telangana
-
రూ. 3,300 కోట్లు రికవరీ చేస్తారా..లేదా ?
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బకాయిల వసూలులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..పౌరసరఫరాలశాఖ రూ.3,300 కోట్లపైన ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. 2022–23 యాసంగిలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరించింది. ఇందులో సెంట్రల్ పూల్కు ఇచ్చే పారాబాయిల్డ్ బియ్యం, రాష్ట్ర అవసరాలకు బియ్యం కోసం దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు మరాడించారు. మిగతా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ఈ ధాన్యం విలువ రూ.7వేల కోట్లు. అయితే అప్పటికే కొంతమంది మిల్లర్లు తా ము ధాన్యాన్ని మిల్లింగ్ చేయలేమని చేతులెత్తేసి..తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అక్రమంగా విక్రయించడం, మిల్లింగ్ చేసి బియ్యాన్ని సరిహద్దులు దాటించేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మిల్లర్ల వద్ద ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యంపై దృష్టి పెట్టారు. రికవరీ చేయాల్సిందేనని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ధాన్యం రికవరీకి జాతీయస్థా యిలో వేలానికి టెండర్లు ఆహ్వానించగా, నాలుగు సంస్థలు ముందుకొచ్చాయి. రికవరీ చేయాల్సిన ధాన్యానికి బదులు అప్పటి ధాన్యం విలువకు అదనంగా రూ. 200కు పైగా చేర్చి వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా మొత్తానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువను ప్రభుత్వం రాబట్టింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిల్లర్ల వద్దే ఉండిపోయింది. దీన్ని ‘వేలం ధాన్యం’గా పేర్కొంటున్న మిల్లర్లు..ధాన్యం బకాయి పడడాన్ని అత్యంత సాధారణ విషయంగా చెబుతున్నారు. మిల్లర్ల సంఘం ముఖ్య నాయకుడిగా చెప్పుకుంటున్న ఓ మిల్లరే దాదాపు రూ.400 కోట్ల విలువైన టెండర్ ధాన్యం బకాయి పడ్డట్టు సమాచారం. నాయకులుగా చెప్పుకునేవారు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా, వ్యాపారం కొనసాగిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది. తూతూమంత్రంగా రెవెన్యూ రికవరీ యాక్ట్, క్రిమినల్ కేసులు ధాన్యం బకాయిలు చెల్లించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్లో ధాన్యం మిల్లింగ్కు ఇవ్వబోమని, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద యజమాని పేరిట ఉన్న భూములను వేలం వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మిల్లర్లు తాము విక్రయించిన ధాన్యం నుంచి కొంతమేర రికవరీ చూపించి తాత్కాలికంగా తప్పించుకున్నారు. 314 మంది మిల్లర్లు పూర్తిగా చేతులెత్తేశారు. తమ దగ్గర ధాన్యం లేదు.. దానికి సమానమైన సొమ్ము కూడా లేదన్నారు. వీరి నుంచి రావాల్సిన సుమారు రూ. 1,000 కోట్లు.. రాని బకాయిల కింద ప్రభుత్వం జమకట్టింది. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించింది. నర్సాపూర్లోని ఓ మిల్లర్కు చెందిన 1.31 ఎకరాల భూమిని రూ. 2.12 కోట్లకు వేలం వేసింది. ప్రతి జిల్లాలో కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఏమైందో ఏమో గానీ మిల్లర్లపై చర్యలు నిలిచిపోవడంతోపాటు ధాన్యం కేటాయింపులో కూడా షరతులతో కూడిన సడలింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద నుంచి రావాల్సిన రూ.3,300 కోట్ల బకాయిలు ఇప్పట్లో రికవరీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. తాజాగా మరో మూడు నెలల గడువు మిల్లర్ల నుంచి బకాయి ధాన్యం వసూలుకు మరో మూడు నెలల గడువు ఇస్తూ ఈ నెల 11న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం ధాన్యం ఎలాగూ ఉండదు కాబట్టి..దానికి సమానమైన నగదు వసూలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 314 మంది మిల్లర్లు ఇప్పటికే మొండికేయగా, మూడు నెలల కాలంలో ఎంత మంది చెల్లిస్తారో తెలియని పరిస్థితి. కఠిన చట్టాలను ప్రయోగిస్తే మిల్లర్లు తిన్న సొమ్ము కక్కేందుకు అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం కదలడం లేదు. -
కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా: సీఎం రేవంత్
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో జరిగిన పాపాల చిట్టా విప్పుతా..19, 20 తేదీల్లో బట్టబయలు చేస్తా. ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే...అసలు సినిమా ముందుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేతుల బెడితే పదేళ్లలో రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతికి పాల్పడ్డారు. రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారు. అప్పులకు అసలు, మిత్తీ కలిపి ఏడాదిలో రూ.1.53 లక్షల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. ఆ డబ్బే ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేవి..’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పుల్లోనే పథకాల అమలు ‘కేసీఆర్ పాలించిన ఆ పదేళ్లలో ధనిక రాష్ట్రం అప్పుల కుప్పయ్యింది. దివాళా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. ఆనాడు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.500 కోట్ల అప్పు ఉంటే ఈనాడు ప్రతినెలా వడ్డీ రూ.6,500 కోట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో రూ.8.29 లక్షల కోట్లు అప్పు తేలింది. అయినా అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేశాం. ఈ మహాలక్ష్మి పథకంతో నేటికి 150 కోట్ల మంది ఆడబిడ్డలకు గాను రూ.5,005 కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్నాం. అప్పుల పాలైన రాష్ట్రంలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్, 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల పంట రుణమాఫీకి శ్రీకారం చుట్టాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టులు, పథకాలపై చర్చకు రావాలి ‘కృష్టా, గోదావరి జలాల ప్రాజ్టెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయి కూలేశ్వరంగా మారింది. తాటిచెట్టులా పెరిగిండ్రు కానీ ఆవకాయ అంత కూడా ఆయన మెదడులో తెలివి లేదు.. నేను హరీశ్రావుకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై చర్చకు రావాలి. 300 టీఎంసీలతో శ్రీరాంసాగర్, 200 టీఎంసీల నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు జూరాల, నెట్టెంపాడు, దేవాదుల, రాజీవ్, ఇందిరాసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి పక్కా శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పారదర్శక పాలనకు అద్దం పడతాయి. కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో సాగునీరు రాకున్నా కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేలా తోడ్పాటు అందించాం. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. ఈ విషయాలపై విమర్శలు చేస్తున్న హరీశ్రావు, కేటీఆర్ పిల్లకాకులు. కేసీఆర్ను రమ్మన్నా..ఏ ప్రాజెక్టు వద్ద మాట్లాడుదాం రమ్మంటున్నా..’ అని రేవంత్ అన్నారు. జనగామ జిల్లా శివునిపల్లిలో మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు ∙సభకు హాజరైన మహిళలు ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు.. ‘అధికారం పోతే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు. అందుకే ఫామ్హౌస్లో నుంచి లేచి రమ్మన్నా. రూ.58 లక్షల ప్రజాధనం జీతభత్యాల కింద తీసుకున్నారు. ఏ రంగంలో జీతగాళ్లకైనా పని చేయకుంటే జీతం ఇస్తారా? అపార రాజకీయ అనుభవజు్ఞడైన కేసీఆర్ అ«ధికారం ఉంటే వస్తరు.. లేకుంటే అలిగి పండ్తరా? మీరైతే లక్షల కోట్లు సంపాదించి ఫామ్హౌస్లు, టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు. నువ్వు గజ్వేల్, నీ కొడుకు జన్వాడ, నీ అల్లుడు మొయినాబాద్, నీ బిడ్డ శంకర్పల్లిలో ఫామ్హౌస్లు కట్టుకున్నరు. కానీ తెలంగాణ రైతులు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీరు క్యాప్సికమ్ పండించి కోట్లు సంపాదించిన తీరు వారికి, నిరుద్యోగ యువతకు చెప్పరా? అధికారం పోగానే దివిసీమ తుపాను బాధితుల కంటే ఎక్కువ ఆందోళనలో కేసీఆర్ కుటుంబం ఉంది. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని హరీశ్రావు అంటున్నడు. జాతిపితకు, కేసీఆర్కు ఏమైనా పోలిక ఉందా? అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా? అసలైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపితే.. హరీశ్రావు చెప్పే జాతిపిత ఫామ్హౌస్లో పడుకుంటున్నారు. తెలంగాణ జాతిపితలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్..’ అని సీఎం పేర్కొన్నారు. మా మీద ప్రజలకు కోపం ఎందుకుంటుంది... ‘ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్లే పయనంలో మహిళల అభ్యున్నతికి పాటు పడుతుంటే మాపై ప్రజలకు కోపం ఉందని చెబుతున్నారు. మాపై కోపం ఎందుకు ఉంటుంది? 65 లక్షల మందికి సారెచీర ఇచ్చినందుకా? వెయ్యి సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ తయారీతో శ్రీమంతులు చేసినందుకా? రూ.20,617 కోట్ల పంట రుణమాఫీ చేసినందుకా? రూ.500 బోనస్ ఇస్తూ రైతు భరోసా రూ.12 వేలకు పెంచినందుకా? మీడియా మిత్రులకు ఇళ్లపట్టాలు ఇచ్చినందుకా?..’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న దొంగలకు ఉప్పు పాతర వేస్తా అన్నందుకు దోపిడీ వర్గాలకు నాపై కోపం ఉంటుంది తప్ప ప్రజలకు ఉండదన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి ‘గత బీఆర్ఎస్ పాలకులు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావట్లేదన్నారు. సభలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రామచంద్రునాయక్, యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ చొరవ.. మయన్మార్ బాధితులకు విముక్తి
కరీంనగర్ జిల్లా: అక్రమ ఉపాధి పేరుతో మోసపోయి మయన్మార్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 540 మందిని ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మయన్మార్ బాధితుల కథనాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తేవడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దాంతో అక్కడ చిక్కుకున్న 500 మందికి పైగా బాధితుల్ని భారత్ కు తీసుకొచ్చారు.ఈక్రమంలోనే మయన్మార్ నుంచి తిరిగొచ్చిన కరీంనగర్ జిల్లా మానుకొండూరం మండలం రంగం పేటకు చెందిన మధుకర్ రెడ్డి.. బండి సంజయ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని బండి సంజయ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు బండి సంజయ్. Met Madhukar Reddy from Rangampet, Manakondur Mandal, who safely returned home, thanks to Hon’ble PM Shri @narendramodi ji’s leadership. He is one of the 540 cybercrime victims lured to Myanmar through fraudulent job offers.Trapped in forced cyber fraud operations, many like… pic.twitter.com/Cckg20otqS— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 16, 2025 -
ఏం కష్టమొచ్చిందో.. దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు
సిద్దిపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో దంపతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ముందుగా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఆపై భార్త కూడా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం ఎల్లారెడ్డిలో ఈ దారుణం జరిగింది. కెమ్మసారం భాగ్య పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన భర్త నాగరాజ్.. భార్య లేని జీవితం వద్దకుని అతను కూడా పురుగుల మందు సేవించాడు. దాంతో నాగరాజ్ కూడా తనువు చాలించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ దంపతులకున్న నలుగురు పిల్లలు అనాథులుగా మారిపోయారు. అమ్మా, నాన్న ఇక తమతో ఉండరని తెలిసి రోదిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
‘రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుంది’
సాక్షి, నిజామాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫీవర్ పట్టుకుందని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ఇఫ్తార్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. తెలంగాణ అంటే గంగా జమునా తహిజిబ్.ఇతరులకు తెలంగాణ ఇక రాజకీయం. బీఅర్ఎస్కు తెలంగాణ ఒక టాస్క్. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది..గౌరవం,అభిమానం అనేది కొంటే రాదు.ముఖ్యమంత్రి మాటలు గౌరవ ప్రదంగా లేవు. తెలంగాణ హిస్టరీ కేసీఆర్ .. ఆయనతో రేవంత్కు అస్సలు పోలిక లేదు. కాంగ్రెస్ పార్టీ రంజాన్ తోఫా నిలిపివేయటం బాధాకరం. సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ఎవరు ఎంటి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు.ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. -
సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన హరీష్ రావు
సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ పేదల కోసం సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఊళ్లలో కరెంట్ కష్టాలు మళ్లీ వచ్చాయి.ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పేద ప్రజల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించేవాడు. రేవంత్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సిద్ధిపేటకు రేవంత్ అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్ధిపేట బాగా అభివృద్ధి చెందింది. మళ్లీ కేసీఆర్ రావాలి అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్ధిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా కొట్లాడతా. కేసీఆర్ అన్ని ప్రాజెక్టులు నిర్మించాడు. బుద్ధి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది’ అని హరీష్ విమర్శించారు. -
‘సీఎం రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేఎల్పీ కార్యాలయం నుంచి మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం.. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారు.శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటిలకే చట్టబద్ధత లేకుండా పోయింది. సభ ఇంకా కొనసాగుతోంది. 6 గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా?, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలి. రుణమాఫీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. నిర్మల్ లో ఏ గ్రామానికి వెళ్లినా సరే.. రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమే. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్ మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు. లంకె బిందెల కోసమా?, మీ ఆస్థాన గుత్తేదారుల ప్రాజెక్టులకు రీ ఎస్టిమేషన్ వేసి ఇస్తున్న మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా?, వారి జేబులు నింపే శ్రద్ధ పేదలకు మంచి చేసేందుకు పట్టింపు లేదా?, కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి దానిపై చర్చ డైవర్ట్ చేస్తున్నారు. మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదంటే ఎలా?, కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశాడో రికార్డులు ఉన్నాయని రేవంత్ అన్నారు.. వాటిని బయట పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి?’ అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. -
‘అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం’
సాక్షి, వరంగల్ : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంచనాల మేరకు రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించారు. కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. అది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా 15 నెలల్లో రూ. 58 లక్షల జీతం తీసుకున్నారు.ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్,హరీష్ రావు చర్చకు రావాలి. ఎనిటైం. ఏ ప్రాజెక్ట్ దగ్గరైనా చర్చకు రెడీ. రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్.త్యాగాలు చేసిన వారు జాతిపితలు అవుతారు’అని పునరుద్ఘాటించారు. సభలో రేవంత్ అసహనంజనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. నిరుద్యోగులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలను చూసిన రేవంత్.. చూశాను ఇక దించండి అంటూ అసహనానికి లోనయ్యారు. దీంతో నిరుద్యోగులు ఫ్లెక్సీలను దించడంతో రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
సినిమాల్లోకి ఎంట్రీ.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గత మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని.. టైం ఇస్తారా అని డైరెక్టర్ అడగగానే... టైం ఇవ్వలేనేమోననుకున్నా.. కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది కచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా’’ అని జగ్గారెడ్డి చెప్పారు.‘‘ఏ వార్ ఆఫ్ లవ్’ క్యాప్షన్ను డైరెక్టర్ ముందే రాసుకున్నారు. నా కథకు, లవ్కు సంబంధం లేదు. కథ చెప్పే క్రమంలో స్టార్టింట్ అంతా డైరెక్టర్ చెప్పారు.. మిగతా అంతా నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పా. కొన్ని విషయాలలో డైరెక్టర్ కన్విన్స్ అయ్యారు. నేను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చింది. నా రాజకీయానికి సంబంధం లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా.. సినిమా ద్వారా కొత్త గా రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకునేదేమీలేదు’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.విద్యార్థి నేతగా, కౌన్సిలర్గా రోల్ ఉంటుంది. మున్సిపల్ ఛైర్మన్ ఎలా అయ్యాననేది ఇందులో చూపిస్తాం. లవ్, ఫ్యాక్షన్, ఎమోషన్ , పొలిటికల్గా సినిమా ఉంటుంది. ఢిల్లీ టూర్ నన్ను పూర్తి గా మార్చేసింది.. దీని పరిణామాలు ఎటు పోతాయో నాకు తెలియదు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతా. మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా.. స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదు. ఉగాదికి నా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సంగారెడ్డికి చెందిన మొగిలయ్య 18 ఏళ్ల క్రితం రాసిన పాటను విడుదల చేస్తాం’’ అని జగ్గారెడ్డి తెలిపారు. -
SLBC: రోబోలతో సెర్చ్ ఆపరేషన్.. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే
సాక్షి, మహబూబ్నగర్ జిల్లా: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం అయింది. మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది.రోబోల వినియోగంతో సహాయక చర్యలు ముమ్మరం అవుతాయని భావిస్తున్నా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలు మూడింటిని వినియోగించనున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి వెయ్యి క్యూబిక్ మీటర్ల సామర్ద్యం గల బురద, మట్టిని తొలగిస్తోంది. మానవుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోల పని చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు.రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. -
‘దోచుకున్న డబ్బుతో మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు’
వరంగల్:: గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయిలు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టలాని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో భాగంగా సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్.. బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన బుద్ధి రావట్లేదు.రాష్ట్ర విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం. నిజాలు బయటపడతాయని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడడు. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎందుతున్నాయంటే దానికి కారకులు గత పాలకులే’ అని ధ్వజమెత్తారు పొంగులేటికాంగ్రెస్ అంటేనే సంక్షేమం.. సామాజిక న్యాయంఅసలు కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమన్నారు మంత్రి సీతక్క. ఇంటింటికి ఒక్క ఉద్యోగం అని రంగుల ప్రపంచం కేసీఆర్ చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్12 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగాలు ఇస్తుంటే కళ్లల్లో ప్రతిపక్షాలు నిప్పులు పోసుకుంటున్నాయన్నారు. సంవత్సరంలో రూ. 23, 600 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాం. పరీక్షలు రాయకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేసన్ ఘనపూర్ అభివ1ద్ధిలో అగ్రగామి అని సీతక్క స్పష్టం చేశారు. -
DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం
సాక్షి,హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. ఓ అగంతకుడు అర్థరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం, ఇంట్లో కిచెన్,హాల్సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. గంటన్నరపాటు ఇంట్లో కలయతిరిగాడు. అయితే,దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేకపోవడం ప్రమాదమే తప్పింది. మరోవైపు, డీకే అరుణ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకపోవడంపై కుట్రకోణం దాగి ఉందని డీకే అరుణ కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డీకే అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంట్లో పోలీసులు, క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. తనపై ఏదైనా కుట్ర కు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న ఎంపీ డీకే అరుణ.. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు. -
‘ఇదేం బాదుడు’.. బస్సులో సీటు కోసం మహిళల కొట్లాట(వీడియో)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు కారణంగా బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాలకు ఎన్ని బస్సులు వేసినా సీట్లు సరిపోవడం లేదు. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు ఘర్షణలకు దిగుతున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చెప్పుతో కొట్టుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. హైదరాబాద్ జిల్లాలోని హాకీంపేటకు చెందిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. బొల్లారం స్టాప్ వద్ద ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఓ మహిళ మరో మహిళకు సపోర్ట్ రావడంతో వారి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. సీటు తమదంటే తమ దంటూ గొడవకు దిగారు. మాటలు కాస్త కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు బూట్లతో దాడి చేసుకున్నారు.ఈ సందర్బంగా బస్సు కండక్టర్ వారిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. కండక్టర్ను వారు పట్టించుకోకుండా దాడి చేసుకున్నారు. అనంతరం, చేసేదేమీ లేకపోవడంతో బొల్లారం పోలీస్ స్టేషన్లో బస్ కండక్టర్ ఫిర్యాదు చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బస్సులో సీటు కోసం బూట్లతో కొట్టుకున్న మహిళలుహైదరాబాద్ - హకీమ్ పేట డిపోకి చెందిన ఆర్టీసి బస్సులో.. బొల్లారం స్టాప్ వద్ద ఎక్కి బస్సులో సీట్ కోసం కొట్టుకున్న ముగ్గురు మహిళలుబొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు pic.twitter.com/NXmtKd0tIo— Telugu Scribe (@TeluguScribe) March 16, 2025 Video Credit: Telugu Scribe -
ఓటమి భయంతోనే తమిళనాడులో కొత్త డ్రామా: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్, త్రిభాష విధానంపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని డీఎంకే వితండవాదం చేస్తోంది. డీలిమిటేషన్, జాతీయ విద్యావిధానంపై దివాలాకోరుతనంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 2026 తమిళనాడు ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోంది. దీన్ని బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో లిక్కర్ సరఫరాలో కుంభకోణం తెరపైకి వచ్చింది. డీఎంకే నేతలు కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కాం దృష్టి మళ్లించడానికే డీఎంకే.. దక్షిణాదికి అన్యాయం అనే వాదనను లేవనెత్తింది. త్రిభాషా విధానం బ్రిటిష్ కాలం నుంచే అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతోంది. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఓటమి భయంతో స్టాలిన్ బురద జల్లుతున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్పై వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్కు హరీష్రావు సవాల్
సాక్షి, తెలంగాణభవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్రావు కౌంటరిచ్చారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతుందన్నారు. అలాగే, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్కు సంస్కారం ఉందా?. కేసీఆర్ను మార్చురీకి పంపాలని ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి.. మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారు. రేవంత్ భాష వలన తెలంగాణ పరువుపోతుంది.అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలని పేదలను వేధిస్తోంది. ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని రైతులకు చెప్పారు. ఫోర్త్ సిటీ అని మరో 15వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఏమనాలి. ఫార్మా సిటీ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలి. లేకపోతే ఫార్మా సిటీ నిర్మాణం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించండి.కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా నిన్న రేవంత్ సభలో మాట్లాడారు. మోదీ మంచోడు.. కిషన్ రెడ్డి చెడ్డ వ్యక్తి అని రేవంత్ అంటాడు. అటు రాహుల్ గాంధీ మాత్రం మోదీ చెడ్డ వ్యక్తి అని అంటాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రేవంత్ సర్కార్ను బండకేసి కొట్టారు. 15 నెలలకే రాష్ట్రానికి ఈ ప్రభుత్వం భారమైంది.రేవంత్కు సవాల్..రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నా. మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం?. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్’ అని ప్రశ్నించారు. -
HYD: గురుశిష్యులు అరెస్ట్.. యాసిడ్ దాడి కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్లో కలకలం సృష్టించిన ఆలయంలో ఉద్యోగిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యాసిడ్ దాడి కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు.గురువును వేధిస్తున్నాడనే కారణంగా శిష్యుడు యాసిడ్తో దాడి చేశారు. సైదాబాద్ ఆలయంలో ప్రధాన పూజారిగా ఉన్న రాజశేఖర్ శర్మను అకౌంటెంట్ నర్సింగరావు వేధిస్తున్నాడని జాబ్లీహిల్స్ టీటీడీ ఆలయ పూజారి హరనాథ్ శర్మ.. యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గురుశిష్యులు హరనాథ్ శర్మ, రాజశేఖర్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారుశుక్రవారం ఆలయంలో విధుల్లో ఉన్న ఎకౌంటెంట్ నర్సింగరావుపై యాసిడ్ దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజ్ ద్వారా విచారణ చేపట్టారు. బాధితుడు నర్సింగరావుతో కొంత కాలంగా ఆలయ పూజారితో విభేదాలు ఉన్నాయని సమాచారం. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. విమానం ఎమర్జెనీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెనీ ల్యాండింగ్ అయ్యింది. కౌలాలంపూర్ ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఏటీసీ అధికారులకు పైలట్ సమాచారం ఇచ్చారు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.వారం క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా విశాఖపట్నం ఎయిర్పోర్టుకు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టులు ఫైట్ ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు.ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావటంతో.. పైలట్ విమానాన్ని డౌన్ చేశాడు. అయితే అప్పటికే రన్వేపై టేకాఫ్ తీసుకోవడానికి మరో విమానం రెడీగా ఉండగా.. దాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
నీటి కష్టాలు.. డెడ్ స్టోరేజ్కు నాగార్జునసాగర్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. నాగార్జున సాగర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. మరో తొమ్మిది అడుగులు తగ్గితే.. నీటి మట్టం 18 టీఎంసీలు తగ్గి డెడ్ స్టోరేజ్కు చేరుకుంటుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 148 టీఎంసీలుగా ఉంది.వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్లో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. మరో వారం, పది రోజుల్లోనే సాగర్ డెడ్ స్టోరేజ్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సాగర్లో నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 519 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 148 టీఎంసీలుగా ఉంది. రోజుకో టీఎంసీన్నర చొప్పున ప్రాజెక్టులో తగ్గుతున్న నీళ్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు.. పంటల సాగుకు ఇంకా 20 నుంచి నెల రోజుల పాటు నీళ్లు అవసరం కానున్నాయి.ఈ క్రమంలో సాగర్లో నీటి మట్టం అటు రైతులను, ఇటు అధికారులను టెన్షన్ పెడుతోంది. ప్రాజెక్టులో నీళ్లు ఈ స్థాయిలో తగ్గితే తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సాగర్ ప్రాజెక్టు నుంచే హైదరాబాద్ జంట నగరాలకు, నల్లగొండ జిల్లాకు తాగునీటి సరఫరా జరుగుతోంది.మూసీ పరిస్థితి ఇది..మూసీ ప్రాజెక్టులో క్రమంగా తగ్గుతున్న నీటిమట్టంపూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులుప్రస్తుతం: 630 అడుగులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలుప్రస్తుతం: 1.44 టీఎంసీలుపులిచింతలలో ఇలా..పూర్తిస్థాయి నీటిమట్టం: 175 అడుగులుప్రస్తుతం: 166 అడుగులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 45 టీఎంసీలుప్రస్తుతం: 33 టీఎంసీలు -
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: ఫిలింనగర్ రోడ్డునెంబర్–8లో నివసించే సినీ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) సోదరి గదిలో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు ఆమె తండ్రి సి.రాజు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో(Filmnagar Police Station) ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజు కూతురు మూడో అంతస్తులో ఉంటుంది. తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఆమె ఆందోళన చెందింది. పరిశీలించగా రెండు బంగారు డైమండ్ ఉంగరాలతో(Diamond) పాటు ఒక హెడ్ఫోన్ కనిపించలేదు. దీంతో విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు బైక్ పార్కు చేసినట్లుగా గుర్తించారు. సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి వెనుక డోర్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్లి అల్మరాలో నుంచి బంగారు వస్తువులు తస్కరించినట్లుగా గుర్తించారు. సరిగ్గా 20 నిమిషాల్లోనే దొంగిలించిన సొత్తుతో సదరు వ్యక్తి బయటకు రావడం, వెళ్లిపోవడం కూడా సీసీ ఫుటేజీలో నమోదైంది. చోరీకి గురైన బంగారం విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిలింనగర్ పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టారు. పాత నేరస్తుల కదలికలను కూడా గమనిస్తున్నారు. ఇంత ధైర్యంగా గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లడం, దర్జాగా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టేచర్ సరే.. స్టేట్ ఫ్యూచర్ సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘బీఆర్ఎస్ నేతలు మాటకు ముందు, మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. ఆ స్టేచర్ విషయంలో ఉన్న ఆసక్తి, పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ విషయంలో ఏదీ? ఒకప్పుడు మీకు అధికార పార్టీ స్టేచర్ ఉండేది, తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని జనం మార్చురీకి పంపారు. స్టేచర్ గుండుసున్నా అయింది. నేను ఇదే చెప్పా, అందులో తప్పేముంది. నేను కేసీఆర్ను ఏదో అంటున్నానని కేటీఆర్, హరీశ్రావు అంటున్నారు.కేసీఆర్ నుంచి తీసుకునేందుకు ఇక ఏమీ లేదు. ఆయనది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే.. కేటీఆర్, హరీశ్రావు దానికోసం పోటీపడతారేమో. దాన్ని నేనైనే కోరుకోను కదా! కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. అదే ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. నేను ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇది మా భవిష్యత్తు కార్యాచరణ..’’అని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు శనివారం ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.వివరాలు సీఎం రేవంత్ మాటల్లోనే.. ‘‘పార్టీలో పెద్ద మనిషి హోదాలో కేసీఆర్.. తాడు బొంగరం లేనట్టు వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీశ్రావులను సరిదిద్దాలి. ఇకనుంచి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. నా రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతున్నారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన నేను మంత్రి కాకుండా నేరుగా సీఎం అయ్యా. గతంలో ఎన్టీఆర్, నరేంద్ర మోదీ డైరెక్ట్గా సీఎం అయి పాలన అందించలేదా? 40ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కదా.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే.. అందులో మంచిని గుర్తించి నేర్చుకునేందుకు నేను సిద్ధం.. రైతులకు సంబంధించిన ఏ విషయంపై అయినా చర్చ జరగాలని కేసీఆర్ కోరితే నేను రెడీ. సభకు వచ్చి చర్చించాలి. పూర్తి చిట్టా విప్పుతా. ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా.. భూకంపం కూడా ఒక్కసారి రాదు, రెండుమూడు సార్లు కదిలి కంపిస్తుంది. తుఫాన్ ముందు కొంత ప్రశాంతత ఉంటుంది. కొన్నేళ్లు అలాంటి ప్రశాంతత చూపిన ప్రజలు చివరికి ఎన్నికల్లో ప్రభావం చూపారు. అసెంబ్లీ ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా వచ్చినా కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు. వారి అధికారాన్ని దూరం చేసినందుకు నామీద కోపం ఉండొచ్చు. కానీ సీఎం కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా.. ఇంకా కుల దురహంకారాన్ని వీడలేదు. ఇట్లానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్నా ఖాయం. గవర్నర్ ప్రసంగం అలానే ఉంటుంది.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అవును.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలానే ఉంటుంది. ఎందుకంటే మాది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో కూడిన విధానాలనే పథకాలుగా అమల్లోకి తెచ్చాం. మా ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా రూపొందిన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాలనే గవర్నర్ ప్రస్తావించారు. అలాంటప్పుడు విమర్శించడం ఏమిటి? ప్రతిపక్ష నేతలు అజ్ఞానమే విజ్ఞానంగా, అడ్డగోలుతనమే గొప్పతనంగా భావిస్తున్నట్టున్నారు’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గింది.. ‘‘అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యువతకు 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరోటి లేదు. నేను సవాల్ విసురుతున్నా.. ఉంటే చెప్పండి. 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతంగా ఉంటే.. 2024 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 18.1 శాతానికి తగ్గింది. కేంద్ర కార్మిక శాఖ ఆదేశం మేరకు లేబర్ఫోర్స్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక చెప్పిన వాస్తవమిది. నిరుద్యోగ సమస్యను తగ్గించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.’’ఔను.. మోదీ బడే భాయే.. ‘‘దేశంలోని ముఖ్యమంత్రులకు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ బడే భాయే (పెద్దన్న). ఈ మాటను మరోసారి చెప్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను తరచూ ప్రధానిని కలుస్తూనే ఉంటాను. పార్టీపరంగా ఆయనతో విభేదించొచ్చు. కానీ ప్రధానిగా గౌరవిస్తా. గత 15 నెలల్లో ఢిల్లీకి 32 సార్లు వెళ్లా, మూడు పర్యాయాలు ప్రధానిని కలిశా. నేను కలవని కేంద్రమంత్రి అంటూ ఎవరూ లేరు. అవసరమైతే మరో 300సార్లు వెళ్తా. మీరు ప్రధానిని గౌరవించరు. గవర్నర్ను గౌరవించరు. ప్రజలను పట్టించుకోరు.’’ -
సికింద్రాబాద్లో కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
సనత్నగర్: రైల్వే ‘కవచ్’రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్లో ఏర్పాటు కానుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలవనుందని పేర్కొన్నారు. రైల్వే భద్రతలో కవచ్ వ్యవస్థ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమైందని చెప్పారు. బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రైల్వే అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బేగంపేట, చర్లపల్లి, మేడ్చల్, యాకుత్పురా, నాంపల్లి, కాచిగూడ, హైటెక్సిటీ, హఫీజ్పేట్, మలక్పేట్, ఉందానగర్ రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంగీకరించారని తెలిపారు. ఆయా రైల్వేస్టేషన్లకు అప్రోచ్ రోడ్ల కోసం భూమిని సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. బేగంపేట రైల్వేస్టేషన్ను రూ.38 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే తొలివిడత పనులు పూర్తయ్యాయని చెప్పారు. దీనిని మహిళా రైల్వేస్టేషన్గా మార్చనున్నట్లు కిషన్రెడ్డి ప్రకటించారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ నుంచి ఉన్నతాధికారి వరకు అంతా మహిళలే ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు జైపూర్లోని గాం«దీనగర్ రైల్వేస్టేషన్ ఒక్కటే దేశంలో పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న రైల్వేస్టేషన్గా ఉంది. రైల్వే ప్రాజెక్టులకు రూ.39,300 కోట్లు.. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేల కోసం కేంద్రం రూ.5,337 కోట్లు కేటాయించిందని కిషన్రెడ్డి గుర్తుచేశారు. అలాగే రైల్వేల ఆధునీకరణలో భాగంగా రూ.39,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1,096 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపట్టినట్లు వివరించారు. 753 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్లు నిర్మిస్తామని, 453 ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం పూర్తిచేశామని వెల్లడించారు.సికింద్రాబాద్ నుంచి తెలంగాణలో ఏడు జిల్లాలను కలుపుతూ 9 స్టాప్లతో 5 వందేభారత్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. రూ.715 కోట్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్రెడ్డి చెప్పారు. రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కూడా త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఏబీసీడీలు కూడా తెలియకుండా కేంద్రంపై యుద్ధమా? ఏబీసీడీలు కూడా తెలియకుండా కేంద్రంపై యుద్ధం చేయాలంటే ఎలా? అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు కిషన్రెడ్డి చురకలంటించారు. గతంలో లాగా రెచ్చగొడితే ప్రజలు ఊరుకోరని, చైతన్యవంతులు అయ్యారని పేర్కొన్నారు. డీ లిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. -
సైబర్ నేరాల కట్టడికి ‘ఐ4సీ’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రోజుకో తరహా మోసంతో అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు దర్యాప్తు సంస్థలు తమదైన శైలిలో అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరిట మోసగాళ్ల ఆగడాలు బాగా పెరగడంతో వారికన్నా ఒకడుగు ముందుకేసి, వారు మోసాలకు వినియోగిస్తున్న సిమ్కార్డు లు, స్కైప్ ఐడీలు, వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేస్తున్నాయి. తాము చేపట్టిన చర్యల్లో భాగంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ స్కామ్లకు వాడిన సుమారు 7.81 లక్షల సిమ్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరాలకోసం వినియోగిస్తున్న 2,08,469 ఐఎంఈఐ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది. దేశంలో జరుగుతున్న డిజిటల్ స్కామ్లు, సైబ ర్ నేరాలపై ఇటీవల ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో పరిష్కరించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’(ఐ4సీ) కృషి చేస్తోందన్నారు. వార్తా పత్రికలు, మెట్రో రైళ్లలో ప్రకటనలు, ఆకాశవాణి.. తదితర మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం చేస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలర్ట్యూన్ ప్రచా రాన్ని ప్రారంభించామన్నారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రోజుకు 7 నుంచి 8 సార్లు విధిగా ప్రతి వినియోగదారుడికి వినిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ స్కామ్లపై 1930 టోల్ఫ్రీ నంబర్కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందిçస్తున్నామని చెప్పారు. డిజిటల్ స్కామ్ల కోసం ఉపయోగించిన 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ఐ4సీ గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్ఫూఫ్డ్ కాల్స్ను కూడా గుర్తించి అరికడుతున్నట్లు తెలిపారు. వివిధ సైబర్ నేరాలపై వచ్చిన 13.36 లక్షల ఫిర్యాదుల ఆధారంగా రూ.4,386 కోట్లు నేరగాళ్లబారిన పడకుండా చర్యలు తీసుకున్నట్లు బండి వివరించారు. -
లిఫ్ట్ ప్రమాదాలకు చెక్!
గత ఏడాది మే 27న హైదరాబాద్ నాగోల్లోని ఓ హోటల్లో లిఫ్ట్ కేబుల్ తెగి ఎనిమిది మంది గాయపడ్డారు. జూలై 27న తుకారాంగేట్లో68 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. జూలై 15న హఫీజ్పేటలో లిఫ్ట్ వైర్తెగిపడి ఒకరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆగస్టు 26న గుడిమల్కాపూర్లో లిఫ్ట్ పైకప్పు కూలి 65 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. గతనెల 22న మాసబ్ట్యాంక్లో ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. తాజాగా మార్చి 12న సంతోష్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో చిక్కుకుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు’ ఇలా నిత్యం ఏదో ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేవలం షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే కాదు సామూహిక, వ్యక్తిగత గృహ సముదాయాల్లోనూ లిఫ్ట్లు/ఎస్కలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, పిల్లల కోసం వీటిని అమర్చుకుంటున్నారు. అయితే లిఫ్ట్ల తయారీ కంపెనీలపై మెజార్టీ ప్రజలకు అవగాహన లేదు. నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలామంది బిల్డర్లు మార్కెట్లో తక్కువ ధరకు లభించే లిఫ్ట్ పరికరాలను కొనుగోలు చేసి అమర్చుతున్నారు. అయితే, వీటిపై నిర్వహణతోపాటు నియంత్రణ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల్లో అమల్లో ఉన్న లిఫ్ట్ పాలసీని తెలంగాణలోనూ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అధ్యయనం, ముసాయిదా రూపకల్పన కోసం రెండు రోజుల క్రితం ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లిఫ్ట్ యాక్ట్– 2015 ముసాయిదాకు మెరుగులు దిద్దాలని ఆదేశించింది. అలాగే, ఇతర రాష్ట్రాల్లో పాలసీ ఏ విధంగా ఉందనే అంశంపై ఆరా తీసే పనిలో తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ విభాగం నిమగ్నమైంది. ప్రమాణాల మేరకు లేకపోవడం వల్లే.. అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) ఇవ్వడానికి పురపాలక శాఖ అమలు చేస్తున్న జీఓ 168లో లిఫ్ట్ ఏర్పాటు గురించి ప్రస్తావన ఉన్నా.. దాని నాణ్యత, నిర్వహణ, నియంత్రణపై ఎలాంటి ఆంక్షలు లేవు. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా 10 వేల వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిలో 20 శాతమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు ఉన్నట్లు అంచనా.మిగిలినవి కనీస నైపుణ్యంలేని తయారీ దారులు విక్రయిస్తున్నవే. తయారీ సంస్థల వద్ద ఐదారేళ్లు పని చేసిన వర్కర్లే స్వయంగా ఎలివేటర్ల తయారీని ప్రారంభిస్తున్నారు. వీరు బిల్డర్ల వద్ద తక్కువ ధరకు కాంట్రాక్టులు తీసుకుని నాసిరకం లిఫ్ట్లను అమర్చుతున్నారు. అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో లిఫ్ట్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఆ తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. బీఐఎస్ నిబంధనల ప్రకారం లిఫ్ట్ను నిర్మించే సమయంలో దానిలో ఎంత మంది వెళ్లొచ్చు? ఎంత బరువు మోయగలదు? వంటి అంశాలను స్పష్టం చేయాల్సి ఉంది. ప్రమాణాల మేరకు కరెంట్ సరఫరా ఉందా? నాణ్యమైన పరికరాలు (ఆటోమేటిక్ డోర్లు, మోటారు, కేబుల్, సెన్సర్లు, ఫ్యాన్లు, లైట్లు, అత్యవసర ఫోన్, అగ్ని నిరోధక పరికరాలు) ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా.. చట్టం లేకపోవడంతో చాలామంది పట్టించుకోవడం లేదు. 20 ఏళ్లకు పైబడిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. చాలాచోట్ల ఇప్పటికీ పాతవే దర్శనమిస్తున్నాయి. సర్టిఫైడ్ నిపుణులతోనే ఎలివేటర్లను ఇన్స్టాల్ చేయించుకోవడంతోపాటు నిర్వహణ సరిగా ఉందని నిర్ధారించుకుంటేనే లిఫ్ట్ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని తెలంగాణ విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి సీహెచ్.రామాంజనేయులు వివరించారు. -
ఔరా.. వైరా..
తడారిన భూములకు ఊపిరి పోస్తోంది. ఎండిన గొంతుల దాహార్తి తీరుస్తోంది. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది.. లక్షలాది బతుకులకు అన్నం పెడుతోంది. పర్యాటక కేంద్రంగా కూడా వరి్ధల్లుతున్న ఆ జలాశయం వయసు వందేళ్లు.. ఖమ్మం జిల్లాలో అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరొందిన వైరా జలాశయంపై కథనమిది. వైరా: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన వైరా జలాశయం.. సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కల్పతరువుగా నిలుస్తున్న ఈ జలాశయాన్ని స్వాతంత్య్రానికి ముందు నైజాం నవాబు నిర్మించారు. వృథా నీటిని అరికట్టేలా.. తొలినాళ్లలో ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రవహించే నిమ్మవాగు, ఏన్కూరు మండలం నుంచి ప్రవహించే గండివాగు, గిన్నెలవాగు, పెద్దవాగుల నుంచి వచ్చే మరో ఏరు.. వైరా సమీపాన కలిసి అతిపెద్ద ప్రవాహంగా తయారై వృ«థాగా పోయేది. ఈ పరిస్థితుల్లో ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించి వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలని.. నాటి పాలకుడైన నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆలోచన చేశారు. దీంతో సాయిద్ జాదా నవాబ్ అలావత్జంగ్ బçహదూర్ 1923వ సంవత్సరంలో శంకుస్థాపన చేయగా అప్పటి నిజాం ప్రభుత్వ కార్యదర్శి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అయిన నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బçహదూర్ పర్యవేక్షణలో సుమారు రూ.36 లక్షలతో ఏడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. డంగు సున్నం, రాయితో ఈ ప్రాజెక్ట్ను నిర్మించగా.. 274 చదరపు మైళ్ల భూమి ముంపునకు గురైంది. అలాగే, 130 చదరపు మైళ్ల భూమిని రైతుల నుంచి సేకరించి.. అప్పట్లోనే సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులుగా ఉన్నప్పుడు మొత్తం 60 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు 88 అడుగులు కాగా, పొడవు 5,800 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు 19 మైళ్ల దూరం ప్రవహిస్తూ.. 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. కుడి కాల్వ 15 మైళ్ల దూరం ప్రవహించి 29 ఉపకాల్వల ద్వారా 16 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ఐదు మైళ్ల దూరం ప్రవహిస్తూ 22 ఉప కాల్వల ద్వారా తొమ్మిది వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిoది. 1930లో కేవలం 12 వేల ఎకరాల భూములను సాగులోకి తెచ్చేలా డిజైన్ చేసినా ప్రస్తుతం రెండింతలుగా సాగవుతుండడం విశేషం. దాహార్తి తీరుస్తూ.. ఖమ్మం జిల్లాలోని వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, వేంసూరు, కొణిజర్ల, చింతకాని, ఏన్కూరు, పెనుబల్లి తదితర 11 మండలాల్లోని 420 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ రిజర్వాయర్ నుంచి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ కృషితో మహర్దశ.. జలయజ్ఞంలో భాగంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రత్యేక కృషి వల్ల ఈ జలాశయం రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు అప్పట్లో రూ.51 కోట్లు మంజూరు చేయగా మహర్దశ పట్టింది. జలాశయం ఆధునికీకరణలో భాగంగా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీత, సిమెంట్తో లైనింగ్ చేయించి కాల్వలు పటిష్టం చేశారు. దీంతో ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం ఫలించింది. పర్యాటకంగానూ అభివృద్ధి రిజర్వాయర్ కట్టపై పచ్చిక బయళ్లు.. అందమైన పూల తోటలు.. చుట్టూ నీరు.. కొండపై నుంచి చూస్తే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మైమరిపింపజేస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తూ.. అందమైన సాయంత్రాలు గడిపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సూర్యోదయం లేదా సాయంసంధ్య వేళల్లో ఇక్కడి దృశ్యాలను తిలకించేందుకు రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ఈమేరకు పర్యాటక అభివృద్ధిలో భాగంగా పిల్లల పార్క్ నిర్మించి.. పూలతోటలు అభివృద్ధి చేయడమే కాక ప్రత్యేక టైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2006లో పర్యాటక శాఖ రూ.70 లక్షలు వెచ్చిoచింది. ఇక్కడ పలు టీవీ సీరియళ్ల షూటింగ్ కూడా జరగడం విశేషం. మత్స్యకారులకు జీవనోపాధి వైరా రిజర్వాయర్పై కొణిజర్ల, వైరా, తల్లాడ మండలాలకు చెందిన సుమారు 500 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడానికి.. ముందు నుంచే మత్స్యకారులు చేపలు, రొయ్య పిల్లలు వేసి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేటతో జీవనం సాగిస్తుంటారు. -
దగా యాష్..నిఘా ట్రాష్
సాక్షి, పెద్దపల్లి: భారతావనికి ఎన్టీపీసీ విద్యుత్ వెలుగులు పంచుతుంటే, విద్యుదుత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద (యాష్) రాజకీయ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. బూడిదతో ఎన్నిరకాలుగా దందా చేయవచ్చో, అన్నిరకాలుగా అక్రమమార్గాల్లో అమ్ము కుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రామగుండం కేంద్రంగా యాష్ పాండ్లో జరుగుతున్న అక్రమాలపై ఇంటలిజెన్స్ రిపోర్టు సీఎంవో కార్యాలయానికి చేరుకున్నా.. ఈ దందాకు అడ్డుకట్ట పడలేదు. దీంతో బూడిద సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం.. చివరకు గోదావరిఖని పోచమ్మ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసేస్థాయికి చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నేషనల్ హైవేకి తరలింపు పేరుతో..ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిద.. చెరువులో నిర్ణీత స్థాయికి మించితే కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఎనీ్టపీసీ అవసరమైన వారికి ఎప్పటికప్పుడు అందులో బూడిదను ఉచితంగా సరఫరా చేస్తోంది. కానీ జాతీయ అవసరాల దృష్ట్యా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా.. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు.. రామగుండంలోని కుందనపల్లిలోని బూడిద చెరువు నుంచి తరలించాల్సి ఉంటుంది. అందుకు లోడింగ్, రవాణా ఖర్చులు సైతం ఎన్టీపీసీయే భరిస్తుంది. రవాణా చార్జీలుగా టన్నుకు రూ.1,250 చొప్పున చెల్లిస్తుంది. అంటే ఒక లారీకి రూ.50 వేల వరకు బూడిద రవాణాకు చెల్లిస్తుంది. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు కొత్త దందాకు తెర తీశారు. నేషనల్ హైవే పేరిట తరలించే లారీల్లో సగం లారీలను నేషనల్ హైవేల నిర్మాణానికి చేరుస్తూ, మిగిలిన సగం లారీల బూడిదను బ్లాక్మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.పాండ్ నుంచి లోడింగ్ అయి బయటకు వచ్చాక వాటికి నంబర్ ప్లేట్లు మార్చి జీపీఎస్ను మరో లారీలో పెట్టడం తదితర జిమ్మిక్కులతో నేషనల్ హైవేకు తరలించాల్సిన బూడిదను.. కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. దీంతో పక్కదారి పట్టించిన ఒక్కొక్క లారీకి ఎన్టీపీసీ నుంచి రవాణా చార్జీల పేరిట రూ.50 వేలు, ఇటుక బట్టీలకు లారీ బూడిదను రూ.50 వేలకు అమ్మి తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. బూడిదతో పాటు నిర్వహణ ఖర్చుల పేరిట అక్రమార్కులు డబుల్ ధమాకా పొందుతున్నారు. లోడింగ్ పేరుతో..పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తిలో భాగంగా వెలువడే నీటితో కలిసిన బూడిదను.. బూడిద చెరువులో నింపుతారు. ఆ బూడిదను డీసిల్టేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు టన్నుకు రూ.130 చొప్పున 38 ఏజెన్సీలు 15 లక్షల మెట్రిక్ టన్నుల బూడిద తరలించేలా టెండర్లు ఖరారు చేశారు. కాగా, ఎన్టీపీసీ ఈ టెండర్లను రద్దు చేసి రూ.1కే టన్ను ఇచ్చేందుకు టెండర్లు పిలిచింది. దీంతో 114 మంది ఈ టెండర్లను దక్కించుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారిలో ఐదుగురు.. రాజకీయ బలంతో లోడింగ్ పేరుతో దందాకు తెర తీశారు. లారీల సామర్థ్యాన్ని బట్టి రూ.4,600 నుంచి రూ.9,600 వరకు అక్రమంగా వసూలు చేస్తూ ఇటుకబట్టీలకు సరఫరా చేస్తున్నారు. రోజుకు వెయ్యి వాహనాల్లో బూడిద తరలిస్తూ రూ.లక్షల్లో జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో..బూడిద చెరువులోకి వచ్చి చేరే బూడిదను జాతీయ రహదారుల నిర్మాణం, ఇటుకల తయారీతో పాటు ఇతరత్రా నిర్మాణాలకు ఉచితంగా ఎన్టీపీసీ అందిస్తుంది. కానీ, ఈ బూడిద తరలింపు వ్యవహారంలో రాజకీయ నేతల జోక్యంతో అక్రమాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు వెయ్యి లారీల చొప్పున సరఫరా అవుతుండటంతో.. అంతే మొత్తంలో బూడిద దందాలో డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో కొన్నిరోజులుగా జిల్లాలో బూడిద పంచాయితీపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చివరకు ఎన్టీపీసీ కాంట్రాక్టు కారి్మక సంఘం అధ్యక్షుడు కౌశిక్హరి తడిబట్టలతో గోదావరిఖని పోచమ్మ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా దుమారం రేపింది. -
హాజరు నుంచి హోంవర్క్ దాకా..
సాక్షి, సిద్దిపేట: విద్యార్థి బడికి గైర్హాజరైతే వెంటనే తల్లిదండ్రులకు మెసేజ్ వెళుతుంది.. విద్యార్థికి ఆ రోజు ఇచ్చే అసైన్మెంట్లు/హోంవర్క్ వివరాలు కూడా యాప్లో వచ్చేస్తాయి.. అంతేకాదు పరీక్షల్లో వచ్చిన మార్కులు, ప్రోగ్రెస్ రిపోర్ట్, సెలవులు, సిలబస్ వంటి వివరాలూ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరుతాయి. ఇదేదో ప్రైవేట్ స్కూల్లో అమలవుతున్న ఆధునిక విధానం కాదు.. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేకత. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని ఓ ప్రైవేట్ కంపెనీ రూపొందించిన యాప్లో ఈ పాఠశాలకు ప్రత్యేక లాగిన్ అందించారు. విద్యార్థులపై మంచి పర్యవేక్షణతో.. ఈ పాఠశాలలో 364 మంది విద్యార్థులున్నారు. రోజూ ఉదయం 9 గంటలకే యాప్లో, రిజిస్టర్లో విద్యార్థుల అటెండెన్స్ తీసుకుంటారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్కు వెంటనే ఎస్సెమ్మెస్ వెళుతుంది. అలాగే విద్యార్థులకు రోజువారీగా ఇచ్చే అసైన్మెంట్లను క్లాస్ టీచర్లు యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు తల్లిదండ్రులకు చేరుతాయి. దీనితో పిల్లలు స్కూల్కు వెళ్తున్నామని డుమ్మాకొట్టే చాన్స్ ఉండదు. హోంవర్క్/రీడింగ్ లేదంటూ ఇళ్లలో చెప్పి తప్పించుకోవడానికీ వీలుండదని టీచర్లు చెబుతున్నారు. ఈ యాప్తో విద్యార్థులపై పర్యవేక్షణ సులువైందని అంటున్నారు. త్వరలో విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా.. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్, లీవ్ అనుమతులు, నెలవారీ సిలబస్, పేరెంట్స్ ఫీడ్ బ్యాక్, పరీక్షల టైం టేబుల్, హాలిడేస్ లిస్ట్ వంటివి సైతం యాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి సంబంధించి కనీస సామర్థ్యాలు సాధించే దిశగా విద్యార్థి సూచిక (స్టూడెంట్ ప్రొఫైల్) ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన తీరు, పురోగతి సాధిస్తున్న అంశాలను ఇందులో పొందుపర్చనున్నారు.హాజరుశాతం పెరిగింది యాప్ ద్వారానే విద్యార్థుల అటెండెన్స్ తీసుకుంటున్నాం. విద్యార్థి స్కూల్కు గైర్హాజరైతే వెంటనే పేరెంట్స్కు సమాచారం వెళ్తుంది. పర్యవేక్షణ పెరగడంతో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. ప్రోగ్రెస్ రిపోర్ట్, ఫీడ్ బ్యాక్ వంటివి కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం. – వాసుదేవరెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, హుస్నాబాద్ పిల్లలు గైర్హాజరైతే వెంటనే మెసేజ్ వస్తుందిమా పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్లు స్కూల్కు వెళ్లకుంటే నా ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఇలా తల్లిదండ్రులకు విద్యార్థుల సమాచారం తెలపడం బాగుంది. టీచర్లు అసైన్మెంట్లను యాప్లో పెడుతుండటంతో.. పిల్లలు ఇంటికి వచ్చాక వారిని దగ్గరుండి చదివిస్తున్నాం. – ముక్కెర రమేశ్, విద్యార్థి తండ్రి -
‘రాయలసీమ’పై కేంద్రం కొరడా
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి డీపీఆర్ తయారీ ముసుగులో ఏపీ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తోందని అందిన ఫిర్యాదులపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. డీపీఆర్ తయారీ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని, ఎక్కడైనా తవ్వకాలు జరిపితే వాటినీ పూడ్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని దాని వాస్తవ పూర్వస్థితికి పునరుద్ధరించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత నెల 27న రాయలసీమ ప్రాజెక్టుపై వచ్చిన ఫిర్యాదుపై చర్చించి కేంద్ర నిపుణుల మదింపు కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి అదనపు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో, డీపీఆర్ తయారీకి సంబంధించిన పనులు మినహా ఇతర ఏ చర్యలు ప్రాజెక్టు సైట్లో చేపట్టలేదని పేర్కొంటూ అఫిడవిట్ రూపంలో స్వీయధ్రువీకరణ సమర్పించాలని స్పష్టంచేసింది. సైట్ పునరుద్ధరణకు తీసుకున్న చర్యలను ఫొటోలు, ఇతర ఆధారాలతో సహా సమర్పించాలని, ఇందుకు వాడిన పద్ధతులను, గడువులనూ తెలపాలని ఆదేశించింది. అఫిడవిట్లో అవాస్తవాలను పొందుపరిస్తే జల, వాయు, పర్యావరణ చట్టాల కింద సంబంధిత అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ప్రాంతీయ అధికారి, కేంద్ర జలసంఘం, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రాజెక్టు సైట్ను తనిఖీ చేశాక ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరింది. డీపీఆర్ తయారీ ముసుగులో పర్యావరణానికి ఏదైనా హానీ చేసినట్టు తనిఖీల్లో గుర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ విజయం: మంత్రి ఉత్తమ్రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమేనని నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం కృష్ణా బోర్డు, ఎన్జీటీ, కృష్ణా ట్రిబ్యునల్–2, సుప్రీం కోర్టులను ఆశ్రయించిందన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని తాను కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా, శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి లేఖ రాశారన్నారు. -
భారత్.. ఆధ్యాత్మిక స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మికత, ధర్మ పరిరక్షణలో ప్రపంచానికి భారత్ స్ఫూర్తిదాయకమని.. ప్రజలంతా వాటిని ఆచరించి శాంతి పొందాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉద్ఘాటించారు. ధర్మ రాజ్యం అంటే.. రూల్ ఆఫ్ లా అని.. సరైన విలువలు, సరైన ఆలోచన, సేవలు, కరుణ, నీతి, నైతికత పాటించడమే ధర్మమని వివరించారు. దేశం ధర్మ రాజ్యంగా ప్రగతి బాట పయనించాలని మహాత్ముడు అభిలాషించారని చెప్పారు. ఆర్థిక భారతమే కాదు.. వికసిత్, విరాసిత్ భారత్ ఆవశ్యకతనూ ప్రధాని మోదీ వెల్లడించారన్నారు. మనసును నిగ్రహించుకుని చట్టపరమైన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడంపై బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జాతీయ న్యాయనిపుణుల సదస్సు శనివారం హైదరాబాద్లోని శాంతి సరోవర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టితోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు మాట్లాడారు. గుడిలో పూజలు, అర్చన, ప్రదక్షిణలు చేయడం మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించడం కూడా ఆధ్యాత్మికమే అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. శాంతి లేని బతుకు నిరర్థకమని.. స్వామి వివేకానందుడే స్ఫూరిగా ఆధ్యాత్మికాన్ని ఆచరించాలని సూచించారు. ఆధ్యాత్మికాన్ని పెంపొందించడంలో బ్రహ్మకుమారీల పాత్ర అభినందనీయమన్నారు. మితిమీరిన ‘ఇన్స్టంట్’కు అలవాటుపడితే అనారోగ్యాన్ని ఆహ్వానించినవారవుతారని హెచ్చరించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి: జస్టిస్ ఎస్వీ భట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగినప్పుడే అసాధ్యాలు కూడా సుసాధ్యం కాగలవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి చెప్పారు. న్యాయవాదులకు స్వీయ అవగాహన ఉండాలని, కేసును, కక్షిదారుడిని అర్థం చేసుకున్నప్పుడే సమర్థ వాదన సాధ్యపడుతుందన్నారు. గెలుపోటములను ఒకేలా స్వీకరించాలని.. అపజయానికి కుంగిపోవడం, విజయానికి పొంగిపోవడం వృత్తినే కాదు, వ్యక్తిత్వాన్నీ దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏం చేస్తున్నాం.. ఎలా చేస్తున్నాం.. అనే సమీక్ష అందరికీ అవసరమన్నారు. వృత్తిపరంగా ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయని.. కొన్నిసార్లు మనసు కలుషితం అవుతుందని చెప్పారు. సానుకూలత లేకుండా సరైన నిర్ణయం తీసుకోలేమని చెబుతూ.. జరిగిందేదో జరిగిపోయింది.. సానుకూలంగా ముందుకెళ్తాను అనే ధోరణిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ బీడీ రాథి, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎం.రాజేందర్రెడ్డి, మాజీ అడ్వొకేట్ జనరల్లు దేశాయి ప్రకాశ్రెడ్డి, బీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.జీఎస్టీ.. దేశ ఆర్థిక చరిత్రలో ఓ మలుపు: గవర్నర్ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టడం మన దేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. శనివారం తాజ్ దక్కన్ హోటల్లో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో జీఎస్టీ రూపకల్పనలో కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రపై సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య సమన్వయం అవసరమన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానానికి జీఎస్టీ దోహదం చేసిందన్నారు. సాహసోపేతమైన సంస్కరణల మాదిరిగానే జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు అవాంతరాలు తప్పలేదని పేర్కొన్నారు. ఎక్కడైతే ప్రజలకు న్యాయం అందుతుందో.. అక్కడ ధర్మంతోపాటు రాజుకు బలమైన పునాది ఏర్పడుతుందని కౌటిల్యుడు చెప్పిన మాటలను ఉదహరించారు. పన్ను చెల్లింపుదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న వన్ టైమ్ వడ్డీ మాఫీ పథకాన్ని ఈ నెల 31లోగా పన్ను చెల్లించి లబ్ధి పొందాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి మాట్లాడారు. ఎఫ్టీసీసీఐ జీఎస్టీ కమిటీ చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్, బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదులు లక్ష్మీకుమారన్, శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
హద్దు మీరితే ఖబడ్దార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు.. మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్గానే చూస్తాం. క్రిమినల్స్కు ఎట్లా జవాబు చెప్పాల్నో అట్లానే చెప్తాం. జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే.. ముసుగుతీసి ఒక్కొక్కడిని బట్టలూడదీసి కొడతాం, తోడ్కలు తీస్తా..’’ అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కురీ్చలో ఉన్నానని, అందువల్ల ఊరుకుంటానని అనుకుంటున్నారని.. కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేనూ మనిషినే.. చీమూనెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీపేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్నా.. కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధిచెప్పు.. హద్దు దాటితే, మాటజారితే అనుభవిస్తరు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తుందని అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతరేస్తం. చట్టపరిధిలో అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుంది. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి వేదన కాదు.. అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతోపాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి. ఒకరోజు దీనిపై చర్చ పెట్టాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతారా? రాష్ట్రంలో కులగణనను 1931 తర్వాత ఇప్పుడు మేమే చేశాం. ఈ సర్వేలో 96.9 శాతం మంది పాల్గొన్నారు. మిగతావారి కోసం మరో అవకాశం ఇచ్చాం. కానీ బీఆర్ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తం అబద్ధాలతోనే బతుకుతున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే కులగణనపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలపై జీఎస్టీ లేదని ఇష్టమున్నట్టు అబద్ధాలు ఆడుతారా? ప్రధాని మోదీకి చెప్పి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ వేయించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డిని కోరుతున్నాను. నామీద కోపం ఎందుకు ఉంటుంది? మేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాం. తెలంగాణ తల్లిని సచివాలయం లోపల ప్రతిష్టించాం. నామీద అన్ని వర్గాలకు కోపం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, రైతులకు, యువతకు 15 నెలల్లోనే ఎన్నో చేశాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం చేపట్టాం. రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్ ఇస్తున్నాం. యువతకు ఉద్యోగాలిస్తున్నాం. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నాం. నామీద ఎందుకు కోపం ఉంటుంది? 15 ఏళ్లు పైబడ్డ వాహనాలు తిరగొద్దు హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1,600 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంటికి నాలుగు వాహనాలు ఉంటున్నాయి. దీనితో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, కొత్త రోడ్లు వేసినా పరిస్థితిలో మార్పు రాదు. ప్రజా రవాణాను పెంచుతున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్ను కాపాడాలి. మరో ఢిల్లీ కాకుండా చూడాలి. నగరంలోని 3 వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపి.. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తం. 15ఏళ్లు పైబడిన వాహనాలను నగరంలోకి అనుమతించం. పరిశ్రమలను ఓఆర్ఆర్ ఆవలికి తరలిస్తాం. పాతబస్తీలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచన మేరకు లాల్దర్వాజా ఆలయం అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.20కోట్లు కేటాయిస్తున్నా. ఈ మేరకు జారీ చేసే జీవోలో అక్బరుద్దీన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతల ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ ‘‘రాష్ట్రంలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే పెడ్లర్లు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేస్తాం. రూ.250 కోట్లు వెచ్చించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశాం. ఇటీవల దుబాయిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలన్నీ తెప్పించాం. డ్రగ్స్కు సంబంధించిన గుట్టంతా మా వద్ద ఉంది. స్కూళ్లలో డ్రగ్స్ వినియోగిస్తే ఆ స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత. వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించాం. లక్షలకొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో ఏం జరుగుతోందో, పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో యాజమాన్యమే పర్యవేక్షించాలి. ప్రతి స్కూల్లో సైకాలజీ టీచర్ను తప్పనిసరిగా నియమించుకోవాలి. స్కూళ్లు, కాలేజీల వద్ద ప్రత్యేకంగా నిఘాపెడతాం.’’ -
వడివడిగా బురద తొలగింపు
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదస్థలంలో చివరి 40 మీటర్లలో తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండగా, ఇందుకోసం రోబోలతో ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లడ్జ్ రిమూవల్ రోబో మిషినరీని తీసుకెళ్లారు. శనివారం దానికి అనుసంధానంగా పనిచేసే వ్యాక్యూమ్ ట్యాంక్ను సొరంగంలోకి తరలించారు. దీని ద్వారా వేగంగా బురద, మట్టిని కన్వేయర్ బెల్టు మీదుగా బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో ఆదివారం ప్రారంభమవుతాయని చెబుతున్నారు. డీ1 వద్ద తవ్వకాలు పూర్తయితేనే.. ఇప్పటికే కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టారు. అక్కడ గురుప్రీత్సింగ్ మృతదేహం లభించగా, మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మరో పాయింట్ డీ1 వద్ద సింగరేణి, ర్యాట్హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. డీ1 వద్ద 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. డీ1 వద్ద టీబీఎంలో సెగ్మెంట్ ఎరెక్టర్ ఉండే చోట కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తికావచ్చని, అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పురోగతి కోసం శ్రమించిన కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం దారుణమన్నారు. కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు. ఉత్తమ్వి పచ్చి అబద్ధాలు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని హరీశ్రావు విమర్శించారు. సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించి ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేశారు. నాడు కృష్ణా జలాల్లో తెలంగాణకు తాత్కాలిక కేటాయింపులు మాత్రమే జరిగాయి. ఇటీవల తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్ ఢిల్లీకి వెళ్లి 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుని వచ్చారు’అని హరీశ్ అన్నారు. ‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో జరిగే అన్యాయంపై నాడు కాంగ్రెస్ నాయకులు పి.జనార్దన్రెడ్డి ఒక్కరే కొట్లాడారు. నాడు నాతోపాటు ఆరుగురు కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాం. కానీ ఉత్తమ్కుమార్ రెడ్డి.. కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం నోరు మూసుకున్నారు. ఆయనది ద్రోహ చరిత్ర అయితే బీఆర్ఎస్ది త్యాగాల చరిత్ర. ఉత్తమ్ దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాకు కేసీఆర్ నీళ్లు ఇస్తే.. హుజూర్నగర్ను ముంచి పులిచింతల ద్వారా ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చిన ఘనులు కాంగ్రెస్ నాయకులు’అని హరీశ్రావు మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ మార్చురీకి పోతారని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. శనివారం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియా పాయింట్ వద్ద వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ను కించపరచడం తప్ప సీఎం 3 గంటల పాటు అసెంబ్లీలో మాట్లాడిందేమీ లేదన్నారు. రాజముద్ర నుండి చార్మినార్, కాకతీయుల కళాతోరణం తీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ చాంబర్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్తో భేటీ అయ్యారు. సీనియర్ సభ్యుడైన జగదీశ్రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదనే విషయాన్ని హరీశ్రావు ప్రస్తావించారు. జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేసే అంశంలో విపక్ష ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కోరలేదన్నారు. జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై పునఃసమీక్షించి ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. సభ ప్రారంభమైన తర్వాత హరీశ్రావు ఇదే విషయాన్ని మరోమారు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను కోరారు. -
పల్లా వర్సెస్ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో హామీల అమలుతోపాటు పాలనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి దాడి చేయగా.. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ప్రతిదాడి చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డి వరుస ఆరోపణలు చేస్తుండగా మంత్రులు పదేపదే కల్పించుకుని సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పల్లా సొంత నియోజకవర్గం జనగామలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.124 కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము మూడు నెలల్లోనే రూ.263 కోట్లు మాఫీ చేశామన్నారు. మా సీఎం కూడా మీ సీఎంలాగే ఉండాలా?: భట్టి సీఎం రేవంత్రెడ్డి వద్దే విద్యా శాఖ ఉండడంతో పర్యవేక్షణ కొరవడిందని, 2 లక్షలమంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యా రని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపణలు చేయగా, భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఖండించారు. మీ సీఎం (కేసీఆర్) తరహాలోనే మా సీఎం ఉండాలని ఊహించుకుంటే ఎలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎస్సీతో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేశారని, 22వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చారని, 36 వేల మంది టీచర్లకు బదిలీలు కల్పించారన్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను గాలికి వదిలేస్తే, 12 మంది వీసీలను నియమించారన్నారు. మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతోపాటు నిర్మాణానికి రేవంత్ రూ.540 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. గత ప్రభుత్వం మీకు (పల్లాకు), ఇతరులకు ప్రైవేటు వర్సిటీలను ధారాదత్తం చేస్తే వాటికి దీటుగా తాము ప్రభుత్వ వర్సిటీలను తీర్చిదిద్దుతున్నామన్నారు. బీఆర్ఎస్ ధోరణితోనే అన్యాయం: మంత్రి ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితోనే రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో తీరని నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల సామర్థ్యం పెంపు విషయంలో ఏపీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. తాము కేంద్రం, కృష్ణా బోర్డుతో కొట్లాడి సాగర్ కుడి కాల్వకు ఏపీ తీసుకుంటున్న జలాలను 10వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించామన్నారు. మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు నిర్వహించని బీఆర్ఎస్ వాళ్లు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రుణమాఫీ చేశామని, రైతులందరికీ బోనస్ చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళా జర్నలిస్టు ‘ఎక్స్’లో పెట్టిన వీడియోలోని భాషను చూసి కూడా ఆమెను సమరి్థస్తారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100% రుణమాఫీ జరిగితే ముక్కును నేలకు రాస్తా: పల్లా రైతు రుణమాఫీ 50 శాతంలోపే జరిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామతోపాటు భట్టి నియోజకవర్గం మధిరలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100శాతం రుణమాఫీ జరిగితే తాను ముక్కును నేలకు రాసి, రాజీనామా చేస్తానని ప్రకటించారు. 27 శాతం మంది రైతులకే బోనస్ లభించిందని, ఏడాదిలో 564 మంది రైతులు, 116 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకులాల్లో 83 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. కరెంట్ కోతలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టారని, అరెస్టైన జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ని విడుదల చేయాలన్నా రు. కాకతీయ కళాతోరణం, చారి్మనార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే పోరాడతామన్నారు. తెలంగాణ తల్లి సాధారణంగా ఉండాలని, నగలు, వడ్డాణం ఉండకూడదని చెప్పేటోళ్లు రూ.కోట్ల వాచీలు, వారి కుటుంబ సభ్యులు ఖరీదైన నగలు ధరిస్తున్నారన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 55వేల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. -
నేడు స్టేషన్ఘన్పూర్కు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం చేరుకుంటారు. స్టేషన్ఘన్పూర్లో ఇందిర మహిళా శక్తి స్టాళ్లను సందర్శిస్తారు.ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేస్తారు. రూ.700 కోట్ల విలువైన పనులను సీఎం వర్చువల్గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో నిర్వహించే కృతజ్ఞత సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఐదు రోజులుగా స్టేషన్ఘన్పూర్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తదితరులు శనివారం బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. » మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. » 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. » మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లె హెలిప్యాడ్కు చేరుకుంటారు. » 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళాశక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ సంఘాలకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు. » 1.25 నుంచి 3 గంట లవరకు శివుని పల్లె లో ప్రజాపాలన కా ర్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. » 3.10 గంటలకు శివునిపల్లె హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలి కాప్టర్లో హైదరా బాద్ చేరుకుంటారు. -
యస్.. రెండోసారి నేనే సీఎం!
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఏమో కానీ.. తెలంగాణ సీఎంగా ఎవరైనా ఆశలు పెట్టుకుంటే మాత్రం వదులకోవాల్సిందేననే సంకేతాలిచ్చారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్.. రెండోసారి కూడా తానే సీఎం అంటూ ఉద్ఘాటించి పలువురు ఆశావహులపై నీళ్లు చల్లారు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ, రేవంత్ మాత్రం స్పష్టమైన ధీమాతో సీఎంగా రెండోసారి కూడా తానే అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సంగతిని పక్కన పెడితే, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ ఎప్పట్నుంచో వస్తుంది. దీనిపై తెలంగాణ బీజేపీ కూడా డిమాండ్ చేస్తూనే ఉంది. బీసీలను వాడుకోవడం, వదిలేయడమే కానీ వారిని ఎప్పుడు సీఎంగా అందలం కాకపోయినా కనీసం సీఎం అభ్యర్థిగా అయినా ప్రకటిస్తారా? అంటూ కాంగ్రెస్ పై పదే పదే విమర్శలు చేస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్.. ఒక బీసీని సీఎంగా చేస్తుందా? అని ఎద్దేవా చేస్తోంది.సీఎం రేవంత్ ముందే జాగ్రత్త పడుతున్నారా..?మరి ఈ విమర్శల నేపథ్యమో ఏమో కానీ రేవంత్ రెడ్డి.. తానే రెండోసారి సీఎం అంటూ పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీలో సందర్భం వచ్చిన ప్రతీసారి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తానే సీఎంను అంటూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. తన సీఎం పీఠానికి కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి పోటీ లేకుండా రేవంత్ ముందే జాగ్రత్త పడుతున్నారా అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.అయితే సీఎం రేవంత్ మాత్రం తాను రెండోసారి సీఎంను అని తరచు వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యాన్ని చూస్తే ఆయనలో కాస్త ఆందోళన అనేది కన్పిస్తోంది. ఒకవేళ బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల సమయంలో ప్రకటిస్తే ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ లాంటి నేతలకు ఆ అవకాశం దక్కే అవకాశం ఉంది. మరొకవైపు పొన్నం ప్రభాకర్ లాంటి నేతలకు కూడా సీఎం పదవిపై ఆశ ఉందని చర్చ నడుస్తోంది. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తాను కూడా ముందు వరుసలోను ఉంటారు. ఇలా కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగానే ఉంది.. ఆ క్రమంలోనే రేవంత్ సీఎం పోస్ట్ అంశాన్ని సమయం వచ్చినప్పుడల్లా లేవనెత్తుతున్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుంది. సీఎంగా తన సహజ ధోరణిలో ముందుకు సాగుతున్న రేవంత్.. అత్యంత ధీమాగా ‘రెండోసారి అధికారం.. రెండోసారి సీఎం’ అని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.రేవంత్ నోట.. ‘మళ్లీ సీఎం’ మాటతెలంగాణ అసెంబ్లీ సమాఏశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్.. ప్రస్తుతమే కాదు.. రెండోసారి కూడా తానే సీఎం అంటున్నారు. ‘రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతా. మొదటిసారి బిఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్న. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ నాకు ముఖ్యం. రూ. 25 లక్షల పైచీలుకు రుణమాఫీ జరిగింది ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి. కోటిమంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తా. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు. గతంలో నేను చెప్పిందే జరిగింది. భవిష్యత్తులో నేను చెప్పిందే జరుగుతుంది’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
‘తమిళభాష అభివృద్ధి కోసం స్టాలిన్ ఏం చేశారో చెప్పాలి?’
హైదరాబాద్: త్రిభాషా పాలసీ అనేది కొత్తది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటునుండి ఈ విధానం కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని, నచ్చిన భాషను చదువుకోవచ్చని కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘ఇతర దేశాల్లో కూడా మాతృభాషలోనే మాట్లాడుతారు. డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. దేశంలో నూతన విద్యా విధానం వచ్చాక మాతృభాషకు ప్రోత్సాహం ఇచ్చాం. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ప్రజలను రచ్చ కొట్టి అధికారం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నాలుగున్నర సంవత్సరాలలో తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలి.దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని సినిమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. నియోజకవర్గ పునర్విభజన పై కొత్త నియమాలు రాలేదు.జనగణన జరగలేదు. ఈ అంశంపై ఏబిసిడిలు తెలియని సీఎం రేవంత్ యుద్ధం చేస్తా అని అంటున్నారు. దక్షిణ భారత ప్రజలు తన్యవంతులయ్యారు అక్షరాస్యత పెరిగింది.. మీ పిచ్చి మాటలు నమ్మరు. రాజకీయ దురుద్దేశంతో ప్రజల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు’ అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.కాగా, త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు మిగతా పార్టీలకు మధ్య వార్ నడుస్తోంంది. ఇదే అంశంపై పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానాన్ని సమర్ధించారు. ఎలాగు ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది కాబట్టి సమర్థిస్తూ మాట్లాడారు పవన్. దీనిపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. -
కోకాపేట జీఏఆర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరగలేదు: ఏసీపీ
సాక్షి, హైదరాబాద్: కోకాపేట జీఏఆర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరగలేదని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. బిల్డింగ్లో రెస్టారెంట్ పనులు జరుగుతున్నాయని.. గ్యాస్ లీక్ అయ్యిందని తెలిపారు. దీంతో గ్యాస్ పీల్చి కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు. వారిని వారిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నార్సింగి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, మొదట కోకాపేట జీఏఆర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో పలువురు ఐటీ ఉద్యోగులు గాయపడ్డారంటూ ప్రచారం జరిగింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. బిల్డింగ్లో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
జగిత్యాల: జిల్లాలోని పొలాసలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య. భర్త కమాలకర్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అవ్వగా, మరో పెళ్లి చేసుకున్నాడనేది కూడా ఆమె ఆరోపిస్తోంది. తమను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని, అందుచేత భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు భార్య చెబుతోంది.గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తమను వేధిస్తున్నాడని భార్య పేర్కొంది. భార్యా పిల్లలను కొడుతుండటంతో ఓపిక నశించి కమలాకర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెబుతోంది. పిల్లలతో కలిసి కమాలకర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు భార్య స్పష్టం చేసింది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమాలకర్ పరిస్థితి విషమంగా ఉంది. -
‘సోషల్ మీడియా చాలా ఇబ్బందిగా మారింది’
హైదరాబాద్: తాను కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ బారిన పడ్డ మహిళనే అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోసల్ మీడియా ఎఫెక్ట్ను సీఎం రేవంత్ సభలో మాట్లాడటం తమ అందరికీ చాలా రిలీఫ్ గా ఉందన్నారు సీతక్క. ఈరోజు(శనివారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి.. మానసిక ఆవేదనకు గురి చేశారు. సోషల్ మీడియా పోస్ట్ లు కొన్ని సార్లు డీమోరల్ చేశాయి. మహిళలు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టం.. అలాంటిది మేము ఈ స్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్ కోసం వాడుకున్న నేను.. అంతే ఇబ్బందులకు గురయ్యాను. సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాలకు వాడుతుంది. సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తుంది. బాడీ షేమింగ్, ఫోటోలు మార్ఫింగ్, అననివి అన్నట్లుగా చెప్తున్నారు. గత ఏడాది నుంచి ఇది ఎక్కువ అవుతుంది. అన్న చెల్లెల్లు చేతిలో చెయ్యి వేసుకున్నా.. మరోకరకంగా చూపుతున్నారు. సోషల్ మీడియాను మంచికి వాడాలి.. చెడు కు కాదు. కరోనా సమయంలో ఎంతో సర్విస్ చేసా.. దాన్ని కూడా సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. అబద్దాల పైనే బీఆర్ఎస్ నడుస్తుంది. అబద్ధానికి అర్థం బీఆర్ఎస్. ఏ రోజుకైనా నిజమే గెలుస్తుంది. సోషల్ మీడియా కట్టడి అవసరం. సోషల్ మీడియా ద్వారా మాపై బురద చల్లుతున్నారు....కడుక్కోవడం మా వంతు అవుతుంది’ అని సీతక్క వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీ వదిలిపోతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అంటూ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విషం కక్కుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. భయపడేవాళ్లు పాకిస్తాన్ పారిపోయారు.. తాము కొట్లాడే వాళ్లం కాబట్టి ఇక్కడే ఉన్నాం అంటున్నాడు ఓవైసీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే అని అన్నారు.అసదుద్దీన్ దేశం విడిచి పారిపోవడం ఖాయమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మతకల్లోలు జరగొద్దని నిన్న ఒక్కరోజు ఇంట్లో నమాజః్ చేసుకోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తే తప్పు పట్టారన్నారు. అసదుద్దీన్ కు ట్రీట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ కు విజ్క్షప్తి చేస్తున్నానని చమత్కరించారు రాజాసింగ్. -
మా ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతం: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నాటి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్పీచ్లో అప్పులు, వడ్డీలు లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో ముచ్చటించారు. ‘ఈ 15 నెలల్లో మేము చేసిన అప్పు 4500కోట్లే. రేపట్నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సోషల్ మీడియా పేరుతో అడ్డు అదుపు లేకుండా పోయింది. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా నన్ను ట్రోల్ చేశారు’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.తప్పులు, అప్పులు చేసి మీరే ముంచేశారు..ఈరోజు సీఎం రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ రూ. 8. 19 లక్షల కోట్లు అప్పులు చేశారని, తాము వచ్చాక రూ. రూ. 1.53 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామన్నారు సీఎం రేవంత్,. ప్రస్తుత తెలంగాణ అప్పు రూ. రూ. 7. 38 లక్షల కోట్లు అని చెప్పారు. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి: సీఎం రేవంత్మాదే తప్పు అయితే క్షమాపణ చెప్తా.. కేసీఆర్కు రేవంత్ సవాల్ -
వరంగల్ చౌరస్తాలో కుటుంబం ఆత్మహత్యాయత్నం
సాక్షి, వరంగల్: వరంగల్ చౌరస్తాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. బ్యాంక్ వేధింపులు తట్టుకోలేక చిలుకూరి క్లాత్స్టోర్ బ్రదర్స్ కుటుంబం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.అనంతపురంలో మహిళా లెక్చరర్ ఆత్మహత్యమరో ఘటనలో.. ఏపీలోని అనంతపురం కేంద్రీయ వర్శిటీ మహిళా లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్కు మహిళా లెక్చరల్ యోజిత సాహో ఊరేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉత్తమ్ ద్రోహ చరిత్ర వల్లే.. రేవంత్ కృష్ణా జలాల విమర్శలకు హరీష్ కౌంటర్
హైదరాబాద్, సాక్షి: ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. సంస్కారం లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియాతో చిట్చాట్లో మాట్లాడారాయన. ‘‘కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి బయటకు వచ్చేశాం. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను కేసీఆర్ సాధించారు. కానీ, సీఎం అనే విజ్ఞత కోల్పోయి, సంస్కారం లేకుండా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి.. ఆ వ్యాఖ్యలపై సభలో మాట్లాడామన్నా మాకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు’’ అని హరీష్ అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన ద్రోహం వల్లే తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని హరీష్ ఆరోపించారు. ఈ తప్పు ముమ్మాటికీ కాంగ్రెస్దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వల్ల నిర్లక్ష్యం జరిగింది. అప్పటి లెక్కల ప్రకారం నీళ్లు, ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పటి లెక్కల ప్రకారం నీళ్ల పంపకాలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు మంత్రి పదవి కోసం తెలంగాణ కోసం మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు కోసం 40 రోజులు పీజేఆర్ తప్ప ఎవరూ పోరాడలేదు. ఆ సమయంలో ఉత్తమ్ మౌనంగా ఉండిపోయారు. .. తెలంగాణకు ద్రోహం చేసి పోతిరెడ్డిపాడుపై పెదవులు మూసుకున్నందుకే ఉత్తమ్కు మంత్రి పదవి వచ్చింది. విజయవాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చంద్రబాబు ఇంట్లో భోజనం చేశారు. ఆపై శ్రీశైలం ఖాళీ అయ్యే వరకు చూశారు. సెక్షన్-3 తెచ్చి తెలంగాణకు న్యాయం చేసింది కేసీఆర్. ద్రోహ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది.. త్యాగ చరిత్ర మాది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను మేము వ్యతిరేకించాం. నీళ్లు ఉన్నా ఖమ్మం, నల్గొండ లో పంటలు ఎండిపోయాయి ఎందుకు?. కేసీఆర్ కట్టిన సీతారామ పుణ్యమాని ఖమ్మం పంటలు కాపాడుకుంటున్నారు. -
సచివాలయంపై డ్రోన్ చక్కర్లు.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన తెలంగాణ సచివాలయంపై ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. దీన్ని గమనించిన ఎస్పీఎఫ్ పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తులను సైఫాబాద్కు చెందిన వంశీ, నాగరాజుగా గుర్తించారు. దీంతో, వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సెక్రటేరియల్ అవుట్ పోస్టుతో పాటు సచివాలయం లాన్ ఏరియాను డ్రోన్తో చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. -
కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే సభకు రాకుండా కేసీఆర్(KCR) మొహం చాటేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సమాధానమిస్తూ.. మాజీ సీఎంతో పాటు హరీష్, కేటీఆర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్లు మాటకు ముందు స్టేచర్.. మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. మరి మీకు స్టేట్ ఫ్యూచర్ వద్దా.. మీ స్టేచరే మీకు ముఖ్యమా? అని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్రశ్నించారు.కేసీఆర్ దగ్గర ఇప్పుడు మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమే. ఆ సీటుతో నేనేం చేసుకుంటాం. అది హరీశ్కో, కేటీఆర్కో కావాలి మాకు కాదు. కేసీఆర్ను ఉద్దేశించి నేను ‘స్ట్రెచర్’ వ్యాఖ్యలు చేశానని హరీష్, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నాను.. అందులో తప్పేం ఉంది. కేసీఆర్ చెడును నేను ఎందుకు కోరుకుంటా?. ఆయన వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి. ఆయన అక్కడే ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇక్కడే అధికారంలో ఉండాలి. కేసీఆర్ సభకు రావాలి. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించం. ఆయన సభకు వచ్చిననాడే కృష్ణా జలాల అంశం చర్చ పెడతాం’’ అని రేవంత్ స్పష్టం చేశారు. -
మాదే తప్పు అయితే క్షమాపణ చెప్తా.. కేసీఆర్కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంంలో మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో తమతో చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గవర్నర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బలహీనవర్గాలకు చెందిన మహిళ గవర్నర్గా ఉంటే.. ఆమెను సూటిపోటి మాటలతో అవహేళన చేశారు. భారత రాజ్యాంగం స్పూర్తితో వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గత ప్రభుత్వం ప్రజాస్వామ విలువలను పాటించలేదు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. గవర్నర్ను గౌరవించే బాధ్యత మాది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం.. వాటినే గవర్నర్ ప్రస్తావించారు. మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాం. ఎవరు అడ్డుకున్నా వెళ్లిపోతాం అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే కారణం. అవమానాలు భరించలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని నిర్ణయించాం. వాస్తవాల మీద ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే మా విధానం. గతంలో ఎన్నికప్పుడే రైతుబంధు అన్నదాత అకౌంట్లలో పడేది. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతుభరోసా అందిస్తామన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం. కేసీఆర్ హయాంలోనే కృష్ణా బేసిన్ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కృష్ణా నీటి విషయంలో కేసీఆర్ సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాశారు. మా తప్పు ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా కేసీఆర్కు, బీఆర్ఎస్ నేతలకు క్షమాపణ చెబుతాను. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడతాం. లెక్కలతో సహా నిరూపిస్తాను.. చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీటి కోసం పోరాటం చేస్తున్నాం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా?. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్న పెంచితే తెలంగాణ ఎడారి అవుతుందని పీజేఆర్ అడ్డుకున్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసింది. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండిచాలని కోరాం.కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు.. సంతోష్కు రాజ్యసభ ఇవ్వలేదా?. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగ అవకాశాలిచ్చారు.. పదేళ్లు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు?. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు తక్కువ, పెట్టిన పరీక్షలు ఎక్కువ. పరీక్ష పేపర్లను పల్లీ బఠానీల్లా అమ్మేశారు. గత ప్రభుత్వంలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మేసింది. టీఎస్పీఎస్సీ ప్రతిష్టను దిగజారిస్తే మేం ప్రక్షాళన చేశాం. ఒక్క ఏడాదిలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చాం. 19 శాతం నిరుద్యోగాన్ని తగ్గించిన ఘనత మాది. విద్యాశాఖను మేం ప్రక్షాళన చేశాం. 20 ఏళ్లు ప్రమోషన్, 10 ఏళ్లు ట్రాన్స్ఫర్ లేని వారికి శుభవార్త అందించాం. చిన్న వివాదం కూడా లేకుండా 36వేల మంది టీచర్లను బదిలీ చేశాం. గ్రూప్-2,3,4 పరీక్షల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశాం’ అని తెలిపారు. -
కుల్ఫీ ఐస్క్రీమ్, బర్ఫీ స్వీట్లలో గంజాయి
సాక్షి, హైదారాబాద్/అబిడ్స్ : హోలీ సంబరాలను సొమ్ము చేసుకొనేందు కు గంజాయి విక్రేతల ముఠా కొత్త పన్నాగం పన్నింది. హోలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం లోయర్ ధూల్పేట్లో కుల్ఫీ ఐస్క్రీమ్లు, బర్ఫీ స్వీట్లకు సిల్వర్ కోటెడ్ బాల్స్ను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 100 కుల్ఫీ ఐస్క్రీమ్లు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి కుల్ఫీ ఐస్క్రీమ్ల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వా«దీనం చేసుకుని, సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
కొత్త రేషన్కార్డులకు బియ్యం రాలే..
ఈ ఫొటోలో రేషన్కార్డు ప్రొసీడింగ్ కాపీతో కనిపిస్తున్న మహిళ పేరు దొమ్మాటి అనూష. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటకు చెందిన అనూషకు పదేళ్ల నుంచి రేషన్కార్డు లేదు. గణతంత్ర దినోత్సవం రోజు అధికారులు భర్త అనిల్ పేరిట కొత్త రేషన్కార్డు ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి బియ్యం వస్తాయని అధికారులు చెప్పగా రేషన్ డీలర్ మాత్రం ఈ పాస్ మిషన్లో పేర్లు రాలేదని చెప్పారు. ఈ సమస్య ఒక్క అనూషది మాత్రమే కాదు గ్రామంలోని 17మంది కొత్తకార్డుదారులది. రెండు నెలల నుంచి బియ్యం కోసం డీలరు, అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేట గ్రామాన్ని సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జనవరి 26న ఇందిరమ్మ ఇండ్లు 106మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 11, రైతుభరోసా 92మంది, 17 మందికి కొత్తరేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ రేషన్ డీలర్కు బియ్యం కోటా వచ్చినప్పటికీ కొత్త రేషన్కార్డు లబ్ధిదారుల పేర్లు ఈపాస్ మిషన్లో నమోదు చేయకపోవడంతో బియ్యం ఇవ్వలేదు. మార్చినెలలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయలేదు. కొత్త రేషన్కార్డు వచ్చి రెండు నెలలవుతున్నప్పటికీ బియ్యం రావడంలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బహుదూర్ఖాన్పేటలో మొత్తం 254 రేషన్కార్డులుండగా ప్రతినెలా 86 క్వింటాళ్ల బియ్యం స్టాక్ వస్తోంది. అయితే జనవరి 26న బహుదూర్ఖాన్పేటతోపాటు రెవెన్యూ గ్రామమైన చామనపల్లిలోని 36 మందికి కొత్తరేషన్కార్డులను అధికారులు మంజూరు చేశారు. చామనపల్లికి చెందిన లబ్ధిదారుల పేర్లు ఈపాస్ మిషన్లో నమోదు కాగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన బహుదూర్ఖాన్పేట గ్రామ లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం సివిల్సప్లై అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపుగా 40రోజుల నుంచి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అయితే కొత్త రేషన్కార్డు నెంబర్లు కొన్ని సాంకేతిక కారణాలతో స్టేట్ కమీషనరేట్ కార్యాలయం నుంచి జనరేట్ కాలేదని సివిల్ సప్లయి డీటీ సురేందర్ తెలిపారు. వచ్చేనెలలో సమస్యను పరిష్కరించి మే నెల నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అవకాశముందని పేర్కొన్నారు.ఏడేళ్ల తర్వాత కొత్తకార్డుపెళ్లయిన ఏడేళ్లకు కొత్త రేషన్కార్డు వచ్చింది. గతంలో నా పేరు తల్లిదండ్రుల రేషన్కార్డులో ఉంది. అయితే కొత్తగా భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో అధికారులు రేషన్కార్డు ఇచ్చారు. రెండునెలలుగా బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్తే కొత్త పేర్ల జాబితా రాలేదని డీలర్ చెప్పడంతో నిరాశపడ్డాను.– అజయ్, బహుదూర్ఖాన్పేటబియ్యం కోటా వచ్చిందిఫిబ్రవరి, మార్చి నెలల్లో అదనంగా ఆరు క్వింటాళ్ల బియ్యం కోటా వచ్చింది. ఈపాస్ మిషన్లో కొత్త రేషన్కార్డుదారుల పేర్లు రావడం లేదు. పేర్లు లేకపోవడంతో బియ్యం ఇవ్వడం లేదు.– తప్పెట్ల తిరుమల, రేషన్ డీలర్, బహుదూర్ఖాన్పేట -
తెలంగాణ ప్రజలకు గమనిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలలోనే సాధారణం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు.. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.ఇదే సమయంలో మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీమ్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అలాగే, శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.అయితే.. మార్చి 20 నుంచి 24 తేదీల్లో మాత్రం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా బలమైన ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందని కూడా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం వేడికి బాధపడాల్సిందేనని.. మార్చి 20 తర్వాత మాత్రం రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
కేసీఆర్ ఎప్పుడూ చెప్తుండేవారు.. మీపై గౌరవం ఉంది: హరీష్రావు
హైదరాబాద్, సాక్షి: సభలో ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలని తమ పార్టీ అధినేత కేసీఆర్(KCR) చెబుతుండేవారని, ఆ మాటను తాము తూచా తప్పకుండా పాటిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అంటున్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. తమ పార్టీ నేత జగదీష్రెడ్డిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారాయన.‘‘స్పీకర్ అంటే జగదీష్రెడ్డికి, మాకు ఎంతో గౌరవం ఉంది. సభలో హుందాగా ఉండాలని మా అధినేత చెబుతుండేవారు. మేం అలాగే ఉంటున్నాం. స్పీకర్ పట్ల ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదు. జగదీష్రెడ్డికి మైక్ ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా ఆయన స్పీకర్ను ఏకవచనంతో పిలవలేదు. కాబట్టి జగదీష్రెడ్డి(jagadish Reddy)పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలి’’ అని హరీష్ రావు స్పీకర్ను కోరారు. అంతకు ముందు.. సభ ప్రారంభానికి ముందు స్పీకర్ను ఆయన ఛాంబర్లో బీఆర్ఎస్ శాసనసభా పక్షం కలిసిసింది. జగదీష్రెడ్డి సస్పెన్షన్ అక్రమం, అన్యాయన్న బీఆర్ఎస్ సభ్యులు.. సస్పెన్షన్పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, చివరకు సస్పెన్షన్కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి.. నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. -
కస్టడీలోని యువకుడి మృతితో కలకలం
నిజామాబాద్: సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని వడ్డెర కాలనీకి చెందిన అలకుంట సంపత్ (31) జగిత్యాల జిల్లాలోని శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ మేనేజర్గా పని చేస్తున్నారు. సంపత్తోపాటు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేటకు చెందిన చిరంజీవి, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్కు చెందిన మిట్టాపల్లి నర్సారెడ్డిలు పనిచేస్తున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేశారు. కొంతమందిని లావోస్ దేశానికి డేటాఎంట్రీ ఆపరేటర్ల పేరిట పంపించారు. తీరా అక్కడ సైబర్నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసి స్వదేశానికి తిరిగొచ్చారు. అనంతరం ఆలకుంట సంపత్, చిరంజీవి, నర్సారెడ్డిలపై జిల్లా కేంద్రంలోని సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ముగ్గురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. 12న కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ నిమిత్తం జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం జిల్లా కేంద్రంలోని సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్కు తీసుకురాగా, గురువారం రాత్రి సంపత్ ఎడమ చేయి లాగుతోందని పోలీస్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. సంపత్ మృతి విషయాన్ని గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు తమకు చెప్పినట్టు కుటుంబీకులు తెలిపారు.ఫస్ట్క్లాస్ జడ్జి సమక్షంలో..సంపత్ మృతదేహానికి ఫస్ట్క్లాస్ జడ్జి హరికృష్ణ సమక్షంలో ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టును సీపీ సాయిచైతన్యకు అందించారు. సంపత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.గుండె సమస్యతో మృతి చెందాడు‘అలకుంట సంపత్ గుండె సంబంధిత సమస్యతోనే మృతి చెందాడు. సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగ యువతను థాయిలాండ్, మయన్మార్, లావోస్ తదితర ప్రాంతాలకు పంపించేవాడు. మోసపోయిన వారి ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు గురువారం జగిత్యాలలోని సంపత్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేశారు. అదే రోజు రాత్రి ఎడమ చేయి, ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో పోలీసులు జీజీహెచ్కు తీసుకువెళ్లారు. జీజీహెచ్లోని సీసీటీవీ ఫుటేజీలో సంపత్ నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించాం. జీజీహెచ్కు వెళ్లిన తర్వాత సంపత్ కుప్పకూలిపోయాడు. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. సంపత్ మృతిపై ఒకటో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ కొనసాగుతోంది.’ అని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సమగ్ర విచారణ జరపాలిసంపత్ మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం జీజీహెచ్కు చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త సంపత్ మృతి చెందాడని భార్య ఆరోపించారు. మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని జీజీహెచ్ ఎదుట ఉన్న రోడ్డుపై ధర్నా చేశారు. న్యాయం చేస్తామని, జడ్జి సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా పోస్టుమార్టం చేయించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. -
TS Assembly: తెలంగాణ శాసన సభ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కూడా హాట్ హాట్గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ జరిగింది. రుణమాఫీ, బకాయిల చెల్లింపు అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గవర్నర్ ప్రసంగ తీర్మానంపై సమాధానమిచ్చారు. :తెలంగాణ శాసన సభ ఎల్లుండి( సోమవారానికి) వాయిదాతెలంగాణ శాసన సభలో పొట్టి శ్రీరాములు అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంరుణమాఫీ చరిత్రలో మిగిలిపోయే అంశం.ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు రాకున్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేశాం.క్వింటాల్ కి 10 కిలోల తరుగు పేరిట కోట్లు కొల్లగోట్టారు.తరుగు తీస్తే.. తొలు తీస్తాం అని మేము చెప్పాం.కృష్ణ బేసిన్లో 299 టీఎంసీ లు చాలు అని సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్.. ఇది నిజం కదా..?వైఎస్సార్ ఆశీర్వాదంతో కేసీఆర్ కేంద్రంలో మంత్రి అయ్యారు.అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు అడ్డుకుంటే పోతురెడ్డి పాడు పెద్దది అయ్యేదా..?కేసీఆర్ ఏడాది నుంచి 55 లక్షల జీతం జీతం తీసుకొని.. సభకు వచ్చింది రెండు రోజులు మాత్రమే.సీఎం రేవంత్ ప్రసంగంరైతులకు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాంగత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై అన్యాయం చేసిందిమార్చి 31వ తేదీ నాటికి రైతులందరినీ భరోసా అందిస్తాంఅధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాంరైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాంవరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్ అన్నారుగతంలో ఎక్కడ పంట పండినా.. కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంకేబినెట్ విధానాలనే గవర్నర్ ప్రసంగిస్తారు.. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే గవర్నర్ ప్రసంగంలో చేర్చాం ఈ మాత్రం అవగాహన లేకుండా మంత్రులుగా ఎలా చేశారో తెలియడం లేదు ఇష్టారీతిలో మాట్లాడి సభ నుంచి వెళ్లిపోతే.. భవిష్యత్లో కూడా బీఆర్ఎస్కు సున్నానే వస్తది బీఆర్ఎస్ బాయ్కాట్మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నిరసనరేవంత్ ప్రసంగం కొనసాగుతున్న వేళ సభ నుంచి బాయ్కాట్ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది ఆ తర్వాత కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగం చేర్చారుఓ గవర్నర్ అందునా మహిళా గవర్నర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం హేళన చేసింది మేము రాజ్యంగబద్ద వ్యవస్థ కు గౌరవం ఇస్తాంగవర్నర్ ప్రసంగం.. గాంధీ భవన్ ప్రసంగంలా ఉందని కొందరు హేళన చేస్తున్నారుఅజ్ణానమే కొందరు విజ్ణానం గా భావిస్తున్నారు. శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి..కృష్ణ బేసిన్ ప్రాజెక్టుల్లో తెలిమెట్రీలను పెట్టిస్తాం గత ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వల్ల ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకుపోయింది కృష్ణ జలాలు అక్రమంగా తరలిపోవడానికి గత ప్రభుత్వం సహకారం ఉంది. కృష్ణా బేసిన్ లో నీళ్ల వాటా కోసం మేము పోరాటం చేస్తాంబకాయిల పాపం ఎవరిది?: మంత్రి శ్రీధర్ బాబుబకాయిలు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి?పేరుకుపోయిన బకాయిలను 14 నెలల నుంచి చెల్లిస్తున్నాంప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయొద్దుబకాయిలంతా మీరు అధికారంలో ఉన్న సమయంలోవేమీరు పెండింగ్లో ఉంచిన బకాయిలను మేమే అధికారంలోకి వచ్చాక చెల్లించాముపళ్ల రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలిమీ ఇంజనీరింగ్ కాలేజ్లకు దీటుగా.. మేము మా ప్రభుత్వ కాలేజ్లను ముందుకు తీసుకవెళ్ళతాముఇంత బ్లైండ్గా మాట్లాడుతారనుకోలేదు: భట్టిమేం పనులు చేశాం.. మీలా ప్రచారాలు చేసుకోవడంలేదుఇచ్చిన మాట తప్పొద్దనే ఏడాదిలోపు రుణమాఫీ చేశాంఅన్ని గ్రామాల్లో ఆ జాబితా డిస్ప్లే చేస్తున్నాంపల్లా విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాస్తవాలు చెబుతారని అనుకున్నాం.కానీ, ఇంతబ్లైండ్గా మాట్లాతారనుకోలేదుబీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖను నిర్వీర్యం చేశారుబీఆర్ఎస్ పాలనలో డ్రాపౌట్స్ ఎందుకు పెరిగాయి?2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడులు మానేశారు?మేం యూనివర్సిటీలను ధారదత్తం చేసి విద్యను అమ్ముకోలేదుటీచర్ రిక్రూట్మెంట్ ఎవరు ఇచ్చారు?ఇంకా 5, 6 మంది టీచర్లను రిక్రూట్ చేసుకుంటాంఒక్కసారైనా ఐటీఐల గురించి పట్టించుకున్నారా?. మేం అధికారంలోకి రాగానే వాటిని స్కిల్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించాం. మీలాగా గాలికి వదిలేయలేదుఅన్ని వర్సిటీలకు వీసీలను నియమించాంచాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి వెళ్లి ఎప్పుడైనా చూశారా?వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూకి మొదటిసారి దళిత వీసీని నియమించిన ఘనత రేవంత్రెడ్డిదేసీఎం ఎంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోండిమీరు చూసిన సీఎంలాగా ఇప్పటి సీఎం చేయరు ప్రభుత్వానికి BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి.సీఎం, డిప్యూటీ సీఎం ఏ గ్రమానికైనా రచ్చి వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలి.ఏ గ్రామంలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!ఆ గ్రామంలోనే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా.జనగామనే కాదు డిప్యూటీ సీఎం మధిర అయినా పర్లేదు.వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాఅసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి..రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదనడం సరికాదుఅధికారంలో వచ్చిన మూడు నెలలోనే రుణమాఫీ చేశాంసిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలకు ఆ నేతలు చేసిన దానికంటే.. మేం చేసిన మేలు ఎక్కువఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తాంప్రతీ పథకాలను లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంఅధికారంలో ఉన్నన్నాళ్లూ మీరు ప్రచారాలు చేసుకున్నారుమేం అన్నీ చేసుకుంటూ పోతున్నాం.. కానీ, ప్రచారం చేసుకోవడం లేదుకావాలంటే.. శాసన సభ ప్రాంగణంలో రైతు బంధు, రైతు భరోసా లిస్టులు అంటిస్తాం115 నియోజకవర్గాలకు సంబంధించి.. గృహజ్యోతితో పాటు అన్ని పథకాల సమాచారం మా దగ్గర ఉందిమేం పని చేసేది ప్రజల కోసం మీలాంటి రాజకీయ పార్టీల కోసం కాదుబీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాలు.. డిప్యూటీ సీఎం చెబుతున్నారుడిప్యూటీ సీఎం ఎలాగైనా సీఎంకు రావాల్సిన క్రెడిట్ కొట్టేసి.. ప్రమోషన్ పొందాలని చూస్తున్నారుమేం అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలిమా ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేశాంరైతు భరోసా ఎంత మందికి ఇచ్చారు?ఎంత మందికి ఇచ్చారో కాదు.. ఇంకా ఎంతమందికి ఇవ్వలేదో ఆ లెక్కలు కూడా చెప్పాలి కదా?అధికారంలోకి వచ్చి 15నెలలు అయ్యింది.. ఇంకెతం కాలం పడి ఏడుస్తారు?వరికి రూ.500 బోనస్ ఎప్పుడు ఇచ్చారు? ఎంత ఇచ్చారు?మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.ఉమ్మడి నల్గొండ జిల్లా లో మెజార్టీ రైతులకు రుణమాఫీ అయ్యింది.. రైతు భరోసా ఇచ్చాము.మీ ప్రభుత్వo లో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు ఇన్స్టాల్ మెంట్ చేశారు...మేము 2లక్షలు ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..దేశ చరిత్ర లో ఎక్కడ లేని విధంగా మేము ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..మేము రుణమాఫీ చేస్తే మీరు ఓర్వలేక పోతున్నారు..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిరేపు సీఎం రేవంత్ స్టేషన్ ఘన్ పూర్ వస్తున్నారు.దేవాదుల ఆన్ చేసి ఎండుతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలి.ఇప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయాయి.రేపు సీఎం పంటనష్టం పై రైతులకు నిదులు ఇవ్వాలి.అంతకుముందు.. సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. జగదీష్రెడ్డి సస్పెన్షన్ అంశం పునఃసమీక్షించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశంఘుంది. అలాగే ఇవాళ కీలకమైన యూనివర్సిటీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది. విభజన చట్టం 10 ఏళ్లు పూర్తి కావడంతో తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడం, తెలంగాణ విద్యార్థులకే అడ్మిషన్లు లాంటి అంశాలను ఈబిల్లులో పొందుపరిచారు.అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశంఇవాళ అసెంబ్లీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్లు చేశారు. లాబీలో శ్రీధర్ బాబు ఛాంబర్ ముందు ఈ ఇద్దరు మంత్రులలు ఎదురు పడ్డారు. శ్రీధర్ బాబు వస్తుంటే ముఖ్యమంత్రి వచ్చినంత హంగామా ఉందని కోమటిరెడ్డి అనగా.. అసెంబ్లీ సిబ్బంది, అధికారులు నవ్వుకున్నారు. వెంకన్న నాపై అభిమానంతో అలా అంటారు..ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవద్దని శ్రీధర్ బాబు అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. -
కుబేరులకు కునుకు లేదు..?!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు నిద్రలేమితో బాధపడుతున్నారట. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు మొత్తం 260 మందిని సర్వే చేయగా ఆర్థిక అనిశి్చతి, ఎక్కువ సమయం పనిచేయడం, నిర్ణయాలు తీసుకోడానికి అధిక ఒత్తిడిని ఎదుర్కోడం, నిరంతర డిమాండ్లు తదితర అంశాలతో 55 శాతం మంది ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారట. ఇటీవల హార్ట్ఫుల్నెస్, టీఐఈ గ్లోబల్ సంయుక్తంగా నిద్ర సంక్షోభంపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ యజమానులు, టెక్ నిపుణులకు సైతం నిద్ర పట్టడంలేదని తేలింది. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు.పనితీరుపై ప్రభావం.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది తగినంత సమయం నిద్రలేకపోవడంతో పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, అలసటకు గురవుతున్నామని అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ఏకాగ్రత కోల్పోతున్నామని, ఫలితంగా కార్యాలయ పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. నిద్రలేమితో సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారట. 26 శాతం మంది రాత్రి 6 గంటలే నిద్రపోతున్నారని, 19 శాతం మంది చాలా పేవలమైన నిద్రతో ఒత్తిడి, ఆందోళనల కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. నిద్రను త్యాగం చేస్తున్నారు.. స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపార వేత్తలు తమ విజయాల్లో నిద్రను త్యాగం చేస్తున్నారు. ఉత్పాదకత, నిర్ణయాలు తీసుకోవడం, పనితీరుపై నిద్ర లేమి ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. స్థిరమైన విజయానికి కీలకమైన ఆరోగ్యకరమైన పని–జీవన సమతుల్యతను సాధించడంలో వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చే వనరులను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. – మురళి, గ్లోబల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ కేవలం విశ్రాంతి కాదు.. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. మనసు, శరీరం, ఆత్మ పునరుజ్జీవనం పొందడానికి ఒక పవిత్ర అవకాశం. ఆరోగ్యకరమైన నిద్ర పద్ధతులతో జ్ఞానం, సృజనాత్మకత, సమతుల్యతతో నడిపించే సామర్థ్యం మెరుగ్గా ఉంటాయి. అంతర్ దృష్టి బలపడుతుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. – రెవరెండ్ దాజీ, హార్ట్ఫుల్ నెస్ గైడ్, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు -
Telangana: మా గ్రామాలను ఎఫ్సీడీఏలో కలపండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్సిటీలో తమ గ్రామాలను సైతం విలీనం చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 56 రెవెన్యూ గ్రామాలతో పాటు 765.25 స్కై్వర్ కిలోమీటర్ల పరిధిని 12 జోన్లుగా విభజించి.. భావినగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను తొలగించి, ఫ్యూచర్సిటీ డెవలెప్మెంట్ అథారిటీలో విలీనం చేసింది. సీఎం రేవంత్రెడ్డి చైర్మన్గా ఇప్పటికే ఫ్యూచర్సిటీ డెవలెప్మెంట్ అథారిటీ కోసం ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్(ఆమనగల్లు) వరకు 330 ఫీట్ల రేడియల్ గ్రీన్ఫీల్డ్రోడ్డు ఏర్పాటుకు భూ సేకరణ చేపట్టింది. అంతర్జాతీయ హంగులతో సుమారు 30 వేల ఎకరాల్లో కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్సిటీలో తమ గ్రామాలను కూడా విలీనం చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కొన్ని గ్రామాల ప్రజలైతే ఏకంగా అఖిలపక్షంగా ఏర్పడి ధర్నాలకు సైతం దిగుతుండడం విశేషం. బతుకులు మారతాయనే.. ఐటీ, ఇండ్రస్టియల్ పరిశ్రమల రాకతో సమీప భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కనీస అభివృద్ధికి నోచుకోని తమ గ్రామాలను కొత్తసిటీలో కలపడం ద్వారా తమ జీవితాలు పూర్తిగా మారిపోతాయనే ఆశ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. కాగా ప్రభుత్వ ప్రతిపాదిత ఫోర్త్సిటీ కోసం ఇప్పటికే 13,973 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. తాజా గా మరికొంత భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కృత్రిమమేథ (ఏఐ) సిటీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక వాణిజ్య భవనం సహా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, క్రికెట్ స్టేడియం తదితర ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు ఇందులో చోటు కలి్పంచనుంది. ఐటీ, ఇండ్రస్టియల్ పార్కుల పేరుతో కొత్తగా మహేశ్వ రం మండలం రావిర్యాల గ్రామం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 275.12 ఎకరాలు, కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 350.22 ఎకరాల భూసేకరణకు నోటిఫి కేషన్ జారీ చేసింది. అదనంగా తిమ్మాపూర్లో 600 ఎకరాలు, పంజాగూడలో 300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కన్సల్టెన్సీకి నోటిఫికేషన్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 14 గ్రామాల మీదుగా వెళ్లే గ్రీన్ఫిల్డ్ రేడియల్ రోడ్డును రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. ఫేజ్–1లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్ పేట వరకు 19.02 కిలోమీటర్ల మేర రూ.1,665 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఫేజ్–2లో భాగంగా మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు ఆర్ఆర్ఆర్ వరకు 22.30 కిలోమీటర్లు రూ.2,365 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న టెక్నికల్ బిడ్లను ఆహ్వానించడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లను నాటే పనిలో నిమగ్నమయ్యారు. మార్చి 21న టెక్నికల్ బిడ్స్ తెరవనున్నారు. తాజాగా రోడ్డు నిర్మాణ సమయంలో పనులు పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సరీ్వసులకు టెండర్లు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ⇒ మహేశ్వరం మండలంలో 31 పంచాయతీలు ఉండగా, వీటిలో హర్షగూడ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం అయింది. తాజాగా తుమ్మలూరు, మహబత్నగర్ను ఫోర్త్సిటీలో విలీనం చేశారు. ఇదే మండలం నుంచి మరికొన్ని విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి.⇒ కందుకూరు మండల పరిధిలోని నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, ధన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, దావుద్ గూడతండా, పెద్దమ్మతండా పంచాయతీలను సైతం ఫోర్త్సిటీలో కలపాలని కోరుతున్నారు. -
మనవడి పుట్టిన రోజు నాడే తాత బలవన్మరణం
మియాపూర్: మనవడి పుట్టిన రోజు నాడే అతడి తాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్కు చెందిన రాఘవేందర్ రావు(60) భార్య విజయలక్ష్మితో కలిసి మియాపూర్లోని దీప్తిశ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవేందర్రావు కాలనీలో విజయ స్వగృహ ఫుడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాఘవేందర్రావు మనవడు అర్జున్ పుట్టిన రోజు కావడంతో సాయంత్రం వేడుకలు నిర్వహించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్కు వెళ్లారు. రాఘవేందర్ రావును కూడా రావాలని కోరగా.. తాను ఇంట్లోనే ఉంటానని, మీరు వెళ్లి రండి అని చెప్పారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా బెడ్రూం లోపలి నుంచి డోర్ వేసి ఉంది. రాఘవేందర్రావును ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో.. కిటికిలోంచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపు బద్దలు కొట్టి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా రాఘవేందర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మనవడి పుట్టిన రోజు నాడే రాఘవేందర్ రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. -
వరకట్న వేధింపులకు యువతి బలి
అత్తాపూర్: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్కు చెందిన స్వప్న(27)కు అత్తాపూర్ పాండురంగ నగర్కు చెందిన అమరే‹Ùకు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కొద్దిరోజులుగా అమరేష్ అదనంగా కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. పెళ్లి సమయంలో పెట్టిన బంగారాన్ని తన అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టడంతో పాటు అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ వేధించసాగాడు. ప్రతిసారి ఇంటి నుంచి డబ్బులు తేలేక..వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలను ఆదేశించారు. ప్రభుత్వం పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ను ప్రభుత్వం ఆయుధంగా ఎంచుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని స్పష్టం చేశారు.ఒకవేళ అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటికి పంపినా వివిధ రూపాల్లో నిరసన తెలపాలని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని భావించినా హోలీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కరే వెళ్లినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. ముందుగా ప్లాన్చేసుకునే సస్పెన్షన్లు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ సందర్భంగా రచ్చ చేసి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎల్పీ భేటీలోనే ప్లాన్ చేసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించడం ద్వారా ప్రజా సమస్యలు, ఆకాంక్షలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టే బడ్జెట్లోని డొల్లతనాన్ని బయట పెట్టేందుకు సమావేశాలను ఉపయోగించుకోవాలి. దూషణలు, పరస్పర విమర్శల జోలికి వెళ్లకుండా పూర్తి అధారాలు, అంకెలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి’’అని సూచించినట్టు సమాచారం. పార్టీ రజతోత్సవాలపైనా చర్చ బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కేసీఆర్ పలు సూచనలు చేశారు. వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మాజీ మంత్రి హరీశ్రావు ఇప్పటికే దృష్టి సారించారు. ఆ సభను విజయవంతం చేసేందుకు జరగాల్సిన కసరత్తు, నియోజకవర్గాల వారీ గా సన్నాహక సమావేశాలు, సన్నాహక కమిటీల ఏర్పాటు వంటి అంశాలపైనా కేటీఆర్కు కేసీఆర్ ప లు సూచనలు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి త్వ రలో కేటీఆర్ అన్ని జిల్లాల ముఖ్య నేతలతో ఒక ప్ర త్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.22న డీఎంకే భేటీకి కేటీఆర్తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష భేటీకి హాజరుకావాల్సిందిగా కేటీఆర్ను కేసీఆర్ ఆదేశించారు. ఆ భేటీలో బీఆర్ఎస్ పక్షాన ప్రస్తావించాల్సిన అంశాలు, పోరాట రూపాలు, ఐక్యకార్యాచరణ, అవలంబించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్ష, దానిపై బీఆర్ఎస్ చేసిన పోరాటాలను కూడా ప్రస్తావించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, నిధుల పంపిణీలో వివక్ష, దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కంట్రిబ్యూషన్ తదితరాలపైనా దిశానిర్దేశం చేశారు. -
యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. వీటితోపాటు అశోకుని శాసన నిలయాలు, చౌసట్టీ యోగినీ దేవాలయాల వంటి ఆరు చారిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్ నామినేట్ చేసింది. వీటిని మార్చి 7న తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్లో తెలిపింది. ఒక ఆస్తిని ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే.. వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. ఈ ఏడాది భారత్ చేర్చిన జాబితాలో చత్తీస్గఢ్లోని కంగెర్ వ్యాలీ నేషనల్ పార్క్, తెలంగాణలోని ముడుమాల్ మెగాలితిక్ మెన్హిర్స్, పలు రాష్ట్రాల్లోని అశోకుడి శాసన స్థలాలు, మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలోని బుందేలాల రాజభవనాలు, కోటలు ఉన్నాయి. వీటితో భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది. -
బలంగా గళం వినిపిస్తా
సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభ్యుడిగా నా హక్కులు కాపాడుకోలేని నేను ప్రజల హక్కులను ఎలా కాపాడగలను? ఎలాంటి సభా సాంప్రదాయాలను ఉల్లంఘించకున్నా నన్నుఅసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం. నా సస్పెన్షన్కు చూపిన కారణాలేవీ సరికాదు. కాంగ్రెస్ పార్టీకి నా గొంతు నొక్కడం సాధ్యం కాదు. పంటలు ఎండి బాధ పడుతున్న రైతు గురించి, ప్రభుత్వం చేతిలో మోసానికి గురవుతున్న ప్రజల గురించి మరింత బలంగా నా గళం వినిపిస్తా.ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తా..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం భేటీలో సీఎం సమక్షంలో ముందే నిర్ణయం తీసుకున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేయడంపై జగదీశ్రెడ్డి శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పథకం ప్రకారమే గొడవకు దిగారు ‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై కాంగ్రెస్ నుంచి ఇద్దరు సభ్యులు సుమారు గంటన్నర పాటు మాట్లాడినా మేం ఎక్కడా అడ్డు చెప్పలేదు. కానీ నేను మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు పథకం ప్రకారమే గొడవకు దిగారు. స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా నేను ఒక్క అక్షరం కూడా ఉపయోగించలేదు. 50 మంది సభ్యులు అంతరాయం కలిగిస్తున్నా స్పీకర్ నా రక్షణకు రాలేదు. సభను నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని మాత్రమే చెప్పా.సభ్యులందరికీ సమాన హక్కులుంటాయనే విషయాన్ని గుర్తు చేశా. నేను స్పీకర్ను ఏకవచనంతో సంబోధించానని, దళితులను అవమాన పరిచానని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో దళిత కోణం ఎక్కడుందో చెప్పాలి. ఏకవచనంతో సంబోధించలేదు అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సభాపతి స్థానానికి కుల మతాలు ఉండవు. ప్రజలు ప్రత్యక్షంగా నేను మాట్లాడిన తీరును వీక్షించారు. ఈ విషయంలో స్పీకర్ నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. సభను ప్రభుత్వం నియంతృత్వ పద్ధతిలో నడిపిస్తోంది..’అని జగదీశ్రెడ్డి అన్నారు. సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కారు ‘నా సస్పెన్షన్ విషయంలో అన్ని సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. అన్ని పార్టీల సభాపక్ష నేతల సమక్షంలో నా వ్యాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కనీసం వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. నేను మాట్లాడిన అతికొద్ది సమయంలో ఎక్కడా అన్పార్లమెంటరీ పదాలు వాడలేదు..’అని మాజీమంత్రి చెప్పారు. -
పాలన చేతగాకే.. గొంతునొక్కుతున్నారు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకనే అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కుతోందని మండిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబోమ్మలతో ర్యాలీలు నిర్వహించి దహనం చేశాయి. జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటికి పంపడం అప్రజాస్వామికమని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ సస్పెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని మండిపడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేయగా... పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. శాసనసభలో స్పీకర్ను అగౌరవపరిచే విధంగా జగదీశ్రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా... ప్రభుత్వం కక్షపూరితంగా, పథకం ప్రకారమే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా చెప్పుకునేందుకు ఒక్క మంచి పనికూడా లేనందునే.. కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీని అడ్డాగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశాయి. నకిరేకల్, దేవరకొండ, మునుగోడులలో రాస్తారోకోతో నిరసన తెలిపాయి. హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్లలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, భీమారం, రామకృష్ణాపూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్లలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. కాగా.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు, ఇల్లందు, మధిర తదితర చోట్ల తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు.ప్రజాకోర్టులో తేల్చుకుంటాం: కేటీఆర్పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ కేడర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి చేతకానితనం బయటపడొద్దనే బీఆర్ఎస్ నాయకులపై కుట్రలు చేస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు, హామీల అమల్లో మోసాన్ని ఇదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
నేటి నుంచి అంగన్వాడీలు ఒకపూటే
సాక్షి, హైదరాబాద్: ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఒకపూటే నిర్వహించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క ఆదేశించారు.ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. శనివారం నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగించాలని తెలిపారు. -
బాల్యంపై బులీయింగ్ పడగ
‘ఐ వాంట్ టు డై’.. ఐదో తరగతి చదివే ఒక బాలిక తన రెండు నోట్బుక్స్లో రాసుకున్న వాక్యం ఇది. హైదరాబాద్లోని అల్వాల్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఆ బాలిక బాగా పేరొందిన పాఠశాలలో చదువుతోంది. నోట్బుక్స్లో రామకోటి రాసినట్లుగా ‘ఐ వాంట్ టు డై’అంటూ రాసి పేజీలు నింపేసింది. వాటిని చూసి తల్లిదండ్రులుహడలిపోయి, మానసిక వైద్యులను సంప్రదించారు.కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు సకాలంలో స్పందించకపోతే పాప ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని తెలిపారు. ఆ బాలిక మాత్రమే కాదు.. చాలామంది స్కూల్ పిల్లలు తరగతి గదిలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరిద్దరు పిల్లలను టార్గెట్ చేసి అనేక రకాలుగా వేధిస్తున్నారు. వారిలోని శారీరక లోపాలను ఎత్తిచూపుతూ ఏడిపిస్తారు. మానసిక వైద్య పరిభాషలో ‘బులీయింగ్’గా పిలిచే ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాలేజీల్లో ర్యాగింగ్ తరహాలో స్కూళ్లలో బులీయింగ్ భూతంపిల్లలను వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ విష సంస్కృతి 1.3 శాతం ఉంటే, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో 35 నుంచి 37 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ బులీయింగ్?ఐ వాంట్ టు డై అని రాసిన బాలిక తోటి విద్యార్థుల కంటే కాస్త లావుగా ఉంటుంది. దాంతో తరగతి గదిలో సహ విద్యార్థులు మొదట్లో ఆటపట్టించేవారు. క్రమంగా అంతా ఒక్కటై ఆమెను ఏకాకిని చేసి ఏడిపించడం మొదలుపెట్టారు. ఈ బులీయింగ్ అంతటితో ఆగలేదు. బాలిక చుట్టూ చేరి జడలు పట్టుకొని లాగుతూ ‘పిగ్టేల్’అంటూ ఏడిపించేవారు. ఈ వేధింపులపై క్లాస్ టీచర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఆ బాలికనే తిట్టింది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఫిర్యాదును పట్టించుకోలేదు.దీంతో ఆ బాలిక డిప్రెషన్లోకి వెళ్లింది. పైకి చూడ్డానికి ఇది సాధారణంగా ఏడిపించడం (బులీయింగ్)గానే కనిపిస్తుంది. కానీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో కొందరు టీచర్లే బులీయింగ్కు ఆజ్యం పోస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల రంగు, రూపు, ఆకృతి, నడక వంటి శారీరక అంశాలను లక్ష్యంగా చేసుకొని ‘బాడీషెమింగ్’కు పాల్పడుతున్నారు. ఏడేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల టీన్స్ వరకు బులీయింగ్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ఆధిపత్య పెంపకంతరగతిలో ఉన్న పిల్లలంతా ఒకేవిధమైన బులీయింగ్ స్వభావాన్ని కలిగి ఉండరు. వారిలో ఒక్కరో, ఇద్దరో కలిసి మిగతా వాళ్లందరినీ ఒక గ్రూపుగా సంఘటితం చేస్తారు. టార్గెట్ చేసిన బాలిక లేదా బాలుడిని ఏకాకిని చేస్తారు. మిగతా పిల్లలు తమ ప్రమేయం లేకుండానే ఆ జట్టులో చేరి ఏడిపిస్తుంటారు. తరగతిలో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఆ ఒకరిద్దరు పిల్లల ప్రవర్తన మిగతా పిల్లలను ప్రభావితం చేస్తుంది.తోటివారికంటే తామే గొప్పవాళ్లమనే భావన పిల్లల్లో కలగడానికి వారి తల్లిదండ్రుల ఆధిపత్య పెంపకమే (అథారిటేరియన్ పేరెంటింగ్) కారణమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి గురించి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. బులీయింగ్ను అరికట్టాల్సిన టీచర్లే బాధితులను మరింత ఏకాకులను చేస్తున్నారు.స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందనే విషయాన్ని తల్లిదండ్రులు కచి్చతంగా ఆరా తీయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బులీయింగ్కు గురయ్యే పిల్లలు సరిగ్గా తినకపోవడం, మాట్లాడకుండా ఉండిపోవడం, ఇంట్లోనూ ఒంటరిగా గడపడం వంటి లక్షణాలతో బాధపడుతారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. కలిసికట్టుగా ఎదుర్కోవాలి పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా డామినేటింగ్ కల్చర్లో పిల్లలను పెంచుతారు. దీంతో సహజంగానే ఆ పిల్లలకు అదే సంస్కృతి అలవడుతుంది. తాము అలా ఏడిపించడం వల్ల తోటి విద్యార్థి మనస్సును గాయపరుస్తున్నామనే భావన ఆ పిల్లల్లో ఏ మాత్రం కనిపించదు. ఒక సర్వే ప్రకారం తరగతి గదిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక విధమైన బులీయింగ్కు గురవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ యాజమాన్యం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. బులీయింగ్ లక్షణాలు ఏ రూపంలో కనిపించినా అరికట్టాలి. లేకపోతే పిల్లల భావి జీవితాన్ని ఇది కబళిస్తుంది. – డాక్టర్ సంహిత, మానసిక వైద్యనిపుణులు, సికింద్రాబాద్. -
ఫైర్ లేని వాల్స్!
సాక్షి, హైదరాబాద్: ప్రతీ రంగంలో సాంకేతికత అత్యంత కీలకంగా మారింది. అదేస్థాయిలో సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంటోంది. ఏదైనా సంస్థ నెట్వర్క్ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్వాల్ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే, హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్వర్క్లు బలహీనమని గ్రూప్–ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్ క్రైం ట్రెండ్స్ రిపోర్ట్–2025లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్ దాడుల్లో అత్యధికంగా 13 శాతం ఘటనలు భారత్లోనే జరిగినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన నెట్వర్క్లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల నెట్వర్క్, మిలిటరీ, ఆర్థికసేవల సంస్థల నెట్వర్క్లు హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. హ్యాకర్లు ఫైర్వాల్స్ను ఛేదించి సదరు నెట్వర్క్లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అ«దీనంలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు తెలిపింది. డేటా లీకేజీలో అమెరికాది తొలిస్థానంపబ్లిక్ డొమైన్లో ఉండే డేటా లీకేజీలో అమెరికా తొలిస్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2024లో ఈ తరహా ఘటనలు అమెరికాలో 214 నమోదైనట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో రష్యా (195 ఘటనలు) ఉండగా.. భారత్ (60) మూడో స్థానంలో నిలిచినట్టు గ్రూప్–ఐబీ నివేదిక పేర్కొంది. ఈ–మెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు, పాస్వర్డ్లు ఈ డేటా లీకేజీలో ఉంటున్నాయి. 2024లో ఈ–మెయిల్ అడ్రస్లు, పాస్వర్డ్లను డార్క్వెబ్లో విక్రయించడం ద్వారానే సైబర్ నేరగాళ్లు రూ.248.9 కోట్లు కొల్లగొట్టారు.ఫైర్వాల్స్ అంటే? అనధికారికంగా నెట్వర్క్లోకి చొరబడకుండా, హానికరమైన డేటాను నెట్వర్క్లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఫైర్వాల్. ఇది హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ కావొచ్చు. నెట్వర్క్ ప్యాకెట్లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అనేదాన్ని ఫైర్వాల్ నిర్ణయిస్తుంది. ఫైర్వాల్స్ ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా నెట్వర్క్ను యాక్సెస్ చేయకుండా హానికరమైన సాఫ్ట్వేర్ను నిరోధించగలవు. -
ఆ జాబితా పరిగణించం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్లకోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి, జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని.. తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చిచెప్పింది. దీనితో కంగుతినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్తో మళ్లీ సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే.. లబ్ధి దారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. కేంద్రం నుంచి అందే నిధుల కోసం.. దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది.ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని, కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచి్చంది. కేంద్రం రూపొందించిన యాప్తో మళ్లీ సర్వే.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి.. 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుకాగా.. మూడున్నర లక్షల మంది సొంత భూమి లేనివారు.రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని.. దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.అయినా కేంద్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నా... కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర నిధులు రాకుంటే పథకం భారమే! పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్ను రూ.లక్షన్నరగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4 శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.73 వేలుగా ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలిక కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
జ్వరం గోలీలూ లేవు!
ఆస్పత్రిలో మందుల్లేక..బయట కొనలేక! ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు మాశమ్మ. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగనూల్ గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్ మందులు రాశారు. అయితే ఆ మందులు ఆసుపత్రిలో లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేటులో తీసుకోవాలని చెప్పారు. డబ్బులు పెట్టి ప్రైవేట్ దుకాణంలో మందులు కొనే స్తోమత లేని మాశమ్మ ఇలా నిస్సహాయంగా నిలబడింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (పీహెచ్సీలు) పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, ఎంఎన్జే, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకచోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.జ్వరానికి వాడే పారాసెటమాల్, జలుబుకు ఉపయోగించే సిటిరిజైన్ లాంటివి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. డాక్టర్లు రాసిచ్చిన 5 మందుల్లో కనీసం 2 లేదా 3 బయట కొనుక్కోక తప్పడం లేదని అంటున్నారు. మందుల కొరత నేపథ్యంలో కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు కాకుండా 10 రోజుల వరకే మందులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అయితే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు అవసరమైన మందుల నిల్వలు తమ వద్ద ఉన్నాయని టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ చెపుతున్నారు. అలాగే జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో కూడా మందుల నిల్వలు ఉన్నాయని ఆయా జిల్లాల డీఎంహెచ్ఓలు చెబుతున్నప్పటికీ..వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలాచోట్ల అవసరమైన మందుల కోసం ఇండెంట్లు పెట్టేవారే లేరని, మరోవైపు మందులు సమీకరించి పంపాల్సిన టీజీఎంఎస్ఐడీసీకి నిధుల కొరత సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణ మందులకూ తిప్పలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులు, బోధన కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, పీహెచ్సీలకు అక్కడి నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు మందులు సరఫరా అవుతుంటాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులు, తదితర ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు అందుతుంటాయి. ఈ విధంగా పలు ఆస్పత్రులు ఇండెంట్లు పంపినా కొన్ని మందులు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరానికి వాడే పారాసెటమాల్ టాబ్లెట్ ప్రతి ఆసుపత్రిలో తప్పక ఉండాలి.కానీ పెద్దపల్లి జిల్లాలోని కొన్ని పీహెచ్సీల్లో ఈ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు రోగులు చెపుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో కంటి చూపు సమస్య నివారణ కోసం వ్యాధి నిరోధక టీకాలకు అనుబంధంగా అందించే విటమిన్ –ఏ సిరప్ కొరత దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉంది. నెల రోజులుగా ఈ సిరప్ నిల్వలు నిండుకోగా.. జిల్లా ఆసుపత్రులతో పాటు పీహెచ్సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో కేవలం టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులే చెపుతున్నారు.అలాగే సర్వ సాధారణ మందులైన రాన్టాక్, పాన్టాప్, జోఫర్, డైసైక్లోమిన్, ఎవిల్, ఫెరజోడిన్, సిటిరిజైన్, మెట్రోజిల్, బెటాడిన్ ఆయింట్మెంట్, డైక్లో, స్రైబీష్ లోషన్ వంటివి కూడా కొన్నిచోట్ల అందుబాటులో లేవు. పీహెచ్సీల్లో బీపీ, షుగర్కు సంబంధించి నెల రోజులకు సరిపడే మందులు ఇవ్వాల్సి ఉండగా, గత కొంతకాలంగా 10 రోజులకే పరిమితం చేస్తున్న పీహెచ్సీలు చాలా ఉన్నాయి. జింక్, యాంటి బయోటిక్, ఐరన్ గోలీలతో పాటు ఐవీ సెట్లు కూడా చాలా పీహెచ్సీలు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవని, బయట కొనుక్కోమంటున్నారని రోగులు చెపుతున్నారు. ప్రముఖ ఆసుపత్రుల్లోనూ... ఉస్మానియా, గాందీ, నీలోఫర్, ఎంజీఎం, ఎంఎన్జే ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణనలోకి తీసుకుని టీజీఎంఎస్ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే వస్తుండగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ 20 శాతం మందుల కొనుగోలుకు సంబంధించి 8 నెలలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం కూడా సమస్యకు కారణమవుతోంది.ఉస్మానియా ఆసుపత్రిలో 1,100 పడకల వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 1000 పడకలకు గానూ 1,500కు పైనే రోగుల తాకిడి ఉంటోంది. కొన్నిసార్లు (సీజన్) ఈ రెండు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య 2 వేలకు పైగానే ఉంటోంది. దీంతో గాం«దీ, ఉస్మానియా ఆసుపత్రుల ఆవరణల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేటు మెడికల్ దుకాణాలు 24 గంటలు రోగులతో కిటకిటలాడుతూ ఉంటున్నాయి. వరంగల్ ఎంజీఎంలో 2,500 నుంచి 3,000 వరకు రోగులు నమోదవుతున్నారు. కాగా మందుల కొరత నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులు, మండలాలు, పట్టణ కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల పక్కనే ఉంటున్న ప్రైవేటు మెడికల్ షాపులే రోగులకు గతవుతున్నాయి. 293 మందులకు 100 కూడా ఉండటం లేదు.. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లోని పీహెచ్సీలు, సబ్సెంటర్స్లో మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఆయింట్మెంట్లు, లోషన్లు, యాంటి బయాటిక్స్, ఐవీ సెట్లు మొదలైనవన్నీ కలిపి 293 కేటగిరీల మందులు ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చే రోగులు మొదలుకొని ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, బీపీతో వచ్చే వారికి, చర్మ వ్యాధులు, పాము కాట్లు, పురుగు మందులు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిచిన వారికి ఉపయోగపడే మందుల వరకు ప్రతి ఒక్కటీ పీహెచ్సీల్లో ఉండాలి.కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ పీహెచ్సీలు, 4,693 ఉప ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల 50 నుంచి 100 లోపు కేటగిరీల్లోనే మందులు ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. పాముకాటుకు గురై పీహెచ్సీలకు వచ్చే వారికి ‘పాం’ ఇంజక్షన్ అందుబాటులో ఉండడం లేదు. కుక్కకాటుకు కూడా ఇంజెక్షన్ అందుబాటులో ఉండాలని ఎన్హెచ్ఎం చెపుతుండటం గమనార్హం. మందుల కొరత లేదు.. టీజీఎంఐడీసీ ద్వారా 568 రకాల మందులను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు పంపిస్తున్నాం. ఇందులో ఒక కేటగిరీ కింద 293 రకాల మందులు, మరో కేటగిరీలో 100 రకాల మందులు అవసరానికి అనుగుణంగా పంపిస్తాం.ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాం«దీ, ఎంఎన్జే, నీలోఫర్, ఎంజీఎం ఆసుపత్రులను వారానికోసారి సంప్రదించి ఇండెంట్ ద్వారా వారికి అవసరమైన మందులను పంపిస్తాం. అలాగే జిల్లాల్లోని సీడీఎస్లకు కూడా వారు పంపే ఇండెంట్లను బట్టి మందులు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. ఎక్కడైనా ఉన్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే పంపించే ఏర్పాటు చేస్తాం. – హేమంత్ (టీజీఎంఐడీసీ ఎండీ) పాముకాటు మందు కోసం 17 కి.మీ ప్రయాణం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీను కొన్నిరోజుల క్రితం ఓ ఇంటి దగ్గర ఉదయం వేళ పనిచేస్తుండగా, కట్టెల కింద పడుకున్న విషపు పాము చేతిపై కాటేసింది. అక్కడే ఉన్న శ్రీను బావ తాడుతో చేయికి కట్టుకట్టి, బైక్పైన గ్రామంలోని పీహెచ్సీకి తీసుకెళ్లాడు. అక్కడ పాము కాటుకు వేసే మందు ‘పాం’ అందుబాటులో లేదు. కరీంనగర్ వెళ్లాలని సిబ్బంది సూచించారు. దాంతో బైక్ పైనే అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పెద్దాసుపత్రికి వెళ్లగా వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. -
గ్రూప్–3లోనూ పురుషులే ‘టాప్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 కొలువుల భర్తీ కోసం నిర్వహించిన అర్హత పరీక్షల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. గ్రూప్–2 లాగే గ్రూప్–3 పరీక్షల్లోనూ పురుషులే ఆధిపత్యం కనబరిచారు. ఈ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఒకే ఒక్క మహిళ ఉన్నారు. టాప్ 92లో పది మంది మహిళలు మాత్రమే నిలిచారు. మొత్తం 450 మార్కులకు గాను మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి 339.239 మార్కులు సాధించాడు. గ్రూప్–2లో టాప్ 31 ర్యాంకుల్లో ఒక్క మహిళ కూడా లేని విషయం తెలిసిందే. 18 వేల మందికి అనర్హత మొత్తం 1,388 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 30 డిసెంబర్, 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. గ్రూప్–3లో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులు. ఈ పరీక్షల ఫలితాలు, జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జీఆర్ఎల్), మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్ స్కాన్డ్ కాపీలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.ఈ పరీక్షలకు 2,67,921 హాజరుకాగా, వీరిలో ఏకంగా 18,364 మంది అనర్హతకు గురయ్యారు. దీంతో జీఆర్ఎల్లో 2,49,557 మంది అభ్యర్థుల వివరాలు మాత్రమే ఉన్నాయి. అభ్యర్థులు వారి టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కమిషన్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని కమిషన్ స్పష్టం చేసింది. జీఆర్ఎల్ ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం ప్రాథమిక ఎంపిక జాబితా రూపొందిస్తామని తెలిపింది. నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా అభ్యర్థులు వారి ఒరిజినల్ ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.సాంకేతిక సమస్యలకు సంబంధించిన సమాచారం కోసం టీజీపీఎస్సీ హెల్ప్డెస్క్ ఫోన్ నంబర్లు 040–23542185, 040–23542187లలో సంప్రదించాలని, లేదా ‘హెల్ప్డెస్్క(ఎట్)టీఎస్పీఎస్సీ.జీఓవీ.ఇన్’లో ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నెల 10వ తేదీన గ్రూప్–1 మార్కులు విడుదల చేసిన టీజీపీఎస్సీ... 11న గ్రూప్–2 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్–3 జీఆర్ఎల్ విడుదల చేసిన కమిషన్.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల తుది ఫలితాలను 17న, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షల తుది ఫలితాలను 19న ప్రకటించనుంది. కాగా, గ్రూప్–3 జీఆర్ఎల్లో అభ్యర్థి ర్యాంకు, హాల్ టికెట్ నంబర్, సాధించిన మార్కులు మాత్రమే ఉన్నాయి. పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 కొలువులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ వరుసగా విడుదల చేసింది. అయితే, ఈ మూడు కేటగిరీల్లోనూ టాపర్లుగా నిలిచినవారు ఎక్కువ మందే ఉన్నారని సమాచారం. అదేవిధంగా ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాల్లో చేరిన కొందరు గ్రూప్–3లోనూ అర్హత సాధించారు. వీరిలో చాలామంది గ్రూప్–1 ఉద్యోగాల్లో లేదంటే గ్రూప్–2 ఉద్యోగాల్లో చేరుతారు. దీంతో గ్రూప్–3లో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో గ్రూప్–4 ఉద్యోగం చేస్తూ గ్రూప్–3 పోస్టు సాధించినవారు.. ప్రస్తుతం చేస్తున్న గ్రూప్–4 ఉద్యోగాలను వదిలేసే అవకాశమే ఎక్కువ. దీంతో పలు కేటగిరీల్లో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని సమాచారం.గ్రూప్–3 స్టేట్ టాపర్ అర్జున్రెడ్డి గ్రూప్–2లోనూ 18వ ర్యాంకు పాపన్నపేట (మెదక్): గ్రూప్– 3 పరీక్షల్లో స్టేట్ టాపర్గా మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్రెడ్డి నిలిచారు. శుక్రవారం టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు గాను ఆయన 339.239 మార్కులు సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్– 2 ఫలితాల్లో కూడా అర్జున్రెడ్డికి స్టేట్ 18వ ర్యాంకు రావటం విశేషం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అర్జున్రెడ్డి.. ప్రస్తుతం హవేలిఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ, మెదక్ కలెక్టరేట్లో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–2 పోస్టుకు ప్రాధాన్యం ఇస్తానని అర్జున్రెడ్డి తెలిపారు.గ్రూప్–3, గ్రూప్–2లో మహిళా టాపర్ ఒక్కరే సాక్షి, హైదరాబాద్: గ్రూప్–3 పరీక్ష ఫలితాల్లో మహిళా విభాగంలో డాక్టర్ వినీషారెడ్డి మహిళా విభాగంలో టాపర్గా నిలిచారు. మొత్తం 450 మార్కులకు గాను ఆమె 325.157 మార్కులు సాధించి 8వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. గ్రూప్–2 ఫలితాల్లోనూ మహిళల విభాగంలో ఆమే టాపర్ కావటం విశేషం. సీడీపీఓ పరీక్షల్లో సైతం వినీషారెడ్డి స్టేట్ టాపర్గా నిలిచారు. గ్రూప్–1 పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా పరీక్షలకు సిద్ధమైనట్లు ఆమె తెలిపారు. తన లక్ష్యం ఐఏఎస్ ఉద్యోగం సాధించటమేనని చెప్పారు.3–7–27–27 పోటీ పరీక్షల్లో చంద్రకాంత్ ర్యాంకులివి శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు చంద్రకాంత్ పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, జూనియర్ లెక్చరర్పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్ సాధించిన చంద్రకాంత్, ఈ నెల 11 వెల్లడైన గ్రూప్–2 ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంకు సాధించాడు. కొన్నాళ్ల క్రితం ప్రకటించిన గ్రూప్–4 పరీక్షల్లోనూ ఇతడు 27 ర్యాంకు సాధించటం విశేషం. అంతేకాదు, జూనియర్ లెక్చరర్ పరీక్షల్లో కూడా స్టేట్ 3వ ర్యాంకు సొంతం చేసుకొని ప్రశంసలు పొందాడు. ఈ నెల 12న రవీంద్రభారతిలో సీఎం చేతుల మీదుగా జేఎల్ ఉద్యోగ నియామక పత్రం అందుకున్నాడు.గ్రూప్స్ పరీక్షలన్నింట్లోనూ ర్యాంకులు పెంట్లవెల్లి: టీజీపీఎస్సీ గ్రూప్స్–1, 2, 3, 4 పరీక్షలన్నింట్లోనూ మంచి ర్యాంకులు సాధించి ఔరా అనిపించాడు నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన హవల్దారి శ్రీనాథ్. ఇతడు గ్రూప్–1లో 454.5 మార్కులు సాధించాడు. గ్రూప్–2లో స్టేట్ 68వ ర్యాంకు పొందిన శ్రీనాథ్.. శుక్రవారం ప్రకటించిన గ్రూప్–3లో స్టేట్ 88వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. గ్రూప్–4లో స్టేట్ 136వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడిన శ్రీనాథ్.. తన తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహం వల్లే తాను పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించినట్లు చెప్పాడు. -
అమృత కవచం!
(సాక్షి స్పెషల్ డెస్క్): రక్షణశాఖలో ఆహార శాస్త్రవేత్తగా 34 ఏళ్లు పనిచేసి రిటైరైన డాక్టర్ ఎ.రామకృష్ణ ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు, వ్యాపారులతోపాటు వినియోగదారులకు మేలు కలిగించే అద్భుత ఆవిష్కరణను వెలువరించారు. భారతీయ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు అనుబంధంగా కర్ణాటకలోని మైసూర్లో ఉన్న రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల (డీఎఫ్ఆర్ఎల్)లోని ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ప్యాకేజింగ్ విభాగంలో ఆయన సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యారు. మూడేళ్లుగా సొంతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలు, పూలు ఎక్కువకాలం దెబ్బతినకుండా ఉండేలా, పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేందుకు దోహదపడేలా వినూత్న ప్యాకేజింగ్తో ‘కృషి కవచ్’కవర్లను అభివృద్ధి చేశారు.పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో..పోలియాక్టిక్ యాసిడ్, చెరుకు పిప్పి వంటి స్థానికంగా చవకగా లభించే సేంద్రియ పదార్థాలను ఉపయోగించి కృషి కవచ్ కవర్లను రూపొందించినట్టు రామకృష్ణ వెల్లడించారు. ‘‘కూరగాయలు, పండ్లు, పూలను కృషి కవచ్ కవర్లలో ఉంచితే చాలు. రిఫ్రిజిరేషన్ అవసరం లేదు. సాధారణ గది వాతావరణంలో ఉంచినా.. నెల రోజుల వరకు బాగుంటాయి.వడలిపోవు. కుళ్లిపోవు. అర కిలో నుంచి వంద కిలోల వరకు అవసరం మేరకు కృషి కవర్లను తయారు చేసుకోవచ్చు. రైతులు తమ ఉత్పత్తులను కోసిన రోజే ఏదో ఒక ధరకు అమ్ముకోకుండా నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. రైతుల ఆదాయం పెరుగుతుంది. టోకు, చిల్లర వ్యాపారులతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు కూడా కృషి కవచ్ కవర్లు ఉపయోగపడతాయి’’అని తెలిపారు. దీనిపై త్వరలో పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు.ఐఐహెచ్ఆర్తో త్వరలో ఒప్పందం.. ఐఐహెచ్ఆర్, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్లోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో ‘కృషి కవచ్’టెక్నాలజీని పరీక్షించి చూశారని రామకృష్ణ తెలిపారు. ఈ టెక్నాలజీని ప్రజలకు అందించే క్రమంలో ఐఐహెచ్ఆర్తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ అందిస్తుందని వెల్లడించారు.ఇది అనవసరపు నష్టం.. రైతులు ఆరుగాలం కష్టించి పండిస్తున్న పండ్లు, కూరగాయలను తోటలో కోసినప్పటి నుంచి మన నోటికి చేరేసరికే సగటున 25–30% వరకు పాడైపోతున్నాయి. సరైన రవాణా, నిల్వ సదుపాయాలు లేకపోవడమే దీనికి కారణం. దీనివల్ల అనవసరంగా జరుగుతున్న నష్టం ఏటా రూ.1,52,790 కోట్లు అని అంచనా.ఇది అమృతం లాంటి పరిష్కారం.. కూరగాయలు, పండ్లు, పూలను సాధారణ వాతావరణంలోనే 30 రోజులపాటు చెక్కు చెదరకుండా నిల్వ ఉంచే అద్భుత ఆవిష్కరణ అందుబాటులోకి వచ్చింది. మైసూరుకు చెందిన ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఈమేరకు ప్రత్యేకమైన కవర్లను రూపొందించారు. పర్యావరణహిత పదార్థాలతో ఈ ‘మోడిఫైడ్ ఎటా్మస్ఫియర్ ప్యాకేజింగ్ (మాప్)’ కవర్ల తయారీ సాంకేతికతను ఆవిష్కరించటం విశేషం. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ (ఐఐహెచ్ఆర్) ద్వారా ఈ సాంకేతికత త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.వృథా అవుతున్న పండ్లు, కూరగాయలు: 25 30%ఈ నష్టం విలువ సుమారు: రూ.1,52,790 కోట్లు⇒ మన దేశంలో ఏటా 1,132 లక్షల టన్నుల పండ్లు, 2,146 లక్షల టన్నుల కూరగాయలు, 36 లక్షల టన్నుల పూలు ఉత్పత్తి అవుతున్నాయి. ⇒ కూరగాయల్లో.. బంగాళదుంపలు 30–40%, టమాటాలు 5–47%, ఉల్లిపాయలు 25–40%, వెల్లుల్లి 8–22%, క్యాబేజీ, కాలీఫ్లవర్ 7–25%, మిరపకాయలు 4–35%, క్యారట్ 5–9% శీతల సదుపాయాల్లేక పాడైపోతున్నాయి. ⇒ పండ్లలో.. ద్రాక్ష 27%, అరటి 20–28%, బత్తాయి, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు 20–95%, యాపిల్స్ 14%, అవకాడోలు 43% దెబ్బతింటున్నాయి.‘కృషి కవచ్’ పనిచేసేదిలా.. ‘‘సాధారణంగా పండ్లు, కూరగాయలను చెట్ల నుంచి కోసిన తర్వాత ఆక్సిడేటివ్ మెటబాలిజం ద్వారా వాటిలో మార్పులు జరుగుతాయి. సేంద్రియ పదార్థాలు విచ్చిన్నమవుతూ ఉంటాయి. శీతల ప్రదేశంలో ఉంచకపోతే ఈ ప్రక్రియ వేగంగా సాగి.. అవి వడలి, కుళ్లి పాడైపోతాయి. ‘కృషి కవచ్’కవర్లలోకి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఇౖథెలిన్ వంటి వాయువులు కొంతమేర ఇటూ ఇటూ పారాడేందుకు వీలుంటుంది. ఇందులో నీటి ఆవిరి ఏర్పడదు.దీనితో ఆహార ఉత్పత్తులు సెకండరీ ప్యాకేజింగ్ అవసరం లేకుండానే 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి. సూక్ష్మజీవులు, ఫంగస్లు కూడా ఆశించవు. ఈ కవర్లను తిరిగి వాడొచ్చు, కంపోస్టు చేయవచ్చు. 25–30శాతంగా ఉన్న ఉద్యాన ఉత్పత్తుల వృథాను అరికట్టడం ద్వారా గణనీయమైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు చేకూరుతాయి.కృషి కవచ్ కవర్ల ద్వారా ఆహార వృథాను అరికట్టడంతోపాటు వ్యాల్యూ యాడెడ్ చర్యల ద్వారా దేశ జీడీపీని 3శాతం మేరకు పెంచుకోవచ్చు. – డాక్టర్ ఎ.రామకృష్ణ, విశ్రాంత శాస్త్రవేత్త, ‘కృషి కవచ్’ ఆవిష్కర్త, మైసూరు -
ఫోన్ కాల్తో రూ.1.95 కోట్లు కొట్టేశారు.. డబ్బుల్ని డ్రా చేయడం మరిచిపోయారు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ఓ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, ఆ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్గా పని చేస్తున్న రమేష్ (పేరు మార్చాం) ఫోన్కు సంస్థ ఛైర్మన్, ఎండీ సురేష్ ఓ ప్రాజెక్ట్ నిమిత్తం ముందస్తు చెల్లింపులు చేయాలి. అర్జంట్గా నా అకౌంట్కు రూ.1.95కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని కోరడమే ఆ మెసేజ్ సారాశం. మెసేజ్తో పాటు వాట్సప్ డిస్ప్లేలో ఉన్న ఫొటో తన ఎండీ సురేష్దేనని నిర్ధారించుకున్నాక ఆయన అకౌంట్కు అడిగిన మొత్తం పంపాడు.పంపిన కొద్ది సేపటికి అసలు మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. మేనేజింగ్ డైరెక్టర్ తన బ్యాంక్ అకౌంట్స్ నుంచి రూ.1.95కోట్లు ట్రాన్స్ఫరయినట్లు వచ్చింది. కంగుతిన్న ఎండీ సురేష్ అకౌంట్స్ ఆఫీసర్ సురేష్ను సంప్రదించాడు. సురేష్ తన వాట్సప్కు మీరు పంపిస్తే నేను డబ్బులు పంపారని చెప్పడంతో పాటు ఆధారాల్నిచూపించాడు. దీంతో మోసపోయామని గుర్తించారు. సదరు సంస్థ ప్రతినిధులు వెంటనే తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేసింది.సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్సీఆర్పీ డబ్బులు ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయో ట్రాక్ చేసింది. ప్రారంభంలో వివరాలు లేకపోవడంతో డబ్బులు ఎవరికి? ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయో నిర్ధారించడం కష్టంగా మారింది.ఎన్సీఆర్పీ సంస్థ ఎండీతో కలిసి బ్యాంక్ నోడల్ అధికారుల్ని సంప్రదించారు. డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారో గుర్తించారు. అదృష్టం కొద్దీ సైబర్ నేరస్తులు డబ్బుల్ని దొంగిలించారు. కానీ వాటిని బ్యాంక్ అకౌంట్ను డబ్బుల్ని డ్రా చేసుకోలేకపోయారు. దీంతో సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్ నుంచి తిరిగి బాధిత సంస్థ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడంతో కథ సుఖాంతమైంది. -
వికారాబాద్: ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగిలో ఘోర ప్రమాదం తప్పింది. పల్లవి కాలేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సును సైడ్కు ఆపే క్రమంలో మట్టి కూరుకుపోయిన బస్సు.. బోల్తా కొట్టింది. బస్సులో ఉన్న మహిళల తలలకు గాయాలు కాగా.. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరు క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.బస్సులో మొత్తం 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 30 మందికి స్వల్ప గాయాలు కాగా, నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిగి నుంచి షాద్ నగర్ వెళ్తుండగా ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. -
కిలాడీ లేడీ బాగోతం బట్టబయలు
సాక్షి, వరంగల్: వరంగల్లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయపడుతున్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. వరంగల్లోని మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి.. పాఠశాల బాలికలే లక్ష్యంగా దందా సాగిస్తోంది.వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించి.. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకుని బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతోంది. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే, వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలినట్లు సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు బట్టబయలయ్యాయి. సదరు కిలాడీ లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం రెండు రోజుల్లో ఆ కిలాడీ లీలలు పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది. -
బీజేపీ నేతలతో రేవంత్ రహస్య భేటీల మర్మమేమి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు’’ అంటూ సీఎం రేవంత్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు గడప దాటదు కానీ.. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే.. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు.‘‘39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుంచి సాధించిన పని.. తెచ్చిన రూపాయి లేదు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి.. తెలంగాణకు ఒరిగేది ఏంటి?. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు.. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు. హామీల అమలు చేతగాక గాలి మాటలు.. గబ్బు కూతలు.’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.గల్లీలో హోదాను మరిచి తిట్లు - ఢిల్లీలో చిట్ చాట్లు.కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…— KTR (@KTRBRS) March 14, 2025మరో ట్వీట్లో ‘‘బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓ వైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం. ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలి’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.‘‘పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా?. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు ఢిల్లీ పార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తది’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
పూజారి ఇంట ఇఫ్తార్ విందు
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్టేషన్ బస్తీలోని గణేశ్ ఆలయ పూజారి హరగోపాల్ శర్మ గురువారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతుండగా.. రోజా పాటించే వారిని సాయంత్రం ఆహ్వానించిన శర్మ.. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పలు రకాల వంటకాలను వడ్డించారు. ఈ సందర్భంగా అక్కడి ముస్లింలు శర్మను అభినందించారు.కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని..లింగాలఘణపురం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని, ఆయన తండ్రి అంత్యక్రియలకు కులస్తులు దూరంగా ఉన్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురంలో గురువారం జరిగింది. విష యం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దయ్యాల భిక్షపతి (60) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి కొడుకు అనిల్ ఆరు నెలలక్రితం నెల్లుట్లకు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకొని జన గామలో ఉంటున్నాడు. కొంతమంది పాలి వారు, కుల పెద్దలు కొడుకు తలకొరివి పెట్టవద్దని, మృతుడి భార్య పెడితేనే వస్తామని చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించలేదు. విషయం తెలుసు కున్న ఎస్సై వారి వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వగా కొంతమంది మాత్రం అంత్యక్రియలకు హాజరయ్యారు. -
సీఎం రేవంత్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలుచేసిన రేవంత్పై చర్యలు తీసుకోవాలని శంభీపూర్రాజు, వివేకానంద, మర్రి రాజశేఖర్రెడ్డి ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదు’
హైదరాబాద్: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయంతం చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర పై విషయ ప్రచారం మొదలెట్టింది. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్ పార్టీ, బీ అర్ ఎస్ పార్టీ లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ, పుదుచ్చేరి లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో గాల్లో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది.డీఎంకే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్షం మీటింగ్ కి రేవంత్, కేటీఆర్ పోటీ పడి హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ ఇచ్చిన 420 హామీల పై అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి.హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాల్సిన బీ అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిల పక్షం మీటింగ్ కి హాజరు అవ్వడం ఏంటీ?, డిలిమిటేషన్ రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ. దీనికి రాజకీయాలు అంటగడతార?, బ్రిటిష్ నినాదం విభజించు - పాలించు ను కాంగ్రెస్ అనుసరిస్తుంది. గతంలో అధికార దుర్వినియోగం తో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది. జనాభా తగ్గుదల పై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు ? , డిలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33శాతం సీట్లు దక్కనున్నాయి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని రేవంత్ అనుకుంటున్నారా? , కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ.....జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది. దేశాన్ని ఇండియా - పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్, నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్.. రేవంత్ 20 - 20 రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. 20 - 20 మ్యాచ్ లో ఎన్నైనా అబద్ధాలు అడొచ్చా?, మొన్న జరిగిన ఢిల్లీ t20 లో మిమ్మల్ని డకౌట్ చేశారు. Mlc ఎన్నికల్లో రేవంత్ డాకౌట్ అయ్యారు. ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోత మోగిస్తున్నారు’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్: హోలీ వేడుకల ముసుగులో గంజాయి
సాక్షి, హైదరాబాద్: నగరంలో హోలీ ముసుగులో గంజాయి వినియోగం కలకలం సృష్టించింది. ఎస్టీఎఫ్ దాడులతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్లతో పాటు గంజాయి బాల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోలీ అంటేనే రంగుల పండుగ. తెలంగాణ మహా రాజధాని హైదరాబాద్లో విభిన్న రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు జరుపుకుంటారు.కానీ.. నగరంలో కొందరు హోలీకి భిన్నంగా లోయర్ ధూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్లో గంజాయి, బర్ఫీ స్వీట్లో గంజాయి, సిల్వర్ కోటెడ్ బాల్స్లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారనే సమాచారం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ పోలీసులకు అందింది.ఎస్టీఎఫ్ టీం అంజిరెడ్డి గ్రూపులోని ఎక్సైజ్ పోలీసులు గంజాయి ముసుగులో జరుగుతున్న హోలీ వేడుకల్లో దాడులు నిర్వహించి గంజాయితో తయారైన 100 కుల్ఫీ ఐస్ క్రీమ్ను, 72 బర్ఫీ స్వీట్లను, సిల్వర్ కోటెడ్ బాల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అమ్మకాలు నిర్వహించే సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. -
SLBC టన్నెల్లోకి అటామనస్ హైడ్రాలిక్ పవర్ రోబో
సాక్షి, మహబూబ్నగర్/నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్ను వినియోగిస్తున్నారు.దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు.టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, నిన్న (శుక్రవారం) మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. -
నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు అనుమానాస్పద మృతి
సాక్షి, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఒకటవ టౌన్లో సైబర్ క్రైమ్ కేసులో విచారణ జరుపుతున్న ఆలకుంట సంపత్(31) గురువారం రాత్రి పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్న సమయంలో ఎడమ చేతి నొప్పి రావడంతో జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్కు వెళ్లిన తర్వాత చికిత్స పొందుతూ సంపత్ మృతి చెందాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.పెద్దపల్లి జిల్లాలోని అంతర్గామ్లోని ఒడ్డెర కాలనీకి చెందిన సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ మేనేజర్గా పని చేస్తున్నారు. డేటా ఏంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూళ్లు చేశారు. లావోస్ దేశం పంపించి అక్కడ సైబర్ నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంకు వెళ్లి వారి సహాకారంతో భారతదేశంకు తిరిగివచ్చారు. భారతదేశంలోని రాయబార కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆలకుంట సంపత్, దండగుల చిరంజీవి, రాజారెడ్డిని నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 4న రిమాండ్కు తరలించారు. సంపత్తో పాటు చిరంజీవిని ఈనెల 12న కోర్టు అనుమతితో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లి విచారించినట్లు తెలుస్తోంది. అనంతరం నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్స్టేషన్లో విచారణ జరుపుతున్న సమయంలో సంపత్కు ఎడమ చేతి నొప్పి రావడంతో సైబర్ క్రైమ్ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది జీజీహెచ్కు తరలించారు.చికిత్స పొందుతున్న సమయంలో ఫిట్స్ రావడంతో సంపత్ చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. గురువారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో సైబర్ క్రైమ్ పోలీస్ నెంబర్ నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సంపత్ గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పడంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు సంపత్ తీవ్రంగా గాయపడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబంసభ్యుల న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా చేశారు. వీడియో ద్వారా పోస్టుమార్టరం నిర్వహిస్తామని డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజావెంకట్రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. పోలీసుల విచారణలో సంపత్ మృతి చెందాడా లేక ఆసుపత్రిలో మృతి చెందాడా.. అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు.సంపత్ పోలీసు కస్టడీలో చనిపోలేదు: సీపీఈ ఘటనపై నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు. సంపత్ పోలీసు కస్టడీలో చనిపోలేదని స్పష్టం చేశారు. అతనికి ఎడమ చేయి నొప్పి వస్తే పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. ‘‘ఆసుపత్రికి సంపత్ నడుచుకుంటూ వెళ్లాడు.. ఆ సీసీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయి. ఆసుపత్రి లోపల అతనికి సడన్ హార్ట్ ఎటాక్ వచ్చింది.. వైద్యులు సీపీఆర్ చేశారు.. ఎమర్జెన్సీ చికిత్స అందించారు.. అయినా ఫలితం లేకుండాపోయింది. మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై డీఎస్పీ ర్యాంక్ అధికారితో విచారణ కూడా ప్రారంభించాం’’ అని సీపీ వెల్లడించారు. -
TSPSC Group 3 Result : గ్రూప్-3 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1, గ్రూప్-2 మార్కుల జాబితాను విడుదల చేసింది. ఇవాళ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేయనుంది.ఇక 1365 ఈ గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్ఈ గతేడాది నవంబర్లో పరీక్షలను నిర్వహించింది.నవంబర్ 17,18వ తేదీల్లో ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ (మార్చి14)న విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్ఈ తెలిపింది. -
మొయినాబాద్ పీఎస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..
సాక్షి, రంగారెడ్డి: ఫామ్హౌస్లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోచంపల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఫామ్ హౌస్ లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు చెందిన ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్హౌస్కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
అడ్వాన్స్గా రూ.30వేలు.. నా భర్త చంపేయండి గోపి..!
హన్మకొండ: భర్తను కడతేర్చడానికి భార్య సుపారీ(Supari) అందజేసింది. ఎలాగైనా, ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో గురువారం భార్యతోపాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నర్సంపేట రూరల్ ఎస్సై అరుణ్ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధారావత్ సుమన్కు, మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది.ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతుండడంతో హైదరాబాద్లో వేర్వేరుగా ఉంటున్నారు. సుమన్ హైదరాబాద్లోనే(Hyderabad) ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం నరేశ్ అనే యువకుడు సుమన్కు వాట్సాప్ కాల్(WhatsApp call) చేసి నిన్ను చంపేందుకు ప్రయత్నం జరుగుతుందని, తనకు డబ్బులు ఇస్తే ఆ ప్రయత్నాన్ని ఆపుతానంటూ చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన సుమన్.. ఈనెల 9వ తేదీన నరేశ్పై నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.నరేశ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో సుమన్ భార్య మంజుల..(Manjula) మరికొందరితో కలిసి భర్తను చంపించేందుకు నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపికి రూ.30వేల సుపారీ ఇచ్చినట్లు నరేశ్ తెలిపాడు. దీంతో మంజుల, ఆమెకు సహకరించిన ఆమె బావ ములుగుకు చెందిన మోతీలాల్, వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన నరేశ్, నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మల్లేశ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రియురాలితో పెళ్లి కోసం.. -
సీనియర్-జూనియర్.. ఇంతకీ నష్టం ఎవరికో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది. 👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు. రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు. 👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్కే నష్టం. 👉బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు. కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఓడించాయని, హరీష్రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి. 👉బీఆర్ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్ఎస్కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్ఎస్కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు. ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హోలీ వేళ పిడిగుద్దుల ఆటపై పోలీసుల ఆంక్షలు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 124 ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల(Pidiguddulata) ఆటపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పిడిగుద్దుల ఆటకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆటను అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఈ ఆటపై ఉత్కంఠ నెలకొంది.నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. ఈ ఆటలో భాగంగా ముందుగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామం మధ్యలో ఉన్న చావిడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో రెండు వైపులా రెండు కర్రలు (గుంజలు) భూమిలో పాతుతారు. ఆ రెండు కర్రలకు మధ్యన ఓ బలమైన తాడును కడుతారు.అంతకుముందు గ్రామదేవతలకు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు, పటేల్, పట్వారీలను డప్పులు, బాజాలతో పిడిగుద్దుల ఆట నిర్వహించే స్థలం వద్దకు వస్తారు. తర్వాత ఆట మొదలు కాగానే ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులతో విరుచుకుపడతారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగుతుంది. ఈ క్రమంలో దెబ్బలు తాకినా లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆట ముగిసిన ఒకరినొకరు కౌగిలించుకుంటారు.ఈ ఆటలో దెబ్బలు తగిలి రక్తాలు కారినా పట్టించుకోకుండా, కామదహనంలోని బూడిదను చేతులతో తీసుకుని దెబ్బలు, గాయాలపై రాసుకుంటే గాయాలు మానిపోతాయని, నొప్పులు కూడా తెలియవని గ్రామస్థులంటారు. కొత్తగా చూసేవారికి విచిత్రంగా అనిపించే ఈ ఆట హున్సా గ్రామానికే ప్రత్యేకతను సంతరించి పెట్టింది. అనంతరం, ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కేకలు వేస్తూ గ్రామంలో తిరుగుతారు. ఈ ఆటను తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తారు. అందుకే ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఏకంగా నిలబడి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల నుంచి గ్రామస్థులు పిడిగుద్దులాట కోసం రిహార్సల్స్ చేస్తూ ఆటకు సిద్ధమవుతున్నారు. -
పిల్లలను వదిలి.. ప్రియుడితో వెళ్లి..
జగిత్యాలక్రైం: నవమాసాలు మోసి.. ఇద్దరు పిల్లలను కనిపెంచిన తల్లి ఆ పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన యువతిని మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి గతంలో వివాహం చేశారు. వీరికిద్దరు పిల్లలు జన్మించారు. యువతి భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పిల్లలను పోషించాల్సిన సదరు మహిళ.. మరో వ్యక్తి మోజులో పడింది. ఈ క్రమంలో యువతి తండ్రి అనారోగ్యంతో జగిత్యాల ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు కుమారులను తీసుకుని ఆస్పత్రికి వచ్చిన ఆ యువతి కుమారులను అక్కడే వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. తండ్రి ఎందుకు రావడం లేదో.. తల్లి ఎప్పుడొస్తుందో తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనాథలుగా మారి న ఆ పిల్లలను అమ్మమ్మ, తాతయ్య చేరదీశారు. -
వింత ఆచారం: కీడు సోకిందని ఊరు ఖాళీ
జమ్మికుంట (హుజూరాబాద్): ఊరుకు కీడు సోకిందని, అందుకే తరచూ గ్రామంలో ఎవరో ఒకరు చనిపోతున్నారని గ్రామస్తులంతా ఊరు విడిచి బయటకు వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్లో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. విలాసాగర్లో కొన్ని నెలలుగా ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతున్నారు. ఇలా గ్రామంలో వరుసగా 11 మంది మృతిచెందడంతో ఆయా కులాల పెద్దలందరూ వేదపండితులను ఆశ్రయించారు. గ్రామానికి కీడు సోకిందని తెలుసుకొని ఊరంతా గురువారం వేకువజామున 5 గంటలకు ముందే ఇళ్లకు తాళాలు వేసి సమీపంలోని మానేరు పరీవాహక ప్రాంతం బ్రిడ్జి వద్దకు తరలివెళ్లారు. అక్కడే వంటలు చేసుకొని సాయంత్రం వరకు గడిపి చీకటిపడ్డాక ఇంటిబాట పట్టారు. దీంతో గ్రామంలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. గతంలో కూడా ఇలాగే బయటకు వెళ్లామని, ఫలితం కనబడిందని గ్రామస్తులు తెలిపారు. -
HYD: బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నటుడు బాలకృష్ణ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ను ఢీకొట్టింది.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్లోని రోడ్డు నంబర్-1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్పాత్పైకి శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో ఉన్న కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక, సదరు కారు.. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
బండి సంజయ్ వ్యక్తిగత కార్యదర్శిగా పూజిత
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా 2017 బ్యాచ్కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిణి డాక్టర్ పూజిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కేబీఆర్ పురం. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన పూజిత.. ఏడాది పాటు రుయా ఆస్పత్రిలో హౌస్ సర్జన్గా సేవలు అందించారు. సివిల్స్లో 282 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. పూజిత భర్త మోహన్కృష్ణ భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్గా పని చేస్తున్నారు. పూజిత ప్రతిభా పాటవాలు తెలుసుకున్న బండి సంజయ్ మహిళా అభ్యున్నతి, మహిళల భద్రతా అంశాల్లో సేవలు వినియోగించుకోవడానికి ఎంపిక చేసుకున్నారు. -
Hyderabad: పోలీసు అధికారుల బూట్లు, చెప్పులు చోరీ
మలక్పేట: బంగారం, డబ్బులు, బైక్లు, ఇతర విలువైవ వస్తువుల కోసం దొంగతనాలు, దోపిడీ జరగడం సాధారణంగా చూస్తుంటాం. కానీ.. అందుకు భిన్నంగా కొందరు ఆగంతకులు అపార్ట్మెంట్లలో చొరబడి దొరికిన కాడికి చెప్పులు దొంగతనం చేస్తున్నారు. చెప్పులే కదా ఎవరూ పట్టించుకోరు.. లేదా చెప్పులు అమ్ముకుంటే లాభం అనుకున్నారో ఏమో. ముగ్గురు, నలుగురు యువకులు కలిసి ముఠాగా ఏర్పడి చెప్పుల దొంగతనానికి పాల్పడుతున్నారు. వారు చెప్పులు, షూస్ తప్ప ఇతర వస్తువులు ముట్టుకోకపోవడం గమనార్హం.వివరాలు ఇలా ఉన్నాయి.. మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని మూసారంబాగ్ డివిజన్ ఈస్ట్ ప్రశాంత్నగర్లోని మైక్రో హెల్త్కేర్ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చెప్పులు చోరీకి గురయ్యాయి. అపార్ట్మెంట్లోని ఆరు పోర్షన్లలో చెప్పులు, బూట్లు పొద్దున వరకే మాయమయ్యాయి. దీంతో అపార్ట్మెంట్వాసులు విస్మయానికి గురయ్యారు. సీసీ ఫుటేజ్లు పరిశీలించగా.. ముగ్గురు యువకులు ఆటోలో వచ్చి చెప్పులను మూట కట్టుకుని ఆటోలో వేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు రికార్డు అయింది. పోలీసు అధికారి షూ.. చెప్పులు కూడా.. మెక్రో హెల్త్కేర్ లైన్ అపార్ట్మెంట్ వెనుక భాగంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ పోలీసు అధికారి షూస్, చెప్పులు కూడా దొంగతనం చేశారు. నాలుగు అపార్ట్మెంట్లలోని చెప్పులు మూట కట్టి ఖాళీగా ఉన్న స్థలంలో పడేశారు. అనంతరం వాటిని తీసుకొచ్చి ఆటోలో వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. చెప్పులు, షూస్ బ్రాండెండ్వే అని, చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అపార్ట్మెంట్ వాసి రవిప్రసాద్ చావ్లా చెప్పారు. నెల రోజుల క్రితం ఇదే తరహాలో.. మైక్రో హెల్త్ కేర్ సంస్థ పక్కనున్న అపార్ట్మెంట్లో కూడా నెల రోజుల క్రితం చెప్పుల దొంగతనం జరిగింది. చోరీపై అపార్ట్మెంట్ నివాసి సయ్యద్ మహబూబ్ బాషా మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లోని 6 ఫ్లాట్లలో మొత్తం 30 జతల బూట్లు, 25 జతల చెప్పులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ తెలిపారు. -
అందని దారం.. వ్రస్తోత్పత్తి ఆగం
సిరిసిల్ల: సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులు, చేనేత, జౌళిశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపం.. వ్రస్తోత్పత్తికి శాపంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే వ్రస్తోత్పత్తి ఆర్డర్లకు నూలు (దారం) సరఫరా చేస్తామని ముందుగా అధికారులు ప్రకటించి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశారు. కానీ, సిరిసిల్లలో వ్రస్తోత్పత్తికి అవసరమైన నూలును సకాలంలో అందించడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈనెల 15 నాటికి అందించాల్సిన ఆర్వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వ్రస్తాల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది. సిరిసిల్లలోని పాతికవేల మరమగ్గాల (పవర్లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వ్రస్తాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. దానికి అవసరమైన నూలు అందించలేదు. దీంతో గడువులోగా వ్రస్తాల తయారీ కష్టంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి గండి స్కూళ్లు తెరిచే నాటికి (జూన్ మొదటి వారంలో) అన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లోని పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు డిసెంబర్లో సిరిసిల్ల నేతన్నలకు కోటి ఐదు లక్షల మీటర్ల వ్రస్తాల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి అవసరమైన నూలును డిపో ద్వారా అందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయి.. సిరిసిల్లలోని నేతన్నలకు వేములవాడలోని నూలు డిపో ద్వారా నూలు సరఫరా అయ్యే సరికి ఫిబ్రవరి అయింది. వచ్చిన నూలుకు ఆసాములు పది శాతం మేరకు డీడీలు చెల్లించి, నూలు తీసుకుని వచ్చి భీములుగా పోసి సాంచాలపైకి ఎక్కించారు. ప్రస్తుతం పది లక్షల మీటర్ల వస్త్రాలు సిద్ధంగా ఉండగా.. భీములపై మరో పది లక్షల మీటర్ల వస్త్రం రెడీ అవుతోంది. మొత్తంగా 20 లక్షల మీటర్లు మరో వారంలోగా సిద్ధమైనా.. ఈ నెలాఖరులోగా 50 శాతం వ్రస్తోత్పత్తి లక్ష్యం అసాధ్యమే. ఈ లెక్కన వ్రస్తాల సేకరణ పూర్తయి, యూనిఫామ్స్ కుట్టి, బడి తెరిచే నాటికి రెండు జతల డ్రెస్సులు అందించాలనే లక్ష్యం సాధించడం కష్టంగానే ఉంది.సమస్య ఏంటంటే..!ప్రభుత్వం టెస్కో ద్వారా సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ (మ్యాక్స్)లకు వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం, ఇక్కడ మాస్టర్ వీవర్స్ (యజమానులు) నూలును కొనుగోలు చేసి ఆసాముల (పవర్లూమ్స్ యజమానులు)కు ఇవ్వడం, వారు సాంచాలు నడుపుతూ, కార్మికులతో పని చేయిస్తూ.. బట్ట నేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా నాణ్యమైన నూలు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు సకాలంలో అందించలేదు. ఇప్పుడు ప్రైవేటుగా కొనుగోలు చేసి స్కూల్ యూనిఫామ్స్ బట్టను నేయాలని యజమానులను జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఆలస్యంగా నూలు ఆర్డర్లు ఇవ్వడంతో వ్రస్తోత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇటీవల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సిరిసిల్ల కలెక్టరేట్లో వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఈనెల 15లోగా 50 శాతం బట్ట ఇవ్వాలని కోరారు. కానీ ఆ మేరకు సిరిసిల్లలో వ్రస్తాల నిల్వలు లేవు.మహిళాశక్తి చీరల ఊసేది?సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 8న ఇందిరా మహిళా శక్తి పేరిట స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75 కోట్లు ఉంటుంది. కానీ, దానికి సంబంధించిన నూలును ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. మొదటి విడతకే మోక్షం లేక వ్రస్తోత్పత్తిదారులు రెండో విడత ఆర్డర్లు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగుల), వెప్ట్ (అడ్డం కోముల పోగుల) నూలు అందుబాటులో ఉండటం లేదు. వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను మగ్గంపై నేసే అవకాశం ఉంది. ఒకటి ఉండి ఒకటి లేక వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతుండగా, ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి మరింత ఆలస్యం కానుంది.ఆలస్యమైనా లక్ష్యం సాధిస్తాంకొంత ఆలస్యమైనా వ్రస్తోత్పత్తిలో లక్ష్యం సాధిస్తాం. ఈ మేరకు సిరిసిల్లలోని వ్రస్తోత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా నూలు డిపో ఏర్పాటు చేసి నూలు సరఫరా చేస్తున్నాం. ప్రైవేటుగా కూడా నూలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పాం. డిపో ద్వారా అందరికీ నూలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటాం. – వులిశె అశోక్రావు, టెస్కో జీఎం, హైదరాబాద్ -
ఏపీఎల్కు గ్రీన్ రేషన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారితోపాటు దారిద్యరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్నవారికి కూడా రేషన్కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీఎల్ వారికి ఇచ్చే రేషన్కార్డులపై సబ్సిడీతో కూడిన ఎలాంటి సరుకుల సరఫరా ఉండదు. వారికి సన్నబియ్యాన్ని ఇవ్వాలని భావిస్తున్నా.. బియ్యం సేకరణ ధర, నిర్వహణ చార్జీలను కలిపి రేషన్ షాపుల్లో విక్రయించాలని యోచిస్తోంది. ఈ అంశాన్ని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డులను మూడు రంగుల్లో జారీచేయాలని, గులాబీ కార్డులను గ్రీన్కార్డులుగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీఎల్కు ఇచ్చే కార్డులు ప్రస్తుతానికి గుర్తింపుకార్డులుగా మాత్రమే ఉపయోగపడతా యని అన్నారు. ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే కార్డులపై ఎవరెవరి ఫొటోలు ఉండాలన్నది ప్రస్తుతానికి బయటపెట్టలేమని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు చిప్తో కూడిన స్మార్ట్ రేషన్కార్డుల కోసం టెండ ర్లు ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. కార్డుల డిజైన్ కూడా పూర్తయిందని తెలిపారు. వచ్చేనెలలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీకి ఇంకా పూర్తిస్థాయిలో సమాయత్తం కాలేదని.. మే నుంచి బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే.. రబీ సీజన్లో 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశవ్యాప్తంగా సన్నబియ్యం ధరలు పడిపోయాయని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో సన్నబియ్యం కిలో రూ.60 – 65 వరకు ఉంది కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అవి మరీ ఖరీదైన బియ్యం అయి ఉండవచ్చని పేర్కొన్నారు. నాణ్యత లేకుంటే నేషనల్ వేస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్న బియ్యం తినే స్థితిలో లేకపోతే.. అదంతా జాతీయ వ్యర్థంగా (నేషనల్ వేస్ట్) మారుతుందని సీఎం రేవంత్రెడ్డి, తాను ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషిని కలిసినప్పుడు చెప్పామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యానికి ఇస్తున్న సబ్సిడీతోపాటు సన్నబియ్యానికి అదనంగా అయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పంపాలని కోరినట్లు వెల్లడించారు. దొడ్డు బియ్యానికి కిలో దాదాపు రూ.33 పైగా వ్యయం అవుతుంటే, సన్నబియ్యానికి కిలో రూ.47 వరకు అవ్వొచ్చని పేర్కొన్నారు. -
అప్పుడే భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రెండో వారంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈసారి వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. వాస్తవానికి మార్చి మొదటి వారం నుంచి వేసవి సీజన్గా పరిగణిస్తారు. ఈ క్రమంలో మార్చిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కానీ గత రెండ్రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్లో సగటు ఉష్ణోగ్రతకన్నా 4.4 డిగ్రీలు అధికంగా, నిజామాబాద్లో 3.2, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డు అయింది. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరినట్లు ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజులు ఇదేతరహాలో వాతావరణం ఉంటుందని వివరించింది. వడదెబ్బతో కూలి మృతి రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజా పేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి బొల్లారం నర్సమ్మ (55) వడదెబ్బతో మృతిచెందింది. నర్సమ్మ గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిoది. దాహం వేయడంతో నీళ్లు తాగింది. ఆ వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. నర్సమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ నోటీసు!
చండ్రుగొండ: ఓ సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసుతో నిరక్షరాస్యుడైన ఆ కూలీ బిత్తరపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు (వెంకటేష్) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఈ నెల 4వ తేదీన జీఎస్టీ నోటీసు అందింది. తనకు చదువు రాకపోవటంతో తెలిసివారికి ఆ లేఖను చూపగా, విజయవాడ బెంజ్ సెంటర్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం నుంచి అందిన నోటీసుగా చెప్పారు.విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.కోటి విలువైన గ్రానైట్ వ్యాపారం చేశారని, 2022 ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలిపి జీఎస్టీ రూ.22,86,014 బకాయి పడ్డట్లు అందులో ఉంది. దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు.. విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎవరిదో కనుక్కునేందుకు ఈ నెల 12న విజయవాడ వెళ్లాడు. అయితే ఆ అడ్రస్లో కార్యాలయమే లేదని తేలడంతో వెనుదిరిగాడు. 2022 ఏడాదిలో ఆయనకు పాన్కార్డు కూడా లేదు.ఆరు నెలల క్రితమే చండ్రుగొండలోని మీ సేవ కేంద్రానికి పాన్కార్డు కోసం దరఖాస్తు చేయటానికి వెళ్తే.. ఆ పేరు, ఆధార్ నంబర్తో అప్పటికే పాన్కార్డు జారీ అయిందని చెప్పారు. అయితే, వెంకటేశ్వర్లు ఆధార్కార్డు అక్రమార్కుల చేతికి ఎలా వెళ్లింది? ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్ తీసుకున్నది ఎవరేది తేలాల్సి ఉంది. ఈ విషయమై బాధితుడు మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని, అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరాడు. -
సందేహాలున్నప్పుడు.. శిక్షలు విధించలేం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాక్షులు, మెడికల్ ఆధారాల్లో వ్యత్యాసం ఉండి.. ప్రత్యక్ష సాక్షి చెబుతున్నది సందేహాస్పదంగా ఉన్నప్పుడు శిక్షలు విధించడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదు చేసిన తర్వాత అది కోర్టుకు చేరడానికి పదహారున్నర గంటల సమయం పట్టిందని.. ఇంత సమయం ఎందుకు పట్టిందో దర్యాప్తు అధికారి వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. ఆలస్యం పరిస్థితులను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది. ప్రత్యక్ష సాక్షి (పీడబ్ల్యూ 6) వాంగ్మూలం ప్రకారం.. కార్తీక్ చేతిపై షంషీర్ ఖాన్ దాడి చేశాడని.. తలపై దాడి చేసినట్లు పేర్కొనలేదని చెప్పింది. కానీ, పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పుర్రెపై బలమైన గాయం కారణంగా కార్తీక్ మరణించినట్లు ఉందని చెప్పింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రధానంగా అతని వాంగ్మూలంపై ఆధారపడ్డారని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2018లో ఆదిలాబా ద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నామని తెలిపింది. నిందితుడు షంషీర్పై ఇతర కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 ప్రస్తావన లేదు..పోలీసుల కథనం మేరకు.. ‘ఓ అమ్మాయికి సంబంధించిన విషయంలో షంషీర్, కార్తీక్కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో కాగజ్నగర్లోని లారీ చౌరస్తాలో కార్తీక్ను షంషీర్ కత్తితో దాడి చేసి చంపాడు. 2014, ఫిబ్రవరి 20న కార్తీక్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత షంషీర్ను పోలీసులు అరెస్టు చేశారు.’ ఈ కేసు విచారణ చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు.. షంషీర్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ షంషీర్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో షంషీర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.దామోదర్రెడ్డి, పోలీసుల తరఫున ఏపీపీ అరుణ్కుమార్ వాదనలు వినిపించారు. ‘కోర్టుకు పంపిన ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 పేరు ప్రస్తావించలేదు. విచారణ సమయంలోనూ అతని పేరు లేదు. పీడబ్ల్యూ 6 చెప్పిన దానికి మెడికల్ ఆధారాలు విరుద్ధంగా ఉన్నాయి. మరణించిన వ్యక్తి తల, మెడపై దాడి జరిగిందని సాక్షి చెప్పలేదు. మెడికల్ ఆధారాల్లో తల, మెడ, ఎడమ చెవిపై గాయాలున్నాయి. ఎడమ మణికట్టు వద్ద కూడా గాయాలున్నాయి. పీడబ్ల్యూ 6 సాక్షాలు సందేహాస్పదంగా ఉన్నా యి. అందువల్ల 2018లో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.న్యాయం గెలిచిందిఎనిమిదేళ్లుగా జైలు జీవితం గడిపి ఈ రోజే విడుదలయ్యాను. శిక్షా కాలంలో సెంట్రల్ జైలు, వరంగల్లో ఓపెన్ జైలు పెట్రోల్ బంకులో పని చేశాను. ఇన్నేళ్లకు మళ్లీ న్యాయం గెలిచిందని నమ్ము తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. – షంషీర్ ఖాన్ -
టన్నెల్లో రోబో రెస్క్యూకు రూ. 4కోట్లు
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్ బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ దురదృష్టకర సంఘటన జరగని పక్షంలో రెండేళ్లలో సొరంగం పూర్తయ్యే దన్నారు. ప్రమాదం జరిగిన దగ్గరనున్న 40 మీటర్లు అత్యంత ప్రమాదకరమని, అందుకే రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. టీబీఎం లోపల తవ్వకాలు..టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, శుక్రవారం మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.మేడిగడ్డ బరాజ్పై ఎన్డీఎస్ఏ నివేదిక వారంలోగామేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లో పగుళ్లు రావడానికి సంబంధించి వారం పది రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక వస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బరాజ్లో నీరు నిల్వ చేసి వినియోగించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఓ విలేకరి మంత్రి దృష్టికి తీసుకుని రాగా..నీరు నిల్వ చేస్తే.. డ్యామ్ కొట్టుకొని పోయి దిగువన ఉన్న సీతారామ ప్రాజెక్టుతో సహా 44 వేల గ్రామాలు, భద్రాచలం కొట్టుకొనిపోవాలని వారు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. డ్యామ్ల రక్షణపై నివేదికలు ఇవ్వడంలో ఎన్డీఎస్ఏ సుప్రీం అని.. దాని సూచనలు పాటిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి చెప్పారు. -
ఒక్కో పేపర్ 2సార్లు మూల్యాంకనం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 జవాబుపత్రాల మూ ల్యాంకనం అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీ ఎస్సీ) స్పష్టం చేసింది. ప్రతి జవాబుపత్రాన్ని వేరువేరు ఎవాల్యుయేటర్లతో రెండుసార్లు మూల్యాంకనం చేయించినట్లు వెల్లడించింది. ఎంపిక చేసిన(ర్యాండమ్గా) కొన్ని జవాబు పత్రా లను మూడోసారి కూడా పరిశీలన జరిపినట్లు తెలిపింది. ఈ నెల 10వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్–1 అభ్యర్థుల మార్కులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేదని కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తు న్నారు. ఈ ప్రచారంపై స్పందించిన కమిషన్.. గురువారం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 20,161 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను 351 మంది నిపుణులైన ఎవాల్యు యేటర్లతో మూల్యాంకనం చేయించినట్లు తెలిపింది. మూల్యాంకనం తీరు, మాధ్యమాల వారీగా అభ్యర్థులు, పేపర్వారీగా వచ్చిన టాప్ మార్కు లు, టాప్ 100 ర్యాంకులు, 500 ర్యాంకుల్లో జెండర్, కమ్యూనిటీ వారీగా అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.యూపీఎస్సీ స్థాయి నిపుణులతో మూల్యాంకనంరాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ జవాబుపత్రాల మూల్యాంకనం వెంటనే ప్రారంభించిన కమిషన్.. గత నెల 15వ తేదీనాటికే పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న చీఫ్ ఎగ్జామినర్లు, ఎవాల్యుయేటర్లు యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్నవారేనని స్పష్టం చేసింది. వీరంతా శాశ్వత ప్రాతిపదికన వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు అని కమిషన్ తెలిపింది. తుది మార్కులను ఖరారు చేసే సమయంలో కూడా మరోమారు పరిశీలన జరిపిన తర్వాతే మార్చి 10వ తేదీన విడుదల చేసినట్లు వెల్లడించింది. అయితే గ్రూప్–1 మార్కులపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి నిరాధార ఆరోపణలను పట్టించుకోవద్దని అభ్యర్థులకు సూచించింది. ప్రతి కేటగిరీలోని పోస్టులను నిబంధనల ప్రకారం నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా భర్తీ చేస్తామని కమిషన్ వివరించింది. -
ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానిదే..
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని సర్వేనంబర్ 25లోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, దీంతో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు 2004లో జనవరి 13న 400 ఎకరాల భూమిని కేటాయించిందని వివరించింది. అయితే ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకుందని పేర్కొంది.దీన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపింది. ఆ తరువాత ఐఎంజీ భారత్ సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడా కొట్టేయడంతో ప్రభుత్వ అధీనంలోకి వచ్చిందని వివరించింది. ఆ తరువాత అక్కడ ఐటీ, ఐటీయేతర పరిశ్రమల కోసం కేటాయించాలని టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు.. ఆ సంస్థకు భూమి కేటాయించినట్లు తెలిపింది. ఈ 400 ఎకరాల పరిధిలోకి బఫెల్లో లేక్, పీకాక్ లేక్ రావని స్పష్టం చేశారు. -
డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్వహించబోయే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్వి భజన (డీ లిమిటేషన్) చేపడితే దక్షిణాది రాష్ట్రా లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని విమర్శించారు.ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదనను వినిపిస్తామని తెలిపారు. తమిళ నాడు పురపాలక శాఖ మంత్రి కె.ఎన్.నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్.ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్లో కేటీఆర్ గురువారం సాయంత్రం సమావేశమయ్యా రు. డీలిమిటేషన్కు వ్య తిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా డీఎంకే బృందం బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందజేసింది.ఈ సందర్భంగా ఇరుపక్షాలు మీడియాతో మాట్లాడాయి. ‘డీ లిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడితేనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. 1970–80 దశకంలో కుటుంబ నియంత్రణ సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాల సంఖ్యను కొత్తగా చేసే జనగణన ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్రం చెప్పడం అన్యాయం.ఇదే జరిగితే పార్లమెంట్లో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున హాజరుకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తోపాటు తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని డీఎంకే నేతలు ప్రకటించారు. అంతకుముందు డీఎంకే నేతలను కేటీఆర్ సత్కరించారు. -
జగదీశ్రెడ్డి కామెంట్స్.. కలకలం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి గురువారం శాసనసభలో స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఈ సభ నీ సొంతం కాదు..’ అని ఆయన అనడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, అరుపులతో సభ దద్దరిల్లింది. దళిత స్పీకర్ను అవమానించిన, ఏక వచనంతో సంబోధించిన జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. అందరికీ సమాన హక్కులు: జగదీశ్రెడ్డి ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి.. స్పీకర్ను ఉద్దేశించి ‘ఈ సభ మనందరిది. మనందరికీ సమాన హక్కులున్నాయి. మనందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నరు తప్ప ఈ సభ నీ సొంతం కాదు..’ అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్రెడ్డి మాట్లాడిన ప్రతిపదం వెనక్కి తీసుకోవాల్సిందేనని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. సభాపతిని దూషించినందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. దళిత స్పీకర్ను అవమానించిన జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని కాంగ్రెస్ దళిత సభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించారని తప్పుబట్టారు. మొత్తం దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్కి దళితుల పట్ల చిన్నచూపు అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్కుమార్ పేపర్లు పైకి విసిరేస్తే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సుదీర్ఘ విరామం తర్వాత సభ ప్రారంభం కాగా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులతో పాటు అధికార పక్ష సభ్యులు మాట్లాడారు. జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయాలని కొందరు, బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరినా స్పీకర్ వారికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ సెషన్ మగిసేవరకూ జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. ఆ తర్వాత కూడా అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సస్పెన్షన్పై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్ళారు. అయినా అవకాశం ఇవ్వకపోవడంతో మూకుమ్మడిగా సభ నుంచి నిష్క్రమించారు. అసలేమైంది..? ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగదీశ్రెడ్డి మాట్లాడుతుండగా (ఈ సమయంలో 4 బర్రెల కథ చెప్పారు)..అధికార పక్షం (మధ్యలో) మాట్లాడకుండా ఉండాలంటే చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ అన్నారు. దీంతో ‘నేను గవర్నర్ ప్రసంగంపై చర్చ నుంచి అక్షరం పక్కకు పోయినట్టు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా..పొమ్మంటే పోతా..’ అంటూ జగదీశ్రెడ్డి ఆవేశంతో తన చేతిలో ఉన్న నోట్స్ను కుర్చీకేసి విసిరికొట్టారు. దీంతో స్పీకర్ని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను జగదీశ్రెడ్డి వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. ‘అసహనానికి గురికాకుండా సహనంతో మాట్లాడండి. సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు. మంత్రిగా పదేళ్లు పని చేశారు. మీరీ విధంగా మాట్లాడడం, సభా సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు..’ అని జగదీశ్రెడ్డిని ఉద్దేశించి స్పీకర్ అన్నారు. ‘ఏ సభా సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో మీరు చెబితే ఆ తర్వాత నేను మాట్లాడుతా..’ జగదీశ్రెడ్డి అన్నారు. దీంతో ‘నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం’ అని స్పీకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జగదీశ్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో వాతావరణం వేడెక్కింది. జగదీశ్రెడ్డి అన్నదాంట్లో తప్పేం ఉంది?: హరీశ్రావు బీఆర్ఎస్ సభ్యుడు, మాజీమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..‘సభ్యులందరికీ సమాన హక్కులుంటాయని, సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించింది కాదని, ప్రతిపక్ష సభ్యులకు కూడా సమాన హక్కులుంటాయని జగదీశ్రెడ్డి అన్నారు. ఇందులో తప్పేం ఉంది..’ అని ప్రశ్నించారు. మీరు చేయలేనిది మేం చేశాం: శ్రీధర్బాబు 2014–15లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందో తాము సంవత్సర కాలంలో చేసి చూపెట్టామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ‘వాళ్లు వ్యంగ్యంగా నవ్వుతున్నారు. వారి విషయంలో ప్రజలు వ్యంగ్యంగా నవ్వారు కాబట్టే మేము ఇక్కడ (అధికారంలో) ఉన్నాం..’ అని వ్యాఖ్యానించారు. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి దేశమంతా పచ్చగా కనిపించినట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా జగదీశ్రెడ్డికి కనిపించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేశారా?: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దళితుడిని సీఎం చేయకపోతే నా మెడ మీద తల ఉండదని 10 వేల సార్లు అన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిలదీశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇచ్చావా? అని కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. దళితుడు (భట్టి విక్రమార్క) ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకి అని నిరూపించుకున్నవు అని అన్నారు. బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు పాల్గొనలేదని, వారికి ప్రజలపై ప్రేమలేదని వ్యాఖ్యానించారు. మమ్మల్ని రమ్మంటారా? వద్దా?: తలసాని సభ సాంప్రదాయాలను అధికారపక్షం పాటించకపోతే ఎలా? అని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. సభకు తమను రమ్మంటారా? వద్దంటారా? చెప్పాలని స్పీకర్ను ప్రశ్నించారు. అయితే జగదీశ్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని మంత్రులు, అధికారపక్ష సభ్యులందరూ ట్రెజరీ బెంచీల వద్ద నిలబడి నినాదాలతో హోరెత్తించడంతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సాయంత్రం 3.35కు సమావేశమైన తర్వాత జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ సభ్యులను అనుమతించారు. జగదీశ్రెడ్డి చెప్పిన 4 బర్రెల కథ ‘ఓ తండా వద్ద తవి్వన బావివద్దకు వెళ్లి ప్రజలకు గవర్నర్ ప్రసంగం చదివి వినిపించిన. అది విన్న వెంకటరాములు, రాజయ్యలు వారి ఊళ్లో ఉండే వెంకటయ్య కథతో పోల్చారు..మా అమ్మగారి ఇంటికి పాలుపోసి తీరుతా..అని నేను అంటే నా భర్త కొట్టిండని వెంకటయ్య భార్య సర్పంచ్కి ఫిర్యాదు చేసింది. మీకు బర్రెలే లేవు..పాలు ఎక్కడివి అని సర్పంచ్ అడిగితే నాకు నాలుగు బర్లున్నాయి అని వెంకటయ్య అన్నడు. పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, మా అత్తగారు ఒకటి ఇస్తే, నేను ఒకటి కొంటే.. నాలుగైతయి అన్నడు. గవర్నర్ ప్రసంగం కూడా ఇలానే ఉందని ఆ గ్రామస్తులు అన్నరు..’ అని జగదీశ్రెడ్డి చెప్పారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఆటో కారి్మకులకు రూ.12 వేలు, అక్కచెల్లెళ్లకు రూ.2500, రైతులకు బోనస్, తులం బంగారం, స్కూటీలు, 2లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీయడంతో వివాదం ప్రారంభమైంది. ‘గవర్నర్ ప్రసంగాన్ని ఏఐ, చాట్ జీపీటీతో తయారు చేసినట్టు ఉంది. మనసు కవి ఆత్రేయ బతికి ఉంటే ..ప్రభుత్వాలు ఇంత మనస్సు లేకుండా పనిచేస్తాయా? అని చూసి ఆత్మహత్య చేసుకునేవారు. గవర్నర్తో 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాలు మాట్లాడించారు.’ అని అంతకుముందు విమర్శించారు. -
పదేళ్ల తుప్పును వదిలిస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.కేంద్ర మంత్రి అయినందునే కిషన్రెడ్డి టార్గెట్ ‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.కిషన్రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దడం ఏంటి? మూడు భాషల విధానాన్ని రేవంత్రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.ప్రజలకు చెప్పకపోతే ఎలా? ‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
కౌన్సెలింగ్.. గైడెన్సే కీలకం
సాక్షి, ఎడ్యుకేషన్: ప్రస్తుత విద్యా వ్యవస్థ కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి సమస్యను పరిష్కరించాలంటే... వారికి పాఠశాల స్థాయిలోనే కెరీర్ గైడెన్స్, వారి నైపుణ్యాలపై కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని ఐసీ3 (ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్) మూవ్మెంట్ వ్యవస్థాపకులు, ప్రముఖ కెరీర్ కౌన్సిలర్, టెడెక్స్ స్పీకర్ గణేశ్ కోహ్లి చెప్పారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో మార్కులనే ప్రతిభకు కొలమానంగా భావించడం, ఇతరులతో పోల్చుకోవడం వంటి పలు కారణాలతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు.దీంతో వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని, ఈ కారణంగానే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలకు పాఠశాల స్థాయి నుంచే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ‘కౌన్సెలింగ్ ఇన్ ఎవ్రీ స్కూల్’అనే ఉద్దేశంతో ఐసీ3 మూవ్మెంట్కు రూపకల్పన చేసి, దాదాపు 90 దేశాల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్న గణేశ్ కోహ్లి.. విద్యార్థుల మానసిక ఒత్తిడి అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై పలు సూచనలు ఇచ్చారు.మానసిక ఒత్తిడికి ఎన్నో కారణాలువిద్యార్థుల్లో నెలకొంటున్న మానసిక ఒత్తిడి సమస్యలు చివరికి వారు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నాయి. 2012లో 6,654గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు, 2022 నాటికి 13,044కు చేరాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావడానికి అకడమిక్స్తో పాటు మరెన్నో అంశాలు కారకాలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత ఆహార్యం, సహచరులు– బంధువుల ఒత్తిడి, వైఫల్యం అంటే విపరీతమైన భయం వంటివి వీటిలో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.సంపూర్ణ వికాసం కల్పించడం కంటే అత్యున్నత గ్రేడ్లకే విలువనిచ్చే విద్యావ్యవస్థ ఇందుకు మరో ముఖ్యమైన కారణం. మరోవైపు చిన్నతనం నుంచే పిల్లలను వారి సహచరులతో పోల్చడం వల్ల తమ సామర్థ్యంపై అపనమ్మకం ఏర్పడి దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని గుర్తించకపోవడం వల్ల ఎన్నో ప్రతికూల పరిణామాలు చూడాల్సి వస్తోంది.విదేశాల్లో ఇప్పటికే నివారణ చర్యలుఇతర దేశాల్లోనూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పలు దేశాలు ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫిన్లాండ్, కెనడా, నెదర్లాండ్స్ తదితర పాశ్చాత్య దేశాల్లో పరీక్షల్లో మార్కుల కంటే సామర్థ్య ఆధారిత అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కౌన్సెలింగ్, మెంటార్íÙప్, ప్రయోగాలతో కూడిన అభ్యసనం వంటి మార్గాల ద్వారా కెరీర్పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.కానీ మన దేశంలో అకడమిక్గా పొందిన ఘనతనే విజయంగా గుర్తిస్తున్నారు. సక్సెస్ అంటే మార్కులే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్ కార్యక్రమాలు ఎంతో సత్ఫలితాలనిస్తాయి. పలు దేశాల్లో ఇది నిరూపితమైంది. మన దేశంలోనూ కౌన్సెలింగ్ సమ్మిళిత సాధనాలను అందుబాటులోకి తెస్తే మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకుని సవాళ్లను స్వీకరించే స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు. సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేయాలి నేటి విద్యా వ్యవస్థను పరిశీలిస్తే పాఠశాలలు విద్యార్థులకు కేవలం అకడమిక్ అభ్యసన కేంద్రాలుగానే ఉంటున్నాయి. వాటిని విద్యార్థుల భావోద్వేగాలను, సామాజిక, మానసిక సమస్యలను తీర్చే ప్రాంగణాలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత నెలకొంది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తరగతి గదిలో, బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధులను చేసేందుకు చర్యలు తీసుకోవాలి.పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి విద్యార్థుల మానసిక ఒత్తిడి విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు తమ సమస్యలను, ఆలోచనలను తమతో పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. దీనికి భిన్నంగా పిల్లల మాటలను తీసిపారేసేలా ప్రవర్తిస్తే వారు మరింత న్యూనతకు గురవుతారు. సక్సెస్ అంటే ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో చేరడం మాత్రమే కాదని పిల్లల బలాలు, ఆకాంక్షలను నెరవేర్చుకునేలా వ్యవహరించడం అని గుర్తించాలి.పరీక్ష విధానంపై పునరాలోచన చేయాలి దేశంలోని పరీక్షల విధానంపైనా పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్నే పరీక్షించే విధంగా ఉండడంతో విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో విద్యార్థులు కూడా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను, నిజ జీవిత పరిస్థితుల్లో వాటిని అన్వయించే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టకుండా..మార్కుల కోసం బట్టీ పట్టి చదువుతున్నారు. పర్యవసానంగా వాస్తవ పరిస్థితుల్లో ఆయా పాఠ్యాంశాల ప్రాధాన్యత ఏంటో తెలియట్లేదు. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం దిశగా అడుగులు వేయాలని జాతీయ విద్యా విధానం సూచించిన సంగతి తెలిసిందే.పాఠశాలల పాత్ర కీలకంప్రస్తుత పరిస్థితుల్లో మార్పు తేవాలంటే పాఠశాలలు ముందు నిలవాలి. మానసిక పరిపక్వత, భావోద్వేగ స్థిరత్వం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా విద్యార్థులు ఆత్మవిశాసం పెపొందించుకోవడానికి కెరీర్ కౌన్సెలింగ్ తోడ్పడుతుంది. నిర్దిష్టమైన కెరీర్ గైడెన్స్ పొందిన విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటారని.. ఆనిశి్చతి, ఆందోళనలను తగ్గించుకుంటారని పలు పరిశోధనల్లో తేలింది.ఏం చేయాలి..⇒ పిల్లల్లోని ఒత్తిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేలా టీచర్లకు శిక్షణనివ్వాలి. ⇒ విద్యార్థులు భావోద్వేగాలను నియత్రించుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడంపై బోధించాలి. ⇒ మాధ్యమిక పాఠశాల స్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్ను కరిక్యులంలో భాగం చేయాలి. ⇒ విద్యార్థులు సహచరులతో మానసిక సమస్యల గురించి చర్చించుకునే పరిస్థితిని, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాలి. -
బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ‘‘నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. విలీనం చేసా.. నన్ను విమర్శించిన వారిని ఎవరినీ వదిలిపెట్టాను. కేసీఆర్ను వదిలిపెట్టేది లేదు.. అవినీతి విషయం లో అన్ని లెక్కలు తేలుస్తాం’’ అంటూ విజయశాంతి హెచ్చరించారు. ‘‘నేను కొత్త మనిషిలాగా ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు నేను సేవలు అందించాను. బీజేపీ, బీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే ఆ పార్టీని వదిలేశాను’ అని విజయశాంతి చెప్పారు.‘‘ఎమ్మెల్సీగా మీ బండారం బయట పెడతానని భయం అవుతోందా?. నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు. విజయశాంతికి తెలంగాణకి సంబంధం లేదా?. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కాబట్టి నేను బీజేపీకి వెళ్లాను. నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేశాను. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో లేరు’’ అని విజయశాంతి అన్నారు.‘‘కేసీఆర్ తన దొరబుద్ది నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా?. నింద వేయడం కాదు. నేను గట్స్ ఉన్న మహిళని. ప్రతిరోజూ నన్ను అవమానించారు. నన్ను హింసపెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్రెడ్డి బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశాను. మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి, కిషన్ రెడ్డి స్నేహితులు ’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాపలా కుక్కలాగా తెలంగాణని కాపాడుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా అడగాలి. కేసీఆర్ మోసాలన్నీ బయటకి తీయాలి. కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది’’ అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. -
మటన్ కర్రీ వండలేదనే కోపంతో భార్యను చంపిన భర్త
సాక్షి,మహబూబ్ నగర్: జిల్లాలో దారుణం జరిగింది. మటన్ కూర వండలేదని భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. సీరోల్ ఎస్సై సీఎహెచ్ నాగేష్ వివరాల మేరకు.. సీరోల్ మండల కేంద్రానికి చెందిన ఎం కళావతి,ఎం బాలు భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలుకి నాన్ వెజ్ తినాలని బుద్ధి పుట్టింది. ముందుగా చికెన్ కూర తిందామని అనుకున్నాడు. అసలే బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని షాపుకెళ్లి మటన్ కూర తెచ్చాడు.మటన్ తినాలని ఉంది. అందుకే మటన్ తెచ్చా. వెంటనే మటన్ కూర చేయమని భార్యను కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో నిందితుడు బాలుకి కోపం నషాళానికి అంటింది. ఏం చేయాలే పాలుపోలేదు. పట్టరాని కోపంతో భార్య కళావతిని వెనక్కి నెట్టాడు. ఫలితంగా బాధితురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భర్త నెట్టడంతో బాధితురాలి తలకి బలమైన గాయాలయ్యాయి. అక్కడికక్కడే మరణించింది. అనంతరం బాలు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అధికారులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్ గౌడ్ చెప్పారు.అసెంబ్లీలో జగదీశ్వర్రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభమని.. కానీ ఆ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేనంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. గురువారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ స్థానం గెలవాలని తనకు అప్పగిస్తే.. నిద్రహారాలు మాని గెలిపించానన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి సస్పెన్షన్పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీలో జగదీస్రెడ్డి చాలా అతి చేశారన్నారు. మేము ఎవ్వరిని టార్గెట్ చేయం.. తప్పు చేస్తే వదిలి పెట్టం.. ఎమ్మెల్యే జగదీష్రెడ్డి చైర్ను ప్రశ్నించడం సరికాదు. స్పీకర్ కుర్చీని ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. స్పీకర్ను అవమానించినందుకే చర్యలు తీసుకున్నాం. ఎథిక్స్ కమిటికి సిఫార్సు చేశాం’’ అని రాజగోపాల్రెడ్డి చెప్పారు. -
ఇదే మా సవాల్.. మీ సవాల్కు మేము కూడా సిద్ధమే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తుందని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై ఎవరైనా చర్చకు వస్తారేమో రండి.. అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులకు పొన్నం సవాల్ విసిరారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ల మధ్య ఇదే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు చర్చకు రావాలంటూ పొప్నం సవాల్ చేశారు.పొన్నం ప్రభాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ పొన్నం ప్రభాకర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం ద్వారా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చ జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.దీనికి కౌంటర్ గా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర బీజేపీ లేఖ విడుదల చేయాలి. మూసీకి నిధులు ఇవ్వాలి, మూసీకి నిధులు ఇవ్వాలి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వరకూ రైల్వే లైన్ ఇవ్వాలి. తెలంగాణ కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చేలాగ రాష్ట్ర బీజేపీ ప్రయత్నం చేయాలి’ అని పొన్నం స్పందించారు. -
తెలంగాణ రైజింగ్కు మద్దతుగా నిలవండి
ఢిల్లీ : తెలంగాణ రైజింగ్ కు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి జైశంకర్ ను కోరారు. ఈ మేనరకు వినతి పత్రం అందజేశారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ కార్యక్రమాలకు సహకరించాలని విన్నవించారు.ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్ను సీఎం రేవంత్ కోరారు. తెలంగాణ రైజింగ్ను విదేశాల్లో భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో(గురువారం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థ/ల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా, వీరిపై పోటీకి ఎవరూ సిద్ధం కాలేదు. దాంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది కాంగ్రెస్. రెండు స్థానాలను సీపీఐ అడిగినప్పటికీ ఒక స్థానమే సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. వీరి మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదిరింది. దాంతో సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించక తప్పలేదు. అయితే ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందించారు. -
జగదీష్రెడ్డి సస్పెన్షన్.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డిని స్పీకర్ సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రేపు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారు. ఒక సభ్యుడి గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్దాలపై జగదీష్రెడ్డి ప్రశ్నించారు. సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. జగదీష్రెడ్డి సంయమనం పాటించారు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘జగదీష్రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోంది. తప్పు చేయకపోయినా స్పీకర్పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పాం. మా వాదనను కూడా వినిపించుకోలేదు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలి. జగదీష్రెడ్డి చేసిన తప్పుపై వివరణ కూడా తీసుకోలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్కుమార్ను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ ప్రసాద్కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు. స్పీకర్ గురించి జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారంటే?తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. హోళీ పండుగ రోజు ఆనవాయితీగా మధ్యలో తాడు కట్టి ఇరువైపులా నిలబడి కొట్టుకునే సంప్రదాయంతో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అనుమతి నిరాకరించారు. గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోళీ రోజూ కొట్టుకుంటే గ్రామానికి కీడు జరగదని ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. కొట్టుకుంటే కక్షలు పెరిగి.. గొడవలు జరుగుతాయంటున్న పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలో ఉన్న హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది.దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయోబేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాటను నిర్వహిస్తుంటారు. వసంత రుతువు రాకకు గుర్తుగా సంబురంగా నిర్వహించే హోలీ.. ఆ గ్రామంలో పిడిగుద్దులకు వేదిక అవుతుంది. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. -
అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామం మాది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మా ప్రాంతంలో అవగాహన అంతంతే. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ (Telangana) ఉద్యమంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలపై కొంత అవగాహన వచ్చింది.. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) సాధించొచ్చనే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆరు ఉద్యోగాలు సాధించాను. పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించొచ్చు’ అని అంటున్నారు ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో మూడో ర్యాంక్ (Third Rank) సాధించిన బీర్దార్ మనోహర్రావు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పండరినాథ్ కీర్తనకారుడు. పండరిపూర్ విఠలేశ్వరుని కీర్తనలు, ప్రవచనాలు బోధిస్తారు. మా ఉజ్జంపహాడ్ గ్రామం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉటుంది. నా భార్య మనీష గృహిణి. కూతురు మనస్విని 3వ తరగతి, కొడుకు మహేశ్వర్ ఒకటో తరగతి చదువుతున్నారు. కుటుంబమంతా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. నేను నిత్యం హనుమాన్చాలీసా చదువుతాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కుల్చారం మండలం అంసాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేశాను. ఒక దాని తర్వాత మరోటి ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ కొలువులు ఆరు వచ్చాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించి పీజీటీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు (State First Rank) వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లో రెండో ర్యాంకు, 2016 గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో చేరా. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో ఆ ఉద్యోగం మానేశా. తిరిగి స్కూల్ అసిస్టెంట్గా విధుల్లో చేరా. జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, తాజా గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు వచ్చింది. బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్గా ఉద్యోగంలో చేరాను.డిప్యూటీ కలెక్టర్ కావాలని ఉంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో అత్యున్నతమైనది గ్రూప్–1. డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించడమే నా ముందున్న లక్ష్యం. గ్రూప్–1 పరీక్షలు కూడా రాశాను. 430 మార్కులు వచ్చాయి. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడితే గ్రూప్–1 ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: గ్రూప్– 2 టాపర్ హరవర్ధన్రెడ్డిసిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితముండదు నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే కష్టం. సంబంధిత సబ్జెక్టు మరిచిపోకుండా కనీసం రెండు గంటలైనా చదవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సిలబస్పై పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితం ఉండదు. పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమయం వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత సమయం కలిసొస్తుంది. కనీసం 8 గంటలు చదవాలి. -
అవసరమైతే స్పీకర్పై అవిశ్వాసం పెడతాం: హరీష్ రావు
హైదరాబాద్, సాక్షి: స్పీకర్ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ను జగదీష్రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. స్పీకర్ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్ కుర్చీతో డైవర్షన్ పాలిటిక్స్కు దిగింది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్పై జగదీష్రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం -
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్రెడ్డి సస్పెన్షన్
👉తెలంగాణ అసెంబ్లీ: జగదీష్రెడ్డి సస్పెన్షన్👉బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు👉ఈ సెషన్ మొత్తానికి జగదీష్రెడ్డి సస్పెన్షన్👉స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు👉సభ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు👉తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..👉అసెంబ్లీ లాబీ లోకి చేరుకున్న మార్షల్స్👉ఇప్పటికే స్పీకర్ తో అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు భేటీ.👉ఈ సభ మీ సొత్తు కాదని స్పీకర్ ను ఉద్దేశించి వాఖ్యానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.👉జగదీష్ రెడ్డి వాఖ్యల పట్ల అధికార కాంగ్రెస్ అభ్యంతరం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు అధికార కాంగ్రెస్ డిమాండ్..👉అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నిరసన నేపథ్యంలో సభను వాయిదా వేసిన స్పీకర్..👉సభలో జరిగిన వ్యవహారం పై సీఎం కు రిపోర్ట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.👉దలిత స్పీకర్ ను అవమానించిన విషయం లో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రులు నిర్ణయం .👉సభ ప్రారంబంకాగానే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రి సీతక్కకు సూచించిన శ్రీధర్ బాబు..👉అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్ను జగదీష్ అవమానించారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలకు దిగింది.👉గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఇవాళ శాసనసభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోగా.. ఒకానొక స్థితిలో పరిస్థితి చేజారిపోయింది. స్పీకర్ ఛైర్ను సభ్యులు ప్రశ్నించకూడదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అనడంతో పరిస్థితి మారిపోయింది. 👉ఈ సభ మీ ఒక్కరి సొత్తేం కాదంటూ జగదీష్రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు.. సభను అదుపులో పెట్టాలంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.👉మరోవైపు.. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ గడ్డం ప్రసాద్ను విడిగా కలిశారు. జగదీష్రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘జగదీష్ రెడ్డి స్పీకర్ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’’ అని అన్నారు.👉ఇంకోవైపు.. జగదీష్రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్లో విషయాన్ని తెలియజేశారు. అనంతరం సీఎం ఛాంబర్లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీష్రెడ్డి స్పీకర్ ప్రసాద్కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గతంలో స్పీకర్ చైర్లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో ఒక్కొక్కరుగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పీకర్పై వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పకపోతే జగదీష్రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని సైతం పరిశీలించాలని స్పీకర్ను కోరతామని అన్నారు. ఇదిలా ఉంటే.. జగదీష్ మాట్లాడిందాంట్లో తప్పేం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అంటుండగా, స్పీకర్ కుర్చీతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్కు దిగిందని ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. -
దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని వెళ్తాం. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది.డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్పై కిషన్ రెడ్డి తన గళం కేంద్ర క్యాబినెట్లో వినిపించాలి. తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు. -
స్పీకర్పై జగదీష్రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో అలజడి రేపాయి. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ స్పీకర్పై ఆరోపణలకు దిగగా.. బీఆర్ఎస్ సభ్యులు దళిత స్పీకర్ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ కాసేపు వాయిదా పడింది.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్హాట్గా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా వ్యవహారం నడిచింది. మాజీ మంత్రి జగదీష్రెడ్డి గవర్నర్ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిెడ్డి వెంకట్ రెడ్డి అడ్డు పడి వాస్తవాలు మాట్లాడాలని జగదీష్రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సభలో సభ్యులందరికీ సమాన నిబంధనలు ఉంటాయని అన్నారు. ఈలోపు.. మంత్రి శ్రీధర్ బాబు - బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ బాబు ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒకానొక తరుణంలో పరిస్థితి చేజారిపోతుండడంతో స్పీకర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులు సభను అవమానం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తించవద్దు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దు’’ అని స్పీకర్ ప్రసాద్ అనడంతో జగదీశ్ రెడ్డి లేచారు. స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.. ‘‘మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమేనని, ఈ సభ అందరిదని, మీ ఒక్కరికే సొంతం కాదు’’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు.జగదీష్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పొడియం దగ్గరగా వెళ్లారు. సభను ఆర్డర్లో పెట్టాలని, ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో.. దళిత స్పీకర్ను అవమానించిన జగదీష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్కు దిగింది. ఈ ఆందోళనలతో సభ వేడెక్కగా.. కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. -
విచారణకు రావాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి బిగ్ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్హౌస్లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు చెందిన ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్హౌస్కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
లిఫ్ట్లో ఇరుక్కుని.. హైదరాబాద్లో మరో విషాదం
హైదరాబాద్, సాక్షి: పదిహేను రోజుల వ్యవధిలో.. అదీ ఒకే ప్రాంతంలో మరో పసిప్రాణాన్ని నాసిరకం లిఫ్ట్ బలిగొంది(Lift Accident). నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి మెహదీపట్నంలో చోటు చేసుకుంది. ఆసిఫ్నగర్ ఠాణా పరిధి సంతోష్నగర్కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్(Surendar) లిఫ్ట్లో ఇరుక్కుని మరణించడం స్థానికంగా విషాదం నింపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్యామ్ బహదూర్(Shyam Bahadur) నేపాల్కు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం ఏడు నెలల కిందట నగరానికి వచ్చాడు. తొలుత గుడిమల్కాపూర్లో ఓ భవనానికి కాపలాదారుగా పనిచేశాడు. అయితే మూడు నెలల కిందట సంతోష్నగర్ కాలనీలోని ముజ్తాబా అపార్ట్మెంట్కి వాచ్మెన్గా వచ్చాడు. నిర్వాహకులు రూమ్ ఇస్తామని చెప్పడంతో నేపాల్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడిని తీసుకొచ్చాడు. ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్పక్కనే ఉన్న చిన్నగదిలో శ్యామ్ బహదూర్ కుటుంబం ఉంటోంది. బుధవారం రాత్రి 10 గంటల టైంలో.. సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిప్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. కాసేపటికే సురేందర్ ఎక్కడా కనిపించకపోవడంతో శ్యామ్ వెతకగా.. లిఫ్ట్మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో కనిపించాడు. తల్లిదండ్రులు రోదిస్తుండగానే.. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేందర్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడన్న సమాచారంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
1,532మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేత (ఫొటోలు)
-
హైదరాబాద్ చేరుకున్న సైబర్ కేఫే బందీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం విదేశాలకు పోయి, సైబర్ కేఫేలో బందీలుగా చిక్కుకుపోయిన 540 మంది భారతీయులు మంగళవారం ఢిల్లీకి చేరుకోగా, వారిలో బుధవా రం రాత్రి తెలంగాణకు చెందిన 24 మంది బాధితులు హైదరాబాద్కు చేరుకున్నారు. వారికి సంబంధించిన పర్వవేక్షణ బాధ్యతలను ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ఉప్పల్కు అప్పగించారు. వారిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా హైదరాబాద్కు తరలించారు. దీంతో వారి బంధువులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే అధికారులు రెగ్యులర్ ఎగ్జిట్ నుంచి కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి వారి నుంచి వివరాలు, స్టేట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులను ఆశ్రయించగా, బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పంపిస్తామని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తెలంగాణకు చేరుకున్న 24 మంది బాధితుల గురించి కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ఆరా తీసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి శ్రీధర్బాబు కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల పేరిట అక్రమ రవాణా చేయడానికి కారణమైన వారిని గుర్తించడానికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, విచారణ అనంతరం మధుకర్రెడ్డిని కుటుంబసభ్యులకు అప్పగించారు.జగిత్యాలలో వెలుగుచూసిన మరో మోసం సైబర్ కేఫేలో చిక్కుకొని బయటపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన దేశెట్టి రాకేశ్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు మల్లికార్జున మ్యాన్పవర్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. నిర్వాహకుడు ఆల్లెపు వెంకటేశ్కు ఫోన్పే, నగదు రూపంలో 2022లో రూ.3.50 లక్షలు అప్పజెప్పాడు. 2023 ఆగస్టులో రాకేశ్ను ఆర్మీనియాకు పంపించాడు. కానీ అక్కడ జాబ్ చూపించకపోవడంతో ఇబ్బందులు పడి, అతి కష్టం మీద నవంబర్ 2023లో స్వదేశానికి చేరుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంకటేశ్ను అడగ్గా 2025 జనవరి 12న రాకేశ్ను థాయిలాండ్కు పంపించాడు. అక్కడ వెంకటేశ్కు సంబంధించిన వ్యక్తులు ఒక సైబర్ క్రైమ్ చేసే ముఠాకు అప్పజెప్పారు. ఇతరుల సహాయంతో ఇండియన్ ఎంబసీనీ సంప్రదించి స్వదేశానికి రాకేశ్ తిరిగి వచ్చాడు. తనను మోసం చేసిన కన్సల్టెన్సీ నిర్వహకుడు ఆల్లెపు వెంకటేశ్పై జగిత్యాలటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసుదర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చెప్పారు. -
గవర్నర్ది గాందీభవన్ ప్రసంగం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగం.. గాందీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్మీట్లా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోటి వెంట అబద్ధాలు, అసత్యాలు చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని ఆరోపించారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కొత్త విషయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలపై స్పష్టత ఇస్తారని, గత 15 నెలల పాలనపై ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం. కానీ అలాంటిదేమీ జరగలేదుగానీ పెళ్లిలో చావుడప్పు కొట్టినట్టుగా ప్రసంగం ఉంది’అని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిస్థాయిలో ప్రజలను వంచించడమేనని, ఆయన ప్రతిష్టను సైతం తగ్గించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యంతో రైతులు అరిగోసలు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, గవర్నర్ ప్రసంగంలో ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కమాట కూడా లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 నుంచి 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని, గవర్నర్ నోటి ద్వారా మాత్రం రుణమాఫీ పూర్తయిందని అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక ఆగమాగమవుతుంటే, రైతుబంధు అందిందని, అసత్యాలు వల్లించారని విమర్శించారు. సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, గోదావరి పరీవాహకంలో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 83 మంది విద్యార్థుల మరణాలపై గవర్నర్ ప్రసంగంలో ఒక్క సానుభూతి మాట కూడా లేదని విచారం వ్యక్తం చేశారు. బీసీలకు సామాజిక న్యాయమా? కులగణన పేరుతో బీసీల సంఖ్య తగ్గించి, వారిని మోసం చేసి.. ఏదో ఉద్ధరించినట్టు సోషల్జస్టిస్ అని గవర్నర్ నోటివెంట అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానించిందని తాము అనడం లేదని, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు గళం విప్పితే, ఆయన్ను సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘమైనా కులగణన లెక్కలు సరైనవని అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నడా? మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలైనా ఏకీభవించే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. నో విజన్.. ఓన్లీ కమీషన్ భారతదేశంలో ఏ రాష్ట్ర సచివాలయంలోనూ జరగని ఘోర సంఘటన తెలంగాణ సచివాలయంలో జరిగిందని కేటీఆర్ దుయ్యబట్టారు. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ధర్నా చేసిన సంఘటనే దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు.. కేవలం 20 శాతం కమీషన్ కక్కుర్తి మాత్రమే ఉందని మండిపడ్డారు. కమీషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ. 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ.1.62 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. దావోస్లో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ ద్వారా అబద్ధాలు చెప్పించారని, గత ఏడాది చెప్పిన రూ.40,000 కోట్లలో ఒక్క పైసా కూడా రాలేదని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నమని, తెలంగాణ ప్రజలు సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడం ఖాయమన్నారు. పిచ్చికుక్క హద్దులన్నీ దాటేసింది ‘మర్యాదకు ఉండే హద్దులన్నింటినీ పిచ్చి కుక్కదాటేసింది. అతడిని వెంటనే ఏదైనా పిచ్చాస్పత్రికి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను కోరుతున్నారు. అసహనంతో ఉన్న అతను.. తన చుట్టూ ఉన్నవారిని కరవడం మొదలుపెడతాడేమో. త్వరగా కోలుకో ‘చీఫ్ మినిస్టర్’అని సీఎం రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల కుదింపు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీలు ప్రారంభమైన నాటి నుంచి జరిగిన ప్రవేశాలు, ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వాటి సంఖ్యను కుదించాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి వారం రోజులుగా డిగ్రీ కాలేజీల ప్రిన్స్పాళ్లతో సొసైటీ కార్యదర్శి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటి సంఖ్యను కుదించి అక్కడున్న విద్యార్థులను సమీప కాలేజీల్లో విలీనం చేసే దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అరకొరగా ప్రవేశాలు ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 30 మహిళా డిగ్రీ కాలేజీలున్నాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు 3 కాలేజీల చొప్పున ఏర్పాటు చేశారు. ఇవి 2016–17 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రాగా.. తొలి ఏడాది డిగ్రీ మొదటి సంవత్స రం మాత్రమే ప్రారంభించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఒక్కో కాలేజీలో 7 కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 40 మంది చొప్పున 280 మంది విద్యార్థులుంటారు. 3 సంవత్సరాలకు కలిపి 840 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే చాలాచోట్ల అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవు. ప్రారంభంలో విద్యార్థులు బాగానే చేరినప్పటికీ, కోవిడ్ తర్వాత చేరికలు తగ్గుతూ వచ్చాయి. మరోవైపు ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతుండడంతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు తగ్గాయి. దీంతో కాలేజీల నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీల సంఖ్యను కుదించేందుకు సొసైటీ చర్యలు చేపట్టింది. సగం కాలేజీలు విలీనం ఈ కాలేజీల్లో కోర్సులవారీగా ప్రవేశాలు, ఖాళీలను సొసైటీ అధికారులు విశ్లేషిస్తున్నారు. అడ్మిషన్లు సగం కంటే తక్కువగా వచి్చన కోర్సులను సమీప కాలేజీలో విలీనం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఏ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీని అదే వర్సిటీ పరిధిలోని మరో కాలేజీలో విలీనం చేయాలని నిర్ణయించారు. కొన్నింటిని పూర్తిగా సైన్స్ కాలేజీలుగా, మరికొన్నింటిని ఆర్ట్స్ కాలేజీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు కాలేజీలున్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఒక కాలేజీని సైన్స్ కాలేజీగా, మరో కాలేజీని ఆర్ట్స్ కాలేజీగా మార్చి, మూడో కాలేజీని పై రెండింటిలో విలీనం చేసేలా సొసైటీ ప్రధాన కార్యాలయంలోని అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. 30 కాలేజీల్లో కలిపి 25,200 సీట్లు ఉండగా, మొత్తం 12 వేలకు మించి విద్యార్థులు లేరని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కాలేజీలను 20కి తగ్గించాలా? 15కు కుదించాలా? అనే తర్జనభర్జన పడుతున్నారు. ఒకటిరెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మాటకు మాట.. తిప్పికొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించి.. ప్రతిపక్షాలను కకావికలం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని.. సభ లోపల వారు మాట్లాడే ప్రతి పదాన్ని మాటకు మాట తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘ఈ బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలి..’’ అని సూచించారు. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కంటే ఎక్కువ కుంభకోణాలు చేసినవారెవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆ కుంభకోణాలను ప్రస్తావించి తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. మొక్కుబడిగా హాజరవడం కాదు.. కాంగ్రెస్ సభ్యుల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం కాదని, సభను సీరియస్గా ఫాలో కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభ ప్రొసీడింగ్స్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని వాటిపై అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. ఆయా సబ్జెక్టులపై ప్రతిపక్షాలు చెప్పే అంశాలను తిప్పికొట్టే స్థాయికి అవగాహన పెరగాలని చెప్పారు. సభ్యుల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి ఓ మంత్రి సహకారంతో తమకు ఇష్టమైన సబ్జెక్టుల గురించి నేర్చుకోవాలని సూచించారు. నాకేమిటనే నిర్లక్ష్యం వద్దు ‘‘ప్రతిపక్షాల విమర్శలను అటు సభలో, ఇటు బయట కూడా సమర్థంగా ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఏం చేసినా చూసీ చూడనట్టు ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై అభ్యర్ధిని నిలబెట్టరని ఏమైనా అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు మాట్లాడే అంశాల గురించి నాకేమిటి, నా గురించి కాదు కదా? అని వదిలేయకుండా సమష్టి బాధ్యతగా తీసుకుని తిప్పికొట్టాలి..’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండాలని సూచించారు. సభకు ఎవరు వస్తున్నారో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత విప్లదేనని చెప్పారు. పార్లమెంటు తరహాలోనే ప్రతి రోజు మూడు సార్లు ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోవాలని విప్లను ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలుస్తా.. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తానని, అందరితో కలసి భోజనం చేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. జిల్లాల వారీ అభివృద్ధిపై సమీక్షలు జరుపుతామని, అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమాల గురించి చర్చిద్దామని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేతో కూడా తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. చెప్పేది సీరియస్గా తీసుకోండి.. సీఎల్పీ సమావేశంలో సభ్యుల అటెండెన్స్ గురించి రేవంత్ మాట్లాడుతున్న సమయంలోనే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్ నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే సీఎం పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘‘సభ్యులందరూ కచ్చితంగా సభకు రావాలని నేను చెబుతుంటే కొందరు ఫోన్ చూసుకుంటూ బయటికి వెళుతున్నారు. సీఎల్పీ సమావేశంలో కూర్చునే ఓపిక కూడా ఉండదా? రాజకీయాలంటే పిల్లాలట కాదు. ఒక్కసారి గెలవగానే సరిపోదు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడానికి సీరియస్గా ప్రయత్నించాలి. నాన్సీరియస్గా ఉంటే ఎలా?’’ అని పేర్కొన్నట్టు సమాచారం. -
మీ స్మార్ట్ వాచ్ మీకు నిజమే చెబుతోందా?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఓ రోజున అమర్ అనే యువకుడు నాకు అత్యవసరంగా ఫోన్ చేశాడు. ఆ సమయంలో తను జిమ్లో ఉన్నాడు. తన స్మార్ట్ వాచ్ గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 38 మాత్రమే చూపిస్తోందని చెప్పాడు. నిజానికి 60–100 మధ్యలో ఉండాలి.కానీ ఓసారి వాచ్ తీసి..మళ్లీ వేసుకునే సరికి అది100 చూపించింది. అదిఆ వాచ్ కచ్చితత్వంలో ఉన్న ఎర్రర్. కానీ ఆ సమయంలో నిజంగానే తనకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమోఅన్నంతగా తను టెన్షన్ పడ్డాడు..స్మార్ట్ వాచ్లు.. ఇప్పుడు చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. తామెంత నడిచాం.. ఎంత సేపు పరిగెత్తాం.. ఎంత సేపు స్విమ్ చేశాం.. పడుకున్నాం.. ఎన్ని కాలరీలు బర్న్ చేశాం.. ఇవన్నీ ఉదయాన్నే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. స్టేటస్లు పెడుతున్నవాళ్లూ ఎక్కువయ్యారు. ఇదంతా నాణానికి ఓవైపు.. మరోవైపు చూస్తే.. నిజానికి ఇదో వ్యసనంలా మారుతోందా? స్మార్ట్ వాచ్లపై మనంఅతిగా ఆధారపడుతున్నామా? అసలు మన స్మార్ట్ వాచ్ నిజమే చెబుతోందా? హార్ట్ రేట్ స్మార్ట్ వాచ్కు సంబంధించి ముఖ్యంగా వైద్యపరమైన అంశాల్లో గుడ్డిగా నమ్మడం మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘యువకులు వీటిపై అతిగా ఆధారపడుతున్నారు. హార్ట్ రేట్ బాగా పెరిగిందనో.. లేదా బాగా తగ్గిందనో భయంతో మా వద్దకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది’అని పుణేకు చెందిన కార్డియాలజిస్ట్ అభిజిత్ వైద్య తెలిపారు. నిజానికి స్మార్ట్ వాచ్లు పల్స్ రేట్ను మాత్రమే చూపిస్తాయని.. జనానికి ఈ రెండింటి మధ్య తేడా పెద్దగా తెలియదన్నారు. ‘ప్రతీ సారి గుండె కొట్టుకునేటప్పుడు రక్తప్రసరణలో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా గుండె కొట్టుకునే రేటును గణించడానికి స్మార్ట్ వాచ్లు ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ)ని వాడతాయి. గుండె కొట్టుకునే రేటును కచి్చతంగా గణించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్(ఈసీజీ) బెస్ట్. పీపీజీ కూడా కొంత మొత్తంలో పనిచేస్తుంది గానీ.. ఈసీజీతో పోలిస్తే.. అది కచ్చితంగా లెక్కించలేదు’అని చెప్పారు. చాలా చిన్నచిన్న మార్పులు పల్స్ రేట్ను ప్రభావితం చేస్తుంటాయని.. దీనివల్ల స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ను కచ్చితంగా చూపించలేదని చెప్పారు. ‘నేను చాలాసార్లు ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అదే పనిగా హార్ట్ రేట్, బీపీని స్మార్ట్ వాచ్లో చెక్ చేసుకోవడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే’ అని తెలిపారు. 2022లో ఫ్రాన్స్, కెనడా, నెదర్లాండ్స్కు చెందిన పరిశోధకులు ఒక పాపులర్ స్మార్ట్ వాచ్లోని ఈసీజీ సదుపాయాన్ని పరీక్షించి చూడగా.. ఫాల్స్ పాజిటివ్లు(తప్పుడు ఫలితం) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ‘నిజంగానే గుండెకు సంబంధించి సమస్య ఉండి.. మీ ఖరీదైన స్మార్ట్ వాచ్ ఈసీజీలో అంతా నార్మల్ అని చూపిస్తే.. అప్పుడు ఆ రోగి వైద్యుడు వద్దకు వెళ్లడు. అది ప్రమాదకరం. హృదయ ధమనుల్లో ఏదైనా పూడికల్లాంటివి ఉంటే ఈసీజీలో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ అలాంటి వాటిని పట్టుకోదు’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొన్ని నాణ్యమైన స్మార్ట్ వాచ్లు గుండె కొట్టుకోవడంలో తేడాలను(అరిర్థియా) సరిగానే గుర్తిస్తున్నాయని చెప్పారు. స్లీప్ ట్రాకర్స్లీప్ ట్రాకర్ల విషయానికొస్తే.. మన నిద్ర ఆధారంగా అవి 0–100 వరకూ మార్కులిస్తుంటాయి. ఎక్కువ వస్తే.. మనం మంచిగా నిద్రపోయినట్లు అన్నమాట. ‘స్మార్ట్ వాచ్లు సెన్సర్లను ఉపయోగిస్తాయి. ఆక్సిలరోమీటర్, గైరోస్కోప్, హార్ట్ రేట్ మానిటర్ ఇలా.. అవి నిద్రలోని వివిధ దశలను గుర్తించలేవు. నిజమైన నిద్రను స్లీప్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్తో లెక్కించవచ్చు. అంతేకాదు.. స్మార్ట్ వాచ్లు మన కదలికలను బట్టి.. నిద్రను గణిస్తాయి. ఒకవేళ మీరు పడుకోకున్నా.. కదలకుండా ఉంటే.. అది నిద్ర కింద లెక్క తీసుకుంటుంది’అని డయాబెటాలజీ అండ్ స్లీప్ మెడిసన్ కన్సల్టెంట్ డాక్టర్ స్మిత వివరించారు. సరైన స్లీప్ స్కోర్ రాలేదని టెన్షన్ పడే వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య పెరిగిందని చెప్పారు. ఖర్చు చేసే కేలరీలు కేలరీల ఖర్చు అంచనాల్లోనూ ఇదే పరిస్థితి. స్టాన్ఫోర్ట్ వర్సిటీ చేసిన పరిశోధనలో కేలరీలు ఎంత ఖర్చయ్యాయి అన్న విషయాన్ని స్మార్ట్ వాచ్లు సరిగా గణించలేకపోయినట్లు తేలింది. ‘ఇద్దరు 60 కేజీల బరువున్న వాళ్లను తీసుకుంటే.. ఒకరిలో 15 శాతం బాడీ ఫ్యాట్, రెండో వారిలో 45 శాతం బాడీ ఫ్యాట్ ఉంది అనుకుందాం. నిజానికి కేలరీల ఖర్చు అన్నది ఇద్దరిలో వేరువేరుగా జరుగుతుంది. స్మార్ట్ వాచ్లో మనం బరువు మాత్రమే నమోదు చేస్తాం కాబట్టి.. ఇద్దరికీ ఒకేలా కేలరీలు ఖర్చయినట్లు చెబుతుంది. కానీ శరీరతత్వం బట్టి.. కేలరీల ఖర్చు వేర్వేరుగా ఉంటుంది’అని న్యూట్రిషనిస్ట్ రాధిక తెలిపారు. స్టెప్ కౌంట్గతంలో 111 దేశాలకు చెందిన 7 లక్షలకు పైగా జనాన్ని శాంపిల్గా తీసుకుని అమెరికా, ఆ్రస్టేలియా పరిశోధకులు అధ్యయనం చేశారు. దీని ప్రకారం.. స్టెప్ కౌంట్ అనేది.. వాచీ స్థాయిని బట్టి 15–66 శాతం తేడా వస్తోందని తేలింది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందింపజేసుకోవడానికి స్మార్ట్ వాచ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని.. అదే సమయంలో ఆరోగ్యపరమైన అంశాల్లో వీటిపైనే అతిగా ఆధారపడటం మంచిది కాదని.. పైగా.. ఇది అనవసరమైన ఆందోళనకు తెర తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే..మీ స్మార్ట్ వాచ్ ఏం చెబుతోందోదాన్ని కాదు.. మీ శరీరం మీకుఏం చెబుతుందో దాన్ని వినండి..అని వైద్యులు సూచిస్తున్నారు. -
సైబర్ నేరాలకు సమష్టిగా చెక్
సాక్షి, హైదరాబాద్: ‘సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ–కేటుగాళ్లు కనీసం బాధితుల కంటికి కూడా కనిపించకుండా రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. సైబర్ భద్రత, ఈ నేరాల దర్యాప్తు సాంకేతికతతో ముడిపడిన అంశాలు. పోలీసు విభాగాలు, ప్రత్యేక ఏజెన్సీలు మాత్రమే వీటిని కట్టడి చేయలేవు’అని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ (ఎన్సీఎస్సార్సీ) డైరెక్టర్ డాక్టర్ ఇ.కాళిరాజ్ నాయుడు అన్నారు. జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న ఎన్సీఎస్సార్సీ.. ఉస్మానియా యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో బుధవారం హ్యాకథాన్–ఎక్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాళిరాజ్ నాయుడు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సైబర్ నేరాలు, భద్రతపై ఆయన చెప్పిన అంశాలివి... దేశవ్యాప్తంగా హ్యాకథాన్లు ఎన్సీఎస్సార్సీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లోనూ హ్యాకథాన్–ఎక్స్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాం. తెలంగాణలో ఓయూ వేదికగా ఏర్పాటు చేశాం. కంప్యూటర్ ఇంజనీరింగ్లోని అన్ని విభాగాలకు చెందినవాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. యువకులతో పాటు యువతులూ పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఆంధప్రదేశ్లో నిర్వహించిన హ్యాకథాన్కు 300 మంది హాజరుకాగా.. తెలంగాణలో 400 మంది పోటీపడ్డారు. వీటి నుంచి ఎంపికైన 50 బృందాలకు (దాదాపు 200 మంది) వచ్చే నెల (ఏప్రిల్) రెండో వారంలో ఆంధ్రప్రదేశ్లో సెమీఫైనల్స్ నిర్వహిస్తాం. ఇందులో విజయం సాధించిన వారికి మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందిస్తాం. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, విభాగాల్లో సెమీ ఫైనల్స్ను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నాం. వీటి తర్వాత ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ రీజియన్లలో ఫైనల్స్ ఉంటాయి. గెలుపొందే వారికి మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతిగా రూ.లక్ష ఇవ్వనున్నాం. ఆపై ఢిల్లీలో సూపర్ ఫైనల్స్ జరుగుతాయి. ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొస్తున్న కంపెనీలు యువతలోని నైపుణ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దీనికోసం సర్కారు కూడా హ్యాకథాన్లు నిర్వహిస్తోంది. అయితే అవి ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. రెండు, మూడో శ్రేణి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఎన్సీఎస్సార్సీ పని చేస్తోంది. దీనికోసమే ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో హ్యాకథాన్–ఎక్స్లు నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా నిపుణులను వెలికితీసి జాతికి అంకితం చేయాలన్నదే మా ధ్యేయం.వీళ్లు పోలీసులు, ఏజెన్సీలకు సహకరిస్తారు. ఎన్సీఎస్సార్సీ నిర్వహించే హ్యాకథాన్లలో సత్తా చాటుతున్న యువతీయువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు ఎన్సీఎస్సార్సీకి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. హ్యాకథాన్లలో పాల్గొన్న వారిలో ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి. నేరాలపై అవగాహనకు పెద్దపీట సైబర్ నేరాల బారినపడిన వారికి సహాయం చేయడం కన్నా.. అసలు ఎవరూ ఆ నేరాలకు బలి కాకుండా చూసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా దర్యాప్తు, సైబర్ సెక్యూరిటీ పైనే కాకుండా అవగాహన కల్పించడానికీ పెద్దపీట వేస్తున్నాం. దీనికోసం ఎన్సీఎస్సార్సీ హ్యాకథాన్ల ద్వారా ప్రత్యేక సమూహాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఇందులోని సభ్యులు అన్ని రంగాలకు చెందిన వారికి సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన కల్పిస్తుంటారు. వీరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ ఏజెన్సీల్లోనూ పని చేసే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఎస్సార్సీ ప్లానింగ్, టెక్నికల్, అవేర్నెస్ కోణాలను స్పృశిస్తూ హ్యాకథాన్లను నిర్వహిస్తోంది. మా హ్యాకథాన్లలో పాల్గొంటున్న అభ్యర్థులు తమ రాష్ట్రాలకే సేవలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ కోణంలో ముందుకు రావాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సీఎస్సార్సీతో కలిసి పని చేయడానికి అంగీకరించింది. మిగిలిన రాష్ట్రాలు సైతం ఇలా ముందుకు రావాలి అని కాళిరాజ్ నాయుడు కోరారు. -
ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రతినెలా రూ.22 వేల కోట్ల ఆదాయం అవసరమని, అంత ఉంటేనే సంక్షేమ పథకాలను ఓ మోస్తరుగా నడపగలమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఇప్పుడొస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వేతనాలు, అప్పులకే రూ.13 వేల కోట్లు పోతున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి క్యాన్సర్లా మారిందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏం చేయాలో ఉద్యోగులు చెప్పాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 1,292 మంది జూనియర్ కాలేజీ లెక్చరర్లు, 400 మంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు బుధవారం రవీంద్రభారతి వేదికగా ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రొటేషన్ మాత్రమే చేస్తోంది.. ‘ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తోంది. రూ.6,500 కోట్లు అప్పులు తిరిగి చెల్లించేందుకు కడుతున్నాం. మిగిలిన రూ.5 వేల కోట్ల నుంచి రూ.5.5 వేల కోట్లల్లోనే 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు చెల్లించాలి. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా ఈ నిధులే వాడుకోవాలి. ఈ ఇబ్బంది ఉంది కాబట్టే ఒక్కో నెలలో ఒక్కో పథకానికి చెల్లింపు పెండింగ్లో పెడుతున్నాం. మా ప్రభుత్వం రొటేషన్ చేసే పని మాత్రమే చేస్తోంది. గత సీఎం క్యాన్సర్ ఇచ్చిపోయాడు గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి క్యాన్సర్ ఇచ్చి పోయాడు. దీన్ని నయం చేసే ప్రయత్నం చేస్తుంటే పది నెలలకే దిగిపొమ్మంటున్నారు. తల తాకట్టు పెట్టి ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి రోజు వేతనాలు ఇస్తున్నాం. ఉద్యోగులు విపక్షాల మాటలకు ప్రభావితం కావొద్దు. స్టేచర్ ఉందనుకునే నాయకులు స్ట్రెచ్చర్ మీదకు వెళ్ళారు. అక్కడి నుంచి మార్చురీకి కూడా నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లను. నా కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. పనిచేసి జీవిస్తా..’అని సీఎం అన్నారు. అధ్యాపకులు భవిష్యత్తుకు బాటలు వేయాలి ‘ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న వారిలో భావోద్వేగం కన్పిస్తోంది. పరీక్షలు రాసి 12 ఏళ్ళు నిరీక్షించారు. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేమి కాలయాపనకు కారణం. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంపై నేను ప్రత్యేక శ్రద్ధ చూపా. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ప్రభుత్వ నియామకాలు చేపట్టాం. దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా లేదు. గత పాలకుల ఉద్యోగాలు తీసి వేయడం వల్లే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. తెలంగాణ భవిష్యత్కు అధ్యాపకులు బాటలు వేయాలి. అంకిత భావంతో పనిచేయాలి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభు త్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు ప్రతి ఏటా తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు చేరుతున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిజానికి ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్ళలోనే నాణ్యమైన టీచర్లు ఉన్నారు. అయినా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? సర్కారీ స్కూళ్ళల్లో పోటీ తత్వం పెరగాలి. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తాం..’అని రేవంత్ చెప్పారు. ఇంజనీరింగ్లో నాణ్యత ఉండటం లేదు..‘రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. ఇందులో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కోర్సు కోసం ఆరాటపడుతున్నా, వారికి బేసిక్స్ కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యతో పాటు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడా రంగంలో వెనుకబాటును అధిగమించడమే లక్ష్యంగా క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం..’అని సీఎం వివరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
19న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వం 19వ తేదీన (బుధవారం) ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్ 2025–26ను ప్రవేశపెట్టనుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన బుధవారం స్పీకర్ చాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది.ఇందులో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్రెడ్డి, సీపీఐ తరఫున కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సుమారు గంట పాటు సాగిన ఈ భేటీలో.. తాము ప్రతిపాదించిన అంశాలను సభా వ్యవహారాల్లో చేర్చాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభను కనీసం 20 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ కోరింది. మరోవైపు బీఏసీ సమావేశంలో ఖరారు కావాల్సిన ఎజెండాను ముందుగానే బయటికి లీక్ చేశారంటూ హరీశ్రావు వాట్సాప్ సందేశాలను చూపించారు. చివరికి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైతే సమావేశాలను పొడిగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. విడివిడిగా మూడు రోజుల విరామంతో.. బీఏసీ నిర్ణయం ప్రకారం.. గురువారం (13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. 14న హోలీ పండుగ సందర్భంగా విరామం ప్రకటించి, 15న చర్చను కొనసాగిస్తారు. 16న ఆదివారం విరామం. 17న ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరుగుతుంది. అదే రోజున బీసీ రిజర్వేషన్లు, 18న ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాలపై చర్చ జరిగే అవకాశముంది. 19న రాష్ట్ర బడ్జెట్ 2025–26ను ప్రవేశపెడతారు. సభ్యులు బడ్జెట్ను అధ్యయనం చేసేందుకు 20న విరామం ప్రకటించారు. తిరిగి 21 నుంచి 26వ తేదీ వరకు బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులపై చర్చ జరుగుతుంది. 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించిన తర్వాత సమావేశాలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. శాసనసభ తరహాలోనే శాసనమండలి సమావేశాల షెడ్యూల్ను కూడా ఖరారు చేయగా.. అందులో ఈ నెల 22 నుంచి 26 వరకు విరామం ప్రకటించారు. -
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు నందినగర్లోని నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఆయన వెంట పార్టీ నేతలు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి రాగా, ఇంటి వద్ద కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి వాహనంపై గులా బీ పూలు చల్లారు. సభ ప్రారంభానికి అరగంట ముందే అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి, హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగ తం పలికారు. గంగుల కమలాకర్, కేపీ వివేకానంద్, తాతా మధు, నవీన్కుమార్రెడ్డి కేసీఆర్కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాసనసభ లాబీలో తన కు కేటాయించిన చాంబర్లో అరగంట పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ను ఆహ్వానిస్తూ శుభలేఖ అందజేశారు. అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11కి ప్రారంభం కాగా, 5 నిమిషాల ముందే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడగానే అసెంబ్లీ నుంచి కేసీఆర్ తిరిగి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. కేసీఆర్ను కలిసిన మంత్రి తుమ్మల శాసనసభకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఆయన యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కేసీఆర్ కూడా మంత్రి తుమ్మల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
టన్నెల్లో రోబోలతో రెస్క్యూ షురూ
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద స్థలం వద్ద మట్టి, శిథిలాలు, బురద తొలగింపునకు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్వి రోబోటిక్స్కు చెందిన నిపుణులు ఆటోమేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రో బోను సొరంగం లోపలకు తీసుకెళ్లారు. రాళ్లను క్రష్ చేసి తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు మరో రోబో, బురదను తొలగించేందుకు ఒకటి చొప్పున మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఆటో మేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రోబోæ సొరంగంలో పను లు మొదలుపెట్టింది. పూర్తిగా ఉక్కుతో తయారైన ఈ రోబోట్ హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ రోబోకు ముందుభాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్ద రాళ్లు, శిథిలాలను కట్ చేస్తూ ము క్కలుగా చేయడంతోపాటు బురదను వ్యాక్యూమ్ సక్కర్ ద్వారా తొలగించి నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తుంది. గంటకు వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి, బురదను తొలగిస్తుందని చెబుతున్నారు.ప్రమాద స్థలంలో ఏఐ ఆధారిత రోబో సాయంతో తవ్వకాలు, మట్టి తొలగింపు చేపడుతుండగా, 100 మీటర్ల దూరం నుంచి రిమోట్ ఆపరేటింగ్ ద్వారా రోబోలను పర్యవేక్షించనున్నారు. సొరంగం ఇన్లెట్ వద్ద ఉండే మాస్టర్ రోబో మిగతా రోబోలతో కమ్యూనికేట్ చేస్తుంది. ఆల్ఇండియా రోబోటిక్ అసోసియేషన్ ఈ ఆపరేషన్కు సహకారం అందిస్తోంది. చివరి 20 మీటర్ల వద్ద తవ్వకాలు సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న 13.85 కి.మీ. పాయింట్ వద్ద చివరి 20 మీటర్ల స్థలంలో సొరంగం పైకప్పు వదులుగా ఉండటంతో మళ్లీ కూలే అవకాశాలు ఉన్నాయని, అక్కడ పనిచేసే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదకరమని జియోలాజికల్ సర్వే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చివరి 20 మీటర్ల ప్రదేశంలో రోబోల ద్వారా రెస్క్యూ చేపడుతున్నారు. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య ట్రెంచ్ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడే టీబీఎం మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ స్థలంలోనే మిగతా కార్మికులు ఉంటారని భావిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పూర్తిగా మట్టి, శిథిలాలతో కూరుకుపోయి ఉంది. మట్టి, బురద, శిథిలాలను తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. -
సామాన్యులకు స్టార్‘లింక్’ అయ్యేనా!
సాక్షి, హైదరాబాద్: కొండలు, గుట్టలు, అడవులతో కూడిన మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే అంశం ఇప్పుడు మన దేశంలో హాట్టాపిక్గా మారింది. ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్తో చేతులు కలిపినట్టు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వెల్లడించిన మరుసటి రోజే.. అనూహ్యంగా రిలయన్స్ జియో సైతం తెరపైకి వచ్చింది.తాము కూడా స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్లింక్ ఆమోదం పొందాల్సి ఉందని ఎయిర్టెల్, జియో స్పష్టం చేశాయి. భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే గుజరాత్, తమిళనాడులలో బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి శాటిలైట్ టెలికం సేవల కోసం రెడీ అవుతోంది. అటు జియో కూడా దేశంలో రెండు ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ నెలకొల్పి పోటీకి సై అంటోంది. మరింత సమయం తప్పదు దేశంలో శాటిలైట్ టెలికం సేవలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిబంధనలను ప్రకటించలేదు. పైగా టెలికం శాఖ, ట్రాయ్, కేంద్ర హోం శాఖ నుంచి స్టార్లింక్ అనుమతులు పొందాల్సి ఉంది. ఈ సేవలకు సంబంధించి ఉపగ్రహ స్పెక్ట్రమ్ను నేరుగా సంస్థలకు కేటాయించడానికి బదులుగా.. వేలం వేయాలని జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పట్టుబడుతున్నాయి.మరోవైపు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఉన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపుల విధానం అమలు చేయాలని స్టార్లింక్, ప్రాజెక్ట్ కైపర్ వంటివి కోరుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నీ అనుకూలించి శాటిలైట్ టెలికం సేవలు అందుబాటులోకి వస్తే.. ఈ విభాగంలోనూ టారిఫ్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. తొలుత వ్యాపార, వాణిజ్య కస్టమర్లకు.. భారత్లో శాటిలైట్ టెలికం, ఇంటర్నెట్ చార్జీలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. స్టార్లింక్ గేర్ (శాటిలైట్ ఇంటర్నెట్ అందుకోవడానికి కావాల్సిన పరికరాలు) ధర కూడా వెల్లడి కావాల్సి ఉంది. భారత్లో ప్రస్తుతమున్న సంప్రదాయ టెలికం చార్జీలతో పోలిస్తే ఇతర దేశాల్లో స్టార్లింక్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ భారత మార్కెట్కు తగ్గట్టుగా పోటీ ధరలో చార్జీలు అమలు చేసే అవకాశం ఉందని దిగ్గజ టెలికం సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. తొలుత వ్యాపార, వాణిజ్య కస్టమర్ల కోసం సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు. సాధారణ కస్టమర్లకు శాటిలైట్ టెలికం సేవలు చేరడానికి చాలా కాలం పడుతుందన్నారు. విదేశాల్లో చార్జీలు ఇలా.. స్టార్లింక్ యూఎస్ఏలో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. పరికరాల కోసం ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది. » ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది. » రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు. » రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి. » ఇక భూటాన్లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఆఫర్ చేస్తోంది. యూరప్లో స్టార్లింక్ ఇంటర్నెట్ వేగం ఊక్లా నివేదిక ప్రకారం హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది. మనదగ్గర చాలా చవక.. శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్్రస్కిప్షన్ కూడా అందుతుంది. రూటర్కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్పైన ఆధారపడాల్సిందే.స్టార్ లింక్ ప్రత్యేకతలు ఇవీ.. కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000 శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగా వినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది. రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు. -
ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో వెలువరించింది. దీంతో ఇప్పటివరకు 7,257 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి 10,472.723 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాలకు విస్తరిస్తుంది. మొత్తం 1,355 గ్రామాలు, 104 మండలాలు సంస్థ పరిధిలోకి వస్తాయి. మరోవైపు ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిధిలోకి తెచ్చారు. రీజినల్ రింగ్రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టూ 354 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రగతి పరుగులు! అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడం వల్ల ప్రగతి పరుగులు పెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న హైదరాబాద్ నగరాన్ని కోర్ అర్బన్ ప్రాంతంగా పరిగణిస్తూ సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్ఎంసీని విస్తరిస్తారు. ఆ తర్వాత ఔటర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా పరిగణిస్తూ శాటిలైట్ టౌన్షిప్పులు, ఇతర మౌలిక సదుపాయాలతో నగరాన్ని విస్తరించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు తరువాత ఉన్న తెలంగాణను రూరల్ తెలంగాణగా పరిగణించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం కూడా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం త్వరలో అంతర్జాతీయ కన్సల్టెన్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. -
ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక పాలకమండలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)కి ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేస్తూ బుధ వారం జీఓ విడుదల అయ్యింది. పాలకమండలికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అటవీ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, డీటీసీపీ హైదరాబాద్, ఎఫ్సీడీఏ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. 56 రెవెన్యూ గ్రామాలతో పాటు 765.25 చదరపు కిలోమీటర్ల పరిధిలో 12 జోన్లుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను తొలగించి ఎఫ్సీడీఏలో విలీనం చేసింది. ఎఫ్సీడీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలు ఇవే.. ఆమనగల్ మండలంలోని ఖానాపూర్, రామనూతలతో పాటు ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్, పోచారం, రామిరెడ్డిగూడ, తులేకలాన్, తుర్కగూడ, ఎలిమినేడు, ఎర్రకుంట, తడ్లకాల్వ రెవెన్యూ గ్రామాలు.. కడ్తాల్ మండలం చెరికొండపట్టి కల్వకుర్తి, చెరికొండపట్టి పడకల్, ఏక్రాజ్గూడ, కడ్తాల్, కర్కల్ పహాడ్, ముద్విన్.. కందుకూరు మండలం దాసర్లపల్లె, అన్నోజిగూడ, దెబ్బగూడ, గూడూరు, గుమ్మడవెళ్లి, కందుకూరు, కొత్తూరు, గపూర్నగర్, లేమూర్, మాదాపూర్, మీర్ఖాన్పేట్, మొహ్మద్నగర్, ముచ్చర్ల, పంజాగూడ, రాచలూరు, సర్వార్లపల్లి, తిమ్మాయిపల్లె, తిమ్మాపూర్.. మహేశ్వరం మండలం తుమ్మలూరు, మంచాల మండలంలోని ఆగపల్లే, నోముల, మల్లికార్జునగూడ గ్రామాలను.. యాచారం మండలం చౌదరిపల్లె, గున్గల్, కొత్తపల్లె, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కాజ్గూడ, మొగుళ్లవంపు, నక్కర్తి, నానక్నగర్, నందివనపర్తి, నస్తిక్సింగారం, తక్కెళ్లపల్లి, తాటిపర్తి, తులేకుర్దు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి గ్రామాలను ఈ అథారిటీలో కలిపారు. ఇటీవలి వరకు ఎకరం రూ.2 కోట్లు పలికిన భూముల ధరలు ప్రస్తుత నిర్ణయంతో రెట్టింపయ్యాయి. -
దేశానికి దిక్సూచి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ కేవలం పురోగమించడమే కాకుండా రూపాంతరం చెందుతోంది. సమ్మిళితత్వం, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ అనే విజన్.. సాహసోపేత సంస్కరణలు, ప్రజా కేంద్రీకృత సుపరిపాలన, నిర్ణయాత్మక నాయకత్వంతో సాకారమవుతోంది. అన్ని వర్గాల సంక్షేమానికి, సుస్థిర పురోగతికి ప్రభుత్వం బాటలు వేస్తోంది సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచి అయ్యే తెలంగాణ నిర్మాణానికి సంఘటితంగా, విశ్వాసంతో, స్థిరమైన నిబద్ధతతో అందరం కలిసి ముందుకు సాగుదాం..’ అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు, లక్ష్యాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. గవర్నర్ మాట్లాడుతున్నంతసేపు ప్రధాన ప్రతిపక్ష సభ్యులు నిరసన నినాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చేయి చూపటం ద్వారా పలుమార్లు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు గవర్నర్ కీలకాంశాలను ప్రస్తావించినప్పుడల్లా..అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించారు. గవర్నర్ 35 నిమిషాల పాటు ఆంగ్లంలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కలలుగన్న దిశలో పురోగమించేందుకు అవసరమైన అవకాశాలను కల్పించే నిబద్ధతకు అద్దం పట్టేదిగా ఈ బడ్జెట్ సమావేశం ఉండనుంది. తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం. మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు వారి కృషే కీలకం. అలాంటి రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలుత హామీ ఇచ్చినట్టుగా రూ.2 లక్షలు చొప్పున పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.20,616.89 కోట్ల మొత్తంతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని వ్యవసాయ కార్మీకులకు ఎన్నడూ లేని విధంగా సహాయం చేస్తూ ఏడాదికి రూ.12 వేలను సమకూరుస్తోంది. 566 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. 260 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది. సన్న రకం వరి ధాన్యానికి కింటాల్కు రూ.500ల బోనస్ చొప్పున రూ.1,206.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది..’ అని గవర్నర్ చెప్పారు. గేమ్ ఛేంజర్గా మహాలక్ష్మి పథకం ‘బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్గా మారింది. ఇప్పటివరకు మహిళలకు రూ.5,005.95 కోట్లు ఆదా చేసింది. ఇటీవలే ఆమోదించిన ఇందిరా మహిళాశక్తి మిషన్ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయ లక్ష్యంతో లక్షమంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తయారు చేస్తోంది. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తోంది. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్ అందిస్తోంది. మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులను కేటాయించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదిలో 55 వేల మంది ప్రభుత్వోద్యోగాలు పొందారు. ఇది ఎన్నడూ సాధించని విజయం. ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడానికి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సమీకృత గురుకులాల ప్రారంభంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది. పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను ఏర్పాటు చేస్తోంది..’ అని గవర్నర్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు, ఎస్సీ వర్గీకరణకు బిల్లులు ‘రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సాహసోపేత మార్పు దిశగా ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయాన్ని అందించే దిశగా వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. అత్యంత అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ కులాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత న్యాయోచితంగా, సమతుల్యంగా అందించడమే దీని ఉద్దేశం..’ అని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. దావోస్లో ‘తెలంగాణ రైజింగ్’ ‘దావోస్లో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ 49,500 మందికి ఉద్యోగాలను కల్పించేలా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగేలా పర్యాటక రంగాన్ని ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేయనుంది. ఇందుకు ప్రత్యేక పర్యాటక విధానాన్ని సిద్ధం చేసింది. భూ పరిపాలనను క్రమబదీ్ధకరించడానికి, పౌరులందరికీ భూ భద్రతను కల్పించడానికి, భూ వివాదాలను తగ్గించడానికి, భూ రికార్డులలో పారదర్శకతను పెంపొందించడానికి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. సుస్థిర ప్రపంచ శ్రేణి నగర నిర్మాణం కోసం ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది..’ అని గవర్నర్ చెప్పారు. ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ‘బడ్జెట్ కేవలం అంకెల కూర్పు కాదు. ప్రభుత్వ భవిష్యత్తు ప్రాధాన్యతలు, విజన్కు ప్రతిబింబం. మన పాలసీలను, కార్యక్రమాలను, సంక్షేమ చర్యలను తెలియజేసే ఒక ఆర్థిక నమూనా. కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ, ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉంటాయని గుర్తించాలి. యువ, డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢమైంది. ప్రవేశపెట్టిన ప్రతి పాలసీ, ప్రతి కార్యక్రమం, ప్రతి సంస్కరణ ప్రజల సాధికారతకు, సమ్మిళిత వృద్ధి కోసం ఉద్దేశించిందే. ప్రస్తుత తెలంగాణ అవకాశాలు, అభివృద్ధి, సాధికారతగల రాష్ట్రంగా ఉంది. రేపటి తెలంగాణ మరింత ఉజ్వలంగా, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞాన వినూత్నత, సామాజిక న్యాయంలో అగ్రగామిగా నిలవబోతోంది. డాక్టర్ అబ్దుల్ కలామ్ అన్నట్లు ‘‘కలలు కనండి, కలలు ఆలోచనలుగా మారుతాయి, ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి’’. ప్రజల కలలను ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది, విజన్, సంకల్పం, కార్యాచరణ ద్వారా వాటిని వాస్తవాలుగా మారుస్తుంది..’ అని గవర్నర్ చెప్పారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయడాన్ని, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. -
Wine Shops Closed : వైన్షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
సాక్షి,హైదరాబాద్ : మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 14న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి.ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచలను జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా హోలీ షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, బహింగంగా ప్రదేశాల్లో వాహనదారులపై కలర్స్ వేసి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. -
రాజకీయ పార్టీలకు భట్టి,జనారెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. ప్రతి పార్టీని ఆహ్వానిస్తామని తెలిపారు.జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని.. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలని భట్టి విక్రమార్క, జానారెడ్డిలు సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని.. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా వారు స్పష్టం చేశారు. -
Cases against KTR : తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr), ఎమ్మెల్యే ముఠా గోపాల్కు హైకోర్టు ఊరట దక్కింది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది.అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా బాణసంచా కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ ఫిర్యాదులందాయి. ఆ ఫిర్యాదులపై కేటీఆర్,ముఠా గోపాల్పై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ కేసును కొట్టివేశారు. -
తొలిసారి కాదు .. రెండో సారి ఎన్నికల్లో గెలవడం గొప్ప .. సీఎల్పీలో రేవంత్
సాక్షి,హైదరాబాద్ : ‘మొదటి సారి ఎన్నికల్లో గెలవడం గొప్పకాదు.. రెండో సారి గెలవడం గొప్ప’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టీవ్గా. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా. వచ్చే నెల 6 నుండి జిల్లాల వారిగా జిల్లా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు,ఎంపీలు ,ఇతర ప్రజాప్రతినిధులతో లంచ్ మీటింగ్లు పెట్టుకుందాం. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై చర్చిద్దాం. మంత్రుల నియోజవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి అనే భావన చాలా మందిలో ఉంది. ఈ బడ్జెట్ సమావేశం లో అలా జరగదు.ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తాం.మొదటి సారి గెలవడం పెద్ద విషయం కాదు.రెండవసారి గెలవడం గొప్ప విషయం.మంత్రులు తప్పనిసరిగా హౌస్లో ఉండాలి.మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదు’అని సూచించారు. -
సీఎల్పీలో ఎమ్మెల్యేకి సీఎం రేవంత్ క్లాస్!
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడే సమయంలో మీరు మధ్యలో వెళ్లిపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. ఇంతకి సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభలో ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి భయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. అనంతరం, తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో మేం చేసిన డిమాండ్స్ ఇవే
సాక్షి,హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు తరలిస్తుంటే రేవంత్ సర్కార్ చోద్యంగా చూస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించాలని తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం (BAC Meeting)లో డిమాండ్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ (Telangana Assembly Speaker) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. అనంతరం హరీష్ రావు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు.. అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవటంపై అభ్యంతరం తెలిపాం ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా స్పీకర్ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తాం. సంఖ్యా బలాన్ని బట్టి బీఆర్ఎస్కు సభలో సమయం ఇవ్వాలని కోరాం. తమ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు. రైతాంగ సమస్యలు, తాగు సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరామని.. వివిధ (సుంఖిశాల,పెద్దవాగు కొట్టుకుపోవడం,ఎస్ ఎల్ బీసీ ప్రమాదం) ప్రాజక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేమన్నారు. మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరామన్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. నదీ జలాల వినియోగంలో విఫలం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఏసీలో చెప్పామన్నారు. ఏపీ నీళ్ళు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. బిల్లులు చెల్లింపుకు 20 శాతం కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటం చర్చించాలని, బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలని కోరినట్లు చెప్పారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ జరపాలని డిమాండ్ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలిన పిల్లర్ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని బీఏసీలో చెప్పామన్నారు. నిరుద్యోగభృతి, జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీలో కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు. -
వంటగదిలో ఈగలు, బొద్దింకలు.. ‘నారాయణ’ సెంట్రల్ కిచెన్లో తనిఖీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్లో తనిఖీలు చేశారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయాలను వాడుతున్నట్లు గుర్తించారు. తప్పుపట్టిన కత్తులతో సిబ్బంది.. కూరగాయలను కట్ చేస్తున్నారు.కిచెన్లో ఈగలు, బొద్దింకలను అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే సిబ్బంది.. ఫుడ్ను నారాయణ హాస్టల్కు సరఫరా చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. -
ఎస్సైకి గ్రూప్–1 ఉద్యోగం
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్గౌడ్ గ్రూప్–1కు ఎంపికయ్యారు. ఇటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే.. అటు గ్రూప్స్కు సిద్ధమయ్యారు. సోమవారం విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో మాధవ్గౌడ్ 505 మార్కులు సాధించారు. మెరిట్ మేరకు ఆయనకు డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మాధవ్గౌడ్ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్పూర్. తండ్రి మొగిలి పోస్టల్ ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. 2019 ఎస్సై బ్యాచ్కు చెందిన ఆయన వరంగల్ కమిషనరేట్ పరిధి జఫర్గడ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల బదిలీపై కేయూ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ప్రస్తుతం భీమారంలోని సత్యసాయికాలనీ–5లో భార్యాపిల్లలతో ఉంటున్నారు.గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానంశాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్ృ1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్ృ1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు. -
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ గరం వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో(Governor Budget Speech) కొత్త విషయాలేవీ లేవని.. మరోసారి అబద్ధాలే చెప్పించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) గరం అయ్యారు. బుధవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.గత 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలను అంగీకరిస్తారేమోనని అసెంబ్లీకి వచ్చాం. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదు. గాంధీ భవన్ ప్రెస్మీట్లా ఉంది. రైతు సమస్యలతో పాటు దేనని ప్రస్తావించలేదు. గవర్నర్తో అన్నీ అబద్ధాలే చెప్పించారు. తద్వారా గవర్నర్ హోదాను దిగజార్చింది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో 400 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు బాధ పడుతున్నారు. కానీ, రైతు సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదు. సాగునీటి తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటిదాకా 30 శాతం మించి రుణమాఫీ జరగలేదు. సాగు నీటి సంక్షోభం నెలకొన్నది. కేసీఆర్(KCR)పై కోపంతో మేడిగడ్డకు మరమత్తులు చేయించడం లేదు. 20% కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది.... గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అప్పులు చేశారంటూ గుండె బాదుకున్న సన్నాసులు.. ఏడాదిలోనే 1లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు. ఈ అంశం గవర్నరు ప్రసంగం లో లేదు. ఏడాదిలోనే వరి ధాన్యం పండించామని దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకున్నారు. సిగ్గులేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. గ్రామాలకు వెళ్తే తరిమి కొడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. -
Ameerpet: అరిష్టాలు తొలగిపోతాయని ఆలయంలో చోరీ
హైదరాబాద్: అరిష్టాలు తొలగిపోతాయని గుడిలో పంచలోహ విగ్రహాలు దొంగిలించిన ఇద్దరు మహిళలను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దొంగతనం చేసిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎస్ఆర్నగర్ సమీపంలోని గురుమూర్తినగర్లో శ్రీ వినాయక ఆలయం గర్భగుడిలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు కనిపించడం లేదంటూ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శనివారం భక్తుల రూపంలో వచ్చిన మహిళలు తమ మాయమాటలతో అర్చకుడిని బోల్తా కొట్టించి విగ్రహాలు ఎత్తుకుళ్లినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్కు చెందిన స్వర్ణలత, పావని అనే మహిళలు ఆలయానికి వచ్చిన..అర్చకుడు నవీన్కుమార్ తీర్థ ప్రసాదాలు పంచి పెడుతుండగా అదును చూసి విగ్రహాలను ఓ సంచిలో వేసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత అర్చకుడిని విగ్రహాలు కనిపించక పోవడంతో అధికారులకు సమాచారం అందించారు. గడిచిన రెండేళ్ల కాలంలో స్వర్ణలతో ఇంట్లో వరుసగా నలుగురు మరణించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు చనిపోవడంతో అరిష్టం వల్లే మృతి చెందారని భావించింది. నిత్యం పూజలందుకునే మహిమాని్వతులైన దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని, సకల శుభాలు జరుగుతాయని నమ్మింది. పావనికి విషయాన్ని చెప్పి పథకం ప్రకారం ఇద్దరు విగ్రహాలను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించారు. వారిద్దరికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. విగ్రహాలను స్వా«దీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
మొత్తం చినబాబే చేశారు! రెడ్బుక్ ఎఫెక్ట్తో అంతా..
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Hyderabad: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం..
సాక్షి, హైదరాబాద్: ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్కు(Elevated corridor) ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority of India) నుంచి తాజాగా అనుమతి లభించనుంది. ప్యారడైజ్(Paradise) నుంచి డెయిరీఫామ్(Dairy farm) వరకు 5.4 కిలోమీటర్ల కారిడార్ మార్గంలో బేగంపేట్ విమానాశ్రయం(Begumpet Airport) వద్ద సుమారు 600 మీటర్ల పొడవుతో సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్కు ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఎయిర్పోర్ట్ అథారిటి నుంచి అనుమతి లభించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించనుంది. డెయిరీఫామ్ ఎలివేటెడ్ ప్రత్యేకతలు.. ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్, తాడ్బండ్, బోయిన్పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. భూసేకరణ కోసం అయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,550 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు వల్ల నగరానికి ఉత్తరం వైపు వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రస్తుతం సుచిత్ర నుంచి మేడ్చల్ రూట్లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డెయిరీఫామ్ ఎలివేటెడ్ అందుబాటులోకి వస్తే జంక్షన్ రహితమైన, సిగ్నల్ర హితమైన, నిరాటంకమైన వాహనాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి. ⇒ ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు మొత్తం 5.4 కిలోమీటర్ల కారిడార్లో 3.05 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ⇒ బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద 600 మీటర్ల అండర్గ్రౌండ్ టన్నెల్ను నిర్మిస్తారు. ⇒ మొత్తం ఎలివేటెడ్ కారిడార్ 27 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో 25 మీటర్లు క్యారేజ్వే, 2 మీటర్లు మీడియన్ ఉంటుంది. రెండు వైపులా క్రాష్ బారియర్స్ను ఏర్పాటు చేస్తారు. ⇒ బోయిన్పల్లి జంక్షన్ వద్ద రెండు వైపులా 248 మీటర్ల నుంచి 475 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ప్రవేశ, నిష్క్రమణ ర్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వాహనాలు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ⇒ తాడ్బండ్ జంక్షన్ వద్ద మలుపులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో 600 మీటర్ల టన్నెల్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. జియోమెట్రిక్ ప్రత్యేకతలతో టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ టన్నెల్ వల్ల వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది. 44వ జాతీయ రహదారి మార్గంలోనే కాకుండా కారిడార్కు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో కూడా వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. శామీర్పేట్ కారిడార్ ఇలా.. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్రింగ్ రోడ్డు వరకు సుమారు 18.10 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సైతం హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. తిరుమలగిరి, అల్వాల్ మార్గంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం సుమారు 197 ఎకరాల భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,232 కోట్లు అవుతుందని అంచనా. ఈ రూట్లో రక్షణ శాఖ నుంచి, హకీంపేట్ వద్ద ఎయిర్ఫోర్స్ నుంచి అనుమతి లభించాల్సి ఉందని పేర్కొన్నారు. శామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్లో ఎయిర్ఫోర్స్ అనుమతి కీలకం కానుంది. ఈ అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు? -
ఈనెల 19న బడ్జెట్.. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ
Assembly Session Updates..👉బీఏసీ సమావేశం ముగిసింది.. 👉ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం. 👉19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క👉హోలీ రోజున, ఆదివారం అసెంబ్లీకి సెలవు. గవర్నర్ను అబద్దాల ప్రచారానికి వాడుకున్నారు: హరీష్గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ప్రకటనగవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదుగవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదుసీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదుప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్దాలు, అవాస్తవాలుఏడాదిన్నర పాలన వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్రసంగంఅబద్దాల ప్రచారానికి గవర్నర్ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది.గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు.👉 స్పీకర్ ఛాంబర్లో ప్రారంభమైన BAC సమావేశం. బీఆర్ఎస్ నుంచి సమావేశానికి హాజరైన హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిముగిసిన ప్రసంగం.. 👉తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసింది. 👉36 నిమిషాలకు పాటు సాగిన గవర్నర్ ప్రసంగం👉జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించిన గవర్నర్ 👉తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.👉ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు..తెలంగాణలో రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై గవర్నర్ ప్రసంగం..రుణమాఫీ జరిగింది, రైతులకు బోనస్ లభించింది అంటూ గవర్నర్ ప్రసంగంఆరు గ్యారెంటీల అమలు జరిగింది, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు అమలు అంటూ గవర్నర్ ప్రసంగం.కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులు.గవర్నర్ తో అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ నిరసన 👉అసెంబ్లీకి ముఖ్యమంత్రి రేవంత్ సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..👉బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ వద్ద కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.👉అసెంబ్లీ లాబీలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన పఠాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తన తమ్ముడి కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చిన మహిపాల్ రెడ్డి. పెళ్లికి రావాలనిక కేసీఆర్ను కోరిన ఎమ్మెల్యే, 👉మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు.👉రెండో రోజు(13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.👉మూడో రోజు(14న) హోలీ నేపథ్యంలో సభకు సెలవు ఉంటుందని తెలుస్తోంది. తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకూ సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు తీర్మానాలు ఉంటాయని సమాచారం. స్థానిక సంస్థల్లో, విద్య-ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి వేర్వేరు బిల్లులకు ఆమోదం తెలపనుంది.👉అనంతరం, ఈ నెల 18 లేదా 19న 2025-26 రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు ఉంటుంది. అనధికార సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28 వరకు సభ జరగవచ్చని తెలుస్తోంది. బీఏసీలో నిర్ణయం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
కాంగ్రెస్ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్.. రేవంత్పై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను నియంతల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు.సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 12 మంది పోలీసులు మఫ్టీలో ఆమె ఇంటికి వెళ్లి రేవతిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. ఇదే సమయంలో రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ను పోలీసులు సీజ్ చేశారు. అయితే, రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక, జర్నలిస్ట్ రేవతి అరెస్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్..‘రేవతి అరెస్ట్ను ఖండిస్తున్నాం. తెల్లవారుజామునే రేవతి గారి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తన పైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ అరెస్టు చేయడం దారుణం.ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చిండు. చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా?. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలి. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట. అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలి’ అని ఘాటు విమర్శలు చేశారు. సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఖండిస్తున్నాను. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. @revathitweets పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ను అరెస్టు చేయడం దారుణం. ఒక రైతు… pic.twitter.com/4mXy8LufOo— KTR (@KTRBRS) March 12, 2025మరోవైపు.. జర్నలిస్ట్ రేవతి అరెస్ట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. ఈ సందర్బంగా కవిత ట్విట్టర్ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు. జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు..జర్నలిస్టు రేవతి @revathitweets గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 12, 2025 -
ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతా
కరీంనగర్(రామగుండం): తనతో చనువుగా ఉన్న ఆమె ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతానని, లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బిహార్కు చెందిన వలసకూలీ గేదెం అజయ్ భీష్మించుకు కూర్చున్నాడు. మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్కిరణ్, ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు మైక్సెట్ ద్వారా యువకుడిని సంప్రదించగా.. కొద్దిరోజులుగా ఆ యువతి తనతో మాట్లాడడం లేదన్నారు. స్పందించిన పోలీసులు యువతిని ఘటనా స్థలానికి తీసుకొచ్చి మైక్లో మాట్లాడించగా, అజయ్ టవర్ దిగాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. అజయ్ తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి సదరు యువతిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి మాట్లాడించడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి. -
ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య అరెస్ట్
నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్పురాలో నివాసముంటున్న మహ్మద్ ఖలీల్ నల్లగొండ మండలం చర్లగౌరారం జెడ్పీహెచ్ఎస్లో అటెండర్గా పనిచేస్తున్నాడు.అతడికి 2007లో అక్సర్ జహతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఖలీల్ చేస్తున్న అటెండర్ ఉద్యోగం తనకు లేదా పిల్లలకు ఇవ్వాలని అతడిని భార్య అక్సర్ జహ వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఖలీల్ అనారోగ్యంతో ఇంట్లో పడిపోయాడని చుట్టుపక్కల వారిని అక్సర్ జహ నమ్మించి, ఆటోలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఖలీల్కు ఎటువంటి వైద్యం చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చింది. అదే రోజు రాత్రి ఖలీల్ మృతిచెందాడు.మరుసటిరోజు ఖలీల్ తల్లి అహ్మది బేగం తన కుమారుడి మృతికి కోడలే కారణమంటూ నల్లగొండ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్లో మృతుడి తలపై మారణాయుధాలతో కొట్టడంతో పాటు ముక్కు, నోటిని బలవంతంగా మూయడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ‘లే నాన్న.. అమ్మా.. చెల్లి వచ్చాం.. ఒక్కసారి చూడండి నాన్న.. మీరే మా ధైర్యం.. ఇలా వెళ్లి పోతే ఎలా.. మీకు ఎన్ని గాయాలు అయ్యాయి.. నాన్న పడిపోతుంటే.. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు..!! అంటూ.. సిరిసిల్లలో ప్రమాదవ శాత్తు మృతిచెందిన 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం(61)(Police Commandant Gangaram) కూతురు డాక్టర్ గౌతమి కన్నీరు కార్చుతూ విలవిలాడిపోయారు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావునగర్లో రమేశ్ ఇంట్లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అద్దెకు ఉంటారు. చంద్రశేఖర్రెడ్డి కూతురు ఇటీవల మరణించారు. అతన్ని ఓదార్చేందుకు వారి ఇంటికి వెళ్లిన తోట గంగారాం తిరిగి వస్తుండగా.. లోపల లిఫ్ట్ లేకుండానే గేటు ఓపెన్ కావడంతో అందులో ప్రమాదశాత్తు పడిపోయాడు. మూడో అంతస్తు నుంచి గంగారాం పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తాళ్ల సాయంతో గంగారాంను బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఫ్ట్ నిర్వహణ లోపమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేటకు చెందిన లిఫ్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోలీస్ బెటాలియన్లో..సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్లో కమాండెంట్ మృతదేహాన్ని ఉంచి పలువురు నివాళులు అర్పించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా బెటాలియన్కు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు రాత్రి ఎస్పీ గిటే మహేశ్ బాబా సాహేబ్, ఏఎస్పీ చంద్రయ్య గంగారాం మృతదేహాన్ని పరిశీలించి నివాలి అర్పించారు. గతంలో హైదరాబాద్ సచివాలయం ఛీప్ సెక్యూరిటీ ఆఫీస్(సీఎస్వో) గా గంగారాం పని చేశారని, ఆయన మృతిపట్ల సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్కుమార్ పోలీస్ కమాండెంట్ మృతిపై సంతాపం ప్రకటించారు. బెటాలియన్ పోలీస్ సిబ్బంది కన్నీటి నివాళి మధ్య గంగారాం మృతదేహాన్ని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులంకు తరలించారు. -
నేటి నుంచి ఆన్లైన్లో ‘నవమి’ టికెట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభి షేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణానికి ఉభయదాతల టికెట్లు రూ.7,500, సెక్టార్ల టికెట్లు రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150, పట్టాభిషేక మహోత్సవానికి రూ.1,500, రూ.500, రూ.100 టికెట్లను ఆన్లైన్లో ఉంచామని వివరించారు.ఉత్సవాలకు రాలేని భక్తుల గోత్రనామాలతో కల్యాణం జరిపించే సేవల కోసం రూ.5,000, రూ.1,116 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వారు ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేవస్థానం సమీపంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి టికెట్లు పొందాలని సూచించారు. నేరుగా విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు.. ఈనెల 20వ తేదీ నుంచి భద్రాచలంలో నేరుగా సెక్టార్ టికెట్లు విక్రయించనున్నారు. రామాలయం వద్ద మెయిన్ కౌంటర్, తానీషా కల్యాణ మండపం, సీఆర్వో కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసు వద్ద వచ్చే నెల 1 నుంచి కౌంటర్ అందుబాటులో ఉంటుంది. -
గ్రూప్–2 టాపర్ హరవర్ధన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో నారు వెంకట హరవర్ధన్రెడ్డి నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. మొత్తం 600 మార్కులకుగాను అతడు 447.008 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. గ్రూప్–2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. జీఆర్ఎల్ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మంగళవారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది. సభ్యులు అమీర్ఉల్లా ఖాన్, ప్రొఫెసర్ యాదయ్య, యం.రామ్మోహనరావు, పాల్వాయి రజిని సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్–2 జీఆర్ఎల్, ఫైనల్ కీ విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ స్కాన్డ్ కాపీలను కూడా వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచారు. కాగా, టాప్ 31 ర్యాంకుల్లో మహిళలు ఎవరూ లేకపోవటం గమనార్హం. 13 వేలమంది అనర్హత గ్రూప్–2 సర్వీసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 29 డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు... దాదాపు నెలరోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. 5,51,855 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు మూడుసార్లు వాయిదా పడ్డ ఈ పరీక్షలు ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగాయి. 33 జిల్లాల్లోని 1,368 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే మొత్తం నాలుగు పేపర్లు రాశారు. తాజాగా 2,36,649 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఫైనల్ కీలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. వివిధ కారణాలతో 13,315 మంది అభ్యర్థులు అనర్హతకు గురయ్యారు. టాపర్ కోదాడ వాసి గ్రూప్–2 పరీక్షల్లో టాపర్గా నిలిచిన నారు వెంకట హరవర్ధన్రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఈయన తండ్రి రవణారెడ్డి కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. హరవర్ధన్ ఇటీవలే గ్రూప్–4లో మంచి ర్యాంకు సాధించి ఇంటర్బోర్డులో ఉద్యోగం పొందాడు. వీరిది ఆంధ్రప్రదేశ్ కాగా తండ్రి ఉద్యోగ రీత్యా ఖమ్మంలో స్థిరపడ్డారు. గత సంవత్సరమే రవణారెడ్డి కోదాడ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా బదిలీపై వచ్చారు. ఐఏఎస్ సాధించి తీరుతా సిద్దిపేట జోన్: రెండుసార్లు యూపీపీఎస్సీ పరీక్షలు రాసినప్పటికీ అర్హత సాధించలేక పోయా. అయినప్పటికీ ఎప్పటికైనా ఐఏఎస్ సాధిస్తా. గ్రూప్ – 2 రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు రావటం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు వడ్లకొండ శ్రీనివాస్రెడ్డి, సుజాత ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైంది. నా ప్రాథమిక విద్య సిద్దిపేటలోనే పూర్తిచేశా. హైదరాబాద్లో ఇంటర్, ఇంజనీరింగ్ ఢిల్లీలో పూర్తి చేశాను. రెండేళ్లు ఐటీ ఉద్యోగం చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివి గ్రూప్ –2లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాను. – సచిన్రెడ్డి, 2వ ర్యాంకర్, సిద్దిపేటసంతోషంగా ఉంది.. కొల్చారం(నర్సాపూర్): గ్రూప్–2లో మూడో ర్యాంకు రావటం ఆనందంగా ఉంది. ఇటీవల వెలువడిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లోనూ ఎకనామిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. –బి.మనోహర్ రావు, 3వ ర్యాంకర్. అంసాన్పల్లి, కొల్చారం మండలం, మెదక్ జిల్లాకోచింగ్ లేకుండానే సాధించా పెన్పహాడ్: ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే స్వశక్తితో గ్రూప్–2 పరీక్షలకు సన్నద్ధమయ్యాను. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉంది. పెన్పహాడ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. కోదాడ క్రాంతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, కోదాడ అనురాగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాను. 2014లో వీఆర్వో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం అనంతగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. మున్సిపల్ కమిషనర్గా చేయాలనే ఆలోచనతో ఉత్తమ ర్యాంకు సాధించాను. నా తమ్ముడు శ్రీరామ్ నవీన్ కూడా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–2లో 326వ ర్యాంకు సాధించాడు. – శ్రీరామ్ మధు, 4వ ర్యాంకర్, మహ్మదాపురం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లారోజుకు 15 గంటలు చదివాను తలమడుగు: గ్రూప్–2లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రోజుకు 12 గంటల నుంచి 15 గంటలు చదివాను. నా విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఒక లక్ష్యంతో చదివితే కచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. చింతలపల్లి ప్రీతమ్రెడ్డి, 5వ ర్యాంకర్. కజ్జర్ల, తలమడుగు మండలం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నా తల్లిదండ్రులే స్ఫూర్తి లక్సెట్టిపేట: మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు గొడ్డటి కిష్టయ్య, దేవక్క ఎంతో కష్టపడి నన్ను చదివించారు. గ్రూప్–2లో ఏడో ర్యాంకు సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవల గ్రూప్–4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి మంచిర్యాల కలెక్టరేట్లో పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2కు సన్నద్ధమయ్యాను. – గొడ్డటి అశోక్, 7వ ర్యాంకర్, మంచిర్యాల జిల్లా, గంపలపల్లి గ్రామం ఉన్నత స్థానానికి ఎదగడమే లక్ష్యం డోర్నకల్: సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఉన్నత స్థానానికి ఎదగడమే లక్ష్యంగా చదివాను. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. వాళ్లు కష్టపడి నన్ను చదివించడం, అన్నయ్య కానిస్టేబుల్ ఉద్యోగం సాధించటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. ఇటీవల మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాను. గ్రూప్–2 కోసం తీవ్రంగా కృషి చేశా. – మేకల ఉపేందర్, 9వ ర్యాంకర్, ముల్కలపల్లి, డోర్నకల్, మహబూబాబాద్. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. సివిల్స్కు సిద్ధ్దమవుతున్నాను. బీహెచ్ఎంఎస్ పూర్తి కాగానే పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. అమ్మానాన్నల పోత్సాహంతో మూడేళ్లుగా ఇంట్లోనే యూట్యూబ్లో పాఠాలు వీక్షిస్తూ గ్రూప్స్కు సిద్ధమయ్యాను. సీడీపీఓ పరీక్షల్లో కూడా టాపర్గా నిలిచాను. గ్రూప్–1లో మంచి మార్కులు సాధించాను. సివిల్స్ సాధించి పేదలకు సేవలందించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. –డాక్టర్ వినీషా రెడ్డి, 32వ ర్యాంకర్, హైదరాబాద్.గ్రూప్–2కే ప్రాధాన్యం పాపన్నపేట(మెదక్): గ్రూప్–2లో రాష్ట్ర స్థాయిలో 41వ ర్యాంకు సాధించాను. గ్రూప్–1 ఫలితాల్లో కూడా 401 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం కొల్చారం గురుకుల పాఠశాలలో పీజీటీ (గణితం)గా పని చేస్తున్నాను. గ్రూప్–1లో ఎంపీడీఓ పోస్టు రావచ్చు. అయితే గ్రూప్–2కే ప్రాధాన్యత ఇస్తాను. –బాయికాడి సుష్మిత, 41వ ర్యాంకర్, అబ్లాపూర్, పాపన్నపేట మండలం, మెదక్ జిల్లాభర్త ప్రోత్సాహంతోనే.. తలమడుగు: నా భర్త నిమ్మల సాత్విక్రెడ్డి ప్రోత్సాహంతోనే గ్రూప్–2లో మంచి ర్యాంకు సాధించాను. మొదటిసారి పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాను. తర్వాత అటవీ శాఖలో బీట్ ఆఫీసర్గా, మూడోసారి కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగాలు సాధించాను. – నిమ్మల తేజశ్రీరెడ్డి, 190వ ర్యాంకర్. సుంకిడి, తలమడుగు మండలం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా