సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మీరే మన రాష్ట్ర భవిష్యత్తు. పరీక్షల మీద దృష్టి పెట్టండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని పోస్టు చేశారు.
Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026


