Telangana
-
రాజ్యాంగం సజీవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే లక్ష్యంతో పనిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నిర్మించే నూతన హైకోర్టు జోన్–2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్టి, జస్టిస్ అలోక్ అరాధే, హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్తో కలసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం సీజేఐ మాట్లాడారు. ఈ కార్యక్రమం లాంఛనం కాదని.. రాజ్యాంగ విధి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కల కార్యరూపం దాలుస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం అభినందనీయమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి..: ‘న్యాయవ్యవస్థలో నా సుదీర్ఘ వృత్తి జీవితంలో నేను ఒకటి నమ్ముతాను. ప్రతి కార్యానికి మూడు దశలు ఉంటాయి. ప్రారంభం ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. మధ్యభాగం పట్టుదలను ప్రదర్శిస్తుంది. ముగింపు వాగ్దానం నెరవేరిందా లేదా అనేది తెలియజేస్తుంది. ప్రజలంతా న్యాయపీఠం, చిహ్నం, కార్యకలాపాలను మాత్రమే చూస్తారు. అదే మనకు కనిపించే న్యాయవ్యవస్థ. కానీ ప్రతి కోర్టు గది వెనుక దాన్ని నడిపించే ఓ ప్రపంచం ఉంటుంది. అక్కడే న్యాయమూర్తులు నివసిస్తారు.. శిక్షణ పొందుతారు.. తీర్పులు భద్రపరుస్తారు.. ఈరోజు దానికి మనం పునాది వేస్తున్నాం. మనం ఇక్కడికి రావడం లాంఛనం కాదు.. రాజ్యాంగ విధి. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న సూత్రాన్ని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. ప్రతి రాష్ట్రంలో ఓ హైకోర్టు ఏర్పాటు చట్టపరమైన అవసరమే కాకుండా గణతంత్ర రాజ్య నిబద్ధతగా ఎప్పుడూ భావిస్తాను. అలాంటి నిబద్ధతకు.. అందుకు ఆధారమైన మౌలిక సదుపాయాలు ఉన్నంత వరకే అర్థం ఉంటుంది. అది లేకుంటే కేవలం కాగితాల్లోనే మిగిలిపోతుంది. తెలంగాణలో అది నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకుంటోంది. జోన్–1లో పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ భవనాలు ఓపక్క రూపుదిద్దుకుంటుండగానే జోన్–2 మొదలవుతోంది. న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అది సరైనదే. ప్రస్తుత భవనం చారిత్రాక కట్టడం అయినప్పటికీ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. రాబోయే వందేళ్ల అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాలను కల్పించడం ఓ లక్ష్యం మాత్రమే కాదు.. తప్పనిసరి. కోర్టు గదులతోపాటు జోన్–2 కూడా అంతే ముఖ్యం. చెట్టులో మనకు కొమ్మలు, ఎత్తు మాత్రమే కనిపిస్తాయి. కానీ తుపాను వచ్చినప్పుడు వేర్లు మాత్రమే దాన్ని కాపాడతాయి. జోన్–2 న్యాయవ్యవస్థకు వేర్లలాంటింది’అని పేర్కొన్నారు. దశాబ్దం తర్వాత కార్యరూపం.. ‘హైకోర్టు రోజువారీ కార్యకలాపాలు తన నియంత్రణలో లేని ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ 100 ఎకరాల ప్రాంగణం ఆ పరిస్థితిని మారుస్తుంది. సంస్థాగత స్వయం సమృద్ధిని సిద్ధాంతం నుంచి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అది ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ నిర్మించబోయే ఆడిటోరియంలో న్యాయవ్యవస్థకు శిక్షణా కార్యక్రమాలు, పౌరుల కోసం న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామం. సెంట్రల్ రికార్డ్ రూమ్.. తీర్పులను భద్రపర్చడం అత్యంత ప్రాధాన్యం. ప్రస్తుత హైకోర్టులో 2009లో చోటుచేసుకున్న ఓ అగ్నిప్రమాదం కొత్త భవన నిర్మాణానికి బీజం వేసింది. ఫుల్ కోర్టు ఆమోదం, హైకోర్టు చీఫ్ జస్టిస్ల ప్రస్తావనతో దశాబ్దం తర్వాత కార్యరూపం దాల్చింది. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు న్యాయ వ్యవస్థకు సదుపాయాల కల్పనకు ముందు వస్తున్నాయి. అత్యంత అవశ్యకం అని గుర్తిస్తున్నాయి. ఇది గొప్ప విషయం. రూ. 2,583 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ సహకారాన్ని అభినందిస్తున్నా. న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ ఒకే లక్ష్యంతో పనిచేస్తే రాజ్యాంగం నిజంగా సజీవంగా నిలుస్తుంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలి’అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. రాబోయే వందేళ్లకు న్యాయ వేదిక: సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘ఇదో ప్రత్యేకమైన రోజు. మన దేశంలో దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం. కానీ న్యాయం కోసం ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడమంటే అన్ని మతాల ప్రజల కోసం ఓ పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే. మన ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర ఆధారితంగా, గౌరవంగా పనిచేస్తాయి. సామాన్య పౌరుడికి కోర్టు ఓ చివరి ఆశ. తెలంగాణ కోసం కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం మా ప్రభుత్వానికో గొప్ప అవకాశం. ఈ భవనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. రాబోయే వందేళ్లపాటు పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా సేవలందిస్తుంది. ఇది మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం. వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేయాలి. ఈ భవనం దేశంలోని అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటి మాత్రమే కాదు.. అత్యాధునిక, మౌలికవసతుల ప్రమాణంగా ప్రఖ్యాతి చెందుతుంది. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే రాజేంద్రనగర్లో 100 ఎకరాల భూమిని కేటాయించాం. జోన్–1 పనులు శరవేగంగా సాగుతున్నాయి. జోన్–2 పనులను కూడా 2027 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తాం. తీర్పులకే కాదు.. న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకూ అత్యున్నత గౌరవం ఇస్తాం’అని వెల్లడించారు. ప్రతి వ్యక్తికి భరోసా కల్పించాలి: జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ప్రధాన కోర్టు సముదాయం, కార్యాలయ భవనాల జోన్–1 ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు నివాస బంగళాలు, అనుబంధ నిర్మాణాలు, ఆడిటోరియం, సెంట్రల్ రికార్డ్ రూమ్.. జోన్–2ను ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. కోర్టులు ఆస్పత్రుల్లా పనిచేయాలని సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. అక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికీ భరోసా, విశ్వాసం కల్పించే ప్రదేశాలుగా ఉండాలి. న్యాయం అందించడమే కాదు.. దాన్నిపౌరులు అనుభూతి పొందాలి’అని అభిలíÙంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్టార్లు, ఏజీ సుదర్శన్రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్రావు, హెచ్సీఏఏ అధ్యక్షుడు ఎస్.సురేందర్రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్ఖాన్, తేరా రజనీకాంత్రెడ్డి, హెచ్సీఏఏ ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, కార్యదర్శులు శ్రావణ్కుమార్గౌడ్, నిరంజన్రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్టార్టప్ స్టేట్’ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్’తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనమని చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు.సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ‘మేము అవకాశాల కోసం ఎదురుచూడలేదు. వాటిని అందిపుచ్చుకోవడానికి అద్భుతమైన పాలసీలను తయారు చేశాం. మౌలిక సదుపాయాలను కల్పించాం. తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించాం’అని కేటీఆర్ వివరించారు.2027లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని.. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. భవిష్యత్తు గురించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు.. దీన్ని కేంద్రం గుర్తించాలి.. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కేటీఆర్ ప్రస్తావిస్తూ దేశాభివృద్ధి కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘భారత్ 28 ఇంజన్లుగల ఒక ఫార్ములా–1 రేసింగ్ కార్ లాంటిది. ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయి’అని కేటీఆర్ గుర్తుచేశారు. ఐటీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు.2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు చిరునామాగా మారిందన్నారు. హైదరాబాద్లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందన్నారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్, టాస్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని కేటీఆర్ వివరించారు. స్కైరూట్ ఏరోస్పేస్, డారి్వన్ బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి యూనికార్న్ సంస్థలు హైదరాబాద్ నుంచి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా తెలంగాణ.. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని.. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఏటా 10 బిలియన్ డోసుల టీకాలను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని.. దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు.ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రిటెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించండి. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించండి. నేటి సమస్యల పరిష్కారమే కాదు.. రేపటి అవసరాలకు తగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోండి’అని పిలుపునిస్తూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. -
కొత్త వెలుగుల వ్యాసపురి
సాక్షి, హైదరాబాద్: వేదవ్యాసుడు స్వయంగా ప్రతిష్ఠించారని భక్తులు భావించే జ్ఞాన సర స్వతీ దేవాలయం పూర్తి కొత్తరూపు సంతరించుకోబోతోంది. వ్యాసుడి పేరుతో వ్యాసపురిగా మొదలై ప్రస్తుతం బాసరగా పిలుచుకుంటున్న సరస్వతీ దేవాలయానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద సరస్వతీ దేవాలయం. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో రాణిస్తారన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడ పిల్లలకు ఓనమాలు దిద్దిస్తా రు. క్రమంగా భక్తుల రాక పెరుగుతుండటంతో దేవాలయం ఇరుకుగా మారింది.గర్భాలయం పురాతనమైంది కావటంతో మండపంలోని భక్తులకు అమ్మవారి విగ్ర హం పూర్తిస్థాయిలో కనిపించటం లేదు. చిన్న తలుపు ఉండటమే దీనికి కారణం. గర్భాలయం కూడా చిన్నదిగా ఉంది. దీంతో ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తొలుత ఆలయ పునరి్నర్మాణానికి నిర్ణయించి రూ.50 కోట్లు మంజూరు చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.225 కోట్లతో ఈ ఆలయానికి కొత్తరూపు ఇవ్వనుంది. తొమ్మిదంతస్తుల భారీ రాజగోపురం, కోనేరు పునరుద్ధరణ, ధ్యాన మందిరం... ఇలా కొంగొత్త ఆకర్షణలతో చదువులతల్లి కోవెల భక్తులను ఆకట్టుకోబోతోంది. దేవాలయ పనులను సీఎం రేవంత్రెడ్డి సోమ వారం భూమిపూజ చేసి ప్రారంభిస్తారు. భక్త పారవశ్యం... చెంతనే విశాల గోదావరి ప్రవాహం... చుట్టూ దట్టమైన అడవితో కూడిన ప్రకృతి శోభ..తీరంలో చిన్న గ్రామం.. స్వయంగా వ్యాసమహర్షి తపస్సు చేశారని చెప్పుకొనే గుట్ట.. దాని దిగువనే దేవాలయం.. వెరసి ఈ ప్రాంతానికి వస్తే భక్తులు ఆనందపారవశ్యంలో మునిగితేలుతారు. వ్యాస మహర్షితో అనుబంధం ఉందన్న గాథ వారిలో భక్తి భావాన్ని నింపుతుంది. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసాలకు అంత ప్రాధాన్యం.వసంత పంచమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశ నలుమూలల భక్తులు వస్తుంటారు. కొంతమంది భక్తులు అక్కడ మూడు, ఐదు, ఏడు, తొమ్మిదిరోజులపాటు ఉండి ధ్యానం చేసుకుంటూ మాధవ కవలం రూపంలో బాసరలోని భక్తులు పంచే అన్నప్రసాదం స్వీకరిస్తూ గడిపే ఆనవాయితీ ఉంది. గతంలో ఆలయం పూర్తి రాతి నిర్మాణంతో అలరారేది. ఆలయం పక్కనే భారీ కోనేరు.. సమీపంలో మంచినీళ్లు తోడుకునే పెద్ద బావి ఉండేది. ఆ తర్వాత అభివృద్ధి పనుల్లో్ల భాగంగా అవి కాలగర్భంలో కలిసి పోయాయి. ఇప్పుడు మళ్లీ కోనేరును పునరుద్ధరించనున్నారు. శృంగేరీ పీఠాధిపతుల ఆధ్వర్యంలో... ఈ ఆలయ పునరి్నర్మాణానికి ప్రభుత్వం ముందుగా శృంగేరీ పీఠాధిపతులను సంప్రదించింది. పునరి్నర్మాణంలో చేపట్టే పనులు, వాటి ప్రత్యేకతలను వారికి వివరించి సూచనలు తీసుకుంది. వారి సూచనల ఆధారంగానే ఇప్పుడు పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మూడు రెట్లు పెరగనన్న ఆలయ ప్రాంగణం ప్రస్తుతం ఆలయ గర్భాలయం, అర్ధమండపం కేవలం 2 వేల చదరపు అడుగుల్లోనే ఉంది. వాటిని 5 వేల చదరపు అడుగులకు విస్తరిస్తారు. 9 అంతస్తుల ఉత్తర రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మిస్తారు. ప్రస్తుతం ఆలయం మొత్తం విస్తీర్ణం 20 వేల చదరపు అడుగుల మేర ఉండగా, ఇప్పుడు దాన్ని ఏకంగా 62 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో సిమెంటు బదులు శిలనే వాడుతారు.ఆరువేల మంది భక్తులకు సరిపడా అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు నిర్మిస్తారు. 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు... తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో వీధుల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్టాప్తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం... ఇలా ఎన్నో నిర్మాణాలు కొలువు దీరనున్నాయి. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్సెంటర్ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటుతారు. . పుష్కరాలకు వచ్చే వారికి... వచ్చే ఏడాది జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు రానున్నందున, బాసరలో వారి కోసం భారీగా వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఆ పనులను కూడా ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో చేర్చటం విశేషం. భక్తులు ఏ స్థాయిలోనూ ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
యువతను తిరిగి క్రీడలవైపు రప్పించాలి
సాక్షి, హైదరాబాద్: క్రీడామైదానం వదిలి దేశ యువత పెద్ద తప్పు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మైదానం వదిలి పబ్లు, డ్రగ్స్ సంస్కృతి వైపు వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో చదువుకున్న యువతే ఎక్కువ ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వీరుల భూమి అయిన పంజాబ్లో ఇప్పుడు డ్రగ్స్ పెరిగాయని.. పంజాబ్లా మరే రాష్ట్రం కావొద్దన్నారు. యువతను సరైన దారిలో పెట్టకపోతే దేశ భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన బీఎన్ ముల్లిక్ స్మారక అఖిల భారత పోలీసు ఫుట్బాల్ చాంపియన్ షిప్–2026 పోటీల ముగింపు వేడుకలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన ఆటతో ఆకట్టుకున్నారు. సీఐఎస్ఎఫ్, గోవా జట్ల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్లో గోవా టీం తరఫున రేవంత్రెడ్డి వరుసగా మూడు గోల్స్ కొట్టి జట్టును గెలిపించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్కు గొప్ప పేరుందన్నారు. 1950 నుంచి 1960ల వరకు నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్గా హైదరాబాద్ను పిలిచేవారని.. భారత ఫుట్బాల్ జట్టుకు అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ నగరం అందించిందని సీఎం గుర్తుచేశారు. స్పై మాస్టర్గా పేరుగాంచిన బీఎన్ ముల్లిక్ పేరిట నిర్వహించిన ఈ టోర్నమెంట్తో దేశంలోని వివిధ పోలీసు బలగాల మధ్య సమన్వయం పెంచడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ క్రీడల్లో దేశం పేరు నిలబెట్టాలి నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న దక్షిణ కొరియా ఒలింపిక్స్లో 30కిపైగా పతకాలు సాధిస్తే 140 కోట్లకుపైగా కోట్ల జనాభాగల భారత్ నుంచి ఒక్క పతకం రాకపోవడం బాధాకరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు నిలబెట్టేలా క్రీడాకారులను తయారు చేసేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో పుల్లెల గోపీచంద్, కపిల్దేవ్ వంటి ఎందరో గొప్ప క్రీడాకారులు బోర్డు సభ్యులుగా ఉన్నారన్నారు.‘మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ. 2 కోట్ల నగదు పురస్కారం ఇచ్చాం. టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ 12వ తరగతి తప్పినా నిబంధనలు పక్కనపెట్టి అతన్ని డీఎస్పీని చేశాం. చదువుకుంటే జాబ్లు వస్తాయో లేదో కానీ మీరు క్రీడాకారులుగా రాణిస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.తెలంగాణ యువతకు మార్గదర్శనం చేసేందుకే దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చానని తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ను అరికట్టేందుకు పోలీసులు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అందరూ క్రికెట్ క్రేజ్తో ఫుట్బాల్ను మరిచిపోతున్న తరుణంలో భారీ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహణతో తెలంగాణ పోలీసులు గర్వపడేలా చేశారన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం 12 రోజులపాటు జరిగిన మ్యాచ్లలో 34 జట్లు పాల్గొన్నాయని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. విజేతలను, మ్యాచ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్ విజేతలుగా పురుషుల జట్టు నుంచి సీఐఎస్ఎఫ్, మహిళల జట్టు నుంచి అస్సాం రైఫిల్స్ నిలిచాయి. విజేత జట్లతోపాటు మహిళల నుంచి గోల్డెన్ బూట్ గెలుచుకున్న క్రీడాకారిణి ప్రియా సాసా, పురుషుల నుంచి గోల్డెన్ బూట్ గెలుచుకున్న క్రీడాకారుడు విజయ్ బెహారేలకు సీఎం రేవంత్రెడ్డి ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వప్న తివారీ, సైబరాబాద్ సీపీ డా. రమేశ్రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన
భైంసా/బాసర/కైలాస్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట ఆయన బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. ⇒ ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బాసరకు బయల్దేరతారు. ⇒ ఉదయం 11 గంటలకు బాసర హెలీప్యాడ్కు చేరుకుని అక్కడ నుంచి రాజన్న గెస్ట్హౌస్కు వెళతారు. ⇒11:10 నుంచి 12:10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ⇒మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు.⇒ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు రిజర్వ్ టైమ్ ⇒ మధ్యాహ్నం 1:45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. ⇒ మధ్యాహ్నం 2.15 గంటలకు పిప్పిరికి చేరుకుంటారు. ⇒ 2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ⇒ 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.⇒ సభ అనంతరం ఐఎస్వో సరి్టఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబి్ధదారులకు అందజేస్తారు. అలాగే సీఎం కప్ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. ⇒ 4.20 గంటలకు హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. -
మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. -
Hyd: దారుణం.. మహిళను, స్కూటీని ఈడ్చుకెళ్లిన ట్రక్
హైదరాబాద్: నగరంలో మాదాపూర్లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ చూసి స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని డీసీఎం ఢీకొట్టింది. ఆ దంపతుల్లో భార్య కూడా స్కూటీతో వ్యాన్లో చిక్కుకుపోయింది. అనంతరం ఆ స్కూటీని అలాగే కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వ్యాన్ పక్క నుంచి వెళ్తున్న నగర వాసులు ఈ విషయాన్ని గమనించి ఆ డీసీఎం వ్యాన్ను అడ్డగించారు. అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్(26)లు భార్యభర్తలు. వీరిది కేరళ రాష్ట్రం. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. జ్యూయలరీ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నిన్న రాత్రి మూవీ చూడటానికి వెళ్లారు. అయితే వీరిని తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టడంతో వారిలో భర్త రోడ్డు పక్కకు పడిపోగా, భార్య మాత్రం డీసీఎం వ్యాన్లో చిక్కుకుపోయింది. ఇలా కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ఇది గమనించిన కొంతమంది వ్యాన్ అడ్డగించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, తీవ్రగాయాలైన భర్తకు చికిత్స అందిస్తున్నారు. అయితే వారిని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్కు ప్రమాదం జరిగిన విషయం తెలిసినా ఆపకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ స్కూటీ ఆ వ్యాన్ కింద చిక్కుకున్నా అలానే వెళ్లిపోయాడు. ఇలా కిలో మీటర్లు దాటి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఒక చోట గమనించిన కొంతమంది ఆ వ్యాన్ను అడ్డగించి డ్రైవర్ను పట్టుకున్నారు. ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ను, క్లీనర్నుపోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఆ వ్యాన్ను పోలీసులు సీజ్ చేశారు. -
రిసార్టులో దాడులు.. అరెస్టయిన వారిలో సినీనటుడు
సాక్షి హైదరాబాద్: గోల్కొండ తారామతిలోని ఓ రిసార్టులో గత రాత్రి డ్రగ్స్ పార్టీ నిర్వహించగా పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈగల్ టీమ్ ఓ ప్రకటన చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపింది. తారామతిలో పోలీసులు, నార్కోటిక్స్ టీమ్స్తో సంయుక్త దాడులు నిర్వహించామని చెప్పింది. ఇంటర్నేషనల్ డీజే మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో పార్టీ నిర్వహించినట్లు వివరించింది. మెుత్తం 35 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అరెస్టయిన వారిలో వ్యాపారులు, డీజే ప్లేయర్, మోడల్, బాలీవుడ్ నటుడు, సర్వర్ ఉన్నట్లు చెప్పింది. -
లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదర్గూల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్గూల్ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్గూల్ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు. -
ఖానాపూర్ మున్సిపాలిటీ.. బీజేపీ-బీఆర్ఎస్ కైవసం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ-బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా బీజేపీ కార్పొరేటర్ మౌనిక ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా.. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. ముందుగా చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం నడుమే చైర్మన్ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)
-
ప్రధాని మోదీని మెప్పించిన వంటలక్క యాదమ్మ..!
ఏదైన శుభకార్యానికి వెళ్లొస్తే మొదటగా అందరూ మాట్లాడుకునేది వడ్డించిన వంటల గురించే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. వంటకం ఎలా ఉంది..? ఎన్ని రకాలు వడ్డించారు? ఇలా ఓ చర్చే జరుగుతుంది. అయితే ఈ వంటలక్క చేయి పడితే రుచి చూడడం అవసరం లేదు. నాన్వెజ్లో బగారా, చికెన్, మటన్, ఫిష్, తలకాయ, బోటీతో పాటు వెజ్లో పచ్చిపులుసు, భక్షాలు, పప్పుచారు, పులిహోరాతో పాటు పంచభక్ష పరమాన్నాలు లొట్టలేసుకుని తింటారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్న కరీంనగర్లోని సప్తగిరికాలనీకి చెందిన ప్రముఖ క్యాటరింగ్ నిర్వాహకురాలు గూళ్ల యాదమ్మ చేతి వంటను రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ రుచిచూశారు. ఒకప్పుడు రూ.15కు దినసరి కూలీగా చేసి, ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్న యాదమ్మ చేతివంటపై సండే స్పెషల్..!!విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికైనా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు.మోదీ మెచ్చిన వంటలు2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు.వందలాది మందికి ఉపాధికిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు.ఈ జన్మలో కలిగిన భాగ్యంకరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
పాఠశాల నుంచి వస్తూ.. అనంత లోకాలకు
హైదరాబాద్ : తండ్రితో బైక్పై వస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని స్కూల్ బ్యాగ్ ఆర్టీసీ బస్సుకు తట్టుకోవడంతో కిందపడి ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. తన కళ్లెదుటే కూతురు మృత్యువాత పడటంతో ఆ కన్నతండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డుపై నీరు పేరుకుపోవడం.. పక్కనే కారు పార్క్ చేయడంతో.. బైక్ను తప్పించబోవడంతో ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఊదురు గ్రామానికి చెందిన కంచి ప్రసాద్, సునీత దంపతులు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–58లోని ప్లాట్నెంబర్ 1143లో వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. వీరి కూతురు కీర్తిక (14) వెంగళరావునగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి, కుమారుడు సాయి (11) ఆరో తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే ప్రసాద్ శనివారం కూతురు, కొడుకును మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి బైక్పై తీసుకువస్తున్నాడు. బైక్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1556 వద్దకు రాగానే గుంతలు తేలిన రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో పక్కకు వెళ్లాడు. అక్కడ కారు పార్క్ చేసి ఉన్న కారును తప్పించేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకొచి్చంది. బస్సుకు కీర్తిక స్కూల్ బ్యాగ్ తట్టుకోవడంతో ఆమె కిందపడింది. టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్కు, సాయికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తిరుపతిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని మెట్రో స్టేషన్ రోడ్డంతా గుంతలమయమై మురుగునీరు పారుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు పూడ్చకపోవడం, మురుగు సమస్యకు చెక్ పెట్టకపోవడంతో శనివారం రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత పడింది. దీనికి తోడు రోడ్డు పక్కన అక్రమంగా పార్కింగ్ చేసిన కారు కూడా ఈ ఘటనకు కారణమైందని, జీహెచ్ఎంసీ అధికారులపైనా కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో మార్చి 5న వివా హం జరిగింది. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమె, శుక్రవారం రాత్రి అత్తారింటికి చేరుకుంది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా, పెళ్లైన నెల రోజులకే అఖిల బలవన్మరణానికి పాల్పడటం కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు -
అప్పీల్కు అవకాశమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆ చట్టంలో పేర్కొన్న విధంగా అప్పీల్ వ్యవస్థ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే అవకాశమే లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. మొదటి అప్పిలేట్ అథారిటీ అయిన ఆర్డీవో నుంచి జిల్లా కలెక్టర్, తర్వాత సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే మాడ్యూల్ భూభారతి పోర్టల్లో పనిచేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పొరపాటునో, గ్రహపాటునో కింది స్థాయి అధికారులు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా, తగిన డాక్యుమెంట్లు లభించక తిరస్కరణకు గురైన దరఖాస్తులకు మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించి పరిష్కరించుకోవాలనుకున్నా అవకాశం ఉండడం లేదు. అప్పీల్ కోసం సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. ఆన్లైన్లో అవకాశమివ్వలేదని, తామేమీ చేయలేమని అధికారులు చెçపుతుండడంతో చేసేదేమీ లేక రైతులు వెనుదిరగాల్సి వస్తోంది. అయితే, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఆ మాడ్యూల్ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భూభారతి పోర్టల్లో వచ్చే అన్ని సమస్యలకూ ఏకకాలంలో పరిష్కారం చూపే అవకాశం లేకపోయినా కనీసం అప్పీల్ చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతాంగం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాదాబైనామాలదీ ఇదే పరిస్థితి.. భూముల విషయంలో సాధారణంగా వచ్చే సమస్యలకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా అప్పీల్కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ముఖ్యంగా సాదాబైనామాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, అమ్మినవారు కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనను తొలుత విధించడంతో చాలా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. నోటీసుల గడువు ముగిసినా అఫిడవిట్ ఇచ్చేందుకు అమ్మినవారు ముందుకు రావడం లేదన్న కారణంతో చాలా దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం 9 లక్షలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు 30 శాతం వరకు అనేక కారణాలతో తిరస్కరించగా, వాటిలో ఎక్కువగా అఫిడవిట్ విషయంలోనే తిరస్కారానికి గురయ్యాయి. ఇప్పుడు అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో గతంలో అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వలేదనే నిబంధనతో తిరస్కరించిన దరఖాస్తులపై కలెక్టర్లకు అప్పీల్ చేసుకునే వెసులుబాటును భూభారతి చట్టం కల్పిస్తోంది. కానీ, పోర్టల్లో మాత్రం అప్పీల్ మాడ్యూల్ పనిచేయకపోవడంతో దాదాపు 2 లక్షలకు పైగా దరఖాస్తుదారులు ఈ అప్పీల్ వ్యవస్థ కోసం నిరీక్షించాల్సి వస్తోందని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. అప్పీల్ వ్యవస్థను ఆన్లైన్లో ఏర్పాటు చేస్తేనే సాధారణ దరఖాస్తులతో పాటు సాదాబైనామాలకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని వారంటున్నారు. -
వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టడంపై వివా దం రేగింది. ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో శనివారం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు వారి వెంట తెచ్చుకున్న రేవంత్రెడ్డి చిత్రపటాన్ని అక్కడ పెట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ సమస్యలను పట్టించుకోని కేసీఆర్కు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయంలో రేవంత్రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధికార మదంతోనే దాడి: హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు బిహార్ గ్యాంగ్ను తలపిస్తున్నారన్నారు. ఓ వైపు విద్వేష ప్రసంగాల బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ మరోవైపు గూండా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. ‘సీఎం, మంత్రులు పొలిటికల్ టూర్లు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నారు. దాడులు ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఖండించారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు డెడ్లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ డెడ్లైన్ విధించింది. మైనార్టీ జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని మార్చి 31 నుంచే విధుల నుంచి తొలగించిన అధికారులు.. ఈ సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల 23వ తేదీన చివరి పనిదినంగా ప్రకటిస్తూ ఆ మరుసటి రోజు నుంచి విధులకు రావొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వారి పనిదినాల గడువును ఉటంకిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి రెండ్రోజుల క్రితం అన్ని జూనియర్ కాలేజీలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాలతో ఈ సొసైటీ పరిధిలో దాదాపు 2,250 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా సంవత్సరం ముగియడంతో వారి సేవలను నిలిపివేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీంతో నిర్దేశించిన గడువు నాటికే వారికి వేతనాలు చెల్లిస్తారు. తదుపరి ఈ ఉద్యోగులు సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదు. సొసైటీ అవసరాలకు అనుగుణంగా తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. 12 వేల మందికి పైమాటే.. ప్రస్తుతం మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను నిలిపివేసినప్పటికీ.. ఇతర గురుకుల సొసైటీల పరిధిలోనూ ఇదే తరహా చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే గురుకుల జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో.. అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సేవలు నిలిచిపోయాయి. ఈనెల 23వ తేదీతో ఆయా గురుకుల పాఠశాలల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా చెక్పడనుంది. ఈమేరకు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల పరిధిలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరందరి సేవలను ఈనెల 23తో నిలిపివేస్తున్నప్పటికీ, తదుపరి సర్వీసుకు సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేవలం 10 నెలల వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో వేసవి సెలవుల్లో వారు జీవనంకోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి 12 నెలల వేతనం ఇవ్వాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఉద్యోగులు చెపుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాలు అంతంతమాత్రమే ఇస్తున్నారు. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదు. విద్యా సంస్థల్లో పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణం. వారికి కేవలం 10 నెలల జీతాలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏడాదిలో 10 నెలలు ఇక్కడ పనిచేసి మిగిలిన రెండు నెలలు ఎక్కడ పనిచేయాలి. ఈ రకమైన వివక్షను ప్రభుత్వం వీడాలి. మానవీయకోణంలో ఆలోచన చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి. – పులి లక్ష్మయ్య, అధ్యక్షుడు, రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం -
వాటర్.. మరో మీటర్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు మట్టం తీవ్రంగా పడిపోతోంది. నెల రోజుల వ్యవధిలో మీటర్కి పైగా లోతుల్లోకి జారిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వేసవి తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో భూగర్భజలాల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రధానంగా బోరుబావుల కింద యాసంగి పంటల సాగుకోసం యథేచ్ఛగా నీటిని తోడేస్తుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 7.25 మీటర్ల లోతుల్లో లభ్యమైన భూగర్భ జలాలు మార్చి నాటికి 8.22 మీటర్ల లోతుల్లోకి దిగజారాయి. కాగా, జనవరిలో 6.28 మీటర్ల లోతుల్లోనే జలాలు లభ్యమయ్యాయి. వాస్తవానికి గత వర్షాకాలంలో సాధారణానికి మించి 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుత నీటి సంవత్సరం 2025–26లో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాది సెప్టెంబర్లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు మట్టం 4.41 మీటర్ల లోతుల్లోనే ఉంది. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో మార్చి నాటికి 8.22 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. గతేడాది మార్చిలో రాష్ట్ర భూగర్బ జలాలు 9.91 మీటర్ల లోతుల్లోకి పడిపోగా, ఈ ఏడాది మార్చిలో కొంత మెరుగ్గా 8.22 మీటర్ల లోతుల్లోనే లభ్యమవుతున్నాయి. గత వర్షాకాలంలో సాధారణానికి మించి వర్షాలు కురవడమే దీనికి కారణం. రాష్ట్ర భూగర్భ జల శాఖ ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. వికారాబాద్లో ఆందోళనకరం..ఖమ్మం జిల్లాలో 4.52 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, వికారాబాద్ జిల్లాలో మాత్రం 13.72 మీటర్ల లోతుల్లో లభిస్తున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా, కేవలం 2 జిల్లాల్లోనే 0–5 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతుల్లో, 10 జిల్లాల్లో 10 మీటర్లకి మించిన లోతుల్లో భూగర్భ జలాలున్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు భావిస్తారు. ఈ నేపథ్యంలో వేసవి ప్రారంభంలోనే 10 జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్టు ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.వికారాబాద్ జిల్లాలో 13.72, కామారెడ్డి జిల్లాలో 12.35 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 11.95 మీటర్లు, మెదక్ జిల్లాలో 11.86 మీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 11.67 మీటర్లు, సిద్దిపేట 11.13 మీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 10.80 మీటర్లు, మేడ్చల్ 10.78 మీటర్లు, సిరిసిల్ల 10.6 మీటర్లు, రంగారెడ్డి 10.06 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి.85 మండలాల్లో దశాబ్దకాలం కంటే లోతుల్లోకి రాష్ట్రంలో 536 మండలాల్లో (86శాతం) భూగర్భ జలాల మట్టం గత దశాబ్ద కాల సగటు కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ మండలాల్లో 0.01–19.24 మీటర్ల మేర దశాబ్ద కాల వృద్ధి నమోదైంది. మిగిలిన 85 మండలాల్లో(14శాతం) దశాబ్ద కాల సగటు కంటే 0.01 నుంచి 13.4 మీటర్ల మేరకు లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి.ఎండిపోతున్న పంటలు..కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు బాగా ఇంకిపోవడంతో బోరుబావుల కింద సాగుచేస్తున్న యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ట్యాంకర్లతో పంటలకు నీళ్లు అందించడానికి తంటాలు పడుతున్నారు. ఎండిపోయిన పంటలను పశువులకు మేత కోసం వదిలేస్తున్నారు. -
కట్టుకున్నవారే కాలయముళ్లు
అడ్డాకుల/పటాన్చెరు టౌన్: రక్షణ గా ఉండాల్సిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లు అయ్యారు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ సంఘ టనలు కలకలం రేపాయి. ఒకచోట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే మనస్పర్థలతో భార్య ప్రా ణం తీస్తే.. మరోచోట అనుమానంతో పెళ్లయిన ఏళ్ల తర్వా త భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపాడొక భర్త. వివరా లివి. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన నర్సు కె.శ్రీదేవి (21).. అదే గ్రామా ని కి చెందిన చందుతో ప్రేమలో పడింది. కులాలు వేరైనా ఎని మిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి గ్రామంలో చందు ఇంట్లోనే ఉంటూ కాపు రం చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. చందు నిత్యం తన భార్యను హింసించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యను కొట్టి గొంతు నులిమి చంపాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుందనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి గ్రామస్తు ల సమాచారంతో ఎస్ఐ ఎం.వేణు పొలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి భర్త చందును అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి మృతదేహానికి జిల్లా ఆస్ప త్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. చందు అక్కడికి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి బంధువులు పట్టుబట్టారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డాకుల, దేవరకద్ర ఎస్ఐలు శ్రీనివాస్, నాగన్న బందోబస్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చందుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. అనుమానమే పెనుభూతమై..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీ మ జిల్లా, అల్లవరం మండలం మొగలమూరుకు చెందిన పరమేశ్వరరావు, లీలా వతి (54) దంపతులు పటా న్చెరు ఏపీఆర్ కాలనీలో కుమారుడు మహావీర్ ఆరు ద్ర, కోడలు సుజాతతో కలి సి ఉంటున్నారు. కాగా కొంతకాలంగా పరమేశ్వరరావు, లీలావతి పై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతు న్నాడు. శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు తమ కుమారునికి వ్యాక్సిన్ వేయించేందుకు ఉదయం 10 గంటల సమయంలో బయటికి వెళ్లారు. ఈ క్రమంలో పరమేశ్వరరావు కూరగా యలు కోసే కత్తితో లీలావతి గొంతుకోసి పరారయ్యాడు. కుమారుడు, కోడలు వచ్చి చూసేసరికి లీలావతి రక్తపు మడు గులో చనిపోయి ఉండటంతో అరుస్తూ బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ రాజు సిబ్బందితో కలిసి ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పరారైన పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చుట్టూ వారు మన ఏజ్ బారు
సాక్షి, హైదరాబాద్: మన చుట్టూ ఉండే వ్యక్తులు మన మనసుపై మాత్రమే కాదు, శరీర ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతారని నిపుణులు ఎప్పటినుంచో చెబుతుండగా.. తాజా అధ్యయనం దీన్ని మరింత బలపరుస్తోంది. ఎప్పుడూ ఒత్తిడి కలిగించే లేదా ప్రతికూల (నెగెటివ్) ధోరణితో ప్రవర్తించే (టాక్సిక్) వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశం ఉందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు బ్యుంక్యులీ సారథ్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏ)లో ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా 18–104 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2300 మందికి పైగా వ్యక్తులను పరిశీలించారు. వారి సామాజిక సంబంధాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెట్వర్క్ను విశ్లేషించారు. ముఖ్యంగా ఎవరి వల్ల ఎక్కువగా భావోద్వేగ ఒత్తిడికి గురవుతున్నారో లేదా సమస్యలు ఎదురవుతున్నాయో గుర్తించారు. పాల్గొన్న వారి లాలాజలం నమూనాలను తీసుకుని డీఎన్ఏ మైథెలేషన్ అనే విధానం ద్వారా ‘బయోలాజికల్ ఏజ్’ను కొలిచారు. సాధారణంగా మన పుట్టిన తేదీ ఆధారంగా చెప్పే వయసు క్రోనాలాజికల్ ఏజ్ కాగా, శరీర కణాల స్థితి ఆధారంగా చెప్పే వయస్సును బయోలాజికల్ ఏజ్ అంటారు. ఇది ఆరోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తుందన్న మాట. అధ్యయనం తేల్చిన కీలకాంశాలివే.. ఒక వ్యక్తి జీవితంలో కీలకంగా లేదా అత్యంత సన్నిహితంగా ఎవరైనా టాక్సిక్ వ్యక్తి ఉంటే వృద్ధాప్య వేగం సుమారు 1.5% పెరుగుతుంది. అటువంటి సంబంధాలు ఉన్నవారి బయోలాజికల్ వయస్సు సగటున 9 నెలలు ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉన్న నెగటివ్ సంబంధాలు శరీరంపై ఎక్కువ ప్రభావం చూపాయని పరిశోధకులు గుర్తించారు. టాక్సిక్ వ్యక్తులు దీర్ఘకాలిక ఒత్తిడికి (క్రానిక్ స్ట్రెస్)కు కారణమవుతారు. దీనివల్ల కార్టిసోల్ వంటి హార్మోన్లు పెరిగి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది కణాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి వాటికి కారణమై అంతిమంగా వేగవంతమైన వృద్ధాప్యం ప్రాప్తించేందుకు కారణమవుతుంది. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం... టాక్సిక్ వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆందోళన, నిరాశ, భావోద్వేగ అలసట వంటి మానసిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో నిద్రలేమి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా మీద పడవచ్చు. మన చుట్టూ ఉన్న సంబంధాలు భావోద్వేగాలపై అంతిమంగా శరీర వృద్ధాప్య ప్రక్రియపై ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సానుకూల సంబంధాలే ఆరోగ్యానికి మేలు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మంచి సంబంధాలు కలిగి, మద్దతు ఇచ్చే వ్యక్తులతో కలిసి జీవించడం ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలంటే టాక్సిక్ వ్యక్తులతో సంబంధాలను తగ్గించుకుని సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. నెగటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండడం, అవసరమైన చోట భావోద్వేగ హద్దులు పెట్టుకోవడం, వ్యాయామం, ధ్యానం వంటి కార్యకలాపాలతో ఒత్తిడిని తగ్గించుకోవాలని, సానుకూల ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలని సూచిస్తున్నారు. -
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
బోధన్: నిజామాబాద్ జిల్లా మంజీర నది తీర ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో భీతావహ వాతావరణం ఏర్పడింది. సాలూర మండల కేంద్రం, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామా ల్లో వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఈ గ్రామాల్లో యాసంగి సీజన్లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. పంటలు కోత దశకు చేరాయి. వర్షానికి మొక్కజొన్న నేలవాలింది. వరిపంట గింజ రాలిపోయింది. సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు సేవా కేంద్రం ఆవరణలో, అంతర్రాష్ట్ర బైపాస్ రోడ్డు మార్గం, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. -
ఆర్థిక ఇబ్బందుల్లేకుంటే కారుణ్య ఉద్యోగానికి అర్హులు కారు
సాక్షి, హైదరాబాద్: మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో లేకున్నా, అతను లేకుండా దీర్ఘకాలంగా జీవనం సాగిస్తున్నా వారు కారుణ్య ఉద్యోగానికి అనర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. 25 ఏళ్ల మహిళ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఎంజీఎం ఆస్పత్రిలో మేల్ నర్స్గా పని చేసి మరణించిన తండ్రి ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలంటూ వరంగల్కు చెందిన ఓ యువతి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారు తిరస్కరించడంతో, ఆకస్మిక ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించడానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబం చాలా కాలం జీవనం సాగించిందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లేవంటూ పిటిషన్ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. పిటిషనర్ తల్లి రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమె తండ్రికి చట్టబద్ధమైన వారసురాలిగా పొందిన సివిల్ డిక్రీ కేవలం ఆస్తి విషయాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి చట్టపరమైన హక్కు కల్పించదని చెప్పారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారంటూ ఆ ఉత్తర్వులను సమర్థించింది. ఉద్యోగం కోసం చేసిన మొదటి దరఖాస్తును సరైన కారణాలతో తిరస్కరించారని పేర్కొంది. ఐదేళ్ల తర్వాత రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. -
ఆప్షన్ ఇచ్చి తరలండి!
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి ఆర్టీసీ సిబ్బంది తరలింపునకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఎవరు ఏ రీజియన్లో పనిచేయదలుచుకున్నారో ఆప్షన్ల ద్వారా చెప్పాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్కు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 15లోగా ఆప్షన్లను సేకరించి అందజేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీన్ని అత్యవసర ప్రక్రియగా భావించాలని స్పష్టం చేయటం విశేషం. త్వరలో ఔటర్ రింగురోడ్డు లోపల ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తిప్పాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి, అందుకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ బస్సులు వచ్చే కొద్దీ తత్సమాన సంఖ్యలో డీజిల్ బస్సులను జిల్లాలకు బదిలీ చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) విధానంలో ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుంది. రెండు సంస్థలు వాటిని నిర్వహిస్తాయి. అప్పుడు నగరంలోని డిపోలన్నింటిని వాటికే అప్పగించనున్నారు. అద్దె ప్రాతిపదికన నిర్వహించనున్నందున వాటిల్లో డ్రైవర్లు, మెకానిక్ సిబ్బందిని ఆయా సంస్థలే నియమించుకోవాల్సి ఉంటుంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ఉంటారు. డిపోల్లో డీఎంలు, అసిస్టెంట్ డీఎంలు, అకౌంట్స్ సిబ్బంది, కండక్టర్లు...లాంటి వారు మాత్రమే ఆర్టీసీ వైపు నుంచి పనిచేస్తారు. మిగతా ఆర్టీసీ సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించాల్సిందే. ఈ క్రమంలోనే సిబ్బంది కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చుకునే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. » హైదరాబాద్ జోన్ (గ్రేటర్ హైదరాబాద్ పరిధి వెలుపలి దక్షిణ తెలంగాణ ప్రాంతం), కరీంనగర్ జోన్ల పరిధిలో డిప్యుటేషన్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. » పదోతరగతి, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న డ్రైవర్లు నగరంలో కండక్టర్లుగా పనిచేసేందుకు వెసులుబాటు కల్పించింది. దీనికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. » మెకానిక్లు వారి విద్యార్హత ఆధారంగా ఏడీఎస్లుగా, బస్పాస్ కౌంటర్ సిబ్బందిగా, భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు పార్కింగ్ డ్రైవర్లుగా ఓడీతో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. » డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది కలిపి నగరంలో దాదాపు 8 వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరినీ తరలించాల్సి ఉంది. » ప్రస్తుతం 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, నగరంలో కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఏకంగా 4 వేల మంది డ్రైవర్లు అదనంగా మారనున్నారు. ఇక ప్రస్తుతం 2 వేల కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇటీవల 1,700 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఆ విధుల్లోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీని అదనంగా మారే డ్రైవర్లకు కండక్టర్ పోస్టు ఇవ్వటం ద్వారా భర్తీ చేస్తారు. » కండక్టర్ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా అదనంగా ఉండే డ్రైవర్ల నుంచి ఆప్షన్లు తీసుకుని వారి సొంత జిల్లాలు, వారు కోరిన ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. -
రెస్పెక్ట్ ఏదిరా?
గంగాధర: తమకు గౌరవం ఇవ్వడం లేదని పదో తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులను చితకబాదారు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల విద్యాలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. శుక్రవారం రాత్రి పది గంటలు దాటిన తరువాత వాచ్మన్, డ్యూటీలో ఉండే ఉపాధ్యాయుడు నిద్రపోయారు. పదో తరగతి విద్యార్థులు 25 మంది కలిసి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 మందిని, ఒక్కొక్కరిగా తమ గదిలోకి పిలుస్తూ చితకబాదారు. దెబ్బలు తిన్న విద్యార్థులు శనివారం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.దెబ్బలు తిన్న వారిలో ఓ విద్యార్థి పుట్టిన రోజు కావడంతో.. శనివారం అతని తల్లి పాఠశాలకు వచ్చినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత బాధిత విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాఠశాలకు చేరుకోగా, సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్రావు, ఎస్ఐ వంశీకృష్ణ, పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. బాధిత విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇద్దరిని కరీంనగర్ తరలించారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనపై తహసీల్దార్ అంబటి రజితకు ఫిర్యాదు చేశారు. దాడి జరుగుతున్నా డ్యూటీలో ఉన్న వాచ్మన్, ఉపాధ్యాయుడు పట్టించుకోలేదని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తహసీల్దార్ రజిత విచారణ చేపట్టి దాడి చేసిన పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, ఇంటికి పంపించారు. వాచ్మన్, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.గదిలో బంధించి ర్యాగింగ్7వ తరగతి విద్యార్థిని కొట్టిన టెన్త్ విద్యార్థులుకారేపల్లి: గురుకులం విద్యార్థులు సాయంత్రం వేళ ఆడుకుంటున్న సమయంలో తలెత్తిన గొడవ ఏడో తరగతి విద్యార్థిపై దాడికి దారితీసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం సాయంత్రం కొందరు పదో తరగతి విద్యార్థులు ఓ గదిలో 7వ తరగతి విద్యార్థిని బంధించి ర్యాగింగ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు.ఈ సమయాన ఉపాధ్యాయులెవరూ లేకపోగా, విద్యార్థి అరుపులు విన్న సమీపంలోని డబుల్ బెడ్రూం వాసులు చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. గాయపడిన విద్యార్థిని 108 అంబులెన్స్లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే చేరుకున్న విద్యార్థి కుటుంబీకులు, స్థానికులు దాడి చేసిన టెన్త్ విద్యార్థులను తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులు చేరుకుని 10వ తరగతి విద్యార్థులను ఓ గదిలో ఉంచి.. ఉదయం మాట్లాడదామని నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. -
ఆ ముగ్గురు ఐఏఎస్లు హాజరుకావాలి
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో గతంలో పనిచేసిన ఏడుగురు ఉద్యోగులకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులైన ఆర్థిక, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులతో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, వరంగల్ ఎస్ఈ, కొత్తగూడెం డివిజన్ ఈఈ, ఖమ్మం జిల్లా కలెక్టర్.. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీరిలో ముగ్గురు ఐఏఎస్ అధికారులున్నారు. తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసింది.తమను క్రమబద్దీకరించకపోవడాన్ని, పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు (గతంలో) జగన్నాథం సహా పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి వీరికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ అధికారులు అప్పీల్ వేశారు. అప్పీల్ను ద్విసభ్య ధర్మాసనం పాక్షికంగా అనుమతించింది. ఖమ్మం జిల్లాకు చెందిన జగన్నాథం సహా మరికొందరి సేవలను 1993, నవంబర్ 25 నుంచి అన్ని ప్రయోజనాలతో క్రమబద్ధీకరించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించి, బి.శ్రీనివాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించాలని 2023, సెప్టెంబర్ లో ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో జగన్నాథం సహా మరికొందరు బాధితులు 2024లో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ శామ్కోషి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ధిక్కరణ పిటిషన్ను పరిశీలించిన ప్రతివాదులను తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
నేను సీఈవో.. నేను సీఎఫ్వో..
సాక్షి, హైదరాబాద్: వ్యాపార సంస్థల అధినేతలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) వంటి అధికారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారు. సంస్థల అధికారిక ఈ–మెయిల్స్కు మోసపూరిత ఫిషింగ్ లింకులు పంపించి, తద్వారా సంస్థ అధికారుల కంప్యూటర్లు, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆయా ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై సైబర్ నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ను సాధించి అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇటీవల ఈతరహా కేసులు వెలుగు చూస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ఎలా చేస్తారంటే?ఎలక్ట్రానిక్ ఉపకరణాలు నేరస్తుల నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తారు. సీఈఓ, సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వీలుపడదని, తాము సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేయాలన్న సారాంశంతో అకౌంటెంట్లకు సెల్ఫోన్, వాట్సాప్ సందేశాలను పంపిస్తారు. పై అధికారుల నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్లు కూడా నిజమేనని కోట్లాది రూపాయల నగదు బదిలీ చేస్తారు. సొమ్మును ఎలా మళ్లిస్తారంటే?కంపెనీకి సంబంధించి ఉన్నతాధికారుల ముసుగులో అకౌంటెంట్లకు నకిలీ సందేశాలను పంపించి, వారి నుంచి కొట్టేసిన సొమ్మును నేరస్తులు సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో తక్షణమే వందలాది మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసుకుంటారు. గంటల వ్యవధిలోనే ఆసొమ్ము తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకుంటారు. వాట్సాప్లో ఉన్నతాధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకుండా, వెంటనే ఆ అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధ్రువీకరించుకోవాలని సజ్జనార్ సూచించారు.సంస్థలు ఏం చేయాలంటే?⇒ కార్యాలయాలు, ఉన్నతాధికారులు వినియోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో నాణ్యమైన ఫైర్వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను నిరంతరం అప్డేట్ చేసుకోవాలి.⇒ కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పనిసరిగా లాగౌట్ చేయాలి.⇒ ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా, పబ్లిక్ వైఫైలను వినియోగించకూడదు.⇒ సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఈ తరహా సైబర్ నేరస్తుల దాడులను ఎదుర్కోగలమన్న విషయాన్ని విస్మరించరాదు.⇒ ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలి. -
ఔషధ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్య రూపు రేఖలను మారుస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ అన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు భారతీయ ఔషధ రంగంపై కొంత మేర ప్రభావం చూపుతున్నాయన్నారు. అయితే ఈ రంగంలో సవాళ్లను అధిగమించేందుకు వినూత్న ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలపై ఫార్మా వర్గాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఫార్మా ఎగుమతుల వృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. భారత ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) సహకారంతో కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన ‘చింతన్ శివిర్’ను రాజేశ్ అగర్వాల్ శనివారం ప్రారంభించారు.దేశీయ మార్కెట్ లక్ష్యంగా ఔషధాలు‘ప్రపంచ జనాభాలో 18 నుంచి 19 శాతం భారత్లోనే ఉండటం ఫార్మా రంగానికి అతిపెద్ద మార్కెట్గా నిలుస్తోంది. జనరిక్స్ తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉన్నా ఏపీఐ, ఇంటర్మీడియెట్ల తయారీని స్థానికంగా పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలకు భారతీయ ఔషధాలు ఎగుమతి అవుతున్నా అనేక దేశాలకు 10శాతం కంటే తక్కువ ఎగుమతులు ఇక్కడ నుంచి జరుగుతున్నాయి.ఫార్మా రంగంలో బయోలాజిక్స్, బయోసిమిలర్స్ వంటి కొత్త పోకడలకు అనుగుణంగా మారాలి. కొత్త పేటెంట్ల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడంతోపాటు ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాలి. భౌగోళికంగా విచ్ఛిన్న పరిస్థితులున్న నేపథ్యంలో దిగుమతుల సరఫరా గొలుసును సురక్షితంగా ఉంచడానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. 38 దేశాల ఆర్థిక వ్యవస్ధతో అనుసంధానమయ్యేలా 9 విదేశీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త మార్కెట్లకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు.సీఈఓలతో సమావేశంచింతన్ శివిర్లో భాగంగా ఫార్మా సీఈఓలతో ముఖాముఖి సమావేశం జరిగింది. మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకోవటం, నియంత్రణ– నిబంధనల అమలు, ఎగుమతుల వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీలో వచ్చే సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న 12వ అంతర్జాతీయ ఫార్మా, హెల్త్కేర్ ఎగ్జిబిషన్ ఐపెక్స్–2026 షెడ్యూల్ను ఈ సందర్భంగా ప్రకటించారు. ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి, కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శులు మోహిత్ యాదవ్, సత్యప్రకాశ్ టీఎల్ పాల్గొన్నారు. -
ఔషధాలపై యుద్ధం దెబ్బ
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం ఔషధ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. మందుల తయారీలో వినియోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియంట్ (ఏపీఐ)తోపాటు సాల్వెంట్స్, ఎక్సిపియెంట్స్ ముడిసరుకుల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగాయి. వీటికితోడు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఏటా చేసే ధరల సాధారణ సవరణతో ఈనెల నుంచి 760కి పైగా మందుల ధరలు 0.65 శాతం పెరిగాయి. దీంతో 900కు పైగా అత్యవసర ఔషధాల ధరలు 20 నుంచి 200 శాతం వరకు పెరగబోతున్నాయి. ఇది సామాన్యులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ఆర్థిక భారం మోపనుంది. మందుల ధరలపై యుద్ధం ప్రభావంపశ్చిమాసియా సంక్షోభం వల్ల పెట్రోకెమికల్ సరఫరా గొలుసు దెబ్బతిన్నది. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయి. భారత ఫార్మా రంగం తయారు చేసే మందులకు సంబంధించి 70–80 శాతం ముడి సరుకులు చైనా, పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడుతోంది. దీంతో పారాసెటమాల్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్ (ఏపీఐ) ధర కిలోకు రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.450–600కు చేరింది. గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్ వంటి సహాయక పదార్థాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో సిరప్లు, ఓరల్ డ్రాప్స్ తయారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది ఫార్మా తయారీదారులు ఉత్పత్తి ఆపేస్తున్నట్లు ప్రకటించారు.యుద్ధం తర్వాత ఉత్పత్తి అవుతున్న వాటిపై...ఫార్మా రంగ వర్గాల సమాచారం మేరకు సుమారు 900 రకాల అత్యవసర మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త స్టాక్ వచ్చిన తర్వాతే ఈ పెరుగుదల పూర్తిగా అమలవుతుంది. ప్రస్తుత స్టాక్ (యుద్ధం ముందు తయారైనది) ఇప్పటికీ పాత ధరల్లోనే ఉంది. ఇందులో సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్+మినరల్స్ కలయికతో ఉండే ప్రొటీన్ గ్లూకోనెట్ అనే సప్లిమెంట్ ధరలు 200 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే అమాక్సిలిన్ యాంటీ బయోటిక్ మందు ప్రధాన ఔషధ ధర 50 శాతం పెరిగింది.అలాగే పారాసెటమాల్ క్యాప్సుల్స్, ఆక్స్బార్, విక్బార్, గమ్ బెటల్ క్యాప్యూల్స్ వంటి నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్, స్టెరాయిడ్లు, గుండె సంబంధిత వ్యాధులతోపాటు కేన్సర్, డయాబెటిక్ ఔషధాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. యుద్ధం తర్వాత ఉత్పత్తి అవుతున్న మందులు మార్కెట్లోకి వస్తే భారీగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఫార్మసిస్టులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్ (మెట్ఫార్మిన్, ఇన్సులిన్), హైపర్టెన్షన్, హృద్రోగం, కేన్సర్ వంటి వ్యాధులకు ఔషధాలు వాడేవారి నెలవారీ ఖర్చు 20–50 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పాత ధరలకు సరఫరా చేయలేంప్రభుత్వ ఆసుపత్రులకు టీజీఎస్ఎంఐడీసీ ద్వారా మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ‘ఒప్పందం ప్రకారం పాత రేట్లకు మందులు సరఫరా చేయలేం. ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వాలి’ అని లేఖ రాసినట్లు తెలిసింది. ఫార్మా తయారీదారుల సంఘాలు సబ్సిడీలు, దిగుమతి రిబేట్, స్థానిక ఏపీఐ తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నాయి. కొన్ని పెట్రోకెమికల్ సాల్వెంట్స్పై కస్టమ్స్ డ్యూటీని మూడు నెలలు మినహాయించినప్పటికీ, ఇది సరిపోదని నిపుణులు చెబుతున్నారు. -
‘బాసర’కు రూ. 225 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో నియమ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ఎలాంటి ప్రదర్శనలు లేకుండా కేవలం ఆధ్యాత్మీకతకు పెద్ద పీట వేయాలని స్పష్టం చేశారు. రూ. 225 కోట్లతో బాసర దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధికి సంబంధించి శనివారం ఆయన తన నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ.. బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలను నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని, పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని, ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం చెప్పారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని సీఎం చెప్పారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి ముందు సూది మందు
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి ముందు బరువు తగ్గే సులభమైన మార్గాల వెతుకులాటలో యువతీ యువకులు నిమగ్నమవుతున్నారు. వెయిట్లాస్కు సంబంధించిన ప్రత్యేక ఇంజెక్షన్లు, మందులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్లో వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’(టిర్జెపాటైడ్) ఇంజెక్షన్ తీసుకోవడం ఇటీవల పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. పెళ్లి రోజు న నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్లో ఇదొక కొత్త ట్రెండ్గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే... ఢిల్లీలోని ఓ క్లినిక్ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్డిస్క్ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. శారీరక రూపానికి ప్రాధాన్యంతో... భారత్లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. గతేడాది భారత్లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులోని క్రియాశీల పదార్ధమైన సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ తయారీదారులు ఇటీవల నోవో మందు చౌక వెర్షన్ల విక్రయాలు ప్రారంభించి, దాని లభ్యతను విస్తృతం చేశారు. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి. భారత్లో మౌంజారో ఇంజెక్షన్ పెన్ అత్యల్ప డోస్ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్ ధర రూ. 25,781గా ఉంది. వెగోవీ అత్యల్ప డోస్ను నెలకు రూ.5,660, గరిష్ట డోస్ను రూ.16,400కి విక్రయిస్తున్నారు. ఇమ్యునో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఎలాంటి వెయిట్లాస్ చికిత్స అయినా మెటబాలిక్ సిండ్రోమ్తో సడన్గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్ ద కౌంటర్’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్ టాబ్లెట్గా వాడకూడదు. ఈ మందులతో సడన్గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. సడన్ వెయిట్లాస్తో యాంగ్జయిటీ ట్రమెర్స్, తీవ్రమైన వెన్నునొప్పుల బారిన కూడా పడే అవకాశాలున్నాయి. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. తగిన డైట్, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. –డా. బూర నర్సయ్యగౌడ్, బేరియాట్రిక్ సర్జన్ -
ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి బీఆర్ఎస్ కైవసం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఇబ్రహీంపట్నం/ఖానాపూర్: పెండింగ్లో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో రెండుచోట్ల చైర్మన్ ఎన్నిక ముగిసింది. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిసల సంధ్యారాణి, వైస్చైర్పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 22 మంది కౌన్సిలర్లకు గాను బీఆర్ఎస్, సీపీఐకి చెందిన 14మంది హాజరయ్యారు. కోరం ఉండడంతో ఎన్నిక సజావుగా పూర్తయింది.ఏడుగురు కాంగ్రెస్, ఓ స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎన్నికకు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, సీపీఐ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ చైర్పర్సన్ పీఠం గెలుచుకోకుండా మంత్రి వివేక్ కుట్ర చేసి జైలుకు పంపారని ఆరోపించారు. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ స్పందిస్తూ తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగేలా చూస్తే రెండు సార్లు బీఆర్ఎస్ నాయకులే ఆటంకం కలిగించారని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో... ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్–చైర్పర్సన్ పీఠం ఎన్నికపై చిక్కుముడి వీడి పోయింది. 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం ఎట్టకేలకు ఎన్నిక ప్రక్రి య ముగిసింది. నాటకీయ పరిణామాల మధ్య రెండుసార్లు ఎన్నికల ప్రక్రియ వాయిదాపడటం.. వివాదం కోర్టుకు చేరడం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫీíÙయో సభ్యుడు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్రెడ్డి చైర్మన్గా, బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల వైస్–చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఖానాపూర్లో వాయిదా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. గతంలో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరవడంతో కోరం లేక అధికారులు ఎన్నిక నిర్వహించలేదు. తాజాగా శనివారం మూడోసారి చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడున్న అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. అధికారులు మొదట సంతకాల సేకరణ చేపట్టగా, కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ సత్యంకు మద్దతుగా చేతులు ఎత్తారు. అయితే తాము సంతకాలు సేకరిస్తున్నామని, తర్వాత ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక పేరును అధికారులు ముందుగా ప్రతిపాదించారు. దీంతో వెడ్మ బొజ్జు అభ్యంతరం తెలిపారు. దీంతో గందరగోళం నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బారికేడ్లు తోసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్ సత్యవతి స్పృహ కోల్పోవడంతో అధికారులు ఎన్నికలను ఆదివారానికి వాయిదా వేశారు. సత్యవతిని ఆస్పత్రికి తరలించారు.‘వీ లవ్ యూ వివేక్’..: బాల్క సుమన్రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అనంతరం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ఉద్దేశిస్తూ..‘వీ లవ్ యూ వివేక్.. గతంలో మంత్రి నన్ను తమ్ముడిగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తమ్ముడిగానే నేనొక విజ్ఞప్తి చేస్తున్న. క్యాతనపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలి’అని వ్యాఖ్యానించారు.శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని తన నివాసంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్షి్మతో కలిసి సుమన్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయాలుండాలి తప్ప ఆ తర్వాత ప్రజల అభివృద్ధి కోసం అన్ని పార్టీ లు కలిసికట్టుగా పని చేయాల్సిన అవస రం ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, మాజీ ఎ మ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ మేయర్ రవీందర్సింగ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, రామడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కేరళలో కమ్యూనిజం పోయి.. గూండాయిజం వచ్చింది
సాక్షి, హైదరాబాద్: కేరళలో పాలన, మానవీయ విలువలు దారుణంగా పడిపోయాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. కేరళ అంటే కమ్యూనిజం, మార్క్సిజం గురించి మాట్లాడుతారు కానీ అది నేడు పక్కకు పోయి గూండాయిజం మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు. గత ఎన్నికల ముందు ఎల్డీఎఫ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈనెల 9న జరుగనున్న ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శనివారం ఆయన కేరళ రాష్ట్రంలోని పత్థనంతిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీల్లో పాల్గొన్నారు., ‘శబరిమల ఆలయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి, నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది, పొట్ట చేత పట్టుకొని కేరళ యువత ప్రపంచం నలుమూలలకు వలస పోతుండగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్కు సరైన సంక్షేమం, ఆదరణ లేకుండా పోయింది’అని భట్టి స్థానిక పరిస్థితులను ఓటర్లకు వివరించారు. ‘కేరళ అంటే సెక్యులరిజం, ఉన్నత విద్యావంతులు, గొప్ప మానవీయ కోణం ఉంటుందని అంతా భావిస్తాం కానీ ఈరోజు కేరళలో ఆ తరహా పరిస్థితులు కనిపించకుండా పోయాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. మా దగ్గర ఉచిత బస్సు..: తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే ఇందులో 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యపై కేరళ కంటే తెలంగాణ ఎక్కువ వ్యయం చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘భవ్య బాసర’ దిశగా..
నిర్మల్: తొలి అక్షరాలను దిద్దించే చదువుల తల్లికి అద్భుతమైన ఆలయం నిర్మాణం కానుంది. రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలో బాసర జ్ఞాన సరస్వతీదేవి కోవెలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నూతన గర్భాలయం, అర్ధమండపం, అనివేటి మండప నిర్మాణాలను కృష్ణశిలలతో చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నదాని కంటే రెండున్నర రెట్లు పెంచనున్నారు. నలువైపులా రాజగోపురాలతో ద్వారాలను నిర్మిస్తారు. ఉత్తరం వైపు తొమ్మిది అంతస్తులతో, మిగిలిన మూడు దిక్కుల్లో ఏడు అంతస్తులతో రాజగోపురాలు నిర్మితం కానున్నాయి. ఆలయానికి నలుదిక్కులా దాదాపు 33 అడుగుల వెడల్పుతో నాలుగు మాడవీధులు నిర్మించనున్నారు.సుమారు 7 వేల అడుగులతో దాదాపు 6 వేల మంది భక్తులకు అనువుగా క్యూకాంప్లెక్స్లు, టాయిలెట్లు, ఫుడ్స్టాల్స్.. ఇలా అన్నివసతులు సమకూర్చనున్నారు. ఇవేకాక దాదాపు 200 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యానమందిరం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న ప్రసాద పంపిణీ కేంద్రం స్థానంలో 20 వేల అడుగుల విస్తీర్ణంలో ప్రసాద పంపిణీ కేంద్రం, నూతన వంటశాల, భోజనశాలను నిర్మించనున్నారు. ఆలయానికి ఈశాన్యాన నూతన కోనేరు నిర్మాణం, దేవాలయానికి వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్, సోలార్ విద్యుత్, ఆహ్లాదకర వాతావరణం కోసం పుష్పవనాలను ఏర్పాటు చేయనున్నారు. -
ఈగల్ టీం దాడులు.. పలువురికి డ్రగ్స్ టెస్ట్
సాక్షి హైదరాబాద్: గోల్కోండ తారామతిలో రిసార్టులో ఈగల్ టీమ్, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులు చేపట్టింది. అక్కడి నిర్వహిస్తున్న జాక్ జాన్సన్ ఈవెంట్లో పాల్గొన్న మెుత్తం 36 మందికి పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈవెంట్కు పలువురు సినీ నటులు హజరయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్న కేటీఆర్
జగిత్యాల జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వద్దకు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఆదిలాబాద్ పర్యటన అనంతరం మార్గమధ్యంలో కేటీఆర్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలువనున్నారు. బీఆర్ఎస్లోకి రావాలని జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఈ నెల 27న జగిత్యాల లేదా కరీంనగర్లో బీఆర్ఎస్ ప్లీనరీ కోసం ప్లాన్ చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ప్లీనరీ కంటే ముందే బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు జీవన్ రెడ్డి. రాబోయే బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పక్కన ప్రత్యేక ఆకర్షణగా జీవన్ రెడ్డి నిలవనున్నారు.కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి సెలవు పలికారు. కాంగ్రెస్లో ఉండలేకపోతున్నానని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే పార్టీలో చేరి సీఎం అయ్యారని అన్నారు. ఆయన బీఆర్ఎస్లో చేరతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. -
SHOCKING CCTV FOOTAGE: వామో ఏంటి ఇది కొట్టులో విక్స్ కొనడానికి వచ్చి...
-
‘నాపై కాదు.. సీపీ ఇల్లీగల్ దందాలపై విచారణ చేయాలి’
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. కరీంనగర్ సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీస్ విధులకు ఆటంకం కల్గించారనే ఆరోపణలపై కౌశిక్రెడ్డిని సీఐడీ విచారించింది. దీనిలో భాగంగా విచారణ అనంతరం ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, సీపీ మతమార్పిడి చేస్తున్నారని తాను అనలేదని, ఆధారలన్నీ సీఐడీకి ఇచ్చానని, మళ్లీ ఎప్పుడు పిలిచినా వెళ్తానన్నారు. తనపై విచారణ చేయడం కాదని, సీపీ ఇల్లీగల్ దందాలపై విచారణ చేయాలన్నారు కౌశిక్రెడ్డి.‘కౌశిక్ రెడ్డి కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డు ఎందుకు పెట్టారు?, కరీంనగర్, వరంగల్ నుంచి చెత్త తీసుకొచ్చి హుజురాబాద్ లో ఎలా వేస్తారు. కౌశిక్ రెడ్డి దీక్షకు కూర్చుంటాడని సీఐడీ నోటీస్లు ఇచ్చారు. నా మీద కోపం ఉంటే ఊరేయండి...హుజురాబాద్ మీద కక్ష ఎందుకు?, డంపింగ్ యార్డు రద్దు చేయకపోతే 7 వ తారీఖు నుంచి 8 వ తారీఖు వరకు దీక్షకు కూర్చుంట. నాపై వేసిన కేసు పోలీసులకే ఉచ్చు బిగిస్తుంది. ఈ కేసుకు సీఐడీకి ఏం సంబంధం.కరీంనగర్ పోలీస్ కమిషనర్ మత మార్పిడి చేస్తున్నాడని నేను అనలేదు. అలా అన్నానని ఒక్క వీడియో అయినా చూపించగలరా?, చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని తెలిపారు. -
ఉద్రిక్తత: ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మ్యాజిక్ ఫిగర్ 7పై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు ఇవ్వడంతో చైర్మన్గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఎన్నికల సమయంలో తమకు ఏడుగురు మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో మెంబర్ వెడ్మ బొజ్జు నిరసనకు దిగారు. దాంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికను రేపటి వాయిదా వేశారు ఎన్నికల అధికారులు. ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్ ఎన్నుకోవడానికి సరిపడ కోరం ఉన్న ఎన్నికను నిర్వహించకుండా అధికారులు ఎన్నికను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించిన కౌన్సిలర్లు. వారికి మద్దతుగా బైఠాయించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ జాన్సన్ నాయక్. కలెక్టర్ వచ్చి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను నిర్వహించాలి, లేదంటే ఇక్కడనే చస్తాం కానీ లేవమాని తేల్చి చెప్పారు కౌన్సిలర్లు. దాంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించిన బీజేపీ 8 వార్డ్ కౌన్సిలర్ బొప్పారావు సత్యవతి కళ్లుతిరిగి కిందపడిపోయారు. సాటి కౌన్సిలర్లు ఆమెకు నీళ్లు ముఖంపై కొట్టి మంచి నీళ్లు అందించారు. -
రెండు నెలల శిశువుకు అరుదైన గుండె శస్త్రచికిత్స
హైదరాబాద్, ఏప్రిల్ 4, 2026: రెండు నెలల శిశువుకు అరుదైన గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాధించారు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ శిశువు రెండు నెలల వయస్సులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె వైఫల్య లక్షణాలతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల్లో గుండెలో రంధ్రం ఉందని తేలింది. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. సుదీప్ వర్మ నిర్వహించిన ఎకోకార్డియోగ్రామ్లో ఏఆర్ సిఏపిఏ, అంటే సాధారణంగా గుండెకు శుభ్రమైన రక్తాన్ని అందించే రక్తనాళం (కొరోనరీ ఆర్టరీ) ఒక ప్రత్యేక మార్గం (ఏఓర్టా) నుంచి రావాలి. కానీ ఈ చిన్నారిలో అది తప్పుగా ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం (పల్మనరీ ఆర్టరీ) నుంచి వస్తోంది. తరువాత ఏఓర్టోగ్రామ్ ద్వారా దీనిని నిర్ధారించారు. అనంతరం చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సలో భాగంగా, రైట్ కొరోనరీ ఆర్టరీని పల్మనరీ ఆర్టరీ నుండి వేరు చేసి, ప్రత్యేక “హుడ్” టెక్నిక్ సహాయంతో ఏఓర్టాకు అనుసంధానం చేశారు. దీంతో గుండెకు సరైన ఆక్సిజన్తో కూడిన రక్త ప్రవాహం పునరుద్ధరించబడింది. శస్త్రచికిత్స అనంతరం రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు లో కావాల్సిన మందులు అందించామనీ, అపరేషన్ తరువాత శిశువును నీయోనేటల్ ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సపోర్ట్, ఇనోట్రోప్స్ సహాయం, అవసరమైన చోట పెరిటోనియల్ డయాలిసిస్ వంటి చికిత్సలు అందించారు.ఇంత చిన్న వయస్సు ఉన్న శిశువులపై గుండె శస్త్రచికిత్స చేయడం సవాలుతో కూడుకున్నదని. రక్తనాళాలు చాలా చిన్నగా ఉండటం, శరీర సామర్థ్యం పరిమితంగా ఉండటం, శస్త్రచికిత్స సమయంలో రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అంశాలు కష్టతరమనీ, కానీ అన్ని సవాళ్లను అధిగమిస్తూ ఈ శస్త్రచికిత్స విజయవంతమై, ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉండి నీయోనేటల్ ఐసీయూ నుండి డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో సీనియర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. అనిల్, కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డా. నాగరాజన్, డా. సి. అపర్ణ (క్లినికల్ డైరెక్టర్) నేతృత్వంలోని నీయోనటాలజీ బృందం డా. విశ్వనాథ్, డా. అమిత్, డా. ఇషిత, డా. రాజశేఖర్ పాల్గొన్నారు.ఏఆర్ సిఏపిఏ అనేది చాలా అరుదైన గుండె లోపం (సుమారు 0.25% కేసుల్లో మాత్రమే కనిపిస్తుంది). ఇది తీవ్రమైన సందర్భాల్లో ఆకస్మిక శిశు మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఈ ఘటన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె లోపాలను త్వరగా గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. ఆధునిక నీయోనటల్ కార్డియాక్ కేర్ సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని డా. అపర్ణ తెలిపారు. -
అబద్దాలు చెప్పడంలో రేవంత్కు ఆస్కార్: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్కు అబద్దాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై చర్యలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీలో అరాచకం చేశారు. అలా ఇక్కడ చేయవద్దు. నెమళ్లు, పక్షులు, ఉన్నాయి పర్యావరణాన్ని రక్షించాలి. డంప్ యార్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ప్రజలకు దూరంగా ఉన్న దగ్గర నిర్మించాలి. హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ గురించి సీఎంకు తెలిసే మాట్లాడాడు. ఓసారి డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని సీఎం పరిశీలించాలి లేదా నివేదిక తెప్పించుకోవాలి. లాఠీ దెబ్బలు అయినా తింటాం కానీ హుజురాబాద్లో డంప్ యార్డును అడ్డుకుంటాం.బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం. కేరళంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆరు గ్యారంటీలు తెలంగాణలో అమలు కావడం లేదు. నిరుద్యోగ భృతి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం లేదు. హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే సీఎం రాజీనామా చేయాలి. ఢిల్లీకి పోయి డబ్బు మూటలు స్పెషల్ ఫ్లైట్లలో ఇచ్చారు. కేరళ మీడియా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకోవాలి. ఆరు గ్యారంటీలపై చర్చకు సవాలు చేస్తున్నా.. నా సవాలుకు సీఎం సిద్ధమా?’ అని ప్రశ్నించారు. -
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
సాక్షి, ఇబ్రహీంపట్నం: తెలంగాణలో బీఆర్ఎస్కు మరో ఘన విజయం దక్కింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ శ్యామలను ఎన్నుకున్నారు. ఇక, చైర్మన్ ఎన్నిక ప్రక్రియను కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వాకౌట్ చేసింది.ఇక, అంతకుముందు.. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది. ఇదిలా ఉండగా.. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ మౌనిక ఎన్నికయ్యారు. ఇక్కడ వైఎస్ చెర్మెన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు. -
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్లో కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనకి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టారు.కాంగ్రెస్ నాయకులే క్యాంప్ ఆఫీస్పై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టాము.. కానీ దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు.ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందంటూ హరీష్రావు మండిపడ్డారు.‘‘ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు?’’ అంటూ హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్దే విజయం.. క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా
సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో బీఆర్ఎస్కు ఘన విజయం దక్కింది. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది.రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు.ఇక, క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎట్టకేలకు క్యాతనపల్లి మున్సిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పంతం నెగ్గించుకున్నారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా పొత్తు ధర్మంలో ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. -
20 గుంటల భూమిలో 8 స్తంభాలు.. నాగలి ఎలా తిరుగుతుంది?
జగిత్యాల జిల్లా: మల్లాపూర్కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8 విద్యుత్ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్కో ఏఈ వినీత్రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్ చేశారు. విద్యుత్శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు. https://t.co/DVI3Vih9iy pic.twitter.com/RxNNnb7QLj— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) April 4, 2026 -
‘బ్లాక్ కాఫీ డీజే నైట్’లో డ్రగ్స్
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొండాపూర్లో ఉన్న ‘క్వేక్ ఎరీనా పబ్’లో గురువారం అర్ధరాత్రి ఈగల్ బృందాలు దాడులు చేశాయి. అంతర్జాతీయ కళాకారుడితో ‘బ్లాక్ కాఫీ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్న ఎనిమిది మంది మాదకద్రవ్యాలు సేవించి చిక్కారు. వీరిపై గచ్చిబౌలి పోలీస్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈగల్ అధికారులకు అప్పగించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న స్పెయిన్ కళాకారులు అలెగ్జాండర్, క్వేక్ అరేనా పబ్ డీజే కేవీలకు నెగెటివ్ వచ్చినట్లు ఈగల్ శుక్రవారం ప్రకటించింది. గురువారం రాత్రి ప్రారంభమైన ‘బ్లాక్ కాఫీ’లో పాల్గొన్న కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్కు సమాచారం అందింది. దీంతో ఆ విభాగంలోని టాస్్కఫోర్స్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసుస్టేషన్, గచ్చిబౌలి పోలీసులతో కూడిన బృందాలు రాత్రి 12 గంటల ప్రాంతంలో దాడులు చేశారు. 64 మంది అనుమానితులను గుర్తించి వీరి లాలాజలం, మూత్రం నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా.. తొలుత నలుగురికి, ఆ తర్వాత మరో నలుగురిని పాజిటివ్ వచ్చింది. దీంతో వీళ్లు గంజాయి, మెతాంఫెటమైన్, బెంజోడియాజిపిన్ సేవించినట్లు గుర్తించారు. వీరిపై గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇందులో ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు బీఎన్ఎస్లోని సెక్షన్లను జోడించారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న మోనిష్ ఉమేష్ (వ్యాపారి), పృథి్వరాజ్ (కాంట్రాక్టర్), అభిషేక్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) రిషబ్ (వ్యాపారి), హరిత్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్), రితేష్ (మొబైల్ దుకాణం నిర్వాహకుడు), జ్యోతిరాదిత్య, ఆకెళ్ల హరిత సారంగ్లను ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి వారి రక్తనమూనాలను వైద్యుల ద్వారా సేకరించారు. కాగా.. ఈ కేసులో 8 మంది నిందితులు ఈగల్ ఎదుట స్వచ్ఛందంగా డ్రగ్స్ వినియోగాన్ని అంగీకరించారు. నిందితులకు గచి్చ»ౌలి పోలీసులు శుక్రవారం వారి తల్లిదండ్రులు/సంరక్షకుల్ని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరికి గతంలో డ్రగ్స్ తీసుకున్న చరిత్ర లేకపోవడంతో నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. డీ–అడక్షన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. -
‘మూడింతలు’.. ముప్పుతిప్పలు
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి మూడు నెలల ( ఏప్రిల్, మే, జూన్) ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ– పోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో కాలయాపన జరుగుతోంది. గతంలో కరోనా సంక్షోభ సమయంలో ఇదే తరహాలో మూడు నెలల బియ్యం పంపిణీ చేసినప్పుడు ప్రభుత్వం సాఫ్ట్వేర్లో మార్పులు చేసి ఒకే బయోమెట్రిక్ అథెంటికేషన్తో పంపిణీని సులభతరం చేసింది. ప్రస్తుతం పంపిణీలో సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రతి కార్డుదారు మూడు విడతల బియ్యం కోసం ఈ–పోస్ యంత్రంపై మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. వేయింగ్ మిషన్పైనా మూడుసార్లు తూకం వేయడం అనివార్యమైంది. ఒక్కొక్కరికి పది నిమిషాలు.. తప్పని నిరీక్షణ సాధారణంగా ఒక కార్డుదారుడికి రేషష్ పంపిణీ చేయడానికి రెండు నిమిషాల సమయం సరిపోతుంది. ప్రస్తుతం సాంకేతిక చిక్కులతో ఒక్కో కార్డుకు కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. వేలిముద్రలు పడకపోయినా, సర్వర్ నెమ్మదించినా ఈ సమయం మరింత పెరుగుతోంది. ఈ పోస్ యంత్రంతో అనుసంధానమైన వేయింగ్ మిషన్పై తూకం వేయడం తప్పనిసరి. మొదటి నెల కోటా తూకం పూర్తై రసీదు వచ్చాక, మళ్లీ రెండో నెల కోసం బయోమెట్రిక్ వేయాలి, ఆపై మళ్లీ తూకం వేయాలి. ఇలా మూడుసార్లు చేయాల్సి వస్తోంది. గడువు ఉన్నా రద్దీ ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఈ నెలలో మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేసినప్పటికీ లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ‘ముందు వెళ్తేనే బియ్యం దొరుకుతాయి.. లేదంటే స్టాక్ అయిపోతుంది’ అన్న భయం కార్డుదారులను తెల్లవారుజాము నుంచే రేషన్ షాపుల వద్ద క్యూ కట్టేలా చేస్తోంది. ఇప్పటికైనా∙సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేస్తే తప్ప ఈ రద్దీ తగ్గేలా కనిపించడం లేదని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటి వద్దే ఎఫ్ఐఆర్.. ఇదొక మంచి అడుగు!
నేరాలకు గురైన బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలంగాణ పోలీసులు ఇటీవల ప్రకటించారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ప్రాథమిక (నేర) సమాచార నివేదిక. నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా బాధితులు తెలిపిన సమాచారం: నేర వివరాలు, నేరస్థుడి పేరు, నేరం జరిగిన సమయం, తేదీ దీనిలో ఉంటాయి. కాబట్టి దీనిని ఎఫ్ఐఆర్ అంటారు. కానీ ఈ మాటను ఎక్కడా చట్టంలో నిర్వచించలేదు.ప్రతి పోలీస్ స్టేషన్కు కూడా భౌగోళిక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో జరిగిన నేరాలపై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని నేర పరి శోధన చేసే అధికారం ఉంటుంది. అయితే, 2012లో ఢిల్లీలో ‘నిర్భయ’ ఉదంతం తర వాత కేంద్ర ప్రభుత్వం నేర చట్టాలను బలోపేతం చేయడానికి నియమించిన ‘వర్మ కమిషన్’ ముఖ్య సూచనలు చేసింది. తీవ్ర మైన లేదా హేయమైన నేరాలు జరిగిన ప్రదేశం తమ పరిధిలో లేకున్నా బాధితులు ఇచ్చిన నేర సమాచారాన్ని ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలనీ, అందుకు అప్పుడు అమలులో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్–1973లో తగిన సవరణలను చేయాలనీ సిఫారసు చేసింది.తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, బాధితులు, ప్రత్యేకించి స్త్రీలు ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ వెతుకుతూ వెళ్లాల్సిన ఆగత్యం పట్టవద్దనేది ‘జీరో ఎఫ్ఐఆర్’ ముఖ్యోద్దేశం. ప్రతి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్పుడు దాని వివరాలను జనరల్ డైరీలో రాస్తూ, దానికి ఒక నంబర్ వేస్తారు. కానీ ‘జీరో ఎఫ్ఐఆర్’కు నంబర్ కేటాయించాల్సిన అవసరం లేదు. అందుకే దానిని ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటారు. దీన్ని నమోదు చేసిన తరువాత, నేరం జరిగిన ప్రదేశానికి సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆ నేర సమాచారాన్ని వెంటనే పంపించాలి. సంబంధిత పోలీస్ స్టేషన్, ఆ ఎఫ్ఐఆర్కు ఒక నంబర్ వేసి నియమాల ప్రకారం దర్యాఫ్తు చేయాలి.చదవండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్లైన్లో పెట్టలేరా?క్రిమినల్ ప్రొసీజర్ చట్టంలో ఇది భాగం కానందున, ఇది సరిగ్గా అమలు కాలేదు. అయితే ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత –2023’ లోని సెక్షన్ 173, తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు సమాచారాన్ని తీసుకోవడానికి అన్ని పోలీస్ స్టేషన్లకు చట్టబద్ధమైన అధికారాన్ని కల్పించింది. తెలంగాణ పోలీస్ శాఖ ఇంకొక అడుగు ముందుకు వేస్తూ, పోలీసులే బాధితుల ఇళ్లకు వెళ్ళి ఫిర్యాదు / నేరాన్ని నమోదు (Home Based FIR) చేయాలని నిర్ణయించింది. ఇది మంచి పరిణామం. ఈ ప్రక్రియ కూడా జీరో ఎఫ్ఐఆర్ కోవలోకే వస్తుంది.– కె. ఎస్. హరీష్ కుమార్విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
తెలంగాణపై కావ్య మారన్ చిన్న చూపు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని ఎస్ఆర్హెచ్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్ఆర్హెచ్ ప్రతినిధి నగేష్కు వినతిపత్రం సమర్పించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆరోన్ జార్జ్, అమన్రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్ఆర్హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్ఆర్హెచ్కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్ఆర్హెచ్ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్ ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి
నిజామాబాద్ రూరల్: ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు లేవని నిరూపించింది. శ్రీలంక అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన బొంత వెంకటేశ్ 2019లో దుబాయికి వెళ్లాడు. అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి వెంకటేశ్ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు తల్లితండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని వెంకటేశ్ శ్రీలంకకు వెళ్లి తారుషి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఇటు వెంకటేశ్ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. దీంతో తారుషి, ఆమె తల్లితండ్రులు సేనాదిపతిగే నిలంతి పెరీరా, గలాని గమగె జనక ప్రియదర్శన సిల్వా లింగి తండాకు పది రోజుల క్రితం చేరుకున్నారు. శుక్రవారం ఇరు కుటుంబాల సంతోషాల మధ్య హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వీరి వివాహానికి లింగి తండా వేదికగా మారనుంది. తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్ ‘సాక్షి’తో తెలిపారు. -
మేమేం పాపం చేశాం నాన్న..
కరీంనగర్ రూరల్: ఆడపిల్లలుగా పుట్టడమే ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కన్నతండ్రే కాలయముడుగా మారి కవల పిల్లలకు గడ్డిమందు తాగించి చంపి వ్యవసాయబావిలో పడేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కరీంనగర్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలంకు మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి కవల ఆడపిల్లలు గీతాన్శ్రీ, గీతాన్విక (4) ఉన్నారు. శ్రీశైలం ప్రస్తుతం సమీపంలోని ప్రతిమ ఆస్పత్రిలో పనిచేస్తుండగా మౌనిక వ్యవసాయ పనులకు వెళ్తోంది. కవల ఆడపిల్లలు పుట్టారని శ్రీశైలం భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. కుటుంబసభ్యులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి, భార్యాభర్తలకు సర్ది చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భార్యతో గొడవ పడిన శ్రీశైలం ఇద్దరు పిల్లలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి గడ్డిమందు తాగించి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. పిల్లల గురించి మౌనిక ప్రశ్నించడంతో ఇద్దర్ని చంపి బావిలో పడేశానని శ్రీశైలం చెప్పడంతో స్థానికులతో కలిసి బావి వద్దకు వెళ్లింది. సమాచారం అందుకున్న రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బావిలో దిగి గాలించగా పెద్ద పాప గీతాన్శ్రీ మృతదేహం లభించింది. పిల్లల్ని చంపారనే కోపంతో శ్రీశైలంపై స్థానికులు దాడి చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలించగా రాత్రి 8.30 గంటలకు గీతాన్విక మృతదేహం దొరికింది. -
బీరు తాగించించి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నం..!
హైదరాబాద్: మహిళా చెఫ్పై హెడ్ చెఫ్ లైంగిక దాడికి యత్నంచిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో చెఫ్గా పని చేస్తున్న మహిళ అనారోగ్యం కారణంగా ఇటీవల విధులకు వెళ్లడం లేదు. ఇదే హోటల్లో హెడ్ చెఫ్గా పని చేస్తున్న శ్యాం.. డ్యూటీకి సంబంధించిన మీటింగ్ ఉందని తన ఇంటికి రమ్మన్నాడు. గురువారం సాయంత్రం ఫిలిం నగర్లోని బీజేఆర్ నగర్లో ఉంటున్న శ్యాం ఇంటికి ఆమె వెళ్లింది. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన అతను.. బీరు, బ్రాందీ సీసాలు పట్టుకు వచ్చాడు. బీరు తాగాలని ఆమెను బలవంతం చేశాడు. తాగనంటూ ఆమె నిరాకరించినా.. బలవంతంగా తాగించి లైంగిక దాడికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు యత్నంచగా.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. పొత్తి కడుపుపై కాలితో తన్నాడు. ఆమెను నిర్బంధించి కొన్ని అసభ్యకరమైన వీడియోలు చూపించాడు. ఎట్టకేలకు తప్పించుకున్న బాధితురాలు నేరుగా వెళ్లి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ఆర్టీసీ మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. నగరంలో ప్రధాన బస్ టెర్మినల్గా ఉన్న మహాత్మాగాంధీ బస్స్టాండ్ (ఎంజీబీఎస్) స్థాయిలో దీనిని నిర్మించే యోచనలో ఉంది. అంతర్రాష్ట్ర బస్సు సర్విసులకు ఒక టెర్మినల్, సిటీ బస్సుల కోసం మరో టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం బస్ డిపో, బ్యాటరీ బస్సుల కోసం భారీ చార్జింగ్ సెంటర్.. ఇలా సమీకృత కేంద్రంగా ఇది రూపొందనుంది. దీని నిర్మాణానికి జీడిమెట్ల ప్రాంతంలో ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించింది. దశలవారీగా దీనిని అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ సమాయత్తమవుతోంది. రోడ్లపై బస్సులు ఆగకుండా.. కేపీహెచ్బీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొచ్ఛాయి. కొత్త కాలనీలు శరవేగంగా రూపొందుతున్నాయి. నిత్యం ఈ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో బస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లమీదనే ఆగుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో మెదక్ రీజియన్ నుంచి అంతర్రాష్ట్ర, రాష్ట్ర సర్విసులు వచ్చి రోడ్ల మీదనే ఆగుతున్నాయి.భవిష్యత్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నగరంలోకి వెళ్లకుండా ఇక్కడే నిలిచిపోయేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికీ చాలా బస్సులు పటాన్చెరు, బీహెచ్ఈఎల్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు నెలకొంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, బస్సులు రోడ్లమీద ఆగకుండా ప్రత్యేకంగా ఓ టెర్మినల్ నిర్మించి అందులోనే ఆగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 30 ఎకరాల్లో అంతర్రాష్ట్ర బస్సుల కోసం టెర్మినల్ నిర్మించనున్నారు. నైట్హాల్ట్ బస్సుల కోసం జగద్గిరిగుట్ట వద్ద దాదాపు 60 వరకు బస్సులు నైట్హాల్ట్లో ఉంటున్నాయి. వాటిని నిలిపేందుకు సరైన చోటు లేకపోవటంతో రోడ్ల మీదనే ఆపుతున్నారు. నైట్హాల్ట్ బస్సు సిబ్బంది పడుకునేందుకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీ సర్వీసులకు సిటీ టెర్మినల్ కూకట్పల్లి, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్, బాచుపల్లి, గండిమైసమ్మ, గాజులరామారం... ఇలా ఈ సమీపంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న వందల సంఖ్యలోని కాలనీలకు వెళ్లి వచ్చే సిటీ బస్సులకు కూడా టెర్మినల్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అంతర్రాష్ట్ర సర్వీసులతోపాటు సిటీ బస్సులకు కూడా ఇక్కడ సిటీ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించారు. 20 ఎకరాలలో సిటీ టెర్మినల్ నిర్మించనున్నారు. ఎలక్ట్రిక్ బస్సు డిపో భవిష్యత్లో నగరంలో ఆర్టీసీ సర్వీసులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద తెలంగాణ ఆరీ్టసీకి కేంద్రం 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరో ఆరు నెలల నుంచి ఏడాదిన్నర కాలంలో ఆ బస్సులు సమకూరనున్నాయి. వాటి కోసం ప్రస్తుతం ఉన్న డిపోలు కాకుండా కొత్తగా పది డిపోల వరకు నిర్మించాలని ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. ఇక్కడ భారీ డిపోను నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఆ డిపో ఉండనుంది. చార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలను ఛార్జ్ చేసేందుకు ఛార్జింగ్ స్టేషన్ అవసరం. ఇక్కడి డిపో బస్సులతోపాటు, అంతర్రాష్ట్ర బస్సులు, ఇతర బస్సులకు ఛార్జింగ్ వసతి కలి్పంచేలా ఇక్కడ 15 ఎకరాలలో ఛార్జింగ్ స్టేషన్ నిర్మించాలని భావిస్తున్నారు. మల్టీలెవల్ పార్కింగ్ యార్డ్ టెర్మినల్కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రానున్నందున ఇక్కడ ఓ మల్టీలెవల్ పార్కింగ్ యార్డు కూడా రూపొందనుంది. దాన్ని భూగర్భంలో నిర్మించే యోచనలో ఉన్నారు. -
ప్రేమ విఫలమైతే అది మోసం కాదు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని ప్రేమించి విఫలమైతే అది మోసపూరితం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మోసం చేయాలన్న ఉద్దేశం ఉందని సాక్ష్యం ఉంటేనే నేరంగా పరిగణించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. మోసపూరిత ఉద్దేశం లేనపుడు అది వాగ్దానం మాత్రమేనని గతంలో ఓ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ఈ కేసులోనూ ఐదేళ్లు ప్రేమలో ఉన్నారని, ఇది హామీలో విఫలం కావడమే తప్ప మోసం కాదంది.పిటిషనర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి పాటించలేదంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ రామగుండం జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడం నేరం కిందకు రాదని గతంలో ఇదే కోర్టు చెప్పిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి యువతిని ప్రేమకు ఒప్పించాడని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. -
పెట్రో, లిక్కర్... పన్నులు బేఫికర్
సాక్షి, హైదరాబాద్: పన్నుల వసూళ్లలో పెట్రోల్, మద్యం పోటీ పడుతున్నాయి. ఈ రెండు ఉత్పత్తుల అమ్మకాల కారణంగానే రాష్ట్ర ఖజానాకు రూ. 33,288 కోట్లు సమకూరాయని గణాంకాలు చెబుతున్నాయి. పెట్రోల్ అమ్మకాలపై విధించే వ్యాట్ ద్వారా రూ. 16,346 కోట్లు సమకూరగా, లిక్కర్పై రూ. 16,942 కోట్లు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన పన్ను వసూళ్లలో 42 శాతం పెట్రో, లిక్కర్ అమ్మకాలపై విధించిన వ్యాట్ ద్వారానే రావడం గమనార్హం. పన్నుల శాఖ గణాంకాల ప్రకారం 2025–26లో జీఎస్టీ, వ్యాట్, వృత్తి పన్ను రూపంలో ఖజానాకు రూ. 78,706 కోట్లు సమకూరాయి.అంతకుముందు ఏడాది కంటే అన్ని రకాల పన్ను వసూళ్లలో 5 శాతం వృద్ధి నమోదైంది. 2024–25లో అన్ని రకాల పన్నులు కలిపి రూ.75,129 కోట్లు వచ్చాయి. కాగా, 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 సెస్టెంబర్ 30 వరకు 1.2 శాతం ఎక్కువగా పన్ను వసూళ్లు రాగా, 2025 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు 8.1 శాతం వృద్ధి నమోదైంది.ఇక, జీఎస్టీ కేటగిరీలో గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా గత ఏడాది మార్చిలో జీఎస్టీ కింద రూ. 3,574 కోట్లు, పెట్రోల్పై వ్యాట్ ద్వారా రూ. 1,248 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,324 కోట్లు వసూలయ్యాయి. అదే ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ కింద రూ.4,230 కోట్లు, పెట్రోల్పై వ్యాట్ ద్వారా రూ. 1,221 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,437 కోట్లు వచ్చాయి. జీఎస్టీలో ఏకంగా 18 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. -
విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించిన తర్వాత సదరు విద్యార్థులకు వెనుక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మీదట అనేక ఏళ్లుగా కాలేజీలకు సర్కార్ నుంచి రూ.వేల కోట్లు బకాయి ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినా విడుదలలో విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.ఆయా కాలేజీల నిర్వహణ, కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఇతర చర్యలు ఈ పిటిషన్లలో ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇప్పటివరకు పేరుకుపోయిన రూ.వేల కోట్ల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీతోపాటు మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేశవ్ మెమోరియల్ సహా పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీతాలు ఇచ్చే పరిస్థితీ లేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా 2008, 2009లో రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నిషేధం తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు రూ.1,500 కోట్ల ట్యూషన్ ఫీజు బకాయిలను విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తాలు రావాల్సి ఉంటే కోర్టులు అతన్ని డిఫాల్టర్గా పేర్కొని, శిక్షించేవన్నారు.చెల్లింపులపై టోకెన్లు జారీ చేసి ఐదేళ్లయినా విడుదల చేయడం లేదన్నారు. ఒక్క కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకే రూ.56 కోట్లు బకాయి ఉందని తెలిపారు. 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు బడ్జెట్ ఆమోదం ఉందని, అనుమతి పొందిన తర్వాత చెల్లించకపోవడం సబబుకాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజీలు ఆర్థికంగా కుదేలయ్యాయని, బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరాయన్నారు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకూ ఆదాయాన్ని సమకూర్చుకోలేక పోతున్నాయని, బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరారు. బకాయిలు మరింతగా పేరుకుపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.నిర్వహణ కష్టంగా మారడంతో...పిటిషనర్లు సమరి్పంచిన గణాంకాలు సరైనవి కావని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున టోకెన్లు జారీ చేసిన మొత్తాల చెల్లింపునకు సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూ ర్తి.. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. -
కుటుంబ కలహాలతో సర్పంచ్ ఆత్మహత్య
కడెం: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగింది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్కు చెందిన లహరిక (31), మాసా యిపేటకు చెందిన ఆర్ఎంపీ రాజేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలో గతేడాది డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ కావడంతో రాజేశ్ లహరికను సర్పంచ్గా నిలబెట్టగా విజయం సాధించింది. అయితే వారి ఇంట్లో గొడవలు మాత్రం సద్దుమణ గలేదు.దీంతో లహరిక ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇంతలో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలు నిర్వ హించాలని నిర్ణయించింది. దీంతో రాజేశ్ నర్సా పూర్కు వెళ్లి లహరికను ఈనెల 1న తీసుకు వచ్చా డు. గురువారం గ్రామ సభలో సర్పంచ్ లహరిక పాల్గొన్నారు. అయితే శుక్రవారం ఉద యం తన ఏడేళ్ల కొడుకు ప్రజ్వల్ను తీసుకుని గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. అనంతరం ఇంటికి చేరు కున్నారు. ఇంతలో ప్రజ్వల్ తన తండ్రికి ఫోన్చేసి విషయం చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన రాజేశ్ లహరికను ఖానాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. -
‘రిజిస్ట్రేషన్’లో నయాదందా
సాక్షిప్రతినిధి, వరంగల్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలపర్వం కొనసాగుతూనే ఉంది. వరంగల్లో ట్రెండ్ మార్చిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఏకంగా వాట్సాప్ కాల్, చాటింగ్ల ద్వారా కథ నడిపించిన వైనం ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ వెంచర్లు, ప్రభుత్వ, అసైన్డు భూములు.. ఇలా ఒక్కో భూమి రిజిస్ట్రేషన్కు ఒక్కోరేటు మాట్లాడుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల మేరకు గురు, శుక్రవారం ఏసీబీ చేపట్టిన తనిఖీలతో గుట్టురట్టయ్యింది. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మొదట వడ్డెపల్లిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్ 1, 2 చాంబర్లలో తనిఖీలు చేశారు.సోదాల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు/డాక్యుమెంట్ రైటర్లు ఉండగా, లెక్కకు చూపని రూ.47,450 నగదుతో పాటు 70 నమోదుకాని పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా సబ్ రిజిస్ట్రార్–1 జమాలపురం రామనరసింహారావు, సబ్ రిజిస్ట్రార్–2 దావులూరి ఆనంద్ల మధ్య జరిగిన అనేక వాట్సాప్ చాట్లు బయటపడ్డాయి.గత సంవత్సర కాలంలో పత్రాలు రాసిన వారితో సుమారు రూ.42,03,125ల విలువైన ఫోన్పే లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఏకకాలంలో సబ్రిజిస్ట్రార్ల ఇళ్లలో సోదాలు జరిపినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా సబ్రిజిస్ట్రార్ దావులూరి ఆనంద్ నుంచి రూ.24,61,540ల నికర నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్లో రూ.30,10,000లు విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు స్వా«దీనం చేసుకున్నారు. -
ఐస్క్రీం బండి..రావొద్దండి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో తోపుడు బండ్లపై ఐస్క్రీం అమ్మితే నేరమే అని పంచాయతీ పాలకవర్గాలు అంటున్నాయి. ఈ మేరకు వరుస తీర్మానాలు కూడా చేస్తున్నాయి. తమ ఆదేశాలను కాదని ఐస్క్రీంలు విక్రయిస్తే బండ్ల నిర్వాహకుల వద్ద రూ.5 వేలు జరిమానా వసూలు చేస్తామని పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా తమ పిల్లల ఆరోగ్యం కోసమేనని పంచాయతీ పాలకవర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లోకి ఐస్క్రీం బండ్లకు అనుమతి లేదంటూ గ్రామ పంచాయతీలు వరుసగా తీర్మానాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ⇒ తాజాగా డిచ్పల్లి మండలం సుద్దపల్లి, మాక్లూర్ మండలం మందాపూర్, డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, అన్నారం, నూత్పల్లి, తొండాకూర్ గ్రామాలు కూడా అదే బాటలో నడిచాయి. ఐస్క్రీం తినడం వల్ల పిల్లలకు తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు, వాటిలో కలిపే రంగులు, రసాయనాల వల్ల భవిష్యత్లో కేన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామ సభలు నిర్వహించి మరీ తమ గ్రామంలోకి ఐస్క్రీం బండ్లు నిషేధిస్తూ.. తీర్మానాలు చేస్తున్నారు. ⇒ నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్, అయిలాపుర్, చింరాజ్పల్లి, వెల్మల్, తొండాకూర్, గాదేపల్లి ఆర్మూర్ మండలంలో పిప్రి, ఆర్మూర్, ముప్కాల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో తోపుడు బండ్లపై ఐస్క్రీం అమ్మకాలను నిషేధిస్తూ జీపీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని పంచాయతీ పాలకవర్గాలు గ్రామ ముఖద్వారం వద్ద, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బోర్డులు (ఫ్లెక్సీలు) ఏర్పాటు చేశాయి. ఏప్రిల్ 2 నుంచి నిషేధం.. గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ఏప్రిల్ 2వతేదీ నుంచి సుద్దపల్లిలో ఐస్క్రీం తోపుడు బండ్లను నిషేధించాం. గ్రామసభ లో పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామ ముఖద్వారంతో పాటు అన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. ఈ తీర్మానాన్ని కాదని ఎవరైనా ఐస్క్రీం విక్రయిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తాం. – పానుగంటి రూప, సర్పంచ్ సుద్దపల్లిపిల్లల ఆరోగ్యం కోసమే.. తోపుడు బండ్లపై అమ్మే ఐస్క్రీంలు తినడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఐస్క్రీంలో కలిపే రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గమనించి గ్రామసభలో ఐస్క్రీం తోపుడు బండ్లు గ్రామంలోకి రావద్దని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. దీనికి వీడీసీతో పాటు గ్రామ యువత, గ్రామస్తులు సంపూర్ణ మద్దతు తెలిపారు. – వినోద్రెడ్డి.. సుద్దపల్లి గ్రామస్తుడుమనం చాక్లెట్ అంటే పడి చావడం లేదు!!చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఎంత ఇష్టమన్నదే ఇక్కడ పాయింట్. యూరప్, యూఎస్లో చాక్లెట్ అంటే పడి చస్తుంటే.. ఆసియాలో మాత్రం చాక్లెట్ కన్నా.. స్థానిక మిఠాయిలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో జర్మనీ వాసులు అత్యధికంగా చాక్లెట్ను తింటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి 8.1 కిలోల చాక్లెట్ను తింటున్నాడట. తర్వాతి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. చివరి స్థానాల్లో భారత్, చైనాలు ఉన్నాయి. ఓసారి ఆ లెక్కలేంటో చూసేద్దామా.. -
బడి సేవలు సులభతరం!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల సేవలు సులభతరం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సేవలను ఆన్లైన్ పద్ధతిలో అందించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో అందే సర్విసులను ఇకపై ఆన్లైన్ ఆధారితంగా అందించనుంది. ప్రస్తు తం పాఠశాలల్లో ట్రాన్స్ఫర్ సర్టీఫికెట్ (టీసీ), బోనఫైడ్, విద్యార్థి వివరాల్లో సవరణలు, పదోతరగతిలో వివరాల అప్డేషన్ తదితర సర్వీసులు అందుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు సదరు పాఠశాలలో నేరుగా సంప్రదించాల్సి వస్తోంది.ఈ క్రమంలో పాఠశాల హెచ్ఎంలు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాలతో సేవలు పొందడంలో ఆలస్యమవుతోంది. ఇకపై జాప్యానికి అవకాశం లేకుండా పాఠశాల విద్యాశాఖ నేరుగా ఆన్లైన్లోనే ఈ సర్విసు లు అందించాలని భావిస్తోంది. దీంతో ఈ సర్విసులను పారదర్శకతతోపాటు నిర్దిష్ట సమయంలో అందించడం, డిజిటల్ పద్ధతిలో రికార్డుల నిర్వహణకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. మీసేవ కేంద్రాలతో లింకు : విద్యార్థులకు డూప్లికేట్ మెమోలు జారీ చేసేందుకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(బీఎస్ఈ) ఇప్పటికే ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సర్విసు ప్రయోగ దశలో ఉంది. గతంలో డూప్లికేట్ మెమో కావాలనుకుంటే విద్యార్థులు నేరుగా బోర్డు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. దరఖాస్తు చేసుకోవడం ఒక ఎత్తయితే... సర్టీఫికెట్ పొందేందుకు పట్టే సమయం...అందుకు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడం..చివరకు పాఠశాలకు వచ్చే వరకు సుదీర్ఘ సమయం పట్టేది. ఇకపై అలాంటి ఆలస్యం లేకుండా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పాఠశాల సర్విసులు కూడా ఆన్లైన్లో అందించే ఆలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది.అయితే ఈ సేవలను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయనుంది. ట్రాన్స్ఫర్ సర్టీఫికెట్ లేదా బోనఫైడ్ ఇతర పాఠశాల సేవలు పొందాలనుకుంటే ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు నేరుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుతుంది. ఆ వినతికి అనుగుణంగా సదరు మండల విద్యాధికారి/పాఠశాల ప్రిన్సిపల్ లాగిన్లో ప్రత్యక్షమవుతుంది. అక్కడి నుంచి ధ్రువీకరణ అందిన వెంటనే మీసేవ కేంద్రంలో సర్టీఫికెట్ ప్రత్యక్షమవుతుంది. ఏటా విద్యార్థుల వివరాలు అపార్లో అప్డేట్ అవుతుంటాయి. అపార్ వివరాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తుండగా, అతి త్వరలో సీఎం అనుమతి తీసుకున్న తర్వాత ఈ సేవలను అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. -
ఆరు గ్యారంటీలేవీ?
నారాయణపేట: ‘ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతున్నాయి. పిల్లలు పుడితే గానీ కల్యాణలక్ష్మి రావడం లేదు. ‘పాలమూరు బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కావు. నీ సొంత నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేపట్టావా.. కొడంగల్కు రా చర్చించుకుందాం’అంటూ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకా మసంద్ బావాజీని శుక్రవారం ఆయన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని ఎక్కామెడ్ శివారులో మీడియాతో మాట్లాడారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తే ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని చెప్పారన్నారు. ఇప్పటికే రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టావని, వడ్లకు బోనస్ రెండుసార్లు ఇవ్వలేదని.. కూట్లో రాయి తీయనోడు.. ఏట్లే రాళ్లు తీశాడంటా అన్నట్టుంది నీ పరిస్థితి అంటూ రేవంత్రెడ్డిపై సెటైర్లు వేశారు. ‘మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లారు.. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్లీ కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. రేవంత్.. నీది ఐరన్ లెగ్ అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం’అంటూ హరీశ్రావు ఎద్దేవా చేశారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1.83 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు చేపడితే, మిగిలిన 30 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు. మూడవ ఫేజ్లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకంలోని కాల్వలను తవి్వతే కొడంగల్కు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.90 శాతం పనులు పూర్తి చేసిన పాలమూరును పక్కనపెట్టి కమీషన్ల కోసం రూ.4,500 కోట్లతో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అందాల పోటీలు, ఫుట్బాల్ షో అంటూ వేల కోట్లు ఖర్చు చేశావు గానీ.. లంబాడ సోదరులకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పాల్గొన్నారు. -
గ్రీన్ టెక్స్టైల్ హబ్లు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ టెక్స్టైల్ హబ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. యువత, మహిళలను లక్ష్యంగా చేసుకొని సంప్రదాయ వస్త్రోత్పత్తికి ఆధునికతను జోడించి డిజైన్, కుట్టు పని తదితరాల్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ప్రపంచానికి ఔషధాలు, వ్యాక్సి న్లు అందిస్తున్న తెలంగాణలో తయారయ్యే దుస్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ధరించేలా వస్త్ర పరిశ్రమను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో శుక్రవారం ‘ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్– 2026’(ఎటెక్స్కాన్)ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సాంప్రదాయాల కలబోతగా తెలంగాణ వస్త్ర పరిశ్రమ నిలుస్తోంది. మన జీవన విధానంలో వస్త్ర పరిశ్రమ అంతర్భాగంగా ఉంది. నిజాం కాలంలోనే ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్కు వచ్చే వ్యాపారులు ముత్యాలు, వస్త్రాలు కొనుగోలు చేసేవారు. పోచంపల్లి ఇక్కత్ మొదలుగద్వాల చీరలు, వరంగల్ డర్రీలు, నారాయణపేట చేనేత వరకు అనేక రకాలైన వ్రస్తోత్పత్తుల్లో తెలంగాణకు ఎంతో పేరు ఉంది’అని సీఎం పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి నాణ్యతలో అగ్రగామి ‘భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఉత్పత్తి, నాణ్యతలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంది. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రపంచస్థాయిలో పేరొందిన సంస్థలు దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. నైపుణ్యం, సంకల్పం, అత్యుత్తమ మానవ వనరులు, ప్రపంచానికి సరితూగే విధానాలతోపాటు వస్త్ర పరిశ్రమపై తెలంగాణకు దూరదృష్టి కూడా ఉంది. తెలంగాణ పత్తి చేల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం కలిసి పనిచేస్తున్నాం.హైదరాబాద్ భారతదేశానికి మాత్రమే కాదు..ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతూ హాలీవుడ్ స్థాయికి చేరింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్ను తమ నిర్మాణ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి. సినిమా రంగం ద్వారా కూడా ఫ్యాషన్ రంగాన్ని ప్రోత్సహిస్తాం. పెట్టుబడులతో వచ్చే వారికి మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ఇతర ప్రోత్సాహకాలతోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తాం. ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయిలో తెలంగాణలో వ్రస్తోత్పత్తి పరిశ్రమ వాతావరణాన్ని నిర్మిద్దాం’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. నేతన్నకు అందించే సామాజిక న్యాయం : శ్రీధర్బాబు ప్రభుత్వం దృష్టిలో వస్త్రోత్పత్తి అంటే అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే సామాజిక న్యాయమని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం చరఖా, మగ్గం ద్వారా కూడా వస్తుందని మహాత్మాగాంధీ నిరూపించారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో నేతన్నలు కూలీగానే మిగిలిపోకుండా యజమానిగా ఎదగాలనే సంకల్పంతో నేత కార్మికులను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాం. ఆధునిక సాంకేతికతతో మేడిన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు ‘న్యూ స్వదేశీ విజన్’కు శ్రీకారం చుడుతున్నాం. డిజిటల్ డిజైన్లు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ద్వారా తెలంగాణ నేతన్నల నైపుణ్యాన్ని మిలాన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైకి చేర్చాలని లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం’అని శ్రీధర్బాబు ప్రకటించారు. వేలాది కుటుంబాలకు జీవనాధారం : మంత్రి తుమ్మల ‘తెలంగాణలో టెక్స్టైల్ రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. వేలాది కుటుంబాల జీవనాధారం. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. చేనేత రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వం టెక్స్టైల్ రంగాన్ని కేవలం ఆర్థిక ప్రగతిగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోంది. ‘తెలంగాణ విజన్ 2047’లో టెక్స్టైల్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాం. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది’అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. – ఎటెక్స్ కాన్ 2026లో భాగంగా ‘రీమేజినింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్టైల్స్’పై రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ విడుదల చేశారు. సదస్సులో టెక్స్టైల్ రంగంలోని తాజా ధోరణులు, సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలపై పలు సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, శశాంక, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. -
కసాయి తండ్రి.. ఐదేళ్ల కవల కూతుళ్ల ప్రాణం తీశాడు..
సాక్షి, కరీంనగర్ : రూరల్ మండలం జూబ్లీనగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు కుమార్తెలను హత్య చేసి బావిలో పడేశాడు.పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం శ్రీశైలం తన భార్యతో గొడవపడ్డాడు. కోపోద్రికుడైన అతడు ఐదేళ్ల కవల కూతుళ్లకు గడ్డి మందు తాగించి అనంతరం బావిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక కూతురు మృతదేహం లభించగా, మరో కూతురు కోసం గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు శ్రీశైలంపై దాడి చేశారు. భార్యతో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్ : డ్రోన్ పైలట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 'దివ్యాంగులు, వృద్ధులు ,ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ' (EPwD), ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ శిక్షణా కార్యక్రమాలలో డ్రోన్ పైలట్ శిక్షణ, హోటల్ నిర్వహణ విభాగం కింద క్యాంటీన్ చెఫ్ శిక్షణ , కారు డ్రైవింగ్ నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు (04.04.2026) ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న NITHM ప్రాంగణంలో జరగనుంది.ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల గౌరవ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం
సాక్షి,నిర్మల్: విధి ఆడిన వింత నాటకంలో సర్పంచ్ లహరిక మృతి చెందారు. నిర్మల్ జిల్లా మాసాయిపేట సర్పంచ్ లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. లహరికను తీసుకెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది.ప్రమాదంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు లహరికను మరో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.ఈ విధంగా వరుస సంఘటనలు విషాదాంతానికి దారితీశాయి. ఆత్మహత్య ప్రయత్నం, రోడ్డు ప్రమాదం, ఆసుపత్రి చికిత్స.. వరుస సంఘటనలు చివరికి విషాదాంతానికి దారితీశాయి. మాసాయిపేట సర్పంచ్ లహరిక మృతి నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశమైంది -
ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!
సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్ కమెడియన్ను గుర్తు చేసుకుంటున్నారు. -
‘తెలంగాణలో బీజేపీకి స్థానంలో లేదు’
మంచిర్యాల: తెలంగాణాలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికలొస్తే దేవుళ్ల పేరు చెప్పడం బీజేపీకి అలవాటని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్పై కూడా మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్లో కేసీఆర్, హరీష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నారు. కవిత వేరుకుంపటితో బీఆర్ఎస్ రోడ్డున పడిందన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితమయ్యారన్నారు. ‘ బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసుల పాలయ్యారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ రోజు మేము పదవుల్లో ఉన్నామంటే అది కార్యకర్తల కష్టమే. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. కేసీఆర్ శృతి లేని పాలన చేసిండు. వారి హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ. 6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం . తెలంగాణాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సిట్లకు పైగా గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. -
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల పోలీసుల విభాగం ఉక్కుపాదం మోపుతుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు.. మామిడి పండ్ల రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జరాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా..‘వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను… pic.twitter.com/yOYzQFmVMG— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 3, 2026ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాను. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వండి’ అని పోస్టు చేశారు. -
నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)
-
కేజీకి రూ.44 మార్జిన్ ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో చికెన్ ధరలు పెరిగినా, తగ్గినా దుకాణదారులకు ఇచ్చే మార్జిన్ (లాభం)లో ఎలాంటి కోతలు విధించలేదని బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ (బీఐసీసీ) ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పౌల్ట్రీ రంగం ఇతర వ్యాపారాలకు భిన్నంగా ఉంటుంది. భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటిగ్రేటర్, రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. రిటైల్ దుకాణదారు ఎప్పుడూ నష్టపోడు. తనకు కేటాయించిన కచ్చితమైన మార్జిన్ స్థిరంగా ఉంటుంది.ప్రస్తుతం రాష్ర్టంలో కిలో చికెన్కు రూ.44 మార్జిన్ అందిస్తున్నాం. పౌల్ట్రీ యాజమాన్యాలు గత ఐదేళ్ల కాలంలో మూడేళ్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 2022–23 లో కిలోకి రూ.7.96 నష్టం వచ్చింది. మొత్తం పది కోట్ల కిలోలు విక్రయించాం. అప్పులను భరించి బ్యాంకు రుణాలతో నడిపిస్తున్నాం. 2024–25లో కిలోకు రూ.6.53 నష్టం వచ్చింది. 2023–24లో కేజీకి 64 పైసలు, 2025–26లో రూ.1.60 లాభాలు వచ్చాయి.కార్పొరేట్ సంస్థలు అన్యాయం చేస్తున్నాయంటున్న రిటైల్ వ్యాపారులు ఒక్కసారి ఆలోచించాలి. సంస్థలు ఎలా ఉన్నా హోల్సేల్, రిటైలర్కిచ్చే మార్జిన్ (ఫిక్స్డ్ ప్రాఫిట్)లో ఎలాంటి తేడాలు చూపించలేదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా చూశాం’అని చెప్పారు. ఈ సమావేశంలో స్నేహా ఫామ్స్ ఎండీ రామిరెడ్డి, వీహెచ్ఎల్ జీఎం బాలసుబ్రహ్మణియన్, ఎస్ఆర్ పౌల్ట్రీ ఎండీ శ్రీనివాస్, వెన్కాబ్ ఏజీఎం రాజిరెడ్డి పాల్గొన్నారు. -
ఇసుక నుంచి తైలం తీశారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ఇసుక విక్రయాల్లో చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ రూ.1008 కోట్ల ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో (2024–25) పోలిస్తే ఇది 36 శాతం వృద్ధి కావడం విశేషం.ఇసుక నిర్వహణలో పారదర్శకత, కఠినమైన అమలు చర్యలు, సాంకేతిక వినియోగం వంటి చర్యలు అధిక ఆదాయానికి ప్రధాన కారణాలుగా సంస్థ వెల్లడించింది.జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ, అక్రమ రవాణా నియంత్రణకు బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం పెరిగినట్లు టీజీఎండీసీ తెలిపింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను సంవత్సరమంతా అందుబాటులో ఉంచి, వినియోగదారులకు సమాన అవకాశాలు కలి్పంచడం జరిగిందని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి. -
మూసీ ప్రాజెక్టుకు 'గ్రీన్' సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. మూసీ సుందరీకరణపై సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కార్తీక్రెడ్డి గత నెల ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీనిపై జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, టెక్నికల్ సభ్యుడు డాక్టర్ ప్రశాంత్ గార్గవ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు ఇలా..: పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జి.రాజగోపాలన్ వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సరైన పర్యావరణ అనుమతి పొందకుండానే నిర్మాణ కార్యకలాపాలు చేపడుతోంది. అందువల్ల తదుపరి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టకుండా నిరోధించాలి. ఇప్పటికే చేపట్టిన కార్యకలాపాలపై జరిమానా విధించాలి..’అని కోరారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు విన్పించారు. ‘పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాం. సుందరీకరణకు సంబంధించి చేపట్టిన కార్యకలాపాలన్నీ చట్టపరమైన అనుమతులు, దీనికి సంబంధించిన విధివిధానాలు తెలిపే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు అనుగుణంగానే ఉన్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టును ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. కల్పిత ఆధారాలు, దరఖాస్తులతో బెంచ్ను కూడా రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు..’అని వాదించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీనాథ్ శ్రీదేవన్ వాదిస్తూ.. ఈ దశలో పిటిషన్ వేయడం చెల్లదంటూ కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పక్షాల వాదనల అనంతరం..ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ ఎన్జీటీ బెంచ్ తీర్పు వెలువరించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్ర పర్యావరణ మదింపు అథారిటీ జారీ చేసిన విధివిధానాల పత్రంలో ఇప్పటికే ఉన్నాయని పేర్కొంది. పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని, కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ దశలో దీనిపై విచారణ చేపట్టలేమంటూ పిటిషన్ను కొట్టివేసింది. -
నమ్మితే నెట్టేట మునిగినట్టే..
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు సర్వం చాట్బాట్ మయమైపోతోంది. వంట మొదలు ఆదాయపు పన్ను మదింపు వరకు... సాధారణ అనారోగ్య సమస్యలు మొదలు వివిధ స్పెషలైజ్డ్ రంగాల్లోనూ దీనిపై ఆధారపడుతున్నారు. రోజువారీ పనుల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నా... అది ఇచ్చే సమాచారం కచి్చతత్వం, డేటా గోప్యత, జవాబుదారీతనం విషయంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వంటకాల విషయంలో చాట్బాట్లు భోజన ప్రణాళికలను రూపొందించగలవు, తగిన వంటకాలను సూచించగలవు. అయితే రుచిని లేదా ఆకృతిని అంచనా వేయలేదు.వంటల్లో కొలతలు తప్పుగా ఉండొచ్చు, ఆహార సంప్రదాయాలను విస్మరించవచ్చు. ఆలోచనల రూపకల్పనకు ఇది సురక్షితమే కానీ సమస్యల నివారణకు ఇచ్చే సూచనలను తరచుగా సమీక్షించాల్సి ఉంటుంది’అని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను మదింపు, హెల్త్ ఇష్యూస్ వంటి వాటిలో దీనిపై అతిగా లేదా పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రతి 8 మంది టీనేజర్లు/యువకుల్లో ఒకరు సలహా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ, హార్వర్డ్ అధ్యయనం ప్రకారం... అన్ని రంగాల్లో చాట్బాట్లపై ఆధారపడటం పెరిగింది.ఆరోగ్య విషయంలో... చాట్బాట్లు తప్పుడు లేదా హానికరమైన వైద్య సలహాలను ఇవ్వగలవని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనల వంటి సంక్షోభాలకు సరైన ప్రతిస్పందనలను అందించడంలో విఫలమౌతాయని చెప్పాయి. ⇒ వైద్య సంబంధిత ప్రశ్నలకు అనేక చాట్బాట్ ప్రతిస్పందనల్లో తప్పుడు సమాచారం ఉంటోంది. ⇒ ఆరోగ్య సలహాల కోసం ఏఐని ఉపయోగించడం ప్రమాదకరం. ⇒ తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వైద్య సహాయం పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ⇒ వైద్యుల మాదిరిగా ఏఐ శారీరక పరీక్షలు చేయలేదు. అలాగే వినియోగదారుడి పూర్తి వైద్య చరిత్రను అర్థం చేసుకోలేదు. సందర్భం తెలియకపోవడం వల్ల తప్పుడు రోగ నిర్ధారణలు జరుగుతాయి. ⇒ మానసిక ఆరోగ్యం కోసం చాట్బాట్లపై ఆధారపడితే వృత్తిపరమైన సంరక్షణ విషయంలో చిక్కులు ఎదుర్కునే ప్రమాదముంది. ⇒ హానికరమైన సలహాలను ఇచి్చన తర్వాత, యూఎస్ నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ (నెడా) తమ చాట్బాట్ ’టెస్సా’ను తొలగించింది. పన్ను మదింపు విషయంలో.. ⇒ ఏఐ పాత పన్ను చట్టాలనుఉపయోగించవచ్చు. వ్యూహాత్మక ప్రణాళికను అందించలేకపోవచ్చు. కచ్చితత్వ సమస్యలెదురుకావొచ్చు. ⇒ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులకు బాధ్యత వహించాలి. ఏఐ ప్లాట్ఫారమ్లు తరచుగా తమ సమాధానాలు అధికారిక సలహా కాదని పేర్కొంటాయి. ⇒ డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుంది. వివిధ అధ్యయనాల్లో సిఫార్సులు ⇒ అత్యంత కీలకమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ మానవ నిపుణులను సంప్రదించాలి. ⇒ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని చాట్బాట్లతో పంచుకోవద్దు. వ్యక్తిగత డేటాను సంరక్షించుకోవాలి. ⇒ సాధారణ మేధోమథనం కోసం ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా అంశానికి సంబంధించి ప్రాథమిక, ప్రారంభ సమాచారంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. -
ఏ పేదోడూ ఆఫీసుల చుట్టూ తిరగొద్దు
ఆమనగల్లు: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే సమీకృత భూభారతి పోర్టల్ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామంలో గురువారం సమీకృత భూభారతి పోర్టల్ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను దోచుకున్నారని, వారు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.వారి భూ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఐదు మండలాలలో సమీకృత భూభారతి పోర్టల్ను గురువారం నుంచి అమలు చేస్తున్నామని, 45 రోజుల పాటు పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులతో జిల్లాకు ఒక మండలంలో పోర్టల్ను అమలు చేస్తామని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఏ పేదోడు ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఏ అధికారి దగ్గరకు వెళ్లి ప్రాధేయపడాల్సిన అవసరం ఉండకూడదని తెలిపారు. స్మార్ట్ఫోన్తో పోర్టల్లో లాగిన్ అయితే అన్ని సేవలు పొందొచ్చని వివరించారు.రాష్ట్రంలో ఉన్న సాదా బైనామాలకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. రాష్ట్రంలో సర్వేయర్ల కొరత లేకుండా 5,300 మందికి రెండు విడతల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి మండలానికి 4 నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించామని తెలిపారు. భూముల సర్వే విషయంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి రోవర్లతో కచ్చితమైన సర్వే చేయిస్తున్నామని, ఇప్పటికే 411 రోవర్లు ఉన్నాయని మరో 400 రోవర్లు రాబోతున్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత, డీఏఓ ఉషారాణి, డీఈఓ సుశీందర్రావు, డీఎంహెచ్ఓ డా.లలితాదేవి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ ఫయీం ఖాద్రి, మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్, టీపీసీసీ నేతలు బాలాజీసింగ్, అయిల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
గ్రూప్–1 నియామకాలకు సుప్రీం గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన 563 గ్రూప్–1 పోస్టుల నియామకాలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఈ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్–1 నియామకాలకు ఆమోదం తెలుపుతూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం తుది తీర్పును వెలువరించింది.గ్రూప్–1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పి. ఆదిత్య తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. నియామక ప్రక్రియలో కమిషన్ అనుసరించిన విధానాలను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియామకాలను సమరి్థంచిందని.. ఆ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ పిటిషన్లను కొట్టేసింది. పారదర్శకంగా ’ట్రిపుల్ ఎవాల్యుయేషన్’ విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియలో కమిషన్ అత్యంత పారదర్శకత పాటించిందని కోర్టుకు వివరించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అత్యంత శాస్త్రీయమైన ‘ట్రిపుల్ ఎవాల్యుయేషన్’(మూడంచెల మూల్యాంకనం) విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు.మూల్యాంకనకర్తలు మా ర్కులు వేసేటప్పుడు ఉండే వ్యత్యాసాలను (కొందరు కఠినంగా, మరికొందరు ఉదారంగా వేయడం) తగ్గించి, అభ్యర్థులకు న్యా యం చేసేందుకే ఈ పద్ధతిని అమలు చేశామన్నారు. మొదటి రెండు విడతల్లో బార్కోడ్విధానం పాటించామని.. మూడో విడ తలో మూల్యాంకనకర్తకు అభ్యర్థి వివరాలు తెలియకుండా ఉండేందుకు, గోప్యతను కాపాడేందుకు మాత్రమే బార్కోడ్ వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వెబ్నోట్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. నిలబడని పిటిషనర్ల వాదనలు మూడో విడత మూల్యాంకనంలో బార్కోడింగ్ లేకపోవడం వల్లే అక్రమాలకు ఆస్కా రం ఏర్పడిందని.. సుమారు 924 మంది అభ్యర్థుల ఎంపికలో వ్యత్యాసాలు ఉన్నాయ ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. జవాబుల ‘కీ’లోనూ లోపాలు ఉన్నా యని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల సందర్భంగా మూల్యాంకన విధానం, బార్కోడింగ్ మినహాయింపు తదితర సాంకేతిక అంశాలపై కమిషన్ను ప్రశ్నించిన ధర్మాసనం.. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. కమిషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయ స్థానం.. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకున్న అనంతరం పిటిషన్లను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. -
గ్రామ సభలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు విజయవంతంగా నిర్వహించారు. 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపాలిటీల్లో ఈ సభలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామసభలో సీఎస్ కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.పలుచోట్ల జరిగిన గ్రామసభల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్లో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ పాల్గొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు ఈ సభల్లో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకా లపై ప్రజలకు అవగాహన కలి్పంచారు. -
నమ్మితే 'నెట్టేట' మునిగినట్టే..
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు సర్వం చాట్బాట్ మయమైపోతోంది. వంట మొదలు ఆదాయపు పన్ను మదింపు వరకు... సాధారణ అనారోగ్య సమస్యలు మొదలు వివిధ స్పెషలైజ్డ్ రంగాల్లోనూ దీనిపై ఆధారపడుతున్నారు. రోజువారీ పనుల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నా... అది ఇచ్చే సమాచారం కచ్చితత్వం, డేటా గోప్యత, జవాబుదారీతనం విషయంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వంటకాల విషయంలో చాట్బాట్లు భోజన ప్రణాళికలను రూపొందించగలవు, తగిన వంటకాలను సూచించగలవు. అయితే రుచిని లేదా ఆకృతిని అంచనా వేయలేదు. వంటల్లో కొలతలు తప్పుగా ఉండొచ్చు, ఆహార సంప్రదాయాలను విస్మరించవచ్చు. ఆలోచనల రూపకల్పనకు ఇది సురక్షితమే కానీ సమస్యల నివారణకు ఇచ్చే సూచనలను తరచుగా సమీక్షించాల్సి ఉంటుంది’అని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను మదింపు, హెల్త్ ఇష్యూస్ వంటి వాటిలో దీనిపై అతిగా లేదా పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రతి 8 మంది టీనేజర్లు/యువకుల్లో ఒకరు సలహా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ, హార్వర్డ్ అధ్యయనం ప్రకారం... అన్ని రంగాల్లో చాట్బాట్లపై ఆధారపడటం పెరిగింది.ఆరోగ్య విషయంలో... చాట్బాట్లు తప్పుడు లేదా హానికరమైన వైద్య సలహాలనుఇవ్వగలవని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కొన్నిసార్లుఆత్మహత్య ఆలోచనల వంటి సంక్షోభాలకు సరైన ప్రతిస్పందనలను అందించడంలో విఫలమౌతాయని చెప్పాయి. » వైద్య సంబంధిత ప్రశ్నలకు అనేక చాట్బాట్ ప్రతిస్పందనల్లో తప్పుడు సమాచారం ఉంటోంది. » ఆరోగ్య సలహాల కోసం ఏఐని ఉపయోగించడం ప్రమాదకరం. » తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వైద్య సహాయంపొందడంలో ఆలస్యం జరగవచ్చు. » వైద్యుల మాదిరిగా ఏఐ శారీరక పరీక్షలు చేయలేదు. అలాగే వినియోగదారుడి పూర్తి వైద్య చరిత్రను అర్థం చేసుకోలేదు.సందర్భం తెలియకపోవడం వల్ల తప్పుడు రోగ నిర్ధారణల జరుగుతాయి. » మానసిక ఆరోగ్యం కోసం చాట్బాట్లపై ఆధారపడితే వృత్తిపరమైన సంరక్షణ విషయంలో చిక్కులు ఎదుర్కునే ప్రమాదముంది. » హానికరమైన సలహాలను ఇచ్చిన తర్వాత, యూఎస్ నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ (నెడా) తమ చాట్బాట్ ’టెస్సా’ను తొలగించింది. పన్ను మదింపు విషయంలో.. » ఏఐ పాత పన్ను చట్టాలనుఉపయోగించవచ్చు. వ్యూహాత్మక ప్రణాళికను అందించలేకపోవచ్చు. కచ్చితత్వ సమస్యలెదురుకావొచ్చు. » పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులకు బాధ్యత వహించాలి. ఏఐ ప్లాట్ఫారమ్లు తరచుగా తమ సమాధానాలు అధికారిక సలహా కాదని పేర్కొంటాయి. » డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుంది. వివిధ అధ్యయనాల్లో సిఫార్సులు » అత్యంత కీలకమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ మానవ నిపుణులను సంప్రదించాలి. » వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని చాట్బాట్లతో పంచుకోవద్దు. వ్యక్తిగత డేటాను సంరక్షించుకోవాలి. » సాధారణ మేధోమథనం కోసం ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా అంశానికి సంబంధించి ప్రాథమిక, ప్రారంభ సమాచారంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. -
గత పాలకుల తప్పిదాలను సరిచేస్తాం.. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు గురువారం గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని అన్ని సభల్లోనూ అధికారులు చదివి వినిపించారు. ⇒ ‘ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ... సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పనిచేస్తోంది. మేం పాలకులం కాదు..సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుంటున్నాం. ⇒ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ⇒ ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు.. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మా ర్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ‘ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుంచి 99 రోజులపాటు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరూవాడ స మస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియ రెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. ⇒ మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేష న్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇ ళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. ⇒ ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్తో ఆర్థికంగానే కాక, అన్నిరంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్వన్గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. క్యూర్, ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ⇒ ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధా రణ కార్యక్రమం కాదు..ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై... దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి’అని సీఎం సందేశం ఇచ్చారు. -
మళ్లీ టెక్ లేఆఫ్ కలకలం...
సాక్షి, హైదరాబాద్: మళ్లీ టెక్ లేఆఫ్లు ఊపందుకోవడంతో ఐటీ, ఇతర రంగాల ఉద్యోగుల్లో దడ మొదలైంది. 2026 తొలి మూడు నెలల్లోనే ప్రధాన టెక్, ఇతర కంపెనీల్లో దాదాపు లక్ష లేఆఫ్లు చోటుచేసుకున్నాయి. ఇందుకు ఒరాకిల్, అమెజాన్, డెల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా మినహాయింపుగా లేవు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్, లాజిస్టిక్స్, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగుల్లో భారీ కోతను సూచిస్తోంది. జనవరి 2026 నాటి డేటా ప్రకారం... 2009 తర్వాత ఒక ఏడాది ప్రారంభంలో నమోదైన అత్యధిక ఉద్యోగ కోతలు ఇవే కావడం గమనార్హం. 1.08 లక్షలకు పైగా ఉద్యోగ కోతలకు జరిగిన ప్రణాళికలు 2025 చివర్లో తగ్గుముఖం పట్టినా.. 2026 తొలి మూడు నెలల్లో అనూహ్య మార్పు వచ్చింది. ఇందుకు ప్రధానంగా... ఏఐ, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, పునరి్నర్మాణం, కోవిడ్లో అవసరానికి మించి తీసుకున్న వర్క్ఫోర్స్ వంటి వాటికి ముగింపు పలకడం వంటి వ్యూహాత్మక మార్పులే కారణంగా నిపుణులు చెబుతున్నారు. తొలగింపులు – ప్రణాళికలు ఇలా... ఒరాకిల్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల ఉద్యోగులను (మొత్తం ఉద్యోగుల్లో 18%) తొలగిస్తోంది. ఒక్క భారత్లోనే 12వేల మందిపై ప్రభావం. అమెజాన్: ఏఐ పెట్టుబడులు పెంచుతున్నందున, జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించింది. యూపీఎస్: తన భవిష్యత్ నెట్వర్క్ను ఆటోమేట్ చేస్తున్నందున, 2025లో కొన్నివేల ఉద్యోగాల తొలగింపు. 2026లో 30వేల వరకు ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళిక. నోకియా: ప్రపంచవ్యాప్తంగా 14 వేల ఉద్యోగాలను ప్రభావితం చేసే ప్రణాళికలను ప్రకటించింది. డెల్: సుమారు 11 వేల ఉద్యోగులను తగ్గించింది. ఎపిక్ గేమ్స్: వెయ్యికి పైగా ఉద్యోగుల తొలగింపు » మెటా (700+), ఇంటెల్ (15,000), మైక్రోసాఫ్ట్ (15,000), స్పాటిఫై (పాడ్కాస్టింగ్) వంటి టెక్ కంపెనీల్లో గణనీయమైన కోతలు జరుగుతున్నాయి. లేఆఫ్స్ పెరుగుదలకు కారణాలివీ... » కంపెనీలు తమ సిబ్బందిపై వెచ్చించే బిలియన్ల డాలర్లను ఏఐ డేటా సెంటర్లు, చిప్లు, శిక్షణ వైపు మళ్లిస్తున్నాయి. » 2020–22 మధ్య టెకీలను పెద్దసంఖ్యలో తీసుకున్న కంపెనీలు, ఇప్పుడు ఉత్పాదకతపై దృష్టి సారిస్తూ కోతలు విధిస్తున్నాయి. » అనేక కంపెనీలు నిర్వహణ శ్రేణులను తగ్గించడం, పునరావృతమయ్యే పనులను ఆటోమేషన్ చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. » పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, అధిక వడ్డీలు, తగ్గిన వినియోగదారుల విశ్వాసం. జాబ్ మార్కెట్పై ప్రభావం 2026 జనవరిలో నియామకాలు 17 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో, ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మరింత సమస్యగా మారింది. తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు తరచుగా తక్కువ జీతం, తక్కువ స్థాయి హోదాలు లేదా భద్రత లేని, ఒప్పంద ఆధారిత పని లభిస్తోంది. ఇతర నిర్మాణాత్మక సమస్యలను దాచిపెట్టడానికి లేదా ఖర్చులను తగ్గించడం ద్వారా స్టాక్ ధరలను పెంచుకోవడానికి కంపెనీలు ఏఐని సాకుగా ఉపయోగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధమూ ఒక కారణమే.. రాబోయే మూడేళ్లలో బాగా పెరగబోయే ఏఐ అడాప్షన్లో భాగంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలోనూ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ అన్వయింపు మరింతగా పెరుగుతోంది. పెద్ద కంపెనీలు కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోలేకపోతే ఇండస్ట్రీలో మనుగడ సాధించే అవకాశాలు లేవు. కాస్ట్ కంట్రోల్ మినహా మరో గత్యంతరం లేదు. ఇందులో ఉద్యోగుల జీతాలు తగ్గించడమే ప్రధానం. క్లౌడ్, జెన్ ఏఐ టూల్స్ వినియోగం వల్ల కూడా పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఏఐ, ఇతర అత్యాధునిక నైపుణ్యాలను పెంచుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్న వారికి కూడా తప్పకుండా అవకాశాలు పెరుగుతాయి. –వెంకా రెడ్డి, చీఫ్ పీపుల్ ఆఫీసర్, క్వాలీజీల్ -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
చేర్యాల(సిద్దిపేట): పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అది తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ముస్త్యాల గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (24), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ (27) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 28న రాకేశ్గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రేమికుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురైన హారికను కుటుంబ సభ్యులు జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నిధులిచ్చినా.. పారడం లేదు!
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోక నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలోని కీలకమైన జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంలో ఉదాసీనత చూపుతోంది. ప్రపంచ బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ)ల ఆర్థిక సహాయంతో అమలు చేస్తున్న డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్) రెండో దశ కింద రూ.100 కోట్లను రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం, మూడో దశ కింద రూ.445 కోట్లను సూత్రప్రాయంగా కేటాయించింది. రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులను డ్రిప్ పథకం కింద చేర్చి రూ.545 కోట్లతో మరమ్మతులు నిర్వహించడానికి 2024లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు రెండో దశ కింద 9 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను మాత్రమే కేంద్రానికి పంపించగా, కేంద్రం నుంచి రూ.5.72 కోట్లు విలువైన పనులకే ఆమోదం లభించింది. ఇప్పటివరకు ఒక్క పనికీ టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు అప్పగించలేదు. ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఓ సమావేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రిప్ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేసేందుకు నీటిపారుదల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఇన్చార్జీ/అదనపు చార్జీ బాధ్యతల్లో పనిచేస్తున్న అధికారులు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని కేంద్ర జలశక్తి శాఖ తప్పుబట్టింది. రాష్ట్రం నుంచి 29 డ్యామ్లు2025లో వర్షాకాలం ముగిసిన తర్వాత రాష్ట్రంలోని జలాశయాలకు తనిఖీలు నిర్వహించగా, 21 జలాశయాల్లో తీవ్ర లోపాలు బయటపడ్డాయి. ఆనకట్టల భద్రత చట్టం, 2021 ప్రకారం ఈ జలాశయాలను కేటగిరీ–2 జాబితాలో చేర్చి అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. ఈ జలాశయాలకు డ్రిప్ కింద మరమ్మతులు నిర్వహించవచ్చని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి సూచన చేయడం గమనార్హం. డ్రిప్ ప్రాజెక్టు రెండు, మూడో దశల కింద దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల పరిధిలోని 736 డ్యామ్లను రూ.10,211 కోట్లతో పునరుద్ధరించడానికి కేంద్రం ఆమోదించింది. వీటిలో రాష్ట్రంలోని 29 డ్యామ్లు ఉన్నాయి. ఈ జాబితాలో రాష్ట్రం నుంచి నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, జూరాల, పాకాల లేక్, లక్నవరం, రామప్పలేక్, పాలేరు, డిండి, కోయిల్సాగర్, కడెం, మూసీ, శ్రీరామ్సాగర్, వట్టివాగు, స్వర్ణ, ఎల్ఎండీ, మల్లూరువాగు, బొగ్గులవాగు, ఎన్టీఆర్ సాగర్, కౌలాస్నాలా, సాత్నాలా, సింగూరు, గడ్డెన్నవాగు, అక్కంపల్లి రిజర్వా యర్ పెద్దదేవలపల్లి, పీపీఆర్ ప్రాజెక్టులున్నాయి. జూరాల ప్రాజెక్టును రూ.143.44 కోట్లు, నాగార్జునసాగర్ను రూ.29.56 కోట్లు, శ్రీరామ్సాగర్ను రూ.63.48 కోట్లతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించారు. వ్యయంలో 70శాతం రుణాన్ని కేంద్రం ఇప్పించనుండగా, 30 శాతం రాష్ట్ర వాటాగా భరించాల్సి ఉండనుంది. 2031 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని గడువు విధించింది. పొరుగు రాష్ట్రాలు భేష్డ్రిప్ పథకాన్ని కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు బాగా సద్వినియోగం చేసుకున్నాయి. కర్ణాటకకు డ్రిప్ రెండో దశ కింద రూ.699 కోట్లు, మూడో దశ కింద రూ.400 కోట్లను కేటాయించగా, ఆ ప్రభుత్వం 13 ప్రాజెక్టులను ప్రతిపాదించింది. అందులో రూ.600 కోట్లతో 11 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపగా, రూ.372 కోట్లు విలువైన పనులను కర్ణాటక ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఒడిశా సైతం రూ.40.59 కోట్లు విలువైన పనులు పూర్తి చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒక్క రూపాయీ ఖర్చుచేయలేదు. -
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. కేరళ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎం నేరుగా ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. తొలుత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవనాన్ని, ఆ తర్వాత స్కిల్స్ యూని వర్సిటీ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. మే నాటికి ఎఫ్సీడీఏ పనులు, జూన్ చివరి నాటికి స్కిల్స్ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.అక్కడి నుంచి పవర్గ్రిడ్ సెంటర్కు చేరుకున్నారు. కొంగరకలాన్ నుంచి మీర్ఖాన్పేట్, అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న 330 అడుగుల విస్తీర్ణంలోని గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు సహా రేడియల్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలోని ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి ఖర్చుకు వెనుకాడకుండా భూగర్భ విద్యుత్ కేబుళ్లను వేయాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామమని, ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్నాయని, త ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అధికారుల ఉరుకులు, పరుగులు మధ్యాహ్నం 3.55కు ఇక్కడికి చేరుకున్న సీఎం..సాయంత్రం 5.10 గంటల సమయంలో తిరుగు ముఖం పట్టారు. సీఎం పర్యటన ఆఖరి నిమిషంలో ఖరారు కావడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సీఎం వస్తున్న సమాచారం అధికార పార్టీ నేతలకు కూడా లేకపోవడం విశేషం. సీఎం వెంట సీఎస్ రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఉన్నారు. సీఎం రాకకు ముందే పవర్ గ్రిడ్ కేంద్రానికి చేరుకున్న సీఎస్.. విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
‘జూబ్లీహిల్స్’ ఎన్నికలపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సభ్యుడు సునీల్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నందా సూరేపల్లి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘2024లో 270 మందికి సభ్యత్వం ఇవ్వడంపై ఈ కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. పాత వారిని తొలగించడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా సహకార శాఖ రిజి్రస్టార్ పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది’అని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రక్రియలో కోర్టులో జోక్యం చేసుకోలేవని సహకార శాఖ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్రెడ్డి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఓటర్ల జాబితాపై పలు పిటిషన్లు, ధిక్కరణ పిటిషన్లపై ఇదే కోర్టు విచారణ చేపడుతున్నందున జోక్యం చేసుకోవచ్చన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో రూ. 21,211.92 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్జించిన అత్యధిక ఆదాయం ఇదే. అంతకుముందు 2024–25లో నమోదైన రూ.20,569.35 కోట్ల మునుపటి అత్యుత్తమ స్థాయితో పోలిస్తే ఇది 3 శాతం అధికం కావటం విశేషం. ఇందులో సరుకు రవాణా రూపంలో రూ.13,575 కోట్లు రాగా, ప్రయాణికుల టికెట్ల రూపంలో రూ.6,235 కోట్లు వచ్చింది. పెనాల్టీలు, తుక్కు అమ్మకాలు లాంటి ఇతర రూపాల్లో మిగతాది వసూలైంది. ఈ వివరాలను గురువారం రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే...గత ఆర్థిక సంవత్సరంలో 147.871 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. 28.64 కోట్ల మంది ప్రయాణికుల తరలింపు ద్వారా రూ.6,235.37 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ మొత్తం 2024–25 సంవత్సరంలో రూ.5,714.83 కోట్లుగా ఉంది. 2024–25 సంవత్సరంలో 3,495 రైళ్లతో పోలిస్తే, ఈ సంవత్సరంలో 3,791 ప్రత్యేక రైళ్లను నడిపారు. టికెట్ల తనిఖీ ద్వారా రూ.232.6 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది రూ.184.24 కోట్లు కాగా, 2023–24లో మునుపటి అత్యుత్తమ స్థాయి రూ.220.85 కోట్లుగా నమోదైంది. జోన్పరిధిలో 194.57 కిలోమీటర్ల ట్రాక్ అదనంగా నిర్మితమైంది. ఏడాది కాలంలో 325 కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణను పూర్తి చేసింది. అమృత్భారత్ స్టేషన్ల పథకం కింద దక్షిణ మధ్య రైల్వే రూ. 6వేల కోట్లకు పైగా వ్యయంతో 119 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులను చేపడుతోంది. ఇందులో రూ.2,900 కోట్ల వ్యయంతో 11 ప్రధాన స్టేషన్ భవనాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తంలో తెలంగాణ పరిధిలో 40 స్టేషన్లు ఉన్నాయి. వరంగల్, బేగంపేట, కరీంనగర్ స్టేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదు స్టేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. జోన్ పరిధిలో 479 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ ప్రారంభమైంది. 486 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆర్ఓబీ/ ఆర్యూబీల నిర్మాణం ద్వారా 65 చోట్ల మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్ను తొలగించారు. కొత్తగా 72 ఆర్యూబీలు, 27 ఆర్ఓబీలను నిర్మించారు. గత ఏడాది కాలంలో కొత్తగా 40 లిఫ్టులు, 25 ఎస్కలేటర్లు, 10.74 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. -
ఎండ కన్నా డేంజర్.. తేమ తాపం
దేశంలో మనకు తెలియకుండానే మన మనుగడకు ప్రమాదకరమైన స్థాయికి దగ్గరగా ఉన్న అధిక ఉష్ణోగ్రతలను ఇప్పటికే అనుభవిస్తున్నామా? హీట్ వేవ్ (వడగాడ్పుల) ముప్పును లెక్కగట్టేటప్పుడు ఒక్క ఉష్ణోగ్రతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ప్రమాదకరమైన వేడి ముప్పును ముందుగా తెలుసుకోలేకపోతున్నామా?అధిక ఉష్ణోగ్రతతోపాటు అప్పటి గాలిలో సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) శాతాన్ని కూడా కలిపి లెక్కించటం ప్రారంభించాలి. వాస్తవికమైన మనం ఫీలయ్యే వేడి ముప్పు తీవ్రతను ముందుగా గుర్తించటానికి, సహాయక చర్యల సన్నద్ధతను పెంచుకోవటానికి ఇది అవసరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెట్–బల్బ్ ఉష్ణోగ్రత అంటే? ఉష్ణోగ్రతతోపాటు గాలిలో సాపేక్ష తేమను కూడా పరిగణనలోకి తీసుకోవటాన్ని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు. వేడి ఒత్తిడి అంచనాలో ఉష్ణోగ్రతతోపాటు గాలిలో తేమను కలపటం ఎందుకు అంటే.. వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. వేడిని తట్టుకునే ప్రక్రియలో చెమట శరీరానికి ఉపయోగపడుతుంది. చర్మంపై నుంచి చెమట ఎంతగా ఆవిరైపోతోందనే దానిపై ఈ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా జరుగుతోందనేది ఆధారపడి ఉంటుంది.గాలిలో అధిక తేమ ఉన్న పరిస్థితిలో, శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి అంతరాయం కలుగుతుంది. చెమట ఆవిరి కానప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది తీవ్రమైతే అలసట, వడదెబ్బ తగులుతాయి. తీవ్రమైన సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వేడి, తేమ వల్ల కలిగే ఈ మిశ్రమ ఒత్తిడిని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత ద్వారా అంచనా వేస్తారు. వాతావరణ ప్రజారోగ్య స్థితిగతుల అంచనాల్లో ఇదొక కీలకమైన కొలమానమైనా, మన దేశంలో ఇంకా తక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఉష్ణోగ్రత కన్నా తేమే ముఖ్యంకేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.నాయర్ రాజీవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఇలా అన్నారు.. ‘ప్రస్తుతం మనం తేమ ప్రభావాలపై తగినంత శ్రద్ధ పెట్టటం లేదు. కానీ మన ఆరోగ్యంపై ప్రభావం విషయానికి వస్తే, పెరుగుతున్న ఉష్ణోగ్రతతోపాటు తేమ కూడా అంతే ముఖ్యమైనది లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది’. ‘డ్రై హీట్’ ఒక్కటే ప్రామాణికమా? ⇒ భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్దేశించే ప్రాథమిక ప్రమాణాల ప్రకారం.. మైదాన ప్రాంతాల్లో 40 (కొండ ప్రాంతాల్లో 30, కోస్తా తీర ప్రాంతాల్లో 37) డిగ్రీల సెల్సియస్ దాటితేనే ప్రస్తుతం వడగాడ్పు (హీట్వేవ్స్)ను అధికారికంగా ప్రకటిస్తున్నారు. ⇒ ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే ‘వడగాడ్పు’రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే ‘తీవ్ర వడగాడ్పు’రోజుగా ప్రకటిస్తున్నారు. ⇒ అయితే, ఉష్ణోగ్రతతోపాటు గాలిలోని సాపేక్ష తేమను ప్రాథమిక ప్రమాణంగా ఐఎండీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. హీట్వేవ్స్ ప్రకటనకు సాపేక్ష తేమను ఐఎండీ ప్రాథమిక ప్రమాణంగా కాకుండా సెకండరీ విషయంగానే పరిగణించటం వల్ల ఈ ముప్పు ప్రాణాంతకంగా మారుతోంది. దీన్ని ‘డ్రై హీట్’ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు.⇒ పగటి ఉష్ణోగ్రత ఐఎండీ ప్రమాదకరమని భావించినంత పెరగనప్పుడు కూడా, గాలిలోని అధిక సాపేక్ష తేమ వల్ల, ప్రజలు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పును అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, వృద్ధులు, పిల్లలతోపాటు ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు గురవుతున్నారు. ⇒ గాలిలో తేమ శాతం సాధారణంగా ఎక్కువగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో, కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగర, పట్టణ ప్రాంతాల్లో వాతావరణ మార్పు నేపథ్యంలో ఈ ముప్పు పెరుగుతోంది. హీట్ స్ట్రోక్ మరణాలు ఎక్కువ కావటానికి ఇదొక ముఖ్య కారణంగా చెబుతున్నారు. ⇒ వడగాడ్పుల ప్రభావం ప్రజలపై ఉన్నా, అధికారికంగా ప్రకటించనందున, ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రజల్లో సంసిద్ధత, అప్రమత్తత లోపిస్తోంది. నివారించదగిన వడగాడ్పు మరణాల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ అంతేకాదు, బాధితులకు వైద్య సహాయంలో, సహాయక చర్యల్లో, వడగాడ్పు మృతులకు పరిహారం చెల్లింపుల్లోనూ ఇది ప్రతిబంధకంగా మారుతోంది. డ్రై హీట్ పద్ధతికి బదులు వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతిని అనుసరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. -
విజేతలు శ్రీచరణ్ తేజ్, చిద్విలాసిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ అండర్–15 బాలుర విభాగంలో కొండ్లాపు శ్రీచరణ్ తేజ్, అండర్–15 బాలికల విభాగంలో కుమ్మరికుంట్ల చిద్విలాసిని విజేతలుగా నిలిచారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వివిధ వయో విభాగంలో తెలంగాణ జిల్లాల నుంచి 300 మందికిపైగా పోటీపడ్డారు. నిర్ణీత ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శ్రీచరణ్ తేజ్ 4.5 పాయింట్లు సాధించగా... చిది్వలాసిని 3.5 పాయింట్లు స్కోరు చేసింది. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం జనరల్ సెక్రటరీ జయచంద్ర విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఆర్.చంద్రమౌళి చీఫ్ ఆర్బిటర్గా, ఆర్.శ్రీరామ్ డిప్యూటీ ఆర్బిటర్గా వ్యవహరించారు. వివిధ వయో విభాగాల్లో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు వివరాలు ఇలా ఉన్నాయి. అండర్–15 విభాగం: బాలురు: 1. శ్రీచరణ్ తేజ్ (4.5 పాయింట్లు), 2. బొబ్బిలి సుజయ్ (4 పాయింట్లు), 3. జక్కరాజు జై శ్రేయాన్స్ (4 పాయింట్లు). బాలికలు: 1. చిది్వలాసిని (3.5 పాయింట్లు), 2. లేఖ్యశ్రీ సాన్వి (3 పాయింట్లు), 3. ఎ.ప్రణతి (2.5 పాయింట్లు). అండర్–13 విభాగం: బాలురు: 1. ధ్రువ్ శ్రీవాస్తవ (5 పాయింట్లు), 2. ఎస్.శశాంక్ (5 పాయింట్లు), 3. జి.రుషికేశ్ ( 4 పాయింట్లు). బాలికలు: 1. కె.లాస్య (4 పాయింట్లు), 2. చేట్ల వేదశ్రుతి (3 పాయింట్లు), 3. గౌలీకర్ సుహాసిక (3 పాయింట్లు). అండర్–11 విభాగం: బాలురు: 1. కేఎస్ విశిష్ట్ శ్రీరామ్ (5 పాయింట్లు), 2. పి.చార్వీక్ సాయి (4.5 పాయింట్లు), 3. కొత్తపల్లి దేవాంశ్ (4.5 పాయింట్లు). బాలికల విభాగం: 1. పొలిశెట్టి ధృతి (4 పాయింట్లు), 2. కె.తేజస్వి (4 పాయింట్లు), 3. మునిపల్లి ఆశ్రిత (4 పాయింట్లు). అండర్–9 విభాగం: బాలురు: 1. అంబటి ప్రసిధ్ (5 పాయింట్లు), 2. బి.యజత్ రెడ్డి (5 పాయింట్లు), 3. పట్లోళ్ల ధ్రువిన్ రెడ్డి (4 పాయింట్లు). బాలికలు: 1. జి.శాన్విత (3 పాయింట్లు), 2. సాన్విక (3 పాయింట్లు), 3. ముద్దాల కుముద (3 పాయింట్లు). అండర్–7 విభాగం: బాలురు: 1. రంగనాధ వేద ఆర్క (5 పాయింట్లు), 2. ఎస్. తనవ్ ఇషాన్ (5 పాయింట్లు), 3. గూడురు విహాన్ (4 పాయింట్లు). బాలికలు: 1. మెహరీన్ షేక్ సుహీరా (4 పాయింట్లు), 2. ఆవుల శ్రేయాంశి (3 పాయింట్లు), 3. రంగనాధ ఐరా అర్ణి (3 పాయింట్లు). -
పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై జరిగిన చర్చలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివిధ అంశాలపై పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఆ వ్యాఖ్యలు అభ్యంతకరం: కేఆర్ సురేశ్రెడ్డి ‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ’కేంద్ర జలశక్తి మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పాలని, లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సురేశ్రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే మేడిగడ్డ బరాజ్లోని రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్ కారి డార్, స్టీల్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీలతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ.900 కోట్ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్, కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కిషన్రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భద్రాచలం గ్రామాలను ఏపీలో కలపడం కాంగ్రెస్ రూపొందించిన విభజన చట్టంలోనే ఉంది. అప్పట్లో సోనియాగాంధీతో డిన్నర్ చేసి, ఆమె కాళ్లు పట్టుకున్న కేసీఆర్.. అప్పుడెందుకు ఆ గ్రామాల గురించి అడగలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కేంద్రం నుంచి పైసా తీసుకోలేదని చెబుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కేసీఆర్ దుబాయ్లో నోట్లు ఏమైనా ముద్రించారా? అది కేసీఆర్ ఇంట్లో డబ్బు కాదు, ప్రజల డబ్బు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిపోయింది. ఎన్నికల ముందు కాళేశ్వరంపై విచారణ జరిపి కేసీఆర్ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఆ పనిచేయడం లేదు’అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. అది ఎలాగూ అమరావతే ఎంపీ రేణుకాచౌదరి పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (కంటితుడుపు చర్య) మాత్రమే.’అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టాన్ని కేవలం తన మిత్రపక్షాలకు (కూటమికి) మేలు చేసేందుకే వాడుకుంటోంది. అదే చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది’అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భద్రాచలం సరిహద్దుల్లోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి: ఎంపీ వద్దిరాజు సూపర్బజార్ (కొత్తగూడెం): ఆంధ్రప్రదేశ్ విభజన సమయాన భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను ఏపీలో విలీనం చేశారని, ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామనేది మొదటి నుంచి తమ పార్టీ విధానమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మంత్రి కిషన్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణే 'గ్యారంటీ'!
సాక్షి హైదరాబాద్: కేరళలో యూడీఎఫ్ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టోపై విమర్శలు చేసేవారు.. ఆ హామీలు తెలంగాణలో ఎలా అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. గురువారం కొచ్చిలో ఐదు ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ –2047 మేరకు తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధిరేటు 10.8%గా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్య మని తాము నిరూపించామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన ఖాయం అవినీతి, కుటుంబ పాలన అంశంలో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో పదేళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను పాలించారని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నా యన్నారు. దేశాన్ని, కేరళనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్ను ఉద్దేశించి విమర్శించారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలతో కేరళలో విజయన్ పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణ యుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. -
కల్తీ రాయుళ్లకు సీపీ సజ్జనార్ వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు.గురువారం బషీర్బాగ్లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో 'హెచ్-ఫాస్ట్' ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు.నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులు అభినందిస్తూ, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు డీసీపీ ఏ. శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ‘మెట్రో రైల్’ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
ఢిల్లీ: హైదరాబాద్ నగర మెట్రో రైల్ ప్రాజెక్ట్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆమోదానికి కాలపరిమితి లేదని, ప్రాజెక్టు ఆమోదం అనేది మదింపు ప్రక్రియ ఫలితం, సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యత పై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై అప్రైజల్ జరుగుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు అత్యధిక వ్యయంతో కూడుకున్నవి. ప్రతిపాదిత ఫేస్ 2 నెట్వర్క్ ను ప్రస్తుత ఫేజ్ 1 మెట్రో నెట్వర్క్తో అనుసంధానం చేసే సాంకేతిక సాధ్యసాధ్యల పై సలహా ఇవ్వడానికి కమిటీని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలియజేయాలి’ అని తెలిపారు. -
5 ఏళ్ల ప్రేమ, పెళ్లైన నెలకే ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కట్నం కోరలకు మరో యువతి బలైపోయింది. హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో, ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడన్న ఆరోపణలతో, బిహార్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇషితా యాదవ్ తనువు చాలించింది. పోలీసుల వివరాల ప్రకారం,బుధవారం సాయంత్రం, ఇషితా యాదవ్ తన అపార్ట్మెంట్లోని హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ఆమె భర్త, నీరజ్ భన్సల్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇషితా ,నీరజ్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఇషితా స్వస్థలం బిహార్ కాగా, నీరజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం, వీరిద్దరూ హైదరాబాద్కు మకాం మార్చారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, నీరజ్ అదనపు కట్నం కోసం ఇషితాను వేధించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో పాటు, తాను ఇటీవల ప్రారంభించిన ఒక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె కుటుంబాన్ని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇషితా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్ -
కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి
హైదరాబాద్ : నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ బేకరీ ఉత్పత్తులు, అపరిశుభ్రంగా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్, టప్పాచబుత్రా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో జిర్రాలోని చాంద్ బేకరీపై దాడి చేసి, రూ. 2.77 లక్షల విలువైన ముడి సరుకులు, ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.బేకరీ యజమాని సయ్యద్ ఖదీర్ (42)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫ్ నగర్లో నివాసం ఉండే ఖదీర్ నటరాజ్ నగర్లో ‘చాంద్ బేకరీ’ పేరుతో తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. బేకరీ నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతులు లేవని పోలీసులకు సమాచారం అందింది.పక్కా సమాచారంతో చాంద్ బేకరీపై పోలీసులు దాడులు చేశారు. నకిలీ ఉత్పుత్తులతో పాటు మైదా బస్తాలు, సాస్ కార్టన్లు, డాల్డా, చక్కెర, కొబ్బరి పొడి, కేక్ పౌడర్, ఆయిల్ టిన్నులు, చికెన్, బ్రెడ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.పక్కా సమాచారం ఆధారంగా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, టప్పాచబుత్రా పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితుడిపై టప్పాచబుత్రా పోలీసులు పలు కింద కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి అందె శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేష్, టప్పాచబుత్రా ఇన్స్పెక్టర్ జి. బాలకృష్ణ, ఎస్.ఐలు కె. వెంకటరమణ, అమ్జద్ షరీఫ్, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. -
హైదరాబాద్లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిల్వ ఉంచిన కుళ్ళిన గొర్రె, మేక మాంసాన్ని (పాయా, ముడి, బీజా, గురుదా, కలేజీ తదితర అవయవాలు) విక్రయిస్తున్న ఒక భారీ నెట్వర్క్ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), హెచ్-ఫాస్ట్ (H-FAST) మరియు మంగళ్హాట్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.మంగళ్హాట్లోని 'A to Z షీప్ అండ్ గోట్ ఆఫ్ఫల్' స్టోర్పై మెరుపు దాడి చేసి సుమారు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. పది లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడు రఫీ అహ్మద్ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు, స్టోర్ యజమాని మొహమ్మద్ అఫ్రోజ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అఫ్రోజ్పై గతంలో జీహెచ్ఎంసీ జరిమానా విధించడంతో పాటు, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుడు రఫీ అహ్మద్.. యజమాని అఫ్రోజ్ సహాయంతో హోల్సేల్ మార్కెట్ నుండి తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను సేకరించేవాడు. ఈ మాంసాన్ని మంగళ్హాట్, అమాన్ నగర్ కాలనీలోని తమ స్టోర్లో నిల్వ చేసేవారు. మాంసం కుళ్లిపోకుండా దుర్వాసన రాకుండా ఉండేందుకు డీప్ ఫ్రీజర్లు, నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో ఎక్కువ కాలం నిల్వ ఉంచేవారు. అనంతరం, ఈ కుళ్లిన మాంసాన్ని తాజా మాంసంగా నమ్మించి హోటళ్లు, శుభకార్యాలకు, ఇతర ఈవెంట్లకు సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు. -
ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..!
తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు. మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్ ఛాంబర్ తన ప్రకటనలో పేర్కొంది. -
మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) కీలక తీర్పునిచ్చింది. మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిన ఎన్జీటీ.. ప్రక్షాళనపై పటోళ్ల కార్తీక్రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేసింది.గాంధీ సరోవర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ పేర్కొన్నగా.. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారన్నది ప్రభుత్వం వాదన. విచారణ జరిపిన ఎన్జీటీ.. పిటిషన్లో సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేసును ట్రిబ్యునల్ డిస్మిస్ చేయడంతో మూసీ ప్రక్షాళన పనులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ తీర్పుతో ప్రభుత్వానికి లీగల్ రిలీఫ్ లభించింది. -
లంచాలకు తలొంచి..
చైతన్యపురి/ఉస్మానియా యూనివర్సిటీ: నగరంలో బుధవారం రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు ఓయూ ఉద్యోగులు, చైతన్యపురి ఏఎస్ఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. లోక్ అదాలత్లో కేసు రాజీ కుదురుస్తానంటూ లంచం తీసుకున్న కోర్టు విధులు నిర్వర్తిస్తున్న చైతన్యపురి ఏఎస్ఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎలక్ట్రీషియన్గా పనిచేసే పల్లెపు రాంబాబు అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడు. చైతన్యపురి పోలీసులు కోర్టులో చార్జిషిట్ దాఖలు చేశారు. లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుతానని కోర్టు విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ పూసల బాలయ్య నిందితుడు రాంబాబును రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాంబాబు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద రాంబాబు నుంచి బాలయ్య డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఓయూ పాలన భవనం కార్యాలయంలోని బిల్స్ సెక్షన్లో పని చేస్తున్న ఉద్యోగులు అరవింద్, రమేశ్ లు రూ.13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పెన్షన్ కోసం ఓ విశ్రాంత ఉద్యోగి దరఖాస్తు చేసుకోగా వీరు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ముందస్తు ప్రణాళికతో బాధితుడి నుంచి ఓయూ ఉద్యోగులు రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
కుళ్లిపోయిన వెయ్యి కిలోల మాంసం సీజ్
హైదరాబాద్: కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయ గోడౌన్పై పోలీసులు దాడులు చేశారు. సుమారు వెయ్యి కిలోల మాంసం విడిభాగాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళ్హాట్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్హాట్ కిస్తీ చమాన్ ప్రాంతంలో అఫ్రోజ్ అనే వ్యక్తి ఎ టు జెడ్ గోదాం నిర్వహిస్తున్నాడు. నగరంలోని పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభ కార్యాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి అఫ్రోజ్ నాణ్యత లేని మాంసాన్ని విడిభాగాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాడు. బుధవారం మంగళ్హాట్ పోలీసులతో పాటు టాస్్కఫోర్స్ హెచ్ ఫాస్ట్ బృందం, వెటర్నరి అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ గోడౌన్లో కుళ్లిపోయిన, అపరిశుభ్రమైన, దుర్వాసనతో కూడిన దాదాపు వెయ్యి కిలోల మేకలు, గొర్రెల మాంసం విడిభాగాలను స్వా«దీనం చేసుకుని నిందితుడు అఫ్రోజ్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 రోజుల క్రితం ఇదే గోడౌన్పై దాడులు చేసి కుళ్లిన మాంసాన్ని, విడిభాగాలను స్వా«దీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. తిరిగి కుళ్లి పోయిన మాంసంతో విక్రయాలు చేస్తుండడంతో పోలీసులు మరోసారి దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. పట్టుకున్నారు.. గోప్యంగా ఉంచారు.. ఉప్పల్: గడువు ముగిసిన పదార్థాలతో తిను బండారాలను తయారు చేస్తున్న పలు సంస్థలపై హెచ్–ఫాస్ట్ అధికారులు బుధవారం దాడులు చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. రామంతాపూర్ బాలకృష్ణానగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి గడువు ముగిసిన పదార్థాలతో తిను బండారాలను తయారు చేసి వాటిపై శ్రీనివాస్ స్వగృహ ఫుడ్స్ పేరిట లేబుల్స్ అతికించిన ప్యాకెట్లను రిటేల్ షాపుల్లో విక్రయిస్తున్నాడు. ఫుడ్ సేప్టీ అధికారులు గత నెల 30న దాడి చేసి 20 బ్యాగుల మైదా, 20 టిన్నుల ఆయిల్ను స్వా«దీనం చేసుకున్నారు. రామంతాపూర్ సాయికృష్ణానగర్లో నాయుడు ఫుడ్స్ కంపెనీ పేరిట నిర్వహిస్తున్న తిను బండారాల సంస్థపైనా దాడి చేసిన అధికారులు.. షేక్ మహబూబ్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. -
నెలకు 10 శాతం వడ్డీ.. నాగోల్లో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: తమ వద్ద పెట్టుబడి పెడితే భారీ వడ్డీ ఇస్తామని ఆశచూపి రూ.15 కోట్లకు టోకరా వేసిన నిందితుడిని పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాగోలు ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన కిచ్చ వీరభద్రరావు (51) బండ్లగూడ ఆనంద్ నగర్లో గల రాజీవ్ స్వగృహలో నివాసముంటున్నాడు. భార్య రాజ్యలక్ష్మి, సహాయకుడు వెంకట దుర్గాప్రసాద్తో కలిసి నాగోల్ వీరభద్ర ట్రేడింగ్ పేరుతో కార్యాలయం ప్రారంభించారు.తమ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో సుమారు 290 మంది వినియోగదారులు రూ.30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రారంభంలో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన నిందితులు 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.అనంతరం రూ.30 కోట్లలో రూ.15 కోట్లు చెల్లించి, మిగతా రూ.15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. అధిక వడ్డీ ఆశ చూపి 290 మందికి టోకరా వేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా వీరభద్రరావు, రాజ్యలక్షి్మ, వెంకట దుర్గాప్రసాద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
హనుమకొండలో ఘోరం.. స్విమ్మింగ్పూల్లో పడి..
హనుమకొండ జిల్లా: అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన మండలంలోని పున్నేలు క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ – ఫర్హత్(26) దంపతులకు ఇద్దరు కుమారైలు ఉమేరా(8), అయేషా(6) ఉన్నారు. వీరి కుటుంబానికి ఓ వెంచర్లో స్విమ్మింగ్ పూల్ ఉండగా.. దానిని నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. తరచూ వెళ్లే మాదిరిగానే బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా స్విమ్మింగ్ పూల్కు వెళ్లినట్లు తెలిసింది. ఈక్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి స్విమ్మింగ్ పూల్లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తల్లి, కూతుళ్ల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తు మృతిచెందినట్లుగా భర్త అజారుద్దీన్ చెబుతున్నాడు. ఇటీవల అయేషా మూడోసారి గర్భం దాల్చడం విషయంలో దంపతులకు గొడవలు జరుగుతున్నాయని, అనుమానాస్పద స్థితిలో మృతి చెందలేదని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి అలీ అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. -
భూ భారతి సమీకృత పోర్టల్.. ఏ ప్రాంతంలో ఎంత ఫీజు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో మరో కీలక అడు గు. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐడీఎల్ఆర్ఎంఎస్) పేరుతో భూభారతి సమీకృత పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేస్తూ రూపొందించిన ఈ కొత్త సమీకృత పోర్టల్ రాష్ట్రంలోని ఐదు మండలాల్లో గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో పైలట్ పద్ధతిలో ఈ పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నారు.ఒక్క క్లిక్... సమస్త సమాచారంభూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ సమీకృత పోర్టల్ రూపకల్పనకు పూనుకున్నారు. కేవలం భూపరిపాలనకు సంబంధించిన సమాచారమే కాకుండా సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉండేలా ఈ పోర్టల్ను రూపొందించారు. మైల్యాండ్ పోర్ట్ఫోలియో, నాలా ఆర్డర్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల వివరాలు, ఫీడ్బ్యాక్, అధికారుల వివరాలు, ఆర్వోఆర్–1బీ, ఎల్పీఎం (భూదార్), దరఖాస్తులు, సిటిజన్ చార్టర్, డౌన్లోడ్స్, మ్యుటేషన్ ఆర్డర్లు, భూముల మార్కెట్ విలువలు, భూనక్షా, ధరణి కంటే ముందునాటి ఈసీలు, ఫీజుల రీఫండ్ వివరాలతో కూడిన 15 అంశాల డ్యాష్బోర్డును ఈ పోర్టల్లో రూపొందించారు. డ్యాష్బోర్డులోని ఒక్కో అంశంపై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం లభ్యమవుతుందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఈ పోర్టల్లో ఐదు రకాల సేవలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సమాచారం, సర్వే, తప్పొప్పుల సవరణ, అప్పీల్, రిజిస్ట్రేషన్ సర్వీసులనూ ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటిరాష్ట్రంలోని భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో, సీఎం రేవంత్రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సమీకృత పోర్టల్పై అక్కడి నుంచే రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రైతులకు పారదర్శక, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ సమీకృత భూభారతి పోర్టల్ను తయారు చేశామన్నారు. ఈ పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమల్లోకి తేవడం ద్వారా భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని వెల్లడించారు. భూసేవల కోసం రైతులు మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే పొందేవిధంగా పోర్టల్ను రూపొందించామని, భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ పోర్టల్లోకి రైతు లాగిన్ అయిన వెంటనే తన భూమికి సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయన్నారు. భూముల సర్వే కోసం చెల్లించాల్సిన ఫీజు వివరాలు, సర్వే పురోగతి, ఎల్పీఎం, భూదార్ నెంబర్ కేటాయింపు వివరాలు కనిపిస్తాయన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ప్రతి దశలో రిజిస్టర్డ్ మొబైల్కు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారం వస్తుందని వివరించారు. ఈ పోర్టల్తోపాటు రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జతచేసేలా భూభారతి చట్టంలో పేర్కొన్న నిబంధనను కూడా అమల్లోకి తెస్తున్నామని, పాత విధానాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహించే విధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. -
డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు చూపండి
జడ్చర్ల: డ్రగ్స్ పరీక్షలకు మేము సిద్ధమే..కానీ అవే పరీక్షలకు రాజకీయ నాయకులు సిద్ధమా? అంటూ సినీ నటుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను ఓ ఎమ్మెల్యేగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు చూపిస్తున్నానని, తన మాదిరిగానే సినీ నటులు కూడా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. మంచు విష్ణు తండ్రి మోహన్బాబు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని ఆయన అప్పుడు ఏం పరీక్షలు చేయించుకున్నారని ప్రశ్నించారు. మీ సోదరుడు మనోజ్ టెస్టే మీరు చేయించలేరని తమపై ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. ‘మేము ఏం టెస్టులు చేయించుకోవాలో రాసివ్వు ...ఆయా టెస్టులన్నీ చేయించుకుని రిపోర్టులు ముందుంచుతాము.. ఇందుకు మీరు కూడా సిద్ధమా?’అంటూ సవాల్ విసిరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. -
కాంబోడియా సైబర్ నెట్వర్క్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కాంబోడియాలో నిర్వహిస్తున్న సైబర్ నేరాల నెట్వర్క్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్ల కాల్ సెంటర్లకు సిమ్ కార్డులు సప్లయ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మంగళవారం అరెస్ట్ చేసింది. కాంబోడియాకు తరలిస్తున్న 198 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ నెట్వర్క్ వివరాలను టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీకి మూడేళ్ల క్రితం దుబాయ్లో రిజ్వాన్తో పరిచయం ఏర్పడింది. తాను పనిచేస్తున్న కాల్ సెంటర్కు ఇండియాకు చెందిన సిమ్ కార్డులు సరఫరా చేస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తానని రిజ్వాన్ ప్రలోభపెట్టాడు. దీంతో అష్రఫ్ హైదరాబాద్ తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్తో పాటు హనుమకొండకు చెందిన నూనె అశోక్ (29)ల వద్ద 600 సిమ్ కార్డులు సేకరించాడు. ఇలా సేకరించిన సిమ్ కార్డులను మయన్మార్లోని సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్లు సహా సైబర్ నేరాలకు వినియోగించేవారు. గుట్టు రట్టవడంతో టీజీసీఎస్బీ అధికారులు అష్రఫ్ సహా రిజ్వాన్, సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్, హనుమకొండకు చెందిన నూనె అశోక్ను అరెస్ట్ చేశారు. -
తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)
-
Telangana: పారాక్వాట్ గడ్డిమందుపై సర్కార్ నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ గడ్డిమందుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో పారాక్వాట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చి, 60 రోజులపాటు రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, పంపిణీ, వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉండనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా పారాక్వాట్ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రానికి ఉన్న పరిమిత అధికారాలను ఉపయోగించి రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందును పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు నం. 24 జారీ చేసింది. అత్యంత విషపూరితమైన గడ్డిమందు..పారాక్వాట్ గడ్డిమందు వరి, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, ఇతర కూరగాయల సాగులో కలుపు నియంత్రణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇది అత్యంత విషపూరితమైనది. ఈ మందు పొలాల్లో పిచికారీ చేసే సమయంలో చర్మంపై లేదా కళ్లలో పడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడాలనే నిర్ణయం తీసుకొనే వాళ్లతో పాటు ప్రమాదవశాత్తు దీనిని తాగడం వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 1,167 మరణాలు నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మందు మనుషుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుండడంతో రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, పంపిణీ, వినియోగంపై తక్షణ నిషేధం విధించినట్లు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఈ గడ్డిమందు అమ్మకాలు నిర్వహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఈనాడుకు నాంపల్లి కోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ‘ఈనాడు’ దినపత్రికపై దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్ను నాంపల్లిలోని మొదటి అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ కేసు (ఎస్టీసీ ఎస్సార్ నెం.11/2026) ఆధారంగా ‘ఈనాడు’ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గురువారం పిటిషన్ను న్యాయస్థానం మరోసారి విచారించనుంది. ఆ పత్రికలో ప్రచురితమైన ఓ కథనానికి సంబంధించిన వివరాలను అథారిటీ కోరినా సంస్థ స్పందించకపోవడంతో ఈ ఏడాది జనవరిలో ప్రైవేట్ కంప్లైట్ ఫైల్ చేసింది. గత ఏడాది ఆగస్టు 17న ‘ఈనాడు’లో ‘షాడో నేత... వసూళ్ల మేత’ శీర్షికన ఓ కథనం ప్రచురితమైంది. రాష్ట్ర, జిల్లా అథారిటీలు ఆ కథనంలోని అంశాలను చర్చించి, ఆ అంశాలపై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించాయి. హైదరాబాద్ రీజియన్కు సంబంధించిన జిల్లా పోలీసు కంప్లైట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న మాజీ సెషన్స్ జడ్జ్ కె.సుదర్శన్కు ఆ బాధ్యతలు అప్పగించాయి. అదే కథనంలో ముగ్గురు డిప్యూటీ పోలీసు కమిషనర్ (డీసీపీ) ర్యాంకు అ«ధికారులకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ముగ్గురు పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడానికి కంప్లైంట్స్ అథారిటీ నిర్ణయించింది. దీంతో ఆ కథనానికి సంబంధించిన ఆ«ధారాలు, రిపోర్టర్ వివరాలు, వార్తకు సంబంధించిన ఒరిజినల్ కాపీ, రిపోర్టర్ అఫిడవిట్ తదితరాలను తమకు అందించాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 29న స్పీడ్ పోస్టు ద్వారా ‘ఈనాడు’ ఎడిటర్, పబ్లిషర్కు లేఖ రాసింది. సెపె్టంబర్ 1న లేఖ అందినట్లు గుర్తించింది. అయితే వివరాలను అందించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ‘ఈనాడు’కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 12న వీటిని జారీ చేసినప్పటికీ బాధ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జనవరి 2న నాంపల్లిలోని ఫస్ట్ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్స్ దాఖలు చేసింది. పత్రిక ఎడిటర్, పబ్లిషర్గా ఉన్న డీఎన్ ప్రసాద్పై ప్రాసిక్యూషన్ చేసి, చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్తో పాటు ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం, తాము పంపిన లేఖ, షోకాజ్ నోటీసులు తదితరాలను సంబంధించిన ప్రతుల్ని జత చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఎన్.శ్రీకాంత్ బాబు ప్రతివాదుల వ్యక్తిగత హాజరుకోరుతూ నోటీసులు జారీ చేశారు. -
నేడే విజయ యాత్ర
హైదరాబాద్: బజరంగ్దళ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరగనున్న వీర హనుమాన్ విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సుమారు 168 ర్యాలీలతో పాటు శోభాయాత్రలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా 3 వేల మంది పోలీసులతో పాటు సాయుధ బలగాలు, టాస్క్ఫోర్స్ బృందాలను సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు గౌలిగూడ రామమందిర్లో యజ్ఞంతో యాత్ర ప్రారంభమై.. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా, ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా, సుల్తాన్బజార్ చౌరస్తా నుంచి రాంకోఠి కాచిగూడ క్రాస్ రోడ్డు, నారాయణ గూడ క్రాస్రోడ్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా అశోక్నగర్, గాంధీనగర్, బన్సీలాల్పేట్, సిటీలైట్ హోటల్ సుభాష్ రోడ్డు, ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ రోడ్డు, ప్యారడైజ్ ఎక్స్రోడ్డు మీదుగా సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. -
వేసవి కబురు చల్లగా!
సాక్షి, హైదరాబాద్: వేసవి సీజన్పై ఐఎండీ చల్లని వార్త చెప్పింది. ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్– జూన్ మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు, హీట్వేవ్ అంచనాలను బుధవారం వాతావరణ శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధా రణం, అంతకంటే తక్కువగా నమోదవుతాయని వివరించింది. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని తెలిపింది. దీంతో పగటి పూట సాధారణ వాతావరణం ఉన్నప్పటికీ రాత్రి వేళ మాత్రం ఉక్కపోత ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే... ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవు తాయని, రెండు, మూడు తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతాయని వివరించింది. ఏప్రిల్ నెలలో సాధా రణ ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని పశ్చిమ ప్రాంత జిల్లాల్లో సాధారణం కంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు మధ్య తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా ఉంటాయని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం, కాస్త ఎక్కువగా ఉండొచ్చని వివరించింది.హీట్వేవ్ తక్కువే...: ప్రస్తుత వేసవి సీజన్లో రాష్ట్రంలో హీట్వేవ్ రోజులు తక్కు వగానే ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. గత మూడేళ్లుగా హీట్వేవ్ రోజులు తగ్గుతూ వచ్చాయి. 2024 వేసవి సీజన్లో 22 రోజుల పాటు వడగాలులు నమోదు కాగా గతేడాది కేవలం 10 రోజులు మాత్రమే నమోదయ్యాయి. ముందస్తు వర్షాలతో గత వేసవి సీజన్లో వరుసగా చాలా రోజులు వాతావరణం చల్లగా ఉంది. ప్రస్తుత సీజన్లో కూడా హీట్వేవ్ ప్రభావం అంతంతమాత్రమేనని, గరిష్టంగా 5 నుంచి 10 రోజుల్లోపై ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. నెలవారీగా వర్షపాతం గణాంకాలతో పోలిస్తే ఈసారి ఏప్రిల్–జూన్ నెలల్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. బుధవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 39.3డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 21.4డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి,. -
త్రివేండ్రం కమ్యూనిస్టు, ఢిల్లీ కమ్యూనలిస్టు
సాక్షి, హైదరాబాద్: కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ, తివేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఓడగొడితేనే కేరళకు మంచి రోజులు వస్తాయన్నారు. మోదీ–విజయన్లవి విభిన్న భావజాలాలైనా, భావాలొక్కటేనని, ఎల్డీఎఫ్– బీజేపీ మధ్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ రెడ్డి కేరళలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రివేండ్రం, నేమం, భరతన్నూర్, అలెప్పీ, కాయకుళం నియోజకవర్గాల్లో రోడ్షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కేరళ సీఎం పినరయి విజయన్ను ప్రధాని మోదీతో పోల్చారు. ప్రధాని మోదీకి, కేరళ సీఎం విజయన్కు తేడా ఏమీ లేదని, విజయన్ ద్వారా కేరళ భవిష్యత్తును అపహరించాలని మోదీ చూస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ ఓటు బ్యాంకు విజయన్కు బదిలీ అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్ మాత్రమేనని అన్నా రు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తుందని, విజయన్సర్కారుపై ఈగ కూడా వాలనీయదని ఆరోపించారు. కేరళ సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యమన్నారు. మలయాళంలో పలకరింపు గత పన్నెండేళ్లుగా ఢిల్లీలో... పదేళ్లుగా కేరళలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోదీ, కేరళలో విజయన్ డబుల్ ఫెయిల్యూర్గా నిలిచారని ధ్వజమెత్తారు. ఇరువురి సిద్ధాంతాలు వేరైనా వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతోందని, అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళ కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కేరళ అభివృద్ధికి రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని, వారిద్దరూ కేరళ కుటుంబ సభ్యుల్లా మారారని తెలిపారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ ఓ సినిమాలో చెప్పిన ’నీ పో మోనే.. దినేశా..’ తరహాలో ’నీ పో మోనే విజయన్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్’ (విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో) అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ మలయాళంలో పలకరించడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాత్రికి ఎర్నాకులంలో బస చేసిన రేవంత్ గురువారం కూడా కేరళ ప్రచారంలో పాల్గొననున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా రేవంత్తో కలిసి రోడ్షోలకు హాజరయ్యారు. కూనంనేని ఆక్షేపణ కేరళ సీఎం, మార్క్సిస్టు నేత పినరయి విజయన్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ తప్పుపట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విధానాలపై రేవంత్ విమర్శలు చేయొచ్చు కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరైంది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆక్షేపించారు. మోదీని విమర్శించవచ్చు కానీ, విజయన్ను మోదీతో పోల్చడం కూడా సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా కీలక భాగస్వాములనే విషయాన్ని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని కూనంనేని వ్యాఖ్యానించారు. -
Bangalore : తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
బెంగళూరులో తెలంగాణ దంపతులు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోవడం, వరుస ఆర్థిక ఇబ్బందుల వల్ల దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తెలంగాణకు చెందిన టెకీ బాను చందర్రెడ్డి (32) బెంగళూరులో తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది సేపటికే ఆయన భార్య, ఐబీఎంలో పనిచేస్తున్న బిబి షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.సిద్దిపేట జిల్లాకు చెందిన బాను చందర్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో పనిచేసేవారు. అయితే గతేడాది ఏఐ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారు. దీంతో భార్య షాజియాతో కలిసి భారత్కు తిరిగి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. దాదాపు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేసినా స్థిరమైన ఉద్యోగం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాబ్ మార్కెట్లో ఏఐ ఆధారిత మార్పులు, ఉద్యోగాల కోతల కారణంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.మరోవైపు, షాజియాతో మతాంతర వివాహం జరగడం వల్ల బాను చందర్రెడ్డిని అతని కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. ముఖ్యంగా తండ్రి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బాను చందర్ కుంగిపోయాడు. ఓ వైపు కుటుంబసభ్యులు దూరం పెట్టడం, ఆర్ధిక ఇబ్బందులతో ఒత్తిడికి గురైన బాను చందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని షాజియా తీవ్ర షాక్కు గురై 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో, తన మరణానికి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించవద్దని బాను చందర్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటన టెక్ రంగంలో ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. నిరుద్యోగం, కుటుంబ విభేదాలు, మానసిక ఒత్తిడి కలిసినప్పుడు ఎంతటి విషాద పరిణామాలు చోటు చేసుకోవచ్చో మరోసారి స్పష్టమైంది. -
నరెడ్కో తెలంగాణ కొత్త కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) తెలంగాణ విభాగానికి సంబంధించి 2026-2028 కాలానికి నూతన కార్యవర్గ సభ్యులు, కీలక అధికారుల నియామకం పూర్తయింది. మంగళవారం హైదరాబాద్లోని 'ఏపీఆర్ ఐల్' వేదికగా జరిగిన అసోసియేషన్ 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కొత్త బృందాన్ని అధికారికంగా ప్రకటించారు.నరెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా కాళీ ప్రసాద్ దామెర, గోపాలకృష్ణ కొరిపల్లి, సెక్రటరీ జనరల్గా వెంకటేశ్వరరావు రావుల, కోశాధికారిగా సుధాకర్ రెడ్డి కొండల నియమితులయ్యారు.ఎంపికైన నూతన నాయకత్వ బృందం 2026 నుండి 2028 వరకు రెండేళ్ల పాటు అసోసియేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిర వృద్ధిని పెంపొందించడం, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేయనుంది. -
హైదరాబాద్లో వైన్ షాపులు బంద్
సాక్షి,హైదరాబాద్: నగర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ యాక్ట్, 1968 లోని సెక్షన్ 20 ప్రకారం, 02.04.2026 ఉదయం 06.00 గంటల నుండి 03.04.2026 ఉదయం 06.00 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు (టాడీ షాప్స్), బార్లు, రెస్టారెంట్లలోని బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు స్పెషల్ కిట్ పంపిణీ చేయనున్నారు. 21 వస్తువులతో స్కూల్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కలర్ యూనిఫామ్ అమలు చేయాలని కూడా సర్కార్ నిర్ణయించింది.వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ వ్యవస్థల్లో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో 19 లక్షల మంది ఉన్నారు. -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తయారు చేశామన్నారు.ఈ పోర్టల్ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం.. ఈ పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రైతు కోణంలో రూపొందించామని సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 2 నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసిన పనిలేకుండా తన ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్ను రూపొందించామని అన్నారు. రైతులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారని.. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తనకు ఉన్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్నిఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంతచెల్లించాలో కనిపిస్తుంది.ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్కు వెళుతుంది. ఆతర్వాత రెండు రోజల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారు. తర్వాత ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెన్స్డ్ సర్వేయర్ ఖరారు చేయడమేగాక సర్వేకూడా రోవర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్టమ్లో నమోదు చేశాక అది మండల సర్వేయర్ స్య్రూటినీకి వెళుతుంది.ఆపై మండల తహశీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్పిఎమ్, భూధార్ నెంబర్ల కేటాయింపు జరుగుతుంది. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో కూడా నిక్షిప్తమవుతాయి. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ ను జనరేట్ చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఎస్ ఎమ్ ఎస్ అలర్ట్స్ పంపిస్తారు. భూభారతి చట్టంలో పేర్కొన్నవిధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ ( ఎల్పిఎమ్) యూనిక్ నెంబరు, అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ను కూడా ఇస్తామని వెల్లడించారు.ఈ ఐదు మండలాల్లో రైతులు దరఖాస్తు చేసుకున్నతర్వాత సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని అలాగే గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని, కచ్చితమైన సర్వే వివరాలు వస్తాయని తెలిపారు.భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని వాటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని రైతు ఇంటి నుంచే అన్నిసేవలు పొందేలా పారదర్శక వ్యవస్ధను తీసుకువస్తున్నామని ఇది రెవెన్యూ వ్యవస్ధలో చారిత్రాత్మక మార్పునకు నాంది అవుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. -
అతి వ్యాయామంతో ప్రాణాపాయం : ‘కోలా యూరిన్’ గురించి తెలుసా?
హైదరాబాద్, మార్చి 26, 2026: ‘నో పెయిన్.. నో గెయిన్’ (కష్టం లేనిదే ఫలితం ఉండదు) అనే సూత్రాన్ని నమ్మి జిమ్లో మితిమీరిన కసరత్తులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలోనే కండలుపెంచాలనే ఆరాటంతో చేసే కఠినమైన వ్యాయామాలు ‘రాబ్డోమయోలిసిస్’ (Rhabdomyolysis) అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తాయని వారు స్పష్టం చేశారు.ఒక్క రోజే 90 నిమిషాల కసరత్తు.. కిడ్నీలు ఫెయిల్!ఇటీవల ఫిట్నెస్ కోసం మొదటి రోజే జిమ్కు వెళ్లిన 25 ఏళ్ల యువకుడు, త్వరగా ఫలితం రావాలనే ఉద్దేశంతో ఏకంగా 90 నిమిషాల పాటు స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ మరియు పుష్-అప్స్ వంటి అత్యంత కఠినమైన వ్యాయామాలు చేశాడు. రెండు రోజుల తర్వాత అతనికి కండరాల నొప్పులు తీవ్రమవ్వడమే కాకుండా, మూత్రం రంగు మారి ‘కోలా’ లేదా టీ డికాషన్ రంగులోకి మారింది. పరిస్థితి విషమించడంతో అతను ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. పరీక్షల్లో అతని శరీరంలో కండరాల విచ్ఛిన్నం వల్ల విడుదలయ్యే ‘మయోగ్లోబిన్’ స్థాయిలు పెరిగి, కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనినే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ రాబ్డోమయోలిసిస్’ అంటారు. ఏమిటీ రాబ్డోమయోలిసిస్?కండరాలు విపరీతంగా అలసిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటిలోని కణాలు విచ్ఛిన్నమై ‘మయోగ్లోబిన్’ అనే ప్రోటీన్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్రోటీన్ కిడ్నీలలోని సూక్ష్మ నాళాలను మూసివేస్తుంది (Clogging). దీనివల్ల కిడ్నీలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతింటాయి. సకాలంలో గుర్తించకపోతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.గుర్తించాల్సిన ప్రమాద సంకేతాలు: వ్యాయామం చేసే వారు ఈ క్రింది లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదుమూత్రం రంగు మారడం: మూత్రం కోలా లేదా టీ రంగులోకి మారడం అత్యంత ముఖ్యమైన సంకేతం.తీవ్రమైన కండరాల నొప్పి: సాధారణ నొప్పి కంటే భిన్నంగా, కండరాలు వాపు రావడం.నీరసం: విపరీతమైన అలసట లేదా కండరాల్లో శక్తి లేకపోవడం.తక్కువ మూత్ర విసర్జన: రోజువారీ కంటే మూత్రం రావడం తగ్గిపోవడం. వాంతులు: వికారం లేదా వాంతులు అవ్వడం.సకాలంలో చికిత్సతో ప్రాణాపాయం నుంచి విముక్తిఈ యువకుడి కేసులో ఏఐఎన్యూ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ సమన్వయంతో చికిత్స అందించారు. రోగికి తగినంత ద్రవాలను అందిస్తూ (Aggressive Hydration),ఎలక్ట్రోలైట్ సమ తుల్యతను కాపాడటం ద్వారా కిడ్నీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నట్టు హైటెక్ సిటీలోని ఏఐఎన్యూ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. జిమ్కు వెళ్లే వారికి వైద్యుల సూచనలునెమ్మదిగా ప్రారంభించండి: మొదటి రోజే కఠినమైన వ్యాయామాలు వద్దు. క్రమక్రమంగా తీవ్రతను పెంచాలి.నీరు ఎక్కువగా తాగాలి: వ్యాయామానికి ముందు, తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.విశ్రాంతి అవసరం: కండరాలు కోలుకోవడానికి వారంలో కనీసం ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలి. నొప్పిని భరించొద్దు: తీవ్రమైన నొప్పి ఉంటే వ్యాయామం ఆపేయాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ జిమ్ చేయడం ప్రాణాంతకం."వ్యాయామం అనేది ఒక ఔషధం లాంటిది. అది సరైన మోతాదులో ఉన్నప్పుడే ఆరోగ్యం. శరీరం ఇచ్చే హెచ్చరికలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి," అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? -
శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్య, పిల్లలను నరికేసి..
రంగారెడ్డి జిల్లా: కట్టుకున్న భార్యతోపాటు అభంశుభం తెలియని చిన్నారులపై ఓ వ్యక్తి మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరించాడు. రోకలి, చాకుతో దాడి చేశాడు. భార్య, కుమారుడు మృతిచెందగా కూతురు మృత్యువుతో పోరాడుతోంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్ పంచాయతీలోని పులుగోనిపల్లితండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బాణావత్ రాందాస్నాయక్ ఆమనగల్లులోని ఓ కాటన్మిల్లులో కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య కవిత, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కవిత కూలి పనికి వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. కూతుళ్లు పవిత్ర, పావని ఆమనగల్లులోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా కుమారుడు, చిన్న కూతురు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. కొన్నేళ్లుగా రాందాస్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతున్నాడు. స్థానిక పెద్దలు, పోలీసులు పలుమార్లు సర్దిచెప్పినా ఆయనలో మార్పు రాలేదు. సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య కవిత (32), కుమారుడు హర్ష(6), కూతురు ప్రణీతపై చాకు, రోకలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కవిత, హర్ష అక్కడికక్కడే మృతిచెందారు. ఇరుగుపొరుగు వారు సమాచారం అందించగా.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రణీతను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి, తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు రాందాస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
‘శిరసా’వహిస్తేనే ఊళ్లోకి రండి!
ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ పాలకవర్గం వినూత్న ఆలోచన చేసింది. తమ గ్రామంలోకి వచ్చే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో గ్రామంలోకి ప్రవేశం లేదని గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పోలీసులు ఇటీవల ‘అరైవ్..అలైవ్’కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రత కోసం తమ పాలకవర్గం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ ధరావత్ శివాజీ విజ్ఞప్తి చేశారు. -
భర్త రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పచ్చని కాపురాల్లో కలహాలు చిచ్చురేపాయి. మద్యం, మనస్పర్థలు, అక్రమ సంబంధాలు.. ఇలా కారణమేదైనా.. బంధాలు బలి అయ్యాయి. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. మూసాపేట/చెన్నారావుపేట: భర్త రెండో పెళ్లి చేసుకొని వేధిస్తూ ఉండటంతో వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలను చంపి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ ఏసీపీ నరేష్ స్థానికుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా, చెన్నారావు పేట మండలం బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్ (31) అదే మండలంలోని పదహార చింతల తండాకు చెందిన స్రవంతి (27) పదమూడేళ్ల కిందట ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి కౌశిక్ (10), కార్తీక్ (8) సంతానం. వీరు మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో ఉంటున్నారు. స్రవంతి దగ్గర బంధువుల అమ్మాయి మహేశ్వరి అలియాస్ సోనూ పరిచయం కాగా, ప్రవీణ్ ఆమెను సంవత్సరం కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ రెండో భార్య వద్దకు వెళ్లి వచ్చేవాడు. స్రవంతిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె పిల్లలను తీసుకుని నాలుగు రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. అయితే ప్రవీణ్.. స్రవంతి, పిల్లలు కావాలంటూ సోమవారం సాయంత్రం వారిని తన ఇంటికి తీసుకొచ్చాడు. మంగళవారం ఉదయం ప్రవీణ్ పనికి వెళ్లడంతో స్రవంతి, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ప్రవీణ్ మధ్యాహ్నం ఇంటికి రాగా తలుపులు మూసిఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా స్రవంతి, ఇద్దరు కుమారులు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. తల్లి ఇద్దరు కుమారులకు ఉరేసిన అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. స్రవంతి, ఇద్దరు పిల్లలను ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. స్రవంతి బంధువులు వరంగల్ జిల్లాలోని ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. -
HYD: భారీగా హైడ్రా కూల్చివేతలు
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైలార్దేవుపల్లి సర్కిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. మైలార్దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. దీంతో, బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలిసింది.అంతకుముందు మంగళవారం కూడా హైడ్రా ఆక్రమణల కూల్చివేత చేపట్టింది. మంచిరేవుల గ్రామంలోని నాగిరెడ్డికుంటలో 7 ఎకరాల స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జాలో ఉంచుకున్నట్లు తేలింది. సర్వే చేయగా.. సదరు సంస్థ కబ్జాచేయగా మిగిలిన భూమిని, స్థానిక నేత విక్రయించినట్లు స్పష్టమైంది. ఆ మేరకు మొత్తం ఆక్రమణలను నేలమట్టం చేశామని హైడ్రా వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.934 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, బౌరంపేట్లోని గండిమైసమ్మ-మియాపూర్ రహదారికి ఇరువైపులా ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన రేకుల షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. ఘట్కేసర్ వద్దనున్న అవుషాపూర్లో.. ఇళ్ల స్థలాలుగా మారిన 1,440 గజాల పార్కు భూమికి, జూబ్లిహిల్స్లో ఆక్రమణకు గురైన 300గజాల వరద నాలాకు హైడ్రా విముక్తి కల్పించింది. -
మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ ఎన్ని సవాళ్లు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపుతుందని, దానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకమే నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి మొదలైన తర్వాత జీరో టికెట్ల మొత్తం రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రజాభవన్లో మహిళా సంఘాల సభ్యులతో ప్రభుత్వం అభినందన సభ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే, బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ వసతి పథకాన్ని ప్రారంభించిందని, దాని రూపంలో ఇప్పటి వరకు 290 కోట్ల ప్రయాణాలతో మహిళలు ఆదా చేసుకున్న మొత్తం రూ.10 వేల కోట్లకు చేరుకోగా, అంతేమొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం అందజేసి దాన్ని ఆదుకుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, వీలైతే ఈ మొత్తాన్ని రూ.లక్షన్నర కోట్లకు చేరుస్తామని ప్రకటించారు. ఈ లక్ష్య సాధనలో సంవత్సరానికి రూ.20 వేల కోట్లు ఇచ్చే దిశలో ఇప్పటికే రూ.57 వేల కోట్లను అందజేసినట్లు వెల్లడించారు. వాటిపై ప్రభుత్వం వడ్డీ భరిస్తూ రూ.1329 కోట్లను చెల్లించిందని, తాజా బడ్జెట్లో వడ్డీ కోసం రూ.రెండున్నర వేల కోట్లను ప్రతిపాదించిందని, ఐదేళ్లలో రూ.10 వేల కోట్లను ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని భరిస్తుందని తెలిపారు. ఆరీ్టసీకి బకాయిల భారమున్నా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కారి్మక సంఘాల పునరుద్ధరణ అంశాలు తప్ప సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను కొలిక్కి తెస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత ప్రయాణ పథకాన్ని విమర్శించే వారికి, ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలే తిరుగుబాటు ద్వారా సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ సందర్భంగా ఉచిత ప్రయాణ వసతికి సంబంధించి రూ.10 వేల కోట్ల మొత్తాన్ని ఆరీ్టసీకి రీయింబర్స్ చేయడానికి గుర్తుగా రూ. 10,000 కోట్ల మెగా చెక్కును మంత్రులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్, ప్రేమ్సాగర్ రావు, మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, సెర్ఫ్ సీఈవో దివ్య, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు సీహెచ్.వెంకన్న, ఖుస్రో షా ఖాన్ , రాజశేఖర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతాకృష్ణన్ పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
చర్చించకుండా పారిపోయారు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టి.హరీశ్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
టోల్ ఇక్కడ తగ్గింది.. అక్కడ పెరిగింది
చౌటుప్పల్/రఘునాథపల్లి/దేవరుప్పుల/మంచిర్యాల: హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్–వరంగల్, జనగామ–సూర్యాపేట రూట్లో స్వల్పంగా పెరిగాయి. తగ్గిన, పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు తగ్గడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని ఇబ్రహీంపట్నం మండలం చిల్లకల్లు టోల్ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ ధరలు కూడా ఒక టోల్ప్లాజా వద్ద తగ్గితే మరో టోల్ప్లాజా వద్ద యథావిధిగా ఉన్నాయి. ⇒ పంతంగి టోల్ప్లాజా వద్ద త్రీ యాక్సల్ వాహనాలకు మాత్రమే ఇరువైపులా 5 రూపాయలు తగ్గనుంది, మిగిలిన వాహనాలకు తగ్గింపు చేయలేదు. ఇక్కడ త్రీ యాక్సల్ వాహనాలకు ఒక వైపునకు రూ.290 నుంచి రూ.285కు, ఇరువైపులా రూ.435 నుంచి రూ.430 తగ్గింది. ⇒ కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద కూడా కేవలం త్రీ యాక్సస్ వాహనాలకు మాత్రమే ఐదు రూపాయలు తగ్గనుంది. ఇక్కడ ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కు, రెండు వైపులా రూ.675 నుంచి రూ.670కు తగ్గుతుంది. ⇒ ఏపీలోని చిల్లకల్లు వద్ద కారు, జీపు, వ్యాను, లైట్ మోటారు వాహనాలకు ఐదు రూపాయలు తగ్గించారు. ఇక్కడ వీటికి ఒకవైపునకు రూ.105 నుంచి రూ.100కు తగ్గించారు. రెండు యాక్సల్ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కు, మూడు యాక్సల్ వాహనాలకు 24గంటల్లో ఇరువైపులా రూ.570 నుంచి రూ.565కు తగ్గించారు. ⇒ మంచిర్యాల–చంద్రాపూర్ జాతీయ రహదారి 363పై మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరండి టోల్ ప్లాజాల్లో గతేడాదితో పోలిస్తే కనీసం రూ.5 నుంచి నెలవారీ పాస్లపై గరిష్టంగా 25 చొప్పున తగ్గాయి. ఒకవైపు రాకపోకలు సాగించే మినీ వాహనాలకు ఒకవైపు జర్నీకి రూ.150 ఉండగా, 145కు తగ్గించారు. 3 జతల టైర్ల వాహనాలకు రూ.340 ఉండగా, ప్రస్తుతం రూ.335కు తగ్గింది. అలాగే నెలవారీ పాస్లు సైతం ఒక్కో పాస్కు రూ.25 నుంచి గరిష్టంగా ఏడు జతల భారీ వాహనాల వరకు రూ.160 వరకు తగ్గాయి. ⇒ జనగామ –సూర్యాపేట రహదారిలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి ప్లాజా వద్ద రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ చార్జీలు పెరిగాయి. కారు (నాలుగు టైర్ల వాహనాలు)కు రూ.35 నుంచి రూ.40, లైట్ కమర్షియల్ వాహనాలకు ప్రస్తుత రేటు రూ.60 ఉండగా ఇందులో ఎలాంటి మార్పు లేదు. బస్సు, ట్రక్కు వాహనాలకు ప్రస్తుతం రూ.125 ఉండగా 130కి పెరిగింది. రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనానికి ప్రస్తుతం రూ.135కి 140 పెరగగా, రిటర్న్ జర్నీకి రూ.5, ఫోర్ టూ సిక్స్ యాక్సల్స్ వాహనాలకు ప్రస్తుతం రూ.295 నుంచి 300కు పెరగగా రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. సెవన్ టూఓహెచ్సీ వాహనాలకు ప్రస్తుతం రూ.240 ఉండగా 245కి, రిటర్న్ జర్నీకి రూ.355 నుంచి 365కి పెరిగింది. ⇒ వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై యాద్రాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజాల వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు ఒకవైపునకు రూ. 5 పెరిగింది. లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు సింగిల్ జర్నీకి రూ. 5పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.10 పెరిగింది. బస్సు, ట్రక్కుకు ఒకవైపునకు రూ.15 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.10, రిటర్న్ జర్నీకి రూ.15 పెరిగింది. భారీ వాహనాలకు ఒక వైపునకు రూ.20 పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.25 పెరిగింది. పెరిగిన వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము టోల్ప్లాజాల వద్ద స్వల్పంగా టోల్ రుసుమును తగ్గించినా, వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుమును సైతం స్వల్పంగా పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము రూ.3000 ఉండగా దానిని రూ.3075కు పెంచారు. ట్రిప్పుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. -
మీరే పరిష్కరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో నదీ యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఇకపై నీటి తరలింపు, ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలను మీకు మీరే పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తేల్చిచెప్పింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ విషయంలో రెండు రాష్ట్రాలు ప్రస్తుతం అమల్లో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు లోబడి నడుచుకోవాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖలకు మార్చి 30న లేఖ రాసింది. ఏపీ శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ కిందికి నీళ్లను విడుదల చేస్తుండడంతో జలాశయం ఖాళీ అవుతోందని, తమ సాగునీటి అవసరాలతో పాటు వేసవి తాగునీటి అవసరాలకి నిల్వలను పరిరక్షించడం కోసం జల విద్యుదుత్పత్తి జరపకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కోరుతూ తెలంగాణ మార్చి 25న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖకు స్పందిస్తూ రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు తాజాగా లేఖ రాసింది. పెండింగ్ అంశాలతో బోర్డుకు ప్రాథమిక పరిమితులు.. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా పునః కేటాయింపులు జరపడంతో పాటు ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్స్ను జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఖరారు చేయాల్సి ఉంది. అలాగే ఏపీ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు రెండు రాష్ట్రాలు ఉమ్మడి జలాశయాలను కృష్ణా బోర్డుకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయాలు తేలకపోవడం.. తమ విధులకు సంబంధించి ప్రాథమిక పరిమితులుగా మారిందని కృష్ణా బోర్డు పేర్కొంది. ఇవన్నీ తేలేవరకు పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఇకనైనా ఏపీని కట్టడి చేయాలి – కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరపకుండా ఏపీ జెన్కోను కట్టడి చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మార్చి 25న లేఖ రాసింది. ‘శ్రీశైలం జలాశయంలో నిల్వలు గత మార్చి 20 నాటికి 839.9 అడుగులకు పడిపోవడంతో కనీస నిల్వ మట్టానికి ఎగువన 7.824 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాష్ట్రానికి తాగునీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వలను పరిరక్షించాల్సి ఉంది. నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ఆయకట్టు అవసరాలను తీర్చడానికే ఏపీ.. శ్రీశైలం నుంచి సాగర్కు విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. సాగర్ కుడి ప్రధాన కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఏపీ ఇప్పటికే 178.06 టీఎంసీలను తరలించుకుంది..’ అని తెలంగాణ వివరించింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ ఏకంగా 738.25 టీఎంసీల (76.19శాతం) కృష్ణా జలాలను వాడుకోగా, తాము 230.76 టీఎంసీలు (23.18శాతం) మాత్రమే వాడుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ ఇంకా నీళ్లు తీసుకోకుండా కట్టడి చేయాలని ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా బోర్డు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఏపీని కట్టడి చేయాలని కోరింది. లెక్కలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండికేంద్ర జలశక్తి శాఖ 2015 జూన్ 18, 19న ఏపీ, తెలంగాణతో నిర్వహించిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపకాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించిన విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఇటీవల కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం ప్రస్తావించింది. త్రిసభ్య కమిటీ, సీడబ్ల్యూసీ కమిటీతో పాటు ఇతర వేదికలను జల వివాదాల పరిష్కారానికి వినియోగించుకోవాలని సూచించింది. మరోవైపు ఒక్కో మేజర్, మీడియం ప్రాజెక్టుతో పాటు స్థూలంగా అన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ప్రతినెలా వాడుకుంటున్న కృష్ణా జలాల లెక్కలను రెండు రాష్ట్రాలు క్రమం తప్పకుండా తమ వెబ్పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కృష్ణా బోర్డు కోరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం త్రిసభ్య కమిటీ సమావేశమైనప్పుడు ఈ గణాంకాలు అవసరం అవుతాయని తెలిపింది. -
దారుణం.. ఆస్పత్రి ఫ్లష్ట్యాంక్లో శిశువు మృతదేహం
హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కూకట్పల్లి రాందేవ్రావు ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రి మహిళా వాష్రూమ్ ఫ్లష్ ట్యాంకులో శిశువు డెడ్ బాడీ లభించడం హృదయ విదారకంగా మారింది. ఓ మహిళ ప్రసవం అనంతరం శిశువును ఫ్లష్ ట్యాంక్లో పడేసింది. ఆపై అక్కడ నుంచి పరారైంది. ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనతో అంతా షాక్కు గురౌతున్నారు. అప్పుడే పుట్టిన పసికందను ఇలా ఫ్లష్ ట్యాంక్లు పడేయడం ఏంటని విస్తుపోతున్నారు. -
శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
హైదరాబాద్: ఏప్రిల్ 2వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను అత్యంత ప్రశాంతంగా, దిగ్విజయంగా నిర్వహించేందుకు నగర పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్ర ఏర్పాట్లపై కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖలు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రను అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసినట్లే, హనుమాన్ విజయ యాత్రను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు వెల్లడించారు.యాత్ర నిర్వహణలో వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు.యాత్రలో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిర్ణీత మార్గాల్లోనే యాత్ర సాగేలా చూడాలని కోరారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల దృష్ట్యా విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మళ్లింపులు చేపడతామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమావేశం అనంతరం సీపీ గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
HYD: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులను హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో తల్లి స్రవంతి ముందుగా ఇద్దరు కుమారులు కార్తిక్,కౌశిక్లను హత్య చేసింది. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, భార్య స్రవంతిని వదిలేసి భర్త ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత్తమామలు స్రవంతికి కొంత స్థలాన్ని రాసిచ్చారు. అయితే, ఆ స్థలాన్ని తిరిగి ఇవ్వాలని భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇదే కారణంగా భార్య, పిల్లలను భర్త ప్రవీణ్ హత్య చేసి ఉండవచ్చని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. -
రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్
హైదరాబాద్: రిటైల్ చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. దీనిలో భాగంగా రేపట్నుంచి(బుధవారం, ఏప్రిల్ 1వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం (మార్జిన్) తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తోంది చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చే వారని, గత 20 ఏళ్ళుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని, కానీ ఇటీవల మార్జిన్ను16 రూపాయలకు తగ్గించారని, ప్రస్తుతం కేజీ చికెన్కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తుంది.అసోసియేషన్ నాయకుల చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటించనున్నట్లు ప్రకటించారు.ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశముంది. ముఖ్యంగా వేసవి కాలంలో చికెన్కు ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు. లేదంటే ఈ బంద్ దీర్ఘకాలం కొనసాగి మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య
బెంగళూరులో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన యువ టెకీ దంపతులు బెంగళూరులో విషాదకరమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32), సోమవారం తన అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను చందర్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ ఇంటి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమె పదేపదే తలుపు తట్టినా లోపల ఉన్న భర్త స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భద్రతా సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, భాను మృతదేహం కనిపించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకొన్ని నిమిషాల తర్వాత, షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదంలో మునిగి పోయాయి. తెలంగాణలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా రెండు వేర్వేరు బలవంతపు మరణాలు కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాలనుపోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వీరి మరణాలకు ప్రేరేపించిన అంశాలు ఆరోగ్య సమస్యలా? మానసిక క్షోభ? ఇతర కారణాలపై ఆరాతీస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు! -
సినిమాల్లో హీరోలు తాగితే తప్పు లేదా?: అనిరుధ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినిమా వాళ్ళు చేస్తే ఒప్పు, రాజకీయ నాయకులం చెప్తే తప్పా? అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన సీఎల్పీ మీడియా హాల్లో మాట్లాడుతూ.. హీరోలకంటే రాజకీయ నాయకులకు ప్రైవసీ లేకుండా పోయింది.. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా?’’ అంటూ మండిపడ్డారు.‘‘ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తాగుతాడు. ధూల్పేటలో గుడుంబా దొరుకుంటుందని సినిమాలో చూపెట్టాడు. బాలకృష్ణ సినిమాలో మామా ఏక్ పెగ్ లా అనే పాటలో నటించాడు. మందుబాబులం అనే పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశారు. రాజకీయ నాయకులం కల్తీసారా తాగకండి అంటే బద్నాం చేస్తారా.. ఎక్కువ డ్రగ్స్ వాడేది సినీ ఇండస్ట్రీ లోనే’’ అని అనిరుధ్రెడ్డి ఆరోపణలు గుప్పించారు.‘‘సినీ యాక్టర్స్ అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. సినిమా వాళ్లపైనే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. మా రాజకీయ నాయకులపై ఎక్కువగా రూమర్స్ లేవు. అందరూ సినిమా యాక్టర్స్ 90 రోజుల కోకసారి పాలికర్ టెస్ట్ చేయించుకోవాలి. నేను కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా.. నా కొడుకు నన్ను డ్రగ్స్ గురించి అడిగాడు. ఇప్ప సారా ఇండియన్ లిక్కర్. ఇప్పసారాను బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పసారాకు 3000 ఏండ్ల చరిత్ర ఉంది. నేను సారాకి వ్యతిరేకం. తాగమంటున్నాడని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.కల్తీ సారా కంటే ఇప్పసారా చాలా మంచిది. రాలిపోయిన ఇప్ప పూల నుండి సారా చేస్తారు. ఇప్ప సారా వల్ల లాభాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఆదివాసీలు లిక్కర్ చేస్తే తప్పా?. కార్పొరేట్ కంపెనీలు లిక్కర్ చేస్తే కరెక్టా?. ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ మంచిది. ఇండియా నుండి తీసుకుపోతున్న ఇప్ప పువ్వుతో విదేశాల్లో సారా చేసి వేలల్లో సంపాదిస్తున్నారు. ఆదివాసీలు ఉన్నారు కాబట్టే అడవులు ఉన్నాయి’’ అని అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. -
కాకతీయ వర్శిటీలో దారుణం
సాక్షి, హనుమకొండ జిల్లా : హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి.విశ్వవిద్యాలయంలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
“పోలీస్ అక్క”కు రేవంత్ అభినందనలు
హైదరాబాద్: ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానకి షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మహిళల భద్రతపై అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దాదాపు 7,000 మంది విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించడం ప్రశంసనీయమని అన్నారు.నిర్మల్ లో నిర్వహించిన "పోలీస్ అక్క" కార్యక్రమం యావత్ పోలీసు యంత్రాంగానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి కొనియాడారు. సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మహిళా పోలీసు అధికారులు పోలీస్ అక్కలుగా మారి మహిళలు, బాలికలకు ఆత్మవిశ్వాసం కల్పించడం అభినందనీయమన్నారు.మహిళల భద్రత కోసం, ముఖ్యంగా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఒక వినూత్నమైన ఆలోచనతో “పోలీస్ అక్క” పేరిట నిర్మల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ (SKOCH) అవార్డు లభించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.బండి సంజయ్ అభినందనలుప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు సాధించినందుకు ఐపీఎస్ జానకి షర్మిల, నిర్మల్ జిల్లా పోలీసులకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. నిర్మల్లో పోలీస్ అక్క వంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి విజన్ ఎలా ఉండాలో, హార్డ్వర్క్ ఎలా చేయాలో ఈ అవార్డు చాటిచెబుతుంది. పోలీస్ అక్క కార్యక్రమం కరుణతో కూడిన పోలీసింగ్ ఎలా జీవితాలను మార్చగలదో చూపించడానికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది. మహిళా అధికారులను మార్గదర్శకులు, రక్షకులుగా నిలబెట్టడం ద్వారా ఈ కార్యక్రమం భద్రతను మాత్రమే కాకుండా యువతుల్లో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తమ భవిష్యత్తును సురక్షితంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది’ అని అన్నారు.తెలంగాణ డీజీపీ ప్రశంసలుకరుణతో కూడిన పోలీసింగ్ను పోలీస్ అక్క వంటి అద్భుతమైన కార్యక్రమం ప్రతిబింబిస్తుందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రక్షణతో పాటు అంతకుమించి ఆత్మవిశ్వాసం, మార్గదర్శకత్వం, భద్రత భావాన్ని అందించే స్ఫూర్తిదాయక ప్రయత్నమని చెప్పారు. నిర్మల్ జిల్లాలో జానకి షర్మిల నాయకత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమానికి స్కోచ్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. భద్రతతో కూడిన సమాజ నిర్మాణంలో ఇది గొప్ప ముందడుగని చెప్పారు. -
హనీ ట్రాప్ బారిన ప్రముఖులు? బయటకు రాని భారీ స్కాం!
ఖమ్మం జిల్లా: రాష్ట్రంలో ఎక్కడ సైబర్ క్రైం జరిగినా అందరి చూపు కల్లూరు డివిజన్పైనే పడుతోంది. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ ముఠా అయ్యప్ప సొసైటీ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి రూ.90 కోట్ల మేర కొల్లగొట్టారంటూ గత ఏడాది నవంబర్ 29న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ప్రాంతవాసులు ఉలికిపడ్డారు. అలాగే, డిసెంబర్ 24న రూ.547 కోట్ల మేర సైబర్నేరం వెలుగు చూడగా, ఇందులోనూ పోట్రు ప్రవీణ్తో పాటు మరికొందరే కాక మూల్ అకౌంట్లు ఇచ్చిన 45 మందిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుకు వెనుకంజకల్లూరు మండల కేంద్రంగా హనీ ట్రాప్తో సైబర్ నేరగాళ్లు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు కొల్లగొట్టారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. సుమారు ఆరు నెలల క్రితం హానీ ట్రాప్ జరగగా, పలువురు ప్రముఖులు బాధితుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడం... కల్లూరు ప్రాంతవాసులు పలు సైబర్ నేరాల్లో నిందితులు కావడంతో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. అయితే, హనీ ట్రాప్తో నష్టపోయినట్లు చెబితే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని సమాచారం. కానీ రూ.కోట్లల్లో మోసం కావడంతో పోలీసులు విచారణ చేడుతూనే హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇదేసమయాన గతంలో వెలుగు చూసిన సైబర్ నేరాల్లో ప్రధాన నిందితులు, వారి సన్నిహితుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాల కోసం రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేఖలు పంపించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల్లో కొందరి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది.ధైర్యంగా ఫిర్యాదు చేయండిసైబర్ నేరాల్లో డబ్బు కోల్పోయిన బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. బాధితుల గోప్యతకు భంగం ఏర్పడకుండా విచారణ చేపడుతాం. గతంలో నమోదైన సైబర్ కేసులు విచారణ దశలో ఉన్నాయి. హనీట్రాప్పై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.– వసుంధర యాదవ్, కల్లూరు ఏసీపీ -
కారుపై చెత్త.. ఇదే శిక్ష
హైదరాబాద్: చెత్త తరలించేందుకు అవకాశం లేకుండా కార్లను అడ్డుగా పార్కింగ్ చేయడంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల డివిజన్ దుర్గా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్ వద్ద పరిశుభ్రత పనులు చేయడానికి సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చారు. రోడ్ల పక్కన పోగైన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించడానికి జేసీబీ, టిప్పర్లను తీసుకోవచ్చారు. సర్కిల్ ఉప కమిషనర్ శంకర్ సింగ్ కూడా వచ్చారు. అడ్డుగా ఉన్న కార్ల యజమానులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఉప కమిషనర్ ఆదేశాల మేరకు చెత్తను కార్లపై వేయించారు. దీంతో అటుగా వెళుతున్న వారు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. -
తాగిన మైకంలో కత్తి పట్టుకుని భార్యాపిల్లలపై..
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో భార్యాపిల్లలపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి. ఆమనగల్ మండలం పులిగోని పల్లి తండాలో ఈ దారుణం జరిగింది. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు ఆ వ్యక్తి.బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతుర్ని కత్తితో పొడిచాడు. దీంతో అతడి భార్య, కుమారుడు మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఆ బాలికకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ బాణావత్ పాల్పడ్డ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య పేరు కవిత, కుమారుడి పేరు హర్ష, కూతురి పేరు ప్రణితగా గుర్తించారు. -
వేసవిలో వర్షాలు.. బాబోయ్ దంచికొట్టేస్తున్నాయ్..
హైదరాబాద్: వేసవికాలంలో వర్షాలు దంచికొడుతున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రైతులు నష్టపోయారు. ఇక, ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాలలో వర్షాలు కురుస్తాయని అన్నారు.తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. గత అర్ధరాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి, చింత, వరి పంటలు నేలరాలాయి. అకాల వర్షానికి రైతులు పంటలు నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం (మార్చి 31) ఉదయం తెల్లవారుజామున గంటపాటు భారీ వర్షం పడింది. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కాయ నేల రాలడంతో ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులకు నష్ట పరిహారమందించాలని కోరుతున్నారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న పంటలను కూడా దెబ్బతీసింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, దొంకేశ్వర్ మాక్లూర్ ఆలూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేలరాలిపోగా, కలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
-
ఉత్సాహంగా నోస్టాల్జియా–2026 అలుమిని మీట్
హైదరాబాద్: బంజారాహిల్స్లోని ముఫకంజా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ అలుమిని మీట్ సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నోస్టాల్జియా 2026 పేరుతో నిర్వహించిన ఈ అలుమిని మీట్లో వివిధ బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులతో పాటు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్ మాట్లాడుతూ కాలేజీ నుంచి వెళ్ళిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి మన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ఇది ఎంతో సంతోషకర విషయమని అన్నారు. ప్రతియేటా డిసెంబర్లో ఈ అలుమిని మీట్ ఇక నుంచి తప్పకుండా జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు నాటి అధ్యాపకులకు సొసైటీ చైర్మన్ మహ్మద్ వలియుల్లా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ హేమరాజ్, అడ్వజర్ కమ్ డైరెక్టర్ మహిపాల్ సింగ్రావత్, రిజిస్ట్రార్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ఒంటరి మహిళలే అతని టార్గెట్
హైదరాబాద్: బెట్టింగ్ కు బానిసై.. ఒంటరి మహిళలను మభ్యపెట్టి కారులో తీసుకువెళ్లి హత్యలు చేస్తున్న సీరియల్ సైకో కిల్లర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా చనగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా ఉన్నాడు. కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసయ్యాడు. ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. ఫిలింనగర్ రోడ్ నెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న తన కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ నగలు అమ్మిన డబ్బును మళ్లీ బెట్టింగ్లో పెట్టాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్లో రోజూ బట్టలు ఉతికి ఇస్త్రే చేసే మంగతాయారమ్మ (60)ని టార్గెట్ చేశాడు. ఈ నెల 17న ఆమె పని ముగించుకుని బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్నగర్లో దింపుతానని తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. మోకిల పోలీస్స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు మిస్సింగ్ కేసులు నమోదు చేసిన అనంతరం యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది. దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా బెట్టింగ్ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఒకవేళ పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
పేలిన ట్రాన్స్ఫార్మర్.. ఎగిసిపడ్డ మంటలు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ మార్తాండనగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న టాటాఏస్ వాహనం, రెండు బైకులు దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.2 రోజుల క్రితమే మణికొండలో.. వేసవికాలం కావడంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. హైదరాబాద్లోని మణికొండలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడివారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో ప్రమాదం తప్పింది. నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. -
కమర్షియల్ సిలిండర్ రూ.6 వేలు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నరగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ఓ వ్యక్తి... పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న కొరతను క్యాష్ చేసుకోసాగాడు. అతడి దందాపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం దాడి చేశారు. ప్రధాన నిందితుడు సహా పదిమందిని అరెస్టు చేసి, రూ.21 లక్షల విలువైన 414 సిలిండర్లు, పది వాహనాలు స్వా«దీనం చేసుకున్నట్టు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేంధర్తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ప్రధాన నిందితుడు మొహమ్మద్ అమీర్ భార్య పేరుతో గ్యాస్ డీలర్షిప్ తీసుకుని అఫ్జల్గంజ్లో ‘మెట్రో గ్యాస్ ఏజెన్సీ’ నిర్వహిస్తున్నాడు. దీనికి శంషాబాద్లో భారీ గోదాం కూడా ఉంది. అయితే, బ్లాక్ మార్కెట్ దందాకు పథకం వేసిన అమీర్.. ఏడాదిన్నర క్రితం బంజారాహిల్స్ నాగార్జున సర్కిల్ సమీపంలోని ఓ ప్రార్థన స్థలం ప్రాంగణాన్ని నెలకు రూ.5 వేలకు అద్దెకు తీసుకున్నాడు. 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమంగా సిలిండర్లను నిల్వ ఉంచాడు. మొహమ్మద్ యూసుఫ్ను అక్కడ నియమించాడు. గ్యాస్ కోసం సంప్రదించే వ్యాపారులను ఈ ప్రాంతానికి వెళ్లమని సూచించేవాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం వాణిజ్య సిలిండర్ను రూ.2,100కు విక్రయించాలి. కానీ, కొన్ని రోజులు రూ.4 వేల చొప్పున అమ్మారు. ఇటీవల గ్యాస్ సంక్షోభం ఏర్పడడంతో రూ.6 వేలకు పెంచేశారు. యూసుఫ్ చాలాసార్లు రూ.500 అ«ధికంగా వసూలు చేశాడు. అమీర్.. సిలిండర్ల డెలివరీకి మొహమ్మద్ ఇస్మాయిల్, రామారావు, లోక్ కుమార్లను, మొహమ్మద్ సక్రుద్దీన్, మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ, మొహమ్మద్ మినాజ్ అన్సారీ, రాజేష్ పాల్ను కూలీలు, డ్రైవర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. పది వాహనాల్లో రోజూ 30 నుంచి 40 సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై జూబ్లీహిల్స్ జోన్ టాస్్కఫోర్స్కు సమాచారం రాగా.. అమీర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పథకం వేశారు. డెకాయ్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. వారం రోజులుగా అమీర్ను సంప్రదిస్తున్న పోలీసులు ఆరు సిలిండర్లు కావాలని అడుగుతున్నారు. రోజురోజుకు రేటు పెంచేస్తున్న అతడు సోమవారం సిలిండర్ రూ.6 వేలకు విక్రయించడానికి అంగీకరించి గోదాం చిరునామా ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ యదేంధర్ నేతృత్వంలో టాస్్క ఫోర్స్ ఎస్సై డి.రవిరాజ్ తమ బృందంతో దాడి చేశారు. అమీర్కు గోదాం కోసం అద్దెకిచి్చన ప్రార్థనా స్థలం అధ్యక్షుడు రామ్రాజ్ సింగ్నూ అరెస్టు చేశారు. -
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు చెందిన హైదరాబాద్లోని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని జయలలిత ఇంటిని అధికారులు సీజ్ చేశారు. రూ.83 లక్షల ఇంటి పన్ను పెండింగ్లో ఉండడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పలుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమెను అభిమానులు పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మ అని పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత సినిమాల్లోనూ నటించారు. మరోవైపు, జయలలితకు భారీగా ఆస్తులు ఉన్నాయి. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు గతంలో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. పసిడి ఆభరణాలు, నగదుతో పాటు ఆస్తుల పత్రాలను మూడు ట్రంకు పెట్టెల్లో అధికారులు తమిళనాడు సర్కారుకు అప్పగించారు. -
అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగి అత్యవసర ఖర్చులకూ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మొత్తం 123 రోజులపాటు చేబదులు (ఓవర్ డ్రాఫ్ట్) రుణాలను తీసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ప్రతిరోజూ రాష్ట్ర ఖజానాలో కనీసం రూ.1.38 కోట్ల నిధుల నిల్వ ఉండాలని ఆర్బీఐ నిర్దేశించగా, 2024–25లో ఏకంగా 123 రోజులపాటు అంతకంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మొత్తం రూ.37,457 కోట్లను చేబదులుగా ఆర్బీఐ నుంచి తీసుకుంది. 2024–25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్’ పేరుతో కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యవసర ఖర్చులకూ ఖజానాలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా చేబదులు తీసుకోవచ్చు. ఆదాయం సమకూరగానే ఆర్బీఐకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014–15లో 62 రోజులు మాత్రమే చేబదులు తీసుకోగా, 2022–23లో అత్యధికంగా 328 రోజులపాటు తీసుకున్నారు. 2024–25లో 123 రోజులకి చేబదులు రుణాలు తగ్గడం గమనార్హం. 363 రోజులూ రుణాలే... రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి 2024–25లో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 298 రోజులపాటు రూ.64,188 కోట్ల వేస్ అండ్ మీన్స్ రుణాలను తీసుకోగా, 363 రోజులపాటు రూ.27,730 కోట్ల ప్రత్యేక రుణాలను తీసుకుంది. ఈ తాత్కాలిక రుణాలను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా, రూ.5842 కోట్లను గడువులోగా చెల్లించడంలో విఫలమైంది. రాష్ట్రం 2024–25లో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటు, రూ.48,922 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా, ఆదాయం (రుణాలు మినహాయించి), వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూ.46,370 కోట్ల అప్పులను సమీకరించడం ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం అధిగమించింది. ఆ సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.1,67,804 కోట్ల ఆదాయం రాగా, అందులో 45 శాతాన్ని జీతభత్యాల రూపంలో తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులకే ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చింది. జీతాలకు రూ.30,277 కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ.27,803 కోట్లు, పెన్షన్ల చెల్లింపులకు రూ.16,942 కోట్లను ఖర్చు చేసింది. ఏటేటా పెరుగుతున్న అప్పులు రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయి. 2020–21లో రూ.2,78,018 కోట్లు ఉన్న ప్రభుత్వ అప్పులు 2024–25 నాటికి రూ.4,47,493 కోట్లకు ఎగబాకాయి. ఇక ప్రభుత్వ పూచీకత్తు అప్పులు 2020–21లో రూ.1,05,007 కోట్లు ఉండగా, 2024–25 నాటికి రూ.2,41,528 కోట్లకు చేరాయి. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన అప్పుల మొత్తం సైతం రూ.3.83 లక్షల కోట్ల నుంచి రూ.6.89 లక్షల కోట్లకు పెరిగింది. -
ఒంటరి మహిళలే లక్ష్యం
బంజారాహిల్స్: బెట్టింగ్లకు బానిసై ఒంటరి మహిళలను మాయమాటలతో తన కారులో ఎక్కించుకుని దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించిన యువకుడిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసై తీవ్రంగా నష్టపోతున్న అతను ఈజీ మనీ కోసం పథకం వేశాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని గత ఐదు వారాల నుంచి ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించసాగాడు. ఓఆర్ఆర్ సర్విస్ రోడ్డుకు తీసుకెళ్లి.. ఫిలింనగర్ రోడ్డునెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని వాసు పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న ఆమెకు మాయమాటలు చెప్పి తనకారులో ఎక్కించుకున్నాడు. మధ్యాహ్నం నేరుగా నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధి లోని ఓఆర్ఆర్ సర్విసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి నెట్టేసి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే మంగతాయారమ్మ (60)ని వాసు టార్గెట్ చేశాడు. ఈనెల 17న ఆమె పని ముగించుకుని మధ్యాహ్నం బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్నగర్లో దింపుతానని ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. పట్టపగలు కారు కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. అలాగే వెనుక సీట్లో ఆమెను పడుకోబెట్టి మోకిళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో పడే సి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు అటు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో యాదమ్మ మిస్సింగ్ కేసు, ఇటు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగతాయరమ్మ మిస్సింగ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకుని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది.దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బెట్టింగ్ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు సీరియల్ సైకో కిల్లర్ వాసును అరెస్టు చేశారు. మంగతాయారమ్మ ఒంటిపై ఉన్న నగలు అమ్మగా వచ్చిన డబ్బును కూడా బెట్టింగ్ల్లో పెట్టాడు. ఒకవేళ నిందితుడు పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
కరడుగట్టిన నక్సలిజం ఖతం: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలపాటు దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు చేపట్టిన చరిత్రాత్మక ’ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ విజయవంతం కావడంతో తెలంగాణ పూర్తిస్థాయిలో నక్సల్స్రహిత రాష్ట్రంగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సభలో సెల్యూట్ చేశారు. అదే సమయంలో వామపక్ష తీవ్రవాదానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఏ విధంగా అండగా నిలిచిందో వివరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్.. భీకర పోరు ‘తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో 50 కి.మీ. పొడవు, 37 కి.మీ. వెడల్పు ఉన్న ఒక కొండపై మావోయిస్టులు ఏళ్ల తరబడి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్క డ సోలార్ విద్యుత్, ఐఈడీ (బాంబుల) తయారీ ఫ్యాక్టరీలు, ఐదేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకున్నారు. 400 నుంచి 500 మంది కేడర్ అక్కడ ఉన్నారు. ఆ స్థావరాన్ని ఛేదించేందుకు కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా 21 రోజులపాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టారు. 45 డిగ్రీల భగభగమండే ఎండలో మన జవాన్లు రోజుకు కేవలం 300 మిల్లీలీటర్ల నీటిని తాగుతూ ధైర్యంగా పోరాడారు. ఈ ఆపరేషన్లో 30 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. మిగిలిన వారు లొంగిపోయారు లేదా పారిపోతూ పోలీసులకు చిక్కారు. దీంతో బస్తర్, మహారాష్ట్ర, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో నక్సల్స్ పైకి (ఉత్తరం వైపు) రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా వారు నిరాకరించారు. కిందికి వస్తే మాత్రం ఆపుతామని చెప్పారు‘ అని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయారు 2024 ప్రారంభంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో 21 మంది సభ్యులు ఉండగా.. ఇప్పుడు వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని అమిత్షా తెలిపారు. ‘ఒకరు పట్టుబడ్డారు, ఏడుగురు లొంగిపోయారు, 12 మంది హతమయ్యారు, ఒకరు మాత్రమే పరారీలో ఉండి చర్చలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని 37 మందికిగాను ఎవరూ మిగల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర కమిటీలో ఉన్న వారిలో ఆరుగురు లొంగిపోయారు, ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క నక్సలైట్ కూడా లేడు‘ అని చెప్పారు. బసవరాజు, హిడ్మా, వివేక్, పల్లూరి ప్రసాదరావు (చందన), వాసుదేవ్ వంటి అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం లేదా లొంగిపోయారని తెలిపారు. కాంగ్రెస్ దన్నుతోనే నక్సలిజం ‘1970లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ’అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చి, నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతు తీసుకున్నారు. ఆ మద్దతును ఆసరాగా చేసుకుని మావోయిస్టులు దేశంలోని 17 శాతం భూభాగానికి, 10 శాతం జనాభాకు విస్తరించారు. తిరుపతి నుంచి పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నారు‘ అని అమిత్షా చెప్పారు. అలాగే నక్సల్స్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ ప్రారంభించిన ’సల్వాజుడుం’ ఉద్యమాన్ని 2011 జూలై 5న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం చట్టవిరుద్ధమని ప్రకటించిందని, ఆ తీర్పు వల్లే నిరాయుధులైన ఎంతోమంది సల్వాజుడుం కార్యకర్తలను, ఆదివాసీలను నక్సల్స్ ఊచకోత కోశారని చెప్పారు. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయని, ఇదీ కాంగ్రెస్కు నక్సల్స్తో ఉన్న లాలూచీ అని దుయ్యబట్టారు. ‘రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో అనేకసార్లు నక్సల్స్ సానుభూతిపరులతో కనిపించారు. ఆయన జరిపిన భారత్ జోడో యాత్రలో నక్సల్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు చెందిన వారు పాల్గొన్నారు. 2010లో ఒడిశాలో లాడో సికాకాతో, 2018లో హైదరాబాద్లో గద్దర్తో రాహుల్ వేదిక పంచుకున్నారు‘ అని అమిత్షా పేర్కొన్నారు. 1970 నుంచి 2026 మార్చి వరకు వామపక్ష తీవ్రవాదానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తూనే ఉందని, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 20 వేల మంది పౌరులు, జవాన్ల మరణాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. -
సెలెక్ట్ కమిటీకి విద్వేష బిల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు–2026ను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనసభ తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిని సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు ప్రతిపాదించారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. సెలెక్ట్ కమిటీ ఎంపిక అధికారాన్ని స్పీకర్కు కట్టబెడుతూ తీర్మానం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పటిష్టమైన చట్టం అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కక్ష సాధింపు ఉండదు వాక్ స్వాతంత్య్రాన్ని హరించడానికి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను పొన్నం తోసిపుచ్చారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 19(1)(ఏ)లో వాక్ స్వాతంత్య్రాన్ని చేర్చి దాని తో పాటే సహేతుకమైన పరిమితులను విధించిన విషయాన్ని గుర్తు చేశా రు. తెలంగాణ ఎల్లప్పుడూ గంగా–జమున సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, వివిధ మతాలు, సంస్కృతులు కలిసి మెలిసి జీవించే రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మనుషులు, సమాజం మధ్య ఇవి విభేదాలను పెంచి శాంతి, సామరస్యానికి ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత చట్టాలు మారుతున్న పరిస్థితులకు సరిపోవడం లేదని, అందుకే కొత్త చట్టం అవసరమైందని పేర్కొన్నారు. అయితే ఎవరి పట్ల కక్ష సాధింపు ఉండదని స్పష్టం చేశారు. పదాలు, సంకేతాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు మొదలైనవన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయని వివరించారు. ఈ చట్టం కింద నమోదయ్యే నేరాలు విచారణార్హమైనవిగా, బెయిల్ ఇవ్వలేనివిగా ఉంటాయని మంత్రి వివరించారు. విద్వేషపూరిత కంటెంట్ను వెంటనే తొలగించే అధికారాన్ని సంబంధిత అధికారులకు ఇచ్చినట్లు, పునరావృత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని మేజిస్ట్రేట్లకు కల్పించినట్లు తెలిపారు. కాగా బాధితులకు పరిహారం కల్పించే విధానాన్ని కూడా బిల్లులో చేర్చినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే కుట్ర: బీజేపీ బిల్లుపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచి వేయడానికి ఈ బిల్లును తెచ్చారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. శాంతిభద్రతల పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం మానవ హక్కుల ఉల్లంఘనలా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్ష సాధించే విధంగా నిబంధనలు ఉన్నాయని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నంగా ఈ బిల్లును అభివర్ణించారు. ఆధారాలు లేకుండానే అరెస్టులు చేసే అవకాశం కల్పిస్తోందని, నేరం రుజువు కాకముందే జైలుకు పంపేలా నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్రెడ్డి కూడా మాట్లాడారురు. బిల్లును ఉపసంహరించుకోవాలి: ఎంఐఎం, సీపీఐ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉన్న బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కోరారు. ఇలాంటి చట్టాలు బ్రిటిష్ కాలంలో ఉండేవని, ప్రస్తుతం మళ్లీ వాటిని తీసుకురావడం వల్ల ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లుతుందని అన్నారు. ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బిన్ బలాలా మాట్లాడుతూ.. మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సెలెక్ట్ కమిటీకి పంపించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ చట్టం అవసరం: కాంగ్రెస్ సభ్యులు విద్వేషపూరిత ప్రసంగాలను, కంటెంట్ను నిరోధించేందుకు తెచ్చిన ఈ చట్టం స్వాగతించదగినదని, అదే సమయంలో బిల్లు ద్వారా వచ్చే అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు వంశీకృష్ణ అన్నారు. మాట్లాడే హక్కు పేరుతో స్టేజీల మీద, సోషల్ మీడియాలో వ్యక్తులను, సమూహాలను ఇష్టానుసారంగా తూలనాడే స్థితికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాగమయి, లక్ష్మారెడ్డి, యశస్వినిరెడ్డి, శంకరయ్య, కేఆర్ నాగరాజు, నారాయణ్ గణేష్, మరో సభ్యుడు దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. -
కల్తీపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార పదార్థాలు, వస్తువుల కల్తీపై హైడ్రా, ఈగల్ తరహా పకడ్బందీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న వ్యవస్థలను, చట్టాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆహారంతో పాటు వివిధ రూపాల్లో కల్తీ వల్ల కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా..సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయం, పౌష్టికాహారంపై కమిటీ.. ‘ఆహార భద్రత కల్పనలో భాగంగా అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సి ఉంది. నాణ్యమైన ఆహారంతోనే బాధ్యత తీరిపోయిందనుకోకుండా..వ్యవసాయం, పౌరసరఫరాలు, సంబంధిత ఇతర శాఖలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు ఏం చేయాలి అని దానిపై చర్యలు తీసుకుంటాం. విద్యలో నాణ్యత, సాంకేతిక నైపుణ్యాలతో పాటు విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం మా ప్రభుత్వ తదుపరి లక్ష్యం. అలాగైతే మోదీ ఫొటో పెడతాం.. సన్న బియ్యం పథకం అమలు కోసం ఏడాదికి రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలోని 86 శాతం మందికి అంటే.. 3.39 కోట్ల మందికి (గతంలోని 2.80 కోట్ల మంది నుంచి 3.39 కోట్లకు పెరుగుదల) సన్న బియ్యం పథకం అందుతోంది. రేషన్కార్డుల పంపిణీ కూడా సంతృప్త స్థాయి (సాచురేషన్ లెవల్)లో వందశాతం పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వంద శాతం సన్న బియ్యం ఇస్తే ప్రధాని మోదీ ఫొటో పెడతాం. దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేపడితే బాగుంటుందని కేంద్రానికి సూచిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పంటల మార్పిడి జరగాలి ‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాభసాటి పంట వరి ఒక్కటే కాదన్న విషయాన్ని రైతులు గ్రహించాలి. రాష్ట్ర భూమి, నైసర్గిక స్వరూపం, తదితరాలకు అనుగుణంగా పంటల మార్పిడి జరగాలి. ప్రభుత్వం కూడా వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. అయితే ఈ విషయంలో రైతుల్ని ఒత్తిడి చేయం. వారికి తగిన అవగాహన కల్పిస్తాం. వరి వేస్తే ఉరేనంటూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ బెదిరించారు. ఈ విషయంలో ఆయనకు, నాకు ఎలాంటి పోలిక లేదు. మేము బోనస్ కూడా ఇస్తున్నాం. పంటల మార్పిడిపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, మేధావులతో టాస్్కఫోర్స్ కమిటీ వేస్తాం. వారిచ్చే నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రవాణా, కోల్డ్ స్టోరేజీలు, నిల్వ చేసే వ్యవస్థ తదితరాలపైనా సమగ్ర విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏదైనా పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓ నిధి ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. బ్రూటల్ మెజారిటీతో నియంతృత్వం ‘నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల పెంపు ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయి. దక్షిణాదిలో ఒక్క సీటు కూడా గెలవకుండానే ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ఈ విధంగా లభించే ‘బ్రూటల్ మెజారిటీ’ నియంత పాలనకు, నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయకూడదు. ఉత్తరాది రాష్ట్రాలకు మరి ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలకు, దక్షిణాది రాష్టాలకు మధ్య ప్రస్తుతం ఎంపీ సీట్ల సంఖ్యలో తేడా ఎంత ఉందో అంత స్థాయిలోనే సీట్లు పెంచాక కూడా తేడా ఉండేలా చూడాలి. దీనిపై ఇప్పటికే కేంద్రానికి నిరసన తెలిపాం. లక్ష్మణ్ రాజీనామా చేయాలి దక్షిణాదికి జరిగే అన్యాయం సరిదిద్దకపోతే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టి ఉమ్మడిగా పోరాడుతాం. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఏవేవో లెక్కలు చెబుతున్నారు. దక్షిణ భారత ప్రజల కోసం ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. ఉత్తరం, దక్షిణం మధ్య అంతరం పెరగకుండా చూడాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నుంచి రెండురోజుల పాటు కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలిపారు. శకుని వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది ‘మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్రెడ్డికి పేరు, గుర్తింపు వచ్చింది. ఆయన లేకపోతే నేను చేసిన మంచి పనులు తెలిసేవి కావు. సన్న బియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు ఇలా అన్నీ చేస్తున్నాం. మరి కేసీఆర్ చెప్పినవి చేశారా? డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చారా? మేము చేసేదే చెబుతున్నాం. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. శకుని చేసిన పనుల వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది. కేసీఆర్ ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. కానీ కేసీఆర్ను బావా, బావమరుదులు కలిసి (హరీశ్, కేటీఆర్) గృహ నిర్బంధంలో ఉంచారేమోనన్నది నా అనుమానం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. -
మండలి నుంచీ బీఆర్ఎస్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ అంశంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సోమవారం శాసనమండలిలో ఆందోళనకు దిగడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారిని ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. మండలి చరిత్రలోనే తొలిసారి ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై సభా సంఘం లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మండలిలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలతో 50 నిమిషాలపాటు హోరెత్తించారు. కాగితాలు చించి చైర్మన్ కుర్చీవైపు విసిరేందుకు ప్రయత్నించారు. మార్షల్స్ అడ్డుకోగా మరోసారి కాగితాలు చించి విసిరారు. వాటిలో కొన్ని గుత్తా సుఖేందర్రెడ్డిపైనా పడ్డాయి. ‘పెద్దల సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉంది. ఇలా ఆందోళన చేయడం సరైంది కాదు. సభ్యులు వెనక్కి వెళ్లి వారి స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్ష నేత తమ సభ్యులను కంట్రోల్ చేయాలి. సభా కార్యక్రమాల నిర్వహణకు సభ్యులు సహకరించాలని’ అని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుబట్టారు. తల్లిదండ్రుల కోసం పెట్టిన గొప్ప బిల్లుపై చర్చలో పాల్గొనకపోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడాక సభ్యుల ఆందోళన మధ్యే బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఈ సమయంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రెండుసార్లు కలగజేసుకొని బీఆర్ఎస్ కోరినట్టు ఈ అంశంపై ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. అయినా శాంతించని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ఆందోళన కొనసాగిస్తుండటంతో వారిని సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్కుమార్రెడ్డి, తాతా మధుసూదన్, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎం. కోటిరెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులంతా బయటకు వెళ్లాలని చైర్మన్ కోరగా ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు తదితరులు సభలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మార్షల్స్తో వాగ్వాదానికి దిగారు. చివరకు మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. గన్పార్కులో నిరసన.. శాసనమండలిలోకి సోమవారం వెళ్లే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులో నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాలపై విచారణకు సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ప్లకార్డులతో మండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సస్పెన్షన్ పిరికిపంద చర్య: దేశపతి శ్రీనివాస్ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ మైనింగ్ను ఆధారాలతో సహా సభ ముందు పెడితే నిజాలు బయటపడతాయనే భయంతో తమను సస్పెండ్ చేయడం పిరికిపంద చర్య అని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. సాంకేతిక ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, సభా సంఘం వేసేందుకు ఎందుకు భయపడుతుందో చెప్పాలని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. -
‘బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే’
ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ లక్ష్యం తమ నాయకుడు రాహుల్ గాంధీని బద్నాం చేయడమేని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంల్లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటరిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్గా అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమే ఏకైక అజెండా అమిత్ షా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘పార్లమెంట్లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు. గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు. అలాంటి గద్దర్ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది?, జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ,,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు. గద్దర్తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?, బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే. గద్దర్ గురించి అమిత్ షా లోక్సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారుఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి. మేము తప్పుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం’ అని చామల కిరణ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
శాసనమండలిలో విజయశాంతి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అసలు ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అని ప్రశ్నించారు. ఉద్యమ కారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యమకారులను పట్టించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం జాప్యం చేస్తోందని అన్నారు.వీడియో కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి -
‘దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిది’
హైదరాబాద్ దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. హైదరాబాద్లోని లోక్భవన్లో సోమవారం(మార్చి 30వ తేదీ )ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ లో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్లో ఉంటున్న రాజస్థాన్ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సతీమణితో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా రాజస్థాన్కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. భగవాన్ శ్రీ రాముడు, జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని చెప్పారని.. వారి స్ఫూర్తితోనే రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసంకు గొప్ప సేవ చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. గవర్నర్ సందేశం అనంతరం ఏర్పాటు చేసిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గిగ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
హైదరాబాద్: గిగ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘శాసనసభలో మంత్రి వివేక్ వెంకస్వామి గిగ్ వర్కర్స్ బిల్లును తేవడం సంతోషంగా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో గిగ్ వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు. లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లులో వృత్తిపరంగా ఆరోగ్యపరమైన అంశాలు ఉన్నాయి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ప్రభుత్వం తరుఫున సాయం అందించడం లాంటివి ఉన్నాయి. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో లో గిగ్ వర్కర్స్ చట్టం తేవడం శుభపరిణామం. వారికి వృత్తిపరంగా ఇబ్బంది లేకుండా చట్టం చూసుకుంటుంది. గిగ్ వర్కర్ల బిల్లుపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం గిగ్ వర్కర్లకి అండగా ఉంటుంది’ అని అన్నారు.మతపరమైన విద్వేషాలను రెచ్చగొడితే చర్యలు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు-2026ను ప్రవేశపెట్టింది. ఆ బిల్లును స్పీకర్.. సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు. ‘తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు’కు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మత సామరస్యానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో చేసే పోస్టులతో పాటు అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. -
కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు.


