breaking news
Telangana
-
రాళ్ల దాడి కేసు.. బాల్క సుమన్ అరెస్టు
సాక్షి,మంచిర్యాల జిల్లా: క్యాతన పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలి వచ్చారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటిగేటును బలవంతంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల రాకపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాల్క సుమన్ ఇంటి గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్ ఇంటి గేట్లను బలవంతంగా ఓపెన్ చేశారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల్క సుమన్ను అరెస్టు చేశారు. సుమన్ను విడుదల చేయాలి: హరీశ్రావుమాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. బాల్క సుమన్ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. -
సీఎం కప్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం
సీఎం కప్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20న హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాల అభివృద్ధి, మత్స్య, యువజన సేవలు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి , క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ డాక్టర్ సోనిబాలా దేవి కలిసి ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వానం అందజేశారు.సీఎం కప్GAMES (Grievance And Monitoring for Excellence in Sports) పేరుతో ఏజెంటిక్ ఏఐ కాల్ సెంటర్ కార్యక్రమం మరియు ‘నిలమణి’ అనే మొబైల్ యాప్ను సచివాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రి వి. శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ డాక్టర్ సోని బాలాదేవి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలను బలోపేతం చేయడం మరియు గ్రామీణ స్థాయిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎంకప్ను నిర్వహించడం తెలంగాణ క్రీడాశాఖ యొక్క ప్రశంసనీయమైన ప్రయత్నమని అన్నారు. యువత, విద్యార్థులు ఇతర అసామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 4.6 లక్షల క్రీడాకారులు నమోదు చేసుకున్నారని, వారిలో 22,000 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ఇక పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సమయానుకూల సమాచారం మరియు నవీకరణలు అందించేందుకు “సీఎం కప్ గేమ్స్”లో నిలమణి మొబైల్ యాప్ను ఏఐ ఆధారిత కాల్ సెంటర్తో అనుసంధానం చేసి 24/7 సమాచారం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 12 జిల్లాల్లో 44 క్రీడా విభాగాలను కలిగి ఉన్న ఈ పోటీలు ఘన విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఈ క్రీడలు ఉత్తమ చాంపియన్లను తయారు చేస్తాయని ఆయన ఆశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, ఇతర గౌరవ అతిథులు పాల్గొన్నారు. -
గూడెం ఏ పార్టీలో ఉన్నారో ఆయనే చెప్పారు: మహేష్ కుమార్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదన్నారు. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలే నిరూపించాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేపటి మీటింగ్ అన్ని రాష్ట్రాలపై ఏఐసీసీ సమీక్ష జరుగుతుంది. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష అయిపోయింది. పార్టీ నిర్మాణం, సంక్షేమంపై చర్చ జరగనుంది. చిత్త శుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. 67 శాతం బీసీ వార్డు మెంబర్లు గెలిచారు. 87.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది.ఇక్కడ జీవన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీట్లు సర్వేల ఆధారంగా మున్సిపల్ చైర్మెన్ కౌన్సిలర్ల ఆధారంగా ఎంపిక జరిగింది. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదు. 94 మున్సిపాలిటీలు గెలిచామంటే అభివృద్ది, సంక్షేమం పట్ల ప్రజలకు సానుకూలతే నిదర్శనం. నిజామాబాద్లో ఐదు సీట్లలో ఏంఐఏం అభ్యర్థుల మీద గెలిచాం. మేయర్ వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్లు ఆ దిశగా ఆలోచించారు. ఈనెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్టులో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణ తరగతులు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఒకరోజు అటెండ్ అవుతారు.వరుస ఓటముల కారణంగా బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడే ఆయనే చెప్పారు. దీనిపై మేము మాట్లాడటానికి ఏమీ లేదు. ఢిల్లీ మీటింగ్ తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై పూర్తిగా స్పష్టతను ఇస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
హైదరాబాద్లో ముదురుతున్న ఎండలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల రెండో వారం నుంచే ఈ మార్పు కనిపిస్తోంది. ఉదయం స్వల్పంగా చలి ఉన్నా.. 10 గంటల నుంచే భానుడు ప్రభావం చూపిస్తున్నాడు. గాలిలో 26 నుంచి 34 తేమశాతం మధ్య ఉండటంతో పొడి వాతావరణం నెలకొంది. ఈ నెల మూడో వారంలో అకాల వర్షాల సూచన ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఉక్కపోత మరింత పెరుగుతుందని అంటోంది. ఈసారి వేసవిపై ఎల్నినో ప్రభావం ఉండవచ్చని హెచ్చరిస్తోంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయని, మే, జూన్లో మాత్రం ఎండలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని ఆ శాఖ అంచనా వేస్తోంది. -
Telangana: ఫామ్హౌస్లకూ ఇక వినోద లైసెన్స్
సాక్షి, హైదరాబాద్: ఫామ్ హౌస్లలో అక్రమ, అసాంఘిక కార్యకలాపాలు సాగుతుండటంతో పోలీసు మరింత నిఘా పెంచారు. సైబరాబాద్ కమిషనరేట్ తరహాలో మల్కాజిగిరిలోనూ ఫామ్హౌస్లకు వినోద లైసెన్స్ తప్పనిసరి చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు. స్టార్ హోటళ్లు, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లు వంటి ప్రధాన వినోద, ఆతిథ్య సంస్థలకు అమ్యూజ్మెంట్ లైసెన్స్ తప్పనిసరి చేస్తే ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్ఓసీ), మున్సిపల్ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్స్, ఆరోగ్య అధికారి నుంచి సర్టిఫికేషన్, టౌన్ప్లానింగ్ ఆమోదం, భవన నిర్మాణ అనుమతి పత్రాలతో పోలీసుల అనుమతి పొందాల్సి ఉంటుంది. -
తెలుగురాష్ట్రాల్లో...కోర్టులకు బాంబు బెదిరింపులు
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో వెంటనేపోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు.మద్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు పేలతాయని 12 చోట్ల ఆర్డీఎక్స్ పెట్టామంటూ బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.అయితే అవి బెదిరింపు ఫోన్లా లేక నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
సాక్షి హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వచ్చిన పిటిషన్ ను విచారించనున్నారు. దానం నాగేందర్ రెడ్డిపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారించనున్నారు. అయితే మెుత్తం పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడినట్లు బీఆర్ఎస్ పార్టీస్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డంప్రసాద్ వారిపై నమోదైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇక మిగిలిన ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లను విచారించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పిటిషన్ ను ఈ రోజు విచారణ చేపట్టనున్న స్పీకర్, రేపు కడియం శ్రీహరి పిటిషన్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దానం నాగేందర్ తరపు లాయర్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతకాలం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. -
బీఎస్ఎఫ్ అదుపులో హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్ : రాజస్థాన్లోని జైసల్మేర్ ఉన్న భారత్– పాకిస్తాన్ సరిహద్దుల్లో మంగళవారం కలకలం రేగింది. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న హైదరాబాదీ మహమ్మద్ అషా్ఫక్ హుస్సేన్ను పట్టుకున్న గ్రామస్తులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు (బీఎస్ఎఫ్) అప్పగించారు. అతడి వద్ద ఆధార్ కార్డు, పాస్పోర్టుతో పాటు సౌదీ అరేబియా వీసా స్వా«దీనం లభించింది. అష్ఫాక్ హుస్సేన్ అక్కడికి ఎందుకు వచ్చాడనే కోణంలో బీఎస్ఎఫ్ విచారణ చేస్తోంది. కరీంనగర్కు చెందిన మహమ్మద్ అషా్ఫక్ హుస్సేన్ (38) కొన్నాళ్లుగా హైదరాబాద్లో నివసిస్తున్నాడు. మంగళవారం ఉదయం జైసల్మేర్లోని మియాజలార్ ప్రాంతంలో ఉన్న గుంజన్గఢ్ గ్రామం వద్ద సంచరిస్తున్నాడు. ఇతడి వ్యవహారశైలిని అనుమానించిన గ్రామస్తులు ప్రశ్నించారు. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బీఎస్ఎఫ్కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బీఎస్ఎఫ్ బృందం హుస్సేన్ను అదుపులోకి తీసుకుంది. బీఎస్ఎఫ్తో పాటు ఆర్మీ, ఐబీ అధికారులు రంగంలోకి దిగి ఇతడిని వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. సౌదీ వీసా ఉన్న అతడు అక్కడికి ఎలా.. ఎందుకు వచ్చాడు? స్థానికులతో సంబంధాలైమైనా ఉన్నాయా? లేక ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు అటు కరీంనగర్, ఇటు హైదరాబాద్ల్లో ఆరా తీస్తున్నాయి. -
అభ్యంతరకరంగా రీల్స్.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మహా శివరాత్రి రోజు శివుడికి మాదకద్రవ్యాలను ప్రసాదంగా పెడుతున్నామంటూ రీల్స్ చేసిన ఇద్దరు యువకులు కటకటాలపాలయ్యారు. ఇన్స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జంగమ్మెట్ రవీందర్ నాయక్ నగర్ కాలనీకి చెందిన సభావత్ శ్రీచరణ్(, వడ్త్యా విజయ్ కృష్ణ జిమ్లో పని చేసేవారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న వీరు శంషాబాద్ శివారులోని ఓ శివాలయానికి వెళ్లి ‘శివుడికి అందరూ కొబ్బరి కాయలు కొడతారు...కాని మేము స్పెషల్ ప్రసాదం పెడుతున్నామంటూ గంజాయి’ చూపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్గా మారిన ఈ వీడియోను చూసిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఫలక్నుమా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? –సీపీ సజ్జనార్ దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా...? ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? అంటూ ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మహా శివరాత్రి భక్తికి నిదర్శనం...ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు...ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగిస్తే...జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.లైక్ల కోసం–లోకాన్ని మరిచి...వ్యూస్ కోసం–విలువలనే వదిలి..రీల్స్ కోసం–రోడ్డున పడి...మత్తులో మునిగి–జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి...వ్యసనాలకు వాకిలిగా కాదు’......అంటూ చెప్పుకొచ్చారు. -
మెదక్ జిల్లా కలెక్టర్కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ సర్వే నంబర్ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూ వివాదంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరాహుల్రాజ్కు హైకోర్టు ఆర్నెల్లు సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేలు జరిమానా చెల్లించాలని చెబుతూ నాలుగు వారాలు గడువిచి్చంది. ఈ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి నాలుగు వారాలు తీర్పు అమలును నిలిపివేసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ సర్వే నంబర్ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూమికి తను వారసురాలినని, తన పేరుపై మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగవెల్లి లక్ష్మి 2024, ఏప్రిల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను రద్దు చేశారు. లక్ష్మితో పాటు ప్రతివాది నారాయణ, మల్లయ్యలకు నోటీసులు ఇచ్చి మరోసారి పూర్తి విచారణ జరిపాలని ఆదేశించారు. సేల్డీడ్, సాదాబైనామా క్రమబదీ్ధకరణ చర్యలను పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. దీని కోసం మూడు వారాలు గడువిచ్చారు. జూన్లో ఉత్తర్వులు జారీ చేసినా సెపె్టంబర్ వరకు అమలు చేయకపోవడంతో తిరిగి లక్ష్మి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.కోర్టు తీర్పునిచ్చినా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని, ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ ఏజీపీ(అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) అందజేసిన రికార్డుల్లో తేదీ లేదని, పిటిషనర్కు నోటీసులు అందినట్లు నిర్ధారణ చేసుకోలేదని న్యాయమూర్తి గమనించారు. వాట్సాప్ ద్వారా పిటిషనర్కు పంపించామని ఏజీపీ పేర్కొన్నా ధిక్కార పిటిషన్లోని కౌంటర్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని అభిప్రాయపడ్డారు. రెండెకరాల భూమి కోసం 51 ఏళ్ల మహిళలను పదేపదే కోర్టుల చుట్టూ తిరిగేలా చేయడం సరికాదని అధికారుల తీరును తప్పుబట్టారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ధిక్కరించినట్లు పేర్కొన్న న్యాయమూర్తి ఆర్నెల్లు జైలు విధిస్తూ తీర్పునిచ్చారు. -
మాఘం మౌనమైతే.. ఫాల్గుణం పెళ్లిబాజాలు
విజయనగరం గంటస్తంభం: మాఘమాసం అంటేనే పెళ్లిళ్లు, శుభకార్యాల మాసం అని పెద్దలు చెప్పకొంటారు. కానీ, ఈ ఏడాది శుక్ర మౌఢ్యమి కారణంగా మంచి ముమూర్తాలు దొరకక చాలామంది వేచి చూడాల్సి వచ్చింది. దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియనుండటంతో వివాహాలు, శుభకార్యాలకు మళ్లీ చైతన్యం వచ్చింది. పండితులు చెబుతున్నట్టుగా ఈనెల మూడో వారం నుంచే శుభముహూర్తాలు కలసి వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి ఊపందుకోనుంది. హడావిడి మొదలు.. గ్రామాలు, పట్టణాల్లోని వధూవరుల ఇళ్లలో ఏర్పాటు హడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక కుటుంబాలు మండపాలు, పురోహితులు, అలంకరణల కోసం బుకింగ్స్ పూర్తి చేసుకున్నాయి. ఏడాది పొడవునా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయనే వార్తతో పెళ్లిళ్ల సంఖ్య వేలల్లోకి చేరనుందని అంచనా. కల్యాణ మండపాలకు భారీ డిమాండ్.. వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ మొదలవుతుండటంతో కల్యాణ మండపాలు, హోటళ్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని మండపాలు వరుసగా బుక్ అవుతున్నాయి. మండపం స్థాయిని బట్టి అద్దెలు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా బాజాభజంత్రీలు, షామియానా వ్యాపారులు, క్యాటరింగ్ సంస్ధలకు కూడా పని పెరిగింది. పెళ్లిళ్లకు వచ్చే బంధువుల కోసం లాడ్జీలు, హోటళ్లు ముందుగానే రిజర్వ్ అవుతున్నాయి. పూల అలంకరణల హవా... వివాహాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పూల అలంకరణలకు ఈసారి ప్రత్యేక ఆదరణ కనిపిస్తోంది. అలంకరణ రకం, డిజైన్ను బట్టి ఖర్చులు రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియంతో పాటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి తాజా పూల రకాలను తెప్పిస్తున్నారు. ఫొటోగ్రాపర్లు, వీడియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులకు కూడా బిజీ షెడ్యూల్ మొదలైంది. పురోహితులు సైతం ముందస్తుగానే బుక్ అయిపోతుండటంతో తేదీలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబాలకు సూచిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో పెళ్లి హడావిడి గ్రామల్లో అయితే పెళ్లి పనుల సందడి మరో రకంగా కనిపిస్తోంది. ఇళ్ల ముందర పందిళ్లు, ఊరంతా వెలుగులు, బంధువుల రాకపోకలు..మళ్లీ ఆ పాత హుషారు తిరిగి వస్తోందని పెద్దలు అంటున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఈ సీజన్పై ఆశలు పెట్టుకున్నాయి. మొత్తం మీద శుభముహూర్తాల రాకతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.ముహుర్తాల కోసం ఎదురుచూపులు ముగిశాయి శుక్ర మౌఢ్యమి ఈ నెల 17తో ముగియనుండటంతో శుభకార్యాలకు ఏర్పడిన విరామం తొలగింది. ఈనెల 19 నుంచి మే రెండో వారం వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు ఇది అనుకూల సమయమని సూచించారు. – జయంతి ప్రవీణ్కుమార్, సిద్ధాంతి, జగ్గాపురం -
హైదరాబాద్ : 25వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
-
శివరాత్రి రోజున చికెన్ వండనని చెప్పడంతో..
మేడ్చల్ జిల్లా: చికెన్ వండలేదని భార్యతో గొడవపడి ఓ వ్యక్తి అత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగి దసరాజుల ప్రకాశ్(66) భార్య పద్మతో కలిసి ప్రతాప్సింగారం లోని న్యూవెంచర్లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 15 చికెన్ వండమని భార్యకు కోరగా అమె శివరాత్రి రోజున వండనని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటినుంచి బయటికి వెళ్లిన పద్మ కొద్దిసేపటికి తిరిగి వచ్చి చూడగా..భర్త ప్రకాశ్ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో కొన ఊపిరితో ఉన్న అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నా భార్యను ట్రాప్ చేశాడు..
హైదరాబాద్: నా భార్యను ఓ వ్యక్తి ట్రాప్ చేసి తనవైపు తిప్పుకుని నాపైనే కేసులు పెట్టించారని, నాకు నా పిల్లలకు న్యాయం జరగాలని ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ బెదిరింపులకు పాల్పడిన సెల్ఫీ వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..కొత్తగూడెం జిల్లాకు చెందిన లకావత్ వెంకన్న , లక్ష్మి దేవి దంపతులు నగరానికి వలస వచ్చి యాప్రాల్లోని హరిప్రియ ఎంక్లీవ్లో నివాసముంటున్నారు. వెంకన్న డ్రైవర్గా పని చేస్తుండగా లక్ష్మి అదే అపార్ట్మెంట్లోని జైపాల్రెడ్డి, అరుణ దంపతుల ఇంట్లో పని చేసేది. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి వెంకన్నకు కారు కొనుక్కునేందుకు రూ. 3.50లక్షలు అప్పుగా ఇచ్చాడు. గత ఆగస్టులో జైపాల్రెడ్డి భార్య అరుణతో కలిసి అమెరికా వెళ్లిపోయాడు. ఆ తర్వాత జైపాల్రెడ్డి డబ్బులు ఇవ్వాలని వెంకన్నను అడగగా కాలయాపన చేస్తున్నాడు. ఆ తర్వాత వెంకన్న పథకం ప్రకారం తన భార్య ఫోన్ నుంచి గత సెప్టెంబర్ లో జైపాల్రెడ్డి ఫోన్కు ‘బాగున్నావా’ అనే మెసేజ్ చేయించి వారి నుంచే డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేశాడు. అయితే వెంకన్నపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది, జైపాల్రెడ్డి భార్య అరుణ సైతం ఈ నెల 3న వెంకన్నపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు. లక్ష్మి వాళ్ల చేతుల్లో మోసపోవద్దు.. నాపేరు లకావత్ వెంకన్న... సార్ .మేము .యాప్రాల్లో హరిప్రియ ఎన్క్లేవ్లో నివాసముంటున్నాము. నా భార్యను జైపాల్రెడ్డి తన వైపు తిప్పుకుని నాపై కేసులు పెట్టిస్తున్నాడు. జవహర్నగర్ పీఎస్లో అధికారులు వారికే సహకరిస్తున్నారు. అక్కడ నాకు న్యాయం జరగలేదని నా సొంత ఊర్లో వచ్చి కేసు పెట్టా. నాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగడం లేదు.. నా పెళ్లాం పిల్లలు లేనప్పుడు , నేనెందుకు బతకాలి...నేను బతకలేను సార్.. నాకు ఎట్లా న్యాయం చేయలేకపోయారు ఎస్పీ సార్ .. కనీసం నా పిల్లలకైనా న్యాయం చేయండి.. లక్ష్మి వాళ్ల చేతుల్లో నీవు మోసపోకు , నా పిల్లలను చంపేస్తారు. అంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని చేసిన సెల్పీ వీడియో వైరల్గా మారింది. -
ఎప్ సెట్ రాసిన వెంటనే ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: సాంకేతికతను జోడించి ఈసారి మరింత మెరుగైన రీతిలో ఎప్సెట్ను నిర్వహిస్తున్నామని సెట్ కనీ్వనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ లాగవుట్ అయిన వెంటనే మార్కులు డిస్ప్లే అవుతాయని తెలిపారు.ఈ మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో సెట్ పూర్తయిన మరుక్షణమే తెలుసుకోవచ్చని చెప్పారు. దీన్ని ఈ ఏడాది నుంచే ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. మే నెలలో జరిగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏప్సెట్)కు ఈ నెల19వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టికేకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, సెట్ ఉప కన్వీనర్ ప్రొఫెసర్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. సెట్కు ఏప్రిల్ 4 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఇదే నెల 23న హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రూ. 10 వేల ఫైన్తో పరీక్ష మొదలయ్యే రెండు రోజుల ముందు (ఏప్రిల్ 2 వరకూ) దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... తప్పు చేశారో... ఇట్టే పట్టేస్తుంది! ఇంటర్ బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ సెట్కు, ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ సెట్కు మాత్రమే దరఖాస్తు చేయాలి. కానీ ఆన్లైన్లో ఇందుకు విరుద్ధంగా దరఖాస్తు చేస్తున్నారు. దీనివల్ల ఆఖరి నిమిషంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది నుంచి ఈ సమస్య ఉండదు. ఇంటర్ బోర్డ్తో సమన్వయం చేసుకుని ఇంటర్ హాల్ టిక్కెట్ను ఆన్లైన్ ద్వారా సెట్కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థి తప్పు చేస్తే సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థికి చెప్పేందుకు హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ నుంచి వెంటనే విద్యార్థి రిజిస్టర్ మొబైల్కు ఫోన్ వెళ్తుంది. సెట్కు హాజరైన విద్యార్థులు ప్రాథమిక కీ విడుదలవ్వగానే తప్పులుంటే తెలియజేయవచ్చు. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి ప్రతీ సందేహానికి రూ. 500 చెల్లించాలి. లేవనెత్తిన తప్పు నిజమని తేలితే సొమ్ము వాపస్ ఇస్తారు. విద్యార్థి తన మొబైల్ నుంచే ఏప్సెట్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఈసారి కొత్తగా కలి్పంచారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఇప్పటి వరకూ విద్యార్థి మీ సేవ కేంద్రం నుంచి దరఖాస్తు చేసేవాళ్ళు. దీనివల్ల కేంద్రం నిర్వాహకుడు దరఖాస్తులు తప్పుగా నింపుతున్నారు. ఇది చివరి నిమిషంలో సమస్యలకు తావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మొబైల్ కంపాటబులిటీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన హయాంలో జరిగిన పురోగతిని వీసీ ప్రొఫెసర్ టికెకె రెడ్డి వివరించారు. ఈ పట్టణాల్లో పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 16 పట్టణాల్లో ఏప్సెట్ జరుగుతుంది. వీటి పరిధిలో 57 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలో నాలుగు జోన్లు ఉంటాయి. ఈ జోన్లల్లో 32 పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. బాలికలకు ఈసారి సమీపంలోనే పరీక్ష కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఫైన్తో దరఖాస్తు చేసే విద్యార్థులకు హైదరాబాద్లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి. -
నివసిస్తున్న చోటే ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, మురికివాడల్లో ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్న నిరుపేదలకు అదే ప్రాంతంలో భారీ భవన సముదాయాలు నిర్మించి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ పథకం కిందనే ఆ ఇళ్లను నిర్మిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కింద భారీ ఎత్తున నగరంలో గృహ సముదాయాలు నిర్మించింది. ఇందులో కొన్ని పూర్తి స్థాయిలో సది్వనియోగం అవుతుండగా, కొన్ని దూరంగా ఉన్నాయన్న ఉద్దేశంతో బస్తీ వాసులు వెళ్లేందుకు ఆసక్తి చూపక నిరుపయోగంగా ఉన్నాయి.దీన్ని దృష్టిలో ఉంచుకుని..లబ్ధిదారులు జీవనోపాధి పొందుతూ ఉంటున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద భారీ భవన సముదాయాలు నిర్మించి కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ–క్యూర్)పరిధిలోని మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయటం, పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం రాత్రి సచివాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్చార్జి మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్లతో కలిసి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. 5 నుంచి 10 అంతస్తుల వరకు.. హైదరాబాద్లోని బస్తీల్లో జీవనం కొనసాగిస్తున్న పేదల కోసం గతంలో దూరంగా 42 వేల ఇళ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో తేలిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. చాలాచోట్ల లబ్దిదారుల ముసుగులో ఇతరులు చేరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పేదలు జీవనోపాధి పొందుతున్న చోటనే వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. ఐదు అంతస్తుల నుంచి పది అంతస్తుల మేర భారీ భవన సముదాయాలు నిర్మించి వారికి కేటాయించాలని నిర్ణయించారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 10 రోజుల్లో నివేదికకు ఆదేశం క్యూర్ పరిధిలో ఇలాంటి లబ్ధిదారుల సంఖ్య, వారి ఆవాసానికి ఎన్ని భవనాలు నిర్మించాలి, అందుకు అవసరమయ్యే స్థలం తదితర వివరాలతో పదిరోజుల్లో నివేదిక అందజేయాలని మంత్రులు ఆదేశించారు. మురికివాడల్లో స్ధలం ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్ 5 అంతస్తుల్లో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నిర్మించిన ఇళ్లు కూలే స్థితికి చేరినందున, వాటిæ స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే అంశాన్ని పరిశీలించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్ధలాలు ఉన్న 28 వేల మంది లబి్ధదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. బోగస్ గుర్తింపు..అర్హులకు ఇళ్లు అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి మార్చి చివరి నాటికి లబి్ధదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల లబి్ధదారులను గుర్తించి వారే వాటిని పూర్తి చేసుకోవడానికి వీలుగా అంతకుముందు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన నిధులను మంజూరు చేయాలని నిర్ణయించారు. చాలాచోట్ల ఇళ్లు తీసుకుని అక్కడ నివాసం ఉండని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, అలాగే బోగస్ లబ్ధిదారులను కూడా గుర్తించాలని ఆదేశించారు. అనర్హుల స్ధానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. డబుల్ బెడ్ రూం నివాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. విస్తీర్ణం సవరించుకోండి.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారు, గత ప్రభుత్వం అమలులోకి తెచి్చన గృహలక్ష్మి పథకంలో ఇళ్లు పొందిన వారు, వాటిని ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసి ఉంటే వాటికి ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే 400 చ.అడుగులు–600 చ.అడుగుల మధ్యలోనే వాటి విస్తీర్ణం ఉండాలనే నిబంధన విధించింది. విస్తీర్ణం తక్కువ ఉంటే నిబంధన మేరకు పెంచుకోవాలని, ఎక్కువ ఉంటే, తగ్గించుకోవాలని పేర్కొంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఇళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే, మిగతా కిస్తీల మొత్తాన్ని విడుదల చేయనున్నట్టు పేర్కొంది. బేస్మెంట్ స్థాయిని మించి ఇల్లు నిర్మించి ఉంటే, దానికి బేస్మెంట్ కిస్తీ కాకుండా తదుపరి కిస్తీల మొత్తం విడుదల అవుతుందని తెలిపింది. గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, ఆయా జిల్లాల కలెక్టర్లు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
మనోడు.. పగోడు ఇదో ఫీజుల గోడు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజ నీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహా రం వివాదాస్పదమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని కాలేజీలకు ఫీజులు తగ్గిస్తూ, మరికొన్ని కాలేజీ లకు పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనలు పలు ఆరోపణలకు దారి తీస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ ఆర్సీ) నిర్ణయాలకు విరుద్ధంగా ఉన్నాయని కాలేజీల యాజమా న్యాలు ఆరోపిస్తున్నాయి. ఫీజు లను రాజకీయ కోణంలో చూశారని, స్వతంత్ర ప్రతిపత్తి గల ఎఫ్ఆర్సీని లెక్కజేయలేదని అంటున్నాయి. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ప్రతీ మూడేళ్లకోసారి కాలేజీల ఫీజులను ఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది. 2025–28 సంవత్సరానికి సంబంధించి అన్ని కాలేజీల ఆడిట్ నివేదికలను ఎఫ్ఆర్సీ పరిశీలించి ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి గత ఏడాది పంపింది. దీనిపై సంతృప్తి చెందని ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మార్గదర్శకాలు రూపొందించింది. దీని ఆధారంగా మరోసారి కాలేజీ యాజమాన్యాలతో ఎఫ్ఆర్సీ చర్చించి గత డిసెంబర్లో కొత్త ఫీజుల ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. వాస్తవానికి 2025–26 విద్యా సంవత్సరం నుంచే కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. ఇది జరగకపోవడంతో కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. తాజాగా ఫీజులు నిర్ధారణ చేస్తూ ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది.70 కాలేజీల్లో పాతవే...రాష్ట్రంలో 157 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో 70 కాలేజీల్లో పాత ఫీజులే ఉంచారు. 63 కాలేజీల్లో ఫీజులు పెంచారు. 19 కాలేజీల్లో ఫీజులకు కోత పెట్టారు. ఐదు కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఎఫ్ఆర్సీ ముందు పెట్టలేదు. ఇవి మూత పడినట్టుగా భావిస్తున్నారు. అయితే, అధికార పార్టీకి చెందినవారి కాలేజీల ఫీజులను పెంచి.. విపక్ష పార్టీకి చెందినవారి ఫీజులు తగ్గించారని సంఘాల నాయకులు చెబుతున్నారు. -
లైఫ్ సైన్సెస్లో సహకారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలనుకునే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటునకు రేవంత్రెడ్డి ప్రతిపాదించారు.మంగళవారం హైటెక్స్లో 23వ బయో ఆసియా సదస్సు–2026 ప్రారంభమైన సందర్భంగా... లైఫ్ సైన్సెస్లో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్లతో రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు తెలంగాణలో తాము పెట్టదలచుకున్న పెట్టుబడులను ప్రకటిస్తూ ఒప్పందాలు చేసుకున్నాయి.ఇవీ ఒప్పందాలు ⇒ ఫ్రాన్స్లో తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుంచి విడిపోయిన గ్లోబల్ కన్సూ్యమర్ హెల్త్కేర్ కంపెనీ అయిన ఒపెల్లా హెల్త్కేర్, తన జీసీసీ కార్యకలాపాలను 42,000 చ.అ సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పించనుంది. ⇒ జీఏపీఎఫ్ఏ ఇండోనేషియా విభాగమైన... వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బీఎస్ఎల్3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ⇒ ఏఐ, డేటా సైన్స్ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్ ఐఎన్సీ.. ఏఐ ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్పై కీలక సేవలు అందించిన సంస్థ, తన కార్యకలాపాలను హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించనుంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్ కేర్ రంగంలో మరింత ఆధునికత రానుంది. ⇒భారత లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ 12 ఎకరాల స్థలంలో 1 మిలియన్ చదరపు అడుగుల అడ్వాన్డ్స్ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. -
మాది యోధుల జాతి.. నీది ద్రోహుల జాతి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ పోరాట యోధుల జాతి, మరొకటి తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్స్ జాతి, వారిది ద్రోహుల జాతి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతి గౌరవాన్ని ప్రశ్నించే వారికి చరిత్రే సమాధానం ఇస్తుందని అన్నారు. ‘జాతి అంటే ఏమిటో లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైళ్లు చూసినవారికి, ఉద్యమాల్లో రక్తం చిందించిన వారికే తెలుస్తుంది. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికే తెలంగాణ అస్తిత్వం అర్థమవుతుంది..’అని చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో భారీ ఎత్తున నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్ కట్ చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై ఆయన పేరెత్తకుండా ఘాటుగా స్పందించారు. ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? ‘కొంతమంది ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడుతున్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఒక శిఖరం. తెలంగాణనే కేసీఆర్ ఆనవాలు. ఈ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు. దాన్ని ఎట్లా చెరిపేస్తావు? తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్ర వాదుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలవదు, నీతి తెలవదు. ఆ రోజు తుపాకులు తీసుకుని ఉద్యమకారుల మీద దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తది..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ జాతి మొత్తానికి హీరో ‘కేసీఆర్.. ఏ జాతికి నువ్వు జాతి పిత? ఏ జాతి నీది అని మాట్లాడుతున్నాడు? రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీమ్, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మ, పరాయి పాలనపై పోరాడి తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపిన సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, తుర్రేబాజ్ ఖాన్, కాళోజీ, దాశరథి వంటి మహనీయుల జాతి మాది. 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్‘ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటంలో అసువులు బాసిన 369 మంది యువ కిశోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. మేము మీలా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం కాదు. మాది సామంతుల జాతి కాదు..స్వతంత్రుల జాతి. గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. కేసీఆర్ తాను జాతి పితనని ఎన్నడూ చెప్పుకోలేదు. ప్రజలే ఆయన్నలా పిలుచుకున్నారు. నా తండ్రి తెలంగాణకు హీరో, తెలంగాణ జాతి మొత్తానికి హీరో..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బర్త్డే గిఫ్ట్ ‘తెలంగాణ కోసం కేసీఆర్ జెండా ఎత్తిన కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం, వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, జాతీయ పార్టీ బీజేపీ వంటి మూడు బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయి. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం మాత్రమే. ఆ సంకల్పమే కేసీఆర్ను మొండి ధైర్యంతో ముందుకు నడిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కేసీఆర్ లాంటి మహా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే ఆయనకు మనం ఇచ్చే చిరుకానుక..’అని కేటీఆర్ అన్నారు. కేక్ను కట్ చేసి మాజీ మంత్రి హరీశ్రావుకు తినిపించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, దాసోజు శ్రవణ్కుమార్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సిద్ధార్థ్రెడ్డికి జైలు
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తుది తీర్పును వెల్లడించింది. మెరిట్స్ లేవంటూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. గత నవంబర్లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు–12 కీలక పాయింట్లు జస్టిస్ మనోజ్ మిశ్రా తీర్పును చదువుతూ 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు వెల్లడించారు. హత్య అనే వాదన చెల్లదు: ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. హత్య కోణాన్ని కోర్టు తోసిపుచ్చింది. విషమే ప్రాణం తీసింది: అందుబాటులో ఉన్న మెడికల్ రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం.. ఆమె మరణం కచ్చితంగా విషం తీసుకోవడం వల్లనే సంభవించినట్లు రూఢీ అయ్యింది. అత్యాచారం జరగలేదు: సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూ షపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. ఆలస్యపు ఆరోపణలు: కేసు విచారణ చాలా కాలం జరిగా క, ఆలస్యంగా అత్యాచారం, హత్య జరిగిందంటూ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం కష్టసాధ్యం. డాక్టర్ మునిస్వామిపై ఆగ్రహం: ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం నివేదికను అందించిన డాక్టర్ బి.మునిస్వామి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన సమర్పించిన నివేదిక ’అన్ప్రొఫెషనల్’గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందస్తు లీకులు: నివేదికను అధికారికంగా సమర్పించకముందే, అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్లిందని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. సాక్షి నం. 34 కీలకం: సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం తెలిపింది. నిందితుడికి వ్యతిరేకంగా: పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కాదు: కూల్డ్రింక్లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. విషం కొన్నది అతడే: ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ’నొవాక్రాన్’అనే పురుగుల మందును సిద్ధార్థ్ రెడ్డే కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. ఆ తీర్పు వర్తించదు: వెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సర్వైవింగ్ పార్ట్నర్దే బాధ్యత: ఇది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ్రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.ఆ రోజు ఏం జరిగింది? 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం.. సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పుడప్పుడే వెండితెరపై తళుక్కుమంటున్న యువనటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిలు పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్డ్రింక్లో విషం (పురుగుల మందు) కలుపుకొని తాగారు. వెంటనే ఇద్దరినీ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూసింది. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్ రెడ్డే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తొలుత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు.. సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా, శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. -
జట్టుగా చందా... గుట్టుగా గాంజా దందా!
సాక్షి, హైదరాబాద్: మత్తుమహమ్మారికి బలవుతున్న విద్యార్థులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కొందరు విద్యార్థులు కలిసి డబ్బులు పోగు చేసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించడం వంటి అత్యంత ప్రమాదకర ధోరణిని వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్పీఎస్) ప్రత్యేక బృందం బయటపెట్టింది. దీనిపై విస్తుపోయే విషయాలు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈగల్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టుబడిన విద్యార్థులు తొలుత వినియోగదారులుగా మొదలై, పెడ్లర్లుగా మారి ఆ తర్వాత పెద్ద సరఫరాదారుల దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందం ముగ్గురిని అరెస్టు చేసి 36.878 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్ మీదుగా కరీంనగర్కు గంజాయి తరలిస్తుండగా వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కరీంనగర్కు చెందిన బీటెక్ విద్యార్థి బుచ్చల ఆదిత్య అలియాస్ ఇంద్ర (20), ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి గొల్లపల్లి నిఖిల్ అలియాస్ చింటు (19) పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారంతో మరొక నిందితుడు వడ్లకొండ యశ్వంత్ అలియాస్ మింటును పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఇతను ఇంతకు ముందు రెండు ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్) కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రాథమిక విచారణలో బుచ్చల ఆదిత్య పలు విషయాలు వెల్లడించాడు. మొదటగా అలవాటు.. ఆ తర్వాత విక్రయాలు బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా హాస్టల్మేట్ అమ్ముల త్రినేశ్ ద్వారా ఆదిత్య గంజాయికి అలవాటుపడ్డాడు. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించాలని ప్రణాళిక రూపొందించాడు. ఆదిత్య రూ.11,600 ఇవ్వడంతోపాటు తన స్నేహితులు గొల్లపల్లి నిఖిల్ (రూ.12,000), వడ్లకొండ యశ్వంత్ (రూ.15000), అమ్ముల త్రినేశ్ (రూ.2000), సుందరగిరి సంజయ్ (రూ.30,000), అజయ్ (రూ.5,000), సిద్ధూ (రూ.2,000), శ్రీధర్ (రూ.3,000)...ఇలా మొత్తం రూ.80,600 జమ చేశారు. ఈ డబ్బుతో కరీంనగర్కు చెందిన, ప్రస్తుతం ఒడిశాలోని పసుపులంక ప్రాంతంలో నివసిస్తున్న కలవేన ప్రవీణ్ కుమార్ అలియాస్ చంటి ద్వారా గంజాయి కిలో రూ.2వేల చొప్పున కొనుగోలు చేశారు. ఈ గంజాయిని కొంత వాళ్లు వాడుకునేందుకు పెట్టుకుని మరికొంత జల్సాలు చేసేందుకుగాను ఈజీ మనీ కోసం హైదరాబాద్ , కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. గతంలోనూ 2025 జనవరి, జూలై, డిసెంబర్ నెలల్లో 12 కిలోల చొప్పున మూడు సార్లు గంజాయి కొనుగోలు చేసి మేడ్చల్, కరీంనగర్ జిల్లాల పరిసరాల్లోని విద్యార్థులకు విక్రయించినట్టు విచారణలో బయటపడింది. దీంతో అమ్ముల త్రినేశ్, సుందరగిరి సంజయ్, అజయ్, సిద్ధూ, శ్రీధర్తోపాటు వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన భగవాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతను రక్షించడంలో, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్ధారించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని, డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే 1908 టోల్ఫ్రీ నంబర్లో లేదా 8712671111లో సమాచారం ఇవ్వాలని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సూచించారు. -
‘బుల్డోజర్’ తీర్పు మీకు వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: ఫిర్యాదు రావడమే అదునుగా ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ చేపట్టకుండా భూములను ప్రభుత్వానివిగా పేర్కొంటూ హైడ్రా కంచె వేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ‘బుల్డోజర్ న్యాయం’పై చెప్పిన తీర్పు మీ ఏజెన్సీకి వర్తించదా అని ప్రశ్నించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి పనిచేస్తున్నారా? లేదా? అని అడిగింది. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని హైడ్రా భావిస్తోందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చినప్పుడు, కంచె వేసేటప్పుడు హైడ్రా చట్ట ప్రక్రియను పాటించడంలేదని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ‘మీరు మీకు నచ్చిన భూములకు కంచె వేస్తూనే ఉంటారు. కానీ మీ చర్యలకు మద్దతిచ్చే ఆధారాలు మీ వద్ద ఉండవు’అని మండిపడింది. హైదరాబాద్ గోల్కొండ మండలం గుడిమల్కాపూర్ సర్వే నంబర్ 104లోని 1,351 చదరపు గజాల స్థలంలో తన షెడ్ను కూచ్చివేసి, దాని చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ప్రసాద్ ఎన్.తంజెర్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైడ్రా చర్య గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు. హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు అడిగిన వాటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం హైడ్రా చర్యలు చేపడుతోందని వాదించారు. కంచె తొలగించండి... వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూమి నుంచి కంచె తొలగించాలని హైడ్రాను ఆదేశించారు. అలాగే అక్కడ ఎలాంటి మార్పులు చేయొద్దని పిటిషనర్కు స్పష్టం చేశారు. ఆ భూములు ప్రభుత్వ భూములా.. వివాదంలో ఉన్నాయా.. కోర్టు ఉత్తర్వులున్నాయా.. అనేది ఎలా నిర్ధారణ చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండా కంచె వేయడం సబబుకాదని హితవు పలికారు. జీవితకాలం సంపాదించిన డబ్బుతో ప్రజలు భూమి కొనుగోలు చేస్తారని, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కంచెలు వేస్తూ పోవడం సమర్థనీయం కాదన్నారు. హైడ్రాపై ఆరోపణలు ఇదే తొలిసారి కాదని, వందల పిటిషన్లు న్యాయస్థానం వద్ద విచారణలో ఉన్నాయని చెప్పారు. కంచె వేయడానికి ఏజెన్సీకున్న అధికారం ఏంటో కూడా చెప్పాలన్నారు. పిటిషనర్ ఫోన్ను లాక్కునే అధికారం మీకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పత్రాలు, గణాంకాలు, భూములపై పూర్తి సమాచారం లేకుండా కంచె వేయవద్దని హైడ్రాను ఆదేశించారు. ఇప్పటివరకు అలా వేసి ఉంటే తొలగించాలన్నారు. తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా వేశారు. -
నేటి నుంచి యాదగిరి క్షేత్రంలోవార్షిక బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రధానాలయం సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు 11 రోజులపాటు ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే రూ.2 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఇప్పటికే ఆలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. ఇక శ్రీస్వామి వారి బ్రహోత్సవాల నేపథ్యంలో ఈనెల 18 నుంచి 28 వరకు నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం లాంటి ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. 11 రోజుల షెడ్యూల్ ఇలా.. » 18న ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం. » 19న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. » 20న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం చుడతారు.ఉదయం 9 గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ.» 21న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ. » 22న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార (మురళీ కృష్ణుడి) సేవ, రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ. » 23న ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన సేవ. » 24న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ, అనంతరం 8.45 గంటలకు శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. » 25న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకారము (హనుమంత వాహనం) సేవ, రాత్రి 9 గంటల నుంచి గజవాహన సేవ, రాత్రి 9.30 గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం. » 26న ఉదయం 9 గంటలకు శ్రీ మహావిష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7.30 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. » 27న ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం, సాయంత్రం 7 గంటలకు శ్రీపుష్పయాగం, ద్వాదశి ఆరాధన, దేవతోద్వాసన, దోపు ఉత్సవం. » 28వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం, ఉత్సవాలు సమాప్తి. -
మళ్లీ అనుమతులు పొందాల్సిందే !
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల స్వరూపంతో పాటు వాటి విస్తృతిలో మౌలికమైన మార్పులు జరిగిన నేపథ్యంలో 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వాటికి 2022 జూలై 14లోగా మళ్లీ కొత్తగా అనుమతులు తీసుకొని ఉండాల్సిందేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది. లేనిపక్షంలో అలాంటి అనుమతి లేని ప్రాజెక్టుల వినియోగాన్ని నిలుపుదల చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించడం తమకు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలంను దీనికి ఉదాహరణగా పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్–1లోని ప్రతి ప్రాజెక్టు విషయంలో పెరిగిన మొత్తం పరిధి మేరకు సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో భాగాలకు ఇంకా అనుమతులు లేకపోవడమే కారణమని తేల్చిచెప్పింది. ఈ మేరకు స్వరూపం, విస్తృతిలో మౌలిక మార్పులకు గురైన ప్రాజెక్టులకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరంపై స్పష్టత ఇవ్వాలని సీడబ్ల్యూసీకి ఇప్పటికే కోరామని కృష్ణాబోర్డు వెల్లడించింది. శ్రీశైలం ప్రాజెక్టును పేర్కొనడంతో ప్రాధాన్యం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ జనవరి 30న ఢిల్లీలో సమావేశమైనప్పుడు ఈ మేరకు కృష్ణా బోర్డు ప్రజెంటేషన్ ఇచి్చంది. సమావేశం మినట్స్ కాపీలో ఈ అంశాలను కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. మౌలిక స్వరూపం, విస్తృతిలో మార్పులకు లోనైన ప్రాజెక్టులకి ఉదాహరణగా శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా బోర్డు పేర్కొనడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతులుండగా, దానిపై ఎస్ఆర్బీసీ ప్రాజెక్టును నిర్మించడానికి మాత్రమే ఆ తర్వాత అనుమతులు జారీ అయ్యాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు కుడి వైపు నుంచి ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, కేసీ కాల్వ అవసరాల కోసం ఏపీ, ఎడమ వైపున కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల అవసరాల కోసం తెలంగాణ నీళ్లను తరలించుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు లేకపోవడంతో వాటిని తప్పనిసరిగా పొందాల్సిందేనని కృష్ణా బోర్డు ఈ సమావేశంలో పరోక్షంగా స్పష్టం చేసింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వచ్చే వరకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరాదు.. ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు అమల్లో ఉండగా, దాని ఆధారంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలో ఎదురవుతున్న సవాళ్లను కృష్ణా బోర్డు ఎత్తిచూపింది. రాష్ట్రాల వారీగా, ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులతో పాటు వర్షాభావంతో నీటి కొరత ఏర్పడినప్పుడు ప్రాజెక్టుల నుంచి రెండు రాష్ట్రాలకు ఏ నిబంధనల ప్రాతిపదికన (ఆపరేషన్ ప్రొటోకాల్స్) నీళ్లను విడుదల చేయాలి అనే అంశంపై స్పష్టత అవసరముందని, ఈ అంశాలపై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలియజేసింది. కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం కృష్ణా బేసిన్లోని ఏ ఒక్క ప్రాజెక్టును రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు తమకు అప్పగించలేదని కృష్ణాబోర్డు కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ప్రాజెక్టులను తమ అధికార పరిధిలోకి తీసుకురాకపోతే వాటి ద్వారా నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్–1 1976లో 75శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను కేటాయించింది. కృష్ణా ట్రిబ్యునల్–2 తదుపరి కేటాయింపులు/వివాదాల పరిష్కారం జరిపే వరకు అనుమతులు లేని ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకి సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అనుమతుల జారీ ప్రక్రియను చేపట్టడం అర్థరహితమని, చట్టబద్ధం కాదని స్పష్టీకరించింది. కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు తర్వాతే టెలీమెట్రీ కేంద్రాలునీటి వినియోగం లెక్కలను తేల్చడానికి ప్రాజెక్టులపై స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో టెలీమెట్రీ కేంద్రాల వంటి వ్యవస్థల ఏర్పాటు విషయంలో కృష్ణా ట్రిబ్యునల్–1 ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదని కృష్ణాబోర్డు స్పష్టం చేసింది. సంబంధిత రాష్ట్రాలే గేజింగ్, వినియోగం లెక్కింపు, వార్షిక నీటి వినియోగం లెక్కలను నిర్వహించాల్సి ఉంటుందని మాత్రమే ట్రిబ్యునల్ పేర్కొందని గుర్తు చేసింది. టెలీమెట్రీ కేంద్రాల ద్వారా నీటి వినియోగం క్రమబద్దీకరించే విషయంలో సంబంధిత రాష్ట్రాలతో కృష్ణా బోర్డు బాధ్యతలను నిర్వచిస్తూ కృష్ణాబోర్డు–2 నిర్ణయం వెల్లడించే వరకు వేచిచూడక తప్పదని స్పష్టం చేసింది. ఏడేళ్ల కింద బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 టెలీమెట్రీ కేంద్రాలను ఎన్నడూ నీటి వినియోగం క్రమబద్దీకరణ కోసం వాడలేదని, వాటి ద్వారా అందే సమాచారంలో స్థిరత్వం కొరవడిందని తెలియజేసింది. గోదావరి జలాల కేటాయింపులు తేల్చలేదుగోదావరి బేసిన్లో నీటి లభ్యత ఎంత ఉందనే అంశాన్ని గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) తేల్చలేదని సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం(పీఏఓ) వెల్లడించింది. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు నీటి పంపకాలను సైతం ట్రిబ్యునల్ జరపలేదు. కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపులపై కమిటీ ముందు ప్రజెంటేషన్ ఇచి్చంది. -
కోరినంత ఇవ్వలేం..నాణ్యమైంది అస్సల్లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కోకు సింగరేణి షాక్ ఇచ్చింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మేర బొగ్గు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది. నాణ్యమైన బొగ్గు అడగొద్దంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన జెన్కో అధికారులకు అధికారికంగా లేఖ రాసినట్టు సమాచారం. సింగరేణి యాజమాన్యం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచగా.. తాజాగా ఈ లేఖ బయటకు పొక్కింది. కాగా మంగళవారం అత్యవసరంగా సమావేశమైన బోర్డు డైరెక్టర్లు.. ఊహించని పరిస్థితి నుంచి బయటపడటానికి మార్గాన్వేషణ చేస్తున్నారు. యాదాద్రి థర్మల్ యూనిట్లను వాణిజ్య ఉత్పత్తిలోకి తెచ్చిన సమయంలో సింగరేణి వెనక్కు తగ్గడంపై చర్చలు జరిపారు. విదేశీ బొగ్గు తేవడమా? తెస్తే భరించే శక్తి ఉంటుందా? ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యాదాద్రికి తిప్పలే..! ఈ వేసవిలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. దీన్ని తట్టుకోవడానికి యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కీలకమని భావించారు. అన్ని యూనిట్లలో ఉత్పత్తి భారీగా పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలోని థర్మల్ యూనిట్లకు రోజుకు లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఇందులో 50 శాతం నాణ్యమైన బొగ్గు కావాలి. అంటే కనీసం 5 వేల ఉష్ణశక్తి (జీసీవీ) ఉండేలా చూసుకోవాలి. కొత్తగా నిర్మించిన యాదాద్రి థర్మల్ యూనిట్లకు అత్యధిక ఉష్ణశక్తి (జీసీవీ) బొగ్గు వాడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సింగరేణి బొగ్గు 3,500 జీసీవీకి మించి రాదని అధికారులు ఆలస్యంగా తేల్చారు. ఈ బొగ్గును కూడా పూర్తి స్థాయిలో అందించలేమని సింగరేణి అధికారులు వెల్లడించడంతో యాదాద్రి ప్లాంట్కు ఈ వేసవిలో కష్టాలు తప్పేట్టు లేదు. నైనీ కోల్ బ్లాక్ వివాదం అవ్వడం, బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి ఆమడ దూరంలో ఉండటం వల్ల సింగరేణిని ఎంత ఒత్తిడి చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని జెన్కో అధికారులు చెబుతున్నారు. కాగా, విదేశీ బొగ్గు దిగుమతిపై జెన్కో అధికారులు దృష్టి పెడుతున్నారు. అయితే ఇది సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపుతుంది. అంతిమంగా ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో భారం పడే అవకాశం ఉంది. సింగరేణి బొగ్గు మెట్రిక్ టన్ను రూ.5 వేల నుంచి 6 వేల వరకూ లభిస్తుంది. అదే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు మెట్రిక్ టన్ను రూ.12 వేల వరకూ ఉంటుంది. అంటే రెట్టింపు ధర పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని జెన్కో అధికారులు భావిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన బొగ్గు సరఫరా గురించి సింగరేణి యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జెన్కో సీఎండీ హరీశ్ చెప్పారు. -
‘పట్నం’ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సి పల్ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని బుధవారం తమ ముందు హాజరుపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యాదగిరి అదృశ్యం కావడంతో ము న్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. అయితే, మధ్యాహ్నం ధర్మాసనం ముందు ప్రభుత్వ న్యాయవాది హాజరై యాదగిరి కనిపించారని, ఎన్నిక నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించలేదు. యాదగిరిని ఆయన భార్యతోపాటు తమ ముందు హాజరుపరచాలని తేల్చిచెప్పింది. ఈ విషయంపై వివరాలు సమర్పించేందుకు అమికస్ క్యూరీగా న్యాయవాది రామకృష్ణారెడ్డిని నియమిస్తూ, విచారణ వాయిదా వేసింది. ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన తన తండ్రి యాదగిరి కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆకుల హరికాంత్ హైకోర్టులో బుధవారం లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకే ఎన్నిక ఉందని చెప్పడంతో వెంటనే జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాస్తవాలు తెలియాల్సి ఉంది..: పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఒక పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లను 13న బొంగులూరులోని ఓ ఫంక్షన్ హాల్కు తరలించారు. అనంతరం అందరినీ బయటకు పంపి యాదగిరిని మాత్రం పంపలేదు. చైర్మన్ రేసులో ఉన్న యాదగిరిని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్రెడ్డి కిడ్నాప్ చేసినట్లు అనుమానం ఉంది. దీనిపై 15న యాదగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. యాదగిరికి ప్రాణహాని ఉంది’అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ పొట్టిగారి శ్రీధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడువిస్తే హాజరుపరుస్తారు’అని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం.. చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీవోలకు వెంటనే తెలియజేయాలని చెబుతూ విచారణ 19కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి హాజరైన యాదగిరి ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికలో మంగళవారం సైతం ఉత్కంఠ కొనసాగింది. స్వతంత్ర అభ్యర్థి ఆకుల యాదగిరిని కి డ్నాప్ చేశారన్న నేపథ్యంలో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో, న్యాయస్థానం స్టే విధించిందని చెబుతూ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నోటీసు ఇవ్వలేదని గొడవ..: జిల్లా ఎన్నికల అబ్జర్వర్ మయాంక్ మిట్టల్, ఎన్నికల అధికారి, ఆర్డీవో అనంతరెడ్డి ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆకుల యాదగిరి సమావేశానికి రాగా, ఆ తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకున్నారు. మీటింగ్ ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. మయాంక్ మిట్టల్ సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఎక్స్అఫీషియో ఓటర్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఎన్నికల నోటీసు అందజేయలేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు గొడవ చేయడంతో పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన అధికారులు మెజార్టీ సభ్యులు చైర్మన్గా బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్రెడ్డిని బలపర్చినట్లు సంతకాలు చేశారు. అనంతరం ఎన్నికలపై న్యాయస్థానం స్టే ఇచ్చిందని చెబుతూ, ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఆపేశారు. కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
8లో 7 కాంగ్రెస్కే..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో వాయిదా పడిన 11 చోట్ల మంగళవారం ఎన్నికలు నిర్వహించగా అందులో ఎనిమిది చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో మూడు చోట్ల వాయిదా పడింది. 8 మున్సిపాలిటీల్లో ఏడు చైర్పర్సన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే.. ఒక్కచోట బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ విజయం సాధించిన ఏడు మున్సిపాల్టీల్లో.. రెండింటిని టాస్తో గెలుపొందడం విశేషం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, తొర్రూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎక్స్అఫీ షియో ఓట్లతో కలుపుకొంటే సమానంగా ఓట్లు రావడంతో చైర్పర్సన్ పీఠం కోసం ఎన్నికల అధికారులు టాస్ వేయగా.. రెండుచోట్ల కూ డా కాంగ్రెస్కు చైర్పర్సన్ పీఠాలు దక్కా యి. ఇక కాగజ్నగర్లో బీజేపీ సభ్యులు కాంగ్రెస్కు మద్దతునివ్వడంతో అక్కడ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటే.. వైస్చైర్మన్ స్థానాన్ని బీజేపీ సాధించింది. కాగా ఇబ్రహీంపట్నం ము న్సిపాలిటీలో ఎన్నిక ప్రక్రియ సగం వరకు అయిన తరువాత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో.. ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఇది కాకుండా క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు వా యిదా పడ్డాయి. ఈరోజు కూడా బద్ద శత్రువుల్లా వ్యవహరించే పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవడం విశేషం.ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలు ఇలా..ఇంద్రేశంలో బీఆర్ఎస్.. జహీరాబాద్లో కాంగ్రెస్.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక మంగళవారం జరిగింది. ఇందులో ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇంద్రేశంలో 18 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, 9 బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఒక స్థానం ఇండిపెండెంట్కు వచ్చింది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ బీఆర్ఎస్ గూటికి చేరడంతో గులాబీ పార్టీకి చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పదవులు దక్కాయి. చైర్పర్సన్గా కుశంగుల ప్రమీల ఎన్నికయ్యారు. » జహీరాబాద్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో హైడ్రామా కొనసాగింది. ఈ ఎన్నిక నిర్వహించిన అధికారుల తీరును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మొత్తం 37 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ మూడు, ఎంఐఎం రెండు, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ షెట్కార్, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు తమ ఎక్స్అఫీషియో ఓట్లను ఇక్కడ నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్కు ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు స్వతంత్రులు అనుకూలంగా ఓటేయడంతో చైర్మన్గా ఎండీ యూనూస్ ఎన్నికయ్యారు. వైస్చైర్పర్సన్ పదవి మాత్రం స్వతంత్ర కౌన్సిలర్కు వచ్చింది. ఓరుగల్లు హస్తం క్లీన్స్వీప్...! బీఆర్ఎస్ చేజారిన తొర్రూరు... డోర్నకల్, జనగామల్లోనూ కాంగ్రెస్ సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ను కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికే 9 మున్సిపాలిటీలను చేజిక్కించుకున్న కాంగ్రెస్.. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం జరిగిన ఎన్నికల్లో మూడింటినీ గెలుచుకుంది. లాటరీ తీసిన జనగామ, తొర్రూరులలో కూడా బీఆర్ఎస్కు ‘లక్కీ’ కలిసిరాలేదు. లాటరీలో అదృష్టం కలిసిరాక అవి ‘చేతి’కి చిక్కాయి. డోర్నకల్లో కూడా హస్తంపరమైంది. » జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉద్రికతల మధ్య కొనసాగింది. జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు వేసిన తర్వాత కూడా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి బాలమణికి మొత్తం 16 ఓట్లు రాగా...బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్కు సైతం 16 ఓట్లు వచ్చాయి. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు డ్రా తీశారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణి పేరు రావటంతో ఆమెను చైర్మన్గా అధికారులు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేపట్టారు. » జనగామ ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే పద్ధతితో బాలమణి, సుధాకర్లు ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో, లాటరీ ద్వారా ఎన్నిక నిర్వహించారు. మొదట కాంగ్రెస్ చేతులెత్తే ప్రక్రి య పూర్తికాగా, ఆ తర్వాత బీఆర్ఎస్ వంతు వచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు మద్దతు గా 8వ వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ మంజుల చేతిని పైకి ఎత్తగా, కాంగ్రెస్కు చెందిన కరుణాకర్ రెడ్డి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు ఆమె చేయిని లాగు తూ ఓటు వేయొద్దని కిందికి అనడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇద్దరు కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు. దయాకర్రావు కన్నీటిపర్యంతం నర్సింహులపేట: ‘45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు పాలన, చూడలేదని, కక్షసాధింపు, మోసం రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా.. తప్పుకోవాలా..అనిపిస్తుంది. నా ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లెందు కాంగ్రెస్కే... ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి 19 మంది కాంగ్రెస్ సభ్యులు, రెబల్, స్వతంత్ర సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా ప్రిసైడింగ్ అధికారి మధు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత రెండో వార్డు నుంచి గెలుపొందిన దొడ్డా కిరణ్ మిత్రాను చైర్పర్సన్గా, 17వ వార్డు నుంచి ఎన్నికైన పెండేలా రాజును వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. -
ఢిల్లీకి రండి.. కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఏఐసీసీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి కీలకమైన పిలుపు వచ్చింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 19న ఢిల్లీకి రావాలంటూ కబురు అందింది. గురువారం ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయమైన ఇందిరాభవన్లో సమావేశానికి రావాలని సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం అందినట్టు గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ భేటీకి హాజరవుతారని తెలిపాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో సమావేశమవుతున్న క్రమంలోనే తెలంగాణ నాయకత్వాన్ని కూడా పిలిచారని వివరించాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీలో కార్యదర్శులుగా ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఢిల్లీ సమావేశానికి హాజరు కానున్నట్టు సమాచారం. పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సమీక్ష?: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని అధిష్టించాలనే కోణంలోనే అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో ఏఐసీసీ సమావేశమవుతోంది. సంస్థాగతంగా పార్టీని ఉత్తేజితం చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాల్సిన బీజేపీ వ్యతిరేక ఆందోళనలపై దిశానిర్దేశం చేయనుంది. అయితే తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏఐసీసీలోని ముగ్గురు కీలక నేతలు నిర్వహించే ఈ సమావేశంలో.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీతో సమన్వయం, పదవుల పందేరం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఆరు గ్యారంటీలు, ఇతర పార్టీల పరిస్థితి, డీసీసీ అధ్యక్షుల పనితీరు, పార్టీ కార్యవర్గానికి చేస్తున్న పని విభజన తదితర అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పనితీరును గురించిన సమాచారం కూడా ఏఐసీసీ వద్ద ఉందని, ఎన్నికల్లో గెలుపోటములే కాకుండా ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాల గురించిన చర్చ కూడా ఈ సమావేశంలో జరుగుతుందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై స్పష్టత? ఈ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలా లేదా? మార్పులు చేర్పులుంటాయా? అనే అంశంపై స్పష్టత వస్తుందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పోస్టుల కేటాయింపు విషయంలోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ మేరకు అంశాల వారీగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి ఇప్పటికే పలు నివేదికలు అందజేసినట్టు చెబుతున్నారు. కాగా ఏఐసీసీకి అందజేసేందుకు గాను..గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పనితీరు గురించి సీఎం రేవంత్రెడ్డి, తాను పీసీసీ అధ్యక్షుడిని అయిన తర్వాత పార్టీని బలోపేతం చేస్తున్న తీరు, పీసీసీ కమిటీలు, ఏఐసీసీ ఇచ్చే ఆందోళనల విజయవంతం తదితర అంశాలపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. నేడు ముంబైకి సీఎం సీఎం రేవంత్రెడ్డి ముంబైకి వెళ్లారు. బుధవారం అక్కడ జరిగే ముంబై క్లైమేట్ వీక్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తర్వాత ముంబైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సతీమణి గీత.. మాతృమూర్తిని పరామర్శించనున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళతారు. గురువారం ఏఐ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొంటారు. ఏఐసీసీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. గురువారం రాత్రికి లేదా శుక్రవారం ఉదయానికి సీఎం హైదరాబాద్కు తిరిగి వస్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రికి అభినందనలు మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డికి పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వీర్ల శంకరయ్య, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లు కూడా సీఎంను కలిసి అభినందనలు తెలిపారు. రేవంత్ కూడా పార్టీ నేతలను అభినందించారు. -
జీవ విజ్ఞాన రాజధానిగా హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వం, కంపెనీలు, నిపుణులు, ప్రజలు..అందరం కలిసి పనిచేస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో మీరు భాగస్వాములు కావాలి..’ అంటూ కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ‘23 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేది. అదే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచింది. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అనే బలాల ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు, పరిశోధన, డిజైన్లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగింది. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు.. భారత్ నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంది. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నాం. భవిష్యత్ మార్పులతో కూడిన ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు. మంగళవారం హైటెక్స్లో ‘బయో ఆసియా–2026’ సదస్సు ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం ‘హైదరాబాద్ ఇప్పటికే జీసీసీలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. దీన్ని మనమంతా కలిసి సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. మీ జీసీసీలను స్థాపించండి. ఆవిష్కరణ కేంద్రాలు నిర్మించండి. మాలిక్యూల్స్, ఔషధాలను తయారు చేయండి. క్లినికల్ అనలిటిక్స్ను నడపండి. ఏఐ ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేయండి. డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లండి. మా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్య యువత మీ విజయంలో భాగస్వాములు అవుతారు. గత రెండేళ్లలోనే జీవ విజ్ఞాన రంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల దావోస్లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం. జీనోమ్ వ్యాలీని విస్తరించాం. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు ‘వన్–బయో’ను ప్రారంభించాం. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేశాం. అనేక జీసీసీలను ఆహా్వనించాం. ఇది సాధారణ అభివృద్ధి కాదు. దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం ఇది..’ అని సీఎం పేర్కొన్నారు. బయో వరల్డ్ దిశగా.. ‘బయో ఆసియా తన పేరును దాటి, బయో వరల్డ్గా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సు.. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకం ఉంది. ఇటీవల తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ప్రకటించాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యం. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే.. పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ అది అందిస్తుంది. హైదరాబాద్ మీ సమాధానం..’ అని రేవంత్రెడ్డి అన్నారు. ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్గా హైదరాబాద్: శ్రీధర్బాబు ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ను ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్సŠట్ – జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026– 2030)‘ రూపొందించామని తెలిపారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్ఎన్ఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో ‘రెడీ టూ వర్క్ ఫోర్స్‘గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామని చెప్పారు. -
రేపట్నుంచి రంజాన్ దీక్షలు
సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లో మంగళవారం నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 (గురువారం) నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారని ఇప్పటికే ప్రకటించారు. బుధవారం నెలవంక నిర్ధారణ కమిటీ నెలవంక కనిపించినట్లు ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ నెల అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీతో పాటు ఢిల్లీలోని కేంద్ర కమిటీతో నెలవంక నిర్ధారణ కమిటీ చర్చలు జరిపి రంజాన్ నెల ప్రారంభంపై ప్రకటన చేయనుంది. -
హారిక డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు
సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడల మండలం హారిక డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. గుమ్మిడదల కేంద్రంలోని హారిక డ్రగ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి రియాక్టర్ పేలింది. పేలుడు తీవ్రతతో పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలింది. ఘటన సమయంలో పరిశ్రమలో కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారంపేలుడు శబ్దంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం కనిపిస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయాల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
‘ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి’
హైదరాబాద్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్,హెచ్ ఎం డి ఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరుల హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జి లను ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అడ్వటైజింగ్ బోర్డుల ఏర్పాటు పైన జాగ్రత తీసుకోవాలి.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం అడ్వటైజింగ్ బోర్డులు కేటాయించాలి. అడ్వటైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒక సారి ఫీజు వసూలు చేయాలి. అనధికార అడ్వటైజింగ్ బోర్డు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలి. జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. -
ibomma Ravi : ఇమ్మడి రవికి బెయిల్
సాక్షి,హైదరాబాద్: ఐబొమ్మ రవికి బెయిల్ లభించింది. సినిమా పైరసీ కేసులో గతేడాది నవంబర్లో అరెస్టైన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి నాంపల్లి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేయడంతో పాటు ప్రతీరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశ విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి చేసింది. పైరసీ కేసులో అరెస్టైన బెయిల్ పొందిన ఇమ్మడి రవి ఇప్పటికైనా అతని తండ్రి అప్పారావు దగ్గరికి వెళతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది కుమారుడు అరెస్టును తండ్రి అప్పారావు సమర్ధించారు.ఇమ్మడి రవి తండ్రి ఏమన్నారంటే?ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను. పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా.. నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. తాజాగా బెయిల్ వచ్చిన ఇమ్మడి రవి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారా? లేదంటే ఉద్యోగం చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా,ఇమ్మడి రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది. గతంలో రవి అమీర్పేట్లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్పేటలోని హాస్టల్ రూమ్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. -
TG: ఈఏపీసెట్ పరీక్షా తేదీలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)-2026 పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అగ్రి కల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11 వరకూ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం , మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిప్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండో షిప్ట్లో పరీక్షలు నిర్వహించనున్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి..!
మహబూబాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్రావును పీఎస్కు తరలించారు పోలీసులు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఎర్రబెల్లి దయాకర్ రావు. మీడియతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చైర్మన్ ఎన్నిక తీరును ఎర్రబెల్లి తప్పుబటట్టారు ‘ కష్టపడి పనిచేసిన కార్యకర్తలక నేనేం సమాధానం చెప్పాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పని చేస్తుంది. . నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం వ్యవహరించింది. నన్ను, నా భార్యను ఎందుకు అరెస్ట్ చేశారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. బీఆర్ఎస్ 9 వార్డులను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 7 వార్డులను దక్కించుకుంది. బీజేపీకికానీ, ఇతరులకు కానీ ఇక్కడ విజయం సాధించలేద. దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పోరు ఖాయమైంది. ఈ తరుణంలోనే చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నప్పటికీ ఒక కౌన్సిలర్ కాంగ్రెస్లోకి వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలోనే చైర్మన్ పీఠం చేజారిపోవడంతో ఎర్రబెల్లి దయాకర్రావు భావోద్వాగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా తొర్రూర్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీకి అనుమతించలేదు పోలీసులు. ఎర్రబెల్లిని అనుమతించకపోవడంతో రోడ్డుపైన బేటాయించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా చేశారు. ఆపై ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో లాఠీచార్జి వంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. -
‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ను ‘‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే "తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030)" రూపొందించామని మంగళవారం హెచ్ఐఐసీ లో నిర్వహించిన "బయో ఏషియా 2026" సదస్సు ఆయన వివరించారు. ఇప్పటి వరకు లైఫ్ సైన్సెస్ రంగంలో సప్లై కోసం మాత్రమే మన వైపు చూసిన ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల కోసం చూస్తోందన్నారు.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా తెలంగాణను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్ఎన్ఏ(mRNA), జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో "రెడీ టూ వర్క్ ఫోర్స్"గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామన్నారు. సీబీఆర్ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని అన్నారు.అందుకే... కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా, నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగానూ హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. అలాగే... గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గానూ మార్చేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, ఆటోమేషన్ ఇన్ బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్, డేటా ఆధారిత ప్రెసిషన్ మెడిసిన్ , కంప్యూషనల్ బయాలజీ, బయో మాన్యుఫాక్చరింగ్ 4.o తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. -
మా నాన్న హీరో: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు ( మంగళవారం) కేసీఆర్ జన్మదినం సందర్బంగా బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ని పట్టుకొని కొంతమంది నేతలు ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తెలంగాణ హీరో అని తెలిపారు. ఆయన నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఆయన భగవంతున్ని కోరుత్నుట్లు తెలిపారు.సంచులు మెసేవారికి జాతి గురించి కానీ దాని గౌరవం గురించి గాని ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని ఒకటేమో తెలంగాణ జాతయితే మరోకటి రాష్ట్ర ద్రోహులదని తెలిపారు. బీర్ఎస్ పార్టీకి అధిష్ఠానం ఆడిస్తే ఆడడం తెలియదని కేటీఆర్ అన్నారు. ఏ జాతికి జాతిపిత అని మాట్లాడుతున్నారు. రుద్రమదేవి, కొమురం భీం, సర్వాయి సర్దార్ పాపన్న, కాళోజీ , చాకలి ఐలమ్మ, తుర్రెబాజ్ ఖాన్, దాశరథి, తెలంగాణ విద్యార్థి అమరవీరుల జాతి మాదని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ భవన్కు భారీగా నేతలు తరలివచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపారు. కాగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలు చోట్ల కేకులు కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. -
ఇబ్రహీం పట్నం మన్సిపాలిటీ ఛైర్మన్.. వీరికే
సాక్షి రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన ఇబ్రహీం పట్నం మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకంది. ఓటింగ్ పెట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చేతులు ఎత్తే విధానం కాకుండా ఓటింగ్ పెట్టాలని కౌంటింగ్ హాలులోని ఫర్నిచర్ ఎత్తిపడేశారు. దీంతో పోలీసులు వారిని అదుపుచేసే యత్నం చేశారు. -
డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు తెలంగాణ సర్కార్ సన్నద్ధం
-
రణరంగమైన ఛైర్మన్ ఎన్నిక.. వివేక్ కారుపై రాళ్లదాడి
సాక్షి, మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్బంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయిపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్పగాయాలయినట్లు తెలుస్తోంది.ఎన్నికల కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పెద్దఎత్తున గూమిగూడారు. అనంతరం పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం అక్కడ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. సరైన మోజారిటీ ఉన్నా ఛైర్మన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారంటూ ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలంటూ నిరనస చేపట్టారు. నిన్న11 చోట్ల కోరం సరిగ్గా లేకపోవడంతో వాయిదాపడిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలను అధికారులు నేడు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కాగజ్నగర్ మున్సిపల్ ఛైర్మన్ కాంగ్రెస్ కైవసం ఛైర్పర్సన్ షాహిన్ సుల్లానా (కాంగ్రెస్) వైస్ ఛైర్పర్సన్ లావణ్య (బీజేపీ) సంగారెడ్డి జిల్లాజహీరాబాద్ కాంగ్రెస్ కైవసం మున్సిపల్ ఛైర్మన్గా యూనస్ వైస్ఛైర్మన్గా శిరీషమహబూబాబాద్ జిల్లాతొర్రూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంలక్కీడ్రాలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి జనగామ జిల్లాజనగామ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసంలక్కీడ్రాలో కాంగ్రెస్ సొంతంఇండిపెండెంట్లను ప్రభావితం చేశారని పల్లా ఆగ్రహంకౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన అదృష్టంజనగామ మున్సిపల్ ఎన్నికపై ఉత్కంఠకాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానంగా ఓట్లుదీంతో లక్కీడ్రా ద్వారా చైర్మన్, వైస్ఛైర్మన్ ఎన్నిక దీంతో ఇండిపెండెంట్లను ప్రభావితం చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహాంసంగారెడ్డి జిల్లాఇంద్రేశ్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం ఛైర్పర్సన్గా ప్రమీల,వైస్ఛైర్మన్గా హరీశ్ రెడ్డి స్వతంత్ర్య అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ గెలుపుపటాన్చెరు మున్సిపాలిటీల్లో ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశంఐదింట ఐదు గెలిచి క్లీన్స్వీప్ చైసిన బీఆర్ఎస్ -
హైదరాబాద్ : మణికొండలో కాలనీలను ముంచెత్తిన వరద (ఫొటోలు)
-
11 మున్సిపాలిటీ ఛైర్మన్లకు నేడు ఎన్నిక
సాక్షి హైదరాబాద్ : రాష్ట్రంలో పలు కారణాలతో వాయిదాపడ్డ 11 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక నేడు అధికారులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొర్రూరుతో పాటు జనగామ మున్సిపాలిటీల ఛైర్మన్ స్థానాలకు సమాన స్థానాలు రావడంతో అధికారులు డ్రా ద్వారా ఛైర్మన్ని ఎన్నిక చేయనున్నట్లు సమాచారం అందుతుంది.జనగామా మున్సిపాలిటీకి ఎక్స్ అఫీషియో స్థానాలతో కలిసి కాంగ్రెస్ 16, బీఆర్ఎస్16 స్థానాలు వచ్చాయి. అయితే ఈ ఛైర్పర్సన్ స్థానంకోసం అధికారులు డ్రా తీసే అవకాశం కనిపిస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఇదివరకే ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించారు.మరోవైపు తొర్రూరు మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రాంతంలో కూడా ఎక్స్ అఫిషియోతో కలిసి కాంగ్రెస్కు 9, బీఆర్ఎస్ 9, స్థానాలు వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా డ్రా తీసే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇదివరకే వివాదం నెలకొంది. ఎంపీ కావ్య ఎలా ఓటు వేస్తారనే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంతో శాంతిభద్రతల రీత్యా 144 సెక్షన్ విధించారు. ఎస్పీ ఆధ్యర్యంలో 700మందితో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.నిన్న 11 మున్సిపాలిటీల్లో కోరం లేకపోవడంతో పాటు పలు కారణాలతో మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలు రద్దయ్యాయి. అవి ఇబ్రహీంపట్నం, తొర్రూర్, సుల్తానాబాద్, కాగజ్నగర్..ఇల్లందు, క్యాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ జనగామ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. -
కేసీఆర్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest birthday greetings to former CM Telangana, Shri K. Chandrashekar Rao Garu. Praying for your health, peace, and long life. pic.twitter.com/KLHCpcZEGx— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
Hyderabad: ట్రాఫిక్ క్లియర్ కంటే చలాన్లకే ప్రాధాన్యం?
హైదరాబాద్: సిటీ ట్రాఫిక్ పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ క్లియర్ చేయడంపై కంటే చలాన్ల మీదే వారికి ఎక్కువ దృష్టి ఉంటుందనే విమర్శలకు ఊతమిచ్చే ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. చేతిలో కెమెరా, మొబైల్ ఫోన్ పట్టుకుని కేవలం చలాన్ల కోసమే రోడ్లపై వేచి చూసే పోలీసులు చాలాచోట్ల కనిపిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఫొటో తీయడమే వారి డ్యూటీ. ఈ క్రమంలో సోమవారం ఓ వ్యక్తి టీఎస్ 10ఎఫ్డీ 8002 కారును ఆర్పీరోడ్లోని దర్గా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉదయం 10.15 గంటలకు నిలిపి, మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ మధ్య సమయంలో కారుకు ఉదయం 10.29, 10.50, మధ్యాహ్నం 12.18 గంటలకు వరుసగా మూడు చలాన్లు వేశారు ట్రాఫిక్ పోలీసులు. అవి కూడా వేర్వేరు సెక్షన్లకు కాదు. అన్నీ కూడా క్యారేజ్ వే లో పార్కింగ్ పేరిటే కావడం గమనార్హం. ఇదీ మహంకాళి ట్రాఫిక్ పోలీసులు చేసిన ఘన కార్యం. రాణిగంజ్, ఆర్పీరోడ్లోని షాపుల ముందు నిత్యం పార్క్ చేసే వాహనాలను మాత్రం పట్టించుకోరు. -
రూ. కోటి బీమా కాజేసేందుకు..
బూర్గంపాడు: రూ.కోటి బీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసేందుకు పథక రచన చేశారు. తీవ్రంగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన గత శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ వద్ద జరిగింది. తాజాగా బాధితుడి బంధువుల కథనం ప్రకారం.. ఏపీలోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గన్నవరానికి చెందిన కట్టా యశ్వంత్కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మేనమామ ములిశెట్టి శ్రీనివాసరావు సంరక్షణలో ఉన్నాడు. ఆరు నెలల క్రితం వరకు యశ్వంత్ సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్ట్ కారి్మకుడిగా పనిచేశాడు. అదే గ్రామానికి చెందిన కట్టా సాయిదీపక్తో ఆరునెలలుగా స్నేహం చేస్తూ అతని వ్యక్తిగత పనులకు సహాయకారిగా ఉంటున్నాడు. ఇదే సమయంలో భద్రాచలానికి చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్ కొండ భానుప్రకాశ్ కూడా వీరితో జత కలిశాడు. భానుప్రకాశ్, యశ్వంత్ మధ్య బంధుత్వం కూడా ఉంది. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాయిదీపక్, ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్న భానుప్రకాశ్ కలిసి తల్లిదండ్రులు లేని యశ్వంత్ పేరిట బీమా చేయించి అతడ్ని హతమారిస్తే బీమా సొమ్ము దక్కించుకోవచ్చని ప్రణాళిక వేసుకున్నారు. కులాలు వేరైనా యశ్వంత్ ఇంటిపేరు, సాయిదీపక్ ఇంటి పేరు ఒకటే (కట్టా) కావడం వీరికి కలిసొచ్చింది. ఇందులో భాగంగా నాలుగు నెలల క్రితం యశ్వంత్ పేరిట ప్రీమియం చెల్లించి రూ.కోటి బీమా చేయించారు. ఇంటి పేరు ఒకటే కావడంతో కట్టా సాయిదీపక్ను సోదరుడిగా పేర్కొంటూ నామినీగా నమోదు చేయించారు. పరిహారం కాజేసేలా... పథకంలో భాగంగా శనివారం రాత్రి భద్రాచలంలో యశ్వంత్కు ఓ స్కూటీ ఇప్పించి మద్యం తీసుకుని సారపాకకు సమీపంలోని మోతె పట్టీనగర్కు రమ్మన్నారు. సాయిదీపక్, భానుప్రకాశ్ కారులో ముందుగా అక్కడికి చేరుకున్నారు. యశ్వంత్ వచ్చాక సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో రోడ్డు పక్కన మద్యం తాగి యశ్వంత్ తలపై తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డుపై పడుకోబెట్టారు. కొంతదూరంలో ఆయన వేసుకొచి్చన స్కూటీని పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకం వేశారు. అటుగా వస్తున్నవారు రక్తం మడుగులో ఉన్న యశ్వంత్ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. యశ్వంత్కు స్కూటీ ఎవరు ఇచ్చారని మేనమామ ప్రశి్నస్తే తామే ఇచ్చామని సాయిదీపక్, భానుప్రకాశ్ చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పథకం ప్రకారమే యశ్వంత్ను హత్య చేసేందుకు ప్రయత్నించారని గుర్తించారు. -
ఇంట్లో మృతదేహం.. బయట తలుపునకు తాళం
మూసాపేట (హైదరాబాద్): మృతదేహాన్ని నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఇంట్లోనే ఉంచుకోవటంతో దుర్వాసన వెలువడి.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివేకానందనగర్, రామకృష్ణనగర్ వీధిలో శ్రీసాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులోని అద్దె ఇంట్లో తల్లి శమంతకమణి, ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో నివాసం ఉంటోంది. భర్త రిటైర్డ్ ఎస్ఐగా చేసి గతంలోనే మరణించాడు. భర్తకు వచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. పిల్లలు ముగ్గురికి వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో కుమార్తె శైలజ (50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తలుపునకు తాళం వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపుతట్టగా సోమవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తలుపు వేసుకున్నారు. సోమవారం కూడా మృతదేహాన్ని అలాగే ఉంచటంతో దుర్వాసన ఎక్కువైంది. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి మృతదేహాన్ని తరలించాలని సూచించారు. పలు విధాలుగా వారికి నచ్చజెప్పటంతో చివరికి వారి సొంత ఊరు కైకలూరికి అంబులెన్స్లో తరలించారు. అయితే గతంలో వాచ్మన్పై దాడి చేసింది కూడా వీరేనని, అద్దె డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వటం లేదని స్థానికులు తెలుపుతున్నారు. -
మహిళ చేతికే మంత్రదండం
సాక్షి, హైదరాబాద్: పురపోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రంలో పురపాలనను వారు శాసించనున్నారు. అతివలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్పర్సన్ స్థానాలను అలంకరించారు. కార్పొరేషన్లలో మాత్రం రిజర్వ్ చేసిన మూడు స్థానాల్లోనే మేయర్ పీఠాలను దక్కించుకున్నారు, మహిళలకు ఇతర రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సోమవారం నిర్వహించిన చైర్పర్సన్/మేయర్ ఎన్నికల ఫలితాల్లో 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఏకంగా 64 శాతం పదవులను మహిళలు దక్కించుకున్నారు. వారు ఏకంగా 72 చోట్ల పురపాలన పగ్గాలు చేపట్టారు. అయితే, ఎన్నికలు వాయిదా పడిన మరో 11 మున్సిపాలిటీల్లో ఇప్పటికే మహిళలకు 4 రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారు 76 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు అవుతుంది. అంటే దాదాపు 62 శాతం పదవులను దక్కించుకున్నట్లు అవుతుంది. మహిళలు వారికి కేటాయించిన 50 శాతం రిజర్వేషన్ల కంటే 12 శాతం అధికంగా పదవులు దక్కించుకుంటుండటం విశేషం. చట్టసభల్లోనూ అమల్లోకి వస్తే.. మహిళలు తెరచాటు వ్యక్తులుగా కాకుండా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో.. 2029లో చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే.. ఎంతమంది మహిళా రాజకీయ వేత్తలు చట్టసభలకు వెళ్తారనేది ఆసక్తికరం. చైర్పర్సన్లుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు కూడా అధికంగా ఉండటం గమనార్హం. బీసీ, ఎస్సీ, అన్రిజర్వ్డ్ సీట్లలోనూ వారు విజయం సాధించడం గమనార్హం. వార్డు సభ్యుల ఎన్నికలోనూ వారు అన్రిజర్వ్డ్ సీట్లలో గెలుపొంది సత్తాచాటారు. రాష్ట్రంలో మహిళలకు పదవులు ఇస్తూ వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించడం మంచి పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. దీనివల్ల ఆ సమస్యల పరిష్కారానికి వారు ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. రాజకీయ నాయకులు తమకు అవకాశం రానిచోట తమ ఇంట్లోని మహిళలను రంగంలోకి దించారు. అయితే అధికారం అందుకున్న తరువాత పాలనపై తమదైన ముద్ర కనిపించాలంటే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే వారి భవిష్యత్తు రాజకీయంగా మరింత ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విద్యాధికులు చైర్పర్సన్/మేయర్ స్థానాలు అధిరోహించిన మహిళల్లో విద్యాధికులూ ఉన్నారు. వీరిలో 8 మంది పీజీ చేసిన వారు ఉంటే.. 23 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారున్నారు. ఒక డాక్టర్ ఉన్నారు. అలాగే, టెన్త్, ఇంటర్ చదివిన వారూ ఉన్నారు. బీసీలకు 58 శాతం పదవులు రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జోరుగా ఆందోళన జరగడం, అది చట్టబద్ధత సాధించడానికి అనేక అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో 112 చైర్పర్సన్/మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీసీలకు 58.03 శాతం పదవులు దక్కాయి. ఇందులో ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా 22 పదవులు దక్కగా.. ఆ తరువాత గౌడ్లకు 8, ముదిరాజ్లకు 7, యాదవ సామాజిక వర్గానికి 5 చైర్పర్సన్ పదవులు లభించాయి. వీరు కాకుండా లింగాయత్. బెస్త, పద్మశాలి, స్వర్ణకారులు, బోయ, తేలి, కురుమ, రెడ్డిక సామాజిక వర్గాల వారూ ఉన్నారు. -
సిటీ బస్సుల్లోనూ లగేజ్ ర్యాక్స్
సాక్షి, హైదరాబాద్: జిల్లా సర్వీసుల్లో బస్సెక్కగానే ప్రయాణికులు వారి వెంట తెచ్చుకున్న బ్యాగులను బస్ అటక(ర్యాక్స్) మీద పెట్టేస్తారు... ఆ బరువు మోసే అవసరం వారికి ఉండదు. కానీ, హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఆ వసతి లేదు. దీంతో ప్రయాణికులు బరువు ఎంతున్నా, బ్యాగులను మోస్తూ నిలబడాల్సిందే. ఈ విషయంలో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో చాలా మంది ఈ విషయంలో ఆర్టీసీ పరిష్కారం చూపాలని కోరినా, బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ దానిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ, సిటీ బస్సుల్లో కూడా సామగ్రి పెట్టుకునే అటకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా 150 బస్సుల్లో ఏర్పాటు...జిల్లా సర్వీసుల్లాగా ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఎక్కువసేపు ప్రయాణించే పరిస్థితి ఉండదు. కానీ, ప్రయాణించే సమయం తక్కువే అయినా, ఎక్కువ బరువుతో ప్రయాణించేవారు లగేజీ పెట్టుకునే స్థలం లేక మోస్తూ నిలబడాల్సి వస్తోంది. సిటీ బస్సుల్లో ఎక్కువ సమయం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఆ సమయంలో నిలబడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు వారి బ్యాగులను కింద పెట్టే వీలు కూడా ఉండదు.తప్పని పరిస్థితిలో మోస్తూ ఉండాల్సిందే. పాఠశాల విద్యార్థులు భారీ బ్యాగులను మోస్తూ, రద్దీ మధ్యలో మెసలడం.. వారికి, తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా లగేజీ అటకలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత రెండు బస్సుల్లో ఏర్పాటు చేసి పరిశీలించింది. ప్రయాణికుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తొలిదశలో 150 బస్సుల్లో అటకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా సర్వీసుల్లో ఉండేంత విశాలంగా కాకుండా, తక్కువ ఎత్తుతో ఉండేలా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బస్సుకు రూ.15 వేలు...ఆర్టీసీకి ప్రత్యేకంగా మియాపూర్లో బస్బాడీ నిర్మాణ విభా గం ఉంది. సొంతంగా సిబ్బందే బస్సు బాడీలను తయారు చేసే సామర్థ్యం ఉన్న వారు కావటంతో, ఈ పనిని కూడా వారికే అప్పగించారు. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.15 వేల ఖర్చు అవుతుందని తేల్చారు. ప్రస్తుతం ఆ బస్సుల్లో అట కలు ఏర్పాటు చేసే పని జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ఆ బస్సులు అటకలతో తిరగనున్నాయి. అవి ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉన్నాయా, సిటీ రద్దీ నేపథ్యంలో అవి అంతగా వినియోగించుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది గుర్తించి... మిగతా బస్సుల్లో వాటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు. రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఒకచోట కాకుండా అటూ ఇటూ మారుతుంటారు. అలాంటప్పుడు ఈ ర్యాక్స్ను వినియోగించుకోవటం అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది పరిశీలించనున్నారు.అప్పట్లో పార్టీషన్ పేరుతో వృథా వ్యయం...ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత హైదరాబాద్ సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు–పురుష ప్రయాణికులు కలిసిఉండే వీలు లేకుండా ప్రత్యేక పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఓ వరుస సీట్లను తొలగించి మధ్యలో ఇనుప జాలీ తరహాలో స్లైడింగ్ డోర్తో కూడిన విభజనను ఏర్పాటు చేశారు. ఇందుకు ఏకంగా రూ.4.5 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఓ ఉన్నతాధికారి వీటి ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కొద్ది రోజులకే ఆ ఏర్పాటు వృథా ప్రయాస అని తేలిపోయింది. మళ్లీ వాటిని తీసేసి, వాటి కోసం తొలగించిన సీట్లను తిరిగి ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే, తాజా నిర్ణయం ఉపయోగకరమైంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావటంతో దీనికి సానుకూలత ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. -
పురపాలికల్లో పై‘చేయి’
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్లతోపాటు సింహభాగం మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను తన ఖాతాలో వేసుకుంది. కనీసం 90 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టణ స్థానిక సంస్థల్లో పట్టు సాధించగలిగింది. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక ప్రక్రియలో భాగంగా 81 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది.వీటితోపాటు నలుగురు స్వతంత్రులు, ఒక ఏఐఎఫ్ బీ అభ్యర్థి గెలుపొందిన స్థానాలు కూడా కాంగ్రెస్ మద్దతుతోనే వచ్చాయి. ఈక్రమంలో మరో 11 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్చైర్మన్ల ఎంపిక ప్రక్రియ మిగిలి ఉండగానే, 86 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక, పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ పీఠాలు తమవేననే ధీ మా అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం. ఆది నుంచీ ఆచితూచి పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మొదటి నుంచీ ఆచితూచి వ్యవహరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ముగిసేంతవరకు పార్టీ నాయకత్వం సమన్వయంతో వ్యవహరించింది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. వీరికి తోడు పీసీసీ నియమించిన సమన్వయకర్తలు, పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి వారు పార్టీ అభ్యర్థుల గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు.పీసీసీ ఏర్పాటు చేసిన వార్రూం కూడా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికల దిశలో నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. ప్రతి రోజూ ఎన్నికల సరళిని పర్యవేక్షించిన ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించి, తగిన సూచనలు చేశారు. గత నెలలో తన విదేశీ పర్యటనకు ముందు, ఆ తర్వాత రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్లను నేరుగా తన మాటలతో ఢీ కొట్టడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగలిగారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కూడా పార్టీ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పురపాలిక ఎన్నికల్లో ఘన విజయం దిశగా ముందుకు నడిపించారు. మెదక్లోనే... ఓ మోస్తరు పోయిన దగ్గరే వెతుక్కోవాలనే నానుడి చందంగా.. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో కొంతమేరకు ప్రతికూల ఫలితాలు వచి్చన ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాని నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునే విషయంలో పకడ్బందీగా వ్యవహరించింది. దీంతో నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను 90శాతానికి పైగా దక్కించుకోగా, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి ఫలితాలు, మెదక్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించగలిగింది.మరీ ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను పట్టుపట్టి మరీ అధికార పార్టీ చేజిక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడి సొంత స్థానం కావడంతో అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కాదని ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠంపై కూర్చోగలిగింది. సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, ఒక మెట్టు తగ్గి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వడంలోనూ తాము చాకచక్యంగా వ్యవహరించామ ని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి.ఇక్కడ మేయర్ పీఠం సీపీఐకి ఇవ్వడం ద్వారా ఆ పార్టీ భవిష్యత్తులో చేసే రాజకీయ పదవుల డిమాండ్కు చెక్ పెట్టగలిగామని అంటున్నాయి. ఇక, పుర పీఠాలనూ ఎక్కువ శాతం బీసీ వర్గాలకు కేటాయించామని, ఆయా వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాలతోపాటు రిజర్వు చేయని మున్సిపాలిటీలను కూడా వెనుకబడిన వర్గాలకు కేటాయించామని చెబుతున్నాయి. తాము చెప్పిన విధంగా 50 శాతం కంటే ఎక్కువ బీసీలకు అవకాశం కలి్పంచామని కూడా పేర్కొంటున్నాయి. అయితే, ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకునే విషయంలోనే వ్యూహాత్మక వైఫల్యం జరిగిందని, దీనిపై సమీక్ష చేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
నాలుగు లైన్ల ‘గ్రాండ్’ కారిడార్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ–ఉత్తర భారత్లను రైల్వే మార్గంతో జోడించే కీలక గ్రాండ్ ట్రంక్ రూట్లో నాలుగో లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలోనే అత్యంత బిజీ మార్గాల్లో ఇది ఒకటి. నిత్యం 160 రైళ్లు తిరిగే ఈ మార్గం పూర్తిస్థాయి పరిమితికి చేరుకోవడంతో కొత్త రైళ్లను నడపడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో మూడో లైన్ను నిర్మిస్తున్నారు. మరో మూడు నెలల్లో ఆ పనులు పూర్తి కానున్నాయి. దీంతో ఆ రూట్లో అదనంగా మరో 100 రైళ్లు నడిపేందుకు వెసులుబాటు కలిగింది. ఇక్కడితో ఆగిపోకుండా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మార్గంలో నాలుగో లైన్ను కూడా నిర్మించాలని నిర్ణయించింది. అధికారికంగా దీనికి మంజూరు ఇవ్వనప్పటికీ సర్వే పనులను ప్రారంభించి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు నాలుగో లైన్ నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు ఖర్చవుతాయని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. డీపీఆర్ పూర్తయ్యాక ఖర్చు విషయంలో మరింత స్పష్టత రానుంది. ప్రస్తుతం ఈ మార్గంలో మూడో లైన్ నిర్మాణం పూర్తి కావచ్చింది. బల్లార్షా–కాజీపేట మధ్య 201 కి.మీ. మూడో లైన్ ఇప్పటివరకు 183 కి.మీ. మేర పూర్తయింది. మిగతాది పురోగతిలో ఉంది. బెల్లంపల్లి – మందమర్రి – ఆసిఫాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ మధ్య పనులు జరుగుతున్నాయి. దీనికి రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాజీపేట–విజయవాడ మధ్య 219 కి.మీ. మేర పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 195 కి.మీ. పూర్తయ్యాయి. డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 24 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయి. దీనికి రూ. 3,300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి కానున్నాయి. ఇది దేశంలోనే ప్రధాన కారిడార్ అయినందున భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను భారీగా పెంచాలనేది కేంద్రం ఆలోచన.ప్రయాణికుల రైళ్లతోపాటు సరుకు రవాణా రైళ్లను విస్తృతంగా తిప్పాలని భావిస్తోంది. ప్రస్తుతం 424 కి.మీ. మేర నాలుగో లైన్ కోసం సర్వే జరుగుతోంది. మరో మూడు నెలల్లో డీపీఆర్ పూర్తి చేసి ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నాలుగేళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. భూసేకరణలో జాప్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వేగంగా కొలిక్కి తెచ్చి నిధుల సమస్య రాకుండా పనులను పరుగెత్తించాలని భావిస్తోంది. ఇది పూర్తయితే ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో రైళ్లు తిరిగేందుకు వీలు కలుగుతుంది.ఈ కారిడార్ పరిధిలో సిమెంటు పరిశ్రమలు, బొగ్గు గనులు ఉన్నందున వాటి ఉత్పత్తుల తరలింపు భారీగా పెరగనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, ఎరువుల సరఫరా మెరుగవనుంది. రైల్వేకు దీని వల్ల భారీ ఆదాయం లభించనుంది. ఇక ప్రస్తుతం గ్రాండ్ ట్రంక్ రూట్ దేశ రైలు అవసరాల్లో 40 శాతం తీరుస్తోంది. ఈ మార్గంలో భవిష్యత్తులో సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో ట్రాక్ను 180 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించనున్నారు. -
పిండం గుండె.. గండం పెరుగుతుండె!
సాక్షి, సిటీబ్యూరో: తల్లిగర్భంలో ఉండగానే పిండం గుండె లయ తప్పుతోంది. హార్ట్బీట్ రేటు గణనీయంగా తగ్గిపోతోంది. హైదరాబాద్లో ఇలాంటి కేసులు ఇటీవల బాగా పెరిగాయి. రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్కు నెలకు 300 కేసులు వస్తుండగా, అందులో సుమారు 30 వరకు ఫీటల్ హార్ట్ రేటు సమస్యలున్నాయి. గర్భం దాల్చిన 16 వారాల నుంచి 18 వారాల్లో ఎర్లీ టిఫా స్కాన్ చేసి పిండం పరిస్థితిని గుర్తించవచ్చని, సరైన సమయంలో స్పందించి చికిత్స అందిస్తే, పుట్టబోయే బిడ్డకు సాధారణ జీవితం అందించేందుకు వీలుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? జాగ్రన్ సిండ్రోమ్, ఎస్ఎల్ఈ, యాంకలైజింగ్, స్పాండలైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న గర్భిణుల్లోని పిండంపై హార్ట్బీట్ రేటుపై ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పిండం గుండె తెల్లగా మారిపోతోంది. గుండె చుట్టూ నీరు చేరుతుంది. హార్ట్ వాల్్వలు లీకవుతాయి. ఇటువంటి సమయంలో తల్లి నుంచి ప్లాసెంటా ద్వారా చికిత్స చేయడంలో ఎఫెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆశించిన మేరకు ఉండటంలేదు. దీంతో నేరుగా పీటస్కే ట్రీట్మెంట్ అందించే అత్యంత సంక్లిష్టమైన వైద్యసేవలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్కు తెలంగాణలోని ఇతర జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి రిఫరల్ కేసులు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తుమ సేవలు పిండం గుండెకు చికిత్సను ఇప్పటివరకు తల్లి నుంచే అందిస్తుండగా, తాజాగా నేరుగా ట్రీట్మెంట్ చేసే అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. పిండం హార్ట్ రేటు తక్కువగా ఉండటం, గుండె చుట్టూ నీరు చేరడం వంటి సందర్భాల్లో నేరుగా ఇమ్యునోగ్లోబిలిన్ థెరఫీ చేస్తున్నారు. దీనిలో 95 శాతం సక్సస్ రేటు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇమ్యునోథెరపీ సేవలందించే ఆసుపత్రులు ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి.అందులో హైదరాబాద్కు స్థానం లభించడం గమనార్హం. అంతర్జాతీయంగా అత్యుత్తమ వైద్యసేవలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తోందనేందుకు ఇదొక ఉదాహరణ. అత్యాధునిక శస్త్రచికిత్సల్లో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో వివిధ దేశాల నుంచి శస్త్రచికిత్సల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడి చికిత్సలపై ప్రఖ్యాత అమెరికన్ మ్యాగ్జైన్ జాక్ (జేఏసీసీ)లోనూ కథనాలు ప్రచురితం కావడం గరి్వంచదగ్గ విషయమని వైద్యునిపుణులు పేర్కొంటున్నారు.18వ వారం నుంచి ట్రీట్మెంట్ నెలకు 300 కేసుల వరకు ఫీటల్ ఎకో చేస్తున్నాం. అందులో పది శాతం కేసుల్లో ఫీటల్ హార్ట్ రేట్ సమస్యలు ఉంటున్నాయి. గర్భం దాల్చిన 16 నుంచి 18 వారాల్లో ఎర్లీ టిఫా స్కాన్ చేయించుకోవడం మంచిది. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుర్తించి, త్వరితగతిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయంలో ఇమ్యునోథెరపీ చేస్తున్నాం. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినా నిలవకపోవడం, అబార్షన్లు వంటి సమస్యలు ఉన్నపుడు ఎక్సటెండెడ్ ఏఎన్ఐ టెస్టు చేయించుకోవాలి. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకునేటప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. – డా. భార్గవి, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ -
63 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీస్ కమిషనరేట్లో పని చేస్తున్న మరో 63 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్ వీసీ సజ్జనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్లైన్లలో పని చేసిన, చేస్తున్న వారికి ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్లు దక్కాయి. అలాగే వివిధ విభాగాల్లో ఎటాచ్మెంట్, వెయిటింగ్లో ఉన్న వారినీ వివిధ స్థానాల్లో నియమించారు. ఐదుగురిని కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ (ఐఎంసీ), యాంటీ ఫుడ్ అడాల్ట్రేషన్ టీమ్ (ఏఎఫ్ఏటీ) విభాగాల్లో నియమించారు. అధికారి - పోస్టింగ్ టి.రాంబాబు - చార్మినార్ వి.రామకృష్ణ - చిలకలగూడ బి.లక్ష్మీనారాయణ రెడ్డి - పహాడీషరీఫ్ ఆర్.రుక్మిణి - ఆసిఫ్నగర్ ట్రాఫిక్ జి.రాజగోపాల్ రెడ్డి - ముషిరాబాద్ ఎన్.మోహన్రావు - అఫ్జల్గంజ్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ - మీర్చౌక్ ఎస్.కోటేశ్వరరావు - ఛత్రినాక కె.నర్సింహ్మ - డబీర్పుర జి.నరేష్ - సుల్తాన్బజార్ ఎం.మహేష్ - ఉస్మానియా వర్సిటీ కె.కరుణాకర్ - భవానీనగర్ ఎస్.సంతోషం - ఛత్రినాక ట్రాఫిక్ డి.అశోక్ - సనత్నగర్ ఇ.జంగయ్య - ఫలక్నుమా ఎ.సీతయ్య - సైఫాబాద్ యు.శ్రీనివాసులు రెడ్డి - జూబ్లీహిల్స్ కె.మధులత - ఐఎంసీ బి.ధనలక్ష్మి - ఐఎంసీ బి.నర్సిములు - ఐఎంసీ ఎ.పురేందర్రెడ్డి - ఐఎంసీ ఎన్.రంజిత్ కుమార్ గౌడ్ - ఏఎఫ్ఏటీ -
తన బిడ్డ జాడ కోసం అడవిలో దారి చూపించిన ఆవు..!
అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒక్కటే. అది మనుషుల్లోనైనా, మూగ జీవాల్లోనైనా. ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ ఇటిక్యాల పహాడ్ లో ఆవు దూడపై పులి దాడి చేసింది. అయితే పశు యజమాని, అధికారులు.. ఆవు దూడపై పులి దాడి చేసిన చోటును గాలిస్తుండగా, అది చూసిన ఆవు.. వారిని తన వెంట తీసుకెళ్లింది. తాను ముందుండి దారి చూపిస్తూ అధికారులను తన వెనకాలే రమ్మన్నట్లగా ముందుకు సాగింది. ఇలా పులి దాడి చేసిన ప్రాంతానికి తీసుకెళ్లింది. ఇలా బిడ్డపై తన ప్రేమను చాటుకుంది ఆవు.. అయితే పులి దాడి చేసి ఆ దూడను అప్పటికే మింగేసి ఉండొచ్చు. కాకపోతే ఆవు ఇలా దారి చూపించి తన బిడ్డను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం మాత్రం అమ్మ ప్రేమకు అద్దం పడుతోంది.. తాను ఆవునే కానీ, అంతకుమించి అమ్మను తెలియజెప్పింది.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక నజర్
హైదరాబాద్: హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ దక్కించుకున్న 17 మున్సిపాలిటీలకు గాను 8 హంగ్ మున్సిపాలిటీలపై సీనియర్ నేతలను అక్కడ ఇంచార్జ్లుగా నియమించింది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ గూండాగిరీ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని ఎన్నికైన వారిని సాఫీగా సాగేలా చూసుకోవడమే లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా స్థానిక పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల పైన పార్టీ మొత్తం అండగా ఉందని భరోసా ఇచ్చారు. కిడ్నాప్ల, దాడులు, అక్రమ ఓట్లతో పదవుల కొల్లగొట్టే కుట్ర చేశారన్నారు. దిగజారిన శాంతిభద్రతలకు నేడు జరిగిన పరిణామాలే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ తొత్తులగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘మా పార్టీ బేస్ పెరిగింది.. ఓటింగ్ శాతం పెరిగింది’
హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బైంసా, నారాయణపేట్లలో బీజేపీ జెండా ఎగురువేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బైంసాలో తమ కార్యకర్తలను వేధించి, వందలు కేసులు పెట్టి జైలుకు పంపారని, అయినా ఇక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా బైంసా ప్రజలకు రాంచందర్రావు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ మా ఓటు శాతం భారీగా పెరిగింది. 25 మునిసిపాలిటీలలో డిసైడింగ్ పార్టీ గా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్గా గెలుస్తున్నాం. చాలా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్టెస్ట్ పార్టీగా ఉన్నాం. ప్రతి చోటా మా ప్రాతినిధ్యం పెరిగింది మా పార్టీ బేస్ పెరిగింది. బీఆర్ఎస్ 43 నుంచి 27కు పడిపోయింది. 14 శాతం తగ్గింది. 550 వార్డులు నష్టపోయింది బీఆర్ఎస్. 70 గెలిచినా 2003తో పోలిస్తే కాంగ్రెస్కు చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. రూలింగ్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణ హిస్టరీలో మొదటి సారి మునిసిపల్ కార్పొరేషన్ను బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ ప్రజలకు, బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్న. ఎలాంటి పొత్తు లేకుండా మా సొంతంగా కరీంనగర్ మేయర్ స్థానాన్ని గెలిచాం. నిజామాబాద్లో మాది సింగిల్ లార్జెస్ట్ పార్టీఅరవింద్, రాకేష్, ధన్పాల్ సూర్యనారాయణ కష్టపడి పని చేశారు. మజ్లిస్ పార్టీ ఓట్లు ఎలా పెరుగుతున్నాయి. బీజేపీ ఎక్కడ వస్తుందో అక్కడ ఈ రెండు పార్టీలు ఎంఐఎం తో కలిసి మేయర్, చైర్మన్ రాకుండా చేశాయి. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న దానికి ఏం పేరు ఇవ్వాలి. ప్రజలే వీరి మధ్య సంబంధం ఏంటో చూడాలి. కమ్యునిస్టు పార్టీలు కనుమరుగు అవుతున్నాయి. వాటికి రేవంత్ రెడ్డి ప్రాణం పోసేలా చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఆలోచన చేయాలి. ఏప్రిల్లో ఎస్ఐఆర్ రాబోతుంది. అధికారులు అప్రమత్తంగా దొంగ ఓట్లు తొలగించాలి. ఓటర్లకు తెలియకుండానే వారి ఇళ్లలో ఓట్లను చేరుస్తున్నారు. బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విప్ జారీ చేశాం’ అని రాంచందర్రావు స్పష్టం చేశారు. -
పార్టీలో కొనసాగాలా?.. జీవన్రెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన పార్టీపై అసహానం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు..?కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఛైర్పర్సన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచీ తాను మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే పని చేస్తే ఇంకా తాను కాంగ్రెస్లో కొనసాగాలా అని ప్రశ్నించారు. జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలన్నారు. అభివృద్ధి పేరుతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకని ఎమ్మెల్యేను సంజయ్ను ప్రశ్నించారు.కాంగ్రెస్లో అన్యాయం జరిగిన వారికే తాను మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం తమ వర్గంపై ఈ వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు.ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగాలా, వద్దా అన్న సందిగ్ధ పరిస్థితి తనకు నెలకొందని జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా ఛైర్పర్సన్ను ఎన్నుకోవాలంటే కనీసం 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. బీజేపీకి, ఆరు, బీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకున్నాయికాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14మంది, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం నుంచి 17మంది పోటీ చేయగా తొమ్మిది మంది విజయం సాధించారు.స్వతంత్రుల్లో తొమ్మిది మంది జీవన్ రెడ్డి వర్గం కాగా.. నలుగురు ఎమ్మెల్యే వర్గీయులు, ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉన్నారు. ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా సంజయ్ వర్గానికి చైర్పర్సన్ పదవి అప్పగించేందుకు నిర్ణయించారు. దీంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. -
తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తత మున్సిపల్ ఎన్నిక రేపటికి వాయిదా
-
ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి, 5వేలకు పైగా శైవభక్తిగీతాలు
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.Zoom వెబినార్ ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సూపర్ ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు Nikeelu Gunda తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ ప్రకటించింది. -
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీబీసీ,గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదనిన గీతం యూనివర్శిటీ సుప్రీంలో వాదించింది. అయితే వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది. -
ట్విస్ట్.. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్, అలాగే బీఆర్ఎస్లో చేరిన ఇండిపెండెంట్ సభ్యుడు పార్టీ బలాన్ని పెంచారు. దీంతో బీఆర్ఎస్ బలం 14కి చేరింది. కాంగ్రెస్ బలం మాత్రం 12 వద్ద నిలిచింది. ఈ సమీకరణలతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. ఫలితంగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు బలపడుతున్నాయి.స్థానికంగా ఈ పరిణామం పెద్ద రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్లను పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రాజ్యాంగబద్ధంగా తమకే అధికారం ఉందని వాదిస్తోంది. -
PJTSAU : పరీక్షా పేపర్ లీకేజీ కలకలం
సాక్షి,హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పరీక్షా పేపర్ల లీకేజీ కలకలం సృష్టిస్తున్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ మూడవ సంవత్సరరం పరీక్ష పేపర్లు వాట్సప్లో చక్కెర్లు కొట్టాయి. అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో జూనియర్ అసిస్టెంట్ కార్తిక్ ఈ పేపర్ను లీక్ చేసి, దానిని 1.4 లక్షల రూపాయలకు విక్రయించినట్లు తేలింది. ప్రాథమిక విచారణలో పేపర్ లీక్ వరంగల్ నుంచి జరిగినట్లు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.సీఐడీ అధికారులు ఈ వ్యవహారాన్ని పూర్తిగా విచారించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. -
షవర్కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ స్టూడెంట్ బలవన్మరణంచింతల్: పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలో నివాసముంటున్న అశోక్బాబు కుమార్తె నాగలిఖిత (17) జీడిమెట్లలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన గదిలో చదువుకోవడానికి వెళ్లింది. కాసేపటి తరువాత చెల్లెలు గీతిక సాయి గది తలుపు తట్టగా స్పందన రాలేదు. అపార్ట్మెంట్ వాచ్మన్ సహాయంతో తలుపు తాళం విరగొట్టి లోపలికి వెళ్లగా చున్నీని మెడకు కట్టుకొని మంచానికి చున్నీని కట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. షవర్కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య ఫిలింనగర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని షవర్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ మహబూబాబాద్కు చెందిన గుగులోత్ సంధ్యారాణి(20) షేక్పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఫాల్కన్ వ్యాలీ కాలనీలో హాస్టల్లో ఉంటోంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రేక్పాస్ట్ చేసిన అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్రూమ్లోకి వెళ్లి చున్నీతో షవర్కు ఉరేసుకుంది. కాసేపటి తరువాత మిత్రులు బాత్రూమ్ తట్టగా లోపలి నుంచి గడియ వేసి ఉంది.దీంతో హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా షవర్కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయవద్దని మృతురాలు వాట్సప్ మెసేజ్ పెట్టింది. ఈ మేరకు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేశారు. కళాశాల యాజమాన్యం, వేధింపుల వల్లనే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరగబడ్డ ‘ఓటుకు నోటు’
సాక్షిబ హైదరబాద్: తనకు ఓటు వేయాలంటూ ఓటర్లకు ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని ఓ అభ్యర్థి భర్త అడుగుతుండటంతో ఓటర్లు తిరగబడ్డారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారంలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ వీడీయో సోషల్ మీడీయాలో చక్కర్లు కోడుతుంది. బండమాదారంలోని 9వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు ఆకుల సురేష్ కు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆయన తరన భార్య విజయలక్ష్మీతో నామినేషన్ వేయించి బరిలో దింపాడు. ఫలితాల అనంతరం విజయలక్ష్మి మూడవ స్ధానంలో నిలిచారు. దీంతో విజయలక్ష్మి భర్త సురేష్ .. ఓటర్ల వద్దకు వెళ్ళి ఓటు కోసం తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పినా వినకుండా వారితో వాదనకు దిగారు. ఓటు వేశామని ఆలయంలోకి వెళ్లి ప్రమాణం చేయాలని కోరడంతో తిరగబడ్డారు. ఎన్నికలన్నప్పుడు అందరూ వస్తారు.. అందరూ డబ్బులు ఇస్తారు.. నచి్చన వారికి ఓటు వేస్తాం అందరికీ ఎలా వేస్తాం అని ప్రశ్నించారు. -
కొండా సురేఖ మనవడి పాటకు ప్రభాస్ వాయిస్ ఓవర్
బంజారాహిల్స్ : రెండున్నరేళ్ల వయసులో లింగాష్టకం పఠించి అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఆ చిన్నారి. ఈ వీడియోకు హీరో రెబల్స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రభాస్ స్వరం అధనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇంత చిన్న వయసులో భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మికతలో ప్రతిభను ప్రదర్శించిన బుడతడిని ప్రభాస్ ప్రశంసించారు. ఆ బుడతడే దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మనుమడు కొండా మురళీకృష్ణ పటేల్. చిన్నారి స్వచ్ఛమైన భక్తి, కుటుంబ విలువలు సమాజానికి మార్గదర్శకమని, ఇతర పిల్లలకు కూడా స్ఫూర్తి దాయకమని కొనియాడారు. కాగా చిన్నారి కొండా మురళీకృష్ణ పటేల్ తల్లిదండ్రులు సుషి్మతాపటేల్, అభిలాష ప్రభాస్ ప్రశంసల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి షాకిచ్చిన అధిష్టానం
సాక్షి,జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎమ్మెల్యే సంజయ్ తరుఫు వర్గానికి చెందిన అభ్యర్థిని మున్సిపల్ ఛైర్ పర్సన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి మొండి చేయిచూపించింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. జగిత్యాలలలో మున్సిపాలిటీ వార్డులు మొత్తం 50 ఉండగా ఛైర్పర్సన్ను ఎన్నుకోవాలంటే కనీసం 25 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో ఆయన వర్గానికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఈ పరిణామం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వర్గానికి పెద్ద దెబ్బగా మారింది.కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. వాణి అభ్యర్థిత్వం ఖరారవడంతో, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండే అవకాశం బలపడింది. అయితే, ఈ నిర్ణయం వల్ల పార్టీ అంతర్గతంగా విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బస్సు.. రాదేం బాసూ!
సాక్షి, హైదరాబాద్: ఇది ఆరాంఘర్ చౌరస్తాలోని బస్టాప్. శనివారం రాత్రి 9 గంటలు దాటింది. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ మీదుగా ఉప్పల్కు రాకపోకలు సాగించే సిటీబస్సు (రూట్ 300) కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. గంట సేపట్నుంచీ ఇలా పడిగాపులు కాస్తున్నారు. చాలాసార్లు ఆఖరి బస్సు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణం చేయడం షరామామూలుగా మారింది. ఈ ఒక్క రూట్లోనే కాదు.. నగర శివారు కాలనీలకు, దూర ప్రాంతాలకు సకాలంలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి రాత్రి 9 గంటల తర్వాత, శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో సిటీ బస్సులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకొనే నెపంతో పలు డిపోల్లో ఆఖరి ట్రిప్పులను నిలిపివేస్తున్నారు. మరోవైపు కొన్ని డిపోలు నైట్ హాల్ట్ సరీ్వసులకు సైతం స్వస్తి చెబుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు, ఆలస్యంగా విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రయాణికులు అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇదే అదనుగా ఆటోవాలాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు, కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీ మేరకు రాత్రి 12 తర్వాతా ఆఖరి ట్రిప్పులు తిరగాలి. కానీ.. కొన్ని రూట్లలో ప్రయాణికులు లేరనే సాకుతో డ్రైవర్లు, కండక్టర్లే ఆఖరి ట్రిప్పులను రద్దు చేస్తున్నారు. మరికొన్ని డిపోల పరిధిలో బస్సుల నిర్వహణ ఖర్చును తగ్గించుకొనే నెపంతో ట్రిప్పుల్లో కోత విధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, గండిమైసమ్మ, మొయినాబాద్, శామీర్పేట్, తదితర ప్రాంతాల్లో చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలకు రాత్రి వేళల్లో ట్రిప్పులను నిలిపివేస్తున్నారు. నైట్హాల్ట్ సర్వీసులను కూడా అధికారులు రద్దు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నైట్డ్యూటీ సిబ్బందికి అదనపు అలవెన్సులను భారంగా భావించడంతోనే నైట్హాల్ట్ సరీ్వసులు నిలిచిపోతున్నాయని డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నారు. నిత్యం 20 లక్షల మంది ప్రయాణికులు.. గ్రేటర్ పరిధిలో 25 డిపోల నుంచి నిత్యం సుమారు 2,850 బస్సులకుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్టీసీ అంచనా ప్రకారం 20 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. కానీ మహా నగర విస్తరణకు అనుగుణంగా సిటీబస్ సేవలు విస్తరించకపోవడంతో ప్రజా రవాణా సదుపాయం తగ్గుముఖం పడుతోంది. బస్సు ట్రిప్పుల కొరత మరింత ఆజ్యం పోస్తోంది. -
కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు కొలువు తీరాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్ఈసీ అధికారిక వివరాలు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు చేరాయి. బీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు చేరగా, బీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ చేరింది. ఇక సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్ చేరగా, ఇండిట్లు నాలుగు మున్సిపాలిటీలను దక్కించుకున్నారు.మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్ఈసీ అధికారిక వివరాలుకాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లుబీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలుబీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్నాలుగు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లువరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలుతొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు వాయిదా..మిగిలిన 9 మున్సిపాలిటీలలో చైర్మన్ల ఎన్నిక పూర్తి..9 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీతొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్టు ప్రకటించిన అధికారులు* భూపాలపల్లి మున్సిపాలిటీ - (కాంగ్రెస్) _ చైర్మన్ బుర్ర కొమురయ్యనర్సంపేట_ చైర్మన్ గా పెండెం శ్రీలక్ష్మి ( కాంగ్రెస్ )స్టేషన్ ఘన్పూర్_ మున్సిపాలిటీ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్ ( కాంగ్రెస్ )వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి ( కాంగ్రెస్ )ములుగు మున్సిపాలిటీ చైర్మన్ గా చింతనిప్పుల చంద్రకళ ( కాంగ్రెస్ )మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి ( కాంగ్రెస్ )పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ( కాంగ్రెస్ )మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి ( కాంగ్రెస్ )కేసముద్రం మున్సిపాలిటీ చైర్మన్ బానోత్ సునీత ( కాంగ్రెస్ ) ఎన్నికకాంగ్రెస్లో కొనసాగడంపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్జగిత్యాల మున్సిపల్ ఎన్నికపై జీవన్ రెడ్డి విచారంసంతోషమా.. బాధ అర్థం కావడం లేదు: జీవన్ రెడ్డిపార్టీ జెండా మోసిన వ్యక్తికే పదవి ఇవ్వాలని మెుత్తుకున్నాకాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందిపార్టీలో ఉండాలా లేదా అనే సందిగ్ధత నెలకొంది జగిత్యాల జిల్లాజగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి మెట్పల్లి ఛైర్మన్ స్థానంపై బీజేపీ నేతల అసంతృప్తిఅసంతృప్తితో మెట్పల్లిలోని ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతలు యాదగిరి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలుబీఫామ్లు ఇవ్వడంలో యాదగిరి నిర్లక్షం చేశారని ఆరోపణ10 సీట్లు గెలిచినా ఛైర్మన్ దక్కలేదని నేతల అసంతృప్తిఏడు కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక పూర్తిమహాబూబ్నగర్, నల్గగొండ, మంచిర్యాల, కాంగ్రెస్ కైవసంరామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంకొత్తగుడెం కార్పొరేషన్ కైవసం చేసుకున్న సీపీఐకరీంనగర్ కార్పొరేషన్ చేజిక్కించుకున్న బీజేపీమెుత్తంగా కాంగ్రెస్కు ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలలో ఇల్లందు మినహా కొత్తగూడెం కార్పొరేషన్లో చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తిఎదులాపురం మున్సిపాలిటీ చేర్మెన్ గా పోకబత్తిన అనిత, వైస్ చైర్మన్ గా తమ్మినేని నవీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికవైరా మున్సిపాలిటీ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్మధిర మున్సిపాలిటీ ఛైర్మెన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్స్ ఆఫీషియో సభ్యుడుగా తన ఓటు వినియోగించుకున్నారుసత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా రెహానా బేగం, వైస్ చైర్మన్గా బొంతు సుమలతకల్లూరు మున్సిపాలిటీ చైర్మన్గా ధరావత్ మోహన్ నాయక్ , వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరికొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సీపీఐ పార్టీకి చెందిన మూడ్ గణేష్వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరిపురపు లలిత కుమారిఅశ్వారావుపేట మున్సిపాలిటీలోచైర్మన్, వైస్ చైర్మన్లుగా భార్యా, భర్తలుచైర్మన్గా జూపల్లి శశికళవైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికరంగారెడ్డి జిల్లాఆమనగల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ నేనవత్ పత్య నాయక్ క్లినిక్ పై దాడి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలుబీఆర్ఎస్ నుండి కౌన్సిలర్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆగ్రహంబిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పత్య నాయక్రంగారెడ్డి జిల్లాఇబ్రహీంపట్నంలో క్యాంప్ రాజకీయాలురహస్యప్రాంతాలకు కౌన్సిలర్ల తరలింపుఅభ్యర్థులను తరలిస్తున్న పార్టీలుఎన్నికలు వాయిదా పడడంతో అభ్యర్థుల తరలింపుమహబూబాబాద్ జిల్లాఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ ఫిర్యాదుకావ్య ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదని బీఆర్ఎస్ ఫిర్యాదుగ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఇదివరకే కావ్య ఓటు వేశారని ఫిర్యాదు హంగ్ వచ్చిన మూడు చోట్ల కాంగ్రెస్ పాగాకేసముద్రం,మహబూబాబాద్, వర్ధన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశంతెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీ పూర్తిగా బీజేపీ కైవసంభైంసాలో ఇండిపెండెంట్ కు మద్ధతుఐదు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ల పదవులు దక్కించుకున్న బీజేపీకరీంనగర్ కార్పోరేషన్ బీజేపీ వశంనారాయణపేట్ మున్సిపాలిటీ బీజేపీ కైవసంభైంసా ఇండిపెండెంట్లతో కలిసి బీజేపీ వశం3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లు దక్కించుకున్న బీజేపీ1. ఆమన్ గల్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ2. జిన్నారం (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ3. నర్సాపూర్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ4. అలియాబాద్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ5. ఎల్లంపేట (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీనిర్మల్ జిల్లాభైంసా మున్సిపాలిటీ ఛైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థిఛైర్మన్గా ప్రమాణస్వీకారం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి తూముదత్తాత్రి26స్థానాలకు 12 చోట్ల గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు సూర్యాపేట జిల్లాసూర్యాపేట మన్సిపల్ ఛైర్మన్గా మొరిశెట్టి నివేదితవైస్ ఛైర్మన్గా ఎండీ షపీఉల్లా ఎన్నికకోదాడ ఛైర్మన్గా వేర్నేని కుసుమ వెంకటరత్నంవైస్ ఛైర్మన్గా దేవర పల్లిమల్లీశ్వరిహుజూర్నగర్ ఛైర్మన్ డోంతగాని శ్రీనివాస్ గౌడ్వైస్ ఛైర్మన్గా తన్నీరు మల్లిఖార్జుననేరెడుచర్ల ఛైర్మన్గా కొణతం చిన వెంకట్ రెడ్డివైస్ ఛైర్మన్గా నూకల సందీప్ రెడ్డితిరుమలగిరి ఛైర్మన్గా ఎస్ రఘనందన్ రెడ్డివైస్ ఛైర్మన్గా గోవిందమ్మయాదాద్రి జిల్లాభువనగిరి ఛైర్మన్గా తంగళ్ళపల్లి శ్రీవాణివైస్ఛైర్మన్గా పోతంశెట్టి మంజులయాదగిరిగుట్ట ఛైర్మన్ భరత్ గౌడ్వైస్ ఛైర్మన్గా బరిగే రమ్య ప్రమాణస్వీకారంచౌటుప్పల్ ఛైర్మన్గా మోగుదాల పావనివైస్ ఛైర్మన్గా గోశిక వినయ్ ప్రమాణస్వీకారంభూదాన్ పోచంపల్లి ఛైర్మన్ తడక వెంకటేశంవైస్ ఛైర్మన్గా కొయ్యడ రజినిఆలేరు ఛైర్మన్గా బాలామణివైస్ ఛైర్మన్గా ఇంగడి ఆంజనేయులుమోత్కూరు ఛైర్మన్గా గడ్డం స్వప్నవైస్ ఛైర్మన్గా పల్లెర్ల వెంకన్ననల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ (ఆమీర్)నల్లగొండ జిల్లామిర్యాలగూడ ఛైర్మన్గా చిలుకూరు సుధ వైస్ ఛైర్మన్గా పావని ప్రమాణస్వీకారంచిట్యాల ఛైర్మన్గా పందిరి గీత ప్రమాణస్వీకారం వైస్ ఛైర్మన్గా గుండెబోయిన శ్రీలక్ష్మిదేవరకొండ: ఛైర్మన్గా పున్న శైలజవైస్ ఛైర్మన్గా జూబేరియా తబసుంచండూరు: ఛైర్మన్గా కోడి శ్రీనివాసులువైస్ ఛైర్మన్గా దశరథ ప్రమాణస్వీకారంహాలియా ఛైర్మన్గా చింతల రామచంద్రారెడ్డివైస్ ఛైర్మన్గా రాజా రమేష్ ఎన్నికనందికొండ ఛైర్మన్గా గౌతమివైస్ ఛైర్మన్గా రాజా ప్రసాద్ ప్రమాణస్వీకారం. మహబూబ్నగర్ మేయర్ కాంగ్రెస్ వశంమేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మమత రాష్ట్రంలో 11 మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎన్నికలు వాయిదాఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదాఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదాక్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూర్ ఎన్నిక వాయిదానారాయణపేట మున్సిపాలిటీ బీజేపీదే నారాయణపేట మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న బీజేపీనారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు వేసిన ఎంపీ డీకే అరుణ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీజేపీ కైవసంఇటీవల బీజేపీలో చేరిన ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిపి 12కి చేరిన బీజేపీ బలం 12 మంది కౌన్సిలర్లతోపాటు, ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో మేజిక్ ఫిగర్ 13కి చేరిన బీజేపీ బలం.నారాయణ పేట మున్సిపాలిటీ చైర్మన్గా కొండా శ్వేత ఎన్నికనారాయణ పేట మున్సిపాలిటీ ఓటింగ్కి దూరంగా ఉన్న బీఆర్ఎస్నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు.మున్సిపాలిటీ చైర్మన్ పదవికి మేజిక్ ఫిగర్ 13..11 వార్డులలో బీజేపీ విజయం.7 వార్డులలో కాంగ్రెస్ విజయం.2 స్థానాలలో BRS అభ్యర్థులు విజయం.2 వార్డులలో AIMIM కైవసం.ఒక వార్డులలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా.. ఇటీవల బీజేపీలో చేరారుఒక వార్డులో గెలిచిన AIFB అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు.పెద్దపల్లి జిల్లా:మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్గా ముస్కుల సహేందర్ రెడ్డి ఎన్నికకరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్: కరీంనగర్ మేయర్గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ప్రమాణం.34 ఓట్లతో మేయర్ అభ్యర్థి ప్రకటనకాంగ్రెస్- 14టీఆర్ఎస్- 9ఎంఐఎం- 3ఇండిపెండెంట్స్- 8నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ :నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉమా రాణి 49వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన ఉమా రాణి.డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్54 డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నిక ఎంఐఎం కామారెడ్డి:కామారెడ్డి మున్సిపాలిటీలో బిగ్ ట్విస్ట్ కాంగ్రెస్కు మద్దతు పలికిన బీఆర్ఎస్ కౌన్సిలర్లుకామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి ఎన్నిక ఇబ్రహీంపట్నం:ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతమున్సిపల్ కార్యాలయంపై రాళ్లతో దాడిఎన్నికను ఆపాలంటూ కాంగ్రెస్,బీఆర్ఎస్ ఆందోళన ఆందోళ కారుల్ని చెదరగొట్టిన పోలీసులు కౌన్సిలర్ యాదగిరి కనిపించకుండా పోవడంతో అనుచరుల ఆగ్రహం ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్తెలంగాణలో ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లలో పదవుల కోసం బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పోటీ అభ్యర్థులను మభ్యపెడుతున్న పార్టీలు అభ్యర్థుల కోసం క్యాంపు రాజకీయాలు ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న హైటెన్షన్రంగారెడ్డి:ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ఒకే కారులో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావుఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన మహిపాల్రెడ్డి,రఘునందన్ రావుఎక్స్అఫిషియో ఓట్లతో బీఆర్ఎస్కు దక్కనున్న ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం తొర్రూర్ మున్సిపాలిటీ: తొర్రూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవికిపై ఉత్కంఠ తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు తొమ్మిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లుబీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ యత్నం అంటూ ఆరోపణలు కాంగ్రెస్పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహంకాంగ్రెస్ ఎక్స్ అఫిషియో ఓట్లతో ఏదో చేయాలని కాంగ్రెస్ చూస్తోందిఎంపీ కడియం కావ్య 2025 ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారుఎంపీ కడియం కావ్య ఓట్లను పరిగణలోకి తీసుకుంటే హైకోర్టుకు వెళతాం. రాజ్యాంగ బద్ధంగా, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి మాదే. జనగామ జిల్లా:తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్డగింతతొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్దకు వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన ఎంపీకాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలుబీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులట.కరీంనగర్: జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ ఎన్నికలో కొనసాగుతున్న ఉత్కంఠ.జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో సహా బి అర్ ఎస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లు ఇండిపెండెంట్లు మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్న బీఆర్ఎస్, బీఅర్ఎస్ చైర్మెన్ పీఠం దక్కించుకునే అవకాశం. కరీంనగర్:కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీకరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించిన బీజేపీబీజేపీ క్యాంప్ నుండి అభ్యర్ధులను లాగి ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ఈ క్రమంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్న బీఆర్ఎస్సూర్యాపేట జిల్లా:కోదాడ మున్సిపాలిటీలో పదవి పంపకాలుచైర్ పర్సన్ ఆశావాహులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్లో బుజ్జగింపు రాజకీయాలుమొదటి రెండు సంవత్సరాలు చైర్ పర్సన్గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబువైస్ ఛైర్మన్గా దేవారంపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డిఅనంతరం మరో మూడు సంవత్సరాలుచైర్ పర్సన్గా పారా సత్యవతి సీతయ్యవైస్ చైర్మన్ గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు పేర్లు ఖరారు జగిత్యాల జిల్లా:జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసంసీల్డ్ కవర్లో చైర్మన్ అభ్యర్థి పేరుఇప్పటికీ చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని అధిష్ఠానంజీవన్ రెడ్డి, సంజయ్కు కూడా అందని సమాచారంవాణి, జ్యోతి అనే ఇద్దరు కౌన్సిలర్ల పేర్లను అధిష్ఠానం ముందు ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజయ్అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న జీవన్ రెడ్డి, సంజయ్ఎవరి వర్గం వారు చైర్మన్, వైస్ చైర్మన్ కాబోతున్నారన్న ఉత్కంఠ.కరీంనగర్: కరీంనగర్లో శరవేగంగా మారుతున్న మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు..రాత్రికి రాత్రే చక్రం తిప్పిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కాంగ్రెస్కు మేయర్, డిప్యూటీ పీఠాలు దక్కాలంటే బీఆర్ఎస్, ఇండిపెండెంట్స్, ఎంఐఎం మద్దతు తప్పనిసరికానీ, చేతులెత్తి ఓటేసే విషయంలో పీఠముడిబీఆర్ఎస్ అభ్యర్థుల డిమాండ్లకు కాంగ్రెస్ సరైన స్పందన లేకపోవడంతో అలకతటస్థంగా వ్యవహరించాలని నిర్ణయం..?మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తకపోతే బీజేపీదే విజయంఉత్కంఠగా మారిన కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా:వ్యూహ-ప్రతివ్యూహాల నడుమ మున్సిపల్ పోరుఎక్స్ అఫీషియో ఓట్లతో గేమ్ ప్లాన్గెలుపు గుర్రాలను తేల్చేది ప్రజా ప్రతినిధులేఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ఎత్తుగడలుకింగ్ మేకర్లుగా స్వతంత్రులుమొయినాబాద్, ఎల్లంపేటలో హంగ్ భయంస్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య వార్వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు.. క్లైమాక్స్కు చేరిన మున్సిపల్ ఉత్కంఠమేడ్చల్ జిల్లా :జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యే చాన్స్మల్లారెడ్డి, ఈటల మధ్య చర్చలు విఫలంకాంగ్రెస్ నేత మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల మధ్య చర్చలుఎల్లంపేట లోనే మల్లారెడ్డి, ఈటల ఓట్ల నమోదుఎల్లంపేట 13-13 ఓట్లతో టై.. లాటరీ ద్వారా చైర్మెన్ ఎన్నుకుంటారా ? బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటారా ? అనేది ఉత్కంఠనిజామాబాద్: నిజామాబాద్ : బోధన్ మున్సిపాలిటీలో వీడిన ప్రతిష్టంభనకాంగ్రెస్, ఎం. ఐ. ఎం. మధ్య అవగాహనచైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం.మున్సిపల్ చైర్మన్గా తూము శరత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు.నిజామాబాద్:నిజమాబాద్ జిల్లాలో మేయర్,చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్,ఏడు మున్సిపాలిటీలునిజమాబాద్తో పాటు కామారెడ్డి, బోధన్లో హాంగ్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మేయర్,ఎంఐఎంకు డిప్యూటీ మేయర్కు ఇచ్చేలా కుదిరిన ఒప్పందంమేయర్ పరిశీలనలో ముగ్గురు మహిళల మధ్య పోటీఎంఐఎం డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఖరారు తొలిసారి మహిళకు అవకాశంఆర్మూర్, భీంగల్ ,ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యంసీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు పంపనున్న అధిష్టానం మహబూబ్ నగర్: నేడు మహబూబ్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్,చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నికమహబూబ్ నగర్ కార్పోరేషన్లో కుదరని ఏకాభిప్రాయంగంగరగోళంగా అభ్యర్దుల ఎంపికపదవి కోసం మైనార్టీల పట్టుహంగ్ నేపద్యంలో గద్వాల,నారాయణ పేట,అమరచింతలో ఉత్కంఠతక్యాంపుల నుంచి నేరుగా సమావేశలకు గెలిచిన అభ్యర్దులుఖమ్మం..మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తికౌన్సిలర్ల ప్రమాణం తర్వాత చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎన్నికఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్కేచైర్మన్ ,వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ..నేడు పేర్లు ప్రకటించనున్న ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖకొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో సిపిఐ ,కాంగ్రెస్ల మధ్య కుదిరిన ఒప్పందంమొదటి రెండున్నర ఏళ్ళు సీపీఐకి మేయర్..కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్తర్వాత రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్కు మేయర్ సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునే విధంగా అంగీకారం ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్లో60 డివిజన్లో పార్టీల వారీగా గెలిచిన స్థానాలుకాంగ్రెస్ 22, సిపిఐ 22 ,బి ఆర్ ఎస్ 8, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు 6చోట్ల గెలుపొందారుఇందులో ఐదుగురు స్వతంత్రులు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికజాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్తో నడవాలని నిర్ణయించుకున్న సీపీఐఅంతకుముందు కొత్తగూడెంలో హంగ్ వచ్చిన నేపద్యంలో సిపిఐకి బహిరంగంగా మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నిజమాబాద్ జిల్లా:నేడు జిల్లాలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, ఉత్తమ్ పర్యటననిజమాబాద్ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో గా ఓటు హక్కు వినియోగించుకోనున్న మహేష్ కుమార్ గౌడ్మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను పర్యవేక్షించనున్న మంత్రులు.నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కొలువుదీరనున్న పాలకవర్గాలుఉదయం 10 గంటలకు సమావేశం. అనంతరం సభ్యుల ప్రమాణంక్యాంపుల నుంచి నేరుగా సమావేశానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుపలు మున్సిపాలిటీల్లో ఇంకా చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎవరో రాని స్పష్టతనల్లగొండ మేయర్ గా ప్రమాణస్వీకారం చేయనున్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.ఇక్కడ డిప్యూటీ మేయర్ గా మైనార్టీ, బీసీ వర్గాలకు అవకాశందేవరకొండ చైర్ పర్సన్ గా పున్నా శైలజకు అవకాశం?హాలియా చైర్మన్ గా చింతల చంద్రారెడ్డినందికొండ చైర్ పర్సన్గా మానసస్వర్ణమిర్యాలగూడ నుంచి పోటీలో నలుగురుచండూరు చైర్మన్గా కోడిశ్రీనివాస్చిట్యాల చైర్ పర్సన్గా పందిరి గీతకు అవకాశంనేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొణతం చిన వెంకటరెడ్డి. వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డికోదాడ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువు. పోటీలో ఐదుగురుసూర్యాపేట చైర్ పర్సన్గా మొరిశెట్టి నివేదితతిరుమలగిరి చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన రుఘునందన్ రెడ్డిహుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ విషయంలో స్పష్టత కరువు.భువనగిరి చైర్ పర్సన్ గా గంజి శ్రీవాణి, బర్రె పూజిత, పోతంశెట్టి మంజులలో ఒకరికి అవకాశంచౌటుప్పల్ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువుమోత్కూరు చైర్ పర్సన్ కోసం ముగ్గురు పోటీఆలేరు చైర్ పర్సన్ పోటీలో ఇద్దరుయాదగిరిగుట్ట చైర్ పర్సన్ గా వాణి ఎంపిక దాదాపు ఖరారేపోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేష్ కు అవకాశం -
‘మా బుజ్జి కదూ.. ఊరుకో తల్లీ.. మా అమ్మకదా’
పెద్దపల్లి: ‘మా బుజ్జి కదూ.. ఊరుకో తల్లీ.. మా అమ్మకదా’ అని ఏడుస్తున్న ఆ చిన్నారిని లాలింపసాగింది అమ్మమ్మ. ‘పండుగ కదా తల్లీ.. ఈరోజు మన కడుపు నిండుతుంది’ అని ముద్దుల వర్షం కురిపించింది. ఈ దృశ్యం స్థానికుల మదిని కరిగించింది. ఈ పసికూన తన మనుమరాలేనని ‘సాక్షి’కి సంబురంగా తెలిపింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మడ్ల రామలింగేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన ఆదివారం దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. పండుగపూట తమ కడుపు నిండుతుందని గంపెడాశతో తమపిల్లలను చంకలో వేసుకొని గుడిముందు యాచిస్తూ కనిపించారు కొందరు మహిళలు. అంతలోనే ఒక్కసారిగా గురకపెట్టి ఆగకుండా ఏడుస్తున్న పాపని చూసి తోటి మహిళ తనకిమ్మంటూ ఎత్తుకొని తన లాలింపు మాటల పాటలు, ముద్దులు కురిపిస్తుంటే ఆ పసిపాప తల్లితో పాటు తోటి యాచకులు సైతం మొహంలో నవ్వులు చిందిస్తూ కనిపించారు. -
‘ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ను ఎవరో కొట్టి చంపారు’
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి శనివారం కారు దూసుకెళ్లడంతో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (48) మృతిచెందిన ఘటనపై ఆయన సోదరులు అబ్దుల్లా, సుధాకర్ ఆదివారం కూసుమంచి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడు శ్రీనివాస్ తల, ముఖంతోపాటు ఎడమ చేతిపై గాయాలున్నాయని.. గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోదరులకు అప్పగించగా వారు నంద్యాల జిల్లాలోని స్వగ్రామం అల్లూరుకు తీసుకెళ్లారు. కారులో నుంచి ఒడ్డుకు వచ్చి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వస్తూ.. శ్రీనివాస్ ప్రయాణించిన ఏపీ 16 డీపీ 2345 కారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వచ్చినట్లు టోల్ప్లాజా సీసీ పుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కారు రిజిస్టేషన్ ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన వేణుమాధవరెడ్డిదిగా గుర్తించారని తెలిసింది. కారు జాతీయ రహదారిపై వెళ్లకుండా నాయకన్గూడెం నుంచి పాలేరు రాష్ట్ర రహదారిపై రావడం, రిజర్వాయర్లో పడిపోయాక కారు నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ గతంలో హైదరాబాద్లో కండక్టర్గా ఉద్యోగం చేసేవాడని, ఆ తర్వాత ఉద్యోగం నచ్చక వదిలేసి పుస్తకాలు రాస్తున్నాడని సోదరులు పేర్కొన్నారు. -
ఇండిపెండెంట్లకు రూ.2 కోట్లు.. ఫార్చునర్ కారు ఆఫర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ భావించినప్పటికీ రాత్రికి రాత్రి పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్09, మజ్లిస్03, ఏఐఎఫ్బీ 02, స్వతంత్రులు04, ఎక్స్ అఫీషియో 02 (ఇద్దరు ఎమ్మెల్యేలు)తో కలిపి తమకు 34 బలముందని చెప్పిన కాంగ్రెస్.. తెల్లవారే సరికి బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతిని తమవైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు వరకు పర్యవేక్షించాల్సి వచ్చింది.రోజంతా హైడ్రామా15 డివిజన్ నుంచి ఏఐఎఫ్బీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన విప్పల సాయిజ్యోతి తొలుత బీజేపీలో చేరి ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్ గూటికి చేరింది. ఆమె పార్టీ మారడం వెనక సీఎం కార్యాలయంతోపాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు కృషి ఎంతో ఉంది. ఆదివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయిజ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్బీ నాయకులు ఆమె ఇంటికి విప్ నోటీసు అంటించారు. ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీలో చేరాక పార్టీ ఎలా మారతారంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య సాయిజ్యోతిని హైదరాబాద్లోని కాంగ్రెస్ శిబిరానికి తరలించగా, అక్కడ ఆమె మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల, ఇండిపెండెంట్ కొమురయ్యతో కలిసి కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలం 35కు చేరుకుంది. మేయర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా లేక ఇండిపెండెంట్గా ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది.జమ్మికుంటలోనూ హంగ్ ఉత్కంఠను రేపింది. మొత్తం 30 సీట్లలో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ 10, బీజేపీ 04, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్లో ఒక కౌన్సిలర్ వెళ్లి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. కాంగ్రెస్ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01, బీఆర్ఎస్ రెబల్1 కలిపి 15 స్థానాలతో మున్సిపాలిటీ వశపరుచుకోవాలని చూసినా మేజిక్ ఫిగర్ చేరలేదు. దీంతో బలపరీక్ష వాయిదా వేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.జగిత్యాల జిల్లా రాయికల్లో 12 సీట్లున్నాయి. బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒక సీటు గెలిచారు. కరీంనగర్ తరహాలోనే ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ జట్టు కట్టి బీజేపీ ఆశలకు గండికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.26 సీట్లున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా.. బీఆర్ఎస్ 06, కాంగ్రెస్ 06, స్వతంత్రులు 04 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు పెట్టుకున్నాయి. దీంతో బీజేపీకి మున్సిపాలిటీపై ఆశలు సన్నగిల్లాయి.పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, సు ల్తానాబాద్, రామగుండం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో స్పష్టమైన మెజారి టీ రావడంతో కాంగ్రెస్ పాలకవర్గాలను ఏర్పా టు చేయనుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగరేయనుంది.ఇండిపెండెంట్ల జోరుహంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు, కార్పొరేటర్ల పంట పండింది. వీరి మద్దతు కీలకమవడంతో పార్టీలు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. కరీంనగర్ లాంటి చోట డబ్బుతో పాటు ఫార్చునర్ కారు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లతో బేరసారాలు రూ.కోట్లకు చేరాయి.కరీంనగర్ బల్దియాలో నేడు ప్రమాణ స్వీకారం: ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక: మ.12.30 నుంచి 1.30 వరకు ప్రెసిడింగ్ అధికారి: ఆర్డీవో ఎన్నిక మొత్తం: వెబ్కాస్టింగ్, లైవ్స్ట్రీమింగ్ -
‘బయో ఏషియా’కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బయో ఏషియా–2026 సద స్సుకు రాజధాని ముస్తాబైంది. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) హాల్–4లో రెండ్రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. 17న సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, మంత్రి శ్రీధర్బాబు బయో ఏషియా సదస్సు 23వ ఎడిషన్ను ప్రారంభిస్తారు. ‘టెక్బయో అన్లీ‹Ù్డ ఏఐ, ఆటోమేషన్– బయాలజీ రివల్యూషన్’’అనే థీమ్ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బయో టెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు, 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలను ఈ సదస్సు వేదికగా పంచుకోనున్నారు.తాజా సదస్సులో సింథటిక్ బయాలజీ, జనోమిక్స్, బయో మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఔషధ ఆవిష్కరణ, డిజిటల్ హెల్త్ రంగాలపై లోతైన చర్చ జరుగుతుంది. చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్న నేపథ్యంలో భవిష్యత్లో ఆరోగ్య రంగం ‘ప్రీడిక్టివ్, ప్రిసైస్, ఇన్క్లూజివ్’దిశగా ఎలా మారుతుందో ఈ సదస్సు స్పష్టం చేయనుంది. భారత్ టెక్ బయో శక్తిగా ఎలా ఎదిగింది ? ప్రపంచ ఆరోగ్య సమస్యలకు వినూత్న పరిష్కారాలను ఎలా అందిస్తోంది అన్న అంశాలపై ప్రత్యేకంగా ఈ సదస్సులో చర్చిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, పెట్టుబడులు, విధానాల సమన్వయం ద్వారా ఆరోగ్య రంగంలో వేగవంతమైన పురోగతిని సాధించడమే లక్ష్యంగా బయో ఏషియా–2026 వేదిక కానుంది. షెడ్యూల్ ఇలా... ⇒ ఈనెల 17వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల మధ్య బయో ఏషియా–2026 సదస్సును సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారు. తొలిరోజు సదస్సులో భాగంగా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ ప్రసంగిస్తారు. యూఎస్ఏకు చెందిన ప్రఖ్యాత కేన్సర్ జీన్ థెరపీ విభాగ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్.లెవిన్, ఆ తర్వాత అమ్జెన్ సంస్థ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డా.హోవర్డ్ వై.చాంగ్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి. ⇒18న రెండో రోజు సదస్సులో భాగంగా ప్యానల్ డిస్కషన్స్ కొనసాగుతాయి. తెలంగాణ రైజింగ్–2047: బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్–సైన్సెస్ ఇకో సిస్టం, ముగింపుల కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. -
18 నుంచి యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ఆదివారం యాదగిరికొండపైన ప్రధాన కార్యా లయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధా నార్చకులు కాండూరి వెంకటాచార్యు లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరీశుడి క్షేత్రంలో కొనసాగుతా యన్నారు. 18న ఉదయం విష్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రాత్రి అంకురార్పణతో ఉత్సవాలను అర్చకులు పాంచ రాత్ర ఆగ మశాస్త్రా నుసారంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.20న ఉద యం 9గంటలకు మత్సా్యలంకారంతో అలంకార సేవలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 24న రాత్రి 8 నుంచి 8.45 గంటల వరకు ఆలయ తూర్పు మాడ వీధిలో శ్రీస్వామి అమ్మవార్లకు ఎదు ర్కోలు ఉత్సవం జరుగుతుందన్నారు. 25న రాత్రి శ్రీస్వామి అమ్మ వార్ల తిరుకల్యాణ మహోత్సవం ఆలయ ఉత్తర మాడ వీధిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 26న దివ్య విమాన రథోత్సవం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవు తుందన్నారు. 27న విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థ స్నానం, 28న ఉదయం 10గంటలకు అష్టో త్తర శత ఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు.100 మంది యజ్ఞాచార్యులు, పారాయ ణీకులు, రుత్వికులు ఉత్సవాల్లో పాల్గొంటారన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు ఆలయ సంప్రోక్షణ నేపథ్యంలో దర్శనాలు కొంత సమయం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్త దంపతులు పాల్గొనేందుకు రూ. 20వేల రుసుము చెల్లిస్తే అన్ని సేవల్లో పాల్గొనే అవకాశంతో పాటు అంతరాలయ దర్శనం, అభిషేకం లడ్డూ, కనుమ, శ్రీస్వా మి శెల్లా ఇస్తామన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవస్థానం ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ముందుకు వెళ్తున్నామని ఈవో వెల్లడించారు. -
సీపీఎం.. మున్సి‘పల్టీ’
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు కార్మిక–రైతు ఉద్యమాలకు అగ్రగామిగా నిలిచిన సీపీఎం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోగా, సీపీఐ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ విజయాలను నమోదు చేసింది. కొత్తగా అవతరించిన కొత్తగూడెం కార్పొరేషన్పై సీపీఐ ఎర్రజెండా ఎగురవేయనుంది. సీపీఎం మాత్రం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసి కూడా ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో తన ప్రభావాన్ని చూపలేకపోయింది. బీఆర్ఎస్తో పొత్తు.. రెంటికీ నష్టంప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని సీపీఎం బరిలోకి దిగినప్పటికీ ఆ వ్యూహం ఫలించలేదు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సీపీఎం పోటీ చేసిన చోట కాంగ్రెస్ విజయం సాధించింది. తద్వారా బీఆర్ఎస్ కూడా నష్టపోయినట్టు అయింది. రాష్ట్రవ్యాప్తంగా 13 వార్డుల్లో మాత్రమే సీపీఎం గెలుపొందింది. ఐదేళ్ల క్రితం ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లు సాధించిన సీపీఎంకు, ఈసారి పొత్తుతో ఒక సీటు మాత్రమే అదనంగా దక్కింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఒకప్పుడు సీపీఎంకు ప్రధాన కోటలు. కానీ తాజా ఫలితాలు అక్కడ కూడా ప్రభావం తగ్గినట్టుగా చూపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం బలహీనత, ఓటర్ల మూడ్ మార్పు, పొత్తులపై గందరగోళం.. ప్రభావితం చేసిన అంశాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సీపీఐ దూకుడు.. మేయర్ అవకాశంఈ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో గణనీయ ఫలితాలు సాధించింది. కొత్తగూడెంలో 22 మంది కార్పొరేటర్లు, రామగుండంలో ఒక కార్పొరేటర్ సీపీఐ తరఫున గెలిచారు. క్యాతనపల్లి, ఎదులాపురం మున్సిపాలిటీల్లో నాలుగేసి వార్డులు, మహబూబాబాద్లో 3 వార్డులతోపాటు హుజూర్నగర్, యాదగిరిగుట్ట, వైరా, చండూరు, కోదాడ, భూపాలపల్లిలలో ఒక్కో వార్డు గెలుచుకుంది. ఏకంగా 40 స్థానాల్లో విజయాలు నమోదు చేయడం సీపీఐకి నూతన ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాన్ని సీపీఐ పొందడం తెలంగాణ, ఉమ్మడి ఏపీ చరిత్రలోనే తొలి ఘట్టంగా నిలవనుంది. -
మేం పాలకులం కాదు.. సేవకులం
బంజారాహిల్స్: రాష్ట్ర ప్రజలకు తాము పాలకులం కాదని.. సేవకులం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సేవ చేయడానికే ప్రజలకు తమకు అవకాశం ఇచ్చారని.. అందుకు తగ్గట్లుగా తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్నారు. కానీ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ముఖ్యమంత్రిని, మున్సిపల్ మంత్రిని సైతం తానే అయినందున మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపోటములకు తానే బాధ్యత తీసుకుంటానని చెబుతూ ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఫలితం తన పనితీరుకు గీటురాయి అని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని బంజారా భవన్లో సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మానవజాతి శాంతి మార్గంలో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తినింపారు. దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా నిలబడ్డారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా జరపడం మా బాధ్యత. సమాజంలో వెనుకబడిన వారిని పాలనలో భాగస్వాములు చేయాలన్నదే నా ఆలోచన. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 15 శాతం ఉంటే 30 శాతం పదవులు ఇచ్చాం. నలుగురు మంత్రులు, స్పీకర్ పదవి ఎస్సీ వర్గానికే ఇచ్చామన్నారు. వచ్చే కాలమంతా పేదల కోసమే పనిచేస్తా’ అని సీఎం రేవంత్ తెలిపారు. దళితుడిని స్పీకర్ చేశాం..ఏ దళితుడినైతే ముఖ్యమంత్రి చేస్తానని గత పాలకులు మోసం చేశారో.. ఆ దళితుడిని అధ్యక్షా అని మైక్ అడిగే పరిస్థితి తీసుకొచ్చామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దళితుడు రాష్ట్రాన్ని నడపలేరు.. నేనైతేనే నడుపుతానన్న వాళ్లు అధ్యక్షా అని పిలిచి మైక్ అడిగేలా దళితుడిని పైన కూర్చొబెట్టానని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని.. అంబేడ్కర్ అందరికీ ఇచ్చిన ఆయుధమన్నారు. 20 ఏళ్లలో అన్ని హోదాలు చూశానని, ఏనాడూ ప్రజలకు దూరం కాలేదన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు అండగా నిలబడ్డారని.. తనకు సీఎం హోదా రావడానికి లంబాడాల అండదండలు ఉన్నాయని రేవంత్రెడ్డి అన్నారు. పేదవాడి గౌరవం రేషన్కార్డు..రాష్ట్రంలో 3.15 కోట్ల మంది పేదలకు రేషన్కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని.. తాను స్వయంగా ఒక గిరిజనుడి ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేశానని సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. అలాగే పేదల ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. 50 లక్షల మంది పేదల ఇళ్లలకు ఈ పథకం వర్తింపజేస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలి..గిరిజన విద్యార్థుల్లో స్ఫూర్తినింపేందుకే ఆ వర్గానికి చెందిన అధికారులకు మంచి పోస్టులు ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. విద్యార్థులు నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడి చదువు కోవాలని సూచించారు. 100 నియోజకవర్గాల్లో రూ. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామ న్నారు. చదువు లేకపోవడం వల్లే గిరిజనులు పేదరికంలో మిగిలిపోతున్నారని.. చదువే అన్ని హోదాలు తెచ్చి పెడు తుందన్నారు. గిరిజన బిడ్డలు చదువుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు కావాలో తనకు చెప్పాలని సూచించారు.అన్ని తండాలకూ బీటీ రోడ్లు..రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ సభావేదిక నుంచే ప్రకటించారు. ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని.. అన్ని తండాల్లోనూ గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని చెప్పారు. అన్ని తండాల్లో మంచినీటి కోసం ట్యాంకులు, సోలార్ పంప్సెట్లు ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేయాలన్నారు. నల్లమలలో సంత్ సేవాలాల్ మహారాజ్ కోసం 20 ఎకరాల భూమి కేటాయించామని, వచ్చే జయంతిని అక్కడే జరుపుకుందామని సీఎం రేవంత్ చెప్పారు. -
విప్ ఉల్లంఘిస్తే వేటే!
సాక్షి, హైదరాబాద్: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులు తప్పనిసరిగా పార్టీ విప్ను పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే. పార్టీ విప్ను ఉల్లంఘిస్తే వారిపై అనర్హత వేటు వేసి సభ్యత్వం రద్దు చేస్తారు. తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్/చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ల ఎన్నికల నిబంధనలు–2020 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పరోక్ష విధానంలో మేయర్/చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను ఎలా నిర్వహించాలో ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను జారీ చేసింది. సోమవారం ఈ పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధనలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. విప్ ఉల్లంఘిస్తే...⇒ గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ విప్ను నియమించి ఎన్నికలు జరిగే రోజు ఉదయం 11 గంటలలోపు ఎన్నికల అధికారికి అందజేయాలి. సంబంధిత పార్టీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్లో అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తి లేదా ఆ వ్యక్తి నుంచి అధికారం పొందిన మరో వ్యక్తి తన సంతకంతోపాటు పార్టీ ముద్ర వేసి ఎవరిని విప్గా నియమించారో ఈ లేఖలో తెలియజేయాలి. ⇒ తమ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులకే ఓటేయాలని పార్టీ సభ్యులందరికీ విప్గా నియామకం పొందిన వ్యక్తి ‘విప్’జారీ చేయడంతోపాటు ఆ అభ్యర్థుల జాబితాను ప్రత్యేక సమావేశ ప్రారంభానికి గంట ముందు ఎన్నికల అధికారికి సమర్పించాలి. ⇒ సభ్యులందరికీ పార్టీ విప్ నోటీసు చేరినట్టు వారి నుంచి ధ్రువీకరణ తీసుకొని సమావేశ ప్రారంభానికి ముందు ఎన్నికల అధికారికి విప్గా నియామకం పొందిన వ్యక్తి సమర్పించాలి. పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుడు ఎవరైనా విప్ తీసుకునేందుకు నిరాకరిస్తే ఆ విషయాన్ని రికార్డు చేసి ఎన్నికల అధికారికి అందించాలి. ⇒ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు పార్టీ విప్ను ఉల్లంఘిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ⇒ తమ పార్టీ సభ్యుడు/సభ్యులు విప్ ఉల్లంఘించారని విప్గా నియామకం పొందిన వ్యక్తి ఎన్నికలు జరిగాక మూడు రోజుల్లోగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, ఎన్నికల అధికారి సంబంధిత సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తారు. వారం రోజుల్లోగా సంజాయిషీ అందితే, ఆ తర్వాతి రెండు రోజుల్లోగా ఎన్నికల అధికారి ఆయా సభ్యుల సభ్యత్వ రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తగిన కారణాలతో వెల్లడించాలి. ఒకవేళ వారం రోజుల్లో సంజాయిషీ అందకపోతే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా ఆ తర్వాతి రెండు రోజుల్లోగా ఎన్నికల అధికారి తగిన నిర్ణయాన్ని తీసుకుంటారు. తొలుత ప్రమాణ స్వీకారం.. తర్వాతే ఎన్నికలు జిల్లా కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారి సంబంధిత పురపాలికలో మేయర్/చైర్పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ప్రారంభమైన వెంటనే సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కోరం ఉంటేనే తొలి రెండు సమావేశాలు సంబంధిత మున్సిపల్ కౌన్సిల్/కార్పొరేషన్లో ఓటు హక్కు కలిగి ఉన్న సభ్యుల (ఎన్నికైన సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు) మొత్తం సంఖ్యలో కనీసం సగం మంది సమావేశానికి హాజరైతేనే మేయర్/చైర్పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నికల నిర్వహణకు కోరం ఉన్నట్టు పరిగణించి సమావేశాన్ని కొనసాగిస్తారు. నిర్దేశిత సమయానికి సమావేశం ప్రారంభమైన గంటలోపే కోరం సాధ్యమైతే ఎన్నికలను నిర్వహిస్తారు. ⇒ ఏదైనా కారణంతో ఎన్నికలు సాధ్యం కాకుంటే సాధారణ సెలవులతో సంబంధం లేకుండా మరుసటి రోజు మళ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. మరుసటి రోజూ ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో ఎన్నికల నిర్వహణకు తదుపరి తేదీని ఖరారు చేసేందుకుగాను ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.⇒ కోరం లేక తొలి రెండు సమావేశాల్లో మేయర్/చైర్పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక సాధ్యం కానిపక్షంలో, తదుపరి సమావేశం/సమావేశాల్లో కోరం విషయంలో పట్టింపు లేకుండా హాజరైన సభ్యులతో మేయర్/చైర్పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.ఎన్నికల ప్రక్రియ ఇలా...మేయర్/ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ పదవులకు పోటీ చేసే అభ్యర్థిని ఓటు హక్కు గల ఓ సభ్యుడు ప్రతిపాదిస్తే మరో సభ్యుడు మద్దతు తెలపాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శుల్లో అత్యున్నత స్థాయి కలిగి వ్యక్తి నుంచి, లేదా వారి నుంచి అధికారం (పత్రంపై పార్టీ ముద్ర వేసి ఉండాలి) పొందిన వ్యక్తి నుంచి ఈ మేరకు ధ్రువీకరణ పత్రం తీసుకొని కలెక్టర్ నియమించిన ఎన్నికల అధికారికి ఎన్నికలు జరిగే రోజు ఉదయం 10 గంటలలోపు అందజేయాలి. ⇒ సక్రమ విధానంలో అభ్యర్థిత్వం ప్రతిపాదించిన, మద్దతు తెలిపిన అభ్యర్థుల పేర్లు, రాజకీయ పార్టీ పేరును ఎన్నికల అధికారి చదివి వినిపిస్తారు. ⇒ సభ్యులందరూ ఒకే అభ్యర్థిని ప్రతిపాదిస్తే ఎన్నికలు నిర్వహించకుండా సంబంధిత అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ⇒ ఇద్దరు, అంతకు మించి అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నికలు నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులు చేయి ఎత్తి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ⇒ మేయర్/చైర్ పర్సన్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. ⇒ సభ్యులు చేయి ఎత్తడం ద్వారా ఒక్కో అభ్యర్థి సాధించిన ఓట్ల సంఖ్యను ఎన్నికల అధికారి రికార్డు చేసి ప్రకటిస్తారు. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ⇒ ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు పోలైతే అభ్యర్థులు, సభ్యులందరి సమక్షంలో ఎన్నికల అధికారి లాటరీ ద్వారా తీసిన తొలి పేరును ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటిస్తారు. -
ఫోర్.. నెవర్ బిఫోర్
మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన పాలమూరుతోపాటు బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎంఐఎం, బీఆర్ఎస్ల మద్దతు, స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓట్ల సహకారంతో కరీంనగర్, నిజామాబాద్లలో కూడా పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒక్కటి కావడం గమనార్హం. మరోవైపు పాలమూరులో కాంగ్రెస్–ఎంఐఎంలు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండగా, కొత్తగూడెంలో సీపీఐకి అవకాశం దక్కనుంది. రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లలో పరిస్థితి ఇది.బీజేపీకి అధిక డివిజన్లు వచ్చినా..66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి 30 డివిజన్లు దక్కాయి. నలుగురు స్వతంత్రులు, ఎంపీ బండి సంజయ్ ఓటుతో ఆ పార్టీ బలం 35కు చేరింది. కానీ, ఇక్కడ బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి మజ్లిస్, స్వతంత్రులు కూడా తోడయ్యారు. దీంతో కాంగ్రెస్ (14), బీఆర్ఎస్ (9), స్వతంత్రులు (4), మజ్లిస్ (3), ఏఐఎఫ్బీ (2) తోపాటు ఎమ్మెల్యేలు కమలాకర్ (బీఆర్ఎస్), కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)ల ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ కూటమి బలం 34కు చేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... బీజేపీ గూటికి వెళ్లిన స్వతంత్రుల్లో ఒకరు కాంగ్రెస్ కూటమికి రావడంతో కూటమి బలం 35కు పెరిగితే, బీజేపీ బలం 34కు తగ్గింది. బీజేపీ నుంచి మరో ఇద్దరు కూడా వస్తారనే ప్రచారం జరుగుతుండడంతో కమలం శిబిరం కలవరపాటుకు గురవుతోంది.కొత్తగూడెంలో కామ్రేడ్లుచెరో 22 డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్, సీపీఐల మధ్య అధికార పంపిణీ ఒప్పందం కుదరడంతో ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోనున్నాయి. తొలి రెండున్నరేళ్లు సీపీఐకి, మలి రెండున్నరేళ్లు కాంగ్రెస్కు మేయర్ పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది.పాలమూరులో మేయర్ ఎవరో..!మహబూబ్నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పరం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే..మేయర్ అభ్యర్థిత్వంపై ఈ పార్టీలో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు 31 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్ గెలుపొందిన 29తోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఎంఐఎం, నలుగురు స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ బలం 37కు చేరింది. బీఆర్ఎస్ 15, బీజేపీ 8 మంది చొప్పున బలం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే, ఇక్కడ కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొందరు కార్పొరేటర్లు క్యాంపు నుంచి శనివారం రాత్రే పాలమూరుకు చేరుకోవడం హాట్ టాపిక్గా మారింది.నిజామాబాద్ కాంగ్రెస్దే...!ఇందూరు కార్పొరేషన్ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన మేరకు ఆ పార్టీ బలం సమకూర్చుకుంది. ఇక్కడ బీజేపీకి 28 డివిజన్లు రాగా, మ్యాజిక్ ఫిగర్కు మూడు తగ్గాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డిలు ఎక్స్ అఫీషియో ఓట్లు వేస్తే ఆ మేరకు బలం చేకూరనుంది. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం 14 మందితోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ కూటమి బలం 34కు చేరనుంది. దీంతో మేయర్ పీఠం కాంగ్రెస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కడం లాంఛన ప్రాయమే కానుంది. ⇒ నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ పరం కావడం కూడా లాంఛన ప్రాయమే. -
స్పామ్ కాల్స్.. ఇక బ్లాక్!
అవాంఛిత, మోసపూరిత కాల్స్, సందేశాలు ప్రపంచానికి సవాల్గా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు ఆర్థిక నష్టాలకూ ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95% మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజూ స్పామ్ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సిద్ధమవుతోంది. కస్టమర్ అందుకున్న కాల్, మెసేజ్ను టెలికం కంపెనీ స్పామ్గా గుర్తిస్తే ఆ నంబర్ను బ్లాక్ లిస్టులోకి చేర్చాలని భావిస్తోంది. అలాగే అధికారిక ఫిర్యాదు లేకపోయినా స్పామ్ మెసేజ్లు పంపే మొబైల్ నంబర్ను డిస్కనెక్ట్ చేయాలన్న ప్రతిపాదనపై ట్రాయ్ కసరత్తు చేస్తోంది. టెలికం కంపెనీలతో ఈ మేరకు చర్చిస్తోంది. ప్రస్తుతం టెల్కోలు 10 రోజుల వ్యవధిలో ఐదు ప్రత్యేక ఫిర్యాదులను స్వీకరిస్తే స్పామర్పై చర్య తీసుకుంటున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక నంబర్ను వరుసగా 10 రోజులపాటు అనుమానిత స్పామ్గా ఏఐ టెక్నాలజీ గుర్తిస్తే.. ఆ నంబర్కు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా కూడా చర్య తీసుకోవచ్చు. ఇది అమల్లోకి వస్తే స్పామ్ కాల్స్, మెసేజెస్ కట్టడికి టెలికం కంపెనీలు చేపడుతున్న చర్యలకు మరింత ఊతం ఇచి్చనట్టు అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్రియల్ టైమ్లో విశ్లేషించి.. ప్రస్తుతం దేశంలో ఏదైనా అవాంఛిత సమాచారాన్ని స్పామ్గా గుర్తించడానికి నిర్దిష్ట నియమాలు లేవు. కాల్స్, సందేశాలు పంపినవారి రోజువారీ వినియోగ తీరు, కాల్స్ ఎంత సమయం మాట్లాడుతున్నారు, ఎన్ని సందేశాలు పంపిస్తున్నారు, ఎవరెవరికి, ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఈ కాల్స్ చేస్తున్నారు వంటి అంశాలను టెల్కోలు ఉపయోగిస్తున్న ఏఐ సాంకేతికత రియల్ టైమ్లో విశ్లేషించి.. అవాంఛిత కాల్స్, మెసేజెస్ను గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. కాల్ను అంగీకరించడం లేదా తిరస్కరించడం అనేది కస్టమర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అనుమానిత స్పామ్గా గుర్తించిన అనేక కాల్స్ నిజమైన కాలర్ల నుంచి వచి్చనవే ఉంటున్నాయి. వాటిలో గిగ్ వర్కర్లతోపాటు ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి.వ్యవస్థీకృతంగా మోసాలు.. 2024 సెపె్టంబర్ నుంచి 2026 జనవరి మధ్య 7,100 కోట్ల స్పామ్ కాల్స్, 290 కోట్ల స్పామ్ సందేశాలను గుర్తించినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. 8 లక్షలకుపైగా మోసపూరిత లింక్స్ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కాల్ సెంటర్లతో వ్యవస్థీకృతంగా మోసపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 92.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ వెల్లడించారు. 250కిపైగా కొలమానాలను పరిగణనలోకి తీసుకొని స్పామ్ కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు.⇒ టెల్కోలు ఏఐ సొల్యూషన్స్ సాయంతో ప్రతి నెలా సుమారు 40 కోట్ల కాల్స్, సందేశాల ను అనుమానిత స్పామ్గా గుర్తిస్తున్నాయి. ⇒ నమోదు కాని టెలీమార్కెటర్ల నుంచి వస్తున్న వాటిలో 7.5 కోట్ల కాల్స్, ఎస్ఎంఎస్లు ప్రతిరోజూ బ్లాక్ అవుతున్నాయి. ⇒ స్పామర్లపై టెల్కోలకు రోజుకు సగటున 10,000 ఫిర్యాదులు మాత్రమే అందుతున్నాయని సమాచారం. ⇒ 2025 ఫిబ్రవరిలో 1,16,213 స్పామ్ ఫిర్యాదులు టెల్కోలకు అందగా 2025 డి సెంబర్లో ఆ సంఖ్య 3,34,317కు చేరింది. ⇒ ఫిర్యాదులలో ఎక్కువ భాగం నమోదు కాని టెలిమార్కెటర్లపైనే ఉంటున్నాయి. ⇒ టెలిమార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు సాధారణంగా 10 అంకెల మొబైల్ నంబర్ ద్వారా కాల్స్ చేస్తున్నారు. ⇒ భారత్లో 116 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారిలో అవాంఛిత కాల్స్ను నివారించేందుకు ట్రాయ్ తీసుకొచి్చనడు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) సేవలను 22 కోట్ల మంది మాత్రమే ఎంపిక చేసుకున్నారు. -
హంగు.. కొత్త రాజకీయ రంగు
రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్ ఉంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్⇒ మహబూబాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ నుంచి 13, బీఆర్ఎస్ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్కు ముగ్గురు సీపీఎం, బీఆర్ఎస్కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్గా కాంగ్రెస్లో చేరిన ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. ⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన 9 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్ అనివార్యం కానుంది. ⇒ ఆసిఫాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్ ఫిగర్ 11. ఇక్కడ కాంగ్రెస్కు ఏడుగురు, బీఆర్ఎస్కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది. ⇒ ఖానాపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) నమోదు కావడం, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ⇒ ఆదిలాబాద్: మ్యాజిక్ ఫిగర్కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్ (11), బీఆర్ఎస్ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్ కూర్చునే అవకాశాలున్నాయి. ⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. ⇒ కాగజ్నగర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్కు 9 మంది, బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుంది. ⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్ఎస్(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్ఎస్ పరం కానుంది. ⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్ఎస్ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కూడా వారు టచ్లో ఉన్నట్టు సమాచారం. ⇒ బోధన్ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయనుంది. మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్ ఇష్టానికే చైర్మన్ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది. ⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు 19, బీఆర్ఎస్ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్కు చైర్మన్, బీఆర్ఎస్కు వైస్చైర్మన్ దక్కే అవకాశాలున్నాయి. ⇒ అలంపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు ఆరుగురి బలం కావాలి. బీఆర్ఎస్కు ఐదు, కాంగ్రెస్కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో గులాబీ జెండా ఎగరనుంది.⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(బీఆర్ఎస్) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ⇒ అలియాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్ పదవి అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది. ⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్కు 8 మంది, బీఆర్ఎస్కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్ఎస్) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్ఎస్లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది. ⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఆర్ (కాంగ్రెస్) ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది. ⇒ మొయినాబాద్ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 14. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానుంది. ⇒ వికారాబాద్: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్ఎస్ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరం కానుంది. ⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్ లోక్సభ సభ్యుడు బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ జహీరాబాద్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలున్నాయి. ⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్ (2), ఏఐఎఫ్బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ. ⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్ఎస్ కూటమిదే. ⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పక్షానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చేరడంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 15కు చేరనుంది. మ్యాజిక్ ఫిగర్కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ⇒ ఇస్నాపూర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 14 కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి (ఎక్స్ అఫీషియో), ఒక ఇండిపెండెంట్తో కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ఎంపీ రఘనందన్రావు ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ⇒ మెదక్, నర్సాపూర్ : హంగ్ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీజేపీకి చైర్మన్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ⇒ రాయికల్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది. ⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్ ఫిగర్ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది. ⇒ కోహిర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది. ⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, బీఆర్ఎస్ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ⇒ మెట్పల్లి: ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసి బీజేపీకి చెక్ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 14కుగాను బీఆర్ఎస్(6), కాంగ్రెస్ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ⇒ జగిత్యాల: మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్స్ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 15. 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.ఆమనగల్లులో ఏమవుతుందో?బీఆర్ఎస్కు చెక్పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులుఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్ పదవిని కాంగ్రెస్కు అప్పగించి, వైస్ చైర్మన్ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. -
కోటప్పకొండ ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్
పల్నాడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు భక్తులు పోటెత్తడంతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండ కిందకి గాని పైకి గాని కదలకుండా వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా గంటల తరబడి అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా కోటప్పకొండ నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో నరసరావుపేట వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు భక్తులు. కొండ దిగుభాగంలో పూర్తిగా వాహనాలు ప్యాక్ అయిపోవడంతో ట్రాఫిక్ను కంట్రోల్లో తీసుకురావడం కష్టతరంగా మారింది. ఇది క్లియర్ కావడానికి మరికొన్నిగంటలు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. -
మంత్రులు, పీసీసీ చీఫ్తో సీఎం జూమ్ మీటింగ్
హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికపై సీఎం రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) మున్సిపల్, కార్పొరేషన్లకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వీటిపై కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం కూడా దృష్టి సారించింది. ఏమాత్రం ఏమరపాటుకు లోనుకాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్ మీటింగ్లో చర్చించారు. దీనిలో భాగంగా నేతలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. -
జగిత్యాల ఎపిసోడ్కు ఫుల్స్టాప్..!
హైదరాబాద్: జగిత్యాల మున్సిపల్ పీఠంపై నెలకొన్న సందిగ్థతకు ఫుల్స్టాప్ పడినట్ల కనిపిస్తోంది. జగిత్యాల మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికే ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లతో సంధి కుదిర్చిన తర్వాత పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీరిద్దరితో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ చర్చలు జరపగా, అవి ఫలించాయనేది ప్రాథమిక సమాచారం. ఇరు వర్గాలకు నేతలు నచ్చచెప్పడంతో వారు మెట్టుదిగి వచ్చారని, ఈ క్రమంలోనే జెండా మోసిన వ్యక్తికు చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిలో భాగంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరు వర్గాల నేతలకు నచ్చచెప్పారు.ఈ చైర్మన్ పీఠంపై జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు చెరో వర్గంగా విడిపోయారు వార తమ పంతాన్ని నెగ్గించుకోవాలని పట్టుబట్టుకుని కూర్చున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికి మేయర్ పీఠం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది అధి నాయకత్వం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంజయ్ను ప్రజాభవన్కు పిలుపించుకుని మరీ చర్చలు జరిపారు. ఇది ఫలించడంతో జగిత్యాల ఎపిసోడ్కు దాదాపు ముగింపు పడినట్లే కనబడుతోంది. -
నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్.. కుదిరిన పొత్తు..!
సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది. కాంగ్రెస్కు మేయర్ పదవి, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి షేర్ చేసుకునేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. నగరపాలక సంస్థకు మెుత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు ఒక స్థానం లభించింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.అయితే ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో నిజామాబాద్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఇందూరులో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. బీజేపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ మేయర్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్ పావులు కదిపింది. అయితే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకిలోనే మరికొందరు మేయర్ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మేయర్ రేసులో ఉన్నారు. మొత్తం ఐదుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నాట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇక్కడ హంగ్ వచ్చింది. ఈ కార్పొరేషన్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్కు రెండు ఓట్లు పెరిగినట్లైంది. బీఆర్ఎస్ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేయర్ పీఠం చేజిక్కించుకుంది. -
కరీంనగర్ మేయర్పై వీడిన సస్పెన్స్?.. చక్రం తిప్పిన నేతలు
సాక్షి, కరీంనగర్: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలో సంచలనం జరగుబోతుందా అంటే దాదాపు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరీంనగర్ మేయర్ స్థానం చేజిక్కించుకోవడం కోసం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనికోసం తమ ప్రధాన ప్రత్యర్థైన బీఆర్ఎస్ కార్పోరేటర్ల మద్ధతు మంత్రి కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో సహా పలువురు ఇండిపెండెంట్ల తో కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెుత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు కోఆఫ్షన్ మెంబర్స్తో కలిసి మెుత్తం ఆసంఖ్య 69 స్థానాలకు చేరుకుంది. అయితే మేయర్ పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 35 స్థానాలు. ఇందులో బీజేపీ 30 స్థానాలు గెలువగా, కాంగ్రెస్ 14 సీట్లు సాధించింది. దీంతో బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అందుకునేలా ప్లాన్ వేసింది. దీనికి గానూ ఒక్కో కార్పోరేటర్ సీటుకు రూ.1.5 కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకూ బేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా మేయర్ పదవికోసం కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు ఆశావాహులుగా ఉండగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేయర్ పీఠం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపు ఫిబ్రవరి 16న జరగనుంది. దీంతో మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి:ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’ -
రాష్ట్ర పునర్నిర్మాణంలో మీపాత్ర మరవలేనిది: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంజారాభవన్లోసంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మానవ జాతి శాంతి మార్గం లో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తి ని నిప్పారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అందుకే దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా ఆయన నిలిచారన్నారు. సేవాలాల్ జయంతి అధికారికం గా జరపడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో లంబాడీలు కీలక పాత్ర పోషించారని రాష్ట్రం కోసం సురేష్ నాయక్, కవిత నాయక్ ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాడీల పాత్ర మరవలేనిదన్నారు. అందుకే తండాలలో రోడ్డు లేకుండా ఏ తండా ఉండకూడదని అన్ని తండాలకు బీటీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.అదే విధంగా ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాను zptc అభ్యర్థి గా పోటీ చేసినప్పుడు తండా ల్లో ఉన్న యువకులు తన విజయం లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు తనకు అండగా నిలిచారన్నారు. పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం రేషన్ కార్డని సీఎం తెలిపారు. కార్డు ఉన్నవారందరికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్ళకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని 50 లక్షల పేదల ఇళ్ల లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం రూ.9,000 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు.ఇటీవల జరిగిన గ్రూప్-1పై అక్రమ కేసులు వేస్తే పోరాడి ఉద్యోగాలు ప్రకటించామన్నారు. గ్రూప్-1లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. దీనిపైన ఎవరికైనా అనుమానం ఉంటే లెక్కపెట్టుకోవాలని సీఎం సవాల్ విసిరారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చారని, అసైన్డ్ పట్టాల రూపం లో గిరిజనులకు భూములు పంచారన్నారు. తమ ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని అందుకే నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి గొప్పస్థానాలకు ఎదగాలన్నారు. -
బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేస్తున్నారు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన ప్రతిచోటా కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్. సీపీఐ అలయెన్స్లో ఉన్నాయని సింగరేణిలో కొన్నిచోట్ల బీజేపీ, సీపీఐ సైతం కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికే కొన్నిచోట్ల సీపీఐకి మద్ధతిచ్చామన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 15-22)
-
కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదరిన ఒప్పందం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా కాంగ్రెస్, సీపీఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 9న ఎన్నికలు జరగ్గా, 11న ఫలితాల్లు వెల్లడయ్యాయి. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్కు 22, సీపీఐకి 22 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రాలేదు. మరోవైపు సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఫలితంగా సీపీఐ 22, బీఆర్ఎస్ 8 కార్పొరేటర్ల బలం కలుపుకుంటే మేజిక్ ఫిగర్ చేరేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇదే సమయంలో స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ సైతం మేయర్ పదవి కోసం ఆరంభంలో ప్రయత్నాలు చేసినా, ఆ తర్వాత అర్ధంతరంగా ఆ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్, సీపీఐలకు చెందిన అగ్రనాయకులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చివరకు పవర్ షేరింగ్పై ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. కాగా, పవర్ షేరింగ్పై ఇటు కాంగ్రెస్, అటు సీపీఐలో కొత్తగూడేనికి సంబంధించిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం ఇక్కడితో సమసి పోతుందా లేక సోమవారం వరకు కొనసాగుతుందా అనేది చూడాలి. సీపీఐలో మేయర్ పదవి ఎవరిని వరించేనో... సీపీఐ నుంచి 22 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇందులో మేయర్ పదవి రిజర్వ్ చేయబడిన ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. సీపీఐ తరఫున గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు సైతం కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ల నుంచి గెలుపొందారు. వేర్వేరు ప్రాంతాలుగా ఉన్న ఈ మూడింటిని ఒక్కటిగా చేస్తూ కార్పొరేషన్గా మార్చారు. ఇప్పుడు మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులు గెలవడం, వారంతా మేయర్ పదవికి అర్హులై ఉండటం విశేషం. సుజాతనగర్ పరిధిలోకి వచ్చే 20వ డివిజన్ నుంచి మూడు గణేశ్ 277 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పాల్వంచ పరిధిలోకి వచ్చే 31వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల 73 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కొత్తగూడెం పరిధిలో 52వ డివిజన్ నుంచి బానోతు కళావతి 224 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించింది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు.ఆది నుంచీ ఆసక్తికొత్తగూడెం మేయర్ కుర్చీలో తొలిసారిగా కూ ర్చునేది ఎవరనే అంశంపై ఆది నుంచీ ఆసక్తి నెలకొంది. కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. మొత్తం 60 డివిజన్లలో 11 డివిజన్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో మేయర్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని చాలా మంది అశావహులు ఎన్నికల బరిలో దిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే వైద్యులు సైతం ఖద్దరు బట్టలు తొడిగి రాజకీయ కదనరంగంలోకి దూకారు. వైద్యుడు భూక్యా శ్రీనివాసరావు జనరల్గా ఉన్న 6 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచారు. రికార్డు స్థాయిలో 608 ఓట్ల మెజార్టీ సాధించారు. కొత్తగూడెంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ. సీనియర్ రాజకీయనేత శంకర్నాయక్ సతీమణి స్వప్నా నాయక్ 19వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు కాకుండా మూడో డివిజన్ నుంచి గుగులోతు శ్రీను, 23 డివిజన్ నుంచి బానోతు అనిత, 33 డివిజన్ నుంచి బానోతు బాలు ఉన్నారు. -
ఇందూర్ మేయర్ ఎవరో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరపా లక సంస్థ (కార్పొరేషన్) మేయర్ ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఇందూ రు నగరంలో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ బీజేపీకి అవకాశాలు లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి మే యర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. మేయర్ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకిలోనే మరికొందరు మేయర్ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మే యర్ రేసులో ఉన్నారు. మొత్తం ఐదురుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీ పెద్దల టచ్లోకి వెళ్లి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో ఉత్కంఠగా మారింది. దీంతో ఇందూరు నగరపాలకలో రాజకీ యం రసకందాయంలో పడింది. 60 డివి జన్లు ఉండగా.. బీజేపీకి 28, కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు ఒక సీటు వ చ్చింది. ఇక్కడ గతసారి మాదిరిగానే హంగ్ ఏర్పడింది. ఎంఐఎం మద్దతుతో మేయర్ చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్కు రెండు ఓట్లు పెరిగినట్లైంది. బీఆర్ఎస్ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆ«దీనంలోనే ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పలువురు పోటీ పడుతున్నారు. మేయర్ ఆశిస్తున్నవారు ఆ పదవి దక్కదనుకుంటే ఏమైనా తేడా చేస్తారా అనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ ఖాయమైతే సహకరించిన ఎంఐఎం పారీ్టకి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.బోధన్లో రసవత్తరంబోధన్టౌన్: ఎన్నికల ఫలితాల అనంతరం బోధన్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 12, బీజేపీ 3 సీట్లు సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. స్వతంత్ర కౌన్సిలర్తోపాటు బీఆర్ఎస్కు చెందిన మరో కౌన్సిలర్ను సైతం కాంగ్రెస్ నాయకులు క్యాంప్నకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ లెక్కన కాంగ్రెస్ బలం 19కి చేరగా, ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
ఒట్టేసి చెప్పు ఓటేశావో లేదో..
మంచిర్యాల జిల్లా: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ డబ్బులు పంచి.. ఓటమి తర్వాత తిరిగి ఇవ్వాలంటూ వసూలు చేస్తున్న వీడియో శనివారం వైరల్గా మారింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ బీజేపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమి పాలైంది. శనివారం డివిజన్ పరిధిలోని సీతారాంపల్లిలో ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి.. ‘ఓటు వేసావో లేదో ఒట్టేసి చెప్పు’.. అంటూ చేతిలో చేయి వేయించుకుంది. సదరు వృద్ధు రాలు తమ ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయని, ఒకటి వేశామని, మరొకటి వేయలేదని చేతిలో చేయి వేసి చెప్పింది. అనంతరం రూ.3000 తిరిగి ఇచ్చేసింది. డబ్బులు ఎవరు పంపిణీ చేయమన్నారు?.. ఎందుకు తిరిగి ఇవ్వమంటున్నారని పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో కనిపిస్తోంది. SWEAR ON GOD THAT YOU VOTED…OR PAY BACK! BJP candidate Jadi Tirupati, who lost in Mancherial Municipal Corporation Division 9, in the recently concluded Telangana Municipal polls decided that it is “pay back” time quite literally. His wife Roopa went to every house and… pic.twitter.com/N3Uqgml75D— Revathi (@revathitweets) February 14, 2026 -
కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి..
హైదరాబాద్: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అరకిలోమీటరు వరకు లాక్కెళ్లడంతోపాటు అతనిపైనే కారును పోనిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. రాంపల్లి నీలగిరి హోమ్స్లో నివాసముంటున్న సతీష్(45), విజయ్కుమార్, రాజులు ఈ నెల 9న కారులో వెళుతుండగా మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన కారు వీరి కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో వీరు వేగంగా వెళ్లి ఆ కారును అడ్డుకున్నారు. సతీష్ ఆ కారుకు ఎదురుగా నిలబడ్డాడు. అయితే నిందితులు వేగంగా వచ్చి సతీష్ను ఢీకొట్టడంతో అతను బానెట్ను గట్టిగా పట్టుకున్నాడు. అయినా అలాగే సుమారు అర కిలోమీటరు వరకు లాక్కెళ్లారు. అదుపుతప్పి సతీష్ పడిపోవడంతో నిర్దాక్షిణ్యంగా అతనిపైనే కారుపోనిచ్చారు. ఈ సంఘటనలో సతీష్ తీవ్రంగా గాయడ్డాడు. గమనించిన స్థానికులు కారును అడ్డుకొని అందులో ఉన్న మహేష్ తరుణ్లకు దేహశుద్ధి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను శనివారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
‘మున్సిపోల్స్’లో కాంగ్రెస్కు 40% ఓట్లు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్క తేలిపోయింది. ఈనెల 11న జరిగిన పోలింగ్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు, ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ ఎన్నికల్లో మొత్తం 37,81,232 ఓట్లు పోల్ కాగా, అందులో అత్యధికంగా కాంగ్రెస్కు పోలయ్యాయి. ఈ పార్టీకి మొత్తం 39.8 (దాదాపు 40 శాతం)తో 15,05,006 ఓట్లు వచ్చాయి. గత (2020) మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 7లక్షల ఓట్లు ఆ పార్టీ కి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్కు గత ఎన్నికలతో పోలిస్తే 5 లక్షల ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో 15.90 లక్షల ఓట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 10,87,347 (దాదాపు 29 శాతం) ఓట్లకు పరిమితమైంది.ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 11 శాతంగా నమోదైంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 4,17,659 ఓట్లు అదనంగా వచ్చాయి. మరో ప్రతిపక్షమైన బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికలతో పోలిస్తే తగ్గలేదు. గత ఎన్నికల్లో వచ్చిన 15 శాతం ఓట్లను మళ్లీ నిలబెట్టుకుంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో 5.5 లక్షల ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి మరో 42 వేల ఓట్లు పెరిగి మొత్తం 5,92,823 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం కూడా తన 3% ఓట్లను పదిలపర్చుకుంది.2020 ఎన్నికల కంటే ఆ పార్టీ కి 3 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. కాగా, ఈసారి మూడు ప్రధాన పార్టీ ల తర్వాత అత్యధికంగా ఓట్లు తెచ్చుకుంది స్వతంత్రులే. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లలో 8.3 శాతం ఓట్లు అంటే 3,14,096 ఓట్లు వచ్చా యని ఈసీ ప్రకటించింది. ఎంఐఎంతో సహా సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫా ర్వర్డ్ బ్లాక్, జేఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఎంబీటీ, ఐయూఎంఎల్.. ఇలా అన్ని పార్టీ ల ఓట్లు కలిపినా ఇండిపెండెంట్ల కంటే తక్కువే కావడం గమనార్హం. -
మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టడంతోపాటు పునరుద్ధరణ చర్యల విషయంలో నీటిపారుదల శాఖ, సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), డిజైన్ కన్సల్టెంట్కు పూర్తి సహకారం అందించాలని బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్ జాయింట్ వెంచర్’ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. సిబ్బంది, సామగ్రి, యంత్రాలను బరాజ్ వద్దకు తరలించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేసింది. పరస్పర అంగీకారంతో రూపొందించే నిబంధనల ప్రకారమే బరాజ్ పునరుద్ధరణ పనులు చేపట్టాలంటూ ‘ఎల్ అండ్ టీ’ప్రత్యుత్తరం రాయడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. పరస్పర అంగీకారమనే ప్రశ్న ఉత్పన్నం కాదని.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని తేలి్చచెప్పింది. కేవలం నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఒప్పంద కాలంలోనే బరాజ్కు నష్టం జరిగిందని.. బరాజ్ పునరుద్ధరణను పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టాలని ‘ఎల్ అండ్ టీ’కి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ రామగుండం సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ నెల 3న ‘ఎల్ అండ్ టీ’కి మరో లేఖ రాశారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో నిర్మాణ సంస్థ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు తమ నివేదికల్లో తేల్చడాన్ని గుర్తుచేశారు. పునరుద్ధరణ చర్యల్లో ఈ సంస్థల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం లేఖలో ఆదేశించింది. నీటిపారుదల శాఖ నియమించే డిజైన్ కన్సల్టెంట్ నుంచి అవసరమైన ఇన్పుట్స్ అందిన వెంటనే బరాజ్ పునరుద్ధరణకు సహకరిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. పునరుద్ధరణ పనుల డిజైన్ల తయారీ కోసం ఆఫ్రీ ఇండియా లిమిటెడ్ సంస్థను కన్సల్టెంట్గా ఎంపిక చేశామని.. త్వరలో ఒప్పందం చేసుకోనున్నామని తెలియజేసింది. -
టార్గెట్ 90
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 16న జరిగే మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో కనీసం 90కి తగ్గకుండా పురపాలి కల్లో కాంగ్రెస్ కొలువు తీరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులకు లక్ష్యం నిర్దేశించారు. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి, హంగ్ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులతో శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో ప్రత్యే కంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించిన మంత్రులు.. ప్రజాతీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితమే ఈ విజయమని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన పార్లమెంట్ ఇన్చార్జి మంత్రులను సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. అలాగే పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు నడిపిన మహేశ్కుమార్గౌడ్, రేవంత్రెడ్డిని మంత్రులు అభినందించారు. ఫలితాలు మనకు బూస్టప్ మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ అందరం కలసికట్టుగా పనిచేయడం వల్లే సత్ఫలితాలు సాధించామన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీకి బూస్టప్ ఇచ్చాయని చెప్పారు. మొత్తం 70కిపైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధించిందని.. హంగ్ ఏర్పాటైన చోట్ల కూడా స్వతంత్రులు, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగరేసేలా మంత్రులు పనిచేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను పార్లమెంటు ఇన్చార్జి మంత్రులకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలపై పార్టీ అగ్ర నాయకత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్న సీఎం.. త్వరలోనే పరిషత్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ను నమ్మలేదు.. బీజేపీ బలపడలేదు ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో లేరని.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందన్న వాదనలో నిజం లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే చేసి చూపిందని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తిని చాటాలని మంత్రులకు సూచించారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ ముఖ్య నేతలు వేం నరేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, చిన్నారెడ్డి హాజరవగా ఆన్లైన్ ద్వారా మంత్రులు ఉత్తమ్, దామోదర, తుమ్మల, మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. మంత్రులకు పని విభజన పార్టీపరంగా సమస్యలున్న మున్సిపాలిటీల్లో అందరితో మాట్లాడే బాధ్యతను మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు.జగిత్యాల పంచాయతీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కు అప్పగించిన సీఎం.. కొత్తగూడెం బాధ్యతను పొంగులేటికి, కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతను శ్రీధర్బాబు, పొన్నం, నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యత మహేశ్గౌడ్, ఉత్తమ్కు అప్పగించారు. -
మూడు ముక్కలాట!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంకటంలో పడేసింది. 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు రావడంతో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అంశం ఆయా పార్టీల మధ్య మూడు ముక్కలాటగా మారింది. పరస్పరం కత్తులు దూసుకొనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించుకుంటేనే కనీసం 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువుతీరే పరిస్థితి నెలకొనడం పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.ఒకవేళ ప్రధాన రాజకీయ పక్షాలు సహకరించుకోకుంటే ‘గోడ దూకుళ్లు’ మాత్రమే ఆయా మున్సిపాలిటీల్లో పీటముడి వీడేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరో 12 మున్సిపాలిటీల్లో స్వతంత్రుల సాయంతో, ఇంకో 5 మున్సిపాలిటీల్లో స్వతంత్రులతోపాటు ఎంఐఎం, ‘లెఫ్ట్’పార్టీల సాయంతో పాగా వేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండటంతో ఆ దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముడిపడిన మున్సిపాలిటీలివే.. హంగ్ ఫలితాలు వచి్చన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేయాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి కానుంది. ఈ జాబితాలో మెట్పల్లి, రాయికల్, అలంపూర్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపూర్, ఎల్లంపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత, వర్ధన్నపేట, కేతనపల్లి ఉన్నాయి. కేతనపల్లిలో ఇరు పార్టీలు చైర్మన్, వైస్చైర్మన్ల పంపకాలపై అవగాహనకు వచ్చేందుకు అవకాశాలు ఉండగా మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపేర్, ఎల్లంపేట, నారాయణపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే సులువుగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్లలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మిగిలిన చోట్ల బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి లబ్ధి కలుగుతుందనే అంచనాతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. గైర్హాజరు... గోడ దూకుళ్లు ప్రధాన పార్టీలు మూడు దిక్కులుగా ఉన్న పరిస్థితుల్లో మిగిలిన ప్రత్యామ్నాయాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా అవగాహన కుదుర్చుకోకపోయినా స్థానిక నేతల మధ్య జరిగే చర్చలను బట్టి ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరైతే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే అలా గైర్హాజరు కావడం ద్వారా మేజిక్ ఫిగర్లో మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయని.. నేరుగా మద్దతివ్వడమే పరిష్కారమని అంటున్నాయి. ఈ రెండు మార్గాలు కుదరని పక్షంలో మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లను లాక్కోవడమే మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల స్వతంత్రులు కాంగ్రెస్లో చేరడమో లేదా మద్దతు ప్రకటించడమో జరిగిపోయింది. అయితే ఇందుకోసం రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వతంత్రుల సాయం తీసుకుంటే.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలను గెలిచే అవకాశం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. జనగామ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మొయినాబాద్, ఇస్నాపూర్, కోహిర్, పరిగి, పోచంపల్లి, జగిత్యాల, వేములవాడ, దేవరకద్ర, వికారాబాద్ మున్సిపాలిటీల్లో స్వతంత్రులుగా గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తే ఆ స్థానాలు అధికార పార్టీ వశం అవుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒక్క ఎక్స్ అఫీషియో ఓటుతో కేసముద్రం మున్సిపాలిటీని కూడా గెలుచుకోవచ్చు. దీంతో అధికార పార్టీ ఖాతాలో ఈ 13 మున్సిపాలిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, జహీరాబాద్, బోధన్లలో స్వతంత్రులతోపాటు లెఫ్ట్, ఎంఐఎంలు సహకరిస్తే ఆయా పీఠాలు కూడా అధికార పార్టీకి లభిస్తాయి. ఇక ఆలియాబాద్లో మ్యాజిక్ ఫిగర్కు మూడు స్థానాలు తక్కువ పడగా ఒక స్వతంత్ర, ఒక బీఎస్పీ కౌన్సిలర్ను కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో మరొకరు అవసరం కాగా బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్కు వైస్చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. సీఎం వద్దకు వడ్డేపల్లి కౌన్సిలర్లు వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలన విజయం సాధించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కు చెందిన 8 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టయింది. స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో కౌన్సిలర్లు కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్రెడ్డి, దేవమ్మ, విజయభాస్కర్, జయశ్రీ, ఎరుకల తిమ్మప్ప ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్కుమార్ పాల్గొన్నారు. -
రాజులు వారే... తరాజులు వారే!
తెలంగాణకు సంబంధించినంతవరకు ‘నేనే రాజును, నేనే మంత్రిన’ని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించ డానికి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయనీ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలే రాజులనేది ఒక ప్రాథమిక అవగాహన. భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నది కూడా ప్రజల పేరుతోనే కదా! ఈ కోణం నుంచి చూసినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో స్వాతిశయం మోతాదు మించినట్టే కనిపిస్తుంది. మరుసటి రోజు ప్రకటించబోయే ఎన్నికల ఫలితాల్లో భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నామనే జోష్ ఇందుకు కారణం కావచ్చు.ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే భారీ విజయం దక్కినట్టు ఎలా భావిస్తారు? అదంతే! మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తలచుకుంటే స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. అర్థబలం, అంగబలం అధికార పార్టీకి దండిగా ఉండడం ఒక కారణం. అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పుచేతల్లోఉంటుంది. అంకితభావంతో ఒక పార్టీకి జెండా మోసే కార్య కర్తల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీల్లో తగ్గుముఖం పట్టింది. వారి స్థానాన్ని నాలుగురాళ్లు వెనకేసుకున్నవారు, పైరవీకార్లు ఆక్రమిస్తున్నారు. అంకితభావంతో ఉండే కార్యకర్తల మాదిరిగా తెగించి పోరాడే తత్వం ఈ నయా శ్రేణులకు తక్కువ. లెఫ్ట్, బీజేపీల్లో ఈ జాడ్యం కొంత తక్కువ కావచ్చు కానీ, మిగిలిన పార్టీలేవీ మినహాయింపు కాదు. దానికితోడు ఇంకో రెండు మూడేళ్లు అధికారంలో ఉండే పార్టీనే గెలిపిస్తే కొద్దోగొప్పో అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం కూడా ఓటర్లలో ఉండే అవకాశం ఉన్నది.ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఓట్ల లెక్కింపునకు ముందే భారీ విజయాన్ని ముఖ్యమంత్రి ఊహించడం, 90 శాతం మునిసిపాలిటీలు గెలవబోతున్నామని ప్రకటనలు చేయడం అసహజమేమీ కాకపోవచ్చు. ఇంతకుముందు 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక పార్టీ 93 శాతం మునిసిపాలిటీలను గెలుచుకున్న ఉదాహరణ కూడా ఉన్నది. కాకపోతే ఆ స్థాయి ఫలితాల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిందా అనేదే ప్రశ్న. 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత 66 చోట్ల లభించింది. అంటే 57 శాతం. 36 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ 36 త్రిశంకు కౌన్సిళ్లలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. ఇవి కూడా పార్టీ ఖాతాలో పడితే సంఖ్య 79కి, శాతం 68కి చేరుతుంది.ఇంకో ఆరు మునిసిపాలిటీల్లో రెండు పార్టీలకు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. ఐదుచోట్ల కాంగ్రెస్ – బీఆర్ఎస్కు మధ్య, ఒకచోట బీఆర్ఎస్ – బీజేపీకి నడుమ ఈ టై ఏర్పడింది. 12 హంగ్ మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పెద్దపార్టీగా గెలిచింది. నాలుగు మునిసిపాలిటీల్లో బీజేపీ, ఒకచోట ఎమ్ఐఎమ్లు పెద్దన్నలుగా ఉన్నాయి. ఈ మొత్తం 23 చోట్ల అధికార దన్నుతో సగానికి సగం కాంగ్రెస్ లాక్కోగలిగినా గరిష్ఠంగా దాని బలం 90 మునిసిపాలిటీలకు చేరుతుంది.స్ట్రయిక్ రేట్ 80 శాతాన్ని దాటే అవకాశం లేదు. అయినా, ఇదేమీ చిన్న విజయం కాదు. ఐదింట నాలుగొంతుల మునిసిపాలిటీలను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంటుంది. కాకపోతే ఐదేళ్ల కింద అప్పటి అధికార బీఆర్ఎస్ ఇంతకంటే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ‘నేనే రాజు, నేనే మంత్రి’ ప్రకటన స్పష్టం చేసినట్లయింది. 2020లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మునిసిపాలిటీలే దక్కాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మునిసి పాలిటీలను స్పష్టమైన మెజారిటీతో గెలుచుకున్నది. ఇంకో పన్నెండు హంగ్ పట్టణాల్లో పెద్ద పార్టీగా గెలిచింది. ఐదుచోట్ల కాంగ్రెస్తో, ఒకచోట బీజేపీతో సమాన వార్డులు గెలవడంతో అక్కడ టై ఏర్పడింది. మొత్తంగా 31 మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ తన బలాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ తన ‘దర్బార్ సంస్కృతి’ నుంచి బయటపడి ఉన్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని క్షేత్రస్థాయి రిపోర్టులు సూచిస్తు న్నాయి. పార్టీకి కేంద్రంలో మాదిరిగానే నియోజకవర్గాల స్థాయిలో కూడా దర్బార్ సంస్కృతి అలవాటైంది. అక్కడ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిలే పార్టీకి కేరాఫ్ అడ్రస్!పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలకు సమాంతరంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్ఎస్ చేపట్టలేక పోయింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో తెగించి పోరాడే కార్యకర్తలు కరువయ్యారు. ఈ పరిణామం నగర కార్పొ రేషన్లలో, పెద్ద పట్టణాల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ అధినేత మీద జనసామాన్యంలో ఉండే అభిమానం ఇక్కడ పోలైన ఓట్లలో ప్రతిఫలించలేదు. ఎన్నికలు జరిగిన ఏడు నగర కార్పొ రేషన్లలో పెద్దవైన నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని అదిదక్కించుకోవచ్చు. నిజామాబాద్లో బీజేపీ గణనీయంగా 28 డివిజన్లు దక్కించుకున్నప్పటికీ, కాంగ్రెస్ – ఎమ్ఐఎమ్ కలిసి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ బీజేపీకి గట్టి పునాదే ఉన్నది. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఆ పార్టీవే. బీజేపీ విస్తృత ప్రచార వ్యూహాలతో వోటర్లలో పోలరైజేషన్ సృష్టించి లాభపడింది. ఈ ట్రెండ్కు ఎదురీదేంత సంస్థాగత బలం, నాయకత్వం లేక బీఆర్ఎస్ ఆ మేరకు నష్టపోయింది.కొత్తగూడెం ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. కాంగ్రెస్తో పొత్తులో కొత్తగూడెం శాసనసభ్యునిగా ఎన్నికైన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తన నాయకత్వ ప్రతిభను ఈ ఎన్నికల్లో చాటుకున్నారు. కాంగ్రెస్తో సమానంగా 22 సీట్లను సీపీఐ గెలిచింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార చాతుర్యం ప్రదర్శించి అడ్డుపుల్లలు వేయకపోతే సీపీఐకి మేయర్ పీఠం ఖాయం. అదే జరిగితే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అదొక శుభసూచకం. ఎందుకంటే, అన్యాయాన్ని ఎదిరించే శక్తులకూ, ప్రశ్నించే గొంతులకూ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీలు ఆదర్శమే కనుక! మిగిలిన నాలుగు కార్పొరేషన్లు నల్లగొండ, మహబూబ్నగర్, రామగుండం,మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై విజయం సాధించింది.మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవరికెన్ని, ఎంత శాతం అనేదానికన్నా వార్డులు, డివిజన్ల సంఖ్య కీలకం. ఎందుకంటే, జనం ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించేది వార్డు/ డివిజన్ సభ్యులనే! మునిసిపల్ వార్డుల్లో కాంగ్రెస్కు 1,347, బీఆర్ఎస్కు 716, బీజేపీకి 261, ఇతరులకు 257 లభించాయి. కార్పొరేషన్ల డివిజన్లలో కాంగ్రెస్ 191, బీఆర్ఎస్ 63, బీజేపీ 76, ఇతరులు (సీపీఐ సహా) 83 చోట్ల గెలిచారు. ఇక ఓట్ల శాతానికి వస్తే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపిన లెక్క అందుబాటులో ఉన్నది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్కు 29 శాతం, బీజేపీకి 16 శాతం, ఇండిపెండెంట్లకు 8 శాతం, ఎంఐఎంకు 3 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం లభించినట్టు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకపక్షంగా గెలవడం రివాజుగా మారిన ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభావం కాంగ్రెస్ చెబుతున్నంత బలహీనంగా ఏమీ లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతమైన బలహీనతలను అధిగమించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీపీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలను కొట్టి పారేయలేము. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మంచి విజయాన్ని సాధించినప్పటికీ రెండు కమ్యూ నిస్టు పార్టీలకూ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రెండు శాతం ఓట్లుకూడా రాకపోవడం ఒక విషాదం. ఒకప్పుడు మిలిటెంట్ పోరాటాలకు పెట్టింది పేరైన సీపీఎం పార్టీ కేవలం అరశాతం ఓట్లకు మాత్రమే పరిమితం కావడం దాని స్వయంకృతాపరాధమే! ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మాత్రంకాంగ్రెస్ పార్టీ వృద్ధ సింహం తాటిపర్తి జీవన్రెడ్డి గురించే! జగిత్యాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఆయన అనుచరులకే ఎక్కువ భాగం టిక్కెట్లను కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ, జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఆయన దృఢంగా నిలబడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించింది. డబ్బూ, అధికారం తోడు లేకున్నా జీవన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటానికి జగిత్యాల జనం జైకొట్టారు. టికెట్ దొరికిన కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్లుగా నిల బెట్టిన వారితో సహా మొత్తం 18 మందిని గెలిపించుకొని రేస్లో నంబర్ వన్గా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జీవన్రెడ్డి అనుచ రునికి ఛైర్మన్ పదవిని ఇస్తుందా? లేక అధికారం అండతో మేనేజ్ చేసి ఎమ్మెల్యే మనిషినే ఛైర్మన్ చేస్తుందా అనేది వేరే సంగతి. కానీ జగిత్యాల విన్నర్ మాత్రం జీవన్రెడ్డే!‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ముఖ్యమంత్రి ప్రకటించు కోవడం దర్బార్ సంస్కృతి ప్రవేశిస్తుందనడానికి ఒక సూచికే! ఈ ప్రకటనతో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తు న్నారో, ఎంతమంది విభేదిస్తున్నారో తెలియదు. భిన్నాభిప్రా యాలు ఇప్పటికైతే పెదవులు దాటడం లేదు. నాలుగు దశాబ్దాలకాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డున్న జీవన్రెడ్డి తరఫున ఒక్క గొంతు కూడా వినిపించకపోవడం నిజంగా విచిత్రమే. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సరికొత్త సామరస్యమో, తుపాను ముందరి ప్రశాంతతో కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజలే రాజులన్న సత్యాన్ని గ్రహించక పోతే 2023లో బీఆర్ఎస్కు ఎదురైన అనుభవమే ఎవరికైనా తప్పదు. రాజులూ ప్రజలే! వాళ్లు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రభుత్వ పనితీరును తూకం వేసే తరాజులూ వారే!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కొత్తగూడెం మేయర్ పీఠం పై వీడిన పీటముడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల హంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికి అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్-సీపీఐల మధ్య చర్చలు సఫలం కావడంతో కొత్తగూడెం మేయర్ పీఠంపై పీటముడి వీడింది. కాంగ్రెస్-సీపీఐ పొత్తుతో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో సీపీఐకి మేయర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లలో ఈ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, సీపీఐ రెండూ సమానంగా 22 సీట్లు గెలవడంతో హంగ్ కౌన్సిల్ ఏర్పడింది. అంటే, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్కు 8 సీట్లు వచ్చాయి. సీపీఐకి అవసరమైతే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కేటీఆర్ ప్రకటించారు కూడా. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పందించారు కూడా. సీపీఐ అనేది తమకు మిత్రపక్షమేనని, కాకపోతే ఇక్కడ విడివిడిగా పోటీ చేశామని నిన్ననే క్లారిటీ ఇచ్చారు. దాంతో కొత్తగూడెంలో కాంగ్రెస్-సీపీఐలు కలిసే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాయనే సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో కొత్తగూడెం కార్పొరేషన్లో నెలకొన్న మేయర్ పదవిపై సందిగ్థత వీడింది. -
అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు: సీఎం రేవంత్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులందరినీ సీఎం అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించాం. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు. -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం..
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ ప్రాసిక్యూషన్కు అనుమతి లభించింది. ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్న ఏసీబీ.. మరో వైపు ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో రాజకీయ, అధికారులపై ప్రాసిక్యూషన్కు అనుమతి రావడంతో.. ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసంది. -
తెలంగాణలో కాకరేపుతున్న క్యాంప్ పాలిటిక్స్
మొయినాబాద్: తెలంగాణలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు ఎక్కడ జంప్ జిలానీ అంటారో అని ఆయా పార్టీలు వారిని డేగ కళ్లతో కనిపెడుతున్నాయి. దీనిలో భాగంగా వారిని క్యాంప్లకు తరలిస్తూ దాచేయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రిసార్ట్ల్లో దాస్తున్న అభ్యర్థులను డైరెక్ట్గా చైర్మన్, మేయర్ ఎన్నికకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు చేయి జారకుండా పార్టీల జాగ్రత్తలు పడుతున్నాయి. మధ్యలో గ్యాప్ ఇస్తే అభ్యర్థులు మాయమైపోతారనే భయంలో పార్టీలు ఉన్నాయి. జగిత్యాలలో ఒకే పార్టీలో క్యాంప్ రాజకీయాలు..జగిత్యాలలో ఒకే పార్టీలో ఇద్దరు ప్రత్యర్థి నేతల మధ్య మొదలైన క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. తన అనుచరులు 18 మందితో కలిసి హైదరాబాద్ క్యాంపునకు మాజీమంత్రి జీవన్ రెడ్డి బయల్దేరారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు మేజిక్ ఫిగర్ 26 సీట్లు..ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు తన వర్గీయులతో పాటు, ఎంఐఎం ఇద్దరు, ఇండిపెండెంట్స్ కలిపి 22కు చేరింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇద్దరూ చేతులు కలిపితేనే జగిత్యాల బల్దియా కాంగ్రెస్ వశమవుతుంది. సంజయ్ వర్గంతో కలిసేందుకు జీవన్ రెడ్డి..ససేమిరా అంటున్నారు. ఆదినుండి పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం దక్కాలని పట్టుబడుతున్నారు.రసకందాయంగా జగిత్యాల్లో కాంగ్రెస్ అంతర్గత క్యాంప్ రాజకీయాల కొట్లాట మొదలైంది. ఇక పాలమూరు టూ చీరాల క్యాంపుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు బయల్దేరారు. రాత్రే ఓ వాహనంలో కొందరు వెళ్లగా నేడు మరో టూరిస్ట్ బస్సులో పయనమయ్యారు. కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్యే, పార్టీ ప్రదాన నేతలు సైతం క్యాంపులకు బయల్దేరారు. ఇలా తెలంగాణలో ప్రతీ చోటా క్యాంపు రాజకీయాలే కనిపిస్తున్నాయి. -
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో కీలక పరిణామం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ బలం.. మ్యాజిగ్ ఫిగర్కి చేరుకుంది. బండి సంజయ్ సమక్షంలో రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలో చేరారు. ఆ ఇద్దరి చేరికతో కార్పోరేషన్లో 34కి బీజేపీ బలం చేరుకోగా.. బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో 35కి బీజేపీ బలం చేరింది. కరీంనగర్ కార్పోరేషన్ దాదాపు బీజేపీ కైవసం చేసుకున్నట్లయింది.కరీంనగర్లో ఫలితాల తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో 66 డివిజన్లలో 30 సీట్లు గెల్చుకుని బీజేపీ.. అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు దక్కించుకోవాలంటే 34 సీట్లు అవసరం. ఎక్స్ అఫీషియో మెంబర్లగా ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిల ఓట్లతో బీజేపీ బలం 33కి చేరింది. ఇప్పటికే మరో ఐదుగురు ఇండిపెండెంట్స్ బీజేపీలో చేరికతో కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. కరీంనగర్లో 30 స్థానాలు గెలుచుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్ పీఠం బీజేపీ వశమవడంనల్లేరు మీద నడకలా ఉంది. తెరపైకి ఎక్స్అఫిషియో ఓట్లుఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. రాయికల్, మెట్పల్లి, జమ్మికుంటలో హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి చోట్ల ఎక్స్అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గపరిధిలోని మున్సిపాలిటీలో ఎక్స్అఫిషియో ఓటుహక్కు కలిగి ఉంటారు. తన పరిధిలో రెండు మూడు మున్సిపాలిటీ ఉంటే.. ఎక్కడ అవసరమో అక్కడ ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాని సమయంలో వీరి ఓటు కీలకమవుతుంది. తాజాగా పాత కరీంనగర్ జిల్లాలో ఎక్స్అఫిషియో ఓట్లపై జోరుగా చర్చ సాగుతోంది.కరీంనగర్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. మేజిక్ ఫిగర్ చేరుకోలేదు. అవసరాన్ని బట్టి 10 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లతోపాటు, ఎక్స్అఫిషియో ఓట్లు వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలో దాచిన ఈ ఓట్లను అవసరాన్ని బట్టి వినియోగించనున్నాయి. బీజేపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఓట్లు ఉండగా..కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్లో, మేడిపల్లి సత్యం చొప్పదండిలో, ఆది శ్రీనివాస్ వేములవాడలో, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ ధర్మపురిలో, మంత్రి శ్రీధర్బాబు మంథనిలో, హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, విజయరమణారావు పెద్దపల్లి, సుల్తానాబాద్లో, రామగుండంలో మక్కాన్సింగ్ ఓట్లు వినియోగించుకునే అవకాశముంది. వీరే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, భానుప్రసాద రావు ఉన్నారు. బీఆర్ఎస్కు గంగుల కమలాకర్, కేటీఆర్, కోరుట్లలో సంజయ్, హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఓట్లు అందుబాటులో ఉన్నాయి. -
అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సులేమాన్ నగర్లోని తన స్వంత కార్యాలయంలోనే కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే ఖదీర్ మృతి చెందాడు. ఫ్యామిలీ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
‘ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మేయర్ ఎన్నికల వ్యవహారం మరింత హీట్ పుట్టిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కుట్రలు చేసి కరీంనగర్లో బీజేపీకి మేయర్ పదవి రాకుండా కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్రజా తీర్పును కాలరాసి ఏమైనా కుట్రలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం. కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ ఎలా దక్కించుకుంటాయి?, బీజేపీకి మేయర్ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయి. కరీంనగర్ వేదికగా మూడు పార్టీల బండారం బయటపడుతోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజాతీర్పును కాలరాస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్లను తిరగనివ్వను’ అని తీవ్రంగా హెచ్చరించారు.కాగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. BJP 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్ల చొప్పున గెలిచాయి. ఇండిపెండెంట్లు 8 సీట్లు గెలవగా, ఫార్వర్డ్ బ్లాక్ రెండు డివిజన్లలో గెలిచింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. -
పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!
బెట్టింగ్ యాప్లు, సైబర్ మోసాలు, స్కాంలపై అలుపెరుగని పోరు సల్పుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహ కల్పించే, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవలి కాలంలో విద్యావంతులు కూడా డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్న కేసులను అనేకం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఒకవీడియోను ఎక్స్లో షేర్ చేశారు. దీంతో పాటు తన సందశాన్ని కూడా జోడించారు.‘‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి.హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి’’ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి...… pic.twitter.com/mzA6JNKBrk— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 14, 2026 -
వస్తోంది వాహన్ పోర్టల్
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలతో పాటు వివిధ రకాల పౌరసేవలను మరింత సులభతరం చేసే వాహన్ పోర్టల్ వచ్చే మార్చిలో అందుబాటులోకి రానుంది. తొలుత సికింద్రాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి అనంతరం గ్రేటర్లోని మిగతా రవాణా కార్యాలయాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ఆర్టీఏ అధికారులు, ఉద్యోగులతో పాటు ఆటోమొబైల్ డీలర్లకు ఈ నెల 16 నుంచి శిక్షణనివ్వనున్నారు. గ్రేటర్లో 89 లక్షల వాహనాలు ప్రస్తుతం సారథి పోర్టల్తో డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన పౌరసేవలు అందజేస్తున్న తరహాలోనే మార్చి నుంచి వాహనాలకు సంబంధించిన 52 రకాల సర్వీసులను ‘వాహన్ పోర్టల్’ ద్వారా అందజేస్తారు. ఈ మేరకు అన్ని వాహనాల వివరాలను వాహన్లో నిక్షిప్తం చేస్తారు. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 89 లక్షల వాహనాలున్నాయి. వీటి వివరాలన్నీ వాహన్ పోర్టల్లో చేరుస్తారు. కొత్తగా నమోదయ్యే ప్రతి బండి వాహన్లో నమోదు చేసిన తర్వాతే వినియోగదారుడికి చేరుతుంది. దీంతో వాహనదారులు స్వయంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొదట షోరూమ్ రిజిస్ట్రేషన్లతో ప్రారంభించి అనంతరం అన్ని సేవలూ వాహన్లోకి తెస్తారు. అంతర్రాష్ట్ర బదిలీలు, జిల్లాల మధ్య వాహనాల బదిలీల కోసం ప్రత్యేకంగా వాహనదారులు ఎలాంటి నిరభ్యంతర పత్రాలు అందజేయాల్సిన అవసరం ఉండదు. వాహన్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే బండి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ సదుపాయం లభించనుంది. యాజమాన్య బదిలీలు సులభతరమవుతాయి. రోడ్డు ప్రమాదాలు, చోరీ వంటి ఘటనల్లోనూ వాహనాల జాడను తేలిగ్గా కనిపెట్టవచ్చు. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, డూప్లికేట్ లైసెన్సులు, చిరునామా బదిలీలు, వాహనాల బదిలీలు, పర్మిట్లు, ఫీజుల చెల్లింపు వంటి అన్ని రకాల సర్వీసులు ఆన్లైన్ ద్వారానే లభిస్తాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు మాత్రమే స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. -
నిజామాబాద్ మేయర్ మాదే: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్లో ఎంఐఎం పార్టీ.. తమకే మద్దతు ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ నేతనే ఉంటారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో హాంగ్ వచ్చిన మున్సిపాలిటీల అంశంపై వ్యూహ రచన చేస్తాం. సీపీఐ నేతలతో మాట్లాడుతున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. జగిత్యాలలో కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్గా ఉంటారు. మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది. 90 శాతం గెలవాలని రూల్ ఉందా?. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉండదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం మాదే. మెగా గ్రేటర్ ఎన్నికలు కూడా మేమే కైవసం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.ఇక, అంతకుముందు.. డీసీసీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్లో మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించే బాధ్యత డీసీసీలకు అప్పగించారు. హాంగ్ వచ్చిన మున్సిపాలిటీలలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుపై సాయంత్రంలోగా మున్సిపాలిటీల వారీగా వివరాలు ఇవ్వాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్లో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారనుంది. -
బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు
హన్మకొండ: ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్హాల్నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్ మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. -
డ్యూటీలో పోలీస్ కపుల్స్
పెద్దపల్లి: భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే. ఇద్దరికీ ఒకేచోట ఎలక్షన్ డ్యూటీ. అయితే, ఇద్దరం కలిసి ఎన్నికల విధులు నిర్వర్తించడం మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సరదాగా చెప్పారు. పెద్దపల్లి రూరల్ ఎస్సైగా మల్లేశ్, మహిళా ఠాణా ఎస్సైగా రాజమణికి పెద్దపల్లి మున్సిపల్ కౌంటింగ్ విధులు కేటాయించారు. పోలీస్కపుల్స్ కావడంతో పోలీసు అధికారులు అందరూ విధుల్లో ఉన్న దంపతులను చూసి స్వీట్ మెమోరీ అని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు నా భర్త గెలుపు కోసం వెన్నంటే ఉండి పోరాటం చేశానని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాడజనం మా ఆయనను గెలిపించారని.. భర్త విజయం సాధించిన వార్త విని పరుగులతో వచ్చింది భార్య. ఆ క్షణం భర్త గుండెపై వాలి ఆనందంతో ఏడ్వసాగింది. తల్లి సైతం గారాల కొడుకును చూసి ముద్దులు òపెడుతూ కన్నీరుతెచ్చుకుంది. ఈసన్నివేశం చూస్తూ గెలిచిన అభ్యర్థులంతా ఒక్కసారిగా వారి ప్రేమను చూస్తూ ఉండిపోయారు. పెద్దపల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి పాగాల శ్రీకాంత్ గెలుపుతో తల్లి, భార్య, కూతురు, బంధువులు, కాలనీవాసుల ఆనందం ఆకాశాన్నంటింది. కౌంటింగ్ కేంద్రం బయట ఒకరికొకరు తమ మద్దతుదారులు గెలిచారంటూ సంబురాల్లో మునిగిపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ప్రజల రుణం తీర్చుకుంటా
అనంతగిరి: ‘మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారు.. భారీ మెజారిటీతో గెలిపించారు.. వారి రుణం తీర్చుకునే సమయం వచి్చంది.. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించా.. ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యం.. నాన్న స్పీకర్ ప్రసాద్కుమార్ సహకారం.. ప్రభుత్వ అండదండలతో పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం’ అని 17వ వార్డు కౌన్సిలర్.. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అనన్య అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మీ విజయానికి దోహదం చేసిన అంశాలు? కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే నా విజయానికి దోహదం చేశాయి. 17వ వార్డు ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారు. నాన్న ఆశీర్వాదం ఫలించింది. అందరి ఆదరణతోనే విజయం సాధించా. ఏయే సమస్యలు గుర్తించారు? వార్డుల్లో పర్యటించినప్పుడు పలు చోట్ల డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య ఉన్నట్లు గుర్తించాం. తొలుత వీటి పరిష్కారానికి కృషి చేస్తాం. అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏంటీ? వికారాబాద్ పట్టణంపై పూర్తి అవగాహన ఉంది. నాన్న రాజకీయాల్లో ఉండటంతో చాలా నేర్చుకున్నా.. మున్సిపల్, ప్రభుత్వ నిధులతో వికారాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. -
స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్పై కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ లింగం తెలిపిన మేరకు.. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని 6వ ఫేజులోని ఆవాస స్పాలో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులతో పాటు, 15 మంది పురుషులను, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అసంతృప్తులకు రేవంత్ వార్నింగ్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండు కార్పొరేషన్ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ రెండో టర్మ్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తాము పవర్లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే. ఇది రేవంత్కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్ రెండో టర్మ్లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్ఎస్కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్కు సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హంగ్ ఎఫెక్ట్.. ఎక్స్ అఫీషియో అర్హతపై ఈసీ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యులర్ విడుదల చేసింది. మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యుల అర్హతలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది.ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. మున్సిపల్ ప్రాంతంలో ఓటర్గా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదు అని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు. మున్సిపల్ ఎన్నికల అమలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపిణీ చేసింది. అలాగే, మేయర్-చైర్మెన్ ఎన్నికపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎం యాక్ట్-2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి Form-II నోటీసు కలెక్టర్లు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 16వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. మున్నిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈనెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాల్టీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్.. కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దాదాపు 40 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ పెరిగింది. దీంతో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 16న ఛైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందచేయాలని తెలిపింది. ఎన్నికల కోడ్కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. డిక్లరేషన్ నమూనాను ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ పంపించింది.బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని.. ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేట్, టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఎస్ఈసీ తెలిపింది.మరోవైపు.. ఎన్నికల్లో విజేతలను ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. పలు చోట్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. -
ముందే చెప్పాలి..ఇండిగో సిబ్బందిపై ఆగ్రహాం
సాక్షి హైదరాబాద్: శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో సిబ్బంది తీరుపై ప్రయాణికులు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం విమానాశ్రయం నుంచి 8.20 గంటలకు ఫ్లైట్ బాగ్డోగ్రా వెళ్లాల్సిఉంది. అయితే ఇండిగో సిబ్బంది ఉదయం 7.40 గంటలకే గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేట్ వద్ద 50 మంది వరకూ ప్రయాణికులు వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు ఇండిగో సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డింగ్ సమయంలో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమాన సమయాల్లో ఎవైనా మార్పులుంటే ముందుగా సమాచారం ఇవాల్సిందని ఆగ్రహాం చెందారు. కాగా కొద్ది నెలల క్రిత ఇండిగో నిర్లక్షంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. -
శ్రీశైలం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆ గాలి పీల్చితే రోగాలే
సాక్షి, హైదరాబాద్: నగరంలో గాలి కాలుష్యం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) వందలు దాటి వేలల్లో నమోదవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఏక్యూఐ 50 వరకు ఉంటే సేఫ్, 200 దాటితే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఏక్యూఐ ఏకంగా 1,651గా నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం మణికొండ, ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో నమోదైన వివరాలు హాట్ టాపిక్గా మారాయి. ఈ గాలి పీలి్చతే శ్వాసకోశ వ్యాధులు తథ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో ఏక్యూఐ గరిష్టంగా 500గా ఉంటోంది. అలాంటిది హైదరాబాద్లో దానికి మూడున్నర రెట్లు పెరగడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. మణికొండలో నిర్మాణ రంగ పనులు జోరుగా సాగుతున్నాయి. కొండప్రాంతాల్లో తవ్వకాలు, మట్టి, గ్రావెల్, నిర్మాణ సామగ్రి తరలింపుతో రహదారులు నిత్యం దుమ్ముతో నిండిపోతున్నాయి. ఈ దారిలో వెళ్లాలంటేనే భయమేస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. కళ్లలో దుమ్మూ ధూళితో నిండిపోతున్నాయి. దుస్తులు, శరీరంపై పిండి పడ్డట్లు దుమ్ము చేరుతోందంటున్నారు. రెడీమిక్స్ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిజామాబాద్పై ఉత్కంఠ.. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. మొత్తం 7 కార్పొరేషన్లలో రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో పూర్తి మెజార్టీతో ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకోగా.. కొత్తగూడెం, నిజామాబాద్ పరిస్థితి ఉత్కంఠగా మారింది.కొత్తగూడెంలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. 60 స్థానాలకు గాను కాంగ్రెస్ -22, బీఆర్ఎస్ -8, బీజేపీ -1, ఇతరులు -29 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. మరోవైపు.. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్లాన్ మార్చింది. సీపీఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో సీపీఐ కలిసి వెళ్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.ఇక, నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ రావడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిజామాబాద్లో మొత్తం డివిజన్లు 60 ఉండగా.. బీజేపీ-28, కాంగ్రెస్-18, ఎంఐఎం-13, బీఆర్ఎస్-1 స్థానాలను దక్కించుకున్నాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొలిటికల్ సస్పెన్స్ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారింది. అయితే, ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఎంఐఎం కీలకం కావడంతో మేయర్గా ఆ పార్టీ మెంబర్ ఉంటారా? లేక కాంగ్రెస్ నుంచి ఎన్నుకుంటారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంటుంది.అటు మహబూబ్నగర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 60 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ -29, బీఆర్ఎస్ -15, బీజేపీ -7, ఇతరులు - 8 స్థానాల్లో విజయం సాధించారు. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు దక్కలేదు. అయితే, ఇండిపెండెంట్లు అధికార కాంగ్రెస్లో చేరే అవకాశం ఉండటంతో మేయర్ పీఠం హస్తం పార్టీకే దక్కే చాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 66 స్థానాలకు గాను 30 సీట్లలో సొంతంగా విజయం సాధించింది. ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే మరో నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ కార్పోరేటర్ బీజేపీలో చేరిపోయారు. దీంతో, బీజేపీ బలం 34కు చేరుకుంది. ఈరోజు లేదా రేపు మరో ఐదుగురు కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. హాంగ్ ఏర్పడ్డ 37 మున్సిపాలిటీలు , మూడు కార్పోరేషన్లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈనెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో ఓట్ షేర్పై సూచనలు చేయనున్నారు. -
బల్దియా ఎన్నికలు జూన్లో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పుర పోరు ఫలితాలతో జోష్లో ఉన్న అధికార కాంగ్రెస్.. మహా నగరంలోనూ వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఇదే ఊపుతో విజయం సాధించవచ్చనే ఆలోచన చేస్తున్నట్లు నగర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలనుకున్నా కనీసం ఐదారు నెలలు ఆగక తప్పని పరిస్థితులున్నాయి. అందుకు తగిన కారణాలున్నాయి. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియగానే, కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడటంతో అవి కుదురుకునేందుకు ఆర్నెల్లు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎంత త్వరపడినా కనీసం మే నెల వరకైతే ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. మే ఆఖరు దాకా.. కాంగ్రెస్ ఎంత తొందర పడినా.. ఎన్నికల నిర్వహణకు ముందు ప్రీ–ఎలక్షన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు దాదాపు మూడు నెలలు పట్టనుంది. మహా నగరంలోని 300 వార్డులు మూడు కార్పొరేషన్లుగా మారడంతో.. తిరిగి వార్డు నంబర్లు మారనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వార్డుల వారీగా జనాభా, రిజర్వేషన్లు, తాజా ఓటరు జాబితా తదితర పనులు చేయాల్సి ఉంది. కొన్ని వార్డుల సరిహద్దులకు సంబంధించి మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని మున్సిపల్ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తిచేసి, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు వివిధ అంశాలను బేరీజు వేస్తే ఎంత త్వరగా చేసినా మే ఆఖరు వరకు సమయం పడుతుంది.కొత్త కార్పొరేషన్లలో సమస్యలు మరోవైపు.. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీఎం) బాలారిష్టాల్లో ఉన్నాయి. ఇంకా వాటి కార్యాలయాల పనులు, సిబ్బంది నియామకాలే పూర్తికాలేదు. చేయాల్సిన మౌలిక సదుపాయాల పనులు చాలా ఉన్నాయి. కొత్త కార్పొరేషన్లు జీతాలకు సైతం ప్రస్తుతం జీహెచ్ఎంసీ నిధులపైనే ఆధారపడ్డాయి. ఎన్నికలు ఆలస్యమయ్యేకొద్దీ, ప్రజలు ఆశించిన సదుపాయాలు అందుబాటులోకి రాక, వ్యతిరేకత పెరిగేందుకు అవకాశముంటుంది. త్వరితంగా ఎన్నికలు జరిగితే కనీసం చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక.. బహుశా జూన్లో నగరంలోని మూడు బల్దియాలకు సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. జూన్ రెండో వారం వరకు పాఠశాలలకు సెలవులుంటాయి. సాధ్యమైనంత వరకు ఆలోగా ఎన్నికలకు వెళ్లే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. -
కన్నీళ్లు పెట్టుకున్నా... 10 ఓట్లు మాత్రమే వచ్చాయి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది. అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. View this post on Instagram A post shared by Politics Meter (@politicsmeter) మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె.. జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అనంతుల డు ఓట్లు మాత్ర మే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.కల్నల్ తల్లి ఓటమి సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు. -
బ్యాలెట్ బాక్స్లో లేఖ, చీటీ
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలోని ఓటర్లు తమ డిమాండ్లను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. పాత జాతీయ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ 48వ వార్డుకు చెందిన 50 మంది ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలను రాసి వేసి తమ డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. ∙తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ 45వ వార్డుకు చెందిన పెన్షనర్లు బ్యాలెట్ బాక్సులో కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవిస్తూ లేఖ రాశారు. తాము రిటైరై 15 నెలలు గడిచిందని, ఒక్క పైసా కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ∙లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డుకు చెందిన ఓ రిటైర్డు ఉద్యోగి తన కు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులు రాలేదని, అందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని, సీఎం రేవంత్రెడ్డి, ఆయన మంత్రి వర్గం తగిన మూల్యం చెల్లించక తప్ప దని బ్యాలెట్ బాక్స్లో వేసిన లేఖలో పేర్కొన్నారు. -
మంత్రి పదవి ఇవ్వకుంటే నా టార్గెట్ అదే
హైదరాబాద్: ‘ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి. లేదంటే నా టార్గెట్ అదే’ అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి పదవిని ప్రస్తావిస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రాజగోపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి ఇస్తానంటే ఇంకా ఆగుతానని.. అదే సమయంలో పదవి గురించి తాను బాధపడటం లేదని చెప్పారు. ఇకపై మునుగోడు నియోజకవర్గాన్ని పార్టీ కార్యకర్తలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాను చూసుకుంటానన్నారు. సమయం వచ్చి నప్పుడు జెండా ఎగురవేద్దామని వ్యాఖ్యానించారు. ‘సమయం వస్తుంది.. అది కూడా నెరవేరుతుంది’ అని అన్నారు. -
కొత్తగూడెంలో 50–50
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా ఉన్నా కొత్తగూడెం కార్పొరేషన్ సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య సర్దుబాటు కుదరలేదు. దీంతో కాంగ్రెస్ సీపీఎంతో జత కట్టి 58 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు ఆ పార్టీ 22 డివిజన్లకే పరిమితం కాగా, మిత్రపక్షమైన సీపీఎం రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచింది. ఆది నుంచీ చెబుతున్నట్టుగానే 22 స్థానాల్లో సీపీఐ గెలిచింది. 51 డివిజన్ నుంచి గెలిచిన అభ్యర్థి సీపీఐకి మద్దతుదారుగా ఉన్నారు. కింగ్ ఎవరో? కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు 31 డివిజన్లలో గెలవాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీలుగా అవతరించినా సరిపడా మెజారిటీ సాధించలేకపోయాయి. అయితే కాంగ్రెస్ జోరుకు బ్రేక్ వేసేందుకు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కారద్యర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడినట్టు తెలిసింది. సీపీఐ 23 స్థానాలకు తోడు బీఆర్ఎస్ సభ్యులు 8 మంది తోడైతే మేయర్ పదవి సీపీఐ ఖాతాలో పడుతుంది. అయితే, బీఆర్ఎస్ ఆఫర్పై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్తగూడెం విషయంలో సీఎం రేవంత్రెడ్డి సైతం కూనంనేనికి ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే సీపీఐ– కాంగ్రెస్లు కలిసి అధికారం పంచుకునే వీలుంది. కీలకంగా ఎక్స్అఫీషియో ఓట్లు మిత్రపక్షమైన సీపీఎంతో కలిపి కాంగ్రెస్ బలం 23గా ఉంది. ఐదుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలెట్టింది. వారు కాంగ్రెస్ పక్షాన నిలిస్తే హస్తం ఖాతాలో 28 డివిజన్లు ఉంటాయి. మెజారిటీకి మరో మూడు ఓట్లు అవసరం పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగూడెం నుంచి ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ రంగంలోకి దింపాల్సి ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ను చేరుకుంటుంది. అయితే, సీపీఐ, బీఆర్ఎస్ మధ్య పొత్తు చిగురించని పక్షంలోనే ఈ సమీకరణానికి చోటుంది. ఒక వేళ సీపీఐ అనుబంధ సభ్యుడు, ఒకరిద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం వైపు మొగ్గు చూపినా కాంగ్రెస్కు మేయర్ పదవి దక్కించుకోవడం అంత సులువు కాదు. ఎక్స్అఫీషియో కోటాలో సీపీఐకి కూనంనేని సాంబశివరావుతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు ఓట్లు అండగా నిలిచే అవకాశముంది. కొత్తగూడెం మేయర్ మాకే!సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మేయర్ స్థానం సీపీఐకి వచ్చే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆయన శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో మేయర్ స్థానం కమ్యూనిస్టులకు రావడం గొప్ప గౌరవమన్నారు. కమ్యూనిజంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. ఈ విజయం కార్మికులకు అంకితమని, తమ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇస్తామని కేటీఆర్ ఫోన్లో హామీ ఇచ్చారని, కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరూ మాట్లాడలేదని వివరించారు. -
కాంగ్రెస్పై వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ‘సామ, భేద, దాన, దండోపాయాలు‘అన్నీ ప్రయోగించినా ప్రజల మనసు గెలవలేకపోయిందన్నారు. డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దురి్వనియోగం పరాకాష్టకు చేరినా ఓటర్లు భయపడలేదని స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కాంగ్రెస్కు హెచ్చరిక ‘123 చోట్ల ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో ప్రత్యక్షంగా గెలిచాం. 30 చోట్ల హంగ్ పరిస్థితి నెలకొన్నది. మరో 10–15 చోట్ల బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 117 స్థానాల్లో బలమైన ఫలితాలు సాధించాం. అధికారంలో లేని పార్టీగా ఇదే ప్రజాభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి వన్సైడ్ అవుతాయి. మంచి పరిపాలన ఉంటే 80–90 శాతం స్థానాలు గెలుస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టా ఉంది. ఇది కాంగ్రెస్కు హెచ్చరిక. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు కూడా నిండకముందే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. 4 వేల పైచిలుకు గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీఆర్ఎస్నే ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ను గద్దె దించే శక్తి బీఆర్ఎస్కే ఉందని ఈ ఫలితాలు తేల్చాయి. హంగ్ వచ్చిన చోట్ల ఏ వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో చర్చించి, స్థానిక నాయకత్వ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు ‘రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసి పనిచేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి చెన్నూరు, క్యాతనపల్లి ప్రాంతాల్లో పోటీ చేసి విజయాన్ని సాధించాం. చాలామంది వచ్చారు..పోయారు నేనే రాజు, నేనే మంత్రి అనుకునే వారు చాలామంది వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తే గాలి తీసుకుపోతుంది. ఇందిరాగాం«దీ, ఎన్టీ రామారావులనూ ఓడించిన దేశమిది. మీ ప్రభుత్వంపై అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ప్రజల తీర్పే అసలు ఇండికేటర్..’అని కేటీఆర్ సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పోరాటం మరింత తీవ్రం చేస్తామని అన్నారు. సింగరేణి కంపెనీలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై మేము పోరాడుతున్నామని చెప్పారు. -
మున్సిపల్ ముచ్చట్లు
తల్లీకొడుకు విజయం తిరుమలగిరి (తుంగతుర్తి) : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సి పాలిటీలో తల్లీకొడుకు విజయం సాధించారు. 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బత్తుల శకుంతల,ఆమె కుమారుడు బత్తుల శ్రీనివాస్ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.మెదక్కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో తల్లీకొడుకు గెలిచారు. 14వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా దొంతి లక్షి్మ, 15వ వార్డు నుంచి దొంతి నరేశ్ గౌడ్ ఘన విజయం సాధించారు. ఖమ్మంరూరల్: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో. 15వ డివిజన్ నుంచి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆమె కుమారుడు నవీన్ 14వ డివిజన్ నుంచి గెలుపొందారు. అన్నపై తమ్ముడి గెలుపు నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డునుంచి అన్నా తమ్ము డు పోటీ చేయగా, అన్నపై తమ్ముడు గెలిచాడు. బీఆర్ఎస్ నుంచి బీరం నాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి బీరం భరత్రెడ్డి బరిలో ఉండగా, భరత్రెడ్డి తన అన్న నాగిరెడ్డిపై 172ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.⇒ కల్వకుర్తిలోని ఏడో వార్డులో భార్య రత్నమాల కాంగ్రెస్ నుంచి విజయం సాధించగా.. 13వ వార్డులో భర్త ఆనంద్కుమార్ ఓడిపోయారు. ⇒ గద్వాల మున్సిపాలిటీలో బీజేపీ నుంచి పోటీ చేసిన దంపతులు గెలుపొందారు. 19వ వార్డు నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, 26వ వార్డు నుంచి ఆయన భార్య కృష్ణవేణి గెలుపొందారు. ⇒ వనపర్తి మున్సిపాలిటీలో కూతురు సౌమ్య (కాంగ్రెస్) ఆమె తల్లి అరుణ (బీఆర్ఎస్) విజయం సాధించారు. ⇒ జహీరాబాద్ మున్సిపాలిటీలోని 33వ వార్డు నుంచి తాహెరాబేగం(కాంగ్రెస్) 34వ వార్డు నుంచి ఆమె కోడలు నయ్యర్ బేగం స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించింది. ⇒ మంచిర్యాల కార్పొరేషన్లో తోటికోడళ్లు కాంగ్రెస్ కార్పొరేటర్లుగా గెలిచారు. 38వ డివిజన్ నుంచి పూదరి విజయరాణి, 39 డివిజన్ నుంచి పూదరి సునీత గెలుపొందారు. కల్నల్ తల్లి ఓటమి సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు. మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె.. జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆంజనేయులుకు 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.కన్నీళ్లు పెట్టుకున్నా... యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది. అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానిస్టేబుల్ భార్య ఘన విజయం చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాలలో బీఆర్ఎస్ తరఫున 2వవార్డు అభ్యరి్థగా కమలాపురం గీతాంజలి బరిలో నిలిచారు. ఆమె భర్త రమేశ్ కొమురవెల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త రమేశ్ ప్రచారంలో పాల్గొన్నారని వచ్చిన ఆరోపణల మేరకు ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి తేజపై 223 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ట్రాన్స్జెండర్ విజయం చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్(కావేరి) తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగే‹Ùపై 102 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. ఈ వార్డులో 1008 ఓట్లు పోల్ కాగా, సుధాకర్(కావేరి)కు 429 ఓట్లు, నగేశ్కు 327 ఓట్లు వచ్చాయి. కాలేజీ టు కౌన్సిలర్ కోదాడ: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జిల్లేపల్లి నాగేశ్వరరావు కోదాడ మున్సిపాలిటీలోని 20వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కాలిదాసు వెంకటరత్నంపై 203 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ⇒ హైదరాబాద్లో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న షేక్ నెహనాజ్ కోదాడలోని 26 వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. ఆయనకొచ్చిన ఓట్లు 0 రామాయంపేట: రామాయంపేట మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన భూమ మల్లేశం తన ఓటు కూడా తాను వేసుకోలేకపోయాడు. ఆయన కుటుంబసభ్యులు కూడా మల్లేశంకు ఓటు వేయలేదు. దీంతో ఆయనకు సున్నా ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి గెలిచిన ముస్లిం మహిళ భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీలోని 5వ వార్డు బీజేపీ అభ్యరి్థగా పోటీచేసిన ముస్లిం మహిళ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ నాయకుడు తుమ్మల నగేశ్.. యాస్మిన్ను మతాంతర వివాహం చేసుకున్నాడు. 5వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్య యాస్మిన్ను బీజేపీ తరఫున బరిలో నిలిపాడు. ఒక్క ఓటుతో.... పరకాల: పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర ఒక్క ఓటుతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యరి్థశనిగరపు రజనికి 368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 366 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల మెజారిటీతో గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి సంతోషపడగా..పోస్టల్ బ్యాలెట్ మూడు ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకే పడ్డాయి. దీంతో సుభద్ర ఓట్లు 369కి చేరాయి. ⇒ మెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో కాంగ్రెస్ నుంచి కొడకంటి హరిత, బీఆర్ఎస్ నుంచి న్యాయవాది జీవన్రావు పోటీ చేశారు. హరితకు 366 ఓట్లు రాగా, జీవన్రావుకు 365 ఓట్లు వచ్చాయి.⇒ నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి ఒక్క ఓటుతో విజయం సాధించారు. జయలక్షి్మకి 355 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మకు 354 ఓట్లు వచ్చాయి. ⇒ కల్వకుర్తిలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్కు 259 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి తాహిర్ అలీకి 258 ఓట్లు వచ్చాయి. ⇒ గద్వాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో విజయం సాధించారు. మొదట కౌంటింగ్ చేయగా.. బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మకు రెండు ఓట్ల మెజారిటీ వచ్చింది. మూడుసార్లు రీకౌంటింగ్ చేసి.. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టు ఆర్ఓ ప్రకటించారు.‘డ్రా’లో వరించిన విజయం నర్సాపూర్ /దుబ్బాకటౌన్/తూప్రాన్: ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీసి విజేతను ప్రకటించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యరి్థగా పంబల్ల లలిత, కాంగ్రెస్ నుంచి వంకమల్ల జ్యోతి పోటీ పడ్డారు. ఇద్దరికీ సమానంగా 253 ఓట్లు వచ్చాయి.దీంతో అధికారులు డ్రా తీయగా.. పంబల్ల లలితకు విజయం వరించింది. లలిత 15వ వార్డు నుంచి రెండోసారి విజయం సాధించారు. ⇒ దుబ్బాక మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి కంకనాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి సత్తు శ్రీలతకు సమానంగా 266 ఓట్లువచ్చా యి. అధికారులు టాస్ వేయగా బీఆర్ఎస్ అభ్యరి్థని గెలుపు వరించింది. ⇒ మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గజ్జెల కృష్ణకు, బీఆర్ఎస్ అభ్యర్థి సత్యలింగంకు 330 సమాన ఓట్లు వచ్చాయి. టాస్ వేయగా, సత్యలింగంకు అదృష్టం వరించింది. హస్తం గూటికి బీఎస్పీ అభ్యర్థి మెదక్జోన్: మెదక్లోని 17వ వార్డులో బీఎస్పీ తరఫున పోటీ చేసిన బుజరంపేట అరుణ గెలిచారు. అయితే కాంగ్రెస్ నేతలు ఆమెతో సంప్రదింపులు జరిపి తమ క్యాంపునకు తరలించారు. దీంతో కాంగ్రెస్ బలం15కు చేరింది. ఇక మిగిలిన ఇద్దరు బీజేపీ అభ్యర్థుల మద్దతు కోసం ఇరుపార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. నాటి సఫాయి.. నేడు కౌన్సిలర్ నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు 2018 వరకు గ్రామ çపంచాయతీలో సఫాయి కార్మికురాలిగా పనిచేసిన ఇంజమూరి వెంకటమ్మ ఇప్పుడు మున్సిపాలిటీలోని 10వవార్డు కౌన్సిలర్గా విజయం సాధించారు. బీఆర్ఎస్నుంచి పోటీ చేసిన వెంకటమ్మ.. కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ రాణిపై 10 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ జంటపై.. కాంగ్రెస్ జంట నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలి టీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన దంపతులు.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దంపతులపై విజయం సాధించారు. 4వార్డులో కొణతం మంజుల.. తన ప్రత్యర్థి నాగండ్ల ఇందువదనపై 72 ఓట్లతో, 15వ వార్డులో కొణతం చిన వెంకట్రెడ్డి.. తన ప్రత్యర్థి నాగండ్ల శ్రీధర్పై 203 ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున కొణతం మంజుల, చిన వెంకట్రెడ్డి పోటీ చేయగా.. బీఆర్ఎస్ నుంచి నాగండ్ల ఇందు వదన, శ్రీధర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కపుల్ ధమాకా రామాయంపేట(మెదక్): రెండు వార్డుల్లో దంపతులు గెలుపొందారు. రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, లావణ్యతో ఒకటో వార్డు నుంచి, నాగరాజు 7 వార్డు నుంచి గెలిచారు. లావణ్యను చైర్పర్సన్ చేస్తామని ఇటీవల కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. ఓ జంటలో భార్య.. ఇంకో జంటలో భర్త ఓటమి సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా కూసంపూడి మహేశ్ గెలుపొందగా.. ఆయన భార్య మాధురి 3వ వార్డు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 22వ వార్డు కాంగ్రెస్ అభ్యరి్థగా ఎండీ.రెహనాబేగం గెలిచినా, ఆమె భర్త 20వ వార్డు అభ్యర్థి ఎం.డీ. కమాల్పాషా ఓడిపోయారు. జంటగా కౌన్సిల్లోకి... అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా జూపల్లి రమే‹Ùబాబు, ఆయన సతీమణి శశికళ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా ముందే ప్రకటించిన శశికళ 6వ వార్డు నుంచి ఆమె భర్త రమేశ్బాబు 13వ వార్డు నుంచి గెలుపొందారు. భర్త ఓటమి.. భార్య గెలుపు ఇదే కార్పొషన్ పరిధిలో దంపతుల్లో భార్య గెలుపొందగా.. భర్త ఓటమి చవిచూశాడు. 34వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అగల్డ్యూటీ రాజు, 36వ డివిజన్ నుంచి అగల్డ్యూటీ రాణి పోటీచేశారు. వీరిలో అగల్డ్యూటీ రాణి గెలుపొందింది. -
టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడులు, టీచర్ల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం కన్పించడం లేదు. పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్లు తక్కువగా ఉన్నారని, టీచర్లు ఎక్కువగా ఉన్నచోట విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. సర్దుబాటుతో ఈ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. కొత్త నియామకాల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో 24,235 సర్కారు బడులుంటే వీటిల్లో ఎన్రోల్మెంట్ 16,57,812 మాత్రమే.అయితే ఇదే బడుల్లో 1.06 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. 16 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 30 మంది విద్యార్థులకొక టీచర్ ఉండాలనేది విద్యాశాఖ లేవనెత్తుతున్న అంశం. రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులు 1,25,583 ఉండగా, 18 వేలకుపైగా ఖాళీగా ఉన్నాయి. రేషనలైజేషన్ జరిగితే 10వేలకు పైగా టీచర్లను సర్దుబాటుతో సరిపెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త నియామకాల అవసరం లేదన్నది పాఠశాల విద్య డైరెక్టరేట్ నివేదిక సారాంశం. దగ్గర్లోని స్కూళ్లలో కలిపేద్దాం పది మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న స్కూళ్లను కిలోమీటరు దూరంలో ఉన్న మరో ప్రభుత్వ స్కూల్లో కలిపేయాలని భావిస్తున్నారు. దీనివల్ల కొన్ని స్కూళ్లలో టీచర్ల కొరత తీరుతుందని చెబుతున్నారు. తక్కువ మంది విద్యార్థులున్న చోట స్కూల్ నడిపినా విద్యార్థులపై అంతగా శ్రద్ధ ఉండటం లేదని, విద్యార్థులు కూడా పెద్దఎత్తున గైర్హాజరు అవుతున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. విద్యార్థులు పది మంది కన్నా తక్కువ ఉన్న ప్రాథమిక, మాధ్యమిక బడులు వెయ్యి వరకూ ఉంటాయని గుర్తించారు. 19 లోపు విద్యార్థులున్న స్కూళ్లు 5,500 వరకూ ఉన్నాయి.వెయ్యి ఉన్నత పాఠశాలల్లో 50 మంది కన్నా తక్కువే విద్యార్థులున్నారు. దీని ప్రకారం 8 వేల స్కూళ్లలో 16 వేల మంది అదనంగా టీచర్లు ఉన్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ చెబుతోంది. ఇదే క్రమంలో 3 వేల స్కూళ్లలో అనదంగా 4 వేల టీచర్ల అవసరం ఉందంటున్నారు. హేతుబద్దీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అంటున్నారు. నిరుద్యోగులకు నిరాశ ‘టెట్’ఉత్తీర్ణులైన వారు రాష్ట్రంలో 4 లక్షల మందికిపైగా ఉన్నారు. గత ఏడాది 10 వేలకుపైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఈ ఏడాది కూడా డీఎస్సీ ఉంటుందని నిరుద్యోగులు భావించారు. టీచర్ పోస్టుల కోసం కోచింగ్ కేంద్రాలను ఆశ్రయించి శిక్షణ పొందిన వాళ్లూ ఉన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగాలు మానేసి డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. హేతుబద్దీకరణ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశకు గురవుతున్నారు. -
అంచనాలకు దూరంగా..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకింత నిరాశాజనక ఫలితాలే వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీగా మంచి ఫలితాలే సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశించినా అది నెరవేరలేదని అంటున్నారు. మొత్తం 7 కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠాలను, 116 మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 దాకా చైర్పర్సన్ పదవులను సాధిస్తామని వేసుకున్న అంచనాలకు దగ్గరలో కూడా ఫలితాలు రాలేదని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో దూకుడు చూపడంతోపాటు దక్షిణ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్లో గెలిచి బలాన్ని చాటుతామనుకున్న అంచనాలను అందుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లలో 7, 8 ఎంపీ సీట్లలో మూడు, 3 ఎమ్మెల్సీ సీట్లలో 2 ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గెలిచినందున... పుర ఎన్నికల్లో అక్కడ మంచి ప్రదర్శన కనబరుస్తామని భావించింది. అయితే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ పీఠం మాత్రమే దక్కించుకోగలిగింది. దక్షిణాన నామమాత్రమే... దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్కసీటునైనా సాధించి ప్రాతినిధ్యం చాటుతామన్న కమలనాథుల ధీమా వాస్తవరూపం దాల్చలేదు. అదేవిధంగా కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా కైవసం చేసుకుంటామన్న ఆశలు నెరవేరలేదు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో నిరాశాజనక ఫలితాలు రాగా, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో ఆశించినస్థాయిలో వార్డులు, డివిజన్లను గెలవలేకపోయింది. ఏతావాతా చూస్తే... 2020 మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే కొంచెం అటుఇటుగా ఈసారి కూడా సాధించినట్టయ్యింది. అయితే, గత ఎన్నికల్లో 15 శాతం ఓటింగ్ సాధించగా, 20 శాతం ఓట్ల నమోదు ద్వారా మెరుగైన ఫలితాలను సాధించామని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. జాతీయ నాయకత్వం ధీమా మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వం కూడా విశ్వసించింది. ఈ ఎన్నికలకు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను అందజేసింది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్నగర్లో పెద్దఎత్తున ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు భిన్నంగా... కాంగ్రెస్ సర్కార్పై చార్జీïÙట్ విడుదల చేసింది.. పురపోరు కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా రూపొందించింది. మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీనిచి్చంది. అయితే, ఇవేవీ ఆశించిన స్థాయిలో పట్టణప్రాంతాల ప్రజల ఓట్లను రాబట్టుకోవడంలో సఫలీకృతం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్, వార్డులోనూ గెలవకపోవడంతో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అంటున్నారు. -
ఇంకాస్త కష్టపడి ఉంటే..
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ దాదాపు 30 శాతం వార్డులు/డివిజన్లను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 781 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఇంకొద్దిగా కష్టపడితే వార్డుల సంఖ్య కనీసం వెయ్యివరకు చేరేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వరుస విజయాలు సొంతం చేసుకున్న ఆ పార్టీ తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయిందని అంటున్నారు.2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 1,737 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోగా.. అప్పట్లో కాంగ్రెస్ 589 స్థానాలకే పరిమితమైంది. దీంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఇప్పుడు తమకు ఎక్కువ స్థానాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నప్పటికీ ఒక్క కార్పొరేషన్లోనూ ప్రభావం చూపలేకపోయింది. అయితే మరికొన్ని చోట్ల సింగిల్ లార్జెస్ట్ పారీ్టగా అవతరించడం గమనార్హం.అక్కడ పొత్తులు కుదిరితే మరికొన్ని పీఠాలు దక్కే అవకాశం ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా.. బీఆర్ఎస్ సానుభూతి పరులు 30 శాతానికి పైగా గెలిచారని, ఈ ఎన్నికల్లోనూ వార్డుల పరంగా చూస్తే 30 శాతానికి పైగా విజయం సాధించినట్లు పార్టీ నాయకత్వం చెబుతోంది. కీలక నేతల ప్రాంతాల్లో చెక్కుచెదరని పట్టు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి పూర్తి దూరంగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కార్నర్ మీటింగ్లు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ పరిమిత ప్రాంతాల్లోనే పర్యటించారు. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీశ్రావు సైతం సొంత ప్రాంతంలోనే ప్రచారం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నేతలు సీరియస్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం కూడా ఎన్నికల్లో దూకుడుగా పని చేసిందని అంటున్నారు. కానీ బీఆర్ఎస్కు.. క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్నప్పటికీ బడా నేతల ఆర్భాటం లేకపోవడంతో మైనస్ అయ్యిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు సిట్టింగ్లకు సీట్లు ఇచ్చారనే అసంతృప్తి, ఫలితంగా సమన్వయలోపం లాంటి కారణాలు కూడా బీఆర్ఎస్ వెనుకబడటానికి కారణమయ్యాయని జిల్లాస్థాయి నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పట్టు నిలుపుకోవడం గమనార్హం. అగ్రనేతల్లో సంతృప్తి ప్రస్తుతం ఎన్నికలు జరిగిన స్థానాల్లో పావువంతుకు పైగా సీట్లలో విజయం సాధించడంపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సాధారణంగా అధికారపార్టీ ఖాతాలోనే పడతాయని, కానీ పావువంతు సీట్లు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు దక్కడం ఆ పార్టీ బలాన్ని స్పష్టం చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ సాధించిన సీట్ల కంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఎక్కువ వచ్చాయంటూ ఇతర నేతలు సైతం సమరి్థంచుకుంటున్నారు. నారాయణపేట జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ రెబెల్స్ విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచి్చన కేసీఆర్ కుమార్తె కవిత మద్దతుదారులు ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. -
కాంగ్రెస్ ఫుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అంచనాలకు తగినట్టుగానే ఆధిక్యత సాధించడంతో అధికార కాంగ్రెస్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 26 నెలల తర్వాత, 2024 పార్లమెంటు ఎన్నికల అనంతరం పార్టీ గుర్తులపై జరిగిన ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పనితీరుతోనే మన్ననలు ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల మనసును గెలుచుకోవడానికి పార్టీ పనితీరే కారణమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గత 26 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వా సం పెరిగిందని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సన్నబియ్యం, రేషన్కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కీలకపాత్ర పోషించాయని, సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా సాగిన ఎన్నికల ప్రచారం, వ్యూహాల అమలు కూడా ఫలితాన్నిచ్చాయని పేర్కొంటున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో స్వీప్ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తోన్న వారందరి సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మద్దూరు, కోస్గి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలోని మధిరతో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి (హుజూర్నగర్, నేరేడుచర్ల), దామోదర రాజనర్సింహ (ఆంథోల్), వాకిటి శ్రీహరి (మక్తల్), సీత క్క (ములుగు), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (ఏదులాపురం), దుద్దిళ్ల శ్రీధర్బాబు (మంథని), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వివేక్ (చెన్నూరు), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)లలో కాంగ్రె స్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంది. మంత్రులు అజహరుద్దీన్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. వాటి కోసం స్వతంత్రుల సాయం సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాని ఐదు చోట్ల స్వతంత్రుల సాయంతో గెలిచేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గద్వాల, వేములవాడల్లో ఇద్దరు చొప్పున ఇండిపెండెంట్లు, మొయినాబాద్, బెల్లంపల్లిలో ఐదుగురు, పరిగిలో ఇద్దరు స్వతంత్రుల సహకారంతో ఆయా మున్సిపాలిటీ లు, జగిత్యాలలో రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కచి్చతంగా బీజేపీ, బీఆర్ఎస్లు కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ రానున్న 10–12 స్థానాల్లో కూడా వీలున్న మున్సిపాలిటీలను స్థానిక పరిస్థితులను బట్టి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఆ రెండు కార్పొరేషన్లపై గురి మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా పరిశీలిస్తే ముందు నుంచీ ఊహించినట్టుగానే నల్లగొండ, రామగుండం, మంచిర్యాల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. నిజామాబాద్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఢిల్లీ నుంచి సీఎం ఆరా ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కడి నుంచే ఫలితాలపై ఆరా తీశారు. గెలిచిన చోట్ల ప్రజా ప్రతినిధులను, పార్టీ నేతలను అభినందించడంతో పాటు గెలుపునకు దగ్గరగా వచి్చన మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడంపై చర్చలు జరిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షిలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎక్స్ అఫీషియో ఓట్లు ఎక్కడ ఎన్ని అవసరమవుతాయో అంచనాలు వేశారు. కీలకంగా వార్ రూమ్ ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో కాంగ్రెస్ వార్ రూం కీలకంగా పనిచేసి సత్ఫలితాలు సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోలు ప్రజల్లోకి వెళ్లిన తీరును గమనించడం బూత్ల వారీగా ప్రచారం సమన్వయం చేయడం, గడప గడపకూ సంక్షేమ పథకాలను చేరవేయడం, మహిళా సంఘాలు, అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించడం, క్లబ్బులతో సంప్రదింపులు జరపడం లాంటి కార్యక్రమాల ద్వారా వార్రూం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సమన్వయం చేసిన ఈ వార్రూంను పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి ముందుండి నడిపించారు. మిన్నంటిన సంబురాలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. గాం«దీ భవన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మాజీ ఎంపీ, సీనియర్ నేత వి.హన్మంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్రావు, సంగిశెట్టి జగదీశ్వరరావు, పీసీసీ నేత అల్లం భాస్కర్ తదితరులు నృత్యాలు చేస్తూ, స్వీట్లు పంచుకున్నారు. -
పురంలో పైచేయి
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 66 మున్సిపాలిటీలు, రామగుండం, నల్లగొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో విజయకేతనం ఎగురవేసింది. మరో ఐదారు మున్సిపాలిటీలు, మరో కార్పొరేషన్ను కూడా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 13 పురపాలికల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎంఐఎం విషయానికి వస్తే ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో మంచి ఫలితాలు సాధించిన కమలం పార్టీ.. పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకోవడంలో వెనుకబడింది.ఇక దాదాపు 36 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పలు వార్డు స్థానాల్లో విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్తో తలపడిన సీపీఐ ఆ పార్టీకి దీటుగా విజయాలను సాధించినా మ్యాజిక్ ఫిగర్ను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక అనూహ్యంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) బలపర్చిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలుపొందడం గమనార్హం. 51 శాతం స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ మున్సిపాలిలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్ల వారీగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే విజయం సాధించింది. మొత్తం 2,996కు గాను 2,995 వార్డులు, డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో (మక్తల్లో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు) ఆ పార్టీకి 1,538 స్థానాలు లభించాయి. అంటే దాదాపు 51 శాతం వార్డులు, డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (2020) కేవలం 580 వార్డులు, డివిజన్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. గతం కంటే ఏకంగా 900కు పైగా స్థానాలను అదనంగా దక్కించుకుంది.బీఆర్ఎస్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ 781 డివిజన్లు, వార్డుల్లో విజయం సాధించింది. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 26 శాతం స్థానాలు లభించాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో 1,767 స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు 1,000 స్థానాలను కోల్పోవడం గమనార్హం. అయితే రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీలే మెరుగైన ఫలితాలు సాధించడం కూడా గమనించ వలసిన విషయం. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో 311 చోట్ల విజయం సాధించగా, ఈసారి ఆ పార్టీకి 3335 స్థానాలు దక్కాయి. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో 11.3 శాతం గెలుపొందింది. మరోవైపు సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 331 (11.3 శాతం) చోట్ల విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే సీపీఎం, ఎంఐఎం స్థానాలు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. రెండుచోట్ల మినహా కాంగ్రెస్ జోరు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలనూ స్వీప్ చేయగా, నల్లగొండలో కేవలం ఒక్క మున్సిపాలిటీ మినహా 16 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజార్టీ స్థానాలు, కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్న్ను దక్కించుకోగలిగింది.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ ఉమ్మడి మెదక్లో కొంత డీలా పడింది. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లోనూ కొంత వెనుకబడింది. ఇక్కడ గులాబీ పరిమళం ఉమ్మడి మెదక్, హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ రెండు చోట్లనే ఎక్కువ స్థానాలు రాగా, 26 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కొంచెం అటూ ఇటుగా అవే ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటి ఎన్నికల తరహాలోనే గ్రామీణ తెలంగాణ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఫలితాలు రావడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు నారాయణపేట, నిర్మల్, ఖానాపూర్, కాగజ్నగర్ తదితర మున్సిపాలిటీలు, నిజామాబాద్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థానాలు లభించాయి.కమలం పార్టీ విషయానికొస్తే ఈ ఎన్నికకల్లో నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపగలిగింది. కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఓటమి చవి చూడాల్సి వచి్చంది. వార్డుల వారీగా వచి్చన సంఖ్యలో గతంతో పోల్చుకుంటే పెద్దగా మార్పు లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందనే సంకేతాలు కరీంనగర్, నిజామాబాద్ మినహా పురపాలికల్లో పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. 40 చోట్ల హంగ్! గతంలో ఎన్నడూ లేని విధంగా 36 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. అంటే వీటిల్లో సొంతంగా ఎవరూ మేయర్, చైర్పర్సన్లను దక్కించుకునే అవకాశం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్కు 31 డివిజన్లు అవసరం కాగా, సీపీఐ, కాంగ్రెస్లకు చెరి 22 స్థానాలు మాత్రమే లభించాయి. ఇక నిజామాబాద్లో కూడా మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 స్థానాల కంటే మూడు స్థానాలు వెనుకబడిన బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ ఎంఐఎం (13), కాంగ్రెస్ (18)లకు కలిపి మ్యాజిక్ ఫిగర్ లభించడం గమనార్హం. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ సాధించిన ఆ పార్టీ అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైపోయింది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులు కూడా ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, ఏదీ కుదరకపోతే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని పదవులు, పదవీకాలం పంచుకోవడం లాంటి వ్యూహాలతో మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. క్యాంపులు షురూ..! ఏకంగా 40 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 16వ తేదీ వరకు గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకోవాల్సి ఉండడంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని పార్టీలు క్యాంపులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు నేటి వరకు గడువు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు. రాజ్యసభ సభ్యులు శనివారం సాయంత్రం లోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అలా నమోదు చేసుకున్నవారికే.. ఈనెల 16వ తేదీన నిర్వహించే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండంలో మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైంది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులూ ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, లేదంటే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మహబూబ్నగర్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 31కి ఒక్క స్థానం దూరంలో ఉంది.రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీపై వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారు. - రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రిమున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సామ, భేద, దాన, దండోపాయాలన్నీ ప్రయోగించినా ప్రజలమనసు గెలవలేకపోయింది. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసిపనిచేస్తాం - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర పన్ని ఓడించాయి.ఈ మూడు పార్టీల మధ్య ఫెవిక్విక్ బంధం మరింత బలోపేతమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తమ మనుగడకుప్రమాదమన్న అక్కసుతో మజ్లిస్, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా ఓడించే ప్రయత్నం చేశారు. - రాంచందర్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
కొన్ని క్యాన్సర్లను నివారించొచ్చు
సాక్షి, స్పెషల్ డెస్క్: క్యాన్సర్.. ప్రపంచాన్ని వణికిస్తున్న అత్యంత భయంకరమైన వ్యాధి. ఏటా ఒక కోటి మంది ఈ వ్యాధి బారినపడి కన్నుమూస్తున్నారంటే ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కొత్త క్యాన్సర్ కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ నివారించదగినవే. అంటే ఏటా 71 లక్షల మందిని ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడవచ్చన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. 2022లో 1.87 కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ సోకింది. ఇందులో సుమారు 38% కేసులు ఇన్ఫెక్షన్లు (అంటువ్యాధులు), జీవనశైలి అలవాట్లు, పర్యావరణ కాలుష్య కారకాల వల్ల సంభవించాయని అంచనా. ఇవన్నీ నివారించదగినవే. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్లను సకాలంలో టీకాలు వేయడం ద్వారా అడ్డుకోవచ్చు. అలాగే స్మోకింగ్ వల్ల కలిగే అనేక కణితులను ధూమపానం మాన్పించడం ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చడానికి ‘శక్తివంతమైన అవకాశం’ఉందని పరిశోధకులు అంటున్నారు. కొన్ని క్యాన్సర్లు అనివార్యం.. వయసు పెరిగే కొద్దీ మన డీఎన్ఏలో అనివార్యంగా జరిగే నష్టం లేదా వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యువులు వారసత్వంగా రావడం వల్ల కొన్ని క్యాన్సర్లు అనివార్యం. అయితే 10లో దాదాపు నాలుగు కేసులను నివారించవచ్చన్న అంశం జనంలో ఆసక్తి రేకెత్తిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 30 నివారించగల కారకాలను డబ్ల్యూహెచ్ఓలో భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే సంస్థ విశ్లేషించింది. ధూమపానం, అతినీలలోహిత (అ్రల్టావయోలెట్) కిరణాలు వీటిలో ఉన్నాయి. ఇవి మన డీఎన్ఏను నేరుగా దెబ్బతీస్తాయి. ఊబకాయం, శరీరంలో వాపు, హార్మోన్లను మార్చే అతి తక్కువ శారీరక శ్రమ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. వాయు కాలుష్యం వల్ల నిద్రాణమైన క్యాన్సర్ కణాలు మేల్కొంటాయని ఏజెన్సీ వెల్లడించింది. ధూమపానం ప్రధాన కారణం క్యాన్సర్కు దారితీసే తొమ్మిది ఇన్ఫెక్షన్లను కూడా ఏజెన్సీ నివేదించింది. వీటిలో హెచ్పీవీ, కాలేయ క్యాన్సర్కు దారితీసే హెపటైటిస్ వైరస్లు, కడుపు నొప్పి, అల్సర్స్, తీవ్రమైన గ్యాస్ సమస్యలకు కారణం అయ్యే హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా ఉన్నాయి. పరిశోధన బృందం 2022 నుండి 36 రకాల క్యాన్సర్ కేసుల డేటాను.. అలాగే 185 దేశాలలో 2012–22 మధ్య ఈ వ్యాధికి మూలమైన 30 ప్రమాద కారకాల సమాచారాన్ని విశ్లేషించి నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ కేసులకు ధూమపానం ప్రధాన కారణమని వెల్లడించింది. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫెక్షన్లు, మద్యపానం ఉన్నాయి. భవిష్యత్తులో క్యాన్సర్ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రమాద కారకాలను నివారించడం అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి అని పరిశోధన వెల్లడించింది. దేశాలకు అనుగుణంగా.. పురుషుల క్యాన్సర్లలో 45% నివారించదగినవిగా ఉండగా.. మహిళల్లో ఇది 30% ఉంది. నివారణ స్థాయి పురుషులలో అధిక స్థాయిలో ఉండడానికి కారణం.. ధూమపాన ప్రియులు పురుషుల్లో ఎక్కువగా ఉండడమే. యూరప్లో నివసించే మహిళల్లో క్యాన్సర్ దరి చేరకుండా ఫుల్స్టాప్ పెట్టే మొదటి మూడు కారణాల్లో ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం ఉన్నాయి. సబ్–సహారా ఆఫ్రికాలో మహిళల్లో నివారించగల క్యాన్సర్లలో ఇన్ఫెక్షన్ల వాటా దాదాపు 80% ఉంది. అంటే ఈ క్యాన్సర్లను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తీసుకునే చర్యలు ప్రతి ప్రాంతం లేదా దేశానికి అనుగుణంగా ఉండాలని నివేదిక వివరించింది. సగం వాటా వాటిదే.. నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం ధూమపానం, వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్తో ముడిపడి కడుపు క్యాన్సర్, హ్యూమన్ పాపిలోమా వైరస్తో గర్భాశయ క్యాన్సర్.. నివారించగల మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి దాదాపు సగం ఉంటాయి. ధూమపానం నియంత్రణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేపట్టిన దేశాల్లో క్యాన్సర్ కేసులు తగ్గాయని నివేదిక తెలిపింది. ధూమపానం ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. మహిళల్లో 30% నివారించవచ్చు.. ⇒ నివేదిక ప్రకారం.. మహిళల్లో 92 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 30% నివారించవచ్చు. ⇒ సబ్ సహారా ఆఫ్రికా వంటి తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో సరై్వకల్ క్యాన్సర్ కేసులు అధికం. ⇒ అధిక ఆదాయ దేశాలైన ఉత్తర అమెరికా, యూరప్లో మహిళల్లో క్యాన్సర్కు స్మోకింగ్ ప్రధాన కారణం. ⇒ పురుషుల్లో 43 లక్షల నివారించదగ్గ క్యాన్సర్ కేసుల్లో 25% ధూమపానం కారకంగా నిలిచింది. ⇒ ఇన్ఫెక్షన్తో కూడిన క్యాన్సర్ కేసులు పురుషుల్లో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో ఎక్కువ. -
దేశంలో 40% మందిలో ఫ్యాటీ లివర్!
సాక్షి, స్పెషల్ డెస్క్: దేశంలో కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దాదాపు 40 శాతం మంది భారతీయులు ప్రస్తుతం ఫ్యాటీ లివర్ (కొవ్వు పేరుకుపోయిన కాలేయం) సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతీయులలో తక్కువ బరువు ఉన్నప్పటికీ పొత్తికడుపు భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉంటోందని.. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.అధ్యయనంలో తేలిన అంశాలివీ..లాన్సెట్ (ఆగ్నేయాసియా) జర్నల్లో ప్రచురితమైన ఫెనోమ్ ఇండియా అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ మధ్య 27 నగరాల్లో జరిపిన పరిశోధనలో సుమారు 38.9 శాతం మందిలో ఆల్కహాల్తో సంబంధం లేని మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) ఉన్నట్లు తేలింది. కాలేయం గట్టిపడటం లేదా మచ్చలు పడటం (ఫైబ్రోసిస్) ముప్పు సాధారణ వ్యక్తుల్లో 1.7% మందిలో ఉంది. ఇప్పటికే ఎంఏఎస్ఎల్డీ సమస్య ఉన్నవారిలో లివర్ ఫైబ్రోసిస్ 6.3 శాతం మందిలో.. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తంగా 2.4 శాతం మందిలో ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపించాయి. సైలెంట్ కిల్లర్..గతంలో నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్గా పిలిచే ఈ సమస్యను ఇప్పుడు ఎంఏఎస్ఎల్డీగా పిలుస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్య ఉన్న వారిలో చాలా మందికి తమ కాలేయం దెబ్బతింటోందనే విషయం ప్రాథమిక దశలో తెలియదు. ఈ వ్యాధి కాలేయాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఎంఏఎస్ఎల్డీ కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తోంది. దేశ జనాభాలో గణనీయమైన శాతం మందిలో లివర్ ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కాలేయం గట్టిపడే (స్కారింగ్) ప్రక్రియకు ప్రారంభ దశ. దీన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే అది కాలక్రమేణా కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్ లేదా ప్రాణాంతక కాలేయ కేన్సర్కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశ జనాభా విస్తృతిని, వేగంగా పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాటీ లివర్ రోగుల స్థాయి ఆందోళనకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వంటి జీవక్రియ సంబంధిత సమస్యలే ఫ్యాటీ లివర్కు ప్రధాన మూలాలని పరిశోధకులు స్పష్టం చేశారు. సరైన జీవనశైలి, పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
చలో కొలంబో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానుల్లో భారత్–పాక్ మ్యాచ్ సెగలు పుట్టిస్తోంది. ఈ నెల 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ హై–వోల్టేజ్ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. ఈ విపరీతమైన రద్దీని క్యాష్ చేసుకుంటూ ఎయిర్లైన్స్ సంస్థలు చార్జీలను ఆకాశానికి ఎత్తేశాయి.శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకు నేరుగా వెళ్లే విమానాల్లో టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సాధారణ రోజుల్లో రూ.13,000 ఉండే రౌండ్ ట్రిప్ ధర.. ఇప్పుడు ఏకంగా రూ. లక్షకు చేరింది. డైరెక్ట్ ఫ్లైట్స్ దొరక్కపోవడంతో బెంగళూరు, చెన్నై మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం ప్రయాణికులు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వెచ్చిస్తున్నారు.పనిలో పనిగా పర్యాటక ప్రాంతాల సందర్శనకేవలం క్రికెట్ కోసమే కాకుండా, శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు రియల్టర్లు, వ్యాపారవేత్తలు, యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. కొలంబోలోని 5–స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోగా, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు రద్దీ దృష్ట్యా ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.క్యాండీ వంటి సుందర ప్రదేశాలు, క్యాసినోల సందడికి తోడు ‘దాయాదుల పోరు’ కూడా తోడవ్వడంతో శ్రీలంక పర్యాటకం ఒక్కసారిగా కళకళలాడుతోంది. మ్యాచ్ టికెట్ దొరకడం ఒక ఎత్తైతే.. కొలంబో ఫ్లైట్ ధర భరించడం మరో ఎత్తు! అయినా సరే, మైదానంలో టీమ్ ఇండియాకు మద్దతు తెలపడానికి ఫ్యాన్స్ ఏమాత్రం వెనకాడటం లేదు. -
నల్లగొండ అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే నల్లగొండ: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు విషెస్ తెలిపారు.ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు.ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడిపోయిన అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.నల్లగొండ అంటే కాంగ్రెస్ అని...కాంగ్రెస్ అంటే నల్లగొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారుఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు -
ఉత్కంఠ రేపుతున్న కొత్తగూడెం కార్పొరేషన్
ఖమ్మం: కొత్తగూడెం కార్పొరేషన్ ఉత్కంఠ రేపుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. కొత్తగూడెంలో సీపీఐ తన సత్తా చాటింది. మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ 20, సీపీఐ 24 చోట్ల గెలుపు సాధించాయి. కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్వీస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్ఎస్ (9) బహిరంగ మద్దతు ప్రకటించింది. సీపీఐ.. బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందా? కాంగ్రెస్తో జత కడుతుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెంలో బీజేపీ 1, ఇతరులు 5 స్థానాలు దక్కించుకున్నాయి.ఫలితాలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం ప్రజలు సీపీఐని ఆదరించారన్నారు. ‘‘కేటీఆర్ మాకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెట్లు కూడా మద్దతు ఇస్తున్నారు. మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం, మేయర్ పదవిని గిరిజనులకే ఇస్తాం. మేం కాంగ్రెస్తో చర్చలు జరపలేదు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని.. మేయర్ సీట్ను త్యాగం చేయటం కుదరదంటూ కూనంనేని తేల్చి చెప్పారు. మరోవైపు, కొత్తగూడెంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశామని.. సీపీఐ తమ మిత్ర పక్షం అని కాంగ్రెస్ అంటోంది. మాకు, సీపీఐకి కలిసి 44 స్థానాలు వచ్చాయని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్ఎస్ గెలిచిన 8 స్థానాలు అత్యంత కీలకంగా మారాయి. -
‘ఎన్ని విమర్శలు, వెటకారాలు చేసినా కాంగ్రెస్కే పట్టం కట్టారు’
నిజామాబాద్: తమ పార్టీపై ఎన్నో విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయని, అదే ఇంతటి ఘన విజయానికి కారణమైంద్నార. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నిజమాబాబ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ గెలిపించారు. మంత్రులు, నేతలు, కార్యకర్తల కృషితో 70 శాతం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం. ఎన్ని విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు కాంగ్రెస్ని ఆదరించారు. 75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా అన్ని పార్టీలు కలిసి కనీసం 25 శాతం కూడా గెలవలేదు. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీ, ఎంఐఎంలు లబ్ధిపొందాయి. సీఎం రేవంత్, మంత్రులు, ప్రజల కోరికలను నెరవేర్చేలా పాలిస్తున్నారు. సన్నబియ్యం, ఉచిత బస్సు, విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం. రానున్న రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. -
కరీంనగర్లో గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం గొప్ప విషయం అని.. ఈ గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ జనం గెలిపించారని.. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని.. ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు.‘‘హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్కు గుణపాఠం చెప్పారు ఓటర్లు. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. ఒకనాడు రెండు సీట్లతో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై కోట్ల రూపాయలు వెదజల్లారు. మా పార్టీ కార్యకర్తలకు కూడా ఫోన్లు చేసి లక్షలిస్తామన్నారు. మేం మ్యాజిక్ ఫిగర్ దాటాం ఆల్రెడీ. ఇండిపెండెంట్స్ గా గెల్చినవారు కూడా మాకు మద్దతిస్తారు.ఎంఐఎం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగురేసిన పార్టీ బీజేపీ’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
వారికే ఈ విజయం అంకితం.. సీఎం రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.‘‘ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం... పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం.. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.‘‘అదేవిధంగా.. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద-మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన…— Revanth Reddy (@revanth_anumula) February 13, 2026 -
త్రిముఖ పోటీతో నష్టం జరిగింది: రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: ఆరు మున్సిపాలిటీలో సింగల్ లార్జెస్ట్ గా అవతరించామని.. మొదటిసారి రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మొత్తం కలిపి 300 పైగా వార్డు, కార్పొరేటర్లు గెలిచారు. నారాయణపేటలో గెలిచాం. గతం కంటే ఇపుడు మెరుగయ్యాం. ఎన్నికల్లో మేము మేనిఫెస్టో ఇచ్చాం. ప్రభుత్వ తప్పిదాలపై ఛార్జీ షీట్ కూడా ప్రకటించాం. చాల చోట్ల స్వల్పంగా ఓడిపోయాం. త్రిముఖ పోటీలో నష్టం జరిగింది’’ అని రాంచందర్రావు పేర్కొన్నారు.‘‘ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం సాధించాం. ఖమ్మం కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా ఒకటి గెలిచాం. అధికార దుర్వినియోగం వల్లే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఇది క్లియర్ మెజారిటీ కాదు. బీఆర్ఎస్ కూడా గతం కంటే వెనకబడింది. బీఆర్ఎస్ది రెండో స్థానం అనుకోవడం కాదు.. గతం కంటే వెనుకబడ్డారు. బీజేపీకి ఓటు శాతం పెరిగింది. బీజేపీ ఓటింగ్ ప్రాంతాల్లోనే మజ్లీస్ పార్టీ, బీఆర్ఎస్.. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. ఉత్తర తెలంగాణలో ముస్లిం పాపులేషన్ ఉంది. వాళ్ల ఓట్ల వల్లనే బీఆర్ఎస్, కాంగ్రెస్ అక్కడ గెలిచింది, కాంగ్రెస్ బీఆర్ఎస్, మజ్లీస్ ఒక్కటి అయ్యాయి’’ అని రాంచందర్రావు వ్యాఖ్యానించారు. -
తెలంగాణ మున్సిపోల్స్.. సత్తా చాటిన ఎంఐఎం
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. పలు స్థానాల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM) పార్టీ సత్తా చాటింది. మధ్యాహ్నం 2:00 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. ఎంఐఎం పార్టీ వివిధ జిల్లాల్లో పలు వార్డులను కైవసం చేసుకుంది. కాగజ్నగర్లో వార్డు నంబర్ 3లో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ ముబీన్ విజయం సాధించారు.సంగారెడ్డిలో వార్డు నంబర్ 5 నుంచి ఎంఐఎం అభ్యర్థి ఐజాజ్ గెలుపొందగా.. జహీరాబాద్లో ఎంఐఎం రెండు స్థానాలను గెలుచుకుంది. జగిత్యాలలో ఎంఐఎం 31, 34 వార్డులను గెలుచుకుంది. మరో రెండు వార్డుల్లో ముందంజలో ఉంది. బాన్సువాడలొ వార్డు నంబర్ 17 నుండి ఎంఐఎం తరపున ఫరా నాజ్ విజయం సాధించారు. వికారాబాద్లో వార్డు నంబర్ 4లో ఎంఐఎం అభ్యర్థి షబ్బీర్ హుస్సేన్ గెలిచారు.నిర్మల్లో వార్డు నంబర్ 29 నుండి ఎంఐఎం అభ్యర్థి ముజాహిద్ అలీ విజయం సాధించారు. నారాయణపేలో వార్డు నంబర్ 23లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ తఖీ చంద్ గెలుపొందారు. కొడంగల్లో వార్డు నంబర్ 9 నుంచి ఎంఐఎం అభ్యర్థిని సనా ఆఫ్రీన్ విజయం సాధించారు. కోహీర్లో వార్డు నంబర్ 8లో ఎంఐఎం తరపున రఫీ విజయం సాధించారు. భైంసాలో ఎంఐఎం ఇప్పటివరకు 8 వార్డులను గెలుచుకుంది. (స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ రెబల్స్ కూడా 6 వార్డుల్లో గెలిచారు).బోధన్లోఎంఐఎం తన ఆధిపత్యాన్ని చాటుతూ ఏకంగా 12 వార్డులను కైవసం చేసుకుంది. రఫీక్((వార్డు-3), సమీర్ (వార్డు 5), అఖీల్ (వార్డు-7), రఫీ (వార్డు-8), అలీమ్ (వార్డు-12), మీర్ ఇలియాస్ అలీ (వార్డు-18), అన్సారీ కామ్ (వార్డు-27), ముజాహిద్ బాబర్ (వార్డు-28), వలీ (వార్డు-30), అల్తాఫ్ (వార్డు-31), వసీం సుల్తానా (వార్డు-32), ఖైఖషా కౌసర్ (వార్డు- 38) గెలుపొందారు.నల్గొండలోనల్గొండలో ఏఐఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించింది. వార్డు నంబర్ 46 నుంచి పట్టణ అధ్యక్షుడు రఫీ ఉద్దీన్ గెలుపొందగా, వార్డు నంబర్ 29 నుంచి నదీమ్ విజయం సాధించారు.మహబూబ్ నగర్లో వార్డ్ నెం.14 నుండి , ఇమ్రాన్ షరీఫ్ గెలిచారు. గద్వాల్లో వార్డు నెం. 15 నుంచి మొహమ్మద్ ఇలియాస్ గెలిచారు. -
ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్.. ఐదు చోట్ల హంగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో భాగంగా పలుచోట్ల హంగ్ ఏర్పడింది. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్, కోహిర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీల ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థుల కోసం పార్టీలు పోటీపడే అవకాశం ఉంది.వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో, హంగ్ ఏర్పడింది. మరోవైపు.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. ఇక, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇస్నాపూర్లో 26 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4 విజయం సాధించారు. మ్యాజిక్ ఫిజర్ 13 కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో, ఇండిపెండెంట్లపై పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా.. బీజేపీ, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.ఏఐఎఫ్బీ ప్రభంజనం.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఓ మున్సిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ 10 వార్డుల్లో 8 చోట్ల ఏఐఎఫ్బీ గెలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో వార్డుకే పరిమితమయ్యాయి. తెలంగాణ జాగృతికి చెందిన నేతలు ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం గమనార్హం.కాంగ్రెస్ హవా.. కారు జోరు.. కాంగ్రెస్: నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్పూర్.బీఆర్ఎస్: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్ఫార్వర్డ్ బ్లాక్: వడ్డేపల్లి. -
క్యాంపు రాజకీయాలు..? ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గెలిచే అభ్యర్థులు దాదాపు ఖరారవడంతో పార్టీలన్నీ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను శిబిరాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది.మున్సిపల్ ఎన్నికల చట్టం రూల్ 63 ప్రకారం గెలిచినసదరు అభ్యర్థికి సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరని పేర్కొంది. Form XXVII ప్రకారం ఎలక్షన్ సర్టిఫికేట్ అందించాలని తెలిపింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా గుర్తింపు పొందినట్లు ధృవీకరణ చేయాలని తెలిపింది. ఎన్నికల్లో గెలిచినట్లుగా సర్టిఫికేట్ అందుకున్న అభ్యర్థి తప్పనిసరిగా అతని సంతకం చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఇదివరకే కొంతమంది అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో తిరిగి వారిని కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
మున్సిపల్ ఫలితాలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ విజయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.👉మరోవైపు.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. గడ్డపోతారంలో మొత్తం 18 వార్డులకు గాను 14 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక, నందికొండలో 12 వార్డులకు గాను.. 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు.. కే. సముద్రం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.👉సుల్తానాబాద్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. మొత్తం 15 వార్డులకు గానూ 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డును దక్కించుకున్నారు.👉డోర్నకల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 15 వార్డుల్లో 10 వార్డులను కాంగ్రెస్ దక్కించుకోగా, నాలుగింటిలో బీఆర్ఎస్ విజయం సాధించింది.మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరిపెడ 15 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-6 విజయం సాధించాయి. చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చండూరు(10) స్థానాల్లో కాంగ్రెస్-7, బీఆర్ఎస్-2, సీపీఐ-1 విజయం సాధించాయి.చిట్యాల కాంగ్రెస్ విజయం చోటుచేసుకుంది. చిట్యాల (12) స్థానాల్లో కాంగ్రెస్-9, బీఆర్ఎస్-2 విజయం. హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. హాలియాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-2 విజయం. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. గుమ్మడిదల 22 స్థానాల్లో బీఆర్ఎస్-14, కాంగ్రెస్-4. బీజేపీ-2 విజయంచొప్పదండి కాంగ్రెస్ వశం.. చొప్పదండిలోని 14 స్థానాల్లో కాంగ్రెస్-10, బీజేపీ-3, బీఆర్ఎస్-1 స్థానం విజయం. -
వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజారిటీ మున్సిపాలిటీలను దక్కించుకుంది.దాదాపు అన్ని జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మున్సిపాలిటీలుకాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీఎంఐఎంఇతరులు1జనగాం1213010042స్టేషన్ఘన్పూర్13050003నర్సంపేట2106010014వర్ధన్నపేట050600015పరకాల130603006డోర్నకల్11040007కేశసముద్రం08080008మహబూబాబాద్13111019మర్రిపెడ090500110తొర్రూర్070900011భూపాలపల్లి1610020112చొప్పదండి1001030013హుజురాబాద్1608050114జమ్మికుంట1012040415ధర్మపురి15000016జగిత్యాల220406021417కోరుట్ల18080600118మెట్పల్లి06061000419రాయికల్03030500120సిరిసిల్ల0627050021వేములవాడ1305080022మంథని1101000123పెద్దపల్లి27010100224సుల్తానాబాద్1201010025ఎదులాపురం2402000126కళ్లూరు1207000127మధిర1801000328సత్తుపల్లి170600029వైరా12050100230అశ్వరావుపేట1720100231ఇల్లందు1903000232ఆదిలాబాద్11062106033భైంసా01006120734ఖానాపూర్03040400135నిర్మల్24021303036ఆసిఫాబాద్070900437కాగజ్నగర్09110501438బెల్లంపల్లి14140100539చెన్నూర్11040200140క్యేతనపల్లి0710000141లక్సెట్టిపేట1103010042ఆమనగల్లు0108060043చేవెళ్ల1104030044ఇబ్రహీంపట్నం08130200145మొయినాబాద్10060400546షాద్నగర్15110100147శంకరపల్లి0940000248కొడంగల్1001001049పరిగి0808000250తాండూరు19120201151వికారాబాద్070303010152అలియాబాద్08070300153ముచ్చింతలపల్లి0914010054ఎల్లంపేట0812040055ఆర్మూర్19050801056భీంగల్080400057బోధన్17503120158బాన్సువాడ110303010159బిచ్కుంద100200060కామారెడ్డి19111600361ఎల్లారెడ్డి1001000162ఆలేరు0703020063భువనగిరి22040400564చౌటుప్పల్13030301065మోత్కురు0803000166పోచంపల్లి06050100167యాదగిరిగుట్ట08010200168హుజుర్నగర్1904000369కోదాడ2603000670నేరేడుచర్ల0905000171సూర్యాపేట31110100572తిరుమలగిరి051000073చండూరు0603000174చిట్యాల0902000175దేవరకొండ11060100276హాలియా110100077మిర్యాలగూడ31140100278నందికొండ110100079చేర్యాల050700080దుబ్బాక04110200381గజ్వేల్07110100182హుస్నాబాద్160400083ఆందోల్-జోగిపేట1603000184గడ్డపోతారం0314000185గుమ్మడిదల04150200186ఇంద్రేశం06090200187ఇస్నాపూర్1012000488జిన్నారం06080400289కోహిం080501010190నారాయణఖేడ్1103010091సదాశివపేట16080100192సంగారెడ్డి221002010393జహీరాబాద్141503020394మెదక్14150200195నర్సాపూర్0605040096రామాయంపేట0803010097తూప్రాన్0409030098భూత్పూర్0701020099దేవరకద్ర060401001100కోస్గి160000101మద్దూరు09060001102మక్తల్1200300103నారాయణపేట 0702110201104అలంపూర్0505000105గద్వాల1611070102106ఐజా0713000107వడ్డేపల్లి01010008108అమరచింత03030300109ఆత్మకూరు06010300110కొత్తకోట100301001111పెబ్బేరు0705000112వనపర్తి200802002113కల్వకుర్తి 130305001114కొల్లాపూర్1603000115నాగర్కర్నూలు1806000116ములుగు12051002 -
వార్డుల వారీగా ఎన్నికల ఫలితాలు
తెలంగాణ మున్సిపల్ కార్పొషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీనే సత్తాచాటింది. మొత్తం ఏడు కార్పొరేషన్లకు గాను నాలుగింట కాంగ్రెస్ హవా చూపెట్టింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో విజయం సాధించింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకంది కొత్తగూడెం, నిజామాబాద్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీ రాలేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ 22 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ 22 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 8 డివిజన్లలో, సీపీఎం ఒక డివిజన్లో, బీజేపీ ఒక డివిజన్లో మాత్రమే గెలిచింది. నిజామాబాద్ కార్పొరేషన్ 60 డివిజన్లో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ కార్పొరేషన్ని గెలుచుకోలేక పోయింది. బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజ న్లలో విజయం సాధించగా బీఆర్ఎస్ ఒక చోటు గెలుపొందింది.కార్పొరేషన్కాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీసీపీఐ ఎంఐఎంఇతరులుకరీంనగర్ (66)140930-0310రామగుండం (60)38130101-07నిజామాబాద్ (60)170128-14-మహబూబ్నగర్ (60)301507-0305మంచిర్యాల (60)440805--03కొత్తగూడెం (60)22080122-07నల్లగొండ (48)270904-0206 -
ఎవరో పురంధర్!
సాక్షి, హైదరాబాద్: కొద్దిసేపట్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ‘పురం’ధర్ ఎవరో తేలనుంది. శుక్రవారం ఉదయం 8కి కౌంటింగ్ చేపట్టి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫలితం వెల్లడించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఎన్నికల అధికారులు ఆయా కేంద్రాల్లో మాక్ కౌంటింగ్ నిర్వహించారు. తొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో 106 టేబుళ్లు.. 418 మంది లెక్కింపు సిబ్బందిని నియమించారు. నగర శివారులోని 9 పురపాలికల్లోని 194 వార్డుల్లో మొత్తం 590 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవిత్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, అనంతరం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. లెక్కింపు ఇలా.. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో 14 టేబుళ్లు, మొయినాబాద్లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 265 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడు కౌంటింగ్ కేంద్రాల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 153 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. రిజర్వేషన్లు ఇలా.. ఫలితాల వెల్లడి తర్వాత ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, చేవెళ్ల మున్సిపాలిటీలు జనరల్కు రిజర్వు కాగా, షాద్నగర్ బీసీ జనరల్కు, మొయినాబాద్ ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. అలియాబాద్ మున్సిపాలిటీ జనరల్ మహిళలకు, మూడు చింతపల్లి మున్సిపాలిటీ ఎస్సీ జనరల్కు, ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వయ్యాయి. భారీ భద్రత ఆమనగల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద శుక్రవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడటం నిషేధం. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. – సుధీర్బాబు, ఫ్యూచర్ సిటీ కమిషనర్ -
సృష్టి ఫెర్టిలిటీ కేసు.. డాక్టర్ నమృత అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమృతను పోలీసులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గిరిజనుల వద్ద నుంచి బిడ్డలను కోనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్లు నమ్మించిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.అయితే డాక్టర్ నమృతపై గతంలో పలు అభియోగాలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికోసం ఏపీలో కొంత మంది ఏఎన్ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతను జులై 27న పోలీసులు అరెస్టు చేశారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని. తదితర ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై కేసులు నమోదు చేశారు.అంతేకాకుండా డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు గతంలో బెయిల్ పై విడుదలకాగా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మున్సిపల్ ఫలితాలు.. కాంగ్రెస్ హవా
Telangana Municipal Elections 2026 Results👉వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు👉వార్డుల వారీగా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. నిజమాబాద్ : కార్పొరేషన్ 60 డివిజన్లో ముగిసిన ఓట్ల లెక్కింపుఅతిపెద్ద పార్టీ గా బీజేపీ ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి ఓటమిబీజేపీ 28కాంగ్రెస్ 18ఎంఐఎం 13బీఆర్ఎస్ 01తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా116 మున్సిపాలిటీల్లో 72 చోట్ల కాంగ్రెస్ విజయం15 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ రామగుండంలో కాంగ్రెస్ విజయం వెనుక మంత్రి శ్రీధర్బాబు కీలక పాత్రపెద్దపల్లి జిల్లాలో చక్రంతిప్పిన మంత్రి శ్రీధర్బాబుమంథని మున్సిపాలిటీలో 13 స్థానాలకు 11 కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్రామగుండంలో 60 స్థానాలకు 38 స్థానాల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ పలు మున్సిపాలిటీల్లో హంగ్హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో హీటెక్కిన పాలిటిక్స్చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ స్కెచ్ నిజమాబాద్ : కార్పొరేషన్ లో 60 డివిజన్లకు ఓట్ల లెక్కింపు26 డివిజన్ల లో ముందంజలో బీజేపీ అభ్యర్థులుకాంగ్రెస్ 17 డివిజన్లలో ముందంజఎంఐఎం 10 డివిజన్లలో ముందంజబీఆర్ఎస్ ఒక డివిజన్లో ముందంజ కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుపోతాం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాంకాంగ్రెస్ ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టిందిఅధికారుల్ని అడ్డం పెట్టుకుని గెలవాలని చూశారుకాంగ్రెస్, బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉందికాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్(మొత్తం 60 డివిజన్లు)ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీసీపీఐ -24చోట్ల గెలుపుకాంగ్రెస్-20చోట్ల గెలుపుబీఆర్ఎస్-09సీపీఎం -01బీజేపీ -01 నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంమంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్దే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసంకరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో 3 గంటల 50 నిమిషాల వరకు అప్డేట్స్బీజేపీ 33కాంగ్రెస్ 12బీఆర్ఎస్ 9ఇండిపెండెంట్స్ 6ఎంఐఎం 3ఆల్ ఇండియా ఫార్వబ్లాక్-3రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 3.17pmవరకు ఫలితాలు -48కాంగ్రెస్ 31బీఆర్ఎస్ 12బిజెపి 01ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 03ఇండిపెండెంట్ 01సిద్ధిపేట జిల్లాహుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం మెదక్: నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనారాయణపేట: మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంవరంగల్: పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్: కల్వకుర్తిమున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: షాద్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: శంకరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమెదక్: రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్కైవసంమెదక్: తుప్రాన్మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ ఆధిక్యందాదాపు 15 మున్సిపాలిటీల్లో హంగ్దేవరకద్ర, కేసముద్రం, జహీర్బాద్లో హంగ్అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామల్ హంగ్ఆసిఫాబాద్, జమ్మికుంట,జిన్నారంలో హంగ్మహబూబాబాద్,బోధన్, వేములవాడ, ఆలియాబాద్లో హంగ్ జగిత్యాల జిల్లా :ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్స్వీప్15/15 స్థానాలు కాంగ్రెస్ కైవసంమొత్తం స్థానాలు 1515స్థానాల్లో ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేక పోయిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ప్రభావం చూపని బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులుఖమ్మం:వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన16 వ వార్డు రీ కౌంటింగ్ చెయ్యాలని జీవన్ రెడ్డి డిమాండ్కరీంనగర్ జిల్లా:తొలి రౌండ్ ముగిసేసరికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల్లో 30 స్థానాల్లో లీడ్లో దూసుకుపోతున్న బీజేపీరాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: ఎస్ఈసీ రాణి కుమిదినిఎక్కడా ఎలాంటి సమస్యలు మా దృష్టికి రాలేదు.సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నేషనల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించింది.16వ తేదీ మేయర్, చేర్మెన్ ఎన్నిక ఉంటుంది.మేయర్, చైర్మెన్ ఎన్నికలు టై అయితే లాటరీ విధానం అమలు చేస్తారు సిద్దిపేటచేర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఇల్లందు మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్మహబూబాబాద్ జిల్లా;మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్_ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెసు కార్యకర్తల అందోళనకౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లోపలికి ఎలా పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం4 వార్డు ఇండిపెండెంట్ ఆభ్యర్ది గుగులోత్ జ్యోతి రమేష్. 135 ఓట్ల తో గెలుపుజ్యోతి రమేష్ ను క్యాంపు కు తరలించడానికి మంతనాలుక్యాంప్ కి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పోలీసుల రంగ ప్రవేశంఆభ్యర్ధిని కౌంటింగ్ హలోకి పంపిన పోలీసులుమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెసు కార్యకర్తలు.. నిరసనఖమ్మం జిల్లాకల్లూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీరాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 1, 6, 26 వార్డుల్లో రీకౌంటింగ్ కు పట్టుబడుతున్న సమీప ప్రత్యర్థులుకౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఆయా వార్డు అభ్యర్థులుబయటకు నెట్టేసిన పోలీసులు..కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమేడ్చల్ జిల్లా అలియాబాద్లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతస్వతంత్ర అభ్యర్థి వెంకటేష్ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులుపోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు, తోపులాట ధర్మపురిలో సంచలన ఫలితాలు..ధర్మపురి రాజకీయాల్లో సంచలన ఫలితాలు.ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోర పరాభవం.15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం..రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న ధర్మపురి మున్సిపల్ ఫలితాలు.. హంగ్ ఎఫెక్ట్.. స్వంత్రులకు గిరాకీ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీ.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ.దేవరకద్ర, కేససముద్రం, జహీరాబాద్లో హంగ్.అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామలో హంగ్.ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలోనూ హంగ్.బోధన్, వేములవాడ, అలియాబాద్లో హంగ్.ఈ నేపథ్యంలో కీలకం కానున్న స్వతంత్రులు. కాంగ్రెస్ ఆధిపత్యం.. మధిరలో కాంగ్రెస్ ఘన విజయంమధిర 22 వార్డుల్లో 21 వార్డులు కాంగ్రెస్ కైవసం.ఒక్క వార్డుకే పరిమితమైన బీఆర్ఎస్మెదక్ రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్ కొత్త మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంసంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం.మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంపెబ్బేరు కాంగ్రెస్ కైవసం. పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంజమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యంఆత్మకూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంసిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం బీఆర్ఎస్ జోరు.. భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.15 వార్డుల్లో 11 చోట్ల బీఆర్ఎస్ విజయం.క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం. కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మూడు చోట్ల హంగ్.. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్.కేస సముద్రంలో చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం.అలంపూర్లో చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ.. సిరిసిల్లలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం.39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడి.14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం.స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఘన్పూర్లో 18 స్థానాల్లో కాంగ్రెస్-13, బీఆర్ఎస్-5.హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.హుజురాబాద్ 30 స్థానాల్లో కాంగ్రెస్-16, బీఆర్ఎస్-8, బీజేపీ-5ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్.ఇస్నాపూర్లో 26 స్థానాల్లో బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4జనగామలో బీఆర్ఎస్ ఆధిక్యం.జనగామలో 30 స్థానాల్లో బీఆర్ఎస్-13, కాంగ్రెస్-12, ఇతరులు-4గాంధీభవన్లో సంబురాలు..హైదరాబాద్..గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబురాలు.బాణాసంచా పేల్చి, స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు. 👉ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ హవా.👉ఉమ్మడి జిల్లాలో కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం.ఇప్పటి వరకు వెలువడిన 18 స్థానాల్లో ఫలితాల ప్రకారం..13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం. ఖమ్మంలో కాంగ్రెస్ హవా..మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు మున్సిపాలిలీలు కాంగ్రెస్ కైవసం. కొల్లాపూర్, మంథని, నేరుడుచర్చ కాంగ్రెస్ వశం..ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో కాంగ్రెస్ హవా..బాన్సువాడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్.19 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.3 వార్డుల్లో బీజేపీ విజయం2 వార్డుల్లో స్వతంత్రులుఒక వార్డులో బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం.బోణీ కొట్టని బీజేపీ.కొత్త మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా. 👉ఇప్పటి వరకు 80 మున్సిపల్ వార్డుల ఫలితాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అందించిన అధికారులు👉52 వార్డులు కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్, 1 ఇతరులు గెలుపు.దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమొత్తం 20 వార్డులుకాంగ్రెస్-11బీఆర్ఎస్-6 ఇండిపెండెన్స్-2బీజేపీ-1 బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయంచిట్యాల, చండూరు, హాలియా, నందికొండలో కాంగ్రెస్ విజయం. మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మరిపెడ 15..కాంగ్రెస్-8బీఆర్ఎస్-6 చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.చండూరు(10)కాంగ్రెస్-7బీఆర్ఎస్-2సీపీఐ-1చిట్యాల కాంగ్రెస్ విజయం.చిట్యాల (12)కాంగ్రెస్-9బీఆర్ఎస్-2 హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంహాలియా 12..కాంగ్రెస్-8బీఆర్ఎస్-2 గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.గుమ్మడిదల 22బీఆర్ఎస్-14కాంగ్రెస్-4బీజేపీ-2బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.22 వార్డుల్లో కాంగ్రెస్ 16 విజయం.వేములవాడలో బీజేపీ ఆధిక్యం.కోహిర్లో (16) ఇలా..కాంగ్రెస్-6బీఆర్ఎస్-5బీజేపీ-1 నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం.నందికొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా కాంగ్రెస్నందికొండలో మొత్తం 12 వార్డులు.కాంగ్రెస్-11బీఆర్ఎస్-1 గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంసంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో 18 వార్డులుబీఆర్ఎస్-14కాంగ్రెస్-3ఇండిపెండెంట్-1. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కిషోర్ గెలుపు13వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసింహ రెడ్డి గెలుపు17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ గెలుపుమూడో వార్డు అభ్యర్థి ప్రియాంక రెడ్డి బీజేపీ విజయం.16వ వార్డు అభ్యర్థి కె.లక్ష్మీ బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంహుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయంబీఆర్ఎస్ హవా..మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయంఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపుమేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపుసంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం... ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.విజయాలు ఇలా.. జగిత్యాల పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.వరంగల్ నర్సంపేట మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.వైరా మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో ఏడు వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.కొల్లాపూర్ 6,14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. అభ్యర్థుల విజయాలు..యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు బీజేపీ అభ్యర్థి రాధ గెలుపుమరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం.సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు.100 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.గడ్డిపోతారం 16వ వార్డులో బీఆర్ఎస్ విజయం. ఆధిక్యం ఇలా.. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కాంగ్రెస్ లీడ్.ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో బీజేపీ గెలుపు.ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నందికొండ, హాలియా, చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్.నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం. నల్లగొండ జిల్లాహాలియా మున్సిపాలిటీలోపోస్టల్ బ్యాలెట్ల ఫలితాలుకాంగ్రెస్ :32టీఆర్ఎస్ :8బీజేపీ : 1 ఇండిపెండెన్స్ :2నోటా: 1మొత్తం: 44చొప్పదండి మున్సిపల్ రెండవ వార్డులో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుబీజేపీ:1కాంగ్రెస్:2టీఆర్ఎస్:1 ఆధిక్యాలు ఇలా.. ఆదిలాబాద్..పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.ఖమ్మం జిల్లామధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజ.కాంగ్రెస్ -29బీఆర్ఎస్ -5నోటా -1 సంగారెడ్డిసంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలుమొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం3 వార్డుల్లో BRS ఆధిక్యంక్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుహైదరాబాద్..క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలునగర శివారుల్లోని పలు రిసార్టులలో రూమ్స్ బుక్ చేసిన హస్తం నేతలు350 రుమాలు బుక్ చేసిన కాంగ్రెస్నిన్న రాత్రే పలు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంపులకు తరలింపుఈరోజు ఉదయం మరి కొందరిని క్యాంపునకు తరలించిన కాంగ్రెస్ నేతలుబీఆర్ఎస్ ఆగ్రహంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా..అశ్వారావుపేట కౌంటింగ్ హాల్లో అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం..అధికార పార్టీ అభ్యర్థితో ముగ్గురిని అనుమతిస్తూ, బీఆర్ఎస్ నుండి ఒక్కరినే అనుమతి ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనఅందరికి ఒకే రూల్ ఉండాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలుబీజేపీ అభ్యర్థి మృతి.. మంచిర్యాల..లక్షెట్టిపేట పదో వార్డు బీజేపీ అభ్యర్థి మృతి.ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ.బీజేపీ లీడ్.. కరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో బీజేపీ లీడ్.పలు వార్డుల్లో బీజేపీ ఆధిక్యత.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు తర్వాత ప్రకటించనున్న అధికారులు.కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఈసీ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.వెబ్ కాస్టింగ్ విధానాన్ని కమిషన్ ఆఫీసులో పరిశీలిస్తున్న చీఫ్ రాణి కుమిదిని.ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఉండాలని SEC ఆదేశం.పోలింగ్ రోజు తరహాలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి.కౌంటింగ్ కేంద్రంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి.కౌంటింగ్ జరగని చోట ఆలస్యానికి కారణం ఏంటని ఆరా తీసిన SEC. 👉మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుస్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.కరీంనగర్ జిల్లా:హుజురాబాద్లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టిన అధికారులు.కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతఎన్నికలపై అన్ని పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠకౌంటింగ్ కేంద్రాల సందడి వాతావరణం,. క్యూలో అభ్యర్థులను లోపలికి పంపుతున్న పోలీసులు ఎన్నికలు ఫలితాలు.. టీపీసీసీ చీఫ్ కీలక ఆదేశాలుఎన్నికల ఫలితాలపై ఉత్కంఠఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ఫలితాలపై అలర్ట్గా ఉండాలన్న పీసీసీ ఛీఫ్.హాంగ్ వచ్చే అవకాశం ఉన్న చోట వెంటనే పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రికి సమాచారం ఇవ్వాలని ఆదేశం..ఇంకా క్యాంప్లకు తరలించని అభ్యర్థులను వీలైనంత త్వరగా తరలించాలని సూచన..ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయే వార్డులలో కచ్చితంగా రీ కౌంటింగ్కు అడగాలని సూచించిన మహేష్ కుమార్. ఈసీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు..తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వద్ద భారీ బందోబస్తు.పోలింగ్ రోజుతో పోల్చితే మూడింతల బందోబస్తు పెంచిన పోలీస్ శాఖ.పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని SEC ఆదేశం.SEC నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ, BRS నేతలు.కౌంటింగ్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే SECకి చేరుకుంటారనే సమాచారంతో బందోబస్తు పెంచిన అధికారులు.ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపుఓట్ల లెక్కింపు కోసం మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థులుఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికఅభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న అధికార, విపక్షాలుకట్టుదిట్టమైన భద్రత: డీజీపీకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ శివధర్రెడ్డిలెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రతపోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘాకమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణకౌంటింగ్ కేంద్రాలకు 200 మీ దూరం వరకు ఆంక్షలుఅన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందా? బీఆర్ఎస్ పట్టునిలుపుకొనేనా? బీజేపీ నిలబడేనా?ఫలితాలపై సర్వత్రా ఆసక్తిమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. -
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా కీసర, ఏడుపాయల జాతర, బీరంగూడ జాతరలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్, అమ్ముగూడ, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఈసీఐఎల్ క్రాస్రోడ్స్ నుంచి కీసర, ఏడుపాయాల జాతరకు 330 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నారు.అలాగే సీబీఎస్, పటాన్చెరు నుంచి 155 బస్సులు బీరంగూడ జాతరకు నడుస్తాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 17 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. -
రంజాన్కు రెడీ!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ ఉపవాస దీక్షలకు నగరంలోని ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న నెలవంక కనిపిస్తే 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. నగర రంజాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడి పసందైన వంటకాలకు మంచి పేరుంది. రంజాన్ మాసంలో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణ ఉట్టిపడుతుంది. హలీం తయారీ ఏర్పాట్లు షురూ అయ్యాయి. హలీం తయారీలో కీలకమైన గోఠా, డెకీసాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఛత్తబజార్లో అన్వర్ తయారు చేసిన గోఠాలకు జిల్లాలు, ఇతర రాష్ట్రాలోనూ డిమాండ్ ఉంది.అన్ని హోటళ్ల వద్ద నిర్వాహకులు హలీం బట్టీలను నిర్మిస్తున్నారు. ఫంక్షన్ ప్యాలెస్లు, మైదానాల్లో కూడా హలీం బట్టీలు ఏరాటు చేస్తున్నారు. హలీంలో గోధుమలు, మటన్, నెయ్యి, మసాలాలు కీలకం. అయితే ఈసారి కొంతమంది తయారుదారులు ఎక్కువ కొవ్వు లేకుండా ఆర్యోగానికి మేలు కలిగించే మిల్లెట్స్, వోట్స్, వెజిటెబుల్తో తయారు చేస్తున్నట్లు ఓ హోటల్ నిర్వాహకుడు తెలిపారు. ప్రొటీన్స్, తక్కువ మసాలాలతో ఆరేబియన్, యమనీ, సోమాలీ తదితర వెరైటీల్లో హలీం అందుబాటులోకి రానుంది. 5 వేలకుపైగా విక్రయకేంద్రాలు నగరంలో 5 వేలకుపైగా హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి నూనె, పప్పులు, మటన్, చికెన్తోపాటు మసాలాల ధరలు ఎక్కువగా ఉండటంతో హలీం ధరలు కూడా ఎక్కువగా ఉండే అవకాశముందని నిర్వాహకులు అంటున్నారు. గతంలో 280 వరకు ఉండగా ఈసారి ధర 320 వరకు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.మసీదుల్లో ఏర్పాట్లు నమాజ్ల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మసీదు కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మసీదులకు సున్నాలు, కలర్ పెయింటింగ్ పూర్తి చేశారు. వజూఖానాల మరమ్మతులతోపాటు మంచినీటి సౌకార్యం కోసం కూలర్లు అమర్చుతున్నారు. మసీదు ప్రాంగణాల్లో షామియానాలు, రెకులòÙడ్లు అమర్చారు. ఇఫ్తార్ విందులకు ఇప్పటికే ప్రణాళికలు చేసుకొని రోజువారీ దాతల పేర్లు ఖరారు చేశారు. రాత్రి ఇషా నమాజ్ అనంతరం మసీదుల్లో తరావీ నమాజ్లు చేస్తారు. తరావీ నమాజ్లో హఫేజ్ (ఖురాన్ కంఠస్థం చేసినవారు) ఖురాన్ వినిపిస్తారు. అన్ని మసీదుల్లో హఫేజ్ల నియామకాలను మసీదు కమిటీలు పూర్తి చేసినట్లు జహారానగర్ మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్ బాకర్ సాహెబ్ తెలిపారు. -
చచ్చినా.. వదలరా?
జగిత్యాలక్రైం: కుల కట్టడితో ఓ కుటుంబాన్ని వెలి వేసి.. ఓ వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా రాకుండా దూరంగా ఉన్న కట్టుబాట్ల అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందెనకుంటలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏదెల రాజేశం, కొమిరె పోశయ్య సమీప బంధువులు. పోశయ్య కుటుంబంలో ఓ సమస్య తలెత్తగా అండగా నిలవాల్సిన కుల పెద్దలు ఆ కుటుంబాన్ని గతంలోనే బహిష్కరించారు. ఓ అమ్మాయి విషయంలో ఏర్పడిన సమస్యను తమకు చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నందుకు కులపెద్దలు ఆగ్రహించారు.పోశయ్య కుటుంబం ఎవరి ఇళ్లకూ వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో రాజేశం (40) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. పోశయ్య కుటుంబ సభ్యులు రాజేశం ఇంటికి వెళ్లారు. తమ మాట కాదని పోశయ్య, రాజేశం ఇంటికి వెళ్లాడన్న కోపంతో కులపెద్దలెవరూ అంత్యక్రియలకు రాలేదు. వారికోసం చాలాసేపు ఎదురు చూసిన రాజేశం కుటుంబ సభ్యులు చివరకు దగ్గరి బంధువులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. వ్యక్తి చనిపోయినా దగ్గరకు రాని కుల సంఘం తీరును చూసి రాజేశం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఏఓ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బీర్పూర్ ఎస్సై రాజు చెప్పారు. -
పులెక్కడుంది?
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామం పరిసరాల్లో పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. బుధవారం పులి కనిపించిన ప్రాంతానికి వాయవ్య దిశగా 2 కి.మీ దూరంలో తాజాగా పాదముద్రలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్ చర్యలను మరింత ముమ్మరం చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉత్పన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్యవేక్షణ కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. పుణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం, స్థానిక అటవీ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తోంది. ఈ పరిసర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను పెంచడంతో పాటు, ప్రజలు జాగ్రత్త పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షిత మార్గం కల్పించేందుకు అటవీ శాఖ సమగ్ర చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఆరోగ్యాన్నలా.. డీప్ ఫ్రై చేయొద్దు!
ఆహార పదార్థాలకు నూనె లేదా కొవ్వు తోడైతే రుచి ఇనుమడిస్తుంది. అయితే, ఈ వంట ప్రక్రియలో, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో వేపుడు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేపుళ్లు, పిండి వంటలు, గారెలు, పూరీలు, బజ్జీలు, పునుగులు, అప్పడాలు, వడియాలు.. మనం ఇష్టంగా తినే ఇటువంటివి వండేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఆ ఆహారమే విషతుల్యంగా మారి అనారోగ్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ప్రాణాంతక జబ్బులకూ కారణం కావొచ్చు. వేపుళ్లకు లేదా డీప్ ఫ్రైలకు నూనెలు, కొవ్వు పదార్థాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వేపుళ్లకు ఏయే నూనెలు విడిగా వాడొచ్చు? ఏయే నూనెలను కలిపి వాడొచ్చు? అనే విషయాలూ ముఖ్యమే.. అవేమిటో చూద్దాం.. గుండె జబ్బులు, కేన్సర్ ముప్పు?నూనెలు, కొవ్వుల్లో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (పీయూఎఫ్ఏ– ‘పూఫా’లు) ఉంటాయి. ఒకసారి వేపుడుకు వాడితే ప్రమాదం లేదు. ఒక్కసారి వేపుడు లేదా డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మళ్లీ వేపుళ్ల కోసం వాడితే అవి హానికరంగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నూనెలు, కొవ్వుల్లోని ‘పూఫా’లు వేపుడు కోసం రెండు అంతకన్నా ఎక్కువసార్లు అధికంగా వేడి చేసినప్పుడు ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సీకరణం చెందిన పూఫాలతో కూడిన ఆహారం తీసుకున్న వారు గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ మాజీ చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు.వేపుళ్లకు ఏయే నూనెలు మేలు?కరకరలాడే వంటకాల తయారీ కోసం వంట నూనెలను ఎక్కువ మంటపై పొగలు కక్కేలా వేడి చేయాల్సి ఉంటుంది. స్మోక్ పాయింట్ను మాత్రమే చూడకుండా రసాయన స్థిరత్వాన్ని బట్టి వేపుళ్లకు నూనెను ఎంచుకోవాలి. ఇందుకు ఉపయోగపడే నూనెలు ఏవంటే.. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే కొబ్బరి నూనె, పామాయిల్ వంటివి లేదా వేరుశనగ నూనె, శుద్ధి చేసిన వరి తవుడు నూనె, అధిక ఓలిక్ పొద్దుతిరుగుడు (మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లం కలిగిన) నూనెలు ఆహారాన్ని వేయించడానికి మంచివని డాక్టర్ ప్రసాద్ వివరించారు.కలిపి వాడుకోదగినవిఇంట్లో రోజువారీ కూరల్లో లేదా డీప్ ఫ్రైలకు కూడా కనీసం రెండు రకాల వంట నూనెలు కలిపి వాడుకుంటే మేలని, నిలువ పచ్చళ్లకు నువ్వుల నూనె మంచిదని డా. ప్రసాద్ చెప్పారు. వాటిలో ఉండే పోషకాలను బట్టి కలిపి వాడుకోదగిన నూనెలు ఇవీ.. పామాయిల్ + సోయా నూనెపామాయిల్ + పొద్దుతిరుగుడు నూనె వరి తవుడు నూనె + నువ్వుల నూనెఆలివ్ నూనె + పొద్దుతిరుగుడు లేదా సోయా ఆయిల్మళ్లీ ఫ్రైలకు వాడొద్దు..మన ఇంట్లో వేపుళ్లకు ఒకసారి వాడిన నూనెను పారబోయాల్సిన అవసరం లేదు. ఆ నూనెను వడగట్టి కూరల తాలింపుల్లో వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా 3–4 రోజుల్లోనే (వేపుళ్లకు కాకుండా) కూరల్లో వాడుకోవాలి. నిల్వ ఉంచితే ఆ నూనె చెడిపోయే అవకాశం ఉంది. అయితే, డీప్ ఫ్రైలకు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేపుళ్లకు వాడితే ప్రమాదం. అవి తిన్న వారు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బుల పాలయ్యే ముప్పు ఉంది. –డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్, మాజీ చీఫ్ సైంటిస్ట్


