breaking news
Orissa
-
బురదలో చిక్కుకున్న గున్న ఏనుగు
● రక్షించిన అటవీ సిబ్బంది భువనేశ్వర్: అంగుల్ జిల్లా శ్యామసుందర్పూర్ గ్రామం సమీపంలో ఆహారం కోసం వెతుకుతూ బురదతో నిండిన వరి పొలంలో మగ గున్న ఏనుగు చిక్కుకుంది. 22 ఏనుగుల గుంపు నుంచి ఒంటరై దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఏనుగు పరిస్థితి పట్ల స్థానికులు స్పందించారు. అటవీ శాఖ అంగుల్ రేంజ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. చికిత్స కోసం పురుణాగొడొ సమీపం కులసింఘ జంతు చికిత్స కేంద్రానికి తరలించారు. రాత్రంతా చలిలో గడపడంతో గున్న ఏనుగు బలహీనమైందని అధికారులు తెలిపారు. ఇది సుమారు 15 రోజుల వయస్సు మగ గున్న ఏనుగు అని అంగుల్ డీఎఫ్వో నితీష్ కుమార్ తెలిపారు. చికిత్సతో ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు.వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి మృతి జయపురం: జయపురం–కొరాపుట్ 26వ జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఘాట్ రోడ్డుపై వ్యక్తి పడిఉండటం చూసిన స్థానికులు బరిణిపుట్ సర్పంచ్ పద్మ నందబాలయ్యకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. ఆయన జయపురం సదర్ పోలీసుస్టేషన్ అధికారికి విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని వవ సంరక్షతల గృహంలో ఉంచారు. మృతుని వివరాలు తెలియక పోతే దహన సంస్కారాలు పూర్తిచేస్తామని పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు.సాగరతీరంలో గుర్తు తెలియని మృతదేహం భువనేశ్వర్: పూరీ సముద్ర తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. సముద్రంలో ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు భావిస్తున్నారు. బలిహర్చండి సముద్ర ముఖద్వారం వద్ద మృతదేహం బయటపడింది. శరీరంపై గాయాలు ఉండడంతో హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నాయి. బ్రహ్మగిరి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఈడీ లైట్లు అందజేత పర్లాకిమిడి: నువాపడ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జయడోల్కియా తరఫున గత వారం రోజులుగా పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మబంద పంచాయతీలోని కాలనీ వాసులు వీధి లైట్లులేక రాత్రివేల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ విషయం తెలిసి 18 ఎల్ఈడీ లైట్లను అక్కడి ప్రజలకు కోడూరు అందజేశారు. నువాపడ అసెంబ్లీ నియోజకవర్గంలో 23 కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
ఘనంగా మత్స్య, పశుపాలన మేళా
జయపురం: స్థానికంగా ఒక కల్యాణ మండపంలో బ్లాక్ స్థాయి మత్స్య, పశుపాలన మేళా–2025 ఆదివారం నిర్వహించారు. బ్లాక్ పశు చికిత్సాధికారి డాక్టర్ సునీల్ కుమార్ నాయిక్ అధ్యక్షతన జరిగిన మేళాలో ముఖ్య అతిథిగా జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యవక్తగా పశుసంపద విభాగ చీఫ్, జిల్లా పశు చికిత్సాధికారి డాక్టర్ లక్ష్మీధర బెహరా, జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, జిల్లా పరిషత్ సభ్యులు తిపతి పట్నాయిక్, ఎంపీ ప్రతినిధి కృష్ణ చంద్ర నేపక్, ఏబీడీఓ మనోజ్ కుమార్ నాయిక్, ఎస్డీబీఓ బిశ్వజిత్ రాయ్, మత్య్స అధికారి సునీల్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ జ్యోతిని వెలిగించి మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకాల గురించి వివరించారు. నలుగురు ఉత్తమ రైతులు, మరో నలుగురు పాడి రైతులను సత్కరించారు. -
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తికి ప్రతిబింబం
భువనేశ్వర్: గుజరాత్లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ (కెవాడియా)లోని ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగిన భారత్ పర్వ్–2025 వేడుకలో ప్రసంగిస్తూ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి భారత దేశం అంతటా ఉన్న ప్రజలు ఒడిశాను సందర్శించాలని ఆహ్వానించారు. ఒడిశా సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన భూమిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ భారత్ పర్వ్ ఏకత్వంలో భిన్నత్వంతో దేశాన్ని ఏకం చేసే వేడుకగా వెలుగొందుతుందన్నారు. ఐక్యత విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే వార్షిక జాతీయ ఉత్సవం భారత్ పర్వ్. ఇది ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని రంగరించుకుంది. ఈ కార్యక్రమం వివిధ రాష్ట్రాల నుంచి ప్రదర్శనలు, వంటకాలు, హస్తకళలు, సంగీతం, నృత్య ప్రదర్శనల ద్వారా భారత దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారత దేశ సంప్రదాయాల ఐక్యత, గొప్పతనాన్ని ఒకే చోట అనుభవించడానికి ఇది ఒక వేదికగా ఆకట్టుకుంటుంది. ఒడిశా చరిత్ర, వారసత్వం, ప్రకృతి సౌందర్యం అందంగా కలిసిపోయే రాష్ట్రం అని గవర్నర్ అన్నారు. స్వర్ణ త్రిభుజాన్ని ఏర్పరిచే ప్రసిద్ధ భువనేశ్వర్, పూరీ, కోణార్క్ దేవాలయాలు, చాందీ పూర్, గోపాల్ పూర్ యొక్క ప్రశాంతమైన బీచ్లు, సిమిలిపాల్, కొరాపుట్ పచ్చని అడవులు, సుందరమైన చిలికా సరసు, మయూరభంజ్ యొక్క గొప్ప గిరిజన సంస్కృతి గురించి ఆయన మాట్లాడారు. ఒడిశాలో అడుగుడుగున భక్తి, సృజనాత్మకత తారసపడుతుందన్నారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని భారత దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే స్టాట్యూ ఆఫ్ యూనిటీ కింద నిలబడటం గర్వకారణమైన క్షణం అని అన్నారు. భారత్ పర్వ్లో పాల్గొనే ముందు గవర్నర్ సర్దార్ సరోవర్ ఆనకట్టను సందర్శించారు. ఇది భారత దేశం యొక్క దార్శనికత, పురోగతికి చిహ్నంగా గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్తో ఒడిశా శాసన సభ స్పీకర్ సురమా పాఢి, రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ పాల్గొన్నారు. -
కళా రంగంలో విద్యార్థులు రాణించాలి
● ప్రతిభను కనబరిచేందుకు సరైన వేదిక సురభి ● కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలకరాయగడ: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే కార్యక్రమమే సురభి అని కొరాపుట్ లోక్సభ ఎంపీ సప్తగిరి ఉలక అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిశు మహోత్సవాలను సురభి పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. చదవుతో పాటు విద్యార్థులు కళా రంగాల్లో కూడా రాణించాలని అన్నారు. మన రాష్ట్రం కళలకు పుట్టినిళ్లన్నారు. ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్ర గౌరవాన్ని పెంపోందించారని అన్నారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లా కూడా కళామతల్లిని ఆరాధించే ఎంతోమంది కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు. అయితే వారికి సరైన వేదిక లేకపోవడంతోనే వారు ఆయా రంగాల్లో రాణించలేకపొతున్నారని అన్నారు. అయితే సురభి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారికి ఆశా దీపాలుగా మారుతుండడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇటువంటి తరహా కార్యక్రమాలను సద్వినియోగపరుచుకొని తమ సత్తాను చాటుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక మాట్లాడుతూ.. ప్రయత్నం తొనే విజయాన్ని సాధించవచ్చని అన్నారు. ఒటమి మన విజయానికి సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు. నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య నిర్వహించిన వివిధ పొటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల ద్వారా బహుమతులను అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రమేష్ చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రమదానంతో రోడ్డు నిర్మాణం
● కురుకుటి గ్రామస్తుల ఆదర్శంరాయగడ: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ గ్రామానికి శ్రమ దానంతో రహదారిని నిర్మించుకుని రాకపోకలకు మార్గం సుగమమం చేసుకున్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధిలోని సెరిగుమ్మ పంచాయతీ కురుకుటి గ్రామంలో 50 కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సరైన రోడ్డు లేక అత్యవసర సమయంలో స్థానికులు ఇబ్బందులు పడుతుండేవారు. తమ గ్రామానికి రహదారి నిర్మించండి మహాప్రభో అని రాజకీయ నాయకులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామస్తులంతా ఏకమై శ్రమదానానికి పూనుకున్నారు. కాయా కష్టం చేసుకుని జీవనోపాధి పొందే గ్రామస్తులు రెండు రోజులుగా పనులకు వెళ్లకుండా చిన్నాపెద్ద అంతా కలిసి శ్రమదానంతో రహదారిని నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారు. -
చిత్రలేఖనం పోటీలకు అనూహ్య స్పందన
రాయగడ: స్థానిక స్పందన సాహితీ, సాంసృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. జూనియర్ విభాగానికి 86 మంది, సీనియర్ విభాగానికి 42 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే విధంగా సృజనాత్మకమైన చిత్రాలను గీచారు. ప్రముఖ చిత్రకారుడు ఎం.జనార్దన ఆచారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. విజేతలకు వార్షికోత్సవం రోజున బహుమతులను అందజేయనున్నట్టు సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరి ప్రసాద్ తెలిపారు. -
గుప్ చుప్ అంగడి సముదాయం
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025భువనేశ్వర్లో త్వరలో ప్రత్యేకభువనేశ్వర్: గుప్ చుప్ (పాణీ పూరి) నోరూరించే ప్రముఖ చిరు తిండి. పట్టణ, నగర ప్రాంతాలలో ఎక్కడికక్కడ జన సంచార వీధుల్లో సైకిలు, తోపుడు బండ్లపై విక్రయిస్తారు. ఆబాల గోపాలం గుమిగూడి గుప్ చుప్ కోసం ఎగబాకుతారు. ఇటీవల గుప్ చుప్ వివాహాది శుభ కార్యాలయాల్లో తొలి నోరూరించే పదార్థంగా అతిథుల్ని ఆకట్టుకుంటుంది. క్రమంగా గుప్ చుప్కు ఆదరణ పెరగడంతో ఇంటికి వచ్చిపోయే అతిథులకు అందజేసి రుచికరంగా ఆకట్టుకుంటున్నారు. వీధుల్లో రోడ్డు పక్కన ఈ అమ్మకాలను క్రమబద్ధీకరించేందుకు స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ నడుం బిగించింది. ప్రసిద్ధ వీధి చిరుతిండిని (గుప్ చుప్) ఆస్వాదించడానికి అనుకూలమైన, పరిశుభ్రమైన స్థలం కేటాయిస్తుంది. అనధికార తాత్కాలిక అమ్మకపు కేంద్రాలు ట్రాఫిక్ రద్దీని ప్రేరేపిస్తున్నాయి. ఈ సమస్య నివారణకు ప్రయోగాత్మకంగా గుప్ చుప్ అంగడి సముదాయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నగర మేయర్ సులోచన దాస్ తెలిపారు. దీని కోసం నగర పాలక సంస్థ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎదురుగా బహిరంగ స్థలం గుర్తించింది. మేయర్ సులోచనా దాస్ ఆ స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదిత ప్రణాళికను సమీక్షించారు. సాహిద్ నగర్ స్క్వేర్, నిక్కో పార్క్ మధ్య పనిచేస్తున్న అన్ని గుప్ చుప్ విక్రేతలను గుర్తించి కొత్త వెండింగ్ జోన్ కిందకు తీసుకు వస్తారు. ప్రతి విక్రేతకు ప్రత్యేకంగా రూపొందించిన ట్రాలీని ఉచితంగా అందిస్తారు. ఓపెన్ వెండింగ్ జోన్ మోడల్ కింద అభివృద్ధి చేసిన ఈ వెండింగ్ జోన్ 30 నుండి 40 స్టాల్స్కు వసతి కల్పించగలదని భావిస్తున్నారు. ఈ ప్రాంగణం అందంగా తీర్చిదిద్ది వినియోగదారుల కోసం పార్కింగ్, ఇతర సౌకర్యాల్ని అందుబాటులోకి తేనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రేతలు పనిచేయడానికి అనుమతిస్తారు. సాయంత్రం వేళల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేస్తారు. పరిశుభ్రత పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా విక్రేతలు చేతి తొడుగులు ధరించి గుప్ చుప్ విక్రయిస్తారు. ఈ ప్రాంగణంలో దహీ గుప్ చుప్, పుదీనా గుప్ చుప్ వంటి బహుళ రుచులతో గుప్ చుప్ లభిస్తాయి.నోరూరించే గుప్ చుప్ ఇదే.. -
స్వచ్ఛంద సంస్థల పనితీరు భేష్
● అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్రాయగడ: స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను తరచూ నిర్వహిస్తు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్ క్లబ్, సంబాద్ సంస్థలు సంయుక్తంగా లయన్స్ క్లబ్ సమావేశం హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల పనితీరును ఆయన ప్రశంసించారు. శిబిరాల ద్వారా కొత్త దాతలు వచ్చేలా కృషి చేస్తే రక్త యూనిట్ల సేకరణ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు . జిల్లా కేంద్రాసుపత్రిలో రోజూ ఎంతోమంది రక్తం అవశ్యకతతో సతమతమవుతున్నారని అటువంటి వారికి ఈ తరహా రక్తాన్ని సకాలంలొ అందించే ప్రయత్నం అభినందించాల్సిన విషయమని అన్నారు . యువకులు అపొహాలు వీడి రక్తదాన శిబిరాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లాల్ బిహారి లెంక, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఏవీఎస్ గిరి, డాక్టర్ డీకే మహాంతిల ఆధ్వర్యంలో జరిగిన శిబిరానికి డాక్టర్ వి.లోక్నాథ్ రాజు, డాక్టర్ గౌతం పట్నాయక్ పర్యవేక్షించారు. శిబిరంలో 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సంబాద్ సంస్థ ప్రతినిధి శివ ప్రసాద్ దొర రక్తదానం చేయడంతోపాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనను లయన్స్ సభ్యులు అభినందించారు. -
మరదలిపై మాజీ వీఆర్ఓ దాడి
వజ్రపుకొత్తూరు: ఆస్తి తగాదాల నేపథ్యంలో సుంకర జగన్నాథపురం గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ వంకల లోహిదాసు తన మరదలు వంకల దానమ్మపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సుంకర జగన్నాథపురంలో మాజీ వీఆర్ఓ వంకల లోహిదాసుడు, అతని తమ్ముడు తవిటినాయుడు (లేటు) భార్య వంకల దానమ్మకు పక్కపక్కనే వారసత్వంగా వచ్చి జీడి తోట ఉంది. ఆస్థి విషయంలో తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తమ భాగంలో ఎందుకు దుక్కి దున్నుతున్నారని దానమ్మ ప్రశ్నించడంతో లోహిదాసు, కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలతో బాధితురాలు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా లోహిదాసు తనకు శ్రీకాకుళంలో బంధువైన టీడీపీకి చెందిన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుసునని, ఏ కేసు పెట్టుకున్నా తనకు ఏమీ కాదని బెదిరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు దానమ్మ ఫిర్యాదు మేరకు వంకల లోహిదాసు, సరస్వతి, ప్రసాద్లపై వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దంత గ్రామానికి చెందిన చాకిపల్లి సుందరమ్మ(62) అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుందరమ్మ కుమార్తె రాడ నీలవేణి శనివారం దంత గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఆమెను తిరిగి వారి గ్రామానికి పంపించేందుకు కొత్తమ్మ తల్లి గుడి వద్దకు సుందరమ్మ కూడా వెళ్లింది. ఈ క్రమంలో టెక్కలి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గ్రామం వద్దకు వచ్చి రిటర్న్ చేస్తున్న క్రమంలో సుందరమ్మను ఢీకొట్టింది. బస్సుకు, వెనుక ఉన్న బండరాయికి మధ్య ఇరుక్కుపోవడంతో నడుముకి తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీలమణిదుర్గ సన్నిధిలో విదేశీయులు పాతపట్నం: ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారిని లండన్కు చెందిన మహిళలు రీటా, ఫ్లేలు శుక్రవారం దర్శించుకున్నారు. కుంకుమ పూజలు నిర్వహించారు. స్నేహితుల పెళ్లి కోసం భారత్ వచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు టి.రాజేష్ పాల్గొన్నారు. రేపటి నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం శ్రీకాకుళం/శ్రీకాకుళం కల్చరల్: సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలలో భాగంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 11 నుంచి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవాలు నిర్వహించనున్నామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం సందర్భంగా ఆదివారం బైక్ ర్యాలీ, పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన ప్రతి రోజు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ నెల 15 నుంచి 17 తేదీలలో ఉత్తరాంధ్ర స్ధాయి మ్యాజిక్ వర్క్ షాప్ను శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించనున్నామన్నారు. ఔత్సహితులైన సైన్సు ఉద్యమ అభిమానులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 23న జిల్లా స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, 83 మంది మండల స్ధాయి విజేతల బృందంతో నిర్వహించనున్నామని వివరించారు. కార్యక్రమంలో చెకుముకి జిల్లా కన్వీనర్ పి.కూర్మారావు, గౌరవ అధ్యక్షుడు బి.మోహనరావు, ఎం.ప్రదీప్, ఎం.వాగ్ధేవి, హెచ్ మన్మధరావు, బి.వెంకటరావు, సీహెచ్ ఉమామహేశ్వర్, ఎస్ సంజీవరావు, పి.జగదీశ్వరరావు, టి.ఎర్రమ్మ, కృష్ణారావు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
కవిటి : జమేదారుపుట్టుగ గ్రామానికి ఇటుకల లోడుతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ఆదివారం కొజ్జీరియా జంక్షన్ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటనలో కార్తీక్దాస్ (16) అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. కవిటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండలం రత్తకన్న నుంచి కవిటి మండలం జమేదారుపుట్టుగకు ట్రాక్టర్తో ఇటుకల లోడును తీసుకువచ్చే ప్రయాణంలో కొజ్జిరీయా జంక్షన్ వద్ద ట్రాక్టర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కార్తీక్దాస్ ట్రాక్టర్ కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రయత్నం చేశారు. అప్పటికే కార్తీక్దాస్ మృతిచెందాడు. ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హింజలిఘాట్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కార్తీక్దాస్ వ్యక్తిగత పని కోసం వచ్చాడా.. ట్రాక్టర్పై పనిచేసేందుకు వచ్చాడా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. -
గో‘విలవిల’!
● ఈ ఏడాది సెప్టెంబరు 27న శ్రీకాకుళం పెదపాడు హైవేపై రెండు వ్యాన్లతో తరలిస్తున్న పశువులను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. జలుమూరు మండలం నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదుచేశారు. ● ఏప్రిల్ 16న కొత్తూరు మండలం బలద సంత నుంచి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను సరుబుజ్జిలి పోలీసులు పట్టుకున్నారు. రెండు వ్యాన్లలో తరలిస్తుండగా భజరంగదళ్ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదుచేశారు. ● మే 25న ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్ వద్ద రెండు వ్యాన్లలో 18 పశువులు పోలీసులకు పట్టుబడ్డాయి. తిలారు సంత నుంచి విజయనగరం జిల్లా అలమండకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదుచేశారు. హిరమండలం: జిల్లా నుంచి పశువులు అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రధానంగా వారపు సంతలను లక్ష్యంగా చేసుకొని మూగజీవాలను తరలిస్తున్నారు. రైతుల ముసుగులో దళారులు ఈ దందాకు పాల్పడుతున్నారు. వయసుపైబడిన పశువులు, ఎక్కువ ఈతలు అయిపోయిన పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో పశువుల అవసరం తగ్గింది. అందుకే ఖరీఫ్, రబీలో అతి ముఖ్యమైన సమయంలో పశువులను వినియోగిస్తున్నారు. ఆ సమయంలో కొనుగోలు చేసి మిగతా సమయాల్లో విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా దళారులు, వ్యాపారులు రంగప్రవేశం చేసి పశువులను తరలించుకుపోతున్నారు. వారపు సంతల్లో.. జిల్లాలో వారపు సంతలు అధికం. అందునా పశువుల క్రయ విక్రయాలు జరిగే సంతలే ఎక్కువ. ఆమదాలవలస మండలంచింతాడ, కోటబొమ్మాళి మండలం తిలారు–నారాయణవలస, లావేరు మండలం బుడుమూరు, బూర్జ మండలం కొల్లివలస, కంచిలి మండలం అంపురం, మఖరాంపురం, ఒడిశాలోని బరంపూర్, పర్లాకిమిడి, చీకటిలో వారపు సంతలు ఉన్నాయి. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. కొంతమంది దళారులను ఏర్పాటుచేసుకొని పశువులను సేకరిస్తున్నారు. వాటి రవాణాకు మరికొంతమందితో మాట్లాడుకొని వారి సహకారంతో వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీటిలో కబేళాలకే ఎక్కువగా తరలిపోతున్నాయి. సాగు అవసరాలకు తక్కువగానే ఉంటున్నాయి. నేతల చేతుల్లోనే.. జిల్లాలో వారపు సంతలు ఎక్కువగా రాజకీయ పార్టీల నేతల చేతుల్లో ఉంటున్నాయి. ఒక్కో సంతలో వారానికి కోట్ల రూపాయల పశు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ప్రధానంగా ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే, జూన్.. సంక్రాంతి, దసరా సమయాల్లో వీటి క్రయ విక్రయాలు అధికం. గత రెండేళ్లలో 2,683కుపైగా పశువులను పట్టుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకు మించి తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో సంతల నుంచి వారానికి 2 వేల వరకూ పశువులు అక్రమంగా తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే అధికారం పశుసంవర్థక, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖకు ఉన్నప్పటికీ తూతూమంత్రపు చర్యలకు పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో పర్యవేక్షణ లేక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. జాడలేని గోశాలలు.. పోలీసులతో పాటు ఇతర శాఖల తనిఖీల్లో పట్టుబడుతున్న పశువులను సంరక్షించేందుకు జిల్లాలో గోశాల లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో మెళియాపుట్టి మండలంలో ఓ గోశాల నిర్వహించారు. దాని నిర్వహణపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే గోశాల లేకపోవడం కూడా పశువుల తరలింపునకు అడ్డుకట్ట పడకపోవడానికి కారణమనే వాదన ఉంది. ఎందుకంటే పట్టుకుంటే పశువులను ఎక్కడ సంరక్షించాలన్నది ఒక ప్రశ్న. ఆరేళ్ల కిందట సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో ప్రభుత్వం గోశాల నిర్మాణానికి నిర్ణయించింది. అయినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గోవులను పట్టుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస, గుర్జింగివలస ప్రాంతాల్లో ఉన్న గోశాలలకు తరలించాల్సి వస్తోంది. ఇప్పటికై నా జిల్లాలో ఉన్న వారపు సంతలపై దృష్టి సారించడంతో పాటు గోశాలల ఏర్పాటుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. తరలింపు పశువులను అక్రమంగా తరలిస్తే నేరం. నిబంధనలను అనుసరించి, అన్నిరకాల అనుమతులు తీసుకున్న తర్వాతే పశువులను తరలించాలి. పోలీస్ శాఖపరంగా ప్రత్యేకంగా దృష్టిసారించాం. అక్రమంగా తరలిస్తే కేసులు నమోదుచేస్తాం. – సీహెచ్ ప్రసాద్, సీఐ, కొత్తూరు -
సైబర్ నేరాలపై అప్రమత్తత
కొరాపుట్: సైబర్ నేరాలపై అవగాహన కోసం నబరంగ్పూర్ జిల్లా ఎస్పీ సందీప్ సంపత్ మడకర్ స్వయంగా ప్రచారం చేశారు. ఆదివారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో సైకిల్ తొక్కుతూ పర్యటించారు. ప్రతి జంక్షన్ వద్ద సైకిల్ను నిలిపి బాటసారులతో మాట్లాడారు. ప్రాడ్ కాల్స్కి రిప్లై ఇవ్వొద్దని, ఫోన్కు వచ్చే ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని, అకౌంట్లలో డబ్బులు మాయమైతే వెంటనే సైబర్ సెల్కి ఫోన్ చేయాలని సూచించారు. అవగాహన కల్పించేందుకు కర పత్రాలు అందజేశారు. పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాయఘడలో.. పర్లాకిమిడి: సైబర్ నేరాలు, ప్రజల భద్రతపై జిల్లాలోని రాయఘడ పోలీస్ స్టేషన్ నుంచి మార్కెట్, బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీని రాయఘడ ఐఐసీ, పి.ఎం.శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించారు. సైబర్ నేరాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమితాబ్ పండా సూచించారు. ఆర్.ఉదయగిరి బ్లాక్లోని చెలిగడ వారపు సంత వద్ద సైబర్ నేరాలపై షార్ట్ ఫిల్ములు, మొబైల్ స్క్రీన్పై ప్రసారం చేసి ప్రజలను చైతన్య పరిచారు. సైబర్ మోసాలకు గురైనవారు టోల్ఫ్రీ నంబర్ 1930కు తక్షణమే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ సురక్షిత ప్రచారం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు. -
మానవత్వం చూపిన మహిళా కానిస్టేబుల్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో బిబిగూడ పాఠశాలలో శనివారం ఆర్ఐ పరీక్ష రాసేందుకు ఓ బాలింత వచ్చింది. రెండు నెలల పాపను అక్కడి అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని చెప్పారు. దీంతో పాపకు పాలు ఇవ్వడం కష్టమవుతుందని, పరీక్ష రాయనని అంటున్న భైరవి మండాల్ దగ్గరకు రజనీ మాఝి అనే మహిళా కానిస్టేబుల్ వచ్చింది. తాను బిడ్డను చూస్తానని, పరీక్ష రాసి రావాలని ఆమెను ప్రోత్సహించింది. రజినీ చూపిన మానవత్వం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాపకు పాలు ఇచ్చి తల్లి వచ్చేవరకు బాగా చూసింది. ఆమెకు తోటి ఉద్యోగులు సహకరించారు. రజినీకి కూడా 9 నెలల బాబు ఉన్నాడు. అందువల్లే మరో తల్లి బాధను అర్థం చేసుకుంది. రజినీ సహకారంతో తాను పరీక్ష బాగా రాశానని భైరవి మండాళ్ ఆనందం వ్యక్తం చేశారు. -
బాగుసలలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం
పర్లాకిమిడి: జాతీయన్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గుసాని సమితి బాగుసల గ్రామంలో జిల్లా న్యాయ సేవాప్రాధికరణ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి బిమల్ రవుళో ప్రారంభించగా.. ఆర్సీడీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు, అసిస్టెంటు బ్లాక్ విద్యాశాఖ అధికారి సోమేశ్వర్ర్రావు, బీఎస్ఎస్వో సుభ్రత్ దాస్, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం బాగుసల బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బిమల్ రవుళో పాల్గొని దివ్యాంగులకు వైట్ కేన్స్ అందజేశారు. ప్రజలకు లీగల్ ఎయిడ్ ద్వారా ఎటువంటి సహాకారం అందించగలమో బిమల్ రవులో వివరించారు. -
జయపూర్ ఎమ్మెల్యేకు సత్కారం
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీనీ పతిని పలువురు పార్టీ ప్రముఖులు పరమర్శించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని అతని స్వగృహాన్ని సందర్శించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి భాహీనిపతి వెళ్లారు. అక్కడ వైద్య నిపుణులు పరీక్షించి అతని ఊపిరితిత్తులలో తీవ్ర సమస్య ఉందని గుర్తించారు. వెంటనే అత్యున్నత చికిత్స చేశారు. కొద్ది రోజులుగా భాహీని పతి కొరాపుట్లో ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో కొరాపుట్ ఎంసీ సప్తగిరి ఉల్క, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రాం చంద్ర ఖడం, ఇతరు సీనియర్ నాయకులు ఉన్నారు. వీరంతా నువాపడా ఉప ఎన్నికల ప్రచారం ముగించరుకొని వస్తూ ఎమ్మెల్యేను పరామర్శించాు. నువాపడలో పార్టీ పరిస్థితిని ఎంఎల్ఎ బాహీని పతికి వివరించారు. -
న్యాయ సేవలపై అవగాహన
రాయగడ: జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా సంస్థ ఆద్వర్యంలో న్యాయ సేవా సలహాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి సత్యనారాయణ షడంగి ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.పులి కాదు పిల్లి కొరాపుట్: కొరాపుట్ జిల్లా వాసులను వణికించినది పులి కాదని పిల్లి అని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా కొరాపుట్ జిల్లా సునాబెడా ప్రాంతంలో పులి తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే విషయం టీవీలలో ప్రసారం కావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలుచోట్ల సీసీ కెమెరాలు పెట్టి, అడుగులు పరిశీలించారు. చివరకు అది అడవి పిల్లిగా ధ్రువీకరించారు. ఆదివారం అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ప్రజలు భయపడవద్దన్నారు. ఆ జంతువు పులి కాదని అడవి పిల్లి అని తెలిపారు. -
ఉత్సాహంగా గీతాపారాయణ పోటీలు
రాయగడ: స్థానిక గాయత్రీనగర్లోని సరస్వతీ శిశుమందిరం ప్రాంగణంలో సరస్వతి శిశు విద్యా ప్రజ్ఞాన్ ఆధ్వర్యంలో ఆదివారం గీతా పారాయణ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మున్సిపాలిటీ పరిధిలని వివిధ పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు పోటీల్లొ పాల్గొన్నారు. పవిత్ర భగవద్గీత మంత్రాన్ని నాలుగు విభాలుగా పఠించారు. పోటీలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు కేవీ శర్మ, ప్రదీప్ కుమార్ పండ, గీతా ప్రవచకులు గంగాధర్ రథ్ , గంగా ప్రసాద్ బ్రహ్మ, నృసింహా నాథ్ పండ, అనంత వైష్ణవ శతపతి, రఘునాథ్ భొయ్ హాజరయ్యారు. ఆధ్యాత్మికతపై విద్యార్థులకు అవగాహన కలిగించే ఇటువంటి పోటీలు వారి మానసిక వికాసానికి తోడ్పడతాయని సత్యవాది పతి అన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
ఘనం భక్త కనకదాసు జయంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్త కనసాదాసు 516వ జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరంగిని అనే కవిత్వాలను రచించినట్లు వివరించారు. నలచరిత్ర, హరిభక్తిసార, తదితర రచనలను కన్నడంలో రచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
నందిగాం: తురకలకోట గ్రామ సమీప తోటలో శనివారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తురకలకోట గ్రామానికి చెందిన మేఘవరం వెంకటరావు(38) బెంటుగేటు వద్ద పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. యజమాని వద్ద రూ.30వేలు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం అక్కడ పని మానేశారు. అప్పు తీర్చలేకపోవడంతో యజమాని వేధింపులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడని, చివరకు తోటలో ఉరివేసుకున్నాడ ని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు వెంకటరావు భార్య నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేజీబీవీ విద్యార్థినికి వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
శ్రీకాకుళం: రిమ్స్లో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థి ని చిత్తరపు వందనను వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి వందన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ చిత్రహింసలకు గురుచేస్తూ కులం పేరుతో దూషించిందని, వీటిని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వాపోయింది. విద్యార్థిని తల్లి లక్ష్మి మాట్లాడుతూ తన బిడ్డకు జరిగినా అన్యాయంపై ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాగోలు మాజీ సర్పంచ్ యడ్ల గురుమూర్తి, రాష్ట్ర ఎస్సీ విభాగం సంయుక్త కార్యదర్శి పెయ్యిల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: టెక్కలి నుంచి నౌపడ వెళ్లే దారిలో తలగాం సమీపంలో శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇజ్జువరం పంచాయతీ రాజగోపాలపురం గ్రామానికి చెందిన ఇజ్జువరపు అప్పన్న(43) శుక్రవారం రాత్రి పలాసలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలక్ష గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నడిచివస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అప్పన్న అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం మార్చురికీ తరలించారు. అప్పన్నకు భార్య పార్వతి, కుమారుడు కార్తీక్, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం: అరసవిల్లి రోడ్డులోని శర్వాణి విద్యాల యలో 9వ తరగతి చదువుతున్న తమ్మిరాజు చర్వి శ్రీ అండర్–19 క్రికెట్ రాష్ట్ర జట్టుకు శ్రీకాకుళం జిల్లా తరఫున ఎంపికై ంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టోర్నమెంట్కు జరిగిన ఈ ఎంపికల్లో జిల్లా నుంచి ఎంపికై న ఏకై క క్రీడాకారిణిగా నిలిచింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నిర్వహించిన ఎంపిక మ్యాచుల్లో బౌలింగ్, బ్యాటింగ్లో మెరుగైన ప్రతిభ కనబరిచింది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడనుంది. ఈ సందర్భంగా శర్వాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అంధవరపు సూరిబాబు విద్యార్థిని శనివారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అందవరపు ఆంజనేయులు, హెచ్ఎం కె.రేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల పరిశీలన
పర్లాకిమిడి: ఈస్టుకోస్టు రైల్వే, వాల్తేరు డివిజన్ డి.ఆర్.ఎం లలిత్ బోరా విశాఖపట్నం–గుణుపురం ప్యాసింజరులో అకస్మికంగా విచ్చేసి అమృత్ భారత్ రైల్వేష్టేషన్ల ఆధునికీకరణ పనులను తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ బయట ఆరెంజ్, నీలం రంగులను మార్చడం చూశారు. స్టేషన్ ఎంట్రన్స్లో తారు రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే ష్టేషన్ వెలుపల కోణార్కు ఆర్చి వద్ద విలేకరులతో మాట్లాడారు. అమృత భారత్ రైల్వే ష్టేషన్ పనులను పర్యవేక్షించడానికి వచ్చానని, త్వరితగతిన ఈ పనులకు పూర్తిచేస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారన్నారు. పర్లాకిమిడి గుణుపురం బ్రాడ్ గ్యాజ్ లైన్ రాయగడ వద్ద తెరువల్లికి పొడిగించేందుకు కూడా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం 3 స్టేషన్ పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని, రైళ్ల వేగం పెంచితే గానీ, కొత్త రైళ్లను ఈ లైనులో వేయలేమన్నారు. సీనియర్ డివిజనల్ ఇంజినీర్ బి.సాయిరాజు, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్, సీనియర్ డీఓఎం అవినాష్, పీఆర్ఓ జయరాం ఉన్నారు. -
ఆడంబరంగా వల్లభాయ్ జయంతి ముగింపు వేడుకలు
పర్లాకిమిడి: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి వేడుకల్లో భాగంగా ఏక్తా పాదయాత్రను బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి గజపతి స్టేడియంలో ప్రారంభించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని విద్యార్థులంతా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ముగింపు సమావేశంలో కలెక్టర్ మధుమిత, మోహన ఎమ్మెల్యే దాశరతి గోమాంగో, జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి ఎం.ప్రకాశ రావు, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజపతి స్టేడియంలో ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి మిల్లెట్స్ స్టాల్స్ను ప్రారంభించారు. అనంతరం సర్దార్ వల్లభాయి పటేల్, ఏక్తా పాదయాత్రపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్టేడియంలో ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ఏక్ పేడ్ మా కా నామ్ పేరిట మొక్కలను నాటారు. -
ఘనంగా సురభి, శిశు మహోత్సవం
పర్లాకిమిడి: రాష్ట్రంలో టెన్త్ పరీక్ష ఫలితాల్లో గజపతి జిల్లా ప్రథమ స్థానం సాధించడం పట్ల ఉపాఽధ్యాయులను జిల్లా ముఖ్య విద్యాధికారి, ఎంపీ (బరంపురం) ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి అభినందించారు. మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో శిశుమహోత్సవం 2025, సురభి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా కలెక్టర్ మధుమిత, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, డీఈఓ మయాధర్ సాహు, అదనపు డీఈఓ గిరిధర్ తదితరులు హాజరయ్యారు. పది పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి, గిరిజన విద్యార్థులకు మేలుచేశారని.. అలాగే రాష్ట్ర రాజధానిలో మా పేరును నిలబెట్టారని మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమంగో అన్నారు. అనంతరం జిల్లాలోని ఏడు సమితిల నుంచి విచ్చేసిన విద్యార్థులకు 11 ఈవెంట్లలో పోటీలను నిర్వహించారు. క్విజ్, వక్తృత్వం, డ్రాయింగ్, సృజనాత్మక రైటింగ్, పాటలు, సాంస్కృతిక, పి.ఎం. పోషణ, మోడల్ పార్లమెంట్ పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. సా విజేతలకు ఏడీఎం ఫల్గుణి మఝి, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాలు జిల్లా సైన్సు కోఆర్డినేటరు అంపోలు రవికుమార్, బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మోనాలిసా దాస్, ఇతర సిబ్బంది సహకరించారు. -
ఘనంగా అయ్యప్పస్వామి అంబలం పూజ
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో మాజీ స్పీకర్ తమ్మి నేని సీతారాం నివాసంలో ఆయన కుమారుడు చిరంజీవినాగ్ నేతృత్వంలో శనివారం అయ్యప్పస్వామి అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. అరటిచెట్లతో అంబులం ఏర్పాటు చేసి అయ్యప్ప, వివిధ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పురోహి తులు రాజేష్శర్మ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సీతారాం, వాణమ్మ దంపతులు అయ్యప్పస్వామి ఆలయానికి శాశ్వత విరాళంగా రూ.30వేలను యడ్ల రమణయ్యస్వామి, తంబిస్వామిలకు అందజేశారు. సుమారు 300 మంది అయ్యప్ప భక్తులకు భి క్ష ఏర్పాటు చేశారు. 20 మంది గురుస్వాములు, గురుభవానీలకు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కాలింగ కుల అధ్యక్షుడు దుప్పల లక్ష్మణరావు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. -
ప్రథమ చికిత్స
ఆర్టీసీకి కావాలి.. శ్రీకాకుళం–పాతపట్నం ఆర్డీనరీ బస్సులో ఖాళీగా ఉన్న బాక్సు మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల్లో 25 రకాల మెడికల్ కిట్లు అందుబాటులో ఉండా లి. యాంటీ సెప్టిక్ క్రీమ్, లిక్విడ్, ప్యా డ్లు, గాయాలపై అంటించేందుకు స్టెరిలైజ్డ్ ఎలాస్టిక్ బాండ్, వాటర్ ప్రూఫ్ బ్యాండేజ్, అయోడిన్, దూది, నొప్పి నివారణ మాత్రలు, చేతి గ్లవ్స్, శానిటైజర్ తదితర మెడికల్ వస్తువులు తప్పనిసరి గా ఉంచాలి. వీటితో పాటు ప్రథమ చికిత్స ఎలా చే యాలో డ్రైవర్, కండక్టర్లకు అవగాహన కల్పించాలి ఆస్పత్రులకు పరుగుతీయాల్సిందే.. జిల్లాలో శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోలు ఉన్నా యి. వీటి పరిధిలో సుమారు 360కు పైగా బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ సుమారు 45 వేలకు పైగా ప్రయాణికు లు రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా బస్సు ల్లో ప్రయాణం చేస్తున్నపుడు మార్గం మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ప్రథమ చికిత్స పెట్టెలు అలంకార ప్రాయంగా మారడంతో వెంటనే సమీప ఆస్పత్రులకు పరుగు లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బస్సుల్లో పూర్తిస్థాయిలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాల ని ప్రయాణికులు కోరుతున్నారు. -
నిర్లక్ష్యం వల్లనే ప్రాణనష్టం
● పూరీ శారదా బాలి తొక్కిసలాట దర్యాప్తు నివేదిక వెల్లడి భువనేశ్వర్: ఈ ఏడాది పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్భంగా శ్రీ గుండిచా ఆవరణ శారదా బాలి ప్రాంతంలో తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. ఈ విషాద సంఘటన భక్తజన హృదయాల్ని కలచి వేసింది. ప్రభుత్వం, యాత్ర నిర్వహణ యంత్రాంగం కంటి మీద కునుకు చెదరగొట్టింది. భక్తులు, యాత్రికుల భద్రత కోసం ప్రత్యేకంగా నియమితులైన ఉన్నతాధికారులు, సాంకేతిక సేవల సంస్థ నిర్లక్ష్యంతో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని దర్యాప్తులో తేలింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ పోలీసు అధికారులు బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సీనియర్ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రద్దీ నియంత్రణ కోసం కృత్రిమ మేధతో సముచిత సమాచారం జారీ చేయాల్సిన సంస్థ కూడ నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు దర్యాప్తు నివేదిక ధ్రువీకరించింది. ఆ సంస్థ అవాంఛనీయ సంస్థగా ప్రకటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 29న పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ఉత్సవంలో గుండిచా ఆలయ ప్రాంగణం శారదబాలిలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రముఖ కార్యదర్శి (ప్రణాళిక – సమన్వయం) ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో పోలీసుల పర్యవేక్షణలో తీవ్రమైన లోపాలు, ఆలయ అధికార వర్గంతో సమన్వయ లోపం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వైఫల్యం వంటి తీవ్రమైన లోపాలు ఉన్నాయని తేలింది. దర్యాప్తు నివేదికను ప్రభుత్వం ఆమోదించిందని హోం (ప్రత్యేక విభాగం) అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సీనియర్ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. విచారణలో, రద్దీ నియంత్రణ ఇన్చార్జిగా నియమితులైన ఇద్దరు సీనియర్ అధికారులు అజయ్ కుమార్ పాఢి, విష్ణు ప్రసాద్ పతి ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో లేరు. రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైంది. వారివురు ప్రస్తుతం సస్పెన్షన్లో కొనసాగుతున్నారు. 1962 ఒడిశా సివిల్ సర్వీసెస్ (సీసీఏ) 15వ నిబంధన ప్రకారం వారిపై చర్యలు చేపట్టాలని హోం శాఖ అదనపు కార్యదర్శి డీజీపీ, ఐజీ పోలీసుకు లేఖ రాశారు. భక్తులతో కిటకిటలాడుతున్న జన సందోహ ప్రాంతాల గుండా అలంకార చెక్క సామగ్రిని తీసుకెళ్లే ట్రక్కుల రాకపోకలను పోలీసులు అనుమతించారు. ట్రక్కులు ప్రవేశించడంతో గుండిచా ఆలయం వెలుపల శారాదా బాలి మైదానంలో భయాందోళనలతో చెల్లాచెదురు కావడంతో అకస్మాత్తుగా తొక్కిసలాట సంభవించింది. తప్పనిసరి సేవలను అందించడంలో విఫలమైనందుకు ఐసీసీసీ సంస్థ మెస్సర్స్ ఇన్వెంట్ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను ప్రభుత్వం అవాంఛనీయ జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. లైవ్ ఫీడ్లలో జన సమూహం కనిపించినప్పటికీ అధికారులను అప్రమత్తం చేయడంలో విఫలమైనందుకు కమాండెంట్ శారద ప్రసాద్ దాస్ వ్యతిరేకంగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. పూరీలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) అధీనంలో 275 కెమెరాలు ఏర్పాటు చేయగా సంఘటన జరిగిన సమయంలో నామ మాత్రంగా 123 మాత్రమే పనిచేసినట్లు దర్యాప్తు ధ్రువీకరించింది. రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ అధ్యక్షతన 4 మంది ఓఏఎస్ అధికారుల సహాయక సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది జూలై 31న లోక్ సేవా భవన్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి దర్యాప్తు నివేదికను సమర్పించారు. భువనేశ్వర్, పూరీ రెండు వేర్వేరు చోట్లలో దర్యాప్తు బృందం బహిరంగ విచారణ చేపట్టింది. 60 మందికి పైగా వ్యక్తులను, అధికారులను కలిసి, సంభాషించిన తర్వాత దర్యాప్తు నివేదికను రూపొందించినట్లు తెలిపారు. దర్యాప్తులో సహాయపడటానికి తొక్కిసలాట దృశ్యాలను పంపమని ప్రత్యక్ష సాక్షులకు దర్యాప్తు బృందం అభ్యర్థించింది. విచారణలో నలుగురు ఓఏఎస్ అధికారులు మానస్ రంజన్ సామల్, బినయ్ కుమార్ దాస్, రష్మి రంజన్ నాయక్, ప్రదీప్ కుమార్ సాహు సహాయకులుగా వ్యవహరించారు. -
450 కిలోల గంజాయి స్వాధీనం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీస్స్టేషన్ పరిధిలో గల తెల్రాయ్ పంచాయతీ జకల్గుండి గ్రామ అడవిలో దాచిన 18 బస్తాల గంజాయిని శనివారం మధ్యాహ్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆంధ్రాకు తరలిచాలని అడవిలో ఉంచారు. రాత్రి సమయంలో అడవి మార్గంలో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందడంతో ఎంవీ 79 పోలీసు స్టేషన్ ఐఐసీ చంద్రకాంత్ తండి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించి గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకతో నిందితులు పరారయ్యారు. గంజాయిని తూకం వేయగా 450 కిలోలు ఉంది. దీని విలువ రూ.40 లక్షలు ఉంటుందని ఐఐసి చంద్రకాంత్ తెలిపారు. -
విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు మృతి
కొరాపుట్: వన్య ప్రాణులైన అడవి పందులను వేటాడడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్కి చెందిన ఇద్దరు యువకులు గెహ్ల మండిగా (30), మీని మినియకా (25)లు పశువులు మేపడానికి అడవికి వెళ్లారు. అక్కడ వేటగాళ్లు అడవి పందుల వేటాడేందుకు 11 కేవీ విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా విద్యుత్ కనెక్షన్ లాగారు. అదే మార్గంలో పశువులు మేపడానికి వెళ్లిన యువకులకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. పశువులు మేపడానికి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు గాలింపులు చేయగా అడవిలో వీరి మృతదేహాలు కనిపించాయి. లక్ష్మీపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. వేటగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. -
దేవగిరి శైవక్షేత్రంలో చోరీ
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి దేవగిరి ప్రఖ్యాత శైవక్షేత్రంలోని హుండీ చోరీకి గురయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నరు. అయితే పోలీసుల రాకను గుర్తించిన దుండగులు బైకుతో పాటు ఉన్న హుండీని విడిచి పారిపోయారు. పోలీసులు బైకు, హుండీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐఐసీ నీలకంఠ బెహర తెలియజేసిన వివరాల ప్రకారం.. మందిరం బయట గేటు వద్ద ఉన్న హుండీని నలుగురు వ్యక్తులు దొంగిలించారు. దాన్ని బైక్కు కట్టి తీసుకువెళుతున్న సమయంలో ఎదురుగా ఆవుల మంద అడ్డంగా వచ్చింది. దీంతో రహదారి లేక.. మరో వైపు సమాచారం పోలీసులకు తెలిసిందన్న భయం దొంగలను వెంటాడింది. చేసేదిలేక బైకుతో సహా హుండీని అక్కడే విడిచి పరారయ్యారు. -
గుజరాత్లోని గిఫ్ట్ నగరం సందర్శన
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి గుజరాత్ 3 రోజుల పర్యటనలో భాగంగా భారత దేశంలోని మొట్టమొదటి ప్రపంచ ఆర్థిక, సాంకేతిక కేంద్రమైన గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్ సిటీ)ని సందర్శించారు. ఆర్థిక, సాంకేతిక వృద్ధిని ప్రోత్సహించే గిఫ్ట్ సిటీలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినూత్న పర్యావరణ వ్యవస్థ. ఈ ప్రాజెక్ట్ దార్శనికతను ఆయన ప్రశంసించారు. ఇది భారత దేశ భవిష్యత్ను ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా రూపొందించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని అభివర్ణించారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ కంభంపాటి అహ్మదాబాద్లోని చారిత్రాత్మక సబర్మతి ఆశ్రమంలో జాతిపితకు నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ సత్యం, శాంతి, నిస్వార్థ సేవ యొక్క ఆదర్శాలు దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సబర్మతి నదీ తీరాన్ని (అటల్ వంతెన) సందర్శించారు. -
సైబర్ సెక్యూరిటీపై అవగాహన
బలిమెల కళాశాలలో..మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల పట్టణంలోని బలిమెల సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సైబర్ సెక్యూరిటీపై పోలీసులు శనివారం అవగాహన కల్పించారు. మా గౌరవం–మా కాలేజ్ అనే కార్యక్రమంలో భాగంగా శిబిరాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాళ్ల మోసపూరిత పద్ధతులు, ఆన్లైన్ మోసాలు, లాటరీ మోసం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, నకిలీ కాల్స్ ద్వారా ఓటీపీ అడగడం, ఫేక్ నూస్ వీడియో కాల్స్ మొదలగు వాటి ద్వారా ఎలా మోసం చేస్తున్నారో విద్యార్థులకు వివరించారు. బలిమెల పోలీసు ఏఎస్ఐ సంజిత్ టాకరీ మాట్లాడుతూ.. సైబర్ నేరాళ్లపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు సైబర్ నేరాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. -
283 కిలోల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పోలీసులు 283 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సునాబెడా వైపు మాచ్ఖండ్ నుంచి గంజాయి వస్తుందని సమాచారం వచ్చింది. దీంతో ఇన్స్పెక్టర్ చరణ్ సింగ్ మజ్జి నేతృత్వంలో పోలీసులు సన బొడింగా వద్ద తనిఖీలు చేపట్టారు. అదే ప్రాంతంలో ఓఆర్ 02 ఏఎల్ 0801 నంబర్ గల సుజుకీ డిజైర్ కారు కనిపించింది. ఆ కారులో వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో తనిఖీలు చేపట్టడంతో గంజాయి పట్టు బడింది. దీంతో గంజాయిని సీజ్ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. 10 అడుగుల కొండచిలువ పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి మోక్కా పంచాయతీ కలియగూడ గ్రామంలో 10 అడుగుల కొండచిలువ పామును శనివారం పట్టుకున్నారు. గ్రామానికి చెందిన త్రినాఽథ్ బుమియా, గంగాధర్ నాయక్ ఇద్దరు కలిసి వరి పొలంలో కలుపు తీస్తుండగా భారీ కొండచిలువ కనిపించింది. దీంతో ధైర్యంతో దాన్ని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చి మత్తిలి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని స్వాధీనం చేసుకున్నారు. సినీనటుడు అశ్రుమోచన్ మహంతికి తప్పిన ప్రమాదం భువనేశ్వర్: ఒడియా చలన చిత్ర నటుడు అశ్రుమోచన్ మహంతి నడుపుతున్న కారు శనివారం తెల్లవారు జామున భువనేశ్వర్ శివార్లలోని కొలాఝొరి సమీపంలోని దయా పడమ కాలువలోకి అదుపు తప్పి పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం నటుడు సురక్షితంగా బయటపడగలిగాడు. కారు ముందుకు అకస్మాత్తుగా వచ్చిన వీధి కుక్కను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ సంఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి నటుడిని వాహనం నుంచి బయటకు తీయడానికి సహాయం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలువలో నీరు తక్కువగా ఉన్నందున ఘోర ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తున్న అశ్రుమోచన్ మహంతికి స్వల్ప గాయాలు అయ్యాయని ప్రాథమిక వైద్య పరీక్షల తర్వాత సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ రాయగడ: జిల్లాలోని గుడారి సమితి ఎంకే రాయ్ తహసీల్ పరిధిలో ఉన్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.స్నేహలత 26 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. ఇందులో సిలిమి మౌజా పరిధిలో ఉన్న 14 మందికి, కొదప పంచాయతీలోని పరికుపడ గ్రామానికి చెందిన మరో 12 మందికి పట్టాలను అందించారు. కార్యక్రమంలో ఆర్ఐ కవితా బిడిక, సూపర్వైజర్ మనోజ్ సబర్ పాల్గొన్నారు. -
రాయగడలో సమైక్యతా ర్యాలీ
రాయగడ: మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం శనివారం పట్టణంలో సమైక్యతా ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలొ భాగంగా స్థానిక గాంధీ పార్క్ వద్ద గల అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కలక్టర్ అశుతోస్ కులకర్ణి, కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉలక, బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి.గొపిఆనంద్, పట్టణ ప్రముఖులు, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత పట్టుకుని జాతి సమైక్యతకు అద్దం పట్టేలా ర్యాలీ నిర్వహించడం దేశభక్తిని చాటుకుంది. -
కొరాపుట్లో ‘కామ్రేడ్ కళ్యాణ్’ షూటింగ్
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో కామ్రేడ్ కళ్యాణ్ తెలుగు సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శబరి శ్రీ జగన్నాథ క్షేత్రంలో పలు దృశ్యాలు చిత్రీకరించారు. హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ మహిమా నంబియర్ మధ్య సన్నివేశాలు తీశారు. జిల్లాలో 13 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. చిత్ర యూనిట్కి ప్రభుత్వపరంగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు హడావిడి చేయడం పట్ల షూటింగ్ సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. ఈ సినిమాకి నిర్మాతగా కోన వెంకట్, దర్శకుడిగా జానకిరామ్, సంగీత దర్శకుడిగా రఘు వాసన్ వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే రాజమౌళీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ చిత్రం, ఘాటీ, సంక్రాతికి వస్తున్నాం వంటి చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. మరి కొన్ని చిత్రాలు షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
విక్రయానికి రథయాత్ర చక్రాలు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ యాత్ర రథాల విడి భాగాలు విక్రయించాలని శ్రీ మందిరం అధికార వర్గం (ఎస్జేటీఏ) నిర్ణయించింది. జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర వార్షిక రథయాత్రలో ఉపయోగించిన మూడు పవిత్ర రథాల చక్రాలను ఈ సంవత్సరం విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి నిర్ధారిత కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) జారీ చేసింది. దీని ప్రకారం రథ చక్రాలతో పాటు, ప్రభ, గుజ, అసువారీ వంటి ఇతర విడి భాగాలు భక్తులకు అమ్మకానికి అందుబాటులో ఉంటాయని ఎస్జేటీఏ పేర్కొంది. ఆసక్తిగల దరఖాస్తుదారులు ఈ నెల 10లోపు దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రూ.1,000 తిరిగి చెల్లించని రుసుము చెల్లించడం తప్పనిసరి. ఎస్ఓపీ ప్రకారం జగన్నాథుని రథంలోని ఒక్కో చక్రం ధర రూ.3 లక్షలుగా నిర్ణయించగా బలభద్రుని రథ చక్రం ధర రూ. 2 లక్షలు, దేవి సుభద్ర చక్రం ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫారాలు పూరీలోని ఎస్జేటీఏ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. చెక్క రథాల నిర్మాణాల పవిత్రతను కాపాడి మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతతో నిండిన జగన్నాథ వారసత్వంలో కొంత భాగాన్ని కలిగి ఉండే అరుదైన అవకాశాన్ని భక్తులకు అందించడం ఈ చొరవ ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం రథ యాత్ర కోసం కొత్త రథాలను నిర్మిస్తారు. యాత్ర తర్వాత చెక్క భాగాలను కూల్చి వేస్తారు. ఈ ఏడాది ఆ పవిత్ర అవశేషాలను విక్రయించేందుకు అధికారిక, పారదర్శక విధానం ఎస్ఓపీ రూపొందించడం విశేషం. -
ఈపీఎఫ్ పింఛన్ రూ.7,500 మంజూరు చేయాలి
పర్లాకిమిడి: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఈపీఎఫ్ ఖాతాదారులకు పింఛన్గా నెలకు రూ.7,500, డీఏ. ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలని అఖిల ఉత్కళ భవిష్యనిధి పెన్షన్దారులు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక రాజవీధి పెద్ద రాధాకాంత మఠంలో భవిష్య నిధి పెన్షన్దారుల సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు. అఖిల ఉత్కళ ఈపీఎఫ్ పెన్షన్దారులకు అధ్యక్షులుగా పినాకి ప్రసాద్ జెన్నా, కార్యదర్శిగా గోవింద చరణ్ పాత్రో ఎన్నికకాగా, గంజాం అఖి ఉత్కళ భవిష్యనిధి సంఘం సాధారణ కార్యదర్శి ప్రశాంత్కుమార్ శతపతి కార్యక్రమానికి అధ్యక్షత వహించి భవిష్యత్తు ప్రణాళికను సభ్యులకు వివరించా రు. నెలకు 7,500 రూపాయలు ఇచ్చేవరకూ పోరాడతామని ప్రశాంత్ కుమార్ శతపతి తెలియజేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు.మెడికల్ దుకాణాల్లో తనిఖీలు రాయగడ: ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులు, క్లినిక్లతో పాటు ల్యాబ్లలో గుణుపూర్ సబ్ కలెక్టర్ అనిల్ దుదుల్ అభిషేఖ్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుణుపూర్, బైపాస్ రోడ్డు, పాత బస్టాండ్, బాలికల ఉన్నత పాఠశాల కూడలి తదితర ప్రాంతాల్లో ఎంఎం మెడికోస్ క్లినిక్, అమూల్య భారత్, జోసెఫ్ సొబొర్, అనంతదాస్, అమ్మా క్లినిక్, రాధికా డాక్టర్ చాంబర్ తదితర చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటిని సీజ్ చేయాలని గుణుపూర్ సబ్ డివిజన్ మెడికల్ ఇన్చార్జిని ఆదేశించారు. 51 తాబేళ్లు స్వాధీనం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మోటు అటవీశాఖ అధికారులు గురువారం రాత్రి 51 తాబేళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఎం.పి.వి–47 గ్రామానికి చెందిన సూరజ్ మండల్, ఎం.వి.–81 గ్రామానికి చెందిన జయంత్ బచాజ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి బైక్పై రెండు సంచుల్లో తాబేళ్లను రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మోటు అటవీశాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది సంయుక్తంగా కలిమెల సమితి కమారగూడ కల్వర్టు వద్ద మాటువేసి అడ్డుకున్నారు. తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. 160 కేజీల బరువున్న వీటిని కిలో 500 చొప్పున మార్కెట్లో విక్రయిస్తుంటారని పోలీసులు తెలిపారు. విపక్ష నేత విమానం ఆలస్యంభువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విపక్ష నేత నవీన్ పట్నాయక్ విమానం బయలుదేరడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని బీజేడీ ఆరోపించింది. శుక్రవారం స్థానిక విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ విమానం దాదాపు 70 నిమిషాలు ఆలస్యమైంది. విమానాశ్రయ అధికారులుఅనుమతి మంజూరు చేయడంలో జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగిందని, నువాపడాలో నవీన్ పట్నాయక్ పాల్గొనాల్సిన రోడ్షో, బహిరంగ సభకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేడీ నాయకులు ఆరోపించారు. దీనిపై అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ స్పందించి నవీన్ పట్నాయక్ విమాన ఆపరేటర్ విమాన ప్రయాణం ప్రణాళికను సమర్పించలేదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ క్లియరెన్స్ నంబర్ జారీ కాలేదన్నారు.ప్రయాణం వివరాలు అందడంతో సమన్వయం చేసుకుని కోల్కతా నుంచి నంబర్ను పొందామని, ఈ క్రమంలో దాదాపు 25 నిమిషాల ఆలస్యం జరిగిందని చెప్పారు. కాగా, క్లియరెన్స్ ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని బిజూ జనతా దళ్ నాయకుడు చిన్మయ్ సాహు ఆరోపించారు. -
వేడుకగా మహిషాసుర మర్దిని ఆలయ పునఃప్రతిష్ట
పర్లాకిమిడి: మహిషాసుర మర్దిని ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం స్థానిక 16వ వార్డు గొల్ల మేదరవీధిలో ఘనంగా జరిపారు. హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, వైస్ చైర్మన్ లెంక మధు, మాజీ సమితి చైర్మన్ సి.హెచ్.సింహాద్రి తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏటా దసరా ఉత్సవాలకు ఘనంగా ఇక్కడి ప్రజలు మొక్కులు తీర్చుకుంటారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మహిషాసుర మన్దిని ఆలయం గతంలో పల్లికల వంశీయులు నెలకొల్పారు. అనంతరం 1974 మరికొందరు భక్తులు ముందుకు వచ్చి ఆలయ మరామ్మతులు చేపట్టారు. ప్రస్తుతం ఎన్ని ముఖలింగం వంశీయులు, గొల్లవీధి, మేదరవీధి, గొల్లకంజా వీధి, సంజయ్ గాంధీ కాలనీ వాసులు పల్లికల వంశీయులు కలిసి ఆలయం పూర్తిగా నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పునః ప్రతిష్టలో భాగంలో పండితులు భాస్కరభట్ల రవిప్రసాద్ శర్మ, జోస్యుల ప్రతీప్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సీతారాం రెడ్డి తదితరులు ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమాలుజరిగాయి. కార్యక్రమాన్ని ఎన్ని శేఖర్, గొల్లవీధి యూత్ కమిటీ ఆఽధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. -
150 కిలోల గంజాయి స్వాధీనం
● ఒకరి అరెస్టు పర్లాకిమిడి: అబ్కారీ శాఖ కమిషనర్ డంబుఽరధ ఖండ, డిప్యూటీ కమిషనర్ శృతికాంత రవుత్ ఆదేశాల మేరకు బరంపురం అబ్కారీశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. గంజాం జిల్లా బరంపురం పట్టణం సమీపంలో గోత బండ నలా వైపు బుధవారం తెల్లవారు జామున వాహనంలో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎన్పోర్సుమెంట్, ఈబీ బృందం, సదర్ బరంపురం పోలీసు బృందాలకు పట్టుబడ్డారు. గజపతి జిల్లా అడవ మీదుగా బరంపురం పట్టణానికి రాత్రి వేళ కారులో చేరుకుని అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు పథకం చేసినట్టు నిందితుడు అబ్కారీశాఖకు తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న కారులో 150 కిలోల గంజాయి ఉన్నట్టు ఎకై ్సజ్ అధికారులకు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి గజపతి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రైవర్, మరోకరు తప్పించుకున్నట్టు ఎకై ్సజ్ అధికారులు తెలియజేశారు. వీటి విలువ మార్కెట్లో రూ.15 లక్షలు ఉంటుందని జాయింట్ అబ్కారీ కమిషనర్ డంబురధర ఖండ తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి 3 మొబైల్స్, ఒక హీరో బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అబ్కారీ ఎస్ఐ అజిత్ కుమార్ నాయక్, ప్రదీప్ సామల్, కుముద ప్రదాన్, సరోజ్ స్వయిని, కపిలాష్ బత్రా, సౌమ్య రౌత్ పాల్గొన్నారు. -
రాగి పంటతో లాభాలు మెండు
రాయగడ: రాగి పంటతో అనేక లాభాలు ఉన్నాయని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక బిజుపట్నాయక్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి రాగుల దినోత్సవం–25 కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు జిల్లాలో ఆదివాసీలు తమ ప్రధాన ఆహారంగా భావించి వారికి సరిపడ్డ రాగులను పండించుకునేవారని అన్నారు. రాగుల్లో పౌష్టిక గుణాలను గుర్తించిన ప్రభుత్వం ఈ పంటపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి రైతులకు ప్రోత్సహించిందన్నారు. దీంతో ప్రతిఒక్కరూ రాగి పంటపై ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. మన నిత్య ఆహారంలో రాగులు కూడా స్థానాన్ని సంపాదించుకొవడమే అందుకు ప్రధాన కారణమని అన్నారు. జిల్లా అదనపు మేజిస్ట్రేట్ నవీన్ చంద్ర నాయక్ గౌరవ అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో 177 సమితుల్లోని 2,884 గ్రామపంచాయతీల పరిధిలో 14,841 గ్రామాల్లో ఈ పంట సాగు చేస్తున్న రైతుల సంఖ్య 2,43,256 మందికి చేరడం విశేషమన్నారు. అనంతరం రాగులకు సంబంధించిన ప్రచార రథాన్ని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ప్రారంభించారు. అంతకు ముందు రాగి పంటల్లో ఉత్తమ రైతులకు ఈ సందర్భంగా వేదికపై సన్మానించారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహేంద్రతనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి మెళియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం తదితర మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన దిశానిర్దేశం చేశారు. భూ సేకరణ ఇతర పనులకు సంబంధించిన పాత పెండింగ్ బిల్లులు దాదాపు రూ.16.20 కోట్లు తక్షణమే విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపాలని వంశధార భూసేకరణ విభాగాన్ని ఆదేశించారు. ప్యాకేజీలు, డబుల్ స్టోర్డ్ భవనాలు, డబుల్ చెల్లింపులు వంటి సమస్యలపై ఆర్డీవో, టెక్కలి, సంబంధిత తహసీల్దార్లు పూర్తిస్థాయి నివేదికలను త్వరగా సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ జయ దేవి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సర్క్యూట్ కోర్టు ప్రారంభం
జయపురం: కొట్పాడ్ న్యాయవాదుల చిరకాల కోరిక నెరవేరింది. జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ కోర్టు ప్రాంగణంలో సర్క్యూట్ కోర్టును కొరాపుట్ జిల్లా జడ్జి ప్రదీప్కుమార్ మహంతి గురువారం ప్రారంభించారు. కొట్పాడ్లో సర్క్యూట్ కోర్టు నెలకొల్పాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు ఆమోదించగా ఎట్టకేలకు తమ డిమాండ్ కార్యరూపం దాల్చిందని న్యాయవాదులు తెలిపారు. సర్క్యూట్ కోర్టు సాధనలో కొట్పాడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మణి ప్రసాద్ పట్నాయక్ కృషిని న్యాయవాదులు కొనియాడారు. ప్రారంభ కార్యక్రమంలో మణి పట్నాయక్తో పాటు సీనియర్ న్యాయవాదులు పంకజ కుమార్ పాత్రో, స్వాదీనచంద్ర మహంతి, ఘనశ్యామ్ బిశాయి, లింగరాజ్ నాయిక్, శంకర ప్రసాద్ పండ, కిశోర్ మిశ్ర, గుప్త బెహర, దుర్గ నాయిక్, శ్రీమంత పండ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కొట్పాడ్లో ప్రారంభమైన సర్క్యూట్ కోర్టు -
ఒడిశాకు రూ.వెయ్యి కోట్లు
● త్వరలో భువనేశ్వర్ రింగ్ రోడ్డుకు భూమిపూజ ● ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భువనేశ్వర్: కేంద్ర రోడ్డు నిధి కింద ఒడిశాకు కేంద్రం అదనంగా రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ జయ గడ్కారీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే ఈ నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శుక్రవారం భువనేశ్వర్ నగరంలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 84వ వార్షిక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హాజరైన ఈ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భువనేశ్వర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు త్వరలోనే భూమి పూజ జరుగుతుందని చెప్పారు. రింగ్ రోడ్డు నిర్మాణంతో భువనేశ్వర్ ప్రాంతానికి అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు దోహదపడుతుందన్నారు. పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు మంజూరు జాప్యంతో పూరీ – గోపాల్పూర్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ప్రతిపాదనల్లో స్వల్ప మార్పుచేర్పులతో తాజా ప్రణాళిక ప్రతిపాదనల పట్ల విభాగం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నిధులకు కొరత లేదు.. ఒడిశాలో జాతీయ రహదారి ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని మంత్రి చెప్పారు. రోడ్ల నిర్మాణంలో కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టామన్నారు. దీర్ఘకాలిక మన్నికతో నిర్వహణ భారం కుదించేందుకు రహదారుల నిర్మాణంలో వైట్ టాపింగ్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ విధానంలో బిటుమెన్ రోడ్లపై 6 నుంచి 8 అంగుళాల కాంక్రీట్ నిర్మాణం చేపడతారని వివరించారు. దేశ రహదారి మౌలిక సదుపాయాలను మార్చి రవాణా రంగం భావి రూపు రేఖలను రూపొందించే ఆలోచనలతో సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తలు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రధాన వేదికగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ నిలుస్తుందన్నారు. ● వికసిత్ ఒడిశా 2036, వికసిత్ భారత్ 2047 సంకల్ప సిద్ధికి ఈ ఆవిష్కరణలు బలమైన పునాదిగా ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలతో రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒడిశా రాష్ట్ర రోడ్డు విధానం 2025, ఒడిశా రాష్ట్ర రహదారుల అథారిటీ చట్టం 2025 ద్వారా ప్రభుత్వం రహదారి నెట్వర్క్ విస్తరణ, ఆధునీకీకరణ కోసం నిర్ణయాత్మక చర్యలు చేపడుతుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం మధ్య సన్నిహిత సమన్వయంతో, ఒడిశా రహదారి మౌలిక సదుపాయాలు నాణ్యత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
చేపల పెంపకంతో స్వయం ఉపాధి
● కోరుకొండలో భారీ మేళా మల్కన్గిరి: చేపలు, పశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందవచ్చునని వక్తలు అన్నార. మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి కార్యాలయం ఆవరణలో రాష్ట్ర మత్స్య, పశుసంపద శాఖల ఆధ్వర్యంలో భారీ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు జితు బురుడీ ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పశువైద్యాధికారి గగన్ చరయ్ నాయక్ వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, చేపల పెంపకం, పశుపోషణను వివరించారు. ఈ సందర్భంగా పశు పోషణ, కోళ్లు, మేకలు, చేపల పెంపకం ద్వారా స్వయం ఉపాధి సాధించిన రైతులకు వెయ్యి రూపాయల చొప్పున చెక్లను అందజేశారు. గేదెలు, మేకలు, ఆవులు, కోళ్లకు చికిత్స కోసం పశువైద్య శాఖ తరఫున మొబైల్ అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచామని.. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్ 1962కి కాల్ చేయాలని గ్రూప్ వెటర్నరీ అధికారి అవినాశ్ మాఝి తెలిపారు. -
ఉత్తరాఖండ్లో రాయగడ యువతి దారుణ హత్య
రాయగడ: ఉత్తరాఖండ్లో రాయగడ యువతి దారుణ హత్యకు గురైన సంఘటన సంచనలం సృష్టించింది. హత్యకు గురైన యువతి జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల జేకేపూర్ ప్రాంతానికి చెందిన శృష్టి శర్మ (23)గా గుర్తించారు. ఉత్తరాఖండ్ పోలీసులు నది వద్ద ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్లో అద్దె ఇంటిలో నివసిస్తున్న శృష్టి శర్మ ఇంటి యజమాని కుమారుడు అమిత్ సింహాను అరెస్టు చేశారు. శర్మను హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం. మృతదేహాన్ని గుడ్డ సంచిలో బంధించి బరువైన రాళ్లు, ఇటుకలు వేసి నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసుకు సంబంధించి అందిన సమాచారం ప్రకారం.. శృష్టి శర్మ ఉత్తరాఖండ్లో గల లాలపూర్ అనే ప్రాంతంలో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో గత ఏడు నెలలుగా ఇంటర్నషిప్ చేస్తుంది. లాలపూర్లో గల భారతీయం ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక గల కామేశ్వర సింహ్ అనే వ్యక్తి ఇంటిలో అద్దెకు ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం శృష్టి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఇంటి యజమాని, అతని కుమారుడు అమిత్ను ఫోన్ ద్వారా సంప్రదించారు. వీరిద్దరూ స్పందించకపొవడంతోపాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు శృష్టికి వరుసకు అన్నదమ్ముడైన అమృతకుమార్, అతని స్నేహితుడు సురజ్లను లాలపూర్ పంపించారు. శృష్టి కనిపించడం లేదని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శృష్టి అద్దెకు ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటి చుట్టూ యజమాని కొడుకు రంజిత్ సింహ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని సీసీ ఫుటేజ్లో గుర్తించిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు వెంటనే ఇంటి యజమనాని కామేశ్వర్ సింహ్ను విచారించగా అసలు విషయం బయటపడింది. తన కుమారుడే శృష్టిని హత్య చేసినట్టు అంగీకరించాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శృష్టి శర్మ (ఫైల్) -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల ఎన్ఎస్ఐ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ సమీక్షించారు. అభివృద్ధి పనులు సమితిలో ఏలా జరుగుతున్నాయో సమితి అధికారి అమూల్యా కుమార్ సాహును అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఎన్ఎస్ఐ కార్యాలయాన్ని సందర్శించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కొత్తగా ఎన్ఎస్ఐ కార్యాలయ భవనం, పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం వంటి అంశాలపై బలిమెల పౌరపరిషత్ చైర్మన్ ప్రదీప్ కుమార్ నాయక్తో చర్చించారు. ఒక ఎన్పోర్స్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసి బలిమెలలో రహదారి పక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను రోజువారీ మార్కెట్ ఉన్న దుకాణాలకు తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బలిమెల ఆరోగ్య కేంద్రం కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఓ కాంప్లెక్స్ను నిర్మించి దిగువ మార్కెట్ కాంప్లెక్స్, పైఅంతస్తులో సీనిమా హాల్ నిర్మించాలని ప్రతిపాదన చేశారు. -
ఘనంగా న్యాయసేవా దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి పి.భాస్కరరావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు తక్షణ న్యాయం, న్యాయసేవలు అందించడమే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన లేకపోవడం చాలామందికి న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు 3వ అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, స్పెషల్ (పోక్సో) న్యాయమూర్తి ఎన్.సునీత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, అడిషనల్ సివిల్ జడ్జి ఆర్.శాంతిశ్రీ, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కె.అనురాగ్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.శివప్రసాద్, కార్యదర్శి పిట్టా దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం అర్బన్: ఏపీ పీటీడీ శ్రీకాకుళం జిల్లా జై భీమ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో ఎస్సీ, ఎస్టీ కమిటీ హాల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జేవీ రావు, కార్యదర్శిగా ఏఎస్ చలం, వైస్ ప్రెసిడెంట్గా కె.అచ్చయ్య, జాయింట్ సెక్రటరీగా కె.సోములు, అసిస్టెంట్ సెక్రెటరీగా జె.ఉషారాణి, కోశాధికారిగా బీఎల్ నారాయణ, పబ్లిసిటీ సెక్రటరీగా పి.శ్రీను, కార్యవర్గ సభ్యులుగా కేఎం కుమార్, దాలయ్య, పీయూఎం రావు, కేఆర్ రావు, జి.శారద, ఆర్కే రావు, జీఆర్ రావు తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ కేఆర్ఎస్ శర్మను అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టెక్కలి డిపో సెక్రటరీ జీఎన్ భూషణ్, సీహెచ్ వెంకటరమణ, పీవీ ఆనంద్, జీఎస్ చలం, డి.శివాజీ తదితరులు పాల్గొన్నారు. విజేతలై తిరిగి రావాలి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి విజేతలై జిల్లాకు తిరిగిరావాలని సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు సాఫ్ట్బాల్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేదికగా ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా సామగ్రి, దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, మెట్ట తిరుపతిరావు, ఎం.ఆనంద్కిరణ్, ఎ.ఢిల్లీశ్వరరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, కె.మాధవరావు, జి.శ్రీనివాసరావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అక్రమ మద్యం కేసులో జైలుశిక్ష టెక్కలి రూరల్: అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుబడిన గేదెల శేఖర్ అనే వ్యక్తికి జైలుశిక్ష విధించినట్లు టెక్కలి సీఐ విజయ్కుమార్ శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 2023లో బూరగాం గ్రామానికి చెందిన గేదెల శేఖర్ అనే వ్యక్తి 25 మద్యం సీసాలు తరలిస్తుండగా అప్పటి ఏఎస్ఐ రమణ అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తిపై కేసు రుజువు కావడంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యు.మాధురి ముద్దాయికి 6 నెలల జైలు, రూ.2 లక్షల ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు. 10 నుంచి సమ్మేటివ్ పరీక్షలు నరసన్నపేట: పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు సమ్మేటివ్ ఎసెస్మెంట్– 1 పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలు 2,955 ఉండగా.. వాటిలో 2,64,804 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు స్కూల్స్కు చెందిన విద్యార్థులు సైతం పరీక్షలు రాస్తారు. ఏ రోజు ప్రశ్నపత్రాలు ఆరోజు ఆయా మండలాల ఎంఈవోల వద్ద నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలను ఆయా మండలాల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేర్చారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 6, 7 తరగతులకు చెందిన విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. -
పత్తి పొలంలో జవాన్ మృతదేహం
రాయగడ : ఒడిశా ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ జవాన్ మృతదేహాన్ని సదరు సమితి పరిధిలోని పితామహల్ పంచాయతీ జిమిడిపేట సమీపంలో గల పత్తి పొలాల్లో శేశిఖాల్ పోలీసులు గురువారం గుర్తించారు. పంట పొలంలో మృతదేహం పడిఉండటం గమనించిన ఆ ప్రాంతవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయగడ ఎస్డీపీఓ గౌర హరి సాహు తెలియజేసిన వివరాల ప్రకారం చందిలి పోలీస్ వెనుక గల రిజర్వ్ పోలీస్ విభాగంలో జవానుగా విధులు నిర్వహిస్తున్న గౌరి ప్రసాద్ తాడింగి (45) మృతదేహంగా తమ దర్యాప్తులో తేలిందని, అయితే పూర్తి వివరాలు కొసం దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. 12 కిలోల గంజాయి స్వాధీనం రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ రామనగుడ సమితి పరిధిలో గల బంకి కూడలి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 12 కిలోల గంజాయిని రామనగుడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు ఐఐసీ సునీత బెహరా ఆదేశానుసారం పోలీసులు బంకి కూడలి వద్ద వాహన తనిఖీలను బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బైక్పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. లక్ష్మీ అమ్మవారికి వెండి కిరీటం రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో గల జగన్నాథ మందిరం ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ అమ్మవారికి కొత్తగా వెండితో రూపొందించిన కిరీటాన్ని అలంకరించారు. సుమారు 1100 గ్రాములు గల వెండితో రూపొందించిన కిరీటం ఆకర్షిస్తోంది. మరో 700 గ్రాములతో రూపొందించిన 108 వెండి పద్మపూలను కూడా అలంకరించారు. 219 మంది దివ్యాంగులకు పరీక్షలు పర్లాకిమిడి: స్థానిక టౌను హాల్లో దివ్యాంగుల సమర్థ శిబిరాన్ని జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వసస్థీకరణ విభాగం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శిబిరాన్ని పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, సబ్ డివిజనల్ సామాజిక సురక్ష అధికారి లక్కోజు సంతోష్ కుమార్, పురపాలక వైస్ చైర్మన్ లెంక మధు తదితరులు ప్రారంభించారు. దీనిలో భాగంగా నేత్రాలు, చెవి, ముక్కు, నోరు, ఎంఆర్, ఆర్థోపెడిక్ వంటి విభాగాల్లో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. 219 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. వారిలో 168 మందిని యూనిక్ డిజాబిలిటీ (ప్రత్యేక దివ్యాంగులు)గా అధికారులు గుర్తించారు. శిబిరంలో ప్రభుత్వ ఆస్పత్రి అర్థోపెడిక్ డాక్టర్ శంతను పాడి తదితరులు పాల్గొన్నారు. -
ఒక ఎంఎస్ఎంఈ పార్క్
భువనేశ్వర్: దీర్ఘకాలిక పారిశ్రామిక దృక్పథంతో శాఖాపరమైన చొరవలను సమన్వయపరచాల్సి ఉంది. రాష్ట్రం అంతటా వ్యవస్థాపకత, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ రూపకల్పన జరగాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్లో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం జరిగింది. రానున్న ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 147 శాసన సభ నియోజక వర్గాల్లో ఒక్కో ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేయాలని గవర్నర్ అధికారులను కోరారు. ఈ చొరవ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపకత, ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించి పరివర్తనాత్మకంగా ఫలితాల్ని ప్రదర్శిస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రతి శాసన సభ నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ప్రారంభించాయని అన్నారు. నేడు రక్షణ, అంతరిక్ష రంగాల్లో అవకాశాలు పుష్కలం. భారత ప్రభుత్వం అనేక ఉత్పత్తి వర్గాలలో దేశీయ సేకరణకు ప్రాధాన్యత కల్పిస్తుంది. భూమి, పెట్టుబడి, పరికరాలు, సాంకేతిక అవసరాలతో వివరణాత్మక పథకాలతో ప్రాజెక్ట్ వివరాలు సాంకేతిక సంస్థలు, నైపుణ్య కేంద్రాల విద్యార్థి యువతలో వినూత్న ఆలోచనలను ప్రేరేపిస్తాయి, కొత్త ఎంఎస్ఎంఈలను స్థాపించడంలో సహాయపడతాయని గవర్నర్ అన్నారు. ఉత్కర్ష్ ఒడిశా సందర్భంగా అందిన ప్రతిపాదనలపై సాధించిన పురోగతి, వాటి అనుబంధ అవగాహన ఒప్పందాలు వాస్తవ స్థితిగతుల్ని గవర్నర్ సమీక్షించారు. వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడంలో వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఐవైబీ – ఈడీపీ) గురించి చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంపై అవగాహన కీలకం, వాటి వలన ఎంత మంది శిక్షణార్థులు వ్యవస్థాపకులుగా మారారో తెలుసుకోవడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని గవర్నర్ ప్రతిపాదించారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) గురించి డాక్టర్ కంభంపాటి మాట్లాడుతూ సబ్సిడీ పథకాలను అందించే విభాగాలు కూడా చేయూతనిచ్చి లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా బ్యాంకులతో సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలని సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన అమలును కూడా ఆయన సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్లు, ఎగుమతులకు సంబంధించిన అంశాలను సమావేశంలో లోతుగా చర్చించారు. సమ్మిళిత, స్థిరమైన పారిశ్రామిక వృద్ధి కోసం ఈ చొరవలను బలోపేతం చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు. సమీక్ష సమావేశానికి హాజరైన వారిలో పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, సమాచారం, ప్రజా సంబంధాల విభాగం, మహిళా మరియు శిశు అభివృద్ధి, ఎంఎస్ఎంఈ ప్రిన్సిపల్ కార్యదర్శి శుభ శర్మ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజీవ్ కుమార్ మిశ్రా, గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు, ఇపికాల్ మేనేజింగ్ డైరెక్టర్ భూపేంద్ర సింగ్ పుణియా, స్టార్టప్ ఒడిశా సీఈఓ రష్మితా పండా, పరిశ్రమల డైరెక్టర్ అబోలి ఎస్. నర్వానే, పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈ విభాగాల సీనియర్ అధికారులు ఉన్నారు. -
జఖపురాలో గతి శక్తి కార్గో టెర్మినల్
భువనేశ్వర్ : రాష్ట్రంలో సరుకు రవాణా మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుసంధానం ప్రోత్సాహానికి తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ డివిజన్ జఖపురాలో కొత్త గతి శక్తి కార్గో టెర్మినల్ (జీసీటీ) ప్రారంభించారు. జాజ్పూర్ జిల్లాలో ఇది మైలురాయి ప్రాజెక్టుగా నిలుస్తుంది. రూ. 36.85 కోట్లు వెచ్చించి 4 లైన్ల టెర్మినల్ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఇది సిమెంట్, క్లింకర్, స్లాగ్, జిప్సమ్ రవాణాలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టెర్మినల్ నెలకు దాదాపు 86 ర్యాక్లను నిర్వహించగలదని భావిస్తున్నారు. 86 ర్యాక్ల్లో సిమెంట్, అనుబంధ పరిశ్రమలకు ముడి పదార్థాలు, ఉత్పాదకతల తరలించడంలో శక్తివంతమైన వ్యవస్థగా వెలుగొందుతుందని రైల్వే శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ జీసీటీ ప్రారంభం వల్ల సరుకు రవాణా నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. ఈ రంగంలో నిరంతర, నిత్య, దైనందిన ఖర్చులు తగ్గుతాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక సరఫరా గొలుసు బలోపేతం అవుతుంది. రైల్వేలు, స్థానిక ఆర్థిక వ్యవస్థ రెండింటికీ ప్రయోజనం చేకూర్చుతుంది. -
సంస్కృత ఉపాధ్యాయ అభ్యర్థుల నిరసన
భువనేశ్వర్: ఔత్సాహిక సంస్కృత ఉపాధ్యాయ అభ్యర్థులు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓఎస్ఎస్సీ) కార్యాలయం ఎదురుగా నిరసన ప్రదర్శించారు. టీజీటీ సంస్కృత మెరిట్ జాబితా ప్రచురణలో జాప్యంపై తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తం చేశారు. సంస్కృతం మినహా అన్ని టీజీటీ పోస్టుల మెరిట్ జాబితా ప్రచురించారు. సంస్కృత టీజీటీ మెరిట్ జాబితా ఎందుకు ప్రచురించలేదో అస్పష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎస్ఎస్సీ కార్యాలయం ఎదురుగా మోకాళ్లు వేసి లెంపలేసుకుని విభిన్న శైలిలో శాంతియుతంగా నిరసన ప్రదర్శించారు. -
మల్కన్గిరిలో సురభీ ఉత్సవాలు
మల్కన్గిరి: మల్కన్గిరి సదర్ బుటిగూడ ఉన్నత పాఠశాలలో గురువారం సురభీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు జిల్లా విద్యశాఖ అధికా రి చిత్తరంజన్ పాణిగ్రహి అధ్యక్షతన ఈ కార్యక్ర మం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సోమేశ్కుమార్ ఉపాధ్యాయ్ హాజరయ్యారు. ము ఖ్యంగా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం కో సం సురభీ ఉత్సవాలని పిలుస్తారు. పిల్లలకు ఆట లు, క్రీడలు, పాటల పోటీలు నిర్వహించి వారిలో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడమే సురభీ ఉత్సవాల వేదిక ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రదాన్, అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రదాన్, జిల్లా అదనపు వైద్యాకారి మంజులతా బోయి, మల్కన్గిరి సమితి విద్యాధికారి మామతా సోయి, చిత్రకొండ సమితి విద్యాధికారి గాయత్రీదేవి, ఖోయిర్పూట్ విద్యాధి కారి దిలీప్కుమార్ గోండో, ఇలా 7 సమితుల్లో అధికారులు పాల్గొన్నారు. -
వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
పర్లాకిమిడి: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు శనివారం స్థానిక గజపతి స్టేడియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ మధుమతి తెలియజేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో జరిగిన సన్నాహక సమావేశంలో పాలనాధికారితో పాటు జిల్లా పరిషత్, డీఆర్డీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శంకర్ కెరకెటా, అదనపు ఈవో పృ థ్వీరాజ్ మండల్, సీడీఎంఓ డాక్టర్ ఎంఎం అలీ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్థానిక కళాకారులచే ప్రదర్శనలు, స్వయం శక్తి గ్రూపులు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, విద్యార్థులకు అనేక పోటీలు ఉంటాయన్నారు. -
వినూత్న నిరసన
కటక్ రెవెన్షా విశ్వ విద్యాలయం విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. అధ్యాపకులు రోడ్డుపై పాఠాలు బోధించారు. యూనివర్సిటీలోని తరగతి గదులు సురక్షితంగా లేవని పేర్కొంటూ వారంతా ఇలా ఆందోళన చేపట్టారు. +3 ఆర్ట్స్ 2వ సంవత్సరం విద్యార్థులు గురువారం ఈ ప్రదర్శన నిర్వహించారు. తరగతి గదులు సురక్షితంగా లేనందున మరమ్మతులు చేయాలని సుదీర్ఘకాలంగా చేస్తున్న అభ్యర్థనలను అధికారులు పెడచెవిన పెట్టడంతో తరగతి గదులు వీడి క్యాంపస్ ప్రాంగణం అంగట్లో బైఠాయించి ఇలా నిరసన ప్రదర్శించారు. భువనేశ్వర్ -
వేడుకగా బొయితొ బొంధొనొ
భువనేశ్వర్: బొయితొ బొంధొనొ పండుగ నేటి ప్రపంచానికి ఒక లోతైన సందేశాన్ని అందిస్తుందని, మానవ, ప్రకృతి లయ మధ్య సామరస్యాన్ని అందరికీ గుర్తు చేస్తుందని గవర్నర్ హరిబాబు కంభంపాటి అన్నారు. పర్యావరణ క్షీణత, కనుమరుగవుతున్న సాంస్కృతిక, ఆర్థిక అసమానత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో బొయితొ బొంధొన్ మానవాళికి శ్రేయస్సు, సుస్థిరత కలిసి ఉండగలవని బోధిస్తుందని రాష్ట్ర గవర్నర్ ప్రసంగించారు. ఖుర్ధా జిల్లా బలుగాంవ్లో జరిగిన చిలికా బొయితొ బొంధొన్ మహోత్సవం–2025 ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఒడిశా సముద్ర వర్తక వారసత్వం, ప్రాచీన నావికుల ధైర్యసాహసాల వేడుక అని అన్నారు. ప్రాచీన కళింగ ప్రజల సముద్ర మార్గంలో వర్తక సంప్రదాయాన్ని చిరస్మరణీయం చేయడంలో ఈ వేడుక దోహదపడుతుందన్నారు. బొయితొ బొంధొనొ అత్యంత విలువైన సంప్రదాయంగా అభివర్ణించిన గవర్నర్ పూర్వీకులు వాణిజ్య వస్తువులను మాత్రమే కాకుండా, నాగరికత యొక్క సారాంశాన్ని, కళ, భాష, విశ్వసనీయతని వర్తక రంగంలో పొరుగు దేశాలకు తెలియజేయడం దీనిలో ఇమిడి ఉన్న విశిష్టతగా పేర్కొన్నారు. కళింగ రాజ్యంలో ప్రాచీన కాలం నుంచి నావికా వర్తక వ్యాపారాలతో పొరుగు దేశాలతో వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక అనుబంధాలు కలిగి ఉన్నట్లు ఈ బొయితొ బొంధొనొ గుర్తు చేస్తుందన్నారు. ఆగ్నేయ ఆసియా అంతటా ఈ విలువల్ని వ్యాప్తి చేశారన్నారు. ఇండోనేషియాలోని బోరోబుదూర్, కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ వంటి ప్రాంతాల్లో ఒడిశా నావికా వ్యాపార శైలికి సంబంధించిన పలు ఆనవాళ్లు నేటికీ తారసపడడం అద్భుతంగా పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా బొయితొ బొంధొనొ ఉత్సవం నిరవధికంగా నిర్వహించడం అభినందనీయమని ఖుర్ధా జిల్లా యంత్రాంగం, నిర్వాహకులు, కళాకారులు మరియు స్వచ్ఛంద సేవకులను డాక్టర్ కంభంపాటి ప్రశంసించారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ప్రముఖ సాహిత్యకారుడు డాక్టర్ బిజయానంద సింగ్, ఖుర్ధా జిల్లా కలెక్టర్ అమృత్ రుతురాజ్, కార్య నిర్వాహక అధ్యక్షుడు దుష్మంత హరిచందన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. -
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి బలిదియాగుడా ఎస్.ఎస్.డి బాలికల ఉన్నాత పాఠాశాలలో 10వ తరగతి చదువుతున్న భారతి పూజారి (15) విద్యార్థిని కడుపు నొప్పితో మాత్తిలి ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. భారతికి బుధవా రం కంటి వాపు రావడంతో హాస్టల్ సిబ్బంది మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తీసుకెల్లి చికిత్స చేయించారు. మందులు కొలుగోలు చేసి తిరిగి హాస్టల్కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం భోజ నం తరువాత కంటివాపు మందులు వేసుకుంది. కాసేపటికే కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో వెంటనే తిరిగి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లా రు. ఇక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందింది. బాలిక మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తల్లిండ్రులు మాత్తిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్ర దాన్ ఆరోగ్య కేంద్రానికి వచ్చి బాలిక మృతిపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రీపోర్ట్ వస్తే వివరాలు తెలుస్తాయని వైద్యులు అన్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. జయపురం: జయపురం బ్లాక్ విద్యాధికారి సచి న్కుమార్ ప్రదాన్కు కొలాబ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ బాధ్యతలను అదనంగా అప్పగించారు. కొలాగ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్వేతలిని ప్రదాన్ బదిలీ కావటంతో ఆ స్థానం ఖాళీ అయింది. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు సచిన్ ప్రధాన్కు దేబాశిశ్ ప్రధాన్ బాధ్యతలు అప్పగించారు. విద్యావిభాగ అధికారి రాజేంద్రనారాయణ పాడీ, కొరాపుట్ జిల్లా నాన్ గజి టెడ్ సమస్వయ సంఘం అధ్యక్షుడు శశిభూష ణదాస్, విద్యా విభాగ జూనియర్ అధికారి నాగేశ్వరరావు తదితరులు సచిన్కు అభినందన లు తెలిపారు. జయపురం: కొట్పాడ్ న్యాయవాదుల చిరకాల కోరిక నెరవేరింది. జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్ కోర్టు ప్రాంగణంలో సర్క్యూట్ కోర్టును కొరాపుట్ జిల్లా జడ్జి ప్రదీప్ కమార్ మహంతి గురువారం ప్రారంభించారు. కొట్పాడ్లో సర్య్కూట్ కోర్టు నెలకొల్పాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని, ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు ఆమోదించగా తమ డిమాండ్ కార్యరూపం దాల్చిందని న్యాయవాదులు తెలిపారు. సర్క్యూట్ కోర్టు సాధనలో కొట్పాడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మణి ప్రసాద్ పట్నాయక్ కృషి గొప్పదని న్యాయవాదులు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మణి పట్నాయక్, సీనియర్ న్యాయవాదులు పంకజ కుమార్ పాత్రో, స్వాధీన చంద్ర మహంతి, ఘనశ్యామ్ బిశాయి, లింగరాజ్ నాయక్, శంకర ప్రసాద్ పండా, కిశోర్ మిశ్ర, గుప్త బెహర, దుర్గ నాయక్, శ్రీమంత పండా, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నరసన్నపేట: మండలంలోని పారశిల్లి–రెల్లివలస గ్రామాల మధ్య కొత్త విద్యుత్ లైన్ పనులు జరుగుతున్న క్రమంలో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభం పడి ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలో వ్యవసాయ మోటార్లకు ప్రత్యేక లైన్ వేసేందుకు రీవేంప్డ్ డెవలప్మెంట్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో భాగంగా రెండేళ్లుగా పనులు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం రెల్లివలస వద్ద ట్రాక్టర్ పైనుంచి విద్యుత్ స్తంభం కిందకు దించి పైకి ఎత్తుతున్న క్రమంలో టాక్టర్ పక్కకు ఒరిగిపోవడంతో స్తంభం పడి నడగాంకు చెందిన బానాల రాము(37) మృతి చెందగా, జోగి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెల్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేటకు తరలించారు. రాంబాబును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా, రాముకు రెండు నెలల క్రితమే కుమార్తె పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే ప్రమాదం జరగడంతో భార్య ఢిల్లీశ్వరి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నడగాం సర్పంచ్ జల్ల మాధురి, వైఎస్సార్ సీపీ నాయకులు లుకలాపు రవి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఫారెస్టర్ మృతి
కొరాపుట్: రోడ్డు ప్రమాదంలో ఫారెస్టర్ మృతి చెందగా.. మరో ఇద్దరు ఫారెస్టర్ల పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రానికి సమీపంలో నిర్మితమవుతున్న విశాఖపట్నం – రాయ్పూర్ల మధ్య ఉన్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్ భారతమాలపై ప్రమాదం జరిగింది. జొరిగాం ఫారెస్టర్ గుప్త ప్రసాద్ మహంతి (55), ఉమ్మర్కోట్ ఫారెస్టర్ కామాక్ష్య ప్రసాద్ స్వయ్, జొరిగాంకి చెందిన మరో ఫారెస్టర్ తనుజ కుమార్ పరిచ్చాలు కారులో వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక పికప్ వ్యాన్ కారును ఢీకొంది. దీంతో ఘటనా స్థలంలో గుప్త ప్రసాద్ మృతి చెందగా.. మరో ఇద్దరు ఫారెస్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పపడాహండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖపట్నం తరలించారు. పపడాహండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. భారతమాల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తామని గవర్నర్ కంభంపాటి హరిబాబు ఇది వరకే ప్రకటించారు. అయినప్పటికీ వాహనదారులు ప్రారంభం కానీ మార్గంలో ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రమాదానికి గురైన వాహనం -
రైల్వే, తీర ప్రాంత భద్రత లక్ష్యం: డీజీపీ
భువనేశ్వర్: ఆధునికీకరణతో రైల్వే, తీరప్రాంత భద్రతను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని, ఈ దిశలో తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఒడిశా పోలీసులు మానవ వనరుల విస్తరణ, కార్య శైలి మెరుగుదల అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా అన్నారు. గురువారం స్థానిక పోలీస్ భవన్ లో ఒడిశా పోలీస్, రైల్వే మరియు కోస్టల్ సెక్యూరి టీ పోలీసు అధికారుల సమర్థత మెరుగుదల కోసం నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. రైల్వే, తీరప్రాంత భద్రతపై అవగాహన, నేర దర్యాప్తులో సాంకేతికత పాత్ర, సైబర్ నేరం, ఆధునిక వ్యవస్థలలో దర్యాప్తు, జాతీయ, అంతర్జాతీయ సముద్ర చట్టాలు వంటి వివిధ చట్టపరమైన అంశాల పట్ల అవగాహ న పెంపొందించి అధికారుల వృత్తిపరమైన నైపుణ్య త, సామర్థ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్ర మం నిర్వహించారు. తీరప్రాంత భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 149.95 కోట్లను కేటాయించిందని తెలిపారు. తీర ప్రాంత భద్రత కోసం 10 ఆధునిక డ్రోన్లు, 3 ట్రా లర్లు, 140 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారని తెలిపారు. 32 ఫిషింగ్ పోర్టులు, నౌకాశ్రయాలను సీసీటీవీ వ్యవస్థతో అనుసంధానపరిచే పనులు చురుకుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారి, కమాండెంట్ రవీంద్ర కుమార్, అంతర్జాతీయ మరియు జాతీయ సముద్ర భద్రతా చట్టాలు మరియు సముద్ర భద్రతా సమస్యలపై ప్రసంగించారు. రైల్వే రక్షక దళం ఇనస్పెక్టరు జనరల్ అలోక్ బోహ్రా మాట్లాడుతు వివిధ చట్ట అమలు, నిఘా సంస్థల మధ్య మెరుగైన అవగాహన, సమన్వయం, సహకారం తప్పనిసరిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఇనస్పెక్టరు జనరల్ (రైల్వేలు, తీరప్రాంత భద్రత) సత్యజిత్ మిశ్రా, ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లు, మైరెన్ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లపై చర్యలు తీసుకోవాలి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా నకిలీ కుల ధ్రువపత్రాలు కలిగిన వ్యక్తుల సంఖ్య పెరుగుతోందని ఆరోపిస్తూ బహుజన్ సమాజవాదీ పార్టీ జిల్లా శాఖ నాయకులు గురువారం విలేకర్లతో మాట్లాడారు. పలువురు గిరిజనేతరులు నకిలీ ఆదివాసీ సర్టిఫికెట్ల తో ప్రభుత్వ హోదాలు, పదవులు పొందుతున్నార ని ఆరోపించారు. జిల్లా బహుజన్ సమాజవాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జరా శబర్ మాడీ మాట్లాడు తూ.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సమారి టాంగులు తండ్రి పేరుపై ఉన్న భూమి పట్టాలపై సాధారణ వర్గం అని ఉంది, అలాటప్పుడు ఆమె ఎలా ఆదివా సీ ధ్రువపతాన్ని పొందిందని ప్రశ్నించారు. తప్పు డు కుల ధ్రువపత్రాలను సమర్పించి రాజ్యాంగ ప్ర మాణం చేసి ఆమె ఎన్నో సంవత్సరాలుగా రాజ్యాంగ హోదాలో కొనసాగుతున్నారని తీవ్రంగా విమ ర్శించారు. ఇలాంటి నకిలీ కుల ధ్రువపత్రాలతో ఇప్పటికే ఎందరో గిరిజన నేతలు హోదాలో ఉన్నార ని జరా శభర మాడీ తెలిపారు. మారో వైపు ఈ విష యం తెలిసి సమారి టాంగులు ఈ ఆరోపణలను ఖండించారు. ఆమె మాట్లాడుతూ తాను ఎలాంటి నకిలీ కుల ధ్రువపత్రాలు సమర్పించలేదని, ప్రభు త్వ ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఇలా ఆరోపిస్తున్నారని సమారి టాంగులు అన్నారు. -
ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం
● తప్పిన ప్రాణపాయం ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డిపాచిపెంట: మండలంలోని పద్మాపురం పంచాయతీ రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డుపై గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో ఒడిశా ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్లో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా ఆర్టీసీ బస్సు విజయనగరం నుంచి బయల్దేరి పదిమంది ప్రయాణికులతో ఒడిశాలోని జయపూర్ వెళ్తోంది. అయితే పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ, రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా బస్సు స్లో అయిపోయింది. బస్సులో ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్ బస్సు పక్కకు తీసి కిందికి దిగి ఇంజిన్ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించేశాడు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు.అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. పరిశీలించిన ఎస్పీ బస్సు దగ్ధమైన సంఘటన స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి స్థానిక పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక లోపమేనా? ఇంకేమైనా కారణం ఉందా? అన్న విషయంపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టాలని స్థానిక పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి ఉన్నారు. -
సాగర తీరం.. కవ్వళ్ల కోలాహలం!
● మత్స్యకారులకు భారీగా చిక్కుతున్న చేపలు ● కోళ్లు, రొయ్యలు, చేపల మేతగా కలవలు ఇచ్ఛాపురం రూరల్: శీతాకాలం వచ్చిందింటే చాలు సముద్రంలో వేటాడే మత్స్యకారులకు కలవలు పంటే. ఈ సీజన్ లో అధిక మొత్తంలో కవ్వళ్లు(కలవలు) వలలకు చేరుతాయి. వీటితో పాటు కోనేం, నెత్తళ్లు వంటి చేపలు అధిక ధరలకు అమ్ముడుపోతాయి. ప్రస్తుతం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమంతా కలవలతో కళకళలాడుతోంది. కలవల్లో రకాలు.. పెద్దగా ఆహారానికి ఉపయోగపడని కలవ చేపలు కోళ్లు, రొయ్యలు, చేపల ఆహారానికి ఉపయోగపడుతున్నాయి. ఈ చేపలను మత్స్యకారులు మూడు రకాలుగా విభజించి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు చేస్తున్నారు. పెద్దగా ఉండే పచ్చి కలవ చేపలను ఆహారానికి ఉపయోగిస్తుంటారు. ఇవి కేజీ రూ.60 వరకు ధర పలుకుతుండగా, గంప చేపలు రూ.600 వరకు కొనుగోలు చేస్తారు. ఈ రకం చేపలు పెద్దగా అమ్మకాలకు గిరాకీ లేకపోవడంతో రెండో రకంగా సేకరించిన కలవ చేపల్ని ఉప్పులో రెండు, మూడు రోజుల పాటు ఊరబెట్టి సముద్ర తీరంలో ఎండబెడతారు. వీటి ధర కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. ఇందులో నల్లని కలవ చేపల్ని మిక్స్ చేసి కోళ్లు, రొయ్యలు, చేపలకు మేతకు ఉపయోగిస్తారు. ఇక మూడో రకంగా ఉప్పులో నానబెట్టకుండా ఎండబెట్టిన చప్పని చేపలు. ఇవి ఏడాది పాటు నిల్వ ఉంచుకొని ఆహారంగా ఉపయోగిస్తారు. వీటి ధర మార్కెట్లో రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇరత ప్రాంతాలకు ఎగుమతి.. జిల్లాలో లభించే ఉప్పు కవ్వళ్లను దళారులు లారీలు, లగేజీ వ్యాన్ల ద్వారా విశాఖపట్నం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న దిగా మార్కెట్, గంజాం ప్రాంతంలో ఉన్న ఉమా సంత, ముంబై, చైన్నె, కర్ణాటక, కోల్కత్తా వంటి ప్రాంతాలకు టన్నుల కొద్దీ తరలిస్తుంటారు. వర్షాలొస్తే ఇబ్బందే.. ఒక్కోసారి ప్రకృతి ప్రకోపానికి మత్స్యకారులు గురికావాల్సి వస్తోంది. ఇటీవల మోంథా తుఫాన్ ధాటికి డొంకూరులో సుమారు రూ.30లక్షలు విలువ చేసే ఎండు చేపలు వర్షార్పణం అయ్యాయి. దీంతో మత్స్యకారులు భారీగా నష్టపోయారు. సంబంధిత మత్స్యశాఖాధికారులు తూతూమంత్రంగా పరిశీలించి రూ.3లక్షలు విలువైన ఎండు చేపలు వర్షంలో తడిసిపోయాయంటూ జిల్లా ఉన్నతాధికారురులకు నివేదికలు అందించి చేతులు దులుపుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సమయాల్లో చేపల్ని భద్రపరుచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామంటూ చెబుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా ఆదాయం లేని మత్స్య పంట ఏదైనా ఉందంటే అది కవ్వళ్లుగా చెప్పవచ్చు. తప్పని పరిస్థితుల్లో వలకు దొరికిన చేపల్ని విడిచి పెట్టలేక ఒడ్డుకు తెచ్చి కేజీల ధరల్లో అమ్మకాలు చేస్తుంటాం. అధిక శ్రమకోర్చి ఎండబెట్టి అమ్మకాలు జరుపుతాం. వర్షాల సమయంలో తీరం ఒడ్డునే చేపలు కుళ్లిపోతుంటాయి. – చీకటి ధర్మారావు, మత్స్యకారుడు, డొంకూరు -
గంజాయి కేసులో ఇద్దరు విద్యార్థులు అరెస్టు
రణస్థలం: విజయవాడలోని ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులను జేఆర్పురం పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జేఆర్పురం పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో సీఐ ఎం.అవతారం, ఎస్ఐ చిరంజీవిలు వివరాలు వెల్లడించారు. పైడిభీమవరం భూమాత టౌన్షిప్ వద్ద 22.5 కేజీల గంజాయితో 10 మంది నిందితులను ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన పట్టుకోవడం జరిగిందన్నారు. అరైస్టెన కొప్పెర్ల గ్రామానికి చెందిన ఇనాకోటి ముకుందను విచారించగా.. అతని వద్ద నుంచి యూనివర్సిటీలో చదువుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ నఫీజ్, గుంటూరు జిల్లాకు చెందిన కమ్మిశెట్టి వినోధ్ కుమార్లు గంజాయి కొనుగోలు చేస్తుంటారని తెలిసింది. వీళ్లు గంజాయి సేవించి అనంతరం యూనివర్సిటీలో గంజాయికి అలవాటుపడ్డ విద్యార్థులకు అమ్ముంతుంటారని పేర్కొన్నారు. దీంతో విజయవాడ వెళ్లి మూడు రోజులు నిఘా వేసి ఎస్ఐ చిరంజీవి, సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిని జ్యూడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. -
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
నరసన్నపేట: లండన్లో నిర్వహిస్తున్న వరల్డ్ టూరి జం మేనేజ్మెంట్ (డబ్ల్యూటీఎం) కార్యక్రమంలో నరసన్నపేట కూచిపూడి నృత్యాలయం నిర్వహకురాలు కీర్తిప్రియ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ తరుపున కీర్తిప్రియ పాల్గొని ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద నృత్యప్రదర్శన ఇచ్చారు. కాగా ఈ కార్య క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఫర్నీచర్ షాప్లో చోరీ వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర రహదారిలో ఉన్న మోడ్రన్ ఫర్నీచర్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు అందించిన వివరాల మేరకు.. రాజాం గ్రామానికి చెందిన చెల్లూరి సోమేశ్వరరావు గత కొంతకాలంగా ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్న చోరీ ఘటనలో 20 ఎలక్ట్రికల్ యంత్ర పనిముట్లు, ఆదే ప్రాంగణంలో ఉన్న మినీ ట్రాక్టర్ను దొంగలు అపహరించుకుపోయారు. షాప్ ప్రధాన తలుపునకు వేసి ఉన్న తాళం విరగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగానే బుధవారం ఉదయం షాపునకు వెళ్లేసరికి చోరీ జరిగినట్లు గుర్తించిన యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిమార్ తెలిపారు. చోరీకి గురైన సొత్తు రూ.6 లక్షలు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్లకు అమ్ముడుపోతున్నాయి ● చింతా మోహన్ విమర్శ శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. ఇక్కడ బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డేటా సెంటర్ కోసం గూగుల్కు వేల కోట్ల ప్రయోజనాలు కల్పించడాన్ని ప్రస్తావిస్తూ.. చిన్న సంస్థలకు రాయితీలు ఇవ్వాలి కానీ, కార్పొరేట్ సంస్థలకు అవసరం లేదన్నారు. దేశంలో వ్యవసాయం సంక్షోభంలో కొనసాగుతుందని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు అవసరం లేదన్నారు. అవినీతిని ప్రశ్నించే మీడియా సంస్థలను సైతం తొక్కేసే పరిస్థితి కొనసాగుతోందన్నారు. కాశీబుగ్గ ఘటన ప్రభుత్వం, నిఘా వర్గాల వైఫల్యమన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. బైక్ను ఢీకొన్న కారు పాతపట్నం: మండలంలోని పాతపట్నం – టెక్కలి రహదారి ప్రహరాజపాలేం వద్ద ఒక కారు బైక్ను ఢీకొనడంతో పెద్దలోగిడి గ్రామానికి చెందిన విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాన్ లంక సోమశేఖరరావుకు తీవ్రగాయాలయ్యాయని ఏఎస్ఐ కె.రామమూర్తి తెలిపారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన లక్కోజీ లక్ష్మణరావు కారులో బుధవారం మధ్యాహ్నం పాతపట్నం నుంచి కొత్తకోటకు పయనమయ్యారు. ప్రహారాజపాలేం వద్దకు వచ్చేసరికి ఎదురుగా ద్విచక్ర వాహనంపై పెద్దలోగిడికి చెందిన సోమశేఖరరావు వస్తుండగా అదుపుతప్పి ఢీకొన్నాడు. ప్రమాదంలో సోమశేఖరరావుకు కుడికాలు విరిగింది. దీంతో స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఏఎస్ఐ కె.శ్రీరామమూర్తి సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కిమ్స్ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్యుడు రామలింగేశ్వర్ ఏడో నెలలో పుట్టిన చిన్నారిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. పలాసకు చెందిన గర్భిణీ రేవతి ఏడో నెలలో ఉమ్మనీరు లేకపోవడంతో కిమ్స్ ఆస్పత్రికి మూడు నెలల క్రితం విచ్చేసింది. దీంతో వెంటనే రేవతిని ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయడంతో చిన్నారికి జన్మనిచ్చింది. అయితే చిన్నారి 700 గ్రాములతో పుట్టడంతో శ్వాసకోశ, ప్లేట్లెట్స్ తదితర సమస్యలు వచ్చాయి. దీంతో దాదాపు మూడు నెలలు అత్యాధునిక చికిత్స అందించి బుధవారం డిశార్చి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. చిన్నారి తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషి చేస్తోందని వివిధ ఉద్యోగ, పౌర సంఘాల ప్రతినిధులు కొనియాడారు. స్థానిక ఎన్జీవో హోమ్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ అధ్యక్షత బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సదాశివుని కృష్ణ, జి.లక్ష్మణరావు, జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నేతలు బొడ్డేపల్లి ప్రసాదరావు, ఎస్.జోగినాయుడు, జి.షణ్ముఖరావు, డోల శంకరావు, డోల అప్పన్న, సీహెచ్ నాగభూషణ్, టెంక శ్రీను, రౌతు సూర్యనారాయణ, భేరి చిన్నారావు, జి.నర్సింగరావు, గంగు మన్మథరావు, బాసూరు సాయి, డి.నందికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కూర్మనాథాలయంలో నీటి లీకులపై పరిశీలన
గార: ఆది కూర్మక్షేత్రంలోని రాతికట్టడం నుంచి లక్ష్మీసన్నిధి వద్ద వర్షపు నీరు లీకువుతుండటం వంటి సమస్యలపై రాష్ట్ర పురావస్తు శాఖాధికారి డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్, పలువురు అధికారులు బుధవారం సందర్శించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి ఈ ఏడాది పర్యటన సమయంలో స్థానిక అర్చకులు, భక్తులు తెలిపిన సమస్యల్లో నీటి లీకులపై చెప్పడంతో అధికారులు పర్యటన చేపట్టారు. రాతికట్టడాలు మరమ్మతులు చేసేందుకు సాధ్యాసాద్యాలపై పరిశీలించారు. రాళ్ల మధ్య ఏర్పడిన ఖాళీలు పూడ్చేందుకు నిపుణులతో చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నివేదికను అందజేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు, సహాయ సంచాలకులు ఎస్.వెంకటరావు, ఏడీ ఇంజినీరింగ్ భాస్కర్నాయక్ పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాల సందర్శన
మెళియాపుట్టి: ఇటీవల బందపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా గిరిజన సంఘం కార్యదర్శి నిమ్మక అప్పన్న బుధవారం పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై విద్యార్థులు, సిబ్బందికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశీలించామని ప్రహరీ లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మౌలిక సదుపాయాలు సంతృప్తికరంగా లేవన్నారు. సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. ఆయనతో పాటు అరిక మన్మథరావు, సవర భాస్కరరావు, బి.గవరయ్య తదితరులు ఉన్నారు. -
మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ
ఇచ్ఛాపురం: పట్టణానికి చెందిన ఏఎస్ఐ తెలుకుల రామారావు అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. సుమారు 65 ఏళ్ల డబ్బూరి నారాయణారావు అనే వృద్ధుడు బిక్షాటన చేస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జీవనం సాగించేవాడు. అయితే నాలుగు రోజుల క్రితం ఆయన కాంప్లెక్స్ ఆవరణలో అనారోగ్యానికి గురవ్వడంతో స్థానికులు అతడిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ పోలీస్స్టేషన్ రైటర్ రంజిత్ వివరాలు నమోదు చేశారు. దీంతో కంచిలిలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రామారావు సమాచారం తెలుసుకొని వృద్ధుడి మృతదేహాన్ని అంతిమయాత్ర రథంపై బాహుదానదికి తీసుకెళ్లి హిందూ సాంప్రదాయబద్దంగా కుమార్తె గీత సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ కానిస్టేబుల్గా విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 20 ఏళ్లుగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు. అలాగే వారికి పెద్దకర్మ చేసి పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తుంటానని పేర్కొన్నారు. ఇప్పటివరకు 65 అనాథ మృతదేహాలకు ఈవిధంగా అంత్యక్రియలను నిర్వహించానని పేర్కొన్నారు. దీంతో ఏఎస్ఐను పలువురు అభినందించారు. -
పగలు డంపింగ్.. రాత్రి లోడింగ్..!
● యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ● ట్రాక్టర్లతో ఒడిశా తరలిస్తున్న వైనం ● రూ.కోట్లకు పడగలెత్తుతున్న ఇసుకాసురులు కడుము కాలనీ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కొత్తూరు: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఆయా పార్టీల నేతలకు వరంగా మారింది. పేరుకే ఉచిత ఇసుక పథకం తప్ప వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ట్రాక్టర్ ఇసుకకు రూ.వేలల్లో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉచిత ఇసుక పాలసీ కూటమి నేతల ధనార్జనకు మార్గమైంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల చేత నదిలో ఉన్న ఇసుకకు ట్రాక్టర్కు లోడు చేయించాలి. అయితే అందుకు భిన్నంగా మండలంలోని కడుము కాలనీ, వసప గ్రామాల వద్ద ప్రొక్లెయినర్లతో లోడింగ్ చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు వసప, కడుము గ్రామాల వద్ద వంశధార నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమార్కులకు ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఇసుక తరలింపుతో రోజుకు రూ.లక్షల్లో ఇసుకాసురులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నదిలో ప్రొక్లెయినర్లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేసి ఒక్కో ట్రాక్టర్కు రూ.500ల నుంచి రూ.1,000ల వరకు వసూలు చేస్తున్నారు. అంధ్రా నుంచి ఒడిశాకు ఇసుక తరలించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వంశధార నది నుంచి పగలంతా ట్రాక్టర్లతో కడుము కాలనీ, గొట్లభద్ర, కిమిడి–వారణాసి రోడ్లకు ఆనుకొని ఇసును డంపింగ్ చేసి ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తున్నారు. అనంతరం ఈ అక్రమ నిల్వలను రాత్రులు టిప్పర్లు, ట్రాక్టర్లతో ఒడిశాకు తరలిస్తున్నారు. అక్రమ ఇసుక వ్యవహారం కొంతమంది కూటమి నేతలు అండదండలతో యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమంగా రవాణా చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ అధికారుల మాటలను అక్రమార్కులు బేఖాతరు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం కడుము, కడుము కాలనీ, వసప గ్రామాల వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వసప వద్ద అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. నదిలో నుంచి ఇసుక తవ్వకాలు జరగకుండా ఉండేందుకు కందకాలు తవ్వడం జరిగింది. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటాం. – కె.బాలకృష్ణ, తహసీల్దార్, కొత్తూరు మండలం -
మాల్యావంత్ ఉత్సవాలకు సన్నద్ధం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి కార్యాలయంలో సమితి స్థాయి మాల్యావంత్ ఉత్సవాలపై బుధవారం సమితి కార్యాలయం సభ గృహంలో కలిమెల సమితి బీడీఓ ప్రదీప్ కుమార్ కర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు కలిమెల సమితి కార్యాలయ వేనుక భాగంలో ఉన్న తుంబాగుడా సమీపంలో గల కొత్తగా నిర్మించిన క్రీడా మైదానంలో మాల్యావంత్ ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సమితిలో మొత్తం 23 పంచాయతీల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని గిరిజనులు నృత్యాలు ప్రదర్శిస్తారని బీడీఓ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రతినిధి హరి విలాస్ మండాల్, కలిమల ఐఐసీ ముకుందో మేల్కా, బీజేపీ జిల్లా కర్యదర్శి భవానీశంకర్ ముఖర్జి, స్థానిక సర్పంచ్ పృథ్వీరాజ్ మాఝి, సమితి కార్యాలయ సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు. -
ఘనంగా రఘునాథ్ పట్నాయక్ జయంతి
జయపురం: ఒడిశా మాజీ మంత్రి (ఆర్థిక, న్యాయశాఖ) రఘునాథ్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయని వక్తలు అన్నారు. బుధవారం పట్నాయక్ జయంతిని జయపురంలో గల కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ భవనం, స్థానిక పవర్ హౌస్ కాలనీ కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద జయంతిని నిర్వహించారు. ఉత్కళ సమ్మిళిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కేవీకే సమాచార్ పత్రిక సంపాదకులు బినోద్ మహాపాత్ర మాట్లాడుతూ రఘునాథ్ పట్నాయక్ రాష్ట్ర ప్రగతికి, కొరాపుట్ జిల్లా ఉన్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. ఉత్కళ సమ్మిళిని జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ నాయక్, కన్వీనర్ నవీన మదల, ప్రతాప్ మదల, నవీన నాయక్, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షులు హరిహర కరసుధా పట్నాయక్, దుర్గా శతపతి, శివ పట్నాయక్, పియూష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రఘునాఽథ్ పట్నాయక్ విగ్రహానికి ఆయన పెద్ద కుమారుడు, కాంగ్రెస్ నేత బిరెన్ మోహన్ పట్నాయక్ నివాళులర్పించారు. డీసీసీ కార్యాయంలో పట్నాయక్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
చిరుధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్
ఆమదాలవలస: చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన చిరుధాన్యాల సాగు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వృత్తి శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. దీంతో శిక్షణ పొందిన రైతులకు కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో పాల్గొనేవారు ఉపాధి అవకాశాలను సృష్టించుకునేలా ప్రయత్నించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతిబసు మాట్లాడుతూ మేజర్ మిల్లెట్స్ సాగు విధానం, వాటికున్న డిమాండ్ను వివరించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత మాట్లాడుతూ చిరుధాన్యాలు పోషక విలువలు కలిగి ఉంటాయన్నారు. రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్, డాక్టర్ జీఎస్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్గేమ్స్ అండర్–19 విజేత విశాఖ
● రన్నరప్తో సరిపెట్టుకున్న ఆతిఽథ్య శ్రీకాకుళం ● తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి, నాల్గో స్థానంలో చిత్తూరు ● నేటి నుంచి బాలికల క్రికెట్ సమరం శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్గా విశాఖపట్నం నిలిచింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో ఆతిధ్య శ్రీకాకుళం జట్టును సూపర్ఓవర్లో ఓడించి జయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం జరిగిన మరో కీలక మ్యాచ్లో చిత్తూరును పశ్చిమ గోదావరి జట్టు ఓడించింది. శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం/ఎచ్చెర్ల/చిలకపాలెం క్రీడామైదానాల వేదికలగా మూడు రోజులపాటు జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలుర చాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టేట్మీట్ పరిశీలకులు రాజేష్ గోల(కర్నూలు), ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ, ఎం.ఆనంద్కిరణ్, ఎ.డిల్లేశ్వరరావు, బి.లోకేశ్వరరావు, బి.మల్లేశ్వరరావు, జిల్లా ఒలంపిక్ సంఘం సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, గ్రిగ్స్ సెక్రెటరీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ సాగిందిలా.. స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల మధ్య ఫైనల్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విశాఖ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. 75 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేయడంతో స్కోర్ సమమైంది. ఫలితం తేల్చేందుకు మ్యాచ్ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జిల్లా జట్టు 7 పరుగులు చేసింది. 8 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు మూడు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. నేటి నుంచి మహిళా పోరు.. ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలికల చాంపియన్షిప్–2025–26 పోటీలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మైదానాలతోపాటు అవసరమైతే ఎచ్చెర్లలోని వెంకటేశ్వర, చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలల మైదానాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. -
ఆవిర్భవించనుంది: సీఎం
భువనేశ్వర్: ఒడిశా ఓడ రేవు ఆధారిత విస్తరణతో ఆర్థిక అభివృద్ధి విస్తరణలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. కార్తీక పూర్ణిమ పురస్కరించుకుని పారాదీప్ ఓడ రేవులో జరిగిన తెప్పోత్సవం (బొయిత బంధన్)–2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ విషయం ప్రకటించారు. వికసిత్ భారత్ 2047 ప్రణాళిక కింద 500 మిలియన్ టన్నుల వరకు కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో పారాదీప్ ఓడ రేవుకు మెగా పోర్టుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఒడిశా ఓడరేవు ఆధారిత అభివృద్ధి మరియు ఆర్థిక విస్తరణలో కొత్త అధ్యాయం ఆవిష్కరణలో భాగంగా రూ. 46,000 కోట్ల విలువైన ప్రధాన సముద్ర, పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తెప్పోత్సవం (బొయితొ బంధన్), బాలి జాతర కేవలం వేడుకలు కాదు, ఒడిశా యొక్క అద్భుతమైన సముద్ర వారసత్వం, మన పూర్వీకుల అజేయ స్ఫూర్తికి చిహ్నాలు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వారసత్వం ప్రపంచ శ్రేణి ఆశయాలతో ఒడిశా పురోగతిని ప్రేరేపిస్తుందన్నారు. రాష్ట్ర వృద్ధిలో పారాదీప్ పోర్టు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. పారాదీప్ ఆధునిక ఒడిశా ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రవేశ ద్వారంగా ఉనికిని బలపరచుకుంటుందన్నారు. గత దశాబ్దంలో ఓడరేవు సామర్థ్యం రెట్టింపు అయింది. 2015లో 71 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు పరిమితమైన పారాదీప్ ఓడ రేవు సామర్థ్యం 2025 నాటికి 150 మిలియన్ టన్నులకు పెరిగింది. ప్రస్తుతం దీర్ఘకాలిక జాతీయ దృక్పథంలో భాగంగా 500 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర మార్గ వ్యాపార, రవాణా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిని సారించింది. పారాదీప్ ఓడ రేవు -
బైక్ దొంగిలించి.. ప్రమాదానికి గురై
జయపురం: ఒక దొంగ మోటారు బైక్ను దొంగిలించి దానిపై పారిపోతుండగా ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలైన దొంగ ఉదంతమిది. ఈ సంఘటన జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి మహుళి పంచాయితీ బిచలకోట్ గ్రామంలో చోటు చేసుకుంది. నేటి మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బిచలకోట్ గ్రామంలో లిపు మహాపాత్ర తన మోటారు బైక్ను తన ఇంటిమందు ఉంచాడు. అయితే ఆ బైక్ ను ఒక దొంగ దొంగిలించి బొయిపరిగుడ వైపు పరారయ్యాడు. బైక్పై వెళ్తున్న సమయంలో మహుళి గ్రామ సమీప ఘాట్ రోడ్డులో ఒక బస్సును ఢీకొన్నాడు. ఆ ప్రమాదంలో బైక్ దొంగ రోడ్డు పక్కన పడగా తీవ్రంగా గాయ పడ్డాడు. స్థానికులు దొంగను బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్లో చేర్చారు. అతడిని మల్కనగిరి జిల్లా మటిగుడ గ్రామం రంజన్గా గుర్తించారు. బాలికపై లైంగిక దాడి! మల్కన్గిరి: మల్కన్గిరి సమితి పద్మాగిరి ప్రాంతాంలో 16 ఏళ్ల బాలికకు మరో బాలిక సాయంతో ఓ వ్యక్తి బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. పద్మాగిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు సోమవారం జోదిగూఢ శివాలయానికి వెళ్లారు. అయితే వారికి తెలిసిన దేవు బారోయి అనే యువకుడు బైక్పై ఇంటి వద్ద దింపుతానని నమ్మించి సమీప అడవిలోకి తీసుకొని వెళ్లిడు. అక్కడ స్నేహితురాలి సహాయంతో మద్యం తాగించి మత్తులోకి నెట్టిన అనంతరం అత్యాచారం జరిపాడు. ఈ విషయాన్ని బాలిక మంగళవారం ఇంట్లో చెప్పడం విషయం వెలుగుచూసింది. దీంతో మల్కన్గిరి ఆదర్శ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవ్ బారోయిపై ఐఐసీ రీగాన్కీండో కేసు నమోద్ చేశారు. తన సిబ్బందిని ఈ బుధవారం దేవు బారోయిను అరెస్టు చేసి మల్కన్గిరి పోలీసుస్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించినట్టు చెప్పారు. రెండు బైకులు ఢీ:ఒకరి మృతి మల్కన్గిరి: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొ న్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మల్కన్గిరి జిల్లా పోడియా సమితి కేంద్రంలోని హన్మాన్ మందిరం సమీపం బుధవారం మధ్యహ్నం మూడు గంటల ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కలిమెల వైపు నుంచి వస్తున్న యవకుడు రోహిత్ కూర్మి (28) ప్రాణాలు కోల్పోగా.. మరో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఏఎస్ఐ కేశవ్ భత్ర కేసు నమోద్ చేసి పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
ఘనంగా బొయితొ బొంధొనొ పూజలు
పర్లాకిమిడి: కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక శ్రీజగన్నాథ మందిరంలో సాయంత్రం దేవదీపావళిని నిర్వహించారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే దేవతల దీపావళిని కార్తీక పౌర్ణమి నాడు ఏటా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీమందిరం ఆవల మహిళలు సహస్ర దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీజగన్నాథ స్వామి ఓబడా ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. మహేంద్రతనయ నది వద్ద.. పర్లాకిమిడి: కార్తీక పౌర్ణమి సందర్భంగా మహేంద్రతనయ నది ఒడ్డున బుధవారం వేకువజాము నుంచి మహిళలు నదీ స్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలతో కూడిన డొప్పలు నదిలో వదిలారు. ఒడిశాలో దీనిని బోయితొ బొంధొనొ ఉత్సవంగా పిలుస్తారు. పురుషులు, మహిళలు నదీ స్నానాలు చేసి మహేంద్రతనయ నది గట్టు వద్ద తులసి పూజలు చేసి మహిళలు అరటిదోప్పలు పడవలుగా తయారుచేసి పండ్లు, దీపాలు, దక్షిణలతో పూజలు చేసి నదిలో వదులుతారు. మహేంద్రతనయ నది కార్తీక పౌర్ణమితో కిక్కిరిసి పోయింది. కార్తీక పౌర్ణమి సంధర్బంగా శ్రీకేదారీశ్వర వ్రతాలు పలు గృహాల్లో ఘనంగా జరుపుకున్నారు. జయపురంలో.. జయపురం: కార్తీక పౌర్ణమి సందర్భంగా జయపురంలో ప్రజలు భక్తితో పూజలు జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు చెరువుల వద్దకు చేరి స్నానాలు చేసి పూజలు జరిపి అరటి డొప్పలో దీపాలు వెలిగించి చెరువుల్లో వదిలారు. ఘనంగా బొయితొ బొంధొనొ కొరాపుట్: బొయితొ బొంధొన ఉత్సవంతో బుధవారం కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో ఉత్సాహం నెలకొంది. ఒడియా కార్తిక మాసం ముగింపు సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తమ తమ ప్రాంతాల్లో నదులు, చెరువుల్లో పడవలు వదిలి ఉత్సవం చేసుకున్నారు. శ్రీ క్షేత్రంలో కార్తీక కళ భువనేశ్వర్: కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీ మందిరం, సాగర తీరం జన సందోహంతో కిటకిటలాడింది. రద్దీ నియంత్రణ కోసం పట్టణంలో ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాగర తీరంలో లైఫ్ గార్డుల్ని ప్రత్యేకంగా మోహరించారు. బుధవారం వేకువ జాము నుంచి సాగర తీరం జనసందోహంతో కళకళలాడింది. ఆబాలగోపాలం తెప్పలు విడిచి పెట్టడంలో ఉత్సాహం ప్రదర్శించారు. సంకీర్తనలతో సాగర తీరం సరికొత్త వాతావరణం సంతరించుకుంది. -
సూడాన్లో ఒడిశా వ్యక్తి కిడ్నాప్
● విదేశాంగ శాఖకు ప్రభుత్వం లేఖభువనేశ్వర్: సూడాన్లో ఒడిశా వ్యక్తి కిడ్నాప్కు గురయ్యాడు. అక్కడి రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అతడ్ని బందీగా ఉంచినట్లు వార్తలు ప్రసారం అవుతున్నాయి. మరోవైపు బందిపోట్లు బాధిత వ్యక్తితో సంభాషణలతో కూడిన వీడియో ప్రసారం చేశారు. జగత్ సింగ్ పూర్ జిల్లా తిర్తోల్ పోలీస్ ఠాణా పరిధిలోని కొటొకొనా గ్రామానికి చెందిన ఆదర్శ్ కుమార్ బెహరా 2022 నుంచి సూడాన్లో పని చేస్తున్నాడు. అతడు అదృశ్యం అయ్యాడని అతని కుటుంబం ఇటీవల నివేదించింది. తల్లిదండ్రుల ఆవేదన ఆదర్శ్ కుమార్ బెహెరాను సూడాన్లో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మిలీషియా కిడ్నాప్ చేసింది. ఖార్టూమ్ నుంచి దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ ఫషీర్ నగరంలో ఆదర్శ్ను కిడ్నాప్ చేశారు. బందిపోట్లు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో తమ బిడ్డ ఇద్దరు ఆర్ఎస్ఎఫ్ సైనికుల మధ్య కూర్చున్నట్లు కనిపించాడు. వారిలో ఒకరు అతడిని, ‘నీకు షారుఖ్ ఖాన్ తెలుసా?’ అని అడిగాడు. ఆ తర్వాత ఆదర్శ్ భారత, ఒడిశా ప్రభుత్వాల నుంచి సహాయం కోసం వేడుకుంటూ ‘కిడ్నాపర్లు నన్ను అల్ ఫషీర్లో నిర్బంధించారు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా కుటుంబం, పిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు. నాకు సహాయం చేయాలని’ అభ్యర్థించాడని కుటుంబీకులు వాపోయారు. ఆదర్శ్ 2022లో దక్షిణ సూడాన్కు ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని చేయడానికి వెళ్లాడని అతని తండ్రి ఖేత్రబాసి బెహరా తెలిపారు. యుద్ధం కారణంగా అతని పనికి అంతరాయం కలిగింది, అతను ఒడిశాకు తిరిగి రాలేకపోయాడు. ఇంతలో అతడిని కిడ్నాప్ చేశారు. తన బిడ్డను సురక్షితంగా తీసుకురావాలని తండ్రి కోరారు. ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ జగత్సింగ్పూర్ పోలీసు సూపరింటెండెంటు అంకిత్ కుమార్ వర్మ మాట్లాడుతూ సూడాన్లో తమ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి దుస్థితి గురించి తెలుసుకున్న తర్వాత, అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు డైరెక్టర్ జనరల్కు తెలియజేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అతడ్ని సురక్షితంగా విడుదల చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రభుత్వం భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖను కోరింది. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ఆదర్శ్ కుమార్ బెహరాను ఆర్ఎస్ఎఫ్ ఉగ్రవాదులు ఘర్షణలతో అట్టుడుకుతున్న సుడాన్లోని అల్ ఫషీర్లో కిడ్నాప్ చేసిన విషయం మీడియా ప్రసారం ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సీనియర్ అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆదర్శ్ కుమార్ బెహరా విడుదలకు జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో సురక్షితంగా స్వదేశానికి తిరిగి పంపడం కోసం సూడాన్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం కోరుతూ న్యూ ఢిల్లీలోని రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్ శాఖను సంప్రదించారు. పరిస్థితిని పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కుటుంబానికి హామీ ఇచ్చారు. బిజూ జనతా దళ్ అధినేత మరియు ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతతో జోక్యం చేసుకోవాలని కోరారు. -
సైబర్ నేరాల పట్ల అప్రమత్తం
జయపురం: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ అన్నారు. స్థానిక నారాయణి ఆంగ్ల కళాశాల క్రీడా మైదానంలో పట్టణ పోలీసులు సైబర్ నేరాల నివారణ వారోత్సవాల సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. విజేతలకు కళాశాల డైరెక్టర్ అనికేత్ పట్నాయక్, కళాశాల అధ్యక్షురాలు నారాయణి పట్నాయక్, ప్రిన్సిపాల్ ప్రియంక మహారాణ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు అశేషంగా పాల్గొన్న సభికులను అలరించారు. ముఖ్యఅతిథి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కాశ్యప్, పట్టణ పోలీస్ అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్, సదర పోలీసు అధికారి సచింద్ర ప్రదాన్, జయపురం మహిళా పోలీస్ స్టేషన్ అధికారి ఆశ్రిత ఖల్కే, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్శణగా ఓటీవీ నటుడు దేవభ్రత జెనా నిలిచారు. జెనాను నిర్వాహకులు ప్రత్యేకంగా సన్మానించారు. సైబర్ నేరాలపై ప్రదర్శించిన నాటిక ప్రజలను చైతన్యపరిచింది. -
దత్తత శిశువుని సంరక్షించిన అధికారులు
కొరాపుట్: అక్రమంగా దత్తత తీసుకొన్న శిశువుని అధికారులు సంరక్షించారు. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రికి పట్టణంలోని గులిపట్నకి చెందిన జామి సునీల్ కుమార్, నందిత ప్రియ దర్శిని దంపతులు బుధవారం తమ శిశువుని అనారోగ్యంతో తెచ్చారు. బాధిత 11 రోజుల ఆడ శిశువు ధ్రువపత్రాలు వైద్య సిబ్బంది అడిగారు. అంతేకాక తల్లి ఎవరని ప్రశ్నించారు. దీంతో ఆ దంపతులు అక్కడ నుంచి జారుకున్నారు. వెంటనే వైద్య సిబ్బంది ఈ సమాచారం జిల్లా ముఖ్య వైద్యాధికారి సంతోష్ పండాకి ఇచ్చారు. సంతోష్ పండా జిల్లా చైల్డ్ ప్రోటెక్షన్ అధికారి సురేష్ పట్నాయక్కి సమాచారం ఇచ్చారు. సురేష్ పోలీసుల సహాయంతో దంపతుల ఇంటికి వెళ్లి శిశువు వివరాలు అడిగారు. స్పందించిన దంపతులు తాము శిశువుని దత్తత తీసుకొన్నామని కానీ అసలు తల్లిదండ్రుల వివరాలు చెప్పలేమన్నారు. వెంటనే అధికారులు శిశువుని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కి చెందిన అజంతా ప్రియదర్శినికి అప్పగించారు. ప్రస్తుతం శిశువు నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో సంరక్షణాలయంలో ఉంది. మరో వైపు ఉమ్మర్కోట్ పోలీసులు జామి సునీల్ కుమార్, నందితా ప్రియ దర్శిని దంపతులపై కేసు నమెదు చేశారు. -
సెమీఫైనల్కు దూసుకెళ్లిన శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్గేమ్స్ స్టేట్మీట్ క్రికెట్ టోర్నీలో ఆతిథ్య శ్రీకాకుళం బాలురు జట్టు సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్స్ మ్యాచ్లో పటిష్టమైన కృష్ణా జిల్లాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీకాకుళం వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 పరిమిత ఓవర్ల క్రికెట్ ఛాంపియన్షిప్–2025–26 పోటీల్లో భాగంగా రెండో రోజు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగాయి. లీగ్ కమ్ నాటౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంతోపాటు ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల మైదానం, సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీదామైదానం, చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానం నాలుగు వేదికల్లో మ్యాచ్లను నిర్వహించారు. హోరాహోరిగా పోరు.. రెండవ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో గుంటూరు జిల్లాపై జయభేరి మోగించిన పశ్చిమగోదావరి జట్టు సెమీఫైనల్స్లో అడుగుపెట్టింది. మిగిలిన మరో రెండు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆట నిలిపివేశారు. చిత్తూరు–తూర్పుగోదావరి జట్ల మద్య జరుగుతున్న మూడవ క్వార్టర్ఫైనల్ మ్యాచ్ రక్తికట్టింది. ఇరుజట్ల స్కోర్లు సమానం కావడంతో సూపర్ఓవర్ నిర్వహించగా.. అందులోను ఇరు జట్ల స్కోర్లు సమానయ్యాయి. రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించే సమయానికి లైట్ఫెయిల్ కావడంతో బుధవారం సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించనున్నారు. బుధవారంతో బాలు ర క్రికెట్ పోటీలు ముగియనున్నాయి. రెండు సెమీఫైనల్స్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్, మూడవ స్థానం కోసం మరో మ్యాచ్ కలిపి మొత్తం నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. మధ్యాహ్నం విజేతలకు బహుమతులు అందిస్తారు. గురువారం నుంచి బాలికల పోటీలు మొదలుకానున్నాయని ఎస్జీఎ ఫ్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా సెక్రటరీ ఆర్.స్వాతి తెలిపారు. -
వైభవంగా మహాభజన సమారోహణ
పర్లాకిమిడి: పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా పర్లాకిమిడి శ్రీజగన్నాథ మందిరం ఆవరణలో మంగళవారం సాయంత్రం మహాభజన సమారోహణ కార్యక్రమాన్ని కళా సంస్కృతి సేవా ట్రస్టు, హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఆధ్వర్యంలో జరిగినది. తొలుత శ్రీజగన్నాథ స్వామికి జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించగా సమలై నృత్య కళాకారులు, మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ, సమలై నృత్య అకాడమీ ఆధ్వర్యంలో డ్యాన్స్ కార్యక్రమాలు ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు. అనంతరం కుమారి తపస్వీ కోరో...అలిగిరి నందినీ.. పాటతో డ్యాన్సుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. భువనేశ్వర్కు చెందిన శ్రీచరణ్ మహాంతి, అంజిలీ మిశ్రా భక్తిగీతాలతో ప్రేక్షకులను తన్మయ పరిచింది. హైటెక్ గ్రూప్ చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి వేదికపై కుమారీ తపస్వీకోరోకు రూ.5 వేలు, మెమొంటోతో సత్కరించారు. అలాగే మిరాకిల్ డ్యాన్సు అకాడమీ అధినేత శథపతి, సమలై నృత్య అకాడెమీ నిర్వాహకులు బాలకృష్ణ పాణిగ్రాహికి మెమొంటోలతో సత్కరించారు. -
నేడే ఎందువ కై లాసగిరి ప్రదక్షిణ
జి.సిగడాం: మండలంలోని ఎందువ గ్రామంలో కై లాసిగిరి కొండపై వెలసిన కై లాశేశ్వర క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు భారీ పోలీసు బందోస్తు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. మంగళవారం గ్రామంలో కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం 5 గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11 గంటలకు 21 అడుగుల శివపార్వతుల విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. సాయంత్రం కై లాసగిరి శిఖరంపై అఖండ జ్యోతి ప్రజ్వలన జరుగుతుందని, వేదపండితులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జె.ఆర్.పురం సీఐ అవతారం, తహసీల్దార్ మహాదేవు సరిత, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు, ఎస్ఐ వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష ఎందువలో పర్యటించి ఏర్పాట్లపై ఆరా తీశారు. -
సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఆర్ట్స్, సైన్స్, పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 9 నుంచి జరగనున్నాయని, ఈ నెల 21లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని వర్శిటీ పీజీ, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయబాస్కర్ తెలిపారు. బీటెక్ ఏడు, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, వీటికి ఈ నెల 17లోగా ఫీజు చెల్లించాలన్నారు. బీటెక్ మూడు, ఐదు సెమిస్టర్లు డిసెంబర్ 10 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయని, ఈ నెల 24లోగా ఫీజు చెల్లించాలన్నారు. బీఈడీ (ఎంఆర్) మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 13నుంచి జరగనున్నాయని, ఫీజు ఈ నెల 6లోగా చెల్లించాలని సూచించారు. బీఈడీ మినహా మిగతా సెమిస్టర్ల పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతాయని వివరించారు. బీఆర్ఏయూ.ఈడీయూ.ఇన్లో షెడ్యూల్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. నదిలో యువకుడి మృతదేహం ఎచ్చెర్ల : శ్రీకాకుళం మంగువారితోటకు చెందిన బలగ సాయి (25) అనే యువకుడు మృతదేహం ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు పంచాయతీ కాళింగపేట సమీపంలోని నాగావళి నదిలో మంగళవారం లభ్యమయ్యింది. శనివారం ఇంటిని బయటకు వెళ్లి తిరిగి చేరలేదు. మంగళవారం సాయంత్రం నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సీఆర్జెడ్ సమస్యపై ఆరా గార: వత్సవలస పంచాయతీ మొగదాలపాడు గ్రామం సీఆర్జెడ్లో ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయిప్రత్యూష మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోస్టల్ రెగ్యులర్ జోన్లో గ్రామంలో చాలా భాగం ఉండటంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో తహశీల్దార్ ఎం.చక్రవర్తి, అధికారులతో కలిసి సరిహద్దులను పరిశీలించారు. రెవున్యూ మ్యాపుల ఆధారంగా సమస్యను గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ– క్రాప్ నివేదికలు ఆధారంగా కొన్ని పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పాముకాటుకు వృద్ధురాలు మృతి నందిగాం: బోరుభద్రకు చెందిన తిర్లంగి అమ్మన్న (69) అనే వృద్ధురాలు పాముకాటు కారణంగా మృతి చెందింది. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మన్న నాలుగు రోజులు కిందట ఇంటి పెరటిలో ఉన్న మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడ పాము కరవడంతో కుటుంబసభ్యులకు విషయం తెలిసి మంత్రగాడి వద్దకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అమ్మన్నకు దివ్యాంగుడైన కుమారుడు మల్లేశ్వరరావు ఉన్నారు. నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బారులు తీరిన లారీలు కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద భారీ వాహనాలు బారులు తీరాయి. ఒడిశా నుంచి ఒకేసారి 15 భారీ లారీలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. బత్తిలి, భామిని గ్రామాల మీదుగా ఇవి ఒకేసారి కొత్తూరులోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. -
కార్తీక శుభాకాంక్షలు
భువనేశ్వర్: ఏటా కార్తీక పూర్ణిమ పురస్కరించుకుని రాష్ట్రంలో బొయితొ బొంధొనొ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రాచీన నావికా వ్యాపార సంప్రదాయం ప్రతీకగా ఏటా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. అలనాటి నావికా వ్యాపారంలో ఒడియా ప్రజల ప్రాముఖ్యతని వివరించే సంక్షిప్త సైకత యానిమేషన్ వీడియోని అంతర్జాతీయ సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహు చిత్రీకరించాడు. పొరుగు దేశాలతో వ్యాపారం కోసం పడవల్లో బయల్దేరే వ్యాపారులకు వారి భార్యలు వీడ్కోలు పలికే సంప్రదాయ శైలిని ఈ వీడియోలో చిత్రీకరించాడు. ఒక నిమిషం నిడివితో చిత్రీకరించిన ఈ యానిమేషన్ తయారీకి నిరవధికంగా 2 గంటలపాటు శ్రమించినట్లు మానస్ తెలిపాడు. ఈ కళాత్మక సైకత యానిమేషన్ ద్వారా ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపాడు. -
పౌష్టికాహారంపై అవగాహన
జయపురం: ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సెంటర్ జయపురం వారు గర్భవతి, ప్రసూతి మహిళలు, శిశు ఆరోగ్యం, పౌష్టికాహారం, ఆదివాసీ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలపై ఒక సెమినార్ నిర్వహించారు. లమతాపుట్ సమితి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సెమినార్లో లమతాపుట్ సమితిలో 10 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల నుంచి 8మంది కమ్యూనిటీ డాక్టర్లు, 10 మంది మహిళా హెల్త్ వర్కర్లు, ముగ్గురు ఆర్సీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. బహుళ ఆదివాసీ జిల్లాల్లో ఆదివాసీ ప్రజల ఆరోగ్య సమస్యలు దూరం చేసేందుకు విల్ అండ్ మిలెండ్ గెట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ సెమినార్ నిర్వహించినట్లు ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ వారు వెల్లడించారు. ఆదివాసీల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ మార్గాలపై అవగాహన కల్పించారు. -
42 వినతుల స్వీకరణ
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో 42 వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు. బొరిగుమ్మ పంచాయతీ సమితి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన శిబిరంలో జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యభాన్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరై వినతులు స్వీకరించారు. 27 వినతులు వ్యక్తిగతం కాగా 15 సామూహిక సమస్యలపై వచ్చినవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అనంతరం ఇద్దరు దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ మహాజన్ వీల్చైర్లు, 29 మహిళా స్వయం సహాయక గ్రూపులకు రూ. 1.59 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. జయపురం సబ్కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, సీడీవో బేణుధర శబర, డీపీవో జుగల్ కిశోర్ నాయిక్, బొరిగుమ్మ సబ్డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక, జిల్లాసంక్షేమ అధికారి సునీల్ తండి, బీడీవో సుకాంత కుమార్ పట్నాయక్, బొరిగుమ్మ సమితి చైర్మన్ దీప్తిమయి నాయిక్ ఉన్నారు. -
బెల్టు నిర్వాహకులపై బైండోవర్ కేసులు
ఇచ్ఛాపురం రూరల్ : అక్రమంగా నాటుసారా, బెల్టు షాపుల నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ప్రొహిబిషన్ సీఐ పి.దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన 18 మంది బెల్టుషాపు నిర్వాహకులను, పాత కేసులలోని ముద్దాయిలను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి తహసీల్దార్ ఎన్.వెంకటరావు సమక్షంలో బైండోవర్ నమోదు చేశారు. ఇకపై సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. బెల్టు షాపుల నిర్వహణ, నాటుసారా అమ్మకం చేస్తున్నట్లు తెలిస్తే తమకు 14405 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందజేయలని కోరారు. ఎకై ్సజ్ ఎస్ఐ జీసీహెచ్వి రమణారావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టు వద్దు మందస : బిడిమి గ్రామంలోని జుత్తు జగన్నాయికులు భవనంలో పలాస ఆర్డీవో వెంకటేష్ మంగళవారం భూ సర్వే పేరిట గ్రామస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బిడిమి రెవెన్యూ గ్రామంలోని పెద్ద బిడిమి, తిమ్మల బిడిమి, కొత్త బిడిమి, శ్రీరామ్నగర్ గ్రామాలకు చెందిన రైతులంతా పాల్గొని తమకు కార్గో ఎయిర్పోర్టు వద్దని ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యులైన కొమర వాసు, జోగి అప్పారావు, బత్తిన లక్ష్మణ్లను పోలీసులు నిర్బంధించి.. బిడిమి రెవెన్యూ భూములకు సంబంధం లేని వారిని సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చారని వాగ్వాదానికి దిగారు. తక్షణమే కార్గో ఎయిర్ పోర్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ స్పందిస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్లో నిర్వహించనున్నట్టు ఎన్ఏజే జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సత్తారు భాస్కరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కృష్ణ, జి.లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, బాధ్యతలు, చట్టాలు అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ, పాత్రికేయ సంఘాలు, పాత్రికేయ మిత్రులు పాల్గొనాలని కోరారు. 9న శిష్టకరణ శతాబ్ది స్థూపావిష్కరణ శ్రీకాకుళం కల్చరల్ : అఖిల భారత శిష్టకరణ సంఘం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 9న జలుమూరులో శతాబ్ది స్థూపావిష్కరణ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆలిండియా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు డబ్బీరు వెంకట కృష్ణారావు మంగళవారం తెలిపారు. 1925లో జలుమూరు వేదికగా జాతీయ స్థాయి శిష్టకరణ సంఘం ఏర్పాటైందన్నారు. నాటి నిరక్షరాస్యత, వెనుకబడిన సమాజాన్ని చైతన్య పరచడంలో శిష్టకరణాల పాత్ర కీలకమన్నారు. అఖిల భారత శిష్టకరణం సంఘం నాయకుల తీర్మాన, ఆహ్వానం మేరకు శిష్టకరణ బంధువులంతా వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
‘టీచర్లకు సమన్యాయం చేయాలి’
జయపురం: కొరాపుట్ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సమన్యాయం చేయాలని ఒడిశా నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కొరాపుట్ జిల్లా శాఖ కొరాపుట్ జిల్లా విద్యాధికారికి విజ్ఞప్తి చేశారు. కొరాపుట్ జిల్లా నాన్ గెజిటెడ్ కర్మచారీ సమన్వయ సమితి అధ్యక్షుడు శశిభూషణ దాస్ నేడు జిల్లా విద్యాధికారిని కలిసి జిల్లాలో పని చేస్తున్న వారు తమ సమస్యలను సంఘ దృష్టికి తీసుకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యాయుల పది డిమాండ్లను ఒక మెమోరాండం పొందుపరచి జిల్లా విద్యాధికారికి అందజేశారు. కొరాపుట్ జిల్లాలో పని చేస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి సముచిత న్యాయ చేయాలని, ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయమైనవి అని శశిభూషణ దాస్ విద్యాధికారికి వివరించారు. కర్మచారి సమన్వయ సమితి డిమాండ్లను పరిశీలించి ఉచిత నిర్ణయం తీసుకుంటామని విద్యాధికారి హామీ ఇచ్చినట్లు సమన్వయ సమితి అధ్యక్షులు శశిభూషణ దాస్ తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో మూగజీవాలు మృతి
రణస్థలం: పాతర్లపల్లి పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో పాడిరైతు పిన్నింటి అప్పలనాయుడుకు చెందిన పశువుల షెడ్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రెండు ఆవులు, నాలుగు దూడలు మృతి చెందాయి. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో షెడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెక్క దూలాలకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న ఆటో, స్కూటీలతో పాటు వాటర్ పైపులకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అదే షెడ్లో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందర్ సిబ్బందితో వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో సుమారు రూ.5లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. పాతర్లపల్లి పశువర్థక అధికారి డి.చంద్రశేఖర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు పిన్నింటి సాయికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిహారాన్ని అందేలా కృషి చేస్తానని రైతును ఓదార్చారు.ఆయన వెంట సర్పంచ్ గొర్లె రాధాకృష్ణ, నాయకులు మహంతి పెదరామినాయుడు, వెంకటప్పలనాయుడు, పిన్నింటి శ్రీచరణ్, మహంతి అప్పలనాయుడు, గొర్లె కన్నా, వాళ్లే అప్పలన్న, లంక హరీష్, గొర్లె సత్యం, వలిరెడ్డి సూరిబాబు తదితరులు ఉన్నారు. -
కలిమెల సమితిలో ప్రత్యేక గ్రీవెన్స్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మహరాజ్పల్లి పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలిమెల సమితిలోని పలు పంచాయతీల నుంచి 58 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిని పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓ దివ్యాంగురాలి సమస్యను కలెక్టర్ తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ సోభరో, జిల్లా సబ్ కలెక్టర్ అశ్ని ఏఎల్ పాల్గొన్నారు. -
వామపక్ష పార్టీలు బలపడితేనే సుస్థిరత
జయపురం: ప్రపంచంలో పలు దేశాలలో కమ్యూనిస్టు పార్టీ, వామపక్షాలు బలపడి ఉండగా, కొన్ని దేశాలలో సామ్రాజ్యవాద శక్తులు తలెత్తుతున్నాయ ని వాటి వల్ల ప్రజాస్వామ్యానికి, ప్రజలకు పెను ముప్పు ఏర్పడుతుందని ఒడిశా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహతి అన్నా రు. జయపురం సమితి బొయిపరిగుడలో కమ్యూ నిస్టు పార్టీ జోనల్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జోనల్ కమ్యూనిస్టు నేత లయిచన్ ముదులి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సెప్టెంబర్ 21 నుంచి 25 వ తేదీ వరకు చండీగఢ్లో జరిగిన అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలో చర్చ అంశాలను కార్యకర్తలకు వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే ప్రపంచానికి నేతగా వ్యవహరిస్తున్నారని, అయితే చైనా, రష్యా, భారత్ల కలవటం అతడికి ఆందోళన కలిగిస్తోందన్నారు. పాలస్తీనాకు అండగా వామపక్షాలు ఉండటంతో సామ్రాజ్య వాదులకు కన్నెర్రగా ఉందన్నారు. ప్రపంచంలో వామపక్షాలు బలపడిన నాడే సుస్థిరత వస్తుందని తెలిపారు. 2014 లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత దేశంలో మత విబేధాలు పెరిగాయని, ధర్మ నిరపేక్ష, నీతి మంటగలిసిందని, రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాల పై నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించేందుకు చర్యలు చేపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష పాలనలోగల కేరళ రాష్ట్రం దేశంలో ప్రథమ పేదరిక విముక్త రాష్ట్రంగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. దేశంలో వామపక్ష పాలన వచ్చి నాడు దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, కార్యదర్శి రామకృష్ణ దాస్ ప్రసంగిస్తూ బొయిపరిగుడ జోన్లో అధిక సభ్యులను చేర్చేందుకు కార్యకర్తలు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బుధ్ర బొడొనాయిక్, బొయిపరిగుడ జోనల్ కార్యదర్శి బలభధ్ర భోయి,యువ నేత మధు జాని,జోనల్ సహాయ కార్యదర్శి రామ పంగి తదితరులు పాల్గొన్నారు. -
చిత్తరంజన్కు అనురంగ అవార్డు
భువనేశ్వర్: హైటెక్ సంస్థలో ఒడియా భాష, సాహిత్య విభాగంలో సీనియర్ అధ్యాపకుడు, ప్రఖ్యాత అంతర్జాతీయ ఒడిస్సీ నృత్య కళాకారుడు డాక్టర్ చిత్తరంజన్ సహాణి ఈ ఏడాది అనురంగ–2025 సత్కారం పొందారు. భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ సౌజన్యంతో స్థానిక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైజర్) నిర్వహించిన అనురంగ్–2025 సాంస్కృతిక కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందజేశారు. తరాలు మారుతున్నా వెజ్ఞానిక ప్రపంచాన్ని కళలు మరియు సంస్కృతి, సంప్రదాయాలు ఆకర్షిస్తూనే ఉన్నాయి. నృత్యం, సంగీతం మరియు సాహిత్యం ఒక జాతి ఔన్నత్యానికి అద్దం పడతాయని ప్రముఖులు ప్రసంగంలో పేర్కొన్నారు. మన దేశంలో కళలు, సాంస్కృతిక విలువలు వారసత్వంగా కొనసాగడం విశేషం. కార్యక్రమంలో నైజర్ డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ హరేంద్రనాథ్ ఘోష్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రణయ్ కుమార్ స్వంయి, ముంబై హెచ్బీఎన్ఐ ప్రముఖుడు డాక్టర్ దీపా దత్తా, స్టూడెంట్ మినిస్ట్రీ ఆఫీసర్ డాక్టర్ అశోక్ మహాపాత్రో, అనురంగ 2025 సాంస్కృతిక ఉత్సవం చైర్మన్ డాక్టర్ సరలాశ్రిత్ మహంతి తదితరులు పాల్గొన్నారు. -
బ్రిటిష్ వంతెనను సంరక్షించండి
కొరాపుట్: శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్ వంతెనను సంరక్షించాలని నబరంగ్పూర్ జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఐకాన్ ఇన్ మొషన్స్ యువజన సంస్థ ప్రతినిధి రణేంద్ర ప్రతాప్ త్రిపాఠి ఒక ప్రకటనలో మాట్లాడారు. బ్రిటిష్ పాలనా సమయంలో ఇంద్రావతి నదిపై 1909 లో వంతెన నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇంగ్లండ్కు చెందిన ప్రాన్సిస్ మెర్టాన్ సంస్థ దీని నిర్మాణం 1917 లో పూర్తి చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ వంతెన కొరాపుట్–నబరంగ్పూర్ జిల్లాల వాసుల ప్రజలలో కొన్ని తరాలకు గుర్తుగా ఉందన్నారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని, దీన్ని సంరక్షించి పర్యాటక స్థలంగా మార్చాలని డిమాండ్ చేశారు. తాము ఇది వరకే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూరజ్ సూర్య వంశీ, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలను కలసి వినతి పత్రాలు సమర్పించామన్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం భావి తరాలకు ఒక స్మృతిగా ఈ బ్రిటిష్ వంతెన చూపాలని రణేంద్ర విజ్ఞప్తి చేశారు. -
కిటకిటలాడుతున్న శ్రీక్షేత్రం
భువనేశ్వర్: పవిత్ర కార్తీక పూర్ణిమ పురస్కరించుకుని భక్తులు, యాత్రికుల తాకిడితో శ్రీక్షేత్రం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో పూరీలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా బుధవారం భక్తులకు శ్రీమందిరం రత్న వేదికపై మూల విరాటులు స్వర్ణ శోభతో దర్శనం ఇవ్వనున్నారు. ఈ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. వారందరికీ క్రమబద్ధమైన దర్శనం కల్పించేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 45 ప్లాటూన్ల పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు పూరీ కలెక్టరు ప్రతీక్ సింగ్ తెలిపారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా నాయక్ ప్లాజా స్క్వేర్ వరకు బారికేడ్ వ్యవస్థని పొడిగించారు. మెడికల్ స్క్వేర్ నుంచి వాహన రహిత జోన్గా ప్రకటించారు. సముద్ర తీరం మరియు పట్టణవ్యాప్తంగా పవిత్ర పుష్కరిణుల దగ్గర లైఫ్గార్డ్లతో 2 చొప్పున ఒడ్రాఫ్ బృందాల్ని నియమించారు. భక్తులు సింహద్వారం గుండా ప్రవేశించి, దర్శన అనంతరం మిగిలిన మూడు ద్వారాలు నుంచి బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. నేడు కార్తీక పూర్ణిమ -
ఏనుగు దాడిలో బాలుడు మృతి
రాయగడ: రాయగడ, కలహండి జిల్లా సరిహద్దు ప్రాంతమైన లంజిగడ్ అటవీ ప్రాంతంలో ఏనుగు దాడి చేసిన ఘటనలో ఒక బాలుడు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన బాలుడు రవిమఝి (5)గా గుర్తించగా గాయాలు పాలైన బాలుడు సంబారు మఝిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఇరు జిల్లాల అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొగా గాయాలుపాలైన సంబారును సమీపంలో ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లా త్రిలోచనపూర్ పంచాయతీలోని కునాకాడు గ్రామానికి చెందిన కన్ను మాఝికి చెందిన రవి, సంబారులు సమీపంలో తమ పంట పొలాలకు ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హఠాత్తుగా ఏనుగు వారిపై దాడి చేసింది. రవిని ఏనుగు తొండాంతో విసిరిపారేయగా సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అదేవిధంగా సంబారును ఏనుగు గాయపరిచింది. సమాచారం తెలుసుకున్న లంజిగడ్ బీడీవో అమీన్ ప్రధాన్, విశ్వనాత్పూర్ అటవీ శాఖ రేంజర్ నరోత్తమ్ మాఝిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు. మరొకరికి గాయాలు -
వినతుల వెల్లువ
పర్లాకిమిడి: కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన గ్రీవెన్సు సెల్కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ మధుమిత, ఎస్పీ జ్యోతంద్ర పండా, జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహక అధికారి శంకర కెరకెటా తదితరులు వినతులు స్వీకరించారు. రాణిపేట, పర్లాకిమిడి పురపాలక సంఘం, సిద్ధమణుగు, జాజిపూర్ గ్రామ పంచాయతీల నుంచి 79 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 62, గ్రామ సమస్యలకు సంబంధించినవి 17 ఉన్నాయి. సకాలంలో వినతులను వివిధ శాఖల అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గుమ్మ ప్రాంతంలో ఏకలవ్య మోడల్ స్కూల్ తల్లిదండ్రులు కలెక్టర్కు వినతిని అందజేశారు. 2024–25 విద్యా సంవంత్సరం పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ పాఠశాల బిల్డింగ్ నిర్మాణం పనులు పూర్తి కాలేదన్న సాకుతో పాఠశాల తెరవలేదని, విద్యార్థు ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్య క్రమంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని బీడీవో గౌరచంద్ర పట్నాయిక్, తహసీల్దార్ నారాయణ బెహర తదితరులు పాల్గొన్నారు. తల్లీ కూతుళ్లపై అత్యాచారయత్నం భువనేశ్వర్: స్థానిక బరముండా బస్టాండ్లో నిద్రిస్తున్న తల్లీ, కూతుళ్లపై అత్యాచారయత్నం సంచలనం సృష్టించింది. ఈ మేరకు దాఖలైన ఫిర్యాదు ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు గంజాంలోని బెగుణియాపొడాకు చెందిన పబిత్ర కొంహరొగా గుర్తించారు. ఈ ఘటనపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ఏసీఏ నూతన కార్యవర్గం నియామకం భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి (ఏసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కళ లు, సంస్కృతి, తెలుగు సంప్రదాయ విలువల పరిరక్షణ పట్ల ఔత్సాహికులకు కార్యవర్గంలో చోటు కల్పించారు. నలుగురు మహిళలు కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులయ్యారు. అధ్యక్షుడుగా జి.ఆనందరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కె.పి.ఈమని, ఉపాధ్యక్షుడు, సీహెచ్ జగదీష్, కార్యదర్శిగా ఆర్. సత్యసాయి, సంయుక్త కార్యదర్శులుగా వి. శ్రీనివాస్, టి.ఎన్.చంద్రశేఖర్, కోశాధికారిగా ఎ.నాగరాజు, కార్యనిర్వాహక సభ్యులుగా జి.యోగేశ్వరరావు, జి.అపన్న, డి.రవిశంకర్, సాకా శ్రీధర్, బి.రమే ష్, పి.కామేశ్వరరావు, సి.బి.భారతి, ఎం.అరుణ, కె.నీరజ, జి.త్రిపుర, ఆడిటర్గా టి.ప్రకాశరావు నియమితులయ్యారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం రాయగడ: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో యు వకుడు దుర్మరణం చెందాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పూజారిగుడ నుంచి జగన్నాధపూర్కు వెళ్లే రహదారి వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి రాజ నల్ల (18)గా గుర్తించారు. సమాచా రం తెలుసుకున్న కళ్యాణసింగుపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రాజ నల్ల బైక్పై సమీపంలోని బిన్నీస్పూర్ గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలకు గురైన రాజను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మాదకద్రవ్యాలకు స్వస్తి పలకండి
భువనేశ్వర్: మాదక ద్రవ్యాలకు స్వస్తి పలకడం దేశ భక్తితో సమానమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. స్థానిక రాజ్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో నిర్వహించిన మత్తు రహిత భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాదకద్రవ్యాలను తిరస్కరించడం వ్యక్తిగత శ్రేయస్సుకు పరిమితం కాదని, దేశం పట్ల లోతైన విధిని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం, ఉత్పాదకత, పౌరుల క్రమశిక్షణ శక్తివంతమైన దేశం ప్రామాణికలుగా పేర్కొన్నారు. మత్తు వ్యసనం త్యజించిన బాధ్యతాయుతమైన సమాజంలో సభ్యులుగా దేశ పురోగతికి దోహదపడ్డారని ప్రోత్సహించారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ఈ సమావేశంలో ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పలు ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. మాదకద్రవ్యాలు వంటి వ్యసనం యువతరం జీవితాలను నాశనం చేస్తాయని గవర్నర్ తెలిపారు. వర్సిటీలు వంటి పవిత్ర ప్రాంగణాల్లో మత్తు పదార్థాల ఉనికి యావత్ విద్యాభ్యాసం వాతావరణాన్ని విషపూరితం చేస్తుందన్నారు. భారత దేశం 2047 నాటికి వికసిత్ భారత్గా నిలవాలని ఆకాంక్షిస్తుంది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని డాక్టర్ కంభంపాటి అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతపరిచేందుకు వీధి నాటకాలు, పోస్టర్ తయారీ పోటీలు, వాక్థాన్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా యువత వ్యసనాన్ని నివారించడంపై దృష్టి సారించిన విద్యా సంస్థల కోసం లఘు చిత్ర నిర్మాణం పోటీని గవర్నర్ ప్రతిపాదించారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టరు జనరల్ వైబీ ఖురానియా, కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి మానసిక తత్వ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శారద ప్రసాద్ స్వంయి, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, నైపుణ్యత అభివృద్ధి, సాంకేతిక విద్యా విభాగం కమిషనర్, కార్యదర్శి, గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు తదితర ప్రముఖులు ఈ సమావేశంలో ప్రసంగించారు. గవర్నర్ పిలుపు -
బీడీఓ ఇంట్లో చోరీ
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. మంగళ వారం నబరంగ్పూర్ బీడీవో సునీల్ ఖొర ఇంట్లో చోరీ జరిగింది. వరుసగా రెండు రోజుల సెలవు కారణంతో బీడీవో రాయగడ జిల్లాలోని స్వస్థలానికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు టయలెట్ వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. హాల్లో బీరువా పగలుగొట్టి అందులో రు. 20 వేలు అపహరించుకుపోయారు. ఉదయం ఇంటికి వచ్చిన బీడీవో ఖంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారుల ప్రభుత్వ క్వాటర్లో చోరీ జరగడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. పోలీసులు క్లూస్ టీం తెచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. వారం రోజుల క్రితం ఒక జిల్లాస్థాయి ఉన్నతాధికారి సెలవుపై వెళ్లినపుడు కూడా అతని ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రభుత్వ అధికారులు సెలవులపై వెళ్లినప్పుడు వారి ప్రభుత్వ గ్రుహాల లక్ష్యం గా దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసుల గమనించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చాలెంజ్గా తీసుకున్నారు. రూ. 20 వేల అపహరణ -
ఆడాళ్లూ మీకు జోహార్లు
భువనేశ్వర్: భారత మహిళా క్రికెట్ జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిందని సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. సమగ్ర ప్రపంచానికి భారత దేశ నారీ శక్తి శక్తిని చవి చూపారని కొనియాడారు. 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో వారి ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశారు. చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనగా పూరీ సాగర తీరంలో క్రికెటు బ్యాట్, అనేక బంతులతో కూడిన సువిశాల సైకత శిల్పాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇద్దరు భక్తులకు అస్వస్థత రాయగడ: స్థానిక జగన్నాథ మందిరం ఆదివారం సాయంత్రం భక్తులతో కిటకిటలాడింది. అయితే భక్తుల రద్దీలో ఇద్దరు మహిళలు ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన ఇద్దరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడంతో ఇంటికి తరలించారు. అయితే స్థానిక ఉత్కలమణి నగర్కు చెందిన భవానీ సాహు అనే మహిళ తవ్ర అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స అందజేస్తున్నారు. మందిరం కమిటీ సభ్యులు రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని భక్తులు అంటున్నారు. చిలికాలో చిక్కుకున్న పడవ భువనేశ్వర్: యాంత్రిక లోపం కారణంగా చిలికా సరస్సులో ప్రయాణికుల పడవ చిక్కుకుంది. సోమవారం ఉదయం 7 గంటలకు సతొపొడా నుంచి జొహ్నికుదాకు పడవ బయల్దేరింది. దీనిలో 10 బైక్లతో సహా 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మొంహిషాకుదొ సమీపంలో యాంత్రిక లోపం కారణంగా పడవ గంటసేపు సరస్సు నడిబొడ్డున చిక్కుకుంది. నావికులు మరమ్మతులు చేసి యాత్రికులను సురక్షితంగా తీరం చేర్చారు. రాయగడలో వినతుల స్వీకరణ రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన వినతుల స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన 66 సమస్యలు కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వీటిలో 47 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా.. మిగతావి గ్రామ సమస్యలుగా గుర్తించారు. గ్రామ సమస్యలకు సంబంధించి వాటిని పరిశీలించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా పది మందికి వైద్య ఖర్చులకు సంబంధించి రెడ్క్రాస్ నుంచి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి తదితరులు పాల్గొన్నారు. -
శిశు సంరక్షణ సాధ్యం
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025సామాజిక స్పృహతో.. భువనేశ్వర్: బాలల పౌష్టిక పోషణ, సంరక్షణతో ఒక దేశం యొక్క ఆరోగ్యం, తెలివితేటలు బలంగా ముడిపడి ఉంటాయని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. నగరంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఒడిశా రాష్ట్ర చాప్టర్ నిర్వహించిన శిశు, చిన్న పిల్లల పోషణ (ఐవైసీఎఫ్) చాప్టర్ 15వ జాతీయ సమావేశం, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ (హెచ్ఎంబీ) అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క 11వ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవితంలోని శిశు దశ ప్రాముఖ్యత దృష్ట్యా గర్భం దాల్చినప్పటి నుంచి రెండో పుట్టిన రోజు వరకు మొదటి 1,000 రోజులు శారీరక పెరుగుదల, మెదడు అభివృద్ధి, జీవితాంతం శ్రేయస్సు కోసం అత్యంత కీలకమైన కాలమని అన్నారు. శిశువులు, చిన్న పిల్లల పోషకాహారంలో పెట్టుబడి కేవలం వైద్యపరమైన సమస్య పరిష్కారానికి పరిమితం కాకుండా సామాజిక విధిని కూడా రూపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇతర శిశువుల పోషణకు నిస్వార్థంగా చనుబాలను దానం చేసే తల్లులను గవర్నర్ ప్రశంసించారు. జాతీయ ఆరోగ్య మిషన్ మరియు కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాల కింద ఒడిశా చొరవలను ప్రస్తావిస్తూ, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణలో రాష్ట్రం సుస్థిర పురోగతిని సాధించిందని డాక్టర్ కంభంపాటి అన్నారు. ప్రతి నవజాత శిశువుకు తగిన పోషణ, సంరక్షణ, భద్రత కల్పించేందుకు ఈ చొరవ దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎంబీ కార్యదర్శి డాక్టర్ కన్యా ముఖోపాధ్యాయ, ఐవైసీఎఫ్ కార్యదర్శి డాక్టర్ జై సింగ్, వైజ్ఞానిక కమిటీ చైర్పర్సన్ డాక్టర్ బ్రజ కిషోర్ బెహరా, సహ సంస్థ కార్యదర్శి డాక్టర్ పార్థిక్ దే మాట్లాడారు. -
ఉత్సాహంగా 5కే రన్
జయపురం: జయపురం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కోసం 5కే రన్ను సోమవారం నిర్వహించారు. స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయం క్రీడా మైదానం నుంచి సైబర్ సురక్షా మారథాన్ బయలు దేరి పట్టణంలో పలు వీధుల గుండా సాగిన రన్ తిరిగి విశ్వవిద్యాలయ క్రీడా మైదానానికి చేరుకుంది. రన్లో రెండు వందలకు పైగా యువకులు, విద్యార్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా జయపురం సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, గౌరవ అతిథులుగా సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్, సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రధాన్, బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బర్తియ పాల్గొన్నారు. సబ్కలెక్టర్ ప్రసంగిస్తూ.. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మారథన్ పోటీలలో పురుషులలో దిలీప్ ఖొర, గోపాల గోండ్, ఫిలిఫ్ భొత్రలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలవగా, ధనుర్జయ రెడ్డి, యురింగమ్ మీనక కన్సొలేషన్ బహుమతులు పొందారు. మహిళల గ్రూపులో దమయంతి హరిజన్, పూర్ణ మల్లిక్, సంగమ్మ మఝి మొదటి మూడు స్థానాల్లో నిలవలగా.. స్వాతి జాని, భాగ్యలక్ష్మి ఖిలోలు కన్సోలేషన్ బహుమతులు పొందారు. సీనియర్ సిటిజన్ల గ్రూపులో కృష్ణ చంద్ర హత్త, సురేష్ కుమార్ హత్త, లక్ష్మీపాఢీ ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. మారథాన్లో పాల్గొన్న చిన్నారులలో బిభుతి మహరాణ, పి.తేజ్ కిరణ్, గోపీనాథ్ సాహు, సుభాిశిష సాహు, టి.హరి, శివ ప్రసాద్ పాఢీ, గంగా సాగర్, రిహంత మహరాణ, నిరంజన్ సాహు ప్రత్యేక బహుమతులు పొందారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వేదికపై నాటికలు ప్రదర్శించారు. -
ముగిసిన తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవ పోటీలు
జయపురం: ప్రాచీన సంస్కృతి, కళలు, క్రీడలు, మొదలగు సంప్రదాయాల పరిరక్షణకు ఉద్యమిస్తున్న జయపురం తరుణ ప్రజ్ఞా భారతి సంస్థ తన వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక ఎన్కేటీ రోడ్డు నారాయణి ఆంగ్ల పాఠశాల క్రీడా మైదానంలో పోటీలు జరిగాయి. పరుగు, విలు విద్య, సైకిల్ రేస్, శిశు పాటలు, స్కిప్పింగ్, కప్పగెంతుల పోటీలను నిర్వహించగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి అధ్యక్షులు తపన కిరణ్ త్రిపాఠీ ప్రసంగిస్తూ.. మన ప్రాచీన సంప్రదాయ కళలు, ఆచారాలు, సంస్కృతి పరిరక్షణ ప్రధాన లక్ష్యంతో తరుణ ప్రజ్ఞా భారతి ఏర్పాటైందన్నారు. ఏటా ప్రాచీన సంప్రదాయాలపై విద్యార్థులక, ప్రజలకు పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నెల తొమ్మిదో తేదీన స్థానిక తరణీ కూడలి వద్దగల విజ్ఞాన ప్రాధమిక పాఠశాలలో మన శాసీ్త్రయ ఒడిస్సీ నృత్యం, జానపద నృత్యాల పోటీలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీల నిర్వహణలో ప్రజ్ఞా భారతి ఉపాధ్యక్షులు రామ శంకర షొడంగి, కార్యదర్శి అజయ కుమార్ మల్లిక్, కోశాధికారి రవీంద్రమహరాణ, సభ్యులు జానకీ పాణిగ్రహి, సబిత త్రిపాఠీ, లిపిక దొలాయి, సుర్ణ ఖిళో, సంగీత కళాకారుడు జి.మహేష్, తపంజనీ కుమారి సాహు, జగన్నాథ్ పాణిగ్రహి పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిన బీజేడీ అగ్రనేత అమర్ పట్నాయక్
భువనేశ్వర్: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు అమర్ పట్నాయక్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఇది విపక్ష బిజూ జనతా దళ్కు గట్టి ఎదురు దెబ్బగా రాజకీయ శిబిరాల్లో చర్చ జోరందుకుంది. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి విజయ్ పాల్ సింగ్ తోమర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో పట్నాయక్ను పార్టీలోకి స్వాగతించారు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందు బిజూ జనతా దళ్ (బీజేడీ)లో ప్రముఖ వ్యక్తిగా అమర్ పట్నాయక్ వెలుగొందారు. పార్టీ సాంకేతిక సమాచార విభాగం ప్రముఖునిగా చివరి క్షణం వరకు వ్యవహరించారు. ఆయన పార్టీ ఫిరాయించడం రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలలో పట్నాయక్ కీలక పాత్ర పోషిస్తారని సర్వత్రా ఆశాభావం వ్యక్తం అవుతుంది. బీజేపీలో చేరిన తర్వాత అమర్ పట్నాయక్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికత ద్వారా తాను ప్రేరణ పొందానని అన్నారు. అభివృద్ధి చెందిన భారత దేశం కోసం పార్లమెంటులో ప్రధాన మంత్రి ప్రసంగం తరచూ హృదయాన్ని హత్తుకునేది. భారత దేశాన్ని ముందంజ వేయించడంలో ప్రధాన మంత్రి నిబద్ధత తనకు స్ఫూర్తినిస్తుందన్నారు. నేడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారణంగా దేశం ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అమర్ పట్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లో చేరి ఇప్పటి వరకు రాష్ట్రానికి సేవ చేసిన తనకు దేశ నిర్మాణంలో తన ఉనికిని నిర్ధారించే దిశలో పని చేసేందుకు తన తాజా నిర్ణయం దోహదపడుతుందన్నారు. పార్టీ ఏ బాధ్యత కట్టబెట్టిన సమర్థంగా నిర్వహిస్తానన్నారు. 2018లో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ బిజూ జనతా దళ్ అధికారంలో ఉన్నప్పుడు అమర్ పట్నాయక్ ఆ పార్టీలో చేరారు. తదనంతరం ఆయన రాజ్యసభ సభ్యునిగా, బిజూ జనతా దళ్ సాంకేతిక సమాచార విభాగం చైర్పర్సన్గా పని చేశారు. ఆయన బీజేడీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. -
● స‘లక్ష’ణ రీతిలో..
ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ శ్రీవిద్యావేంకటేశ్వర స్వామి మందిరం ఆవరణలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పర్లాకిమిడితో సహా, రాసూరు, కత్తలకవిటి, ఏడోమైలు, జాజిపురం నుంచి మహిళలు హాజరై స్వామిని దర్శించుకున్నారు. లక్ష దీపారాధనలో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డీఎన్ రావు, డైరక్టర్ డా.దుర్గాప్రసాద్ పాఢి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అనితా పాత్రో తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి -
కలిమెలలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ–79 పోలీసుస్టేషన్ ఐఐసీ చంద్రకాంత్ తండి ఆధ్వర్యంలో సోమవారం సైబర్ సెక్యూరిటీ అవగాహన కర్యక్రమాన్ని ఎంవీ–79 గ్రామంలో గల శ్యామ్ ప్రసాద్ జూనియర్ కళాళాల అవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ముబైల్ ఫోన్ ద్వారా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్ మోసాలు, కేవైసీ ఆప్డేట్ పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఉద్యోగ వాగ్దానాల ద్వారా ప్రజాలను దోచుకుంటున్న వైనంపై అవగాహన కల్పించారు . అలానే ప్రభుత్వ చర్యలలో భాగంగా సైబర్ పోలీసుల బలోపేతం, సురక్షిత డిజిటల్ వాతావరణ నిర్మాణంపై కూడా వివరించారు. కాలేజ్ విద్యార్థులతో ‘భికారీ చేసిందే సైబర్ మోసం ‘అనే అంశంపై వీధి నాటకం ప్రదర్శించారు, సైబర్ సెక్యూరిటీ అభియాన్–ఒడిశా 2025 తరఫున రూపొందించిన ప్రామాణిక వీడియోను ప్రదర్శించారు. -
ఈ ప్రభుత్వం గేమ్ చేంజర్ కాదు, నేమ్ చేంజర్
భువనేశ్వర్: నువాపడా ఉప ఎన్నిక ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు, బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు. ఆయన శస్త్ర చికిత్స తర్వాత బహిరంగ సభా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే తొలి సారి. నువాపడా నియోజక వర్గం తొరొబొడా ప్రాంతం ధనొమండి గ్రౌండ్లో జరిగిన భారీ ఎన్నికల ప్రచార సభలో నువాపడా ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి స్నేహంగిని చురియా తరఫున ప్రచారం చేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియాకు నివాళులర్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓట్లను దొంగిలించి ఇప్పుడు అభ్యర్థులను దొంగిలిస్తోందని సూటిగా ఆరోపించారు. నువాపడా జిల్లాను సృష్టించడంలో బిజూ పట్నాయక్ పాత్రను గుర్తు చేశారు. బిజూ జనతా దళ్ ప్రభుత్వ హయాంలో నువాపడా వేగవంతమైన అభివృద్ధిని చవి చూసింది. బిజూ ఎక్స్ప్రెస్వే నుంచి సురక్షిత తాగునీరు, 10,000 హెక్టార్లకు పైబడిన పొట పొలాలకు నీటిపారుదల, సునాబెడ అభయారణ్యం నివాసితులకు వివిధ సంక్షేమ పథకాలు వంటి పలు పథకాలు ఈ జిల్లాకు పుష్కలంగా కేటాయించినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతటా అభివృద్ధి స్తంభించిపోయిందని విచారం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కుప్పకూలాయి, మహిళలపై దారుణాలు తార స్థాయికి చేరుకున్నాయి. మిషన్ శక్తి మహిళలకు గత 8 నెలలుగా జీతాలు అందడం లేదు. రైతులకు యూరియా కొరత, వయో వృద్ధులకు ఫించను అందడం లేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కేవలం స్వీయ ప్రయోజనాల కోసం తలునకలైపోయిందన్నారు. ఇది నినాదాల ప్రభుత్వం. ప్రచారంలో హీరో, కార్యాచరణలో జీరో (సున్నా) అని చమత్కరించారు. గేమ్ చేంజర్ ప్రభుత్వం కాదు నేమ్ చేంజర్ ప్రభుత్వంగా వ్యాఖ్యనించారు. -
ఖేదాపడలో చోరీ
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి ఖెదాపడ గ్రామంలో రవినారాయణ సింహ్ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దుండగులు ఇంట్లోనికి చొరబడి బీరువాను విరగ్గొట్టి అందులోని ఐదు వేల రూపాయల నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు బాధితుడు చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెరువలి పోలీస్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశాడు. చందిలి ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు తెలియజేసిన వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం రవినారాయణ అతని కుటుంబంతో సహా బంధువుల ఇంటికి వెళ్లాడు . ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఇంటికి వచ్చిన రవినారాయణ ఇంటి బయట తలుపులు విరిగి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ పర్లాకిమిడి: గజపతి కలెక్టరేట్లో మంగళవారం సంయుక్త గ్రీవెన్సుసెల్ హాల్–2లో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ మధుమిత తెలిపారు. కార్తీక ఆఖరి సోమవారం సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలకు సెలవు ప్రకటించిన దృష్ట్యా గ్రీవెన్సు సెల్ పర్లాకిమిడిలో మంగళవారం జరుగనున్నట్టు పేర్కొన్నారు. దాడి కేసులో వ్యక్తికి జైలుశిక్ష పలాస: కాశీబుగ్గ పోలీసు స్టేషన్ హెచ్సీ శ్రీనివాసరావు విధులకు ఆటంకం కలిగించి దాడి చేసిన కేసులో బోసి రాంబాబు అనే వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ పలాస కోర్టు జూనియర్ సివిల్ జడ్జి యు.మాధురి తీర్పునిచ్చారు. 2022 మార్చి 16న అర్ధరాత్రి సమయంలో కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో హెడ్కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తుండగా బోసి రాంబాబు మరొకరు ట్రాఫిక్కు అంతరాయం కలిగించి దాడి చేయడంతో అప్పట్లో కేసు నమోదు చేశారు. అదే విధంగా.. సూదికొండకు చెందిన దాసరి దానయ్య, రాజారావు, పిట్ట షణ్ముఖరావులు కొట్లాట కేసులో ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున జరిమానా విధించినట్లు కాశీబుగ్గ టౌన్ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. బీచ్లో నిబంధనలు పాటించాలి గార : కార్తీక మాస వన భోజనాలు (పిక్నిక్)లో భాగంగా సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులు విధిగా నిబంధనలు పాటించాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బి.ప్రసాదరావు అన్నారు. సోమవారం మొగదాలపాడు, శ్రీకూర్మం–మత్స్యలేశం, బలరాంపురం, పెద్ద గణగళ్లవానిపేట బీచ్ల్లో పర్యాటకులకు మైరెన్ విశాఖపట్నం రేంజ్ ఇన్చార్జి డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు అవగాహన కల్పించారు. మైపాడు బీచ్లో ఆదివారం స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతిచెందారని, అలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం తాగి సముద్రంలో స్నానాలు చేస్తే మూడురెట్లు నష్టం పెరుగుతుందన్నారు. జీవితం విలువలను తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత కేరింతలు పేరిట సమద్రపు నీటిలో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవుపలికారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు నీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంత భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. -
తైక్వాండో పోటీల్లో ముగ్గురికి స్వర్ణ పతకాలు
ఇచ్ఛాపురం : ఇటీవల ఏలూరు, కడపలో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలు (ఎస్జీఎఫ్) తైక్వాండో విభాగంలో ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ం సూర్యారావు సోమవారం తెలిపారు. అండర్–17 విభాగంలో ఆశి రెవంత్రెడ్డి, తిప్పన జీవన్రెడ్డి, అండర్–19 విభాగంలో చాట్ల గిరి స్వర్ణ పతకాలు సాధించారని చెప్పారు. వీరు ఈ నెల 7 నుంచి 10 వరకు జమ్మూకశ్మీర్లో జరగనున్న అండర్–19 జాతీయస్థాయి పోటీలకు, ఈ నెల 20 నుంచి 25 వరకు అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం ఇటానగర్లో అండర్–17 జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శారద, రంగారావు, ఉపాధ్యాయులు కామరాజు, సూర్యం, జయలక్ష్మి, ఎస్ఎంసీ ప్రతినిధులు ఆశా లతారెడ్డి, శ్రీధర్, గౌరీశంకర్, తైక్వాండో కోచ్ సీహెచ్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి వర్సిటీ విద్యార్థులు ఎచ్చెర్ల : హర్యానాలో జరగనున్న జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొనేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమ వారం పయనమయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక, కళలు, క్రీడలు, అభిరుచులు వంటివి పరస్పరం పంచుకొని దేశ ఐక్యతలో యువతను భాగస్వామ్యం చేయడంలో భాగంగా జాతీయ స్థాయిలో ఈ నెల 4 నుంచి వారం రోజుల పాటు శిబిరం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వర్సిటీ క్యాంపస్కు చెందిన ఎన్.త్రివేణి, కె.పవన్, జి.రవి, జి.శ్రావణి, ఎస్.సాయిప్రదీప్, ఎస్.భార్గవి, జి.చంద్రశేఖర్, పి.అభిషేక్, ఎస్.అంకిత, ఎం.పవిత్రలు ఎంపికయ్యారు. ఈ బృందానికి ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ కె.కరుణానిధి నేతృత్వం వహి స్తున్నారు. వీరిని వీసీ రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డి.వనజ అభినందించారు. -
రాయగడ బ్లాక్లో శిశు మహోత్సవం, సురభి పోటీలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్లో సమతి స్థాయి శిశు మహోత్సవం, సురభి 2025 పోటీలు స్థానిక హైస్కూల్ మైదానంలో సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా రాయగడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, బ్లాక్ విద్యాధికారి టి.కిశోర్ కుమార్, ఏడీఈవో జుధిష్టర్ బెహారా, అన్ని విద్యాలయాల గైడ్ టీచర్లు హాజరయ్యారు. సురభి కార్యక్రమంలో పిల్లలు వివిధ జానపద కళా నృత్యాలు, ఆధునిక డ్యాన్సులు ప్రదర్శించారు. అలాగే డిబేటింగ్, వక్తృత్వ, ప్రబంధాలు, క్విజ్, చిత్రలేఖనం పోటీలో 12 క్లస్టర్ల నుంచి 250 మంది పిల్లలు పాల్గొన్నారు. పోటీల అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్ చేతులమీదుగా అందజేశాు. బ్లాక్ స్థాయి సురభి పోటీలలో విజేతలు జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు మనోజ్ బెహారా తెలిపారు. -
సందడిగా ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు
జయపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీని ఆదివారం జయపురంలో నిర్వహించారు. ముఖ్యఅతిదిగా ఛతీస్గఢ్ రాష్ట్ర బస్తర్ జిల్లా సద్భావణ కమిటీ నేత రాజ బహుదూర్ సింగ్ రాణా, జిల్లా ఆర్ఎస్ఎస్ పరిచాలకులు మానసింగ్ ఘుయురియ పాల్గొన్నారు. ముఖ్యఅతిథి రాజబహుదూర్ సింగ్ ప్రసంగిస్తూ.. ఆర్ఎస్ఎస్ ఏ జాతికి, మతానికి ప్రాధాన్యత ఇవ్వదన్నారు. అన్ని వర్గాలు, అన్ని మతాలకు చెందిన వారు ఇందులో చేరవచ్చునన్నారు. దేశ నిర్మాణంలో భాగస్వాము కావాలనుకునేవారంతా ఆర్ఎస్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. స్థానిక దసరా పొడియాలో ప్రారంభమైన ర్యాలీ పారాబెడ, గోపబందు నగర్, భద్రయ్య వీధి, బెల్ రోడ్డు, నీలకంఠేశ్వర మందిరం రోడ్డు, లాల్సాహి, సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ మీదుగా తిరిగి దసరా పోడియానికి చేరుకుంది. అక్కడ జరిగిన సభలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. -
ఫ్లై ఓవర్ మరమ్మతులకు శ్రీకారం
రాయగడ: స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి కపిలాస్ కూడలికి అనుసంధానంగా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు సంబంధిత శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. పాత టౌన్, కొత్త టౌన్లకు అనుసంధానించే లైఫ్లైన్గా పిలుస్తున్న ఈ బ్రిడ్జి మరమ్మతుల కోసం చేపట్టిన ఆందోళన ఫలితంగా ఎట్టకేలకు పనుల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే గతంలో నాలుగు సార్లు ఈ బ్రిడ్జి పనుల కోసం టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఏ ఒక సంస్థ ముందుకు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అయితే సునాబెడకు చెందిన ఎన్హెచ్ (నేషనల్ హైవే) ఎట్టకేలకు టెండర్లను ఆహ్వానించడంతో అందుకు ముందుకు వచ్చిన ఒక ప్రైవేట్ సంస్థ ఆదివారం నుంచి పనులను ప్రారంభించింది. సుమారు 93 మీటర్ల పొడవుతో ఉన్న బ్రిడ్జి మధ్యలో దాదాపు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో పాటు పిల్లర్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికే నోటీసులు ఇదిలా ఉండగా బ్రిడ్జి కింద ఉన్న కూరగాయలు, తదితర వ్యాపార సంస్థలు ఖాళీ చేయాల్సిందిగా మున్సిపాలిటీ యంత్రాంగం ఇప్పటికే వ్యాపార వర్గాలకు నోటీసులు జారీ చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా వ్యాపార సంస్థలు, కూరగాయల దుకాణాలను ఆర్కే నగర్, ఆర్ఎంసీ యార్డు, కస్తూరీ నగర్ వద్దనున్న బిజూ పట్నాయక్ మార్కెట్ యార్డుల్లో పెట్టుకోవాలని ఆదేశించింది. అయితే కొద్దిరోజుల వరకు బ్రిడ్జి కింద ఉన్న వ్యాపారస్తులు మున్సిపాలిటీ యంత్రాంగం గుర్తించిన ప్రాంతాల్లో తమ లావాదేవీలు కొనసాగించినప్పటికీ, ఇటీవల మరలా వారు యథాస్థానానికి చేరుకోవడం గమనార్హం. అయితే మున్సిపల్ సిబ్బంది వ్యాపారస్తులకు దుకాణాలు తొలగించాలని మరలా స్పష్టం చేశారు. -
ఘనంగా సరస్వతీ బాల మందిరం వార్షికోత్సవం
జయపురం: స్థానిక సరస్వతీ బాల మందిర వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. స్థానిక పాయిక వీధిలోని సరస్వతీ బాల మందిర ప్రాంగణంలో నిర్వహించిన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత ఉపాధ్యాయుడు హరిహర కరసుధా పట్నాయక్ పాల్గొన్నారు. పాఠశాల పరిశీలన కమిటీ అధ్యక్షులు అనూప్ కుమార్ సామంతరాయ్ అధ్యక్షతన విద్యార్థులు పలు యూనిట్లను ప్రదర్శించారు. విజ్ఞాన, సాహిత్య, మహాప్రబంధ ఫొటోలు, పుష్పాలు, ఔషధ మొక్కలు, ఆట వస్తువులు, ఆహార పదార్ధాలు, వ్యవసాయ పంటలు, చిత్ర కళలు ఫొటోలు, ముగ్గులు ప్రాజెక్టులు ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన ప్రాజెక్టులు అతిథులు, సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. -
అవినీతిపై సామూహిక పోరాటం చేద్దాం
జయపురం: దేశ ప్రగతికి అడ్డుగా నిలుస్తున్న అవినీతిపై సామూహిక పోరాటం చేద్దామని జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి పిలుపునిచ్చారు. కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం ఆధ్వర్యంలో అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు సందర్భంగా జయపురంలో సచేతన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. అవినీతిని అంతమొందించాలంటే ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ప్రజల పనులు చేయడం ఉద్యోగుల కర్తవ్యమని స్పష్టం చేశారు. పనులు చేసేందుకు లంచాలు అడగడం, ఇవ్వడం కూడా నేరమన్నారు. విజిలెన్స్ ఎస్పీ రవీంద్ర కుమార్ పండా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 33 అవినీతి కేసులు కొరాపుట్ విజిలెన్స్ డివిజన్లో నమోదయ్యాయని వెల్లడించారు. ఎటువంటి అవినీతిని విజిలెన్స్ సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.8 కోట్ల విలువ గల ద్రవ గంజాయి పట్టివేత
మల్కన్గిరి: ఇటీవల విడుదలైన టాలీవుడ్ మూవీ ఘాటీ సినిమాలో చూపించినట్లు మల్కన్గిరిలో 8 మోటారుసైకిళ్లతో చిత్రకొండ సమితి నుంచి ద్రవ గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ద్రవ గంజాయిని పట్టుకోవడం ఇది మొదటిసారి. సుమారు 60 కిలోల ద్రవ గంజాయి మార్కెట్ విలువ రూ.8 కోట్లు ఉంటుందని ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు. ఈ గంజాయి ద్రవాన్ని చిత్రకొండ సమితి పరిధిలో గల ఎస్ ఆర్ కంపెనీ కూడలి వద్ద ఆదివారం మధ్యాహ్నం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న చిత్రకొండ పోలీసులకు దొరికింది. నిందితులను సోమవారం పూర్తి విచారణ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. రైలు మార్గంలో అధికంగా గంజాయి రవాణా కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్కు రైల్వేమార్గంపై స్మగ్లర్లు ఆధారపడుతున్నారని రైల్వే పోలీసులు ప్రకటించారు. కొరాపుట్ రైల్వే పోలీసులు గత 8 నెలల్లో 23 ఘటనల్లో 345 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల్లో 9 మాఫియా బృందాలు, మరో 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వీరంతా కొత్తవలస – కిండోల్, కిరండోల్ – రాయగడ రైల్వే లైన్లలో ప్రయాణికుల మాదిరిగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. రోడ్డు మార్గంలో పోలీసుల చెకింగ్లు అధికమవ్వడంతో వీరంతా ఈ రెండు రైల్వేలైన్లలో రవాణా చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైల్వే ఓఐసీ సంతోషి మహంత్ తదితరులు పాల్గొన్నారు. 22 కిలోల గంజాయి స్వాధీనం రాయగడ: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 22.400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం అబ్కారీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రీదేవి గౌతం, మోహన్ లాల్ అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీంతో వారి బ్యాగులకు తనిఖీ చేయగా వాటిలో గంజాయి పట్టుబడింది. అబ్కారీ శాఖ డీఎస్పీ ప్రవాత్ కుమార్ త్రిపాఠి, ఐఐసీ బిజయ్ ప్రకాష్ మిశ్రా, ఎస్ఐ సంతోష్ కుమార్ పరిడ తనిఖీల్లొ పాల్గొన్నారు. -
జనాభా గణనకు సన్నాహాలు
భువనేశ్వర్: త్వరలో ప్రారంభమవ్వనున్న జనాభా గణన – 2027 సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ చర్యల్లో భాగంగా రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ విభాగం అన్ని జిల్లా కలెక్టర్లు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లను వారి జిల్లాలు మరియు కార్పొరేషన్ల పరిధిలో ప్రముఖ గణాంక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అధికార పరిధిలో జనాభా గణన కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను జనాభా గణన అధికారులకు కేటాయించారు. 1990 జనాభా గణన నియమ నిబంధనల ప్రకారం ఈ నియామకం చేసినట్లు పేర్కొన్నారు. జనాభా గణన ప్రక్రియ విజయవంతం కావడంలో అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. సురేష్ దాస్ మృతి తీరని లోటు జయపురం: జయపురం సాహిత్య పరిషత్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సురేష్ దాస్ మృతి సాహిత్య రంగానికి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో సురేష్ దాస్ సంతాప సభను సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయపురం సాహిత్య పరిషత్ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సాహిత్యకులు లక్ష్మీకాంత పాఢీ, శ్రీకాంత మిశ్ర, డాక్టర్ ప్రదీప్ మిశ్ర. నరసింగ పాణిగ్రహి, జి.బి.రావు, కృష్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి సదరు పాత్రోగూడ గ్రామం వద్ద ఓ అద్దె ఇంటిలో వ్యభిచారం జరుగున్నట్లు మల్కన్గిరి ఎస్డిపీఓ దివ్య దళైకు సమాచారం రావడంతో ఐఐసీ రీగాన్కీండో తన సిబ్బందితో శనివారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు వేశ్యలు, ఇద్దరు కస్టమర్లు ఉన్నారు. మొత్తం నలుగురిని అరెస్టు చేసి మల్కన్గిరి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆదివారం వారిని విచారించగా ఓ మహిళ, మరో పురుషుడు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. వారిని కూడా ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. యువతులు జగత్సింగ్పూర్, భద్రక్ జిల్లాలకు చెందినవారు. కస్టమర్లు చత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమాకు చెందిన వారు. -
ఐక్యతతోనే హక్కుల సాధన
శ్రీకాకుళం: బీసీ ఉద్యోగుల ఐక్యత.. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు గుత్తుల వీరబ్రహ్మం, పక్కి భూషణరావు చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో జిల్లా బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర కమిటీ ప్రతినిధి పి.రామచంద్రరావుఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భం వీరబ్రహ్మం మాట్లాడుతూ డిసెంబర్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీసదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు ఐదు లక్షల మంది బీసీ, ఓబీసీ ఉద్యోగులు ఉన్నారని.. వీరి సంక్షేమానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ చింతాడ రాజశేఖరరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ వై.పోలినాయుడు, ప్రధాన కార్యదర్శిగా బలగ మల్లేశ్వరరావులను ఎన్నుకున్నారు. మిగిలిన వారిని వారం రోజుల్లో ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపిస్తామని జిల్లా బీసీ ఉద్యోగ సంఘాల నేత డాక్టర్ దువ్వు చక్రపాణి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘాల నేతలు వై.శంకరరావు, పి.బాలభాస్కరరావు, వి.కామేశ్వరరావు, జె.రామకృష్ణరావు, ఇ.ఎ.ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.నూతన కమిటీ ప్రతినిధులను రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు శాసపు జోగినాయుడు అభినందించారు. -
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
టెక్కలి రూరల్ : పెన్షన్లు లేక ఇటీవల రిటైరైన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం స్పందించి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చల్ల సింహాచలం డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఆదివారం టెక్కలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. కొన్ని సంఘాలు జీపీఎస్, యూపీఎస్ ప్రపంచంలోనే అత్యున్నతమైనవంటూ ప్రశంసించడం దారుణమన్నారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుడు బి.బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అంపోలు షణ్ముఖరావు, కృష్ణ, రోహిణేశ్వరరావు, చక్రవర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్గేమ్స్ స్టేట్మీట్పై నీలిమబ్బులు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగే స్కూల్గేమ్స్ స్టేట్మీట్ క్రికెట్ టోర్నీపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాల వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలబాలికల క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 3 నుంచి 8 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు బాలురుకు, తర్వాత మూడు రోజులు బాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే మోంథా తుఫాను అనంతరం చిత్తడిగా మారిన మైదానాలను నిర్వహకులు వాయువేగంతో సిద్ధంచేసినా ఆదివారం మరోసారి వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. సాయంత్రం వర్షం కురవడంతో మైదానాలు చిత్తడిగా మారడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మైదానాలుగా ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీడా మైదానం, శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలను పరిశీలిస్తున్నారు. జిల్లాకు చేరుకుంటున్న క్రీడా జట్లు.. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు జట్లు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, గుంటూరు, కృష్ణ తదితర జట్లు జిల్లాకు చేరుకున్నాయి. మిగిలిన జట్లు రాత్రికి, సమీపంలోని జట్లు సోమవారం ఉదయానికి చేరుకుంటాయి. క్రీడాకారులకు బలగ మున్సిపల్ హైస్కూల్, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో బస కల్పిస్తున్నారు. రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ సైతం జిల్లాకు చేరుకున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు నేతృత్వంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య, ఎం.తిరుపతిరావు, ఎం.ఆనంద్కిరణ్, ఢిల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, నిర్మల్కృష్ణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కర్నూలుకు చెందిన రాజేష్ గోల పరిశీలకులగా హాజరయ్యారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కేఆర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. -
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
అరసవల్లి: అరసవల్లి, కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాల్లో భాగంగా సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం ఈ నెల 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. గ్రామపెద్దల సమక్షంలో ఆలయ కమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ముర్రాటలతో ఉదయం 7 గంటల నుంచి బయలుదేరి వెలమ వీధిలో వెలిసిన దుర్గమ్మ మట్టి (ఆలయం) వద్ద నుంచి నీలమ్మ గుడి, కాపువీఽధి శ్యామలాంబ గుడి, సింహద్వారం వద్ద ఎర్రిమ్మ గుడి స్థానం వద్ద నుంచి అసిరితల్లి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచి సంబరంగా ముర్రాటలతోనే సిరిమాను చెట్టు ఉన్న పెద్ద తోటకు చేరుకుంటారు. సంప్రదాయం ప్రకారం తొలిముర్రాటను సోను రాములు కుటుంబీకులు సమర్పించనున్నారు. ఉత్సాహంగా కబడ్జీ జట్ల ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు ముగిశాయి. జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలకు 74 మంది బాలికలు, 129 మంది బాలురు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా తుది జట్లను ఎంపికచేస్తామని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు తెలిపారు. ఎంపికచేసిన జిల్లా జట్లను ఈ నెల 7 నుంచి 9 వరకు కర్నూలు జిల్లాలో జరగనున్న 35వ ఏపీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ – 2025–26లకు పంపించనున్నట్టు జిల్లా కార్యనిర్వాహాక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కబడ్డీ శిక్షకులు సింహాచలం, ఝాన్సీ, సంఘ కోశాధికారి నాగాల రమేష్, సంఘ ప్రతినిధులు రవికుమార్, తవిటమ్మ, సాగర్, అప్పనమ్మ, వెంకట రమణ, శ్యాం, లక్ష్మీనారాయణ, యోగి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్యుని దేవేరులకు బంగారు పుస్తెలు వితరణ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవేరులైన ఉషా పద్మిని ఛాయాదేవేరులకు బంగారు పుస్తెలను నగరానికి చెందిన పొడుగు వెంకట సూర్యప్రభాకరరావు, వెంకట రాజేష్ఖన్నా, కరుణాకరరావు కుటుంబసభ్యులు విరాళంగా సమర్పించారు. 29 గ్రాముల 820 మిల్లీగ్రాముల బంగారు శతమానాలతో కూడిన మూడు పుస్తెల తాళ్లను ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలకు దాతలు అందజేశారు. కల్యాణ సేవల్లో పుస్తెలను వినియోగించాలని దాతలు కోరారు. అనంతరం ఈవో మాట్లాడుతూ దాతల సహకారం గొప్పదని, రథసప్తమి వంటి విశేష పర్వదినాల్లో పాసులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత తహశీల్దార్ పొడుగు వెంకట శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు. సముద్రంలో బోటు మునక సోంపేట: ఉప్పలాం పంచాయతీ ఎకువూరు సముద్రతీరంలో ఆదివారం మధ్యాహ్నం బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన రెండు బోట్లు సముద్రంలో వేటకు వెళ్లాయి. మత్స్యకారులు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా కె.గోపాల్కు చెందిన బోటు తీరానికి వంద మీటర్ల దూరంలో మునిగిపోయింది. మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం జరిగిందని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్లో నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100 (డబల్ వన్ డబల్ జీరో)కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతి పాతపట్నం: గొల్లపేట గ్రామానికి చెందిన మెట్టు చిన్నారావు (59) చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగువాడ పంచాయతీ గొల్లపేటకు చెందిన మెట్టు చిన్నారావు బడ్డుమర్రి గోపాలపురంలో బంధువులు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కృష్ణసాగరం చెరువులో స్నానానికి దిగతుండగా కాలుజారి పడిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారావుకు భార్య చిన్నమ్మడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సతీష్ టెక్కలి: ౖవెఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన కోత సతీష్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో యువజన విభాగంలో కీలకంగా సేవలు అందజేసిన సతీష్కు మరళా అదే విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తనపై ఎంతో నమ్మకంతో నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు నేతృత్వంలో బాధ్యతలు అప్పగించారని, పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని సతీష్ పేర్కొన్నారు. పాఠ్య పుస్తక రచనకు ఎంపిక జి.సిగడాం : బూటుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డాక్టర్ కూర్మాన అరుణకుమారి పాఠ్యపుస్తక రచనకు ఎంపికై నట్లు ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. విజయవాడలో ఈ నెల 3 నుంచి నిర్వహిస్తున్న రచనా ప్రక్రియకు ఈమె హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అరుణకుమారిని ఉపాధ్యాయులు అభినందించారు. -
క్రైస్తవ దివంగతులకు శ్రద్ధాంజలి
భువనేశ్వర్: క్రైస్తవ కుటుంబీకులు దివంగతులకు సామూహికంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఖుర్దారోడ్ క్రైస్తవ స్మశాన వాటికలో ఆదివారం నిర్వహించిన అఖిల ఆత్మల దినం కార్యక్రమంలో భాగంగా కుటుంబీకులు అంతా చేరి సామూహిక శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి జట్నీ నియోజక వర్గం ఎమ్మెల్యే బిభూతి భూషణ్ బల్వంత్రాయ్, మున్సిపల్ మండలి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ సస్మిత్ పాత్రో మంజూరు చేసిన నిధులతో స్మశానవాటిక అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన ప్రవేశ మార్గాన్ని ఆరంభించారు. -
పడిపోవడానికి సిద్ధంగా చెట్టు!
● పట్టించుకోని అధికారులు కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి నువాబందు వీధి మీదుగా వేళ్లే మార్గంలో కోర్టు పాత భవనాల సముదాయం వద్ద ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఓ చెట్టు ఒరిగి పోయింది. పిట్ట గోడను శిథిలం చేస్తూ రోడ్డు మీద పడడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్గంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి, జిల్లా కోర్టులకు, నందాహండి సమితికి వెళ్లడానికి నిత్యం వాహనాలు వెళ్తుంటాయి. ఏక్షణంలో నైనా చెట్టు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతకోర్టు వద్ద కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్టు -
అపురూప దర్శనం
కార్తికంలో..రద్దీ నియంత్రణ ఏర్పాట్లు సమీక్షిస్తున్న డీఐజీ డాక్టర్ సత్యజిత్ నాయక్భువనేశ్వర్: మహా పవిత్ర కార్తిక మాసం చిట్ట చివరి 5 రోజులను మహా కార్తిక పంచుకగా వ్యవహరిస్తారు. కార్తిక మాసం నెల పొడవునా ఉపవాసం, ప్రత్యేక పూజలతో ప్రాప్తించే పుణ్యం కంటే పంచుక ఉపవాసం ప్రాప్తించే పుణ్య ఫలం అత్యంత మోక్షదాయకమని విశ్వసిస్తారు. దీన్ని భీష్మ పంచుక అని కూడా అంటారు. ఈసారి పంచుక 5 రోజులకు బదులు 4 రోజులకు పరిమితం అయింది. పంచాంగం గణాంకాల ప్రకారం కార్తిక శుక్ల ద్వాదశి క్షీణతతో ఈ పరిస్థితి నెలకొంది. పంచుక సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై సోదర సోదరీ సమేత శ్రీ జగన్నాథ స్వామి రోజుకో అలంకరణలో శోభిల్లుతాడు. ఈ అలంకారాల్లో మూల విరాటులను దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీ మందిరం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రద్దీ నియంత్రణ కోసం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహా లఘు దర్శనం భక్తులకు వెలుపలి గడప (బహారొ కఠొ) నుండి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనం ఏర్పాటు చేశారు. కార్తిక పూర్ణిమ రోజున ప్రథమ భోగ మండప సేవ ముగిసే వరకు ఈ కట్టడి నిరవధికంగా కొనసాగుతుంది. ఆ తర్వాత లోపలి గోడలపై నుంచి దర్శనం కల్పిస్తారు. సింహ ద్వారం గుండా ప్రవేశం భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి మిగిలిన మూడు ద్వారాల గుండా బయటకు రావాల్సి ఉంది. సేవకులు అన్ని ద్వారాల గుండా రాకపోకలు చేస్తారు. యాత్రికులతో ఆలయం లోనికి ప్రవేశించే యాత్రీ పండాలను మాత్రం అనుమతించరు. శ్రీ మందిరం లోపలి ప్రాంగణంలో మరియు బగేడియా ధర్మశాల సమీపంలో రాత్రింబవళ్లు సేవలు అందించే ఆరోగ్య కేంద్రం తెరిచారు. ఆలయం సమీపంలో రాత్రింబవళ్లు 2 అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు రద్దీ నియంత్రణ కార్యకలాపాల కోసం 32 ప్లాటూన్ల బలగాలను మోహరించినట్లు డీఐజీ డాక్టర్ సత్యజిత్ నాయక్ తెలిపారు. పంచుక ముగిసేంత వరకు ఈ నెల 5వ తేదీ వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. పంచుక తొలి రోజు పురస్కరించుకుని ఆది వారం భద్రతా ఏర్పాట్లుని ప్రత్యక్షంగా సందర్శించి సమీక్షించారు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిపై దర్యాప్తు
● ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● నలుగురితో కమిటీ ఏర్పాటురాయగడ: సదరు సమితి బాయిసింగి ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న తాడింగి నందిని గత నెల 30వ తేదిన మలేరియా వ్యాధితో మృతి చెందిన ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఈ మేరకు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్, జిల్లా ఆరోగ్యశాఖకు చెందిన ఎస్డీహెచ్వో డాక్టర్ ప్రదీప్ కుమార్ సుబుద్ధి, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి ఉన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో తరచూ వివిధ కారణాల వల్ల విద్యార్థులు మృత్యు వాత పడుతుండటం పరిపాటిగా మారిందన్న ఆరోపణలపై స్పందించిన కలెక్టర్ కులకర్ణి బాయిసింగి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మలేరియా వ్యాధితో మృతి చెందిన ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. దీంతో ఈ కమిటీ శనివారం బాయిసింగి ఆశ్రమ పాఠశాల, హాస్టల్ను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అలాగే ఆయా ప్రాంతాల పరిసరాలను పరిశీలించిన కమిటీ విద్యార్థిని ఉండే హాస్టల్ గదిని కూడా పరిశీలించారు. మృతురాలు ఎప్పటి నుంచి అస్వస్థతకు గురైంది, హాస్టల్ నిర్వాహకులు, సిబ్బంది ఎంతవరకు స్పందించి చర్యలు తీసుకున్నారన్న అంశంపై మెట్రీన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని సొంత గ్రామమైన డంగాజోడిలో కూడా పర్యటించి బాధిత కుటుంబీకులతొ మాట్లాడిన కమిటీ వారి వివరాలు సేకరించారు. మలేరియా వ్యాధి సోకిన తరువాత నందినిని తమ ఇంటికి తీసుకువెళతామని అడిగినప్పటికీ హాస్టల్ సిబ్బంది అంగీకరించలేదని బాధిత కుటుంబీకులు దర్యాప్తు కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. -
పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కోరారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సును శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. సోమవారం పంచారామాలను దర్శించుకుని మరలా మంగళవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుతుందని వివరించారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలను దర్శించుకోవచ్చన్నారు. ఈ నెల 9, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతామన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 99592 25608, 99592 25609 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు రాజు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
భూముల రీసర్వేపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భూముల రీ సర్వేలో భాగంగా జరుగుతున్న జాయింట్ ఎల్పీఎం(ఉమ్మడి సరిహద్దు) సమస్యలను నవంబర్ 25 నాటికల్లా పరిష్కరించాలని సర్వే, ల్యాండ్ రికార్డులు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సి.హెచ్.వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు. రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన రీసర్వే పనుల నాణ్యత, పురోగతిపై శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోడిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దశల్లోనూ రికార్డులను తనిఖీ చేసి నూరు శాతం కచ్చితత్వం సాధించాలన్నారు. భూ యజమానులకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలో సర్వే పనులు నిర్వహించాలన్నారు. మొదటి, రెండవ విడతల్లో మిగిలిన పనులను నిర్ణీత గడువు ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెవెన్యూ భూముల సరిహద్దులు నిర్ణయించే పనిని కూడా ఈ నెల 15కల్లా పూర్తి చేయాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కవిటి నుంచి సోంపేట రోడ్డులో వెళుతుండగా జగతి గ్రామం మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోవడంతో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెల్లడయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. శివాజీ స్వగ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు. -
ఉత్తమ ప్రతిభ కనబరచాలి
ఎచ్చెర్ల : క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్టీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ ఆకాంక్షించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎస్.జి.ఎఫ్ సెలక్షన్లో పాల్గొని ఎంపికై ఈ నెల 3 నుంచి 6 వరకూ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్లో అండర్–19 శ్రీకాకుళం జిల్లా జట్టు తరఫున ట్రిపుల్ ఐటీ విద్యార్థి సాయిగణేష్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని డైరెక్టర్ ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఇన్చార్జి సాగర్, టి.దిలీప్కుమార్, కృష్ణంరాజు పాల్గొన్నారు. -
శ్రీముఖలింగంలో భక్తులకు భద్రత ఏదీ..?
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో కార్తిక మాసంతోపాటు శివరాత్రి ఉత్సవాలకు వేల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ కూడా భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. స్వామిని దర్శించుకున్న భక్తులు బయటకు రావాలంటే దక్షిణ మార్గం ఒక్కటే ఉంది. ఇంత వరకూ బాగున్నా ఇదే మార్గం ద్వారా దేవదాయ శాఖ, పోలీసు, రాజకీయ ప్రముఖలు, ఉన్నతాధికారులు, అర్చక కుటుంబాలు, మీడియా ప్రతినిధులు అలాగే ఇతర చోటామోటా నాయకులను కూడా ఆలయం లోపలకు పంపిస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఇదే మార్గం ద్వారా భక్తులు బయటకు రావాలి. దీంతో ఇక్కడ తోపులాటలకు అవకాశం ఉంటుంది. కాశీబుగ్గ ఘటనతో భక్తుల్లో ఆందోళన కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో సుమారు తొమ్మిది మంది భక్తులు మృతి చెందడం, పలువురికి తీవ్రగాయాలు కావడంతో శ్రీముఖలింగం ఒక్కసారి ఉలిక్కిపడింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు, మరమ్మతులు జరగాలన్నా ఆ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుతం స్వామివారి దర్శనం అనంతరం భక్తులు బయటకు వెళ్లేందుకు మరో మార్గం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. లేదా దక్షిణ ద్వారం నుంచి ఎవరినీ పంపించకుండా చూడాలని కోరుతున్నారు. దక్షిణ ద్వారం గుండానే రాకపోకలు వీఐపీలు, రాజకీయ ప్రముఖులు, అధికారులకు ఇదే మార్గం కాశీబుగ్గ ఘటనతో ఉలిక్కిపడిన శ్రీముఖలింగం -
● ఉత్సాహంగా 5కే రన్
రాయగడ: సైబర్ సేఫ్టీ క్యాంపైన్లో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదివారం స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యఅతిథిగా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ రన్ ను ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం జరిగిన సభలొ ఎస్పీ స్వాతి మాట్లాడుతూ.. సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువతకు అవగాహన కల్పించి వారిలో చైతన్య పరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రన్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, పోలీస్ అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
మిస్ రాయగడ పోటీలకు సన్నాహాలు
రాయగడ: చిన్నారులు, మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో వంశీ క్రియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిస్ రాయగడ పోటీలు ఎంతగానో దోహదపడతాయని ముంబై నుంచి వచ్చిన పెమీనా మిస్ ఇండియా– 2019 విజేత శీతల్ సాహు అన్నారు. స్థానిక వంశీకృష్ణ ఫంక్షన్ హాల్లో మిస్ రాయగడ పోటీల ప్రత్యేక సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి తరహా పోటీలు మహిళలల్లో ఆత్మ విశ్వాసం పెంచుతాయని అభిప్రాయపడ్డారు. వంశీ క్రియేషన్ డైరక్టర్ మధురవాణి మాట్లాడుతూ విశాఖపట్నంకు చెందిన ఎలైట్ ఇన్స్టిట్యూట్, వంశీకృష్ణ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్, ఎలైట్ సంస్థ డైరక్టర్ సునీల్ రెడ్డి, జర్నలిస్ట్ అమూల్య రత్నసాహు, జిల్లా సాంసృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి, అటానమస్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ బబిలత షరప్ తదితరులు పాల్గొన్నారు. -
మెమూ షెడ్ సిబ్బంది స్థిరీకరణకు అంగీకారం
భువనేశ్వర్: రైల్వే అధికారులు, శ్రామిక్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన సంప్రదింపుల చర్చా సమావేశం ఫలప్రదమైంది. కార్మికుల తరఫున ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్చించారు. దాదాపు దశాబ్ద కాలంగా ఊగిసలాడుతున్న ఖుర్దారోడ్ మెమూ షెడ్ సిబ్బంది స్థిరీకరణకు అధికార యంత్రాంగం అంగీకరించడం విశేషంగా పేర్కొన్నారు. మెమూ రైళ్ల నిర్వహణ కోసం 2017 సంవత్సరంలో మెమూ షెడ్ ఖుర్దారోడ్లో ఏర్పాటైంది. విద్యుత్, యాంత్రిక విభాగాల నుంచి ఎంపిక చేసిన ఉద్యోగులతో మెమూ షెడ్ కార్యకలాపాలు చేపట్టారు.వేర్వేరు విభాగాల నుంచి నిర్ధిష్టంగా మెమూ రైళ్ల నిర్వహణ కోసం నియమితులైన వీరంతా అగమ్య గోచర స్థితిలో సేవల్ని అందిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక హోదాతో కూడిన గుర్తింపు కోసం శ్రామిక్ కాంగ్రెసు ఉద్యమించింది. దీర్ఘకాలం మంతనాలతో వీరికి అధికారిక హోదా కల్పించేందుకు అధికార యంత్రాంగం అంగీకరించింది. ఖుర్దారోడ్ మండల రెల్వే సమావేశం హాలులో సంప్రదింపుల చర్చా సమావేశం (పీఎన్ఎం) సుదీర్ఘంగా 2 రోజుల పాటు కొనసాగింది. డివిజనల్ హాల్లో అదనపు డివిజనల్ మేనేజర్ (ఇంఫ్రా) శుభ్ర జ్యోతి మండల్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం మండల రైల్వే అధికారి డీఆర్ఎం అలోక్ త్రిపాఠి సమక్షంలో ముగిసింది. 50 పైబడిన సిబ్బంది సంక్షేమ ప్రతిపాదనలపై అధికారులతో కార్మిక వర్గం లోతుగా చర్చించింది. వాటిలో సింహ భాగం ప్రతిపాదనల పట్ల అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించిందని ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు తెలిపారు. జోనల్ సమన్వయకర్త సునీల్ భంజ్, మండల సమన్వయకర్త నిరంజన్ మిశ్రా, ఎన్ఎఫ్ఐఆర్ కార్యనిర్వాహక సభ్యుడు లక్షీధర మహంతి, మండల శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
జవాన్ సేవలకు ప్రశంసలు
ఇచ్ఛాపురం: ఇండియన్ ఆర్మీలో చేరి దేశరక్షణతో పాటు ప్రజాసేవచేయడం వల్ల డిప్యూటీ చీఫ్ ఆర్మీ అధికారి నుంచి ప్రశంసా పత్రాన్ని పట్టణానికి చెందిన ఆర్మీజవాన్ ధర్మాల నూకరాజు అందుకున్నాడు. పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్ ధర్మాల నూకరాజు అతని యూనిట్తో పాటు 2023లో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో విధులు నిర్వహించాడు. ఆ ఏడాది అక్టోబర్లో హిమనదీయ సరస్సుకి వచ్చిన వరదల కారణంగా సరస్సు పై నిర్మించిన చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకు పోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు నిరాశ్రయులయ్యారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్మీయూనిట్ రిస్కీ ఆపరేష్ నిర్వహించి సహాయ సహకారాలు అందించారు. జవాన్లు చేసిన సేవలను గుర్తించిన డిప్యూటీ చీఫ్ ఆప్ ఆర్మీ ఆదివారం ప్రశంసాపత్రాన్ని సీఓ రాహుల్సింగ్ ద్వారా బెంగాల్ ఆర్మీ యూనిట్ వద్ద అందజేసినట్లు జవాన్ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో పొలికోత ఉత్సవం
గార: క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని శ్రీకూర్మనాథాలయంలో పొలికోత ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి శయనబేరం, అమ్మవార్లు పల్లకిపై గ్రామ శివారులోని ప్రత్యేక మంటపం వద్దకు చేరుకున్నాయి. ప్రత్యేక పూజలనంతరం అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు సంప్రదాయ పద్ధతిలో వరి కోతలు ప్రారంభించారు. అయితే, మంటపం వద్దకు వెళ్లేందుకు అర్చకులు, భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సరైన దారి లేక బురదలోనే నడిచి వెళ్లాల్సి వచ్చింది. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కై బాడి కుసుమకుమారిరాజు, మంటప నిర్మాణదారు శంభుమహంతి వెంకట అసిరిరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకూర్మనాథాలయం భక్తులతో కిటకిటలాడింది. వైఎస్సార్ సీపీ నాయకుడు యాళ్ల నారాయణమూర్తి రెండు వేల మందికి దద్దోజనం ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన స్కూల్గేమ్స్ జూడో ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ జూడో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా జూడో అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన ఈ ఎంపికలకు 100 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు మాట్లాడుతే పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, కఠోర సాధన అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రపోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పీఈటీ సంఘ నాయకుడు, జూడో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ గత ఏడాది స్కూల్గేమ్స్ జూడో పోటీల్లో పతకాలు పంట పండించారని.. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో రాణించి పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. కాకినాడ వేదికగా అండర్–17 రాష్ట్రపోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో జూడో కోచ్ పీఎస్ మణికుమార్, సంఘ ప్రతినిధులు మెట్ట తిరుపతిరావు, పాతిన రమేష్కుమార్, బి.నిర్మల్కృష్ణ, పురుషోత్తం, అనితశ్రీ, పీడీలు, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. -
చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలి
పర్లాకిమిడి: ప్రతి ఒక్కరూ చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం అలవర్చుకోవాలని కలెక్టర్ మధుమిత సూచించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థులు పొదుపు పథకాలు, పోస్టల్ బ్యాంకుల్లో పొదుపు చేసుకోవాలని సూచించారు. ఇతర ప్రైవేటు చిట్టీలు, మోసపూరిత వ్యక్తుల వద్ద పెట్టుబడి పెట్టరాదన్నారు. అనంతనం వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథులగా ఏడీఎం ఫల్గునీ మఝి, డీఆర్డీఏ అధికారి పృథ్వీరాజ్ మండల్, ఆదర్శ పోలీసుస్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపలి తదితరులు పాల్గొన్నారు. బొయిపరిగుడలో సబ్ట్రెజరీ కార్యాలయం ప్రారంభంజయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ తహసీల్దార్ పరిధిలో లోక్ సేవా భవనంలో నూతన సబ్ట్రెజరీ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి మోహన మఝి శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా బొయిపరిగుడ సమితి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రచారాన్ని సభికులు, ప్రజలు తిలకించారు. కార్యక్రమంలో పాల్గొన్న బొయిపరిగుడ తహసీల్దార్ సిగ్ధ చౌధురి ప్రసంగిస్తూ నేటి వరకు బొయిపరిగుడ సమితి ప్రజలు ట్రెజరీ పనులకు జయపురం వెళ్లాల్సి వస్తుండేదన్నారు. ఇకపై బొయిపరిగుడలో సబ్ ట్రెజరీ ఏర్పాటు కావటంతో సమితి ప్రజలందరూ లబ్ధి పొందగలరని అన్నారు. బొయిపరిగుడ సబ్ట్రెజరీ సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో బొయిపరిగుడ సర్పంచ్ సూర్యమణి నాయిక్, సమితి సభ్యులు మంజులత పట్నాయక్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వ్యభిచారం కేసులో ఇద్దరు అరెస్టు పర్లాకిమిడి: కాశీనగర్లోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు ఐఐసీ సునీల్ కుమార్ బెహారా సిబ్బందితో ఆకస్మికంగా శనివారం దాడులు జరిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి రూంలోని బీర్ బాటిళ్లు, కండోమ్లు, మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బాధితులను వారి నుంచి విడిపించి కాపాడారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు కాశీనగర్ పోలీసు అధికారి సునీల్ కుమార్ బెహారా తెలిపారు. -
ఇందిరా గాంధీకి ఘన నివాళి
పర్లాకిమిడి: మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతిని సోండివీధి కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ఉత్తమ పరిపాలన అధ్యక్షురాలిగా పేరొందారని, ఆమె ఆచరణలో మనందరం నడవాలని దాశరథి గోమాంగో అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా, మున్ను మహరాణా, ఎస్.పాపారావు, సూర్యనారాయణ పాత్రో, అశోక్ అధికారి, రాజపాత్రో, తదితరులు పాల్గొన్నారు. 35 యూనిట్ల రక్తం సేకరణ రాయగడ: స్థానిక ప్రభుత్వ హస్పిటల్లో గల రక్తదాన కేంద్రం వద్ద శుక్రవారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 35 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వహిందు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. విశ్వహిందు పరిషత్ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ప్రపుల్ల పాత్రో, కార్యదర్శి గోపీనాథ్ గౌడొ, అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భొగిలి రాజేష్, బిల్లా, తదితరులు పాల్గొన్నారు.మలేరియాతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి రాయగడ: సదరు సమితి బాయిసింగిలో గల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న నందిని తాడింగి అనే విద్యార్థిని మలేరియా వ్యాధితో మృతి చెందింది. అక్టోబర్ 29 వ తేదిన అస్వస్థతకు గురైన నందినికి ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు ఆశ్రమంలో గల మలేరియా కిట్ ద్వార రక్త నమూనాను సేకరించి పరీక్షంచగా మలేరియా సొకినట్లు గుర్తించారు. దీంతో విషయాన్ని నందిని కుటుంబీకులకు తెలియజేశారు. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన నందిని ఆరోగ్య పరిస్థితి కొంతమేర మెరుగుపడటంతో తిరిగి హాస్టల్కు తరలించారు. కానీ 24 గంటల్లో మళ్లీ అనారోగ్యం రావడంతో తండ్రి రాజారావు ఆమెను తన స్వగ్రామం డంగిజొడికి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక గురువారం రాత్రి నందిని మృతి చెందినట్లు సమాచారం. ఆరు కిలోల గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి పోలీసులు ఐఐసీ ముకుందో మేల్క ఆదేశాల మేరకు యంపీవీ 31 గ్రామం సమీపంలో గురువారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఓ బస్తాను భుజాన వేసుకుని వస్తున్నారు. పోలీసులు వారిని ఆపి ప్రశ్నించగా వారు తడబడ్డారు. వారి వద్ద ఉన్న బస్తాను తెరిచి చూడగా అందులో గంజాయి కనిపించింది. వారు తెలంగాణకు తరలించేందుకు వచ్చారు. పతిపముల వంశీ, రాచర్ల వంశీ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి నుంచి ఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లు, రూ.6వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. -
అవినీతి నిర్మూలనకు కృషి చేయాలి
● విజిలెన్స్ ఎస్పీ ప్రదీప్ కుమార్ ప్రధాన్పర్లాకిమిడి: అవినీతి అన్ని శాఖల్లో ఉందని.. దీన్ని పూర్తిగా అంతమోందించలేక పోయినా కనీసం నిర్మూలనకు మనందరం పాటుపడదామని బరంపురం విజిలెన్సు (దక్షిణ మండలం) సర్కిల్ ఎస్పీ ప్రదీప్ కుమార్ ప్రధాన్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి అవినీతి నివారణ సచేతన వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇటీవల ఓ ప్రభుత్వ అధికారి ఇంటిని సోదాచేయగా 115 రెసిడెన్స్ ప్లాట్లు, కోట్లాది రూపాయలు, బంగారం బయటపడ్డాయని అన్నారు. లంచం ఇచ్చినా.. పుచ్చుకున్నా సమాజంలో నేరమని అన్నారు. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పురప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్, లేదా 0680 2282300కి ఫోను చేసి సమాచారం అందించాలని అన్నారు. జిల్లా ఎస్పీ పండా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాల కంటే అధికంగా డబ్బును ఆర్జించాలన్న స్వార్ధం ఉండకూడదన్నారు. ఉంటే అనేక అనర్ధాలకు దారితీస్తుందని అన్నారు. ఒక అధార్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులు నెలలు తరబడి తిప్పిస్తున్నారంటే అక్కడ అవినీతి వున్నదని సూచిస్తున్నదని జిల్లాకలెక్టర్ అన్నారు. అనంతరం అవినీతి నిర్మూలన సచేతన వారోత్సవాలు పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, రచన పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతులమీదుగా బహుమతి ప్రదానం చేశారు. అనంతరం జిల్లా ఏడీఎం మఝి ప్రభుత్వ ఉద్యోగులచే అవినీతికి పాల్పడనని ప్రమాణం చేయించారు. ఏ.డీఎం ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా, డీఈవో డాక్టర్ మఽయాధర్ నాయక్ పాల్గొన్నారు. -
జనవరి 2 నుంచి పుష్యపుణి పర్వ మహోత్సవాలు
● ఉత్సవ కమిటీ నిర్ణయంజయపురం: కొరాపుటియ కళ, కళాకార సంఘం ద్వారా జయపురంలో ఏటా నిర్వహించే పుష్యపుణి పర్వ్ మహోత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకుక ఉత్సవ కమిటీ నిర్ణయించింది. 2026 జనవరి రెండో తేదీ నుంచి ఉత్సవాలను ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. స్థానిక పవర్ హౌస్ కాలనీ గీతాంజలి మండపంలో కొరాపుట్ కళ, కళాకార సంఘ సాధారణ కార్యదర్శి, ప్రముఖ సంగీత కళాకారుడు ధిరెన్ మోహణ పట్నాయక్ నేతృత్వంలో శుక్రవారం కళాకారుల సమావేశం జరిగింది. సంఘ అధ్యక్షులు మనోజ్ పాత్రో అధ్యక్షత జరిగిన సమావేశంలో జనవరి ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు పుష్యపుణి మహోత్సవాలు జరిపేందుకు నిర్ణయించింది. ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా.. నూతన కళాంశాలు చేర్చి ప్రజలను రంజింప చేయాలని నిర్ణయించారు. మహోత్సవంలో ప్రాంతీయ చిన్న సినిమాలు, నాటక పోటీలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఆదివాసీ సంగీత, నృత్య పోటీలు నిర్వహించి ఆదివాసీ కళాకారులకు ఉత్సాహ పరచివారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రసిద్ధ కళాకారులను ఆహ్వానించడంతో పాటు స్థానిక కళాకారులు, ఆదివాసీ కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కార్యదర్శి ధిరెన్ మోహన్ పట్నాయక్ వెల్లడించారు. పుష్యపుణి మహోత్సవాలు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పుష్యపుణి మహోత్సవాలకు దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థలను ఆహ్వానించి వారి ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహోత్సవాలు నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో జయపురం ప్రముఖ సీనియర్, జూనియర్ కళాకారులు పాల్గొన్నారు. వారిలో గుప్తేశ్వర పాణిగ్రహి, కమళాకాంత రథ్, ప్రయూష్ పట్నాయక్ జయంత దాస్, శ్రీకాంత దాస్, మహమ్మద్ షరాఫ్, రామనాథ్ త్రిపాఠీ, సుధాకర పట్నాయక్, పద్మ చరణ చౌధురి, పలువురు కళాభిమానులు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహిళ మృతదేహం లభ్యం
మల్కన్గిరి: మల్కన్గిరి సదర తహసీల్ పరిధిలో పంచాయతీ కార్యాలయ సమీపంలో రాజేష్ బిస్వాస్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. రాజేష్ భార్య శంకరి బిస్వాస్ శుక్రవారం ఉదయం తన ఇంటిలో ఉరి వేసుకున్నారు. మృతదేహాన్ని చూసి మల్కన్గిరి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఐఐసీ రీగాన్కీండో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారించారు. మృతురాలి తల్లిదండ్రులు కలిమెల సమితి ఎంపీవీ 23 గ్రామం నుంచి వచ్చి తమ బిడ్డను హత్య చేశారని ఫిర్యాదు చేశారు. భార్య మృతదేహాన్ని అలా చూసి భర్త రాజేష్ ఆయన తల్లి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
● ఐక్యతే మన నిబద్ధత
భువనేశ్వర్: జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని శుక్రవారం దేశ వ్యాప్తంగా నిర్వహించే జాతీయ సమైక్యత దినం వేడుకల్లో భాగంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ను పురస్కరించుకుని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శుక్రవారం అభిషేక్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించగా.. కళింగ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రజలతో సమైక్యత భావాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. -
సామూహికంగా మహా ప్రసాదం సేవించిన గవర్నర్ దంపతులు
భువనేశ్వర్: గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, సతీమణి జయశ్రీ సమేతంగా రాజ్ భవన్ సిబ్బందితో కలిసి పూరీ శ్రీ జగన్నాథుని మహా ప్రసాదం సేవించారు. పవిత్ర కార్తీక మాసంలో శ్రీ జగన్నాథుని మహా ప్రసాదం లభించడం పూర్వ జన్మ సుకృతంగా భక్తజన హృదయాల్ని పులకింపజేస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ అభిషేక్ హాల్లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ప్రథమ మహిళ జయశ్రీ కంభంపాటి సిబ్బందితో కలిసి సామూహికంగా మహా ప్రసాదం సేవించారు. దీంతో ప్రసాద సేవన ప్రాంగణం విశ్వాసం, సంప్రదాయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రశాంతమైన, భక్తిమయ వాతావరణం అలముకుంది. -
15 లక్షల హెక్టార్లకు సాగునీరు లక్ష్యం: ముఖ్యమంత్రి
విలేకర్లతో ముఖ్యమంత్రి సమావేశంభువనేశ్వర్: రాష్ట్రంలో 15 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకు జల వనరుల విభాగం సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ దిశలో సమర్థంగా మలిచేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర జల వనరుల శాఖ పని తీరును ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ భవన్ సముదాయంలో రాష్ట్ర జల వనరుల సమాచారం కేంద్రం సందర్శించారు. రాష్ట్రంలో జలాశయాలు, నదులలో తాజా నీటి మట్టాలను పర్యవేక్షణని ముఖ్యమంత్రి సమీక్షించారు. వివిధ ఉప విభాగాలలో ఇంజినీర్లు, సిబ్బందితో సంభాషించారు. 2029–30 నాటికి రాష్ట్రంలోని 15 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. దీనితో పాటు, జల వనరులకు చిట్ట చివర వరకు సాగు నీరు చేరేలా చూస్తున్నామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగాన్ని మరింత సమర్థమైన, స్మార్ట్ కార్యాలయంగా మారుస్తామని విలేకరులకు వివరించారు. అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ పాఢి మరియు ఇతర సీనియర్ అధికారులు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
రాయగడ: స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహార్షి విద్యా మందిరం ప్రాంగణంలో శుక్రవారం ఆరోగ్యమే మహాభాగ్యం–మనపాత్ర అన్న అంశంపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి మాట్లాడుతూ.. ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్యానికి నడక ఎంతో మేలు చేస్తోందన్నారు. నవ్వడం, నవ్వించడం కూడా ఆరోగ్యంలో భాగమేనని అన్నారు. వాకర్స్ క్లబ్ ముఖ్యసలహాదారుడు సత్యవాది పతి, పాస్ట్ ఏరియా ఉపాధ్యక్షుడు అభిమన్యు నాయక్, టి.జయరాం, ఉదయ పండా, తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. -
ప్రత్యేక పూజలు
రాయగడ: రాధాకాంత మందిరంలో శుక్రవారం విశేష పూజలను నిర్వహించారు. కార్తీక మాసం పర్యదినాల్లో అమలా నవమిని పురస్కరించు కుని పట్టణంలో గల రాధాకాంత మందిరాల్లో ప్రత్యేక పూజలను చేపట్టారు. అమ్మవారి దర్శన భాగ్యం కోసం భక్తులు తరలివచ్చారు. ప్రతీ ఏడాది అమలా నవమి రోజు మాత్రమే ఈ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ సందర్భంగా ఉసిరి కాయాల దండలను సమర్పించారు.పాలసింగిలో హనుమాన్ మందిర ప్రతిష్ట పర్లాకిమిడి: కాశీనగర్ సమితి ఖండవ పంచాయతీ పాలసింగి గ్రామంలో హనుమాన్ మందిరం ప్రతిష్టలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.. ఈ కార్యక్రమంలో రోక్కం సతీష్, హడ్డుబంగి మాజీ సర్పంచ్ బాబూరావు, మాజీ చైర్మన్ నృసింహా చరణ్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం శ్రీకాకుళం పాతబస్టాండ్: డ్రైవింగ్లో నైపుణ్యాన్ని సాధించాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో హెవీ డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా హెవీ లైసెన్సు పొందేందుకు లైట్ మోటారు వెహికిల్ లైసెన్స్ కలిగిన ఎస్సీ అభ్యర్థులు నుంచి ఇటీవల దరఖాస్తులు కోరగా 32 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో పది మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు వివరించారు. 32 రోజుల శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెవీ లైసెన్సుతో డ్రైవింగ్లో ఉపాధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ, డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, ఆర్టీసీ డిపో– 1 డీఎం అమరసింహుడు, పీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
యూజీఎంఐటీ విద్యార్థుల ఆందోళన
రాయగడ: స్థానిక ఉత్కళ గౌరవ్ మధుసూదన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూజీఎంఐటీ)లో మొదటి సెమీస్టర్ చదువుతున్న ఒక విద్యార్థినితో అధ్యాపకుడు ప్రదీప్ కుమార్ త్రిపాఠి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఇనిస్టిట్యూట్ ప్రధాన గేటు వద్ద విద్యార్థులు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అధ్యాపకుడు త్రిపాఠిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలోకి వెళితే...అక్టోబరు 25వ తేదీన ఇనిస్టిట్యూట్లో క్రీడా పోటీలకు సంబంధించి విద్యార్థుల ఎంపిక జరుగుతున్న సమయంలో పోటీల్లో పాల్గొనేందుకు మొదటి సెమిస్టర్ చదువుతున్న ఆదివాసీ విద్యార్థిని కూడా తన పేరును నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఎంపిక చేసే కమిటీలో అధ్యాపకుడు త్రిపాఠి కూడా పాల్గొన్నారు. అయితే ఎంపిక పేరిట విద్యార్తినితో అసభ్యమంగా ప్రవర్తించడంతో అప్పట్లోనే విద్యార్థిని ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇనిస్టిట్యూట్లో ఉన్న నలుగురు కమిటీ సభ్యులు ఆమెను ఈ విషయమై విచారించారు. అనంతరం అధ్యాపకుడు ప్రవర్తనను నిలదీసి అతనిపై చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా అధ్యాపకుడు త్రిపాఠిపై ఎటువంటి చర్యలు తీసుకోకపొవడంతో ఆగ్రహించిన విద్యార్థులు శుక్రవారం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆదివాసీ మహాసంఘం మద్దతు యూజీఎంఐటీలో చదువుతున్న విద్యార్థినిపై అధ్యాపకుడు అసభ్య ప్రవర్తనను ఖండించిన బీజేడీ పార్టీకి చెందిన ఆదివాసీ నాయకురాలు అనసూయా మాఝి, హరప్రసాద్ హెప్రుక, రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఆదివాసీ యువతీ, యువకులు వస్తున్నారని వారికి సరైన రక్షణ కరువవ్వడంతో వారు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా మాఝి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేపడుతున్న ఆందోళన వద్ద బైఠాయించిన ఆదివాసీ నాయకులు తమ మద్దతును తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు తనపై అధ్యాపకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని లిఖిత పూర్వకంగా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అధ్యాపకుడు త్రిపాఠిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం పోలీసులు విద్యార్థులను బుజ్జగించడంతొ పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం ఆందోళనను విరమించారు. -
బాటలో నడుద్దాం
సర్దార్ ● ఏక్తా దివస్లో భాగంగా ర్యాలీలుపర్లాకిమిడి: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ బాటలో ప్రతిఒక్కరూ నడవాలని వక్తలు అన్నారు. పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివాస్ను స్థానిక మోడల్ పోలీసుస్టేషన్లో శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. భారత్ శాంతికాముక దేశమని, ఈ అఖండ భారత్ నిర్మాణం, ఐకమత్యం, ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలన్నారు. అనంతరం జిల్లా పోలీసు దళం, శ్రీక్రిష్ణచంద్ర గజపతి కళాశాల ఎన్సీసీ క్యాడెట్లచే ఎక్తాదివాస్పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ పాల్గొన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ నుంచి రాజవీధి వరకూ గణ దౌడో మారథాన్లో జిల్లా ఎస్పీతో సహా పోలీసు ఉద్యోగులంతా పాల్గొన్నారు. జిల్లా క్రీడా విభాగం ఆధ్వర్యంలో.. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా క్రీడావిభాగం ఆధ్వర్యంలో పటేల్ జయంతిని నిర్వహించారు. రాజవీధిలో గజపతి ప్యాలస్ నుంచి మాస్ ర్యాలీని ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ వరకూ ర్యాలీ జరిగింది. అనంతరం కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి మధుమిత మినీస్ట్రీరియల్ ఉద్యోగులతో ప్రమాణం చేయించారు. అఖండ భారత్లో జాతి, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా నవభారత్ నిర్మాణంలో సహకారం అందిస్తానని ప్రమాణం చేయించారు. ర్యాలీలో జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, జిల్లా శారీరిక క్రీడా అధికారి సురేంద్ర కుమార్ పాత్రో పాల్గొన్నారు. ఘనంగా సర్దార్ జయంతి జయపురం: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదినం, రాష్ట్రీయ ఏకతా దినం సందర్భంగా జయపురం పట్టణ పోలీసు అధికారులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ప్రజా పరుగు పందాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ ముఖ్యఅతిథిగా పాల్గొని పరుగు పందాలు ప్రారంభించారు. ఈ పరుగు పందాలు పట్టణ పోలీసు స్టేషన్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గం మీదుగా రఘునాథ్ మందిర కూడలి వరకు జరిపారు. కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంధ్ర రౌత్, రెండో అధికారి సిద్ధార్థ కుమార్ బెహర, ఏఎస్ఐ సోపన్ మిశ్ర, పోలీసు సిబ్బంది, సీనియర్ సిటిజన్లు కిశోర్ హొత్త, కృష్ణ చంద్ర హొత తదితరులు ఎస్సీసీ విద్యార్థులు, విక్రమదేవ్ వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు బిక్రమ్ బొడొనాయిక్, బిజయ పూజారి, త్రిదేవ్ బ్రహ్మ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థినులు పూర్ణి మల్లిక్, స్వాతి జాని, ఉషా పాడి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. సీనియర్ సిటిజన్స్ గ్రూపులో కృష్ణ చంద్ర హొత, లక్ష్మీకాంత పాఢీ, సురేష్ కుమార్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. విజేతలకు ఎస్డీపీఓ పార్థజగదీష్ కాశ్యప్ బహుమతులు అందజేసి సన్మానించారు. ఉక్కు మనిషికి కంభంపాటి శ్రద్ధాంజలి భువనేశ్వర్: ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి ఆయన స్మృతికి ప్రణామం చేశారు. 560 పైబడి సంస్థానాలను ఏకీకృతం చేసి స్వతంత్ర భారత దేశం పాలన వ్యూహకర్తగా పటేల్ దార్శనిక నాయకత్వం భారతీయుల ఐక్యత, బలానికి మూలస్తంభంగా నిలిచింది. ఈ స్ఫూర్తి వికసిత్ భారత్ సాధనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని గవర్నర్ స్మరించారు. సమైక్యతకు ఆదర్శం సర్దార్ పటేల్ భువనేశ్వర్: ఉక్కు మనిషిగా వాసికెక్కిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పాల్గొన్నారు. స్థానిక కళింగ స్టేడియంలో ఉక్కు మనిషి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళింగ స్టేడియంలో రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ నిర్వహించిన ఐక్యత పరుగును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఐక్యత పరుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉత్సాహంతో ముందంజలో పరుగు తీసి ఆబాలగోపాలాన్ని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు ఐక్యత, సోదర భావం, దేశ భక్తి భారతీయ ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. సర్దార్ పటేల్ దార్శనికత సదా చిరస్మరణీయమని తెలిపారు. మనమందరం కలిసి, ఐక్యంగా పనిచేస్తే, అభివృద్ధి చెందిన భారత దేశం కలను త్వరలో సాకారం చేసుకోగలమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను బలోపేతం చేసి యువత, ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని మేలుకొల్పడానికి ప్రేరణగా ఐక్యత పరుగు (రన్ ఫర్ యూనిటీ) నిర్వహించినట్లు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలు మనందరినీ సమైక్య బాటలో బంధిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పూరీ లోక్ సభ సభ్యుడు డాక్టర్ సంబిత్ పాత్రో పూరీలో ‘రన్ ఫర్ యూనిటీ‘ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో ఆయనతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారిలో స్థానిక అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శరత్ చంద్ర బెహరా మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
● రైతు సంక్షేమమే ధ్యేయం
రాయగడ: రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కొరాపుట్ సెంట్రల్ కోపరేటీవ్ బ్యాంక్ (కేసీసీబీ) కృషి చేస్తోందని ఆ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రహి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో శుక్రవారం బ్యాంక్ 75 వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు పనితీరు గురించి వివరించారు. గత 75 ఏళ్లుగా బ్యాంకు రైతులకు సేవలందించి అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు వ్యక్తిగత, పంట రుణాలను అతి తక్కువ వడ్డీలకు అందించి, వారికి అండగా నిలుస్తోందన్నారు. కొరాపుట్, నవరంగపూర్, మల్కనగిరి, రాయగడ జిల్లాల్లో ఇప్పటికి 200 సొసైటీలు, 23 బ్యాంకులు పని చేస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఆయా జిల్లాల్లో గల ప్రతీ సమితిలో ఒకొక్క బ్యాంకును ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కేసీసీబీ కార్యదర్శి అతూల్య కుమార్ మల్లిక్ తన వార్షిక నివేదికను వివరించారు. ఆయా జిల్లాలకు చెందిన రిజిస్ట్రార్లు, డైరెక్టర్లు, సంచాలకులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మల్కన్గిరిలో ఇందిరాగాంధీ వర్ధంతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఆర్ఎమ్మెసీ కార్యాలయ ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ఇందిర చేసిన సేవలను గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు గోవిందపాత్రో, పి.కేసురావు పాల్గొన్నారు. -
జైలు నుంచి 114 మంది ‘ఎస్ఐ అభ్యర్థులు’ విడుదల
భువనేశ్వర్: ఒడిశా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష కుంభకోణం కేసు మలుపులు తిరుగుతోంది. క్రైం శాఖ దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన వారిలో అత్యధికులకు షరతులతో కూడిన బెయిల్ను న్యాయ స్థానం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 114 మంది నిందితులను గురువారం జైలు నుంచి విడుదల చేశారు. వీరంతా ఔత్సాహిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కోసం పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు కావడం విశేషం. న్యాయ స్థానం వీరికి బెయిల్ మంజూరు చేయడంతో బరంపురం జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత వారు విడుదలయ్యారు. మరో వైపు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షల కుంభకోణంపై ముఖ్యమంత్రి సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేశారు. -
నేడు అమలా నవమి
భువనేశ్వర్: పూరీ జిల్లా సాక్షి గోపాల్ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ క్షేత్రంలో రాధాదేవీ పాద దర్శనం ప్రముఖ ఉత్సవం. ఏటా కార్తీక మాసం శుక్ల నవమి నాడు ఈ దర్శనం లభిస్తుంది. ఈ ఏడాది శుక్రవారం రాధా పాద దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గోపాల్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దీన్నే అక్షయ నవమి, అమలా నవమిగా పేర్కొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సాక్షిగోపాల్ పట్టణం ఉత్సవ సన్నాహాలతో కళకళలాడుతోంది. ఈ ప్రత్యేక రోజున, భక్తులకు రాధారాణి దేవి పాదాలను చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఏడాది పొడవునా దేవీ పాదాల దర్శనం లభించదు. ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. రాధా పాద దర్శనం మోక్షం ప్రసాదిస్తుందని భక్తుల నమమ్మకం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా రాధా పాద దర్శనం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాధారాణి దేవత అద్భుతమైన ఒడియా ఇంటి ఆడపడుచు (ఒడియాణి) అలంకరణలో, సాక్షి గోపాలుడు నటవర్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. సంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజాదులు నిర్వహించి భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికార యంత్రాంగం విస్తత ఏర్పాట్లు చేస్తుంది. గట్టి భద్రత రాధా పాద దర్శనం కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో సాక్షి గోపాలు పట్టణ వ్యాప్తంగా భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. వరుస క్రమంలో భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రవాణా క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పైబడి భక్తులు రాధా పాద దర్శనం కోసం తరలి వస్తారని నిర్వహణ యంత్రాంగం అంచనా. తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీ జిల్లా మేజిస్ట్రేటు , పోలీసు సూపరింటెండెంట్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సాక్షిగోపాలు క్షేత్రం సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. దర్శనం పురస్కరించుకుని 11 వరుసల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పంచసఖ బహిరంగ స్థలం, పరిసర ప్రాంతాలలో సువిశాల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.


