Orissa
-
ఫాస్ట్ఫుడ్ దుకాణంలో సిలిండర్ లీక్
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కాట్రగుడ గ్రామంలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో వంట గ్యాస్ లీకై ంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్లను బయటకు తీసి ప్రమాదాన్ని తప్పించారు. ప్రమాదంలో ఫాస్ట్ఫుడ్ కేంద్రం యజమాని సుశాంత్ తీవ్రంగా గాయ పడ్డారు. కత్తి చూపి గొలుసు దొంగతనం జయపురం: జయపురంలో చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైక్పై వచ్చిన ముగ్గురు స్నాచర్లు ఇద్దరు మహిళలను కత్తితో బెదిరించి మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకు పోయారని ఫిర్యాదులు అందయాని స్థానిక పోలీసులు సోమవారం తెలిపారు. ఎంజీ రోడ్డు నివాసులు జి.రమణమ్మ, ఆమె స్నేహితురాలు పి.హేమ సోమవారం ఉదయం వాకింగ్ కోసం పూర్ణాఘడ్లో దక్షిణ కాళీ మందిరం వెళ్తుండగా ముగ్గురు దుండగులు బైక్పై వచ్చి వారికి కత్తితో బెదిరించి వారి మెడలలో ఉన్న బంగారు గొలుసులు దోచుకు పోయారు. దుండగులు ఏనుగుల శాల వైపు వెళ్లిపోయినట్టు బాధితులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రోగ నిర్ధారణ మిషన్ కోసం ఆర్థిక సాయం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో సికిల్ సెల్ అనీమియా, క్షయ రోగ నిర్ధారణ స్క్రీనింగ్ కోసం నవరత్న కంపెనీ నాల్కో ఫౌండేషన్ వారు సోమవారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ కు 1కోటి 24లక్షల 70వేలు చెక్కును అందజేశారు. ఈ సాయంతో అతి త్వరలోనే వ్యాధి నిర్ధారణ మిషన్ను తీసుకువస్తామని తెలిపారు. బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి పూజారిగుడ పంచాయతీ బాసినీగుడలో గల సహిద్ లక్ష్మణ నాయక్ డిగ్రీ కళాశాలలో వేసవి శిబిరం ఆదివారం ప్రారంభించారు. ఈ క్యాంపులో బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ రాజేష్ మహురియ రాష్ట్ర పురస్కార గ్రహీత స్వచ్ఛంద సేవకులు సంతోష్ కుమార్లు పాల్గొని బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. పైపులు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు మల్కన్గిరి: వుల్కన్గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలెం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న మెగా మంచినీటి ప్రాజెక్ట్ నుంచి ఇనుప పైపులను ఆదివారం రాత్రి చోరీ చేసిన ఇద్దరిని గ్రామస్తులు పట్టుకొని కలిమెల పోలీసులకు అప్పగించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో కూఢ ఎండీవీ 8 గ్రామానికి చెందిన దేవబ్రత హాల్దార్, ఎంపీవీ 17 గ్రామానికి చెందిన అమిత్ మండాళ్ ఉన్నారన్నారు. కలిమెల ఐఐసీ చంద్రకాంత్ తండి వీరిపై కేసు నమోదు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపు నేడుఅరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆల య హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మంగళవా రం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలోనిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ ప్రక టనలో తెలియజేశారు. ఈమేరకు నిబంధనల ప్రకా రంగ్రామపెద్దలు, ఆలయ పాలకమండలి సభ్యులు, అఽధికారులు, ప్రధానార్చకులు సమక్షంలో హుండీ లను తెరిపించి లెక్కింపును చేపడతామని ఆయన వివరించారు. -
దుప్పలపాడులో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం అల్లు మహేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అల్లు మహేశ్వరరావు, అతని భార్య లక్ష్మి ఇరువురు తమ ఇంటికి తాళం వేసి ఉదయం కూలి పనులకు వెళ్లిపోయారు. వారు సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడ్డారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించారు. కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న నగదుతో పాటు సుమారు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. -
ఎట్టకేలకు నిఖిలేష్ మృతదేహం వెలికితీత
జయపురం: కెనాల్లో గల్లంతైన స్థానిక మహారాణిపేట రామ్దాస్లైన్ యువకుడు పి.నిఖిలేష్ మృతదేహాన్ని దాదాపు 60 గంటల తర్వాత వెలికి తీశారు. ఈ సంఘటనపై జయపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోస్టుమార్టం తర్వాత అతడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పట్టణ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి వెల్లడించారు. ఉదయం కుంధారగుడ సమీప ప్రధాన కెనాల్లో శవం తేలుతుండటం ప్రజల చూశారు. ఆ మృతదేహం ధన్పూర్ శాఖ కెనాల్ వరకు కొట్టుకువెళ్లి అక్కడి గేట్కు చిక్కుకుంది. ఆ ప్రాంత ప్రజలు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు, నిఖిలేష్ కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మృత దేహాన్ని బయటకు తీయగా కుటుంబ సభ్యులు గుర్తు పట్టారు. అనంతరం నిఖిలేష్ మృతదేహాన్ని కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ యువకుడు సతిగుడ డేమ్ ఎల్లో బ్రిడ్జి వద్ద కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
జైలుకెళ్లినా తీరు మారలేదు
కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా): జైలుకెళ్లినా వారి తీరు మారలేదు. ఒకరు గంజాయి కేసులోనూ, మరొకరు దొంగతనం కేసులోనూ శిక్ష అనుభవించి ఈ నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు. మరలా పాత పంథాలోనే నేరాల బాట పట్టడంతో కటకటాల వెనక్కి వెళ్లారు. మండలంలో బత్తివానిపాలెం కూడలి వద్ద సోమవారం 12 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరి నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఆర్.ధనుంజయ్ వివరాల ప్రకారం... ఇక్కడ వాహనాలను తనిఖీ చేస్తుండగా, బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను తనిఖీ చేశారు. వీరి వద్ద బ్యాగుల్లో 12 కిలోల గంజాయిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. వీరిది ఢిల్లీకి చెందిన శిబరాం ప్రధాన్, ఒడిశాకు చెందిన నందన్రాంగా గుర్తించారు. ఈ గంజాయిని ఒడిశాలోని జోలాపుట్ నుంచి బత్తివానిపాలెం కూడలి మీదుగా పెందుర్తి రైల్వే స్టేషన్కు తీసుకెళ్లే క్రమంలో పట్టుబడ్డారు. బరంపురం జైల్లో శిబరాం ప్రధాన్ గంజాయి కేసులోను, నందన్రాం దొంగతనం కేసులో శిక్ష అనుభవించి ఈ నెలలోనే విడుదలయ్యారు. అక్కడ జైల్లో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరూ మరలా గంజాయి రవాణాకు పాల్పడుతూ పట్టుబడ్డారు. వీరిద్దరిపైన కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి విలువ రూ.60 వేలు ఉంటుందన్నారు. 12 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు నిందితులు -
విషాహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి రామగిరి ప్రాంతంలో తులసీనగర్లో ఐదుగురు చిన్నారులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు రామగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రామగిరిలో చికిత్స పొందుతూ ఒక చిన్నారి తులసీ బోడమొండి (5) మృతిచెందగా, పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి గుణాబతి బోడమొండి (3) మృతి చెందినట్టు ఆర్.ఉదయగిరి పోలీసులు తెలియజేశారు. మిగతా ముగ్గురు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఇచ్చే ఛతువా పిండిలో మరేదో ఆహారం కలిపి తినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ డాక్టర్లు అనుమానిస్తున్నారు. -
విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో ఉమ్మర్కోట్ సబ్ డివిజన్ జొరిగాం సమితి డోడ్రా, రాయిఘర్ సమితి జొడింగాలో 33/11 కేవీ విద్యుత్ స్టేషన్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ, విద్యాశాఖ మంత్రి సోమవారం ప్రారంభించారు. నబరంగ్పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్రా పాల్గొన్నారు. కాలుష్యంతో అవస్థలు జయపురం: జయపురం పట్టణ సమీప మొకాపుట్ ప్రాంతలో పురపాలక పరిషత్ వారు పట్టణంలో చెత్తను పారవేసేందుకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులో సోమవారం మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రాంత వాసులు పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ యార్డుకు సమీపంలోనే ఆశ్రమ పాఠశాల ఉంది. డంప్ యార్డు నుంచి వెలువడే దుర్ఘంధం వలన విద్యార్థులు అనారోగ్యానికి లోనవుతున్నారు. యార్డులో మంటలు రేగడం వల్ల వేడి గాలలు వీస్తున్నాయని స్థానికులు అంటున్నారు. కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వినతుల స్వీకరణ మల్కన్గిరి: జిల్లా కోరుకొండ సమితి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. సమితిలోని పలు పంచాయతీలకు చెందినవారు వినతిపత్రాలను అందజేశారు. పాత చిత్తపరికి రహదారి నిర్మించాలని ఆ గ్రామస్తులు కోరారు. మొత్తం 27 వినుతులు అందినట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ వినోద్ పటేల్, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సబర్, కోరుకొండ సమితిలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రానైట్ టిప్పర్ స్వాధీనం పర్లాకిమిడి: గుసాని సమితి యం.యస్.పూర్ గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న గ్రానైట్ లోడ్ను జిల్లా మైన్స్ అధికారి దిపెన్ పరిడా సోమవారం ఉదయం పట్టుకుని స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్కు తరలించారు. గ్రానైట్ తరలిస్తున్న టిప్పర్కు ఎటువంటి మైన్స్కు సంబంధించి లీజు కాగితాలు లభించకపోవడంతో గ్రానైట్ కంపెనీ యాజమానికి ఒక లక్షా ఆరువేల రూపాయల జరిమానాను జిల్లా మైన్స్ అధికారి దీపెన్ పరిడా విధించారు. నిధుల గోల్మాల్పై ఫిర్యాదు హిరమండలం: మండలంలోని తంప పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్కు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మామిడి చిన్నబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీపీవోకు ఆదేశించారు. పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ శాఖలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి అయినటువంటి తన పేరును ఉప సర్పంచ్గా రికార్డుల్లో చూపి దుర్వినియోగం చేసినట్లు వాపోయాడు. -
కార్టూన్స్ పోటీలో ‘శేఖర్బాబు’కు అవార్డు
పర్లాకిమిడి: విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం(విశాఖ) తరఫున నిర్వహించిన అంతర్రాష్ట్ర కార్టూన్స్ పోటీలలో పర్లాకిమిడి (ఒడిశా) కు చెందిన కార్టూనిస్టు శేఖర్బాబుకు ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు వచ్చింది. విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ఆదివారం జరిగిన బహుమతి ప్రదాన ఉత్సవంలో ప్రముఖ సాహితీవేత్త కావూరి సత్యవతి ముఖ్యఅతిథిగా పాల్గొని వేదికపై శేఖర్బాబుకు మెమొంటో, రూ.1000లు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం అధ్యక్షులు పి.వి.రామశర్మ, యస్.లక్ష్మణరావు (లాల్), టి.రాజేంద్రబాబు, కె.బి.ఎన్.కళాశాల ప్రిన్సిపల్ డా.క్రిష్ణవేణి, క్రియేటివ్ కల్చరల్ కమిషన్, డైరక్టర్ ఆర్.మల్లి కార్జున రావు, కార్టూన్ పోటీల నిర్వాహకులు కె.వి.వి.సత్యన్నారాయణ, హాస్యానందం ఎడిటర్ రాము పండా తదితరులు పాల్గొన్నారు. -
నిఘా నడుమ టెన్త్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అధికారుల నిఘా నడుమ కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో జరిగిన మ్యాథ్స్ పరీక్షకు రెగ్యులర్, న్రైవేటు కలిపి 28,584మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 28,384 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 199 మంది గైర్హాజరయ్యారు. సోమవారం మ్యాథ్స్ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని డీఈఓ స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు మస్తానయ్య కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాలతో పాటు పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. డీఈవో డాక్టర్ తిరుమలచైతన్య జలుమూరు, సారవకోట మండల పరిధిలో ని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పిలిలో ప్రశాంతం ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గణితం పరీక్షను రాష్ట్ర పరిశీలకులు, మస్తానయ్య, మండల విద్యా శాఖ అధికారి కె.పున్నయ్య పరీక్ష పరిశీలించారు. ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 9 గదుల్లో 425 మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు 21 మందిని మార్పు చేశారు. ిసట్టింగ్ స్క్వాడ్గా వ్యవహరించిన డీఈఓ సారవకోట: మండలంలోని బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 10వ తరగతి లెక్కలు పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్గా డీఈఓ తిరుమల చైతన్య వ్యవహరించారు. ఇక్కడ పరీక్షలు జరుగుతున్న విధానంపై అనుమానం రావడంతో పాటు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన పరీక్ష కేంద్రాన్ని తొలుత పరిశీలించి అనంతరం పరీక్ష ముగిసే వరకు అక్కడే ఉన్నారు. 10వ తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
దేబేంద్ర శర్మకు నివాళి
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో సభ్యులు సోమవారం కాసేపు మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ మృతిపై సంతాపం ప్రకటించి మౌనం పాటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. విపక్ష నేత నవీన్ పట్నాయక్ తరఫున ప్రసన్న ఆచార్య ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సురమా పాఢి సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం సభలో సభ్యులు ఒక నిమిషం మౌనం పాటించి దివంగత మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర శర్మకు నివాళులు అర్పించారు. పవిత్ర పుష్కరిణిలో తేలిన శవం భువనేశ్వర్: పూరీలోని పవిత్ర శ్వేత గంగ పుష్కరిణిలో మృత దేహం తేలింది. బాలాసోర్ బొస్తా ప్రాంతానికి చెందిన గోవింద బింధాని శవంగా గుర్తించారు. ఈ శవాన్ని అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. శవ పరీక్ష కోసం సదరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శియ్యాళీలో గ్రీవెన్స్ పర్లాకిమిడి: కాశీనగర్ సమితి శియ్యాళీ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ ముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్కు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్పండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్పందన కార్యక్రమానికి మొత్తంగా 79 వినతులు అల్లడ, కిడిగాం, గోరిబంద, ఖండవ పంచాయతీల నుంచి అందాయి. వాటిలో ఒకటి అక్కడికక్కడే పరిష్కరించగా, గ్రామసమస్యలు 29, వ్యక్తిగతం 50 ఉన్నాయి. కార్యక్రమానికి గుసాని సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, కాశీనగర్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి డంబురధర మల్లిక్, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ ఎంఎం ఆలీ, డీఎస్ఎస్ఓ సంతోష్కుమార్ నాయక్, సర్పంచు, సమితి సభ్యులు పాల్గొన్నారు. -
గంజాయితో యువకుడు అరెస్టు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తూ ఒక యువకుడు సోమవారం పట్టుబడినట్లు సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్, సబరాపల్లికి చెందిన ఆమద్ ఆనంద్ సోమవారం ఉదయం 10 గంటలకు గంజాయితో పట్టుబడ్డాడు. స్వగ్రామం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకు తరలించేందుకు రూ.3 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, పలాస రైల్వేస్టేషన్ రన్నింగ్ రూం పక్కరోడ్డులో నడుచుకుంటూ స్టేషన్లోకి వచ్చే సమయంలో పోలీసులను చూసి రెండు బ్యాగులు వదిలి ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వెంబడించగా నిఖిల్ పాని తప్పించుకోగా, ఆమద్ అనంద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 21.7 కేజీల గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మకందారులు, మధ్యవర్తులు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. -
నరకం
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 202512గంటల..కొరాపుట్: విశాఖపట్నం–రాయ్పూర్ జాతీయ రహదారి–26 పై ఆదివారం రాత్రి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు వివిధ సమయాల్లో సుమారు 12 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి సునాబెడా మధ్య మెహన్ పొడ గ్రామ సమీపంలో అత్యధికంగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు విస్తరణ పనులు గత 4 నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. అనేక చోట్ల గోతులు తీశారు. రోడ్డు మెత్తం మట్టి పనులు జరుగుతున్నాయి. కాల వైశాఖి ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీ వర్షం పడింది. దాంతో మట్టి బురదగా మారింది. సుమారు 12 కిలోమీటర్ల పరిధిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అనేక చోట్ల పోలీసు వాహనాలు, అంబులెన్స్లు కూడా ముందుకెళ్లలేక నిలిచిపోయాయి. ఈ మార్గం గుండా ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొరాపుట్, నబరంగ్పూర్, మల్కన్గిరి జిల్లాలతో పాటు చత్తీస్గఢ్కు వెళ్తారు. రాయ్పూర్, భువనేశ్వర్, విజయవాడ, పూరి, రాజమండ్రి, విశాఖపట్నం తదితర పట్టణాలకు ఈ మార్గం గుండా రాత్రి పూట బస్సు సర్వీసులు నడుస్తాయి. దాంతో వందలాది మంది ప్రయాణికులు బస్సులలో ఉండి పోయి అవస్థలు పడ్డారు. ఉదయం పూట పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు బురద లోనే నడుచుకుంటూ ముందుకు సాగారు. ప్రతి అరగంటకు వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఈ వార్తలు దానావలంగా వ్యాపించడం తో విశాఖ పట్నం నుంచి వచ్చే వాహనాలు అరుకు,నందపూర్ మీదుగా జయపూర్ వైపు మళ్లాయి. భువనేశ్వర్ వైపు వెళ్లే వాహనాలు రాయగడ లేదా భవాని పట్న వైపు మరలాయి. న్యూస్రీల్ స్తంభించిపోయిన విశాఖపట్నం– రాయ్పూర్ జాతీయ రహదారి కొరాపుట్–సునాబెడాల మధ్య నిలిచిపోయిన వందలాది వాహనాలు -
వంతెనను ఢీకొట్టిన లారీ
రాయగడ: రాయగడ నుంచి ఆంధ్రకు వెళ్లే ప్రధాన రహదారి మజ్జిగౌరి మందిర సమీపంలో ఉన్న వంతెనను లారీ ఢీకొనడంతో ఈ మార్గంలో రాకపొకలు నిలిచిపోయాయి. సోమవారం ఛత్తీస్ఘడ్ నుంచి ఆంధ్ర వైపు బొగ్గు లోడుతో వెళ్లున్న లారీ వంతెన మలుపులో అదుపుతప్పి ఢీకొంది. శనివారం ఆంధ్ర నుంచి రాయగడ మీదుగా వచ్చిన లారీ వంతెన మధ్యలో మరమ్మతులకు గురై నిలిచిపోవయింది. చిన్న మార్గం కావడంతో రకాపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతవరకు ఆ లారీని వేరే ప్రాంతానికి తరలించకపొవడంతోపాటు వంతెన మలుపు వద్ద లారీ ఢీకొని ఉండి పోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపొయింది. పోలీసులు చొరవ తీసుకుని రాయగడ మీదుగా ఆంధ్ర వైపు వెళ్లే భారీ వాహనాలను వ్యూ పాయింట్ మీదుగా వెళ్లేలా మరలించడంతో కొంతమేర సమస్య కొలిక్కి వచ్చింది. తరచూ ఈ వంతెన వద్ద ఇటువంటి సమస్యలు తలెత్తుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఘనంగా సరస్వతీ బాల మందిర వార్షికోత్సవం
జయపురం: విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులకు గురుతర బాధ్యత ఉందని జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన్ కుమార్ నాయక్ అన్నారు. జయపురంలోని సరస్వతీ బాల మందిర వార్షికోత్సవాన్ని సోమవారం స్థానిక సంఘం కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందన్కుమార్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక మైన విద్య నేర్పాలన్నారు. సరస్వతీ బాల విద్యామందిర్ పరిచాలన కమిటీ ఉపాధ్యక్షుడు నవీనచంద్ర మహంతి అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయులు ఓం ప్రకాశ్ మిశ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, ఆకాశవాణి జయపురం విభాగ విశ్రాంత అధికారి ఉదయ శంకర జానీ, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయక్, సహాయక కార్యదర్శి చంద్ర శేఖర మహాపాత్ర, కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి ప్రసంగించారు. క్రీడా, విచిత్ర వేషధారణ, తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాలలో ప్రతిభావంతులను సన్మానించారు. యోగా, నృత్య, సంగీత ప్రదర్శనలు అలరించాయి. కొంత మంది విద్యార్థులు కవితలు చదివి వినిపించారు. -
గుసాని సమితిలో చైన్ స్నాచింగ్
పర్లాకిమిడి: గుసాని సమితి ఏడోమైలు జంక్షన్ వద్ద చైన్స్నాచింగ్ జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో మూడు తులాల బంగారం చైన్ను తెంచుకొని పరారయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏడో మైలు వద్ద బుసుకిడి పంచాయతీకి చెందిన మజ్జి బైరాగి మాస్టార్.. ఆయన భార్య ఎం.జానకమ్మ స్కూటీపై పర్లాకిమిడి మెడికల్కు వచ్చి పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. ఏడోమైలు సమీపంలో ముఖానికి మాస్క్ వేసుకుని వెనుకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు మజ్జి జానకమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కుని రాయగడ వైపు పారిపోయినట్టు బాధితురాలు విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూటీ పైనుంచి దంపతులిద్దరూ రోడ్డు మీద పడిపోయారు. గురండి పోలీసు ఐఐసీ ఓం నారాయణ పాత్రో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడో మైలు జంక్షన్ వద్ద తరచూ చైన్ స్నాచింగ్ సంఘటనలు జరుగుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయండి కొరాపుట్: తమ గ్రామంలో తక్షణం ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా సునాబెడాలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి సోమవారం సిమిలిగుడ సమితి రాజ్పుట్ గ్రామ పంచాయతీ చలాన్పుట్ గ్రామస్తులు తరలివచ్చారు. తమ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని అధికారులు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. స్పందించిన విద్యుత్ ఽశాఖ అధికారులు మూడు రోజులలో ట్రాన్స్ఫారం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. యువకుడు ఆత్మహత్య కొరాపుట్: గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కొట్ సమితి దండసోర్ గ్రామ సమీపంలోని అడవుల్లోని చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని అటుగా వెళ్లిన గిరిజనులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు మల్కన్గిరి: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డడు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి కేంద్రం గోజియాగూడ గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిత్రకొండ సమితి బోడఫోదర్ పంచాయతీ రేఖపల్లి గయరామం గ్రామానికి చెందిన జమున ఖరా, కలిమెల సమితికి చెందిన నీలాంఛల్ సాహులు వాహనాలతో ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు గాయపడడంతో ప్రాథమిక వైద్యం అనంతరం నీలాంచల్ను మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చిత్రకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు ్త చేస్తున్నారు. -
రాష్ట్రంలో నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు: సీఎం
● మూడేళ్లలో 5.92 లక్షల పైబడి ప్రధాన నేరాలు ● భువనేశ్వర్ యూపీడీలో 250కి పైగా క్రిమినల్ కేసులు భువనేశ్వర్: రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శాసన సభలో సోమ వారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 10 ప్రధాన నేరాల కేటగిరీల కింద మొత్తం 5,92,257 కేసులు నమోదైనట్లు ముఖ్య మంత్రి తెలిపారు. రౌర్కెలా ఎమ్మెల్యే శారద ప్రసాద్ నాయక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హత్య, దోపిడీ, దొంగతనం, మోసం, అల్లర్లు, అత్యాచారం, మోటారు వాహన ప్రమాదాలు వంటి 10 ప్రధాన నేర వర్గాలుగా పేర్కొన్నారు. ఈ వర్గాల కింద పెరుగుతున్న నేరాల రేటును పరిష్కరించడానికి ఒడిశా పోలీసులు అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు ముఖ్యమంత్రి సభలో వివరించారు. అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ (ఈఆర్ఎస్ఎస్) రాత్రింబవళ్లు పని చేసే టోల్ ఫ్రీ నంబర్ 112 కు డయల్ చేయడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో సత్వర సేవల్ని అందజేసేందుకు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. నేర దర్యాప్తు వ్యవస్థని సమర్థం చేశామని, కటక్లోని రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్లోని దర్యాప్తు సహాయ విభాగం సమర్థవంతమైన నేర దర్యాప్తుల కోసం జూమ్ మరియు గూగుల్ మీట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించడం విశేషంగా పేర్కొన్నారు. లింగ ఆధారిత హింస నివారణ లింగ ఆధారిత హింసను నివారించడానికి సంపర్క్ టోల్–ఫ్రీ నంబర్ 1800–4191–831 ప్రవేశపెట్టారు. అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 633 పోలీస్ స్టేషన్లలో మహిళలు మరియు పిల్లల డెస్క్లు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. భువనేశ్వర్ అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ (యూపీడీ)లో గత 9 నెలల్లో 285 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. వీటిలో 52 హత్యలు, 97 అత్యాచారాలు, 10 వరకట్న హత్య కేసులు, 1 వరకట్న ఆత్మహత్య కేసు, 37 వరకట్న హింస కేసులు, 44 వరకట్నయేతర హింస కేసులు, 42 మైనర్ బాలికల అత్యాచార కేసులు, 2 సామూహిక అత్యాచార కేసులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖరియార్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మాఝి ఈ వివరాల్ని సభలో ప్రవేశ పెట్టారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
కంచిలి: మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం అర్థరాత్రి ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు, రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన కప్పల జగదీష్ రెడ్డి అనే యువకుడు ఆదివారం కొల్లూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం అతను జాడుపూడి వద్ద భోళా శంకర్ దాబాకు ఆదివారం రాత్రి డిన్నర్కు వచ్చాడు. డిన్నర్ పూర్తి చేసుకొని తన బైక్ మీద జాడుపూడి కాలనీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా, ఇచ్ఛాపురం నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కప్పల జగదీష్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని 108 అంబులెన్స్లో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వేకువజామున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. -
గురుకులాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు
● సజావుగా పదోతరగతి పరీక్షలు ● గురుకుకాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్యబొబ్బిలి: రాష్ట్రంలోని 50 గురుకులాలు, మరో పది కళాశాలల్లో సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొబ్బిలిలోని గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో గురుకులానికీ 8 చొప్పున మొత్తం 480 కెమెరాలను అమర్చేందుకు సంబంధిత వ్యక్తులతో మాట్లాడామని, త్వరలోనే కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ సులువవుతుందన్నారు. అన్ని విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాల ద్వారా ప్రిన్సిపాల్స్, పీఈటీ, పీడీలు విద్యార్థులకు క్రమశిక్షణను మరింత మెరుగుపర్చేందుకు వీలవుతుందన్నారు. బొబ్బిలి గురుకులానికి ప్రహరీ, కంచెల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రహరీ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలో మిగిలిన కొద్దిపాటి భాగం కూడా దాతల సాయంతో నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. మన బడి నాడు–నేడులో భాగంగా కొన్ని భవనాలు నిర్మించగా మిగిలిన పాత భవనాలను తొలగించాల్సి ఉందన్నారు. అలాగే గురుకులాల్లో రెసిడెన్షియల్ అనే పదానికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం ఇక్కడ సిబ్బంది నివాస గృహాల నిర్మాణం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్న కారణంగా పాత డార్మిటరీలను ఆధునికీకరించి కొద్దిమంది సిబ్బందినైనా స్థానికంగా ఉండేందుకు వీలుగా నిర్మాణాలు చేయనున్నామని తెలిపారు. దీనిపై అక్కడికక్కడే సంబంధిత ఈఈతో ఫోన్లో మాట్లాడారు. కళాశాలగా ఎచ్చెర్ల గురుకులం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురంలో ఉన్న గురుకులాన్ని కళాశాలగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. బొబ్బిలి గురుకులాన్ని కూడా చాలా సంవత్సరాలుగా కళాశాలగా మార్చాలన్న డిమాండ్, ప్రతిపాదనలు ఉన్నందున, ఇక్కడి కమిటీలు, స్థానికులు మంత్రి, ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఎం పురం వద్ద ఉన్న గురుకులానికి చెందిన ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. మరో 11 ఎకరాలు మిగిలి ఉన్నందున దానిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. గురుకులాల్లో సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు తాను పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నానని, పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా లేకుంటే అక్షయం
● క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే కఫం పరీక్ష చేయించాలి ● 60 ఏళ్లు దాటిన వారు, పొగ తాగేవారికి పరీక్ష అవసరం ● 100 రోజుల క్షయ కార్యక్రమంలో 861 కొత్త కేసులు గుర్తింపు ● నేడు ప్రపంచ క్షయ దినోత్సవంవిజయనగరం ఫోర్ట్: ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధి క్షయ. క్షయ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. క్షయ వ్యాధిని గుర్తించి 6 నెలల పాటు మందులు వాడడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. అయితే వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారికి ప్రాణాలు మీదికి వస్తుంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాధి లక్షణాలు: రెండు వారాలకు మించి దగ్గు, రెండు వారాలకు మించిన జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆలసటగా ఉండటం, మెడ వద్ద వాపులు క్షయ వ్యాధి లక్షణాలు. మైక్రో బాక్టీరియా చుబర్క్యూలోసిస్ అనే బాక్టీరియా వల్ల గాలి ద్వారా ఈ వ్యాప్తి చెందుతుంది. రోగి దగ్గినప్పుడు ఉమ్మి తుంపర్ల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, సురక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులను పూర్తి కాలం పాటు వాడాలి. సాధారణ క్షయ వ్యాధికి 6 నెలల పాటు, మధ్యలో మానివేసి తిరిగి ప్రారంభిస్తే 8 -
లారీ ఢీకొని భార్యాభర్తల మృతి
సాలూరు: మండలంలోని నెలిపర్తి పంచాయతీ వంగర గుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాలూరు పట్టణంలో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి రాము(51), గురిబారి(47)లు సాలూరు పట్టణానికి వచ్చి సొంత పనులు ముగించుకుని ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో పట్టణంలో బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద వారి బైక్ను ఒడిశా నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా ఆ భార్యాభర్తలు విజయవాడలో వలస పనులకు వెళ్లి ఇటీవలే తమ స్వగ్రామానికి వచ్చినట్లు తెలియవస్తోంది. -
పార్వతీపురం మన్యం జిల్లాలో 1451 క్షయ కేసులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో 20 పంచాయతీలను క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక చేసి జిల్లాలో 49 డిజిగ్నేటేడ్ మైక్రోస్కోప్ సెంటర్లు, 7 టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 1451 మందికి క్షయ పాజిటివ్గా గుర్తించారు. వారిలో 1117 మందికి చికిత్స పూర్తి చేశారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 507 మందిని గుర్తించి వారికి చికిత్స అందించారు. 700 మంది పౌష్టికాహారం కిట్లుప్రస్తుతం జిల్లాలో ఏడు వందల మంది పౌష్టికాహారం కిట్లు పొందుతున్నారని జిల్లా క్షయ నియంత్ర అధికారి డాక్టర్ ఎం.వినోద్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారిలో కనీసం 10 నుంచి 15 శాతం మందికి కఫం పరీక్షలు చేయాలని ఆదేశించామని చెప్పారు. ఏఎన్ఎం, అశ కార్యకర్తలు క్షయరోగులను పరామర్శించి, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడమే కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి ‘కఫం’ పరీక్షకు పంపించాలని సూచించినట్లు చెప్పారు. -
ఆలయంలో దేవుడి విగ్రహాల ధ్వంసం
● పునర్నిర్మాణ దశలో దుండగుల దుశ్చర్య ● బోడసింగిపేటలో ఘటన ● దుర్గాదేవి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో జాతీయ రహదారి 26కు ఆనుకోని పునర్నిర్మాణంలో ఉన్న సీతారామ ఆలయంలో దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో గతంలో ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా శ్రీకారం చుట్టారు. పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పెద్దాపురానికి చెందిన శిల్ప కళాకారులు ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇంతలోనే ఆలయం వెలుపల గోడకు ఆనుకోని నిర్మాణ తుది దశలో ఉన్న దుర్గాదేవి విగ్రహంతో పాటు గరుత్మంతుడు విగ్రహాల చేతులు, కాళ్లను దుండగలు ధ్వంసం చేశారు. రోజూలాగే ఆదివారం ఉదయం పనులకు వచ్చిన శిల్ప కళాకారులు విగ్రహాలు ధ్వంసం కావడం చూసి గ్రామ పెద్దలకు విష యం తెలిపారు. సర్పంచ్ కోరాడ జానకీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ యు.మహేష్ ఆలయం వద్దకు చేరుకొని ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామానికి ఆనుకొని రెండు మద్యం దుకాణాలు ఉండడంతో మందుబాబులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న రాష్ట్ర చిన్న, మధ్య తరహ, ఎన్ఆర్ఐ వ్యవహరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చి పరిశీలించారు. -
ఈ వేడుక ఆదర్శం
● చెప్పడం కాదు.. చేసి చూపించారు... ● కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు ● అరటి ఆకుల్లో భోజనాలు ● మట్టి గ్లాసుల్లో తాగునీరు చీపురుపల్లి: మారిన ఆధునిక సమాజంలో సాంప్రదాయ పద్ధతుల నడుమ నూతన వస్త్రాలంకరణ మహోత్సవం జరిపి మిరియాల వారి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి పట్టణంలోని వంగపల్లిపేటకు చెందిన మిరియాల రాంబాబు, అనురాధ దంపతుల ఇంట నూతన వస్త్రాలంకరణ మహోత్సవం పేరిట ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. బంధువులు, స్నేహితులను వందల సంఖ్యలో పిలిచారు. అందరూ వచ్చారు.. అక్కడ ఏర్పాట్లు చూసి ఒకింత మెచ్చుకున్నారు. వేడుకలు ఇలాగే చేస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని చర్చించుకున్నారు. వేడుకలో కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు వేశారు. అరటి ఆకుల్లో భోజనాలు పెట్టారు. మట్టి గ్లాసుల్లో నీరు పోశారు. ఆహ్వానాన్ని కూడా ఓ వస్త్రంపై రాసి ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వద్దు... కాగితం సంచులు ముద్దు... అంటూ నిత్యం ప్రకటనలిస్తూ.. పత్రికలకు ఫొజులిచ్చే వారికి కళ్లు తెరిచేలా ఎక్కడా ప్లాస్టిక్ వస్తువును వాడకుండా వేడుక నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకుండా చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దశాబ్దాల కిందట జరిగిన వేడుకలు గుర్తుకొచ్చేలా సాంప్రదాయంగా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. -
ఘనంగా ద్విగళ అష్టావధానం
పాలకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం శ్రీ సూర్యచంద్ర కళాసాహితి ఆధ్వర్యంలో ద్విగళ అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ పాల్గొని అవధాని బంకుపల్లి రమేష్ శర్మ, అవధాన చంద్రమస శతావధాని చంద్రశేఖర శర్మ, అవధాన చంద్రమస శతావధాని సాయికుమార్ శర్మలను సన్మానించారు. విశ్వావసు నామసంవత్సర ఉగాధి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కణపాక చౌదరినాయుడు, సింహచలాచార్య, బౌరోతు శంకరరావు, దిలీప్కుమార్, సాహితి శ్రీనివాసరావు, వెలమల మన్మథరావు, కడగల రమణ, గారాల సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఖేలో ఇండియా పారా గేమ్స్లో రజతంవిజయనగరం: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సిల్వర్ మెడల్ కై వసం చేసుకుని జిల్లా పేరు మరోసారి మారు మోగించిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1200 మంది వరకు పారా క్రీడాకారులు పాల్గొన్నారని, టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగు పందెంలో గట్టి పోటీ నెలకొన్నప్పటికీ లలిత అసామాన్య ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని, ఇది జాతీయస్థాయిలో జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. లలిత ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రా ష్ట్రకార్యదర్శి వి. రామస్వామి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, కలెక్టర్ డాక్టర్. బీఆర్. అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందించారని తెలియజేశారు. సీనియార్టీ జాబితా తయారీకి ఏకీకృత విధానం తప్పనిసరిపార్వతీపురంటౌన్: వివిధ జిల్లాలకు చెందిన విద్యాశాఖాధికారులు సీనియార్టీని రూపొందించడంతో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల అనేక పొరపాట్లు జరుగుతున్నాయని ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఎన్. బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ప్రకారం రూపొందించారని, బదిలీలకు రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బదిలీల్లో వ్యక్తిగతంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పనిచేసే పాఠశాల హెచ్ఆర్ఏ, పూర్తి సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తారన్నారు. బదిలీల పాయింట్లు సమానంగా వస్తే వయస్సును బట్టి సీనియార్టీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు సీనియార్టీ రూపొందించడంలో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సవరించే విధంగా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగీత, సాహిత్యాలతో పైడితల్లికి ఘనంగా నీరాజనం విజయనగరం టౌన్: శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 22న గురజాడ కళాభారతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంస్థ వ్యవస్ధాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నా రు. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత, సాహి త్య కార్యక్రమాలతో పైడితల్లి అమ్మవారికి ఘనంగా నీరాజనాలర్పిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలి పారు. అదే రోజు అమ్మవారి భక్తిగీతాలపపై భజన సీడీలను ఆవిష్కరిస్తామన్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ పైడిమాంబ కళానికేతన్ సంస్ధ 27వ వార్షికోత్సవానికి ప్రముఖులతో పాటు, పలువురు పెద్దలు హాజరుకానున్నారన్నారు. ఆ రోజు వేకువజామునుంచి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో పలువురిని సముచితరీతిలో సత్కరిస్తామన్నారు. ఉపశమనం ఇచ్చిన చిరు జల్లులు భామిని: మండలంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా మబ్బులు పట్టి సాయంకాలానికి చిరు జల్లులు కురవడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. శ్రీపైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్ధాపకుడు పాత్రో -
వాగ్దేవి సమారాధనం సంస్థ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం
● సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి విజయనగరం టౌన్: విద్యలనగరం విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్యాశీస్సులతో సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణకు వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషిచేసి ఉంటారో అటువంటి పెద్దలను సముచిత రీతిలో సంస్థ వార్షికోత్సవం రోజున సత్కరించుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వాగ్దేవి సమారాధనం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ధర్మపురి రోడ్డులో ఉన్న సంస్థ ఆవరణలో ఆదివా రం వివరాలు వెల్లడించారు. ఉగాది పర్వదినం, సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు వాగ్దేవి సాహిత్య స్రష్ట అనే పురస్కారంతో, డాక్టర్ బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారంతో సత్కరించుకుంటున్నామని తెలిపారు. సంస్ధ ప్రధానకార్యదర్శి డాక్టర్ నాగమల్లిక మా ట్లాడుతూ గురజాడ గ్రంథాలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున ఉద యం 10 గంటల నుంచి నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాహిత్య పర్యవేక్షకులు సాహితి, రుగ్వేదాచార్యులు రాంభట్ల సన్యాసిరాజు, శంబర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
● ఆఖరి చూపు కోసం..
జయపురం: జయపురం సతిగుడ కెనాల్ ఎల్లో డేమ్ వద్ద కెనాల్లో పడిన కుమారుడి ఆఖరి చూపు అయినాదక్కాలని తండ్రి మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. జయపురం మహారాణిపేట్ రాందాస్ లైన్ నివాసి పి.గౌరీశంకర్ చిన్న కుమారుడు పి.నిఖిలేష్(17) సతిగుడ నది ఎల్లో డేమ్ సమీపంలో గల కెనాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తండ్రి గౌరీశంకర్ తన కుమారుడు కెనాల్లో పడి కనిపించలేదని పోలీసులకు, అగ్నిమాపక విభానికి తెలియజేశారు. కెనాల్ వద్ద నిఖిలేష్ వస్తువులు ఉన్నాయి. వారు వచ్చి ఎంత గాలించినా ఏమీ దొరకలేదు. నిఖిలేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి గానీ, ఉపాధ్యాయులు గానీ నమ్మడం లేదు. కుమారుడి మృతదేహమైనా దొరుకుతుదని తండ్రి గౌరీశంకర కెనాల్ వద్ద ఆశగా ఎదురు చూడటం కనిపించింది. నిఖిలేష్ గత ఏడాది పరీక్షలో 95 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. గౌరీశంకర్ భార్య కొద్ది రోజుల కిందట మృతి చెందారు. ఇప్పుడు చిన్నకొడుకు కాలువలో గల్లంతైపోయాడు. ఆఖరి చూపైనా దక్కాలని కళ్లు కాయలు కాసేలా తండ్రి ఎదురు చూస్తున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లకు తీవ్ర గాయాలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మల్కన్గిరి సమితి సింద్రీమాల పంచాయతీ బందుగూఢ గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు గాయపడ్డారు. మల్కన్గిరి నుంచి ఏదో పని చూసుకుని తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న వారిని ఓ టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఉడాపా గ్రామానికి చెందిన జగన్నాఽథ్ కాబాసి అతని చెల్లి హిరామాణి కబాసిలు మల్కన్గిరికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ డ్రైవర్ వెంటనే వారిని స్థానికుల సాయంతో మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోలీసులకు లొంగిపోయాడు. మల్కన్గిరి ఐఐసీ రీగాన్కీండో కేసు నమోదు చేసి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నాడు. -
హత్య కేసులో ముగ్గురు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ పోలీస్స్టేషన్ పరిధి సిరిపాయి పంచాయతీ బహరుదులుకి గ్రామంలో ఇటీవల ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ముగ్గురిని శనివారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో హత్యకు గురైన యువకుడి భార్య సరస్వతి హలువ, మామయ్య సాధునాయక్, బావమరిది అజయ్ నాయక్లు ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి పిపిలపొదొరో పంచాయతీలోని లులుపొదొరో గ్రామానికి చెందిన కుమార స్వామి హలువ (40) తన అత్తవారు ఉంటున్న బహరుదులుకి గ్రామానికి వెళ్లాడు. శుక్రవారం రాత్రి అతని భార్య సరస్వతితోపాటు తండ్రి , అన్నయ్య సహాయంతో అత్యంత దారుణంగా కుమార స్వామి హలువను హత్య చేసి గ్రామానికి సమీపంలోని పొదలర్లో మృతదేహాన్ని పడేశారు. అ తరువాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయారు. శనివారం అటువైపుగా బహిర్భూమికని వెళ్లిన కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు సంబంధించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇదిలాఉండగా కొన్నాళ్లుగా భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. తరచూ ఇద్దరి మధ్య తగాదాలకు విరక్తి చెందిన సరస్వతి తన భర్తను విడిచి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. తన భార్యను తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన కుమార స్వామిని పథకం ప్రకారం భార్య, బావమరిది, మామయ్యలు హతమార్చారు. ఈ విషయాన్ని పోలీసులు ముందు నిందితులు అంగీకరించారు. నిందితులను కోర్టుకు తరలించారు. -
కాల వైశాఖి పరిహారంపై హామీ
భువనేశ్వర్: రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లాలో కాల వైశాఖి (గాలి వాన) విధ్వంసం సృష్టించింది. వివిధ ప్రాంతాల్లో గూడు చెదిరి పలువురు ప్రజలు తలదాచుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పీడిత ప్రజలకు తక్షణమే పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాంతంలో 400కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మయూర్భంజ్ జిల్లాలో బంగిరిపోషి ప్రాంతం భారీగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో కాల వైశాఖి తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి ఆదివారం ప్రత్యక్షంగా అంచనా వేశారు. ఈ సందర్భంగా, బాధిత వర్గాలకు నష్టాలకు పూర్తి ఆర్థిక పరిహారం అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆన్లైన్లో పరిహారం చెల్లింపు క్షేత్ర స్థాయిలో కాల వైశాఖి నష్టం నివేదికను ఖరారు చేసిన ప్రకారం ఆదివారం సాయంత్రం నాటికి బాధితులకు పరిహార నిధులు అందుతాయి. తక్షణ సహాయ చర్యలో భాగంగా ఈ మొత్తం ఆన్లైన్లో బాధితుల ఖాతాలకు ప్రత్యక్షంగా బదిలీ అవుతాయని మంత్రి వివరించారు. ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. లేని వారికి ప్రత్యక్షంగా నగదు రూపంలో పరిహారం చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. 19 పంచాయతీల్లో విధ్వంసం వాస్తవానికి మయూర్భంజ్ జిల్లాలో గత రెండు రోజులుగా కాల వైశాఖి విధ్వంసం సృష్టిస్తోంది. ప్రధానంగా బంగిరిపోషి, బిషోయ్, కులియానా, సొరొసొకొనా మరియు కరంజియా మండలాల్లో విస్తృత విధ్వంసం సృష్టించింది. జిల్లాలో 19 పంచాయతీల్లో 400 కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక కుటుంబాలు నిరాశ్రయులై ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితుల బాగోగుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు స్థానిక సీనియర్ రెవెన్యూ అధికారులు బాధిత ప్రాంతాల్లో సందర్శించి సత్వర సహాయం అందజేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక అధికారులు, విపత్తు ప్రతిస్పందన బృందాలతో కలిసి, సాధారణ స్థితిని పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లా యంత్రాంగం సహాయ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. అవసరమైన వారికి ఆహారం, తాత్కాలిక ఆశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించేలా చూస్తోంది. -
రాయగడలో ఉగాది ఉత్సవాలకు సన్నాహాలు
రాయగడ: పట్టణంలో ఈ ఏడాది ఉగాది ఉత్సవాలు పోటీపోటీగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట 12 ఏళ్లుగా ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం యాల్ల కొండబాబు నేతృత్వంలో రాయగడ జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వేరేగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలో రెండు వేదికల్లో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం యాల్ల ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను పురష్కరించుకుని స్థానిక కొల్లిగుడ మైదానంలో ముహూర్తపు రాట వేశారు. తాజాగా ఆదివారం స్థానిక తేజస్వీ హోటల్ ఎదురు మైదానంలో నెక్కంటి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలకు ముహూర్తపు రాట వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, రాఘవ కుముందాన్, శిల్లా జగన్నాథ రావు, ఎన్.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. పోటాపోటీగా బ్యానర్లు.. పట్టణం ఉగాది సంబరాల కోసం ముస్తాబవుతోంది. ప్రతి కూడలిలోనూ నిర్వాహకులు ఉత్సవాల బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సమాఖ్య ఉగాదిని పురష్కరించుకుని పోటీలను నిర్వహిస్తుండగా ఈ నెల 27, 28 తేదీల్లో నెక్కంటి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలకు సంబంధించి వివిధ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. చందాల వసూళ్లు..! తెలుగు సమైఖ్యత, సంస్కృతికి అద్దం పట్టే ఈ ఉగాది ఉత్సవాలు ఇదివరకు ఒకే వేదికపై నిర్వహించడంతో పట్టణ ప్రజలు ఉత్సవాలను ఆనందిస్తుండేవారు. క్రమేపీ రెండు గ్రూపులుగా జరుగుతుండటంతో చందాలు చెల్లించే విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఉగాది ఉత్సవాల కోసం స్థానిక విద్యా సంస్థ యాజమాన్యాన్ని నిర్వాహక సంఘానికి చెందిన వ్యక్తి ఫోన్ చేసి పెద్ద మొత్తంలో చందా చెల్లించాలని ఫోన్ ద్వారా బెదిరించడం వంటి ఘటనలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి స్పందించారు. తెలుగు వారి సమైఖ్యతను చాటి చెప్పే ఈ వేడుకలకు చందాల వసూళ్ల పేరిట బెదిరిస్తుండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి తప్ప బెదిరింపులకు పాల్పడటం తగదన్నారు. -
27న విధాన సభ ముట్టడికి సన్నద్ధం
జయపురం: రాష్ట్రంలో అధికార బీజేపీ చర్యలను ఖండిస్తూ ఈ నెల 27న విధాన సభ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిందని ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి వెల్లడించారు. స్థానిక బాబాసాహేబ్ కల్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శశిభూషణ పాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాహిణీపతి ప్రసంగిస్తూ బీజేపీ పాలకులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అందుకు ముఖ్యమంత్రి సభకు సమాధానం చెప్పాలని తాను డిమాండ్ చేసినందుకు బిజేపి ఎం.ఎల్.ఎ జయనారాయణ మిశ్ర తన పై దాడి చేశారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు కొరాపుట్ జిల్లా నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ నెల 27న విధాన సభ ముట్టడిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ మంత్రులను, నేతలను కొరాపుట్ జిల్లాలోనికి అనుమతించకూడదని నేతలు పిలుపునిచ్చారు. ప్రసంగించిన వారిలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, ఒడిశా కాంగ్రెస్ ప్రభారీ రజణీ మహంతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకులు అజిత్ దాస్తో పాటు కొరాపుట్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బినోద్ మహాపాత్ర, కోశాధి కారి నిహారంజన్ బిశాయి తదితరులు ఉన్నారు. -
భగత్ సింగ్ సేవలు స్ఫూర్తిదాయకం
జయపురం: దేశ విముక్తి కోసం ప్రాణాలను చిరు నవ్వుతో అర్పించిన విప్లవ వీరులు సహిద్ భగత్ సింగ్, శుఖ్దేవ్, రాజగురు నిజమైన దేశ భక్తులని వక్తులు అన్నారు. స్థానిక యాదవ భవనంలో ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి అధ్యక్షతన భగత్ సింగ్, శుఖ్దేవ్, రాజగురు వర్ధంతిని నిర్వహించారు. భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భగత్ సింగ్, శుఖ్దేవ్, రాజగురు చిత్రపటాలకు నివాళులర్పించారు. కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, ప్రమోద్ కుమార్ తివారీ, అలేక్ పాత్రో, కె.సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రహసనంగా ఎంజీ రోడ్డు విస్తరణ
జయపురం: జయపురం మహాత్మాగాంధీ రోడ్డులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు రోడ్డు విస్తరణకు గత నవంబర్లో శ్రీకారం చుట్టారు. 40 అడుగుల రోడ్డు ఏర్పాటు లక్ష్యంగా రోడ్డుకు ఇరువైపులా 40 అడుగుల లోపున గల దుకాణాలను, ఇళ్లను కొలతలు కొలిచి ఆక్రమణలను బుల్డోజర్లతో తొలగించారు. రోడ్డు వెడల్పు అయి ట్రాఫిక్ సమస్య తీరుతుందని ప్రజలు సంతోషించారు. అయితే 2024 నవంబర్ నెలలో ఆక్రమణలను తొలగించిన అధికారులు, నాలుగు నెలలు గడిచినా వాటిని పట్టించుకోలేదు. అందువల్ల అటు వ్యాపారులు ఇటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్చ్ 23న రోడ్డుకు ఇరువైపులా కాలువల తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలు ఎంజీ రోడ్డు కమలా మెడికల్ కూడలి నుంచి జైలు రోడ్డు జంక్షన్ వరకు రోడ్డు బ్లాక్ చేసి కాలువల తవ్వకాలు జరుపుతున్నారు. విస్తరణ ఎప్పటికి పూర్తవుతుందోనని స్థానికులు అంటున్నారు. విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదిన జరపాలని ప్రజలు కోరుతున్నారు. -
సిక్కిం కాంగ్రెస్ నేతలతో కొరాపుట్ ఎంపీ చర్చలు
కొరాపుట్: సిక్కిం కాంగ్రెస్ పార్టీ నేతలతో కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క చర్చలు జరిపారు. సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్లో సిక్కిం ప్రదేశ్కాంగ్రెస్ కార్యాలయాన్ని సప్తగిరి ఆదివారం సందర్శించారు. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ సహచర విభాగాల నాయకులతో భేటీ అయ్యారు. ఎంపీ సప్తగిరిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈశాన్య రాష్ట్రాల పార్టీ పరిశీలకుడిగా నియమించింది. దీంతో సప్తగిరి తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తున్నారు. మజ్జిగ, పుచ్చకాయల వితరణ రాయగడ: పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సాయిప్రియ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో తుంబిగుడ కూడలిలో బాటసారులకు మజ్జిగ, పుచ్చకాయలను ఆదివారం వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీశాఖ రాయగడ రేంజర్ కామేశ్వర్ ఆచారి హాజరై బాటసారులకు మజ్జిగ, పుచ్చకాయలను పంపిణీ చేశారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని ట్రస్టు సభ్యులను సూచించారు. ట్రస్టు కార్యదర్శి దయానిధి ఖండగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు జి.బ్రహ్మాజీ, లాడి చంద్రమౌళి, సన్యాసి పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రుల కాన్వాయ్పై రాళ్ల దాడి●● కానిస్టేబుల్కు గాయాలు ● మయూర్భంజ్ జిల్లాలో సంఘటన భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లాలో రాష్ట్ర మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ జిల్లా బంగిరిపోషి ప్రాంతం కాల వైశాఖి వైపరీత్యంతో భారీగా ప్రభావితమైంది. ప్రాంతీయుల్ని పరామర్శించి నష్టం తీవ్రతని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా సమీక్షించేందుకు ఇరువురు మంత్రులు బయల్దేరారు. వీరిలో రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణచంద్ర మహాపాత్రో ఉన్నారు. కాల వైశాఖి వైపరీత్యం నష్టా న్ని అంచనా వేయడానికి ఆదివారం ఇద్దరు మంత్రులు చేసిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. వీరి రాకలో జాప్యం కారణంగా స్థానిక ప్రభావిత వర్గాలు ఆగ్రహంతో నిరసనలు చేపట్టి వారి కాన్వాయ్పై దాడి చేశారు. ఈ సందర్భంగా రాళ్లు రువ్వడంతో మంత్రుల కారు అద్దాలు పగిలాయి. ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. నష్టం అంచనా క్షేత్ర స్థాయి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల వైశాఖి వైపరీత్యానికి గురైన పలు ప్రాంతాల్ని సందర్శించకుండా వెనుదిరగడంతో ఆగ్రహించిన వర్గం ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మంత్రుల పక్షపాత వైఖరి పట్ల ప్రభుత్వం బదులు ఇవ్వాలని ఆందోళనకు దిగిన గ్రామస్తులు నిరసన ప్రదర్శించారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ తలకు గాయమైంది. వాహనాలపై రాళ్లు వర్షం కురిపించారు. భద్రతా సిబ్బంది సకాలంలో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి కుదుటపడింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం రాయగడ: ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మునిగుడ పోలీసులు ఆదివారం రైల్వే స్టేషన్ సమీపంలోని తోపుడు బండిపై స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది అటువైపుగా వెళుతున్న సమయంలొ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ప్రసాద్’ నిధుల కోసం ప్రయత్నాలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఇంకా ఎలాంటి ఫాలోఅప్ చేయకపోవడంపై తనకు అసంతృప్తిగా ఉందని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కుటుంబసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఇందుకోసం ఆలయం ముందర నిర్మాణాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి.. అద్భుతంగా అభివృద్ది పనులు చేపట్టాలని భావించామని, తర్వాత ఫాలో అప్ సరిగ్గా లేకపోవడంతో పనులు ప్రారంభించలేకపోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ స్కీం మంజూరు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. ఆ నిధులు వచ్చేవరకు భక్తులకు తాత్కాలిరంగా సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, మంత్రి సోదరుడు హరిప్రసాద్, టీడీపీ ఇన్చార్జిలు తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
శిష్టకరణ సంఘం నూతన కార్యవర్గం
కొరాపుట్: నబరంగ్పూర్ శిష్ట కరణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిల్లా కేంద్రంలోని అఖండల మణి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సతీష్ పట్నాయక్, ఉపాధ్యక్షునిగా కిశోర్ పట్నాయక్, వివిధ విభాగాల కార్యదర్శులుగా మహేశ్వర్ పట్నాయక్, అవని ప్రసాద్ పట్నాయక్, కోసాధికారిగా చంద్ర ఖర్ పట్నాయక్, న్యాయ సలహాదారుడుగా అరవింద పట్నాయక్, సలహాదారులుగా రబి పట్నాయక్, పి.రామ్మూర్తి పట్నాయక్, ప్రసన్న పట్నాయక్ ఎంపికయ్యారు. సంఘ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. -
వానర సైన్యం!
వామ్మో..టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు గుంపులుగా తిరుగుతున్న కోతులు మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం -
ఝివురీ అడ్డగింతపై ఆందోళన
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి చత్తీస్గఢ్ సరిహద్దున గల ఝివురి నది ముందు అడ్డంగా వేసిన ఇసుక బస్తాలు వెంటనే తొలగించాలని బీజేడీ శ్రేణులు చత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వందలాది మంది కార్యకర్తలు, బిజేడి నాయకులు ఆదివారం ఝివురి నదీ ప్రాంతాన్ని సందర్శించారు. 2003లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం తగదని అన్నారు. మాజీ మంత్రి పద్మిని దియాన్ అధ్యక్షతన నిర్వహించిన ఝివురి బచావ్ అభిజాన్ సభలో మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ ఝివురి నది నుంచి నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే కొరాపుట్ ప్రజలు మౌనంగా ఉండబోరని అన్నారు. గతంలో ఉభయ ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాన్ని పక్క రాష్ట్రం ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇసుక బస్తాలు తొలగించేంత వరకు బీజేడీ పోరాడుతుందని స్పష్టం చేశారు. సభలో కొట్పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి, జిల్లా పరిషత్ సభ్యులు త్రిపతి చలాన్, కొట్పాడ్ సమితి ఉపాధ్యక్షుడు బాబులి పాణిగ్రహి, కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వరచంద్ర పాణిగ్రహి, ఉపాధ్యక్షుడు దురుపుత భొత్ర, సీనియర్ బీజేడీ నేతలు పద్మన్ బిశాయి, మహమ్మద్ సలీమ్, లక్ష్మీపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రభుజానితో పాటు వందలాది మంది స్థానిక బీజేడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పనస కాయల లోడ్ వ్యాన్ బోల్తా : గిరిజన మహిళ మృతి
● రంగబయలు పంచాయతీ కోసంపుట్టు ఘాట్రోడ్డులో ఘటనముంచంగిపుట్టు (అల్లూరి జిల్లా): మండలంలో రంగబయలు పంచాయతీ కోసంపుట్టు గ్రామ సమీపంలో గల ఘాట్రోడ్డులో పనసకాయల లోడుతో వెళుతున్న వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందపూరు బ్లాక్ తుభ గ్రామానికి చెందిన గిరిజన మహిళ కిల్లో కుమ్మి(42) మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యాపారులు ఆదివారం రంగబయలు పంచాయతీ కోసంపుట్టు, పట్నపడాల్పుట్టు, జోడిగుమ్మ గ్రామాల్లో పసనకాయలను కొనుగోలు చేసి, వ్యాన్లో లోడు చేసుకొని వస్తుండగా కోసంపుట్టు ఘాట్రోడ్డు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్ వెనుక ఉన్న కిల్లో కుమ్మి అనే మహిళ కింద పడిపోయింది.ఆమె మీద వ్యాన్ బోల్తా పడింది. వాహనం కింద నలిగిపోయి మహిళ మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్,పనసకాయల కొనుగోలుదారులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా వ్యాన్ కింద నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. స్థానిక ఎంపీటీసీ సిరగం భాగ్యవతి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి,వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించారు. వాహనం ఎక్కడిది,పనసకాయల కొనుగోలుదారులు ఎక్కడివారు అనేది తెలియాల్సి ఉంది.గత రెండు నెలల వ్యవధిలో కోసంపుట్టు ఘాట్రోడ్డులో మూడు సార్లు వాహనాలు బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు.ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
రక్తదానం.. ప్రాణదానం
రాయగడ: స్థానిక బాలాజీ నగర్లో గల శ్రీకళ్యాణ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 54 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాతులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్ పరివేక్షణలో జరిగిన ఈ శిబిరంలో ఆమో ఒడిశా ప్రతినిధి శివప్రసాద్ దొర పాల్గొన్నారు. మల్కన్గిరిలో మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో గల కుమిటిగూడ వీధిలో ఉన్న సత్యసాయి మందిరంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కె.గోపాల్కృష్ణ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 8 యూనిట్ల రక్తం సేకరించి జిల్లా బ్లడ్ బ్యాంక్కు అందజేశారు. మల్కన్గిరి సత్యసాయి కమిటీ సభ్యులు కె.క్రష్ణకుమారి, ఎం.దమయంతి, ఎ.ఉమ, బాలాజీ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించినట్లు శ్రీకాకుళం స్టేషన్ సీఐ ఎం.వి.గోపాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిటర్న్ అధికారిగా తనతో పాటు నరసన్నపేట సీఐ ఎస్.వి.రమణమూర్తి వ్యవహరించినట్లు తెలిపారు. అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఆదిత్యాలయానికి భక్తుల తాకిడి అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. ప్రత్యేక ఆదివారంతో పాటు వత్సవలస రాజమ్మతల్లి ఉత్సవాల కొనసాగింపు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కొందరు సూర్యనమస్కారాల పూజలు చేయించుకోగా...మరికొందరు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లుతో పెద్దగా ఉపశమనం కలుగకపోవడంతో భక్తులు విమర్శలకు దిగారు. వీఐపీల పేరిట చాలా మంది ఫేక్ వీఐపీలు దర్శనాలకు వెళ్లడంపై క్యూలైన్లలో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3,76,300, విరాళాల రూపంలో రూ.1,41,803, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.75 లక్షల వరకు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వై.భద్రాజీ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ జిల్లా సలహాదారుడిగా చందనరావు శ్రీకాకుళం న్యూకాలనీ: బాలల హక్కుల వేదిక పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్) జిల్లా సలహాదారుడిగా తమ్మినేని చందనరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జాతీయ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి నియామక పత్రం అందజేశారు. చందనరావు సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి జిల్లా కమిటీ చొరవతో చిత్తశుద్ధితో సేవలు అందిస్తానని తమ్మినేని పేర్కొన్నారు. ఈయన నియామకం పట్ల సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఇన్చార్జి డి.ప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ అరుణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి ఆమదాలవలస గేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ చల్లపేటకు చెందిన కరిమెళ్ల సూరిబాబు(55) ఆమదాలవలస గేటు ప్రాంతంలో వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్నాడు. కుటుంబం లేకపోవడంతో అక్కడే ఉంటున్నాడు. ట్రాక్ దాటేందుకు వచ్చాడో, ఇంకేం జరిగిందో తెలియదు గానీ ఆదివారం పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు శవ పంచనామా కోసం తరలించారు. రైలు ఢీకొని యువకుడు మృతి పొందూరు: పొందూరు రైల్వేగేటు సమీపంలో ఆదివారం అమరావతి రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు ఆమదాలవలస జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. సుమారు 30 ఏళ్ల గల ఈ యువకుడు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. యువకుడు ఎరుపు టీషర్టు, నీలం ప్యాంట్ ధరించాడని, ముఖం గుర్గు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. వివరాల కోసం 9493474582 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. శ్రీకూర్మంలో భక్తజన సందోహం గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సాధా రణ భక్తులతో పాటు చిన వత్సవలస రాజమ్మ తల్లి సంబరాల నుంచి తిరుగుపయనమైన వారు కూడా క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథం పర్యవేక్షించారు. మరోవైపు సరైన పార్కింగ్ స్థలం లేక వాహనదారులకు ఎప్పటిలాగే ఈ వారం కూడా ఇబ్బందులు తప్పలేదు. కారు, ఆటో, బైక్లు పెట్టేందుకు స్థలం చూపించకపోయినా ఆశీలు మాత్రం పంచాయతీ పేరిట వసూలు చేస్తుండటంపై పలువురు వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు. -
ఆరోగ్యశ్రీ రోగికి డబ్బుల చెల్లింపు
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించినప్పటకీ రోగుల నుంచి ఇంప్లాట్స్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఈ నెల 17న సాక్షిలో ‘ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పట్టణంలోని గాయత్రి ఆస్పత్రిలో వెన్నుపూస శస్త్రచికిత్స చేసుకున్న రోగి గోవింద నుంచి సిబ్బంది రూ. 25 వేలు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ జనార్దనరావు, ఆరోగ్యమిత్ర మురళీధర్ ఆస్పత్రి ప్రతినిధుల నుంచి రూ. 25 వేలు వసూలు చేసి బాధిత వ్యక్తికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. -
20.16 లక్షల మొక్కల పెంపకం
● జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన వీరఘట్టం: జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఈ ఏడాది 18 నర్సరీల్లో 20.16 లక్షల మొక్కలు పెంచాలన్నది లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖ అధికారి జి.ఎ.పి. ప్రసూన అన్నారు. వీరఘట్టం మండలం రేగులపాడులో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మొక్కల పెంపకం బాధ్యతను అటవీ సెక్షన్, బీట్ ఆఫీసర్లకు అప్పగించామన్నారు. ప్రస్తుతం పాలకొండ రేంజ్ పరిధిలో 20,507 హెక్టార్లు, కురుపాం రేంజ్ పరిధిలో 32,681 హెక్టార్లు, పార్వతీపురం రేంజ్లో 26,301 హెక్టార్లు, సాలూరు రేంజ్లో 28,230 హెక్టార్లు కలిపి జిల్లా మొత్తం 1,07,719 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయన్నారు. వన నర్సరీల్లో పెంచే మొక్కలను ఈ ఏడాది జిల్లాలోని పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం, వీరఘట్టం, సీతంపేట, భామిని, పాలకొండ అటవీ ప్రాంతాల్లో నాటించి అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. త్వరలో కుంకీ ఏనుగులను తెప్పించి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న 11 ఏనుగుల గుంపును సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటుచేస్తున్న తాత్కాలిక ఎలిఫెంట్ జోన్కు తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆమె వెంట పాలకొండ రేంజర్ కె.రామారావు, వీరఘట్టం సెక్షన్ ఆఫీసర్ పి.రవిబాబు, సోషల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సోమేశ్వరరావు, తదితరులు ఉన్నారు. -
మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ కన్నుమూత
భువనేశ్వర్: కేంద్రపడా జిల్లా ఔల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ (66) శుక్రవారం కన్నుమూశారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేబేంద్ర శర్మ అంకితభావంతో ఎదిగిన నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన కాంగ్రెస్ టికెట్పై 15వ రాష్ట్ర శాసనసభకు 2014లో ఎన్నికయ్యారు. ఆయన మరణంతో ఈ ప్రాంతంలో సర్వత్రా విచారం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఆవరణలో శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. స్పీకర్ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తదితర ప్రముఖులు దివంగత మాజీ శాసన సభ్యుడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. -
పది మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలి
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం విధుల్లో మినహాయింపు కోరిన ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ సభ్యులు ఈ మేరకు శనివారం డీఈఓ యు.మాణిక్యంనాయుడుని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పదో తరగతి సబ్జెక్టు టీచర్లను మూల్యాంకనం విధుల్లో వేసినపుడు తొలిత ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేయాలని కోరారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుమతి ఇస్తూ ఇంకా అవసరం ఉన్న పరిస్థితులను గుర్తించిన తరువాతే తప్పనిసరి విధులుగా కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న సీనియారిటీ అభ్యంతరాలను సమర్పించడానికి గడువు పెంచాలని కోరారు. డీఈఓని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్ బంకపల్లి శివప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షుడు చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్టణ, రెడ్డి శంకరరావు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. డీఈఓకి పీఆర్టీయూ జిల్లా కమిటీ వినతి -
పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు
భువనేశ్వర్: నగరంలో గంజాయి, మద్యం ఇతరేతర మాదక ద్రవ్యాల విక్రయాల జోరు పెరుగుతోంది. ఊహాతీతమైన రీతుల్లో ఈ పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా ఓంఫెడ్ పాల కేంద్రాల్లో గంజాయి దమ్ము సిగరెట్లు విక్రయిస్తున్నట్లు బట్టబయలైంది. స్థానిక జయదేవ్ విహార్ ప్రాంతంలోని 2 ఓంఫెడ్ పాల కేంద్రాల్లో సిగరెట్ల ముసుగులో గంజాయి విక్రయిస్తున్న రాకెట్ గుట్టు రట్టు అయింది. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో కమిషనరేట్ పోలీస్ స్పెషల్ క్రైమ్ శాఖ ఈ ముఠా వ్యవహారాన్ని ఛేదించింది. గంజాయి అక్రమ విక్రయానికి ఆశ్రయం కల్పించిన 2 ఓంఫెడ్ పాల కేంద్రాలను సీజ్ చేశారు. -
ప్రజలు సహకరించాలి
ప్లాస్టిక్ చేతి సంచులు, కవ ర్లు నగరంలో నిషేధించాం. ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. వ్యాపా రులు పర్యావరణానికి హాని చేకూరని చేతి సంచులను విక్రయించాలి. ప్రజలు గుడ్డ చేతి సంచుల వినియోగించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్టేందుకు సహకరించాలి. – శ్యామ్ ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం కఠిన చర్యలు తప్పవు ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించాలి. వాడిన వాటిని చెత్త కుప్పల్లో, కాలువల్లోకి వదిలేస్తున్నారు. నిషేధం పక్కాగా అమలు చేస్తాం. స్వర్ణాంధ్రా–స్వచ్ఛాంధ్రా కార్యాక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా చర్యలు చేపడతాం. – టి.జయరాం, నగర పంచాయతీ కమిషనర్,పాలకొండ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.. నిషేధిత ప్లాస్టిక్ సంచుల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై తరచూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టిక్ సంచులు విక్రయించే వ్యాపారులతో కూడా మాట్లాడాం. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. – బి.వెంకటరమణ, ఎంపీడీఓ, వీరఘట్టం -
వంశధార జలాలు శివారు ప్రాంతాలకు ఎప్పుడిస్తారు?
హిరమండలం: వంశధార జలాలను శివారు ప్రాంతాలకు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం బృందం గొట్టా బ్యారేజీ, వంశధార రిజర్వాయర్లను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్టా బ్యారేజీని ఆధునీకరించడంతో పాటు కాలువల మరమ్మతులు చేపట్టాలని కోరారు. దీనివల్ల లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్నారు. వంశధార రిజర్వాయర్కు అనుసంధానంగా నేరడి వద్ద బ్యారేజీ ఎప్పుడు కడతారని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోతోందన్నారు. తక్షణం గొట్టాలో ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తిచేసి రిజర్వాయర్కు నీటిని మళ్లించాలన్నారు. ఒడిశాతో సరిహద్దు జలాల సమస్యను పరిష్కరించి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. వంశధార జలాలు శివారు ప్రాంతాలుగా ఉన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అందడం లేదన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానాన్ని పూర్తిచేయాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న డిమాండ్తో ఏప్రిల్ 5న ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యులు మోహనరావు, పోలాకి ప్రసాద్, సిర్ల ప్రసాదరావు, సూరయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
డయేరియా బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గుర్ల: డయేరియా ప్రబలి గత ఏడాది అక్టోబరులో 13 మంది ప్రాణాలు కోల్పోతే వారిలో పది మంది తాలూకు కుటుంబసభ్యులకు మాత్రమే జనసేన పార్టీ ఆర్థిక సాయం అందింది. ఐదు నెలల కిందట గుర్లలో పర్యటన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గుర్లలో శనివారం నెల్లిమర్ల ఎమ్మెల్యే (జనసేన) లోకం నాగమాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎంఎస్ఎంఈ చైర్మన్ టి.శివశంకర్ పాల్గొన్నారు. గుర్ల అంటే గుర్లలో వారికి మాత్రమే... గత ఏడాది అక్టోబరులో గుర్ల మండల కేంద్రంతో పాటు సమీపంలోని కోటగండ్రేడు, నాగళ్లవలస గ్రామాల్లోనూ డయేరియా విజృంభించింది. దీంతో గుర్లలో పది మంది, కోటగండ్రేడులో ఒకరు, నాగళ్లవలసలో ఇద్దరు చనిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం కోటగండ్రేడుకు చెందిన మరడాన అప్పలనర్సమ్మ ఒక్కరే డయేరియా కారణంగా చనిపోయారని ప్రకటించి చేతులు దులుపుకుంది. వైఎస్సార్సీపీ తరఫున రూ.2 లక్షల చొప్పున 13 మంది కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది నవంబరు 26న శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చెక్కులు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన తరఫున కేవలం పది మంది కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన డయేరియా మృతురాలు అప్పలనర్సమ్మ కుటుంబాన్ని జనసేన విస్మరించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గుర్ల అన్నారని, ఆ గ్రామంలోని పది మంది కుటుంబాలకు మాత్రమే చెక్కులిచ్చి సరిపెట్టడం చర్చనీయాంశమైంది. పది మంది మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత -
గుడ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి కొట్ట గ్రామ సమీపంలో కోడి గుడ్లు రవాణా చేస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గుడ్లు నేలమట్టం కాగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్గిరి జిల్లా మతిల్తిలో కోడిగుడ్లను దుకాణాలకు అమ్మేందుకు జయపురం నుంచి ఒక ఆటో వెళ్లింది. మత్తిలిలో దుకాణాలకు గుడ్లు సరఫరా చేసి మిగిలిన గుడ్లతో తిరిగి వస్తుండగా బొయిపరిగుడ సమితి కొట్ట గ్రామ సమీపంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. గుడ్లు రోడ్డపై పడగా ఆటో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడనవారిలో జయపురం సమితి కుంతరకాల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రామ మండల్, డిమ్ల గ్రామానికి చెందిన శివ పొరజలు ఉన్నారు. గాయపడిన ఇద్దరినీ స్థానికులు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బాల్య వివాహం అడ్డగింత పర్లాకిమిడి: స్థానిక కాశీనగర్ బ్లాక్ పోలూరు గ్రామంలో ఏప్రిల్లో జరగనున్న బాల్య వివాహాన్ని కాశీనగర్ జిల్లా శిశు సురక్షా అధికారులు ముందస్తుగా అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామానికి చెందిన ఒక అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండానే పోలూరు గ్రామానికి చెందిన వరుడితో ఏప్రిల్లో వివాహం చేయించేందుకు పెద్దలు నిశ్చయించారు. అయితే చైల్డ్లైన్ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు రాణిపేట గ్రామానికి వెళ్లి వధువు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండకుండా వివాహం జరిపించడం నేరమని నచ్చజెప్పారు. అనంతరం వరుడు నివసిస్తున్న పోలూరు గ్రామానికి వెళ్లి అతడి కౌన్సిలింగ్ ఇచ్చి వివాహంను నిలుపుదల చేశారు. సామూహిక అక్షరాభ్యాసాలకు ఆహ్వానం మల్కన్గిరి: స్థానిక బుట్టిగూడ వీధిలో కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ సామూహిక అక్షరాభ్యాసాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు శనివారం పంపిణీ చేశారు. ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అక్షరాభ్యాసాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఈనెల 28వ తేదీలోగ పాఠశాలల్లో చేరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానపత్రాలు అందించారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ఉమా ప్రసాద్ దాస్, జిల్లా అదనపు విద్య అధికారి రాఘురాం సాజన్ తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ టోర్నమెంట్ విజేతగా విరాట్ రైడర్స్
మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితిలో శుక్రవారం నుంచి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 6 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఫైనల్లో విరాట్ రైడర్స్, లిఖల్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ వారియర్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లిఖిల్ వారియర్స్ జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గజేంద్ర మాఝి నిలిచారు. విజేతలకు మత్తిలి ఐఐసీ దేవదత్త మల్లిక్, సమితి సభ్యుపు బాలారాజ్ కోపే, మత్తిలి విద్యుత్ విభాగం ఇంజినీర్ చిత్తరంజన్ మహరణ, మత్తిలి కాలేజీ ప్రిన్సిపాల్ సుభ్రత్ కుమార్ భత్ర తదితరులు ట్రోఫీ అందజేశారు. -
పీఎం ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పది ఆపై తరగతులు ఉత్తీర్ణులైన వారంతా ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమల్లో వీరికి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టరేట్ చాంబర్లో శనివారం జరిగింది. ముందుగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ యువత నైపుణ్యాన్ని పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణ చక్రవర్తి, సీపీఓ పి.బాలాజీ, మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా ఉపాధి అధికారి అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు. పనస చెట్లను విరివిగా పెంచాలి బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని, దీనిని నివారించేందుకు విస్తృతంగా పనస చెట్లను పెంచాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పనస నర్సరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అటవీ శాఖకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ, కన్వర్జెన్నీ పనులు, పల్లె పండగ, ఉల్లాస్ పరీక్ష తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, పీఆర్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారమ్ పాండ్స్ తవ్వడానికి జిల్లాలో శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి డ్వా మా పీడీ ఎస్.శారదాదేవి, పంచాయితీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత లేదు
విజయనగరం అర్బన్: ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక పూర్తిగా తప్పులతో కూడినదని అంబేడ్కర్ ఫోరం ఏపీ అధ్యక్షుడు భానుమూర్తి ఆరోపించారు. దీనిని పరిశీలించాలని రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తూ కలెక్టర్లోని డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తికి శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం కమిషన్ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 (1)(2) సవరించే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉందన్నారు. డీఆర్వోను కలిసిన వారిలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, దారాన వెంకటేష్, మల్లాన సత్యనారాయణ, రెల్లి, ఉపకులాల అధ్యక్షుడు సోము మురళీమోహన్ ఉన్నారు. రాష్ట్ర గవర్నర్కు అంబేడ్కర్ ఫోరం రాష్ట్ర కమిటీ ఫిర్యాదు -
బోడసింగిపేటలో చోరీ
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో గిట్టుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో శనివారం వేకువజామున ఒక దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో కొంత నగదుతో పాటు విలువైన కిరాణా సామగ్రి అపహరించుకుపోయారు. కనిమెరక గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్ గుప్తా బోడసింగిపేటలో కిరాణా దుకాణాన్ని కొన్నాళ్లుగా నడుపుతున్నాడు. రోజూలాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం వచ్చి చూడగా దుకాణం షట్టర్లు పగులకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ యు.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారారాలను సేకరించారు. దుకాణంలో ఉంచిన రూ.12వేల నగదుతో పాటు రూ.13 వేల విలువ చేసే కిరాణా వస్తువులు అపహరించుకుపోయినట్టు బాధితుడు గుప్తా తెలిపాడు. బెల్లం ఊట ధ్వంసం సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని కుశిమిగూడ పరిధిలో మూడు వేల లీటర్ల పులిసిన బెల్లం ఊటలు శనివారం ధ్వంసం చేసినట్టు ఎస్ఐ వై.అమ్మన్నరావు శనివారం తెలిపారు. సారా వంటకాలు చేస్తున్నారనే సమాచారం అందడంతో దాడులు జరిపినట్టు తెలిపారు. భూమిలో డ్రమ్ములతో పాతి ఉంచిన బెల్లం ఊటలు వెలికి తీసి పారబోసి, డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాసంగిలో గజరాజుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి పంట పొలాల్లో గజరాజుల గుంపు శనివారం సాయంత్రం కనిపించాయి. ఉదయం వెంకటరాజపురం, బాసంగి, గదబవలసలో వరి పంటలను ధ్వంసం చేసిన గజరాజులు సాయంత్రానికి బాసంగి పరిసర ప్రాంతాల్లోకి చేరాయి. రాత్రికి మళ్లీ వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. రబీ వరి పంట ఉభాలు వేసి నెల రోజులు కావడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 258 కేజీల గంజాయి స్వాధీనం పాచిపెంట: మండలంలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్ వద్ద పట్టుబడిన గంజాయిని చూపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం మండలంలో కొటికిపెంట పంచాయతీ గోగాడవలస సమీపంలో హరిత రహదారిపై అనుమానాస్పదంగా రెండు కార్లు ఉన్నాయని మాతుమూరు ఇంచార్జ్ వీఆర్ఓ తమకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. ఈ మేరకు పాచిపెంట ఎస్ఐ వెంకటసురేష్ సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లి కార్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రొయ్యల చెరువులో దిగి యువకుడి మృతి గుమ్మలక్ష్మీపురం: రాజమండ్రి సమీపంలోని పాలకొల్లులో రొయ్యల చెరువులో పనికి వెళ్లిన గిరిజన యువకుడు మండంగి కిరణ్ (25) రొయ్యల చెరువులో దిగి శనివారం మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు తల్లిదండ్రులు లక్కమ్మ, శంకరరావు ఇతర కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గ్రామానికి చెందిన కిరణ్ కుటుంబ పోషణ నిమిత్తం రొయ్యల చెరువులో పని చేసేందుకు రెండు నెలల క్రితం వె వెళ్లాడు. రొయ్యల చెరువులో కర్రలు పాతాలంటూ యజమాని చెప్పడంతో శనివారం చెరువులో దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడంటూ.. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది రావాలంటూ పాలకొల్లు నుంచి తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. నేడు అక్షరాస్యత అర్హత పరీక్ష విజయనగరం అర్బన్: అక్షరాస్యత అర్హత కోసం చేపట్టిన ఉల్లాస్ కోర్సు పరీక్షను ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు వయోజన విద్య ఉప సంచాలకులు ఎ.సోమేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 48,578 మంది అభ్యాసకులు ఈ పరీక్ష రాయనున్నారు. దీనికోసం 1,051 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇన్విజిలేటర్గా అంగన్వాడీ టీచర్లు వ్యవహరిస్తారు. వయోజన విద్య శాఖకు సంబంధించి రాష్ట్ర పరిశీలకులుగా ఎ.దొరబాబు జిల్లాలో హాజరుకానున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, ఏపీఎం వెలుగు, సీడీపీఓ, ఐసీడీఎస్ అధికారులు, గ్రామస్థాయిలో సీసీ వెలుగు, ఐసీడీఎస్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. -
యథేచ్ఛగా విక్రయాలు..!
ఇదీ పరిస్థితి పాలకొండ పట్టణంలో కొన్నాళ్ల వరకు ప్లాస్టిక్పై నిషేధం విధించినా.. తర్వాత అధికారులు పట్టు సడలించటంతో మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో 50 కేసులు నమోదు చేసి సుమారు రూ.40 వేలు అపరాధ రుసుము వసూలు చేశారు. తర్వాత ఈ అంశంపై పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో పాలకొండలో పాలథీన్ నిషేధం అటకెక్కింది. పార్వతీపురం పట్టణంలో వీటి వినియోగం భారీగా ఉంటోంది. మొత్తం చెత్త ఉత్పత్తిలో 30–40 శాతం భాగం దీనిదే. ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదు చేసి రూ.85 వేలు మాత్రమే అపరాధ రుసుం విధించటం దీనికి తార్కాణం. అయినా ప్లాక్టిక్ వినియోగం తగ్గలేదు. కురుపాం నియోజకవర్గానికి ఒడిశా నుంచి భారీగా పాలథీన్ సంచులు, తదితరాలు చేరుకుంటున్నాయి. పాలథీన్ నిషేధంలో సాలూరు నగర పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్లాస్టిక్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపడితే, వినియోగం క్రమేపీ తగ్గుతుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. -
ఉగాది కాదు.. ఇది కూటమి దగా!
శృంగవరపుకోట : రానున్న ఉగాది వలంటీర్లకు కూటమి ప్రభుత్వం చేసే దగా.. అని ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ వలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని, రూ.10వేల వేతనం ఇస్తామని ఇప్పుడు మాట తప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపొందాక వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత లేదని మాట మార్చారన్నారు. కూటమి సర్కారును నిలదీసేందుకు ఈ నెల 30వ తేదీన ఆందోళన కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక తొలి నెలలోనే వలంటీర్లను దూరం పెట్టి సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇచ్చి వలంటీర్ల వ్యవస్థపై గొడ్డలి వేటు వేశారన్నారు. క్షయ రహిత సమాజాన్ని నిర్మిద్దాం ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా తన చాంబర్లో శనివారం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి వ్యాప్తి, వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షయ వ్యాధి చికిత్స విధానం తెలియజేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధం
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుల గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరగనున్న 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. రెండోసారి మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనుండడంతో పోటీదారుల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 200 మంది బాడీ బిల్డర్లు పోటీ పడనున్నట్టు నిర్వాహకులు హరిశంకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించేందుకు అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. పోటీలకు సంబంధించి 16 మంది న్యాయ నిర్ణేతల నిర్ణయం తుది తీర్పుగా భావించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోటీదారులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
● గొంతెండుతోంది..!
తాగునీరు అందక తమ గ్రామంలో గొంతెండుతోందని కొరాపుట్ జిల్లా బందుగాం సమితి గిరిడి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక కారు ముందు ఖాళీ బిందెలతో శనివారం నిరసన తెలిపారు. తమ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో విపక్ష బీజేడీకి చెందిన సస్మితా మెలక సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. – కొరాపుట్ -
నీటిని వృథా చేయకూడదు
పర్లాకిమిడి: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వృథా చేయవద్దని జిల్లా శిశు సురక్షా సమితి అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి సూచించారు. స్థానిక బెత్తగుడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇండియన్ సొసైటీ ఫర్ రూరల్ డవలప్మెంట్, వన్స్టాప్ సెంటర్లో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో నీటి వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మా, నువాగడ సమితుల్లో ఈ ప్రభావం ఎక్కువుగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారని సుభానీ పాణిగ్రాహి అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ అసోసియేట్ సునీతా రథ్, యాక్షన్ ఎయిడ్ జిల్లా కో–ఆర్డినేటర్ శేషదేవ భోయి, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు బబులీ నాయక్, వర్షారాణి మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
మూల విరాటులకు మహాస్నానం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో మహాస్నానం సేవ శనివారం నిర్వహించారు. సేవల నిర్వహణ సమయంలో పాణియా అపొటొ గాయపడ్డాడు. నీళ్లు మోస్తుండగా మందిరం లోపలి గడప ప్రాంగణంలో సేవాయత్ కృష్ణచంద్ర అపొటొ జారి పడడంతో గాయపడి రక్తస్రావమైంది. దీంతో శ్రీమందిరం ఆచారం ప్రకారం మూల విరాటులకు మహాస్నానం చేయించారు. ఈ సేవ ముగిసే వరకు దీర్ఘకాలం సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. బాల భోగం నివేదన సేవకు అంతరాయం ఏర్పడింది. ఆలయ ప్రాంగణం శుద్ధి తదితర అనుబంధ కార్యకలాపాలతో భక్తులకు దర్శనం, స్వామి సేవలకు అంతరాయం అనివార్యమైనట్లు దేవస్థానం అధికార వర్గాలు పేర్కొన్నాయి. తక్షణ చికిత్స కోసం బాధిత కృష్ణచంద్ర అపొటొని స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
సాంప్రదాయ చిత్రకళపై వర్క్షాపు
జయపురం: స్థానిక విక్రమదేవ్ చిత్రకళ, క్రాఫ్ట్ కళాశాలలో సాంప్రదాయ చిత్రకళపై శనివారం వర్క్షాపు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అజయ కుమార్ దాస్, జయపురం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాల ప్రిన్సిపాల్ జుధిష్టర్ మల్లిక్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా సాంస్కృతిక విభాగ విశ్రాంత అధికారి కృష్ణచంద్ర నిశంకొ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న చిత్రకళ, చేతి కళలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రాచీన సాంప్రదాయ చిత్రకళలపై ఔత్సాహిక కళాకారుల్లో అవగాహన కల్పించేందుకు వర్క్షాపుల నిర్వహణ ఎంతో అవసరమన్నారు. అనంతరం వర్క్షాపులో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కృష్ణపంగి, అర్జునదాస్, కె.సునీల్ కుమార్, సురేంద్రబాగ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే మడ్కమి
మల్కన్గిరి: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్చరణ్ను మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ విడుదల చేయాలని విన్నవించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్గిరి జిల్లా కేంద్రంలో డైలీ మార్కెట్ వద్ద టీ స్టాల్ నడుపుతున్న చిత్రసేన్ పాలే అనే వ్యక్తి హోలీ రోజున ప్రమాదవశాత్తు సత్తిగూడ జలాశయంలో పడిపోయాడు. దీంతో అక్కడే స్నానం చేస్తున్న కొంతమంది అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్ రిఫర్ చేశాడు. గాయపడిన వ్యక్తిని చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమిలు శనివారం పరామర్శించారు. అనంతరం మరికొన్ని రోజులు చికిత్స అవసరమని తెలియజేయడంతో సీఎంను కలిసి రిలీఫ్ ఫండ్ అందజేయాలని విన్నవించారు. -
స్కూల్లో చాలని మధ్యాహ్న భోజనాలు
మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం మధ్యా హ్న భోజనాలు చాలలేదు. దీంతో హోటల్ నుంచి పార్సిళ్లు తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం పెట్టారు. శనివారం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య తెలియకుండానే వంట చేయడంతో సుమారుగా 15 మంది విద్యార్థులకు అన్నం సరిపోలేదు. దీంతో మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులు హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి 170 మందికి మాత్రమే వంట చేయడానికి బియ్యం ఇస్తున్నారని వంట నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై హెచ్ఎం ఎం. సలాన చిట్టిబాబును వివరణ కోరగా తాను శ్రీకాకు ళం వెళ్లానని, వంట నిర్వాహకులు సరుకులు పక్క దారి పట్టిస్తున్నారని, చెప్పినా వినడం లేదని తెలిపా రు. స్కూల్ అసిస్టెంట్ ప్రసాద్కు బాధ్యతలు అప్పగించానని పేర్కొన్నారు. ఆయనను వివరణ కోరగా 170 మందికి బియ్యం ఇచ్చానని, తిన్నవారికే గుడ్లు, చెక్కీలు ఇవ్వాలని, తినని విద్యార్థులకు ఇవ్వవద్దని ప్రభుత్వం చెబుతోందని ‘సాక్షి’కి తెలిపారు. -
ఫోర్జరీ సంతకాలు.. ఒకరు అరెస్టు
కొరాపుట్: ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ నిధులను దారి మళ్లించి బెట్టింగ్లకు ఉపయోగించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి అరైస్టెయ్యారు. కొరాపుట్ విజిలెన్స్ విభాగం పరిధిలోని కలహండి జిల్లా త్వముల్–రాంపూర్ సమితి పొడపొదర్, తెలంగి పంచాయతీల పీఈవో దేవానంద సాగర్ని అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని భవానీపట్న కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు. నిందితుడు రెండు పంచాయతీలకు చెందిన సర్పంచ్ల సంతకాలను ఫోర్జరీ చేశారు. అనంతరం రూ.3 కోట్ల నిధులను తన సొంత ఖాతాకి బదలీ చేసుకున్నాడు. ఆ డబ్బుతో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడి నష్టపోయాడు. అధికారుల ఆడిట్లో ఈ విషయం తేలడంతో వారు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ బోల్తా.. చిన్నారి మృతి రాయగడ: జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్ సమితి పరిధిలోని పెర్నాకాడు గ్రామ మలుపులో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా, మరో 28 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి గుడుబలి గ్రామానికి చెందిన మేఘన గొబరెంగ(6)గా సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. గుడుబలి గ్రామానికి చెందిన 30 మంది ఒక ట్రాక్టర్లో పెర్నాకాడు గ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కిందపడి ఊపిరాడక మేఘన అనే చిన్నారి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను చంద్రపూర్ ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని మునిగుడ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి సిరిపారి గ్రామ పంచాయతీలోని బహరదులకి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడిని హత్యచేసి మృతదేహాన్ని గ్రామానికి కొద్దిదూరంలో పడేసి వెళ్లిపోయారు. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం మృతదేహం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తు మేరకు మృతుడు కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి లులుపొదొరొ గ్రామానికి చెందిన కుమార స్వామి హలువ (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దక్షిణాదికి అన్యాయం..!
భువనేశ్వర్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వర్గాల్లో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. సమగ్ర ప్రయోజనకర ప్రామాణికత ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనని న్యాయసమ్మతంగా నిర్వహించాలని పలు రాజకీయ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. పునర్విభజనతో దేశంలో లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతాయి. అలాగే లోక్సభ సీట్లు ఆధారంగా ఽశాసన సభ స్థానాల సంఖ్య కూడా పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. తదనుగుణంగా చట్ట సభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించడంతో పలు రాష్ట్రాలు న్యాయ సమ్మతమైన ప్రామాణికత కోసం పట్టుబడుతున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ దిశలో బలంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక జాతీయ సంస్థ అంచనా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దేశంలో పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య 848కి చేరుకుంటుంది. రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటి సంఖ్య 28కి చేరుకుంటుందని అంచనా. జనాభా ప్రామాణికతపై వ్యతిరేకత జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దేశాభివృద్ధికి భారత ప్రభుత్వ ప్రేరణతో జనాభా నియంత్రణకు తోడ్పడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనతో తీరని నష్టం వాటిళ్లుతుందని రాష్ట్రంలోని విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దిశలో న్యాయసమ్మత పునర్విభజన శీర్షికతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చైన్నెలో జరిగిన సంయుక్త క్రియాశీలక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంటుందని అభినందించారు. దేశ జనాభా నియంత్రణకు సుస్థిర కార్యాచరణతో తోడ్పడిన రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజల హక్కులను నిర్ధారించడానికి ఈ సమావేశం ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. దేశ జనాభా నియంత్రణలో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు విశేషంగా పాలుపంచుకున్నాయన్నారు. జనాభాను స్థిరీకరించడంలో సాఫల్యత సాధించిన రాష్ట్రాలకు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పెను విస్ఫోటనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఆయా రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తాజా జనాభా గణాంకాలు పరిగణనలోకి తీసుకుంటే ఒడిశా రాష్ట్రం భారీ నష్టానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశయం నెరవేరాలి 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని సంయుక్త క్రియాశీలక కమిటీ సమావేశంలో తీర్మానించారు. శనివారం చైన్నెలో న్యాయసమ్మత పునర్విభజన శీర్షిక సమావేశం తర్వాత ఆమోదించిన తీర్మానంపై కనిమొలి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 42, 84, 87వ సవరణల లక్ష్యం వెనుక ఉద్దేశం జనాభా స్థిరీకరణగా పేర్కొన్నారు. ఇంకా ఈ లక్ష్యం నెరవేరలేదని తెలిపారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల స్తంభనను అవసరమైన సవరణల ద్వారా మరో 25 సంవత్సరాలు పొడిగించాలని సంయుక్త క్రియాశీలక కమిటీ (జేఏసీ) తీర్మానించింది. నియోజకవర్గాల పునర్విభజనపై వ్యతిరేకత జనాభా ప్రాతిపదికన సరికాదంటున్న పార్టీలు జనాభా నియంత్రణకు ప్రాధాన్యమేదని ప్రశ్నదిగజారిన సంతానోత్పత్తి రేటు గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో సమగ్ర సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దేశ సమగ్ర అభివృద్ధి కార్యాచరణలో భాగస్వామిగా పాలుపంచుకున్న ఒడిశాకు జనాభా ప్రామాణికతతో నియోజకవర్గాలను పునర్విభజిస్తే తీరని అన్యాయం ఎదురవుతుంది. 1971 నుంచి లోక్సభలో 543 స్థానాలు, రాష్ట్ర శాసనసభలో 147 స్థానాలు ఉన్నాయి. 1971 సంవత్సరంలో రాష్ట్ర సమగ్ర సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) దాదాపు 4 కాగా, వర్ధమాన పరిస్థితుల్లో టీఎఫ్ఆర్ 2 కంటే తక్కువగా దిగజారింది. 2019లో రాష్ట్ర సమగ్ర సంతానోత్పత్తి రేటు దాదాపు 1.8గా నమోదు అయింది. అందువల్ల జనాభాను మాత్రమే నియోజకవర్గాల పునర్విభజనకు ఏకై క కొలమానంగా పరిగణిస్తే జనాభా పెరుగుదలను సమర్దవంతంగా అరికట్టలేని రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రానికి అపార నష్టం వాటిళ్లుతుంది. -
తాగునీటి సమస్యలపై ప్రత్యేక టీమ్
జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు సమితి అధికారులు ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్ సమితిలో గొట్టపు బావులు పాడైపోయిన ప్రాంతాలకు చేరుకొని పైప్లను బాగుచేసి ప్రజల తాగునీటి సమస్యలు తీర్చుతుందని బొయిపరిగుడ సమితి బీడీవో అభిమన్య కవి శతపతి, రూరల్ వాటర్ వర్క్స్ శానిటరీ విభాగ సమితి ఇంజినీర్ ప్రమోద్ కుమార్ సాహులు శనివారం తెలియజేశారు. సమితిలోని 20 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాల మేరకు 2,200 బోర్లు తీయించామని వెల్లడించారు. వాటిలో 30 బోరింగ్ల నీటిమట్టం కిందకు దిగిపోయిందని, మరో 45 గొట్టపు బావులు పనిచేయడం లేదని వెల్లడించారు. వాటిని మరమ్మతులు చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. బోరింగ్లతో పాటు సమితిలో 120 సోలార్ నీటి ప్రాజెక్టులు ఉండగా వాటిలో 10 పనిచేయడం లేదన్నారు. సోలార్తో నడిచే నీటి పంపుల నిర్వహణకు 58 మంది ఉద్యోగులను నియమించామని వెల్లడించారు. సమితిలో నీటి సమస్య లేకుండా చూచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు
పలాస: భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు విద్యుత్తును పొదుపుగా వాడాలని పలాస మండలం బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్వీ రమణరావు పిలుపునిచ్చారు. శనివారం ఎర్త్ అవర్ సందర్భంగా పాఠశాలలోని జాతీయ హరితక్లబ్, జూనియర్ రెడ్ క్రాస్క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థులు విద్యుత్తు బల్బు ఆకారంలో మానవహారంగా ఏర్పడ్డారు. ప్రతి ఒక్కరు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్తు ఉపకరణాలను గంట పాటు ఆపి ఎర్త్ అవర్ పాటించాలని కోరారు. ఎన్జీసి క్లస్టర్ కోఆర్డినేటర్ కొయ్యల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జి.సిగడాం: మండలంలోని సంతవురిటి గ్రామంలో శనివారం ఉదయం ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీరామ ప్లాస్టిక్ పరిశ్రమలో విద్యుత్షార్టు సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో మెషినరీ, స్టాక్ షెడ్ అగ్నికి ఆహుతయ్యాయి. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని కంపెనీ నిర్వాహకురాలు బత్తుల దేవయాని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పొందూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్లాస్టిక్ పరిశ్రమ కావడంతో శనివారం సాయంత్రం వరకు మంటలు చెలరేగుతునే ఉన్నాయి. అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం కంచిలి: మండల కేంద్రం కంచిలి పంచాయతీ పరిధి బలియాపుట్టుగ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రీనా బెహరాకు చెందిన ఇల్లు దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. రీనా బెహరా, భైరాగి దంపతులు, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఇంట్లో నివాసముంటున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. భార్త భర్తలు రోజు కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరగడంతో బాధితులు రోడ్డున పడ్డారు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితి తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొత్తకోట శేఖర్, స్నేహితులు ఆదివారం బాధితులను పరామర్శించారు. శేఖర్ రూ.10వేలు, కొల్లి తాతయ్య, బతకల ధర్మారావులు చెరో వెయ్యి రూపాయలు చొప్పున బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సునీల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. గంజాయితో ఇద్దరు అరెస్టు కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం గంజాయిని తరలిస్తున్న ఇద్దరు ఒడిశా యువకులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారని డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. శనివారం కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన జల్సన్ ఆనంద్, మోజేష్ కుమార్లు గంజాయి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉండగా కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ, సిబ్బంది అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి 7 కిలోల 800 గ్రాముల గంజాయి, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు అధికారులు కఠిన చర్యలు అవలంబించాలని, లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి త్వరితగతిన జప్తు చేయాలని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి స్పష్టం చేశారు. శనివారం రేంజి పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పీవీపీ–మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీలు కె.వి.మహేశ్వరరెడ్డి, తుహిన్ సిన్హా, అమిత్ బర్దార్, మాధవరెడ్డి వారి వారి పోలీసు కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. -
వ్యభిచారం గుట్టురట్టు
జయపురం: స్థానిక మెయిన్ రోడ్డులోని ఒక హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పట్టణ పోలీసులు దాడిచేసి ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేశాడు. వారిలో లాడ్జి మేనేజర్ సైతం ఉన్నట్లు పోలీసు అధికారి ఈశ్వర తండి తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 20వ తేదీన పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసు అధికారి ఈశ్వర తండి నేతృత్వంలో పోలీసులు హోటల్పై దాడి జరిపారు. లాడ్జి మేడమీద ఉన్నటువంటి రూమ్స్లో మహిళలు, విటులు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. మహిళలను విచారించగా తమకు హోటల్ మేనేజర్ సహకరించినట్లు వెల్లడించారు. జయపురంలో చోరీ జయపురం: స్థానిక హటపొదర్ ప్రాంతంలోని ధానవీ టౌన్షిప్లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. ఆ టౌన్షిప్లోని నివసిస్తున్న బరుణ పండ ఇంట్లో జరిగిన దొంగతనంలో రూ.85 వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇంట్లో విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు ఇంటి యజమాని పండ పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారి ఈఽశ్వర తండి వెల్లడించారు. పండా తన ఫిర్యాదులో వారం రోజుల క్రితం ఇతర ప్రాంతానికి వెళ్లానని తెలిపాడు. ఇంటికి తాళాలు వేసి చూడమని తన మిత్రుడికి చెప్పానన్నారు. ప్రతిరోజూ ఇంట్లో పడుకోమని చెప్పి, ఫోన్చేసి కనుగునేవాడినన్నాడు. అయితే శుక్రవారం రాత్రి ఇంట్లో దొంగతనం జరిగిందని తన మిత్రుడు తెలియజేయడంతో వెంటనే ఇంటికి వచ్చి చూశానని తెలిపాడు. అల్మరాలో ఉంచిన రూ.85 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి సామాన్లు చోరీకి గురయ్యాయని వాపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చోరీ కేసులో నిందితులు అరెస్టు రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి అంబొదల పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో ఒక మహిళ కూడా ఉంది. వారి నుంచి రూ.30 వేల నగదు, రెండు బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించారు. నిందితుల వివరాలు వెల్లడించ లేదు. మహిళ దారుణ హత్య మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితి మొహిపోదర్ గ్రామంలో చేపల పంపిణీలో వివాదం తలెత్తడంతో లక్ష్మీ కళాడ్(35) అనే మహిళను అదే గ్రామానికి చెందిన ధనుంజయ కళాడ్ అనే వ్యక్తి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వీరిద్దరూ కొన్ని నెలలుగా ఒక వ్యాపారి వద్ద నుంచి చేపలు తీసుకొచ్చి గ్రామంలోని చెరువులో పెంచుతున్నారు. అయితే ధనుంజయ ఒక్కడే చెరువులో చేపలను శుక్రవారం తీసి లక్ష్మీకి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె అతడిని నిలదీయగా గొడ్డలితో దాడితో చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మర్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. దీంతో పోలీసుస్టేషన్లో లక్ష్మీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. -
రత్నం ఫార్మాస్యుటికల్స్పై క్రిమినల్ కేసు
● కాలం చెల్లిన మందులు, నిషేధిత మత్తు సిరప్లు లభ్యం విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని అంబటి సత్రం జంక్షన్లో ఉన్న రత్నం ఫార్మాస్యుటికల్స్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ దుకాణంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టగా గడువుదాటిన మందులు, నిషేధిత మత్తు టానిక్లు దుకాణంలో లభ్యమయ్యాయి. దీంతో ఈ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకుని యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. వెంకటరత్నం మెడికల్ దుకాణంలో అధిక మొత్తంలో మత్తు కలిగించే నిషేధిత టానిక్లు పట్టుకుని సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో ఔషధ నియంత్రణశాఖ ఎ.డి రజిత పాల్గొన్నారు. -
ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్ -
నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
25న పాలకొండలో జాబ్మేళా
పార్వతీపురంటౌన్: ఈ నెల 25న పాలకొండలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఎనీ డిగ్రీ చదివి 18 నిండి 29 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువతి, యువకులు జాబ్మేళాకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి శ్రీ సత్య సాయి డిగ్రీ కాలేజీ, పాలకొండలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు 15 కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీల్లోకి ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులకు తమ వివరాలను హెచ్టీటీపీఎస్//నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ నంబర్తో పాటు రెస్యూమె, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్,1 పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో జాబ్మేళా జరిగే ప్రదేశంలో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 6301275511, 7993795796 నంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు. పాము కాటుతో వ్యక్తి మృతిజియ్యమ్మవలస రూరల్: మండలంలోని రావాడ రామభద్రపురం గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటి (55) పాముకాటుతో శుక్రవారం మృతిచెందాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పొలం పనులు ముగించుకుని వస్తుండగా మార్గమధ్యంలో నాగుపాము కాటువేసింది. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేసి, రావాడ రామభద్రపురం పీహెచ్సీలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో పార్వతీపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటి మృతిచెందాడు. అయినప్పటికీ కుటుంబసభ్యులు సమీపంలోని చినమేరంగి సీహెచ్సీకి తీసుకెళ్లగా వెంకటి మృతిచెందినట్లు అక్కడి వైద్యురాలు పూర్ణ చంద్రిక ధ్రువీకరించారు. -
రైల్వే ఉద్యోగుల నిరసన
విజయనగరం టౌన్: ఈస్ట్కోస్ట్ రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఉద్యోగులు, యూనియన్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ పీవీ.మౌళీశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ కారణంగా అన్ని ఎల్సీ గేట్లకు 8 గంటల రోస్టర్ను అమలుచేయాలన్నారు. ట్రాక్ మెయింటైనర్లకు సైకిల్ అలవెన్స్చెల్లింపును నిర్ధారించాలని, రన్ఓవర్ కేసుల్లో స్టేషన్ మాస్టర్లకు మెమోలు ఇచ్చే ట్రాక్ మెయింటైనర్లను నివారించాలని బదులుగా సీయూజీ ఫోన్ల ద్వారా సంబంధిత కీమాన్, ట్రాక్ మాన్ల నుంచి వివరాలను పొందడంపై పీడబ్ల్యూవే సూపర్ వైజర్ల ద్వారా మెమోలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీని పెంచేందుకు క్వార్టర్స్ మెరుగైన నిర్వహణ చేపట్టాలని కోరారు. సేఫ్టీ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రిస్క్, హార్ట్షిప్ అలవెన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెస్ విజయనగరం బ్రాంచ్ కార్యదర్శి బి.సత్యనారాయణ, శ్రీకాకుళం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.దంతేశ్వరరావు, సెంట్రల్ ఆఫీస్ బేరర్ ఎం.అనిల్ కుమార్, బి.శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
వీహెచ్పీ పటిష్టతకు కృషి
జయపురం: విశ్వహిందూ పరిషత్ పటిష్టతకు అందరూ కృషి చేయాలని వక్తలు కోరు. వీహెచ్పీ పరిషత్ పశ్చిమ ప్రాంత సమావేశాన్ని స్థానిక శారదా విహార ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో మఠ మందిర, విద్యాలయ ప్రముఖులు హరిశంకర జీ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలపై పశ్చిమ ప్రాంత కార్యదర్శి భక్త చరణ దాస్ వివరించారు. వీహెచ్పీని మరింత బలోపేతం చేసేందుకు పరిషత్ సభ్యులు కృత నిశ్చయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మాతృశక్తి, దుర్గా వాహిణీలను ఏర్పాటు చేయాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్లో మహిళాశక్తిని జాగృతి పరచాలని పిలుపు నిచ్చారు. త్వరలో రాబోతున్న హిందూ నూతన సంవత్సరం, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిలను ఘనంగా జరపాలని అందుకు సభ్యులందరికీ ఏకం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ పశ్చిమ ప్రాంత సాధారణ కార్యదర్శి భక్త చరణ దాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణ అనాపతి, ప్రాంత ఉపాధ్యక్షులు బాబా భొయి భజరంగబలి, జయపురం విభాగ కార్యదర్శి నవకృష్ణ రథ్, ప్రాంత ప్రచార, ప్రసారవిభాగ సభ్యలు సాధూ చరణ దాస్ చౌదరి, జయపురం జిల్లా ప్రచార విభాగ దుర్యోధన మాలిలతో పాటు నవరంగపూర్, మల్కన్గిరి ప్రాంతాల నుంచి వీహెచ్పీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పది పరీక్షలు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 10,363 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 10,314 మంది హాజరయ్యరని, 49 మంది గైర్హాజరయ్యరని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంగా పరీక్ష సజావుగా నిర్వహించామన్నారు. 61 పరీక్షా కేంద్రాల్లో వర్యవేక్షక బృందం 6 కేంద్రాల్లో తాను సందర్శించినట్లు తెలిపారు. డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు -
కృత్రిమ మేధ ఈ తరం అద్భుతం
పర్లాకిమిడి: మనిషి మేధాశక్తిని సాంకేతికతతో రూపాంతరం చేసి కృత్రిమ మేధను సృష్టించడం ఈనాటి ప్రపంచంలో చూడగలుగుతున్నామని, ఐఐటీ, భుభనేశ్వర్ ప్రొఫెసర్ భరతం రామ్కుమార్ అన్నారు. స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్శిటీ ఓపెన్ ఆడిటోరియంలో ప్రథమ అంతర్జాతీయ సమావేశానికి ప్రొఫెసర్ భరతం రామ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సమావేశానికి గౌరవ అతిథులుగా భువనేశ్వర్ నుంచి శిక్షా ఓ అనుసంధాన్ డీమ్డ్ వర్సిటీ అధ్యాపకులు మిహిర్ ఎన్.మహంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆశిష్ రందజన్ దాస్, ప్రొఫెసర్ సుజాతా చక్రవర్తి, సెంచూరియన్ వీసీ ప్రొఫెసర్ సుప్రియా పట్నాయిక్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రోలు విచ్చేయగా సమావేశ కన్వీనరు ప్రొఫెసర్ అశోక్ మిశ్రా తన స్వాగత ప్రసంగంలో అతిథులను ఆహ్వానించారు. దేశ, అంతర్జాతీయ నిపుణులు, పరిశోధకుల నుంచి 140 థీసిస్ పేపర్లు రాగా, వాటిలో 40 ప్రెజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా మెడా– 2025, మెషీన్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్పై ఒక సావనీర్ను గౌరవ అతిథులు ఆవిష్కరించారు. కృత్రిమ మేధాశక్తితో మెషీన్ ఇంటెలిజెన్సు, డాటా సైన్స్ అనుసంధానం చేసి ఫ్యాక్టరీలు, రైల్వే కోచ్లు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉపయోగిస్తున్నారని ప్రొఫెసర్ భరతం రాంకుమార్ తన ప్రెజెంటేషన్లో పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ సెమినార్ మెడా–25కు వర్చువల్ విధానంలో ప్రొఫెసర్ విన్సెంజో పియురీ (ఇటలీ), లక్కీశర్మ (జీకోన్ నెట్వర్క్), ప్రొఫెసర్ స్వగతం దాస్ (కోల్కోత్తా), నేహాశర్మ, ఫ్రోసెలస్టియన్ వెండీ (యు.కె.)లు హాజరయ్యారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నందిగాం: మండలంలోని హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కురాడ ఢిల్లేంద్ర(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందిగాం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కురాడ కరువులుకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఢిల్లేంద్ర జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుశీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న తమ్ముడు భుజంగరావును ష్యూరిటీగా పెట్టి భార్య సుశీల పేరిట రూ.3 లక్షల లోన్ తీసుకున్నాడు. కొద్ది రోజులుగా లోన్ డబ్బులు కట్టకపోవడంతో కుటుంబంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య సుశీల సారవకోట మండలం కుమ్మరిగుంటలో ఉన్న కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఢిల్లేంద్ర శుక్రవారం ఉదయం టెక్కలి వెళ్లాడు. అటు నుంచి బస్సులో బెండిగేటు వరకు టికెట్ తీసుకొని తురకల కోట వద్ద దిగాడు. అక్కడినుంచి మాదిగాపురం సమీపంలో ఉన్న తమ జీడి తోటకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఘటనా స్థలంలో హిట్ దోమల కాయిల్స్, మద్యం బాటిల్ ఉండటంతో మందులో కాయిల్స్ కలిపి తాగి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి తమ్ముడు తోటలో జీడి పిక్కలు ఏరేందుకు వెళ్లగా అక్కడ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధి పనులపై సమీక్ష
మల్కన్గిరి: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆహార సరఫరా, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆయన జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి అనంతరం ఈ సమావేశానికి హాజరయ్యారు. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవినీతిపరులపై కఠన చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. రేషన్ కార్డు కోసం 6.8 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారని, అర్హులకు కార్డులు అందేలా బ్లాక్ స్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి నివాసయోజన కింద అర్హుల ఎంపికకు సర్వే నిర్వహించాలన్నారు. సమావేశంలో మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మట్కమి, మల్కన్గిరి కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సమరి టంగులు, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రదన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేష్ చంద్ర సాబర తదితరులు పాల్గొన్నారు. పొర్జిశీల గ్రామంలో నీటి ఎద్దడి రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి పొర్జిశీ ల గ్రామంలో మంచినీటి కొరత తలెత్తడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. తమ గ్రా మానికి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలక్టర్ ఫరూల్ పట్వారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో 30 కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా నివసిస్తున్నామన్నారు. గ్రామంలో ఉన్న ఏకై క బోరింగు మరమ్మతులకు గురైందని.. దీంతో నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోయారు. సమస్యను పరిష్కరించి తమ కష్టాలు తీర్చాలని కలెక్టర్కు విన్నవించారు. వినతిపత్రం సమర్పించిన వారితో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండా కూడా ఉన్నారు. ప్రఫుల్ల కుమార్ పండాకు ఇస్రో ఐఐఆర్ఎస్ ఆవార్డు పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ ప్రఫుల్లకుమార్ పండాకు ఉత్తమ ఐఐఆర్ఎస్. డి.ఎల్.పి.కోఆర్డినేటరు ఆవార్డును ఇస్రో సంస్థ డెహారాడూన్లో అందుకున్నారు. ఈ ఆవార్డు ను ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎ.కె.కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నట్టు డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా తెలిపారు. దేశవ్యాప్తంగా 3,800 మంది ఈ ఆవార్డుకు దరఖాస్తు చేసుకోగా వారిలో 22 మంది కోఆర్డినేటర్లు ఎంపిక అవ్వగా చివరికి ముగ్గురు ఆవార్డుకు ఎంపికయ్యారు. ప్రఫుల్ల కుమార్ పండా స్పేస్ టెక్నాలజీ , జియాస్సెషల్ అప్లికేషన్పై ఆయన పరిశోధనకు ఈ ఆవార్డు లభించింది. డాక్టర్ పండా గతంలో ఇస్రోలో కొన్నేళ్లు పనిచేసి మానేవేశారు. ఇస్రో సంస్థ తరఫున ఆవార్డు పొందినందుకు సెంచూరియన్ వర్సిటీ చైర్మన్ డాక్టర్ ముక్తికాంత మిశ్రా, ఉపాధ్యక్షులు అచా ర్య డి.ఎన్.రావు, ఉపకులపతి డాక్టర్ సుప్రియా పట్నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్ర్లు అభినందనలు తెలియజేశారు. డంపింగ్ యార్డును తరలించండి కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డంపింగ్ యార్డుని వేరే ప్రాంతానికి తరలించాలని సచేతన నాగరిక మంచ్ డిమాండ్ చేసింది. శుక్ర వారం కొరాపుట్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంచ్ సభ్యులతో మున్సిపల్ యంత్రాంగం చర్చలు జరిపింది. పట్టణంలోని 10వ వార్డులో అశోక్ నగర్లో ప్రస్తుతం డంపింగ్ యార్డు ఉంది. అందులో పట్టణంలో వ్యర్ధాల తో పాటు వైద్య కళాశాల వ్యర్ధాలు వేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతం అంతా దుర్గంధంతో పాటు పొగలు అలుముకుంటున్నాయి. దీనిని తరలించక పోతే మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మంచ్ హెచ్చరింది. దాంతో మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి జోక్యం చేసుకొని మంచ్ సభ్యులతో చర్చలు జరిపారు. యార్డుని వేరే చోటుకు తరలించడానికి అధికారులు అంగీకరించారు. మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్, రుపక్ తురుకు తదితరులు పాల్గొన్నారు. -
ఆశ కార్యకర్తల ర్యాలీ
మల్కన్గిరి : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆశ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు శుక్రవారం మల్కన్గిరి జిల్లా కేంద్రంలో జిల్లా ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆశ వర్కర్లకు నెలకు రూ. 18 వేలు వేతనం పెంచాలి, మరణించే కార్యకర్త కుటుంబానకి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ సమయంలో పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. -
మహిళలపై పెరిగిన దాడులు
మల్కన్గిరి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో మహిళలపై దాడులు చాలా ఘోరంగా పెరిగిపోయావని మల్కన్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద పాత్రో ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై దాడులు పెరగడంతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పావన్నారు. పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వ విఫల్యానికి నిరసనగా ఈ నెల 27వ తేదీన భువనేశ్వర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభను ముట్టడిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు జి. శ్రీనివాస్రావు , కోరాపుట్ మాజీ ఎమ్మెల్యే కృష్ణచంధ్ర సోగాడియా, మాలమాడీ, పి.కేసురావు పాల్గొన్నారు. -
ఇంటర్ వర్సిటీ బేస్బాల్ పోటీలకు పట్టణ క్రీడాకారులు
విజయనగరం అర్బన్: నెల్లూరులోని విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో త్వరలో జరగనున్న ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఆంధ్రయూనివర్సిటీ నుంచి పోటీ పడే జట్టులో విజయనగరం పట్టణంలోని మహరాజా అటానమస్ కళాశాల క్రీడాకారులు ముగ్గురు ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ నెల 19న జరిగిన అంతర్ కళాశాల బేస్బాల్ పోటీల్లో ప్రతిభచూపిన ఎం.దుర్గాప్రసాద్, ఐ.నవీన్కుమార్, ఎన్.భవానీప్రసాద్ ఎంపికై న తుదిజట్టులో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న వారిని మాన్సాస్ కరెస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాంబశివరావు, పీడీ డాక్టర్ పి.రామకృష్ణ, అధ్యాపకులు అభినందించారు. -
గ్రామాల్లో కానరాని అభివృద్ధి
పర్లాకిమిడి: గ్రామాల్లో అభివృద్ధి కానరావడం లేదని సీపీఐ ఎంఎల్ నాయకులు అన్నారు. గజపతి జిల్లా నువాగడ బ్లాక్ అనుగురు పంచాయతీ పెట్టగుడ గ్రామంలో స్వాతంత్య్రం వచ్చి నేటికి 76 సంవంత్సరాలు గడిచినా అభివృద్ధ కానరాలేదని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి గోమంగో అన్నారు. శుక్రవారం ఆయన పెట్టగుడ గ్రామంలో ఆదివాసీ సభ నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం వేతనదారులకు రోజుకు రూ.600 ఇవ్వాలని, జాబ్కార్డులు మంజూరు చేయాలని, పింఛన్ నెలకు రూ.5 వేలు, మంచినీరు, విప్పపువ్వు మద్దతు ధర కిలో రూ.100, మొక్కజొన్న కిలోకి రూ.200 ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. అలాగే జయపూర్ మకిండి కెందునల్లా, అంబాఝరి, నువాసాహి వద్ద చెక్డ్యాంలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పెట్టగుడ నుంచి కెడిపదర్, మాణిక్ పూర్, జయపూర్కు పక్కారోడ్డు నిర్మించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే నువాగడ తహీల్దార్, బ్లాక్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తిరుపతి గోమాంగో అన్నారు. కార్యక్రమంలో కర్నియల్ గోమాంగో, మాథ్యూ రయితో, సైడ్రిక్ మల్లిక్, మయిజో మజ్జి, జయామజ్జి, జోహాన్ రయితో, రాజేంద్ర మఝి పాల్గొన్నారు. -
కొఠియా ప్రాంతంలో ఆక్రమణలు తగవు
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఆక్రమణలు తగవని సీపీఎం నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీ ఎగువ శెంబి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా సాలూరు మండల సీపీఎం కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు పర్యటించారు. ఒడిశా ప్రభుత్వం తరఫున గనుల తవ్వకాల కోసం రాళ్లు పాతారని గుర్తు చేశారు. ఈ విషయం పై ఇటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి సంధ్యారాణి కూడా మౌనం వహిస్తున్నారన్నారు. వివాదాస్పద ఆ ప్రాంతం లో సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయన్నారు. అంతేకాక ఐదో షెడ్యూల్ ప్రాంతం కనుక గిరిజనులకే సర్వ హక్కులు ఉన్నాయన్నారు. ఇక్కడ సరిహద్దు రాళ్లు వేసి గనులు తవ్వకాల కోసం ప్రారంభ పూజలు చేసిన చిత్రాలు శ్రీనివాసరావు విడుదల చేశారు. -
సేవా దృక్పథంతో ముందుకు సాగాలి
రాయగడ: వైద్య రంగంలో భాగమైన బీఫార్మా చదువును పూర్తి చేసుకున్న విద్యార్థులు సేవా దృక్పథంతో ముందుకు సాగాలని.. వారి భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సెంచ్యూరియన్ విశ్వవిద్యాలయం బీ. ఫార్మా విభాగం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ పాత్రో అన్నారు. స్థానిక పితామహాల్లోని సెంచ్యూరియన్ విశ్వవిద్యాలయంలోని బీ ఫార్మ చివరి సంవత్సరం చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన వీడ్కొలు సభలో ప్రసంగించారు. వైద్య రంగంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఇటువంటి కోర్సుల్లో ఆసక్తి కనబరిచి చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు మెండుగా లభిస్తాయని అన్నారు. వాటిని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ దీపక్ రౌత్, డాక్టర్ హరగౌరి మిశ్రా, డాక్టర్ కామిని శెఠి అన్నారు. -
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు. ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శనవేపాడ: మండలంలోని బానాది గ్రామంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరుగు ప్రదర్శనలో 12 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో రామన్న పాలెంకు చెందిన విక్రమ్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచి రూ.12 వేలు, రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెర్సీ నిలిచి రూ. పదివేలు సాధించాయి. మూడో స్థానంలో రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక గుర్రం, నాల్గో స్థానంలో ఎల్.కోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం నిలిచి నగదు బహుమతులు సాధించాయి. విజేతలకు ఆలయ ధర్మకర్తలు, పెద్దలు కమిటీ సభ్యులు నగదు బహమతులు అందజేశారు. ‘గేట్’ లో కార్తికేయ కుశల్ కుమార్కు 79వ ర్యాంక్విజయనగరం అర్బన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్–2025) ఫలితాల్లో పట్టణ విద్యార్థి గంట కార్తికేయ కుశల్ కుమార్ జాతీయ ర్యాంక్ 79 సాధించాడు. గేట్లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) సబ్జెక్టులో 842 స్కోర్తో 79వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కార్తికేయ బీటెక్ కాలికట్ ఎన్ఐటీలో చదివాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించిన కార్తికేయ తండ్రి జి.సునీల్ కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి శోభ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని. పోక్సో కేసులో 12 ఏళ్ల జైలుశిక్షభామిని: మండలంలోని బిల్లుమడకు చెందిన మండల శివ అనే ముద్దాయికి పోక్సో కేసులో విచారణ అనంతరం శుక్రవారం 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో బిల్లుమడ గ్రామంలో ఓ చిన్నారిపై మండల శివ అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా న్యాయమూర్తి విచారణ అనంతరంనేరారోపణ నిర్ధారించి శిక్ష విధించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుసీతంపేట: మండలంలోని మాసడుగూడ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకోవడంతో ఎస్.గణపతి, మనోజ్లకు గాయాలు కాగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించడంతో మెరుగైన వైద్యం కోసం గణపతిని రిమ్స్కు రాఫర్ చేసినట్లు ఏరియా ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. అదృశ్యం కేసు నమోదు పార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల గ్రామానికి చెందిన నీలయ్య జనవరి 20 నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. బంధువులు, పరిచయస్తుల ఇళ్ల వద్ద భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందంటూ భార్య ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివాహిత ఆత్మహత్యపార్వతీపురం రూరల్: వివాహమైన ఏడాదికే అత్తవారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై ఎస్సై బి.సంతోషి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బొడ్డవలస గ్రామానికి చెందిన నాదెళ్ల లీలాసత్య(36) అత్తవారింట్లో వరకట్నం వేధింపులు, అవమానాలు తాళలేక ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డినట్లు మృతురాలి తండ్రి నాదెళ్ల దుర్గారావు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు మృతురాలి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు స్థానిక ఎస్సై పి.రమేష్ నాయుడు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నాల్గవ గేటు వద్ద యువకుడి మృతదేహం తేలియాడుతూ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత మృతుడిని పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆలవెల్లి రాజా(26)గా గుర్తించారు. ఈనెల 19 బుధవారం ఉదయం నుంచి కుమారుడు ఆలవెల్లి రాజా ఆచూకీ లేకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు పార్వతీపురం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా శుక్రవారం తోటపల్లి జలాశయం వద్ద రాజా మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
తాడి ప్రకాష్కి పతంజలి పురస్కారం
విజయనగరం గంటస్తంభం: ప్రముఖ పాత్రికేయుడు, సినీ మాటల రచయిత కె.ఎన్.వై.పతంజలి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు, పతంజలితో పాతికేళ్ల పాటు కలిసి పనిచేసిన రచయిత తాడి ప్రకాష్కు పతంజలి పురస్కారం అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏటా పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందజేస్తున్నామన్నారు. 2025 సంవత్సరానికి గాను తాడి ప్రకాష్కు ఈ నెల 29 తేదీన గురుజాడ గ్రంథాలయంలో పురస్కారం ప్రదానం చేస్తామని చెప్పారు. సాహిత్య అభిమానులు, రచయితలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేదిక కార్యదర్శి బాబు, లక్ష్మణరావు, పౌరవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. -
చైన్నె చేరిన బీజేడీ, కాంగ్రెస్ నాయకులు
భువనేశ్వర్: ప్రతిపాదిత పునర్విభజనపై చైన్నెలో జరగనున్న సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్రం నుంచి బిజూ జనతా దళ్, కాంగ్రెస్ నాయకులు బయల్దేరారు. శుక్రవారం సాయంత్రం వీరంతా చైన్నె చేరారు. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు అమర్ పట్నాయక్, మాజీ ఎమ్మెల్యే సంజయ్ దాస్ బర్మ ప్రాతినిథ్యం వహించారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పునర్విభజన సాహసోపేతమైన రాజకీయ చర్యలో భాగంగా రాజకీయ శిబిరాల్లో చర్చ సాగుతుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక దళాలు శనివారం చైన్నెలో జరగనున్న డీలిమిటేషన్పై కీలకమైన సమావేశానికి హాజరు అవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం బీజేడీ తన వైఖరిని ఈ సమావేశంలో వ్యక్తీకరిస్తుందని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేవలం జనాభా గణాంకాల ఆధారంగా ఉంటే రాష్ట్రంపై పునర్విభజన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఈ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో చర్చ ఆధారంగా రాష్ట్రంపై పునర్విభజన ప్రభావం స్పష్టం కానుందని సంజయ్ దాస్ బర్మ తెలిపారు. తదనంతరం బీజేడీ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఒడిశా, పంజాబ్, బెంగాల్ సహా ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన నాయకత్వ ప్రతినిధి బృందం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆతిథ్యం ఇచ్చే కార్యక్రమంలో సమావేశమవుతుందని సమాచారం. ఈ ఉన్నత స్థాయి సమావేశం వివాదాస్పద పునర్విభజనతో ప్రాంతీయ సమస్యలను చర్చిస్తుందని భావిస్తున్నారు. -
వేతనదారులకు నిలువనీడ కరువు
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఎంఎన్ఆర్ఈజీఎస్ పనులు చేయడంలో ముందంజలో గత కొన్నేళ్లుగా ఉంది. ఈ మండలంలో ఎక్కువ పనులు జరుగుతాయి. అటువంటి ఈ మండలంలో ఉపాధి వేతనదారులకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవి వచ్చినా కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో వేతనదారులకు అవస్థలు తప్పడం లేదు. అసలే వేసవి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపాధి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో అత్యధికంగా ఎండ కాస్తోంది. ఉదయం 8 గంటలైతే భానుడు భగభగ మంటున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండలు మండుతున్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వేతనదారులు వాపోతున్నారు. అలాగే పని సమయంలో వడదెబ్బ వంటివి, చిన్నచిన్నదెబ్బలు తగులుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశం వద్ద ఉండాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంతవరకు సప్లై చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. వేతనదారులు డీహైడ్రేషన్కు గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి ఉంది. బకాయిలు రూ.5 కోట్లకు పైనే.. వేతనదారులకు చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా. మెటీరియల్ కాంపొనెంట్లో వేసిన రహదారులు, హార్టీకల్చర్, ఇతర పనులు దాదాపు 200 వరకు జరగడంతో వాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. వేతనదారులు చేసిన భూ అభివృద్ధి పనులు వంటి వాటికి ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దాదాపు ఉపాధి వేతనదారులు జాబ్కార్డులు ఉన్నవారు 18 వేల మంది ఉన్నారు. వారిలో వందరోజుల పనులు పూర్తి చేసిన వారు 80 శాతం వరకు ఉండడంతో ప్రస్తుతం పనులు చేస్తున్న వేతనదారులు 3 వేలమంది ఉన్నారు. భూ అభివృద్ధి, టెర్రాసింగ్, ఫార్మ్పౌండ్ పనులు వేతనదారులు చేస్తున్నారు. ఇలా 150 వరకు పనులు చేశారు. సరాసరి ఒక్కో వేతనదారుకు రోజుకు రూ.270 వరకు వేతనం గిట్టుబాటవుతుంది. రెండు నెలలుగా బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. కొలతలకు టేప్ సప్లై లేదు.. ఉపాధి పనులు చేసిన వేతనదారుల పనులు ఎంత పూర్తి చేశారనేది సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది కొలతలు వేయడానికి వీలుగా టేపులు సప్లై చేయాల్సి ఉన్నప్పటికీ అవికూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. కేవలం ఎవరి సామగ్రి వారు తెచ్చుకునే పనుల కొలతలు వేస్తున్నారు. పనిప్రదేశంలో మెడికల్ కిట్లు లేవు మండుటెండలోనే పనులు 8 వారాలుగా వేతనాలు అందక విలవిలటెంట్లు తాత్కాలికంగా వేసుకోమన్నాం వేతనదారులు పనిచేసిన చోట టెంట్లు తాత్కాలికంగా వేసుకుంటున్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు పనులు చేసుకుంటున్నారు. బకాయి నిధులు మంజూరైన వెంటనే వేతనదారులకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం. శ్రీహరి, ఏపీడీ, ఎంఎన్ఆర్ఈజీఎస్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం
జయపురం: ఒకే చోట మూడు బైక్లు ప్రమాదానికి గురి కాగా ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారునితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన మహిళ జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి పల్లి గ్రామం లలిత గౌఢ (60) కాగా గాయపడిన వారిలో ఆమె కుమారుడు హిరణ్య గౌఢ(27), బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధిలోగల ఖెందుగుడ గ్రామ దంపతులు ప్రభాకర పాత్రో (45) అతడి భార్య సేవిక పాత్రో, అలాగనే జయపురం సమితి మూలసొర గ్రామం రవీంధ్ర తంతి(24) ఉన్నట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హిరణ్య గౌడను కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించామని, మిగతా ముగ్గురిని జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. లలిత ఆమె కుమారుడు హిరణ్యలు బైక్పై బొరిగుమ్మ వెళ్తుండగా ప్రభాకర పాత్రో దంపతులు బైక్పై జయపురం వస్తున్నారు. 26 వ జాతీయ రహదారి రొండాపల్లి గ్రామం రేడియో స్టేషన్ కూడలి వద్ద ఆ రెండు బైక్లు ముఖాముఖి ఢీకొన్నాయి. అదే సమయంలో జయపురం సమితి మూలసర గ్రామం నుంచి రవీంద్ర మరో బైక్పై వస్తుండగా అదే స్థలంలో అతడి బైక్ కూడా ప్రమాదానికి గురైంది. అతడు చిన్న దెబ్బలతో బయట పడ్డాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అంబాగుడ పోలీసు పటి పోలీసు అధికారి మనువ బిడిక పోలీసులతో సంఘటన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమం చేపట్టారు. స్థానికుల సహకారంతో గాయపడిన వారందరినీ ఆస్పత్రికి పంపారు. సమాచారం అందుకున్న సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రదాన్ అక్కడకు చేరుకున్నారు. చికిత్స చేస్తున్న సమయంలో లలిత మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. హిరణ్య గౌడ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం అతడిని కొరాపుట్ తరలించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. -
అడవిలో చిన్నారి మృతదేహం లభ్యం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి గగుడిమాల్ గ్రామ సమీపంలో గల ఒక అటవీ ప్రాంతంలో ఒక చిన్నారి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కొరాపుట్ తరలించారు. కళ్యాణసింగుపూర్ ఐఐసీ నీలకంఠ బెహర తెలియజేసిన వివరాల ప్రకారం... ఈ నెల 11 వ తేదీన గగుడిమాల్ గ్రామానికి చెందిన అజిత్ నాగవంశ్ అనే వ్యక్తికి చెందిన ఏడాదిన్నర కొడుకు తప్పిపోయాడు. ఎంత వెతికినా జాడ లేకపోవడంతో కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నాడు గగుడిమాల్ గ్రామానికి చెందిన కొందరు బహిర్భూమికని అటువైపుగా వెళుతున్న సమయంలో పొదల నుంచి దర్వాసన రావడం గమనించి అక్కడకు వెళ్లి చూశారు. ఒక మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అజిత్ నాగవంశ్కు సమాచారం అందించారు. మృతదేహానికి ఉన్న చొక్కాను బట్టి అది తన కొడుకు మృతదేహమేనని అజిత్ స్పష్టం చేశాడు. అయితే గ్రామానికి ఇంత దూరంలో ఏడాదిన్నర చిన్నారి ఎలా వచ్చింది. ఇది హత్యా లేక మరేమైనా కారణం ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం
పర్లాకిమిడి: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జైల్ రోడ్డులోని దేవగిరి రేంజ్ కార్యాలయం నుంచి ఒక చైతన్య ర్యాలీని డీఎఫ్ఓ సన్నీ ఖోఖర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ మీదుగా హైస్కూల్, రాజవీధి మీదుగా ఫారెస్టు కార్యాలయం వరకూ సాగింది. అనంతరం జిల్లా అటవీ డివిజనల్ శాఖ కార్యాలయంలో ఒక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా పాల్గొని మాట్లాడారు. గజపతి జిల్లాలో అటవీ ప్రాంతంలో వన్యప్రాణాలు రక్షించాలని, అటవీ సంపదను మనం కాపాడుకోవాలని ఎస్పీ జె.ఎన్.పండా సూచించారు. డీఎఫ్ఓ సన్నీ ఖోఖర్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఏసీఎఫ్ అరుణ్ కుమార్ సాహు, ఏడీఎఫ్ షైన్శ్రీ దాస్, రేంజర్ బ్రహ్మానంద సాహు, సెంచూరియన్ డీన్, దేవగిరి రేంజ్ ఫారెస్టర్ పి.వెంకటరమణ, ఫారెస్టుగార్డు ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటితేనే భవిష్యత్ జయపురం: మొక్కలు నాటి చెట్లు పెంచక పోతే దేశ పౌరులు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని తిరగాల్సి వస్తుందని పలువురు వక్తలు అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జయపురం అటవీ డివిజన్ విభాగం వారు జయపురం పూల్బెడ ప్రాంతంలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్ర సభా గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రేమికులు, రీసెర్చ్ స్కాలర్స్ సైంటిస్టులు పాల్గొన్నారు. సమావేశంలో జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ కుమార్ బెహరా అంతర్జాతీయ అటవీ దినోత్సవం ప్రాధాన్యతపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత పీకే మిశ్ర మాట్లాడుతూ దేశంలో పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వృధాగా ఉన్న భూములను పచ్చగా మార్చాలన్నారు. 2025 నుంచి 2050 లోగా జీరో కార్బన్ డై ఆకై ్సడ్ దేశంగా మార్చాలన్న కలను సాకారం చేసేందుకు ఉద్యమించాలన్నారు. అటవీ విభాగ అధికారి పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన ప్రపంచ అటవీ దినోత్సవంలో ప్రముఖ పర్యావరణవేత్త, స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ జియాలజీ విభాగ ప్రొఫెసర్ ఉదయ కుమార్ దాస్, డీఎఫ్ఓ ప్రతాప్ కుమార్ బెహరా, తదితరులు పాల్గొన్నారు. -
13 ఇసుక ట్రాక్టర్లు సీజ్
రాయగడ: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై జిల్లాలోని గుణుపూర్ ఆదర్శ పోలీసులు కొరడా ఝులిపించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ఖనిజ, వాణిజ్య శాఖల మంత్రి బిభూతి జెన్న ఇటీవల రాయగడ జిల్లాలో పర్యటించిన సందర్భంగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా జిల్లాలోని గుణుపూర్లో ఉన్న వంశధార నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 13 ట్రాక్టర్లను సీజ్ చేసి, దీనికి సంబంధించి 12 కేసులు నమోదు చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.చైన్ స్నాచింగ్ భువనేశ్వర్: పట్టపగలు నడి రోడ్డు మీద చైన్ స్నాచింగ్ జరిగిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఈ మేరకు స్థానిక బొడొగొడొ పోలీసు ఠాణాలో శుక్రవారం ఫిర్యాదు దాఖలైంది. నగరంలో బ్లాక్ పల్సర్ బైక్పై హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చైన్ తెంచుకొని పరారైనట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఘటనతో నగరంలో భయాందోళన నెలకొంది.భారీగా గంజాయి స్వాధీనం రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్స్టేషన్ పరిధి సరిగడ అటవీ ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 1,020 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ముగ్గురు నిందితులను అరె స్టు చేశారు. నిందితులను శుక్రవారం కోర్టుకు తరలించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబులెన్స్ను ఢీకొన్న ట్రక్ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మల్కన్గిరి సమితి సింద్రిమాల గ్రామం వద్ద గురువారం రాత్రి మృతదేహంతో వస్తున్న అంబులెన్స్ను ఓ ట్రక్ ఢీకొట్టింది. ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్కన్గిరి సమితి ఎంవీ 43 గ్రామానికి చెందిన శాంతి మండాల్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో మల్కన్గిరి ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థి తి విషమించడంతో బరంపురం ఆస్పత్రికి రిఫ ర్ చేశారు. సోమవారం అక్కడకు తరలించగా గురువారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తుండగా మల్కన్గిరి నుంచి జయపురం వస్తున్న ఓ ట్రక్ అంబులెన్స్ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్లో ఉన్న తల్లీకొడుకులు, డ్రైవర్కు గాయాలయ్యా యి. ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్ను స్వాధీనం చేసుకున్నారు. -
సభలో కాంగ్రెస్ దుమారం
● బాకాలు ఊదుతూ నిరసన తెలిపిన నాయకులు ● హోరెత్తిన సభ భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో శుక్రవారం నాటి పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. కాంగ్రెస్ సభ్యులు తగ్గేదే లేదని తెగేసి స్పీకరుని చుట్టుముట్టారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ వైఖరిలో ఏమాత్రం తగ్గేది లేదు. ఈ విచారకర పరిస్థితులపై ప్రభుత్వం సభా కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని తొడ గొడుతున్నారు. బడ్జెటు సమావేశాల ఆరంభం నుంచి కాంగ్రెస్ సభ్యులు ఇదే పట్టుతో ఏమాత్రం సడలకుండా నిలదీస్తున్నారు. సభలో ఉద్యమానికి సారథిగా పేరొందిన తారా ప్రసాద్ బాహిణీపతిని సభ నుంచి వారం రోజుల పాటు సస్పెన్షన్ ఉత్తర్వుల్ని స్పీకరు జారీ చేయడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. నిత్యం నిరసనలతో సభా ప్రాంగణం హోరెత్తి పోతోంది. నిరసనకారుల వ్యతిరేకంగా చర్యలు చేపట్టలేని దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ దక్షత ఊగిసలాడుతోంది. రోజుకో అవతారంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకరుని చుట్టుముట్టి సభలో గలాటా రేపుతున్నారు. నిస్సహాయ పరిస్థితుల్లో స్పీకరు సభని అంచెలంచెలుగా వాయిదా వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. శుక్రవారం మరో విభిన్న రూపంలో కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రత్యక్షం అయ్యారు. అంతా నల్లని దుస్తులు ధరించి తలకు నల్లని పాగా చుట్టి వింత రూపంలో తారస పడ్డారు. సభా కార్యక్రమాలు మొదలు కావడంతో తలో వాద్యంతో సభా ప్రాంగణాన్ని మనోరంజక వేదికగా మలిచారు. ఘంటానాదం, వేణు గానం, బాకా బజాయింపుతో సభ ప్రాంగణం హోరెత్తి పోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సభా కార్యకలాపాల్ని స్పీకరు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నిరసన కారణంగా శాసన సభలో ప్రశ్నోత్తరాలకు పూర్తిగా గండి పడింది. సభని ఉదయం 11.30 గంటల వరకు స్పీకరు సురమా పాఢి వాయిదా వేయడంతో ఈ విచారకర పరిస్థితి నిరవధికంగా కొనసాగుతుంది. వేణు గానం, బాకా బజాయింపు, ఘంటానాదం చేస్తు కాంగ్రెస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. మహిళలపై నేరాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని చేసిన నినాదాలతో సభని మారు మోగించారు. మరోవైపు సభలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన విపక్షం బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు కూడా సభ నుంచి వైదొలిగారు. బీజేడీ సభ్యులు సభలోని స్పీకరు పీఠం ముంగిటకు చేరి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేస్తు స్పీకరుకు చేతులు ఊపుతూ తమ అసంతృప్తిని వ్యక్తం చేసి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగిన ప్రజా సమస్యలపై గళం కదిపేందుకు వీలు లేకుండా అధికార పక్షం అన్యాయానికి పాల్పడుతోందని ఆరోపించారు. చర్చలో పాల్గొనడానికి తమకు తగిన అవకాశం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. -
చైన్నె చేరిన బీజేడీ, కాంగ్రెస్ నాయకులు
భువనేశ్వర్: ప్రతిపాదిత పునర్విభజనపై చైన్నెలో జరగనున్న సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్రం నుంచి బిజూ జనతా దళ్, కాంగ్రెస్ నాయకులు బయల్దేరారు. శుక్రవారం సాయంత్రం వీరంతా చైన్నె చేరారు. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు అమర్ పట్నాయక్, మాజీ ఎమ్మెల్యే సంజయ్ దాస్ బర్మ ప్రాతినిథ్యం వహించారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పునర్విభజన సాహసోపేతమైన రాజకీయ చర్యలో భాగంగా రాజకీయ శిబిరాల్లో చర్చ సాగుతుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక దళాలు శనివారం చైన్నెలో జరగనున్న డీలిమిటేషన్పై కీలకమైన సమావేశానికి హాజరు అవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం బీజేడీ తన వైఖరిని ఈ సమావేశంలో వ్యక్తీకరిస్తుందని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేవలం జనాభా గణాంకాల ఆధారంగా ఉంటే రాష్ట్రంపై పునర్విభజన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఈ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో చర్చ ఆధారంగా రాష్ట్రంపై పునర్విభజన ప్రభావం స్పష్టం కానుందని సంజయ్ దాస్ బర్మ తెలిపారు. తదనంతరం బీజేడీ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఒడిశా, పంజాబ్, బెంగాల్ సహా ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన నాయకత్వ ప్రతినిధి బృందం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆతిథ్యం ఇచ్చే కార్యక్రమంలో సమావేశమవుతుందని సమాచారం. ఈ ఉన్నత స్థాయి సమావేశం వివాదాస్పద పునర్విభజనతో ప్రాంతీయ సమస్యలను చర్చిస్తుందని భావిస్తున్నారు. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కొరాపుట్ ఎంపీ భేటీ
కొరాపుట్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క శుక్రవారం భేటీ అయ్యారు. తనను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన పలువురికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించి అల్పాహారం ఏర్పాటు చేయించారు. అందులో భాగంగా ఎంపీ ఉల్క కూడా వెళ్లారు. బీమా పరిహారం అందజేత రాయగడ: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి సెరిగుమ్మ పంచాయతీలోని కొనగా గ్రామానికి చెందిన నాయికొ మండంగి కుటుంబానికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకంలో భాగంగా రూ.2 లక్షల బీమా పరిహారం స్థానిక ఉత్కళ గ్రామీణ బ్యాంకు అధికారి శుక్రవారం అందజేశారు. నాయకొ మడంగి ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందాడు. దీంతో ఆయన చేసిన బీమా నగదును ఇంటికి వెళ్లి బాధితుడి భార్య కుడుంజికి అందించారు. -
ఆధునిక పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
విజయనగరం అర్బన్: పరిశ్రమ రంగానికి అవసరమైన ఆధునిక పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టూడెంట్ చాప్టర్ సంయుక్త నిర్వహణలో ‘మెక్ అనో ఎంఎంఎక్స్ఎక్స్వీ 2025’ అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరికరాలు అవి పని చేస్తున్న తీరు తదితర అంశాలపై పరిజ్ఞానాన్ని పెంచడానికి ఇలాంటి సదస్సులు విద్యార్థులకు దోహదపడతాయన్నారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెకా నికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాస్ ప్రసాద్, వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమదేవి ఫ్యాకల్టీ సమన్వయకర్తలుగా,, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్గా కె.కౌశిక్, పి.ప్రగతి వ్యవహరించారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు వర్సిటీలో మెక్అనో జాతీయ సదస్సు ప్రారంభం -
దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
గుర్ల: మండలంలోని పెనుబర్తికి చెందిన 15 మంది, గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన 30 మంది తమిళనాడులోని రామేశ్వరం దైవదర్శనానికి బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందా రు. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రయాణికుల బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి బస్సు వెనుక భాగంలో ఉన్న కూర్చున్న మహిళలు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుర్ల మండలంలోని పెనుబర్తికి చెందిన రౌతు సూరప్పమ్మ (60), గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన మీసాల అప్పలనారాయణమ్మ (50) ఉన్నారు. అలాగే పెనుబర్తి గ్రామానికి చెందిన బెల్లాన జగన్నాథం, సుంకరి రామలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. బావిలో పడి ఒకరు...పార్వతీపురం రూరల్: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి నేలబావిలో శవమై తేలా డు. ఈ మేరకు స్థానిక రూరల్ ఎస్సై బి.సంతో షి గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సారిక వీధికి చెందిన మజ్జి సత్యనారాయణ(54)ఈనెల 18న ఆస్పత్రికి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పరిసర గ్రామాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు భార్య పార్వతి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం పార్వతీపురం రూరల్ పరిధిలో ఉన్న బ్యాంక్ఆఫ్ బరోడా సమీపంలో నేలబావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మృతదేహాన్ని సత్యనారాయణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నాలుగు నెలల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరు మరణించడంతో మనస్తాపానికి గురై సత్యనారాయణ మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
బాలికల ఉన్నత పాఠశాలలో ‘సునీత’ విజయోత్సవాలు
విజయనగరం అర్బన్: అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ క్షేమంగా చేరుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత పాఠశాల ప్రాంగణంలో బాలికలు సామూహిక ప్రదర్శన చేసి బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పి.రమణమ్మ మాట్లాడుతూ యువత సునీత విలియమ్స్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల్లో స్ఫూర్తిని పెంచే విధంగా ఆమె చూపిన పట్టుదల, దృఢ సంకల్పం నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.వెంకట్రావు, ఈ.రామునాయుడు, పి.ఉమారాణి, ఎంవీ లక్ష్మీనరసమ్మ, సీహెచ్రత్నం, యూవీఏఎన్ రాజు, శ్రీరంగాచార్యులు, విద్యార్ధినులు పాల్గొన్నారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంవేపాడ: మండలంలోని కుమ్మపల్లి సమీపంలో సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను వల్లంపూడి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశా రు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం అందిన సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడుల్లో గ్రామసమీపంలోని తోటల్లో 500 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. దీంతో బెల్లం ఊటను ధ్వంసం చేశారు. -
మీటర్ రీడింగ్ కార్మికుల పొట్ట కొట్టొద్దు..
● ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ విజయనగరం గంటస్తంభం: స్మార్ట్మీటర్లు తీసుకొచ్చి వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్ట కొట్టొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. గురువారం స్థానిక దాసన్నపేటలోని విద్యుత్ భవన్ ముందు మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో సుమారు 4500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్మీటర్లను వ్యతిరేకించి.. నేడు బీజేపీతో జత కట్టడం సిగ్గుచేటన్నారు. ఒక్కో సర్వీస్కు కేవలం రూ.3.60 పీస్ రేటుతో నెలకు రూ. 6 నుంచి 10 వేల రూపాయల లోపు మాత్రమే వేతనం పొందుతున్న రీడర్స్ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్, (ఎస్.కోట సబ్ డివిజన్), విజయనగరం సబ్ డివిజన్ గోక రమణ, (గజపతినగరం సబ్ డివిజన్) ఆది, రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు. -
చెట్టు కొమ్మ పడి విద్యార్థి దుర్మరణం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో గురువారం ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులపై ఎండిన చెట్టు కొమ్మ విరిగి పడి ఒక విద్యార్థి దుర్మరణం చెందగా మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ–రాంచీ 326 జాతీయ రహదారిపై బైక్పై ముగ్గురు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ఒక ఎండిన చెట్టు కొమ్మ వారి బైక్పై పడింది. ఘటనలో జయపురం సమితి డొంగిరిపంశి పంచాయతీ బరంగపుట్ గ్రామానికి చెందిన మహేంద్ర నాయిక్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. భరిణిపుట్ పంచాయతీ నువాగుడ గ్రామానికి చెందిన కమలలోచన హరిజన్, మలిగుడ గ్రామానికి చెందిన ధరమ మాలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వీరు డిగ్రీ చదువుతున్నారు. మహేంద్ర మృతదేహానికి పోస్టు మార్టం జరిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నిందితులకు రిమాండ్
గజపతినగరం: మెంటాడ మండలం రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మను(75) హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం గజపతినగరం పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెంటాడ మండలం రెల్లిపేటలో తన నివాస గృహంలో 16.3,2025న వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. శవపంచనామా అనంతరం వృద్ధురాలిని గొంతునులిమి చంపినట్లు వైద్యుల రిపోర్టు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను గాలించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గురువారం ఉదయం 11గంటలకు నలుగురు నిందితులైన దానాలరాము, దానాల దుర్గారావు, దానాల రాములమ్మ, పాల్తేటి రామప్పడు అలియాస్ బొడ్డులు పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓల సమక్షంలో లొంగిపోయినట్లు చెప్పారు. మృతురాలు అంకమ్మ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి నగదు అప్పుగా ఇస్తూ ఉంటుందని అందులో భాగంగా దానాల రాములమ్మ అప్పుఅడగ్గా ఆమె తిరస్కరించింది. దీంతో రాములమ్మతో పాటు మరో ముగ్గురు తోడై వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం ముక్కుపుడక, రూ.740లు దోచుకుని ఆమెను హతమార్చినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన స్థానిక సీఐ జీఏవీ రమణ, ఆండ్ర ఎస్సై కె.సీతారామ్, గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావులతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్తో పాటు తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధురాలిని హతమార్చిన కేసులో నలుగురి అరెస్ట్ -
గేట్లో ఆలిండియా 451వ ర్యాంక్ ● అర్తమూరు యువకుడి ప్రతిభ
చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన గేట్–2025 (గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)ఎంట్రన్స్ టెస్ట్లో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన యువకు డు సుంకరి నరసింహనాయుడు ప్రతిభ చాటా డు. మెకానికల్ విబాగంలో ఆలిండియా స్థా యిలో 451వ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న గేట్ ఎంట్రన్ పరీక్ష జరగ్గా బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడుగరుగుబిల్లి: మండలంలోని రావివలస ఎస్సీ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి పత్తిగూల శివసాయిని స్థానిక ఎస్సై పి.రమేష్నాయుడు గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివసాయి ఫిబ్రవరి 17న రావివలస ఎస్సీ వసతి గృహంనుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు తండ్రి పోలయ్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివసాయి కోసం గాలింపు చేపట్టగా సీతానగరం మండలం అంటిపేటవద్ద ఆచూకీ లభించడంతో పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి, తల్లిదండ్రులకు ఎస్సై అప్పగించారు. ఈ సందర్భింగా తల్లిదండ్రులు ఎస్సైకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈహెచ్ఎస్ సేవలందించడంలో అలసత్వం తగదు● ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ డి.రాంబాబు విజయనగరం ఫోర్ట్: ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)కు సంబంధించి ప్రతి రోగికి వైద్యసేవలు అందించాలి. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) జిల్లా మేనేజర్ డి.రాంబాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ నెట్వర్క్ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్యసేవల గురించి ఆరా తీశారు. చికిత్స సకాలంలో అందిస్తున్నారా? నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదనంగా డబ్బులు ఏమైనా అడుతున్నారా అని రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏ సమస్య ఉన్నా వెంటనే ఆరోగ్య మిత్రను కలవాలని రోగులకు చెప్పారు. కార్యక్రమంలో టీమ్ లీడర్ ఎ.భానుప్రసాద్ పాల్గొన్నారు. అట్రాసిటి కేసుపై విచారణవేపాడ: మండలంలోని గుడివాడ గ్రామానికి సంబంధించి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపై విజయనగరం డీఎస్పీ మీరాకుమార్ నేతృత్వంలో గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. మార్చి 11న గుడివాడలో వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్బేబీ డ్యాన్స్ వద్ద జరిగిన గొడవలో తన కుమారుడిని కులం పేరుతో వల్లంపూడి ఎస్సై బి.దేవి దూషించి గాయపర్చినట్లు గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ పి.మీరాకుమార్, రూరల్ సీఐ అప్పలనాయుడు గ్రామంలో గురువారం విచారణ నిమిత్తం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ వద్దకు ఫిర్యాదుదారు కృష్ణమ్మ హాజరుకాకపోవడంతో డీఎస్పీ మీరాకుమార్ ఫిర్యాదు దారు ఇంటికి వెళ్లి ఆరా తీయగా కుటుంబసభ్యులు ఉన్నారు కానీ ఫిర్యాదుదారు లేకపోవడంతో గ్రామసభకు చేరుకున్నారు. గ్రామసభలో వేచి ఉన్నప్పటికీ సాక్షులు హాజరుకాకపోవడంతో సర్పంచ్ మిడతాన గోపి, ఏపీ దళితకూలీ రైతు సంఘం నాయకుడు గాలి ఈశ్వర్రావు తదితరులతో మాట్లాడిన అనంతరం డీఎస్పీ, సీఐ వెనుదిరిగారు. మారిక హెచ్ఎం సస్పెన్షన్ వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు గిరి శిఖరంపై ఉన్న మారిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ శ్రీకాంత్ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని అందిన ఫిర్యాదుల మేరకు ఎంఈఓతో విచారణ నిర్వహించారు. అనంతరం సస్పెండ్ చేస్తూ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. -
దేవమాలి సంరక్షణ మనందరి బాధ్యత
కొరాపుట్: భూతల స్వర్గం దేవమాలిపై పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి పర్వత ప్రాంతంపై ఎస్ఎస్ఎంబీ–29 చిత్ర షూటింగ్ పూర్తవ్వడంతో ఆయన తిరుగు ప్రయాణమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇక్కడి అనుభవాలపై ఎక్స్ వేదికగా స్పందించారు. భూతల స్వర్గం వంటి దేవమాలిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటువంటి ప్రదేశంలో తన చిత్ర నిర్మాణం జరుపుకోవడం అద్భుతంగా ఉందన్నారు. తాను మరలా ఇక్కడ సినిమా షూటింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అక్కడికి వెళ్లే సందర్శకులు చెత్త పారవేయవద్దని సూచించారు. ఎవరు తీసుకొచ్చిన చెత్తను వారు వినియెగించిన తర్వాత, మరలా తామే తీసుకొని వెళ్లేవిధంగా సంచులు తెచ్చుకోవాలన్నారు. దేవమాలి పర్వతం మీద సందర్శకులు వదిలి వెళ్లిన చెత్త ఉన్న వీడియోని షేర్ చేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే ఇకపై దేవమాలిపై కొండపై చెత్త నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా మరోవైపు షూటింగ్ జరిగిన ప్రాంతంలో ఏమైనా చెత్తని వదలి వెళ్లారో లేదో చూడడానికి కొందరు ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ సినిమా యంత్రాంగం యుద్ధ ప్రాతిప్రదికన మిగిలిన వ్యర్థాలను తొలగించడానికి జేసీబీలను ఏర్పాటు చేయడంతో అందరూ అభినందించారు. -
ఆదుకోకోంటే ఉద్యమమే
పెదవేగి: కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కంపెనీల సిండికేట్తో దోపిడీ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కోకో రైతులు సంఘటితం కావాలి కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్ అయి ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. 24న ధర్నాలు, రాస్తారోకోలు కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గొడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. తేల్చిచెప్పిన కోకో రైతులు కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ విజయరాయిలో రాష్ట్ర సదస్సుకు పెద్దసంఖ్యలో రైతుల హాజరు -
ఏనుగుల దాడిలో మహిళకు గాయాలు
రాయగడ: ఏనుగుల దాడిలో ఒక మహిళ గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీ తోట గ్రామానికి చెందిన నసితి బెడక అనే మహిళ తన పొలం పనులను ముగించుకుని ఇంటికి అటవీ ప్రాంతంలో నడిచి వస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు తారసపడింది. దీంతో భయాందోళనతో ఆమె పరుగులు తీయగా గుంపులోని ఒక ఏనుగు ఆమైపె దాడి చేసింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. ఏనుగుల దాడిలో గాయపడిన నసితి బెడకను, ఏనుగుల గుంపు ఉన్న ప్రాంతం నుంచి అటవీ శాఖ అధికారులు అతికష్టం మీద తరలించి కల్యాణ సింగుపూర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె ప్రాణాలకు ఎటువంటి భయం లేదని వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఏనుగుల దాడులు పెరుగుతుండడంతో స్థానికులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. రూ.10 కోట్ల వితరణ కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల అభివృద్ధికి నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) రూ.10 కోట్ల వితరణ చేసింది. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వి.కీర్తివాసన్తో నాల్కో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సంస్థ లాభాల్లో వచ్చిన మొత్తంలో రూ.10 కోట్ల చెక్కును కలెక్టర్కు అందజేశారు. నకిలీ డాక్టర్ అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు గురువారం ఓ నకిలీ వైద్యుడిని అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా ఓ నకిలీ వైద్యుడు చిత్రకొండ సమితిలో పాత చమటపల్లి, నీలాకాంబేరు పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాల్లో వైద్యం చేస్తున్నాడు. ఆయనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న చిత్రకొండ ఎస్డీపీఓ ప్రదోష్ ప్రధాన్ వైద్యుడిపై దర్యాప్తు చేసి వివరాలు సేకరించారు. ఈ నకిలీ వైద్యుడి పేరు విద్యాధర్ హాల్దార్ (38). ఈయన స్వగ్రామం పాత చిమటపల్లి పంచాయితీ యంవి 120 గ్రామం. 2012 నుంచి 2017 వరకు మల్కన్గిరిలో ఓ మెడికాల్ స్టోర్లో పనిచేసి తనకు తెలిసిన విద్యతో ఇలా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. తాను ఫార్మసీ చదివానని అతను చెబుతున్నా.. కేవలం 8వ తరగతి మాత్రమే చదివాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి మందులు స్వాధీనం చేసుకున్నారు. నేటి నుంచి ఒంటి పూట బడులు భువనేశ్వర్: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. వేసవి తాపం నేపథ్యంలో పాఠశాలలు, విద్యా సంస్థల్లో తరగతుల వేళల్ని సవరించారు. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలవుతాయి. విభాగం ఆధీనంలో పని చేస్తున్న విద్యా సంస్థలు అన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విభాగం స్పష్టం చేసింది. వేసవి తాపం నేపథ్యంలో విద్యా సంస్థల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల మార్గదర్శకాల్ని విభాగం జారీ చేసింది. ●1 నుంచి 12వ తరగతి వరకు నిత్యం ఉదయం 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు తరగతుల నిర్వహణ వేళలు. ● విద్యార్థులకు పుష్కలంగా తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ● విద్యాసంస్థల ప్రాంగణాల్లో మొరాయిస్తున్న గొట్టపు బావులు ఇతరేతర తాగు నీటి వనరుల పునరుద్ధరణ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పునరుద్ధరించాలి. ● అవసరమైతే విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయడం అనివార్యం. -
కాంగ్రెస్ సభ్యుల వినూత్న నిరసన
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో గురువారం వినూత్న నిరసన ప్రదర్శనతో కాంగ్రెస్ సభ్యులు గోల చేశారు. మహిళలపై జరుగుతున్న దురాగతాలపై నిరసించారు. మరో వైపు తారా ప్రసాద్ బాహిణీపతి సస్పెన్షన్ను నిలదీసిన ప్రతిపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్ సభ్యుల తీరుతో సభలో గందరగోళం నెలకొంది. సరికొత్తగా కాంగ్రెస్ సభ్యులు నల్లని పీలికల్ని ధరించి సభలో ఈల వేసుకుని గోల గోల చేశారు. సభలో ఈల గోల నివారించాలని స్పీకరు చేసిన అభ్యర్థనల్ని సైతం లెక్క చేయకుండా నిరవధికంగా నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో గురువారం శాసన సభ వరుసగా రెండు సార్లు వాయిదా పడింది. శాసన సభ కార్యకలాపాలు విషాదకరంగా ప్రారంభమయ్యాయి. మాజీ బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే దేబ రాజ్ సేఠ్ మృతికి సంతాపంగా ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఒక నిమిషం మౌనం పాటించాలని ప్రతిపాదించారు. ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. అనంతరం మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం ప్రారంభమైంది. కాంగ్రెస్కు చెందిన ప్రతిపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్ట్టించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ ప్రసంగిస్తున్న సమయంలో అనేక మంది కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. మరి కొంత మంది సభ్యులు ఈల వేసుకుంటు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తారా ప్రసాద్ బాహిణీపతిని ఇటీవల సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు నల్లటి పీలికలు ధరించి తీవ్ర నిరసనలు తెలిపారు. స్పీకర్ పదే పదే అభ్యర్థించినప్పటికీ ప్రతిపక్ష సభ్యుల గందరగోళం ఆగకపోవడంతో సభను మొదట మధ్యాహ్నం 12 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు. -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందని విశాఖ రేంజ్ పోలీసు డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు. ఈ మేరకు గడిచిన ఎనిమిది నెలల్లో మూడు దశల్లో పట్టుబడిన 7 వేల 378 కేజీల గంజాయిని ధ్వంసం చేశామని డీఐజీ తెలిపారు. విశాఖ పోలీస్ రేంజ్ పరిధి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాంలో గురువారం మూడు జిల్లాల్లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి నిర్మూలన కార్యక్రమం జరిగింది. 226 కేసులలో సీజ్ చేసిన 7378 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, ,శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి -
పోక్సో కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకోవద్దు
బొబ్బిలి: పోక్సో కేసుల్లో ఇరుక్కుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్థానిక సబ్జైలును ఆమె సందర్శించి రిమాండ్ ఖైదీలతో మాట్లాడి సత్ప్రవర్తనపై తెలియజేశారు. న్యాయ సహాయం కావాల్సిన వారు ఏ విధంగా పొందవచ్చో వివరించారు. చెడు ఆలోచనల వల్ల ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, వాటికి దూరంగా ఉంటూ సమాజంలో మంచి పౌరులుగా ఎలా జీవించాలోనన్న విషయాలను తెలియపర్చి వారిలో పరివర్తన, చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. సబ్జైలర్ పాత్రో, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పొజిషన్ ఉంటేనే నిధుల మంజూరు..!
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతంలో రెండున్నర సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు కేటాయించనుంది. హౌసింగ్లో వచ్చే నిధులను ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంచినట్లు పక్క ప్రభుత్వం, మరోపక్క అధికారులు చెబుతున్నారు. వాటికి తోడు బీసీ, ఎస్సీ కులాల లబ్ధిదారులకు అదనంగా రూ.50వేలు, ఎస్టీ కులాలకు చెందిన లబ్ధిదారులకు అదనంగా రూ.70వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ క్రమంలో హౌసింగ్ పథకం అమలు వేగం పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా ఒక ఎత్తయితే హౌసింగ్ పథకంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ కులాల ధ్రువీకరణ పత్రాలు, వారి అనుభవంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ అధికారులతో పొజిషన్ సర్టిఫికెట్లు జతచేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో లబ్ధిదారులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు స్థలాల పొజిషన్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో లబ్ధిదారులకు ఇబ్బందులు రావడం లేదు కానీ పొజిషన్ సర్టిఫికెట్ మంజూరులో రెవెన్యూ అధికారులు పలు ప్రశ్నలు వేస్తున్నారు. స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు ఉండాలని, డీకేటీ, గ్రామకంఠం భూములకు ఇవ్వమని చెబుతున్నారు. గ్రామాల్లో పేద రైతులకు వారి పొలాల వద్ద హౌసింగ్ ఇంటి నిర్మాణానికి స్థలాలు ఉన్న భూములకు వన్బీ ఉండడంతో మూడు సెంట్ల స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తామని రెవెన్యూ అధికారులు మెలిక పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు తమ గోడు ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గందరగోళంలో హౌసింగ్ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాలో హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. ప్రతి వారం రోజులకు ఈ పథకంలో సాధించిన నివేదికలు ఇవ్వండి అంటూ హౌసింగ్ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారుల వెంట పడుతున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ఈ పాటికే హౌసింగ్ నిర్మాణాలు పునాదులు దాటి గోడస్థాయికి వచ్చి ఉండేవి. కానీ లబ్ధిదారుల సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఉంటేనే నిధులు మంజూరు చేయాలనే నిబంధన ఉండడంతో ఇక్కడే ఈ పథకం ముందుకు కదలకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. దీంతో ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక, రెవెన్యూ అధికారులను ప్రాథేయపడలేక హౌసింగ్ అధికారుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 18,056 మంది లబ్ధిదారుల గుర్తింపు పార్వతీపురం మన్యం జిల్లాలో 18,056 మంది హౌసింగ్ పథకంలో లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు సర్వే చేశారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్ పథకంలో ఇంటి నిర్మాణం మంజూరు చేసేందకు ఆ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికెట్ల మెలిక పెట్టడంతో అవి నిలిచిపోతున్నాయి. జిల్లాలో గల 15 మండలాల్లో అధికారులు విస్తృతంగా సర్వే నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. సుమారు 13వేల మందికి పైగా లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా హౌసింగ్ బిల్లులు అందుతాయో? లేదోనన్న ఆందోళన నెలకొంది. హౌసింగ్ నిధులు ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంపు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి తలలు పట్టుకుంటున్న ఇళ్ల లబ్ధిదారులుఅన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి హౌసింగ్ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టేలా చూస్తున్నాం. – పి.ధర్మ చంద్రారెడ్డి, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా -
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. గుర0ువారం ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. న్యూస్రీల్ ‘పొఖొలొ’ ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం -
మద్యం వ్యాపారుల నివాసాల్లో ఐటీ దాడులు
పర్లాకిమిడి: స్థానిక సొండివీధిలో మద్యం వ్యాపారులు తిరుపతి సాహుకార్, లోకేశ్వర్ సాహుకార్ నివాసాల్లో గురువారం ఐటీ దాడులు జరిగాయి. వేకువజాము నుంచే భువనేశ్వర్ నుంచి ఆదాయపు పన్ను, ఈడీ అధికారులు నేరుగా తెలుగు సొండివీధికి వెళ్లి వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేశారు. విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పర్లాకిమిడి మార్కెట్ జంక్షన్లో జానకీ ట్రేడర్స్ షాపులో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారు. మూడు కార్లలో అధికారులు వచ్చి దాడులు జరపడం పట్టణంలో సంచలనంగా మారింది. గురువారం ఉదయం నుంచి ఏకలంలో ఢెంకనాల్, అనుగుల్, భువనేశ్వర్, తాల్చేర్, పూరీ, కటక్, పర్లాకిమిడిలలో సోదాలు జరిగినట్టు ఐటీ అధికారులు తెలిపారు. తొలుత ఢెంకనాల్లో తముసింగ పి.ఎస్.పరిధిలో శక్తి మాల్టేర్ అండ్ లిమోనైడ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, బౌధ్లో డిస్టిల్లరీ కంపెనీలు, ఎం.డీ. విక్రం సాహు కంపెనీలపై దాడులు జరిగాయి. కాగా, ఈ దాడులపై శక్తి మాల్టేర్ అండ్ లిమోనైడ్ ప్రైవేటు కంపెనీ ఎండీ విక్రం సాహు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఎటువంటి స్పిరిట్ తయారుచేయడం లేదని, ఇతర కంపెనీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్లో ఓ మద్యం వ్యాపారి ఇంట్లో సోదాలు జరపగా సుమారు రూ.350 కోట్ల విలువైన డబ్బు, బంగారం పట్టుబడటంతో వారితో సంబంధం ఉందంటూ విక్రం సాహు ఇళ్లల్లో ఐ.టీ.శాఖ దాడులు జరిపారు. విక్రం సాహుతో సంబంధం ఉన్న పర్లాకిమిడిలో ప్రముఖ మద్యం వ్యాపారులు నివాసాల్లో కూడా సోదాలు జరపడం విశేషం. పర్లాకిమిడి మార్కెట్ జంక్షన్ వద్ద జానకీ ట్రేడర్స్ వద్ద ఐటీ శాఖ దాడులు -
లాభాల బాటలో కేసీసీ బ్యాంక్
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్) లాభాల బాటలో పరుగులు తీస్తుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్ల 51 లక్షలు లాభం ఆర్జించింది. ఈ విషయాన్ని స్థానిక కె.సి.సి బ్యాంక్ కేంద్రం కార్యాలయ సభా గృహంలో గురువారం జరిగిన 74వ వార్శిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. కెసిసి బ్యాంక్ చైర్మన్ ఈశ్వర చంద్ర పాణిగ్రహి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్ల 51 లక్షలు లాభం ఆర్జించిందని, అంతకు ముందు సంవత్సరం కన్నా 5.89 శాతం అధికమని పాణిగ్రహి వెల్లడించారు. 2025–26లో లాభాలను మరింతగా పెంచేందుకు బ్యాంక్ సిబ్బంది ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ ప్రధాన లక్ష్యం అవిభక్త కొరాపుట్లో వ్యవసాయ ప్రగతికి, రైతుల ఆర్థిక ఉన్నతికి చేయూత ఇవ్వడమేనన్నారు. అవిభక్త కొరాపుట్ రాయగడ, నవరంగపూర్, నవరంగపూర్, కొరాపుట్ జిల్లాలో 338 లేంపులు, ఒక మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయని, కెసిసి బ్యాంక్ ఏర్పడి 75 ఏళ్లు గడిచాయని వెల్లడించారు. నేటికీ బ్యాంక్ సొంత నిధి రూ.175.11 కోట్లకు చేరగా, బ్యాంక్ డిపోజిట్లు రూ.654కోట్ల 63 లక్షలకు చేరిందని వెల్లడించారు. 2023–24 నాటకి ఖరీఫ్ వ్యవసాయానికి 103299 మంది రైతులకు రూ.52,314.04 లక్షలు, రబీ లో 106017 మంది రైతులకు రూ.53586.25 లక్షల వ్యవసాయ రుణాలు అందజేసినట్లు వెల్లడించారు. 1194 స్వయం సహాయక గ్రూప్లకు రూ.2393 .94 లక్షలు, బలరాం పథకంలో రూ.366 కోట్లు, బలియ పథకంలో 67 చేనేత పనివారిని రూ.33.50 లక్షలు, మా రుణ పథకంలో 62 మంది లబ్ధి దారులకు రూ.89లక్షలు, మిషన్ శక్తి పథకంలో 469 మంది లబ్ధిదారులకు రూ.457 .07 లక్షల రుణాలు అందించినట్లు తెలిపారు. కేసీసీ బ్యాంక్ కార్యదర్శి అతుల్య కుమార్ మల్లిక్, బ్యాంక్ ఏజీఎం హరికృష్ణ బనగాడి, నాలుగు జిల్లాల బ్యాంక్ శాఖల అధికారులు, బ్యాంక్ డైరెక్టర్లు, సభ్యులు, లేంప్స్ అధికారులు పాల్గొన్నారు. -
న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తున్న యువకుడి అరెస్టు
జయపురం: న్యూడ్ ఫొటోలు పంపుతూ బెదిరిస్తున్న ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఈశ్వర తండి గురువారం వెల్లడించారు. ఆయన వివరణ ప్రకారం గత ఫిబ్రవరి 28 వ తేదీన ఒక వ్యక్తి వచ్చి లిఖిత ఫిర్యాదు చేశారని, అందులో ఒక ఏడాది కిందట తెలియని వ్యక్తి తన కుమార్తెకు న్యూడ్ ఫొటోలు పంపాడని పేర్కొన్నట్లు తెలిపారు. ఓ నంబర్ ద్వారా ఇలా ఫోటోలు, వీడియోలు పంపిస్తున్నాడని, సోషల్ మీడియాలో పెట్టి బెదిరిస్తున్నాడని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజఖరియర్కు చెందిన మహమ్మద్ తాహీర్ అనే వ్యక్తి ఇలా ఫొటోలతో బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడి నుండి రియల్మే 11 ప్రొ మొబైల్ ఫోనులు, రియల్మే టేబ్ 9, ఓలివ్ గ్రీన్ కలర్,ఒక ఇన్ఫిక్స్ లేప్టాప్,ఒక హార్డ్ డిస్క్ (1 టిబి ) సీగేట్, ఒక 256 జీబీ హార్డ్ డిస్, రెండు 16 జీబీల పెన్డ్రైవ్లు, మూడు 32 జీబీల పెన్ డ్రైవ్లు, ఒక 4 జీబీ హెచ్పి పెన్ డ్రైవ్, ఒక 4 జిబి మైక్రో ఎస్డి మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనాతో 50 మంది జర్నలిస్టులు మృతి భువనేశ్వర్: మహమ్మారి కోవిడ్–19 సంక్రమణ కారణంగా 50 మంది జర్నలిస్టులు మరణించారని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి గురువారం సభలో వెల్లడించారు. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే సౌవిక్ బిస్వాల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయం వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన 49 మంది జర్నలిస్టుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేశారు. కటక్ జిల్లాకు చెందిన ఒక జర్నలిస్ట్ కుటుంబానికి మాత్రమే రాష్ట్రం పరిహారం చెల్లించలేదని ముఖ్యమంత్రి తెలిపారు. వారు వేరే రాష్ట్రం నుంచి ఈ సహాయం పొందారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభలో ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కోవిడ్ కారణంగా గంజాం జిల్లాలో అత్యధికంగా 10 మంది జర్నలిస్టులు మృతి చెందారు. భువనేశ్వర్ సహా ఖుర్దా జిల్లాలో 8 మంది దీని బారిన పడి మరణించారు. సుందర్గఢ్ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. టీజీఐ పరిశ్రమలో అగ్ని ప్రమాదం గార: మండలంలోని సతివాడ జంక్షన్లో ట్రాన్స్వర్డ్ గార్నెట్ ఆఫ్ ఇండియా(టీజీఐ) ఇసుక పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్ బ్లాక్ పక్క ఉన్న స్టాకు గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో సాయంత్రం వరకు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖాధికారి వరప్రసాద్ తెలిపారు. ఇసుక లోడింగ్ చేసే బ్యాగులు కాలిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. నేడు డీఎంఈ రాక శ్రీకాకుళం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలలను పరిశీలించి వైద్యులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం జిల్లాలోని మరికొన్ని ఏరియా ఆస్పత్రులను పరిశీలించే అవకాశం ఉంది. -
భూమి విలువ తగ్గించాలని వినతి
జయపురం: భూమి విలువలు (రిజిస్ట్రేషన్ చార్జీలు) పెంచటం వలన క్రయ, విక్రయాల సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయని జయపురం రియల్ ఎస్టేట్ డవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం భువనేశ్వర్లో రెవెన్యూ మంత్రి సురేష్ పూజారిని కలిసి విన్నవించారు. భూములు కొనటం, ప్లాటులు వేయటం నిలిచిపోయాయని మంత్రికి వివరించారు. టౌన్ ప్లానింగ్, మున్సిపాలిటీ అనుమతులు ఉన్నప్పటికీ వాటికి పట్టాలు లభించకపోవటం వలన అమ్మేందుకు తహసీల్దార్ అనుమతి లభించటం లేదన్నారు. బహుళ ఆదివాసీ వెనుక బడిన కొరాపుట్ జిల్లాలో కటక్, భువనేశ్వర్తో సమానంగా భూమి రేట్లు పెరిగాయన్నారు. భూముల క్రయవిక్రయాలు నిలిచిపోతున్నందున పిల్లల చదువులు, వివాహాలు చేసేందుకు ఆదివాసీ, నిరుపేద సంప్రదాయ ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో భూ క్రయవిక్రయాలు జరిగి వాటికి పట్టాలు లభించకపోవటంతో కొనుక్కొనేవారు ఇళ్లు నిర్మాణానికి బ్యాంక్ రుణాలు లభించక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జయపురం తాలూకాలో కుంతర్ కల్ మౌజలో పంట భూమిని బెంజ్ మార్క్ విలువ కన్నా అధికంగా పెంచారని, దీనిపై మరోసారి ఆలోచించాలని మంత్రిని కోరారు. ఈ సమస్యలపై ఏప్రిల్ నాటికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కొరాపుట్ జిల్లా రియల్ ఎస్టేట్ డవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమాంశు మహాపాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ పాణిగ్రహి, విక్రమ సాహు, అరుణ వర్మ, పాల్గొన్నారు. -
మా మంగళ మందిరానికి ప్రభుత్వ గుర్తింపు
రాయగడ: ప్రజలకు శుభాలు చేకూర్చే మా మంగళ అమ్మవారి దేవతా మూర్తిని 35 ఏళ్ల క్రితం స్థానిక రింగ్ రోడ్డులో ఆ ప్రాంతవాసులంతా ప్రతిష్టించి మందిర నిర్మాణం చేపట్టారు. నిత్యపూజలు విశేష కార్యక్రమాలతో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయాన్ని ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ శాఖ గుర్తించింది. ఈ సందర్భంగా తొలిసారిగా మందిర ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా స్థానిక రాజేంద్ర కుమార్ సాహుని నియమిస్తూ ఆ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గురువారం ఆలయ ప్రాంగణంలో అధ్యక్షుడిగా నియమితులైన సాహు బాధ్యతలు స్వీకరించారు. ఈయనతో పాటు మరో పదిమంది ట్రస్ట్ సభ్యులను నియమిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్యుల్లో పేర్కొన్నారు. వీరిలో ప్రముఖ న్యాయవాది బినాయక్ కర్, రామకృష్ణ పండా, గొపినాథ్ గౌడొ, రవీంద్ర సాహు, మంజూశ్రీ ముఖార్జి, పుష్పభాను దాస్, నరేష్ పట్నాయక్, రామనాఽథ్ పురొహిత్, రంజిత్ బిసోయి, లలిత్ జెన్న ఉన్నారు. మందిర ప్రాంగణంలో బాధ్యతలు చేపట్టిన ట్రస్ట్ సభ్యులకు స్థానికులు అభినందించారు. -
ఘనంగా ప్రపంచ పొఖాలొ దివాస్
పర్లాకిమిడి: ఒడిశా జగన్నాథ సంస్కృతిలో పకాలన్నం (చద్దన్నం) తినడం ఒక ఆనవాయితీ అని, స్వయంగా ఈ రోజు జగన్నాథ స్వామి పకాలన్నం, తోటకూర నైవేద్యంగా సేవాయత్లు అందజేస్తారని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి స్థానిక రాజావారి ప్యాలస్లో ఉంటున్న యొటెక్ కంప్యూటర్ కార్యాలయంలో ప్రపంచ పొఖాలొ (చద్దన్నం) దినోత్సవాన్ని ప్రారంభించారు. చద్దన్నం తినడం ఎండా కాలంలో శరీరానికి ఎంతో ఆరోగ్యకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, బినోదిని సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ పట్నాయక్, విశ్రాంత ఎస్బీఐ ఉద్యోగి హరిమోహన్ పట్నాయక్, బిచిత్రానంద బెబర్తా ముఖ్యవక్తగా వ్యవహరించారు. ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి ఆధ్వర్యంలో మహిళలు పోకాలో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పకాలన్నం, తోటకూర జావ, వివిధ వంటకాల పోటీల్లో విజేతలైన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రగతి మహిళా సంఘటన్ నిర్వాహకులు తనూజా శతపథిని సత్కరించారు. అనంతరం విద్యార్థులు కవితా పఠనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిఽథులు పకాలన్నం, పెరుగు, తోటకూర, బంగాళాదుంపల పచ్చడి, తదితర ఆహార పదార్థాలను ఆరగించారు. ఈ కార్యక్రమాన్ని లోకనాథ మిశ్రా, అధ్యక్షురాలు కల్పనా పట్నాయక్, మురళీ పోరిచ్చా తదితరులు పర్యవేక్షించారు. -
రాష్ట్రంలో బంగారం నిక్షేపాలు పుష్కలం: మంత్రి
భువనేశ్వర్: రాష్ట్రంలో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర వాణిజ్య, రవాణా, ఉక్కు, గనుల శాఖ మంత్రి బిభూతి జెనా సభలో లిఖితపూర్వకంగా ప్రకటించారు. సుందర్గడ్, నవరంగ్ పూర్, అంగుల్, కొరాపుట్ ప్రాంతాలలో బంగారు గనులు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. మల్కన్గిరి, సంబల్పూర్, బౌద్ జిల్లాల్లో కూడా బంగారు గనులు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఖనిజ నిక్షేపాలతో తులతూగుతుంది. చైనాకు రాష్ట్రం ఇనుప ఖనిజం ఎగుమతి చేస్తుందని మంత్రి తెలిపారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరం మార్చి నెల 10 నాటికి రూ. 1019 కోట్ల 80 లక్షల ఆదాయం సమకూరిందని మంత్రి విశ్లేషించారు. మద్యం ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో మద్యపానం ప్రభావంతో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రంగా 56 వేల 831 రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు రాష్ట్ర రవాణా విభాగం మంత్రి బిభూతి జెనా తెలిపారు. ఈ ప్రమాదాల్లో 27,167 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50,041 మంది గాయపడ్డారని మంత్రి సభలో లిఖితపూర్వక సమాధానం ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య పెరుగుతోంది. ’మద్యపానం చేసి వాహనాలు నడపడం వల్ల గత 3 ఏళ్లలో 2,127 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 22,672 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వాహన చట్టం నిబంధనల ఉల్లంఘనల కింద 11,377 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు మంత్రి ప్రకటించారు. -
దివ్యాంగులకు తప్పని పాట్లు
ఇచ్ఛాపురం టౌన్: వైకల్య ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి గురువారం వచ్చిన దివ్యాంగులకు అధికారుల తీరు కారణంగా ఇబ్బందులు తప్పలేదు. కంచిలి మండలం బెల్లుప డ గ్రామానికి చెందిన దివ్యాంగులు బి.సీతమ్మ, సీహెచ్ పాపారావు, కె.హరికృష్ణ, సీహెచ్ లత, నర్తు గీతలు అంగవైకల్య ధ్రువపత్రం కోసం దరకాస్తు చేసుకున్నారు. వైద్య పరిశీలనకు గురువారం ఇచ్ఛాపురం సీహెచ్సీకి హాజరుకావాలని నమోదుపత్రంలో సమయం కేటాయించారు. తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి దివ్యాంగులు రాగా.. పరిశీలకులు రాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం అధికారులు ముందుగా చెప్పకపోవడంతో సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలో రావాల్సి వచ్చిందని వాపోయారు. కా గా, దివ్యాంగులకు బుధవారం మాత్రమే వైద్య పరిశీలన చేస్తారని వైద్యాధికారి దేవేంద్రరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ముందుగానే ఆయా మండల అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. -
రౌర్కెలాలో కొత్త రైల్వే డివిజన్కు ప్రతిపాదన
భువనేశ్వర్: రౌర్కెలా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దిలీప్ రే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రితో 3 ముఖ్యమైన అంశాలను చర్చించారు. రౌర్కెలాలో కొత్త రైల్వే మండలం ఏర్పాటు, రౌర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్ఎస్పీ) విస్తరణ, రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి, విస్తరణ పనుల్ని ప్రతిపాదించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రౌర్కెలా కేంద్రంగా కొత్త రైల్వే మండలం ఏర్పాటు రౌర్కెలా, పరిసర జిల్లాల నుంచి రైల్వేకి గణనీయంగా ఆదాయం పెంచేందుకు దోహద పడతాయి. రైల్వే రంగంలో ఈ ప్రాంతం మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సేవల పరంగా వెనుకబడి ఉంది. మెరుగైన అనుసంధానం దక్షతతో కూడిన నిర్వహణ ఖనిజ నిక్షేప ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రౌర్కెలా కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజనన్ను రూపొందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాన మంత్రిని కోరారు. సెయిల్ ఆధ్వర్యంలో రౌర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్ఎస్పీ) విస్తరణ దీర్ఘకాలంగా మొరాయిస్తుంది. భూ సేకరణ సవాళ్ల కారణంగా వేగవంతంగా కొనసాగాల్సిన రూ.30,000 కోట్ల ఆర్ఎస్పీ విస్తరణ ప్రణాళిక కార్యాచరణ స్తంభించి పోయింది. ఈ ప్రాజెక్టు వేగవంతం చేస్తే ప్లాంట్ సామర్థ్యత రెట్టింపై ఉక్కు ఉత్పత్తిలో జాతీయ స్వావలంబనను బలోపేతం చేస్తుంది. వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. సత్వర పరిష్కారంతో రౌర్కెలా స్టీల్ ప్లాంట్ విస్తరణ పట్ల రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని అభ్యర్థించారు. అలాగే రౌర్కెలాలో పూర్తిస్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
అరసవల్లి: విద్యుత్ మీటర్ల రీడింగ్ బాధ్యతలను నుంచి క్రమక్రమంగా తప్పించేలా యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు దారుణమని, ఈ చర్యలతో వేలాది మంది మీటర్ రీడర్లు రోడ్డున పడనున్నారని బాధిత సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యుత్ మీటర్ల రీడర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేళ్లుగా నాట్ స్కాన్ మీటర్లు ఉన్నప్పటికీ, వాటిని మార్చకుండా వెరిఫై చేయకుండానే..మేమే స్కాన్ చేయడం లేదన్న సాకుతో భారీగా జీతాల్లో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన మొబైల్స్ కూడా రీడర్లుకు ఇవ్వకుండా ప్రణాళికబద్ధంగా వేటు వేసేలా కుట్రలు చేస్తున్నార ని ఆరోపించారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను ఇవ్వాలని తామంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నామని.. తక్షణమే యాజమాన్యం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఎస్.అఖిల్, జి.తేజ, ఎల్.భాస్కర్, ఆర్.రమేష్, ఎన్.గోవిందరావు, పి.సంతోష్, బి. దేవీవరప్రసాద్ తదితరులున్నారు. అనంతరం విద్యుత్ శాఖ సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులకు వినతిపత్రాలు అందజేశారు. -
హోంగార్డుపై రాళ్లదాడి
మల్కన్గిరి : చిత్రకొండ సమితి పాప్పరమేట్ల పంచాయతీ లిమాతాంగ్ గ్రామంలో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందని తెలిసి వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హోంగార్డు దేవేంద్ర రౌత్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మల్కన్గిరి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి రాయగడ: విద్యా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు జిల్లాలో గల అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే కార్యక్రమాన్ని స్వాగతిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ సిబ్బంది ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ చంద్ర నాహక్ నేతృత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు, క్లస్టర్ కన్వీనర్లు, విద్యాశాఖ సిబ్బంది గ్రామాల్లో.. 5 నుంచి 6 ఏళ్ల లోపు గల పిల్లలకు బడికి పంపించాలని ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీలోగా ప్రతీ ప్రాంతంలో ఈ ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నహాలు చేసింది. ఐదేళ్ల ప్రాయం గల పిల్లలకు నర్సరీలో, ఆరేళ్ల పిల్లలకు ఒకటో తరగతిలో చేర్పించేందుకు తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు పాఠశాలల్లో పేర్లును నమోదు చేయించుకోవాలని పిలుపునిస్తున్నారు. నేత్రదానం స్ఫూర్తిదాయకం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని విశాఖ– ఏ కాలనీలో నివాసముంటున్న పొట్నూ రు ధర్మరాజు(71) మృతి చెందడంతో ఆయన కుమారుడు పి.వెంకటరమణ, కుమార్తె ఎ.ప్రవీణ, అల్లుడు రమణమూర్తి నేత్రదానానికి ముందుకొచ్చారు. రెడ్క్రాస్ ప్రతినిధి తవుడు ద్వారా విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావుకు తెలియజేయగా నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, పి.సునీతలు హాజరై ధర్మరాజు కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్ అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు. అదనపు వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయండి శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్యాస్ సరఫరా సమయంలో సిబ్బంది అధిక మొత్తం వసూళ్లు చేస్తే పౌర సర ఫరా అధికారులకు ఫిర్యాదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజె న్సీ నుంచి వినియోగదారులు ఇంటికి 15 కిలోమీటర్ల పైన దూరం ఉంటే రవాణా చార్జి నిమిత్తం ఒక్కో సిలిండర్కు రూ.30 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. 15 కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పేకాట శిబిరంపై దాడి కవిటి: మండలంలోని మాణిక్యపురం సమీప కొబ్బరితోట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడిచేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్టు కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.8600 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. యోగా అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం (ఆయుష్ శాఖ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్శ్రీ సీఈఓ బి.వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యక్తిగత విభాగంలో దరఖాస్తుదారుకు కనీస వయసు 40 ఏళ్లు ఉండాలని, 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నాలు గు అవార్డులను జూన్ 21న ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 31తో దరఖాస్తు నమోదు గడువు ముగుస్తుందని తెలిపారు. -
విద్యుత్ బిల్లుల కాల్చివేత
● ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలంటూ సీపీఎం నిరసన విజయనగరం గంటస్తంభం: విద్యుత్ బిల్లులు తగ్గించి ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పూల్భాగ్ కాలనీ 4వ వార్డులో విద్యుత్ బిల్లులు కాల్చివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తి లేదని చెప్పిన చంద్రబాఋ నేడు విద్యుత్ చార్జీలు పెంచి ట్రూ అప్ చార్జీల భారం వేయడం అన్యాయమన్నారు. ట్రూ అప్ చార్జీలను రద్దు చేసి విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేరిట రూ.15 వేల కోట్ల విద్యుత్తు భారం మోపిందన్నారు. అవినీతితో కూడిన సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్మి రామాలక్ష్మి, సభ్యులు విజయ, గురయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురంటౌన్: ప్రధానమంత్రి యోగా అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విజ్ సీఈఓ ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు, సంస్థలు సమాజంలో యోగాను అంకిత భావంతో ప్రజల్లోకి తీసుకు వెళ్లినవారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అవార్డులకు ఎంపికై న వారికి రూ. 25 లక్షల నగదు బహుమానం ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారు దరఖాస్తులను నిర్ణీత ప్రొఫార్మాలో నేరుగా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూౖ.మైజీఓవీ.ఐన్ వెబ్సైట్లో హెచ్టీటీపీఎస్://ఇన్నొవేషన్ఇండియా.మైజీఓవీ.ఐన్/పీఎం–యెగా–అవార్డులు–2025 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10 లీటర్ల సారా స్వాధీనం● ద్విచక్రవాహనం సీజ్ గుమ్మలక్ష్మీపురం (కురుపాం): కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస మండలం దత్తివలస గ్రామంలో 10 లీటర్ల సారాను ద్విచక్రవాహనంపై తరలిస్తూ చినమేరంగి గ్రామానికి చెందిన వెలగాడ బాలకృష్ణ పట్టుకున్నట్లు సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనం, సారాను కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ వద్ద చూపించారు. బాలకృష్ణతో పాటు సారా సరఫరా చేసిన సిరిపురం సుధాకర్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. టాటా ఏస్ వాహనం బోల్తా● ఇద్దరికి గాయాలు గంట్యాడ: మండలంలోని లక్కిడాం నుంచి బొండపల్లి మండలంలోని రయింద్రం గ్రామానికి వాటర్ బస్తాలు తీసుకుని వెళ్తుండగా గంట్యాడ మండలంలోని చినమానాపురం జంక్షన్ వద్ద టైర్ పంక్చర్ కావడంతో 15 అడుగుల గోతిలో టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాల య్యాయి. ప్రైవేట్ వాహనంలో వారిని విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై ఫిర్యాదు రాలేదని గంట్యాడ పోలీసులు తెలిపారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఆదాయం లెక్కింపుమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఎనిమిదవ జాతర ఆదాయాన్ని ఈవో వీవీ.సూర్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. శీఘ్రదర్శనం టిక్కెట్ల ద్వారా రూ.69,700, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.59,760. కేశఖండన టిక్కెట్ల ద్వారా రూ.2,400, మహాఅన్నదానం విరాళాల ద్వారా రూ.92,011, లడ్డూప్రసాదం ద్వారా రూ.61,950, పులిహోర ప్రసాదం ద్వారా రూ.42,250 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. మొత్తంగా ఎనిమిదవ జాతరలో రూ.3,28,071 ఆదాయం వచ్చిందని చెప్పారు. పది హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరుపార్వతీపురంటౌన్: పదవతరగతి హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 10,367 మంది విద్యార్ధులకు గాను 10,319 మంది హాజరయ్యరని, 48 మంది గైరాజరయ్యారయ్యారని పేర్కొన్నారు. 31 మంది స్క్వాడ్ సిబ్బంది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. -
బడి బస్సులు ఏర్పాటు చేయాలి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అవసరం ఉన్న చోట బడిబస్సులు ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిబాబు, కె.రాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు బడి బస్సుల కోసం ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా బడి బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. గతంలో లాగా విజయనగరం నుంచి రణస్థలం వరకు, విజయనగరం నుంచి సతివాడ, విజయనగరం నుంచి కుమిలి వరకు బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలు కావస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికై నా బడి బస్సుల సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శులు శిరీష, సోమేష్, పట్టణ కమిటీ సభ్యులు శివ, గుణ, జయ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మారిక రోడ్డుకు మోక్షం
● గిరిజనుల హర్షం ● కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులువేపాడ: గిరిశిఖర మారిక గ్రామ గిరిజనుల దశాబ్దాల పోరాటం సఫలీకృతం కావడంతో మారిక రోడ్డు నిర్మాణం చురుగ్గా సాగుతోందని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్ అన్నారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మారిక తండాలో రెండురోజులు బస చేసిన నాయకులు బుధవారం మారిక సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల వద్దకు చేరుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మారిక గిరిజన గ్రామానికి రోడ్డు కావాలని, స్వాతంత్య్ర ఫలాలు గిరిజనులకు అందాలంటూ 2013, 2017, 2021,2025 సంవత్సరాల్లో రోడ్డుకోసం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి, వంటావార్పు, కార్యాలయ నిర్బంధం లాంటి పోరాటాల్లో యువత, మహిళలు, పెద్దలు పోరాడి నందున ఆ ఫలితంగా నేడు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ జాతీయ ఉపాధిహామీ పథంకం నిధులు రూ.7కోట్లు కేటాయించటమే కాకుండా రోడ్డు నిర్మాణంపై చొరవ చూపించారంటూ కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ సమస్య పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులు కృషిచేయడంతో పాటు గతంలో ఆసంపూర్తిగా నిలిచిన రోడ్డుపనులు, కొత్తగా మంజూరైన రోడ్డు పనులు ఒకేసారి చేపట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులు మరింత చొరవచూపి వర్షాకాలంనాటికి రోడ్డునిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చలుమూరి శ్యామ్ మారిక పెద్దలు కిలోఆనంద్, గమ్మెల రామకృష్ణ, బాబారావు, అప్పలనాయుడు, అసు, ఆర్జున్, వెంకటరావు,లింగరాజు, కృష్ణ, శ్రీను మహిళలు పాల్గొన్నారు. -
సైబర్ నేరాల పట్ల పోలీస్ శాఖ అలెర్ట్
విజయనగరం క్రైమ్: సైబర్ నేరాలను అరికట్టేందుకు, కేసుల దర్యాప్తుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో వివిధ పోలీస్స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుల్స్కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది.రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి సిబ్బంది మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలను ఛేదించడంలో సమర్థవంతంగా ఎవరైతే విధులు నిర్వహిస్తారో వారికి తప్పనిసరిగా శాఖలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్నారు. బాధితులు వెంటనే ఫోన్ చేయాలిసైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని ఫిర్యాదు అంశాలను ముందుగా పరిశీలించి, అది ఏ తరహా నేరమో గుర్తించాలని సిబ్బందికి సూచించారు. నేరం జరిగిన తీరును తెలుసుకుని, బాధితులను విచారణ చేసిన తరువాత, నేరానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాధితుడి బ్యాంకు స్టేట్మెంటును పరిశీలించి, నేరానికి పాల్పడిన మోసగాడి బ్యాంకు అకౌంటుకు నగదు ఏవిధంగా బదిలీ అయ్యింది, అక్కడి నుంచి ఇంకేమైనా అకౌంట్స్కు నగదు బదిలీ జరిగిందా? లేదా? అన్న విషయాలను గుర్తించాలని చెప్పారు. ఇలా గుర్తించిన బ్యాంకు లావాదేవీలను ఫ్రీజ్ చేసేందుకు సంబంధిత విభాగాలకు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని పేర్కొన్నారు. నేరం జరిగిన గోల్డెన్ అవర్స్లో ఫిర్యాదు దారు 1930కు రిపోర్టు చేస్తే, సైబర్ మోసగాడి బ్యాంకు లావాదేవీలను నియంత్రించేందుకు ఉత్తర. ప్రత్యుత్తరాలు సకాలంలో జరిపితే కోల్పోయిన నగదును తిరిగి బాధితుడికి ఇప్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిక్షణలో సైబర్ అండ్ సోషల్ మీడియా సెల్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, కంప్యూటర్ నిపుణులు రామరాజు, కె.ప్రసాద్, జగదీష్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు 1930కు ఫిర్యాదు చేయాలి నేరాలు ఛేదించేందుకు నైపుణ్యం మెరుగుపర్చుకోవాలి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్స్కు ఒకరోజు శిక్షణ -
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు
పార్వతీపురంటౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు స్వయం ఉపాధికి సచివాలయాల వద్ద, మీసేవా కేంద్రాల వద్ద, నెట్సెంటర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జనరిక్ మెడికల్ స్టోర్ నిర్వహించాలనుకున్న వారు బి–ఫార్మశీ, డి–పార్మశీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 21 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు అభ్యర్థి కలిగి ఉండాలన్నారు. ఉచిత టైలరింగ్ శిక్షణకు 21 నుంచి 50ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కుమ్మరి, మేదర కులాలకు చెందిన వారి కృలవృత్తి నిర్వహించేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. -
బాలల సంక్షేమం కోసం కమిటీలు
విజయనగరం ఫోర్ట్: మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాలల సంక్షేమం, పరిరక్షణ కోసం గ్రామస్థాయిలో సర్పంచ్ ఽ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామస్థాయి కమిటీలో మహిళా పోలీస్ కన్వీనర్గా ఉంటారని, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయలు, ఎన్జీఓలు, ఆరోగ్యవర్కర్స్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామస్థాయి సమావేశాల్లో అనాథ పిల్లల్ని, స్కూల్ డ్రాపౌట్స్ను గుర్తించాలని చెప్పారు. బాల్య వివాహాలు, ట్రాఫికింగ్, డ్రగ్స్ దోపిడీ తదితర అంశాలపై చర్చించాలని సూచించారు. బాలల హక్కుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి కమిటీలో చర్చించిన అంశాలను జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో టీనేజీ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలపై చర్చ జరగాలని, బాల్యవివాహాలు చేయాలనే అలోచనే తల్లిదండ్రులకు రాకుండా చేయాలన్నారు. బాల్య వివాహ చట్టంపై అవగాహన కల్పించి చట్టంలో ఉన్న శిక్షలపై కూడా తెలిసేలా చూడాలని చెప్పారు. హోటల్స్, కర్మాగారాల్లో పనిచేసే బాలలను గుర్తించాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ ప్రసన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ -
రోడ్డు రోలర్ కాల్చివేత
మల్కన్గిరి : కోరుకొండ సమితి పోట్రేల్ కూడలి సమీపంలో తెంతులిగూడ రహదారి పనుల కోసం వినియోగిస్తున్న రోడ్డు రోలర్ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ సంస్థ ప్రతినిధులు బుధవారం కోరుకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఐఐసీ హిమాంశు శేఖర్ బారిక్ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. పెనుగాలుల బీభత్సం జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో మంగళవారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల భారీ వృక్షాలు రోడ్లపై నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో వీచిన గాలులకు బొయిపరిగుడ సమితి దసమంతపూర్ పంచాయతీ పకులపొడ రహదారిలో పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. బొయిపరిగుడ అగ్నిమాపకసిబ్బంది చేరుకొని చెట్టును తొలగించారు. కవి రమాకాంత రథోకు ఘన నివాళి జయపురం: పద్మభూషణ కవి రమాకాంత రథో సంస్మరణ సభను జయపురం విక్రమ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించా రు. విశ్వ విద్యాలయ ఒడియా విభాగం వారు నిర్వహించిన కార్యక్రమంలో రమాకాంత రథో చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయ ఒడియా విభాగ అధిపతి అరుణ కుమార్ రాజు మాట్లాడుతూ.. రమాకాంత రథ్ మరణం ఒడిశా సాహిత్య రంగానికి తీర్చలేని లోటని అన్నారు. ఒడియా సాహిత్యానికి, సాహిత్య ప్రగతికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాల య అధ్యాపకులు సంజయ కుమార్ సాహు, వాణీశ్రీ రాయ్ పాల్గొన్నారు. వరుస దొంగతనాలు మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో రోజు రోజుకీ బైక్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక్క రోజులో మూడు చొట్ల దొంగతనానికి ప్రయత్నించి విఫలం చెందారు. మంగళవారం రాత్రి మల్కన్గిరి మెడికల్ కాలనీలో దొంగలు గేట్ తాళం పగలుగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఓ ఉపాధ్యాయుడు అద్దెకు ఉంటున్నా రు. ఆయన బైక్తోపాటు మారో బైక్ను దొగ లించాలని తాళాలు విరగొట్టే ప్రయత్నం చేశా రు. బైక్కు సెన్సార్ లాక్ ఉండటంతో దొంగ లించలేక పార్ట్లు తీసుకెళ్లారు. 3 గంటల సమ యంలో ఓ మొబైల్ షాప్ వద్ద ఉన్న బైక్లను దొంగలించారు. ఘటనపై ఈ రోజు బుధవా రం మల్కన్గిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాధు చేశారు. ఐఐసీ రీగాన్కీండో కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. నైపుణ్యాలను అలవరుచుకోవాలి పర్లాకిమిడి: సాంకేతిక విద్య, ఎంబీఏ విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్కిల్ డెవలప్మెంట్ను అలవరుచుకోవాలని, కానీ అందుకు భిన్నంగా చాలామంది విద్యార్థులు వార్షిక ప్యాకేజీ చాలదంటూ పలు కంపెనీల చుట్టూ తిరిగే సంస్కృతి ఇటీవల ఎక్కువైందని ఈర్డీస్ అడ్వయిజరీ ప్రైవేటు కంపెనీ ఆర్థిక సలహాదారు రవి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్శిటీ క్యాంపస్లో బుధవారం స్టూడెంట్స్, మేనేజ్మెంట్ ఈవెంట్ ‘మంజర్ 2.ఓ’ కార్యక్రమం ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రి, ఎంబీఏ, బీటెక్ విద్యార్థుల సందేహాలను కోల్కోత్తా, ఐఐఎం పూర్వపు విద్యార్థి రవి సుబ్రహ్మణ్యం నివృత్తి చేశారు. కార్యక్రమంలో స్వాధా ఫౌండేషన్ ట్రస్టీ మోహన్ కుమార్ రామ్మూర్తి, రాం నారాయణ్ శ్రీనివాసన్, సెంచూరియన్ వర్శిటీ రిజిస్ట్రార్ అనితా పాత్ర, మేనేజ్మెంట్ డీన్ ప్రజ్ఞాపాణి తదితరులు పాల్గొన్నారు. -
2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీసులు మంగళవారం రాత్రి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకుబుజు గ్రామం సమీపంలోని ప్రయాణికుల విశ్రాంతి గృహం వద్ద బస్తాలు పడి ఉండటం గమ నించిన పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వాటి ని పరిశీలించి ఆశ్చర్యపోయారు. అందులో 2.61 క్వింటాళ్ల గంజాయి బయట పడింది. ఐఐసీ సౌదా మిని బెహర తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచా రం మేరకు పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేశామ న్నారు. ఈ క్రమంలో బాలకుబుజు గ్రామ సమీపంలో బస్తాలు ఉండటం గమనించిన పోలీస్ సిబ్బంది ఈమేరకు తనిఖీలు నిర్వహించి గంజాయిని గుర్తించారని చెప్పారు. అయితే గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తులు మాత్రం పట్టుబడలేదన్నారు. కే సు నమెదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై.. ద్విచక్ర వాహనంపై గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రాయగడ జిల్లా పద్మపూర్ పోలీ సులు పట్టుకున్నారు. అతని నుంచి 28.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పద్మపూర్ ఐఐసీ ధరణీధర్ ప్రధాన్ తెలియజేసిన వివరాల ప్రకారం.. జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తరణంలో పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదాపూర్–పద్మపూర్ కూడలిలో వాహన తనిఖీలను మంగళవారం నాడు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి బైకుపై బస్తాను తీసుకొని రావడాన్ని గుర్తించా రు. అనుమానంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయ గా బస్తాలో గంజాయి పట్టుబడింది. నిందితుడు గజపతి జిల్లా ఆర్ ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగురు గ్రామానికి చెందిన దేవాశీష్ మండలిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. 344 కిలోల గంజాయి పట్టివేత పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ రోడ్డు వద్ద బుధవారం అబ్కారీ శాఖ పెట్రోలింగ్ చేస్తుండగా ఒక బజాజ్ ఆటోలో ఎనిమిది బస్తాల గంజాయి పట్టుబడింది. గజపతి ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాయగడ రోడ్డు చెక్పోస్టు వద్ద తమ సిబ్బంది తనిఖీలు చేపట్టగా ఓ ఆటోలు కొన్ని బస్తాలు ఉండటాన్ని గమనించారు. దీంతో అనుమానంతో వాటిని పరిశీలించగా.. ఎనిమిది బస్తాల్లో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారన్నారు. వాటిని తూకం వేయగా 344 కిలోలు ఉన్నట్టు తేలిందన్నారు. దీని విలువ మార్కెట్లో రూ.35 లక్షలు ఉంటుందన్నా రు. పట్టుబడిన ఆటో డ్రైవర్ మోహానా బ్లాక్ బోడసింధిబా గ్రామానికి చెందిన కమల్ లోచన్ మఝిగా గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. దాడుల్లో అబ్కారీ శాఖ మొబైల్ యూనిట్ ఎస్సై దుర్యోధన దిగాల్ ఉన్నారు. -
నీలగిరి తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
ఉత్కళ దివాస్ ప్రాముఖ్యతను తెలియజేయాలి
పర్లాకిమిడి: ఏప్రిల్ 1 ఉత్కళ దివాస్, 26న పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో బుధవారం సాయంత్రం జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పాఠశాలల హెచ్ఎంలు, ఉత్కళ సమాజ్, తదతర సంస్థల ప్రతినిధులతో ముందస్తు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సబ్ కలెక్టర్ అనుప్ పండా, సి.డి.ఎం.ఓ డాక్టర్ మహామ్మద్ ముబారక్ అలీ, సమగ్ర గిరిజినాభివృద్ధి శాఖ అధికారి అంశుమాన్ మహాపాత్రో, జిల్లా సాంస్కృతిక అధికారి అర్చనా మంగరాజ్, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, డి.పి.ఆర్.ఓ ప్రదీప్ కుమార్, ఇతర శిక్షా అనుష్టాన్, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఏప్రిల్ 26న మహారాజా కృష్ణచంద్ర గజపతి శ్మశాన వాటిక వద్ద పుష్పాంజలి, వివిధ కూడళ్లల్లో ఆయన విగ్రహాలకు నివాళులర్పించాలన్నారు. విద్యార్థులకు ఉత్కళ దివాస్ సందర్భంగా వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. టౌనుహాల్లో ఒడిశా వంటకాల పోటీలు నిర్వహించాలని పలువురు కోరారు. -
ఇంటింటా విద్యా ప్రచారం
కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శిశు బటిక పథకంపై ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధ వారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి ప్రచారం చేపట్టారు. ఏప్రిల్ 2 నుంచి ఈ పథకంలో భాగంగా ఐదేళ్లు నిండిన చిన్నారులను సమీప పాఠశాలల్లో తప్పక చేర్పించాలంటూ కరపత్రాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కునునాయక్, కౌన్సిలర్ రంజితా పండా పాల్గొన్నారు. వ్యోమగాములకు అభినందనలు భువనేశ్వర్: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన నాసా క్రూ–9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్కు రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తదితర ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. వారి అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. -
పాము కాటుతో విద్యార్థిని మృతి
గుర్ల: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు. -
దాస్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
భువనేశ్వర్: దివంగత రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవకిషోర్ దాస్ హత్యా సంఘటనపై సీబీఐ దర్యాప్తు చర్చకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అనుమతించారు. మంత్రి కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక లోక్సేవా భవన్లో సీఎంను కలిశారు. నవకిషోర్దాస్ భార్య మీనతిదాస్ లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఈ అనుమతి జారీ చేశారు. క్రైంశాఖ పునఃదర్యాప్తు.. బుధవారం రెండో రోజు క్రైంశాఖ పునఃదర్యాప్తు నిరవధికంగా కొనసాగింది. ఇద్దరు క్రైమ్శాఖ దర్యాప్తు బృందం దివంగత మంత్రి ఇంటికి చేరుకుని కుటుంబీకులను ప్రశ్నించింది.వారి వాంగ్మూలం నమోదు చేసినట్లు క్రైమ్ శాఖ అధికారి తెలిపారు. రెండో రోజున హత్య తదనంతర తక్షణ కార్యాచరణపై దర్యాప్తు బృందం లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించి అక్కడ నుంచి ఎయిర్ అంబులెన్సులో రవాణా తదితర అనుబంధ కార్యాచరణపై దర్యాప్తు చేపట్టారు. సీబీఐ దర్యాప్తు కోసం ఒత్తిడి తెస్తా: జయ నారాయణ మిశ్రా నవ కిషోర్ దాస్ హత్యా సంఘటనపై సీబీఐ దర్యాప్తు కోసం అభ్యర్థిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే మిశ్రా తెలిపారు. దివంగత మంత్రి కుటుంబీకులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి అనుతించిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోసం అభ్యర్థిస్తే తన వంతుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సీబీఐ దర్యాప్తు కోసం ఒత్తిడి చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో జాప్యం చోటు చేసుకుందని చెప్పారు. లిఖితపూర్వక అభ్యర్థన అవాంఛనీయం: బీజేడీ నవ కిషోర్ హత్య సంఘటనపై సీబీఐ దర్యాప్తు కోసం కుటుంబీకుల నుంచి లిఖితపూర్వక అభ్యర్థన అవాంఛనీయమని ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ నాయకుడు డాక్టరు ప్రసన్న కుమార్ ఆచార్య విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు దివంగత మంత్రి కుటుంబీకులకు సీబీఐ విచారణకు పదే పదే లేఖలు రాయమని ఎందుకు అడుగుతున్నారు? అని నిలదీశారు. సీబీఐ విచారణకు ఎలాంటి లిఖితపూర్వక అభ్యర్థన అవసరం లేదని స్పష్టం చేశారు. దొందూదొందే: కాంగ్రెసు దివంగత మంత్రి హత్య ఘటన విచారణ, దర్యాప్తు వ్యవహారంలో ఉభయ బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ దొందూ దొందే అన్నట్లు కాలక్షేపం చేస్తున్నాయని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ వ్యాఖ్యానించారు. సీఎంను కలిసిన మాజీ మంత్రి కుటుంబీకులు భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. సీబీఐ విచారణ కోసం అభ్యర్థన లేఖను సమర్పించారు. -
మహిళల భద్రతపై కాంగ్రెస్ గర్జన
● సభా కార్యకలాపాలకు అంతరాయం ● సాయంత్రం 4 గంటల వరకు వాయిదా భువనేశ్వర్: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల పట్ల బడ్జె ట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీస్తోంది. ప్రధానంగా మహిళలు, మైనరు బాలికల పట్ల పెచ్చుమీరుతున్న అత్యాచారాలు, నేరాలపై విరుచుకుపడుతోంది. దీంతో బడ్జెట్ సమావేశాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. కాంగ్రెసు సభ్యుల చర్య పట్ల అధికార భారతీయ జనతా పార్టీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. వరుసగా 2 సార్లు వాయిదా సభలో బడ్జెట్ సమావేశాల ఆరంభం నుంచే గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమ యం ప్రారంభం నుంచే సభలో కాంగ్రెసు సభ్యులు రభసకు దిగారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి వచ్చి గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసినట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత కూడ సభలో పరిస్థితి కుదుట పడలేదు. సభా కార్యకలాపాలు ముందుకు సాగించడం సాధ్యం కాకపోవడంతో సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. వాయిదా ప్రతిపాదనపై చర్చ కావాలి: కాంగ్రెస్ రాష్ట్రంలో మహిళా వర్గానికి భద్రత లేకుండా పోయిందని, చివరికి పాఠశాలల్లో బాలికలకు రక్షణ కొరవడినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో నిలదీశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి సభలో వివరణ ప్రవేశ పెట్టి సభా కమిటి ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన పట్ల స్పీకరు అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన కాంగ్రెసు సభ్యులు స్పీకరు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ది స్వార్థపూరిత చర్య: బీజేపీ రాష్ట్రంలో మహిళల భద్రత అంశం చాటున స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలకు నిత్యం అంతరాయం కలిగిస్తోందనిౖబీజేపీ ఎమ్మెల్యే ఇరాశిష్ ఆచార్య ఆరోపించారు. ఈ అంశంపై సభలో చర్చకు ప్రతి పాదించిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగిందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి సభలో బదులిచ్చారు. విచారకరం: డాక్టర్ ప్రసన్న కుమార్ ఆచార్య, బీజేడీ రాష్ట్రంలో అమాయక మైనరు బాలికలు గర్భం దాల్చడం అత్యంత విచారకరమని, ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ సభ్యుడు డాక్టర్ ప్రసన్న కుమార్ ఆచార్య అన్నారు. మహిళల పట్ల అఘాయిత్యా లు, హత్యలు వంటి సంఘటనలు నిత్య కృత్యాలుగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై బాలుర లైంగికదాడి కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణంలో బాలిక(11)పై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల ముందు బాలికకు పరిచయం ఉన్న 15 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు బాధితురాలి ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని బాలికను బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లారు. బాలికతో మద్యం తాగించి అపస్మారక స్థితికి చేరాక లైంగికదాడికి పాల్పడి పరారయ్యారు. అనంతరం బాధితురాలు ఇంటికి వెళ్లి చెప్పడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ నబరంగ్పూర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు మున్నా త్రిపాఠి, ఏఐసీసీ సభ్యురాలు మనీషా త్రిపాఠిలు ఉమ్మర్కోట్ చేరుకున్నారు. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఉమ్మర్కోట్ పోలీస్స్టేషన్కు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రైవేటు బస్సు బోల్తా
కొరాపుట్: ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ నుంచి ఒడి10ఎక్స్ 4057 నెంబర్ గల ఎస్వీటీ ట్రావెల్స్ ప్రయివేట్ బస్సు జయపూర్ వైపు వెళ్తుండగా తారాగాం వద్ద జాతీయ రహదారిపై టైర్ పేలడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో డాబుగాంకు చెందిన గోవింద త్రిపాఠి (40) బస్సులోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పపడాహండి, నబరంగ్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలపాలైన 15 మందిని నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. క్షతగాత్రులను నబరంగ్పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ సభ్యుడు అరుణ్ మిశ్రా, ప్రమోద్ రథ్లు పరామర్శించారు. అగ్నిమాపక బృందాలు రోడ్డును క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. -
ఉత్సాహం ఉత్సవమై..
● ఘనంగా ముగిసిన డెప్పిగూడ అగ్ని గంగమ్మ ఘటోత్సవం ● తరలివచ్చిన భక్తజనం జయపురం: జయపురం డెప్పిగూడ అగ్ని గంగమ్మ తల్లి ఘటోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజున అమ్మవారి దర్శనానికి భక్తులు ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ఘటోత్సవాలు మున్నెన్నడూ లేనంత ఆడంబరంగా.. అంగరంగ వైభవంగా జరిగాయి. ఐదు దశాబ్దాల కిందట గులాబ్ అనే భక్తుడు డెప్పిగూడ పైగల చిన్న కొండపై పూరిపాకలో అమ్మవారిని ప్రతిష్టించాడు. ఆ నాటి నుంచి క్రమం తప్పకుండా అతడి సంతతి వారు స్థానికుల సహకారంతో ఏటా అగ్ని గంగమ్మ తల్లి ఘటోత్సవాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు గ్రామం నాగేంద్ర ఈవెంట్స్ వారి ప్రత్యేక పౌరాణిక వేషాల ప్రదర్శనలు ప్రజలను అలరించాయి. చివరి రోజైన బుధవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో వందలాదిమంది మహిళలు, పురుషులు, బాల బాలికలు ఘటాలతో డెప్పిగూడ ప్రధాన పూజా మందిరం నుంచిబయలు దేరి 26వ జాతీయ రహదారి శ్మశాన రోడ్డు కూడలి వద్ద గల అగ్ని గంగమ్మ తల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లు బలి ఇచ్చి రక్త తర్పణం చేసి మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి ఫలపుష్పాలతో పూజలు చేశారు. అగ్ని గంగమ్మ తల్లిని పూజించి ఏమి కోరుకుంటే అది నేరవేర్చుతుందన్న ప్రగాఢ నమ్మకం ప్రజలలో ఉండడంతో అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని పూజించేందుకు తరలివచ్చారు. డెప్పిగూడ అగ్ని గంగమ్మ పూజాకమిటీ పర్యవేక్షణలో ఉత్సవం వైభవంగా ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● మరొకరికి గాయాలు రాయగడ: నీలావడి అగ్నిగంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బైక్పై వెళ్లిన ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి జిల్లాలోని స నొ చాందిలి గ్రామానికి చెందిన బి ప్రసన్న (43)గా గుర్తించారు. గాయాలపాలైన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బి.ప్రసాద్గా సమాచారం. మంగళవారం రాత్రి అమ్మవారిని దర్శించుకునేందుకు సనొ చాంది లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మూడు బైకులపై నీలావడికి బయలు దేరారు. నీలావడికి సమీపంలోని ఉతకపాడు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ముందుగా రెండు బైకులు వెళ్లిపొగా వారి వెనుకే వెళుతున్న ప్రసాద్, ప్రసన్నల బైకు అదుపుతప్పి బ్రిడ్జి కింద పడిపొయింది. వెనుక వస్తున్న ప్రసాద్, ప్రసన్నలు ఇంకా రాలేదని అనుమానించి న తోటి స్నేహితులు తిరిగి వెనుకకువచ్చి చూడగా బ్రిడ్జి కింద పడి ఉన్న ఇద్దరిని చూసి వెంటనే ఆంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే సంఘటనా స్థలం వద్దే ప్రసన్న ప్రాణాలు కోల్పొగా తీవ్రగాయాలకు గురైన ప్రసాద్ను అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం రిఫర్ చేశారు. మంగళవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సంద ర్శించారు. ప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
రైలు నుంచి జారిపడి వలస కార్మికుడి మృతి రాయగడ: కై కలూరు–భీమవరం రైల్వేస్టేషన్ మధ్య ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు సదరు సమితి పరిధిలోని పిపలగుడ పంచాయతీ కొడాపాడు గ్రామానికి చెందిన భరేంద్ర కొండగిరి(40)గా గుర్తించారు. నెల రోజుల క్రితం ఉపాధి కోసం మిత్రులతొ కలిసి ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు వెళ్లాడు. పనులు ముగించుకుని మంగళవారం రైలులో ఇంటికి బయలు దేరాడు. కై కలూరు –భీమవరం రైల్వే స్టేషన్ మధ్య ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పొయాడు. గేటు వద్ద నిల్చుని ఉండగా జారిపడినట్లు తెలిసింది. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. రత్న భాండాగారం తాళం గల్లంతు ● ప్రభుత్వ వివరణ కోరిన రాష్ట్ర హైకోర్టు ● వచ్చే వారం తదుపరి విచారణ భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తాళాల గల్లంతు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. రత్న భాండాగారం తాళాల గల్లంతుపై జరిగిన న్యాయ విచారణ నివేదికని బహిరంగపరచాలని రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అఫిడవిట్లు దాఖలు చేసింది. ఈ రెండింటిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించడంతో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఖరారు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జనవరి 29న ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్లో రత్న భాండాగారం తాళాల గల్లంతుపై న్యాయ విచారణ నివేదికను బహిరంగపరచకూడదని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే సంవత్సరం ఏప్రిల్ 5న దాఖలు చేసిన రెండవ అఫిడవిట్లో, ప్రభుత్వం నివేదికను బహిరంగపరచడానికి అంగీకరించిందని పేర్కొంది. బుధవారం కొనసాగిన విచారణ పురస్కరించుకుని హైకోర్టు రెండు అఫిడవిట్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత కోరింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే వారం జరగనుంది. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ అప్పటి బిజూ జనతా దళ్ ప్రభుత్వంపై మండిపడిన సంగతి తెలిసిందే. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఈ అంశాన్ని ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా సంధించింది. ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలి సారిగా పాలన పగ్గాలు చేపట్టింది. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రత్న భాండాగారం తాళాలు గల్లంతు వ్యవహారం నిగ్గు తేల్చుతామని బీజేపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. అబ్కారీ దాడులపై ఆగ్రహం జయపురం: జాముండ గ్రామంలో గ్రామపెద్ద బి.దంతేశ్వరరావు ఇంట్లో నాటుసారా ఉందంటూ బొరిగుమ్మ అబ్కారీ విభాగం అధికారులు, సిబ్బంది దాడులు చేయడంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. అందరినీ కొట్టి భయంకర వాతావరణం సృష్టించడం తగదంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై గ్రామస్తులంతా కలిసి బొరిగుమ్మ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి జరిపిన సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2కొరాపుట్: పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్బాబు, ప్రియాంకచోప్రా కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎస్ఎస్ఎంబీ–29’(వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ కొరాపుట్ జిల్లాలో ముగిసింది. నెల రోజులుగా ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. మంగళవారంతో షెడ్యూల్ ముగియడంతో అదే రోజు రాత్రి కొంతమంది నటీనటులు, సిబ్బంది వెనుదిరగగా.. బుధవారం ఉదయం రాజమౌళి, ప్రియాంకచోప్రా, మిగిలిన సాంకేతిక బృందం వీడ్కోలు పలికింది. షెడ్యూల్ ముగిసిందనే సమాచారం తెలుసుకున్న పరిసర ప్రాంత అభిమానులు వేకువజామునే కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలో రాజమౌళీ బృందం బస చేసిన హోటల్కు పోటెత్తారు. సిమిలిగుడ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రియాంక చోప్రాతో కలిసి ఫొటోలు దిగారు. కదిలిన కాంగ్రెస్ శ్రేణులు.. షెడ్యూల్ మొత్తం పొట్టంగి నియోజకవర్గంలోనే జరిగింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్చంద్ర ఖడం నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ శాసన సభాపక్షనేతగా ఉన్నారు. దాంతో ఖడం నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు, జిల్లా పరిషత్ సభ్యులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్కు చేరుకున్నారు. కొరాపుట్ జిల్లాలో పండించిన నల్ల ధాన్యం, కొరాపుట్ కాఫీ తదితర మిలెట్స్తో కూడిన బాక్స్ను రాజమౌళికి బమూకరించారు. మరోసారి ఇదే ప్రాంతంలో షూటింగ్కి రావాలని ఆహ్వానించారు. ఎప్పుడు ఎవరు షూటింగ్కు వచ్చినా తాము పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోసారి ఈ ప్రాంతానికి తన సినిమా షూటింగ్ కోసం వస్తానని రాజమౌళీ బదులిచ్చారు. వీడ్కోలు పలికిన అధికారులు.. రాజమౌలి బృందానికి వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు తరలివచ్చారు. కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, ట్రైనీ ఐఏఎస్ జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరపు సశ్యా రెడ్డి, జయపూర్ ఎస్డీపీఓ పార్ధో జగదీష్ కశ్యప్లు రాజమౌళి బృందాన్ని కలిశారు. అనంతరం మహేష్బాబు ఉంటున్న దేవమాలి కాటేజీకి వెళ్లి ఫొటోలు దిగారు. 1. నిర్మానుష్యంగా తులమాలి పర్వత ప్రాంతం 2.షూటింగ్ ముగియడంతో సేద తీరుతున్న సినీ యూనిట్ 3.తనకు భద్రత కల్పించిన స్థానిక పోలీసులతో రాజమౌళి జయపురం: జయపురం ప్రాంత ప్రజల కోరిక నేరవేరబోతుంది. ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయం ఈ నెల 22న ప్రారంభంకానుంది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహణ చరణ మఝిలు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దీన్ని నిర్వహిస్తారు. ఈ విద్యా ఏడాదిలో కేంద్ర విద్యాలయంలో చదువులు ప్రారంభించనున్నుట్లు అధికారులు వెల్లడించారు. ప్రారంభం తరువాత విద్యాలయంలో చేరేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అధికారుల పరిశీలన.. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్, జయపురం సబ్కలెక్టర్ కుమారి ఎ. శోశ్య రెడ్డి, కొరాపుట్ కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజ్ కుమార్ దాస్, జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి విభాగ జూనియర్ ఇంజినీర్ చయిత బాస్కె తదితరులు బుధవారం కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. తాత్కాలిక కేంద్ర విద్యాలయాన్ని జయపురం సమగ్ర గిరిజనాభివృద్ది విభాగం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మించింది. అందులో 15 గదులు ఉండగా.. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించారు. భవనానికి రంగులు వేసి అందంగా తయారు చేస్తున్నారు. ఈ నెల 22న సంబల్పూర్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, భువనేశ్వరన్ నుంచి ఒడిశా ముఖ్యమంత్రి మోహణ చరణ మాఝి లు వర్చువల్గా విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతానికి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించనున్నారు. ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుందని నోడల్ అధికారి, కొరాపుట్ కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజ్ కుమార్దాస్ వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు ఆఫ్లైన్లో స్వీకరిస్తామన్నారు. తాత్కాలిక భవనంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ తదితరులు న్యూస్రీల్1 జిల్లాలో ముగిసిన ఎస్ఎస్ఎంబీ–29 చిత్రం షెడ్యూల్ ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేసిన రాజమౌళి, ప్రియాంక చోప్రా మహేష్బాబుతో ఫొటోలు దిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజమౌళికి మిలెట్స్ బహూకరించిన సీఎల్పీ నేత రామ్చంద్ర ఖడం చివరిలో రాజమౌళి, ప్రియాంక చోప్రాలు ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. ఇక్కడి ప్రజల సహకారం, స్నేహశీలత మరువలేమన్నారు. ఆ లేఖను ఐఏఎస్ అధికారి సశ్యా రెడ్డికి అందజేసి ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమకు ఇన్ని రోజులు భద్రత కల్పించిన పోలీసులకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత నెల రోజులుగా వాహనాలు, వేలాది మంది సందర్శకులతో కళకళలాడిన తులమాలి పర్వత ప్రాంతం బోసిపోయింది. సినిమా యూనిట్ వాహనాలు తిరిగి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. సిమిలిగుడ పట్టణంలో ఒక్కసారిగా హోటళ్లలో సందర్శకుల తాకిడి తగ్గింది. సీఎల్పీ నేత రామ్చంద్ర ఖడం, నాయకులతో రాజమౌళి 22న జయపురంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న కేంద్ర మంత్రులు -
పిచ్చుకపై.. బ్రహ్మాస్త్రాలు..!
తిండి గింజలు లేక ముగ్గు పిండిని తింటున్న ఊర పిచ్చుకలు● కిచకిచల మనుగడకు ముప్పు ● నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవంపర్యావరణ పరిరక్షకులైన, చిరుప్రాణులైన పిచ్చుకలను మానవత్వంతో ఆదరించాలి. బంగారు పిచ్చుకలను పెంచవలసిన బాధ్యత పెరిగింది.అరు బయట తిండి గింజలు వేయడం, చూరుపై చిన్న చిన్న కప్పులతో నీటిని పెట్టడం, ఇంటి సన్స్లేడ్లపై ఖాళీలలో పెట్టిన గూళ్లను కాపాడడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో సెల్టవర్స్ ఏర్పాటు లేకుండా రేడియేషన్కు దూరం చేయాలి. పిచ్చుకలు తినడంతో తిండి గింజలు నష్టపోతున్నామనే అపొహ విడనాడాలి. పంటపై పడిన కీటకాలు,పురుగులను పిచ్చుకలు తిని రైతుకు మేలు చేస్తాయి. డాక్టర్ జీఎన్నాయుడు, పీహెచ్డీ, జువాలజీ, భామిని పిచ్చుకలు అంతరించి పోకుండా కాపాడాలి ఒకప్పుడు పల్లెల్లో గుంపులు గుంపులుగా సందడి చేస్తూ కనిపించే పిచ్చుకలు క్రమేపీ అంతరించిపోతున్నాయి.పర్యావరణ సమతౌల్యం కాపాడడంలో పిచ్చుకలు ముఖ్య భూమిక వహిస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. సెల్ టవర్స్ దూరంగా ఉండేలా చూడాలి. మనతో సహజీవనం చేసే పిచ్చుకలను స్నేహితులుగా భావించి రక్షించుకోవాలి. కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్మెర్సీ సంస్థ, శ్రీకాకుళంభామిని: ఇంటి చూర్లు, లోగిళ్లలో నివాసంతో ఇంటిల్లిపాదికి పిచ్చుకలు ఆనందం పంచేవి. మనుషుల మధ్య మమేకమై సహజీవనం సాగించేలా మనముందే ఎగురుతూ అలరించేవి. నేలబావులపైన వాలిన చెట్లుపైన, పొదలు తుప్పలపైన, ఇంటి ముంగిళ్లలో ఊగిసలాడుతూ అందమైన పిచ్చుక గూళ్లు నిర్మించేవి. అపరూపమైన కళానైపుణ్యంతో నిర్మించిన పిచ్చుక గూళ్లు ఆధునిక ప్రపంచంలోనూ గృహనిర్మాణాలకు ఉదాహరణగా మారాయి. పూరింటి చూరుపై కట్టిన గూళ్లపై వాలుతూ ఊగుతూ, వేలాడుతూ కిచకిచ రావాలతో అలరించేవి. తల్లి ప్రేమకు రుజువు జంటకట్టిన పిచ్చుకల జత చెట్ల ఆకులనుంచి తెచ్చిన మొత్తని నార పీచుతో అల్లి నిర్మించిన పిచ్చుక గూళ్ల నిర్మాణం, రక్షణ వలగా మారిన గూళ్లలో గుడ్లు పెట్టి, పిల్లలు పుట్టే వరకు పొదగడం, దగ్గరుండి వాటిని సంరక్షించడంలో దిట్టగా కనిపించచేవి. ఏరి తెచ్చిన గింజలను పిల్లల నోటికి అందిస్తూ తల్లి ప్రేమకు రుజువుగా నిలిచేవి. పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించడం అన్యోన్యమైన జీవన విధానం ప్రతిబంబించేవి. ఆధునికత రూపంలో.. పర్యావరణ హితులైన పిచ్చుకల జీవనంపై ఆధునికత వేటు వేస్తోంది. విద్యుత్ రూపంలో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు గూళ్ల నిర్మాణాలకు అడ్డుకట్ట వేశాయి.సెల్ టవర్ల నుంచి ఉద్భవించే రేడియేషన్ పునరుత్పత్తి లేకుండా చేశాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో కళ్లాల్లో తిండి గింజలు కరువై జీవనం కష్టమైంది. వరిచేను కుప్పలు, ధాన్యం రాశులు తగ్గిపోవడం పిచ్చుకల మనుగడకు కష్టంగా మారింది. కాంక్రీట్ భవనాలు పిచ్చుకల వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. ధాన్యం నిల్వలు లేకుండా పోవడం, పంటచేలపై క్రిమి సంహారక మందులు పిచ్చుకల మనుగడకు కష్టంగా మారుతున్నాయి. మానవత్వంతో ఆదరించాలి -
ధాన్యం కొనుగోలు చేయాలి
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి పరిధి పెద్ద కొ త్తూరు పంచాయతీలో ఖరీఫ్లో పండించిన సుమా రు 3,840 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అన్నదాతలు బుధవారం కలెక్టరేట్కు వచ్చి అధికారులను కలిశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి న్యాయం చేయాలని ఏడీఎం రాజేంద్రమింజ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ధాన్యం కొనుగోళ్లు చేయనందుకు మండీ, రెవెన్యూ కార్యాలయానికి పెద్దకోత్తూరుగ్రామ పంచాయతీ వాసులు ఇటీవల తాళాలు వేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కు టార్గెట్ లేదని సొసైటీ అధికారులు అంటున్నార ని పెద్దకొత్తూరు రైతులు పడ్డ జగన్నాథరావు అంటున్నారు. గుసాని రైతులకు తోలుత నుంచి మండీ అధికారులు ధాన్యం కోనుగోళ్లలో చిన్నచూపు చూస్తున్నారని, ఇప్పటికై నా మిగులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. లేకపోతే కోర్టుకు వెళతామ ని రైతు చెల్లి సోమేశ్వర్ర్రావు తెలిపారు. -
ముగిసిన శ్రామిక్ కాంగ్రెస్ నిరసన
భువనేశ్వర్: తూర్పుకోస్తా రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. భారతీ య రైల్వే కార్మిక జాతీయ సమాఖ్య(ఎన్ఎఫ్ఐఆర్) పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఖుర్దారోడ్ మండల సమ న్వయకర్త సునీల్ కుమార్ భంజ్ ఆధ్వర్యంలో మండల రైల్వే అధికారి డీఆర్ఎం కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శాంతియుతంగా నిరసన కొనసాగించిన సంగతి తెలిసిందే. పాత ఫించను వ్యవస్థ పునరుద్ధరణ డిమాండుతో రైల్వే కార్మికుల వివిధ ప్రాథమిక హక్కులపై దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వేలోని అన్ని జోన్లు, మండలాల్లో నిర్వహించిన ఆందోళన బుధవారంతో ముగిసింది. ముగింపు సభలో తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు) వెతలు, వాణిజ్య విభాగం అధికారుల అహంకారం, ఆపరేటింగ్, సిగ్నల్, ఇంజినీరింగ్ విభాగాల్లో సిబ్బంది అణచివేతను తప్పుపట్టారు. అనంతరం సునీల్ కుమార్ భంజ్ ఆధ్వర్యంలో కార్యకర్తల ప్రతినిధి బృందం ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి హెచ్.ఎస్.బాజ్వాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నిరంజన్ మిశ్రా, మీడియా ఇన్చార్జి లక్ష్మీధర మహంతి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్
పర్లాకిమిడి: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో స్థానిక గజపతి స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ 2024–25ను ఎన్వైకే జిల్లా యువజన అధికారి అక్షయ్ భాస్కర్ నిపాణి ప్రారంభించారు. ఈ జిల్లా స్థాయి క్రీడాపోటీలకు జిల్లాలోని రాయఘడ బ్లాక్ పరశురాం గురుకుల ఉన్నత సెకండరీ పాఠశాల, కాశీనగర్ బ్లాక్ శ్రీరాం డిగ్రీకళాశాల, మోహనా, పర్లాకిమిడి ఉన్నత పాఠశాలల నుంచి 50మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, స్లో సైక్లింగ్ పోటీల్లో గర్ల్స్ పాల్గొనగా, ఫుట్బాల్, రన్నింగ్ రేస్ 100 మీటర్ల బాయ్స్ పాల్గొన్నారు. రన్నింగ్ రేస్లో మిఖోకుమార్ ప్రథమ బహుమతి కై వసం చేసుకోగా, ద్వితీయ బహుమతి సునీల్ గెలుచుకున్నారు. అలాగే మహిళల కబడ్డీ విభాగంలో పరశురాం డిగ్రీకళాశాల విద్యార్థినులు కప్పును కై వసం చేసుకున్నట్టు పీఈటీ అల్లిబిల్లి రామారావు తెలిపారు. ఈ స్పోర్ట్స్ ఈవెంటుకు సెంచూరియన్ వర్సిటీ స్పోర్ట్స్ అధికారి ఎ.హారిచందన్, నెహ్రూ యవకేంద్రం సిబ్బంది ఎ.మహేశ్వరరావు, వి.భవానీ ప్రసాద్ తదితరులు సహకరించారు. -
అటవీ ఉత్పత్తుల విక్రయానికి విజ్ఞప్తి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా మల్కన్గిరి సమితి ఉదులిబేఢ పంచాయతీ పేడాగూఢ గ్రామ అటవీ భూమి హక్కుల కమిటీ తరఫున అటవీ ఉత్పత్తుల విక్రయాలకు అనుమతులు కోరుతూ మంగళవారం కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. అటవీ భూమి హక్కుల కమిటీ అధ్యక్షుడు సమర నాయక్, కార్యదర్శి భక్తరామ్ పూజారి నేతృత్వంలో కమిటీ సభ్యులు కలెక్టర్తో చర్చించారు. చలివేంద్రం ప్రారంభం మల్కన్గిరి: జిల్లాలోని పోడియా సమితి ఒడిశా–ఛత్తీష్గడ్ సరిహద్దు కుమార్గూడ గ్రామం వద్ద పోడియ పోలీసులు చలివేంద్రం సోమవారం ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు. అందువలన ప్రజాప్రయోజనార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఐఐసీ రామేశ్వర్ ప్రధాన్ తెలిపారు. ఆస్పత్రిలో పనిచేయని ఎక్స్రే మిషన్! జయపురం: జయపురం ఫూల్బెడ ప్రాంతంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎక్స్రే మిషన్ పనిచేయటంలేదు. దీంతో ఎక్స్రే యూనిట్ గదికి సిబ్బంది తాళాలు వేసేశారు. ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఉచింతంగానే ఎక్స్రే తీసేవారు. అయితే ప్రస్తుతం పని చేయక పోవటంతో రోగులు ప్రైవేటుగా డబ్బులు చెల్లించి ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జయపురం పట్టణానికి వెళ్లి ఎక్స్రే తీయించుకోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎక్స్రే యూనిట్ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. జయపురం యువతికి నారీరత్న పురస్కారం జయపురం: జయపురం యువతి, ప్రస్తుతం ఢిల్లీలో న్యాయవాదిగా పనిచేస్తున్న ప్రభాతీ నాయక్ మిశ్రాకు నారీ రత్న పురస్కారం లభించింది. ప్రపంచ ఒడిశా సొసైటీ వారు న్యూఢిల్లీలో నిర్వహించిన శక్తి ఉత్సవంలో న్యాయవాది ప్రభాతీ నాయిక్ను ఘనంగా సత్కరించారు. ప్రభాతీ పాతికేళ్లుగా పాత్రికేయ రంగంలో ఉంటూ సాధారణ ప్రజల గొంతుగా వారి సమస్యలపై పోరాడారు. కొన్నేళ్లుగా న్యాయవాదిగానూ పనిచేస్తున్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రభాతి గృహిణిగా కుటుంబంపై తన బాధ్యతలను నిర్వహిస్తూ న్యాయవాదిగానూ రాణిస్తున్నారు. దీంతో ఆమెను ప్రపంచ ఒడియా సొసైటీ వారు నారీరత్న బిరుదుతో సన్మానించారు. ప్రభాతి జయపురం మున్సిపాలిటీ పరిధి జయనగర్ నివాసీ కై లాస చంద్ర నాయిక్ కుమార్తె. ఆమె మున్సిపాలిటీ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో, మహిళా కళాశాలలో, విక్రమదేవ్ కళాశాలలో చదివారు. -
27న అసెంబ్లీ ఎదుట ధర్నా
రాయగడ: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ బలభద్ర మాఝి పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్ల బీజేడీ పాలనలో మహిళలపై పెరిగిన అత్యాచారాలను అప్పటి పాలకులు అదుపుచేయలేకపోయారన్నారు. దీంతో ప్రజలు ఆ పార్టీకి బదులు బీజేపీని గెలిపించారన్నారు. అయితే బీజేపీ ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల సంఖ్య మరింత పెరగటం ఆ పార్టీ అసమర్ధతకు నిలువటద్దంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన అసెంబ్లీ ఎదుట చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో అంతా పాల్గొని బీజేపీ పాలనను ఎండగట్టాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాయగడ జిల్లా పర్యవేక్షకరాలు ద్రౌపదీ మాఝి, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్పండా, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల వెల్లడి -
నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, జెడ్పీ
● నీలావడి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్ కొరాపుట్: నీలావడిలో అగ్ని గంగమ్మ అమ్మవారిని కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలకలు వేర్వేరుగా దర్శించుకున్నారు. మంగళవారం కొరాపుట్ జిల్లా బందుగాం సమితి అలమండ సమీపంలో ఉన్న నీలావడిలోని అగ్ని గంగమ్మ ఉత్సవాలకు కలెక్టర్ హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఘటాన్ని కలెక్టర్ తలపై ఉంచారు. కలెక్టర్ మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు జెడ్పీ చైర్మన్ సస్మితా మెలక అమ్మవారిని దర్శించుకున్నారు. దేవలయ కమిటీ సభ్యులు మెమెంటోతో ఆమె ని సత్కరించారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాపర్లాకిమిడి: తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో గజపతి జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. తొలుత భారతీయ మజ్దూర్ సంఘ్, ఆల్ ఇండియా అంగన్వాడీ లేడీస్ వర్కర్స్ సంఘం కార్యకర్తలు, హెల్పర్లు రాజవీధి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ జరిపారు. అంగన్వాడీ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులవలే గుర్తింపు, సమాన పనికి సమాన వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ తరువాత కనీస పింఛన్ రూ.5 వేలు మంజూరు చేయాలని అంగన్వాడీ వర్కర్లు సంఘం అధ్యక్షురాలు కున్నీ జెన్నా అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, అంగన్వాడీ వర్కర్ల సంఘం కార్యదర్శి పుష్పాంజలి పండా, అధ్యక్షురాలు కున్ని జెన్నాలు డిప్యూటీ కలెక్టర్ కమలకాంత పండాను కలుసుకుని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి అంజలీ నాయక్, జిల్లాలోని ఏడు సమితి కేంద్రాల నుంచి హెల్పర్లు, వర్కర్లు పాల్గొన్నారు. -
రాగి జావతో సంపూర్ణ ఆరోగ్యం
కొరాపుట్: రాగి జావతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మంత్రి నిత్యానంద గొండో తెలిపారు. మంగళవారం తన సొంత నియోజకవర్గం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణం 12వ వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించారు. దీనిలో భాగంగా ఎండ వేడిమికి సమీపంలో ఉన్న దళిత మహిళ ఇంటి అరుగుపై సేద తీరారు. ఇంట్లో అంబలి ఉంటే ఇవ్వాలని ఆమెను కోరారు. దీంతో వెంటనే ఆ మహిళ తన ఇంట్లో ఉన్న అంబలి గ్లాస్ ఇవ్వగా మంత్రి ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబలి తాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మిలెట్స్ వ్యవసాయం, ఉత్పత్తి, మార్కెటింగ్కి అధిక ప్రోత్సాహమిస్తున్నట్లు తెలియజేశారు. ఒకప్పుడు పేదల ఆహారమైనటువంటి అంబలి, నేడు అందరి ఆహారంగా మారిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అంబలి ప్రాముఖ్యం పొందిందన్నారు. -
ముట్టుకుంటే క్షమించం
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025నాగేశ్వరి గుహలనుకొరాపుట్: గనుల తవ్వకాల పేరిట నాగేశ్వరి గుహలను ముట్టుకుంటే క్షమించబోమని గిరిజనులు హెచ్చరించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కేంద్రంలో వేలాది మంది గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరిట అదానీ కంపెనీకి ఈ గుహలు అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ గుహలు ఉన్న బల్దా ప్రాంతంలో నాగేశ్వరి కొండలు ఆవరించి ఉన్న 5 పంచాయతీల ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. సీఎల్పీ నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. భారీ ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవి బిడ్డల నుంచి భూమిని బలవంతంగా లాక్కునే ప్రక్రియకు తాము వ్యతిరేకమని తెలిపారు. గ్రామ సభ అనుమతి లేకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇదే సభలో ప్రముఖ హక్కుల ఉద్యమ నాయకుడు ప్రపుల్ల సామంత్రాయ్ ప్రసంగించారు. అదానీ కోసం రాజ్యాంగ హక్కులను కాల రాస్తూ గిరిజనులను అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ర్యాలీ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.న్యూస్రీల్