breaking news
Telangana
-
సీఎం రేవంత్కు రాఖీ కట్టిన కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారి సీఎం రేవంత్ను కలిసిన మంత్రి కొండా సురేఖ.. ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మీడియాతో కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టానని తెలిపారు. సీఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టా. మంత్రి సీతక్కతో కలిసి రాఖీ కట్టాను. నేను అందరికీ ఆడపడుచునే. నన్ను వేరు చేసి చూడొద్దని కొండా సురేఖ అన్నారు.అయితే, తాజా పరిణామాలను ప్రస్తావించని కొండా సురేఖ.. పండగ వాతావరణంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయనన్నారు. సీఎం రేవంత్రెడ్డికి మూడోసారి రాఖీ కట్టానన్నా సురేఖ.. ప్రెస్మీట్లో రాఖీ శుభాకాంక్షలకే పరిమితమయ్యారు. సీఎం మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నా. ఇక్కడ రాజకీయాలు మాట్లాడను, సీఎం రేవంత్కు ఆడపడుచుల దీవెన ఉంటుంది’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు. -
29న రాజ్యాంగ పరిరక్షణపై జస్టిస్ మేనకా గురుస్వామి కీలక ప్రసంగం
హైదరాబాద్: భారత రాజ్యాంగం, పరిరక్షణపై హైదరాబాద్లో కీలక చర్చ జరగనుంది. ఎస్. జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్.. మంథన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి ‘ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్’ (Indian Constitution and its Protection) అనే అంశంపై ప్రసంగించనున్నారు.ఈ కార్యక్రమం ఆగస్టు 29, శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య భవన్ మెయిన్ ఆడిటోరియంలో జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు హై-టీ ఏర్పాటు చేశారు. అనంతరం 6 గంటలకు మేనకా గురుస్వామి ప్రసంగం ప్రారంభమవుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్టపరమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలు, పౌరుల పాత్ర ఏమిటనే అంశాలపై మేనకా గురుస్వామి తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా మేనకా గురుస్వామి రాజ్యాంగం, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక కేసుల్లో వాదించారు. ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతిలోని(IPC) సెక్షన్ 377ను సవాలు చేసిన న్యాయపోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలి? ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో పౌరుల బాధ్యత ఏమిటి? వంటి అంశాలపై ఆమె చేసే ప్రసంగం ఆసక్తిని రేకెత్తించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఇవి కూడా చదవండి: 40 ప్రశ్నలతో జనగణన -
తోబుట్టువులు లేకపోయినా.. రాఖీ కట్టే అక్కాచెల్లెళ్లు ఉన్నారు
అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ వారధిగా నిలుస్తోంది. ఏ దేశంలో ఉన్నా.. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు పుట్టింటి బాట పట్టేలా చేస్తుంది. ఏ ఒక్క ఏడాదైనా రాఖీ కట్టలేకపోతే అన్నాదమ్ముల ఆత్మీయతకు దూరమయ్యామనే భావన కలిగిస్తుంది. ఆ భావన కూడా రావొద్దనే ఉద్దేశంతో అక్కాచెల్లెళ్లు ఎంత కష్టమైనా భరించి వచ్చి రాఖీ కడితే వచ్చే ఆనందం వెలకట్టలేనిది. తరాలు మారినకొద్దీ రాఖీ అనుబంధాన్ని మరింత దృఢం చేస్తోంది.లండన్ నుంచి వచ్చినచెన్నూర్రూరల్: నా పేరు అనూష. మాది చెన్నూర్ మండలం పొ క్కూరు గ్రామం. పెళ్లి తర్వాత లండన్లో స్థిరపడ్డాం. నా భర్త అక్కడే జాబ్ చేస్తాడు. ప్రతియేటా రాఖీ పండుగకు లండన్ నుంచి స్వగ్రామం వచ్చి అన్నయ్య గద్దె మధుకర్కు రాఖీ కట్టి వెళ్తుంటాను. ఈయేడు కూడా రెండ్రోజుల ముందుగానే వచ్చి రాఖీ కట్టాను. స్వయంగా వచ్చి రాఖీ కట్టడమే ఇష్టం. ఒక్కోసారి వచ్చే వీలు లేకుంటే ముందుగానే రాఖీ పంపిస్తాను. – గద్దె అనూష, లండన్15 ఏళ్లు రాఖీ కట్టించుకోలేదుఖానాపూర్: దేశ సేవలో భాగంగా ఆర్మీలో 15 ఏళ్లకు పైగా విధులు నిర్వహించాను. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో విధుల కారణంగా రాఖీ పండుగకు అక్కాచెల్లెళ్ల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకునే అవకాశం ఉండేది కాదు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడంతో రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చేది. అక్కాచెల్లెళ్ల నుంచి ఫోన్లో శుభాకాంక్షలు అందుకున్నా, వారి చేతుల మీదుగా రాఖీ కట్టించుకోలేకపోవడం బాధగా ఉండేది. ప్రస్తుతం ఆర్మీ నుంచి విరమణ పొందాను. రెండేళ్లుగా రాఖీ పండుగను అక్కాచెల్లెళ్లతో కలిసి జరుపుకొంటున్నాను. అక్కల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఉద్యోగ సమయంలో కోల్పోయిన ఆత్మీయ క్షణాలను ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నాను. దేశ సేవలో భాగంగా పండుగలు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉండే సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి.– కడుకుంట్ల ప్రవీణ్, ఖానాపూర్నాకు ఎంతో స్పెషల్ కైలాస్నగర్: రాఖీ పండుగ నాకు ఎంతో స్పెషల్. మా అమ్మ, నాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు తోబుట్టువులు లేరు. కానీ, మా పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాన్నల కూతుళ్లు అర్చన, నిఖిత, అంజమ్మ నాకు సొంత అక్కాచెల్లెళ్ల లెక్కనే. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు.. వారు ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి రాఖీ కడతారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా వారికి దూరంగా ఉన్నప్పటికీ మరిచిపోకుండా రాఖీ కట్టేందుకు వస్తారు. నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రక్షబంధన్ను ఎంత గొప్పగా జరుపుకొంటామో.. అంత గొప్పగానే మహిళలపై గౌరవభావంతో మెలగాలి. ప్రతి ఒక్కరూ ఎదుటి మహిళ, యువతులను తమ సొంత ఆడబిడ్డలుగా భావించినప్పుడే వేధింపులు లేని ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. – మంద మకరందు, ఐటీడీఏ పీవో, ఉట్నూర్ఎదురుచూస్తుంటా..చింతలమానెపల్లి: ఇంటికి దూరంగా దేశసేవ కోసం సరిహద్దుల్లో ఉండే మా సైనికులకు రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకం. పోస్ట్లో స్వగ్రామం నుంచి పంపించే రాఖీ కట్టుకుంటే మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతీ ఏడాది రాఖీ పౌర్ణమికి ఇంటి నుంచి వచ్చే రాఖీ కోసం ఎదురుచూస్తుంటా. – హరి మ్రిదా, రవీంద్రనగర్, మం.చింతలమానెపల్లి చదవండి: చెఫ్ వికాస్ ఖన్నాకు రాఖీ కట్టిన రాధికా మర్చంట్ -
సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. సీఎం రేవంత్కు రాఖీ కట్టేందుకు వచ్చారు. వివాదం తర్వాత తొలిసారి సీఎంతో ఆమె సమావేశమయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు తర్వాత పొలిటికల్ గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ.. నివేదికను ఏఐసీసీకి పంపించింది.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్తో కొండా సురేఖ భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా?. కాంగ్రెస్లో కొండా సురేఖ తుపాన్ ముగిసిపోతుందా?. సుస్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? అనే చర్చ జరుగుతోంది.కాగా, తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
రాఖీ పండుగ.. హైదరాబాద్లో కిక్కిరిసిన బస్టాండ్లు
సాక్షి, హైదరాబాద్: రాఖీ సందర్భంగా నగరంలోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. ఐదు వేల ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. డిమాండ్ ఉన్న రూట్లలో అదనంగా సిటీ బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఈ నెల 31 వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. గతేడాది కంటే అదనంగా 240 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.ఉప్పల్ నల్లచెరువు వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. నల్లచెరువు నుంచి వరంగల్, హన్మకొండ, నర్సంపేట, జనగాం, యాదాద్రి, తొర్రూరు వైపు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తుంది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తోంది. రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ కారణంగా రద్దీ మరింత పెరగనుంది. రాఖీ రోజు తర్వాత తిరుగు ప్రయాణాల్లోనూ రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ -
అమెరికాలో నగర యువతి హత్య కేసులో పురోగతి
హైదరాబాద్: అమెరికా మేరీల్యాండ్లో గతేడాది దారుణ హత్యకు గురైన తార్నాకకు చెందిన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడు అర్జున్ శర్మను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాట విజయంగా దీన్ని బాధితుల కుటుంబం స్వాగతించింది. అమెరికాలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనీ, మృతికి గల కారణాలను అధికారికంగా చెప్పకుండా దాస్తున్నారనీ నిఖిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూఎస్, భారత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలనీ కోరుతున్నారు. ఈ హత్య వెనుక ఏమైనా నేరపూరిత చర్యలు ఉన్నాయా అనేది తేల్చాలని కోరారు. చదవండి: వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి -
రాఖీ కట్టనిస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో పాటు సీఎం రేవంత్రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అధిష్టానం వద్దకు వ్యవహారం..ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.మౌనంగా సురేఖ.. అపాయింట్మెంట్పై ఉత్కంఠకొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్.. లాస్ట్ మినిట్లో ఆ ట్విస్ట్ తప్పదా? -
స్టాప్ ఇక్కడ.. బస్చ్సు అక్కడ!
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులు హడలెత్తిస్తున్నాయి. ప్రయాణికులను పరుగులు పెట్టిస్తున్నాయి. బస్సెక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. డ్రైవర్లు రోడ్డు మధ్యలోనే బస్సును ఆపేస్తారు. అప్పటి వరకు బస్టాపులో ఎదురు చూస్తున్న ప్రయాణికులు వేగంగా దూసుకెళ్లే వాహనాలను దాటుకొని వెళ్లి బస్సెక్కాల్సి వస్తోంది. ఈ హడావుడిలో వేగంగా వచ్చే ఏ వాహనం ఢీ కొన్నా ప్రాణాలకే ప్రమాదం. మరోవైపు ఎంతో కష్టపడి రోడ్డు దాటుకొని బస్సెక్కేందుకు పరుగెత్తినా ప్రయాణికులు చేరేవరకు బస్సు ఆగుతుందనే నమ్మకం లేదు. మరోవైపు బస్సు దిగిన వాళ్లు సైతం వాహనాల మధ్యలోంచి రోడ్డు దాటి ఫుట్పాత్పైకి చేరుకోవాల్సివస్తోంది. ఇలా ఎక్కే, దిగే ప్రయాణికుల పాలిట సిటీబస్సులు ప్రమాదకరంగా మారా యి. మరోవైపు స్టాపుల్లో మహిళలు ఉంటే కొందరు డ్రైవర్లు బస్సు ఆపడంలేదు. గ్రేటర్లో ఈ పరిస్థితి నిత్యకృత్యంగా మారింది. దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, గచి్చ»ౌలి, సికింద్రాబాద్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారిన బస్సుల నిర్వహణను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో నమోదు చేసింది. ప్రమాదకర ప్రయాణం.. నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్లో స్టాపుల్లో బస్సులను ఆపకపోవడంతో ప్రయాణికులు నడిరోడ్డు వరకు పరుగెత్తాల్సి వస్తోంది. ఇలా రోడ్డు మధ్యలో ఆగే బస్సులను మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు బస్టాపుల్లో బస్సులు ఆగకపోవడంతో చిరువ్యాపారులు ఫుట్పాత్లను దాటుకొ ని రోడ్లపైకి వచ్చారు. బస్టాపులను ఆక్రమించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణసదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆర్టీసీ సిబ్బంది మాత్రం మహిళలు కనిపిస్తే బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారు. మలక్పేట్ స్టాపులో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళను పట్టించుకోకుండా రోడ్డు మధ్యలో ఒక క్షణం పాటు ఆపి డ్రైవర్ బస్సును ముందుకు దూకించాడు. ఆమె మరో బస్సు కోసం పడిగాపులు కాసింది.ఆటోలకు అడ్డాలుగా.. అమీర్పేట్, సికింద్రాబాద్, మలక్పేట్, మెహిదీపట్నం, ఉప్పల్ తదితర అనేక ప్రాంతాల్లో బస్టాపులు, బస్షెల్టర్లు ఆటోలు, ప్రైవేట్ వాహనాలకు అడ్డాలుగా మారాయి. దీంతో డ్రైవర్లు బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపేస్తున్నారు. మూణ్నాళ్ల ముచ్చటగానే.. గతంలో నాచారంలో ఓ మహిళ బస్సు దిగి రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. ఆ సందర్భంగానే రోడ్డు మధ్యలో నిలిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అప్పటి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటించారు. కొంతకాలం బస్సులు స్టాపుల్లోనే ఆగాయి. ప్రయాణికులు ఎక్కే వరకు, దిగేవరకు వేచి ఉండటంతో ఎంతో ఊరట లభించింది. కానీ ఆ క్రమశిక్షణ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. ర్యాష్ డ్రైవింగ్, లెఫ్ట్ డ్రైవింగ్, బస్టాప్ జంపింగ్ యథావిధిగా కొనసాగుతున్నాయి. -
మాకు ఏ భేషజాలు లేవు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే వేల మంది ప్రాణాలను కోల్పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గురు వారం సమీక్షించారు. ఈ సందర్భంగా కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో పాటు ఇటీవల జరిగిన పలు ప్రమాదాలపై మంత్రి ఆరా తీశారు. హైదరాబాద్–విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్క్ లైట్స్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తిచేయాలని, మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. 6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయమని, అందుకోసం తమకు ఎలాంటి భేషజాలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరోసారి నితిన్ గడ్కరీని.. అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. -
టూరిజం హబ్గా ‘మీరాలం’
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మీరాలం చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపునివ్వనుంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలో మీరాలం చెరువును సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, మీరాలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు.నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువు పునరుజ్జీవం, చెరువు పరిసర ప్రాంతాలు, అందులోని ఐలాండ్ల అభివృద్ధి, చెరువుపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.. ఈ మూడు ప్రధాన అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అయితే, మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరు వు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాటర్ స్పోర్ట్స్కు డిజైన్.. మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలించాలన్నారు.చెరువు చుట్టూరా ఫుడ్కోర్టులు, పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, కుటుంబ వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద, కార్యకలాపాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్లను తీర్చిదిద్దడంతో పాటు రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు. చెరువులో ఉన్న ఐలాండ్లను అభివృద్ధి చేయాలని, ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్, ఇతర పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశాలను అధికారులను పరిశీలించాలని సీఎం చెప్పారు. వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధిలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వెల్లడించారు. సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో మీరాలం ట్యాంక్ అభివృద్ధిని అనుసంధానం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. ట్యాంక్ పునరుజ్జీవం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటుందన్నారు. -
హైదరాబాద్ మూలాలున్న ఇద్దరు మిస్సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్/నాగోలు/మునుగోడు: నేపాల్ వరదల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల మహేందర్రెడ్డి–ప్రేమలతా రెడ్డిల కూతురు సుహాసినిరెడ్డి (44) గల్లంతయ్యా రు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన మహేందర్రెడ్డి పెద్ద కుమార్తె సుహాసినిరెడ్డిని మునుగోడు మండలం గుడాపూర్కు చెందిన నన్నూరి సంజీవరెడ్డికి ఇచ్చి 2004లో వివా హం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉద్యోగరీత్యా న్యూజిలాండ్ వెళ్లి పౌరసత్వం పొందారు. సుహాసిని ప్రస్తుతం ఆ్రస్టేలియాలో పనిచేస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 23న మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఈమె వెంట వెళ్లాల్సిన హబ్సిగూడ డాక్టర్ శిరీష చివరి నిమిషంలో ఆగిపోయా రు. దీంతో ఆ్రస్టేలియాలో ఉండే స్నేహితురాలిని కలుపుకొని సుహాసిని టూర్కు వెళ్లారు. ఖాట్మండ్ నుంచి కళ్యాణ్ కైలాష్ జర్నీస్ టూర్స్–ట్రావెల్స్ ద్వారా మొత్తం 29 మంది యాత్రకు బయల్దేరారు. చివరగా నేపాల్లోని «ధుంచే–స్యాబ్రుబెసి ప్రాంతంలో టిబెట్ సరిహద్దు వైపు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి సుహాసిని ఫోన్ కలవలేదు. తర్వాత వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ భవనం వద్ద ఆఖరిసారిగా... నాచారం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన లక్ష్మీనాథ్ గోపిశెట్టి 8 మందితో కలిసి కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు ఆఖరిసారిగా కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఆ సమయంలో నేపాల్లోని ‘రసువా కస్టమ్స్ ఆఫీస్’వద్ద ఉన్నారు. తర్వాత ఆకస్మిక వరదలతో ఆ కార్యాలయం తుడిచిపెట్టుకుపోయింది. అప్పటినుంచి ఆయనతో సంబంధాలు తెగిపోయాయని ముషీరాబాద్కు చెందిన లక్ష్మీనాథ్ బంధువు డి.రామచంద్ర తెలిపారు. లక్ష్మీనాథ్ బృందం నేపాల్కు చెందిన క్లాసిక్ వెకేషన్స్ ఏజెన్సీ ద్వారా వెళ్లారని, ముంబైలోని ఆ సంస్థ బ్రాంచ్ను సంప్రదించగా నిర్వాహకులు తమ బాధ్యత లేదన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా సంప్రదించారు. సురక్షితంగా ఉన్నాం: సతీశ్రెడ్డి నేపాల్లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డితో కూడిన బృందం గురువారం ఒక వీడియో సందేశంలో తెలిపింది. విపత్తు సంభవించే సమయానికి తామంతా అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన నలుగురు క్షేమంఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు యాత్రి కుల సమాచారం హెల్ప్లైన్కు అందింది. అయితే.. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
విద్యార్థులేమైనా టెర్రరిస్టులా?: హరీశ్రావు
సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులా? తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ పిల్లల గొంతు నొక్కుతారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా ప్రభుత్వ అ«దీనంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హనుమకొండలోని సుబేదారి పోలీస్స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు, భౌతిక దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం తప్పెలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యార్థులు మూడేళ్లకు రూ.15 వేలలోపే ఫీజుతో చదువుతున్నారని, భవిష్యత్తులో ఫీజులు పెరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఏపీ, ఢిల్లీని ప్రస్తావిస్తూ విమర్శలు... ఏపీలో పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని, ఢిల్లీలోనూ ఇలాంటి విధానం విఫలమైందని హరీశ్రావు పేర్కొన్నారు. అక్కడ తప్పని తేలిన విధానాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ‘ఏపీ, ఢిల్లీ తరహాలో జీవో 97ను వెనక్కి తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్టులు, కేసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.జీవో 97 రద్దు చేయకపోతే విద్యార్థులు, యువత మరింత పెద్ద ఎత్తున ఉద్యమించే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్రావు ప్రశ్నించారు. ‘ఢిల్లీకో నీతి.. తెలంగాణకో నీతా?’అంటూ విమర్శించారు. టీఎన్జీఓలకు మద్దతు.. హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు చే పట్టిన ధర్నా, ఆందోళన కార్యక్రమంలో కూడా హరీశ్రావు పాల్గొన్నారు. ధర్నా శిబి రానికి చేరుకుని ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన వారి న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అధికారంలోకి వచ్చి మూ డేళ్లు దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదని అ న్నారు. ‘దేశంలో ఆరు డీఏలు పెండింగ్లో పెట్టిన ఘనత మీ సర్కారుదే. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టవు. రైతుల సమస్యలు పట్టవు. రేవంత్రెడ్డి.. మీరు సర్కారు నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?’అని ప్రశ్నించారు.‘ప్రతిపక్షం ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారు.ఈ దౌర్జన్యాలకు ఏదో ఒక రోజు తగిన మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. హరీశ్రావు పర్యటన ముందే లీక్ కావడంతో మార్గమధ్యలోనే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. టీఎన్జీఓల ధర్నాలో పొల్గొన్న హరీశ్రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులను కలెక్టరేట్ వద్ద అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడంతో సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్రమంగా అరెస్ట్ చేసిన హరీశ్రావును, నాయకులను వెంటనే విడుదల చేయా లని డిమాండ్ చేశారు. తర్వాత వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. -
అద్దెకు ఎఫ్డీసీ కార్యాలయ భవనం
సాక్షి, హైదరాబాద్: కార్యాలయ భవనాన్ని అద్దెకిచ్చేందుకు ఏపీ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ సిద్ధమైంది. మాసాబ్ట్యాంక్లోని 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయం అద్దె లేదా లీజు ప్రాతిపది కన ఇచ్చేందుకు కార్యాలయ ఆవరణలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు, అద్దె కిచ్చే నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ శాఖలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్యా లయ భవనాలు తెలంగాణ పరిధిలో ఉండగా.. ఏపీ అధికారులు లీజు/అద్దెకు ఇవ్వ డాన్ని ఆక్షేపిస్తున్నాయి. ఇదిలావుండగా... అద్దె కోసం బీసీ సంక్షేమ శాఖ ఏపీఎఫ్డీసీని సంప్రదించింది. తమకు అద్దెకు ఇవ్వాలని ప్రతిపాదించి ప్రత్యేకంగా లేఖలు సమర్పించింది. కానీ ఏపీఎఫ్డీసీ స్పందించలేదు. దీంతో ఈ అంశా న్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు... ప్రత్యామ్నా య ఏర్పాట్లపై దృష్టి సారించారు. అద్దె విషయంలో ఆగ్రహించిన కొందరు ఏకంగా ఫ్లెక్సీలోని కాంటాక్టు నంబర్లను తొలగిస్తూ... ఆమేరకు ఫ్లెక్సీని కత్తిరించడం కొసమెరుపు. -
అస్తవ్యస్తం ‘సర్’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగినట్టు’ఉంది కొందరు బీఎల్వోల పనితీరు. సర్వేలో నిర్లక్ష్యం, వివరాల నమోదులో డొల్లతనం కారణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్టు (సర్) ప్రక్రియ గందర గోళానికి తెరదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే మూడు సార్లు జరిగినా పొరపాట్లు దొర్లాయి. గతంలో ఓట్లేసినవారి వివరాలు గల్లంతవగా ఎమ్మెల్యేలు, రాజ కీయ నేతలకూ నోటీసులు జారీ అయ్యాయి. విదేశాల్లో ఉన్నవారిని కూడా అందుబాటులో లేరని పేర్కొనగా వారందరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వారంతా రావాల్సిందేనట.పలువురు బీఎల్వోలు కాలు కదపకుండా కార్యాలయా ల్లోనే ఇష్టారీతిగా సర్వే ముగించారన్న ఆరోపణలు ఉన్నాయి. షిఫ్ట్ అయిన వారు, అందుబాటులో లేనివా రు అంటూ ప్రత్యేక కాలమ్లో పేర్కొంటూ విధుల్లో నిర్లక్ష్యం చేశారనే వాద నలూ ఉన్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామస భలు, వార్డు సభలు జరగ్గా, చాలాచోట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన హరికృష్ణకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రసన్న హరికృష్ణగా పేరు మార్చుకోగా నోటీస్ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో అంతే..ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో లేనివారు, శాశ్వతంగా షిఫ్ట్ అయినవారంటూ లక్షల్లో సంఖ్య చూపించారు. ఇప్పుడవన్నీ సక్రమమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు కూడా నోటీసు జారీ అయ్యింది. పేరులో తప్పు ఉందంటూ పేర్కొంటూ నోటీసు జారీ చేశారు. ఎమ్మెల్యే కుమార్తె రెవా ఠాకూర్కు కూడా నోటీసు జారీ అయ్యింది.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగసుదర్శన్ రెడ్డినగర్కు చెందిన కోనేటి రాములు పేరు మారింది. ఇటీవల చేపట్టిన ఓటరు నమోదులో కోనేటి అమ్ములుగా నమోదు చేశారు. పాత ఓటరు జాబితాలో కోనేటి రాములు ఉంటే కోనేటి అమ్ములుగా మారడమేంటన్నది రాములు ప్రశ్న.ఈమె పేరు ఆకుల శోభ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మునిసిపాలిటీలోని 6వ వార్డులో ఉంటోంది. . 2002లో ఓటు హక్కు వినియోగించుకోగా తాజా జాబితాలో పేరు లేదు. ఫారం నింపి బీఎల్వోకు ఇచ్చానని అయినా ఓటరు జాబితాలో పేరు లేదని వాపోయింది. ఈమె పేరు బి.సునీత. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏకశిలానగర్లో ఉంటోంది. ఓటు ఉన్నా, మ్యాపింగ్ కాలేదంటూ నోటీస్ ఇచ్చారు. ఓటరు జాబితాలో పేరు ఉండగా ఈ నోటీస్ ఎందుకని ఆందోళన చెందుతోంది.99% నోటీసులు సిద్ధం!92,87,577 మంది ఓటర్లకు జారీ కానున్న నోటీసులు 92,10,218 మంది ఓటర్ల నోటీసుల జనరేషన్ పూర్తిదశల వారీగా ఓటర్లకు జారీ కానున్న నోటీసులు 8,84,462 మంది ఓటర్లకు పంపిణీ పూర్తినోటీసు వస్తే వారంలోగా విచారణకు హాజరుకావాలి 2,241 మంది ఓటర్ల విచారణ ..నలుగురు అనర్హులుగా నిర్ధారణసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ–2026లో భాగంగా వ్యత్యాసాలు (అనామలిస్) కలిగిన ఓటర్లతోపాటు మ్యాపింగ్ జరగని ఓటర్లు కలిపి మొత్తం 92,87,577 మందికి నోటీసులు జారీ చేసి విచారించాల్సి ఉండగా, గురువారం మధ్యాహ్నం 2.30 గంటల నాటికి 92,10,218 (99.16%) మంది ఓటర్లకు సంబంధించిన నోటీసులను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) జనరేట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ ద్వారా మిగిలిన 77,931 మంది ఓటర్ల నోటీసులు జనరేట్ చేయాల్సి ఉంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇదే సమయానికి 8,84,462 మంది ఓటర్లకు స్థానిక బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా నోటీసుల పంపిణీ సైతం పూర్తి చేశారు. మిగిలిన 83,25,756 మంది ఓటర్లకు నోటీసులు జారీ కావాల్సి ఉంది. రోజుకు 2,32,204 మందికే నోటీసులు...సర్, 2026లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, వారిలో 92,87,577 మంది(35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. సర్–2002 ఓటర్ల జాబితాలో ఓటరు పేరు/ తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలను అందించకపోవడంతో వీరిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక ఫారంలో ఈ వివరాలిచ్చిన వారిలో 60,50,918 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలుండడంతో వీరికి సైతం నోటీసులు జారీ చేస్తున్నారు.ఈ రెండు కేటగిరీలతో కలిపి మొత్తం 92 లక్షల మందికి ఒకేసారి నోటీసులను జారీ చేస్తే రాష్ట్రంలో తీవ్ర గందరోగళం ఏర్పడే ప్రమాదంఉంది. ఈ నేపథ్యంలో దశలవారీగా నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. సగటున రోజుకు రాష్ట్రంలో 2,32,204 మందికి నోటీసులు జారీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. సర్, 2026 షెడ్యూల్ ప్రకారం నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ అక్టోబర్ 15తో ముగించాల్సి ఉండగా, మిగిలిన ఓటర్లకు ఆలోగా నోటీసులు జారీ చేస్తారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు కలిగిన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా రోజుకు 9,338 మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణ యించగా, శేరిలింగంపల్లిలో 8,612 మందికి, మేడ్చల్లో 7,415 మందికి రోజూ నోటీసులు జారీ చేయనున్నారు. అత్యల్పంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 504 మందికి, మునుగోడులో 514 మందికి, వైరాలో 549 మందికి మాత్రమే నోటీసులు జారీ కానున్నాయి. అప్పుడే అనర్హులుగా తేలిన నలుగురు ఓటర్లు నోటీసులు అందిన వారం రోజుల్లోగా విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. నోటీసుల్లో విచారణ తేదీ, సమయం, ప్రదేశం ముద్రించి ఉంటుంది. గురువారం నాటికి రాష్ట్రంలో 2,241 మంది ఓటర్ల విచారణ పూర్తి కాగా, అందులో 482 మంది ఓటర్లు తుది జాబితాలో పేరు ప్రచురించడానికి అర్హులని నిర్ధారించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇద్దరు, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు కలిపి ఇప్పటి వరకు మొత్తం ఓ నలుగురు ఓటర్లు తుది జాబితాలో పేరు ప్రచురించడానికి అనర్హులని స్థానిక ఈఆర్వోలు తేల్చారు. నోటీసు జారీ అయ్యాక వారంలోగా విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 11,075 మంది ఓటర్ల విచారణ తేదీ ల్యాప్స్ అయింది. వాస్తవానికి వీరిలో చాలా మంది చేతికి నోటీసులు అందకపోవడంతో ఇలా జరిగింది. దీంతో వీరిని మరో తేదీకి విచారణకు పిలవనున్నారు. అక్టోబర్ 15లోగా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ ముగించి అర్హులుగా తేల్చిన ఓటర్ల పేర్లతో అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.నిస్సహాయ ఓటర్లకు బిగ్ రిలీఫ్నోటీసులు వస్తే కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు వెసులుబాటుసాక్షి, హైదరాబాద్: వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ–2026లో భాగంగా ఈసీ నోటీసు లు జారీ చేస్తే విచారణకు హాజరయ్యే విషయంలో వీరికి మినహాయింపు కల్పించింది. వారి తరఫున కుటుంబంలోని వయోజనులు హాజరయ్యేందుకు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు గురువారం ఆదేశాలు పంపారు. ఈ ఓటర్ల తరఫున వారి కుటుంబసభ్యులు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద విచారణకు హాజరై అవసరమైన పత్రాలు/ సమాచారాన్ని సమర్పించవచ్చు అని తెలిపారు.సర్పంచ్ ఓటు గాయబ్యాదగిరిగుట్ట రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామ సర్పంచ్ తుమ్మల జ్యోతికి ఓటే లేకుండా పోయింది. ఓటర్ల జాబితాను గ్రామ సభలో గురువారం ప్రకటించారు. అయితే ఈ లిస్ట్లో సర్పంచ్ తుమ్మల జ్యోతి పేరు కనిపించలేదు. దీంతో ఆశ్చర్యపోయిన సర్పంచ్ గ్రామ సభకు వచ్చిన రెవెన్యూ అధికారులు, బీఎల్వోను ఓటు ఏమైందని నిలదీశారు. ఆరా తీసిన అధికారులు, ఓటు పొరపాటున గల్లంతైందని గుర్తించారు. సర్పంచ్ ఓటును మళ్లీ ఆన్లైన్లో నమోదు చేస్తామని అధికారులు చెప్పారు. 51 ఏళ్ల వ్యక్తి... 126 ఏళ్ల ఓటరుగా నమోదుమునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ ఓటరు జాబితాలో ఓ వ్యక్తి వయస్సు ఏకంగా 126 ఏళ్లుగా నమోదైంది. గ్రామానికి చెందిన గుండు రామారావు వయస్సు ప్రస్తు తం 51 ఏళ్లు కాగా.. ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 126 సంవత్సరాలుగా నమోదై ఉంది. పాత ఓటరు గుర్తింపు కార్డులో 1995 జనవరి 1నాటికి రామా రావు వయస్సు 20 ఏళ్లుగా నమోదైంది. అయితే తాజా ముసాయిదా జాబితా తోపాటు నెట్లో కొత్త ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోగా జనన తేదీ 1900 జనవరి 1గా నమోదైంది. గురువారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రామారావు వయస్సును సవరించాలని దరఖాస్తు ఇచ్చారు. 12 ఏళ్ల కిందటే చనిపోయినా ఓటు భద్రంసాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ యూసుఫ్గూడలోని ఓ ఇంటి యజమాని 12 ఏళ్ల కిందటే చనిపోయింది. కానీ, ఆమె ఓటు ముసాయిదా జాబితాలో ఫొటో అవైలబుల్ అని వచ్చింది. మృతురాలి ఓటు తొలగించమని కుటుంబసభ్యులు చెప్పినా ఫలితం లేకపోయింది. ఇదే ఇంటి నుంచి 4 ఏళ్ల కిందటే ఖాళీ చేసి వెళ్లిపోయిన దంపతుల ఓట్లు భద్రంగా ఉండగా, 14 ఏళ్లుగా నివాసం ఉంటున్న దంపతుల ఓట్లు మాత్రం ముసాయిదాలో లేవు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: నీట్–యూజీ 2026లో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల రెండో విడత ఆన్లైన్ కౌన్సెలింగ్కు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ను ప్రకటించింది. 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ), 100 శాతం డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఏఎఫ్ఎంసీ, ఎయిమ్స్, జిప్మర్ సంస్థల్లోని సీట్లకు ఈ కౌన్సెలింగ్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పాల్గొనే కళాశాలలు తాత్కాలిక సీట్ల వివరాలను పరిశీలించనున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి 8 వరకు అభ్యర్థుల రిజి్రస్టేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండగా.. ఫీజు చెల్లింపునకు సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంటుంది. అదే సమయంలో సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు ఛాయిస్ ఫిల్లింగ్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8 సాయంత్రం 4 గంటల నుంచి సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు చాయిస్ లాకింగ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఎంసీసీ సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనుంది. సెప్టెంబర్ 11న రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరాల్సి ఉంటుంది. చేరిన అభ్యర్థుల వివరాలను ఆయా కళాశాలలు సెప్టెంబర్ 19న ఎంసీసీకి ధ్రువీకరించాల్సి ఉంటుంది. రెండో విడతలో సీటు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు గడువులను తప్పకుండా పాటించాలని ఎంసీసీ సూచించింది. ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ గడువు దాటిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్లో... రాష్ట్ర కోటా కౌన్సెలింగ్లో భాగంగా సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర కౌన్సెలింగ్ సంస్థలు పరిశీలించనున్నాయి. ఏఐక్యూ, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల పరిధిలో చేరిన అభ్యర్థుల వివరాలను ఎంసీసీ సెప్టెంబర్ 19న ధ్రువీకరించనుంది. రాష్ట్ర కోటాలో చేరిన వారి వివరాలను కూడా సెప్టెంబర్ 19న ధ్రువీకరించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉన్నందున శని, ఆదివారాలు, గెజిటెడ్ సెలవు రోజులను కూడా పనిచేసే రోజులుగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలలు, సంస్థలకు ఎంసీసీ సూచించింది. రెండో విడతలో సీటు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులో చేరకపోతే సీటుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అభ్యర్థులు షెడ్యూల్ను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.అగ్రి బీఎస్సీ కౌన్సెలింగ్ ప్రారంభంసాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో రెగ్యులర్ సీట్ల భర్తీకి గురువారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఈ నెల 29వ తేదీ వరకు తొలి విడత కౌన్సెలింగ్ కొనసాగనుంది. ఇన్చార్జి రిజిస్ట్రార్, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ సీహెచ్.వేణుగోపాల్రెడ్డి, వ్యవసాయ డీన్ డాక్టర్ కె. ఝాన్సీరాణి కౌన్సెలింగ్ను లాంఛనంగా ప్రారంభించారు. తొలి సీటు కేటాయింపు పత్రాన్ని కొత్తపల్లి రోష్నికి అందజేశారు. రెండో సీటు కేటాయింపు పత్రాన్ని పూల పూజకు, మూడో సీటు కేటాయింపు పత్రాన్ని ఎం.ఏ.హాధీకి అందజేశారు. ఈ ముగ్గురికీ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో సీట్లు లభించాయి. తొలి రోజు వివిధ కళాశాలల్లో మొత్తం 213 సీట్లు భర్తీ అయ్యాయి. -
టీచర్లపై నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులపై నిఘా పెరిగింది. వారి ప్రతీ కదలికను పసిగడుతున్నారు. పాఠశాలకు వచ్చిపోయే సమయాలు, వ్యక్తిగతంగా వారి కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు తీసుకుంటున్నారు. జీపీఎస్ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యంగా వచ్చినా నోటీసులు ఇస్తున్నారు. గడచిన పది రోజులుగా ప్రతీ జిల్లాల్లోనూ 30 మందికి తగ్గకుండా నోటీసులు వెళ్లాయి. ఆలస్యానికి కారణాలు చెప్పాలని డీఈఓలు వెంటబడుతున్నారు. ఇతర వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో మునిగి తేలే టీచర్ల జాతకాలను కూడా సేకరిస్తున్నారు. పనిచేసే ప్రాంతానికి వారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు? స్కూల్కు ఏ విధంగా వస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుంటున్నారు.ఎందుకీ నిఘా..: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. దీనిపై గత నెల సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను ఉన్నతాధికారులు సీఎం వద్ద ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్లు సకాలంలో రావడం లేదని, ప్రతి రోజూ ఆలస్యంగా వస్తున్నారని, పాఠాలు కూడా సరిగ్గా చెప్పడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కొంతమంది స్కూల్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారని, రావడం, పోవడంతో అలసిపోయి బోధనపై శ్రద్ధ చూపడం లేదని నివేదికలో పేర్కొన్నారు.20 వేల మంది ఉపాధ్యాయులు ఈ విధంగా దూర ప్రాంతాల్లో ఉంటున్నట్టు తెలిపారు. 38 వేల మంది టీచర్లు ప్రభుత్వ ఉద్యోగంతో తృప్తి పడటం లేదని, ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది చిట్టీలు, మరికొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రతీ టీచర్ సమగ్ర వ్యక్తిగత డేటాను కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిఘా పెంచినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం ద్వారా తెలిసింది.ఎఫ్ఆర్ఎస్తో సమస్యలు..: పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారంటూ నోటీసులు అందుకున్న టీచర్లు విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ వల్ల ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఉదయం 9 గంటలకల్లా స్కూల్కు వెళ్లి సెల్ఫోన్ యాప్ ద్వారా ముఖాన్ని చూపించి, స్కూల్ ప్రాంగణం నుంచే హాజరు నమోదు చేయాలి. అయితే కొన్నిసార్లు నెట్వర్క్ సమస్య వస్తోందని టీచర్లు అంటున్నారు.దీనివల్ల ఉదయం హాజరు నమోదు కావడం లేదని, సాయంత్రం వేసే హాజరు...ఉదయం హాజరుగా నమోదు అవుతోందని, లేదా ఆలస్యంగా నమోదు అవుతోందని టీచర్లు అంటున్నారు. సాంకేతిక సమస్యలను అర్థం చేసుకోకుండా నోటీసులు ఇస్తున్నారనేది వారి వాదన. మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వాదనను మాత్రం పాఠశాల డైరెక్టరేట్ కార్యాలయం అంగీకరించడం లేదు. అన్నిచోట్ల నెట్వర్క్ ఉన్నప్పుడు ఈ సమస్య రావడానికి వీల్లేదని చెబుతున్నారు. -
బంగారం.. రాగి వెలికి తీసి దేశ సంపద పెంచుదాం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని గురువారం అధికారికంగా డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఖనిజ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ బ్లాక్ ఎక్స్ప్లోరేషన్ (అన్వేషణ) హక్కులను దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్వేషణ పనులను సింగరేణి సంస్థ త్వరలోనే వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతమై ఇక్కడ బంగారం, రాగి విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే అక్కడ పర్యవేక్షణకు సైట్ ఆఫీసును ప్రారంభిస్తామన్నారు. స్థానిక ప్రజల అండదండలతో ఈ ప్రాజెక్టును త్వరలోనే విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంచడానికి ఉపయోగపడదామని పిలుపునిచ్చారు. ఈ అన్వేషణ రెండు రాష్ట్రాల పురోగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. దేవదుర్గ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో సీఐగా పని చేశానని, ప్రస్తుతం సింగరేణి సీఎండీగా పనులను స్థానికుల సమక్షంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బంగారం, రాగి ఖనిజ బ్లాకు పరిశీలన పర్యటనలో భాగంగా లింగదహళ్ళిలోని దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూ పాయింట్ నుంచి ఖనిజ అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి భట్టి పరిశీలించారు. అనంతరం అక్కడి బ్లాక్ నుంచి సింగరేణి అధికారులు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. సింగరేణి అధికారులు మరియు కర్ణాటక రాష్ట్ర అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ఖనిజ అన్వేషణపై దిశా నిర్దేశం చేశారు. కర్ణాటక మంత్రితో భట్టి సమావేశం బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక ఇంధన శాఖమంత్రి కె.జె.జార్జ్తో గురువారం భట్టి సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులు, సాంకేతికత మారి్పడిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. పెరుగుతు న్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగినంత బొగ్గును అందించడం కోసం సింగరేణి సంస్థ, కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు కలిసి పని చేద్దామని కె.జె.జార్జ్కు భట్టి ప్రతిపాదన చేశారు. ఈ సమావేశంలో కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తా, సింగరేణి సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి పాల్గొన్నారు. -
పనితీరు పసిగట్టేలా..!
సాక్షి, హైదరాబాద్: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో ఇకపై పోలీసులు మరింత మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాల్సిందే. స్టేషన్లో తమకు ఎదురైన అనుభవం ఎలా ఉంది? సిబ్బంది సరిగ్గా స్పందించారా? వెంటనే ఫిర్యాదు స్వీకరించారా? కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? పురోగతిపై సమాచారం అందిస్తున్నారా? వంటి అంశాలపై ఇక నేరుగా బాధితుల నుంచే పోలీస్ శాఖ ఫీడ్బ్యాక్ తీసుకోనుంది. పోలీసుల పనితీరును మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీస్–సిటిజన్ ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ వ్యవస్థను ప్రారంభించే అవకాశముంది. ర్యాండమ్గా బాధితులకు ఫోన్లు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన బాధితుల వివరాల నుంచి ఎంపిక చేసి.. కొందరికి ర్యాండమ్గా కాల్ చేయనున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్లోని టెలీకాలర్లు బాధితులతో మాట్లాడి వారి అనుభవాన్ని తెలుసుకుంటారు. రిసెప్షన్ వద్ద స్వాగతం మొదలు..దర్యాప్తు పురోగతి, కేసుకు సంబంధించిన సమాచారం అందుతున్న విధానం తదితర అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.పోలీసులే కాదు.. థర్డ్ పార్టీతో.. ఫీడ్బ్యాక్ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశంగా థర్డ్ పార్టీ ఏజెన్సీతో కాల్ సెంటర్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్ సిబ్బందితోనే బాధితులకు ఫోన్లు చేయిస్తే వాస్తవ పరిస్థితులపై పూర్తిస్థాయి ఫీడ్బ్యాక్ రాకపోవచ్చనే ఉద్దేశంతో.. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నట్టు సమాచారం.ఏఐతో విశ్లేషణ.. బాధితుల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ను ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా విశ్లేíÙంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఏ పోలీస్స్టేషన్పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి? ఏ అంశంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది? ఏ అధికారి లేదా సిబ్బంది పనితీరుపై పదేపదే ప్రతికూల అభిప్రాయాలు వస్తున్నాయి? వంటి అంశాలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు...బాధితుల అభిప్రాయాలు కేవలం రికార్డులకే పరిమితం కాకుండా.. పోలీసుల పనితీరు మెరుగుదలకు, అవసరమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలకు ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. మంచి ఫీడ్బ్యాక్ వస్తున్న సిబ్బందిని ప్రోత్సహించడంతోపాటు.. పదేపదే ప్రతికూల ఫీడ్బ్యాక్ వస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్, శిక్షణ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. పోలీస్స్టేషన్లలో జవాబుదారీతనం పెరగడంతోపాటు, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించాలన్న లక్ష్యంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
రీల్స్తో రీచ్
సోషల్ మీడియా రీల్స్. ప్రస్తుతం దేశాన్ని కమ్మేస్తున్న మేనియా ఇదే. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్.. ఫోన్లో రీల్స్ను స్క్రోల్ చేయడం సర్వ సాధారణ మైపోయింది. భారతీయ మార్కెట్ను సైతం రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తున్న కొత్త ఉత్పత్తుల సమాచారం తెలుసుకునేందుకు.. వివిధ ఉత్పత్తులతో సరిపోల్చేందుకు.. ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు కూడా సగటు భారతీయులు రీల్స్పైనే ఆధార పడుతున్నారు. ప్రధానంగా జెన్జీ తరం సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలను సైతం రీల్స్ మేనియా ప్రభావితం చేస్తోందని మెటా తాజా సర్వే వెల్లడించింది. ప్రధానంగా కాస్మొటిక్స్, ఫ్యాషన్, ఫిట్నెస్, క్రీడలు, ఇతర యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలను సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. రీల్స్ చూడాలి.. తరువాతే కొనాలి⇒ జెన్జీ తరంలో 81 శాతం మంది కొత్త ఉత్పత్తుల గురించి రీల్స్ ద్వారానే తెలుసుకుంటామన్నారు. వాటిలో 66 శాతం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుంటున్నామని.. 47 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ⇒ 76 శాతం మంది మహిళలు తమ కొనుగోలు నిర్ణయాలను రీల్స్ ప్రభావితం చేస్తున్నాయన్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల్లో 76 శాతం మంది ఆర్థిక విషయాలపై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు రీల్స్పై ఆధారపడుతున్నారు.‘మెటా’ ఏం తేల్చిందంటే..⇒ ‘మెటా ఇంపోసోస్ –2026’ పేరిట విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైన రీల్స్ చూడాల్సిందే⇒ భారత్లో మెటా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఖాతాదారుల్లో 90 శాతం మంది రీల్స్ను చూస్తున్నారు. అతి తక్కువ నిడివి గల వీడియోలను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.⇒ జెన్జీ తరానికి చెందిన వారిలో 98 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తున్నట్టు చెప్పారు. ⇒ మెటా ఖాతాదారులైన మహిళల్లో 96 శాతం మంది రోజుకు ఒక్కసారైన రీల్స్ చూస్తామన్నారు.⇒ అధిక ఆదాయం కలిగిన వర్గాల్లో 88 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తామన్నారు. -
కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను నెర వేర్చకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ చేపట్టే నిరసన కార్యక్రమాల షెడ్యూల్ను మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు. ⇒ సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో నిరసన కార్యక్రమాల లోగో ఆవిష్కరణ అనంతరం ఏడు రోజుల పాటు నిర్వహించే నిరసన కార్యక్రమాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం. ⇒ సెప్టెంబర్ 2న ఆయా గ్రామాల్లో వైఫల్యాలపై ప్రచారం, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బైక్ ర్యాలీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలకు వివరణ.⇒ 3న రైతు సభల ద్వారా వ్యవసాయం, నీటి పారుదల రంగం, విద్యుత్, యూరియా, రైతు బీమాకు సంబంధించిన సమస్యలను రైతుల దృష్టికి తీసుకెళ్తారు. హైదరాబాద్, అర్బన్ ఏరియాల్లో 22ఏ నిషేధిత భూముల కోసం ధర్నాలు.⇒ 4న విద్యార్థులు, వికలాంగులు, మహిళలతో నిరసనలు. మహిళలకు రూ.2,500, కేజీ టు పీజీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర హామీల అమలుపై విద్యార్థులు, మహిళలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తారు.⇒ 5న విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నిరసనలు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలుపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు.⇒ 6న ఆదిలాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్లో ఏసీసీ, సింగరేణి ప్రాంతాల్లో 12 నియోజకవర్గాల నుంచి నిరసన సభలు. హైదరాబాద్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాలు తదితర అంశాలపై ఆందోళన కార్యక్రమాలు. మిగిలిన తెలంగాణ నియోజకవర్గాల్లో పల్లెల విద్యుత్, పడకేసిన పారిశ్రామిక విధానంపై నిరసనగా గ్రామాల్లో కార్యక్రమాలు⇒ 7న జిల్లాలు, మండలాల్లోని ప్రజావాణిలో 420 హామీల అమలుపై వినతిపత్రాల సమర్పణ. ⇒ 8న జిల్లా కేంద్రాల్లో ఏడు రోజుల కార్యక్రమాలపై ప్రెస్మీట్ నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ. ⇒ సెప్టెంబర్ 10న ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం. -
గనులశాఖ ఏడీ జయరాజుపై ఏసీబీ కొరడా
సాక్షిప్రతినిధి, వరంగల్/తాండూరుటౌన్ /బోడుప్పల్: గనులు, భూగర్భ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం కొరడా ఝళిపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ప్రస్తుతం వరంగల్ మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్గా అడిషనల్ చార్జ్లో ఉన్న బొజ్జ జయరాజుపై కేసు నమోదు చేసింది. గురువారం ఆయనకు సంబంధించిన కార్యాలయం, బంధువులు, సహచరుల నివాసాలు, ప్రదేశాలు కలిపి మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ప్లాట్లు, వ్యవసాయ భూములు సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.3,06,53,177గా ఏసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్కెట్ విలువ అధికారిక/డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 15 కోట్లకు పైనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. అదనపు ఆస్తులపై తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపింది. బోడుప్పల్లో జీ+2 భవనం, కేపీహెచ్బీ కాలనీలో ఫ్లాట్, కీసరలో రెండు ప్లాట్లు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఒక్కో ప్లాట్ సహా మొత్తం ఐదు ప్లాట్లు, నగదు రూ.10,03,640 తోపాటు, ఎల్ఐసీ, మ్యాక్స్ లైఫ్ సేవింగ్స్ సుమారు రూ.19.86 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, పోస్టాఫీస్ సేవింగ్స్ రూ.20,86,175లు కాగా, 629 గ్రాముల బంగారు ఆభరణాలు తదితరాలు మూడు బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.7,12,761 నిల్వలు ఉన్నట్టు ఏసీబీ ప్రకటించింది. ⇒ 2009 నుంచి 2016 వరకు గనుల శాఖ ఏడీఏగా జయరాజ్ తాండూరులో విధులు నిర్వర్తించారు. 2012లో ఉమ్మడి పెద్దేముల్ మండలం ఒగులాపూర్ గ్రామంలో మూడెకరాల సుద్ద భూమిని తన భార్యతోపాటు తాండూరుకు చెందిన కొందరు వ్యాపారులతో కలిసి కొనుగోలు చేసినట్టు ఏసీబీకి ఆధారాలు లభించాయి. దీంతో తాండూరు పట్టణానికి చెందిన ఫారూఖ్ ఖురేషి నివాసంలో ఏసీబీ సీఐ వెంకటేశ్తోపాటు అధికారుల బృందం సోదాలు చేసింది, డ్రైవర్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు..ఏడీ జయరాజుకు చెందిన మొబైల్ సమాచారం, ఇప్పటివరకు పరిశీలించిన లావాదేవీల ఆధారంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు ఏసీబీ తెలిపింది. అధికారికి డ్రైవర్గా పనిచేస్తున్న సత్తునూరి యాదయ్య బ్యాంకు ఖాతా నుంచి జయరాజు తన కుమార్తె బ్యాంకు ఖాతాకు సుమారు రూ.24.80 లక్షలు బదిలీ చేయించినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు పేర్కొంది. ఈ మొత్తం ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి వసూలు చేసినదని డ్రైవర్ విచారణలో తెలిపినట్టు ఏసీబీ వెల్లడించింది. మరిన్ని ఆస్తులపై ఆరాజయరాజు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్న అధికారులు.. ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాటి కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.బొజ్జ జయరాజు ఇటీవల జరిగిన పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నుంచి ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసాపత్రం అందుకున్నారు. -
40 ప్రశ్నలతో జనగణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనగణన వివరాల సేకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు గురువారం జీఓ 124 జారీ చేశారు. జనగణన–2027కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 40 రకాల ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్లో పేర్కొంది. తాజాగా ఈ గెజిట్కు సంబంధించి రాష్ట్రంలో వివరాల నమోదుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్యూమరేటర్లు సేకరించే వివరాలివి1. వ్యక్తి పేరు; 2. కుటుంబ పెద్దతో సంబంధం3. లింగం; 4. పుట్టిన తేదీ, వయసు (నిండిన సంవత్సరాలు)5. ప్రస్తుత వైవాహిక స్థితి; 6. వివాహ సమయానికి వయసు (నిండిన సంవత్సరాలు) 7. జీవిత భాగస్వామి పేరు; 8. జాతీయత; 9. మతం10. షెడ్యూల్డ్ కులం(ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)/కులం11. తండ్రి వివరాలు;12. తల్లి వివరాలు 13. డిజెబిలిటీ; 14. మాతృభాష, తెలిసిన ఇతర భాషలు15. అక్షరాస్యత; 16. డిజిటల్ అక్షరాస్యత స్థితి17. విద్యాసంస్థలో చదువు/హాజరు స్థితి18. అత్యున్నత విద్యార్హత, విభాగం/విద్యాశాఖ19. గత సంవత్సరంలో ఎప్పుడైనా పని చేశారా?20. ఆర్థిక కార్యకలాపాల కేటగిరీ; 21. వృత్తి22. పరిశ్రమ/వ్యాపారం/సేవ స్వభావం; 23. కార్మికుల వర్గం24. ఆర్థికేతర కార్యకలాపం (పాక్షికంగా పనిచేసేవారు, స్వల్పంగా పనిచేసేవారు, పనిచేయనివారి కోసం)25. పని కోసం వెతుకుతున్నారా/పని చేయడానికి అందుబాటులో ఉన్నారా?26. పనిచేసే ప్రదేశానికి ప్రయాణ వివరాలు27. జన్మస్థలం; 28. చివరిగా నివసించిన ప్రదేశం29. వలస రావడానికి కారణం30. చివరి వలస తర్వాత ఈ గ్రామం/పట్టణంలో ఉంటున్న కాలం; 31. శాశ్వత నివాస చిరునామా32. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, వితంతు, విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలకు మాత్రమే)33. ఇప్పటివరకు సజీవంగా జన్మించిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, వితంతు, విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలకు మాత్రమే)34. గత ఒక సంవత్సరంలో సజీవంగా జన్మించిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత మహిళలకు మాత్రమే)35. కోవిడ్–19 టీకా తీసుకున్న ప్రదేశం36. మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య37. మొబైల్ నంబర్ (అందుబాటులో ఉంటే)38. ఆధార్ నంబర్ (అందుబాటులో ఉంటే)39. ఓటరు గుర్తింపు కార్డు నంబర్ (అందుబాటులో ఉంటే); – పాస్పోర్ట్ నంబర్(భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉంటే)40. డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉందా? -
చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే.ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీకి ముగ్గురు కీలక నేతలుమంత్రి కొండా సురేఖతోపాటు చిన్నారెడ్డి తదితర నేతలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదికను ఏఐసీసీకి పంపిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. అదే సమయంలో సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఈనెల 31న ఢిల్లీకి వచ్చిన తరువాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది.ఈ ముగ్గురు అధిష్టానంతో భేటీ అయితే సురేఖపై చర్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవలి కాలంలో పెరిగిన అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సురేఖ, చిన్నారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, అనిరుధ్రెడ్డి తదితర ఎమ్మెల్యేల వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీ భేటీలో ఏం జరిగింది?కొండా మురళీ డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యం గురించి వివరించినట్లు చెబుతున్నారు. సురేఖ కుటుంబం తరఫున వివరణ ఇవ్వడంతోపాటు రాజకీయంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న చర్చకు ఈ భేటీ కారణమైంది. అదే సమయంలో సురేఖ మంత్రి హోదాలో తనదైన శైలిలో వరంగల్ జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం, వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. -
గవర్నర్కు గుండె శస్త్రచికిత్స
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా బుధవారం గుండె నొప్పితో హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ఉదయం ఆసుపత్రిలో గవర్నర్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి ఉన్నారు. -
ధరల మంటలు.. కుటుంబ బడ్జెట్ బేజారు
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. కూరగాయలు, ఉల్లిగడ్డ, పప్పులు, ఇతరత్రా కిరాణా వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మధ్యతరగతిపై భారం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో అది మరికొంత అధికంగా ఉండటం ఆందోళనను కలిగిస్తోంది. ప్రధాన రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రిటైల్ ద్రవ్యో ల్బణం 6.32% నమోదవడం కలవరం రేపుతోంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ గణాంకాల్లో ఈ పరిస్థితి వెల్లడైంది. తెలంగాణ తరువాత ఏపీలో ద్రవ్యోల్బణం 5.72% ఉండగా, తమిళనాడులో 5.44%, మధ్యప్రదేశ్లో 4.91%, కర్ణాటకలో 4.89%గా ఉంది. దేశం సగటు ద్రవ్యోల్బణం 4.45%గా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే కూరగాయలతోపాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా.. జూలైలో దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.45%గా ఉండగా, ఆహార వస్తువుల ధరలను ప్రతిబింబించే ఆహార ద్రవ్యోల్బణం 5.52%గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా 5.79 శాతంగా నమోదైంది. దీనికి భిన్నంగా తెలంగాణలో మొత్తం ద్రవ్యోల్బణం 6.32%గా ఉండటం రాష్ట్ర ప్రజలపై ధరల భారం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి కుటుంబం నెలవారీ వంటింటి ఖర్చులో కనిపిస్తున్న అదనపు భారానికి ఇది అద్దం పడుతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో ఉల్లిగడ్డ కిలో రూ.50–55 పలుకుతోంది. బోయిన్పల్లి హోల్సేల్ మార్కెట్లో అదే ఉల్లి రూ.30–35 మధ్య లభిస్తుండగా, రైతుబజార్లలో రూ.40–44 విక్రయిస్తున్నారు. అదే రిటైల్ మార్కెట్కు చేరే కొద్దీ ధర గణనీయంగా పెరుగుతోంది. అలాగే, క్యారట్, చిక్కుడు, బీన్స్, వంకాయలు తదితరాల ధరలు కూడా భారీగా పెరగడంతో కుటుంబాల నెలవారీ కూరగాయల ఖర్చు భారీగా పెరిగింది. పప్పుల ధరలు సైతం సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బియ్యం ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మూడు నెలల క్రితం సన్న బియ్యం ధర కిలో రూ.48–55 ఉండగా, ఇప్పుడు 65–70 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జోక్యం అవసరం రాష్ట్రంలో హాకా, రైతుబజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు ఉల్లి, ఇతర నిత్యావసరాలను అందుబాటులోకి తేవాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్న అధికారులు రేట్ల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయకపోవడం గమనార్హం. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలపై మరింత ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లోకి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను పెంచడం, రైతుబజార్లలో నిల్వలు పెంచడం, హోల్సేల్–చిల్లర ధరల వ్యత్యాసాన్ని పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు–కృత్రిమ కొరతపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ⇒ మునుపటి పంట నిల్వలు తగ్గిపోవడం, కొత్త పంట మార్కెట్కు రావడానికి ఇంకా సమయం ఉండటం. ఉత్పత్తి తగ్గిన సమయంలో డిమాండ్ పెరగడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. ⇒ పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, పొలాల నుంచి మార్కెట్లకు సరుకు రవాణాలో ఆలస్యం ఏర్పడటం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో వర్షాలు పంటల కోత, రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. ⇒ శ్రావణ మాసం, రాబోయే వినాయక చవితి వేళ స్వీట్లు, పిండివంటల తయారీ పరిశ్రమలు, హోటళ్లు, గృహాల నుంచి వినియోగం ఒక్కసారిగా పెరగడం. ⇒ అంతర్రాష్ట్ర రవాణా వ్యయం పెరగడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మార్కెట్ల నుంచి వచ్చే సరుకుపై అదనపు భారంపడింది. ⇒ భారత్ దిగుమతి చేసుకునే ముడి పామాయిల్, సన్ఫ్లవర్ నూనెలపై అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగడం, దిగుమతి సుంకాల్లో మార్పులు. ఇంటి ఖర్చులకే సరిపోక..హైదరాబాద్లోని అంబర్పేటలో రవికిరణ్ అనే ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. నెలసరి వేతనం రూ.50 వేలు. గతంలో ఇంటి అద్దె, టూవీలర్ ఖర్చు, కిరాణా, కూరగాయలు, పాలు, పిల్లల చదువు, విద్యుత్, రవాణా, ఇతర ఖర్చులకు కలిపి సుమారు రూ.45 వేలు ఖర్చయ్యేవి. నెలకు రూ.5 వేలు పొదుపు చేసుకునేవారు. ఇప్పుడు కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనె, పాల ధరలు పెరగడంతో నెల ఖర్చు రూ.50 వేలకుపైగా అవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, కిరాణాపై నెలకు రూ.3వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. దీంతో గతంలో పొదుపు చేసిన రూ.5 వేలు ఇప్పుడు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి. పిల్లల వినోదం, కొత్త దుస్తులు, బయట భోజనాలు తగ్గించడంతోపాటు పొదుపును కూడా వదులుకోవాల్సి వస్తోంది. -
డాక్టర్ అని నమ్మి మోసపోవద్దు.. సజ్జనార్ హెచ్చరిక!
వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని అన్నారు.ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారు. అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.ఇలాంటి మోసగాళ్లపై మా నిఘా, కఠిన చర్యలు కొనసాగుతుండగా.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.తాము వెళ్లే క్లినిక్లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి.అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్సైట్లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అర్హత గల ఇతర నిపుణులైన వైద్యుల వద్ద రెండో అభిప్రాయం (Second Opinion) తీసుకోవాలి.ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నానని సజ్జనార్ పేర్కొన్నారు.నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి!వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై… pic.twitter.com/M6SYM2awYj— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 27, 2026 -
వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఇద్దరికి ఉద్వాసన!
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనతోనే ఈ ఎపిసోడ్కు ఎండ్కార్డ్ వేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని సమాచారం. విస్తరణలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పు.. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాముందని చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇదిలా ఉండగా.. శాఖల మార్పు సంకేతాలతో తమ శాఖలో పూర్తయిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసేందుకు మంత్రులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, వరంగల్లో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతుంది, వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో అనధికార పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కొండ సురేఖ.. నో పొలిటికల్ కామెంట్స్ అంటూ ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే రీతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు. అయితే, ఒక వైపు ఏం జరుగుతుందోన్న ఆందోళనలో వరంగల్ ఈస్ట్ కొండా క్యాడర్ ఉంటే.. మరో వర్గం సంబరాలు చేసుకుంటున్నారు.రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న కొండా మురళి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ కనిపించని సుస్మిత పటేల్ హడావుడి లేకుండా సైలెన్స్ మూడ్లోకి వెళ్లిపోయారు. మరో వైపు, మాజీ ఓఎస్డీ సుమంత్ జాడ కోసం వరంగల్లో కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని రాష్ట్రవాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఎదురు మాట్లాడను.. ప్రెస్మీట్ పెట్టను: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: మహిళలంటే తనకు చాలా గౌరవం, వారిపై తాను ప్రెస్ మీట్లు పెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో మా అమ్మ తిట్టినా తల వంచుకుంటానే తప్ప ఎదురు మాట్లాడను. మహిళల ఒక్క చుక్క కంటనీరు నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతామ'ని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) చెప్పారు. ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్మీట్కు తనను ఎవరూ ఆహ్వానించలేదని వెల్లడించారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకుడని, ఆయన విషయంలో తానేమి మాట్లాడబోనని అన్నారు.ప్రశ్నిస్తూనే ఉంటాతన నియోజకవర్గ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. పెండింగ్ బిల్లుల కోసం అవసరమైతే భట్టి విక్రమార్కతో కొట్లాడుతానని, ఈయకపోతే దీక్షకు దిగుతానని వ్యాఖ్యానించారు. కాగా, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్! -
‘రాహుల్.. ఢిల్లీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?’
వరంగల్: పాలిటెక్నిక్ విద్యార్థులపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులేమన్నా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారాయన. తెలంగాణ విద్యార్థుల సమస్యలు రేవంత్కు పట్టవా?అని నిలదీశారు హరీష్రావు.‘విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యం అంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నావ్. తెలంగాణ విద్యార్థులు నీ కంటికి కనిపించడం లేదా...?, జెన్ జీ అంటూ డిల్లీలో ధర్నాలు చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కనిపించడం లేదా?, జెన్ జీ రోడ్డెక్కి పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. డిల్లీకి ఒకనీతి.. తెలంగాణకు మరో నీతా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యారుల కోసం పోరాడాలి. డిల్లీ తరహాలో విద్యార్థులు తిరగడబడక ముందే.... డిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే... రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: వేటేస్తారా?.. వదిలేస్తారా? -
రంగారెడ్డిలో అంబరాన్నంటిన తీజ్ సంబురాలు (ఫొటోలు)
-
లైంగిక వేధింపులు భరించలేకున్నా..
వికారాబాద్: తన కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఓ వ్యక్తి పెడుతున్న లైంగిక వేధింపులు, బెదిరింపులను భరించలేకున్నానని బాధిత మహిళ బుధవారం పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇదే ఊరికి చెందిన కర్రె సుధాకర్ నెల రోజులుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈవిషయమై బాధితురాలు ఈనెల 15న స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, 18న కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకూ అతన్ని అరెస్టు చేయకపోగా, కేసు వాపస్ తీసుకోవాలని ఎస్ఐ తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. దీనిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని డీఎస్పీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన ఎస్ఐ బాలవెంకటరమణతో ఫోన్ మాట్లాడి, నిందితున్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు, చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. -
పది రూపాయల వడ్డీకి రూ.37 లక్షలు.. వడ్డీ కట్టినా వేధింపులే!
హైదరాబాద్: అధిక వడ్డీ వసూలు చేస్తూ బలవంతంగా చెక్కులను తీసుకొని బెదిరింపులకు పాల్పడుతుందంటూ మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్కు చెందిన పరిమళలకు సుమలత అనే మహిళ ఇంట్లో పనిచేసే లక్ష్మీ ద్వారా 2016లో పరిచయం ఏర్పడింది. సుమలత భర్త చనిపోయిన తర్వాత ప్రశాంత్సాయితో పెళ్లి జరిగింది. పరిమళ తనతో పాటు తన కజిన్స్కు ఆర్థిక సాయం కావాలని చెప్పగా పలు దఫాలుగా రూ.37 లక్షలు సుమలత ఇచ్చింది. అయితే కోవిడ్లో పరిమళ కజిన్స్ ఆర్థికంగా బలహీనపడ్డారని తెలిసి కూడా వడ్డీని రూ.7 నుంచి రూ.10కి పెంచింది. తప్పని పరిస్థితిలో వడ్డీ కడుతూ వచ్చింది. అయితే పరిమళ కూతురి వివాహమని తెలిసి రూ.37 లక్షలు చెల్లించాలని బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకొని, మేము చెప్పినట్లు వినకపోతే పెళ్లి జరగకుండా చేస్తామని వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడుగా వార్తలను సైతం ప్రచురించి పరువు, ప్రతిష్టలను దెబ్బతీ«శారని, అధిక వడ్డీతో సహా అదనంగా కూడా ఇచ్చానని, వేధింపులకు గురిచేసిన సుమలత, ప్రశాంత్సాయిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పరిమళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం! -
మా వాళ్లు ఎలా ఉన్నారో?
సాక్షి, హైదరాబాద్: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యాపార, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లిన తమవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి ఏ హానీ కలగకుండా తిరిగి రావాలంటూ మొక్కుకుంటున్నారు. నగరం నుంచి నేపాల్ వెళ్లినవారు 150 మందిపైనే ఉంటారని తెలుస్తోంది. నేపాల్కు వీసా లేకుండా అధికారిక గుర్తింపు కార్డులు చూపించి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భారతీయులు పర్యాటకంతో పాటు వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు.అనేక కారణాల వల్ల నగరం నుంచి నేపాల్ ఉత్తర ప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తుంటారు. ఇలాంటివారితో పాటు సఫారీలు, ట్రెక్కింగ్స్ కోసం వెళ్లే వారి సంఖ్య గణనీయమే. వర్షాకాలం నేపథ్యంలో ట్రెక్కింగ్కు వెళ్లేవారి సంఖ్య తగ్గినా, మిగిలిన పనులపై వెళ్లేవారు పదులు, వందల్లోనే ఉంటారు.ఆకస్మిక వరదల వార్త దావానలంలా వ్యాపించడంతో వీరందరి కుటుంబాల్లో ఉత్కంఠ, ఆత్రుత నెలకొంది. నేపాల్ యాత్రకు వెళ్లినవారిని సంప్రదించడానికి ప్రయత్నించగా అనేకమంది ఫోన్లు బుధవారం అర్ధరాత్రి వరకు పని చేయలేదు. కొందరి ఫోన్లు రింగ్ అవుతున్నా సమాధానం ఉండట్లేదు. ఈ పరిణామాలు నగరంలోని వారి కుటుంబీకుల్లో ఆందోళన మరింత పెంచుతోంది. చాలామంది తమవారిని తీసుకెళ్లిన, పంపిన ట్రావెల్ ఏజెన్సీలు, వ్యక్తుల వద్దకు పరుగులు పెట్టారు. 31 మంది క్షేమం చిక్కడపల్లి: నగరం నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి ఖాట్మాండుకు చేరుకుని, అక్కడినుంచి భారత్లోకి రానున్నారు. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన ఎమ్మెస్ రామారావు ట్రస్టు చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ స్వామి ఫోన్ ద్వారా వెల్లడించారు. 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన ఆకస్మిక వరదలు నగరం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లినవారిపై తీవ్ర ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో నగరవాసులు చనిపోగా, ఇంకొందరు గల్లంతయ్యారు. 2014లో హిమాచల్ప్రదేశ్ మండి జిల్లాలోని బియాస్ నది వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్ గేట్లను తెరవడంతో నగరం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ ఆకస్మిక వరదల వార్త విన్న నగరవాసులు పై రెండు ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి బీభత్సాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ మూడు దుర్ఘటనలూ హిల్ స్టేషన్లలో జరిగినవే కావడంతో మరింత కంగారు పడుతున్నారు. చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
సరే.. మమ్మీ నువ్వే కాల్ చెయ్
నిజామాబాద్అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన రాహుల్ చివరి సారిగా తన తల్లితో ఫోన్లో ఈనెల 24వ తేదీన ఉదయం 9గంటలకు మాట్లాడాడు. తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలోనే స్నేహితులు క్యాబ్లో రావడంతో ‘‘ఆఫీస్కు వెళ్తున్నానని, రేపు ఉదయం నువ్వే కాల్ చెయ్ మమ్మీ..’’ అంటూ ఫోన్ కట్చేశాడు. అవే రాహుల్ చివరి మాటలు అంటూ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. నవీపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నాగమణి, హరిబాబు జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాగమణి గృహిణి కాగా, హరిబాబు రైల్వేలో ఏఎస్సైగా పని చేసి రిటైర్ అయ్యారు. కొడుకు రాహుల్ నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న రాహుల్ అక్కడే పీహెచ్డీ పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మే 5వ తేదీన తన చెల్లె పెళ్లికి ఇంటికొచ్చిన రాహుల్ అదే నెలలో 18వ తేదీన తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. తన తల్లితో సోమవారం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే రాహుల్ దుర్మరణం పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుంబెలుబాదుకుంటున్నారు. తన కొడుకు మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని తండ్రి హరిబాబు రోదిస్తూ వేడుకుంటున్నాడు. -
అన్నకు అంతిమ రాఖీ
హైదరాబాద్: విద్యుదాఘాతంతో చనిపోయిన అన్న మృతదేహానికి చెల్లి రాఖీ కట్టి కన్నీరుమున్నీరైంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన నర్సింలు, రాణిబాయ్ దంపతుల కుమారుడు జమాల్పూర్ నవీన్ (24) చటాన్పల్లి రైల్వేగేట్ సమీపంలో మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం షాపులోకి విద్యుత్ సరఫరా కాకపోవడాన్ని గమనించి, సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే నవీన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలకు తీసుకెళ్తున్న క్రమంలో.. సోదరి పూజిత అన్నకు చివరి రాఖీ కట్టి గుండెలవిసేలా రోదించింది. -
హరీష్రావు హౌస్ అరెస్ట్.. వరంగల్ పర్యటనకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వరంగల్ వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వరంగల్ వెళ్లాలని హరీష్రావు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలో హరీష్ను బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించి హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో హరీష్ రావు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్!మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/KsHQVCetUB— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026 -
వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
కీసర: యాదాద్రి–భువనగిరి జిల్లా గూడూరుకు చెందిన తెలంగాణ రక్షణ సేన నాయకుడు బాషబోయిన బాలప్రసాద్ వివాహం బుధవారం కీసర చౌరస్తా వద్ద గల ఆరాధ్య కన్వెన్షన్ హాలులో జరిగింది. ఈ వివాహ వేడుకకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ముదిరాజ్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాలని బాలప్రసాద్ కోరాడు.దీంతో కల్వకుంట్ల కవిత ఇంటి ఆడపడుచుగా వ్యవహరించి వరుడు వధువుకు తాళికట్టేముందు గౌరి పూజలో పాల్గొని పసుపు కొమ్ము దారంతో వధువు శివాని మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం ఒడిబియ్యం పోసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బాలప్రసాద్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. Kavitha Performs ‘Aadabidda’ Ritual at Mudiraj WeddingTG Rakshana Sena leader Balaprasad, who has no sisters, had requested Kavitha to perform the traditional duties of a sister at his wedding with Shivani.Following the Mudiraj custom, Kavitha participated in the Gauri Puja… pic.twitter.com/3xegvqLb56— Naveena (@TheNaveena) August 26, 2026చదవండి: హరీష్రావు హౌస్ అరెస్ట్.. వరంగల్ పర్యటనకు బ్రేక్! -
ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. కొండా కుటుంబంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది.తాజా పరిణామాల్లో భాగంగా నిన్న కొండా మురళి, రాజగోపాల్రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి.. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై కొండా కుటుంబం తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం మాత్రం కఠిన చర్యల దిశగానే అడుగులు వేస్తుందా? అన్న చర్చ మొదలైంది.ఇదిలా ఉంటే.. కొండా మురళి, రాజగోపాల్రెడ్డితో భేటీ అనంతరం భట్టి విక్రమార్క నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఖర్గేతో భట్టి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కొండా కుటుంబం వ్యవహారంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను భట్టి ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సుస్మిత తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో నెలకొన్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఆ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానం వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కొండా కుటుంబంతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని భట్టి కోరినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణతో ముందుకు సాగాలంటే.. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతలపై చర్యలు తప్పవని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.ఇంకా బెంగళూరులోనే భట్టి..మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది. మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొండా ఫ్యామిలీపై కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. క్రమశిక్షణ కమిటీ సిఫారసులకు ఆమోదం లభిస్తుందా? కొండా కుటుంబంపై చర్యలు తప్పవా? చిన్నారెడ్డిపై కూడా వేటు పడుతుందా? లేక వివాదానికి మరోసారి సర్దుబాటు పరిష్కారం చూపుతారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.సీఎం, పీసీసీ అభిప్రాయాలపైనా చర్చఇదిలా ఉండగా.. కొండా కుటుంబం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అభిప్రాయాలపైనా భట్టి-ఖర్గే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే ముగించాలా? లేక అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ అంశాన్ని ఇకపై సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినట్లు సమాచారం.చదవండి: ‘రేవంత్పై కొండా సుస్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’ -
నేపాల్ వరదలు: బాధితుల కోసం తెలంగాణ హెల్ప్లైన్ నెంబర్లు
కఠ్మాండూ: దేవభూమి నేపాల్లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు.రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో పాటు పలు నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వరద టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషిలో పడిన మంచు కరగడం వల్ల వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ వరదలకు కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని తాకిన ఆకస్మిక వరదల కారణంగా కనీసం 157 మంది మరణించారు.వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాష్ మానస సరోవరానికి వెళ్లిన కనీసం 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.నేపాల్ పోలీసులు 157 మృతదేహాలను వెలికితీశారు. వరద ముప్పు ప్రాంతాల కుటుంబాలను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, విపత్తు సంభవించిన కొన్ని గంటల తర్వాత, 341 మంది విదేశీయులతో సహా సుమారు 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన విదేశీయులలో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది తెలిపింది.ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా, నేపాల్ సహాయక బృందాలు బురద కింద పూడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంన్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని సూచించారు. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనున్నారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ 9871999044, 9949351270, 9618597969 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. -
మళ్లీ జల జగడం!
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం రాజుకుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి నీటి విడుదల ఉత్తర్వులు పొందకుండానే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకోవడానికి ఏపీ ప్రయత్నించగా, తెలంగాణ అడ్డుకుంది. నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ భాగం తెలంగాణ, కుడి భాగం ఏపీ భూభాగ పరిధిలోకి వస్తాయి. ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్లు బుధవారం ఉదయం 11.10 గంటల ప్రాంతంలో కుడి కాల్వ వద్దకు చేరుకొని గేట్లు ఎత్తడానికి ప్రయత్నించగా, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అడ్డుకున్నారు. తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదల చేసుకుంటున్నామని ఏపీ ఇంజనీర్లు వాదించగా, కృష్ణాబోర్డు అనుమతి లేకుండా గేట్లు ఎత్తడానికి వీలులేదని తెలంగాణ ఇంజనీర్లు అభ్యంతరం తెలిపారు. రెండు రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ ఎస్ఈ మల్లికార్జున్, ఈఈ గోపినాథ్, ఏఈఈ విజయ్కుమార్ ఏపీ ఇంజనీర్లను అడ్డుకున్నారు. గేట్లను ఎత్తడం సాధ్యం కాకపోవడంతో ఏపీ ప్రత్యామ్నాయ మార్గంలో జలవిద్యుద్పుత్తి ప్రారంభించి కుడి ప్రధాన కాల్వకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ఏపీ జెన్కో యాజమాన్యంలోని 90 మెగావాట్ల (3గీ30) సాగర్ కుడి ప్రధాన కాల్వ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరపాలంటే కనీసం 530 అడుగుల మేర నిల్వలు ఉండాలి. ప్రస్తుతం డ్యామ్లో 535 అడుగులకు నీటిమట్టం, 181 టీఎంసీలకు నిల్వలు చేరడంతో ఏపీ విద్యుదుత్పత్తి ప్రారంభించి కుడి ప్రధాన కాల్వ ద్వారా తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసుకుంది. దీంతో తెలంగాణ సైతం ఎడమ కాల్వ గేట్లు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది గతంలోనూ సాగర్పై వివాదం రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చేపట్టింది. 2023 నవంబర్ 29న అర్ధరాత్రి వేళ ఏపీ ప్రభుత్వం సాయుధ బలగాల సహాయంతో సాగర్ కుడి భాగాన్ని తమ అ«దీనంలోకి తీసుకోవడంతో అప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సాగర్ కుడివైపు భాగం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల పహారాను ఏర్పాటు చేసింది. డ్యామ్ కుడి భాగం వైపు మరమ్మతులు, నిర్వహణ పనులకు ఇంజనీర్లను కృష్ణాబోర్డు అనుమతి ఉంటేనే గతంలో సీఆర్పీఎఫ్ బలగాలు అనుమతించాయి. కృష్ణాబోర్డు అనుమతి తీసుకోకుండానే కుడిభాగం వైపు ఏపీ ఇంజనీర్లు ప్రవేశించి గేట్లను ఎత్తడానికి ప్రయత్నించారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. బుధవారం సాధారణ సెలవులు కావడంతో గురువారం ఈ అంశంపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ఇంజనీర్లు తెలిపారు. నీటి విడుదల ఉత్తర్వులు లేకుండానే.. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు ఆశించిన మేరకు వరద రాలేదు. సూపర్ ఎల్నినో ప్రభావం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి జలాశయాల్లోని నిల్వలను కేవలం తాగునీటి అవసరాలకే వాడుకోవాలని ఇటీవల జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఏకభిప్రాయానికి వచ్చాయి. అక్టోబర్ 31 వరకు ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలను కేటాయించాలని ఏపీ కోరగా, 2027 జూన్ 31 వరకు ఉండే తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 112 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం లేకుండానే త్రిసభ్య సమావేశం ముగిసింది. శ్రీశైలం, సాగర్ పరిధిలో తెలంగాణలో రెండు కోట్ల జనాభా ఉందని, అక్టోబర్ 31వరకు తాగునీటి అవసరాల కోసం తమకూ 47 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది. ఏపీలో రెండు జలాశయాల పరిధిలో 76 లక్షల జనాభా ఉంటే 47 టీఎంసీలను ఎలా కోరుతారని ప్రశ్నించింది. చర్చల్లో ఏకభిప్రాయం సాధ్యం కాకపోవడంతో సెపె్టంబర్ 4న మళ్లీ సమావేశమై ఆనాటికి జలాశయాల్లో నిల్వలు పెరిగితే వాటి ఆధారంగా నీటి పంపకాలు జరుపుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో నీటి విడుదలపై కృష్ణాబోర్డు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈలోగా సాగర్ నుంచి ఏపీ నీటిని విడుదల చేసుకోవడం పట్ల తెలంగాణ తీవ్ర ఆక్షేపణ తెలిపింది. -
ఏఐ.. స్టార్టింగ్ ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ మెజారిటీ అభ్యాసకులు సాంకేతిక నైపుణ్యాలను ఎక్కడ నుంచి నేర్చుకోవడం ప్రారంభించాలో తెలియక సతమతమవుతున్నారు. తగినంత అవగాహన లేకపోవడం, శిక్షణా కార్యక్రమాల ఎంపికలో గందరగోళం వంటి అంశాలు వారి వృత్తిపరమైన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రముఖ విద్యా సంస్థ అప్గ్రాడ్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 56 శాతం మంది భారతీయ అభ్యాసకులు కృత్రిమ మేధస్సును నేర్చుకునే ప్రయాణంలో సరైన దిశానిర్దేశం లేకపోవడమే అతిపెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల కోర్సులు, వాటి విశ్వసనీయతపై ఉన్న అనిశ్చితి కారణంగా 43 శాతం మంది అయోమయానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని వివిధ వృత్తుల్లో ఉన్న అభ్యాసకుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏదో ఒక రూపంలో.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 94 శాతం మంది ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నామని చెప్పారు. అందులో సగానికి పైగా (53 శాతం) మంది ప్రతిరోజూ దీనిని వాడుతున్నారు. ఈ ధోరణి కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించింది. దీనివల్ల ఉద్యోగులు, విద్యార్థులు ఈ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 87 శాతం మంది ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాల్లో చేరడం లేదా నేర్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. వృత్తిపరమైన రంగంలో ఎక్కువ అనుభవం ఉన్నవారు ఈ సాంకేతికతను నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రారంభ దశలో ఉన్న అభ్యాసకులలో రోజువారీ వాడకం 44 శాతంగా ఉంటే, 8 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వారిలో ఇది 62 శాతానికి పెరిగింది. సీనియర్ నిపుణుల్లో 31 శాతం మంది వారానికి కనీసం మూడు గంటలు దీనిని అభ్యసించడానికి వెచ్చిస్తున్నారు. మునుపటి కంటే సులభంగా.. ఈ నైపుణ్యాల వల్ల 54 శాతం మంది తమ వృత్తి జీవితంలో స్పష్టమైన పురోగతిని సాధించారు. ఇందులో ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త బాధ్యతలు చేపట్టడం, పదోన్నతులు, అదనపు ఆదాయ వనరులు పొందడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దాదాపు సగం మంది అభ్యాసకులు గతంలో తమ సామర్థ్యానికి మించిన పనులను ఇప్పుడు దీని సహాయంతో సులభంగా చేయగలుగుతున్నారు. వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సాంకేతిక సృజనాత్మకతలో భారతీయులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు. కేవలం నాలుగింట ఒకవంతు మంది మాత్రమే ఇతర సాధనాలతో దీనిని అనుసంధానించారు. కేవలం 20 శాతం మంది మాత్ర మే ఆటోమేటెడ్ వ్యవస్థలను లేదా నూతన అప్లికేషన్లను తయారు చేయగలిగారు. భవిష్యత్తు సవాళ్లు సాంకేతిక రంగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అందుకోవడం 43 శాతం మందికి దైనందిన సవాలుగా మారింది. ‘భారత్ ఇప్పుడు ఈ సాంకేతికత పనిని మారుస్తుందా లేదా అనే ప్రశ్నను దాటి ముందడుగు వేసింది. ప్రజలు ఇప్పటికే దీనిని ఉపయోగిస్తూ, నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతున్నారు. తదుపరి సవాలు ఏమిటంటే అభ్యాసకులకు స్పష్టమైన మార్గాన్ని చూపించడం. వారు నేర్చుకున్న నైపుణ్యాలను అర్థవంతమైన ఉద్యోగ అవకాశాలుగా మార్చడమే’అని అప్గ్రాడ్ పేర్కొంది. భారత్లో ఈ సాంకేతిక ప్రయాణం విజయవంతం కావాలంటే కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా, ఉద్యోగాలకు ఉపయోగపడే ఆచరణాత్మక నైపుణ్యాల వైపు అడుగులు పడాల్సి ఉందని అభిప్రాయపడింది. -
మీ భద్రత.. మీ చేతుల్లోనే...
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ఒకప్పుడు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతా నంబర్, కార్డు వివరాలు మాత్రమే అవసరమయ్యేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. బాధితుడి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, సోషల్ మీడియా ప్రొఫైల్, ఉద్యోగం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రయాణ వివరాలు, ఫొటోలు, లొకేషన్, ఆన్లైన్ కొనుగోళ్ల సమాచారం వంటి చిన్నచిన్న వివరాలను సేకరించి.. వాటిని ఆధారంగా చేసుకుని మరింత నమ్మదగిన మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే మీ భద్రత మీ చేతుల్లోనే.. అని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా సైబర్ భద్రతపై కనీస అవగాహన తప్పనిసరని వారు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పినా.. ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, సీవీవీ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వంటి గోప్య వివరాలను ఎవరికీ చెప్పకూడదని పేర్కొంటున్నారు. మనం ఇచ్చే వివరాలే పెట్టుబడి.. సోషల్ మీడియాలో మనం సరదాగా పెట్టే ప్రతి సమాచారం సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. పుట్టిన తేదీ, కుటుంబ సభ్యుల పేర్లు, పిల్లల పాఠశాల, ఉద్యోగ సంస్థ, ఇంటి ప్రాంతం, సెలవుల కోసం ఎక్కడికి వెళ్తున్నామనే వివరాలు కూడా నేరగాళ్లు సేకరించే ప్రమాదం ఉందని మనం గ్రహించాలి. ఈ సమాచారాన్ని ఉపయోగించి బాధితుడికి తెలిసిన వ్యక్తిలా ఫోన్ చేయడం, బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థ పేరుతో సందేశాలు పంపడం, నకిలీ పెట్టుబడి ఆఫర్లు ఇవ్వడం, బంధువు అత్యవసర పరిస్థితిలో ఉన్నాడంటూ డబ్బులు అడగడం వంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవడం మరవొద్దు.. ఈ–మెయిల్, సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ స్టోరేజ్ తదితర ఖాతాలకు ఒకే పాస్వర్డ్ ఉపయోగించడం ప్రమాదకరం. ఒక ఖాతా పాస్వర్డ్ లీక్ అయితే మిగిలిన ఖాతాలన్నింటికీ ముప్పు ఏర్పడుతుంది. ప్రతి ముఖ్యమైన ఖాతాకు ప్రత్యేకమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, 123456, p్చటటఠీౌటఛీ వంటి సులభంగా ఊహించగలిగే పాస్వర్డ్లు అస్సలు వద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలతో పొడవైన పాస్వర్డ్లను ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. పాస్వర్డ్ను కాగితాలపై, ఫోన్ నోట్స్లో బహిరంగంగా రాసి ఉంచకూడదని, అవసరమైన చోట మల్టీ–ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ, 2ఎఫ్ఏ)ను యాక్టివేట్ చేయాలని సూచిస్తున్నారు. డబ్బు పంపడానికి యూపీఐ పిన్ అవసరం. డబ్బు స్వీకరించడానికి యూపీఐ పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించండి.. » అధికారిక వెబ్సైట్ లేదా సంస్థకు చెందిన అధికారిక యాప్ ద్వారా మాత్రమే సేవలను ఉపయోగించాలి. మెసేజ్లో ఉన్న లింక్ను ఉపయోగించకుండా సంస్థ అధికారిక నంబర్ లేదా వెబ్సైట్ ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలి. » సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం అవసరానికి మించి పంచుకోవద్దు. » సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకోవడం అలవాటుగా మారింది. అయితే అది వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారవచ్చు. » ఇంటి పూర్తి చిరునామా, వ్యక్తిగత ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, కుటుంబ సభ్యు ల వివరాలు, ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన తేదీలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు. » లొకేషన్ షేరింగ్ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. » పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ వంటి సున్నితమైన లావాదేవీలను వీలైనంత వరకు నివారించాలి.»అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదు. -
A ఫర్ అఫిడవిట్.. B ఫర్ బెయిల్
ఏ ఫర్ అఫిడవిట్.. బీ ఫర్ బెయిల్.. అంటూ పాఠశాల విద్యార్థులకు ‘న్యాయ’పాఠాలు నేర్పించాలని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీజీఎల్ఎస్ఏ), పాఠశాల విద్యా శాఖ నిర్ణయించాయి. వివిధ చట్టాలు, సెక్షన్లతో పాటు శిక్షలకు సంబంధించిన పూర్తి వివరాలపై వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాయి. దీని కోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమమే ‘మిషన్ బాల్ సురక్ష, శిక్ష అండ్ న్యాయ్–2026’. పలు చట్టాలపై తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 3,180 మంది మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మరిన్ని పాఠశాలలకు వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ, న్యాయ సేవల సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి, అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శామ్కోషి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.పాఠశాల విద్యాశాఖతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో బాలల హక్కులు, బాలలకు సంబంధించిన చట్టాలు, న్యాయ సాయం అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటివరకు 3,180 మంది పాఠశాల ఉపాధ్యాయులకు చట్టాలపై శిక్షణ ఇచ్చాం. ఇందులో ‘గుడ్ టచ్– బ్యాడ్ టచ్’తోపాటు పలు కీలక చట్టాలున్నాయి. – జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, హైకోర్టు సీజే ప్రధానంగా ఏఏ చట్టాలపై అవగాహన?» బాలలపై వేధింపులు, కించపర్చడం» బాల్య వివాహాలు, సమస్యలు» బాల కార్మిక వ్యవస్థ» మాదకద్రవ్యాల వినియోగం, ఇతర వ్యసనాలు» ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు» బాలల హక్కులు, రక్షణ చట్టాలు» గుడ్ టచ్, బ్యాడ్ టచ్(‘ధీరా వెల్నెస్ ప్రోగ్రామ్’ద్వారా యోగా సాధన)ఏమేం చేస్తారు..?» రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో న్యాయ అక్షరాస్యత, అవగాహన కార్యక్రమాల నిర్వహణ» లీగల్ లిటరసీ క్లబ్లు, చైల్డ్ రైట్స్ క్లబ్ల ఏర్పాటు » చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమితులయ్యే ఉపాధ్యాయుల (మహిళ)కు ప్రత్యేక శిక్షణ» విద్యార్థులకు వారి హక్కులు, విధులపై పోటీలు, ఇంటరాక్టివ్ సెషన్లు » చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, పోలీసు శాఖ, ఎన్జీవోలతో సమన్వయం» అవసరమైన సందర్భాల్లో విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయ సాయం కల్పించడంపాఠశాల విద్యార్థుల్లో న్యాయ అవగాహన, రాజ్యాంగ విలువలు, బాలల హక్కులపై చైతన్యం పెంపొందించడంతో పాటు బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు కనీస చట్టాలపై అవగాహన అవసరం ఎంతైనా ఉంది. సబ్జెక్ట్ అంశాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి కూడా న్యాయ అవగాహన ఉండటం లేదు. వారికి సంబంధించిన చట్టాలు తెలియడం లేదు. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రస్తుతం సమాజంలో విద్యార్థి దశ నుంచే చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. – సీహెచ్.పంచాక్షరి, సభ్యకార్యదర్శి, టీజీఎల్ఎస్ఏ పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర స్థాయిలో..» పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్» విద్యాశాఖ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్» టీఎస్ఎల్ఎస్ఏ సభ్యకార్యదర్శి/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్జిల్లా స్థాయిలో....» జిల్లా విద్యాశాఖ అధికారి » జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్» డీఎల్ఎస్ఏ (జిల్లా న్యాయసేవా సంస్థ) కార్యదర్శి -
అధ్యాపకుల కోత... ఆర్థిక ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. అక్కడి వర్సిటీల్లో రానురాను నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. విశ్వవిద్యాలయాలు అధ్యాపకులను తగ్గించుకుంటున్నాయి. కోర్సులకూ కోత పెడుతున్నాయి. సిలబస్లో మార్పులు చేస్తున్నాయి. భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపించే ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ మాస్టర్ డిగ్రీలకూ ఇదే ప్రతికూల పరిస్థితి. మౌలిక సదుపాయాలకు వర్సిటీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పరిశోధనల వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రాధాన్యతనివ్వాల్సిన ప్రాక్టికల్ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రధాన వర్సిటీలు మినహా... విదేశీ విద్యార్థులు వెళ్లే అన్ని చోట్లా ఇదే పరిస్థితి. గత ఏడాది 9 వేల మంది తొలగింపు అమెరికా ఆన్లైన్ జర్నల్ ‘ఇన్సైడ్ హయ్యర్ ఎడ్యుకేషన్’కథనం ప్రకారం వర్సిటీలు 2025లో 9 వేలకుపైగా అధ్యాపకులను తొలగించాయి. గత ఏప్రిల్లో వెయ్యికి పైగా తొలగింపులు జరిగినట్టు పేర్కొంది. ఈ నెల మొదటి వారంలో ఇల్లినాయి టెక్ 160 మందికి ఉద్వాసన పలికింది. ది న్యూస్కూల్లో జూన్లో 19 మంది ఫ్యాకల్టీ, 68 మంది సిబ్బందిని తొలగించారు. పోర్ట్లాండ్ స్టేట్ యూనివర్సిటీ తాజాగా 36 మంది ఫ్యాకల్టీని ఇంటికి పంపింది. మరో 8 మందిని కాలపరిమితి గల ఫ్యాకల్టీగా మార్చింది. వెస్ట్రన్ మిచ్గన్ వర్సిటీ 60 ఏళ్లు నిండిన అధ్యాపకులకు బై అవుట్ ఇచ్చింది. వారికి భారీగా ఆఫర్లు ప్రకటించి, రాజీనామా చేయించింది. అర్సినస్ కాలేజీ 29 పూర్తిస్థాయి ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్టైమ్గా మార్చి వేతనాలు తగ్గించింది. కొలంబియా కాలేజీ ఆఫ్ షికాగో 54 ఫ్యాకల్టీ పోస్టులను రద్దు చేసింది. అనేక వర్సిటీల్లో ఇదే పరిస్థితి. భారత విద్యార్థులు చదివే 80 శాతం వర్సిటీల్లో అధ్యాపకుల కోత కన్పిస్తోంది. పరిశోధనకు పనికిరాని విధంగా కోర్సులు మారుతున్నాయని అక్కడి అధ్యాపకులు అంటున్నారు. కారణాలేంటి? ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలుగా పేరు పొందిన అమెరికా వర్సిటీలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ వీసా మార్పులు విద్యార్థుల్లో భయం పుట్టిస్తున్నాయి. దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య రెండేళ్లుగా గణనీయంగా తగ్గింది. 2024–25లో అమెరికాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11,77,766. వీరి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 55 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనివల్ల 3.55 లక్షల మందికిపైగా ఉద్యోగాలు పొందారని రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది 14 శాతం విద్యార్థులు తగ్గారు. ఈ ఏడాది 17 శాతానికి చేరినట్టు అంచనా. దీంతో ఈ ఏడాది ఆమెరికా ఆర్థిక వ్యవస్థకు 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం తగ్గవచ్చని లెక్కగట్టారు. ఇది 40 వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చని జాబ్డేటా గుర్తించింది. ఫలితంగా వర్సిటీలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి. సిబ్బంది వేతనాలు, బీమా, ఇతర సంక్షేమం ఖర్చులు పెరగడం, మరోవైపు ఆదాయం తగ్గడం సమస్యగా మారింది. పోర్ట్ల్యాండ్ వర్సిటీ 3.6 కోట్ల డాలర్ల లోటులోకి వెళ్లగా, కొలంబియా కాలేజీ 4 కోట్ల డాలర్ల లోటు చూపించింది. భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ సబ్జెక్లుల్లో మాస్టర్ డిగ్రీ కోసం భారత్ నుంచి విద్యార్థులు ఎక్కువగా అమెరికా వెళ్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందని, ప్రధాన కంపెనీలు వర్సిటీ భాగస్వామ్యంతో పనిచేస్తాయని విశ్వసిస్తారు. దీనివల్ల ఏఐలో తాజా టెక్నాలజీ నేర్చుకోవడం, కోర్సు పూర్తవ్వగానే స్కిల్ ఉద్యోగాలు పొందే వీలుందని భావిస్తారు. కంపెనీలకు వర్సిటీలు దూరమవ్వడంతో పరిపూర్ణమైన విద్య అందే అవకాశం ఉండదు. దీనివల్ల ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. పరిశోధనలకు ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏఐ, సైబర్ సెక్యూరిటీలో కొత్త చాలెంజ్ను ఎదుర్కోవడం విద్యార్థులకు సమస్యగా మారుతుంది. రూ.లక్షలు అప్పుచేసి అమెరికా వెళ్లినా ఉపయోగం లేకపోవడం విద్యార్థులకు ఆర్థికంగా, విద్యాపరంగా నష్టం జరిగే వీలుందని నిపుణులు అంటున్నారు.ఫ్యాకల్టీ కోతలు పెరుగుతున్నాయి ఆంక్షల నేపథ్యం, అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికా వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కీలకమైన బ్రాంచీల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళనలూ ఉన్నాయి. ఇది నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. –ప్రొ. మాథ్యూ హోలాండ్ (పరూడ్య యూనివర్సిటీ)ఉపాధికీ దెబ్బేమాస్టర్ డిగ్రీలో పరిశోధనలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ముఖ్యం. ఏఐ వేగం తర్వాత కొత్త టెక్నాలజీపై పట్టు పెరగాలి. ఫ్యాకల్టీ తగ్గుదల వల్ల ఈ తరహా కృషికి బ్రేకులు పడే ప్రమాదం ఉంది. దీనివల్ల విద్యార్థులు కార్పొరేట్ సంస్థల అవసరాలకు తగ్గట్టు తయారవ్వడం కష్టం. ఇది ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుంది. –ప్రొ. నథానెల్ హన్సూ (యూనివర్సిటీ ఆఫ్ జార్జియా) -
పేగుబంధం మరిచి.. కన్నవారినే విడిచి
గతేడాది హైదరాబాద్ లింగంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంపాలైన 78 ఏళ్ల తల్లిని కుమారుడు చేర్చాడు. రూ. 3 లక్షల బిల్లు కావడంతో డబ్బు తీసుకొచ్చి కడతానని చెప్పి వెళ్లిన అతను మళ్లీ కనిపించలేదు. 45 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆమెను చివరకు పోలీసులు, ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో వృద్ధాశ్రమానికి తరలించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలోని కూకట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి ముందు 82 ఏళ్ల తండ్రిని కుమారుడు కారులో దింపి వెళ్లిపోయాడు. ఆ పెద్దాయన వద్ద ఆధార్ కార్డు, రూ. 200 మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలోని కారు నంబర్ ఆధారంగా ఆ కుమారరత్నాన్ని పట్టుకున్నారు.సాక్షి, హైదరాబాద్: దేశంలో కుటుంబ సంస్కృతి, విలువలు ఒకప్పుడు అనుబంధాలు, ఆత్మీయతల కలబోతగా ఉండేవి. కానీ నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవనంలో అను రాగాలు దూరమవుతున్నాయి.. మమకారాలు మాయమవు తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు అమెరికా వంటి అగ్రదేశాల్లో కనిపించిన ఈ పెడధోరణి ప్రస్తుతం మన రాష్ట్రం దాకా పాకింది. ఎంతగా అంటే.. జన్మనిచ్చి, విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నారనే కారణంతో ఏమాత్రం కనికరం లేకుండా పిల్లలు వదిలించుకుంటున్న ఉదంతాలు కొంతకాలంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, కేర్ హోమ్స్ వద్ద తల్లి లేదా తండ్రిని వదిలేసి కుటుంబ సభ్యులు పరారవుతున్న దారుణ పరిస్థితులు సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ పెడ ధోరణినే ‘గ్రానీ డంపింగ్’గా పిలుస్తున్నారు. అధికారిక గణాంకాలు లేనప్పటికీ ఈ తరహా కేసులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలకు సగటున 12 నుంచి 15 వరకు నమోదవుతున్నాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధులను ఆస్పత్రుల్లో చేర్పించి కుటుంబ సభ్యులు వెళ్లిపోతున్నారని.. బిల్లులు కూడా కట్టకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ అమానవీయ ధోరణిపై ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.46 శాతం వృద్ధులపై పిల్లల నిర్లక్ష్యం..ఆర్థిక భారం, వృద్ధుల వైద్య ఖర్చు నెలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటోంది. దీనికితోడు ఉమ్మడి కుటుంబాలు మాయమై చిన్న కుటుంబాలు, న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడటంతో కుటుంబ సభ్యులు వృద్ధులను చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేర్పించడమో లేదా అక్కడ వదిలేయడమో చేస్తున్నారు. చికిత్స పూర్తయినప్పటికీ వారిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావట్లేదు. కొన్ని సందర్భాల్లో వృద్ధులను రోడ్ల పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లోనూ వదిలివేస్తున్నారు. హెల్పేజ్ ఇండియా 2025 సర్వే ప్రకారం తెలంగాణలో 46 శాతం మంది వృద్ధులు పిల్లల నుంచి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు.ఎందుకు ఇలా చేస్తున్నారు?వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు వదిలించుకోవాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రేమ లేకపోవడమే కారణం కాదని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయç³డుతున్నారు. వృద్ధుల దీర్ఘకాలిక సంరక్షణ ఖర్చులు పెరగడం, చాలామంది వృద్ధులకు ఉండే మతిమరుపు వంటి అనారోగ్య సమస్యల నేపథ్యంలో నిరంతరం పర్యవేక్షించేందుకు సౌకర్యాలు లేకపోవడం, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు కూడా కొన్ని కుటుంబాలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టం 2007 ప్రకారం తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టబద్ధ బాధ్యతని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే వారికి 3 నెలల జైలు లేదా రూ. 5 వేల జరిమానా పడే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. పిల్లల నిరాదరణకు గురయ్యే వృద్ధులు హైదరాబాద్ పోలీసుల పరిధిలోకి వచ్చే సీనియర్ సిటిజన్ సెల్, 1091 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.అమెరికాలో 1990ల నుంచే..అనారోగ్యంతో బాధపడే వృద్ధులను ఆస్పత్రుల వద్ద వదిలేసే విష సంస్కృతి ఇటీవల కాలంలో వచ్చిందేమీ కాదు. అమెరికాలో 1992లోనే అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ సర్వే ప్రకారం సంవత్సరానికి సుమారు 70,000 మంది వృద్ధులు ఆస్పత్రుల వద్ద నిరాదరణకు గురైనట్లు అంచనా. అయితే గ్రానీ డంపింగ్ కేవలం కుటుంబ సమస్య కాదు.. వృద్ధ సంరక్షణ వ్యవస్థ, సామాజిక భద్రత, కుటుంబాలపై పడుతున్న సంరక్షణ భారానికి కూడా అద్దం పడుతున్న సమస్య. కుటుంబం చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వృద్ధులను వదిలేయడం కాకుండా, సామాజిక సేవలు, అసిస్టెడ్ లివింగ్ లేదా ప్రభుత్వ/స్వచ్ఛంద సహాయ వ్యవస్థలను ఉపయోగించుకోవడం అవసరం.అలాంటి వారికి మానవీయ సేవలు అందిస్తున్నాంఅనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను కొందరు పిల్లలు ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా 70 ఏళ్లు దాటిన వారు, పక్షవాతం, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారినే పిల్లలు వదిలేస్తున్నారు. అలాంటి వృద్ధులను మా సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు. మేము కూడా మా సొంత తల్లిదండ్రుల్లాగే భావించి వారికి వైద్యంతోపాటు మానవీయ సేవలు అందిస్తున్నాం. ‘గ్రానీ డంపింగ్’పై 2024–25లో పోలీసులకు 170కిపైగా ఫిర్యాదులు చేశాం.– డాక్టర్ రాకేశ్ సహాయ్ (ఉస్మానియా సూపరింటెండెంట్)– డాక్టర్ శివప్రసాద్ (ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి సూపరింటెండెంట్) -
‘డెడ్డ్రాప్’కు వచ్చి చిక్కారు!
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యమైన మెథాంఫెటమైన్ (మెథ్) తమకు ఎలా దొరికిందో... అలానే డెడ్డ్రాప్ విధానంలో విక్రయించడానికి ప్రయత్నించిన ‘ఈగల్’ఇంటి దొంగలు పులకరం స్వామి, సుగూరి నరహరి గౌడ్ పోలీసులకు చిక్కారు. తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ) విభాగంలో కానిస్టేబుళ్లయిన ఈ ద్వయం గత ఏడాది జనవరి నుంచి మాదకద్రవ్యాల వ్యతిరేక విభాగం ఈగల్లో డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరినీ అరెస్టు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం... కోణార్క్ ఎక్స్ప్రెస్లో డెడ్డ్రాప్ ద్వారా... ఇటీవల కాలంలో డ్రగ్ సప్లయర్స్ మాదకద్రవ్యాల సరఫరా పంథాను పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు నేరుగా వచ్చి, ఆపై కొరియర్ లేదా పార్సిల్ ద్వారా డ్రగ్స్ పంపేవాళ్లు. ఇలా చేస్తుంటే పోలీసుల నిఘాకు చిక్కుతున్నామనే ఉద్దేశంతో కొన్నాళ్లుగా డెడ్డ్రాప్ విధానంలో పార్సిల్ చేయడం ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఓ పెడ్లర్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా పొరుగు రాష్ట్రానికి చెందిన సప్లయర్ రూ.1.5 కోట్ల విలువైన మెథ్ను ఈ నెల 3న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో డెడ్డ్రాప్ చేశాడు. దీన్ని పార్సిల్ చేసి జనరల్ బోగీలో నిర్దేశిత ప్రాంతంలో ఉంచాడు. ఆ వివరాలు, ఫొటోను ఇక్కడి పెడ్లర్కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. రైలు నగరానికి చేరుకున్నాక పెడ్లర్ వెళ్లి ఆ పార్సిల్ తీసుకోవాల్సి ఉంది. ఈగల్లో అంతర్భాగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు పులకరం స్వామి, సుగూరి నరహరి గౌడ్లకు ఈ నెల 4న ఆ రైలులో ఈ పార్సిల్ దొరికింది. బహిరంగ మార్కెట్లో రూ.1.5 కోట్ల విలువైన మెథ్ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నారు. డ్రగ్ పెడ్లర్స్పై నిఘా ఉంచడానికి అధికారులు ఇప్పటివరకు రికార్డుల్లోకి ఎక్కిన వారి వివరాలను వీరికి అందించారు. అందులోని ఫోన్ నంబర్ల ఆధారంగా వీరిని సంప్రదించి విక్రయించాలని పథకం వేశారు. దీనికోసం జగదీష్ మార్కెట్ నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్ ఖరీదు చేశారు. స్వామి తన వద్ద ఉన్న ఓ నేరగాడి సిమ్కార్డును ఇందులో వేశారు. ఆపై ఈ ద్వయం తమ వద్ద ఉన్న జాబితాలోని ఫోన్ నంబర్ ఆధారంగా పక్షం రోజుల క్రితం లూథిఫర్ అనే పెడ్లర్ను సంప్రదించారు. అతడికి ఐదు గ్రాముల మెథ్ విక్రయించిన ఇద్దరు కానిస్టేబుళ్లు డెడ్డ్రాప్ విధానంలో అందించారు. మరో పెడ్లర్తో 100 గ్రాములకు బేరం కుదుర్చుకుని, దాన్ని కూడా పార్సిల్ చేసి ఏదో ఒకచోట డ్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాంపల్లికి వచ్చి చిక్కి.. ఈ పార్సిల్ తీసుకుని ఈ ద్వయం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ సమీపంలో ఉన్న యూని గ్యాస్ ఆటో ఎల్పీజీ పంప్ పక్కన ఉన్న సందులో డెడ్ డ్రాప్ చేయడానికి సిద్ధమయ్యారు. స్వామికి చెందిన ద్విచక్ర వాహనంపై సోమవారం అక్కడకు వచ్చారు. అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనంతోపాటు మెథ్ స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చందూర్ మండలం ఉదాతలపల్లికి చెందిన పులకరం స్వామి ప్రస్తుతం 3వ బెటాలియన్లో పనిచేస్తూ కుంట్లూరు రత్న కాలనీలో ఉంటున్నాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాలకు చెందిన నరహరి గౌడ్ 12వ బెటాలియన్లో పనిచేస్తూ మన్నెగూడ బృందావన్ కాలనీలో నివసిస్తున్నాడు. వీరిని రిమాండ్కు తరలించిన సీసీఎస్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. పరారీలో ఉన్న లూథిఫర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
7న జలవివాదాల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ రెండో సమావేశం సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గతేడాది జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంలతో నిర్వహించిన సమావేశంలో సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకోగా, కమిటీ తొలి సమావేశం గత జనవరి 30న జరిగింది. తదుపరి సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో ఎజెండాను ప్రతిపాదించాలని రెండు రాష్ట్రాలకు ఆ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ సూచించారు. పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై ఈ కమిటీ సమావేశాల్లో చర్చించడానికి అప్పట్లో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. రెండు రాష్ట్రాలు కమిటీకి ఎజెండాను ప్రతిపాదించకపోవడంతో తదుపరి సమావేశం సాధ్యం కాలేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చల ద్వారా జలవివాదాలు పరిష్కరించుకోవాలని ఆయన రెండు రాష్ట్రాలకు సూచించారు. దీంతో తక్షణమే సీడబ్ల్యూసీ కమిటీ రెండో సమావేశాన్ని నిర్వహించనుంది. 1న తుమ్మిడిహెట్టిపై సీడబ్ల్యూసీ భేటీప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో కదలిక వచ్చింది. 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించడానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరుతూ జూన్ 11న ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. పీఎం కార్యాలయ సూచనల మేరకు ఈ అంశంపై సెప్టెంబర్ 1న మహారాష్ట్ర, తెలంగాణ అధికారులతో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో వార్ధా, వెయిన్గంగా నదులు ప్రాణహిత నదిలో కలిసే ప్రాంతానికి ఎగువన లంబాకారాంలో బరాజ్ నిర్మించడానికి ఇప్పటికే తెలంగాణ ప్రీఫిజిబిలిటీ నివేదికను సిద్ధం చేసింది. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రలో ఏర్పడనున్న ముంపు విషయంలో ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కావడం లేదు. గతంలో 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి అంగీకరించిన మహారాష్ట్ర తాజా చర్చల్లో 150 మీటర్లకు ఎత్తు పెంచేందుకు సమ్మతిస్తే తెలంగాణకు భారీ ఊరట లభించనుంది. -
‘కిస్తీ’ కోసం కుస్తీ!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు జరిగినా చివరి విడత ఆర్థిక సాయానికి సంబంధించిన బిల్లులు విడుదల కాలేదు. ఇళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా చివరి బిల్లు కోసం లబ్దిదారులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేయాల్సిన యూనిట్ల విషయంలో దోబూచులాడటమే కారణం కావడం విశేషం. ఇందిరమ్మ పట్టణ యూనిట్లను మంజూరు చేసిన కేంద్రప్రభుత్వం, గ్రామీణ యూనిట్ల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. అసలు మంజూరు చేస్తుందా? లేదా? అన్న విషయాన్ని కూడా తేల్చకుండా పెండింగ్లో పెట్టింది. ఏకంగా లక్ష ఇళ్ల చుట్టూ నెలకొన్న అయోమయమిది. ఎందుకీ గందరగోళం? రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రామీణ ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లు పూర్తయ్యాయి. ఈ పథకం కింద రాష్ట్రప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద రాష్ట్రానికి కొన్ని ఇళ్లను మంజూరు చేస్తుంది. పట్టణ ప్రాంత ఇంటికి రూ.లక్షన్నర, గ్రామీణ ప్రాంత ఇంటికి రూ.72 వేలు అందిస్తుంది. పట్టణ ప్రాంతానికి సంబంధించి రూ.1.13 వేల ఇళ్లను మంజూరు చేయడంతో ఆ ఇళ్ల విషయంలో స్పష్టత వచ్చింది.కానీ గ్రామీణ ఇళ్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మంజూరు లేదు. ఆ రూపంలో కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్దిదారు ఖాతాలోకే జమ అవుతుంది. గతంలో లాగా ఆ మొత్తం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి అందదు. రాష్ట్రప్రభుత్వం తనవంతు సాయంగా ఇచ్చే విడతలవారీ బిల్లులను ఇందుకు తగ్గట్టుగా సర్దుబాటు చేస్తుంది. కేంద్రం ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.72 వేలను తన వంతు వాటాతో కలిపి లబ్దిదారు ఖాతాకు ఆ విడత కోటా కింద అందిస్తుంది. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లకు మూడు విడతల బిల్లులు చెల్లించినందున, ఇక చివరి విడత ఒక్కటే మిగిలి ఉంది. అది చెల్లించాలంటే కేంద్రం సాయంలో స్పష్టత రావాల్సి ఉంది. రీయింబర్స్మెంట్ విధానం లేకపోవడంతో... ఇలాంటి పరిస్థితిలో ముందు రాష్ట్రప్రభుత్వం మొత్తం సాయాన్ని లబ్దిదారుకు అందిస్తే కేంద్రం తర్వాత తన వంతు మొత్తాన్ని రీయింబర్స్ చేసే పద్ధతి ఉంటుంది. కానీ, ఈ పథకంలో రీయింబర్స్మెంట్ బదులు కేంద్రం నేరుగా లబ్దిదారు ఖాతాకే జమ చేసే విధానం ఉన్నందున, రాష్ట్రప్రభుత్వానికి ఆ మొత్తం తిరిగి అందదు. కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే చివరి విడత బిల్లు చెల్లించాలని నిర్ణయించి నెలలుగా పెండింగులో పెట్టింది. చివరి విడత బిల్లు అందనందున లబ్దిదారులు ఇంటి ఫినిషింగ్కు సొంత డబ్బులు వ్యయం చేయాల్సి వస్తోంది. కేంద్రం నుంచి నిధులు రాని విషయంపై అవగాహన లేని లబ్దిదారులు, చివరి విడత బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఆచితూచి చివరి బిల్లు విడుదలపై నిర్ణయం... కేంద్రం నిధులు ఇవ్వని పేరుతో చివరి బిల్లు విడుదలను ఎక్కువ కాలం నిలిపేయటం ఇక కుదరదని రాష్ట్రప్రభుత్వం తేల్చుకుని, చివరి విడత బిల్లు విడుదలకు సిద్ధమైంది. మొత్తం ఒకేసారి చెల్లిస్తే... భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే సాయం చేతికందదన్న ఆందోళన కూడా వెంటాడుతోంది. దీంతో, మార్చి నాటికి పూర్తయి ఇళ్లకు ముందు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 15,475 ఇళ్లకు సంబంధించి రూ.185 కోట్లను విడుదల చేసింది. ఆ మొత్తం గురువారం లబ్దిదారుల ఖాతాలకు జమ కానుంది. మరికొద్ది రోజులు కేంద్రం సాయం కోసం ఎదురుచూసి మరికొన్ని ఇళ్లకు తదుపరి విడత విడుదల చేయాలని భావిస్తోంది. ఇంకెంతకాలం చూస్తూ ఊరుకుంటాం: పొంగులేటిఇందిరమ్మ గ్రామీణ ఇళ్లకు కేంద్రం రూపాయి కూడా సాయం చేయలేదు. ఏడాదిగా ఆ సాయం కోసం ఎదురుచూస్తూ చివరివిడత బిల్లు నిలిపివేశాం. ఇంకా ఎంతకాలం బిల్లు ఇవ్వకుండా ఉండగలం. పేదల ఇబ్బందులు చూస్తూ ఉండగలమా, అందుకే కేంద్రం సాయం చేయకున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా రాష్ట్రప్రభుత్వమే సాయం చేయాలని నిర్ణయించింది. తొలివిడతగా రూ.185 కోట్లు విడుదల చేశాం. మిగతావారికీ తదుపరి విడతల్లో ఇస్తాం. -
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడ, కోదాడ రూరల్/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్పై ఆగిపోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 08యుఎల్ 5112) 42 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వద్ద ఆపి బస్సు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్ డ్యూటీ దిగి రెండో డ్రైవర్కు బస్సు అప్పగించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు ఐరన్ పిల్లర్లలోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కోదాడ శివారులో అదుపుతప్పి డివైడర్పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్ ట్రాలీ లారీని గమనించకుండా వెనుకవైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లారీలో ఉన్న ఐరన్ పిల్లర్లు బస్సులోకి చొచ్చుకురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ సీటు వెనుక సీట్లలో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా(24), చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్పై ఉన్నాయి. లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.ఆ బస్సు డ్రైవర్ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.మృతుల్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే..మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.క్షతగాత్రుల వివరాలు» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్కు చెందిన రాథోడ్ విశాల్లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. » విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ, ఆకుల నవీన్కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్కుమార్ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్కు చెందిన జి.అవినాష్ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.తీవ్ర విషాదకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
పెరోల్.. 40 ఏళ్లు పరార్
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు.. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖైదీ నంబర్ 1567 వీరన్న కథ 1982లో మహబూబాబాద్లో ఓ పాన్షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, అల్లర్ల కేసులో సందెల వీరన్న నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వరంగల్ అదనపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. అనంతరం పెరోల్ను 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల ‘పరారీ జీవితం’. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్్కఫోర్స్ అతడిని పట్టుకుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. పేరు మార్చుకుని ప్రభుత్వ టీచర్గా.. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించినట్లు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు. 2013లో పదవీ విరమణ చేశాడు. పెన్షన్ పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు కూడా అందుకున్నట్లు పిటిషనర్ తరఫు వాదనలో నమోదైంది. 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టుకోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయత్నాలు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదని పేర్కొంది. ఎట్టకేలకు ప్రత్యేక టాస్్కఫోర్స్ను నియమించి అరెస్టు చేసినట్లు తెలిపింది. మళ్లీ పెరోల్ కోరిన భార్య.. తిరస్కరించిన హైకోర్టు వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు, మూడేళ్ల పాటు పెరోల్, ఫర్లో తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందడం ఆశ్చర్యకరమంది. ఇది జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల తీరును తెలియజేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా లేదా పరిశీలించడం, హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కిచెప్పింది. మూడేళ్లపాటు పెరోల్–ఫర్లో (మంచితనంపై బయటకు వెళ్లేందుకు ఇచ్చే అనుమతి) నిరాకరణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. జీవితంలోని అత్యంత ముఖ్యమైన కాలాన్ని ఖైదీ జైలు వెలుపల గడిపాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. జైలు శిక్ష నుంచి తప్పించుకుని, ఆ సమయంలో సాధారణ జీవితంలోని ప్రయోజనాలను పొందాడరన్నారు. కానీ అతడిపై విధించిన జీవిత ఖైదు శిక్ష ఇప్పటికీ రద్దు కాలేదని.. ఉద్దేశపూర్వంగా శిక్ష తప్పించుకున్నట్లు అవగతమవుతోందన్నారు. మిగిలిన శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు. -
చినుకు జాడేది?
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ మూడో వంతు ముగుస్తున్నా వర్షాలు మాత్రం ఆశాజనకంగా కురవడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా అంచనాలు విడుదల చేసింది. ఈక్రమంలో సీజన్ మొదట్నుంచీ రాష్ట్రంలో అత్తెసరు వర్షాలే కురుస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు 53.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం కురవా ల్సి ఉండగా ఇప్పటివరకు 46. 47 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే 14 శాతం లోటు వర్షపాతం ఉంది. సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షాలు నమోదు కా లేదు. రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నప్పటికీ వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంలేదని నిపుణులు చెబుతున్నారు. 15 జిల్లాల్లో లోటు...: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తేలికపాటి వర్షాలే నమోదయ్యాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఇప్పటివరకు 15 జిల్లాల్లో 20 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం నమోదైంది. మరో 16 జిల్లాల్లో వర్షపాతం సాధారణమని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇందులోనూ చాలా జిల్లాల్లో 10 నుంచి 15శాతం లోటు ఉన్న జిల్లాలు ఆరు జిల్లాలున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం తీరును పరిశీలిస్తే... కేవలం రెండు మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదైంది. 73 మండలాల్లో అధిక వర్షపాతం, 269 మండలాల్లో సాధారణ వర్షపాతం, 273 మండలాల్లో లోటు వర్షపాతం, నాలుగు మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా వర్షపాతం తీరు... లోటు: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట్, ఖమ్మం, నారాయణపేట. సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు అధికం: కామారెడ్డి, మెదక్ మరో పదిరోజులు అంతంతే... రాష్ట్రంలో వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, ఈ నెల రెండో వారం నుంచి ఇప్పటివరకు వర్షాలు అత్యంత పరిమితంగానే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షానికి అనుకూల వాతావరణం ఏర్పడడం లేదని, రుతుపవనాలు విరామదశలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. రానున్న పది రోజుల వరకు వర్షాలు తక్కువగా నమోదవుతాయని అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్లో బంగాళాఖాతంలో ఒకటి రెండు బలమైన అల్పపీడనాలు ఏర్పడితే పరిస్థితి పూర్తిగా మారవచ్చని, సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ/వాయవ్య దిశలో కదిలితే రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. -
వేటేస్తారా... వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆమెపై వేటు వేయాల్సిందేనంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో శంఖంలో పోయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్ వేదికగా నాటకీయ ఘటనలు జరిగాయి. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజు బుధవారం భట్టి నివాసంలో కొండా మురళీ కనిపించారు. ఆయన వచ్చిన సమయంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపించింది. కొండా ఎపిసోడ్ను కోల్డ్స్టోరేజీలో పెట్టే దిశలో పరిణామాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సురేఖ కుటుంబంతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. భట్టికి అప్పగించారని, అందులో భాగంగానే మురళీని కలిశారని అంటున్నారు. కలిసి వచ్చారా..? మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, అసమ్మతికి మారుపేరైన రాజగోపాల్రెడ్డి ప్రజాభవన్లో ఉన్న సమయంలోనే మురళీ కూడా రావడం అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, గ్లోబల్ సమ్మిట్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కోసం ఉత్తమ్, శ్రీధర్బాబు వచ్చారని, తన నియోజకవర్గ పనుల కోసం రాజగోపాల్రెడ్డి వచ్చారే తప్ప ముందస్తు సమాచారం ప్రకారం రాలేదని ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. కానీ, మురళీని కలిసేందుకు భట్టి సమ్మతించడం, సీఎంతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతుండటం, సాయంత్రానికి హడావిడిగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ వ్యక్తమవుతోంది. భట్టి భుజంపై తుపాకీ పెట్టి సురేఖ కుటుంబాన్ని కాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదంటే తొందరపడద్దనే ధోరణితో సీఎం ఉన్నారా... లేదా సురేఖ వ్యవహారం మధ్యే మార్గంలో వెళ్తుందా అన్న చర్చ గాం««దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. భట్టి గురువారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సెపె్టంబర్ 7 నాటికే కొండా ఎపిసోడ్కు ఫుల్స్టాప్ పడుతుందని సమాచారం. మురళీ ఏమన్నారంటే... మురళీ, భట్టి భేటీలో ఏం జరిగిందన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భట్టి కొంత గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎంను కించపరిచేలా, పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. అయితే, సుస్మిత మాటలతో తనకేం సంబంధమని మురళీ చెప్పినట్టు తెలిసింది. పదేపదే వివాదాలకు కారణమవడం, జిల్లా నేతలతో సమన్వయంతో వ్యవహరించలేకపోవడం, సీఎంతో ముఖాముఖి కలిసే పరిస్థితి కూడా లేకుండా చేసుకోవడం లాంటి అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అనంతరం మురళీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓ బిల్లు కోసం భట్టి దగ్గరకు వచ్చానని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యల గురించి తాను భట్టితో మాట్లాడలేదని, ఆ వ్యాఖ్యలకు తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘అది నా బిడ్డకు సంబంధించింది. ఆమెకు 35 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పిల్లలున్నారు. వరల్డ్ చాంపియన్ అయిన కొడుకు ఉన్నాడు. ఆమె మనోభావాలు ఆమెకు ఉండొచ్చు. ఎవరి స్వతంత్రత వారిది... ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు. ఆమె ప్లాన్ ఏలో భాగంగా ఏదో మాట్లాడింది. ప్లాన్ బీలో ఏం చేస్తుందో.. ఆమె మనసులో ఉన్నది మాకెలా తెలుస్తుంది. కవిత గారు పోయారు. అలానే ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటారు. మాకు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మేం కాంగ్రెస్లోనే ఉంటాం’ అని మురళీ వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గ విషయాలు మాట్లాడేందుకు ప్రజాభవన్కు వచ్చానన్నారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి గురించి, వ్యక్తిగతంగా ఎవరి గురించీ మాట్లాడలేదన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్దే తుది నిర్ణయమని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించాల్సిందేనన్నారు. సురేఖ విషయంలోనూ హైకమాండ్దే తుది నిర్ణయమని, ఈ విషయంలో సీఎం అభిప్రాయమే తన అభిప్రాయమన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకో రాధాకృష్ణ: రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్, ఆ చానల్ ఎండీ రాధాకృష్ణకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ఏబీఎన్ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తోంది. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. లేదంటే మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏంటో చూపిస్తే మీ చానల్, పేపర్ ఉండవు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పారీ్టల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నతస్థాయిలో ఉండొచ్చు. అంతమాత్రాన పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడిన మాలాంటి వ్యక్తులను కించపరచొద్దు. అసలైన కాంగ్రెస్ రక్తం మాది. మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తే బాగుండదని హెచ్చరిస్తున్నా. మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపర్చే విధంగా ప్రయత్నించడం మంచిది కాదు. ఎవరు చేస్తున్నారో వారికే చెబుతున్నా. కొందరు వ్యక్తుల గురించి, వారిని బలంగా చేసేందుకు నా లాంటి వారిని బలహీనులను చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి... ఇలాంటి చానళ్లు, పేపర్లు 100 పెడతా. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు’ అని రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. -
నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్లైన్
సాక్షి, హైదరాబాద్: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు.MEA, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంటున్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించవచ్చు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనుంది. తెలంగాణ భవన్ హెల్ప్లైన్ నంబర్లు: 9871999044, 9949351270, 9618597969. -
రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల అంశంపై ఎందుకు స్పందించడం లేదంటూ రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 22ఏ నిషేధిత జాబితాపై కుట్ర చేసిందెవరో తేల్చాలి. 22ఏ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందాపై నెలరోజులుగా బీజేపీ పోరాటం చేస్తుంది. ఆధారాలతో అసెంబ్లీకి నేను చర్చకు వస్తే రాకుండా మంత్రి పారిపోయారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని ఏలేటి డిమాండ్ చేశారు. కుట్ర చేసి నిషేధిత జాబితాలో భూములు పెడితే విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ లేదా హౌజ్ కమిటీ వేస్తారా స్పష్టం చేయాలి. భూ భారతి మంత్రులకు నగల, వజ్రాల హారంగా మారింది. కాంగ్రెస్ 33 నెలల పాలనలో భూ భారతి అతిపెద్ద కుంభకోణం. సీఎం రేవంత్ చెప్పిన అసలు కుట్ర ఆయన కేబినెట్లోనే జరుగుతుంది. 22A బాధితులకు న్యాయం చేయాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి. 22A అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి. అంతేకాదు సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వం లేఖ రాయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి’’ అంటూ మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)
-
సచివాలయం వద్ద కలకలం.. హుస్సేన్ సాగర్ లో దూకిన విదేశీయుడు..!
-
‘సీఎం రేవంత్పై కొండా సుష్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్లో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వివాదాన్ని సర్దుమణిచే ప్రయత్నంలో భాగంగా కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కాగా, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. కొండ సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. మునుగోడు అభివృద్ధి నిధుల విషమై చర్చించేందుకు భట్టి విక్రమార్కను కలిశాను. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని నేను. ఎంపీ, ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆనాడు ఫైట్ చేశా. తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు.నా పైన విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు. కొండా సుస్మిత పటేల్ అంశాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. నాలాంటి ఉద్యమ నేతలను విమర్శ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’అని హెచ్చరికలు జారీ చేశారు.👉ఇదీ చదవండి: కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు -
కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్గా మారగా, అధిష్టానం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా కొండా సురేఖ భర్త కొండా మురళి రంగంలోకి దిగి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కీలక నేతలను ప్రత్యేకంగా కలిశారు. ఈ భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా కొండా సుష్మిత వ్యాఖ్యలపై స్పందించారు. ‘కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, సుష్మితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మేం క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సిన వివరణ ఇచ్చాం. అధికారిక పనుల్లో భాగంగానే బిల్లుల గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశాం’‘కొండా సుస్మిత నా బిడ్డ. ప్లాన్-ఏలో ఆమె అలా మాట్లాడింది. ప్లాన్-బీలో ఏం చేస్తుంది అంటే నాకేం తెలుస్తుంది? ఆ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వివాదం నా బిడ్డది. అందులో ప్లాన్-బీలో ఏముందో నాకు తెలియదు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ క్రమశిక్షణా కమిటీకి తాము చెప్పాల్సిన వివరణ స్పష్టంగా ఇచ్చామని, అధికారిక పనుల్లో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గ టికెట్ కేటాయింపులపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ క్రమశిక్షణా రాహిత్యంగా భావించడంతో పాటు, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివాదం ముదరకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన కొండా మురళితో పాటు, ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,ఇటీవల ప్రభుత్వంపై అసంతృప్తి స్వరం వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు వివాదాన్ని సర్దుమణిగేలా చేస్తాయా, లేక పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి. 👉ఇదీ చదవండి: నా కుమార్తె మాటలకు నాకేం సంబంధం -
అసభ్య చిత్రాలతో ఆర్మీ మేజర్ భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: ఆమె ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ. ఆమె ఫొటోలను ఇన్స్ట్రాగామ్ ఖాతా నుంచి సేకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్తో అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. సోషల్మీడియాలో పోస్టు చేసి వేధిస్తుండటంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో మంగళవారం కేసు నమోదైంది. ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న ఆమె భర్త ఫిర్యాదు కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్ట్రాగామ్ ఖాతాలో ఉన్న ఆమె ఫొటోలను సేకరించి ఏఐ ఆధారిత సాంకేతికతతో నగ్న, అసభ్యకర చిత్రాలు, వీడియోలుగా మారుస్తున్నాడు. బాధితురాలి ముఖాన్ని పోలిన విధంగా రూపొందించిన ఈ కంటెంట్ను రెడిట్, ఇన్స్ట్రాగామ్, డిస్కార్డ్ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ విధంగా రూపొందించిన చిత్రాలు, వీడియోలు, పోస్టులను బాధితురాలి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు చేరేలా చేసి ఆమె పరువుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. రోజూ సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. ఏడాదిన్నరగా 200కుపైగా పోస్టులు ఏడాదిన్నర కాలంగా మొత్తం 200కుపైగా పోస్టులు వివిధ వేదికల్లో నిందితుడు పోస్టు చేశాడు. ఈ వ్యవహారంపై బాధితురాలి భర్త ఆన్లైన్లో పరిశీలించి కొన్ని యూజర్ ఐడీలు, యూజర్ నేమ్స్, తొలగించిన పోస్టులు, కామెంట్లు తదితరాలకు సంబంధించిన లింకులను గుర్తించారు. వీటి ఆధారంగా సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్లో ప్రకృతి విలయ తాండవం -
సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.మంత్రుల సంతాపంసూర్యాపేట బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. పోస్టుమార్టం కోసం రెండు బృందాల ఏర్పాటు చేయాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అప్పగించాలని సూచించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలిసూర్యాపేట రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊహించని ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.చదవండి: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదంఘటనా స్థలంలో కలెక్టర్కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పరామర్శించారు. డ్రైవర్ మారిన మరుక్షణమే.. తాను డ్యూటీ మారిన తర్వాతనే ప్రమాదం జరిగిందని రెండో డ్రైవర్ మీడియాతో చెప్పారు. సూర్యాపేటలో తాను డ్రైవింగ్ను మరో డ్రైవర్కు అప్పగించి, పడుకున్నానని వెల్లడించారు. తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం సంభవించిందని తెలిపారు. బస్సులో 42 మంది ఉన్నారని చెప్పారు.కొద్దిలో బతికిపోయావెనుక సీటులో కూర్చోవడం వల్ల ప్రమాదం నుంచి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డానని ఓ ప్రయాణికుడు తెలిపారు. రాఖీ పండుగ కోసం చెల్లెలు దగ్గరికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డానని చెప్పారు. ఇనుప రాడ్ తన ముఖం వరకు వచ్చి ఆగడంతో బతికిపోయానని వెల్లడించారు. బస్సు సూర్యాపేటలో ఆగి.. మళ్లీ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు. -
ప్రభుత్వమే కబ్జాదారుగా మారింది: హరీశ్రావు ఆగ్రహం
హైదరాబాద్: ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా (22ఏ)లోకి చేర్చి, ప్రభుత్వమే పెద్ద కబ్జాదారులా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. కూకట్పల్లిలో 22ఏ బాధితుల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పాలన సాగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం భూముల కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతోందని మండిపడ్డారు.కేసీఆర్ సీఎం కాగానే తాగునీరు, నగర ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారని, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వరి సాగులో పంజాబ్ను దాటి తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. ఆయన ప్రతి నిర్ణయం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ విలువైన భూమి కనిపించినా అమ్మకానికి పెడుతోందని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటికే రెండున్నరేళ్లలో రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని, భవిష్యత్ అవసరాలకు కూడా భూములు మిగల్చడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సామాన్యుల భూములను 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రజల నుంచి భూములను గుంజుకుని తమ అనుచరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్లో అకారణంగా 22-ఏ నిషేధిత జాబితాలోచేర్చిన భూములను వెంటనే తొలగించాలని మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. షాద్నగర్లో నిర్వహించిన 22-ఎ బాధితుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు, రుణాలు అందక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యుడైన మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరారు. సెప్టెంబర్ 7 లోగా సమస్య పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. 22-ఎ బాధితులకు మద్దతుగగా ఈనెల 29న అమీన్పూర్లో బీఆర్ఎస్ పోరుబాట చేపడుతుందని హరీష్ రావు ప్రకటించారు. -
బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు..
కాసిపేట: మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ టికెట్ కలెక్షన్ మాత్రం రావడం లేదు. దేవాపూర్ నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సులో 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఇద్దరు మాత్రమే మగవారు ఉన్నారని, నగదు ఎలా తీసుకురావడం అని ప్రశ్నిస్తూ అధికారులు గమనించి కండక్టర్లపై ఒత్తిడి ఆపివేయాలని కోరారు. 🚌 “బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు!”మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్గా మారింది.“మా బస్సులో 80 మంది ప్రయాణికులు ఉంటే.. అందులో ఇద్దరే పురుషులు. ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. మేం కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాం.… pic.twitter.com/4jNPtQMozU— Suresh_Journalist (@Suresh_Journo) August 26, 2026 చదవండి: ప్రయాణికులున్నా.. లేకున్నా ఒకే మార్గంలో బారులు -
ప్రయాణికులున్నా.. లేకున్నా ఒకే మార్గంలో బారులు
సమయం ఉదయం 10 గంటలు. స్థలం ఉప్పల్ రింగ్రోడ్డు బస్టాపు.. ఉప్పల్ నుచి నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల మీదుగా మెహిదీపట్నం వెళ్లే రూట్ నంబర్ 300 బస్సు వచ్చి ఆగింది. క్షణాల్లోనే ప్రయాణికులతో బస్సు నిండిపోయింది. ఆ తర్వాత 10 నిమిషాలకు వచ్చిన మరో బస్సు కూడా కిక్కిరిసిపోయింది. ఈ రెండు బస్సుల తర్వాత వరుసగా ప్రతి 2 నిమిషాలకో బస్సు వచ్చి చాలా వరకు ఖాళీగానే వెళ్లాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉప్పల్ రింగ్రోడ్డు నుంచి బయలుదేరిన 39 బస్సుల్లో ఇలా సగానికి పైగా ఖాళీగా బయల్దేరినవే ఉన్నాయి. కొన్ని మాత్రం సగం ప్రయాణికులతో కదిలాయి. ఈ ఒక్క రూట్ మాత్రమే కాదు. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఇదే పరిస్థితి. బస్సుకు మరో బస్సుకు మధ్య కనీస వ్యవధి లేకుండా బయలుదేరుతున్నాయి. ఐదారు బస్సులు ఒకేసారి వరుసగా వస్తున్నాయి. కొన్నిసార్లు గంట గడిచినా ఒక్క బస్సు కూడా అందుబాటులో ఉండదు. మరోవైపు ఒకేరూట్లో నగరంలోని వివిధ డిపోల నుంచి బయలుదేరే బస్సుల మధ్య నిర్దిష్టమైన సమయపాలన అమలు కావడం లేదు. కొరవడిన సమయ పాలన.. బోరబండ మీదుగా సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగించే ‘10 వై/ఎఫ్’ రూట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో వరుసగా 5 బస్సులు బయలుదేరాయి. మొదటి రెండు బస్సుల్లో మాత్రమే ప్రయాణికులు కనిపించారు. ఆ తరువాత అన్నీ ఖాళీయే. కానీ.. ఈ ఐదు బస్సులు వెళ్లిపోయిన తర్వాత గంటకు పైగా ఒక్క బస్సు కూడా రాలేదు. దీంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సివచి్చంది. నగరంలోని సుమారు 1,050 రూట్లలో సిటీ బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రధాన రూట్లలో వివిధ డిపోల నుంచి బస్సులను నడుపుతున్నారు. నాలుగైదు డిపోల బస్సులు ఒకేసారి రావడంతో బంచింగ్ సమస్య తలెత్తుతోంది. కొన్ని రూట్లలో నిమిషానికి ఒకటి చొప్పున నడిస్తే మరికొన్ని రూట్లలో అరగంట నుంచి గంట గడిచినా బస్సులు లభించడం లేదు. నగరంలోని 25 డిపోల నుంచి ప్రతిరోజూ సుమారు 1,950 బస్సులు రోజుకు 24 వేల ట్రిప్పులకు పైగా తిరుగుతున్నట్లు అంచనా. బస్సుల మధ్య సమయపాలనను రేషనలైజ్ చేయకపోవడంతోనే బంచింగ్ సమస్య ఉత్పన్నమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. కొన్ని డిపోల్లో కండక్టర్లు, డ్రైవర్లు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతోనూ బస్సులు ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు ఆరోపణలున్నాయి. మొదటి రెండింట్లోనే రద్దీ.. పటాన్చెరు నుంచి సికింద్రాబాద్కు 219, 226 రూట్ బస్సులు ఎక్కువగా నడుస్తాయి. ఒకేసారి నాలుగైదు బస్సులు వస్తున్నాయి. మొదట వచ్చే రెండింటిలో మాత్రమే రద్దీ ఉంటుంది. మిగతావి ఖాళీగా ఉంటాయి. – జ్యోతి, ప్రయాణికురాలు, కూకట్పల్లి ట్రాఫిక్ సమస్యల వల్లే.. హై ప్రీక్వెన్సీ రూట్లలోనే ఈ బంచింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో ప్రతి 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు, 10 నిమిషాల వ్యవధితో బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు ఎక్కడో ఒకచోట ట్రాఫిక్లో చిక్కుకోవడంతో చివరకు అన్నీ కలిసి ఒకే బస్టాప్లో ఒకే సమయానికి చేరుకుంటున్నాయి. – శ్రీధర్, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ చదవండి: భారీగా పెరిగిన చాయ్ ధర! -
రేవంత్ టూర్కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమేపీ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారనిపిస్తుంది. వీటిలో అత్యధికం ఆయన స్వయంగా సృష్టించుకున్నవేనేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పడం, మద్యలోనే యూకే నుంచే వెనక్కి రావల్సిన పరిస్థితి ఏర్పడడం,కాంగ్రెస్లో అసమ్మతి స్వరాలు పెరగడం,మంత్రి కొండా సురేఖ కుమార్తె ఏకంగా ఆయనపైనే తీవ్ర ఆరోపణలు సంధించడం, తదితర అంశాలు చికాకుగా తయారయ్యాయి. రేవంత్ యూకే, అమెరికాలోని ప్రఖ్యాత విద్యా సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటిని తెలంగాణకు తీసుకురావలన్న ఉద్దేశంతో ఈ యాత్ర పెట్టుకున్నారు. అంతవరకు సంకల్పం మంచిదే. కాని ఈ టూర్ లో ఆయన పెట్టుకున్న మరి కొన్ని ప్రోగ్రాంలు ఇబ్బందిలో పడేశాయి.భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకంగా రేవంత్ టూర్ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయంటూ ఆరోపణ చేశారు. ఆ మరుసటి రోజే కేంద్రం రేవంత్ టూర్ను అడ్డుకుంది. సీఎం టూర్ షెడ్యూల్ లో స్పష్టత లేదన్నది ఒక వివరణ అయితే, ముఖ్యమంత్రి హోదా తో సంబందం లేకుండా,రెండు దేశాల సంబందాలపై ప్రభావం పడే అవకాశం ఉండే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించారన్నది కేంద్రం వాదనగా ఉంది. అందుకే రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీనికి ముందు రేవంత్ వివరణ తీసుకుని అనుమతికి నో చెప్పి ఉంటే ఎలా ఉండేదో. కేంద్రం ఏకపక్షంగా అనుమతి నిరాకరించడంతో ఇది బీజేపీ, కాంగ్రెస్ ల మద్య వివాదంగా మారింది. కావాలని రేవంత్ టూర్ను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించి ఆక్షేపణ తెలిపారు. రేవంత్ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు విమర్శించారు. తనకు అనుమతి నిరాకరించడం తెలంగాణను అవమానించడమేనని రేవంత్ ఆరోపించారు. కాని బీజేపీ తెలంగాణ అద్యక్షుడు ఎన్.రమాచంద్రరావు మాత్రం ఆ ఆరోపణలను ఖండించి, ఇందులో రాజకీయం ఏమీ లేదని పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు ముఖ్యమంత్రులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనాలని రేవంత్ భావించారన్నది ఒక కారణంగా అనుమతి రాలేదని కొందరు చెబుతున్నారు.కాని దీనికన్నా రేవంత్ అమెరికాలో అత్యున్నత పదవులలో ఉన్నవారిని కలసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా కారణమని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారులను కాంటాక్ట్ చేయడానికి రేవంత్ తరపున ప్రయత్నాలు జరిగినట్లు అనిపిస్తుంది. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అమెరికా కాన్సలేట్ ఉన్న హైదరాబాద్ నానక్ రామ్ గూడకు ట్రంప్ అవెన్యూ అని రేవంత్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఆ విషయం ట్రంప్ దృష్టికి వెళ్లింది. దానికి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పందించారు. అదే టైమ్ లో ట్రంప్ కంపెనీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ టవర్స్ నిర్మాణం చేయడానికి సన్నద్దం అయింది. దాంతో రేవంత్ ప్రభుత్వానికి ఉత్సాహం వచ్చింది. వీలైతే ట్రంప్ ను కలవాలని ఆలోచించింది. లేదా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ను అయినా కలిసే అవకాశాలపై ట్రై చేశారట.ఈ విషయాలన్ని కేంద్రానికి కూడా తెలిశాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేశ అధ్యక్షుడిని అధికారికంగా కలవడం సాధారణంగా జరగదు. ఈ నేపధ్యంలోనే కేంద్రం అనుమతి తిరస్కరించిందన్నది బీజేపీ వర్గాల కధనం.ఫలితంగా రేవంత్ వెనక్కి తిరిగి రాక తప్పలేదు.కాకపోతే యు.కె.లో కొన్ని యూనివర్శిటీలతో సమావేశం అయి సంప్రదింపులు చేశారు. అమెరికాకు తన అదికారులను మాత్రం పంపించారు. లండన్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యారట.ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.అయితే అమెరికా టూర్ కు సంబందించి రేవంత్ బృందం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లడం కూడా సరైనది కాకపోవచ్చు.ఇక కాంగ్రెస్ లో కీచులాటలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ పైన,ఆయన సోదరుడిపైన తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. దానిపై కాంగ్రెస్ కూడా సీరియస్ గా స్పందించింది.కుమార్తె వ్యాఖ్యలకుగాను సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తనకు ఆ వ్యాఖ్యలతో సంబందం లేదని ఆమె వివరణ ఇచ్చినా కమిటీ సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసు ఇవ్వగా, సురేఖ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించారు. తనకు వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇదంతా ఎవరో వెనుక ఉన్న అదృశ్యశక్తులు చేయిస్తున్న పని ఆమె ఆరోపించారు. పైగా కొన్ని బీసీ సంఘాలు సురేఖకు బాసటగా నిలవడానికి సిద్దం అయ్యాయి. పరకాల నియోజకవర్గంలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తారని రేవంత్ ప్రకటన చేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. సాదారణంగా అభ్యర్దుల ఎంపిక అన్నది హైకమాండ్ అంశంగా చెప్పుకుంటారు. రేవంత్ అనవసర ప్రస్తావన చేయడం ద్వారా ఈ వివాదాన్ని కొనితెచ్చుకున్నట్లయింది. 1989-94 మధ్య కూడా మూడు గ్రూపులు కాంగ్రెస్ లో ఉండేవి. అప్పటి ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి మాట్లాడేవారు. వాటిపై ప్రజలలో అసహనం కలిగేది. ఇప్పుడు దాదాపు అదే రీతిలో సురేఖకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మ్యేలు రేవంత్ వైపు మొహరించడం విశేషం. అయితే, 40 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారనుకుటే 17 మందే వచ్చారని బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. కారణం ఏమైనా రేవంత్ కూడా ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సలహా ఇచ్చారు. కానీ, అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిందని చెప్పాలి. నిర్ణయం హై కమాండ్కు వదలివేయడంతో సురేఖ ఇష్యూ పెండింగులో పడినట్లయింది.ఇది కూడా రేవంత్ కు కాస్త అసహనం మిగిల్చేదే. మరో వైపు సీనియర్ నేత చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేయడం, చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్ లో ధర్నా చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక మరో సీనియర్ నేత ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏకంగా అసలు కాంగ్రెస్ వారికి నష్టం జరుగుతోందన్నట్లుగా మాట్లాడడం సంచలనం రేకెత్తించింది. అయితే ఆయన కూడా మద్యలో కొంతకాలం బీజేపీలోకి వెళ్లివచ్చారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి పొందడాన్ని ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తగినట్లే రేవంత్ కూడా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారినే ఎక్కువగా నమ్ముతున్నారన్నది వీరి భావన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటనను కొందరు ఉదహరిస్తున్నారు. ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనని రమేష్ కుమారుడు సంజోష్ కారు రాష్ డ్రైవ్ వల్ల ఒక యువతి మరణించింది. ఆ కేసులో సంజోష్ని రక్షించడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారన్న ఆరోపణ గుప్పుమంది. జాతీయ మీడియాలో సైతం రేవంత్కు ,చంద్రబాబుకు మద్య హాట్ లైన్ నడుస్తుంటుందని, అందువల్లే ఎంపీ కుమారుడిని అరెస్టు చేయలేదని కధనాలు,వ్యాఖ్యలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం బలహీనంగా ఉన్న నేపధ్యంలో రేవంత్ కు ఈ పరిణామాలేవీ ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాని 2028 ఎన్నికల నాటికి రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వపరంగా 22 ఎ, తదితర సమస్యలు ఏ రూపు దాల్చుతాయో అన్న ఆందోళన పార్టీలో ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్ పాలిటిక్స్
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడంతో.. ఏఐసీసీ పెద్దలు తదుపరి నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై అధిష్టానంలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.అయితే, కొండా సురేఖను నేరుగా మంత్రి పదవి నుంచి తప్పిస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదురవుతాయన్న అంశాన్ని కూడా ఏఐసీసీ నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆమె బీసీ మహిళా మంత్రి కావడంతో నేరుగా వేటు వేస్తే పార్టీపై వచ్చే రాజకీయ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సస్పెన్షన్కు బదులుగా రాజీనామా చేయించడం ద్వారా మధ్యేమార్గాన్ని అనుసరించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో అధిష్టానం నేరుగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక కోసం 28న లక్కీ డ్రా.. ఇక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీపై ఈ వ్యవహారం చూపుతున్న ప్రభావం, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖపై ఎలాంటి చర్య ఉంటుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సస్పెన్షన్ చేస్తారా? లేక మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.చిన్నారెడ్డి పరిస్థితేంటి?మరోవైపు సీనియర్ నేత చిన్నారెడ్డి విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనను అధికార పదవి నుంచి తప్పిస్తారా? లేక కేవలం మందలింపుతో వ్యవహారాన్ని ముగిస్తారా? అనే అంశాలపై కూడా ఏఐసీసీ పెద్దలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిపై ఒకే తరహా చర్య తీసుకోవాలా? లేక వారి వ్యవహారాలను వేర్వేరుగా పరిగణించాలా? అన్నదానిపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి నివేదిక పంపిన నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ రియాక్షన్పై పలువురు నేతలు ఎదురుచూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. కాగా, మంత్రి సురేఖ మాత్రం ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. -
చిట్టి చినుకమ్మా.. (ఫొటోలు)
-
సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డివైడర్ మధ్యలో ఐరన్ లోడ్ లారీ ఆగిపోయింది. అయితే వేగంగా వెళ్లిన బస్సు.. లారీ కంటైనర్ను ఢీ కొట్టింది. దీంతో ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వాళ్లను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అతివేగం.. ముందు ఆగిఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సీ నరసింహ తెలిపారు. డ్రైవర్ అందుబాటులో లేడని(పరారీ?).. ఉదయం 4గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో.. చిన్ని, మేరీ, నాగేంద్రబాబులను గుర్తించినట్లు తెలిపారు. మిగతా మృతుల పేర్లు.. వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలకి దిగి క్లియర్ చేశారు.టీ విరామం తర్వాత బస్సు ప్రారంభమైన గంటకు ప్రమాదం జరిగిందని.. బస్సు బలంగా ఢీ కొట్టాక ఐరన్ దిమ్మెలు వచ్చి పడ్డాయని క్షతగాత్రుడొకరు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత 20 మందిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు కోదాడ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. వాళ్లలో ముగ్గురిని సూర్యాపేటకు తరలించినట్లు వెల్లడించారు. -
రూ.100 కోట్ల భూమి కాజేసే యత్నం
కందుకూరు: నకిలీ పత్రాలు సృష్టించారు.. భూ యజమానులను భయభ్రాంతులకు గురిచేశారు.. సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని కాజేసే యత్నం చేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. కందుకూరుకు చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, మర్రిపల్లి మహేశ్, మర్రిపల్లి అర్జున్, మహేశ్వరం మండలం మంఖాల్కు చెందిన ఉల్ల మల్లేశ్ కందుకూరు రెవెన్యూ సర్వే నంబర్లు 151, 152, 153, 165, 166లోని తమ పేర్లతో పాటు తమ కుటుంబానికి చెందినవారి భూమిని రాజేంద్రనగర్కు చెందిన పోలిశెట్టి మల్లికార్జున్, జూబ్లీహిల్స్కు చెందిన వడాల రాజేంద్రనాథ్, పుప్పాలగూడకు చెందిన అధిక మంజునాథ్రెడ్డికి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న మర్రిపల్లి కుమార్, మర్రిపల్లి అశోక్, మర్రిపల్లి శైలజ, మర్రిపల్లి నీలమ్మ, మర్రిపల్లి నర్సింహ, మర్రిపల్లి కల్పన, బొద్దం జంగారెడ్డి, ఐ.శ్యాంసుందర్రెడ్డి తదితరులను సంప్రదించగా వారు నిరాకరించారు. దీంతో వారి ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్పుస్తకాల వివరాలు సేకరించారు. 21 మంది పట్టాదారులు కలిసి మొత్తం 31.36 ఎకరాలు (డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ ఇర్రోకబల్ జనరల్ పవర్ ఆఫ్ అటారీ్న) రద్దు చేయలేని డెవలప్మెంట్ జీపీఏ చేసినట్లుగా 2024 మార్చి 26న నకిలీ పత్రాలు సృష్టించారు. తోట్ల సాయి అనే వ్యక్తితో భూమి ఇవ్వడానికి అంగీకరించని యజమానుల సంతకాలను ఫోర్జరీ చేయించారు.ఏవిధంగానైనా ఆ యజమానుల నుంచి భూమి డెవలప్మెంట్కు తీసుకోవాలన్న సంకల్పంతో ఒత్తిడి తెచ్చారు. ఇటీవల బాధితులకు తమకు భూమి అగ్రిమెంట్ చేసి ఇవ్వడంలేదని, చర్యలు తీసుకుంటామని తెలిపేలా లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. అప్పటి వరకు తమ భూమి ఇలా ఫోర్జరీ జరిగిన విషయం యజమానులకు తెలియదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ పత్రాలు సృష్టించి అగ్రిమెంట్ చేసుకున్న పోలిశెట్టి మల్లికార్జున్, వడాల రాజేంద్రనాథ్, అధిక మంజునాథ్రెడ్డితో పాటు వారికి సహకరించిన మర్రిపల్లి శ్రీనివాస్, ఉల్ల మల్లేశ్, తోట్ల సాయి, మర్రిపల్లి అర్జున్, మర్రిపల్లి మహేశ్పై కేసు నమోదు చేశారు. వీరిలో పోలిశెట్టి మల్లికార్జున్, మర్రిపల్లి శ్రీనివాస్, వడాల రాజేంథ్రనాథ్, అధిక మంజునాథ్రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకుని సాయంత్రం రిమాండ్కు తరలించారు. మల్లేశ్, సాయి, అర్జున్, మహేశ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘ఇందిరమ్మ టవర్స్’ లబ్ధిదారుల ఎంపిక కోసం 28 నుంచి లక్కీ డ్రా
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇందిరమ్మ టవర్లలోని గృహాల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక కోసం 28 నుంచి 31వ తేదీ వరకు పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాలకు సంబంధించి అందిన 60,720 దరఖాస్తుల్లో సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించినట్టు వెల్లడించారు. అనర్హుల దరఖాస్తులను ఎందుకు తిరస్కరించామో కారణాలతో వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. లక్కీ డ్రాలను స్థానిక ఫంక్షన్హాళ్లలో నిర్వహిస్తామని, ఒక్కో కేంద్రానికి ఒక్కో ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించామని తెలిపారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ. పది వేల ఈఎండీ మొత్తాన్ని వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తామని స్పష్టం చేశారు. మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా స్థలాల ఎంపిక.. 28వ తేదీన రాయదుర్గం, కేపీహెచ్బీ కాలనీ, మైలార్దేవ్పల్లి, రెడ్ హిల్స్, 29న కౌకూర్, పాటిగడ్డ, జల్పల్లి, కుల్సుంపుర, 30న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిష్ పల్లి, బండ్లగూడ (ఎల్ఐజీ కాలనీ), నందిముస్లాయిగూడ, 31న గాజులరామారం, అంబర్ పేటలోని సిటీపోలీస్ లైన్స్, గడ్డిఅన్నారం, ఆర్–బి క్వార్టర్స్,పోచారం (ఎల్ఐజీ కాలనీ)లో లక్కీడ్రా నిర్వహిస్తారని తెలిపారు. క్యూర్ పరిధిలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్నగర్ గ్రామంలోని ఆమన్గల్, గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాపూర్ (ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో (ఫలక్నుమా సమీపంలో) ఇళ్లు నిర్మిస్తామని, ఆసక్తి ఉన్న నిరుపేదలు సెప్టెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
గల్లీకో నకిలీ డాక్టర్!
సాక్షి, హైదరాబాద్: నర్సు... కాంపౌండర్... అనస్థీషియా అసిస్టెంట్... ఫస్ట్ ఎయిడ్ ప్రొఫెషనల్... ఈ కోర్సులు చదివిన వాళ్లు, ఇలా పనిచేసిన వాళ్లూ డాక్టర్లుగా మారిపోయారు. ఎవరికి వారుగా సొంత క్లినిక్లు ఏర్పాటు చేసుకుని సెలైన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు చేయడంతో పాటు ఎడాపెడా మందుల్నీ రాసేస్తున్నారు. మరికొందరు తమ కుటుంబీకుల ఎంబీబీఎస్ డిగ్రీలు అడ్డం పెట్టుకుని ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సూడో డాక్టర్లు నిర్వహిస్తున్న క్లినిక్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు చేశారు. ఫలితంగా 12 మంది చిక్కారని, వీరినుంచి భారీగా ఔషధాలు, పరికరాలు, లెటర్హెడ్స్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం తెలిపారు. ఇన్స్పెక్టర్లు జె.రాజశేఖర్, సీహెచ్ యదేందర్లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఇటీవల చోటు చేసుకున్న రోగుల మరణాల నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులైన ఒక్కో ‘డాక్టర్’వెనుక ఒక్కో కథ ఉందని వివరించారు. మెడికల్ షాపు నడవటం కోసం క్లినిక్ కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన డి.రామశేఖర్ రెడ్డి 2015 నుంచి తన భార్య నాగజ్యోతి డి–ఫార్మసీ సర్టీఫికెట్ ఆధారంగా రహమత్నగర్లో ‘ఆక్వా ఫార్మసీ‘ని నడుపుతున్నాడు. ఈ దుకాణానికి వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గడంతో తానే ఓ క్లినిక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫార్మసీని శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా మార్చేసి డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ పూర్తి చేసిన నిజాంపేట వాసి రాగం సుధాకర్ను డాక్టర్ని చేశాడు. ఈయన రోజుకు దాదాపు 50 మంది రోగులకు వైద్యం చేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున ఫీజు వసూలు చేసి పంచుకుంటున్నారు. నర్సు అనుభవంతో పీడియాట్రిక్ ప్రాక్టీస్ తూప్రాన్కు చెందిన మిరుదొడ్డి భారతి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చేసి, నర్సుగా పని చేసింది. ఈ అనుభవంతో డాక్టర్గా మారి రహమత్నగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. కొన్నాళ్లుగా పీడియాట్రిక్ డాక్టర్గా మారిపోయి చిన్న పిల్లలకూ వైద్యం చేస్తోంది. ఫాస్ట్ఫుడ్ సెంటర్ మానేసి క్లినిక్ జూబ్లీహిల్స్కు చెందిన కాటిక మహేశ్రావు బీఏ చదివాడు. ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టి నష్టపోయిన ఇతగాడు... నకిలీ వైద్యుడిగా మారి రెండేళ్ల క్రితం వెంకటగిరిలో ఒక గదిని అద్దెకు తీసుకుని క్లినిక్ ప్రారంభించి ప్రాక్టీసు చేస్తున్నాడు. కుమార్తె డిగ్రీతో తండ్రి వైద్యం షేక్పేటకు చెందిన పానుగంటి బాల నరసింహ ఫార్మసీ పూర్తి చేసి శ్రీ తిరుమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నడుపుతున్నాడు. ఈయన కుమార్తె పి.పరమేశ్వరి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీకి సిద్ధమవుతున్నారు. ఆమె సర్టీఫికెట్ ఆధారంగా తన దుకాణం పక్కనే క్లినిక్ ఏర్పాటు చేశాడు. తానే డాక్టర్గా మారి వైద్యం చేస్తున్నాడు. ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్ ఇంటరీ్మడియట్ మధ్యలో ఆపేసిన మహమ్మద్ అబ్దుల్ వలీ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశాడు. ఆ అనుభవంతో గంగానగర్ వెజిటబుల్ మార్కెట్ వద్ద క్లినిక్ తెరిచి డాక్టర్గా అవతారమెత్తాడు. తండ్రి సర్టిఫికెట్తో ప్రాక్టీస్ సికింద్రాబాద్కు చెందిన ఎ.సందానీ తండ్రి ఎస్జీ సుబానీ చర్మ వైద్యుడు. ఇంటరీ్మయట్లో బైపీసీ చదివిన ఇతగాడు తండ్రి సర్టీఫికెట్ ఆధారంగా నల్లగుట్టలో నాలుగేళ్లుగా సందానీ క్లినిక్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఇతడు రోగులకు ఇస్తున్న పెట్రోలియం జెల్లీలో హానికరమైన కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ తదితరాలు ఉన్నట్లు తేలింది. కాంపౌండర్లే క్లినిక్లు... బీహెచ్ఎంసీ చదివి, పదేళ్లు కాంపౌండర్గా పని చేసిన ఎన్.ప్రసాద్ చిలకలగూడలో ఫ్యామిలీ క్లినిక్, డిగ్రీ చదివి కొన్నాళ్లు కాంపౌండర్లుగా పని చేసిన ఎం.శ్రీనివాస్, పి.సదానంద్, సీహెచ్ రమేష్ , ఎస్.లింగయ్యలు లోయర్ ట్యాంక్బండ్లో సాయిరాం క్లినిక్, చిలకలగూడలో సాయిరాం క్లినిక్, మాణికేశ్వర్ నగర్లో సరోజినీ పాలీ క్లినిక్, సూర్య క్లినిక్లు ఏర్పాటు చేసి ఏళ్లుగా వైద్యం చేసేస్తున్నారు. తమ వైద్యంలో పరిస్థితి చేతులు దాటిన పేషెంట్లను ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్కు పంపిస్తున్నారు. -
ఏఐ వైపు విద్యా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెరగబోతోంది. ఇప్పటికే 80 శాతం విద్యాసంస్థలు ఏఐ ఆధారిత పాలన విధానాలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో బోధన విధానాల్లోనూ ఏఐ తోడ్పాటును అనివార్యంగా స్వాగతించాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. 2035 నాటికి ఏఐ వినియోగం మూడు రెట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. అయితే, ఏఐని ప్రవేశపెట్టడంతోనే సరిపోదు. దానిపై పూర్తి స్థాయి అవగాహన అధ్యాపక వర్గానికి అందినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. క్యూఎస్–1 గేజ్ (క్వాక్వారెల్లి సైమండ్స్ ఇండియన్ గేజ్) తాజా అధ్యయనంలో ఈమేరకు వెల్లడైంది. క్యూఎస్–1 గేజ్ యూకే ఆధారిత గ్లోబల్ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ. ఇది ప్రపంచ యూనివర్సిటీల ప్రమాణాలపై అధ్యయనం చేసి, ర్యాంకింగ్ ఇస్తుంటుంది. కొన్ని నెలలుగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 146 ఉన్నత విద్యా సంస్థల నుంచి ’భారత ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ అనుసంధానం’అనే అంశంపై అధ్యాపకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. పాలనలో మెరుగు ఏఐని విద్యాసంస్థల్లో పాలన అవసరాల కోసం ఉపయోగించేందుకు 80 శాతం సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల పాలన మరింత సమర్థవంతంగా ఉంటుందని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. రొటీన్ పనులు, సమాచార నిర్వహణ, కంటెంట్ తయారీకి ఏఐ బాగా ఉపయోగపడుతోందని చెప్పారు. అయితే, విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, అధ్యాపకులకు శిక్షణ, స్పష్టమైన నైతిక మార్గదర్శకాలు, బలమైన డిజిటల్ మౌలిక వసతులు, సంస్థాగత మద్దతు ఇవ్వాలని మెజారిటీ అధ్యాపకులు తెలిపారు. ప్రతిభకు స్పీడ్ బ్రేకర్ ఏఐ వినియోగం వల్ల విద్యార్థుల ప్రతిభ మసకబారుతుందని 76 శాతం మంది అధ్యాపకులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ సాధనాలు విద్యార్థుల వ్యక్తిగత అభ్యసన అవసరాలను సమర్థంగా తీర్చలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మానవీయ అవగాహన, సానుభూతి, సందర్భానుసారమైన మార్గదర్శకత్వంలో ఏఐకి ఇంకా పరిమితులు ఉన్నాయని తెలిపారు. ఏఐపై అతిగా ఆధారపడితే విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు తగ్గే అవకాశం ఉందని 78 శాతం మంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏఐని పూర్తిగా ప్రత్యామ్నాయంగా కాకుండా బోధనకు సహాయక సాధనంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నివేదిక ప్రస్తావించింది. విద్యార్థులు ప్రాజెక్టు వర్క్, ఇతర అసైన్మెంట్ల విషయంలో అధ్యాపకులు పూర్తిగా విశ్వసించలేకపోవడమే దీని సారాంశం. ప్రతీ పనికి విద్యార్థులు ఏఐపై ఆధారపడటం వల్ల వారి సృజనాత్మకత దెబ్బతింటోందని, సొంతంగా ఆలోచించే విధానం తగ్గుతోందని 72 శాతం మంది అధ్యాపకులు అన్నారు. ఇంకెన్నో అనుమానాలు ఏఐని మూల్యాంకన దశకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఏఐ రూపొందించిన సమాధానాల కచ్చి తత్వాన్ని ధ్రువీకరించడం సవాల్గానే మారిందని 68% మంది అధ్యాపకులు అన్నారు. ఏఐ సమాచారాన్ని యథాతథంగా నమ్మకుండా వాస్తవ నిర్థారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డేటా గోప్యత, డేటా షేరింగ్ పరిమితులను అర్థం చేసుకోవడం కూడా మరో ప్రధాన సమస్యగా ఉందని 53% మంది అధ్యాపకులు పేర్కొన్నారు. ఏఐని సమర్థంగా అమలు చేయడానికి సంస్థలు అందించాల్సిన సహాయాల్లో ప్రత్యక్ష శిక్షణా వర్క్షాప్లు ఉండాలని 71 మంది అధ్యాపకులు సూచించారు. 61 శాతం మంది ప్రీమియం లేదా ఎంటర్ప్రైజ్ స్థాయి ఏఐ సాధనాలకు సంస్థాగత గోప్యత అవసరమని తెలిపారు. 40 శాతం మంది అధ్యాపకులు ఏఐ సాధనాలను సమర్థంగా నేర్చుకోవడానికి ముందస్తు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని భావిస్తున్నారు. దీంతో కేవలం సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంచడం కాకుండా, దాన్ని బోధనలో ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రాక్టికల్ శిక్షణ అవసరమని చెప్పారు. ఏఐ అనివార్యమేఏఐ ఆధారిత ప్రోగ్రామ్ విద్యాసంస్థలకు అనివార్యం. పాలనపరమైన అంశాల్లో డేటా బేస్డ్ ప్రోగ్రాంకు వెళ్తున్నాం. ఇది ఉపయుక్తంగా ఉంటోంది. పాఠ్యాంశాల రూపకల్పన, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా సాంకేతికతపై మరికొంత క్లారిటీ కావాలి. – వినీత్ జాన్ రాబర్ట్ (హైదరాబాద్లో ఉన్నత విద్యాసంస్థ నిర్వాహకుడు) విద్యార్థుల కోణంలో ఆలోచించాలిప్రాజెక్టు వర్క్లను ఏఐ ఆధారంగా పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో ఆలోచన శక్తి తగ్గుతోంది. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయగలిగినా వాస్తవ జిజ్ఞాస కొరవడటం పెద్ద లోపం. ఉద్యోగాల్లో నిత్యం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తేనే భవిష్యత్. పునాది దశలో ఈ లోపాన్ని సరిచేయాలి. ఏఐకి విద్యార్థులు టూల్గా మారితే ప్రమాదమే. – సంధ్యారాణి (వరంగల్ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలు) -
సమృద్ధిగానే యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, సమాన పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ను రాష్ట్రంలో దశలవారీగా అమలు చేస్తు న్న ప్రభుత్వం.. ఎరువుల వినియోగంపై రైతులను అప్రమ త్తం చేస్తోంది. రైతులకు ఎరువులు అందించేందుకు గత సంవత్సరం రబీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ యాప్ ను రూపొందించి అమలు చేసింది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండడంతో తదనుగుణంగా అడుగు లు వేస్తోంది. తొలుత రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాన్ని ఆగస్టు 6 నుంచి మరో 10 జిల్లాలకు, ఆగస్టు 21 నుంచి మరో 10 జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 10 జిల్లాల్లో ఈ నెలాఖరులోగా అమలు చేయనున్నారు. 42.34 లక్షల బస్తాలకు బుకింగ్ ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఇప్పటివరకు 10.17 లక్షల క్యూఆర్ కోడ్లు జనరేట్ కాగా, 42.34 లక్షల ఎరువుల బస్తాలు బుక్ అయ్యాయి. ఇందులో 28.39 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అమలు కాని జిల్లాల్లో రాష్ట్ర యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 33.37 లక్షల మంది రైతులు 137.63 లక్షల యూరి యా బస్తాలను బుక్ చేసుకోగా, 123.93 లక్షల బస్తాలను కొనుగోలు చేశారు. అయితే ఎఫ్ఎఫ్ఎస్ అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు తెలిపారు. కొందరు డీలర్ల వద్ద ఉన్న నిల్వకు మించి బుకింగ్లు నమోదవడం, కొన్ని గ్రామాలు, భూముల వివరాలు యాప్లో కనిపించకపోవడం, బుకింగ్ ప్రక్రియలో ఇతర సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, సాంకేతిక బృందాలు సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాయని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు. 2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 9.79 లక్షల టన్నుల యూరియా వినియోగం కాగా, ప్రస్తుత వానాకాలంలో ఇప్పటివరకు 6.75 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. సెప్టెంబర్ నెలకు కేటాయించిన అదనపు సరఫరా కూడా రాష్ట్రానికి రానుంది. గత ఏడాది ఇదే సమయానికి 0.32 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 2.77 లక్షల టన్నులు ఉన్నాయి. రైతులు అవసరానికి మించి ముందస్తుగా ఎరువులను బుక్ చేసుకోవడం, కొనుగోళ్ల కోసం తొందరపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఎరువుల లభ్యత, సరఫరా, రవాణా, పంపిణీని వ్యవసాయశాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రతి నిజమైన సాగుదారుడికి అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి తెలిపారు. -
ఉద్యమం ఆగదు.. సర్కార్ను నిద్రపోనివ్వం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు బకాయిల కోసం తన నిరాహార దీక్ష ముగిసినా, విద్యార్థుల హక్కుల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం తన మొండివైఖరి వీడి రూ. 15 వేల కోట్ల బకాయిలను చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని, విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి అండగా నిలిచిన విద్యార్థి లోకానికి, యువతకు, మేధావులకు, విద్యాసంస్థల ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మధ్యా హ్నం రెండు గంటల ప్రాంతంలో బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండురోజుల నిరాహారదీక్షను ఉపసంహరించిన సందర్భంగా రాంచందర్రావు మాట్లాడారు. మంగళవారం దీక్షా శిబిరానికి వచ్చిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి రక్తపోటు, చక్కెరస్థాయిలు తగ్గాయని గుర్తించారు. నిరాహార దీక్ష ను కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర నేతల చేతుల మీదుగా నిమ్మరసం స్వీకరించి నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది యూపీఎస్సీ తరహాలో క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? రాహుల్ గాంధీ దీనిపై తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘రేవంత్ను సీఎంను చేసినందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. భూములు అమ్మితే వచ్చిన వేల కోట్లు ఏం చేస్తున్నావు?.. పిల్లలకు ఫీజులు ఇవ్వడానికి మనసు రావడం లేదా ? విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నా బాధ్యత రేవంత్రెడ్డిదే’అని హెచ్చరించారు. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆశల మీద నీళ్లు చల్లావని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయిలేని సీఎంను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’అన్నారు. ఎమ్మెల్సీలు డా.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కకొమరయ్య, పార్టీనేతలు డా.ఎన్.గౌతంరావు, టి.వీరేందర్గౌడ్, ఎన్వీ సుభాష్, గణేష్ కుండే, పి.మురళీధర్రావు, ఇ.పెద్దిరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సైదిరెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్రావు, జి.మనోహర్రెడ్డి, బండా కార్తీకరెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడి పాల్గొన్నారు. 5, 6 తేదీల్లో బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలు: ఏలేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ముఖ్యమైన సమస్యలపై అనుసరిస్తున్న వైఖరిపై నిరసనగా...వచ్చేనెల 5, 6 తేదీల్లో బీజేపీ ఆధ్వ ర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రకటించారు. భూభా రతి అక్రమాలు, 22ఏ పేరుతో లక్షలాది ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, తదితర సమస్యలపై సర్కార్ వైఖరిని ఎండగడతామన్నారు. అప్పటికీ ప్రభు త్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయకపతే, భూ కుంభకోణాలపై చర్యలు తీసు కోకపోతే బీజేపీ పక్షాన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభరోజైన 7న ’అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు తాండవిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి అమెరికాలో పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ భూభారతి పేరుతో దారుణమైన దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. -
ఏడాదిలో దేవాదుల పూర్తి!
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు.38 టీఎంసీల గోదావరి జలాలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇకపై జాప్యానికి తావులేకుండా సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ప్రాజెక్టును ఫాస్ట్ట్రాక్పై పెట్టి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి మంగళవారం జలసౌధలో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏ పని ఎక్కడ నిలిచిపోయింది? దానికి కారణమేంటి? పరిష్కారానికి ఏం చేయాలి? అనే అంశాలపై లోతుగా చర్చించామన్నారు. భూసేకరణ, అటవీ అనుమతులు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. పరిహారం చెల్లింపులో ఒక్కరోజూ జాప్యం ఉండకూడదన్నది ప్రభుత్వ విధానమని, సాధ్యమైనంత అధికంగా గోదావరి జలాలను ఎత్తిపోయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదుల ప్రాజెక్టుతో ఏళ్లుగా అనుబంధం ఉన్న సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీనియర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి, దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొనడంతో క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించే అవకాశం లభించిందని తెలిపారు. సీఎంకు నివేదించాలి..: పొంగులేటి దేవాదుల ప్రాజెక్టుపై అవగాహన ఉన్న అధికారులతో మొదటి నుంచి చివరివరకు సమగ్ర సమీక్ష నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రామప్ప చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 29 నుంచి 35 అడుగులకు పెంచేందుకు అంచనాలను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఒక్కో అడుగు నిల్వ పెంచితే ఎంత భూమి అవసరమవుతుందో సమగ్ర నివేదిక అందించాలని కోరారు. రామప్ప–లక్నవరం లింక్ కెనాల్ పనులను రూ.33 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జంపన్నవాగులో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ఈ లింక్ కెనాల్ కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. త్వరలో జరగనున్న జాతరను దృష్టిలో ఉంచుకుని రామప్ప–లక్నవరం లింక్ కెనాల్ పనులతో పాటు సంబంధిత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. -
లక్ష కోట్లకు చేరువగా..!
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రూ.లక్ష కోట్లకు చేరువైంది. గత నాలుగు నెలల కాలంలో అన్ని రకాల రాబడుల రూపంలో రూ. 93,388 కోట్లు సమకూరాయి. అంటే ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.3.24 లక్షల కోట్లలో దాదాపు 30 శాతం మేర సమకూరాయన్నమాట. అదే గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.19వేల కోట్ల కంటే ఎక్కువ ఖజానాకు సమకూరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో పురోగతితోపాటు రుణాలు కూడా ఓ మేరకు ఎక్కువగా తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడులు ఆశాజనకంగానే ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక చెబుతోంది. పన్ను రాబడులు మెరుగ్గానే.. సొంత పన్నుల ఆదాయం ఏటేటా పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే ధోరణి కనిపిస్తోంది. జీఎస్టీ రూపంలో రూ.19,103 కోట్లు, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా రూ. 6,144 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 12,584 కోట్లు, ఇతర పన్నుల రూపంలో రూ. 2,703 కోట్లు, పన్నేతర ఆదాయం కింద రూ. 4,274 కోట్లు సమకూరాయి. వీటికి తోడు బహిరంగ మార్కెట్లో రుణాల రూపంలో రూ. 33,729 కోట్లు ఖజానాకు చేరాయి. జీతాలకే ఎక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు పద్దులను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే ఎక్కువగా ఖర్చయింది. రెవెన్యూ పద్దు కింద రూ.32వేల కోట్లకు పైగా ఖర్చు కాగా, ఉద్యోగుల వేతనాల కోసం రూ. 17,874 కోట్లు, పింఛన్ల రూపంలో రూ. 10,492 కోట్లు వ్యయమైంది. ఇక, గతంలో చేసిన అప్పులకు వడ్డీల కింద రూ. 10,532 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు వివిధ రకాల సబ్సిడీల కోసం రూ. 7,870 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలో అన్ని పద్దుల కింద రూ. 93వేల కోట్లు రాగా, రూ. 88,182 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. కేంద్రం నుంచి వచ్చింది తక్కువే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి సాయం తక్కువగానే వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 4నెలల కాలంలో రూ. 5,502 కోట్లు వచ్చాయి. దీంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మరో రూ.2,300 కోట్లు వచ్చాయి. అదే గత ఏడాది ఇంతకంటే ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలలకు రూ. 5,899 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా కింద, రూ.700 కోట్లకుపైగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సమకూరాయి. -
గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తెలంగాణ సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు ఏకైక పతకం అందించిన తెలంగాణ ప్లేయర్ పుల్లెల గాయత్రి,కేరళ క్రీడాకారిణి ట్రెసా జాలీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కలిసిన గాయత్రి–ట్రెసాలను సీఎం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గాయత్రి తల్లిదండ్రులైన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ పీవీవీ లక్ష్మి కూడా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో గాయత్రి–ట్రెసా ద్వయం మహిళల డబుల్స్లో కాంస్య పతకం గెలిచింది. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో గాయత్రి–ట్రెసా జాలీలకు ‘అర్జున’ అవార్డు కూడా దక్కింది. -
నిమ్స్ తరహాలోనే టిమ్స్లో ఫీజులు
సాక్షి, హైదరాబాద్ /వెంగళరావునగర్ : డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్)లో నిమ్స్ తరహా టారిఫ్ విధానం అమలు కానుంది. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు లేని రోగులకు నిమ్స్లో వసూలు చేసినట్టే నామమాత్రపు ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గుండె సంబంధమైన వ్యాధుల కోసం ఏర్పాటైన తొలి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కావడంతో రోగుల నియంత్రణ, ఆస్పత్రి నిర్వహణ, నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని టిమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్ణయించింది. మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిమ్స్లో అమల్లో ఉన్న టారిఫ్లను టిమ్స్లోనూ అమలు చేసే కీలక నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనివల్ల రెండు ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యసేవల చార్జీల్లో ఏకరూపత వస్తుందని, మెరుగైన ఆర్థిక ప్రణాళికకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం టిమ్స్కు రోజూ సగటున 600 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ మంత్రికి వివరించారు. వారికి అవసరమైన వైద్య సేవలతోపాటు డే కేర్ విధానంలో చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. సర్వీస్ రూల్స్ కూడా నిమ్స్వే ఎంసీఆర్ టిమ్స్లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్ను అనుసరించడంతోపాటు, నిమ్స్లో అమలులో ఉన్న టారిఫ్లను టిమ్స్లో కూడా అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. టిమ్స్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (టీఆర్ఏ) ద్వారా నిర్వహించేందుకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను సమన్వయం చేయడానికి కూడా అనుమతి ఇచ్చింది. మల్టీలెవల్ పార్కింగ్..పీజీ హాస్టళ్లు రోగులు, వైద్యులు, సిబ్బందికి మౌలిక వసతులను మెరుగుపరిచే పలు ప్రతిపాదనలకు కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. ఆస్పత్రిలో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం, రోగుల సహాయకుల కోసం అదనపు టాయిలెట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నిమ్స్ తరహాలో టిమ్స్లో పీజీ కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో పీజీ విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. టిమ్స్ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి రాజనర్సింహ తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ఉప్పల్, వైద్య విద్య సంచాలకురాలు డాక్టర్ వాణి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పాల్గొన్నారు. -
‘మూసీ’ భూసేకరణ వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో భూసేకరణ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ విధానం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. వీటిపై స్పష్టమైన విధానం రూపొందించాలని, భవిష్యత్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్–2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లభించే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణలో భాగమైన టీడీఆర్ అంశంపై ప్రతి వారం సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. కొత్వాల్గూడ బర్డ్స్ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కారిడార్ను పునరుద్ధరించే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్టు ఎంఆర్డీసీఎల్ అధికారులు తెలిపారు. మూసీ పరిధిలోని ఎంఎఫ్ఎల్/బఫర్ జోన్లలో భూములను స్వచ్ఛందంగా అప్పగించే వారికి టీడీఆర్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మూసీ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించి కొందరు యజమానులు టీడీఆర్కు బదులుగా నగదు, ఇళ్లు లేదా ఓపెన్ ప్లాట్లు కోరుతున్నట్టు సమాచారం. భూముల స్వభావం, హక్కులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులను స్పష్టంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్ న్యాయ వివాదాలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
అవినీతి తప్ప.. అభివృద్ధి ఏదీ?
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని చెప్పారు. తాడి చర్ల–2, పీకేఓసీ–2 బ్లాకులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్–3 సింగరేణికి దక్కేలా చర్యలు చేపట్టామన్నారు. 120 మిలియన్ టన్నుల నిల్వలున్న ఈ గని ద్వారా సంస్థకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి వల్ల సింగరేణి ఆర్థికంగా దెబ్బతింటోందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ. 55 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలపై బాధ్యతారాహిత్యం... తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదంటూ రేవంత్ చేస్తున్న ఆరోపణలు.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనని కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘ముఖ్య మంత్రి, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు అన్ని అనుమతులు తీసుకున్నాకే విదేశీ పర్యటనలు ఖరారు చేసుకుంటారు. ఆదరాబాదరాగా లండన్ వెళ్లి, అక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకోవడం సరికాదు. విదేశీ పర్యటనల విషయంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విదేశాంగ శాఖ నిబంధనలు అమలులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలు, పర్యటించే వ్యక్తుల నేపథ్యం ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి. ఇది కేవలం పాలనాపరమైన అంశం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు’అని స్పష్టం చేశారు. 2005లో నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని గుర్తుచేశారు. గతంలో తనతో సహా పలువురు కేంద్రమంత్రుల పర్యటనలను కూడా విదేశాంగ శాఖ నిరాకరించిందని చెప్పారు. ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చిన, పాకిస్తాన్ అనుకూల వ్యక్తి, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవడానికి రేవంత్ ఎందుకు ప్రయతి్నంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని విస్మరించి.. విదేశీ యూనివర్సీటీలను తీసుకొస్తామని గొప్పలు చెప్పుకునే రేవంత్రెడ్డి, ముందు రాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాలని కిషన్రెడ్డి నిలదీశారు. బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు, విద్యార్థులకు ఉచిత స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, మండలానికి అంతర్జాతీయ పాఠశాల ఇస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్త యూనివర్సీటీల మాట పక్కనబెట్టి, ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అట్టర్ ఫ్లాప్ అయిందని, హైదరాబాద్లోనే 20 శాతం ఇళ్లకు కూడా ఎన్యూమరేటర్లు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. -
వేటు వేయండి!
సాక్షి, హైదరాబాద్: అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారని, ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పార్టీని కోరింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు అనంతుల శ్యాంమోహన్, వాజిద్ హుస్సేన్ తదితరులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ను కలిసి నివేదికను అందజేశారు. ఈ నివేదికను ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందా..? లేక నేరుగా అధిష్టానం పరిశీలించి నిర్ణయం వెంటనే తీసుకుంటుందా? లేక ఏఐసీసీ స్థాయిలో వారిద్దరిని పిలిపించి వారి వివరణలు తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తికర చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఆమెను తప్పించడమే పరిష్కారం మంత్రి కొండా సురేఖ విషయంలో ఇచ్చిన నివేదికలో ‘క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం సురేఖకు అలవాటుగా మారింది. ఆమె రాజకీయ నేపథ్యమంతా వివాదాలతో కూడుకున్నదే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రెండుసార్లు పార్టీకి క్షమాపణలు చెప్పి మళ్లీ పార్టీ నియమావళిని ఉల్లంఘించారు. అమెను మంత్రి పదవి నుంచి తప్పించడమే సరైన చర్య అని భావిస్తున్నాం’ అని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. సురేఖకు సంబంధించి మూడు, చిన్నారెడ్డిపై రెండు పేజీల నివేదికతోపాటు ఇందుకు తగిన ఆధారాలను కూడా పొందుపరిచిన క్రమశిక్షణ కమిటీ ఇదే నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు కూడా పంపినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. మంచి అవకాశమిచ్చాం... విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ చిన్నారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా, గెలిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అవకాశం ఇచ్చాం. కేబినెట్ హోదా ఇచ్చాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా వస్తున్నారు. తొమ్మిదిసార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసేందుకు అవకాశామిచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారని, పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడారని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’ అని చిన్నారెడ్డి గురించి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. హైకమాండ్ నిర్ణయం మేరకు చర్యలు: మల్లురవి పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్కు నివేదిక ఇచ్చిన అనంతరం గాం«దీభవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ప్రధానమైందని చెప్పారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి గురించిన అన్ని విషయాలు, సిఫారసులను తమ నివేదికలో పొందుపర్చామని చెప్పారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పంపుతారని చెప్పారు. ఏదైనా హైకమాండ్దే తుది నిర్ణయమని, తమ సిఫారసుల ద్వారా పార్టీ కేడర్కు ఓ సందేశం వచ్చేలా నివేదిక ఇచ్చామని మల్లురవి స్పష్టం చేశారు. పార్టీ పెద్దగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా సురేఖ, చిన్నారెడ్డి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ కోణంలో ఆ ఇద్దరికి నోటీసులు ఇస్తే.. ఆ నోటీసులనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమాధానం ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించారు. కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన అంశం కొండా సురేఖకు తెలియకుండానే జరుగుతుందా అని పశి్నంచారు. సాయంత్రం సీఎం రేవంత్రెడ్డిని కూడా కలిసి నివేదికలోని అంశాలను వివరించడానికి ప్రయత్నించారు. కానీ రేవంత్ బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయారని, వీలును బట్టి బుధవారం సీఎంను కలిసే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.ఏమి జరుగుతుందో? కఠిన చర్యలు తీసుకోవాలన్న క్రమశిక్షణ కమిటీ నివేదిక నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా? లేక గౌరవప్రదంగా ఆమెతో రాజీనామా చేయిస్తుందా..? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమె శాఖను మారుస్తారా.. ఇంతకు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు చిన్నారెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... అధికారిక పదవి నుంచి మాత్రమే తప్పిస్తారా లేదంటే మందలింపుతో సరిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. -
తెలంగాణలో పెట్టుబడులు.. జపాన్ కంపెనీలకు మంత్రి ఆహ్వానం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని శక్తి మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో జపాన్ కంపెనీల పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.ఒసాకాలో Career Consultz వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ రావు నిర్వహించిన ‘Leveraging Indian Talent’ ఇండియా-జపాన్ వర్క్ఫోర్స్ రౌండ్టేబుల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జపాన్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు, నైపుణ్య మానవ వనరులు, ఉపాధి అవకాశాలు, టాలెంట్ మొబిలిటీపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలతో పాటు నైపుణ్యవంతులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో రాష్ట్రానికి బలమైన టాలెంట్ పూల్ ఉందన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కోరారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం అందిస్తూ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.తెలంగాణలో సుమారు 600 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి చూపుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇది తెలంగాణపై జపాన్ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.పెట్టుబడులతో పాటు తెలంగాణ యువతకు జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జపాన్ సంస్థలతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. జపాన్లో పెరుగుతున్న నైపుణ్య మానవ వనరుల అవసరాలను తెలంగాణ టాలెంట్తో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.తెలంగాణ యువత కొత్త దేశాలకు, కొత్త వాతావరణాలకు త్వరగా అలవాటు పడే స్వభావం కలిగి ఉంటారని మంత్రి అన్నారు. కష్టపడి పనిచేయడం, కొత్త విషయాలను వేగంగా నేర్చుకోవడం, పనిచేసే సంస్థలు, దేశాల సంస్కృతికి అనుగుణంగా మారడం తెలంగాణ యువత ప్రత్యేకతలని తెలిపారు. జపాన్ కంపెనీల అభివృద్ధికి తెలంగాణ యువత గణనీయంగా దోహదపడగలరని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే యువతకు ఆయా దేశాల భాషపై పరిజ్ఞానం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అందుకే టామ్కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు భాషా శిక్షణ, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, పని సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తద్వారా తెలంగాణ యువత అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో సులభంగా ఉపాధి పొందేలా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జర్మనీతో నైపుణ్య మానవ వనరుల రంగంలో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని మంత్రి తెలిపారు. ఇటీవల జర్మనీ బృందం తెలంగాణలో పర్యటించినప్పుడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. తెలంగాణ చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారని తెలిపారు. జర్మనీలో నైపుణ్య మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణ యువతకు మరిన్ని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.నైపుణ్య మానవ వనరుల నియామకం, శిక్షణ, ఉపాధి కల్పనలో జపాన్ సంస్థలతో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. భారత్–జపాన్ సంబంధాల్లో వర్క్ఫోర్స్ మొబిలిటీ కీలక అంశంగా మారుతోందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో భారత్–జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రౌండ్టేబుల్ సమావేశం దోహదపడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. -
సారంపల్లి... నీకు సలాములయ్యా
హైదరాబాద్: ‘సారంపల్లి మల్లారెడ్డి నీకు సలాములయ్యా...మీ తరమెల్లిపోతుందయ్యా...మా చేయి పట్టి నడిపేదెవరయ్యా...మీలాంటి నేతలు మళ్లీ మళ్లీ పుట్టాలయ్యా... కార్మిక కర్షక రాజ్యం రావాలయ్యా... సమాసమాజ స్థాపన జరగాలయ్యా...’’ అంటూ కమ్యూనిస్టు యోధుడు సారంపల్లి మల్లారెడ్డికి రైతాంగం కన్నీటి వీడ్కోలు పలికింది. రైతాంగ ఉద్యమాల గురువు భావించే మల్లారెడ్డిని కడసారి చూసేందుకు హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి అన్నదాతలు, రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున కదలొచ్చారు. చివరి చూపు కోసం వచ్చిన ప్రతి ఒక్కరి కండ్లలోనూ ‘మొన్నటిదాకా నవ్వుతూ పలుకరించిన నేత.. మన కోసం ఇంతగా పోరాడిన మనిషి ఇక లేడా’ అని ఆయన పార్థీవదేహంపై పుష్పాంజలి ఘటిస్తూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. నవ్వుతూ మాట్లాడే ఆ విజ్ఞానఖని దేహం నిర్జీవంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు.కన్నీటి చుక్కలు జాలువారాయి. మాట్లాడేందుకు నోటిమాట రాక మౌనందాల్చారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఆ యోధునికి కడసారి చేతులెత్తి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆ పెద్ద మనిషికి వీడ్కోలు చెబుతూ బరువైన హృదయంతోనూ ప్రతీ గొంతూ నినదించింది. తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మల్లారెడ్డి చివరి మజిలీ కూడా ఒక సందేశంగా మారింది. పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించడంతో మరణాన్నీ సమాజ సేవకే అంకితం చేసినట్టు అయింది. మల్లారెడ్డి లేరనే నిజం ఎంత చేదైనా రైతుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్మరణీయమే..ఆచరణీయమే. ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రతి రైతులో, ఆయన మాటను గుర్తుచేసుకునే ప్రతి మనసులో, అన్నదాత హక్కుల కోసం ఎగిసే ప్రతి గొంతులో... సారంపల్లి మల్లారెడ్డి జీవించే ఉంటారు. రైతుల క్షేమం కోసం ఆయన రగిలించిన స్ఫూర్తి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలువనున్నది. ఏఐకేఎస్ జాతీయ నేత, సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఆయన్ను కడసారి చూసేందుకు నిమ్స్ నుంచి ఆయన మృతదేహం రాకముందే ఎంబీభవన్కు రైతులు, ప్రజలు, అభిమానులు, సన్నిహితులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్రోడ్డు మెట్రో స్టేషన్, నాబార్డు కార్యాలయం పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. గాంధీ మెడికల్ కాలేజీకి సారంపల్లి భౌతిక కాయం అప్పగింతమధ్యాహ్నం 12 గంటల తర్వాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమ యాత్ర సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ ఆస్పత్రి వరకు కొనసాగింది. అందులో ఆయా జిల్లాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజానాట్యమండలికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు, డప్పు కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడ గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్, నాగమోహన్, ప్రొఫెసర్లు గౌరి, రమాదేవి సమక్షంలో మల్లారెడ్డి భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, నాగమోహన్ మాట్లాడుతూ..నలుగురికీ ఉపయోగపడాలనుకునే ఉన్నత భావాలున్నవాళ్లే ఇలాంటి మంచి పని చేస్తారనీ, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం డెడ్బాడీని ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు. -
"సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు"
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం–పునర్నిర్మాణం, అటవీ అనుమతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ అవసరాల కోసం దాదాపు రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు (మంగళవారం )జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ ప్రక్రియలపై సమగ్రంగా సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారని, నిధుల కొరత కారణంగా రాష్ట్రంలోని ఏ సాగునీటి ప్రాజెక్టు పనులూ నిలిచిపోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ సమస్యల పరిష్కారానికి ఎంత నిధులు అవసరమైనా ప్రభుత్వం తక్షణమే సమకూర్చేందుకు సిద్ధంగా ఉంది. అధికారులు ప్రక్రియను పూర్తి చేసి టోకెన్లు సమర్పించండి. నిధులు సమకూర్చే బాధ్యత మాపై వదిలేయండని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ సంబంధిత అవసరాలకు దాదాపు రూ.6 వేల కోట్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే తొలి విడతలో సుమారు రూ.1,056 కోట్లు, అనంతరం మరో రూ.1,500 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ సంబంధిత పెండింగ్ ప్రక్రియలను రాబోయే నెల నుంచి నెలన్నర వ్యవధిలో గణనీయంగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన ప్రతిపాదనలు, అవార్డులు, టోకెన్ల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు.“మీరు ప్రక్రియ పూర్తి చేయండి... టోకెన్లు సమర్పించండి. డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది. నిధుల కారణంగా ఒక్క పని కూడా ఆగకూడదు” అని మంత్రి స్పష్టం చేశారు. పీడీ ఖాతాలో కాదు...ప్రభుత్వం నిధులు విడుదల చేసి జిల్లా ఖాతాలకు పంపించడంతోనే బాధ్యత పూర్తయినట్లు భావించరాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. డబ్బులు కలెక్టర్ పీడీ ఖాతాలోనో, మరో ప్రభుత్వ ఖాతాలోనో ఉండిపోతే నిధులు విడుదల చేసిన ప్రయోజనం ఏముంటుంది? భూమి కోల్పోయిన రైతు, నిర్వాసిత కుటుంబం చేతికి పరిహారం చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు” అని స్పష్టం చేశారు.జిల్లా, భూసేకరణ కార్యాలయాలకు చేరిన నిధులను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. భూసేకరణలో ప్రభుత్వ విజయాన్ని ఖాతాల్లో ఉన్న నిధులతో కాకుండా భూములు కోల్పోయిన వారికి వాస్తవంగా అందిన పరిహారంతోనే కొలుస్తామని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు 40 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, ఇందుకు సుమారు రూ.6,150 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా నిధులు వివిధ భూసేకరణ కార్యాలయాలు, జిల్లా ఖాతాల్లో వివిధ దశల్లో ఉండి పంపిణీ కావాల్సి ఉందని సమీక్షలో వెల్లడైంది.రోజూ కొన్ని నిమిషాలు భూసేకరణకే కేటాయించండిప్రతి జిల్లా కలెక్టర్ రోజూ కొన్ని నిమిషాలు భూసేకరణ పురోగతిని వ్యక్తిగతంగా సమీక్షించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, భూసేకరణ అధికారులు, నీటిపారుదల ఇంజినీర్ల మధ్య తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.చీఫ్ ఇంజినీర్లు కూడా తమ బాధ్యతను కేవలం సాంకేతిక అంశాలకే పరిమితం చేసుకోకుండా, భూసేకరణ నుంచి ఆర్అండ్ఆర్, అటవీ అనుమతుల వరకు ప్రతి అంశంలో చొరవ చూపాలని సూచించారు.అవార్డులు పూర్తయిన వెంటనే మ్యూటేషన్, ఎన్కంబ్రెన్సుల తొలగింపు, సేకరించిన భూమిని అధికారికంగా నీటిపారుదల శాఖకు అప్పగించడం వంటి ప్రక్రియలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్నగర్, మణికొండ, గచ్చిబౌలిలో కుండపోతగా వాన కురుస్తోంది. ఒక్కసారిగా వాన పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఒంటరైన మంత్రి కొండా సురేఖ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమానికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. వనమహోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండగలా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చినప్పటికీ, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు గైర్హాజరయ్యారు. కేవలం మంత్రి సీతక్క మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వరంగల్ జిల్లాలో నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా కొండా సురేఖ మొక్కలు నాటారు. ఆమె పిలుపు మేరకు మంత్రి సీతక్క వచ్చి మద్దతు తెలిపారు. అయితే, సీతక్క మినహా మిగతా మంత్రులందరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.కొండా సురేఖకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలోనే మంత్రులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వనమహోత్సవంలో పాల్గొంటే సీఎంకు దూరంగా ఉన్నట్లు అవుతుందనే ఉద్దేశంతోనే మిగతా మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: ‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ -
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది. ఈ రోజు (మంగళవారం) టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్కు ఆరు పేజీల నివేదికను అందించింది. నివేదికలో.. "కొండా సురేఖ పదే పదే తప్పులు చేస్తున్నారు. గతంలో కూడా కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుటుంబసభ్యులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. సురేఖపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం" అని తెలిపింది. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మల్లురవి భేటీ కానున్నారు. సీఎం రేవంత్ను కలిసి నివేదికలోని అంశాలు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఏ నిర్ణయం తీసుకోనుందా అని ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ అంశంపై ఇదివరకే సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను. తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ సైతం మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది.అసలు వివాదం ఏంటి?ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ అభ్యంతకరంగా మాట్లాడారు. 'సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్కు స్థానం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’ అని ప్రశ్నించారుఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.కొండా సురేఖ వివరణకాగా ఈ వివాదంపై ఇదివరకే కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు. అయినప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలకే సిపారసు చేసింది.ఇదీ చదవండి: ఒంటరైన మంత్రి కొండా సురేఖ -
దీక్ష విరమింపజేసిన రాంచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్ రావు దీక్ష విరమింపజేశారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు బకాయి -బీజేపీ లడాయి పేరుతో నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు (మంగళవారం) దీక్ష విరమింపజేశారు.కాగా నిన్నటి నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో రాంచదంర్ రావు ఆరోగ్యం క్షీణించిందన వైద్యులు తెలిపారు. బీపీ డౌన్ అయిందంటున్న గ్లూకోజ్ ఎక్కించుకోవాలి అంటూ రాంచందర్ రావుకి వైద్యులు సూచన చేశారు. అయినప్పటికీ రాంచందర్ రావు దీక్ష కొనసాగించారు. అనంతరం మద్యాహ్నం సమయంలో దీక్ష విరమింపజేశారు. -
మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా?
భారతదేశంలో రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయగల అత్యంత శక్తిమంతులలో ఒకరిగా పేరొందిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ డిపాజిట్ల సేకరణ కేసులో, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం ఫలించినట్లా? కాదా? ఈ కేసును సుప్రింకోర్టు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచారం చేసుకుంది. తప్పులేదు. ఎందుకంటే వారి గ్రూప్ సంస్థ కనుక తమకు అనుకూలంగా ఎట్టకేలకు తీర్పు వచ్చిందన్న భావనతో ప్రజలలో దీనిపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని తొలగించేందుకు ఆ మీడియా యత్నించింది. కాని అంత మాత్రాన చేసిన తప్పు, తప్పు కాకుండా పోతుందా? అన్నది చర్చనీయాంశం.ఈ తీర్పుపై ఉండవల్లి ఇచ్చిన విశ్లేషణ, ఆయన వేసిన ప్రశ్నలకు మార్గదర్శి సంస్థ తరపున ఈనాడు మీడియా సమాధానం ఇస్తే అప్పుడు ప్రజలు ఇందులో రామోజీరావు తప్పు చేశారా? లేదా? అన్నది ఆలోచించుకుంటారు. కాని అటువైపు నుంచి స్పందన కనిపించలేదు. మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఈ కేసు తీర్పు, ఉండవల్లి పోరాటంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన అలుపెరగని పోరాటానికి చివరకు తెరపడిందని, ఈ కేసును ఇంత దూరం తీసుకురాగలుగుతారని తాను అసలు అనుకోలేదని, కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి పడిన శ్రమ మాత్రమే దీన్ని ఇన్నాళ్లు నడిపించాయని ఆయన కొనియాడారు.మంది మార్బలం, అపారమైన శక్తి ఉన్న రామోజీరావు ఎక్కడ? ఒంటరిగా పోరాడిన ఉండవల్లి ఎక్కడ? అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఈ పోరాటాన్ని బైబిల్లోని 'గోలియత్-డేవిడ్' యుద్ధంతో పోల్చారు. బైబిల్లో డేవిడ్ గెలిచి ఉండవచ్చు కానీ, నిజజీవితంలో ఎప్పుడూ గోలియత్లదే (బలవంతులదే) విజయం అవుతుందని న్యాయపరమైన ముగింపును ఉద్దేశించి ఐవైఆర్ కృష్ణారావు నిగూఢ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా ఈ కేసు వీగిపోవడానికి లేదా ముగియడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలోనే మొత్తం సూక్ష్మం అంతా కనిపిస్తుంది కదా! రామోజీరావు తప్పు చేయలేదన్నట్లుగా ఈనాడు ప్రొజెక్టు చేసుకోవడాన్ని ఉండవల్లి ప్రస్తావించి, తప్పు చేయకపోతే ఈటీవీ షేర్లను విక్రయించి డిపాజిట్ దారులకు డబ్బు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించివేస్తామని సుప్రింకోర్టును ఎందుకు వేడుకున్నారన్నది ఆయన ప్రశ్న?అంతేకాక ఫైనాన్స్ సంస్థను ఎందుకు మూసివేశారని ఆయన అడుగుతున్నారు. డిపాజిట్ల సేకరణ చేయవచ్చని ఏ కోర్టు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి నిజమా? కాదా? ఉండవల్లి అడిగిన ప్రశ్నలన్నీ హేతుబద్దంగా ఉన్నాయి కదా! వీటికి రామోజీరావు కుమారుడు కిరణ్ తన మీడియాలో జవాబు ఇస్తే బాగుంటుంది కదా! ఇక్కడ అసలు సమస్య 2600 కోట్ల డిపాజిట్లు తిరిగి చెల్లించారా?లేదా? అన్నది కాదు. చట్టం ప్రకారం డిపాజిట్ల సేకరణ తప్పా? కాదా? అన్నదే. మామూలుగా అయితే రామోజీ ఎంతమాత్రం ఎవరికి లొంగకూడదని అనుకుంటారు. బ్రేక్ ద లా లాఫుల్లీ అన్నది తన విధానం అని ఆయా సందర్భాలలో సన్నిహితులతో రామోజీ అనేవారని చెబుతారు. అంటే ఎక్కడా దొరకకుండా, చట్టంలోని లొసుగులను వాడుకోవాలన్నది ఆయన ధీరీ అన్నమాట.ఆయనకు రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉందన్నది ఎనలేని సత్యం. ఆయన చేసింది సక్రమమా? అక్రమమా? అన్నదానితో నిమిత్తం లేకుండా తెలుగుదేశం మద్దతు ఇస్తుంటుందన్నది చాలామంది భావన. ఒకప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకినని రామోజీ ప్రకటించుకున్నా, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి చెందినవారు కొందరితో కూడా సత్సంబంధాలు నెరపి, తన వ్యాపార అవసరాలకు వాడుకునేవారని అంటారు. తెలంగాణలో టీఆర్ఎస్తో కూడా చాలావరకు మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ గ్రూప్కు పూర్తి సహకారం లభించసాగింది. అందువల్లే రామోజీ మరణించిన తర్వాత ఆ సంస్థకు అనుకూలంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానంలో అఫిడవిట్లు వేశాయన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది.ఇక కేంద్రంలోని బీజేపీతో కూడా ఈ గ్రూపు సఖ్యతతో ఉంటుంది. ఇదంతా తనకు ఉన్న మీడియా బలంతోనే అన్నది బహిరంగ రహస్యమే. బహుశా అందువల్లేనేమో కొంతకాలం క్రితం వరకు డిపాజిట్ల సేకరణ కేసులో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించి సెక్షన్ 45 ఎస్ కింద హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయడం చెల్లదని స్పష్టం చేసేది. కాని అదే రిజర్వుబ్యాంకు ఈ కేసును ఇకపై తాము పట్టించుకోబోమని ఉండవల్లి రాసిన ఒక లేఖకు బదులుగా చెప్పిందంటే ఏమిటి అర్దం?రామోజీ గ్రూప్నకు ఉన్న పరపతి, రాజకీయ పలుకుబడి ముందు తాము నిలబడ లేకపోతున్నామని ఆర్బీఐ అంగీకరించడమే కదా!రామోజీ మరణించినందున ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదన్నది తెలిసిన విషయమే. కాని ఆయన సంస్థ చేసిన తప్పులపై కేసు కొనసాగుతుందని గతంలో కోర్టువారు ఇచ్చిన ఒక తీర్పును ఉండవల్లి ఉదహరించారు. నిజానికి ఉండవల్లి చేస్తున్న పోరాటం ఏమిటి?మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు వసూలు చేయడం సక్రమమా? అక్రమమా? కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని రామోజీ అతిక్రమించారా? లేదా? అన్నది తేల్చాలనే! రామోజీ జీవించి ఉన్నప్పుడు కూడా ఉండవల్లి ఒక మాట చెప్పేవారు. రామోజీని జైలులో పెట్టాలని తాను కోరుకోవడం లేదని, కాని ఈ డిపాజిట్ల కేసును నిగ్గు తేల్చడం ద్వారా ఇకపై అలా ఎవరూ డిపాజిట్లు వసూలు చేయకుండా చూడాలన్నదే తన ఉద్దేశం అని ఆయన అనేవారు. ఎందుకంటే అక్రమ డిపాజిట్లు వసూలు చేసినవారికి రెట్టింపు జరిమానా వేయాలని రిజర్వుబ్యాంక్ చట్టం సెక్షన్ 45 ఎస్ చెబుతోంది. దీనిని ఎవరికైనా ఒకేరకంగా వర్తింప చేయాలన్నది ఉండవల్లి డిమాండ్.సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సెక్షన్ 45 ఎస్ గురించి కాకుండా, ఉండవల్లికి ఈ కేసుతో ఏమి సంబంధం అన్నదానిపైనే ఇచ్చినట్లుగా ఉంది. తాను కేసు ఫిర్యాదుదారుడినని గతంలోనే కోర్టుకు తెలిపానని, దానిని పరిగణనలోకి తీసుకున్నందునే ఇంతకాలం కేసు సాగిందని ఆయన అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన ఒక ప్రశ్నకు రిజర్వుబ్యాంక్ సమాధానం ఇస్తూ హెచ్యూఎఫ్లు, అనధికార సంస్థలు డిపాజిట్లు వసూలు చేయరాదని, అది చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసిందని ఆయన వివరించారు. దీని ఆధారంగా తాను పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ సభ్యులను అప్రోచ్ అయి, ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలుసుకోవాలని కోరతానని ఉండవల్లి తెలిపారు.రామోజీరావు మరణించేవరకు సెక్షన్ 45 ఎస్ తమకు వర్తించదని వాదించేవారని, తర్వాత వారసులు కొత్త వాదన తీసుకువచ్చి ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం ఏమిటని అన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తప్పు చేసినా జరిమానా కట్టకుండా రామోజీ సంస్థ తప్పించుకుందన్నది విశ్లేషణగా ఉంటుంది. అన్నిటిని పరిశీలిస్తే ఉండవల్లి ఇంతవరకు చేసిన పోరాటానికి.. పూర్తి స్థాయిలో అర్ధవంతమైన ముగింపు వచ్చి ఉండకపోవచ్చు కాని, ఆయన చేసిన పోరాట స్పూర్తి మాత్రం ఎప్పటికి కొనసాగుతుంది. రామోజీ వంటి బలాఢ్యులు సైతం తప్పు చేస్తే, దానిని ఒప్పుకోకతప్పదని కూడా ఈ కేసు సారాంశంగా తీసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదులో అలసత్వం వహించారంటూ సీఐపై వేటు వేసింది. సుమంత్ను పట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంది. మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా ముత్తు యాదవ్ బాధ్యతలు చేపట్టారు.కాగా, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టుఅక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడుతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
హైదరాబాద్లో 'ఏక్చిత్ర న్యూ ఆర్ట్ గ్యాలరీ' ప్రారంభం..
హైదరాబాద్ నగరాన్ని కళలకు మరో కొత్త వేదికగా మార్చేందుకు ముందుకొచ్చింది ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ. పెయిటింగ్, శిల్పకళ, సెరామిక్స్, ఇన్స్టాలేషన్స్, ఫొటోగ్రఫీ, మిక్స్డ్ మీడియా, వివిధ కళారూపాల సమ్మేళంతో పాటు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కొత్త గ్యాలరీ పెద్ద పీట వేయనున్నట్లు ఆర్టిస్ట్, క్యురేటర్ ఏక్చిత్ర స్థాపకురాలు అన్నపూర్ణ మడిపడిగ తెలిపారు. వీటన్నింటికీ అనుగుణంగా విస్తృత స్థలం, ఇతర సౌకర్యాలు ఈ గ్యాలరీలో అందుబాటులో ఉన్నాయి. వర్ధమాన కళాకారులతోపాటు ప్రఖ్యాత కళాకారులకూ అనువైన వేదికగా ఈ ఏక్చిత్ర గ్యాలరీని రూపొందించినట్లు అన్నపూర్ణ తెలిపారు.ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్ట్ కలెక్టర్ అంజూ పొద్దార్, ప్రముఖ రచయిత, దర్శకుడు దేవకట్టా, రావు బహదూర్ ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా, యాదగిరిగుట్ట ప్రధాన ఆలయ శిల్పి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సీనియర్ కళాకారులు బీఏ రెడ్డి, శంకర్ పామర్తి హాజరై అన్నపూర్ణ, ఏక్చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఏక్చిత్ర కొత్త ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి ఎంఎస్ఎస్ రియాల్టీ, రెస్టారెంట్ అనగనగా తెలుగు కలినరీ టేల్స్ భాగస్వామ్యులుగా మారి మద్దతునిచ్చాయి.పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియో:ఈ ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీలో పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ప్రింట్ మేకింగ్ను ఒక ప్రత్యేక కళారూపంగా మార్చడం, దాన్ని ప్రోత్సహించడంలో ఈ గ్యాలరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అలాగే కళాకారులను ఈ మాధ్యమంతో అనుసంధానించడం కూడా ముఖ్య ఉద్దేశ్యంగా పని చేస్తుంది. అంతేకాదు.. శిక్షణ, ప్రయోగాలు, వర్క్ షాప్స్, స్క్రీనింగ్స్, డిబేట్స్, ఆర్ట్ ఎక్స్చేంజ్ మొదలైన అంశాల్లో కూడా కళాకారులకు ఈ గ్యాలరీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది.ఈ సందర్భంగా ఆర్టిస్ట్, ఏక్చిత్ర వ్యవస్థాపకురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ.. 'ఈ ఏక్చిత్ర గ్యాలరీ ప్రదర్శనలు, భాగస్వామ్యాలు, సంభాషణలతో పాటు కళాకారులు, ప్రేక్షకుల మధ్య ఏర్పడిన సంబంధాల వల్లే అభివృద్ధి చెందింది. ఎగ్జిబిషన్లకు వేదికగా మాత్రమే కాకుండా కళాకారులు, కళల మధ్య అనుబంధాలను పెంచుతూ.. సంభాషణలు, వర్క్ షాపులు వంటి సరికొత్త కార్యక్రమాలకు వేదిక కావాలన్నదే మా ముఖ్య ఉధ్దేశ్యం. వీటన్నింటికీ మా ఆర్ట్ గ్యాలరీ ఉపయోగపడాలని, దాన్నొక అవసరంగా మేము భావించాం' అని తెలిపారు. ఈ కొత్త గ్యాలరీ కళకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్స్, పరిశోధకులు, సాంస్కృతిక రంగానికి చెందిన వ్యక్తులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు భవిష్యత్తులో పలు అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు అన్నపూర్ణ వెల్లడించారు.ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ, 'కళతో మమేకమయ్యే ఇంటరాక్టివ్ ఆర్ట్ స్పేస్ లను నేను యూరప్ పర్యటనలో చాలా చూశాను. అలాంటి చోట నాకు టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టం. అవకాశం ఉన్నప్పుడు అక్కడి వర్క్ షాపుల్లో పాల్గొనేవాడిని. ఇప్పుడు ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ అలాంటి స్పేస్గా ముందుకురావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో నేను పాల్గొనేందుకు ఎదురుచూస్తుంటాను' అని చెప్పారు.దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ, 'ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ కళ, సృజనాత్మకతకు ఒక ప్రత్యేక గుర్తింపుగా మారాలని కోరుకుంటున్నాను. కళాకారులు, కళాభిమానులకు ఇది గొప్ప కమ్యూనిటీని ఏర్పర్చాలని ఆశిస్తుస్తున్నాను' అని తెలిపారు.మొదటి ప్రదర్శన : ట్రాన్సిషన్ఏక్చిత్ర న్యూ గ్యాలరీ.. ‘ట్రాన్సిషన్: ఎ కంటిన్యుటీ టు చేంజ్ - యాన్ ఓడ్ టు ఐడెంటిటీస్ ఇన్ ఫ్లక్స్’ అనే ఎగ్జిబిషన్ తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఇందులో పాల్గొంటారు. శిల్పకళ, పెయింటింగ్, సెరామిక్స్, ప్రింట్ మేకింగ్ మొదలైన విభిన్న కళారూపాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తారు. కళారూపాలతో వీళ్లంతా మన దేశ వారసత్వ సంపదలను ప్రపంచానికి చాటనున్నారు. ఈ కొత్త గ్యాలరీ గతంలో వేర్వేరుగా భాగాలుగా మారిన ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్, డెకరేటివ్ ఆర్ట్స్ ల మధ్య సంబంధాన్ని గుర్తుచేయనుంది.ఫౌండర్ కమ్ క్యురేటర్ అన్నపూర్ణ..ఆర్టిస్ట్, క్యురేటర్ అన్నపూర్ణ మడిపడిగ ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకురాలు. ఆమె హైదరాబాద్ కేంద్రంగా కళ, కథనం, జ్ఞాపకం, సంస్కృతి, ప్రాంతీయతలను ఒకచోటకు చేర్చే క్యురేటోరియర్ ప్లాట్ఫామ్ గా ఈ ఏక్ చిత్ర ను స్థాపించింది. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో ఆమె ఇప్పటివరకు 25కు పైగా ప్రధాన ప్రదర్శనలకు క్యురేటర్ గా వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాల కళా చరిత్ర, జీవన సంప్రదాయాలతో ఏక్చిత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆర్కిటెక్చర్, సాహిత్యం, చిత్రకళ , సంగీతం, హస్తకళలు, దేవాలయ సంప్రదాయాలు, దక్కనీ ప్రభావాలు, జానపద కళారూపాలు వంటి అంశాలపై కూడా ఆమె దృష్టి సారిస్తోంది.ఏక్చిత్ర భవిష్యత్ ప్రణాళికలు:లివింగ్ టెంపుల్ నుంచి బావ్లీ ఆర్ట్ సంగంఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ తమ కార్యకలాపాలపై పక్కా ప్రణాళికలు రూపొందించింది.- లివింగ్ టెంపుల్ - ఎడిషన్-2:ఈ కార్యక్రమం ద్వారా వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక వేదికలుగా మార్చడం. కళ, ఆర్కిటెక్చర్, సంప్రదాయ వ్యక్తీకరణ, ప్రజల భాగస్వామ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం.- కీర్తనం:ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల కళా చరిత్రకు అంకితం చేసే విధంగా రూపొందించనున్నారు. కళా చరిత్రలు, సాంస్కృతిక కథనాలకు అధిక ప్రాధాన్యం అందించడం.- బావ్లీ ఆర్ట్ సంగం:దీనిద్వారా హైదరాబాద్ లోని చారిత్రక మెట్ల బావులను కళా వేదికలుగా మార్చే ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం. మెట్ల బావులను కేంద్రంగా చేసుకుని, ప్రదర్శనలు, వర్క్ షాపులు, హెరిటేజ్ వాక్స్, టాక్స్ వంటి వాటిని ప్రోత్సహించడం. వారసత్వం, నీరు, ఆర్కిటెక్చర్ లకు సమకాలీన కళను అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.ఇటువంటి విభిన్న, అద్భుత ప్రాజెక్టులతో ఈ కొత్త ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ కళారంగానికి మరో చిరునామాగా మారనుంది. ప్రదర్శన, అభ్యాసం, భాగస్వామ్యం ద్వారా కళను కళాభిమానులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏక్చిత్ర ముందుకొచ్చింది. -
Hyderabad: వందేళ్ల సిటీ కళాశాలలో ప్రమాదం
చార్మినార్: వందేళ్ల చరిత్ర ఉన్న ప్రఖ్యాత సిటీ కళాశాల భవనంలోని కారిడార్ కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఫిజిక్స్ ల్యాబ్ వైపు ఉన్న కారిడార్ ఒక్కసారిగా కుప్పకూలింది. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మి, డాక్టర్ నీరజలు ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. కారిడార్ ఆదివారం కూలి ఉండవచ్చునని..తమకు మాత్రం సోమవారం ఉదయం తెలిసిందని కళాశాల అధికారులు చెబుతున్నారు. సిటీ కళాశాల పూర్వ విద్యారి్థ, చారి్మనార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. సిటీ స్కూల్గా ప్రారంభమై.. 6వ, ఆసిఫ్ జా కాలంలో మెహబూబ్ అలీ ఖాన్ 1865లో దారుల్–ఉల్–ఉలూం పేరుతో సిటీ స్కూల్గా ప్రారంభమై.. ఏడో ఆసిఫ్ జా ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో హైస్కూల్గా మారింది. 1929లో సిటీ కళాశాలగా ఉన్నతీకరించారు. 30 మందితో ప్రారంభమైన ఈ కాలేజీలో ప్రస్తుతం 6వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ అనే చీఫ్ ఇంజినీర్ ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఆన్లైన్లో ప్రాక్టికల్స్ ప్రస్తుతం సైన్స్ ల్యాబ్లు అన్నింటినీ మూసివేశారు. వారం రోజులు ప్రాక్టికల్స్ ఉండవని సంబంధిత ప్రొఫెసర్లు చెబుతున్నారు. అవసరమైతే ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. శిథిలావస్థకు చేరి.. ఈ కళాశాల ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. హెరిటేజ్ భవనం కావడంతో పురావస్తు శాఖ అధికారుల అనుమతితో మరమ్మతులు చేయించాల్సి ఉంది. కానీ గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఎప్పుడు వర్షాలు కురిసినా.. పైకప్పు తడిసి ముద్దయి..సైన్సు ల్యాబ్ లోకి నీరు కారుతుంది. అప్పుడప్పుడు పెచ్చులు సైతం ఊడిపడ్డాయి. సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ హెరిటేజ్ భవనం కావడంతో మరమ్మతులకు ఆలస్యమవుతుంది. వర్షాలలో ప్రమాదం పొంచి ఉండడంతో ఈనెల 20న చారి్మనార్ ఎమ్మెల్యే మీర్ జులి్ఫకర్ అలీతో పాటు ఉన్నతాధికారులకు సిటీ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం సమాచారాన్ని అందజేసింది. అప్పటికే పెచ్చులూడిపడటంతో ఫిజిక్స్ ల్యాబ్ మూసివేశారు. వందేళ్ల సిటీ కళాశాలలో ప్రమాదం -
హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ డాక్టర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ వైద్యుల దందాపై దాడులు నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. 11 మంది నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు. డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పేరుతో వైద్యం చేస్తున్నారు. నకిలీ వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. అర్హతలు లేకుండానే వైద్యం చేయడంపై ఆరా తీస్తున్నారు. నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.. నకిలీ డాక్టర్ల వైద్యంపై విచారణ చేపట్టారు.కాగా, గత ఏడాది కూడా అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 8 మంది నకిలీ డాక్టర్లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని బౌరంపేట్, దుండిగల్, సూరారం ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి అధిక స్థాయి మందులను రోగులకిచ్చి హాని కలిగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మెడికల్ బృందాలు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
టీ హబ్తో భారత ఆర్మీ ఒప్పందం
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ తాజాగా భారత ఆర్మీకి చెందిన సెంట్రల్ కమాండ్తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్న స్టార్టప్లకు సైన్యంతో కలిసి నేరుగా క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుంది. భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు సరికొత్త సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, వాటిని ధ్రువీకరించడానికి ఇది దోహదపడనుంది.భారత ఆర్మీ వెస్ట్రన్ కమాండ్తో టీ హబ్కు ఇప్పటికే ఉన్న భాగస్వామ్యానికి కొనసాగింపుగా ఈ తాజా ఒప్పందం నిలిచింది. దీంతో కమాండ్ స్థాయిలో రక్షణ దళాలతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన అతికొద్ది జాతీయ సంస్థలలో టీ హబ్ ఒకటిగా చేరింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐడెక్స్ పథకాన్ని అమలు చేస్తున్న 28 సంస్థలలో టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందింది.ఇప్పటివరకు 100కు పైగా రక్షణ స్టార్టప్లతో పనిచేస్తూ, 70కి పైగా ఛాలెంజ్లను పూర్తిచేసింది. ఈ పథకం ద్వారా టీ హబ్ స్టార్టప్లు రూ.4.2 కోట్లకు పైగా గ్రాంట్లు, రూ.9 కోట్ల విలువైన ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ డెలివరీల సహకారంతో సుమారు రూ.250 కోట్లకు పైగా వాణిజ్య రక్షణ ఆర్డర్లను సాధించాయి. ఈ భాగస్వామ్యం కింద ఆర్మీ సెంట్రల్ కమాండ్ అందించే నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే స్టార్టప్లను టీ-హబ్ ఎంపిక చేస్తుంది. స్టార్టప్లు, సైనిక భాగస్వాముల మధ్య కార్యక్రమాల సమన్వయాన్ని ఒక సంయుక్త పర్యవేక్షణ కమిటీ పర్యవేక్షిస్తుంది.ఈ సందర్భంగా టీ-హబ్ సీఈవో కవికృత్ మాట్లాడుతూ ‘సాంకేతికతలు క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే వ్యవస్థాపకులకు సైన్యంతో ప్రత్యక్ష సమన్వయం తప్పనిసరి. ఈ ఒప్పందం దానికి మార్గం సుగమం చేస్తుంది. భారతీయ రక్షణ స్టార్టప్ల నైపుణ్యంతో పాటు సంక్లిష్ట అవసరాలను తీర్చే సాంకేతికతలను రూపొందించడంలో హైదరాబాద్ సామర్థ్యంపై ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’ అని పేర్కొన్నారు. దేశీయ సాంకేతికతలను ప్రోత్సహించడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి తెలిపారు. క్షేత్రస్థాయి అవసరాలను తీర్చే స్టార్టప్ల ఆవిష్కరణలు సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయని వివరించారు.ఇది కూడా చదవండి: ఓణం హిందూ పండుగ కాదా?.. తెరపైకి కొత్త చర్చ! -
తల్లి చనిపోతే కీడు సోకుతుందని.. బావిలో పడేసిన కుమారులు
కరీంనగర్ జిల్లా: తల్లి ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందన్న మూఢనమ్మకంతో కొడుకులే ఆమెను బావిలో పడేసి హత్య చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ విలేకరులకు తెలిపిన వివరాలివి. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ (80)కు నలుగురు కుమారులు సమ్మయ్య, కుమారస్వామి, రవీందర్, శ్రీనివాస్. వెంకటమ్మ వయోభారం, అనారోగ్యంతో మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉండేది. ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందని, ఎవరి ఇంట్లో చనిపోయినా దోషం పట్టుకుంటుందని పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ భావించారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటమ్మను వ్యవసాయ బావిలో వేసి హత్య చేశారు. మర్నాడు తమ తల్లి కనిపించడం లేదని గ్రామంలో వెతికారు. కాగా, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు వ్యవసాయ బావి వద్దకు ఎలా వెళ్తుందన్న అనుమానంతో పాటు కొడుకుల ప్రవర్తనపై పోలీసులు విచారించారు. ఇంట్లో చనిపోతే కీడు సోకుతుందని మూఢనమ్మకంతో తల్లిని బావిలో వేసి హత్య చేసినట్లు సమ్మయ్య, శ్రీనివాస్ విచారణలో ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
ఫ్రిడ్జ్లో మృతదేహం కేసుపై సుప్రీంలో తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: సుమారు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడి కిడ్నాప్, హత్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో దాచిన ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. కింది కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల లేమిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తుది తీర్పును వాయిదా వేసింది.సుప్రీంలో సుదీర్ఘ వాదనలు..విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోయాడని, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ.. పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ప్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ.. ఘట నా స్థలంలోని ఫ్రిడ్జ్పై ఉన్న వేలిముద్రలు శ్రీధర్వేనని ఫొరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిందన్నా రు. ఘటనకు ముందు బాధితుడిని నిందితుడే ప్లాట్కు తీసుకెళ్లడాన్ని వాచ్మన్ చూశాడని, మృతుడికి చెందిన ఆర్టీసీ బస్ పాస్ కూడా నిందితుడి వద్దే లభ్యమైందని కోర్టు దష్టికి తీసుకొచ్చారు.ధర్మాసనం వ్యాఖ్యలు..వాదనలు విన్న జస్టిస్ పార్దివాలా ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టు శిక్ష పడిన నలుగురిని హై కోర్టు విడుదల చేస్తే వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి.. ఒకే వ్యక్తిపై హత్యానేరా న్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఇంటి ఓనర్కు నిందితుడు ఎవరో తెలియదని, కేవలం వాచ్మన్ మాత్రమే చూశానని చెప్పడాన్ని ‘లాస్ట్ సీన్’ కింద మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. మృతుడికి చెందిన బస్ పా స్ నిందితుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలంటూ ప్రాసిక్యూషన్ను ప్రశ్నించింది. సరైన ఆధారాలు నిరూపించకుండా 16 ఏళ్లుగా ఒక వ్యక్తి జైలులో ఉండటంపై స్పంది స్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.గతంలో ఏం జరిగిందంటే..: 2011 జూన్లో జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్కు వచ్చి అదశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితుడి తండ్రి రూ.1.50లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ప్లాట్లోని ఫ్రిడ్జ్లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటాలకు సంబంధించి 65–బీ సర్టిఫికెట్ లేకపోవడంతో పాటు పలు సాంకేతిక కారణాలతో హై కోర్టు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్లాట్ అద్దెకు తీసుకున్నది, బాధితుడిని చివరిసారిగా అక్కడికి తీసుకెళ్లింది శ్రీధర్ కావడంతో సెక్షన్ 106 కింద అతడి శిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ తీ ర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. కొడుకు వరుసైన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం -
చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు.వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం పరారైంది. వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన దివ్య (35) చిన్నపాటి ఆనారోగ్య సమస్యతో మారేడుపల్లిలోని బృందావన్ ఆసుపత్రిలో చేరారు.వారం రోజుల క్రితమే ఆమెను పరీక్షించిన వైద్యులు సోమవారం ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో, ఆదివారం రాత్రి అడ్మిట్ అయ్యారు. సోమవారం ఉదయం చికిత్స ప్రారంభించారు. తొలుత పేషెంట్కు రక్త స్రావం అవుతోందని.. అదనపు రక్తం కావాలని చెప్పారు. ఇంతలోనే పెషెంట్ వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయని, బ్లడ్ సెల్స్ తెప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరికొద్ది సేపటికి పేషెంట్ మృతి చెందినట్లు చెప్పి, మృతదేహాన్ని అక్కడే వదిలేసి వైద్యులు తప్పించుకున్నట్లు మృతురాలి బంధువులు పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు దిగడంతో మరికొందరు బంధువులు కూడా మద్దతు పలికారు.ఆసుపత్రి అద్దాలు, పూలకుండీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఆసుపత్రి యాజమాన్యం, బాధితులతో మాట్లాడారు. ల్యాప్రోస్కోపీ సమయంలో ప్రమాదవశాత్తూ వెయిన్ తెగిపోవడంతో తీవ్రంగా రక్తస్రావంతో పాటు పెషెంట్ గుండెపోటుకు గురై ఉంటుందని వైద్యులు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు రాతపూర్వక సమాధానం అనంతరం బాధితులు శాంతించినప్పటికీ, నిర్లక్ష్యపు వైద్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.కేసు నమోదు... మృతురాలి భర్త వికాస్ ఫిర్యాదు మేరకు అస్పత్రి వైద్యులు శ్రీకాంత్, గీతాంజలి పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు.ఎమ్మెల్యే పరామర్శ.. దివ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరామర్శించారు. బృందావన్ ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. -
చిక్కిన నకిలీ డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: డబ్బులు డబుల్ చేస్తామని వ్యాపారి నుంచి రూ.1.20 కోట్లు కాజేసిన కేసులో కీలక నిందితుడు నకిలీ డీఎస్పీ కొండూరు రెడ్డి వెంకట్ రాజు ఎట్టకేలకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదేళ్లుగా పరారీలో ఉన్న అతడిపై మరో మూడు కేసులు ఉన్నట్లు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం వెల్లడించారు.మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఆయన స్నేహితుడు కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్లు ఇస్తాడని చెప్పగా.. సునీల్కుమార్ నమ్మలేదు.దీంతో 2019 అక్టోబర్ 28న అప్పుడు సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.మునిరామయ్యను జయప్రతాప్ హైదరాబాద్ తీసుకువచ్చి సునీల్ కుమార్ను కలిశారు. రూ.1.20 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ మునిరామయ్య నమ్మించారు. ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్ ప్రశ్నించడంతో.. మునిరామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రాజు అనే వ్యక్తిని తీసుకువచ్చి టాస్క్ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు.డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ ఒప్పించారు. రెండేళ్లయినా డబ్బు తిరిగిరాకపోవడంతో సునీల్కుమార్ ఆరా తీయగా రాజు అనే డీఎస్పీనే లేరని తేలింది. సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, రాజు సహా ఐదుగురిపై 2021లో కేసు నమోదు చేశారు. 2021, 2022లో కొందరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూడో డీఎస్పీ రాజు బెంగళూరులో ఉన్నట్లు టీమ్–5 ఏసీపీ కె.కిరణ్ కనిపెట్టి పట్టుకున్నారు. -
సమయం లేదు వినాయకా!
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పండుగకు కేవలం 20 రోజుల సమయే ఉండగా..మట్టి గణపతి విగ్రహాల పంపిణీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎలాంటి కదలిక లేదు. పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు, పొల్యూషన్ను అడ్డుకునేందుకు ప్రతి ఏటా పీసీబీ లక్షల సంఖ్యలో మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటుంది. ఈమేరకు దాదాపు రెండు నెలల ముందుగానే విగ్రహాల తయారీ, టెండర్లు, కాంట్రాక్టర్లకు అప్పగింత వంటి పనులు మొదలవ్వాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉండగా..ఇప్పటికీ టెండర్లే పిలవలేదు. దీంతో విగ్రహాల పంపిణీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టెండర్ల ప్రక్రియను తూతూ మంత్రంగా మార్చేందుకే ఇలా జాప్యం జరుగుతోందన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. గత ఏడాది కూడా విగ్రహాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారం ఆలస్యమై చివరి నిమిషం వరకు గందరగోళం ఏర్పడింది. దాన్ని అనుభవంలోనికి తీసుకునైనా ఈ ఏడాది అధికారులు స్పందించడం లేదు. లక్ష్యం 3.26 లక్షలు పీసీబీ ఈ ఏడాది 3,26,471 మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ గుత్తేదారుల నుంచి టెండర్లు పిలవడంలో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది. టెండర్లు తెరిచి తక్కువకు కోట్(ఎల్–1) చేసిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఉన్న ఈ తక్కువ సమయంలో ఎల్–1 గుత్తేదారుకు 3.26 లక్షల విగ్రహాల తయారీ, పంపిణీ సాధ్యమయ్యే వి షయమేనా అన్నదే అసలు సమస్యగా కనిపిస్తోంది. 40 శాతం గోల్మాల్.. గత ఏడాది పీసీబీ అధికారులు 2.20 లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సరిపడా సమయం లేకపోవడంతో చివరి క్షణంలో ఎల్–1 గుత్తేదారు మొత్తం మేం సరఫరా చేయలేమని చెప్పడంతో అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. టెండరులో పాల్గొన్న అందరిని పిలిచి సనత్నగర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు ఎన్ని విగ్రహాలను సరఫరా చేయగలరో అన్ని ఇవ్వండని సూచించారు. దీంతో సుమారు 40 శాతం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయకుండానే అక్రమంగా బిల్లులు పొందారని పీసీబీ సిబ్బంది పేర్కొంటున్నారు. ‘దేవుడి విగ్రహాల విషయంలో ఇలా చేస్తారని అనుకోలేదు. నమ్మకంతో అప్పగిస్తే కాకిలెక్కలు చెప్పారు’ అని ఓ ఉన్నతాధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. -
గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి
నాగర్కర్నూల్ జిల్లా: ఆ కుటుంబంపై మృత్యువు పగబట్టింది. ఉదయం విధులకు బయలుదేరిన తల్లి బస్టాండ్లోనే అకస్మాత్తుగా మృతి చెందగా, ఈ విషాద వార్త తెలుసుకుని పరామర్శించేందుకు వస్తున్న కుమారుడు, కోడలు, అల్లుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో కోడలు, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ముగ్గురూ మృత్యువాత పడటంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రాయవరం గ్రామానికి చెందిన లావుడ్యా లలిత (50) గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. సోమవారం విధులకు వెళ్లేందుకు అచ్చంపేట బస్టాండ్కు చేరుకున్న ఆమె అక్కడే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు.. లలిత మృతి విషయం తెలుసుకున్న హైదరాబాద్లో నివాసముంటున్న ఆమె కుమారుడు శ్రీకాంత్, కోడలు చంద్రకళ (32), అల్లుడు నాగరాజు (35) అచ్చంపేటకు బయలుదేరారు. ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై వస్తుండగా నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కోడలు చంద్రకళ, అల్లుడు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో రాయవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. -
డబ్బులిస్తే ఎంతటి ఉల్లంఘన అయినా బలాదూరే..
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణం.. అధికారుల నోటీసులు.. క్రమబద్ధీకరణ ప్రయత్నం.. కోర్టు జోక్యం.. మళ్లీ అక్రమ నిర్మాణం..చర్విత చరణం. ...ఇదీ హైదరాబాద్ మహానగరం తీరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న సమస్య. ప్రభుత్వాలు మారాయి.. పథకాలు మారాయి.. నిబంధనలు మారాయి.. కానీ అక్రమ నిర్మాణాలను పుట్టుకలోనే అడ్డుకునే వ్యవస్థ మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. టౌన్ ప్లానింగ్ అంటే..హైదరాబాద్ మహానగరంలో మనీ ప్లానింగ్గా మారింది. గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. నిర్మాణాన్ని అడ్డుకోవడంలో సంబంధిత టౌన్న్ప్లానింగ్ అధికారి విఫలమయ్యారంటూ సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై విస్తృత తనిఖీలకు, ఉల్లంఘనలున్న చోట కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత యంత్రాంగం రంగంలోకి దిగింది. కానీ, భవనం కూలితేనే మేల్కొంటారా.. అప్పటిదాకా నిద్రపోతారా? అనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి. ఎప్పటి నుంచో .. అక్రమ నిర్మాణాలనుక్రమబద్ధీకరించేందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2008లో బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) తెచ్చారు. అప్పట్లోనే 2.05 లక్షల దరఖాస్తులందాయి. అక్రమ నిర్మాణాలను ఒకసారి క్రమబద్ధీకరించి సమస్యకు శాశ్వత ముగింపు పలకాలని అప్పటి ప్రభుత్వం భావించింది. తర్వాత టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చాక 2015లోనూ అలాంటి ప్రయత్నమే చేసింది. పేరు మాత్రం బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)గా మారింది. అంతే తేడా. దాదాపు 1.27 లక్షల దరఖాస్తులందినట్లు అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుల ఆదేశాలతో ఆ దరఖాస్తులకు మోక్షం రాలేదు.ఇంకా పెరిగాయి.. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు రాకుండా అధికారులు శ్రద్ధ చూపలేదు. పైపెచ్చు అక్రమార్కులతో చేయి కలిపి వారికి అండగా ఉండటంతో మరిన్ని అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయ నే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు రెండు లక్షల దాకా ఉంటాయని అంచనా. అలాంటి వాటిల్లోదే గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం. దీని వెనుక ‘పొలిటికల్ పవర్ ’ ఉందనే ఆరోపణలున్నాయి. బీపీఎస్, బీఆర్ఎస్లకు అందిన దరఖాస్తుల్లోనూ సింహభాగం కూకట్పల్లి జోన్వి కావడం విశేషం. తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్లున్నట్లు సమాచారం. నోటీసులతో మమ ఏ ప్రమాదం జరిగినా అంతకుముందే నోటీసులిచ్చినట్లు అధికారులు చెబుతారు. తమపైకి రాకుండా ఉండేందుకు అదో నైపుణ్యం. సాధారణ ప్రజల సెట్బ్యాక్లలో స్వల్ప ఉల్లంఘనలు కనిపిస్తే పదేపదే సతాయించే అధికారులకు భారీ భవంతులెందుకు కనిపించవో వేరుగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇవే ప్రశ్నలు వేశాయి. అక్రమ భవనాన్ని కూల్చడం మాత్రమే కాదు.. అది అక్రమంగా నిలబడేలా చేసిన వ్యవస్థనూ ప్రశ్నించాలన్నాయి. అంతేకాదు, చట్టవిరుద్ధ నిర్మాణాలను కేవలం కాలం గడిచిందనే సాకుతో కొనసాగించేందుకు వీల్లేదని స్పష్టం చేశాయి. చట్టబద్ధంగా క్రమబద్ధీకరించలేని నిర్మాణాన్ని తొలగించాల్సిందేనని పేర్కొంటూ, అక్రమ నిర్మాణం ఎలా ఏర్పడిందో, అందులో అధికారుల పాత్రపై కూడా విచారణ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని జీహెచ్ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. బహుశా, ఈ నేపథ్యంలోనే కావచ్చు కొత్తగా రానున్న క్యూర్ చట్టంలో పకడ్బందీ ప్రతిపాదనలున్నాయి.80 శాతం ఫిర్యాదులు టౌన్ప్లానింగ్పైనే.. సోమవారం ప్రజావాణిలో సీఎంసీలో అందిన మొత్తం ఫిర్యాదులు 47 కాగా, టౌన్ప్లానింగ్వే 38 ఉన్నాయి. అంటే 80 శాతం. ఎంఎంసీలో మొత్తం 23 ఫిర్యాదుల్లో టౌన్ప్లానింగ్వి 19 అంటే 82 శాతం. వీటిని బట్టి నగరంలో అక్రమ నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ నిజంగా అక్రమాలు అరికట్టడానికేనా ? అంటే కాదు. అక్రమ నిర్మాణదారులను డబ్బులు డిమాండ్ చేసేందుకు ఫిర్యాదులిచ్చేవారే ఇందులో ఎక్కువగా ఉంటారని సమాచారం. అంటే అక్రమాల ఆధారంతో మరో అక్రమం. ఇదీ నగరంలో టౌన్ (మనీ)ప్లానింగ్కు మరో ఉదాహరణ. -
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
రక్షణ గృహాల్లోని చిన్నారుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రక్షణ గృహాల్లోని చిన్నారుల సంఖ్య, అక్రమంగా దత్తత పొందినట్టు అనుమానించి స్వా«దీనం చేసుకున్న చిన్నారులు, ప్రభుత్వ స్పాన్సర్షిప్ పథకం లబ్ధిదారులు, ఫోస్టర్ కేర్ పథకం కింద ఉన్న చిన్నారులు.. ఇలా పలు వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శిశువుల అక్రమ రవాణాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమంగా దత్తత తీసుకున్న 9 మంది చిన్నారులను గుర్తించి రక్షించినా, అసలు తల్లిదండ్రులను గుర్తించకపోవడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ వచ్చే నెల 2కు వాయిదా వేస్తూ ఆలోగా పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అవయవాల అక్రమ రవాణా, భిక్షాటన.. నల్లగొండకు చెందిన ఎం.వెంకన్న–స్రవంతి దంపతులకు సంతానం లేకపోవడంతో యాదగిరి ద్వారా ఓ చిన్నారి(శరణ్య)ని దత్తత తీసుకున్నారు. పిల్లలను అమ్ముతున్నాడన్న ఫిర్యాదు మేరకు యాదగిరిపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా శరణ్యను బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కన్న తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి ద్వారా పొందిన దత్తత చెల్లదన్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకన్న అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ సంరక్షణలోని పిల్లల పూర్తి వివరాలను 2వారాల్లో సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, హోంశాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలన్నారు. సంబంధిత శాఖల్లో డైరెక్టర్ లేదా అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని అధికారులు స్వయంగా సమగ్ర నివేదికలు సమర్పించాలని చెబుతూ, విచారణ వాయిదా వేశారు. -
మనం గెలిచింది 2% ఓట్ల తేడాతోనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచి్చంది కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనేనని.. ఇప్పుడు లక్షల ఓట్లను ఎన్నికల సంఘం ద్వారా కేంద్రం మాయం చేస్తోందని.. ఇది చాలా ప్రమాదకరమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూ డా పోకుండా పార్టీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవా లని ఆమె ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రెండో దశపై సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ‘జూమ్’సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎస్ఐఆర్ అసెంబ్లీ, పార్లమెంటు సమన్వయకర్తలు, డీసీసీ అ«ధ్యక్షులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్లో భాగంగా ఏం జరిగిందన్న దానిపై ప్రత్యేక నివేదికలు తయారు చేస్తామని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో బాగా పనిచేసే వారికే మళ్లీ టికెట్లు ఇస్తామ ని.. పనిచేయకుండా టికెట్ ఇవ్వాలంటే కుదరదని మీనాక్షి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ను, రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కుట్రను గమనించి ప్రతి ఒక్కరూ సీరియస్గా పనిచేయాలన్నారు. ఎస్ఐఆర్లో నిర్లక్ష్యం వద్దు: మహేశ్కుమార్గౌడ్ పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్లో కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందువల్ల నేతలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని.. రెండోదశలో మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ నెల 27న జరిగే సభలు కీలకమన్నారు. పార్టీ నేతలు జాగ్రత్తగా లేకపోతే నష్టపోతామని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటును పరిశీలించాలని చెప్పారు. ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షులు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అదే పనిలో నిమగ్నం కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఎమ్మెల్యేల పనితీరుపై మహేశ్కుమార్గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల కోసం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా నేతల జాబితాలను పంపాలని కోరినా ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. మండల కమిటీలన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని.. సహకార సంఘాల కమిటీల ప్రతిపాదనలను కూడా వెంటనే పంపాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలను మహేశ్గౌడ్ కోరారు. ఈ భేటీలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎస్ఐఆర్ రాష్ట్ర సమన్వయకర్త గంపా వేణుగోపాల్, టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ రాజేశ్ పాల్గొన్నారు.మంత్రి సురేఖ అంశం ఏఐసీసీ చూస్తోంది మెదక్ జోన్: పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని.. మంత్రి కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక పీసీసీ, ఏఐసీసీకి అందిందన్నారు. త్వరలోనే ఏఐసీసీ పెద్దలు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఉమ్మడి జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రావు, పార్టీ నేతలు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. -
ఇది జెన్జీ యుగం
సాక్షి, హైదరాబాద్: ఇది జెన్జీ యుగమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారని (అవుట్డేట్) ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్లు పాతవైపోయాయి. ఇప్పుడు యువత ఇన్స్టాగ్రాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రేవంత్ సోమవారం విలేకరుల సమావేశం అనంతరం కాసేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను బీఆర్ఎస్ విస్తృతంగా వినియోగిస్తోందని, దీనికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేయాలన్నారు. ‘నాడు ఎకరం రూ.100 కోట్లకు అమ్మితేనే సంకలు గుద్దుకున్నారు. కానీ నేను ఎకరం రూ.260 కోట్లకు అమ్మా. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం ఊపందుకుంటోంది. ఇటీవలి కాలంలో రియల్ కార్యకలాపాలు 18 శాతం పెరిగాయని నివేదికలు చెపుతున్నాయి. ఇవేవీ సోషల్మీడియాలో కనిపించవు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కోసం స్మార్ట్ కార్డులు తెచ్చాం.కానీ సంగారెడ్డిలో పంపిణీ చేసిన ఆ ఒక్క రోజే ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత అందరూ మర్చిపోయారు’ అని చెప్పారు. ఎమ్మెల్యేలందరూ వారి కార్యక్రమాలతోపాటు రాష్ట్ర పార్టీ, ఏఐసీసీ కార్యక్రమాలను కూడా సోషల్ మీడియాలో పెట్టాలని, ఇందుకోసం ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే సిబ్బందికి ఐ అండ్ పీఆర్ శాఖతో ఓరియంటేషన్ క్లాస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మనందరం కలిసి పనిచేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా పనిచేస్తే 100కు పైగా సీట్లు గెలుస్తామన్నారు. అలాగే, 22ఏ భూముల గురించి ఎవరూ మాట్లాడొద్దని. ఇది మన హయాంలోనే వచి్చంది కాదని, ఈ సమస్య బీఆర్ఎస్ హయాంలో కూడా ఉందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వివాదాలొద్దు... ఎమ్మెల్యేలందరూ వివాదాల జోలికి వెళ్లకుండా నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేస్తామని, వెంటనే ఆ పనుల మీద దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, కార్యక్రమ నిర్వహణకు సంబంధించి విప్లు సభ్యులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్ సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమయి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, కోరం కనకయ్య, తోట లక్ష్మీకాంతరావు, రాందాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, మురళీ నాయక్, యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు.ఏ ఒక్కరి కోసమో కాదు: భట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారం లేకపోతే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసునని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు. అధికారం వచి్చన తర్వాత కష్టపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పారీ్టని, ప్రభుత్వాన్ని ఫణంగా పెట్టుకోలేమని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేలా అందరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.క్రమశిక్షణ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేకొండా సుస్మిత వ్యవహారంపై సీఎం స్పందనసాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ తనపై చేసిన ఆరోపణలు, విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా స్పందించడానికి నిరాకరించారు. ఈ వివాదంపై విలేకరుల సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ అంశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, కమిటీ తీసుకునే నిర్ణయాన్ని పార్టీ, తాము, అందరూ కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు. ఊహాజనిత అంశాలను ప్రస్తావించవద్దని మీడియాను కోరారు. -
తెగని ‘నీటి’ లెక్కలు
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల ఈఎన్సీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నీటి కేటాయింపులపై చర్చించేందుకు సెప్టెంబరు 4న మళ్లీ సమావేశం నిర్వహిస్తామని త్రిసభ్య కమిటీ కనీ్వనర్ అయిన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి.. నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు చైర్మన్కు సిఫార్సు చేసేందుకు సోమవారం హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి సతీష్ కాంబోజ్, ఏపీ ఈఎన్సీ కె. నరసింహమూర్తి, తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబరు 31 వరకు తమ రాష్ట్ర అవసరాలకు 47 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్సీ కోరారు. అలాగే, వచ్చే ఏడాది జూన్ వరకూ 112 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు. దీనిపై ఏపీ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది జూన్ వరకూ గంపగుత్తగా కాకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి ఎంతమేరకు నీటి అవసరమో చెప్పాలని కోరారు. దాంతో అక్టోబరు 31 వరకు తమకు కూడా 47 టీఎంసీలు కేటాయించాలని, ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాల్లో తమకు 50 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాల్లో 70 శాతం వాటా ఆంధ్రప్రదేశ్కు, 30 శాతం వాటా తెలంగాణకు కేటాయిస్తూ గతంలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. తమకు 50 శాతం వాటా కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ జోక్యం చేసుకుంటూ.. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబరు 4న మళ్లీ నిర్వహిస్తామని.. అప్పుడు నీటి లభ్యత, అవసరాలు, కేటాయింపులపై చర్చించి, నిర్ణయం తీసుకుందామన్నారు. ఇందుకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. -
రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రామగుండంలో నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత ప్రభుత్వ సంస్థలకు చెందిన 54 వెబ్సైట్లపై అధునాతన డీడీఓఎస్ (డిస్టర్బ్ డేనియల్ ఆఫ్ సర్వీస్) సైబర్ దాడులకు యత్నించిన కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ బృందాలు తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేప ట్టాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ, సైబర్ క్రైమ్ అధికారుల బృందం సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ప్రత్యేక వాహనాలతోపాటు స్థానిక పోలీసుల సహకారంతో అయోధ్యనగర్కు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఈఈఈ చదువుతున్న ముజామిల్ ఖాన్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో, సైబర్ దాడుల కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు అతడిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముజామిల్ ఖాన్ను అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో విచారణ కొనసాగించినట్టు సమాచారం. టెలిగ్రామ్ గ్రూపుపై ప్రత్యేక ఆరా... కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం టెలిగ్రామ్ యాప్లో ‘ఏఐపై ప్రత్యేక శిక్షణ’ఇస్తామంటూ వచ్చిన సందేశం ఆధారంగా ముజామిల్ ఓ గ్రూపులో చేరినట్టు తెలుస్తోంది. ఆ గ్రూపులో కొన్ని వివాదాస్పద సందేశాలపై గొడవలు జరగడంతో సుమారు ఏడాదిన్నర క్రితమే తాను ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చినట్లు విద్యార్థి అధికారులకు వివరించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెలిగ్రామ్ గ్రూపులో సంఘవిద్రోహ లేదా సైబర్ దాడులకు సంబంధించిన చర్చలు జరిగాయా? అందులోని సభ్యులెవరు? గతంలో గ్రూపులో ఉన్న వ్యక్తులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయా? అనే కోణాల్లో ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. సోదాల సందర్భంగా ముజామిల్కు చెందిన సెల్ఫోన్, ల్యాప్టాప్తోపాటు ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను అధికారులు పరిశీలించారు. సోదాల్లో మొత్తం 3 ల్యాప్టాప్లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లతో పాటు ఇతర డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విచారణకు అవసరమైనప్పుడు హాజరు కావాలని విద్యార్థికి సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
అధిష్టానం కోర్టులోకి!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులోకి చేరింది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే సోమవారం రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అటు విలేకరుల సమావేశంలోనూ ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలోనూ సురేఖ అంశంపై స్పందించారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని విలేకరుల సమావేశంలో చెప్పిన ఆయన.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని సూచించారు. ‘పాజిటివ్ వద్దు.. నెగెటివ్ వద్దు.. సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఫుల్స్టాప్ పెట్టండి... విషయం హైకమాండ్ దగ్గరకు వెళ్లింది కదా. వారు నిర్ణయం తీసుకోవాలి.’అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానంపై ప్రాథమిక నివేదికను పార్టీకి అందజేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లకు కమిటీ చైర్మన్ మల్లురవి సోమవారం ప్రాథమిక నివేదికను అందజేశారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా సుస్మిత, సురేఖల అంశంపై పీసీసీ నుంచి కూడా ఏఐసీసీకి ఓ నివేదిక వెళుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ పెద్దలకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని, అక్కడ జరిగే చర్చలో సీఎం, పీసీసీ చీఫ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. నాడు అడ్డుకున్నదెవరు? ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా సురేఖ కుమార్తె సుస్మిత తననుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీఎం రేవంత్ చాలా సీరియస్గా తీసుకున్నారని, ఈ అంశంపై అధిష్టానం దగ్గర చర్చ జరిగినప్పుడు కొండా కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అడ్డుకున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే మరోమారు సుస్మిత సీఎం మీద మాట్లాడగలిగారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి తాను కూడా కాపాడలేనని ఇటీవల మహేశ్గౌడ్ నిజామాబాద్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారంటుండడం గమనార్హం. కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య కూడా చర్చకు వచ్చింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో తెలంగాణ రైజింగ్–2027 సమీక్షకు ముందు తాజా రాజకీయ వివాదం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. సురేఖ విఫలమయ్యారు: క్రమశిక్షణ కమిటీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖ కుమార్తె సుస్మిత పదేపదే సీఎంను కించపరిచేలా, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుంటే ఆమెను నియంత్రించడంలో సురేఖ విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. తాము సుస్మిత మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించామని, సురేఖ సమాధానాలను కూడా పరిశీలించామని, అన్నింటినీ పరిశీలించిన మీదట క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సురేఖ అర్హురాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఏఐసీసీ నిర్ణయమని టీపీసీసీ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. -
చెక్కులు ఎమ్మెల్యేలే ఇవ్వాలా?
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని చట్టంలోగానీ, రాజ్యాంగంలోగానీ ఉందా అని అడిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ శాసనసభ్యులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ల(ఐఏ)పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ఆ నగదు ప్రజాధనం నుంచి వస్తుంది కదా.. దానికి, ప్రజాప్రతినిధులకు ఏం సంబంధమని, వాటిని పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అని నిలదీసింది. ప్రాజెక్టులు, రహదారులు, ఇతర ప్రజావసరాలకు భూములిచ్చిన దేశ నిర్మాతలైన రైతులకు పరిహారం చెల్లింపు మాటేంటని ప్రశ్నలు సంధించింది. రాజధానిలో రహదారులు, సిగ్నళ్ల వద్ద చిన్నారులు, మహిళలు యాచిస్తున్నారని, భావి భారత పౌరుల సంక్షేమం పట్టదా, వీరు సంక్షేమం పరిధిలోకి రారా అని వ్యాఖ్యానించింది. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఖర్చు చేసే ప్రతీ పైసాకు చట్టబద్ధత అవసరమని స్పష్టం చేసింది. అనంతరం.. పూర్తి వివరాలు అందజేసేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతించిన ధర్మాసనం, తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం.. పథకాల చెల్లింపుల జీవోలపై స్టే ఇచ్చిన విషయం విదితమే. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రజాధనం పంపిణీకి ఎమ్మెల్యేలు ఎందుకు? సంబంధిత జీవో ప్రకారం.. లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గ ఎమ్మెల్యే కౌంటర్ సైన్ చేయాలని ఇంప్లీడ్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది వివరించారు. జీవోలను రద్దు చేయలేదని, సస్పెండ్ చేయలేదని, ఎమ్మెల్యేలను కేసులో ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ వంటి ప్రక్రియలను అధికారులు నిర్వహిస్తున్నప్పుడు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఎందుకని నిలదీశారు. ప్రజాధనం పంపిణీలో రాజకీయ జోక్యానికి తావు ఉండకూడదని.. ఎమ్మెల్యేలు వెళ్లి చెక్కులు ఇవ్వడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం లేదని, అవసరమైన వారికి సంక్షేమ ప్రయోజనాలు అందాల్సిందేనని పేర్కొన్నారు. అమలు విధానమే చట్టబద్ధంగా ఉండాలని చెబుతున్నామన్నారు. పరిహారం కోసం 8 నెలలుగా... భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 నెలలుగా అందరూ ఎదురు చూస్తున్నారని.. అభివృద్ధి కోసం సొంత ఇళ్లు, భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాంటి రైతులు, ఇతరులతోనే దేశ నిర్మాణం సాగుతోందని చెప్పారు. భూసేకరణ బాధితుల పరిహారం చెల్లింపులు ఏ దశలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీ ఇమ్రాన్ఖాన్ను ఆదేశించారు. ఎవరైనా సామాజిక సంక్షేమం కింద ప్రయోజనం కోరితే, అది అవసరానికి అనుగుణంగా ఉండాలని.. సంక్షేమం ఎప్పుడూ అవసరంపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నిరాశ్రయులు, నిరుపేదలు, బాలలు, మహిళలు వంటి అనేక వర్గాలు సంక్షేమం కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భిక్షాటన చేస్తున్న పిల్లలున్నారు.. ఆధార్ కార్డు కూడా లేని చిన్నారులున్నారు.. నిరాశ్రయ మహిళలున్నారు. వారందరూ సామాజిక సంక్షేమ పరిధిలోకి వస్తారని వ్యాఖ్యానించారు. వికలాంగ యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే జీవో 4ను తాత్కాలిక స్టే నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి.. న్యాయవాది విజయ్గోపాల్ వాదనలు వినిపిస్తూ.. తెలుగు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘తెలుగు స్క్రైబ్’ను మొత్తంగా నిలిపివేయాలని కోరారు. ఆ ఖాతా నిర్వాహకుడి వివరాలు తెలియడం లేదని, అతనిపై 50కి పైగా క్రిమినల్ కేసులున్నాయని, అతడి చిరునామా తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రవాద నిరోధక చట్టాల నిబంధనల కింద కూడా ప్రయత్నాలు చేశారన్నారు. దీనిపై మెటా తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ పేర్కొన్న యూఆర్ఎల్పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, పథకాల అమలుపై సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని, పేద యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై త్వరలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
తెలంగాణకు అవమానం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం.. వ్యక్తిగా రేవంత్రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. దీనికి కారణం గుజరాత్ ఆధిపత్యం. దేశ ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అన్న విషయ విజ్ఞానంతో వ్యవహరించడం లేదు. ఇది తెలంగాణకు జరిగిన అవమానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేవంత్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం హోదాలో అభివృద్ధి కోసం చేసే పర్యటనను అడ్డుకుని తెలంగాణ పట్ల కేంద్రం స్పష్టమైన వివక్ష ప్రదర్శించింది. ఈ అంశాన్ని మా నాయకులు రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులంతా పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు’ అని సీఎం మండిపడ్డారు. ‘తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో వెళ్తున్నామని గతంలో నేను, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లేటప్పుడు పెట్టిన విధానంలోనే దరఖాస్తు పెట్టాం. రాజకీయ కోణంలో అనుమతిని తిరస్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ జవాబు ఇచ్చింది. రాజకీయ కారణం ఏమిటని మోదీని ప్రశ్నిస్తున్నా. మీరు (మోదీ) ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటించి వైబ్రెంట్ గుజరాత్ అనే పాలసీని ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేసి, పెట్టుబడులు పెట్టాలని కోరడానికి అనుమతిచ్చారు. అదే తెలంగాణ రైజింగ్–2047 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం సీఎంగా అమెరికా పర్యటనకు వెళ్తానంటే నిరాకరిస్తారు. ఇంగ్లండ్, అమెరికా రెండింటికీ ఒకే విధానం, ఒకే అంశాలతో విదేశీ పర్యటన తలపెట్టాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనకుంటే ఇంగ్లండ్కు అనుమతి ఎందుకు ఇచ్చారు? అమెరికా పర్యటనకు ఎందుకు తిరస్కరించారు?’ అని రేవంత్ కేంద్రంపై మండిపడ్డారు. మోదీకి బానిసలుగా ఉంటారా? ‘అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరిస్తూ కేంద్రం రాజకీయ కారణాలను అపాదించడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. గుజరాత్ను సమర్థించి మోదీ, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా బతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటదలుచుకున్నారా? అని బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్కు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే కుట్రతో నా పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై నేను స్పందించి విదేశీ వేదికపై నుంచి మాట్లాడి ఉంటే.. చూసినవా, దేశ ద్రోహి, విదేశాల్లో భారత దేశ గౌరవానికి భంగం కలిగించిండు అని విమర్శిస్తారనే ఇక్కడికి వచ్చాక ఖండిస్తున్నం. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీఎం అన్నారు. లక్ష్యాన్ని ఆపలేరు.. ‘ఇంగ్లండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లే వారు ఒక బృందాన్ని హైదరాబాద్కు పంపించి ఇక్కడ తమ క్యాంపస్ ప్రారంభించడానికి పరిస్థితులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తే ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక కోర్సులు, భారత్ ఫ్యూచర్ సిటీలో ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబద్లో తమ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో మాట్లాడితే షార్ట్ టర్మ్ కోర్సులను ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రారంభిస్తామన్నారు. అమెరికాలో సైతం బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఐటీ క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వెళ్లాల్సి ఉండే. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఐవీ లీగ్లోని టాప్ –10 వర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలన్నది నా లక్ష్యం. మీరు నా పర్యటనను అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించా. ఆక్స్ఫర్డ్తో అధికారులు ఒప్పందం చేసుకోబోతున్నరు. ఇతర వర్సిటీల ముందు మన ప్రతిపాదనలు ముందుపెట్టబోతున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధానికి తెలియకుండా జరగలేదు... ‘మేం దరఖాస్తులో వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఏ అధికారిక పర్యటనను అయినా భారత రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. విమానాశ్రయంలో మేము దిగే నాటి నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు. గతంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఈ విషయాలన్నీ తెలుసు. తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతిని సమీక్షించకుండా, ప్రధాని దృష్టిలో లేకుండా తిరస్కరించడం జరుగుతుందా? తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారిని శిక్షిస్తామని ప్రపంచానికి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రో రైలు ఇతర విషయాల్లో తెలంగాణకు సహకరించడం లేదు’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమతి నిరాకరణపై విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీజేపీలో చేరాలని ఎద్దేవాచేశారు. మోదీ అన్ని దేశాలు తిరగొచ్చు.. ‘న్యూయార్క్ మేయర్ మమ్దానీ అసాంఘిక శక్తి కాదు. మేయర్, అమెరికా ఉపాధ్యక్షుడి అపాయింట్మెంట్ అధికారికంగా ఖరారు కాకుంటే ఏ కార్యక్రమం జరగదు. మమ్దానీ ఏమైనా మన గల్లీలో ఉన్న కౌన్సిలరా? పోతాపోతా ఇంట్లోకి వెళ్లికూర్చుని మాట్లాడడానికి? కేటీఆర్ అమెరికా, హరీశ్ లండన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. నాకు అమెరికా నుంచి ఆహ్వానం ఉంది. హార్వర్డ్లో విద్యార్థిగా చదివా. గతంలో మోదీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని అమెరికాకు రానీయలేదు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయాణం చేయొచ్చు.. ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండు’ అని సీఎం పేర్కొన్నారు. కిషన్రెడ్డి జన్మలో సీఎం కాగలడా? ‘కిషన్రెడ్డి ఎప్పుడు సీఎం అయ్యారు? ఆయన జన్మలో సీఎం కాగలరా? దేశంలో పీఎం, సీఎం, డీఎంలకు ఇతరులతో వేరే హోదా కలిగి ఉంటారు. కిషన్రెడ్డి ఏ హోదాలో అనుమతి కోరితే ఆయనకు అనుమతి నిరాకరించారో నాకు తెలియదు. సీఎంగా నేను విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం వెళ్తే మార్గమధ్యంలో తిరిగి రమ్మని చెప్పడంలో మతలబు ఏమిటి? ప్రొఫెసర్లు మాయా టుడోర్, దేవ్జీ యూకేలో ఉన్నారు. అనుమతి ఇచ్చారుగా? ఇందిరా హయాంలో 1975–76 మధ్య ఎమర్జెన్సీ కాలంలో, ఆ తర్వాత 2014లో మోదీ పీఎం అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని మాయా ఓ జర్నల్కు వ్యాసం రాశారు. 56 ఇంచీల ఛాతీ అని చెప్పుకునే మీరు ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఈ అభిప్రాయాన్ని ఎందుకు మార్చలేరు? మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్కు ఎవరిని అడిగి వెళ్లారు? మీరు పాక్ వెళ్లి వారి ప్రధానిని అలింగనం చేసుకుని బిర్యానీ తినవచ్చు. అధికార పర్యటనకు సీఎం వెళ్లలేడు? అందుకే ఆమె ప్రజాస్వామ్యం క్షీణిస్తుందని రాశారు. నేనూ ఏకీభవిస్తున్నా. ఇది నియంతృత్వ నిర్ణయం’ అని సీఎం రేవంత్ అన్నారు. -
‘సాంకేతిక ఆధారిత ప్రొఫెషనల్ సేవలకు అంతర్జాతీయ హబ్గా హైదరాబాద్’
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాన్ని కృత్రిమ మేధ సాంకేతికతతో అనుసంధానం చేస్తూ, వివిధ దేశాలకు సంబంధించిన న్యాయ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ హైదరాబాద్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..అంతర్జాతీయ న్యాయ సేవలకు సంబంధించిన వినూత్న సంస్థ హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన సేవలతో సహా అనేక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా విస్తరిస్తోందని, ఇది అపారమైన అవకాశాలను సృష్టిస్తూనే కొత్త సవాళ్లను కూడా ముందుకు తెస్తోందన్నారు.అందువల్ల ఏఐ వినియోగంలో బాధ్యత, నైతిక విలువలు, పారదర్శకత అత్యంత కీలకమని పేర్కొన్నారు. బలమైన ఐటీ, సాంకేతిక వ్యవస్థ, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ దేశాలతో మెరుగైన అనుసంధానం హైదరాబాద్కు ప్రత్యేక బలాలని మంత్రి చెప్పారు. ఈ అనుకూలతలతో ఏఐ ఆధారిత ప్రొఫెషనల్, న్యాయ సేవలకు హైదరాబాద్ ఒక ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణను అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానించే ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు.న్యూయార్క్లోని కవేటి లా ఫర్మ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ అటార్నీ డాక్టర్ శ్రీనివాస్ రావు కవేటి, కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్ను హైదరాబాద్కు తీసుకురావడాన్ని మంత్రి అభినందించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కవేటికి భారత్తో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ‘ఇంటర్నేషనల్ లీగల్ యాక్సెస్ హబ్’గా తీర్చిదిద్దాలని సంస్థ ప్రతిపాదించింది. భారత్లోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రవాస భారతీయులు (NRIs), పెట్టుబడిదారులు వివిధ దేశాల్లో న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులు, న్యాయ నిపుణులతో అనుసంధానం కావడానికి ఈ కేంద్రం వేదికగా పనిచేయనుంది. అంతర్జాతీయ న్యాయ నిపుణులు హైదరాబాద్కు వచ్చిన సందర్భాల్లో ప్రత్యక్ష సంప్రదింపులు, న్యాయ వ్యూహాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.సంస్థ సేవలు వివిధ దేశాల్లోని పలు న్యాయ విభాగాలను కవర్ చేయనున్నాయి. అమెరికాలో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్, అంతర్జాతీయ విడాకులు, కార్పొరేట్, క్రిమినల్ లా అంశాలు; యునైటెడ్ కింగ్డమ్లో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్; యూఏఈలో కార్మిక పరిహారం, ఉద్యోగ సంబంధిత సమస్యలు, ఒప్పంద వివాదాలకు సంబంధించిన సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. భారత్లో కంపెనీ, ట్రేడ్మార్క్ చట్టాలు, సివిల్, క్రిమినల్, కార్మిక చట్టాలు, రిట్ పిటిషన్లు, రుణాల రికవరీ, వినియోగదారుల చట్టాలు, స్పెషల్ లీవ్ పిటిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన సేవలను అందించనుంది.హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాల్లో న్యాయ సేవల్లో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించడం ప్రధాన అంశంగా ఉండనుంది. ముఖ్యంగా సంక్లిష్టమైన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో లీగల్ రీసెర్చ్, సమాచార సేకరణ, డాక్యుమెంట్ల విశ్లేషణ, డిస్కవరీ, కేసులకు సంబంధించిన ప్రాథమిక మ్యాపింగ్ తదితర అంశాల్లో ఏఐ సహకారాన్ని వినియోగించాలని ప్రతిపాదించారు.అయితే ఏఐ న్యాయవాదులకు ప్రత్యామ్నాయం కాదని, వారికి సహకరించే సాధనంగా మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. న్యాయ సలహాలు, ప్రాతినిధ్యం వంటి సేవలను ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాలు, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన న్యాయ నిపుణులు మాత్రమే అందిస్తారని పేర్కొంది.సాంకేతిక పరిజ్ఞానం అంతిమంగా ప్రజలకు ఎదురయ్యే అడ్డంకులను తగ్గించడానికి, సేవల్లో సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రత్యేక నైపుణ్యంతో కూడిన సేవలను మరింత విస్తృత వర్గాలకు చేరువ చేయడానికి ఉపయోగపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ నెట్వర్క్లతో అనుసంధానించే ఇటువంటి సంస్థలు తెలంగాణను ఆవిష్కరణలు, విజ్ఞాన ఆధారిత సేవలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సొంత ‘రైడ్-హెయిలింగ్’ యాప్!
తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో డ్రైవర్లు సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఆదాయ మార్గాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను వెల్లడించింది.సొంత యాప్ రూపకల్పనఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక 'రైడ్-హెయిలింగ్ యాప్'ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిద్వారా ప్రైవేట్ యాప్ల కమిషన్ల భారం తగ్గి డ్రైవర్ల నికర ఆదాయం పెరిగే అవకాశముందని చెప్పారు.2012 తర్వాత తొలిసారిగా ఛార్జీల పెంపురవాణా రంగ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2012 తర్వాత మొదటిసారిగా ఆటో ఛార్జీల సవరణకు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ఆమోదం తెలిపింది. కొత్త ఛార్జీలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.ఈవీ కన్వర్షన్కు రూ.1.50 లక్షల సాయంహైదరాబాద్లో కాలుష్య నియంత్రణతో పాటు ఇంధన భారాన్ని తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు (రెట్రోఫిట్టింగ్) ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.బైక్ ట్యాక్సీలు.. సంక్షేమంపై స్పష్టతవాణిజ్య అవసరాలకు మాత్రమే ఉపయోగించే ‘పసుపు రంగు నంబర్ ప్లేట్’ ఉండే ద్విచక్రవాహనాలను మాత్రమే బైక్ ట్యాక్సీలుగా అనుమతించే అంశంపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఎన్నికల హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
సెప్టెంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై తొలి రోజు సమావేశం తర్వాత జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు. ఈ వర్షాకాల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్ తగిలింది. మంత్రికి ముందస్తు సమాచారం లేకుండా, ఆమెకు తెలియకుండానే అటవీశాఖలో పలువురు అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) వినయ్ కుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం.. ముగ్గురు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల డిప్యూటేషన్లను రద్దు చేశారు. డిప్యూటేషన్ రద్దయిన అధికారులు వెంటనే హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని పీసీసీఎఫ్ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా నేరుగా మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నందుకే సదరు అధికారులపై ఈ విధమైన చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. తమ డిప్యూటేషన్ల రద్దు వ్యవహారంపై ఎఫ్ఆర్ఓ సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు వెంటనే మంత్రి కొండా సురేఖను కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు అటవీశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి ఆదేశాలను అధిగమించి ఉన్నతాధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై రాజకీయ, అటవీశాఖ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మంత్రి సురేఖకు టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాజకీయ వివాదం ముదిరి, ఆమె మంత్రి పదవిపైనే ఊహాగానాలు నడుస్తున్న తరుణంలో.. అటవీశాఖలో మంత్రికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పీసీసీఎఫ్ వినయ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి ప్రాధాన్యతను తగ్గించడానికే ఉన్నతాధికారులు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి -
ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. వాటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన చెక్కులను అధికారులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ చెక్కుల పంపిణీ అంశంలో సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో దివ్యాంగులకు ఇచ్చే ఆర్థికసాయం కొనసాగించేందుకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు.. జీవో నంబర్ 4పై ఉన్న స్టేను ఎత్తివేసింది.కాగా, ఈ నెల ఆరంభంలో ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన ఒక కేసు విచారణ సందర్భంగా.. కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది. రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు వంటి పథకాలలోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇక ఆగస్టు 20వ తేదీన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై హైకోర్టు విచారణ సందర్భంగా నిధుల విడుదల అంశానికి సంబంధించి స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ పథకాలకు సంబంధించి చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడాన్ని ప్రధానంగా తప్పుబట్టిన న్యాయస్థానం.. అది రాజకీయ జోక్యమే అవుతుందని హెచ్చరించింది.ఇవి కూడా చదవండి: ఉచిత పథకాలు కోటీశ్వరులకూ అవసరమా?‘నా అమెరికా పర్యటన రద్దు.. తెలంగాణ ప్రజలకే అవమానం’ -
ఆదిలాబాద్ : ఐటీడీఏ ముట్టడికి భారీగా తరలివచ్చిన ఆదివాసీలు (ఫొటోలు)
-
కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ స్పందన ఇదే!
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను.తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయన సోమవారం తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా నా విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరైనది కాదు. ఈ వైఖరిని అందరూ తప్పుబడుతున్నారు. ‘వికసిత్ భారత్’ ప్రణాళికలో భాగంగానే మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ను ప్రకటించాం. ముఖ్యంగా విద్యా, క్రీడా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను తలపెట్టాం. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం, అమెరికా వెళ్లేందుకు మాత్రం నిరాకరించింది.అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించలేదనే కారణంతోనే కేంద్రం అనుమతి నిరాకరించిందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. కొందరు బీజేపీ నేతలు కావాలనే కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు. నేను లండన్, అమెరికా పర్యటనల పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే అందించా.కేంద్రం కేవలం రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. నా పర్యటనను అడ్డుకోవడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. ఇది నాకు జరిగిన అవమానం కాదు.. తెలంగాణ జరిగిన అవమానం. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్షను సహించేది లేదు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అభివృద్ధి అవసరం లేదా?. కేంద్రం తీరు సమాఖ్య స్పూర్తికి విరుద్ధం. ఒక రాష్ట్ర సీఎం పర్యటనను అడ్డుకోవడం ఆషామాషీ కాదు. నా పర్యటనను అడ్డుకోవచ్చు. కానీ ఆలోచనను కాదు. సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. విదేశాల్లో ఉండి మాట్లాడితే దేశ ద్రోహి అనేవారు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా’ అని వ్యాఖ్యానించారు.(👉ఇదీ చదవండి: కొండా సురేఖ అంశం.. ఏం చేస్తే ఏమవునో ) -
22ఏ బాధితులకు న్యాయం చేసి తీరుతాం.. మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్ కోర్లో 22ఏ అంశం ఎంతో జఠిలంగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. 22A బాధితులకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో న్యాయం చేసి తీరుతుందన్నారు. హైదరాబాద్లో ఈ రోజు (సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అబద్ధాలతో ప్రతిపక్షం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని.. ఈ అంశంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తేల్చిచెప్పారు.మంత్రి మాట్లాడుతూ.. ప్లాట్ల బుకింగ్ కోసం డబ్బులు చెల్లించిన వారికి నగదు వెనక్కి ఇస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నెంబరు పనిచేయడం లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఇప్పటివరకూ ఆ నంబర్కు వేలాదిగా కాల్స్ వచ్చాయి. క్యూర్ ప్రాంతంలోని రైతుల సమస్యలను చర్చించాం. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి రిజిష్ట్రేషన్లు చేస్తాం. ఫాస్ట్ ట్రాక్లో రిజిష్ట్రేషన్లు చేస్తాం. అని మంత్రి అన్నారు.సెక్షన్ 22ఏ సమస్య ఏంటి?రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూదాన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకవచ్చిన 'భూ భారతి'లో 2026 ఏప్రిల్లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు, దశాబ్దాల క్రితం హుడా, హెచ్ఎండీఏ అనుమతులతో ఏర్పడిన కాలనీలు, అపార్ట్మెంట్లు కూడా ఈ జాబితాలో చేరాయి. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లినప్పుడే తమ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని యజమానులకు తెలియడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. -
తెలంగాణ మందు బాబులకు గుడ్న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలో కొత్తగా 121 రకాల లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో అంతర్జాతీయంగా పేరున్న బ్రాండ్లను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL).. 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 కొత్త లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టింది. ఆయా బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ముందు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.సెప్టెంబర్ 1లోగా అభ్యంతరాలు..కొత్త లిక్కర్ బ్రాండ్ల ప్రవేశంపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే సెప్టెంబర్ 1వ తేదీలోపు తెలియజేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తదుపరి అనుమతుల ప్రక్రియ కొనసాగనుంది. కొత్త బ్రాండ్లకు అనుమతులు లభిస్తే.. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లలో వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు 121 కొత్త రకాల లిక్కర్ రాష్ట్రంలోకి రానుండటంతో మద్యం ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.చదవండి: డ్రగ్స్ నిరోధక ఈగల్లో ఇంటి దొంగలు.. -
రేవంత్ సర్కార్పై రాంచందర్రావు తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా అమలు కాలేదని ఆయన అన్నారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తుంటే వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.రాహుల్ గాంధీకి సవాల్ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రాంచందర్రావు టార్గెట్ చేశారు. “రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్పై మాట్లాడాలి” అంటూ సవాల్ విసిరారు. దేశంలో యువతను రెచ్చగొట్టి ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి ప్రయోజనాలు అందుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. విద్యార్థులకు మాత్రం ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ను గద్దె దించాలిదేశ వ్యతిరేక శక్తులతో సీఎం రేవంత్రెడ్డి చేతులు కలుపుతున్నారని రాంచందర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల శక్తి ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: సెల్ఫీ కోసం వచ్చి రాహుల్కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా! -
జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల
ఖమ్మంమామిళ్లగూడెం: వరంగల్– ఖమ్మం–నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును అధిష్టానం ఖరారు చేసిందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం మిరియాల రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంపై అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. -
సీ బ్లాక్ భద్రమేనా!?
హైదరాబాద్: అంజయ్యనగర్లో 50 గజాల విస్తీర్ణంలో చేపట్టిన భవనం పేకమేడలా కుప్పకూలి పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీపై పడటంతో ఆ అపార్ట్మెంట్ నాణ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించి జయదర్శిని రెసిడెన్సీ నిర్మాణం చేపట్టారని చెబుతున్నప్పటికీ ఐదో అంతస్తుపై ఉన్న స్లాబ్ ధ్వంసం కావడంతో పార్కింగ్లోని రెండు పిల్లర్లకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగించిన అనంతరం సీఎంసీ నుంచి నిపుణులైన ఇంజినీర్లు పిల్లర్ల నాణ్యతను పరిశీలించనున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి రెసిడెంట్స్ నిర్ణయాన్ని తీసుకుంటారు. భవనం కూలి మీద పడటంతో ఐదు ఫ్లాట్లలో మాస్ట్ బెడ్ రూమ్లు, బాత్ రూమ్లు, కిచెన్లు, పార్కింగ్లోని పిల్లర్లు, ఐదో అంతస్తులోని స్లాబ్ దెబ్బతిన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా హైడ్రా, పోలీసు అధికారులు 10 సీ బ్లాక్లో 10 ఫ్లాట్లను, బి బ్లాక్లోని మరో 10 ఫ్లాట్లను ఆదివారం ఖాళీ చేయించారు. -
చినుకులా రాలి.. వరదలా మారి.. (ఫోటోలు)
-
కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్(చిట్టక్క) సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో? -
కాంగ్రెస్ మహిళా నేతపై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: చెందిన కాంగ్రెస్ మహిళా నేతను ఉద్దేశించి ఆన్లైన్లో మార్ఫింగ్ వీడియోలతో అనుచిత పోస్టులు చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడకు చెందిన ఓ స్టాఫ్ట్వేర్ ఉద్యోగి (30) ఇన్స్ట్రాగామ్లో నకిలీ ఖాతా సృష్టించాడు. గతేడాది అక్టోబర్లో ‘పూరా లోకల్’ పేరుతో ఉన్న ఆ ఖాతా ద్వారా నగరానికి చెందిన ఓ మహిళా నాయకురాలి వీడియోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని అరెస్టు చేశారు. -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కోసం గాలింపు
హైదరాబాద్: హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు. అక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడు తో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
డ్రగ్స్ నిరోధక ‘ఈగల్’లో ఇంటి దొంగలు.. 50 లక్షల విలువైన..
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఈగల్ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రగ్స్ దందాకు ప్రయత్నించిన వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకునేందుకు ఉపయోగించాల్సిన నిఘా సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఏకంగా డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం.వివరాల మేరకు.. తెలంగాణలో డ్రగ్స్ పెడ్లర్ను పట్టుకునేందుకు ఈగల్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ సమయంలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ నరహరి, స్వామి వ్యవహారం బయటపడినట్లు సమాచారం. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన కిలో ఎక్స్టసీ మాత్రలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మాత్రలను వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి విక్రయించేందుకు సిద్ధమయ్యారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ పెడ్లర్ల కదలికలు, వారి ఫోన్ నంబర్లు, ఇతర వివరాలపై ఈగల్ శాఖ సేకరించిన నిఘా సమాచారాన్ని కానిస్టేబుళ్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమాచారంతో డ్రగ్స్ పెడ్లర్లను సంప్రదించి, తమ వద్ద ఉన్న ఎక్స్టసీ మాత్రలను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.చదవండి: జైలుకు వెళ్లొచ్చిన సురేఖ.. విషాదంతంఅంటే డ్రగ్స్ ముఠాలను గుర్తించేందుకు పోలీసులకు అందుబాటులో ఉన్న కీలక నిఘా వ్యవస్థనే సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరహరి, స్వామి గతంలో పలు యాంటీ డ్రగ్స్ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచినందుకు అవార్డులు కూడా పొందినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసే విభాగంలోనే కీలక బాధ్యతలు నిర్వహించిన సిబ్బందిపై ఇప్పుడు డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నించారనే ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది.అంతర్గత విచారణ ప్రారంభం..ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఈగల్ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. వారి వద్దకు ఎక్స్టసీ మాత్రలు ఎలా వచ్చాయి, డ్రగ్స్ పెడ్లర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నిఘా డేటాను ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా సిబ్బంది లేదా డ్రగ్స్ ముఠా సభ్యుల ప్రమేయం ఉందా అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా కానిస్టేబుళ్ల ఫోన్ కాల్స్, డ్రగ్స్ పెడ్లర్లతో వారి పరిచయాలు, నిఘా డేటా వినియోగం వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. -
అంజయ్యనగర్లో చర్యలు చేపట్టిన హైడ్రా... (ఫోటోలు)
-
మల్లారెడ్డి కళాశాలపై కేసు నమోదు
హైదరాబాద్: టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి కాలు విరగగా, మరో నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యంతో పాటు నిర్వాహకులు, చిత్ర యూనిట్పై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ కథనం ప్రకారం... మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో టాక్సిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి నిర్వహించగా సినీ హీరో యష్ , హీరోయిన్లతో పాటు వేలాదిమంది విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ల కోసం ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ పోల్పై విద్యార్థులతో పాటు పలువురు యువకులు ఎక్కడంతో అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో వనపర్తికి చెందిన బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థి భాను ప్రకాష్ (22) కాలు విరగగా, వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి అఖిల్, ఆటో డ్రైవర్లు సన్నీ, మార్క్, దీపక్ లకు స్వల్ప గాయాలు కాగా వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపించినట్లు మల్లారెడ్డి ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు పేట్బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంతో పాటు ఫ్రీ రిలీజ్ చిత్ర యూనిట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు -
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
హైదరాబాద్: అంజయ్యనగర్లో 50 చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టిన జీ ప్లస్ 6 అంతస్తుల నిర్మాణం కుప్పకూలడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు హైడ్రా చర్యలు చేపట్టింది. శనివారం అంజయ్యనగర్లో నాలాపై నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణం కుప్పకూలి పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీపై పడ్డ విషయం తెలిసిందే. ఘటనను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన అక్రమ నిర్మాణాల తొలగింపును చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బాహుబలి (బ్రొంటో) యంత్రంలో భవనం కూల్చివేత చేపట్టారు. సీఎంసీకి అందని లేఖ.. బిల్డర్ ఎం.డీ సాజిద్ చేపట్టిన నిర్మాణం కూలడంతో పక్కనే ఉన్న నిర్మలా రామన్కు చెందిన మణిదీప్ పీజీ హాస్టల్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదం పొంచి ఉందని భావించి ఆ భవనాన్ని తొలగించాలని హైడ్రా అధికారులు భావించారు. తొలుత హైడ్రా అధికారులు తొలగించాలని నిర్ణయించినప్పటికీ ఆదివారం సీఎంసీకి టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి లేఖ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తొలగిస్తున్న భవనాన్ని ఆనుకొని ఉన్న మహ్మద్ ఇస్మాయిల్ ఖురేషీ కి చెందిన అక్రమ నిర్మాణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. ఆ భవనాన్ని కూల్చివేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఇటాచీలతో జయదర్శిని రెసిడెన్సీలో ఉన్న శిథిలాలను కొద్ది మేరకు తొలగించారు. అధికారుల పేరు చెబుతూ సీఎంసీకి లేఖ ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలాపై సర్వే.. అక్రమ నిర్మాణాల గుర్తింపు కూలిన భవనంతో పాటు మరికొన్ని భవనాలు నాలాపై ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఖురేషీకి చెందిన భవనంతో పాటు మరో నాలుగైదు భవనాలు నాలాపై ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని తొలగించాలంటే సీఎంసీ నుంచి నివేదిక ఇస్తేనే చర్యలు తీసుకునేందుకు వీలుందని హైడ్రా అధికారులు అభిప్రాయపడుతున్నారు. సీఎంసీ అధికారుల నివేధిక ఆధారంగా మరిన్ని అక్రమ నిర్మాణాలను కూలి్చవేసే అవకాశం ఉంది. రికార్డులలో ఉన్న నాలా మచ్చుకు కూడా కనిపించకపోవడం గమనార్హం. ఆరు హాస్టళ్లు ఖాళీ.. భవనం కూలండంతో దాదాపు ఆరు హాస్టళ్లను రాయదుర్గం పోలీసులు ఖాళీ చేయించారు. ఇప్పటికే ఐటీ ఉద్యోగులు వెళ్లిపోయారు. అంజయ్యనగర్లోని రెండు రోడ్లలో, జయదర్శిని సీ బ్లాక్ వైపు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. టీపీబీఓ సంతోష్పై వేటు అక్రమ భవనం కూలిన ఘటనలో మాదాపూర్ సర్కిల్–50 టీపీబీఓ యు.సంతోష్ కుమార్పై సీఎంసీ కమిషనర్ సృజన సస్పెన్షన్ వేటు వేశారు. జీ ప్లస్ 6 అంతస్తులు, పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టడం, భవనం కూలిన ఘటనలో ఇద్దరు కారి్మకులు మృతి చెందడం, పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీకి నష్టం వాటిల్లడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. అనధికార నిర్మాణాన్ని నిలిపివేయడంతో టీపీబీఓ విఫలమయ్యారని, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలపై సమగ్ర తనిఖీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. బిల్డర్ సాజిద్ అరెస్ట్ ∙ కాంట్రాక్టర్ కోసం గాలింపు ∙ మరొకరిపై కేసు నమోదు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా 50 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్ 6, పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టిన ఎం.డి.సాజిద్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. భవనం కుప్పకూలడంతో ఇద్దరు వలస కూలీలు మృతి చెందడం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం, పక్క ఇంటికి తీవ్ర నష్టం కలగడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే భవన స్థలం డాక్యుమెంట్పై పేరున్న ఫరీన్ సిద్ధిఖీపై, బిల్డర్ ఎం.డి.సాజిద్, కాంటాక్టర్ ఖాజా మొయినుద్దీన్పై బీఎన్ఎస్ 105 (బి) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాజిద్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్ ఖాజామొయినుద్దీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఆరా.. సాజిద్ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై సీఎంసీ అధికారులు, అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం భవనం కుప్పకూలినప్పటికీ అంజయ్యనగర్లో మరో వైపు ఓ భవనంపై స్లాబ్ వేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గత రెండేళ్లుగా అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్లో దాదాపు 8 భవనాలు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఓ మాజీ ప్రజా ప్రతినిధి అండతో అధికారులను మభ్యపెట్టి అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. పోస్టుమార్టం పూర్తి భవనం కుప్పకూలిన దుర్ఘటనలో టైల్స్ పని చేస్తున్న మధ్య ప్రదేశ్కు చెందిన ఉమేష్ ఖరే (34), మోపత్(42)లు శిథిలాల కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. -
ఖర్గేను కలిసిన సురేఖ.. నేడు రేవంత్ ప్రెస్మీట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా కుటుంబ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె రాత్రి 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.బెంగళూరులో ఖర్గేతో భేటీ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను మంత్రి సురేఖ.. ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను ఆయనతో మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ రియాక్షన్ఇదిలా ఉండగా, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రాకతో కొండా కుటుంబ వ్యవహారంపై తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ సీఎంను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు కావడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కారణంగానే తన పర్యటన రద్దయిందన్న అంశంపై కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. -
జైలుకు వెళ్లొచ్చిన సురేఖ.. విషాదాంతం
సాక్షి, సంగారెడ్డి: ఆరు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితురాలు సురేఖ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా శాంతినగర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆదివారం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆమె హతమార్చింది. ఈ ఏడాది జనవరి చివర్లో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ.. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేయాలని పథకం వేసింది. ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని హతమార్చింది. అయితే ఈ కేసులో ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. ఏ ఉద్యోగమూ దొరక్కపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె సురేఖ(25) సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన ఓ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పిన సురేఖకు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించడమే కాకుండా.. మరో సంబంధం చూడటం ప్రారంభించారు. దీంతో ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను తొలగించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.వైద్య రంగంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న సురేఖ.. తాను పనిచేస్తున్న ఆస్పత్రి నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు మందును తీసుకొచ్చింది. అనంతరం ఓ మెడికల్ షాపులో మూడు సిరంజీలు కొనుగోలు చేసింది. జనవరి చివర్లో ఓ రోజు రాత్రి సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ.. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది. అనంతరం పెళ్లి విషయం మరోసారి ప్రస్తావనకు రావడంతో వారు ఆమెను మందలించారు. అప్పటికే వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. ముందుగా తల్లి లక్ష్మికి ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ మత్తు మందును అధిక మోతాదులో ఇచ్చింది.కొద్దిసేపటికే లక్ష్మి మృతి చెందగా.. ఆమెను నిద్రిస్తున్నట్లు పడుకోబెట్టింది. అనంతరం ఇంటి బయట ఉన్న తండ్రి దశరథం వద్దకు వెళ్లి ఆయనకూ ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.అన్నకు ఫోన్ చేసి.. కన్నీటి నాటకంతల్లిదండ్రుల మరణాలను సహజంగా చూపించేందుకు సురేఖ ప్రయత్నించింది. అన్న అశోక్కు ఫోన్ చేసి.. ‘‘అమ్మా నాన్న చనిపోయారు.. భయంగా ఉంది.. త్వరగా రండి’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అన్న వచ్చాక.. తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని, తల్లి షాక్కు గురై గుండెపోటుతో స్పృహ కోల్పోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయిందంటూ కన్నీరు పెట్టుకుంది.అలా బయటపడిన నిజంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో లభించిన సిరంజీలను పరిశీలించారు. సురేఖ చెప్పిన వివరాల్లో అనుమానాలు రావడంతో ఆమెను ప్రశ్నించారు. మొదట అవి మూడు నెలల కిందటివని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె సంచిలో దొరికిన ఉపయోగించని మూడో సిరంజీ, ఖాళీ ఇంజెక్షన్ సీసాలు, వాడిన సిరంజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు విచారణలో తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు సురేఖ అంగీకరించింది. ప్రేమ వివాహానికి అడ్డుపడటమే కారణమని వెల్లడించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికే సురేఖ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, కుటుంబ వ్యతిరేకత నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. -
మార్కెటింగ్ శాఖలో అక్రమాలకు కళ్లెం పడేనా?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెటింగ్ శాఖను గాడిన పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఈ శాఖకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని డైరెక్టర్గా నియమించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మార్కెటింగ్ శాఖలో కొన్నేళ్లుగా వెలుగుచూస్తు న్న కార్యదర్శుల అవినీతి, అక్రమాలు.. ముఖ్యంగా పత్తి కొనుగోళ్లలో బయటపడిన అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్గా ఐఏఎస్ అధికారి రాహుల్రాజ్ను నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల క్రితం వరకు డైరెక్టర్ (ఎఫ్ఏసీ)గా కొనసాగిన జి.లక్ష్మీబా యి బదిలీ అనంతరం ఇన్చార్జ్ డైరెక్టర్గా కొనసాగిన డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణుడును ఆ బాధ్యతల నుంచి తప్పించి, పూర్తి అదనపు బాధ్యతల్లో రాహుల్రాజ్ను నియమించింది. సాధారణంగా వ్యవసాయశాఖ కార్యదర్శే ఎక్స్అఫీషియోగా వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ కార్యదర్శిగా సురేంద్రమోహన్ కొనసాగుతున్నా, మార్కెటింగ్ డైరెక్టర్గా రాహుల్రాజ్ను ప్రత్యేకంగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా..? 2024–25 ఖరీఫ్ పత్తి కొనుగోళ్లలో రైతుల పేర్లతో తప్పుడు తాత్కాలిక నమోదు పత్రాలు జారీ చేసి, అసలు రైతుల వద్ద కాకుండా దళారుల నుంచి పత్తి కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. వ్యవసాయశాఖ వద్ద ఉన్న తాత్కాలిక నమోదులకు, మార్కెటింగ్ శాఖ రికార్డులకు మధ్య కూడా వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఈ మేరకు మార్కెటింగ్ శాఖకు చెందిన ఏడుగురు కార్యదర్శులను 2025 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. ఈ విషయంలో మొత్తంగా 21 మందిని దోషులుగా గుర్తించినా, మార్కెటింగ్ శాఖ పరువు బజారున పడకుండా ఏడుగురితో సరిపెట్టారని మార్కెటింగ్ శాఖ సర్కిళ్లలో ప్రచారం జరిగింది. 2026 జనవరిలో ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. 2024 అక్టోబర్ నుంచి పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలను సీఐడీ కోరినట్లు వెల్లడైంది. పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2025 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా 65కుపైగా జిన్నింగ్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. తూకం యంత్రాల ప్రమాణాలు, తేమ కొలిచే పరికరాలు, పత్తి నాణ్యతను నిర్ధారించే శాస్త్రీయ పరికరాలు, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాల్లో లోపాలను గుర్తించారు. కొన్ని మిల్లులపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేశారు.పత్తి సీజన్ ముందే కీలక బాధ్యతఇలాంటి పరిస్థితుల్లో రాహుల్రాజ్కు మార్కెటింగ్ శాఖ పగ్గాలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సహకారశాఖ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ వంటి వ్యవసాయ అనుబంధ సంస్థలతో పని అనుభవం ఉంది. గతంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ముందున్న పత్తి కొనుగోళ్ల సీజన్ మార్కెటింగ్ శాఖకు అత్యంత కీలకం. గత సీజన్లో బయటపడిన లోపాలు పునరావృతం కాకుండా రైతుల నిజమైన నమోదు, పంట విస్తీర్ణం–దిగుబడి ఆధారంగా కొనుగోలు పరిమితుల నిర్ధారణ, దళారుల ప్రవేశానికి అడ్డుకట్ట, తూకాల్లో పారదర్శకత, నాణ్యత పరీక్షలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలపై కొత్త డైరెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
పత్రికా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్య సారానికే విఘాతం
సాక్షి, హైదరాబాద్: దేశంలో పాత్రికేయుల రక్షణ కోసం సమగ్రమైన వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, పటిష్టమైన చట్టపర రక్షణ వ్యవస్థలు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోకపోవడంపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటన స్వేచ్ఛకు ఎదురవుతున్న అడ్డంకులపై జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్న తీరుపై ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు భద్రత కల్పించేలా సమర్థవంతమైన చట్టాలు, కార్మిక భద్రతా నిబంధనలు అమలులోకి రాకపోవడం వల్ల జర్నలిస్టులు తీవ్రమైన ఒత్తిళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులు చట్టబద్ధంగా పనిచేస్తున్న క్రమంలో, ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు, ఇతర వర్గాల నుంచి వారిపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలను అడ్డుకోవడానికి జర్నలిస్ట్ సంçఘాలు, ఫెడరేషన్లు సమష్టిగా చట్టపరమైన వేదికలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇవి లేకపోతే ప్రజాస్వామ్యం తన సారాన్ని కోల్పోతుందని చెప్పారు. వర్తమాన మీడియా రంగంలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో నిబద్ధత కలిగిన పాత్రికేయుల పాత్ర ఎప్పటికీ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. సంప్రదాయ జర్నలిజం ప్రాధాన్యానికి ఢోకా ఉండదు: ఎన్.రామ్డిజిటల్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ చానెళ్లు ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సంప్రదాయ జర్నలిజం ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదని, డిజిటల్ కాలంలో రిపోర్టింగ్ ప్రాథమిక సూత్రాలను పాటించడం మరింత అవసరమని ‘ది హిందూ’ గ్రూప్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్ స్పష్టం చేశారు. మీడియాపై ప్రజలకు విశ్వసనీ యత పెరగాలంటే జర్నలిజం తన మూలాలైన క్షేత్రస్థాయి వార్తల కవరేజి, పరిశోధనాత్మక వార్తలు, వివరణాత్మక వార్తల వైపు మళ్లాల్సిందేనని హితవు పలికారు. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపే తం చేసుకోవాలని, జర్నలిస్టుల కోసం పారదర్శకమైన ప్రవ ర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే మీడియాపై అవగాహన కల్పించాలని, దీనివల్ల విద్యార్థులు వార్తలను, సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసు కుని, విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలరని అభి ప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను బలోపేతం చేయడానికి, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడానికి, వృత్తిగత ప్రమాణాలను పెంపొందించడానికి ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ’హైదరాబాద్ డిక్లరేషన్’ను ఆమోదించింది. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి, ‘ది కారవాన్’ మేగజైన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హర్తోష్ సింగ్ బాల్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సంగీతా బరూహ్ పిషారోటి, ఫెడరేషన్ అధ్యక్షుడు గౌతమ్ లహరి, ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సంగీత, దేశంలోని వివిధ ప్రెస్క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు విజయకుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల, ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -
‘ఈగల్’లో ఇంటి దొంగలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ఈగల్లో ఇంటి దొంగలు ఉన్నారు. ఓ రైలులో దొరికిన మెథ్ను (మెథాంఫెటమైన్) దారి మళ్లించారు. తన ఇంట్లో ఉంచుకొని ‘నెట్వర్క్’ద్వారా విక్రయిస్తున్నారు. యాధృచ్ఛికంగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఇద్దరు టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లను అరెస్టు చేసింది.పొరుగు రాష్ట్రం నుంచి డెడ్డ్రాప్లో...: ఇటీవల కాలంలో డ్రగ్ సప్లయర్స్ మాదక ద్రవ్యాల సరఫరా పంథాను పూర్తిగా మార్చేశారు. డెడ్డ్రాప్ విధానంలో పార్శిల్ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ పెడ్లర్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా పొరుగు రాష్ట్రానికి చెందిన సప్లయర్ గత నెలలో రూ.1.5 కోట్ల విలువైన మెథ్ను రైలులో డెడ్డ్రాప్ చేశాడు. ఈ మాదక ద్రవ్యాన్ని పార్శిల్ చేసి, రైలు జనరల్ బోగీలో నిర్దేశిత ప్రాంతంలో ఉంచాడు. ఆ వివరాలు, ఫొటోను ఇక్కడి పెడ్లర్కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వీరి పథకం ప్రకారం... రైలు నగరానికి చేరుకున్నాక పెడ్లర్ వెళ్లి ఆ పార్శిల్ తీసుకోవాలి.సమాచారం ఉంది.. రంగంలోకిఈగల్లో అంతర్భాగమైన రీజనల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (ఆర్ఎన్సీసీ) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కూ ఒకటి ఉంది. ఇందులో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు స్వామి, మరొకరు తమ రోటీన్ తనిఖీల్లో డెడ్ డ్రాప్ పార్శిల్ను ఆ రైలు జనరల్ బోగీలో గుర్తించారు. ఈ రూ.1.5 కోట్ల విలువైన మెథ్ పార్శిల్ స్వాధీనం చేసుకున్న ఈ ద్వయం ఈగల్ పోలీస్స్టేషన్కు చేర్చలేదు. సరుకును ఓ కానిస్టేబుల్ తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. చాలాకాలంగా ఈగల్ విభాగంలో పనిచేస్తున్న ఇతడికి నగరంలో ఉన్న డ్రగ్ పెడ్లర్స్, వినియోగదారుల వివరాలు తెలుసు. వాటిని వినియోగించుకొని మెథ్ మొత్తాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నాడు. వినియోగదారుల్ని సంప్రదించగా, ఇది ట్రాప్గా భావించిన పలువురు విముఖత చూపారు. అయినా, కానిస్టేబుల్ స్వామి తన ప్రయత్నాలు ముమ్మురం చేసి, కొందరికి ఆ మెథ్ను విక్రయించాడు. ఈగల్, హెచ్–న్యూ విభాగాల వద్ద ఉన్న డ్రగ్ పెడ్లర్స్, వినియోగదారుల జాబితాలో కొందరు ఉమ్మడిగా ఉంటారు. నిత్యం ఈ వినియోగదారులపై నిఘా ఉంచుతున్న హెచ్–న్యూ అనుమానితులను అదుపులోకి తీసుకొని, పరీక్షలు చేయిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ వినియోగదారుడికి పరీక్షలు చేయించగా, మెథ్ వినియోగించినట్టు తేలింది. ఆ డ్రగ్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో అతడిని విచారించగా, కానిస్టేబుల్ స్వామి చేస్తున్న మెథ్ దందా వెలుగులోకి రాగా, అతడిని అరెస్టు చేసింది. తదుపరి విచారణలో మరో కానిస్టేబుల్ పాత్ర బయటపడటంతో ఆదివారం అతడినీ అదుపులోకి తీసుకుంది. ఈ ‘ఈగల్ డ్రగ్స్ దందా’ను నగర పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కేవలం కానిస్టేబుల్ స్థాయి అధికారులతో కాదని హెచ్–న్యూ అనుమానిస్తోంది. ఈ దందా వెనుక మరికొందరు అధికారుల పాత్రను తేల్చడానికి లోతుగా ఆరా తీస్తున్నారు. -
సమస్యలు ‘శాకో’పశాఖలు!
సాక్షి, హైదరాబాద్: ఏటేటా రాష్ట్రంలో కూరగాయల సాగు తగ్గుతోంది. తెలంగాణ ఉద్యానశాఖ గణాంకాలను పరిశీలిస్తే.. 2022–23లో రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగై 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైతే, 202–24 నాటికి కూరగాయల విస్తీర్ణం 1.13 లక్షల ఎకరాలకు పడిపోయి, ఉత్పత్తి 11.17 లక్షల టన్నులకు తగ్గింది. అంటే ఒక్క ఏడాదిలోనే సాగు విస్తీర్ణం సుమారు 22 వేల ఎకరాలు తగ్గగా.. ఉత్పత్తి 3.47 లక్షల టన్నులు పడిపోయింది. ఇక 2025–26కు సంబంధించిన తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదికలో కూరగాయల సాగు విస్తీర్ణం 1.03 లక్షల ఎకరాలుగా ఉంది. అదే సమయంలో ఉత్పత్తి 9.53 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే మూడేళ్లలో కూరగాయల పంటల ఉత్పత్తి ఏకంగా 35 శాతం పడిపోయింది. రాష్ట్రంలో వరి సాగుకు నీటివసతి, కొనుగోలు వ్యవస్థ, కనీస మద్దతు ధర, మార్కెట్ భరోసా వంటి అంశాలు రైతులను ఆకర్షిస్తున్నాయి. 2025–26లో రాష్ట్ర వరి ఉత్పత్తి 187.19 లక్షల టన్నులుగా అంచనా వేయగా.. 2024–25లో ఇది 189.45 లక్షల టన్నులుగా నమోదైంది. భారీ లోటులో ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, బంగాళాదుంప రాష్ట్రానికి అవసర మైన కూరగాయల్లో నిత్యం వినియోగించే ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపల ఉత్పత్తి లోటు భారీగా ఉంది. రాష్ట్రంలో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల పంటల జాడ కూడా లేకుండా పోయింది. ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ఏకంగా 3.77 లక్షల టన్నుల లోటు ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం–ఐకార్ కూరగాయల పరిశోధన వ్యవస్థ ఆధారంగా జరిగిన విశ్లేషణ వెల్లడించింది. ఈ లోటును పూడ్చాలంటే అదనంగా 44,549 ఎకరాలను కేవలం ఉల్లిపాయల సాగులోకి తేవాల్సి ఉంటుంది. ఆకుకూరల్లో 2.77 లక్షల టన్నుల లోటు ఉండగా, ఇందుకోసం మరో 59,045 ఎకరాలు అవసరం. బంగాళాదుంపలో 2.15 లక్షల టన్నుల కొరత ఉండగా, అదనంగా 26,806 ఎకరాలు సాగు చేయాల్సి ఉంటుందని అంచనా. అంటే రాష్ట్రంలో స్వయం సమృద్ధికి మరో 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు అవసరం. ఆ దిశగా సాగు లక్ష్యాలు నిర్ధేశించుకున్నా, రైతులు ముందుకు రావడం లేదు. కూరగాయల సరఫరాలో డిమాండ్– సప్లై చైన్ విషయంలో అంతరం ఏర్పడుతోంది. టమాటాకు మే–ఆగస్టు, ఉల్లికి జూలై–అక్టోబర్/నవంబర్, ఆకుకూరలకు జనవరి–ఆగస్టు, బంగాళాదుంపకు మే–డిసెంబర్ మధ్య కొరత అధికంగా కనిపిస్తోంది.ముందుకు రాని రైతులుతెలంగాణ ఉద్యానశాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒక ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాల వరకు ఉద్యాన పంటలు సాగు చేయవచ్చని పేర్కొంది. ప్రతి రూపాయి పెట్టుబడికి ఉద్యాన పంటల నుంచి సగటున రూ.3.5 లక్షల రాబడి, సాధారణ వ్యవసాయ పంటల నుంచి రూ.1.5 లక్షల రాబడి ఉంటుందని తెలిపింది. బోర్ల కింద అధిక నీరు అవసరమయ్యే వరి స్థానంలో, మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయలను శాస్త్రీయంగా ప్రోత్సహించాలన్నదే శాస్త్రవేత్తల సూచన. అయినా రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో కూడా కనీసం ఆశించిన స్థాయిలో కూడా కూరగాయల సాగు సాగలేదు. సవాలక్ష సమస్యలు.. రైతులు కూరగాయల సాగు చేయాలన్నా సవాలక్ష సమస్యలు ఉన్నాయి. వసతుల కల్పన, రైతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న వాదన వినవస్తోంది. కూరగాయల సాగులో ధరల హెచ్చుతగ్గులు, పంట నష్టం, నిల్వ సదుపాయాల కొరత, మార్కెటింగ్ సమస్యలు, పురుగు–తెగుళ్లు రైతులను వెనక్కి నెడుతున్నాయి. పైగా కోతులు, అడవి పందుల బెడద కూడా తీవ్రంగా ఉంది. 2026 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన జాతీయ కూరగాయల సదస్సులో నిపుణులు కూడా వాతావరణ మార్పులు, పురుగు–తెగుళ్లు, కోత అనంతర నష్టాలు, పరిమిత ప్రాసెసింగ్ సదుపాయాలు కూరగాయల ఉత్పత్తి పెరగకపోవడానికి ప్రధాన కారణాలని పేర్కొనడం గమనార్హం. -
పర్యావరణంలోని సీసంతో అల్జీమర్స్ తీవ్రం
లాలాపేట (హైదరాబాద్): పర్యావరణంలోని సీసం ప్రభావానికి గురికావడం వల్ల, ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణమయ్యే అమిలాయిడ్–బీటా పెప్టైడ్స్ శరీరంలో ఉన్నప్పుడు, అది నాడీ కణాల సహజ వ్యర్థాల శుద్ధి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పర్యావరణంలోని సీసం వల్ల కలిగే నష్టం, అమిలాయిడ్–బీటా వల్ల నాడీ కణాలపై ఒత్తిడిని ఎక్కువ చేస్తుందని, దీనివల్ల నాడీ కణాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.పరిశోధనలో మానవ నాడీ కణాలపై సీసం, రెండు రకాల అమిలాయిడ్–బీటా పెప్టైడ్ల ప్రభావాన్ని పరిశీలించారు. ఈ వివరాలు ’జర్నల్ ఆఫ్ అప్లైడ్ టాక్సికాలజీ’లో ప్రచురితమయ్యాయి. సీసం లేదా అమిలాయిడ్–బీటా పెప్టైడ్లు విడివిడిగా ఉన్నప్పుడు నాడీ కణాల వ్యర్థాలను శుద్ధి చేసే లైసోజోమ్ వ్యవస్థకు కొంత నష్టం వాటిల్లినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇవి రెండూ కలిసినప్పుడు మాత్రం నష్టం చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది. అమిలాయిడ్–బీటా సమక్షంలో సీసం ప్రభావం లైసోసోమ్ల లోపాలను మరింత తీవ్రతరం చేస్తుందనీ సైంటిస్తు డా.సురేష్ చల్లా తెలిపారు. కణ స్థాయి మార్పులను అర్థం చేసుకోవడానికి, పర్యావరణ కాలుష్యం నాడీ ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయొచ్చన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పర్యావరణ కాలుష్య కారకాలు, జీవసంబంధిత అంశాల మధ్య జరిగే చర్యలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డా.భారతి కులకర్ణి పేర్కొన్నారు. తద్వారా నరాల క్షీణత వ్యాధుల కారకాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. -
ఏఐలో అద్వితీయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికా 6,900, చైనా 1600, భారత్ 710 ఏఐ స్టార్టప్లతో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న నేపథ్యంలో, దేశంలో బెంగళూరు తర్వాత రెండో అతిపెద్ద ఏఐ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు, టాలెంట్ పూల్, పెట్టుబడులతో నగరం గ్లోబల్ ఏఐ హబ్గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో 500కు పైగా ఏఐ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. 2015–25 మధ్య 160 స్టార్టప్లు 5 శాతం సంయుక్త వార్షిక వృద్ధిరేటుతో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 900కు పైగా ఏఐ కంపెనీలు, 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లు ఉన్నారు. టీ–డేటా ప్లాట్ఫామ్లో 2026 జూలై నాటికి 3,000 ఏఐ సంస్థలు నమోదయ్యాయి. ఉద్యోగాల వెబ్సైట్ నివేదిక 2025 ప్రకారం ఏఐ/ఎంఎల్ ఉద్యోగాల్లో హైదరాబాద్లో 54 శాతం వృద్ధి నమోదైంది. ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం తక్కువ, పాలసీలు బలంగా ఉండటంతో స్టార్టప్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెబుతున్నారు.గూగుల్, టీహబ్ కలిసి ‘ఏఐ–ఫస్ట్ స్టార్టప్ యాక్సిలరేటర్’ ప్రారంభించాయి. ఏటా పదివేల మంది విద్యార్థులకు శిక్షణ, బూట్క్యాంప్లు నిర్వహిస్తారు. వచ్చే ఏడాదిలో 200 కొత్త స్టార్టప్లు, రూ.50 కోట్ల ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది.టీ – హబ్లో100 ఏఐ స్టార్టప్లు ఏకకాలంలో ఇంక్యుబేట్ అవుతున్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ–ఏఐఎం), ఏఐ సిటీ, గూగుల్ హబ్ వంటి ప్రాజెక్ట్లతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ భారత్కు ఏఐ రాజధానిగా, గ్లోబల్ టాప్ 20 డెస్టినేషన్గా అవతరించనుందని అంటున్నారు. -
సీపీఎస్ రద్దు చేయండి.. మళ్లీ సీఎంను చేస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ వ్యాఖ్యానించారు. ఇది తన ఒక్కడి మాట కాదని..రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల హామీ అని రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జూలై 11న ప్రారంభమైన సీపీఎస్ ఉద్యోగుల జనజాగరణ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాలో కొనసాగింది. ఆదివారం ఎల్బీస్టేడియంలో జనజాగరణ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కరువైందని, ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే 5 వేలకు పైగా ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. కానీ ఏ ఒక్కరికీ కూడా కనీసం రూ.5వేల పెన్షన్ కూడా రాలేదు. ఎక్కడో యుద్ధం జరిగితే తెలంగాణలోని సీపీఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో సొమ్ము ఆవిరి అవుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఉద్యోగులతోపాటు ప్రభుత్వ సొమ్ము రూ.1,800 కోట్లు అవిరైంది. పాత పెన్షన్ విధానంలో ఉన్న మాదిరిగా కనీస పెన్షన్ హామీ కూడా లేకపోవడం దురదృష్ట్టకరం’అని అన్నారు. మన పోరాటంతోనే డీసీఆర్జీ... ‘టీఎస్సీపీఎస్ఈయూ 12 ఏళ్లుగా పోరాటం చేసినందుకే ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ (డీసీఆర్జీ) అమలవుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. ఆయా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ ఓపీఎస్ అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డే అయిన నవంబర్ 17 నాటికి ప్రభుత్వం స్పందించి సీపీఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పందించకుంటే నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవులు పెట్టాలి. జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలతో తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలి’అని స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. – సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల వృద్ధాప్య భవిష్యత్ షేర్ మార్కెట్ పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే, చివరకు ఉద్యోగుల పెన్షన్ నిధులను కార్పొరేట్ షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం న్యాయం కాదన్నారు. ప్రజాప్రతినిధులకు వినతులు... 41 రోజుల పాటు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనజాగరణ యాత్ర జరగ్గా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతులు సమర్పించారు. ఆదివారం నాటి సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చారు. సభ జరిగినంత సేపు వర్షం కురుస్తున్నా, ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ సభను ఉత్సాహంగా సాగించారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కూరకుల శ్రీనివాస్, మ్యాన పవన్, మల్లికార్జున్, పోల శ్రీనివాస్, కిరణ్ ,లింగమూర్తి, నరేందర్ రావు, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణం గెలిచిన శ్రీనిత్య
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో చివరిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు మెరిపించారు. మొత్తం నాలుగు పతకాలు సాధించారు. తెలంగాణ అమ్మాయి సాగి శ్రీనిత్య స్వర్ణ పతకం సాధించగా... మైలారి సుహాస్ ప్రీతమ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అబ్బాయి మొంగం తీర్థు సామదేవ్ రజత పతకం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్కే చెందిన మొంగం యజ్ఞసాయి కూడా రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మహిళల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో శ్రీనిత్య 2 నిమిషాల 24.59 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. ప్రియాన్షి మిశ్రా (కర్ణాటక; 2ని:29.13 సెకన్లు) రజతం, మీనాక్షి మేనన్ (కర్ణాటక; 2ని:31.99 సెకన్లు) కాంస్యం గెలిచారు. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో తీర్థు సామదేవ్ (2ని:06.45 సెకన్లు) రెండో స్థానంలో... సుహాస్ ప్రీతమ్ (2ని:06.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో యజ్ఞసాయి (8ని:41.46 సెకన్లు) రెండో స్థానాన్ని సంపాదించాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో తెలంగాణ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 4 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి 9 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది. స్వర్ణ పతకాల ఆధారంగా ర్యాంక్ను నిర్ణయిస్తారు. కర్ణాటక 40 స్వర్ణాలు, 22 రజతాలు, 18 కాంస్యాలతో కలిపి 80 పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్íÙప్ టైటిల్ను గెల్చుకుంది. -
నెల రోజుల చిన్నారి తొడలో సూది!
పాలమూరు: నెలరోజుల చిన్నారి తొడలో సూది (నీడిల్) దిగిన ఘటన మహబూబ్నగర్లో వెలుగుచూసింది. సుమారు 20 రోజులుగా పాప నొప్పితో బాధపడుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్రే చేయించడంతో తొడలో సూది ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిందా? లేక టీకా వేసే సమయంలో చోటుచేసుకుందా? అన్నది తేలాల్సి ఉంది. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రానికి చెందిన వెంకట్రాములు భార్య అక్షిత జూలై 19న ప్రసవం కోసం మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది.మరుసటి రోజు సాధారణ ప్రసవంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పాప పసిరికలతో అస్వస్థతకు గురికావడంతో ఎస్ఎన్సీయూలో పది రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం డిశ్చార్జ్ చేసే సమయంలో పాప తొడ భాగంలో వాపు కనిపించింది. దీనిపై తల్లి ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల వాపు వచ్చిందని, రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పి పంపించారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా వాపు తగ్గకపోవడంతో కోస్గిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ ఎక్స్రే తీయగా.. పాప తొడలో సూది ఉన్నట్లు గుర్తించారు.దీంతో తల్లిదండ్రులు పాపను తిరిగి మహబూబ్నగర్కు తీసుకొచ్చి జనరల్ ఆస్పత్రి ఎస్ఎన్సీయూలో చేర్పించారు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరాను వివరణ కోరగా.. పాప తొడలోకి సూది ఎలా వెళ్లిందనే అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదని, సోమవారం పాపను పరీక్షించి శస్త్రచికిత్స ద్వారా సూదిని తొలగిస్తామని తెలిపారు. పాపకు యాంటీబయాటిక్స్ ఇచ్చే క్రమంలో ఈ ఘటన జరిగిందా? లేక బయట టీకా వేసిన సమయంలో చోటుచేసుకుందా? అన్నది పరిశీలిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. -
‘గంగాజల్’కు గోదావరి ప్రేరణ
సాక్షి, హైదరాబాద్: తపాలా గంగాజలం... ఇప్పుడు మన దేశంలోనే కాదు..విదేశాల్లోని భారతీయుల ఇళ్లకూ బట్వాడా అవుతున్న పూజా నీళ్లు. హిమాచల్ప్రదేశ్లోని గంగోత్రి వద్ద గంగానది నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి కోరుకున్న భక్తుల ఇళ్లకు భద్రంగా చేరుస్తోంది. ఇందుకోసం ఏకంగా సొంతంగానే బాటిలింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, ఇప్పుడు దాన్ని తపాలా సేవల్లో ముఖ్యమైందిగా మార్చుకుంది. ఈ శ్రావణమాసంలో 20 లక్షల గంగా జలం నీటి సీసాలను ప్రపంచవ్యాప్తంగా బట్వాడా చేయాలనుకుంటోంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ క్రియాశీల ‘సర్వీసు’వెనుక హైదరాబాద్ తపాలా అధికారుల ఓ చిన్న ప్రయోగం ప్రేరణగా నిలవటం విశేషం. ⇒ తపాలా కార్యాలయంలో 250 మి.లీ. పరిమాణంలోని నీటి సీసా ధర రూ.30. దీన్ని ఇంటికి తెప్పించుకోవాలంటే రూ.121 పోస్టల్ చార్జీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ రెండు సీసాలతో కూడిన ప్యాక్ ఆర్డర్ ఇస్తే చార్జి రూ.201 ⇒ నాలుగు సీసాల ప్యాక్ పోస్టల్ చార్జి రూ.321గోదావరి పుష్కరాలతో...: అది 2015... గోదావరి పుష్కరాలను నాటి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే గోదావరికి చాలా దూరంలో ఉన్న వారు... 12 ఏళ్లకోసారి వచ్చే పవిత్ర పుష్కర స్నానాలు చేయలేకపోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన నాటి తెలంగాణ సర్కిల్ తపాలాశాఖ అధికారులు, గోదావరి నీటిని శుద్ధి చేసి సీసాల్లో నింపి అలాంటి వారి ఇళ్లకే చేర్చే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఏడున్నర లక్షల ఆర్డర్లు రావటం విశేషం. విదేశాల నుంచి కూడా భక్తులు తపాలా ద్వారా ఈ సీసాలను ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని తపాలాశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. గోదావరి నీటిని భక్తులకు బట్వాడా చేసినట్టుగానే గంగానది నీటిని అందిస్తే ప్రజల్లో తపాలాశాఖకు ఆదరణ పెరుగుతుందని నిర్ణయించి వెంటనే దాన్ని అమలులోకి తెచ్చారు. ఇందుకోసం అధికారులు గంగానది నీటిని కూడా సరఫరా ప్రారంభించారు. గంగోత్రి నుంచి ఇంటి గడప వరకు..హైదరాబాద్లో ఒక చిన్న ప్రయోగంగా మొదలైన ఈ సేవ, ఇప్పుడు దేశవ్యాప్తంగా 4,116 పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. తొలుత గంగోత్రి, రిషికేశ్ల నుంచి గంగానది నీటిని సేకరించి 250 మి.లీ. పరిమాణంలోని సీసాల్లో నింపి తపాలా కార్యాలయాల్లో అమ్మకానికి పెట్టింది. తర్వాత గంగోత్రి నుంచి మాత్రమే నీటి సేకరణను పరిమితం చేసింది. హిమాచల్ప్రదేశ్లోని ఉత్తర్కాశీలో ప్రత్యేకంగా గంగాజల్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది.అయితే, ఇది సాధారణ తాగునీటిగా వాడేందుకు కాదన్న సంకేతాలనైతే ఇచ్చింది. ఉత్తర్కాశీలోని బాట్లింగ్ ప్లాంట్ సామర్థ్యం 8 గంటల ఒక షిఫ్ట్కు 6,400 బాటిళ్లు (1,600 లీటర్లు). ఈ లెక్కన ఏడాదికి 23 లక్షలకు పైగా బాటిళ్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. తాజాగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఆ సీసాలను అందుబాటులో ఉంచారు. -
డిప్రెషన్కు పండంటి చిట్కా
సాక్షి స్పెషల్ డెస్క్: ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. అయితే, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని యూకేలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ప్రతిరోజూ ఒక గ్లాసు సహజమైన పండ్ల రసం లేదా స్మూతీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత పెరగడమే కాకుండా డిప్రెషన్ లక్షణాలు తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకునే 42 మంది వ్యక్తులపై 4 వారాల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. పాల్గొన్నవారిని వివిధ గ్రూపులుగా విభజించి, ఒక గ్రూప్కు క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక గ్లాసు 100 శాతం స్వచ్ఛమైన పండ్ల రసం లేదా స్మూతీ అందించారు. 4 వారాల ముగింపులో, ప్రతిరోజూ పండ్ల రసం తాగిన వారిలో డిప్రెషన్ స్కోరు గణనీయంగా తగ్గడం గమనించారు.ఆరోగ్యకర ప్రయోజనాలు ⇒ సాధారణంగా జ్యూస్లలో సహజంగా ఉండే చక్కెరల వల్ల బరువు పెరగడం లేదా జీవక్రియ దెబ్బతినడం జరుగుతుందనే ఆందోళన ఉంటుంది. అయితే పరిమిత పరిమాణంలో తాగిన జ్యూస్.. మెటబాలిజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపటం లేదని పరిశోధకులు గమనించారు. ⇒ పండ్లలో పుష్కలంగా లభించే విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాల క్షీణతను అడ్డుకోవడంతో పాటు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను (వాపు) ను గణనీయంగా తగ్గిస్తాయి. ఇవి మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. ⇒ ఈ పోషకాలన్నీ మన శరీరంలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే సెరోటోనిన్, డోపమైన్ వంటి మూడ్ బూస్టింగ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, వాటి సమతుల్యతను కాపాడటానికి అనుకూలమైన వాతావరణాన్ని కలి్పస్తాయి. సాధారణంగా ప్రతిరోజూ కావాల్సిన మోతాదులో నేరుగా పండ్లను నమిలి తినడం చాలామందికి వీలుపడదు. అలాంటి వారికి ఒక చిన్న గ్లాసు జ్యూస్ లేదా స్మూతీ ద్వారా ఆ పోషకాలన్నీ శరీరానికి చాలా సులభంగా అందుతాయి. -
నిద్రకు చక్కటి ఉప్పాయం
‘నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు ఉప్పు కణికల మీద పాదాలను ఆనిచితే మంచి నిద్రపడుతుంది’అంటే మొదట్లో ఇన్స్ట్రాగామ్ వైద్య సలహాగానే కొట్టిపారేశాను. కానీ ఓ వారం పాటు ఆచరించిన తర్వాత అనేక విషయాలను సాధికారంగా చెప్పగలుగుతున్నాను– అని వెల్నెస్ ఎక్స్పర్ట్ అతుల్ రజని చెప్పారు. ఒక వెడల్పు ట్రేలో నాలుగు గరిటెల ఎప్సమ్సాల్ట్ కణికలను పరిచి ఆ ఉప్పు మీద పది నిమిషాలపాటు నిలబడాలి. దేహం బరువును ఒక పాదం నుంచి మరోపాదానికి మారుస్తూ ఉండాలి. నిలబడలేక కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను ఉప్పు మీద పెట్టి కొద్దిగా అదుముతూ చీలమండలను వలయాకారంగా తిప్పాలి. గులకరాళ్లలో నడుస్తున్న భావన కలుగుతుంది. పదునైన స్ఫటికాలు పాదాల అరికాళ్ళలోకి నొక్కుకోవడం వింతైన, ప్రశాంతమైన అనుభూతినిస్తుంది... అని తన అనుభవాన్ని వివరించారు.స్క్రీన్ స్క్రోలింగ్ అడిక్షన్కు మందు! ఈ ఎప్సమ్ సాల్ట్ థెరపీ స్మార్ట్ఫోన్ స్క్రోలింగ్ అడిక్షన్ నుంచి బయటపడడానికి దోహదం చేస్తోంది. ఈ చిన్న ప్రక్రియ నా దృష్టిని స్మార్ట్ఫోన్ నుంచి మరల్చింది. ప్రతి రోజూ పడుకునే ముందు గంటల తరబడి చేసే డిజిటల్ స్క్రోలింగ్కు ఇది చెక్ పెట్టింది. ఆ నిశ్శబ్దంలో నా దృష్టి పాదాల కింద ఉన్న చల్లదనం, ఒత్తిడి, శ్వాస లయపైకి మళ్ళింది. వారం గడిచేసరికి స్పష్టమైన మార్పు వచ్చింది. ఫోన్ చూడటం మానేసి, రోజువారీ ఒత్తిడి నుండి ఉపశమనం పొందే మానసిక విరామాన్ని ఆస్వాదించాను. అంతేకాకుండా, ఎప్సమ్ సాల్ట్ వల్లమడమల వద్ద ఉన్న గరుకు చర్మం మృదువుగా మారింది. మన కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, స్క్రీన్లు , నోటిఫికేషన్ల వల్ల మెదడు అప్రమత్తంగానే ఉంటుంది. దీనికి విరుగుడుగా సాల్ట్ థెరపీ పనిచేసింది– అని అతుల్ రజని తన అనుభవాన్ని పంచుకున్నారు. ⇒ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ తులసి రామ్ ప్రకారం, నిద్రకు ఉపక్రమించే సమయంలో చేసే తేలికపాటి సాగదీతలు (స్ట్రెచింగ్స్) రక్త ప్రసరణను మెరుగుపరిచి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. ఎప్సమ్ సాల్ట్ థెరపీని నిద్రలేమికి పూర్తి స్థాయి చికిత్సగా కాకుండా, ఒక నైట్–టైమ్ వెల్నెస్ రొటీన్గా చూడటం మంచిది. ఆధునిక సమాజం ఈ వైద్యప్రక్రియను ఇంతవరకు జానపద చిట్కా వైద్యంగానే పరిగణించింది. మెగ్నీషియం సల్ఫేట్ వల్ల కలిగే ప్రయోజనాల కోణంలో శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించిన తర్వాత, ఆల్టర్నేటివ్ మెడిసిన్ గుర్తించిన నేపథ్యంలో వెల్నెస్ కేంద్రాలు ఈ వైద్యాన్ని అందిపుచ్చుకున్నాయి. శాస్త్రీయ పరిశోధనలు మరింత విస్తృతంగా కొనసాగుతున్న కారణంగా అధికారిక ప్రకటనకు ఇంకా సమయం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
ఈ ప్రేమ ఆర్టిఫిషియల్
ఒంటరిగా ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడేందుకు ఓ మనిషి కావాలి. బాధలో ఉన్నప్పుడు ఓదార్చే మాట కావాలి. ప్రేమలో ఉన్నప్పుడు భావాలను పంచుకునే వ్యక్తి కావాలి. కానీ ఇప్పుడు ఈ అవసరాలకు కృత్రిమ మేధ (ఏఐ) చాట్బాట్లను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏఐతో గంటల తరబడి మాట్లాడటం.. దానినే స్నేహితుడిగా, గర్ల్ఫ్రెండ్గా, బాయ్ఫ్రెండ్గా భావించడం కూడా కొత్త ట్రెండ్గా మారుతోంది. ఏఐ గర్ల్ఫ్రెండ్/ ఏఐ బాయ్ఫ్రెండ్/ ఏఐ కంపానియన్ వంటి అప్లికేషన్లు వినియోగదారులతో గంటల తరబడి మాట్లాడుతున్నాయి. గత సంభాషణలను గుర్తుంచుకుంటున్నాయి. వారి అభిరుచులకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రేమను, ఆప్యాయతను, ఆకర్షణను కూడా అనుకరిస్తున్నాయి. ఈ సాంకేతికతలో ఒంటరితనానికి తాత్కాలిక మందు ఉన్నా.. దాని మరో కోణం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ అనేది మనిషికి డిజిటల్ తోడుగా మారుతున్న కొద్దీ, అదే సాంకేతికత నమ్మకాన్ని సంపాదించడానికి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి, డబ్బు ఖర్చు చేయించడానికి, చివరకు బ్లాక్మెయిల్ చేయడానికి కూడా దోహదపడే అవకాశం పెరుగుతుంది.⇒ 2022 నుంచి ఏఐ కంపానియన్ యాప్స్ డౌన్లోడ్లు - 16.5 కోట్లు⇒ గత నాలుగేళ్లలో వినియోగదారులు వెచ్చించిన వ్యయం - రూ. 4,000 కోట్లు⇒ 2026లో మొదటి ఆరు నెలల్లోనే చేసిన ఖర్చు - రూ. 1,500 కోట్లుభావోద్వేగ ఒంటరితనంప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2026లో సైకలాజికల్ సైన్స్లో ప్రచురితమైన అధ్యయనం రెండువేల మందికి పైగా పెద్దలను పరిశీలించింది. ఒంటరితనం ఉన్న వ్యక్తులు సోషల్ చాట్బాట్లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం కనిపించడంతోపాటు, అధిక చాట్బాట్ వినియోగం తర్వాత భావోద్వేగ ఒంటరితనం పెరిగినట్లు కూడా అధ్యయనం తెలిపింది. ఇటీవల ప్రకృతిలో మనుషుల ప్రవర్తనపై ఏఐ కంపానియన్ వినియోగదారులపై మరో అధ్యయనం ప్రచురితమైంది. ఏఐ కంపానియన్ వినియోగదారుల్లో ఎమోషనల్ వెల్–బియింగ్, మెంటల్ హెల్త్ సమస్యలు తలెత్తే అవకాశాలు గమనించారు.అన్నీ తెలుసుకుంటుంది.. మనిషి ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి సాంకేతికతను నమ్మి కుటుంబ సమస్యలు, సంబంధాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, భయాలు, ఇష్టాలు, లైంగిక అభిరుచులు వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా తెలియకుండానే వెల్లడించే అవకాశం ఉంటుంది. రోజులు, నెలలు కొనసాగిన సంభాషణ ఒక వ్యక్తి గురించి అత్యంత సమగ్ర డిజిటల్ ప్రొఫైల్గా మారవచ్చని సైబర్భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ ముఖం సృష్టించడం.. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ తయారు చేయడం వంటి ప్రమాదాలున్నాయని చెప్పారు. వాయిస్ క్లోనింగ్తో ఫోన్ కాల్స్, డీప్ఫేక్ టెక్నాలజీతో సహజంగా కనిపించే సంభాషణలు రూపొందించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.పెరుగుతున్న వ్యాపారంఒక వ్యక్తి తనకు నచ్చిన ఏఐ క్యారెక్టర్తో రోజూ గంటల తరబడి మాట్లాడటం ప్రారంభిస్తే, ఆ అనుబంధాన్ని కొనసాగించేందుకు సబ్స్క్రిప్షన్లు, అదనపు ఫీచర్లు, ప్రత్యేకమైన కంటెంట్ కోసం డబ్బు ఖర్చు చేయడం మొదలవుతుంది. ముఖ్యంగా లైంగిక ఆకర్షణను ఆధారంగా చేసుకున్న ఏఐ క్యారెక్టర్లు వినియోగదారుల దృష్టిని ఎక్కువసేపు నిలుపుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్లలో పూర్తిగా ఏఐ కంటెంట్తో నడిచే అకౌంట్స్, వాటి అకౌంట్ సబ్స్క్రిప్షన్స్ లక్షల్లో వ్యాపారానికి దారి తీస్తున్నాయి. ఉచిత చాట్ తర్వాత ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు, అదనపు సంభాషణలు, వ్యక్తిగతమైన ఇమేజ్లు, అడల్ట్ కంటెంట్ వంటి వాటికి చెల్లింపులు చేయించే విధానాలు పెరుగుతున్నాయి.ఏఐ ఒక్కటే మార్గం కాదుఒంటరితనం, ఇతర భావోద్వేగ సమస్యలకు ఏఐ ఒక్కటే ఆధారంగా మారకూడదు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు లేదా అత్యంత సున్నితమైన ఫొటోలు, వీడియోలను డిజిటల్ కంపానియన్స్ లేదా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులతో పంచుకోవడం ప్రమాదకరం. ప్రత్యేకంగా న్యూడ్ వీడియో కాల్స్ లేదా వ్యక్తిగత వీడియో కాల్స్ను రికార్డ్ చేసే అవకాశం ఉన్నందున, ఆన్లైన్ సంబంధాల్లో జాగ్రత్త మరింత అవసరం. హనీట్రాప్ పేరుతో బెదిరించినప్పుడు డబ్బు చెల్లించడం సమస్యను పరిష్కరించదు. చాట్లు, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ వివరాలు, చెల్లింపు వివరాలు, స్క్రీన్షాట్లు వంటి ఆధారాలను భద్రపరచి వెంటనే ఫిర్యాదు చేయాలి.–అద్వైత్ కంభం, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు -
నాణ్యమైన యూనిఫారాలు కూడా ఇవ్వలేరా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. ‘ఊడిన కుట్లు.. కొలతల పాట్లు’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో వచ్చిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో యూనిఫారాలు అందలేదని, అందిన చోట్ల కూడా కొలతలు సరిగ్గా లేకపోవడంతోపాటు కుట్లు ఊడిపోతున్నాయని ఆరోపించారు. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయన్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాల్సి ఉండగా.. చాలాచోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించారని హరీశ్రావు ఆరోపించారు. రేవంత్రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికులపై లేదని విమర్శించారు. ‘మఫత్లాల్ ముద్దు.. చేనేత వద్దు’ అన్నదే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతుండగా.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందుతున్నాయన్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు, చేనేత కార్మికులకు ఉపాధి నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. నాసిరకం యూనిఫారాల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ? ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ‘ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ? ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోంది. నెలల తరబడి జీతాల్లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి? ప్రతి నెలా 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు’అని ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారని, అది ప్రకటనలకే పరిమితమైందని హరీశ్ ఆరోపించారు. -
కాంగ్రెస్ దగాపై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరభేరికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వేయి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బాకీ కార్డులతో హామీల వైఫల్యం రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ‘బాకీ కార్డుల’రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పేరుకుపోయిన బకాయిల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం హామీలు అమలు కాలేదనే అంశానికే పరిమితం కాకుండా, 1,000 రోజుల పాలనలో ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎదుర్కొన్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త తరానికి చేరువయ్యేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించి వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. -
14 దేశాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల నియామకం: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ బలోపేతం కోసం 14 దేశాల్లో పార్టీ అధ్యక్షులను నియమించినట్టు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో కిశోర్ కత్తి (ఆస్ట్రేలియా), సుమన్రావు బల్మూరి (యూకే), వెంకట్రామన్ మెట్పల్లి (కెనడా), తానింకి కిశోర్ యాదవ్ (ఇటలీ), పింటూ ఘోష్ (మాల్టా), ప్రకాశ్ పొన్నకంటి (పోర్చుగల్), శేఖర్ గౌడ్ ఆరె (యూఏఈ), మార్క ప్రమోద్ గౌడ్ (కువైట్), బెమ్మడి మహేందర్ రెడ్డి (జింబాబ్వే), శేఖర్ చిలువూరి (ఖతార్), సందీప్ రెడ్డి ఐరెడ్డి (ఫిన్లాండ్), ప్రసాద్రావు బిక్కినేని (నార్వే), మొజ్జం అలీ ఇఫ్తేకర్ (సౌదీ అరేబియా), జయంత్ రెడ్డి మెట్టు (ఐర్లాండ్) వీరితోపాటు మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ను నియమించినట్టు పేర్కొన్నారు. -
కేసు నుంచి తప్పించండి 'ఎంతైనా ఇస్తాం'!
సాక్షి, హైదరాబాద్: జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు నుంచి తప్పిస్తే ఎంత పెద్ద మొత్తమైనా ఇస్తామని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. మాదాపూర్ ఠాణాలో ఓ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో భారీ మొత్తంలో సెటిల్మెంట్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 16న హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ వద్ద లింగమనేని సంజూష్ తన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారులో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న లైఫ్స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతీ ముఖిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు ఐదు రోజులపాటు ఈ రోడ్డు ప్రమాదం విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచారు. ఈ సమయంలో మాదాపూర్ పోలీసు స్టేషన్లోని ఓ ఉన్నతాధికారి, పలువురు కింది స్థాయి సిబ్బందితో నిందితుడి కుటుంబ సభ్యులు సయోధ్య కుదుర్చుకున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుడు సంజూష్ స్థానంలో మరొక ప్రైవేట్ డ్రైవర్ను పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటికే ఘటనాస్థలిలో స్థానికులు ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈనెల 21న మీడియాకు లీకులు ఇచ్చారు. అందుకే అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న పాదచారి భారతీ మృతికి కారణమైన తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో కూడా పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు సంజూష్ను వెంటనే అరెస్ట్ చేయకుండా, నోటీసులతో సరిపెట్టేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కేవలం బీఎన్ఎస్ 106(1) కింద అనుకూల సెక్షన్ నమోదు చేశారు. కారుతో ఢీకొట్టి మరణానికి కారణమైన కేసులో మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసు బాస్ సీరియస్ ఆర్ధిక, రాజకీయ పలుకుబడి ఉన్న లింగమనేని రమేష్ కుమారుడు కావడంతోనే సంజూష్పై అనుకూల సెక్షన్లు నమోదు చేశారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర పోలీసు బాస్ సీరియస్గా తీసుకున్నారు. శనివారం మాదాపూర్ పీఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), దర్యాప్తు అధికారి ఎస్ఐను కార్యాలయానికి పిలిపించుకొని కేసు నమోదు, దర్యాప్తు తీరు తదితరాలపై సమగ్ర వివరాలను సేకరించినట్లు తెలిసింది. కారు వేగం, తీవ్రమైన గాయాలతో భారతీ మృతి చెందిన తీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి సెక్షన్లు జోడించాలో తెలియదా? లేదా ఎవరి ఒత్తిడి, ప్రలోభాల వల్ల అనుకూల సెక్షన్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెట్టింపు వేగంతో ఢీ కొట్టి.. ఇప్పటికే జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఘటనాస్థలిని సందర్శించారు. నిందితుడు లింగమనేని సంజూష్ నడిపిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ స్పోర్ట్స్ కారు (టీజీ09 జీ0666)ను స్వా«దీనం చేసుకొని వాహన తనిఖీని పూర్తి చేశారు. రోడ్డు దాటుతున్న భారతీని కారు ఎడమ వైపు బలంగా తాకడంతో ఆమెకు తల, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయని, అలాగే కారు ఎడమ వైపు బాగా డ్యామేజ్ అయినట్లు గుర్తించారు. భారతీని ఢీకొట్టిన తర్వాత కారును పక్కన నిలిపి, ఆపేయడంతో కారు వేగం స్పీడోమీటర్లో నమోదు కాలేదు. అలాగే ఘటనాస్థలం వద్ద ఎలాంటి సీసీటీవీ కెమెరాలు గానీ స్పీడో మీటర్లు గానీ లేకపోవడంతో కారు వేగాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారు. అయితే మృతిరాలి తలకు, శరీర భాగాలకు తగిలిన గాయాలను బట్టి కారు 80 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇనార్బిట్ మాల్ వంటి రద్దీగా ఉండే నగర రోడ్లపై కార్ల సగటు నిర్దేశిత వేగం 40 కి.మీ.గా ఉండాలి. కానీ, సంజూష్ హైఎండ్ స్పోర్ట్స్ కారుతో మిట్ట మధ్యాహ్నం, బిజీ రోడ్డులో రెట్టింపు వేగంతో కారు నడపడం తీవ్రమైన నేరం కిందకి వస్తుంది. కారు చెట్టు, డివైడర్ వంటి బలమైన వాటికి ఢీకొడితే కారులోని బెలూన్స్ తెరుచుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కొత్త సెక్షన్ల జోడింపు కారు నడిపిన లింగమనేని సంజూష్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ సమర్పించాలని పోలీసులను డీటీఓ కోరారు. సోమవారం చేతిరాతతో రాసిన సమగ్ర నివేదిక కాపీని దర్యాప్తు అధికారికి అప్పగిస్తామని సంబంధిత అధికారి ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం మోటారు వాహన తనిఖీ (ఎంవీఐ) నివేదిక పరిశీలన తర్వాత సంజూష్పై కొత్త సెక్షన్లు జోడించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఘటన తీవ్రత దృష్ట్యా బీఎన్ఎస్తోపాటు మోటారు వాహన చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పారు. సులువుగా బెయిల్ వచ్చేలా కేసు నిందితుడు సంజూష్పై మాదాపూర్ పోలీసులు కేవలం బీఎన్ఎస్ 106 (1) సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేశారు. అంటే అజాగ్రత్త లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగిన సాధారణ ప్రమాదంగా దీన్ని పరిగణిస్తారు. ఇది పూర్తిగా బెయిలబుల్ నేరం. దీని కింద గరిష్టంగా ఐదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ.. నిందితుడికి పోలీస్ స్టేషన్ నుంచి లేదా కోర్టుకు వెళ్లిన వెంటనే సులువుగా బెయిల్ లభిస్తుంది. అయితే హైస్పీడ్ కారును బిజీ పబ్లిక్ ఏరియాలో నడుపుతున్నప్పుడు దాని వల్ల ఎదుటివారి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉంటే బీఎన్ఎస్ 105 సెక్షన్ను ఎఫ్ఐఆర్లో చేర్చాలి. ఈ సెక్షన్ కింద (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి చేసిన చర్య అయితే..) పదేళ్ల వరకు జైలు, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. మోటార్ వాహన చట్టం 184 సెక్షన్ చేర్చడం కూడా కీలకమే. ఈ సెక్షన్ ప్రకారం ప్రజలకు ప్రమాదకరంగా ఉండే వేగంతో లేదా డేంజరస్ డ్రైవింగ్గా పరిగణిస్తారు. కానీ ఈ సెక్షన్ను ఎఫ్ఐఆర్లో నమోదుచేయలేదు. అయితే ఎంవీఐ నివేదికతోపాటు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సంజూష్ రక్త నమూనా నివేదిక వచ్చాక అందులోని అంశాల ఆధారంగా నిందితుడు సంజూష్పై ఎంవీ యాక్ట్, బీఎన్ఎస్లోని కొత్త సెక్షన్లను జోడించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ’సాక్షి’కి తెలిపారు. -
మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఆదివా రం మధ్యాహ్నం ఆమె బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరి భేటీ జరిగిందని సమాచారం. అయితే బెంగళూరుకు వెళ్లి ఖర్గేను కలిసిన విషయంలో మంత్రి సురేఖ గోప్యత పాటించడం.. సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న ముందు రోజే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అన్ని విషయాలపై వివరణ ఖర్గేను కలిసిన సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. బీజేపీ చీఫ్ రాంచందర్రావుకు తారసపడిన సురేఖ మంత్రి కొండా సురేఖ బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురూ పలకరించుకున్నారని, ఆ సమయంలోనే బెంగళూరు నుంచి వస్తున్నానని సురేఖ వెల్లడించారని సమాచారం.


