంటి యజమాని సైతం డీటీ భాస్కర్ కొంత మంది ప్రైవేట్ వ్యక్తులతో వచ్చి దౌర్జన్యం చేశారని చెబుతున్నారు. -
పెద్దాసుపత్రికి నిర్లక్ష్య రోగం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల పెద్ద ఆసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్లో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు అలమటిస్తున్నారు. సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు ప్రతి రోజూ 3 వేల మందికిపైగా గుంటూరు జీజీహెచ్కు వస్తున్నారు. రోగులకు సరిపడా వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఆసుపత్రి అధికారులు విఫలమవుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన సీనియర్ వైద్యులు మధ్యాహ్నానికే ఇళ్లకు, సొంత క్లినిక్లకు, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పర్యవసానంగా పెద్ద ఆసుపత్రిలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి గంపెడంత ఆశతో చికిత్స కోసం వస్తున్న నిరుపేదలు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. గుంటూరు మెడికల్: జీజీహెచ్కు క్యాజువాలిటీ (ఎమర్జన్సీ వార్డు) గుండె లాంటిది. రోడ్డు ప్రమాదాల బాధితులు, దాడుల్లో గాయపడిన వారు, విషప్రభావానికి గురైన వారిని అత్యవసర సేవల విభాగంలో (ఎమర్జెన్సీ వార్డు) చేరుస్తారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా డ్యూటీలో ఉండాల్సిన డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు (డీఏపీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు (డీఏఎస్)లు అందుబాటులో ఉండటం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంట్ ఉన్నప్పటికీ సదరు వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుల పనితీరుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సరెండర్ చేసినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆసుపత్రి మొత్తానికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర వైద్య విభాగంలో అత్తెసరు వైద్య సేవలు మాత్రమే లభిస్తున్నాయి. ఎమర్జెన్సీ వార్డులో పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ ఆస్పత్రిలో నివాసం ఉండటం లేదు. రాత్రి వేళల్లో ఎమర్జన్సీ వార్డులో అందుబాటులో ఉండటం లేదు. నర్సింగ్ అధికారుల పర్యవేక్షణ కూడా మొక్కుబడిగా కొనసాగుతోంది. వైద్య పరీక్షల కోసం ఎదురు చూపులు.... జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, రక్త పరీక్షలు ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్ట్రక్చర్లపై, వీల్చైర్లలో ఆక్సిజన్ మాస్క్లు ధరించి సైతం రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్లకు సైతం ఇదే తరహా కష్టాలు రోగులకు తప్పడం లేదు. ఉదయం ఓపీలో చూపించుకున్న రోగి రిపోర్ట్ల కోసం సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. రిపోర్ట్లు చేతికి అందేసరికి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. రోగులు రిపోర్ట్లు చేతిలో పట్టుకుని ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లి మరోరోజు వైద్య సేవల కోసం రావాల్సి వస్తోంది. ప్రైవేటు అంబులెన్స్లే దిక్కు..... పెద్దాసుపత్రికి వచ్చి చనిపోతే వారి భౌతిక కాయాన్ని తరలించాలంటే... ముఖ్యంగా రాత్రి వేళల్లో తరలించాలంటే బంధువులు రూ.వేలల్లో ప్రైవేటు అంబులెన్స్ల వారికి డబ్బులు చెల్లించాల్సిందే. మృతదేహాలను తరలించే కాంట్రాక్ట్ను మహాప్రస్థానం పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వారు సాయంత్రం ఆరు గంటలు దాటితే సేవలు నిలిపివేస్తున్నారు. రాత్రివేళ చనిపోతే మరుసటిరోజు వరకు వార్డులో లేదా మార్చురీలో ఉండాల్సిందే. లేదంటే రాత్రి వేళల్లో ప్రైవేటు అంబులెన్స్ల వారికి పదివేల వరకు చెల్లించి మృతదేహాలను తరలించుకోవాల్సి వస్తుందని బంధువులు వాపోవుతున్నారు. మహాప్రస్థానం వాహనాల సేవలు అంతంత మాత్రమే ఉంటున్నా ఆస్పత్రి అధికారులు వారికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అర్ధాకలితో విధుల నిర్వహణ జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్య సిబ్బందికి ఏడాదిపైగా వేతనాలు చెల్లించలేదు. కాంట్రాక్ట్ స్టాఫ్నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 700 మందికి పైగా రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు రాక పలువురు వైద్య సిబ్బంది అర్ధాకలితో విధులు నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సైతం ప్రతినెలా వేతనాలు చెల్లింపులు జరగటం లేదు. జీతాలు నెలా నెలా రాకపోవటంతో వారు ఫోన్పే స్కానర్లు పెట్టి మరీ మామూళ్లు అడుగుతున్న వీడియో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముట్టజెప్పాల్సిందే... కాన్పుల విభాగంలో, మార్చురీ వద్ద, ఆపరేషన్ థియేటర్ల వద్ద అధిక మొత్తంలో మామూళ్లు వసూలు చేసి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు. రోగులకు కట్టుమార్చే వారు సైతం ముడుపులు తీసుకుని డ్రెస్సింగ్ చేస్తున్నారు. పెద్ద ఆసుపత్రిలో పుట్టినా, గిట్టినా ముడుపులు తప్పనిసరి అన్నట్లుగా కింది స్థాయి ఉద్యోగులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోనూ మామూళ్ల రోగం తీవ్ర స్థాయిలో ఉందని ఆసుపత్రి ఉద్యోగులు వాపోతున్నారు. ఏ ఫైల్ కదలాలన్నా ముడుపులు ముట్టచెప్పాల్సిందే. నర్సింగ్ కార్యాలయంలో కూడా సెలవుల మంజూరుకు, డ్యూటీల కేటాయింపునకు మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందులు, సర్జికల్, ఆక్సిజన్, వర్క్షాపు బిల్లుల మంజూరుకు పర్సంటేజీలు ఇవ్వకపోతే సంతకాలు చేయడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.నీళ్ల బాటిల్ కొనుగోలు చేసి తీసుకెళుతున్న దృశ్యంక్యాన్సర్ ఆసుపత్రి వద్ద పనిచేయని వాటర్ కూలర్ వీల్చైర్పై రోగిని తీసుకెళుతున్న సహాయకురాలుగుంటూరు జీజీహెచ్లో అవుట్ పేషెంట్ విభాగంలో (ఓపీ) చికిత్స పొందాలంటే తొలుత ఓపీ చీటీ తీసుకోవాలి. ఆసుపత్రి అధికారులు ఓపీ చీటీల ప్రక్రియను ఆన్లైన్ చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సెల్ఫోన్, ఆధార్ కార్డు ఉండి గంటసేపు క్యూలో ఉంటే ఓపీ చీటీ చేతికందుతుంది. తీరా ఓపీ చిటీ తీసుకుని వైద్యుల వద్దకు వెళితే అక్కడ సీనియర్ వైద్యులు వార్డుల్లో బిజీగా ఉంటూ జూనియర్ వైద్యులతో ఓపీ వైద్య సేవలను మమా అనిపిస్తున్నారు. ఎండలకు జీజీహెచ్లో రోగులు నీటి సరఫరా లేక అల్లాడిపోతున్నారు. తాగునీరు తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాతల సాయంతో కూలింగ్ వాటర్ కూలర్స్ ఏర్పాటు చేసినా వాటిల్లో నీటిని నింపే ప్రక్రియ సక్రమంగా చేయకపోవటంతో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కూడా తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. వార్డుల్లో ఉంటున్నవారు మరుగుదొడ్లు వినియోగించేందుకు, ఇతర అవసరాల కోసం నీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం జీజీహెచ్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందించాల్సి ఉంది. భోజన విరామం కోసం గంట గ్యాప్ ఇస్తే, మిగతా సమయమంతా ఓపీల్లో వైద్యులు ఉండి చూడాల్సిందే. కానీ పెద్ద ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు పనివేళలు పాటించడం లేదు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వారు తీరిగ్గా 10 గంటలకు ఓపీకి వస్తున్నారు. కొంత మంది హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు ఓపీ వైద్య సేవలకు డుమ్మా కొడుతున్నారు. ఓపీ విభాగానికి వచ్చిన సీనియర్ వైద్యులు రోగులను చూడకుండా ఓపీ సమయంలోనే వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతూ మధ్యాహ్నం చేయాల్సిన విధులను ఓపీలో చేసేసి మధ్యాహ్నం విధులు ఎగ్గొట్టి సొంత ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు. కొంత మంది వైద్యులు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ఇళ్లకు, సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కొంత మంది పీజీ వైద్యులతో కొన్ని వైద్య విభాగాల వారు ఈవినింగ్ క్లినిక్ను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. పెద్దాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు వారంలో కేవలం రెండు రోజులు లేదా మూడు రోజులు మాత్రమే ఓపీలు నిర్వహిస్తారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవల కోసం రోగులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. విధులు నిర్వహించని వైద్యులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో రోగులను వార్డులోకి తరలించేందుకు అవసరమైన వీల్చైర్లు, స్ట్రక్చర్లు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని వీల్చైర్లు తుప్పుబట్టిపోయి వినియోగించడానికి పనికి రాకుండా ఉంటున్నాయి. రోగుల బంధువులే వైద్య పరీక్షల కోసం, వార్డుల్లో అడ్మిషన్ కోసం రోగులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది. రోగులను తరలించాల్సిన కింది స్థాయి ఉద్యోగులు ఆసుపత్రిలో ఉన్నారో.. లేరో.. అన్నట్లు ఉంది. వీరిపై అజమాయిషీ చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల చెక్పోస్టు సెంటర్లో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన శివరాత్రి మునెయ్య (30) వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద జరిగే పాతపాటి పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా హోటల్ నిర్వహించేందుకు సామగ్రి ఆటోలో వేసుకొని బయలుదేరాడు. చెక్పోస్టు సెంటర్ వద్దకు రాగానే జేసీబీ రోడ్డుపైకి రావడంతో ఆటో అదుపు తప్పి జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునెయ్య మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మునయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన జాతీయ నాటకోత్సవాలు
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి శింగమనేని సుబ్బారావు కళావేదికపై సుమ్రిత యూత్ అసోసియేషన్, మధిర వారి యయాతి అనే పౌరాణిక నాటకం ప్రదర్శించారు. ప్రతిరోజూ రెండు నాటికలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. వర్తమాన సమాజ స్థితిగతులకు నాటికలు అద్దంపట్టాయి. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహించారు. నాటకోత్సవాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన కళాంజలి కార్యదర్శి సాంబశివరావును అభినందిస్తూ గౌరవ సత్కారం నిర్వహించారు. కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు. -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో సదస్సు
గుంటూరు మెడికల్: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కలిసి మద్దతు కోరారు. స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ టీవీ మాజీ చైర్మన్ ఊర్మిలేష్, రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధులు డాక్టర్ కాంచన యాదవ్, కుమారి ప్రియాంక భారతి, సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రొఫెసర్ సందీప్ తదితరులను డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తాను కలిసిన వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు 1992లో ఆనాటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రతిని వారికి అందజేశారు. లోక్ సభలోను , అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో ఓబీసీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న కాలంలో వారి సంఖ్య మరీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు డాక్టర్ ఆలా వివరించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఆగస్టు 7న ఢిల్లీలో మేధావుల సదస్సును నిర్వహించనున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్ వివరించినట్లు చెప్పారు. -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనం రద్దు చేసి రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. దీంతో ఉదయం 11గంటల కల్లా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. మరో వైపున అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులోని పార్కింగ్ ప్రదేశం పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో కార్లు ఇతర వాహనాలను కనకదుర్గనగర్కు మళ్లించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్నాన ఘాట్, క్యూలైన్ల పరిశీలన.. దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దుర్గాఘాట్ స్నానాల రేవులో అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవులోని గట్టుపై మట్టి, వ్యర్థాలు నదిలో పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. తెనాలిరూరల్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి– చుండూరు స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన అండర్–11 చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్–11 చిన్నారుల చెస్ పోటీలు ముగిశాయని టోర్నమెంట్ డైరెక్టర్ వైవీకే చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మందికిపైగా చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. బాలికల విభాగంలో పి.లాలిత్య, పి.భవిష్య, బాలురలో ఎం.చేతన్, శౌర్యదీప్ సింగ్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారన్నారు. నలుగురు చిన్నారులు ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ రవీంద్రరాజు, విజేత స్కూల్ డైరెక్టర్ నిమ్మల సురేష్, ఇన్చార్జి సంధ్యలు విజేతలకు బహుమతులు అందించారని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నగరం: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి–మీ హక్కు కార్యక్రమం దోహదపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఆదివారం జరిగిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రీ సర్వేతో రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత శాసీ్త్రయంగా రూపొందించిన భూ హక్కు పత్రాలు పట్టాదార్ పాస్పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.వినోద్కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా నిర్ధారించడంతో భూ వివాదాలు తగ్గడమే కాకుండా రైతులకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చన్నారు. భూహక్కు పత్రాలు, పాస్ పుస్తకాలను రైతులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. యడ్లపాడు: మండల పరిధిలోని సొలస గ్రామంలో వెలసిన శ్రీ భూ సమేత రంగనాయక స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆదివారం పవళింపు సేవతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యుల నేతృత్వంలో స్వామి వారికి పూలంగి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఈఓ నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్– నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి రంగనాథుని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. భక్తుల గోవింద నామస్మరణతో సొలస క్షేత్రం మార్మోగింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.40 అడుగులకు చేరింది. ఇది మొత్తం 159.3072 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
రిటర్నబుల్ ప్లాట్లలో అక్రమ తవ్వకాలు
మంగళగిరి టౌన్ : అమరావతి రాజధాని ప్రాంతంలోని రిటర్నబుల్ ప్లాట్లతో సహా వివిధ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతో మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. అధికారిక అనుమతులు లేకుండానే జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో మట్టిని భారీగా తరలిస్తూ అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు. మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని తెలుసుకున్న రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.తవ్వకాలు సాగిస్తున్న పొక్లెయిన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో భారీ యంత్రాలతో మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మట్టి తవి్వతే మా గతేమిటంటూ రైతులు ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోక పోవడంపై రైతులు మండిపడ్డారు.తవ్వకాల వల్ల తమ ప్లాట్లలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వర్షం వస్తే చెరువుల్లా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి గుంతల భూములను ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే తమకు కేటాయించిన ప్లాట్లలో అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, గుంతలను పూడ్చి వేయాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియా ఇంత భారీగా తవ్వకాలు సాగిస్తోందంటే తప్పకుండా ప్రభుత్వ పెద్దల అండ ఉంటుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కట్టుకథలతో నాపై అట్రాసిటీ కేసు పెట్టారు’
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్లను కూడా రెడ్బుక్ వదల్లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు...ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు. -
తెనాలి పోలీసుల రూటే సెపరేటు
తెనాలి: తమ రూటే సెపరేటు అన్నట్టుగా తయారయ్యారు తెనాలి పోలీసులు. కేసుల నమోదు, నిందితుల అరెస్టులో విమర్శలు వస్తున్నా పట్టటం లేదు. చివరకు పోలీసులపై దాడి కేసుల్లోనూ నిందితులను గోప్యంగా ఉంచుతున్నారు. అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే కేసుల నమోదు, నిందితుల అరెస్టు వంటివి జరుగుతున్నాయనేది బహిరంగంగానే వినిపిస్తోంది. ఇటీవల అంగలకుదురులో జరిగిన దాడి కేసులోనూ పోలీసులు ఇదే వైఖరిని అవలంభించారు. గ్రామస్తులంతా మూకుమ్మడిగా రోడ్డుపై ధర్నాకు దిగితేగాని తత్వం బోధపడలేదు. సాధారణ సెక్షన్లతో నమోదుచేసిన కేసును హత్యాయత్నం కేసుగా మార్చుతామనీ, నిందితులను అరెస్టు చేస్తామని హామీని ఇవ్వాల్సివచ్చింది. ● రూరల్ మండలం అంగలకుదురులో గత నెల 28వ తేదీ సాయంత్రం రోడ్డుపై వాహనం పార్కింగ్ విషయమై గ్రామానికి చెందిన వెలగా తులసీరామ్, షేక్ నాగుల్మీరాల మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి 9:45 గంటల ప్రాంతంలో నాగుల్మీరా, మరి కొంతమందిని వెంటతీసుకుని తులసీరామ్ ఇంటికి వవెళ్లారు. ఇంట్లో ఉన్న అతడిని కిందకు కొట్టుకుంటూ తీసుకురావడమే కాకుండా, వస్తువులను ధ్వంసం చేసి, దొమ్మీకి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిని తులసీరామ్ను స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ 324, ఇంట్లోకి దొమ్మీపై వెళ్లటంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ● టీడీపీ ఆధిక్యత కలిగిన అంగలకుదురులోకి బయట వ్యక్తులు ప్రవేశించి తులసీరామ్పై అతడి ఇంట్లోనే మందిగా వచ్చి దాడికి పాల్పడటంపై గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అంగలకుదురు గ్రామ పరిరక్షణ సంఘంగా ఏర్పడి సమావేశం పెట్టుకున్నారు. రక్తగాయాలు వచ్చేలా దాడిచేసిన కేసులో 324 సెక్షన్ పెట్టటం, దొమ్మీపై నాన్బెయిలబుల్ కేసు పెట్టటం నచ్చలేదు. పైగా మూడురోజులైనా నిందితులను అరెస్టు చేయని పోలీసుల వైఖరిపై మండిపోయారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగకపోతే న్యాయం జరగదన్న భావనతో శనివారం సాయంత్రం అంగలకుదురులో తెనాలి–గుంటూరు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు బైక్లను అడ్డుపెట్టారు. ప్లకార్డులను చేతపట్టి పోలీసుల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఫలితంగా రద్దీ రహదారిలో భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు, సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ధర్నా చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీసుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. తప్పని పరిస్థితుల్లో నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని, దాడిపై నమోదు చేసిన సెక్షన్నూ మారుస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. -
మీ విజయం స్ఫూర్తిదాయకం
గుంటూరు వెస్ట్: ‘విద్యార్థులూ... మీ విజయం స్ఫూర్తిదాయకం.. భవిష్యత్ విజేతలు మీరే..’ అని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ కొనియాడారు. తన మాతృమూర్తి ఉపాధ్యాయురాలని, ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ఎంతో గౌరవం ఉందని కలెక్టర్ తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుల అభినందన సభ ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పది ఫలితాల్లో జిల్లాను గర్వకారణంగా నిలిపారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల ఉన్న అపోహలన్నింటికీ సమాధానం మీరేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరూ.. మీమీ పాఠశాలల్లోని తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు స్ఫూర్తిని, ప్రేరణను నింపాలన్నారు. పిల్లల చదువులకు సహకరించి, గొప్ప విజయాలు సాధించడంలో తోడ్పాటును అందించిన తల్లిదండ్రులను అభినందించారు. ఉత్తమ ఫలితాల సాధనలో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. నేటి ప్రభుత్వ విద్యార్థుల మార్కులు చూస్తే తనకే ఈర్ష్యగా ఉందంటూ.. అంతటి ఘనవిజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు సెల్యూట్ చేశారు. ● జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ జిల్లా నుంచి 27,012 మంది పరీక్షలకు హాజరు కాగా 24,011 మందితో 88.89 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో జిల్లా నిలిచిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సత్కరించారు. మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఇదేం రీల్స్ పిచ్చి!
గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్ సోషల్ మీడియా రీల్స్కు అడ్డాగా మారింది. రోగులకు సేవలందించాల్సిన ఓ వైద్యుడు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. కర్రతో విన్యాసాలు చేస్తూ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేసి వాట్సాప్ స్టేటస్గా పెట్టడంతోపాటు, ఫేస్బుక్, యూట్యూబ్లలో సైతం అప్లోడు చేశాడు. సాక్షాత్తు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుటే డాక్టర్ రీల్స్ చేస్తున్నా సూపరింటెండెంట్ గానీ, సీఎస్ ఆర్ఎంఓగానీ, అడ్మినిస్ట్రేటర్ గానీ ఎవరూ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. విధులకు డుమ్మా.. రీల్స్తో హంగామా జీజీహెచ్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) గా క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ గురుప్రసాద్ శుక్రవారం క్యాజువాల్టీలో విధులు నిర్వహించకుండా సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జీజీహెచ్లో క్యాజువాల్టీ ఆసుపత్రికి గుండెకాయలాంటిది. రోడ్డు ప్రమాద బాధితులు, విషప్రభావానికి గురైన వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో అత్యవసర చికిత్సల కోసం వచ్చేవారంతా కూడా మొదట ఎమర్జెన్సీ వార్డుకు చికిత్స కోసం వస్తుంటారు. అక్కడ వైద్యులు నిరంతరం అప్రమత్తంగా ఉండి బాధితులను రోగులను సత్వరమే పరీక్షించి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. ఎంతో కీలకమైన క్యాజువాల్టీలో డాక్టర్ విధులు నిర్వహించకుండా రీల్స్ చేయడంపై ప్రశ్నించినందుకు ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జి, ఆర్ధోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ అనిల్బాబుతో సైతం దురుసుగా మాట్లాడి కర్రతో దాడిచేసినట్లు డాక్టర్ అనిల్బాబు లిఖిత పూర్వకంగా ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఆరోపణలు.. గతంలోనూ ఎమర్జెన్సీ మెడిసిన్లో విధులు నిర్వహించడం లేదని, డ్యూటీలు నిర్వహించకుండా రీల్స్ చేస్తున్నారన్న ఆరోపణలు డాక్టర్ గురుప్రసాద్పై వచ్చాయి. అతడిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జిగా పనిచేసిన డాక్టర్ గాజుల రామకృష్ణ సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు సదరు వైద్యుడిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ నేడు ఆవిధంగా రీల్స్ చేస్తూ ఆసుపత్రి పరువు బజారున పడేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో వైద్యులు ఇలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం విమర్శలకు తావిస్తుంది. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్వర్మ సంఘటనపై స్పందించి ఎమర్జెన్సీ వార్డులో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేలా వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని, రీల్స్ చేయకుండా కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. -
వైభవంగా సాక్షి భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణం, హేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తలమండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాధరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనురాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధరతిలక్ పర్యవేక్షించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన పలు యూజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు శనివారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఏ, బీబీఏ, ఐదవ సెమిస్టర్, బీకాం జనరల్, కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడించామన్నారు. ఈనెల 13వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు ప్రతి పేపర్కు రూ.1200 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 16వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగ డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, సూపరింటెండెంట్ టంకశాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు మురళి, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ: మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ చిన్నమల్లయ్యపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. వినుకొండకు చెందిన ఓ మహిళపై లైంగికదాడితోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను శనివారం సస్పెండ్ చేశారు. కేసు నమోదు నేపథ్యంలో సీఐ పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఏ క్షణమైన ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నగరంపాలెం: పోలీస్ విధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు (హెచ్సీ), ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్న్ హెచ్సీ ఏవీ.రమణ, కానిస్టేబుల్ సీహెచ్.రాము, తెనాలి గ్రామీణ పోలీస్స్టేషన్ హెచ్సీ చెంగల రాయుడుని సస్పెండ్ చేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని చెప్పారు. అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, విధుల దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా గీత దాటితే శాఖాపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
మైనర్పై థర్డ్ డిగ్రీ!
తాడేపల్లి రూరల్: టీడీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మైనర్ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. పక్కదారి పట్టించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిలోని ప్రకాష్నగర్కు చెందిన 14 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు గతంలో మరణించారు. దీంతో ఆ బాలుడు కూలి పనులకు వెళుతూ నాయనమ్మ, తమ్ముడిని పోషిస్తున్నాడు.కాగా.. ఇటీవల అతడి బాబాయ్తో టీడీపీకి చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో బాలుడి బాబాయ్ తల పగిలింది. ఆ బాలుడు 108 వాహనంలో బాబాయ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలుడు కేసు పెడితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నులకపేటకు చెందిన టీడీపీ మైనార్టీ నాయకుడు, ఇతర నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. స్టేషన్కు పిలిపించి.. కర్కశత్వానికి ఒడిగట్టి.. టీడీపీ నేతల మెప్పుకోసం తాడేపల్లి పోలీసులు ఆ బాలుడిని స్టేషన్కు పిలిపించారు. కెమెరాలు లేని గదిలో అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బెదిరింపులకు దిగారు. హంటర్ (చెక్కపిడికి రబ్బరు తొడిగి ఉన్న చెర్నకోలా)తో ఎస్ఐ సాయి తనను కొట్టారని, మరో కానిస్టేబుల్ తన మోకాళ్లపై బూటుకాలు వేసి తొక్కారని, అరచేతులపై దారుణంగా కొట్టారని బాలుడు మీడియా ఎదుట వాపోయాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీఎస్పీ విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకులు బాలుడి ఇంటికి వెళ్లి బెదిరించారని, బాలుడి బంధువులు, నాయనమ్మతో డీఎస్పీ ఎదుట తప్పుడు సమాధానం ఇప్పించారని సమాచారం. -
స్పా ముసుగులో వ్యభిచారం
గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్్కఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలెం సమీపంలో ఐరాస్పా రిలాక్స్ రెన్యూ రిజువంట్ స్పా సెంటర్లో నల్లపాడు పోలీసులతో కలిసి దాడిచేయగా మేనేజర్ సూర్యతోపాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్ద మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్పరిధిలోని ఇన్నర్రింగ్రోడ్డు ఫేజ్–2 చిల్లీస్ సెంటర్ ఎదురు గల స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం టాస్్కఫోర్స్ పోలీసు బృందం దాడిచేసి మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారంచోటుచేసుకుంది. చిల్లీ సెంటర్లోని ఏ9 బ్యూటీఫుల్ సెలూన్ అండ్ స్పా –2 మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర రాష్ట్రానికి చెందిన ఒక మహిళ, 11సెల్ఫోన్లు, స్పా నిర్వాహకుడు ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
నీట్కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరగనున్న జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026)కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 8,417 మంది విద్యార్థులకు 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 తరువాత కేంద్రాల్లోనికి అనుమతించరు. నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పొందుపర్చిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ ఆంక్షలు విధించింది. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులు సహా ఆభరణాలను ధరించరాదు. విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి విద్యార్థులు ప్రింటవుట్ అడ్మిట్కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. దీంతోపాటు పోస్ట్కార్డ్ సైజు వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపర్చారు. అదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను ఆయా కేంద్రాల్లోనే ఇస్తారు. -
గుంటూరు
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. నగరంపాలెం: విశ్వశాంతిని కాంక్షిస్తూ బృందావన్ గార్డెన్స్లోని వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.8200, మోడల్ ధర రూ.6000 వరకు పలికింది. రమణీయం.. రథోత్సవం పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి దివ్య రథోత్సవం స్వర్ణపురి పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం పూలతో విశేషంగా అలంకరించిన రథంపై స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, స్వామివారి నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. ఆలయ ప్రాంగణం నుంచి కసుకర్రు రోడ్డు వరకు రథోత్సవం సాగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు అందించారు. డప్పు కళాకారుల సందడి ఆకట్టుకుంది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవదాయ సహాయ కమిషనర్ గాండ్ల కామేశ్వరమ్మ, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాథరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధర తిలక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 7 -
ఏఐ సరే.. అసలు కారణం పట్టించుకోరే?
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమల నియంత్రణకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డ్రోన్ల సహాయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దోమల లార్వా నియంత్రణకు చేపట్టిన ఈ కార్యక్రమాలు కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతున్నాయని, అసలు సమస్యకు మూల కారణాలపై దృష్టి పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు విలీన గ్రామాల్లోని 26 ప్రధాన చెరువుల్లో, మురుగు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతల్లో 174 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ ఆపరేషనన్ చేసేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే సదరు డ్రోన్ ఆపరేషన్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు లేకపోవడంతో అక్కడే మురుగునీరు నిల్వ ఉండి దోమల వృద్ధికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని శివారు ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమల వృద్ధి మరింత పెరిగిపోతోందని చెప్పుకోవచ్చు. శుభ్రం చేసే వారే కరువు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 3,129.45 కిలోమీటర్ల పొడవైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. నగర పరిధిలో ప్రజారోగ్య విభాగంలో సుమారు 2 వేల మంది సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొంతమంది డెప్యూటేషన్పై నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారుల వద్ద, మరి కొంతమంది అధికారుల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ గడిపేస్తున్నారు. మిగిలిన కొంతమందితో నగరం అంతా డ్రైనేజీ వ్యవస్థ శుభ్రం చేయడం కష్టంగా మారిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో పారిశుద్ద్య కార్మికులు డ్రైయిన్లు శుభ్రం చేసే పరిస్థితి లేదని నగరవాసులు చెబుతున్నారు. అదే విధంగా మలేరియా విభాగంలో పనిచేసే వారు ఫాగింగ్ మిషన్లను ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లోనే ఎక్కువగా తిప్పుతున్నారు. మిగిలిన ప్రాంతాలకు అసలు వెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.. దీంతో రాత్రి వేళల్లో నగర వాసులు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాలలో అధ్వానం గుంటూరు నగరంలో విలీనమైన 10 గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కచ్చా డ్రైనేజీలు దర్శనమిస్తూ.. ఆ డ్రైనేజీలో మురుగు అంతా ఇళ్ల ముందే నిలిచిపోయి దుర్వాసనతోపాటు దోమల వృద్ధికి కారణం అవుతోంది. అదే విధంగా నగరంలో ఖాళీ స్థలాలు 10 వేలకుపైగా ఉన్నాయి. వీటిల్లో చాలా చోట్ల పిచ్చి మొక్కలు, చెట్లు పెరగడంతోపాటు కొన్ని స్థలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో అవి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు సాధారణంగా చెరువుల్లో దట్టంగా పెరిగిన గురప్రుడెక్క, తూటికాడను తొలగింపజేస్తారు. జీఎంసీ మలేరియా విభాగ సిబ్బంది నేరుగా లోపలికి వెళ్లి మందు చల్లడం ప్రమాదకరంగా మారడంతో ఏఐ డ్రోన్లను వాడుతున్నారు. కానీ డ్రైయిన్లు లేని చోట నిర్మించడంతోపాటు ఉన్నవాటిని సక్రమంగా శుభ్రం చేయించడం ముఖ్యమనే విషయం కూడా అధికారులు మర్చిపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించడంతోపాటు ఫాగింగ్ వంటివి కూడా పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. అప్పుడే కొంతలో కొంతైన దోమల నివారణ సాధ్యమవుతుందని నగర వాసులు పేర్కొంటున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
జగన్ పాలనలో శ్రమజీవులకు మెరుగైన జీవన ప్రమాణాలు
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రమ జీవులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. శుక్రవారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ విభాగ అధ్యక్షుడు శేషగిరి పవన్కుమార్ ఆధ్వర్యంలో మేడే (కార్మికుల దినోత్సవ) వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, షేక్ నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, డైమండ్ బాబులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కార్మిక జెండాను ఆవిష్కరించారు, అనంతరం ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ కార్మిక, కర్షక, రైతు సోదరులకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి విస్తృత రీతిలో కార్యక్రమాలను అమలు పర్చడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారని అన్నారు. ప్రస్తుత టీడీపీ పాలనలో కార్మిక, కర్షక, రైతుల సంక్షేమం ఎండమావిగా మారిందని, కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం రోడ్డు ఎక్కి పోరాటాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు న్యాయమైన హక్కుల సాధన కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేత నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి పెనుమాల అరుణ్కుమార్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిపోయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్, నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మురళి, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు పటాన్ సైదాఖాన్, బాబు, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జి.ప్రభు, అరవింద్, చింతపల్లి రమణ, అరుణ్, భాను, కేసరి సుబ్బులు, స్వర్ణలత, నందేటి రాజేష్, సురసాని వెంకటరెడ్డి, నాజర్, హనుమంతు గోపి శ్రీనివాస్, రామచంద్రయ్య పాల్గొన్నారు. -
రంగురాళ్ల డంపు స్వాధీనం
దాచేపల్లి: భారీ స్థాయిలో రంగురాళ్ల గుట్టును అధికారులు రట్టు చేశారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఓ గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లను అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సహాయంతో అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లు (క్రిస్టల్ క్వార్జ్) స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ నుంచి ఈ రంగురాళ్లు వెలికి తీసినట్లు అధికారులు గుర్తించారు. రంగురాళ్ల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తరువాత వీటి విలువ ఎంత అనేది తెలుస్తుంది. స్థానికుల సమాచారం సుమారు రూ.కోటి పైనే రంగురాళ్ల విలువ ఉంటుందంటున్నారు. స్థానిక సీఐ రాజేష్, అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, పంచనామా నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు అవకాశం
డిసెంబరు 31వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి గుంటూరు, వెస్ట్: సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ భూ పరిమితులు చట్టం, 1976 ప్రకారం ప్రభుత్వ పరిధిలోనికి వచ్చిన సీలింగ్ భూములు, మిగులు భూములు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందన్నారు. తమ ఆధీనంలో ఉన్న భూములకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువున, ఎగువున ఉన్న అందరు నిబంధనల మేరకు అర్హత కలిగి ఉంటారన్నారు. సీలింగు భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ 241 జి.ఓను జారీ చేసిందని చెప్పారు. ఈ ఉత్తర్వుల మేరకు సీలింగ్ భూములను క్రమబద్ధీకరించుకొనుటకు అర్హులైన వ్యక్తులు డిసెంబరు 31వ తేదీలోగా జాయింట్ కలెక్టర్, కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సిలింగ్స్, గుంటూరు వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన మొత్తాన్ని రెండు దఫాలుగా – దరఖాస్తు సమయంలో 50 శాతం, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తేదీ నుంచి ఒక నెల గడువు లోపల మిగిలిన 50 శాతం చెల్లించాలని వివరించారు. 150 చదరపు గజాల వరకు అన్ని అర్హతలు గల వారికి ఉచితంగా డి – పట్టా మంజూరు చేస్తారని, 150 నుండి 300 చదరపు గజాల వరకు ప్రాథమిక (బేసిక్) విలువలో 15 శాతం చెల్లించాలని, 300 నుండి 500 చదరపు గజాల వరకు బేసిక్ విలువలో 30 శాతం, 5 వందల చదరపు గజాలకు పైబడి ఉంటే బేసిక్ విలువ శత శాతం చెల్లించాలని వివరించారు. క్రమబద్ధీకరించుకొను అర్హులకు కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 2019 మే 1వ తేదీకి ముందు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. క్రమబద్దీకరణ విలువ చెల్లించిన వారి భూములను వారి సొంత ఖర్చులతో వారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం కల్పించడమే కాకుండా ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు తగు చర్యలు తీసుకుంటారన్నారు. డి – పట్టా పొందిన వారికి, గతంలో 10 సంవత్సరాల తరువాత మాత్రమే బదలాయింపు చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం 2 సంవత్సరాలకు బదలాయింపు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. -
అంతర్ జిల్లా బాస్కెట్బాల్ చాంపియన్షిప్ జిల్లా జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో జరగనున్న అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు ఎంపిక శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఏపీ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జీఎస్సీ బోస్, కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు సీహెచ్ శ్రీనివాసరావు, అనిల్, రవికుమార్ పర్యవేక్షించారు. అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుపున బాలుర విభాగం నుంచి షణ్ముఖ్, రూపేష్, మణికంఠ, అఖిల్, జాన్ ప్రడ్డి పాల్, జయ రామ్, అఖిల్, విజయ్, ప్రత్యుష, సత్య, ఈశ్వర్ దినేష్ స్టాండ్ బై గా గిరి, హర్షిత్, ఆకాష్, రుత్విక్, బాలికల విభాగం నుంచి యోగ శ్రీ, మానస, అక్షయ, కుండానే, కావ్య, జుబేరియా, శ్రీ లక్ష్మి, ఫర్హానా, ఈషా, ప్రణతి, సహస్ర, సాయి శ్రీ స్టాండ్ బైగా బృంద, జస్విత, ప్రణీత, బ్లేస్సిలను ఎంపిక చేశారు. డాక్టర్ తనపై దాడి చేశాడంటూ విభాగాధిపతి ఫిర్యాదు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో విధుల కేటాయింపులో వివాదం ఏర్పడి ఓ డాక్టర్ ఓ విభాగాధిపతిపై దాడిచేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తనపై దాడిచేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ విభాగాధిపతి లిఖితక పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్ ఆర్ధోపెడిక్ విభాగాధిపతిగా, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జిగా డాక్టర్ పాటిబండ్ల అనిల్బాబు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జి విధులు చేపట్టిన డాక్టర్ అనిల్బాబు ఎమర్జెన్సీ మెడిసిన్లో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు రోడ్డు ప్రమాద బాధితులు, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలువురు క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్లకు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (సీఏఎస్) విధులు కేటాయించారు. జీజీహెచ్లో క్యాజువాల్టీలో పనిచేస్తున్న సీఏఎస్లను క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు. వీరు మూడు షిఫ్ట్లు క్యాజువాల్టిలో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మే నెలకు సంబంధించి డ్యూటీ రోస్టర్ వేసిన పిదప క్యాజువాల్టిలో విధులు నిర్వహించకుండా ఆర్ఎంఓ రూములో డాక్టర్ గురుప్రసాద్ ఉండటంపై డాక్టర్ అనిల్కుమార్ ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగి డాక్టర్ గురుప్రసాద్ తనను అసభ్యంగా మాట్లాడి, కర్రతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, డ్యూటీలు సక్రమంగా నిర్వహించేలా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆసుపత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఉన్నవ గ్రామంలో చోరీ యడ్లపాడు: మండల పరిధిలోని ఉన్నవలో పట్టపగలే గర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీ చేసినట్లు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెన్నుపాటి కృష్ణవేణి రోజువారీ కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తలుపులు తీసి ఉండటంతో పాటు, లోపల ఉన్న లాకర్ కూడా తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆందోళనతో లాకర్ను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 48 గ్రాముల బంగారం గొలుసు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం శివారు పరిధిలోని వెంకటేశ్వర నగర్ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన దాసరి మరియబాబు (35) బైకుపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గంమధ్యలోని వెంకటేశ్వరనగర్ సమీపాన ఏదురుగా వస్తున్న ఆర్టీసీ ఢీకొనటంతో రోడ్డుపై పడి కుడి కాలు విరిగిపోవటంతో సత్వరమే 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్తం అధికంగా పోవటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.ఆర్టీసి డ్రైవరు సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. -
రానున్న ఐదు రోజులు ఎండ తీవ్రం
గుంటూరు వెస్ట్: రానున్న ఐదు రోజులపాటు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న ఐదు రోజులలో వేసవి తీవ్రత (హీట్ ఇండెక్స్) అధికంగా ఉంటుందని సూచించిందన్నారు. 41 – 54 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉండవచ్చని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు, మేడికొండూరు, కొల్లిపర, మంగళగిరి, పొన్నూరు ఫిరంగిపురం, చేబ్రోలు, పెదనందిపాడు, తాడేపల్లి, తాడికొండ, గుంటూరు పశ్చిమం, పెదకాకాని, కాకుమాను, తెనాలి, వట్టిచెరుకూరు, తుళ్ళూరు, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని ఆయన సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబసభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగవద్దని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పింఛన్లు పంపిణీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ శుక్రవారం స్థానిక ఆకులవారి తోటలో పంపిణీ చేశారు. స్థానికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,53,379 మంది పింఛనుదారులకు రూ.110.50 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. -
టెన్త్ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్. విజయభాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు 600 మార్కులకు అత్యధికంగా 597, 594 కై వసం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా ముగ్గురు విద్యార్థులు 593 సాధించగా, 592 మరో ముగ్గురు, ఐదుగురు విద్యారులు 591 కై వసం చేసుకున్నట్లు వివరించారు. 590కు పైగా 17 మంది, 580 పైన 74 మంది, 570 పైన 176 మంది, 560 పైన 271, 550కు పైగా 344, 540కి పైగా 423, 530కి పైగా 490, 520కి పైగా 543 మంది, 510కి పైగా 593, 500కు పైగా 641, 500లోపు 641 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 1200 మంది విద్యార్థులకు గాను మ్యాథ్స్లో 104 మందికి 100 మార్కులు, 248 మందికి 95 పైన మార్కులు, తెలుగులో 108 మందికి 100 మార్కులు, 357 మందికి 95 మార్కులపైన మరియు సోషల్లో 71 మందికి 100 మార్కులు, 351 మందికి 95 పైన మార్కులు, సైన్స్లో 19 మందికి 100 మార్కులు, 243 మందికి 95 పైగా మార్కులు, హిందీలో 19 మందికి 100 మార్కులు, 230 మందికి 95 పైగా మార్కులు, ఇంగ్లీష్లో 230 మందికి 95కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఆక్స్ఫర్డ్ ఘన విజయం సాధించిందని కొనియాడారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రాన్సిస్రెడ్డి, వైస్ చైర్మన్ అరోన్రెడ్డి, డైరెక్టర్ జోసఫ్రెడ్డి, ఇన్చార్జ్లు మనోజ్, భాస్కర్ విద్యార్థులను అభినందించారు. -
ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు
రాజాధి రాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నృసింహుని జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి హోమం, నరసింహ మూలమంత్ర హోమం అనంతరం శాంతి కల్యాణం చేశారు. సాయంత్రం రాజాధిరాజ వాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయంతి ఉత్సవాల శాశ్వత కై ంకర్యపరులుగా మాల్యవంతం లక్ష్మీ నరసింహాచార్యులు, శేషమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. కమనీయం రంగనాథుడి కల్యాణం యడ్లపాడు: సొలస గ్రామంలోని శ్రీభూదేవి సమేత రంగనాయకస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో పరవశించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ మండపాన్ని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదికపై నూతన వధూవరులుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు నేతృత్వంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ఉలూఖల గౌరీ పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కల్యాణం భక్తులు తిలకించి పులకించిపోయారు. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా గ్రామ భక్త బృందం చేసిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కల్యాణానంతరం హోమం, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు గరుడ వాహనంపై రథోత్సవంలో పురవీధుల్లో ఊరేగుతుండగా, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నీరాజనాలు అర్పించారు. ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామ పెద్దలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వేసవి క్రీడా శిక్షణకు తమ పిల్లల్ని పంపించి వారిలోని సృజనాత్మతకు, ప్రతిభకు తల్లిదండ్రులు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంప్ల పోస్టర్ను శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ అశుతోష్ శ్రీవత్సవ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు సెలవుల్లో కనీస ఆటవిడుపుతోపాటు చక్కని ఆరోగ్యం కూడా వేసవి శిక్షణ ద్వారా లభిస్తాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో కార్మికుల పాత్ర ముఖ్యమైనదన్నారు. సమాజంలో కార్మికులకు భద్రతా, పనికి సరిపడా వేతనం కార్మికుల హక్కులని తెలిపారు. ప్రజలందరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమాజంలో ఎక్కువగా ఉందని, ఫ్యాక్టరీలు, హోటళ్లలో పిల్లలు కార్మికులుగా మారుతున్నారన్నారు. పేదరికం, అవగాహనా లోపం వలన తల్లిదండ్రులు పిల్లల చదువులు మాన్పించి కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన మనందరి సమష్టి బాధ్యత అన్నారు. బార్ ప్రెసిడెంట్ మధిర నాగేశ్వరరావు, ప్యానెల్ అడ్వకేట్, కార్మిక దినోత్సవంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ పాండురంగారావు, ఎం.మాధురి, ఏ.సంతోష్కుమార్, ఆర్.చేతన్, పి.వీరాంజనేయులు, స్టేక్ హోల్డర్స్, సోప్ వర్కర్స్, మునిసిపల్ వర్కర్స్, ప్యానెల్ అడ్వకేట్స్, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. -
నగర అభివృద్ధికి సమష్టి కృషి అవసరం
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు వెస్ట్: గుంటూరు నగరం రూపురేఖలు మారాలని, సుందరమైన, ఆకర్షణీయంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థ ప్రగతిపై శుక్రవారం స్థానిక కలెక్టట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ, కమిషనర్ కె.మయూర్ అశోక్, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలన్నారు. సురక్షిత తాగునీరు, చక్కని పారిశుధ్యం, ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, మంచి రహదారులు, కాలువలు వంటి సౌకర్యాలు సమకూర్చి సుందరమైన పట్టణంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగల పౌరులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా వాణిజ్య సంస్థల నుంచి వచ్చే చెత్త నిర్మాణ పట్ల దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం నిర్వహణను ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు. ప్రజా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. బొంగరాలబీడు వద్ద మంచి పార్కు అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరం మేరకు కార్మికులను పెంచాలని, 2027 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేగంగా పూర్తి చేసేందుకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. గోరంట్ల నీటి పథకం జూన్ మొదటి వారం నాటికి ప్రారంభం కావాలని ఆదేశించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ మానస సరోవరం అభివృద్ధి పనులను పి.పి.పి మోడ్లో చేపట్టే ఆలోచన ఉందన్నారు. అమృత్ 2.0 క్రింద చెరువు పునరుద్ధరణకు అవకాశం ఉందని చెప్పారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు శాసీ్త్రయ విశ్లేషణ చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలెం సమీపంలో ఐరాస్పా రిలాక్స్ రెన్యూ రిజువంట్ స్పా సెంటర్లో నల్లపాడు పోలీసులతో కలిసి దాడిచేయగా మేనేజర్ సూర్యతోపాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్ద మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్పరిధిలోని ఇన్నర్రింగ్రోడ్డు ఫేజ్–2 చిల్లీస్ సెంటర్ ఎదురగల స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం టాస్క్ఫోర్స్ పోలీసు బృందం దాడిచేసి మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారంచోటుచేసుకుంది. చిల్లీ సెంటర్లోని ఏ9 బ్యూటీఫుల్ సెలూన్ అండ్ స్పా –2 మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర రాష్ట్రానికి చెందిన ఒక మహిళ,11సెల్ఫోన్లు, స్పానిర్వాహకుడు ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘అద్భుతం అంటూ నమ్మించి.. ఇలా దోచుకుంటున్నారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు వందల కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శమన్నారు. తన సంపద సృష్టికోసమే అమరావతినే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్ టవర్స్ పేరుతో మరో రూ. 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం రూ. 3 వ వేల కోట్లు ఖర్చా?, చిన్న చిన్న పనులకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కేబినెట్ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూముల కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయి. అమరావతిని తన సంపద సృష్టికోసం వాడుకుంటున్నారు. తనకు కావాల్సిన వాళ్లు లే ఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. అమరావతి అద్భుత నగరం కాబోతుందని నమ్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే దళారీ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు బాబు హయాంలో దళారీ వ్యవస్థ తారాస్థాయికి చేరింది. ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర లేదు’ అని విమర్శించారు. సజ్జల ఏమన్నారంటే.. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో సానుకూలత వచ్చిందిఎల్లీ బ్యాచ్ దీన్ని తట్టుకోలేక జగన్, ఆయన కుటుంబ సభ్యులను దూషించారుమావిగన్ మొదటి రోజు నుండే రాజధానిగా మారుతుందిఅది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదని అందరికీ తెలిసిపోయిందిఅందుకే టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేశారుఅమరావతిలో సెక్రటరియేట్ భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లా?దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపటమా?ఇది చూసి జనం బిత్తరపోతున్నారుబిల్డింగుల నిర్మాణమే అడుగుకు ప్రస్తుతం రూ.12 నుంచి రూ 14 వేలు అయిందిఈ అద్దాలకు అయ్యే ఖర్చు అదనంఇదంతా కలుపుకుంటే రూ.18 వేలకు ఒక్కో అడుగుకు ఖర్చు అవుతోందిఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో కూడా ఇంత ఖర్చు కాదుపాలవాగు డిజైన్ త్వరలోనే రూపొందిస్తారటబిల్డింగుల చుట్టూ తిరుగుతూ పాలవాగు వెళ్తుందంటదానికి ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదుట్విన్ టవర్ పేరుతో మరో రూ.12 వందల కోట్లు ఖర్చునగిషీలు, డిజైన్లు, అద్దాలు.. ఖర్చులు ఇది నిరంతరమైన ప్రక్రియప్రజల సొమ్మును అమరావతిలో కృష్ణానదిలా పారిస్తున్నారుఅమరావతి పూర్తికాకూడదు, అది నిరంతర ప్రక్రియలా ఉండాలని చూస్తున్నారుదీని ద్వారా సంపద సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటో అర్థం కాదుగతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా చేయలేదుప్రజలకు పనికి వచ్చే ఏ పని గురించి క్యాబినెట్ లో చర్చించలేదుఅమరావతిలో దోచుకోవటానికి అవకాశం కల్పించినందున అక్కడి రైతులు అదృష్టవంతులంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారురెండో దశ ల్యాండ్ పూలింగ్ 13వ తేదీనుంచి ప్రారంభించారుదానికంటే ముందే ఆరో తేదీన లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తారు?రైతులు భూములు ఇచ్చిన వారికి ఏం ప్రయోజనం చేయలేదుకానీ తనకు కావాల్సిన వారి లేఅవుట్లకు ఎలా అనుమతులు ఇస్తారు?ఇంత బరితెగింపు దేశంలో ఎక్కడా జరగటం లేదుఈదోపిడీకి దేవతల రాజధాని అని అందమైన పేరు పెట్టుకున్నారుమెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదురైతులకు మద్దతు ధర లేదుఫీజు రియంబర్స్ మెంట్ నిధులు లేవుకానీ అమరావతిలో దోచుకునేందుకు మాత్రం భారీగా నిధుల విడుదల చేస్తున్నారుఇంధన సంక్షోభం సృష్టించి మరీ దోపిడీ చేశారుఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దోపిడీ చేస్తూనే ఉన్నారురాజధానిలో పేదలకు యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందిపేదల స్థలాలను నిర్దాక్షిన్యంగా లాగేసుకున్నారుచంద్రబాబు చేసే దోపిడీని అడ్డుకుంటున్నందుకు మమ్మల్ని విలన్ లాగా చూస్తున్నారువారిని ప్రశ్నించిందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారుమేము అలాంటి వాటిపై స్పందించంప్రజా సమస్యలు, అవినీతిపై నిలదీస్తాంఅసలు అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయటం ఏంటి?అమరావతిలో మీడియా వాళ్లు వెళ్లే పరిస్థితే ఎందుకు లేదు?అక్కడేమైనా అణుకేంద్రాలు కడుతున్నారా?ప్రజల సంక్షేమాన్ని వదిలేసి వారిని జలగల్లాగ పట్టి రక్తం పీల్చుతున్నారుపూడి శ్రీహరిపై ప్రభుత్వం వేధింపులకు దిగిందిఒకే ఇష్యూ మీద ఎన్ని కేసులు పెడతారు?దీనిపై హైకోర్టు ఒకటి కంటే ఎక్కవ ఎఫ్ఐఆర్ లు పెట్టవద్దని కూడా చెప్పిందిఐనప్పటికీ పోలీసులు బరితెగింపుకు నిదర్శనమేఆటోలో, అంబులెన్సులో ఎక్కించుకుని శ్రీహరిని తిప్పారుఇలాంటి బెదిరింపులకు ఎవరూ లెక్కచేయరుచంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాంఆ శక్తి వైఎస్సార్సీపీకి ఉందితిరుమల లడ్డూపై చేసింది కల్పిత గాధదేవుని సొమ్ముని దోచుకోవటానికి అల్లిన కథ ఇదిదినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో మాపై ఆరోపణలు చేయలేదునెయ్యి కాంట్రాక్టును పెంచుకోవటానికే ఈ మొత్తం కథ నడిపారుఒక్క సంవత్సరంలోనే డబుల్ రేటు చేశారుధర పెంచి దేవుని సొమ్ము దోచుకోవటానికి పన్నిన కుట్రఅందుకోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీశారుఅంత ఘోరాన్ని, నీచానికి చంద్రబాబు పాల్పడ్డారు -
‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు. -
వైఎస్ జగన్ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మహనీయుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయం. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ``మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది``. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మహనీయుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయం. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు.#BuddhaPurnima pic.twitter.com/3IOxAULn6O— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2026 -
మన్యం ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘సీతంపేట ఘాట్ రోడ్లో ఆటో లోయలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. శుభకార్యానికి వెళ్ళి వస్తున్న వారు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరం. మరి కొందరు గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా అని ఓ సందేశం విడుదల చేశారు.పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఓ ఆటో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా.. పాలకొండ-సీతంపేట రూట్లోని ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను సీతంపేట ఏజెన్సీకి చెందిన రమణ(ఆటో డ్రైవర్), ప్రయాణికులు లక్ష్మి, శాంతి, శ్రావణిలుగా గుర్తించారు. ఐదుగురు చిన్నారులు సహా తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. -
చెవులు లేకుండా ఆడ శిశువు జననం
పశ్చిమగోదావరి జిల్లా: రెండు చెవులు లేని శిశువు జననం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సంచలనం కలిగించగా.. స్కానింగ్ రిపోర్టులో వైకల్యం గుర్తించలేదంటూ బాధితులు సదరు సెంటర్ వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన మహిళ తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏప్రిల్ 28న ఆడ శిశువుకు జన్మనిచి్చంది. అయితే శిశువుకు రెండు చెవులు లేకపోవడంతో వైద్యవర్గాలు ఖంగుతిన్నాయి. బాధిత మహిళ మొదటి నుంచి తణుకులోని వేద హాస్పిటల్లో చూపించుకుని స్థానికంగా వేవ్ స్కానింగ్ సెంటర్లో మూడుసార్లు స్కానింగ్ చేయించుకున్నారు. అవయవ లోపాలను గుర్తించే టిఫా స్కానింగ్ కూడా అక్కడే చేశారు. అయితే స్కానింగ్ సెంటర్ వైద్యుడు మాత్రం లోపం లేనట్టుగా రిపోర్టులు ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకోలేక తణుకు జిల్లా ఆస్పత్రిలో చేరారు. ప్రసవం అనంతరం శిశువును చూసిన బాధితులు ఆవేదనతో గురువారం వేద హాస్పిటల్, వేవ్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లి ఆందోళన చేశారు. పోలీసులు, స్థానికులు సర్దిచెప్పడంతో పరిస్థితి చక్కబడింది. శిశువును మెరుగైన వైద్యసేవల కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూలి పనులు చేసుకుని బతికే తమ కుటుంబం వైకల్యం ఉన్న శిశువును ఎలా సాకాలంటూ శిశువు తల్లిదండ్రులు బోరుమంటున్నారు. -
కార్మికులకు వైఎస్ జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: కార్మికులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు.. సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు. దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. అభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కార్మికులు..సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారుదేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారుఅభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు.కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.#InternationalWorkersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2026


