breaking news
Orissa
-
ప్రేమించుకున్న అన్నాచెల్లెళ్లు.. గ్రామానికే అరిష్టమని..!
ఒడిశా: ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ప్రేమికులను నాగలికి కట్టి ఊరేగించిన ఘటన సంచలనం రేకెత్తించింది. జిల్లాలోని నారాయణ పట్న సమితి, బొరికి గ్రామ పంచాయతీ పెద్ద ఇటికి గ్రామంలో ఒకే వంశానికి చెందిన ఇద్దరు గిరిజనులు ప్రేమించుకున్నారు. ఈ విషయం రథయాత్ర సమయంలో వెలుగులోకి రావడంతో పెద్దలు కఠిన శిక్ష విధిస్తారనే భయంతో వీరు ఆంధ్రాకు పారిపోయారు. కానీ, వారి ఆచూకీని ఇరు కుటుంబాల వారు పసిగట్టి గ్రామ పెద్దలకు నివేదించారు.ఒకే వంశానికి చెందిన వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దరూ ప్రేమించుకోవడం గ్రామానికే అరిష్టమని, పంటలు పండవని, పాపశుద్ధి జరగాలని పేర్కొంటూ వీరిని ఆదివారం ఊరికి రప్పించారు. అయితే ప్రేమికులు తాము ఎలాంటి శిక్షనైనా భరిస్తాం గానీ విడిపోయి ఉండలేమని తేల్చి చెప్పారు. దీంతో వారిని గ్రామం నడిబొడ్డున నాగలికి కట్టి ఊరేగించి శుద్ధిజలం చల్లారు. శిక్ష అమలు తర్వాత ఇద్దరూ కలిసి ఉండొచ్చని పెద్దలు నచ్చజెప్పి తీసుకురావడం గమనార్హం. -
నేటి నుంచి ఒడిశాలో రాష్ట్రపతి పర్యటన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె సోమవారం భువనేశ్వర్కు చేరుకుంటారని రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవా రం భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయి మ్స్) ఐదవ స్నాతకోత్సవానికి హాజరవుతారు. రెండో రోజైన జూలై 15న రావెన్షా విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అలాగే రావెన్షా బాలికల ఉన్నత పాఠశాల మూడు భవనాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. ఆదికాబి సరళ దాస్ జయంతి వేడుకలకు హాజరవుతారు. -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
రాయగడ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దొహదపడతాయని సీఆర్ఫీఎఫ్ నాలుగో బెటాలియన్ కమాండెంట్ ఎం.ఎల్.నాయుడు గెడల అన్నారు. జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల సమీపంలో గల పయిలాపడ గ్రామంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వహించారు. రఘుబారి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు 800 మొక్కలను నాటారు. సీవా సంస్థ ఆధ్వర్యంలో.. కొరాపుట్: పర్యావరణ పరిరక్షణలో మరో భారీ కార్యక్రమం జరిగింది. ఆదివారం జయపూర్ సమీపంలోని గగనాపూర్ వద్ద ప్రభుత్వ భూమిలో పర్యవరణం కోసం గత 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న సోషల్ ఎన్విరానామెంటల్ ఎడ్యేకేషనల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) వన యజ్ఞం చేసింది. అటవీ శాఖ అందించిన వేయి మెక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. తొలి రోజు భారీ ఎత్తున మొక్కలు నాటారు. గగనాపూర్ శివ మందిర పరిసర ప్రాంతంలో మొక్కలు నాటారు. సీవాకి చెందిన జీవీ రెడ్డి, సుధాకర్ పట్నాయక్, వినాయక్ మహాపాత్రో, ప్రతాప్ పట్నాయక్, కిల్లంశెట్టి మెహన్రావు, తదితరులు పాల్గొన్నారు. జయపురంలో.. జయపురం: ‘ఒక మొక్క అమ్మ పేరున’ కార్యక్రమంలో జయపురం సమితి యు.పి.ఎస్ ప్రాంతీయ సాధనా కేంద్రంలో ఆదివారం వనమహోత్సం వారోత్సవాలు నిర్వహించారు. జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన కుమార్ ఆదేశాల మేరకు సి.ఆర్.సి.ఎస్ విజయలక్ష్మీ ౖస్వైయ్ పర్యవేక్షణలో మొక్కలు నాటారు. అబిజాన్లో హనాగుడ ప్రాథమిక పాఠశాల, గొడియ దొబాసాయి ప్రాథమిక పాఠశాల, పంజార హౌస్ కాలనీ పాఠశాల, సాంతరా సాహి పాఠశాల, ఎక్స్ బోర్డు మహమ్మదన్ పాఠశాల, సరస్వతీ బాల మందిరం, జయనగర్ ఆశ్రయం పాఠశాల, జయనగర్ ఉన్నత పాఠశాల, పాయిక వీధి పాఠశాల, సునారి సాహి ప్రభుత్వ యూపీఎస్ పాఠశాల, జగదీష్ చంద్రనాయక్ ఉన్నత పాఠశాల, మునిసిపాలిటీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ వరకు ఉంటుందని విజయలక్ష్మీ ౖస్వైయ్ తెలిపారు. జయపురంలో.. జయపురం: జయపురం తెలుగు సంస్కృతిక సమితి నిర్వహిస్తున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాల ద్వారా ఆదివారం జయపురం సమితి గగణాపూర్ గ్రామ ప్రాంతంలో వన మహోత్సవం నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సోషియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఎన్విరాన్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా)సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 26 మంది ఎకో క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు. వారితోపాటు పీఈటీ రీటా సామంత రాయ్, పాఠశాల ఉపాద్యాయులు ధనపతి భొత్ర, సోన, సిటీ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్ పాల్గొన్నారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో వివిధ రకాల 1,000 మొక్కలు నాటినట్లు ఎకో క్లబ్ ఇన్చార్జి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ తెలిపారు. రానున్న ఆదివారం కూడా వనమహోత్సవం నిర్వహిస్తామని, 2,500 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఉన్నామని వెల్లడించారు. జయపురం పాఠశాల నుంచి గగణాపూర్ గ్రామానికి ఎకో క్లబ్ విద్యార్థులు సైకిళ్లపై వెళ్లారు. -
గుండాల్ సర్పంచ్ మృతి
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్ర సమితిలో కొత్తగా ఏర్పాటు చేసిన గుండాల గ్రామ పంచాయతీ సర్పంచ్ భక్త ఖోశ్ల (40) శనివారం తన స్వగృహంలో మృతి చెందారు. గత రెండేళ్లుగా ఖోశ్ల క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య శశి కలాపి, కుమారుడు ఉన్నారు. 2017లో గుండాల్ పంచాయతీగా ఏర్పడగా ప్రథమ సర్పంచ్గా అతడి భార్య శశి కలాపి పనిచేశారు. రెండోసారి జరిగిన ఎన్నికలలో ఖొశ్ల సర్పంచ్గా ఎన్నికయ్యారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బంధువులు సంతాపం తెలియజేశారు. విద్యుదాఘాతంతో ఏనుగు మృతి భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా సంబల్పూర్ జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రెఢాఖోల్ అటవీ ప్రాంతం నకొటిదెవులో రేంజ్ టికిలిపొడా గ్రామ సమీపంలో ఈ సంఘటన ఆదివారం జరిగింది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ కావడంతో భువనేశ్వర్ నుంచి ప్రత్యేక బృందం ఘటనా స్థలానికి బయల్దేరింది. బ్రిటీష్ కాలం నాటి రైల్వేవంతెన తొలగింపు వజ్రపుకొత్తూరు: మారుతున్న కాలం, టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న భారత రైల్వే కొత్త బాటలో పయనిస్తోంది. పాతవి జ్ఞాపకాలే అయినా ప్రజలకు చేరువయ్యేలా సేవలు అందించాలన్నది లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా బ్రిటీష్ కాలం నాటి కట్టడాలను తొలగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్లో భారీ క్రేన్ల సాయంతో పాత కాలినడక వంతెనను తొలగించే పనులు చేపట్టింది. కేవలం 8 గంటల్లోనే వంతెన మొత్తాన్ని విడిభాగాలు చేసి తొలగించింది. కింది భాగంలో 25వేల కిలోవాట్ల విద్యుత్ తీగలు ఉన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పనులు పూర్తి చేశారు. ఈస్ట్కోస్ట్ రైల్వేలో చివరి స్టేషన్గా ఉన్న పూండికి వాల్తేరు డివిజన్ నుంచి ప్రధాన ఇంజినీర్లు, టెక్నికల్ బృందం వచ్చి తొలగింపు పనులు చేపట్టారు. వంతెన తొలగింపునకు ముందే మూడు నెలలు కిందట సమాంతరంగా కొత్త వంతెన నిర్మించారు. -
విద్యా మందిరంలో గురుపూజోత్సవం
జయపురం: జయపురం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విభాగం వారు ఆదివారం స్థానిక శారదా విహార్ విద్యామందిర ప్రాంగణంలో శ్రీగురు దక్షిణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో పశ్చిమ ప్రాంత ఆర్ఎస్ఎస్ సంఘ పరిచాలక్ ప్రొఫెసర్ సనాతన ప్రధాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జయపురం పట్టణ ఆర్ఎస్ఎస్ పరిచాలక్ డాక్టర్ నిరంజన్ ప్రధాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సనాతన ప్రధాన్ ప్రసంగిస్తూ.. గురు దక్షిణ ఉత్సవం ప్రాధాన్యతను వివరించారు. ఉపాధ్యాయులు, గురువులు మనలను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది మంచి మనషులుగా సమాజానికి అందిస్తారన్నారు. అటువంటి మహానీయులైన గురువులను పూజించి వారికి గురుదక్షిణ ఇవ్వడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అని వివరించారు. గురువులు పూజ్యనీయులని బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర స్వభావులన్నారు. అందుచేత గురువు మనకు విద్య నేర్పినందుకు గురు దక్షిణ ఇవ్వడం సంప్రదాయమన్నారు. ఈ రోజున మన శక్తి, సామర్ాధ్యలను బట్టి గురువులకు గురు దక్షిణ సమర్పించే కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా పలువురు గురువులకు గురుదక్షణలు సమర్పించి వారి ఆశీర్వాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రముఖ ఉపాధ్యాయులు ముకుంద భోయి, సుభ్రత్ కుమార్ పండ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల గృహదీక్ష
రణస్థలం: డీఎస్సీ–2003 ఫోరం పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 2003 బ్యాచ్ ఉపాధ్యాయులు గృహ దీక్ష చేపడుతున్నారని ఆపస్ మండల అధ్యక్షుడు జి.చిన్నికృష్ణంనాయుడు, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి బి.చిన్నంనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో 57 మేరకు అర్హత కలిగిన అందరికి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే శాంతియుత నిరసనకు కుటుంబ సమేతంగా అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. దుండగులను కఠినంగా శిక్షించాలి జి.సిగడాం: డి.ఆర్.వలసలో ఈ నెల 12న శనీశ్వరుడి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు కోరారు. ఆదివారం ఆలయంలో విగ్రహాల పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని సర్పంచ్ కుమరాపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ కుమరాపు రమేష్నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, ఆలయ శిల్పి కుమరాపు రామినాయుడు, కుమరాపు చిన్న శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వ్యక్తి అనుమానాస్పద మృతి సారవకోట : పెద్దలంబ పంచాయతీ కురమన్నపేటకు చెందిన కలుగు నారాయణరావు(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం నారాయణపురం నుంచి పాతపట్నం మండలం కొయ్యకొండ వెళ్లే మార్గంలోని మామిడి తోటలో మేకలు, గొర్రెలకాపరులు ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించారు. స్థానికులకు సమాచారమివ్వగా వారు సారవకోట పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తి మృతిచెంది రెండు, మూడు రోజులు కావడంతో గుర్తుపట్టలేని విధంగా మారింది. కొద్దిసేపటి తర్వాత కురమన్నపేటకు చెందిన నారాయణరావుగా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. నారాయణరావుకు భార్య హిమవతి, కుమార్తెలు ఉష, లలిత ఉన్నారు. నారాయణరావు నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు సారవకోట: అంగూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అడ్డపనస గ్రామానికి చెందిన వెలమల రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. చల్లవానిపేట నుంచి వెంకటాపురం వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న రామారావు గాయపడటంతో 108 వాహనంలో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి ● అధికారి వేధింపులే కారణమంటున్న బంధువులు శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో సిలగాంకు బదిలీ అయిన ఉడుకుల రాంబాబు (44) ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆకస్మిక బదిలీ, ఒత్తిళ్లే ఇందుకు కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. రాంబాబు ఈ నెల 7 వరకు శ్రీకాకుళం బాలుర వసతి గృహంలోనే పనిచేశారు. వాస్తవంగా బదిలీ అయ్యే అవకాశం లేకపోయినా అక్కడి సంక్షేమాధికారి సిఫారసులు, వేధింపుల వల్ల రాంబాబును బదిలీ చేశారని, బదిలీ వద్దని ఎంత మొరపెట్టుకున్నా కనికరించలేదని బంధువులు చెబుతున్నారు. వసతి గృహ సంక్షేమాధికారి చెప్పిన మాటలు విని వాస్తవిక పరిస్థితులు తెలుసుకోకుండా బీసీ సంక్షేమాధికారిణి అడ్డగోలుగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు స్వస్థలం విజయనగరం జిల్లా డెంకాడ మండలం పాలెం గ్రామం. భార్య రమాదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
బాలియాత్ర నిర్వహణకు కమిటీ
జలుమూరు: రాష్ట్ర పండగగా బాలియాత్ర నిర్వహించేందుకు కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్లు యాత్ర కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు తెలిపారు. బాలియాత్ర నిర్వహణకు సంబంధించి ఆదివారం 20 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగం ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ కటక్లో కార్తీక పౌర్ణమి నుంచి వారం రోజుల పాటు యాత్ర జరగనుందని, శ్రీముఖలింగంలో ఏ తేదీన నిర్వహించాలనే విషయమై వారంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యాత్ర విజయంవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ టి.సతీష్కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ టి.బలరాం, వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామ పెద్దలు బి.వి.రమణ, తేజేశ్వరరావు, వేణు, చింతాడ వెంకటరావు, ఉపా ధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు. -
ట్రైన్ నుంచి జారిపడి సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలు
రాయగడ: ట్రైను నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రగాయాలకు గురయ్యాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గాయాలు తగిలిన వ్యక్తి శరత్ మాఝిగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రాయగడ సీఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలంకు చేరుకుని గాయపడిన మాఝిని కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రౌర్కలా–జగదల్పూర్ ఎక్స్ప్రెస్లొ కొరాపుట్ నుంచి బలంగీర్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో లెల్లిగుమ్మ రైల్వే స్టేషన్ సమీపంలో జవాన్ అదుపుతప్పి నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో గాయాలకు గురయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. అనంతరం అతనికి జిల్లా కేంద్రాస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. -
సింగుపుటిలో ఉచిత వైద్య శిబిరం
రాయగడ: సదరు సమితి సింగుపుటి గ్రామంలో స్థానిక సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్, జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ మమత చౌదరి, డాక్టర్ ఎల్ఎన్ సాహు సుమారు 87 మందికి వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కొంతమందికి నేత్ర శస్త్రచికిత్స అవసరం ఉందని గుర్తించారు. వారిని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్కు తరలించి సమితి ద్వారా ఉచితంగా ఆపరేషన్లను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
గిరిజన సంస్కృతిపై ప్రత్యేక రచనలు
కొరాపుట్: గిరిజన సంస్కృతిపై ప్రత్యేక పరిశోధనాత్మక రచనలను ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. జయపూర్ పట్టణంలో ఎస్ఆర్ మాల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన కొరాపుట్ జిల్లా కొట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర, నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జిలు వీటిని ఆవిష్కరించి ప్రజల అందుబాటులోకి తెచ్చారు. సీనియర్ గిరిజన పండితుడు, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రమొదిని హత్తా రచించిన గిరిజన సాంస్కృతిక నేపథ్యం, డాక్టర్ దేవి ప్రసాద్ హత్తా రచించిన గిరిజన ప్రజల పురోగతి పుస్తకాలు విడుదల చేశారు. ఈ పుస్తకాలను కొరాపుట్ జిల్లా గిరిజన సంస్కృతిని సజీవంగా ఉంచుతాయని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు గౌతం సామంత్రాయ్, కవులు, పండితులు పాలొగన్నారు. -
22 కిలోల గంజాయి స్వాధీనం
కొరాపుట్: అక్రమ గంజాయి రవాణా గుట్టురట్టయింది. జయపూర్ ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం పాత్రోపుట్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో పెట్రోల్ బంక్ సమీపంలో కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తూ గమనించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న బస్తాలో 22 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు మధ్యప్రదేశ్కి చెందిన బోలే గో స్వామి, మకాద్సిగా గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి వారికి రిమాండ్ విధించంతో జైలుకు తరలించారు. రేంజ్ ఇన్స్పెక్టర్ శశికాంత్ దత్ దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ మావోయిస్టులు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి దొరాగుడ పోలీసులు శనివారం సాయంత్రం ముగ్గురు నకిలీ మావోయిస్టులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో సమితిలోని కుఫాకోల్ గ్రామానికి చెందిన బినోద్ నాగ్, మాలిగుడ గ్రామానికి చెందిన నరేంద్ర నాగ్లతో పాటు మరో మైనర్ బాలుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాసీపూర్లో నివాసముంటున్న వ్యాపారి శేఖర్ బిసొయికి గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టులమని బెదరించి లేఖ రాశారు. అనంతరం ఫోన్ ద్వారా మాట్లాడి తమకు రూ.50 లక్షలు ఇవ్వకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో గత్యంతరం లేని వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ వాయిస్ రికార్డు ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారు నకిలీ మావోయిస్టులుగా నిర్ధారణ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
ముఖలింగేశ్వరుని సన్నిధిలో తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ
జలుమూరు: ప్రసిద్ధి శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరుడిని తమిళనాడు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ టి.ఎన్ వెంకటేష్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించారు. ఈదుపురంలో పోలీసు పహారా ఇచ్ఛాపురం రూరల్: ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జూన్ 17న గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాట, రెండు రోజుల క్రితం కూటమి నాయకుడు విడుదల చేసిన వివాదాస్పద వాయిస్ రికార్డు దృష్ట్యా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తగా ఏఎస్ఐ శంకరరావు, ముగ్గురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరువు భత్యం చెల్లించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు, సహాధ్యక్షుడు నెమలిపురి విష్ణుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023 జులై నుంచి ఇప్పటివరకు నాలుగు విడతలుగా బకాయిలు పడ్డ డీఏలన్నీ కలిపి 16.38 శాతం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇసుక వాహనాల అడ్డగింత బూర్జ : ఇసుక వాహనాల రాకపోకలతో దుమ్ము ధూళి చెలరేగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బూర్జ మండలం చీడివలస గ్రామస్తులు శనివారం పలు లారీలను అడ్డుకున్నారు. కాఖండ్యాం, తమరాం ఇసుక ర్యాంపుల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలను అడ్డుకోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు. జాబ్మేళాకు విశేష స్పందన శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. జీఎంఆర్ ఏఈఆర్ఓ ఆధ్వర్యంలో వివిధ ఎయిర్పోర్టుల్లో ఫైర్ ఫైటర్స్ పోస్టుల భర్తీకి ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన 18 నుంచి 24 ఏళ్ల యువత జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. 1600 మీటర్ల పరుగు, బరువు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వివరాలు తర్వాత వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు కొత్తూరు: కడుము గ్రామంలో అరసా ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం, ఎస్ఐ టి.రామారావు, సీఎస్డీటీ భీమారావులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల 50 కిలోల బరువు గల 700 పీడీఎస్ బియ్యం బస్తాలను పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ను విచారణ చేయగా.. కొత్తూరు మండలంలో టీడీపీ నేత, కడుము ఎంపీటీసీకి చెందిన అరసా రైస్ మిల్లు నుంచి బియ్యం తీసుకొస్తున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వీఆర్వో చిన్న లోకేష్ పాల్గొన్నారు. కాగా, కొత్తూరు, తదితర మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని చిల్లర వర్తకుల ద్వారా కొనుగోలు చేసి పాచిపెంట మీదుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు సమాచారం. -
పచ్చని ఉద్దానంలో విధ్వంసం తగదు
వజ్రపుకొత్తూరు రూరల్/మందస : పచ్చని చెట్లతో కోనసీమను తలపిస్తూ జిల్లాకు వరంగా ఉన్న ఉద్దాన ప్రాంతాన్ని కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం చేయడం తగదని వామపక్ష నాయకులు అన్నారు. జీడి, కొబ్బరిపంటలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఉద్దాన రైతులను నిరాశ్రయులను చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడును ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంత బాధిత గ్రామాల్లో శనివారం రైతులతో కలిసి కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా వామపక్షాల నాయకులు చైతన్య ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షులు కొమర వాసు, జోగి అప్పారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి భూములను నమ్ముకున్న జీవనోపాధి సాగిస్తున్న ప్రజలను అభివృద్ది పేరుతో పొట్ట కొట్టడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొంత కాలంగా గ్రామస్తులు ఉద్యమాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా సర్వేలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం లాంటి నగరాలకు అనుసంధానంగా కార్గో ఎయిర్ పోర్టులు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ప్రత్యేక కార్గో ఎయిర్ పోర్టు లేదని గుర్తు చేశారు. పచ్చని ఉద్దానాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం మానుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్గో ఎయిర్ పోర్టు పోరాట కమిటీ నాయకులు కోనారి మోహన్రావు, బత్తిని లక్ష్మణ్, పోతనపల్లి కుసుమ, డి.హరికృష్ణ, కె.రమేష్, జోగి కోదండరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న డ్రైవర్ల సమ్మె
జయపురం: తమ డిమాండ్ల సాధనకు డ్రైవర్లు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు బస్సులు, వాహనాలు నిలిపిపోవడంతో ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి ట్రక్కులు రాకపోవడం వలన నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అలాగే సమ్మెలో ట్యాంకర్ల డ్రైవర్లు కూడా పాల్గొనటం వలన పెట్రోలు, డీజిల్ స్టాక్ తగ్గి కొరత ఏర్పడింది. దీంతో పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్ల సమ్మెకు పలు రాజకీయ నేతలు మద్దతు పలుకుతున్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో సమ్మె చేస్తున్న డ్రైవర్లకు మద్దతుగా వారితో కూర్చున్నారు. అలాగే బొరిగుమ్మలో ఆందోళన జరుపుతున్న డ్రైవర్లకు బొరిగుమ్మ సమితి జర్నలిస్టులు మద్దతు తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారు. -
ఇదేనా బాధ్యత..!
ఏదీ భద్రత ఏదీ ప్రమాదాల నివారణ.. నిరంతర నిఘా.. హైవే రోడ్లపై ఇసుక, కంకర, ఊక, ఆయిల్ మరే ఇతర లోడులైనా ఒరిగిపడిపోయినప్పుడు వాటిని తక్షణమే క్లియర్ చేయాల్సిన బాధ్యత కన్సష్నర్లది (రోడ్డు కాంట్రాక్టర్లది). ఒకవేళ వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యి ఆగినా, ప్రమాదాలకు గురై ఎక్కువ సేపు నిలిచినా చుట్టూరా రేడియం స్టిక్కర్లు అంటించాలి. ఆ ప్రదేశంలో సూచీ బారికేడ్లు పెట్టాలి. కన్సస్నర్లు బాధ్యత విస్మరిస్తే ఇలాంటి ఒకట్రెండు నిర్లక్ష్యాలను చూసి ఎన్హెచ్ఐ వారు రెండు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ మించితే వారిని తొలగిస్తారు. పబ్లిక్ ఏం చేయాలి.. రోడ్లపై ఇటువంటి దృశ్యాలు కనిపించినప్పుడు 1033 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఎచ్చెర్ల / శ్రీకాకుళం క్రైమ్: రహదారి భద్రత మనందరి బాధ్యత. చక్కటి నినాదం. కానీ భద్రత పాటిస్తున్నదెవరు? అంత బాధ్యతగా మెలుగుతున్నదెవరు. పై వాక్యాలకు నిదర్శనం ఈ చిత్రం. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యరాళ్లు జంక్షన్లో సర్వీస్ రోడ్లోకి ఎంటరయ్యే ప్రదేశం ఇది. చూడండి ఎంత ఇసుక రోడ్డు మీద ఒలిగిపోయిందో.. ఈ ఇసుక కారణంగా గురువారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు చాలా మంది వాహనాలు ఇక్కడ అదుపుతప్పి స్కిడ్ అయ్యాయి కూడా. ఇసుకను తరలించే వాహనదారులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. రహదారి బాధ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు కంట పడలేదో.. పడినా ఫిర్యాదు రాలేదు కదా అని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో.. వాహనదారులకు మాత్రం చుక్కలు కనబడ్డాయి. ప్రమాదాలకు ఆస్కారమైన.. వాహనాల రాకపోకలు అధికంగా సాగే జాతీయ రహదారిపై నిరంతరం సేవలందించే హైవే పెట్రోల్ సిబ్బంది దృష్టి కూడా ఈ ప్రాంతంపై పడలేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటూ ప్రమాదాల కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పే వీరెవరి కంటినీ శుక్రవారం ఉదయం నుంచి ఈ ఇసుక రేణువు తాకలేదు. వాహనాల నుంచి ఇసుక జారిపోతున్నా పట్టించుకోని వైనం జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడే ఇసుక మేటలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఇసుక వాహనాల నిర్వాహకులు ప్రమాదాలకు ఆలవాలంగా మారిన హైవే కటింగ్ పాయింట్లు చిత్రం చెప్పిన కథ -
ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి
భువనేశ్వర్: రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా శాసనసభ నుంచి పార్లమెంటు వరకు సుదీర్ఘ కాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన కేంద్రమంత్రి జుయెల్ ఓరాం ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు శనివారం ప్రకటించారు. సంబలపూర్ గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సుందరగడ్ పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర దళిత వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. సంబల్పూర్లో జరిగిన జాబ్మేళాలో ఈ ప్రకటన చేశారు. పోటీ నుంచి వైదొలగి యువతకు అవకాశం కల్పించాలనే దృక్పథంతో ఈ యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వరుసగా 6 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 2 సార్లు రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహించగలిగినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైనా పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత వ్యవహారాల్లో చివరివరకు అంకిత భావంతో సేవలందించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయ వర్గాల్లో ఉలికిపాటు రాష్ట్ర ప్రజాప్రతినిధుల్లో పార్టీలకు అతీతంగా జుయెల్ ఓరాం సీనియర్ గిరిజన రాజకీయ నాయకుడు కావడం విశేషం. తాను ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాలను ఉలికిపాటుకు గురి చేసింది. ప్రస్తుతం ఆయన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహంచిన 6 పర్యాయాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రాతినిథ్య రంగంలో జుయెల్ ఓరం 3 దశాబ్ధాలు పైబడి తిరుగులేని నాయకుడిగా కొనసాగుతు పలు మైలురాళ్లని అధిగమించారు. రాష్ట్ర శాసనసభకు 1990, 1998 ఎన్నికల్లో పోటీ చేసి విజేతగా నిలిచారు. అలాగే సుందర్గఢ్ లోక్సభ స్థానం నుంచి వరుసగా 6 సార్లు ఎన్నిక కావడం విశేషం. 1999 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వరుసగా 3 సార్లు బాధ్యతలు నిర్వహించారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా ఒక పర్యాయం కొనసాగారు. పలు కీలకమైన సంస్థాగత పదవులు, హోదాల్లో తనదైన ఉనికిని బలంగా చాటుకున్నారు. కేంద్రమంత్రి జుయెల్ ఓరాం -
● నడకయాతన
రాయగడ జిల్లాలోని మునిగుడ సమితి నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న మునిఖోల్ పంచాయతీ పరిధిలోని 14 గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాల్లో నివసించేవారు అందరూ డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలే. డొంగిరియా ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం డొంగిరియా కొంధొ డవలప్మెంట్ ఏజెన్సీ (డీకేడీఏ) పేరిట ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. డొంగిరియాలు నివసించే గ్రామాలను అభివృద్ధి చేయడం, మౌలిక సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతీ ఏడాది రూ.కోట్లలో నిధులు విడుదలవుతున్నా, ఆయా గ్రామాల్లో అభివృద్ధి జాడలు కనిపించడం లేదు. అసలే వర్షాకాలం కావడంతో రహదారులు బురదమయంగా మారాయి. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాలకు రహదారుల సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నారు. – రాయగడ -
నాగలికి ప్రేమికులను కట్టి..
ఒడిశా: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లకసరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు. Odisha: Tribal couple yoked like cattle, beaten & exiled for marrying secretly.In 2025. In India. A young couple tied to a bamboo yoke, forced to plough fields, paraded & humiliated — just for falling in love against “custom.”And then Haryana: Radhika Yadav. 25. National… pic.twitter.com/99Jgd5Zx45— Deepti Sachdeva (@DeeptiSachdeva_) July 11, 2025 -
ఊహాగానాలు
మంత్రి మండలి విస్తరణపై..భువనేశ్వర్: రాష్ట్ర మంత్రి మండలి విస్తరణ శుభ ఘడియల కోసం పలువురు ఆశావాదులు ఉవ్విళ్లూరుతున్నారు. మన్మోహన్ సామల్ మరో మారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ బిగుసుకుంది. రాష్ట్రంలో తొలి సారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మన్మోహన్ సామల్ కీలక పాత్ర పోషించి అధిష్టానం మన్ననలు పొందారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఆయన దక్షతని ప్రత్యక్షంగా చాటుకున్నారు. బీజేపీ ఏడాది పాలన కాలంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏడాది పాలనలో ఒడిదొడుకుల్ని సవరిస్తూ ప్రభుత్వంలో, సొంత పార్టీలో లుకలుకల్ని పరిష్కరించిన అనుభవజ్ఞుడిగా మంత్రి మండలి విస్తరణకు వ్యూహాత్మకంగా రూపొందిస్తారనే నమ్మకం సర్వత్రా నెలకొని ఉంది. వాస్తవానికి మోహన్ చరణ్ మాఝి కొలువులో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పలువురికి బహుళ శాఖలు కేటాయించారు. బాధ్యతల ఒత్తిళ్లతో కొన్ని శాఖల పని తీరు సంతృప్తికరంగా కొనసాగడం లేదు. కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారి నుంచి బహుళ శాఖల బాధ్యతల్ని తొలగించి పాలన దక్షతనకు పదును పెట్టి రాష్ట్ర బహుముఖాభివృద్ధికి నడుం బిగించాల్సిన సమయంలో స్ఫూర్తిదాయకమైన మంత్రి వర్గాన్ని మన్మోహన్ సామల్ ఆవిష్కరిస్తారని సర్వత్రా చర్చ సాగతుంది. మరో వైపు మంత్రులుగా శాఖల కార్యాచరణ, అనబంధ పురోగతి నామ మాత్రంగా కొనసాగుతున్న వారి వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఏడాది పాలనలో సంతృప్తికరమైన పురోగతి లేని శాఖల్లో అమాత్యుల మార్పు అనివార్యం అనిపిస్తోంది. పాత ముఖాల్ని తొలగించి ప్రభుత్వ ఆశయాల వాస్తవ కార్యాచరణ పట్ల అంకిత భావంతో ఔత్సాహికంగా ముందుకు వస్తున్న వారిలో కొంత మందికి విస్తరణలో చోటు ప్రసాదించేందుకు అనుకూలత నెలకొని ఉంది. బీజేపీ ఏడాది స్వల్ప వ్యవధి పాలనలో ఆరోగ్య, న్యాయ శాఖలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానంగా పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర నిర్వహణ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఏడాది వ్యవధిలో వరుసగా 2 సార్లు నిర్వహించిన జగన్నాథుని రథ యాత్రలో పలు అపశృతులు చోటు చేసుకున్నాయి. శ్రీ మందిరానికి భద్రత లోపించిది. స్వామి భక్తులకు రక్షణ కొరవడిందనే ఆరోపణలు రాష్ట్రేతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇలాంటి అవమానకర పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని మంత్రి మండలి సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సి ఉందని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ఖాళీ స్థానాల భర్తీపై ఉత్సాహం ఉరకలేస్తుండగా ఉద్వాసనకు చేరువలో ఉన్న వారికి గుండె దడ పెరుగుతోంది. ఇటీవల ఏడాది పాలన పూర్తి పురస్కరించుకుని పలు శాఖలు, మంత్రుల పని తీరు, పురోగతి వగైరా సమాచారం ముందస్తుగా సేకరించి విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఆధారంగా పలు శాఖల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం తథ్యం. మంత్రి వర్గ విస్తరణ, కొత్త వారికి పదవుల కేటాయింపు విషయాల్లో ప్రభావ వంతుల ప్రమేయానికి కళ్లెం పడుతుందని మన్మోహన్ సామల్ సన్నిహిత వర్గాల భోగట్టా. అధికార పార్టీ పరువు, ప్రతిష్టల్ని వీధికి ఈడ్చిన సంఘటనల తెర వెనక ప్రముఖుల చొరవకు అడ్డుకట్ట వేసి వికసిత్ ఒడిశా ఆశయ సాధనకు సానుకూల మంత్రి మండలి ఏర్పాటుకు మార్గం సుగమం చేసే యోచన తుది మెరుగులు దిద్దుకుంటుది. లింగ, కులం, ప్రాంతీయ ప్రాతిపదికన మంత్రి మండలిలో స్థానం కల్పించే సమీకరణాలపై గణాంకాలు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ, విద్యాధిక్యత, వ్యూహాత్మక సమన్వయం ప్రామాణికలతో మహిళలు ఇతర వర్గాలకు పట్టం గట్టే అవకాశం ఉంది. అన్ని లోక్ సభ నియోజక వర్గాల నుండి రాష్ట్ర మంత్రి మండలి ప్రాతినిధ్యంపై దష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. సిట్టింగులకు గుండె దడ కొత్తవారిలో ఉత్సాహం బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన పలు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అకాడమీలు, కమిషన్లు వగైరా సభ్యుల నియామకం నోచుకోలేదు. మంత్రి మండలి విస్తరణతో ఆయా పదవుల్ని భర్తీ చేస్తారని భావిస్తున్నారు. పార్టీ అంతర్గత పోటీ ప్రభావంతో ఈ పదవుల భర్తీలో జాప్యం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి యథాతథం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి యథాతథంగా కొనసాగుతారని ఇటీవల ఒక సందర్భంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. ఈ ప్రకటన వీరివురి మధ్య సమన్వయం, సమభావన యోచనల్ని ప్రతిబింబిస్తుంది. రథ యాత్రలో గందరగోళం, భువనేశ్వర్ నగర పాలక సంస్థ అధికారిపై దాడి వంటి సంఘటనల వెనక ప్రభావవంతమైన గ్రూపు నాయకులను పక్కన పెట్టి అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంత్రి మండలి విస్తరణ, ప్రభుత్వ రంగ సంస్థల సభ్యుల నియామకంలో ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. మోహన్ చరణ్ మాఝికి ముఖ్యమంత్రిగా పట్టం గట్టడంతో ఆది నుంచి ఒక వర్గం సమస్యాత్మక పరిస్థితుల్ని ప్రేరేపించి అవాంఛనీయ అలజడి రేపుతున్నట్లు సాగుతున్న ప్రచారంపై పార్టీ అధిష్టానం దృష్టిని కేంద్రీకరించింది. -
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
పర్లాకిమిడి: ఒడిశా సాహిత్య అకాడమీ స్వర్ణోత్సవాలు పురస్కరించుకొని స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రబంధాలు, వక్తృత్వ, కవితాపఠనం, సాహిత్యం, జనలర్ నాలెడ్జిపై జిల్లాస్థాయి పోటీలు శనివారం నిర్వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విశ్రాంత ఉపాధ్యాయులు బినో ద్ చంద్ర జెన్నా, ఉపాంత ప్రహారి పూర్ణచంద్ర మహాపాత్రో, విశ్రాంత హెచ్ఎం శ్వేతా పట్నాయక్, బిచి త్రా నంద బెబర్తా, బినోదిని సైన్సు కళాశాల అధ్యక్షుడు మనోజ్ పట్నాయక్, మహిళా స్నాతక ఉన్నత విద్యాలయం అధ్యాపకులు భారతీ పాణిగ్రాహి, ఒడియా అధ్యాపకురాలు డా.చారుప్రభానాయక్, ఉపాధ్యాయులు శ్యాం సుందర గంతాయత్, శశిభూషన్ పట్నాయిక్ తదితరులు వ్యవహరించారు. -
ఎమ్మెల్యే నియోజక వర్గంలో విపక్ష సభ్యుల ఆందోళన
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ నీలగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే సంతోష్ ఖటువా అరెస్టు డిమాండ్తో ఆందోళన క్రమంగా ఉద్ధృతం అవుతుంది. బిజూ జనతా దళ్ మహిళా నా యకురాలి పట్ల అసభ్య పదజాలంతో అవమానకర అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ. సిటింగ్ ఎమ్మెల్యే అరెస్టు నినాదంతో ఆయన సొంత నియోజక వర్గం నీలగిరి ప్రాంతంలో శుక్రవారం ఽనిరసన సభ నిర్వహించారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ ఖటువా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బిజూ మహిళా జనతా దళ్ అధ్యక్షురాలు స్నేహంగిని చురియా, మాజీ మంత్రి సుదాం మ రాండి, జిల్లా అధ్యక్షులు జ్యోతి ప్రకాష్ పాణి గ్రాహి, ఎమ్మెల్యేలు అశ్విని కుమార్ పాత్రో, సంజీవ్ మల్లిక్, బిజూ యువ జనతాదళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బ్యోమకేష్ రాయ్ తదితర ప్రముఖ కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. -
రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 15న కటక్ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకుని కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ఆయా ప్రదేశాలను ప్రత్యక్షంగా సందర్శించి క్షేత్రస్థాయిలో భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు. డీజీపీతో పాటు భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్, కటక్ జిల్లా మేజిస్ట్రేట్, కటక్ నగర డీసీపీ, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.బంగ్లాదేశ్ రోహింగ్యాల గుర్తింపు ప్రారంభం కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో రాయిఘర్ సమితిలో బెంగాలీ శరణార్థ గ్రామాల్లో బంగ్లాదేశ్ రోహింగ్యాల గుర్తింపు ప్రారంభమైంది. శుక్రవారం ఆ ప్రాంతంలో 59 మంది చొరబాటుదారులు ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. వీరు 1971కి ముందు ఈ ప్రాంతానికి వచ్చినట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉంది. అందులో పది మందిని రాయిఘర్ పోలీస్ స్టేషన్ పిలిపించారు. వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీ లించారు. వీరు చాలా కాలంగా ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. కానీ పోలీసులు గుర్తించిన వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే కానీ రొహింగ్యాలు కాకపొవడం విశేషం.వృద్ధులకు దుస్తులు పంపిణీ రాయగడ: స్థానిక బ్యూటీపార్లర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుంబిగుడ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ మిశ్రో నేతృత్వంలో సంఘం సభ్యు లు వృద్ధాశ్రమంలో ఉంటున్న మహిళలకు చీర లు, పురుషులకు లుంగీ, టవల్లు అందజేశా రు. ప్రతీ ఏడాది ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంఘం సభ్యులు సంక్షేమ నిధికి విరాళాలు అందిస్తుంటారని, అందులో కొంతభాగంగా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శైలసూత సాహు, ఉపాధ్యక్షురాలు శివానీ పలక తదితరులు పాల్గొన్నారు. భారీగా గంజాయి స్వాధీనం కొరాపుట్: మూడు వేర్వేరు ఘటనల్లో 27 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంధాలుంగ్ గ్రామ పంచాయతీ పరిధి జయంతిగిరి, చెటోడిపుట్ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు 12 లీటర్ల దేశీ మద్యం పట్టుబడింది. దీంతో సిర్మే ఖొరా, జయరాం పంగి, బల్కి పంగి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రథ్ ప్రకటించారు. విప్ప పువ్వు స్వాధీనంరాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి గోరఖ్పూర్ గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వు బస్తాలను ఎకై ్సజ్ శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గోరఖ్పూర్లో నివసిస్తున్న జేఎన్ సాహు అనే వ్యక్తికి చెందిన గోదాంలో విప్పపూవును నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ సిబ్బంది దాడులను నిర్వహించారు. దాడుల్లో ఎంత మొత్తం విప్పపువ్వు స్వాధీనం చేసుకున్నది తెలియజేయలేదు. నిందితుడు సాహును అదుపులోని తీసుకున్నట్లు సమాచారం. -
నకిలీ విదేశీ మద్యం పట్టివేత
జయపురం: కొరాపుట్ జిల్లాలో దేశీయ సారా, కల్తీ విదేశీ మద్యం వరదలై పారుతోంది. కొరాపుట్ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షిత తాగునీరు లభించటం లేదుగాని నాటుసారా, కల్తీ విదేశీ మద్యం లభించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. అబ్కారీ సిబ్బంది ఎన్ని దాడులు జరిపి ఎంత మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టుతున్నప్పటికీ అక్రమ మద్యం వ్యాపారం ఆగడం లేదు. ఈ పరిస్థితిలో కొరాపుట్ జిల్లా అబ్కారీ ఉన్నతాధికారి అరుణ కుమార్ పాఢీ సారా ప్రవాహాన్ని అరికట్టాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఉన్నతాధికారి ఆదేశంతో నందపూర్ అబ్కారీ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రథ్ నేతృత్వంలో జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ అబ్కారీ అధికారి భగవాన్ మహానందియ అతని సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నాటు సారా, సొలప కల్లుతో పాటు కల్తీ విదేశీ మద్యం, బీరులను పట్టుకున్నట్లు బొయిపరిగుడ అబ్కారీ అధికారి భగవాన్ మహా నందియ శుక్రవారం వెల్లడించారు. టీమ్ బొయిపరిగుడ సమితి చంద్రగండిగుడ బాలిగాం గ్రామా ల ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నకిలీ విదేశీ మద్యం అమ్ముతున్నారని సమాచారం అందడంతో వెంటనే తాము చంద్రషుండిగుడ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో లుకునాథ్ బిశాయి ఇంటిపై దాడి చేయడంతో అమ్మేందుకు ఉంచబడిన 2.160 లీటర్ల నకిలీ విదేశీ మద్యంతో పాటు 6.600 లీటర్ల నకిలీ బీర్ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ గ్రామంలో బినోద్ బిశాయి ఇంటిపై దాడి జరిపి 30 లీటర్ల సొలప కల్లు, తొమ్మిది లీటర్ల నాటు సారా సీజ్ చేసినట్లు వెల్లడించారు. వాటితో పాటు బలిగాం గ్రామం సుభాష్ డాకువ ఇంట్లో దాచి ఉంచిన 2.340 లీటర్ల నకిలీ విదేశీ మద్యంతో పాటు 25.650 లీటర్ల బీర్లను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనలలో నలుగురిని అరెస్టు చేసినట్లు అబ్కారీ అధికారి భగవాన్ మహానందియ వెల్లడించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నలుగురి అరెస్టు -
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైకిస్టు
జయపురం: ఛతీస్గఢ్ రాష్ట్ర పోలీసు వాహనాన్ని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకిస్టుతోపాటు కానిస్టేబుల్ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ఛతీస్గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా టుంప పోలీసుస్టేషన్ సిబ్బంది కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు అరుకులో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వారు కొరాపుట్ జిల్లాకు వచ్చి సెమిలిగుడ పోలీసుల సహకారంతో నిందితుడుని పట్టుకోగలిగారు. అతడిని బొయిపరిగుడ, మల్కనగిరిల మీదుగా సుకుమకు తీసుమకు గురువారం రాత్రి తీసుకెళ్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో బోయిపరిగుడలోని పెట్రోల్ పంపు సమీపంలోని డాబా హోటల్ వద్ద భోజనాలు చేసేందుకు వెళ్తున్న సమయంలో బలిగుడ గ్రామానికి చెందిన ప్రఫుల్ల మడకామి ద్విచక్ర వాహనంపై రామగిరి గ్రామం నుంచి వస్తూ పోలీసు వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైకిస్టు ప్రఫుల్ల మడకామి, పోలీసు వాహనం డోర్ పక్కన కూర్చున్న పోలీసు హవల్ధార్ అరేంద్ర యాదవ్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలిసిన బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. హవల్దార్ చెవికి పెద్ద గాయమవ్వగా.. ప్రఫుల్ల మడకామికి తలపై బలమైన గాయమైంది. ప్రాథమిక చికిత్స తరువాత ప్రఫుల్లను జయపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసు కానిస్టేబుల్ అరెంద్ర యాదవ్ ను ఛత్తీస్గడ్ రాష్ట్రం సుకుమ జిల్లా టుంపకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్, బైకిస్టుకు గాయాలు -
● నాగలికి ప్రేమికులను కట్టి..
రాయగడ: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లక సరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు. -
ఒడిశాను అదానీ నడిపిస్తున్నాడు: రాహుల్
భువనేశ్వర్: ‘రాజ్యాంగాన్ని కాపాడదాం’ నినాదంతో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక బారముండా మైదానంలో భారీ బహిరంగ సభని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఆయనతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీ మాట్లాడుతు రాష్ట్రంలో ప్రజా దోపి డీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఒడిశా ను అదానీ నడిపిస్తున్నాడని ఆరోపించారు. భారతీ య జనతా పార్టీ దేశ వ్యాప్తంగా రాజ్యాంగ విలువల్ని నిలువునా నీరు గార్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీరు, అడవి, భూమి గిరిజనులకే చెందుతాయి. ఇక్కడ గిరిజనులకు వారి భూమి పట్టాలు ఇవ్వడం లేదు. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ఇది కోటీశ్వరు ల ప్రభుత్వం. ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్న ప్రభుత్వం’గా వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలకు అండ గా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. ముందస్తు సంప్రదింపులు లేకుండా గిరిజనులను బలవంతంగా తరలించి భూమి హక్కులను తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెసా అమలు అణగదొక్కి ఈ వర్గపు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. నిజమైన యాజమాన్యాన్ని పునరుద్ధరించడానికి పెసా చట్టం, గిరిజన బిల్లును కాంగ్రెస్ అమలు చేస్తుందని హామీ ఇచ్చింది. ఎన్నికల సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ నిర్విరామంగా ఉద్యమిస్తుంది. ఎన్నికల సంఘం అధికార భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఒక కోటి మంది బూ టకపు ఓటర్ల ఆవిష్కరణ దీనికి నిలువెత్తు తార్కాణంగా పేర్కొన్నారు. బీహార్లో ఫలితాలను తారుమారు చేయడానికి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఎన్నికలను హైజాక్ చేయడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందని సభాముఖంగా ప్రకటించారు. మహిళలకు కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నా రు. రాష్ట్రంలో మహిళలకు భద్రత పూర్తిగా లోపించిందని, 40 వేల మందికి పైగా మహిళలు అదృశ్యం కావడం దిగ్భ్రాంతికరమైన అంశంగా పేర్కొన్నారు. ఈ దుస్థితి పట్ల రాష్ట్ర ప్రభుత్వం పెదవి కదపకుండా చోద్యం చూస్తుందన్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 15 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నట్లు తాజా విశ్లేషణలు తేల్చడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అదానీ కోసం శ్రీ జగన్నాథుని రథం నిలిపి వేశార ని ఆరోపించారు. ఒడిశాను అదానీ నడిపిస్తున్నాడు అని బహిరంగంగా దుయ్యబట్టారు. ఇటీవల ముగిసిన పూరీ శ్రీ జగన్నాథుని పవిత్ర రథయాత్ర సమ యంలో ఆచార, సంప్రదాయ విరుద్ధమైన సంఘటనలు చోటు చేసుకోవడం అపచారంగా పేర్కొన్నా రు. అదానీ కుటుంబానికి అనుకూలంగా రథాలను నిలిపి వేశారని ఆరోపించారు. ఇక్కడి ప్రభుత్వం ప్రజల కంటే కోటీశ్వరులకు సేవ చేస్తోందనేందుకు ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు. పేదలు, గిరిజను లు, దళితులు, రైతులు మరియు కార్మికులకు అండ గా నిలిచేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్య సింహాలుగా అహర్నిశలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది: మల్లికార్జున్ ఖర్గే అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొత్తగా సాధించిది ఏమీ లేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిన ప్రయజనాత్మక ఫలి తాలతో పబ్బం గడుపుకుంటోందని అఖిల భారత కాంగ్రెస్ కమిటి (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగంలో పేర్కొన్నారు. భువనేశ్వర్ను రాజధానిగా అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆవిష్కరించారని, కాంగ్రెస్ ప్రభు త్వం ఒడిశాలో, కేంద్రంలో ఉన్న కాలంలో రాష్ట్రం పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య, రవాణా, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో స్థిరపరచిన వ్యవస్థతతో బీజేపీ చెలామణి అవుతోందన్నారు. రాష్ట్రంలో పారాదీప్ పోర్టు, రౌర్కెలా స్టీల్ ప్లాంట్, హిరాకుడ్ జలాశయం, నాల్కో, ఎన్టీపీసీ, మంచేశ్వర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, చిలికా నావల్ కోచ్లతదితర ప్రము ఖ వ్యవస్థలు కాంగ్రెస్ ఏర్పాటు చేసినవిగా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒడిశా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. గట్టి బందోబస్తు రాహుల్ గాంధీ పర్యటన పురస్కరించుకుని గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. సమగ్రంగా 53 ప్లాటూ న్ల పోలీసు బలగాలతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బరముండా స్క్వేర్, కాంగ్రెస్ భవన్,మే ఫెయిర్ హోట ల్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 4 మంది డీసీపీ హోదా అధికారులు, 10 మంది అదనపు డీసీపీలు, 24 మంది ఏసీపీలు, 34 మంది ఇనస్పెక్టరు ఇంచార్జిలు, 70 మంది ఇతర సీనియర్ పోలీసు సిబ్బందిని మోహరించారు. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
జయపురం: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని సత్యసాయి భజన మండలి సభ్యులు అన్నారు. దీనిలో భాగంగా బొరిగుమ్మ సమితి దుర్లగుడలోని షిరిడీ సాయి మందిర ప్రాంగణంలో మొక్కలను శుక్రవారం నాటారు. కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ శరత్ దాస్, ఎస్.సాయి, శివ మహంతి, కృష్ణచంద్ర పండ, బాలమ్మ, అనూరాధ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బొరిగుమ్మ సమితి బెణగాం ప్రాజెక్టు ఉన్నత పాఠశాల పరిసరాల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఆర్సీసీ ప్రఫుల్ల కుమార్ నాయిక్, హెచ్ఎం శ్రీకాంత కుమార్ పండ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై ఇద్దరికి గాయాలు
ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని మెట్టక్కివలస పదో వార్డు వాంబే కాలనీలో గ్యాస్ లీకై ఇద్దరు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీకి చెందిన గుంటుకు సరస్వతి టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎదురు ఇంట్లో నివసిస్తున్న కోలా మాధవరావు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా ఆయన కూ డా గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.70 వేల నష్టం జరిగినట్లు సమాచారం. ఎస్సై ఎస్.బాలరాజు సైతం ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గ్యాస్ సిబ్బంది పరిశీలించి బాధితురాలి తో మాట్లాడారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
జర్నలిస్టుల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
జయపురం: జర్నలిస్టుల కోసం జయపురం సబ్డివిజన్ కుంద్రా సమితి కేంద్రంలో భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు కోట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ప్రకటించారు. గురువారం సాయంత్రం కుంద్రను సందర్శించిన సందర్భంగా ఆయన్ని జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు కలిసి సత్కరించారు. జర్నలిస్టు భవనానికి తగిన స్థలం ఎంపిక చేసి కేటాయించాలని ఎమ్మెల్యే రూపు భొత్ర కుంద్ర తహసీల్దార్ బినోద్ చంద్ర నాయిక్ను ఆదేశించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ను అమీన్, రెవెన్యూ సూపర్వైజర్లను స్థలం ఎంపిక బాధ్యతలను అప్పగించారు. అనువైన స్థలం గుర్తిస్తామని తహసీల్దార్ శాసనసభ్యుడుకి హామీ ఇచ్చారు. సెప్టెంబర్లోగా జర్నలిస్టు భవనానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంద్ర సమితి ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని ఆయన జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ ప్రహరాజ్, కార్యదర్శి హరిష్ బెహర, సహాయ కార్యదర్శి సురేంద్ర సాగరియ, సలహాదారు అక్షర కుమార్ పట్నాయక్, న్యాయ సలహాదారు కనూచరణ నాయిక్, జర్నలిస్టులు వీర కిశోర్ శర్మ, బాబుల హరిజన్ ఉన్నారు. -
బోల్భం యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు
జయపురం: శ్రావణ మాసంలో పలు ప్రాంతాల నుంచి గుప్తేశ్వర్ శివ క్షేత్రానికి వేలాది మంది బోల్ భం భక్తులు వస్తారు. దీంతో గుప్తేశ్వర్లో బోల్భం భక్తులకు తగిన సౌకర్యాలు సమకూర్చే విషయమై చర్చిందేందుకు జయపురం సబ్కలెక్టర్ కార్యాలయ సభాగృహంలో శుక్రవారం అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం శ్రావణ మాసం ప్రథమ సోమవారం నుంచి బోల్భం కావి డి దారులు వేలాది మంది వస్తారని, అందుచేత వారు ఎలా శాంతిగా, సురక్షతంగా బాబా గుప్తేశ్వర్ లో మహాశివుడుని దర్శించుకొనేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. అలాగే శివలింగంపై భక్తులు జలాభిషేకం చేసేందుకు తగి న ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించా రు. గుప్తేశ్వర్లో నీటి సమస్య తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని సబ్కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే డయేరియా, అతిసార వ్యాధులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. రెండు రోజుల్లో గుప్తేశ్వర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నరు. గుప్తేశ్వర్లో పారి శుద్ధ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బోల్భం భక్తులు శివలింగాన్ని దర్శించుకొనేందుకు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సబ్కలెక్టర్ జయ పురం తహసీల్దార్ స్నిగ్ధ రాణి చౌధురి ఆదేశించారు. సమావేశంలో జయపురం సబ్డివిజన్ పోలీసు అధి కారి పార్ధ కాశ్యప్, బొయిపరిగుడ ఇన్చార్జి బీడీవో శక్తి మహాపాత్రో, దేవదాయ విభాగ అధికారి చిత్తరంజన్ పట్నాయక్, బొయిపరిగుడ పోలీసు అధికా రి రక్ష్మీరంజన్ ప్రధాన్, అగ్నిమాపక విభాగ అధికారి సురేష్ బారిక్,రామగిరి పోలీసు పంటి అధికారి విష్ణు ప్రసాద్ మడకాని, రెవెన్యూ అధికారి హరిహర శతపతి, దిలీప్ ప్రధాన్లతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
గండం గడిచింది!
ఎచ్చెర్ల: నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ప్రాణభయంతో విలవిల్లాడిపోయారు. సాయం కోసం మైరెన్, పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఈ సమయంలో మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఎచ్చెర్ల మండలం కొయ్యాం సముద్ర తీరానికి సుమారు 45 మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. బాధిత మత్స్యకారులు, బోటు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాకు చెందిన పది మంది మత్స్యకారులు ఈ నెల 9న ఉదయం 5 గంటలకు సముద్రంలో వేటకోసం బయల్దేరారు. ఎచ్చెర్ల మండలంకొయ్యాంకు 45 మైళ్ల దూరంలో ఉండగా బోటు చెక్క పక్కకు ఒరిగిపోవడంతో లోపలికి నీరు ప్రవేశించింది. కొద్దికొద్దిగా బోటు మునిగిపోయే సూచనలు కనిపించాయి. దీంతో బోటులో ఉన్న వారు వారి యాజమాని వాసపల్లి ధనారాజ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన మైరెన్ సిబ్బంది, పోలీసులకు, వేరే బోటు నిర్వాహకులకు ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో మరో బోటు రావడంతో వారిని సాయం అడిగారు. వారు తొలుత సహకరించకపోవడంతో వలకు అడ్డుగా బోటును నిలబెట్టడంతో సాయం చేసేందుకు అంగీకరించారు. పది మంది మత్స్యకారులు ఆ బోటులోకి వెళ్లిపోయారు. 10వ తేదీ మొత్తం ఆ బోటు లోనే గడిపారు. 11వ తేదీ ఉదయం కొయ్యాం తీరానికి చేరుకున్నారు. అప్పటికే యజమాని వచ్చి ఆటోలో మత్స్యకారులను విశాఖకు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనలో సుమారు 90 లక్షల విలువైన బోటు మునిగిపోయిందని యజమాని తెలిపారు. చనిపోతే వస్తామన్నారు.. అంతకుముందు బోటు యాజమాని వాసపల్లి ధనరాజ్ మాట్లాడుతూ సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సాయం అందించాలని మైరెన్ సిబ్బందికి తెలియజేశాం. ఎవరూ స్పందించలేదు. అనంతరం ఎచ్చెర్ల పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరైనా చనిపోతే అప్పుడు వస్తామని బదులిచ్చారని, సముద్రంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు. నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు బోటులో నీరు చేరడంతో దిక్కుతోచని పరిస్థితి మైరెన్, పోలీసులకు తెలియజేసినా కానరాని స్పందన మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు.. -
ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు
కొరాపుట్: శుక్రవారం ఉదయం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణంలో ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు కార్యాలయంలోకి ప్రవేశించి ట్రెజరీ బీరువా పగలు కొట్టడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. వెళ్లేటప్పుడు సీసీ కెమెరా పుటేజీ ఉన్న డీవీఆర్ తీసుకెళ్లిపోయారు. ఈ కార్యాల యం పోలీస్స్టేషన్కు సమీపంలోనే ఉండడం గమనార్హం. బైక్ అదుపు తప్పి యువకుడు మృతి కొరాపుట్: బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రం నుంచి కొసాగుమడ వెళ్లే మార్గంలో బెహరా గుడి వద్ద బైక్ అదుపు తప్పి విద్యు త్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కుసిమి గ్రామానికి చెందిన ఖగుపతి పూజారి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్ మీద ఉన్న మరో వ్యక్తి రూపు బొత్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రజలు ఈ సమాచారం పోలీ సులకు అందించారు. వెంటనే బాధితుడిని నబరంగ్పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాకంబరిగా.. కొరాపుట్: కన్యకా పరమేశ్వరి అమ్మవారు శుక్రవారం శాకంబరిగా దర్శనమిచ్చారు. శుక్రవా రం జయపూర్ పట్టణంలోని మహారాణీ పేట లో గల వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఏటా ఆషాడ మాసంలో అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూరగాయ లు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే అమ్మవారికి ధాన్యంతో అభిషేకం నిర్వహించారు. బూరగాంలో కలకలం టెక్కలి : బూరగాం గ్రామంలో శుక్రవారం కలకలం రేగింది. ఓ ఇంటికీ నిత్యం కొంతమంది యువతీ యువకులు వస్తూ పోతుంటారని, ఓ మహిళ చీకటి వ్యవహారం నిర్వహిస్తోందంటూ స్థానికులు ఇంటికి ఇరువైపులా తాళాలు వేసి నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ కేశవరావు, సిబ్బంది గ్రామానికి చేరుకుని మహిళతో పాటు ఇంట్లో నిర్బంధించిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గ్రామస్తులు నిర్బంధించిన వారంతా తనకు తెలిసినవారేనని ఆ మహిళ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్ కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సివిల్, కుటుంబ కలహాలు, ఆస్తి, కొట్లాట, మిస్సింగ్, చీటింగ్ తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు. -
పర్యాటక స్థూపంగా పైలాన్
ఇచ్ఛాపురం రూరల్: ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన పైలాన్ను పర్యాటక స్థూపంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా 2017లో లొద్దపుట్టిలో విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం పైలాన్ శిథిలావస్థకు చేరుకోవడంతో శుక్రవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాదయాత్రకు చిహ్నంగా ఉండే పైలాన్ను ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త మదిలో చిరస్థాయిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు కారంగి త్రినాథ్, ఆశి దాలయ్యరెడ్డి, పిలక సంతు, ఉప్పాడ రాజారెడ్డి, నైనా తేజా, తులసీ, తిప్పన ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. -
ఆదిత్యాలయంలో విజిలెన్స్ విచారణ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.లక్షల్లో అక్రమాలు చేసినట్లుగా అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టారు. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురి నుంచి వాంగ్మూలాలను స్వీకరించారు. దాదాపుగా రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు సమాచారం. భక్తుల దర్శనాల ఏర్పాట్లు, సౌకర్యాలు, ఆలయంలో వివిధ రకాల అభివృద్ధి పనుల పేరిట రూ.లక్షల్లో అక్రమంగా చెక్కులను జారీ చేస్తూ.. ఆలయ నిధులను దారుణంగా తినేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రెగ్యులర్ ఉద్యోగులే టార్గెట్గా.. విశాఖపట్నంలో గ్రేడ్–2 ఈవోగా రిటైర్డ్ అయిన జగన్మోహనరావుతో పాటు ఆలయ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ కావ్యశ్రీల ప్రమేయంతో రెగ్యులర్ ఉద్యోగుల పేరిట అక్రమంగా చెక్కులు జారీ అయ్యాయని గుర్తించారు. ఎర్రయ్య అనే అటెండర్కు తెలియకుండా ఆయన పేరుతో రూ.5 లక్షల విలువైన చెక్కులు, మరో రెగ్యులర్ రికార్డు అసిస్టెంట్ శిమ్మ మల్లేశ్వరరావు పేరిట 19 చెక్కులు, అటెండర్ శ్రీనివాసరావు పేరుతో సుమారు 4 చెక్కులు, స్వీపర్ నీలయ్య పేరుతో 2 చెక్కులతో పాటు ఆలయంలో సిమ్మెంట్ పనులు చేసే మేస్త్రి కునుకు రాము అనే వ్యక్తి పేరిట ఏకంగా 9 చెక్కులు, దినసరి పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న బుజ్జి పేరిట మరో 4 చెక్కుల వరకు జారీ చేసేశారు. ఆయా రెగ్యులర్ ఉద్యోగుల సంతకాలు కూడా ఫోర్జరీవిగా పేర్కొంటున్నారు. దీంతో పాటు ఆలయంలో విద్యుత్తో పాటు పలు రకాల పనులను కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్న క్లాస్–1 కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. మిగిలిన చెక్కులన్నీ ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారుల పేరుతో జారీ చేశారు. వివాదాస్పదంగా వాంగ్మూలాల స్వీకరణ.. విజిలెన్స్ అధికార సిబ్బంది.. తమ జిల్లా కార్యాలయంలో వాంగ్మూలాలను స్వీకరించకుండా ఆలయ కార్యాలయంలో కూర్చుని వాంగ్మూలాలను దగ్గరుండి రాయించడం వివాదాస్పదమయ్యింది. అక్రమాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ముందున కూర్చోబెట్టుకుంటే వాస్తవాలను ఎలా చెప్పగలమని కొందరు దినసరి వేతనదారులు ఆక్షేపించారు. ఇప్పటికై నా విజిలెన్స్ ఉన్నతాధికారులు తమదైన శైలిలో విచారించి ఆలయంలో అక్రమాల నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. -
పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
రాయగడ: ѧéÅ-Æý‡$¦Ë$ ^èl§ýl$-Ð]l#™ø ´ër$ °Æý‡Óíßæ…^ól ÑÑ«§ýl ´ùsîæÌZÏ ´ëÌŸY…sôæ ÐéÇÌZ ¯]l*™èl-¯ø-™éÞçßæ… ò³Æý‡$VýS$-™èl$…-§ýl-°, ^èl§ýl$-Ð]l#Oò³ {Ôèæ§ýl® MýSË$VýS$-™èl$…§ýl° Hyîl-G… Æý‡Ðól$‹-Ù-^èl…{§ýl ¯éĶæ$MŠS A¯é²Æý‡$. Ý린MýS çÜ…çÜP–† ¿ýæÐ]l-¯]l…ÌZ JyìlÔ> Ýëíßæ™èlÅ AM>-yýlÒ$ B«§ýlÓÆý‡Å…ÌZ Ô¶æ${MýSÐéÆý‡… ѧéÅ-Æý‡$¦ÌS Ð]l$«§ýlÅ ÐéÅçÜ, Ð]lMýS–¢™èlÓ, ´÷Ƈ$${sîæ, iMóS ´ùsîæ-ÌS¯]l$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l*°MìS Ð]l¬QÅ-A-†-¤V> àf-OÆð‡¯]l ¯éĶæ$MŠS ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$-§ólª-Õ…_ Ð]l*sêÏ-yéÆý‡$. ѧéÅ-Æý‡$¦Ë$ A°² Æý‡…V>ÌZÏ Ð]l¬…§ýl$…yéÌS° BM>…„ìS…-^é Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> hÌêÏ ´ûÆý‡çÜ…º…-«§éÌS Ô>Q A«¨M>Ç ºçÜ…™èl MýS$Ð]l*ÆŠ‡ {糫§é¯ŒS Ð]l*sêÏ-yýl$-™èl*.. hÌêÏÌZ° 11 çÜÑ$-™èl$ÌS ¯]l$…_ి 88 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦Ë$ ´ùsîæÌZÏ ´ëÌŸY¯é²Æý‡° A¯é²Æý‡$. VðSË$´÷…-¨¯]l ѧéÅ-Æý‡$¦Ë$ ™èlÓÆý‡ÌZ fÇVóS Æ>çÙ‰-Ýë¦Æ‡$$ ´÷sîæÌZÏ ´ëÌŸY…-sêÆý‡° ÑÐ]l-Ç…-^éÆý‡$. hÌêÏ Ñ§éÅÔ>Q A«¨ M>Ç Æý‡Ðól$‹Ù ^èl…{§ýl ¯éçßæMŠS, hÌêÏ çÜ…çÜP–† Ñ¿ê VýS… A«¨M>Ç çÜ$íÜÙèl »oÇ ´ëÌŸY-¯é²Æý‡$. Ñgôæ-™èl-ÌSMýS$ Ð]l¬QÅA-†¤.. Hyîl-G… ¯éĶæ$MŠS ºçßæ$-Ð]l$™èl$Ë$, {ç³Ôèæ…Ýë ç³{™é-ÌS¯]l$ A…§ýl-gôæÔ>Æý‡$. -
‘బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి’
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్ మధ్య రోజుకో వివాదం సంచలనం రేపుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంతోష్ ఖటువాను వెంటనే అరెస్టు చేయాలని విపక్ష బీజేపీ మహిళా నాయకులు వీధికి ఎక్కారు. నగరంలో నడి రోడ్డు మీద గురువారం భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేని అరెస్టు చేసేందుకు సాక్ష్యాధారాలతో కూడిన ఫిర్యాదుని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరలక్ యోగేష్ బహదూర్ ఖురానియాకు ఆందోళనకారుల ప్రతినిధి బృందం అందజేసింది. వివాదాస్పద ఎమ్మెల్యే సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా కస్టడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేవారు. ఎమ్మెల్యే వ్యతిరేకంగా వన్యప్రాణుల (ఏనుగులు) వేట, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రతినిధి బృందం డీజీపీని అభ్యర్థించింది. ఆయన వ్యతిరేకంగా పలు పత్రికల్లో ప్రచురిత వార్త కాపీలు, ఆడియో క్లిప్లు మరియు తేలిపాల్ గ్రామంలో వన్య ప్రాణుల అక్రమ వేట, దంతాల అక్రమ రవాణా సంబంధిత సాక్ష్యాల్ని డీజీపీకి దాఖలు చేశారు. ఈ నెల 2న ఎమ్మెల్యే ఫామ్హౌస్లో మీడియాతో జరిగిన సంభాషణలో బిజూ జనతా దళ్ నాయకురాలు డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ తనను వేశ్యగా అభివర్ణించి, సెక్స్ రాకెట్ నడిపారని సంతోష్ ఖటువా చేసిన అసభ్యకరమైన, లైంగికపరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను డీజీపీకి దాఖలు చేసిన ఫిర్యాదులో సవివరంగా వివరించారు. ఈ అభ్యంతరకర చేష్టలతో తీవ్ర మానసిక వేదన మరియు ప్రతిష్టకు హాని కలుగుతుందని ప్రభావిత డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులు, ప్రతీకార చర్యల ప్రమాదం దృష్ట్యా డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ ఆమెతో కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. -
ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఆకస్మిక పర్యటన
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంకువాల్ ఆకస్మికంగా పర్యటించారు. కొత్త వలస–కిరండోల్ మార్గంలో కొరాపుట్–కిరండోల్ (కేకే 2) లో విండో ఎల్జి స్పెషల్ రైలులో ప్రయాణం చేశారు. ఈ మార్గంలో రైల్వే స్థిరీకరణ, రైల్వే స్టేషన్లు పరిశీలించారు. విండో ప్రయాణంలో ట్రాక్స్, మలుపులు, వంతెనలు, గుహల గుండా పర్యవేక్షించారు. ఇటీవల కొండ చరియలు ట్రాక్ మీదకు దూసుకు వచ్చిన జరతి–మాలిగుడ స్టేషన్ల మధ్య ట్రాక్ పరిశీలించారు. కొండ చరియలు పడినప్పుడు తట్టుకునే విధంగా ట్రాక్ల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఇదే మార్గంలో కొరాపుట్ మీదుగా జగదల్పూర్ మార్గం పరిశీలించారు. తిరిగి కొరాపుట్–రాయగడ మార్గం కేఆర్ లైన్లో పరిస్థితి సమీక్షించారు. కక్కిరి గుమ్మ రైల్వే స్టేషన్, లైలి గుమ్మ–రవులి మధ్య వంతెన, కేఆర్ లైన్ లో 15 గేట్ లెవల్ క్రాసింగ్ పరిశీలించారు. పలు చోట్ల స్టేషన్లు తనిఖీ చేశారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ గొడుగులు వేసుకొని ట్రాక్ల వద్దకు వెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. పర్యటనలో వాల్తేర్ డీఆర్ఎం లళిత్ బోరా, అన్ని విభాగాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
తగ్గేది లేదు: డ్రైవర్లు
భువనేశ్వర్: అఖిల ఒడిశా రోడ్డు రవాణా డ్రైవర్ల సంఘం స్టీరింగు విరమణ ఆందోళన ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందనని బహిరంగంగా ఆందోళనకారుల మధ్య ప్రకటించి లిఖిత హామీ పత్రం విడుదల చేయాలని గట్టిగా పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు ఏమాత్రం తగ్గకుండా స్టీరింగు విరమణ ఆందోళన నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. అయితే రాష్ట్రంలో డ్రైవర్ల ఆందోళనపట్ల ఏమాత్రం ఆందోళన చెందాల్సింది లేదని రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో పూర్తి అభయం ఇచ్చారు. ఈ రెండు వర్గాల మధ్య సాధారణ ప్రజానీకం, వినియోగదారుల వర్గం తల్లడిల్లుతుంది. ప్రధానంగా డ్రైవర్ల బంద్ ప్రభావంతో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ వంటి చమురు సంక్షోభం తాండవిస్తుందని సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో చమురు కొరత లేదని మంత్రి ప్రకటించారు. డ్రైవర్ల ఆందోళన కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ నిల్వ పుష్కలంగా ఉంది. అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. బుధవారం నగరానికి 150 ట్యాంకర్లు, కటక్కు 76 ట్యాంకర్లతో పెట్రోల్, డీజిల్ చేరినట్లు మంత్రి వివరించారు. అన్ని నగరాల్లోనూ చమురు అందుబాటులో ఉంది. భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పెట్రోలియం డీలర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశం అఖిల ఒడిశా రోడ్డు రవాణా డ్రైవర్ల సంఘం నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో పెట్రోలియం సంక్షోభ పరిస్థితి మెల్లగా పుంజుకుంటోంది. ఈ పరిస్థితి నివారణ కోసం విభాగం మంత్రి పెట్రోలు, డీజిలు డీలర్ల సంఘం ప్రతినిథి ప్రముఖులతో మంత్రి గురు వారం సమావేశం అయ్యారు. స్థానిక లోక్ సేవా భవన్లో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో సరఫరా శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అఖిల ఒడిశా డీజిలు. పెట్రోలియం డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ లాట్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా, తాజా నిల్వల పరిస్థితిపై వీరంతా చర్చించారు. రాష్ట్రానికి రోజుకు 36 లక్షల లీటర్ల పెట్రోల్, 85 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. సాధారణంగా పెట్రోల్ పంపులలో 4 రెట్లు చమురు నిల్వ చేస్తున్నారు. డ్రైవర్ల ఆందోళన ప్రభావంతో గత 2 రోజులుగా పెట్రోలు, డీజిలు రవాణా స్తంభించిపోయింది. దీంతో సాధారణ నిల్వ క్రమంగా అడుగంటి పోతుందని అఖిల ఒడిశా డీజిలు, పెట్రోలియం సంఘం ప్రధాన కార్యదర్శి సంజయ్ లాట్ వివరించారు. ఇది క్రమంగా చమురు సంక్షోభానికి దారి తీసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రస్తుతానికి పెట్రోలు, డీజిలు చమురు కొరత లేదు. గురువారం నాటికి చమురు సరఫరా కాకుంటే సంక్షోభం తలెత్తవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్ర వారం సాయంత్రం నాటికి పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు అడుగంటిపోతాయని విశ్లేషించారు. భయపడాల్సింది లేదు: ప్రభుత్వం -
చుక్కల్ని తాకిన కాయగూరల ధరలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రముఖ కూరగాయల హోల్ సేల్ అంగడి కటక్ ఛత్రబజార్లో నిత్య అవసర కాయగూరల ధరలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులు సతమతం అవుతున్నారు. గురువారం నాటికి ఈ అంగడిలో పలు కాయగూరల కిలో ధరలు (రూ.) ప్రభుత్వానికి లొంగిపొండి ● మీ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం ● మావోయిస్టులకు పోలీసు యంత్రాంగం పిలుపు రాయగడ: ఆయుధాలను వీడి మీరంతా ప్రభుత్వానికి లొంగిపోవాలని, కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్, బస్టాండు తదితర ప్రాంతాల్లో బ్యానర్లను ఏర్పాటు చేసింది. గురువారం నాడు మునిగుడలో కనిపించిన ఈ బ్యానర్లు హల్ చల్ సృష్టించాయి. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరఫున ఉండేందుకు ఇల్లు, ఆర్థిక సాయంతో పాటు పిల్లల భవిష్యత్ కోసం ఆర్థిక సాయం చేస్తామన్నారు. అందువల్ల మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని బ్యానర్లలో పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు ఆపాలి శ్రీకాకుళం: సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేస్తూ పౌరుల జీవనానికి, స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోందని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు గురువారం తెలిపారు. సోషల్ మీడియా అరెస్టులపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారిచేసినా ప్రభుత్వం పాటించట్లేదన్నారు. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అరాచకాలు ఎక్కువయ్యాయని, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు. రెండు లారీలు ఢీ రణస్థలం: పతివాడపాలెంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొట్టుకున్నట్లు జె.ఆర్.పురం పోలీసులు తెలిపారు. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో క్లీనర్, డ్రైవర్లు స్వల్పగాయాలతో బయటపడ్డారని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. డిజిగ్నేషన్ మార్చాలని వినతి ఎచ్చెర్ల: తమకు గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట డిజిగ్నేషన్ ఇచ్చి అన్యాయం చేశారని, తమ డిజిగ్నేషన్ను కాంట్రాక్ట్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా మార్చాలని కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లు రెడ్డి లక్ష్మణరావు, వై.నారాయణరావు, పి.నవీన్ కోరారు. ఈ మేరకు గురువారం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) డైరెక్టర్ కేవీజీడీ బాలాజీకు వినతిపత్రం అందించారు. 2018కి ముందు, తర్వాత రిక్రూట్మెంట్ అయినవారికి రూ.40 వేలు జీతం ఇస్తున్నామ, తమకు మాత్రం రూ.25 వేలకే పరిమితం చేశారన్నారు. ఈ విషయమై అనేకసార్లు వినతిపత్రం అందించినా ఇప్పటివరకూ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను చాన్సలర్ మధుమూర్తి, రిజిస్ట్రార్ అమరేంద్రల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. గిరి ప్రదర్శనకు వెళ్లి వస్తూ.. నరసన్నపేట: మాకివలసలో గ్రామానికి చెందిన రావాడ ఉదయకుమార్ (28) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం సింహాచలం గిరి ప్రదర్శనకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామం వస్తుండగా భోగాపురం వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఉదయకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలియడంతో తండ్రి రమణయ్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉదయ్కుమార్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతలోలో మృతి చెందడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. పీ–4 విధానంపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పీ4 (ప్రభుత్వం–ప్రైవేటు–ప్రజలు– భాగస్వామ్యం) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పథ్విరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంగాళాదుంపలు 20 ఉల్లిపాయలు 25 దోసకాయలు 20 పొటల్స్ 30 బెండకాయలు 40 బరబటీలు 30 వంకాయలు 70 క్యారెట్ 30 -
ఎస్పీగా వెళ్లి డీఐజీగా రాక
కొరాపుట్: సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీగా కన్వర్ విశాల్ సింగ్ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విశాల్ గతంలో కొరాపుట్ ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్విస్టిగేషన్ వింగ్లో డీఐజీగా పని చేస్తున్నారు. మళ్లీ డీఐజీ హోదాలో కొరాపుట్ జిల్లా కేంద్రం రానునున్నారు. ప్రస్తుతం సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీగా ఉన్న అఖిలేశ్వర్ సింగ్ తిరిగి విశాల్ సింగ్ విధులు నిర్వరిస్తున్న ఇన్విస్టిగేషన్ వింగ్ డీఐజీగా వెళ్తారని ప్రభుత్వం ప్రకటించింది. కన్వర్ విశాల్ సింగ్ కొరాపుట్లో ఎస్పీగా పనిచేసి తిరిగి అదే కొరాపుట్కి డీఐజీగా రావడం గమనార్హం. దాతృత్వం చాటుకున్న శ్రీనివాసరావు కొరాపుట్: సామాజిక సేవకు సరిహద్దులు ఉండవని సామాజిక మాధ్యమాలు ఉంటే చాలని ఈ సంఘటన నిరూపించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పేదలకు నబరంగ్పూర్ జిల్లాలోని చైనా మార్కెట్కి చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ కొత్తకోట శ్రీనివాసరావు వితరణ చేశారు. ఆమదాలవలసలో గత 526 రోజులుగా పేదలకు నిరవధికంగా ఉచిత మధ్యాహ్న భోజన వితరణ జరుగుతోంది. అయితే ఇటీవల భారీ వర్షంలో పేదలు ఆహారం తీసుకుంటున్న చిత్రం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన శ్రీనివాసరావు చలించారు. వెంటనే నిర్వాహకులతో మాట్లాడి పేదలందరికీ నాణ్యమైన గొడుగులు, ఒక రోజు ఆహారం, స్వీట్లు అందజేయాలని సూచించారు. అవసరమైన ఆర్థిక సాయం పంపించారు. సాయి భక్తుడైన శ్రీను గురు పౌర్ణమి సందర్భంగా 527 రోజు అక్కడి వారందరికీ గోడుగులు, ఆహారం పంపిణీ చేయించారు. ఏసీఎఫ్ భార్యపై హత్య కేసు విచారణ కొనసాగాల్సిందే: హై కోర్టు భువనేశ్వర్: ఏసీఎఫ్ సౌమ్య రంజన్ మహాపాత్రో మరణానికి సంబంధించి అతని భార్య బిద్యా భారతి పండా వ్యతిరేకంగా నమోదైన హత్యారోపణ కేసు విచారణ కొనసాగాల్సిందేనని రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పర్లాకిమిడి ఎస్డీజేఎం న్యాయస్థానం ఆదేశించిన ప్రకారం ఈ కేసు విచారణ కొనసాగించాలని రాష్ట్ర హై కోర్టు స్పష్టం చేసింది. పర్లాకిమిడి ఎస్డీజేఎం న్యాయ స్థానం జారీ చేసిన ఆదేశాల్ని కొట్టివేయాలని నిందిత భార్య బిద్యా భారతి పండా రాష్ట్ర హై కోర్టుని ఆశ్రయించింది. ఆమె అభ్యర్థనని ఉన్నత న్యాయ స్థానం తిరస్కరించి తదుపరి విచారణ నిరాటంకంగా కొనసాగాలని ఆదేశించింది. నిందితురాలికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్లు 285, 304–ఎ కింద విచారణ కొనసాగుతుంది. 302, 120బి సెక్షన్లు కింద ప్రత్యేక ఫిర్యాదు ద్వారా లేవనెత్తిన ఆరోపణలపై విచారణను ప్రారంభ దశలో కొట్టివేయాలనే అభ్యర్థన పట్ల ఉన్నత న్యాయ స్థానం ప్రతికూలంగా స్పందించింది. ఈ సెక్షన్ల కింద లేవనెత్తిన ఆరోపణలపై సమగ్ర పరిశీలన విభిన్న వాస్తవ వివాదాలను ధృవీకరించే అవకాశం ఉందని రాష్ట్ర హై కోర్టు అభిప్రాయపడింది. తీవ్రంగా భిన్నమైన కథనాలు, వివాదాస్పద వాస్తవాల ఉనికిని దృష్టిలో ఉంచుకుని ట్రయల్ కోర్టు సాక్ష్యాలను లోతుగా పరిశీలించడం సముచితమని హై కోర్టు పేర్కొంది. హై కోర్టు జారీ చేసిన పరిశీలనల్ని ప్రభావితం చేయకుండా పిటిషనర్ (బిద్యా భారతి) ట్రయల్ కోర్టు ముందు విడుదల కోరడం వంటి అభ్యర్థనల్ని ప్రవేశ పెట్టేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు ఉన్నత న్యాయ స్థానం వెసులుబాటు కల్పించింది. దొంగను పట్టించిన ప్రజలు జయపురం: దొంగతనం చేసేందుకు ఒక ఇంటిలో చొరబడిన దొంగను ఆ ప్రాంత ప్రజలు చుట్టు ముట్టి పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ సంఘటన జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి శాంతినగర్లో జరిగింది. బుధవారం రాత్రి ఒక దొంగ బొరిగుమ్మ శాంతినగర్ నివసిస్తున్న బులు పాఢీ ఇంటిలో ప్రహరీ దూకి ఇంటిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంటి యజమాని భార్య శబ్ధం విని తలుపు తెరిచి చూడగా దుండగుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. ప్రహరీపై ఉన్న మేకులు గుచ్చుకోవడంతో ఒక మూల దాక్కున్నాడు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
జయపురం: స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని డెప్పిగుడ జంక్షన్లో గల సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారి నుంచి భక్తులు సాయిబాబా ఆలయానికి తరలివచ్చారు. యజ్ఞ, యాగాలు నిర్వహించారు. కొట్పాడ్లోని సాయిబాబా విగ్రహానికి ఎమ్మెల్యే రూపు భొత్ర పూజలు చేశారు. కొరాపుట్లో... కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమ, మైనారిటీ వ్యవహారాల మంత్రి నిత్యానంద గోండొ గురువారం పర్యటించారు. మెయిన్ రోడ్డులోని ఎస్బీఐ ఎదురుగా ఉన్న అలేఖ్ బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. మత గురువు అవదూత బ్రహ్మచారి బాబాకి పాద నమస్కారం చేశారు. ఆశ్రమంలో మత పెద్దలకు కానుకలు సమర్పించారు. ఆశ్రమానికి అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గురువుగా మారి పిల్లలకు పాఠాలు చెప్పారు. వారితో కలిసి ఆటలాడారు. నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ఉన్నారు. కొరాపుట్ జిల్లాలోని హరే కృష్ట మందిరాన్ని కొట్పాడ్ ఎమ్మెల్యే రుపు భొత్ర సందర్శించారు. గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. నబరంగ్పూర్లో.. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని చైనా మార్కెట్లో షిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉదయం పాలభిషేకం చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాద సేవనం జరిగింది. సాయంత్రం చైనా మార్కెట్, పఠాన్ వీధి, గాంధీ జంక్షన్, మెయిన్ రోడ్డు, జగన్నాథ మందిరం మీదుగా స్వామిని ఊరేగించారు. రాత్రి అల్పాహారం పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: పట్టణంలోని షిర్డీ సాయి మందిరాల్లో గురుపౌర్ణమి పూజలు నిర్వహించారు. స్థానిక రైల్వే రిక్రియేషన్ మైదానం ఎదురుగా గల షిర్డీ సాయి బాబా మందిరంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. డైలీ మార్కెట్ సమీపంలో గల హనుమాన్ మందిరం ప్రాంగణంలో గల బాబా మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. పర్లాకిమిడిలో... పర్లాకిమిడి: వ్యాస పౌర్ణమి సందర్భంగా స్థానక సరస్వతీ శిశు విద్యామందిర్లో విద్యార్థులతో దేవీ మఠం మహాంత రామానంద మహారాజ్ పాల్గొని వ్యాసుని చరిత్ర గురించి తెలియజేశారు. వ్యాస మహార్షిని ఆదిగురువుగా పండితులు అందరూ కోనియాడతారన్నారు. అందువల్ల ఈ రోజు గురుపౌర్ణమి అని కూడా పిలుస్తారన్నారు. రాజవీధిలోని జగన్నాథ మందిరం వెలుపల రథాల వద్ద సరస్వతీ శిశు విద్యామందిర్ విద్యార్థులు హాల్వా ప్రసాదాన్ని యాత్రికులకు పంచి పెట్టారు. శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల యోగా వేదికపై పతంజలి యోగా సమితి గురువు జిల్లా ప్రభారి భిఘ్నేశ్వర్ దాస్ను యోగ సమితి శిష్య బృందాన్ని ఘనంగా సత్కరించారు. -
సర్వం సిద్ధం
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025రథాల విడి భాగాల విక్రయానికి.. మత్స్యజీవి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని సంస్కృతి అపురూపం. భగవంతుడు ఆశీనుడైన రథం తాడు తాకిన జన్మ చరితార్థం అవుతుందని విశ్వసిస్తారు. యాత్ర సమయంలో రథం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో యాత్ర తర్వాత అంత కంటే అధికంగా ప్రాధాన్యత కూడగట్టుకోవడం విశేషం. ఔత్సాహిక భక్తులు రథాల విడి భాగాల్ని కొనుగోలు చేసి నిర్ధారిత ప్రాంగణాల్లో అత్యంత పవిత్రంగా పదిలపరుస్తారు. నిత్యం ఈ విడి భాగాలకు నియమ నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. శ్రీ మందిరం పాలక వర్గం (ఎస్జేటీఏ) వార్షిక రథ యాత్రలో వినియోగించిన రథాల విడి భాగాలు విక్రయించేందుకు తాజా ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) జారీ చేసింది. ఈ నేపథ్యంలో రథాల విడి భాగాల సవరించిన ధరల జాబితాను విడుదల చేసింది. విడి భాగాల్లో రథ చక్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. ప్రధానంగా శ్రీ జగన్నాథ స్వామి నంది ఘోష్ రథం చక్రాలపై భక్తులు అధికంగా మక్కువ కనబరుస్తారు. తాజా ఎస్ఓపీ ప్రకారం శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథ చక్రం ధర ఒక్కొక్కటి రూ. 3 లక్షలుగా నిర్ధారించారు. బలభద్రుని తాళ ధ్వజం ఒక్కో చక్రం ధర రూ. 2 లక్షలు, సుభద్ర దేవి దర్ప దళనం ఒక్కో చక్రం ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. రథాలపై విడి భాగాలకు ధరలు నిర్ధారించారు. వాటిలో ఒక్కో ప్రభ ధర రూ. 25,000 కాగా ఇతర విడి భాగాల ధర ఒక్కొక్కటి రూ.15,000గా ప్రకటించారు. మూడు రథాల పూర్తి రథ చక్రాల సెట్ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 6 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. సకాలంలో దాఖలు చేయాలి ఆసక్తి గల రథాల విడి భాగాల కొనుగోలుదారులు ఈ ఏడాది సెప్టెంబర్ నెల 15 లోపు ఆలయ పాలక వర్గానికి (ఎస్జేటీఏ) దరఖాస్తు దాఖలు చేయాలి. దానితో పాటు రూ.1,000 దరఖాస్తు రుసుం చెల్లించాలి. తాజా నిబంధనల మేరకు కొనుగోలు కోసం ఎంపికై న దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం చేరదీస్తారు. ఈ సమాచారం అందిన ఒక వారం లోపు పూర్తి మొత్తాన్ని సూచించిన ఖాతాలో జమ చేయాలి. నిర్ణీత సమయంలోపు ఎంపికై న దరఖాస్తుదారుడు మొత్తాన్ని డిపాజిట్ చేయలేని పరిస్థితుల్లో తదుపరి అర్హత కలిగిన దరఖాస్తుదారుని పరిగణనలోకి తీసుకుని కొనుగోలు అవకాశం కల్పిస్తారు. ఈ వ్యవహారంలో పాదర్శకతకు పెద్ద పీట వేస్తున్నట్లు పాలక వర్గం ప్రకటించింది. సాధారణంగా స్టార్ హోటళ్లు, కార్పొరేటు ఆస్పత్రులు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పేరొందిన వర్గాలు, మఠాలు, ప్రముఖ దేవస్థానాలు పూరీ శ్రీ జగన్నాథుని రథం విడి భాగాల్ని ఉత్సాహంతో కొనుగోలు చేసి ఆలయ పాలక వర్గం నిబంధనలకు కట్టుబడి ఉంటామని వాంగ్మూలం ముందస్తుగా దాఖలు చేయాల్సి ఉంది. స్వామి వినియోగించిన ప్రతి సామగ్రి, వస్తువు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ క్రమంలో రథాల విడి భాగాలు కొనుగోలు చేసిన వర్గాలు నిర్ధారిత స్థలంలో అత్యంత పవిత్రంగా పదిలపరచి నిత్యం ధూపదీపారాధన నిర్వహించాల్సి ఉంటుంది. న్యూస్రీల్ -
భారీగా గంజాయి స్వాధీనం
పర్లాకిమిడి: జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసుస్టేషన్ పరిధిలో అంతరాబ గ్రామ పంచాయతీ రేణు గ్రామం వద్ద రోడ్డు పక్కన గంజాయి అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా తెలియజేశారు. పట్టుబడిన 12 గంజాయి బస్తాలను మోహనా తహసీల్దార్ సమక్షంలో తూకా వేయగా 12.63 క్వింటాళ్లుగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే గంజాయి అక్రమ రవాణాలో నిందితులు పరారైనట్లు తెలియజేశారు. కొరాపుట్: మూడు వేర్వేరు సంఘటనల్లో 27 కేజీల గంజాయిని కొరాపుట్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంధాలుంగ్ గ్రామ పంచాయతీ జయంతి గిరి, చెటోడి పుట్ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు 12 లీటర్ల దేశీ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో సిర్మే ఖొరా, జయరాం పంగి, బల్కి పంగిలను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రధ్ ప్రకటించారు. దీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులు -
రాష్ట్రపతి పర్యటనకు సన్నద్ధత
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15వ తేదీల్లో రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక లోక్ సేవా భవన్లో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం సన్నద్ధతని ఆయన సమీక్షించారు. రాష్ట్రపతి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం న్యూ ఢిల్లీ నుండి స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక వైమానిక దళం విమానంలో చేరుతారు. భువనేశ్వర్, కటక్ జంట నగరాలలో 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ నెల 14 సాయంత్రం స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పంచమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు. మర్నాడు 15వ తేదీ ఉదయం కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయం 13వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఆ తర్వాత కటక్ రెవెన్షా బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తదుపరి రాష్ట్రపతి కటక్ తులసీ పూర్ బిజూ పట్నాయక్ చక్లో ఉన్న సరళ భవన్ను సందర్శించి ఆది కవి సరళా దాస్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. సరళ సాహిత్య సంసద్ నిర్వహించే ఆది కవి సరళా దాస్ 600వ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కళింగ రత్న అవార్డు–2024ను ప్రదానం చేస్తారు. జూలై 15వ తేదీ సాయంత్రం న్యూ ఢిల్లీకి తిరిగి పయనం అవుతారు. రాష్ట్రపతిని విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి ప్రత్యక్షంగా స్థానిక రాజ్ భవన్ చేరి రాష్ట్రపతి బస చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమాల వేదిక ప్రాంగణాలు, రోడ్డు ప్రయాణంలో దారి పొడవునా అత్యవసర భద్రత, రక్షణ ఏర్పాట్లు సమీక్షించారు. వేదికకు దారితీసే రోడ్ల తాజా స్థితిగతుల దృష్ట్యా అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల పరిశుభ్రత, వేదిక వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తగినంత సంఖ్యలో అదనపు జనరేటర్లను ఏర్పాటు చేయడానికి సూచనలు జారీ చేశారు. రాష్ట్రపతి సందర్శన సజావుగా సాగడానికి, వివిధ సన్నాహాలకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రముఖ కార్యదర్శి అందరి సహకారాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్, ప్రభుత్వ అదనపు ప్రఽముఖ కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత్ సాహు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా, సంబంధిత వివిధ విభాగాల కార్యదర్శులు, కేంద్ర రెవెన్యూ కమిషనర్లు, కటక్, ఖుర్దా జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థిని వింత ప్రవర్తన.. నాకు సారా, బీడీ ఇవ్వండి..!
ఒడిశా: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. -
రోడ్డు మరమ్మతులు చేపట్టలేదని నిరసన
జయపురం: రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇబ్బందులుపడుతున్నామంటు జనం నిరసనకు దిగారు. జయపురం సబ్డివిజన్ బోయిపరిగుడ సమితి దొండాబడి పంచాయతీ నుండి పనసపుట్ గ్రామం మీదుగా జంగోలజోడి గ్రామం వరకు ఉన్న రోడ్డు పంట పొలంలా మారడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోడ్డుకు మరమ్మతులు లేదా పునఃనిర్మాణం చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా సమితి, జిల్లా అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు వినూత్న రీతిలో బుధవారం నిరసనకు దిగారు. పంట పొలంలా ఉన్న రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేవారు. గ్రామస్తులు వివరణ ప్రకారం తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులకు విన్నవించుకోగా దొండాబడి నుంచి జంగొలజొడి గ్రామం వరకు 2019లో తారు రోడ్డు వేశారన్నారు. అయితే రోడ్డు నాణ్యత లేక పోవటంతో రెండు నెలలకే శిథిలమై గతుకులుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేదని గ్రామ పెద్ద బిజయ ఖొర ఆరోపించారు. రోడ్డు బాగు చేయకపోవటంతో గ్రామానికి అంబులెన్స్ కూడా రావడం లేదని.. దీంతో అత్యవసర సమయంలో రోగులు, గర్భిణులు, మహిళలు వెళ్లిలేకపోతున్నారన్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక పిల్లలు అవస్థలు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. ఇప్పటికై న రోడ్డు పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
గురువులే సమాజ మార్గదర్శకులు
కొరాపుట్: సమాజానికి గురువులే మార్గదర్శకులని నిఖిల ఉత్కళ ప్రాథమిక ఉపాధ్యాయుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణి రంజన్ త్రిపాఠి పేర్కొన్నారు. బుధవారం జయపూర్ పట్టణంలో లేబర్ ఆఫీస్ జంక్షన్ వద్ద బీఈఓ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల పదవీ విరమణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక విద్య తోనే సమాజానికి పునాదులు పడతాయన్నారు. వెనకబడిన కొరాపుట్ జిల్లాలో పాఠశాలలకు వెళ్లడానికి సరైన మార్గాలు లేనప్పటికీ ఉపాధ్యాయులు విధి నిర్వహణలో వెనకడుగు వేయడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన 10 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. కొరాపుట్ జిల్లా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శశి భూషణ్ దాస్, బీఈఓ చందన్ కుమార్ పట్నాయక్, ఉపాధ్యాయుల సంఘం జయపూర్ విభాగ అధ్యక్షురాలు భారతీ హోత్త, తదితరులు పాల్గొన్నారు. -
● పూరీలో బర్డ్ఫ్లూ కలకలం
భువనేశ్వర్: పూరీ జిల్లా డెలాంగ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బుధవారం డెలాంగు ప్రాంతంలోని కోళ్లఫారాల వద్ద వందలాది కోళ్లు చనిపోయాయి. ప్రధానంగా అంకులా, గొడిపుట్ మటియాపడా పరిరాల కోళ్ల ఫామ్ హౌస్లో కోళ్ల మరణాలు ఎక్కువగా సంభవించాయి. దీంతో కోళ్ళ పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు డెలాంగ్లో సుమారు 3 వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించారు. ప్రత్యేక వైద్య ఈ బృందం వివిధ కోళ్ల ఫారాలు సందర్శించి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. పరిపాలన 3 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం ప్రభావిత ప్రాంతాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది. -
పాముకాటుతో బాలిక మృతి
కవిటి: మండలంలోని పాత శిలగాం పూడివీధికి చెందిన గొనప షన్విత(11) అనే బాలిక పాముకాటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో పాము కాటు వేసింది. దీంతో బాలిక ఉదయం లేచిన తర్వాత విపరీతంగా వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితికి వెళ్లడంతో సోంపేట ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యమందించారు. పరిస్థితి విషమించడంతో బాలిక చికిత్స పొందుతూనే మంగళవారం మృతి చెందింది. శిలగాం ఉన్నత పాఠశాలలో బాలిక ఆరో తరగతి చదువుతోంది. రోడ్డు ప్రమాదంలో కార్యదర్శికి గాయాలు మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చింతల అప్పారావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని స్వగ్రామం కొరసవాడకు వెళ్లే క్రమంలో ఒడిశా రామసాగరం గ్రామం వద్ద ఆయన ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు 108కు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఒడిశా పర్లాఖిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. పాముల సయ్యాట కొత్తూరు: మండల కేంద్రంలోని ఎన్ఎన్ కాలనీలో మంగళవారం రాత్రి పాములు సయ్యాటాడుతూ కనిపించాయి. కాలనీలోని ప్రజలంతా ఆసక్తిగా గమనించారు. అయితే ప్రజలు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఇటువంటి ఘటన జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయితో ఇద్దరు యువకులు అరెస్టు కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు సుమారు నాలుగు కేజీల గంజాయి తరలిస్తూ కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం చైన్నెకు చెందిన రామ్మూర్తి దినేష్కార్తీక్ ఒడిశాలో 4 కేజీల గంజాయి కొనుగోలు చేసి తిరిగి చైన్నె వెళ్లేందుకు పలాస రైల్వే స్టేషన్కు వెళ్తున్న క్రమంలో కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. కటక్కు చెందిన చిత్తరాంజన్ దాస్ అనే వ్యక్తి పర్లాకిమిడిలో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కటక్ వెళ్లేందుకు పలాస రైల్వే స్టేషన్ వెళ్తున్న క్రమంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరి నుంచి 6 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనపరచుకున్న పోలీసులు కేసు నమోదుచేసి ఇరువురిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ వెల్లడించారు. బరితెగించిన ఆక్రమణదారులు సంతబొమ్మాళి: మండలంలోని పోతునాయుడుపేట గ్రామంలో ఆక్రమణదారులు బరితెగించారు. సాగునీటి కాలువ, రోడ్డుకు మధ్య ఉన్న సుమారు 30 సెంట్లు స్థలం కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వేసిన తాగునీటి బోరును పీకేసి ఆనవాలు లేకుండా చేశారు. దీంతో తాగునీటికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆక్రమణదారులను గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడంతో భయపడి ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో పాటు రోడ్డుకు అనుకొని ఉన్న బెర్ముతో పాటు సాగునీటి కాలువ గట్టును కూడా ఆక్రమించి మట్టిని వేసి కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో విద్యుత్ స్తంభాలు ఉండడంతో అవి కూడా తొలగించమని సంబంధిత కాంట్రాక్టర్తో ఆక్రమణదారులు గొడవపడిన సంఘటనలు ఉన్నాయి. ఆక్రమించిన స్థలంలోని 11 సెంట్లును వేరొక వ్యక్తికి ఆక్రమణదారులు అమ్మి తప్పుడు సర్వే నంబర్తో రిజిస్టేషన్ చేయించారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తహసీల్దార్ హేమసుందర్ను దీనిపై వివరాలు అడుగగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నందాహండిలో నిధుల స్వాహా
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితిలో రూ.12 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష బీజేడి ఆరోపించింది. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని గ్లేజ్ హోటల్లో పార్టీ మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అతి చిన్న సమితి నందాహండిలో మూడేళ్లలో 127 ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. పనులు జరగకుండానే జరిగినట్లు రికార్డుల్లో చూపించి నిధులు కై ంకర్యం చేశారని ఆరోపించారు. వాటర్ షెడ్, హార్టికల్చర్, అటవీ, సమితి విభాగంలో సమష్టి కుంభకోణం జరిగిందన్నారు. తక్షణమే విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేడీ నాయకులు అరుణ్ మిశ్రా, మంజులా మజ్జి, రబీ పట్నాయక్, సరోజ్ పాత్రో, ప్రమోద్ రథ్, నాగేంద్ర పట్నాయక్, ఉత్తం త్రిపాఠి, రాజేష్ త్రిపాఠి, సుమిత్ పూజారి, దయానిధి బిసోయి తదితరులు పాల్గొన్నారు.రెవెన్యూ ఉద్యోగుల నిరసన కొరాపుట్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కొరాపుట్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ మినిసీ్త్రరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్రశాఖ పిలుపు మేరకు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీలోగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించక పోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని, రూ. 20 లక్షల బీమా ఇవ్వాలని, కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని, ఖాళీలు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. జిల్లాలోని 14 సమితులు, నాలుగు మున్సిపాలిటీల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.యువకుడు బలవన్మరణం రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి మునిఖోల్ గ్రామానికి చెందిన ధీరజ్ ఆచార్య (23) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధీరజ్ ఆచార్య మునిఖోల్ గ్రామంలోనే తల్లితో కలిసి ఉంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఏం కష్టం వచ్చిందోగాని మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపై కప్పుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటి తరువాత తన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి ఽధీరజ్ శవమై వేలాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరైంది. ఇరుగు పొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆచార్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మునిగుడ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఐఐసీ సౌదామిని బెహర తెలిపారు. సారాతో ఇద్దరి అరెస్టు జయపురం: చట్ట వ్యతిరేకంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారీ అధికారి సుభ్రత్ కిశోర్ హిరన్ బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి ఉమ్మిరి గ్రామానికి చెందిన కరణ కొటియ, డొంగాగుడ వాసి భీమా నాయిక్గా వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో నిందితులు కరణ, భీమాలు సారాను తరలిస్తుండగా పట్టుబడినట్టు పేర్కొన్నారు. వారిరువురుపై రెండు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు. -
దళిత, మైనారిటీలపై దాడులు అరికట్టాలి
కొరాపుట్: రాష్ట్రంలో దళిత, మైనారిటీ వర్గాల ప్రజలపై దాడులు అరికట్టాలని సర్వమత సమ్మేళనం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోను బుధవారం సర్వమతస్తులు కలిశారు. గంజాం జిల్లాలో దళిత యువకులకు శిరో మండనం చేసి వీధుల్లో ఊరేగించారని, మల్కన్గిరి జిల్లాలో మతం మారినందుకు క్రైస్తవ మతస్తుల ఇళ్లపై దాడులు చేశారని కలెక్టర్కు వివరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాలరాస్తూ అగ్రకుల మతోన్మాదులు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. అనంతరం కలక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల కుంటుంబాల సంఘం అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, క్రైస్తవ, ముస్లిం, ఆదివాసీ, హరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పదో తరగతి విద్యార్థిని వింత ప్రవర్తన!
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. -
రైల్వే వంతెన మంజూరు చేయాలి
● నందపూర్ సమితి వాసుల డిమాండ్కొరాపుట్: అవసరమున్న చోట రైల్వే వంతెన లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా సమీపంలో డర్లిపుట్ వైపు ప్రజలు రైల్వే వంతెన కావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల జరిగిన బహుడా రథాయాత్ర రోజున రోడ్డు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద భక్తులు అధిక సంఖ్యలో కూర్చుని సేద తీరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే సమయంలో రైళ్లు వస్తే పరిస్థితి ఏమిటని ఈ ప్రాంతీయులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రోజూ బాలలు ట్రాక్ దాటుకుంటూ పాఠశాలలకు వెళ్తుంటారు. అక్కడ ఉన్న స్థల పరిస్థితి ప్రకారం ఫుట్పాత్ వంతెన నిర్మించాలని ప్రజలు ఛిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో రైల్వే అధికారులు సర్వే చేసి వెళ్లారు. కానీ ఇంత వరకు వంతెన మంజూరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గజపతిలో అధికారుల పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కేంద్ర పౌరసరఫరాలు, క్యాంప్ సంక్షేమ సంచాలకులు సునీల్ సచ్దేవ్, జాతీయ ఆహార భద్రత చట్ట కేంద్రీయ ప్రాజెక్టుల మానిటరింగ్ అధికారి సచిన్ కుమార్, ఆకాంక్ష బ్లాకులు గుమ్మా, ఆర్.ఉదయగిరిలో బుధవారం పర్యటించారు. వారితో సబ్ కలెక్టర్ అనుప్ పండా, అదనపు జిల్లా పౌరసరఫరాల అధికారిని స్నేహాసినీ బెహరా, ఆర్.ఉదయగిరి బీడీఓ. నారీమన్ ఖర్సల్, తాహాసిల్దార్లు వున్నారు. ఆకాంక్ష మండళాలు ఆర్.ఉదయగిరి, గుమ్మా సమితుల్లో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను వారు సమీక్షించారు. కేంద్ర పౌరసరఫరాలు, సంక్షేమ శాఖ డైరక్టర్ సునీల్ సచ్దేవ్, సచిన్ కుమార్ తొలుత ఆర్.ఉదయగిరి బ్లాక్ అబార్ సింగి, శవరపల్లి గ్రామపంచాయతీలలో పథకాలను లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. గుమ్మా బ్లాక్లో రాగిడి, తరబ పంచాయతీల్లో అమలు జరుగుతున్న కేంద్ర పథకాలు రేషన్ డిపోల వద్దకు వెళ్లి పి.డి.ఎస్.బియ్యం నాణ్యతను తనిఖీలు చేశారు. అనంతరం పర్లాకిమిడిలో ఆర్.ఉదయగిరి ప్రాంతీయ నియంత్రణ బజార్ కమిటీ గోడౌన్లో బియ్యం స్టోరేజీ, రేషన్ బియ్యం బస్తాల స్టాక్ను తనిఖీలు చేపట్టారు. తర్వాత కలెక్టరేట్కు చేరుకుని పాలనాధికారి బిజయకుమార్ దాస్తో ఇద్దరు కేంద్ర అధికారులు కలిసి పర్యటన విశేషాలను మాట్లాడారు. గజపతి జిల్లాలో ప్రాథమిక విధ్య, ఆరోగ్యం, పౌరసరఫరాలు, జనవనరులు మౌలిక సమస్యలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రజలకు అందాల్సిన పీఎం జనమణ యోజనా పథకం, మన్రేగా, స్వచ్ఛభారత్ అభియాన్, ప్యాక్ప్ గుమ్మా, కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకాలు అమలుపై చర్చించారు. తిరిగి ఇద్దరు కేంద్ర అధికారులు భుభనేశ్వర్ పయనమయ్యారు. -
పస్తులు ఉండలేక
అన్నం తినలేక.. ● మధ్యాహ్న భోజనంలో పురుగులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ● పట్టించుకోని అధికారులు కంచిలి: మండలంలోని కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండుతున్న అన్నంలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ సన్నబియ్యంతో వండిన అన్నంలో కొద్ది రోజులుగా పురుగులు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూరగాయల అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, బంగాళ దుంపలు కూర, వేరుశనగ చిక్కిను వడ్డించారు. అయితే కూరగాయల అన్నంలో కొందరు విద్యార్థులకు పురుగులు దర్శనమిచ్చాయి. ఇక్కడ కొద్దిరోజులుగా ఇదేవిధంగా అన్నంలో తెల్లటి పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. రెండో‘సారీ’ ఇటీవల ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి వెంకటేశ్వర పాణిగ్రాహి బియ్యాన్ని తనిఖీ చేసి, మొదటి బ్యాచ్లో సరఫరా చేసిన రెండు ప్యాకెట్ల పాత నిల్వ ఉన్న బియ్యాన్ని వెనక్కి తీసుకెళ్లారు. అయితే రెండో బ్యాచ్లో మళ్లీ సరఫరా చేసిన బియ్యంలో కూడా తెలుపు, నలుపు రంగుల్లో పురుగులు వస్తున్నాయని వంట చేస్తున్న ఏజెన్సీ మహిళలు తెలిపారు. దీనిపై పాఠశాల హెచ్ఎంకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతిరోజు విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూరగాయల అన్నంలో పురుగు బుధవారం పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూలో వడ్డించిన కూరగాయల అన్నంలో నల్లటి పురుగులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ ఇదేవిధంగా పురుగులు వస్తున్నాయి. దీంతో సరిగా అన్నం తినలేకపోతున్నాం. – ఎల్.చందు, ఆరో తరగతి విద్యార్థి ● -
రిజర్వాయర్లో పడి వృద్ధుడు మృతి
కొరాపుట్: జోలాపుట్ రిజర్వాయర్లో పడి వృద్ధుడు మృతి చెందాడు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోలాపుట్ రిజర్వాయర్ పరిధి రెంటా గ్రామ సమీపంలో ఉభ్న పర్ష ఘాట్ వద్ద జోడిపుట్ గ్రామానికి చెందిన సామ్ కిలో (60) స్నానానికి దిగి నీటిలో గల్లంతయ్యాడు. ఉదయం స్నానం కోసం వెళ్లిన సామ్ కిలో సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సాయంత్రం సమయంలో రిజర్వాయర్ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. పాడువా ఎస్ఐ దీపక్ బారిక్ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో అన్నదాత..!
ఇచ్ఛాపురం రూరల్: ‘ఖరీఫ్ నాటికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతుల వినతి మేరకు మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకాన్ని రూ.9 కోట్లతో పునరుద్ధరిస్తాం’ అని గతేడాది నవంబర్ 1వ తేదీన ఈదుపురం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటలు చెప్పి నేటికి 8 నెలలు కావస్తున్నా ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటివరకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో సీఎం హామీపై ఆశలు పెట్టుకున్న అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. 1,200 ఎకరాలకు సాగునీరు ఇచ్ఛాపురం మండలం కొఠారీ, పూర్ణాటకం, పత్రిపుట్టుగ, ధర్మపురం గ్రామాలతో పాటు కవిటి మండలంలోని భైరిపురం, వింధ్యగిరి, రాజపురం, లండారిపుట్టుగ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉండే 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ఏకై క ఎత్తిపోతల పథకం జైకిసాన్ ఎత్తిపోతల పథకం. ఈదుపురం బాహుదా నది పక్కన 2004లో నిర్మించారు. కేవలం వర్షాధారంపై పండించే ఈ ప్రాంత రైతులకు జైకిసాన్ ఎత్తిపోతల పథకం వరంగా మారింది. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు సక్రమంగా పంటలను పండించుకునేవారు. అయితే 2009లో కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉప్పొంగడంతో ఎత్తిపోతల పథకం నీట మునిగింది. దీంతో యంత్రాలు పాడైపోయాయి. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయడంతో మరో ఐదేళ్ల పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు తీరాయి. 2018 అక్టోబర్లో వచ్చిన తిత్లీ తుఫాన్కు బాహుదా వరద నీటిలో ఎత్తిపోతల పథకం 15 రోజుల పాటు ఉండిపోవడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు ఎత్తిపోతల పథకానికి సంబంధించి యంత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పటినుంచి ఏడేళ్లుగా 1200 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో అక్కడి రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీతో ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కుతాం అనుకున్న రైతులకు అడియాసలే మిగిలాయి. రూ.9 కోట్లతో ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తెస్తామన్న ఆయన హామీ నీటిమూటగా మిగిలిపోయింది. పత్తా లేకుండా పోయిన సీఎం చంద్రబాబు హామీ మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకం మొదలైన ఖరీఫ్ కష్టాలు -
దయితరిదాస్ బాబా కన్నుమూత
కొరాపుట్: ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వేలాది అలేఖ్ మతస్తుల గురువు దయితరి దాస్ బాబా (80) తుదిశ్వాస విడిచారు. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి దండాముండా గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఘరియాబంద్ జిల్లా ఉర్మల్ అటవీ ప్రాంతంలోని ఆశ్రమంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఒడిశాలోని కలహండి, నబరంగ్పూర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఛత్తీస్గఢ్ తరలివెళ్లారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు వ్యసనాలు వదిలి ఆధ్యాత్మిక భావజాలంలోకి అడుగు పెట్టడానికి బాబా ఎంతగానో కృషి చేశారు. అంతిమ యాత్రకు నబరంగ్పూర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి తదితరులు హాజరయ్యారు. -
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
బూర్జ: మండలంలోని పాలవలస జెడ్పీహెచ్ స్కూల్, అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలల్లో డీఈవో డాక్టర్ తిరుమల చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పాలవలస జెడ్పీ హైస్కూల్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరుపై ఎంఈవోలు ఎన్.శ్యామసుందరరావు, బి.ధనుంజయరావులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉందో విద్యార్థులకు ప్రశ్నలు అడిగి తెలసుకున్నారు. అల్లెన పాఠశాలలో విద్యార్థులు పాలవలస పాఠశాలలో మెర్జి చేయడంతో తల్లిదండ్రులు పంపించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అయితే 100 మంది విద్యార్థులు ఉంటే గానీ యూపీ స్కూల్ కొనసాగించలేమని డీఈవో పేర్కొన్నారు. ఆయనతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హోంగార్డు కుటుంబానికి చేయూత శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు పి.జగన్నాథంకు జిల్లా హోంగార్డుల యూనిట్ ఒక్కరోజు వేతనం రూ.4.09 లక్షలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చేతులమీదుగా అందజేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జగన్నాథంకు చెక్ అందించారు. మా భూములు తీసుకోవద్దు నరసన్నపేట: ఎంఎస్ఎంఈవో పార్క్ నిమిత్తం తమ భూములు తీసుకోవడానికి ప్రభుత్వం చూస్తోందని, తమ భూములు తీసుకోవద్దని మండలంలోని జమ్ము గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు బమ్మిడి రామారావు, తలసముద్రం రాజారావు, తాడి మొఖలింగంలతో పాటు పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తమ జీవానాధారానికి భూములను ఇచ్చిందని, ఇప్పుడు ఇండస్ట్రీయల్ పార్క్ పేరిట తాము సాగు చేసి పంటలు పండించుకుంటున్న భూములు తీసుకోవడానికి అధికారులు చూస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఇది ఏమాత్రం తగదని పేర్కొన్నారు. ఆర్ఐ సాయిరాంతో పాటు వీఆర్వో, సర్వేయర్లు వచ్చి సోమవారం కొలతలు వేశారన్నారు. తమ భూముల వైపు అధికారులు రావద్దని కోరారు. ‘ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డా.. గుర్తింపేదీ..?’ రణస్థలం: తాను ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డానని అయినా గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ అన్నారు. మండలంలోని రావాడ పంచాయతీలో తన ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశానని, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ మార్కెట్ చైర్మెన్ ఎస్సీ రిజర్వేషన్ అయిందని, అన్ని అర్హతలుండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే తనను నామినేట్ చేయకుండా వేరేవాళ్లకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. దీనికి నిరసనగా తాను పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని, అలాగే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. విజిలెన్స్ దాడులు రణస్థలం: మండల కేంద్రంలోని రామతీర్థాలు రహదారిలో జే.ఆర్.పురంలో ఉన్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్, వ్యవసాయ అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా స్టాక్ రిజిస్టర్తో ఎరువుల భౌతిక నిల్వలను పోల్చితే వ్యత్యాసాలు కనిపించాయి. అలాగే అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎరువులను స్వాధీనం చేసుకొని, దుకాణం డీలర్పై 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, కానిస్టేబుల్ ఈశ్వర్, మండల వ్యవసాయ ఏవో డి.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు పలువురు రాజీనామా
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంద్రా సమితి సభ్యులు, సర్పంచ్లు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా కుంద్రా సమితికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయపూర్ పట్టణంలోని సంగం కల్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ సమితి చైర్మన్ రాజేశ్వరి పరజాకి తాము అభివృద్ధి కోణంలో మద్దతు ఇచ్చామన్నారు. ఆమె భర్త సురేంద్ర పరజా, మరో కాంగ్రెస్ నాయకుడు టునా పట్నాయక్లు ఎన్నికై న సభ్యులకు విలువ ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తామంతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఐదుగురు సర్పంచ్లు, ముగ్గురు సమితి సభ్యులు రాజీనామ చేశారు. కుంద్రాలో సమితి చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవలసి వస్తుంది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు టునా పట్నాయక్ మట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని అన్నారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్ మరోమారు ఎన్నిక అయ్యారు. మంగళవారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన బీజేపీ కేంద్ర నాయకుడు సంజయ్ జైస్వాల్ ప్రకటన చేశారు. ప్రకటన వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రి వర్గం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పండా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు , సీనియర్ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయంలో వరుసగా నాలుగోసారి ఎన్నికై న మన్మోహన్ సామల్ను సత్కరించారు. రాష్ట్రంలో పార్టీ అత్యున్నత స్థానంలో ఇది ఆయన వరుసగా రెండు, సమగ్రంగా నాల్గో పర్యాయం ఈ హోదాకు ఎన్నిక కావడం విశేషం. గతంలో 1999, 2001లో బిజూ జనతా దళ్ (బీజేడీ)తో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ సమయంలో ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. 2023 మార్చిలో మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఎన్నిక అయ్యారు. ఈ వ్యవధిలో 2024 సార్వత్రి ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని చేజిక్కించిన ఘనత సొంతం చేసుకున్నారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా 20 లోక్ సభ స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో ప్రతిపాదిత బీజేడీతో పొత్తును నిరాకరించి ఒంటరిగా పోరాడటానికి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి తన దక్షత, నైపుణ్యతని చాటుకున్నారు. ఆ తర్వాత జరిగిన తాజా ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
బురదలో దిగబడిన బస్సు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి నీలిగూడ గ్రామం ప్రధాన రహదారిలో మంగళవారం పోడియా నుంచి మల్కన్గిరికి వెళ్తున్న బస్సు బురదలో దిగబడింది. రెండు గంటలపాటు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్టర్ సాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు. ఈ రహదారి పనులు గత రెండేళ్లుగా చేస్తున్నా పూర్తి కాలేదు. తరచూ ఈ రహదారిలో బైక్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వర్షం పడితే గోతుల్లో నీరుచేరి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కిశోర్, విద్యా చట్టాలపై అవగాహన
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో జయపురంలోని సరస్వతీ శిశు విద్యామందిర అరవిందనగర్ ప్రాంగణంలో సోమవారం కిశోర్ న్యాయ చట్టం 2015 (శిశు సంరక్షణ, భద్రత చట్టం) బాధ్యతాయుత విద్యా చట్టాలపై చైతన్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రదీకరణ జిల్లా అధ్యక్షులు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి సూచన మేరకు నిర్వహించిన శిబిరంలో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ.. కిశోర్ న్యాయ చట్టం గురించి వివరించారు. అలాగే బాల బాలికలు చదువుకునేందుకు నిర్బంధవిద్యా చట్టాలు కల్పించాయని, అలాగనే నేరాలు చేసే మైనర్ బాల బాలికలకు భద్రత, రక్షణ కల్పించి వారు చదువుకొనేందుకు కావాల్సిన వనరులపై అవగాహన కల్పించారు. పోస్కో ప్రత్యేక న్యాయ స్థానం ప్రభుత్వ న్యాయవాది డాక్టర్ గాయిత్రీ దేవి, శిశు కళ్యాణ కమిటీ కొరాపుట్ అధ్యక్షులు గాయిత్రీ పాత్రో, పీఓఐసీ కొరాపుట్ రిషభ నాయిక్, జయపురం పట్టణ పోలీసు ఏఎస్ఐ సత్యబాది నాయిక్, సరస్వతీ విద్యామందిర్ పారాబెడ అధ్యాపకులు డాక్టర్ రమణీరంజన్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థులకు విజ్ఞాన ప్రతిభపై పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కొత్తూరు: మండలంలోని వసప గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. నిందితుడు శంకరరావు నిర్వహిస్తున్న పాస్ట్ఫుడ్ సెంటర్కు మృతుడు మిన్నారావు పకోడి, బజ్జీలు కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ వెళ్తుంటాడు. దీనిలో భాగంగా మృతుడు మిన్నారావు ఈనెల 5వ తేదీ రాత్రి శంకరావు పాస్ట్ఫుడ్ సెంటర్కు వెళ్లి పకోడి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇద్దరు మధ్యం వివాదం జరిగింది. మిన్నారావు గతంలో బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతో బాకీ విషయంలో ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. కొట్లాటలో మిన్నారావు తలపై సుత్తితో తల వెనుకభాగంలో కొట్టడంతో పాటు చాకుతో పీకను కోసి చంపినట్లు సీఐ ఎండీ అమీర్ అలీ పాల్గొన్నారు -
10 కేజీల గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయిని నరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు బసంత మహాపాత్రో, సిద్దాంత స్వైన్లను అరెస్టు చేసినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్తో కలిసి ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎప్పటిలాగే మడపాం టోల్ గేట్ వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ తదితరులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో సోదాలు చేయగా వీరి వద్ద గంజాయి గుర్తించామన్నారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాలి గ్రామం నుంచి అక్రమంగా గంజాయిని బెంగళూరు తరలిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీంతో గంజాయిని సీజ్చేసి, కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పరశురాం మజ్జి
కొరాపుట్: భారతీయ జనతా పార్టీలో అత్యున్నత జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నబరంగ్పూర్ మాజీ ఎంపీ పరశురాం మజ్జి నియమితులయ్యారు. మంగళ వారం అందుకు తగ్గ ఆదేశాలను రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రకటించింది. పరశురాం 2000–09 ల మధ్య రెండు సార్లు నబరంగ్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. జాతీయ కౌన్సిల్ సభ్యుని హోదా లో పార్టీ జాతీయ అధ్యక్షుని ఏన్నికలలో ఓటు వినియోగించుకునే హక్కు ఉంది. పరశురాంను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. జిల్లా సివిల్ సప్లై అధికారిగా మానస రంజన్ జయపురం: కొరాపుట్ జిల్లా సివిల్ సప్లై నూతన అధికారిగా మానస రంజన్ మహాపాత్రో నియమితులయ్యారు. ఈయన మంగళవారం జయపురం జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మహాపాత్రో ఇంత వరకు జాజ్పూర్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా పనిచేస్తూ కొరాపుట్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ కొరాపుట్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా ఉన్న ప్రదీప్ కుమార్ పండ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ప్రదీప్ కుమార్ పండను జాజ్పూర్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా రాష్ట్ర సివిల్ సప్లై విభాగం నియమించింది. పేకాట శిబిరంపై దాడి పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి గురండి పంచాయతీ మధుసూదన్ పూర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా జరుపుతున్న పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడుల్లో రూ.2,44,100లు నగదు స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్టు చేసినట్టు గురండి ఐఐసీ ఓం నారాయణ పాత్రో తెలియజేశారు. -
నిజమందిరానికి చేరిన జగన్నాథుడు
పర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది. -
రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్ పర్యటన
కొరాపుట్: రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నారని కొరాపుట్ డీసీసీ కో ఆర్డినేటర్ శశి భూషణ్ బెహరా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జయపూర్ మెయిన్ రోడ్డులోని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన భువనేశ్వర్లో రాజ్యాంగ పరిరక్షణ సభ జరుగుతుందన్నారు. ఈ సభకి రాహుల్తోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తదితరులు వస్తారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, పేదలకు అందని సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై ఈ సభలో నిరసన గళం వినిపిస్తామని శశి భూషణ్ బెహరా పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్ గంగ్ పూర్, ఎమ్మెల్యే పి.ఎస్.రాజన్ హిక్కా, చిత్ర కొండ ఎమ్మెల్యే మంగులు కిలో, జయపూర్ మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, నాయకుటు నిమయ్ సర్కార్, రుపక్ తురుక్, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వనమహోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఛలాన్గూఢ పంచాయతీలోని నర్సరీ వద్ద మంగళవారం వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అటవీశాఖ డీఎఫ్వో సాయికిరణ డి.ఎన్ నేతృత్వంలో కార్యక్రమం జరగ్గ ముఖ్యఅతిథిగా మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మన హక్కు అన్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. నాటిన మొక్కలను సక్రమంగా సరంక్షించాలని వక్తలు కోరారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్రశభరో, ఛలాన్గూఢ సర్పంచ్ అరక్షత నాయక్, ఛలాన్గూఢ పాఠశాల విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో 200 మొక్కలు నాటారు. -
రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన
నిజమందిరానికి.. జగన్నాథుడు నిజ మందిరానికి చేరుకున్నాడు. పర్లాకిమిడిలో యాత్ర ముగిసింది. –8లోuబుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025శ్రీమందిరం ఆదాయం లెక్కింపు భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం సోమవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.6,86,982లు, బంగారం 3 గ్రాముల 600 మిల్లీగ్రాములు, వెండి 1 గ్రాము 100 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు. భువనేశ్వర్: అఖిల ఒడిశా ట్రక్, బస్సు డ్రైవర్ల మహా సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఆరంభమైంది. ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సు, ట్రక్ యజమానుల సంఘం ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించింది. అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సమ్మె ప్రభావంతో మంగళవారం రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోయింది. అవగాహన లేని ప్రయాణికులు పలు చోట్ల బస్ స్టాపుల్లో చిక్కుకున్నారు. బస్సు సేవల పునరుద్ధరణ కోసం నిరీక్షించడంలో నిరుత్సాహానికి గురయ్యారు. సరుకు రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. అఖిల ఒడిశా డ్రైవర్ల మహాసంఘ 6 ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు నడుం బిగించింది. వాటిలో డ్రైవర్ల సంక్షేమ బోర్డులో ఆటో డ్రైవర్లను చేర్చడం, 60 ఏళ్లు పైబడిన డ్రైవర్లకు ఫించను భద్రత, ఎక్కడికక్కడ విశ్రాంతి గదులు, మరుగు దొడ్ల సౌకర్యాలు, ప్రతి 100 కిలో మీటర్ల పరిధిలో వాహనాల పార్కింగ్ స్థలాలు, డ్రైవర్ల భద్రతకు హామీపూర్వక చట్టాల అమలు, గనులు, పారిశ్రామిక ప్రాంతాలలో డ్రైవర్లకు ఉద్యోగాలు కల్పించడంలో 70 శాతం రిజర్వేషన్ సౌకర్యం, ఏటా సెప్టెంబర్ 1ని జాతీయ డ్రైవర్ల దినోత్సవంగా ప్రకటన ప్రధాన డిమాండ్లుగా చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా సమ్మె పట్ల స్పందించారు. డ్రైవర్ల సంఘం ప్రతిపాదిత డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సంఘం ప్రతినిథి ప్రముఖుల్ని త్వరలో ఆహ్వానిస్తుందన్నారు. వీరి డిమాండ్లలో కొన్ని న్యాయ సమ్మతమైనవిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చల ద్వారా ప్రతిష్టంభన తొలగించే దిశలో ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ప్రకటించారు. న్యూస్రీల్ ఒడిశా డ్రైవర్ మహాసంఘం రాష్ట్రవ్యాప్త సమ్మెడ్రైవర్లు స్టీరింగ్ చోడొ ఆందోళన రాయగడ: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా రాయగడ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్టీరింగ్ చొడో ఆందోళన చేపట్టారు. స్థానిక సాయి ఇంటర్నేషనల్ కూడలిలో డ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ బోర్డులో తమ పేర్లు నమోదు చేయాలని, సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. -
చెరువులో మునిగి తల్లీబిడ్డ మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి దౌడాగూఢ గ్రామంలో మంగళవారం ఓ తల్లీబిడ్డ స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గురునాథ్ బాగరియా భార్య ప్రియా(24) తన ఐదు నెలల కుమార్త పింకీతో కలిసి మంగళవారం ఉదయం చెరువుకు వెళ్లింది. అయితే బిడ్డకు స్నానం చేయిస్తుండగా ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఉదయం వెళ్లిన వారు మధ్యాహ్నానికి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. చివరకు చెరువు వద్ద ప్రియ చీర కనిపించడంతో వెంటనే మత్తిలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు వచ్చి చెరువులో మునిగిపోయిన తల్లీబిడ్డను బయటకు తీశారు. తర్వాత మత్తిలి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఐఐసీ ప్రియదర్శిని సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోర్టుమార్టం కోసం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
విధుల నిర్వహణలో అప్రమత్తతే కీలకం : డీఆర్ఎం
భువనేశ్వర్: రాత్రింబవళ్లు పట్టాలపై పరుగులు తీసే రైళ్ల నిర్వహణలో సిబ్బంది నిరంతర అప్రమత్తతే బలమైన భద్రతా కవచమని, రెప్పపాటు తప్పిదం కూడా ఘోర ప్రమాదాల్ని ప్రేరేపించే పరిస్థితుల్లో అప్రమత్తత ప్రదర్శించి విధుల నిర్వహణలో సిబ్బంది అంకిత భావం చాటుకున్నారని ఖుర్దారోడ్ రైల్వే మండల అధికారి (డీఆర్ఎం) హెచ్ఎస్ బజ్వా అన్నారు. డివిజన్లోని నలుగురు రైల్వే ఉద్యోగులను గుర్తించి భద్రతా అవార్డులతో సత్కరించారు. డీఆర్ఎం చేతుల మీదుగా సత్కారం పొందిన వారిలో లోకో పైలట్ పి.శ్రీనివాస రావు (ఖుర్దారోడ్), టీపీఎంఏ సుధాంశు స్వంయి (కటక్), టీపీఎంఏ అభిమన్యు దొలై (జఖ్పురా), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (టెక్నికల్) ఉత్తమ్ కుమార్ దాస్ (ఖుర్దారోడ్, మెము కార్ షెడ్) ఉన్నారు. సిబ్బంది అభినందన సభ కార్యక్రమంలో అదనపు మండల రైల్వే అధికారి (ఇన్ఫ్రా) శుభ్ర జ్యోతి మండల్, సీనియర్ మండల భద్రత విభాగం అధికారి (ఎస్డీఎస్ఓ) నమో నారాయణ్ మీనా, ఇతర బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలో డీఆర్ఎం హెచ్. ఎస్. బాజ్వా మాట్లాడుతూ పెను సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సురక్షిత, సమర్థమైన రైళ్ల నిర్వహణలో అవిశ్రాంతంగా పని చేసే రైల్వే ఉద్యోగుల అచంచలమైన అంకిత భావం ప్రశంసనీయమన్నారు. వీరి అంకితభావం గుర్తించి అభినందించడం తోటి సిబ్బందిని ప్రోత్సహిస్తుందన్నారు. మండల అధికారుల అభినందనలతో ప్రత్యేక భద్రతా పురస్కారం అందుకున్న సిబ్బందికి తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
అద్వితీయంగా అంతిమ ఘట్టం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మంగళవారం జరిగింది. దీంతో శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ముగిసింది. సంధ్యా ధూపం తర్వాత రథంపై ఉన్న మూల విరాటులతో ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో గొట్టి పొహండి నిర్వహించి సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికకు చేర్చడంతో నీలాద్రి విజే విజయవంతమై రథ యాత్రకు తెర పడింది. రథ యాత్ర క్రమంలో ఉత్సవ సేవాదులు నిర్వహించారు. రథాలపై మూల విరాటుల పూజలు ముగియడంతో రథాల పైనుంచి విగ్రహాల్ని దించేందుకు చారుమళ్లు ఏర్పాటు చేశారు. వీటి గుండా వరుస క్రమంలో మూల విరాటులతో ఉత్సవ మూర్తుల్ని శ్రీ మందిరం రత్న వేదిక పైకి తరలించారు. బుధ వారం నుంచి శ్రీ మందిరం రత్న వేదికపై భక్తులకు యథాతథంగా ఏడాది పొడవునా చతుర్థా మూర్తుల దర్శనం ప్రాప్తిస్తుంది. మహాలక్ష్మికి స్వామి బుజ్జగింప రథయాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి దేవిని జగన్నాథ స్వామి బుజ్జగించే వైనం భక్త జనాన్ని ముచ్చట గొలిపించే అపురూప ఘట్టం. నీలాద్రి విజే సమయంలో సుదర్శనుడు, దేవీ సుభద్ర, బలభద్ర స్వామిని శ్రీ మందిరంలోనికి ఆహ్వానించిన శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుడు శ్రీ జగన్నాథుని ప్రవేశం అడ్డుకుని శ్రీ మందిరం సింహ ద్వారం తలుపులు మూసి వేస్తుంది. తనను విస్మరించి తోబుట్టువులతో యాత్రకు ఏగి విరహ వేదన తాళలేక స్వయంగా దర్శనం కోసం వెళ్లిన నిరుత్సాహ పరచడంతో శ్రీ మహా లక్ష్మి అలక ప్రదర్శించడం ఈ ముచ్చట గొలిపే ఘట్టం జానపద ఇతివృత్తం. దేవేరి అలక తీర్చేందుకు యాత్ర కానుకగా శ్రీ జగన్నాథుడు రసగుల్లాను దేవేరికి సమర్పించడంతో మురిసిపోయి సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానిస్తుంది. ఇది రథ యాత్రలో చిట్ట చివరి ముచ్చట గొలిపే ఘట్టం. -
దారికాచిన మృత్యువు..
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి కత్తమేట గ్రామం వద్ద మంగళవారం టమటా లోడ్తో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి అటుగా వస్తున్న బైక్పై పడింది. బైక్పై వస్తున్న కానిస్టేబుల్ కృష్ణ పూజారి, భార్య రుక్మిణి పూజారి ట్రక్కు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కృష్ణ పూజారి అక్కడికక్కడే మృతి చెందారు. రుక్మిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు వచ్చి ఇద్దరినీ బయటకు తీశారు. కృష్ణ మృతి చెందినట్లు గుర్తించారు. ఆమెను వెంటనే మత్తాలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి రుక్మిణికి మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధిక బరువు వల్లే ట్రక్కు పడిపోయినట్లు కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి భార్యకు తీవ్ర గాయాలు -
17 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయితో ఒక యువకుడిని రైల్వే, అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి 17.400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన యువకుడు దినేష్ బిభర్గా గుర్తించారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం కోర్టుకు తరలించారు. అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ ధల్ సామంత తెలియజేసిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలో బిభర్ అనుమానాస్పదంగా కనిపించడంతో అతని బ్యాగును తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1.70 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. -
స్కూలుకు తాళం
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ అల్లడ పంచాయతీలో లెంగడాగుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం గ్రామస్తులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తరగతుల్లో 120 మంది చదువుతున్నారు. 2024లో ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవ్వగా మిగతా ముగ్గురు టీచర్లలో ఒకరిని క్లస్టర్ రిసోర్సు సెంటర్ కోఆర్డినేటరు, మరొకరిని బీఎల్ఓ డ్యూటీకి డీఈఓ మాయధర్ సాహు వేశారు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అభ్యసిస్తున్న లెంగడాగుడ ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వ నిధులు మంజూరవుతున్నా ఇప్పటివరకూ హెచ్ఎం పదవిని ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో విద్యార్థులు చదువు చెప్పే వారు కరువయ్యారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించేవరకూ ఈ పాఠశాల తెరవడం సాధ్యపడదని జెడ్పీటీసీ మాజీ సభ్యులు సుకాంతి శోబోరో, ఉపాధ్యక్షురాలు కవితా బిడికా, సమితి సభ్యురాలు పార్వతీ శోబోరో విలేకరులకు వివరించారు. -
డ్రైవర్ల సమ్మెతో నిలిచిన ఎరువుల గూడ్స్ రైలు
కొరాపుట్: డ్రైవర్ల సమ్మెతో రైతులకు నష్టం ఏర్పడింది. మంగళవారం ఒడిశా రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ల సంఘం ఆకస్మిక సమ్మెకి పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచే డ్రైవర్లు స్టీరింగులు వదిలి ఆందోళనకు దిగారు. దీంతో ఈ సమ్మె రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మంగళవారం వేకువ జామున 2,600 టన్నుల యూరియా ప్రత్యేక రైలు లో జయపూర్ స్టేషన్కి వచ్చింది. ఈ యూరియా లారీలు, వ్యాన్ల ద్వారా దుకాణాలకు,రైతులకు చేరాలి. కానీ డ్రైవర్ల నిరవధిక సమ్మెతో రైలు ర్యాక్ వద్దకి వాహనాలు రాలేదు. ప్రస్తుతం కొరాపుట్, మల్కన్ గిరి, నబరంగ్పూర్ జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో మెక్క జొన్న పంట వేశారు. వారికి మెదటి దశ యూరియా తక్షణం అందాలి. కానీ డ్రైవర్ల నిరవధిక సమ్మెతో రైతుల తీవ్ర ఆవేదనకి గురయ్యారు. ఇరు జిల్లాలో డ్రైవర్ల సమ్మె కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో ప్రైవేట్ వాహన డ్రైవర్లు నిరవధిక సమ్మెకి దిగారు. దాంతో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. కొరాపుట్, సిమిలిగుడ, జయపూర్, బొరిగుమ్మ, నబరంగ్పూర్ పట్టణాల్లో డ్రైవర్ల ఆందోళన శిబిరాలు నడుస్తున్నాయి. మరో వైపు బుధవారం భారత్ బంద్ నేపథ్యంలో మంగళ వారం ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అంతర్రాష్ట్ర బస్సులు కూడా నిలిచి పోయాయి. -
కలెక్టర్ దృష్టికి ఇసుక కొరత సమస్య
రాయగడ: గత ఆరు నెలలుగా జిల్లాలోని గుణుపూర్లో ఇసుక కొరత ఏర్పడిందని పట్టణ వాసులు జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి దృష్టికి తీసుకువచ్చారు. గుణుపూర్లోని వంశధార నదీ ప్రాంతంలో మూడు ఇసుక రీచ్లు ఉన్నప్పటికీ అవి ఆరు నెలలుగా మూత పడిపోవడంతో పట్టణంలో నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయాయని కలెక్టర్ను మంగళవారం కలిసి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ఇసుకను తీసుకురావడానికి 2,500 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. దీంతో నిర్మాణ వ్యయం అధికమవ్వడంతో నానా అవస్థలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. వంశధార నదీ తీరంలో ఇసుక రీచ్లు పునః ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన వారిలో మాజీ కౌన్సిలర్ పూర్ణ బవురి, జితేంద్ర నాయక్, భైరబ్ బెహర, కేశవ్ మహాంతి తదితరులు ఉన్నారు. జల దిగ్బంధంలో భట్టారిక ఆలయం భువనేశ్వర్: కటక్ జిల్లా బొడొంబ ప్రాంతంలో ప్రసిద్ధ భట్టారిక ఆలయం వరద నీటి దిగ్బంధంలో చిక్కుకుంది. మహానది వరద నీటి మట్టం దాదాపు ఆలయ శిఖరాన్ని తాకింది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనల నివారణ దృష్ట్యా దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ఓ వైపను మహా నది వరద నీరు ఉప్పొంగుతుంది. భట్టారిక ఆలయం జల దిగ్బంధంలో ఉన్నందున ఈ పరిసరాలకు రావద్దని సాధారణ ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి ప్రధాన కూడలి ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటు చేసింది. మరో వైపు ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాల్ని మోహరించారు. నెల రోజులుగా 110 కుటుంబాలు అంధకారంలోనే.. కొరాపుట్: సుమారు నెల రోజుల పైగా 110 కుటుంబాలు అంధకారంలో జీవిస్తున్నాయి. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంతలుంగు గ్రామ పంచాయతీ తుంబర్కోట్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ కాలి పోయింది. ఇది జరిగి నెల రోజులు దాటినా విద్యుత్ సిబ్బంది ఆ గ్రామం వైపు చూడడం లేదు. గిరిజనులు విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని కలెక్టర్కి లిఖితపూర్వక ఫిర్యాదు పంపించారు. విద్యుత్ లేకపోవడంతో రాత్రి పూట గిరిజనులు బయటకు రావడం లేదు. సెల్ఫోన్లు పని చేయకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. భారీ వర్షాలు వల్ల విద్యుత్ లేకపోవడంతో అనేక బాధలు పడ్డామని గిరిజనులు వాపోయారు. సేవాయత్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని పవిత్ర రథ యాత్ర సమయంలో రథాలపై మొబైల్ ఫోన్ నిషేధాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో పూరీ శ్రీ జగన్నాథ ఆలయ కార్యాలయం సేవకుల వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని ప్రాథమిక సమాచార నివేదికగా (ఎఫ్ఐఆర్) పరిగణించి వారి వ్యతిరేకంగా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరింది. రథాలపై మొబైల్ ఫోన్లు నిషేధాన్ని ఉల్లంఘించినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. సేవకులు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు చూపించే మూడు ఫొటోగ్రాఫిక్ ఆధారాలు ఫిర్యాదుతో జోడించారు. దీని ఆధారంగా విచారణ చేపట్టి నిందితుల వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అభ్యర్థించినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. రథాలపై సేవాయత్ల చర్యలు ఆచారాల పవిత్రతకు విఘాతం కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
కొరాపుట్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో సోమవారం విధులకు హాజరయ్యారు. నబరంగ్పూర్ జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ మినీస్ట్రీయల్ ఉద్యోగులు ఆందోళన చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం తమ డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చనందున నల్ల బ్యాడ్జీలతో విధులకు హజరవుతున్నామని ప్రకటించారు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత విధానం అమలు చేయాలని, మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇవ్వాలని, రూ. 20 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేయాలని, జిల్లా కలెక్టర్ల నివేదిక ప్రకారం కొత్త పోస్టులు సృష్టించాలని, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల కోసం తాము పలుమార్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. ఈ నెల 14వ తేదీలోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోతే విధులు భహిష్కరిస్తామని ఉద్యోగులు ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో కలెక్టరేట్, సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఐటీడీఏ, డీఆర్డీఏ, బీడీవో, మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది హాజరయ్యా రు. సంఘం జిల్లా అధ్యక్షుడు అశుతోష్ మహంతి, ఉపాధ్యక్షుడు ధనుర్జయ మజ్జి, కై లాష్ చంద్ర పాల్గొన్నారు. -
రాయగడలో వినతుల స్వీకరణ
రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి ఆధ్వర్యంలో సొమవారం వినతుల స్వీకరణ చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన 68 మంది వినతులను అందజేశారు. వీటిలో 55 వ్యక్తి గత సమస్యలుగా, మిగతావి గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 45 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గ్రామ సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఆదేశించారు. కార్యక్రమంలొ ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో మారు రథయాత్ర తిలకించి రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి నలుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అందిన వివరాల ప్రకారం.. బొయిపరిగుడ సమితి కొలార్ పంచాయతీ దుదామగుడ గ్రామం సదన ఖొర, కందపొడాపొదర్ గ్రామం హరి ఖిలోలు బొయిపరిగుడలో బహుడ జాత్రకు ఒక బైక్పై వెళ్లారు. జాతర పూర్తయ్యాక వారు ఇళ్లకు బయల్దేరారు. టొపాజోడి కూడలి వద్ద ముందు వెళ్తున్న బస్సును బైక్ ఢీకొనడంతో సదన్, హరి రోడ్డుపై పడి గాయపడ్డారు. వీరిని స్థానికులు బొయిపరిగుడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదన్కు తలపై గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అలాగే బొయిపరిగుడ శిశుమందిరం ప్రాంతంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి ఇద్దరు గాయపడ్డారు. జయపురం సమితి ఎన్.నువాగుడ గ్రామంలో త్రినాథ్ హరిజన్, అతడి మిత్రుడు బొయిపరిగుడ నుంచి జయపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు గాయపడిన ఇద్దరిని బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. వారిలో త్రినాథ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. -
గోడ కూలి మహిళ మృతి
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నబరంగ్పూర్ జిల్లా డాబుగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని జముండా గ్రామంలో గోడ కూలి రబి పనక (60) అనే మహిళ మృతి చెందింది. జయపూర్ సమితి టంకువ గ్రామ పంచాయతీ జగన్నాథపూర్–నువాగుడ మధ్య రోడ్డు బురదమయమైంది. దీంతో గ్రామం నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామని గిరిజనులు తెలిపారు. మరోవైపు కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి కేంద్రానికి వెళ్లే మార్గం పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యాయి. లక్ష్మీపూర్ నియోజకవర్గంలో వర్షాల బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. -
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
● ప్రసవ ‘వే’దన మల్కన్గిరి జిల్లాలొని ఖయిరొపుట్ సమితి బొండాఘాటి వద్ద సోమవారం ఓ గర్భిణిని డోలీపై పది కిలోమీటర్లు మోసుకెళ్లారు. సమితిలొని భొజ్గుడ గ్రామంలో నివసిస్తున్న రంజ్ భొజొ భార్య సునాయి భొజ్ నిండు గర్భవతి. నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆశ కార్యకర్త అంబులెన్స్కు సమాచారం అందించింది. అయితే గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ ఉండిపోవాల్సి వచ్చింది. గత్యంతరం లేక గర్భవతిని గ్రామస్తులు డోలీపై మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చారు. అనంతరం గర్భిణిని ఖయిరాపుట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. గర్భిణి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. – మల్కన్గిరి న్యూస్రీల్ -
ప్రాణాలు వదిలి
కాపాడబోయి.. భువనేశ్వర్: కోణార్క్ ప్రాంతంలో సోమవారం దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన పర్యాటకుల్ని రక్షించబోయిన మరో పర్యాటకుడు దుర్మరణం పాలయ్యాడు. పూరీ పర్యటనకు విచ్చేసిన పర్యాటకుల బృందం కోణార్క్ సందర్శన కోసం కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కోణార్క్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదానికి గురైన కారులో 11 మంది భక్తులు ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర, విశాఖపట్నం నుంచి విచ్చేసిన పర్యాటకులుగా గుర్తించారు. ఆదివారం రాత్రి శ్రీ జగన్నాథుని స్వర్ణాలంకార దర్శనం చేసుకుని ఉదయం కోణార్క్ బయల్దేరారు. కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో చంద్రభాగ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించే ప్రయత్నంలో ఒక పర్యాటకుడు విద్యుదాఘాతంతో మరణించాడు. మృతుడు జగత్సింగ్పూర్ జిలా నువాగాంవ్ గ్రామస్తుడు రంజిత్ పొఢియారిగా గుర్తించారు. ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి కోణార్క్ పర్యటనకు వచ్చిన రంజిత్ పొఢియారి ప్రయత్నించాడు. సహాయం చేసేందుకు రంగంలో దిగిన రంజిత్కు దురదృష్టవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో సొమ్మసిల్లి పోయాడు. సత్వర చికిత్స కోసం అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాద సంఘటన సమాచారం అందడంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులందరినీ రక్షించి చికిత్స కోసం కోణార్క్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ప్రథమ చికిత్స తర్వాత ఉన్నత చికిత్స కోసం బాధితుల్ని భువనేశ్వర్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కోణార్క్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి దుర్ఘటన పాలైన టవేరా కారును స్వాధీనం చేసుకుని సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. -
రెండు కొత్త రైళ్ల ఏర్పాటుకు కృషి
● కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ కొరాపుట్: కొరాపుట్ జిల్లాకి కొత్తగా రెండు రైళ్లు వేసేందుకు కృషి చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ హామీ ఇచ్చారు. జయపూర్లో మీడియాతో సోమవారం మాట్లాడారు. న్యూఢిల్లీ వెళ్లిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్తో సమావేశమై రైళ్ల ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. జగదల్పూర్–భువనేశ్వర్, జగదల్పూర్–సంబల్పూర్–రౌర్కెలాకు పగటి వేళలో రైళ్లు నడిచేలా ప్రయత్నం చేస్తానన్నారు. తన ప్రాంతం పశ్చిమ ఒడిశా నుంచి కొరాపుట్కి పగటి పూట రైళ్లు ఎంతో అవసరం ఉందని ధర్మెంద్ర ప్రదాన్ అన్నారు. సారా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు జయపురం: అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు జయపురం అబ్కారీ అధికారి శశికాంత దత్త సోమవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి హరడాపుట్ డొంగర వాసి రఘునాథ్ హరిజన్, కుందారిగుడ గ్రామానికి చెందిన గోపాల్ నాగ్ ఉన్నట్టు చెప్పారు. కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రఘునాథ్ గ్రామం వద్ద తమ సిబ్బంది ఆదివారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా స్కూటీలో సారాను తరలిస్తున్న ఒకరు పట్టుబడినట్టు చెప్పారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు పేర్కొన్నారు. అలాగే పట్టణంలోని ఓ వీధిలో సారాతో గోపాల్ నాగ్ను అరెస్టు చేశామన్నారు. ఎకై ్సజ్ అధికారి శశికాంత దత్త, ఏఎస్సై బలరాం దాస్ దాడుల్లో పాల్గొన్నారు. జగన్నాథునికి పానకం నివేదన భువనేశ్వర్: ఏటా పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా రథాలపై దేవుళ్లకు పానకం సమర్పిస్తారు. చీకటి పడ్డాక ఈ సేవ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని పాటించారు. ప్రత్యేక మట్టి పాత్రల్లో పానకం నింపుతారు. మూల విరాట్ల పెదవుల ఎత్తు వరకు ఈ పాత్రలు తయారు చేస్తారు. వీటి నిండా సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన పానకం పోసి రథాలపై తెరచాటున గోప్యంగా నివేదించడం ఆచారం. ఈ సమగ్ర ప్రక్రియను ఒధొరొ పొణ సేవగా పేర్కొంటారు. రథాలపై ప్రధాన విగ్రహాల ఎదురుగా మట్టి పాత్రల్ని నిలిపి ఒధొరొ పొణ సేవ నిర్వహిస్తారు. స్వామికి పానకం నివేదించడం పూర్తయ్యాక పాత్రలు పగల గొట్టడంతో రథాల పైనుంచి పాణకం పొరలుతుంది. రథాల పైనుంచి పార్శ్వ దేవతల మీదుగా నేలకు ఈ పానకం జారుతుంది. ఇలా జారిన పానకం పార్శ్వ దేవతలు, అశరీర జీవులు సేవించి మోక్షం పొందుతారని విశ్వాసం. పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి పురస్కరించుకుని సోమవారం ఈ సేవ జరిగింది. గాలి వర్షంతో నేలకూలిన చెట్లు జయపురం: జయపురం సబ్డివిజన్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా బొయిపరిగుడ సమితిలో అత్యధిక వర్షాలతో పాటు పెనుగాలులు వీస్తుండడంతో చెట్లు, ఇళ్లు కూలిపోతున్నాయి. నదులు పొంగుతున్నాయి. ఆదివారం సాయంత్రం బొయిపరిగుడ సమితి టంగిణిగూడ రహదారి, విజయవాడ–రాంచీ 326 జాతీయ మార్గంలో భారీ చెట్లు విరిగిపడడంతో ఇరుపక్కల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బొయిపరిగుడ అగ్నిమాపక అధికారి సుకాంత కుమార్ ప్రధాన్ నేతృత్వంలో అచ్యుత ఓరమ్, రాజేష్ ప్రధాన్, గోవర్దన హిమిక, కులమఱి కిశాన్ తదితర సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున చెట్లను తొలగించారు. అలాగే బొయిపరిగుడ పంచాయతీ మాలాగుడ, మాలిగుడ, పూజారిగుడ గ్రామ పంచాయతీ లింబగుడ ప్రాంతాలలో చెట్లు రోడ్లపై పడి రాకపోకలకు అంతరాయం లేకుండా అగ్నిమాపక సిబ్బంది వాటిని రంపాలతో కోసి తొలగించారు. -
మహాదీప హారతి
శ్రీ మందిరం శిఖరానశ్రీ మందిరం శిఖరాన మహా దీప సేవ భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరంలో ఏకాదశి తిథి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తిథి పురస్కరించుకుని క్రమం తప్పకుండా శ్రీ మందిరం శిఖరాన నీల చక్రం ప్రాంగణంలో మహా దీప హారతి నిర్వహిస్తారు. రథ యాత్రలో పవిత్ర ఏకాదశి నాడు అత్యంత ఆకర్షణీయమైన స్వర్ణాలంకార దర్శనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులకు శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో ఆలయ శిఖరంపై మహా దీప దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. స్వర్ణ అలంకార దర్శనం కొనసాగుతుండగా మహాదీప హారతి నిర్వహిస్తారు. దీనితో యాత్రకు తరలి వచ్చిన అశేష భక్తజనం ఆలయ శిఖరంపై మహా దీప హారతి కనులారా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం పొందుతారు. వెండి కలశాల్లో హారతి మహా దీప హారతి కోసం 3 వెండి కలశాలు సిద్ధం చేస్తారు. వీటిని నెయ్యితో నింపుతారు. అరటి నారతో దీపం ఒత్తులు వినియోగిస్తారు. అరటి నారకు కొత్త బట్టను చుట్టి బలపరుస్తారు. తెల్ల రంగు వస్త్రం వినియోగిస్తారు. ఇలా సిద్ధం చేసిన మహా దీపాన్ని తొలుత శ్రీ జగన్నాథుని ముందు ద్యోతకం చేసిన తర్వాత, ఆలయం పైకి ఎత్తుతారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో భక్త జన సందోహం -
దేవతా మూర్తులకు స్వర్ణాలంకరణ
జయపురం: చైతన్యమందిరం నుంచి శ్రీజగన్నాథ్, బలభద్ర, సుభద్రలతో ఉన్న పెద్ద రథం, పతిత పావనుడు ఉన్న చిన్న రథాలు రాత్రి 8.00 గంటలకు రథొపొడియ వద్దకు చేరాయి. దాదాపు రాత్రి పదకొండు వరకు భక్తుల పూజలు అందుకున్న దేవతా మూర్తులను జగన్నాథ ఆలయానికి తీసుకు వచ్చారు. లక్ష్మీదేవి అనుమతితో గర్భగుడిలోకి వెళ్లాక స్వర్ణాలంకరణ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ విభాగ అదనపు తహసీల్దార్ చిత్త రంజన్ పట్నాయిక్, జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్,జ యపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్లతో పాటు దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
మల్కనగిరి: ఎంవీ– 84 గ్రామ సమీపంలో ఆదివా రం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తంగపా ల్ గ్రామానికి చెందిన రాజేష్ సొడి (20), బసంత కబాసి (18) దుర్మరణం పాలయ్యారు. బబులు మాడి అనేవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... ఒక మోటార్ సైకిల్పై రాజేష్, బసంత, బబులులు మారు రథ యాత్రను చూసేందుకు మల్కన్గిరి వెళ్లారు. రథయాత్రను చూసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఎంవి–84 గ్రామ సమీపంలో మోటారు సైకిల్ ను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు కిందపడి గాయపడ్డా రు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల ను అంబులెన్స్లో మల్కన్గిరి ఆస్పత్రికి తరలించా రు. అయితే బసంత, రాజేష్లు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రీవెన్స్సెల్కు 63 వినతులు
పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్లో సోమవారం గ్రామ ముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్కు జిల్లా పాలనాధికారి బిజయ కుమార్ దాస్తోపాటు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహాణాధికారి శంకర కెరకటా పాల్గొన్నారు. కత్తల కవిటి, రాణిపేట, సిద్ధమణుగు పంచాయితీ, పర్లాకిమిడి పురపాలక సంఘం నుంచి 63 వినతులు అందాయి. వాటిలో 49 వ్యక్తిగతం కాగా.. గ్రామ సమస్యలకు సంబంధించినవి 14 ఉన్నాయి. వాటిలో మూడు వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధిశాఖ పీవో అంశుమాన్ మహాపాత్రో, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, గుసాని బీడీవో గౌరచంద్ర పట్నాయక్ పాల్గొన్నారు. గ్రీవెన్స్కు వినతుల వెల్లువ కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో కలెక్టర్లు సోమవారం గ్రీవెన్ సెల్ నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ నందపూర్ సమితి కేంద్రంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భారీ వర్షంలో కూడా మారుమూల అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 60 ఫిర్యాదుల చేశారు. ఇందులో 19 వ్యక్తిగత ఫిర్యాదులు, 41 సామాజిక ఫిర్యాదులున్నాయి. ఈ శిబిరంలో ఎస్డీపీఓ దేవేంద్ర, సీడీ వేణుధర్ సబర్, ప్రొహిబిషన్ ఐఏఎస్ అధికారి సంతోష్ మిశ్ర పాల్గొన్నారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 40 ఫిర్యాదుల రాగా.. అందులో 36 వ్యక్తిగత, 4 సామాజిక ఫిర్యాదులున్నాయి. -
ఎలుగుబంటి హల్చల్
● భయంతో పరుగులు తీసిన జనం కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రంలో ఎలుగు బంటి హల్చల్ చేసింది. సోమవారం సాయంత్రం జనసంచారం ఉన్నప్పటికీ పట్టణంలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. పపడాహండి–ఉమ్మర్కోట్ రాష్ట్ర రహదారి 39 పై టురి వంతెన వద్ద కాసేపు సేద తీరింది. దానిని చూసి ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను వదిలేసి పరుగులు తీశారు. సమీప కర్రల డిపోలకి ప్రవేశించిన భల్లూకం కొంత సేపు అక్కడ సంచరించింది. తర్వాత నేరుగా పూజారి వీధి వద్దకు వెళ్లడంతో జనం భయంతో ఇళ్లకు తలుపులు వేసి మేడల మీదకి వెళ్లి పొయారు. పపడాహండి లోనికి ప్రవేశించడానికి ఆ ప్రాంతాల చుట్టూ కలియ తిరిగింది. చివరకు ప్రజల పెద్దగా కేకేలు వేయడం, రాళ్లు విసరడంతో అటవీ ప్రాంతం లోనికి వెళ్లిపోయింది. -
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
పర్లాకిమిడి: ఒడిశా రెవెన్యూ అమలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో సోమవారం నిరసన చేపట్టారు. జూన్ 25న ఒడిశా రెవెన్యూ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం గజపతిలో సంఘం కార్యదర్శి సంతును మిశ్రా నేతృత్వంలో 10 అపరిష్కృత డిమాండ్లను నెరవేర్చాలని అప్పటివరకూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్లను 15 రోజుల్లోగా ప్రభుత్వం పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెలోకి దిగుతామని సంతును మిశ్రా తెలిపారు. ఒడిశా రెవెన్యూ ఉద్యోగులకు బేసిక్ పే 9 లెవల్కు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులకు స్వస్థ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, పాత పింఛను అమలుచేయాలని, 1990లో జీఓ ప్రకారం ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం విధివశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మంజూరు చేయాలని కోరారు. పదోన్నత లు, జూనియర్ అసిస్టెంటు అర్హత ప్రస్తుత డిగ్రీ నుంచి ఇంటర్కు మార్చాలని కోరారు. -
వందేభారత్ కొరాపుట్ వరకు పొడిగించండి
● జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహనీ పతి కొరాపుట్: భువనేశ్వర్–విశాఖ మధ్య ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైల్ను అరుకు మీదుగా కొరాపుట్ వరకు పొడిగించాలని జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహనీ పతి కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం విజ్ఞపనతో కూడిన లేఖను రాశారు. వందేభారత్ రైల్ రోజూ 800 కిలోమీటర్లలోపు, రెండు వైపులా సుమారు 1600 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. కానీ భువనేశ్వర్–విశాఖ మధ్య దూరం 440 కిలోమీటర్లు ఉందన్నారు. విశాఖపట్నం నుంచి కొరాపుట్కి 215 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. అందువలన రైల్ను పొడిగించినా నష్టం లేదన్నారు. ప్రస్తుతం వందేభారత్ రైలు రోజుకి సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖలో నాలుగు గంటలు, భువనేశ్వర్లో ఆరేడు గంటలు ఉండి పోతుందన్నారు. కావున ఇలా పొడిగిస్తే కొరాపుట్ ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెరిగి అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. ప్రస్తుతం కొరాపుట్ నుంచి భువనేశ్వర్కి నడుస్తున్న హిరాఖండ్ రైలు 680 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందన్నారు. అదే అరుకు మీదుగా భువనేశ్వర్ 657 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. పగటి పూట నడిచే భువనేశ్వర్–విశాఖ వందే భారత్ ని అరుకు మీదుగా కొరాపుట్కు నడిపాలని విజ్ఞప్తి చేశారు. తన వినతి పత్రాన్ని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రదాన్కి పంపించారు. దేవకుపిలిని పంచాయతీగా గుర్తించాలి రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి కుముడాబల్లి పంచాయతీ పరిధిలో గల దేవకుపిలిని పంచాయతీగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీడీఓ కృష్ణచంద్ర దళపతికి వినతిపత్రం అందించారు. జనాభా పరంగా అభివృద్ధి చెందుతున్న దేవకుపిలిని పంచాయతీగా గుర్తించాలన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో కుముడాబల్లి సర్పంచ్ గౌరి పిడిక, గ్రామస్తులు ఉన్నారు. -
జయపూర్లో షియా ముస్లింల ర్యాలీ
కొరాపుట్: పవిత్ర మొహరం సందర్భంగా జయపూర్లో షియా ముస్లింలు ఆదివారం ర్యాలీ జరిపారు. పట్టణంలోని వెల్కం జంక్షన్ నుంచి ట్రాఫిక్ జంక్షన్ వరకు ర్యాలీ జరిగింది. మహమ్మద్ మనుమడు ఇమామ్ హుస్సేన్తో పాటు మరో 72 మందిని హత్య కాబడిన రోజు కాబట్టి దుఖః భరితమైన కార్యక్రమంగా భావిస్తారు. మొహరం నెల షియా ముస్లిం మతస్తులకు బాధాకరమైనదిగా భావిస్తారు. శతాబ్దాల క్రితం నుంచి కొరాపుట్ జిల్లా నందపూర్ ప్రాంతంలో షియా మతస్తులు మొహరం ప్రారంభించారు. ర్యాలీలో అధికసంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాఫ్రీ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒడిశా శాఖ రాష్ట్ర అధ్యక్షుడు సయ్య ద్ హసన్ మదాని పాల్గొన్నారు. పేదలకు సరుకులు పంపిణీ రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యం నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు బియ్యం, కందిపప్పు, దుంపలు, నూనె తదితర నిత్యావసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు. ట్ర స్టు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్యులు నిరుపేదలకు ప్రతినెల ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారని ట్రస్టు నిర్వాహకురా లు ఎం.నళిని తెలిపారు. కొండ పైనుంచి జారి పడిన బండరాయి రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమి తి సెరిగుమ్మ నుంచి కొలనార సమితి దుందులికి అనుసంధానించే రహదారి మధ్యలోని కొండ నుంచి పెద్ద బండరాయి ఆదివారం సాయంత్రం జారి పడింది. దీంతో ఈ మార్గంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపొయాయి. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా కొండపై గల మట్టి జారి పడటంతో పాటు పెద్ద బండరాయి కూడా రహదారి మధ్యలోకి జారిపడింది. అటువైపుగా వెళ్లే కొందరు గ్రామస్తులు సమాచారాన్ని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడంతో సొమవారం ఉద యం కార్మికుల సహాయంతో బండరాయిని రోడ్డు పక్కకు నెట్టడంతో రాకపోకలు యఽథావిధిగా కొనసాగాయి. ఘనంగా నవ జీవన్ ఆశ్రమం వార్షికోత్సవం ● 77 మంది వృద్ధులకు రేషన్ పంపిణీ పర్లాకిమిడి: స్థానిక డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న నవజీవన్ అనాథశ్రమం 18వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జువెనెల్ ప్యాలన్ జడ్జి భాగ్యలక్ష్మీ నాయక్, విశ్రాంత ఉపాధ్యాయులు బినోద్ జెన్నా, దాతలు గణేష్ పట్నాయక్, ప్రవీణ్కుమార్ తదితరులు హాజ రయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్య 76వ జన్మదినం పురస్కరించుకుని అనాథశ్రమంలో బాలబాలికలతో కేకు కట్ చేయించారు. అనంతరం అన్నలక్ష్మి పథకం కింద 77 మంది అనాథ వృద్ధులకు 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అతిథులు పంపిణీ చేశారు. ట్రస్టు చీఫ్ మేనేజర్ ఎస్.వి.రమణ, హౌస్ మదర్ ప్రభాషిణీకుమారి లిమ్మా, జయలక్ష్మి, బాబూరావు పాల్గొన్నారు. పరిశోధనలపై దృష్టి సారించాలి ఎచ్చెర్ల: వర్సిటీ అధ్యాపకులు పరిశోధనా రంగంపై దృష్టి సారించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె.ఆర్.రజనీ సూచించారు. పూనేలోని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ సంస్థ ప్రచురించిన ‘సౌత్ ఆసియన్ జర్నల్ ఆఫ్ పార్టిసిపేటివ్ డవలప్మెంట్’ ప్రత్యేక సంచికను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధన, అధ్యయన రంగాల్లో సాధించిన ప్రగతి వర్సిటీ పురోగతికి దోహదపడుతుందని తెలిపారు. యూజీసీ గుర్తింపు పొందిన జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో వారు తమ పరిశోధన పత్రాలను ప్రచురించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఏయూ రెక్టార్ ప్రొఫెసర్ అడ్డయ్య, సెమినార్ కన్వీనర్ డాక్టర్ యు.కావ్యజ్యోత్స్న, వాసవ్య మహిళా మండలి డైరక్టర్ డాక్టర్ రష్మి, వైసీబీ డైరెక్టర్ ఎం.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
మరో మారు మన్మోహనే అధ్యక్షుడు
● నేడు అధికారిక ప్రకటన భువనేశ్వర్: మన్మోహన్ సామల్ మరో మారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టనున్నారు. దాదాపు ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మండలి సభ్యుల ఎన్నిక కోసం సోమవారం నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి మన్మోహన్ సామల్ ఒక్కరు మాత్రమే నామినేషను దాఖలు చేశారు. నామినేషను దాఖలు గడువు ముగిసే సరికి ఈ ఒక్క నామినేషన్ పత్రమే దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా స్పష్టం అవుతుంది. మంగళ వారం తుది ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు. కేంద్ర మండలి సభ్యత్వానికి 32 నామినేషను పత్రాలు దాఖలు అయ్యాయి. రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి పోటీ కి నామమాత్రంగా ఒకే ఒక్క నామినేషన్ పత్రం దాఖలైందని ఎన్నికల పర్యవేక్షకునిగా నియమితులైన సంజయ్ జయస్వాల్ తెలిపారు. మన్మోహన్ దక్షతకు పట్టం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకలాపాల్లో మన్మోహన్ సామల్ దక్షత రాష్ట్ర, కేంద్ర కార్యవర్గ ప్రముఖుల్ని ఆకట్టుకుంది. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఆయన కూడగట్టుకుని రెండోసారి వరుసగా అధ్యక్షునిగా ఎన్నిక అయ్యేందుకు మార్గం సుగమం చేసుకోవడం విశేషం. ప్రధానంగా రాష్ట్రంలో తొలి సారి పాలన పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీకి అంతర్గత సమస్యలు ఏమాత్రం అడ్డంకి కాకుండా అధ్యక్షుని హోదాలో మన్మోహన్ సామల్ దక్షత రాజకీయ ప్రముఖుల ప్రసంశలు అందుకుంది. మరో మూడేళ్లు ఆయన ఈ పదవీకాలంలో కొనసాగుతారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు కీలక అధిపతుల నియామకం వివాదరహితంగా పూర్తి అయి పార్టీ మనుగడని మరింత బలోపేతం చేసే దిశలో మన్మోహన్ చాతుర్యం ప్రదర్శిస్తారని బీజేపీ రాష్ట్ర సభ్యులు విశ్వసిస్తున్నారు. ఇదివరకు 1999 నుంచి 2004 సంవత్సరం వర కు పార్టీకి సారథ్యం వహించారు. తదుపరి 2023 మార్చి 23న మరో మారు అధ్యక్షునిగా బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన సారథ్యంలో పార్టీ అగ్ర శ్రేణి ఆదేశాలు, మార్గదర్శకాలు క్షేత్ర స్థాయిలో వాస్తవ కార్యాచరన, అమలు చర్యల తో అధిష్టానం దృష్టిలో దక్షత పరుడుగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. బూత్ స్థాయి, అట్టడుగు స్థాయిలో పార్టీ ఉనికి బలోపేతంలో ఆయనకు ఆయనే సాటిగా మన్ననలు పొందారు. గత సంవత్సరం ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ మొదటిసారి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 20 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి ఇదో ఊహాతీతమైన విజయం. సుదీర్ఘంగా అధికారంలో కొనసాగిన బిజూ జనతా దళ్ విపక్ష హోదాకు దిగజారింది. ఈ ఫలితాలతో బీజేడీ భారత పార్లమెంటులో దాదాపు ఉనికిని కోల్పోయింది. ఈ విజయంతో మన్మోహన్ సామల్ నాయకత్వంలో పురోగతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె. పి. నడ్డా వంటి జాతీయ ప్రముఖుల విశ్వాసం బలపడింది. రాష్ట్రంలో డబుల్ఇంజిన్ సర్కారుని కేంద్రంతో చక్క ని సమన్వయంతో రాష్ట్ర సమగ్ర పురోగతిని వ్యూహాత్మకంగా నిర్వహించడం రాష్ట్రంలో తొలి సారిగా పాలన పగ్గాలు చేపట్టిన మోహన్ చరణ్ మాఝి సర్కారుకు చేదోడు వాదోడుగా మన్మోహన్ సామల్ అధ్యక్షత కొండంత బలంగా నిలుస్తుంది. -
రాయగడలో వన మహోత్సవం
రాయగడ: అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక భారిజోల సమీపంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. గౌరవ అతిథులుగా జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝిలు హాజరయ్యారు. అనంతరం హనుమాన్ మందిరం ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. నవజీవన్ ట్రస్టు ఆశ్రమంలోని విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడ్రక మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యానికి మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ పట్వారి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమ్మపేరుతొ ఒక చెట్టు అనే సందేశంతో ప్రారంభమైన వనమహోత్సవంలో విద్యార్థులు చురుగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పర్యావరణంపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్వో వారు తమ పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలకు నాంది పలుకుతారన్నారు. డీఎఫ్వో అన్నా సాహేబ్ అహలే, రేంజర్ కామేశ్వర్ ఆచారి కార్యక్రమాన్ని పరివేక్షించారు. -
జయపూర్ను కార్పొరేషన్గా మార్చాలి
జయపూర్కి అన్ని అర్హతలు ఉన్నాయి రాజరిక జయపూర్కు కార్పొరేషన్ హోదా కల్పించాలి. కార్పొరేషన్కు కావాల్సిన అన్ని అర్హతలు జయపూర్ పట్టణానికి ఉన్నాయి. మహా రాజులు, రాజులు, సామంతులు శతాబ్దాల క్రితమే దీన్ని నగరంగా గుర్తించారు. కార్పొరేషన్గా మార్చా లని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. ఇది చాలా కాలంగా వస్తున్న డిమాండ్. వీలైనంత తర్వలో కార్పొరేషన్గా ప్రకటన చేయాలి. –తారా ప్రసాద్ బాహనీ పతి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, జయపూర్ కొరాపుట్: ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న జయ పూర్ పట్టణాన్ని కార్పొరేషన్గా హోదా పెంచాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమా ండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అయితే కొద్దిరోజుల క్రితం పూరీ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో చిరకా లంగా కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్న బాలేశ్వర్, జయపూర్ ప్రజలు కూడా తమ పట్టణాలను కూడా కార్పొరేషన్ హోదా కల్పించాలనే డిమాండ్ను తీవ్రం చేశారు. కేవలం పూరీని మా త్ర మే కార్పొరేషన్ చేస్తారా.. జయపూర్ సంగతి ఏమి టని ప్రశ్నిస్తున్నారు. సుమారు నాలుగు శతాబ్దాల క్రితం సూర్యవంశీయులు జయపూర్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. నాటి పురాతన నగ రం కార్పొరేషన్కి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా యని ప్రముఖులు పేర్కొంటున్నారు. దక్షిణ ఒడిశా లో బ్రహ్మపుర తర్వాత జయపూర్ పెద్ద పట్టణం. అవిభక్త కొరాపుట్ జిల్లాలో అతి పెద్ద పట్టణం జయ పూరే. ఈ పట్టణంలో ప్రస్తుతం 28 వార్డులు ఉండ గా పెరిగిన జనాభా దృష్యా త్వరలో వార్డుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుత జనాభా రెండు లక్షలకు చేరువలో ఉంది. జయపూర్ని కార్పొరేషన్ చేయాలనే ఉద్యేశంతో గతంలో ప్రభుత్వం రెండుసార్లు సర్వే కూడా చేసింది. సమీప భరణీపుట్, ఏక్తాగుడ, ఉమ్రి తదితర ప్రాంతాలను కలుపుతూ కార్పొరేషన్ చేయాలని నాటి సర్వేలో ప్రజలు వివరాలు అందించారు. 1953లోనే పురపాలక సంఘం ఏర్పడింది. పూరీ ప్రకటన నేపథ్యంలో గత రెండు రోజులుగా రాజకీయాలకు అతీతంగా డిమాండ్ పెరిగింది. రాజకీయ పక్షాల డిమాండ్ తక్షణమే ప్రకటించాలి కేవలం పూరీని మాత్రమే కార్పొరేషన్ చేయడం తగ దు. అలా చూస్తే జయపూ ర్ కూడా పురాతన నగరమే కదా. కార్పొరేషన్ హోదా కోసం ఇప్పటికే రెండుసార్లు అధికారులు సర్వే లు కూడా చేశారు. కావాలంటే మరోసారి సర్వే చేయండి. జయపూర్ని కార్పొరేషన్గా తక్షణం ప్రభుత్వం ప్రకటించాలి. –బీ.సునీత, మున్సిపల్ వైస్ చైర్మన్, బీజేడి -
అనుమతి లేని దుకాణాల కూల్చివేత
కొరాపుట్: పాఠఽశాలల పరిసరాల్లో పారిశుద్ధ్యానికి జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సశ్యరెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా కొరాపుట్ పట్టణంలోని ఎన్కేటీ రోడ్డు చివర బాయ్స్ హైస్కూల్ ప్రాంతంలో కఠిన చర్యలకు దిగారు. అక్కడ అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న మాంసాహార దుకాణాలను ఆదివారం కూల్చి వేశారు. వీటి నిర్వహణ వలన తీవ్ర దుర్గంధం ఏర్పడి బాలలు అనారోగ్యం పాలవుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ స్వయంగా రంగంలో దిగి కూల్చివేతలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పొలీసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఒడిశాను విద్యా హబ్గా మార్చుతాం
కేంద్ర విద్యాలయ నూతన భవనాలకు శంకుస్థాపనజయపురం: బహుళ ఆదివాసీ అవిభక్త కొరాపుట్ను విద్యా రంగంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కొరాపుట్ జిల్లాలో రెండు దినాల పర్యటన సందర్భంగా ఆదివారం జయపురంలో మూడు గంటలు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొరాపుట్ నుంచి ఆయన నేరుగా జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల సమగ్ర ఆదివాసి అభివృద్ధి ఏజెన్సీ విభాగ భవనాల్లో తాత్కాలిక జయపురం కేంద్ర విద్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ మొక్క నాటిన అనంతరం ఆయన విద్యాలయ అధికారులతో చర్చలు జరిపారు. అక్కడ నుంచి ఆయన విక్రమదేవ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యాధికారులతో విశ్వవిద్యాలయ ప్రగతిపై చర్చలు జరిపారు. అనంతరం ఆయన జయపురం–మల్కన్గిరి మార్గంలో గ్లోకల్ హాస్పిటల్ సమీపంలో జయపురం కేంద్ర విద్యాలయ నిర్మాణానికి ఎంపిక చేసిన 8 ఎకరాల విశాల ప్రాంతంలో జయపురం కేంద్ర విధ్యాలయ శాశ్వత నూతన భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యామంత్రి ప్రసంగిస్తూ ఒడిశాను విద్యారంగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు కేంద్రియ ఒడిశా విశ్వవిద్యాలయం, ఐఐటి భువనేశ్వర్, ఐఐఎం సంబల్పూర్, ఎన్ఐటి రూర్కెలా, కేంద్రీయ విశ్వ విద్యాలయం పూరీ, ఐఎస్ఎర్ బరంపురంలకు కేంఽద్రం చేయూతనిస్తోందని వెల్లడించారు. కార్యక్రమాలలో ఒడిశా రాష్ట్ర విద్యామంత్రి నిత్యానంత గోండ్, మత్య్స,పశుసంపద విభాగ మంత్రి గోకులానంద మల్లిక్, ఉన్నత విద్యామంత్రి సూర్యవంశీ సూరజ్, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, పొట్టంగి ఎమ్మెల్యే రామచంధ్ర కడమ్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీశంకర మఝి, కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, నవరంగపూర్ ఎంపీ బలభధ్ర మఝి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్క, కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాన్, జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, జయపురం కేధ్ర విద్యాలయ ప్రిన్సిపాల్ లతో పాటు పలువురు అధికారులు, బిజేపి నాయకులు, పాల్గున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ -
డిగ్రీ ప్రవేశాలకు మోక్షమెప్పుడో
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడిచాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు సైతం విడుదలై నెల రోజులైంది. అయినా డిగ్రీ ప్రవేశాలకు మాత్రం మోక్షం కలగడం లేదు. కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలలో ఉన్నత విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. గత ఏడాది ఇలాగే ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టడంతో ప్రభుత్వ కళాశాలల్లో వందలాది సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది అంతకుమించిన దుస్థి తి తలెత్తుతుండటంతో కళాశాలల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. కొంతమంది ప్రైవేటు కోర్సుల బాట పడుతున్నారు. ఆన్లైనా.. ఆఫ్లైనా ? ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలను గతంలో కళాశాల యూనిట్గా నిర్వహించేవారు. ఎంపిక చేసిన కళాశాలల్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకుని, సీటు లభించిన కళాశాలలో చేరే వారు. ఇంటర్మీడియెట్ మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారు. 2020 నుంచి ఆన్లైన్ విధానంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం యూనిట్గా విద్యార్థులు వెబ్బేస్డ్ కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఇచ్చుకునేవారు. మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు లభించేవి. ప్రైవేట్ కళాశాలలో 70 శాతం కన్వీనర్, 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు నిర్వహిస్తారు. మేనేజ్మెంట్ సీట్లకు ప్రభుత్వ రాయితీలైన ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు వంటివి వర్తించవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ యాజమాన్యాలు పాతవిధానమైన ఆఫ్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించాలా? ఆఫ్లైన్లో నిర్వహించాలా? అన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ జాప్యం డిగ్రీ ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ నిర్వాకంతో రెండేళ్లగా డిగ్రీ ప్రవేశాలు తగ్గుముఖం పడుతున్నాయనేది గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వద్ద ఫైల్ కొన్ని రోజుల తరబడి పెండింగ్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ మిగిలిన శాఖలపై పెత్తనం చలాయిస్తుండటంతో.. తన విద్యాశాఖపై కనీసం దృష్టి పెట్టలేకపోతున్నారన్న విమర్శలకు డిగ్రీ ప్రెవేశాల ఉదంతమని విద్యార్థి సంఘాల ప్రతినిదులు ఆరోపిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 103 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 15 ప్రభుత్వ, 88 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 28 వేల సీట్లు ఉన్నాయి. కొన్నేళ్ల కిందట జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. గత ఏడాది ఈ సంఖ్య పది వేలకు పడిపోయింది. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ కళాశాలల్లో సైతం గతంలో పోలిస్తే ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల్లో ప్రవేశాలు తగ్గిపోయాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్ కోర్సులను మూసివేశారు. ప్రధానంగా బీఎస్సీ ఎంపీసీ, కంప్యూటర్స్ కోర్సులకు డిమాండ్ ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం వంటి కళాశాలకు డిమాండ్ ఉంది. ప్రైవేట్ కళాశాలలు తీసుకుంటే శ్రీకాకుళం నగరం, రూరల్, రాజాం, నరసన్నపేట, టెక్కలి వంటి ప్రాంతాల్లో 20 కళాశాలల్లో సీట్లకు డిమాండ్ ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉండటంతో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అమలు చేయడంతో విద్యార్థులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిగ్రీలో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు కనీసం దరఖాస్తులు చేసుకోవడానికి సైతం షెడ్యూల్ విడుదల చేయని వైనం విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటున్న కూటమి సర్కారు -
యువకుడు దారుణ హత్య
కొత్తూరు: బాకీ విషయమై తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలం వసప గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసప గ్రామంలో మలగాన శంకర్ అనే వ్యక్తి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు(19) అనే యువకుడు బాకీ ఉన్నాడు. ఎప్పుడు వీరిద్దరూ కలిసిన బాకీ విషయమై గొడవ జరిగేది. తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని శంకర్ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మిన్నారావు శనివారం రాత్రి పకోడీ కొనేందుకు శంకర్ షాపు వద్దకు వెళ్లాడు. ఇంతవరకు ఉన్న బాకీ తీర్చాలని శంకర్ అడగడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో శంకర్ షాపులో ఉన్న సుత్తితో మిన్నారావు తలపై బలంగా కొట్టాడు. దీంతో మిన్నారావు కిందపడిపోయాడు. కొనఊపిరితో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా చాకుతో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని షాపు ఎదురుగా ఉన్న పీహెచ్ రోడ్డు పక్కన పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం వేకువజామున రోడ్డు పక్కన మిన్నారావు మృతదేహం కనిపించడంతో అటువైపు వైపు వెళ్లిన స్థానికులు గుర్తించి మృతుడి లుకలాపు బుడ్డు, లక్ష్మిలకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్ఐ ఎండీ ఆమీర్ ఆలీ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి బుడ్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆమీర్ ఆలీ తెలిపారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద బాకీ విషయమై గొడవ కత్తితో దాడికి పాల్పడిన షాపు నిర్వాహకుడు వసపలో విషాద ఛాయలు -
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా మీనాక్షి బాహిణీపతి
కొరాపుట్: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొరాపుట్ జిల్లాకు చెందిన మీనాక్షి బాహిణీపతి నియమితులయ్యారు. ఆదివారం రాత్రి కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచనతో మీనాక్షిని నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఎంపీ వేణుగోపాల్ ప్రకటించారు. మీనాక్షి ఈ పదవిని రెండో సారి చేపట్టనున్నారు. మీనాక్షి గతంలో కొరాపుట్ పురపాలక సంఘానికి రెండు సార్లు చైర్స్పర్సన్ పని చేశారు. మీనాక్షి భర్త తారా ప్రసాద్ బాహిణీపతి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ప్రస్తుతం జయపూర్ ఎమ్మెల్యేగా, ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మీనాక్షి మరిది భగవాన్ బాహిణీపతి గతంలో కొరాపుట్ పురపాలక సంఘ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షునిగా గెలిపొందారు. భగవాన్ ప్రస్తుతం కొరాపుట్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షునిగా కొనసాగతున్నారు. ఈ ప్రకటనతో బాహిణీపతి కుటుంబం కాంగ్రెస్ పార్టీ ప్రబాల్యం పరిపూర్ణమైంది. -
జగన్నాథుడికి ప్రత్యేక పూజలు
పర్లాకిమిడి: రాజవీధిలో నిలుపుదల చేసిన జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథాల మీద తొలి ఏకాదశి సందర్భంగా జగన్నాథుడు ప్రత్యేక వేషధారణలో ఆదివారం భక్తులకు దర్శనం కల్పించారు. బలభద్రుడు, చెల్లెలు సుభద్ర సునాబేషో (బంగారు తోడుగులు) అలంకరణలో ఉండటంతో పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. సాయంత్రం హారతి సమయంలో ఈ సునాభోషోలో చతుర్థామూర్తులు భక్తులకు దర్శనం కల్పించారు. ఒక్కరోజే 50 వేల మంది భక్తులు జగన్నాథుని సునాభేషోను దర్శించుకోవడానికి విచ్చేశారు. బంగారు తోడుగులతో బలరాముడు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
రాయగడ: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో ఈ మేరకు శనివారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలొ ఆమె మాట్లాడుతూ డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు అత్యధిక శాతం ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధంగా ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలోని ప్రత్యేక అంగన్వాడి, ఆశ కేంద్రాల్లో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందేవిధంగా అవసరమయ్యే మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామంలో ప్రతి సమా చారాన్ని ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య శాఖకు అందించాలని సూచించారు. సమావేశంలొ ఏడీఎంఓ డాక్టర్ మమత చౌధరి, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి, జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సుబుద్ధి, జిల్లా అదనపు కలక్టర్ రమేష్ చంద్ర నాయక్, ఏడీఎంఒ డాక్టర్ మమత సాహు తదితరులు పాల్గొన్నారు. -
డోలీలే గతి
కొరాపుట్: కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి బోడపు పుట్ గ్రామ పంచాయతీ సునా గుడ గ్రామానికి చెందిన మహిళలు వెదురు కర్రల కోసం అడవిలోకి వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో సబితా పంగి,లక్ష్మీ ఖొర అనే మహిళలు వెనుకబడ్డారు. వీరిద్దరూ కలసి వస్తున్న సమయంలో పులి గాండ్రింపు శబ్ధం వినిపించింది. దాంతో తీవ్ర భయకంపితులయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దెయ్యం పట్టిందనే అనుమానంతో గిరిజనులు మంత్ర గత్తెలను రప్పించి పూజలు చేశారు. అయినా వారిద్దరి పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో వారిద్దరినీ బొయిపరిగుడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నం చేశారు. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుర్చీలను డోలీలుగా మార్చారు. వాగులు, అడవులు, కొండలు దాటి కట్పడ గ్రామానికి చేరుకున్నారు. అక్కడకు కూడా అంబులెన్స్ రాలేదని సిబ్బంది చెప్పడంతో గెండ్ర గుడ వరకు బైక్ల మీద తీసుకొని వెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా బొయిపరిగుడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భారీ వర్షంలో బాధిత మహిళలను డోలీల మీద తీసుకుని రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధిత గ్రామానికి రోడ్డు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
మాజీ మంత్రి జాదవ మజ్జికి ఘన నివాళులు
కొరాపుట్: దివంగత మంత్రి జాదవ మజ్జి 75వ జయంతి ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి కేంద్రంలో అతని విగ్రహానికి అభిమానులు ఆదివారంగా ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ హయాంలో జాదవ మజ్జి గనుల శాఖా మంత్రిగా పని చేశారు. తదనంతరం బీజూ తనయుడు మాజీ ముఖ్యమంత్రి హయాంలో జాదవ మజ్జి కుమారుడు రమేష్ మజ్జి మంత్రిగా పని చేశారు. నివాళులర్పించిన వారిలో జాదవ మజ్జి తనయులు.. మాజీ మంత్రి రమేష్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ మజ్జి, బీజేడీ కార్యకర్తలు ఉన్నారు. గజపతి పర్యాటకంపై డాక్యుమెంటరీ విడుదల పర్లాకిమిడి: స్థానిక రాజవీధి శ్రీజగన్నాథ మందిరం వద్ద అడపా మందిరం వద్ద ఆదివారం బహుడా రథయాత్ర పురస్కరించుకుని కళాకారులతో ఒడిస్సీ నృత్య కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ విచ్చేశారు. అనంతరం మోహానా బ్లాక్ కు చెందిన సుజ్ఞాణ్ సాగర్ ‘మొ గజపతి’ అనే పర్యాటకానికి సంబంధించిన డాక్యుమెంటరీ సీడీని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంటరీలో గజపతి పర్యాటక ప్రాంతాల గురించి సవివరంగా సుజ్ఞాన్ సాగర్ మీడియా ప్రతినిధి చిత్రీకరించారు. కార్యక్రమంలో ఉపాంత ప్రహారీ పూర్ణచంద్ర మహాపాత్రో, బినోద్ జెన్నా, సంగీత దర్శకులు రఘునాథ్ పాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ పాల్గొన్నారు. పుట్టగొడుగులు తిని ఐదుగురికి అస్వస్థత కొరాపుట్: పుట్ట గొడుగులు కూర తిని ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి గంజా పర గ్రామ పంచాయతీ మరంగ్పాలిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి ముందు గడ్డిలో ఉదయం వేల పుట్ట గొడుగులు కనిపించాయి. వీటిని స్థానికులు సేకరించి వండుకొని తిన్నారు. అయితే కొద్దిసేపటి తరువాత వారికి వాంతులు, తల తిప్పడం ప్రారంభం అయింది. వెంటనే గ్రామస్తులు వారిని రాయిఘర్ ప్రభుత్వ వైద్యశాలకి తరలించి చికిత్స అందించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన కువాన్ గొండో, బలరాం గొండో, దినేష్ గొండో, శివలాల్ గొండో, బుదురాం గొండోగా గుర్తించి. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉండడగా.. మరో ముగ్గురు కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. నందపూర్ రథయాత్రకు అవాంతరాలుకొరాపుట్: రాజరిక నేపథ్యం ఉన్న కొరాపుట్ జిల్లా నందపూర్ రథయాత్రలో బహుడా రోజు అవాంతరాలు ఏర్పడ్డాయి. రథం లాగడంలో దిశ మారి రథం ఒక ఇంటి వైపునకు దూసుకెళ్లి నిలిచిపోయింది. అనంతరం ప్రజలు చాలా శ్రమ పడి సవ్య దిశలోకి తెచ్చారు. మరి కొంత దూరం వెళ్లి మరో షాపు వద్ద మొరాయించింది. ప్రజలు ఎంత కష్టపడినా ముందుకు కదల్లేదు. దీంతో జేసీబీ తెచ్చి కదిలించారు. అంతలోనే భారీ వర్షం పడడంతో ప్రజలు చెల్లాచెదురయ్యారు. చివరకు ఎంతో కష్టం మీద రథం జగన్నాథ మందిరానికి చేరింది. ఈ ఘటనలో ఒక ఇంటి గోడ కూలి పోయింది. రథం నుంచి కొన్ని భాగాలు విడవడ్డాయి. -
అతిసారం కేసులు నమోదు కాలేదు
● రాష్ట్ర ఆరోగ్య శాఖ బృందం వెల్లడి రాయగడ: జిల్లాలోని ఏ ప్రాంతాల్లో అతిసార వ్యాధి కేసులు నమోదు కాలేదని వైద్య బృందం స్పష్టం చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతిసార ప్రబలినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ మదన్ మోహన్ ప్రధాన్ నేతృత్వంలో జాతీయ స్వస్థ్య మెషిన్ రాష్ట్ర విభాగానికి చెందిన కన్వీనర్ అద్వేత్ ప్రధాన్, గ్రామీణ నీటి సరఫరా విభాగం చీఫ్ ఇంజినీర్ (భువనేశ్వర్) నారాయణ ప్రధాన్ గాంధీ, ల్యాబ్ అసిస్టెంట్ అబీన్ కుమార్ బొరల్ల బృందం జిల్లాలో రెండు రోజులు పర్యటించింది. సదరు సమితిలోని కూలి, కందిలి, పితామహాల్, కొలనార సమితిలోని సూరి తదితర ప్రాంతాల్లో పర్యటించిన వైద్యబృందం అక్కడి గ్రామస్తులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా ప్రాంతాలను పరిశీలించారు. అయితే ఆయా ప్రాంతాల్లో మలేరియా, అతిసార ప్రబలినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి మలేరియా, డెంగీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరిలోని కొరాపుట్ వీధి, జొడియా వీధి, హరిజన్ వీధులతోపాటు టికిరపడ, మైకంచ్, డుడుకాబహాల్, శంకరడ గ్రామాల్లో పర్యటించిన బృందం అక్కడి పరిస్థితిని అధ్యయనం చేశారు. జిల్లాలో ఎక్కడా అతిసారం సోకలేదని అదేవిధంగా మలేరియా, డెంగీ వ్యాధులు అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తగా ఉండాలని ఎటువంటి అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలోని ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025
ఏటా 5 సార్లు బంగారు శోభతో దర్శనం ఏటా రథ యాత్ర పురస్కరించుకుని మారు యాత్ర (బహుడా)లో భాగంగా ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి నాడు రథాలపై బహిరంగంగా అన్ని వర్గాల భక్తులకు స్వామి బంగారు దర్శనం ఒక రోజు లభిస్తుంది. ఏడాదిలో మరో 4 సార్లు శ్రీ మందిరం లోపల మూల విరాటులు బంగారు అలంకరణతో శోభిల్లుతారు. ఏటా కార్తీక పూర్ణిమ, పౌష్య పూర్ణిమ, డోల పూర్ణిమ, అశ్విని శుక్ల దశమి పుణ్య తిథుల్లో స్వామి బంగారు శోభతో భక్తులకు మిరిమిట్లు గొలిపిస్తాడు. పుష్యాభిషేకం సందర్భంగా పుష్య మాసం పౌర్ణమి నాడు, దసరా ఉత్సవాల్లో విజయ దశమి నాడు స్వర్ణ శోభితుడుగా దర్శనం ఇస్తాడు. శ్రీ మందిరం రత్న వేదికపై ఆయా తిథుల్లో మధ్యాహ్న ధూపం తర్వాత మూల విరాటుల్ని బంగారు ఆభరణాలతో అలంకరించడం ఆచారంగా కొనసాగుతోంది. దసరా సమయంలో విజయ రామచంద్రునిగా, కార్తీక పౌర్ణమి సమయంలో ద్వారక నాథునిగా, డోల పౌర్ణమి సమయంలో గోపేశ్వరుడిగా, పుష్యాభిషేకం సమయంలో శ్రీరామునిగా పూజిస్తారు. బంగారు కర్ణ కుండలాలతో దేవీ సుభద్రశ్రీ జగన్నాథుని భారీ బంగారు కిరీటం ● శ్రీ క్షేత్రంలో హరి శయన ఏకాదశిరథాలపై మూల విరాట్ల స్వర్ణాలంకార దర్శనం కోసం తరలి వచ్చిన భక్త జనంభువనేశ్వర్: శ్రీ క్షేత్రంలో ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పూరీ శ్రీ మందిరం భక్త జనంతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజాదులతో స్వామి పలుమార్లు ఆకర్షణీయమైన అలంకరణతో శోభిల్లాడు. హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై దేవుళ్లకు 2 సార్లు బొడొ సొంగారొ అలంకరణ చేయడం విశేషం. ఈ సందర్భంగా రథాలపై మూల విరాటుల్ని స్వర్ణ అలంకారంలో దర్శించుకుని భక్తులు తరించారు. శ్రీ క్షేత్ర వాసుడు శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర దాదాపు అంతిమ దశకు చేరుకుంది. స్వామి యాత్ర ఆద్యంతాలు భక్త జనాన్ని మురిపిస్తాడు. పవిత్ర ఆషాఢ శుక్ల ఏకాదశి పుణ్య తిథి పురస్కరించుకుని భక్తులకు బంగారు శోభతో దర్శన భాగ్యం కల్పించాడు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో 3 రథాలపై దేవుళ్లని బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం సింహ ద్వారం ప్రాంగణంలో పతిత పావనునికి బంగారు అలంకరణ చేశారు. రత్న వేదికపై నిత్యం అసంపూర్ణ దారు విగ్రహాలుగా దర్శనం ఇచ్చే మూల విరాటులు రథ యాత్రలో రథాలపై బంగారు తొడుగులు, ఆభరణాలతో నిలువెత్తు రూపంతో దర్శనం ఇస్తారు. కుల, మత, వర్గ, వర్ణ వివక్షకు అతీతంగా ఆరు బయట పరిపూర్ణ జగన్నాథుని దర్శించుకునే అపురూప అవకాశం స్వామి రథ యాత్రలో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ ఏడాది రాత్రి 11 గంటల వరకు రథాలపై మూల విరాటుల పరిపూర్ణ రూపాన్ని బంగారు అలంకరణలో దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల నుంచి ఈ దర్శనం ప్రారంభం కావడం విశేషం. శ్రీమందిరంలో హరి శయన ఏకాదశి ఆషాడ శుక్ల ఏకాదశి సందర్భంగా రథాలపై దేవుళ్ళకు హరి శయన ఏకాదశి ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. నేటి నుంచి కార్తీక మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు వరకు భగవంతుడు 4 నెలలు శయనిస్తాడు. వల్లభ్ల బొడొ సింగారో అలంకరణ పవిత్ర హరి శయన ఏకాదశి పురస్కరించుకుని రథాలపై మూల విరాటులకు వరుసగా 2 సార్లు బొడొ సింగారొ అలంకరణ చేయడం ఆచారం. నిత్యం సాగే బొడొ సింగారొ అలంకరణ తర్వాత భోగ సేవ తర్వాత అధిక భోగ సేవ నిర్వహించి మరో మారు బొడొ సింగారొ అలంకరణ చేస్తారు.దీన్ని వల్లభ బొడొ సింగారొ అలంకరణగా పేర్కొంటారు. న్యూస్రీల్ -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
కొరాపుట్: ఈ నెల తొమ్మిదో తేదీన జరిగే సార్వత్రి సమ్మెను జయప్రదం చేయాలని వామపక్షా కార్మిక సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఆదివారం సాయంత్రం జయపూర్ పట్టణంలోని జాతీయ రహదారి 26పై ఉన్న ఉమెన్స్ కాలేజీ సమీపంలోని శ్రామిక్ భవన్లో సమావేశం జరిగింది. ఇందులో సీపీఐ నాయకుడు ప్రమోద్ మహాంతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న బంద్ను జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఆశ, అంగన్వాడీ, వంట సహాయకులకు ఉద్యోగ హోదా కల్పించాలని, పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్లు చేశారు. వివిధ సంఘాలలో పని చేస్తున్న కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఐఎన్టీయూసీ, ఈపీఎఫ్ పెన్సనర్ల ఆసోసియేషన్కు తదితర కార్మిక సంఘాలకు చెందిన జుదిష్ట రౌవులో, సుభాష్ బట్టాచార్య, ఉత్తం నాయక్, కె.భగవాన్రెడ్డి పాల్గొన్ానరు. -
దేవతామూర్తులకు పూజలు
రాయగడ: గుండిచా మందిరం నుండి జగన్నాథ మందిరానికి తరలివచ్చిన దేవతామూర్తులు జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవిలు ఆదివారం సునాబొజేలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏకాదశి పర్వదినం కావడంతో రథాలపై దేవతామూర్తులను ఉంచి అలంకరించారు. ఈ సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన బందొస్తును ఏర్పాటు చేసారు. భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు రాయగడ: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక బాలాజీనగర్లో గల కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి సుప్రభాత, అభిషేక కార్యక్రమాలతోపాటు రమాసత్యనారాయణ వ్రత పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలొ పాల్గొన్నారు. పట్టణ బీజేడీ అధ్యక్షునిగా ప్రమోధ్ కుమార్ కొరాపుట్: నబరంగ్పూర్ పట్టణ బీజేడీ అధ్యక్షునిగా ప్రమోధ్ కుమార్ రఽథ్ నియమితులయ్యారు. బీజేడీ పార్టీ నబరంగ్పూర్ జిల్లా ఎన్నికల రిట్నరింగ్ అధికారి సచింద్ర స్వయ్ ఆదివారం తెలియజేశారు. ప్రమోద్ కుమార్కు ఈ పదవి వరుసగా ఐదో సారి ఎన్నికయ్యారు. ప్రమోద్కు పార్టీ మాజీ ఎంపీలు రమేష్ మజ్జి, ప్రతిప్ మజ్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పదవీ కాలం మూడేళ్లు ఉండనుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి శ్రీకాకుళం న్యూకాలనీ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ (1938) జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు బి.రవి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో పలువురు వక్తులు మాట్లాడారు. నాడు–నేడుతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేయాలని కోరారు. పేరెంట్ టీచర్ మీటింగ్ల పేరిట బడుల్లో విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గిన్నిస్రికార్డుల కోసం ఆరాటమే తప్ప విద్యాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు టి.చలపతిరావు, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, బాలాజీరావు, ఆర్.వి.అనంతాచార్యులు, బి.నవీన్, కృష్ణారావు, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్ తగదు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థలో భాగమైన ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నా ట్రోలింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.వ్యక్తి కంటే వ్యవస్థలే ముఖ్యమని, అటువంటి వారిని అవమానిస్తే, న్యాయవ్యవస్థను అవమాన పరిచినట్లేనని పేర్కొన్నారు. ట్రోల్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించించాలని కోరారు. ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాణించి జిల్లాకు పేరుతీసుకురావాలని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్ ఆకాంక్షించారు. జిల్లాస్థాయి అండర్–15 చెస్ ఎంపిక పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొని ఎత్తుకు పైఎత్తులేశారు. బాలుర విభాగంలో డొంకాడ కార్తికేయ ప్రథమ, బొల్ల యశ్వంత్ ద్వితీయ, ఎన్కేపీ నిహల్ తృతీయ, పొన్నాడ వేదిష్ నాలుగో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో మెట్ట తీక్షణ, బొల్ల శృతి, జామి వినమ్ర, రిత్విక తొలి నాలుగు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. -
భక్తిశ్రద్ధలతో బహుడా
తొమ్మిది రోజుల పాటు గుండిచా మందిరంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన జగన్నాథుడు సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి శనివారం తిరిగి మందిరానికి బయల్దేరాడు. దీనినే మారు రథయాత్ర(బహుడా)గా పిలుస్తారు. గండిచా మందిరంలోని దేవతామూర్తులను రథంపైకి ఎక్కించి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాలు లాక్కొని వెళ్లారు. దేవతామూర్తుల రథాలు సాంప్రదాయం ప్రకారం మార్గమధ్యలోని తమ పిన్ని ఇంటి వద్ద ఆగాయి. అక్కడ దేవతామూర్తులు ఏకాదశి పురస్కరించుకొని ఆదివారం విడిది చేస్తారు. భక్తుల పూజలందుకున్న అనంతరం ప్రధాన మందిరానికి రథాలు బయల్దేరుతాయి. – సాక్షి నెట్వర్క్ -
రూ.1.38 కోట్లతో దంపతులు పరారీ
పర్లాకిమిడి: స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి రూ.1.38 కోట్ల డబ్బులు తీసుకొని దంపతులు పరారైన ఘటన పట్టణంలో వెలుగు చూసింది. ఈ దంపతులు మహిళా స్వయం సహాయక గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పి తొలుత రుణాలు మంజూరు చేయించారు. అనంతరం ఉద్యోగులు, రాజకీయ నాయకులకు అతి తక్కువ వడ్డీతో బంగారం కుదువపెట్టి రుణాలు మంజూరు చేసేవారు. ఆ తర్వాత వారి పేర్ల మీద ఎక్కువ మొత్తంలో వివిధ బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేయించుకొని ఆ నగదుతో పరారయ్యారు. అయితే రుణాలు తీసుకున్న బ్యాంకులు నగదు కట్టాలని నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఈ మోసం జరిగి నాలుగు నెలలు అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆదర్శ పోలీసుస్టేషన్లో ఒక స్వతంత్ర బృందం కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా వెల్లడించారు. -
గ్రామానికి చేరుకున్న మృతదేహాలు
కొరాపుట్: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమయలారం వద్ద రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు స్వగ్రామానికి వచ్చాయి. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి భిక్ష పంచాయతీ కొదాబట్ట గ్రామానికి అంబులెన్సులు వచ్చాయి. ఈ గ్రామానికి చెందిన కృష్ణగౌడ కుమారుడు రమేష్ గౌడ (22), హరిశ్చంద్ర బోత్ర కుమారుడు చైతు బోత్ర (23)లు ఈ ఘటనలో మృతి చెందారు. ఇదే ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఆ పరిశ్రమలో పని చేస్తుండగా, ఆరోజు వీరిద్దరూ విధులకు వెళ్లడంతో మృత్యువాతపడ్డారు. వీరి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్చరణ్ మజ్జి ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. సంబంధిత కంపెనీ ప్రతీ మృత కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. వీరి మృతదేహాలు వస్తున్న విషయం తెలిసి సమీప గ్రామాల నుంచి వందలాది గిరిజనులు తరలివచ్చారు. ఇద్దరి మృతదేహాలకు ఒకేచోట అంత్యక్రియలు చేపట్టారు. -
విద్యుత్ చార్జీలను తగ్గించాలి
అరసవల్లి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై చార్జీల పేరుతో మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం వద్ద అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచబోమని మాటిచ్చి ఇప్పుడు దఫదఫాలుగా పెంచుతూ పోతోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయాలను ఉససంహరించుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిత్యుని సన్నిధిలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్ శనివారం దర్శించుకున్నారు. జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు ఆలయ అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అర్చకులు మాధవ్శర్మ, ఆలయ అధికార సిబ్బంది బిఎస్.చక్రవర్తి తదితరులు ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, డీ–1 ఏఈ సురేష్కుమార్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షుడు ఉంగటి పాపారావు పాల్గొన్నారు. విశ్రాంత ట్రెజరీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా తవిటన్న శ్రీకాకుళం పాతబస్టాండ్: పదవీ విరమణ పొందిన ట్రెజరీ ఉద్యోగులు శనివారం సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత వచ్చే ఇబ్బందులు, సంక్షేమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు టీఆర్ఈడబ్ల్యూఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అంకడాల తవిటన్న, ఉపాధ్యక్షుడిగా భీష్మాచార్యులు, కార్యదర్శిగా రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఎ.కోటేశ్వరరావు, కోశాధికారిగా ఆర్ఎస్ పట్నాయక్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా చీఫ్ ట్రెజరీ ఆఫీసర్ రామచంద్రయ్య, డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్ వెంకటరావు పాల్గొన్నారు. నేడు జిల్లా అండర్–15 చెస్ ఎంపిక పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్–15 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాలవీధిలోని చెస్ శిక్షణా కేంద్రంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న వారిని త్వరలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఎంపికల్లో పాల్గొనాలని, పూర్తి వివరాలకు 99125 59735 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఏపీచెస్.ఓఆర్జీ వెబ్పోర్టల్లో వివరాలను నమోదుచేసుకోవచ్చని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బొడ్డేపల్లి రమేష్కుమార్ ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆమదాలవలస పట్టణానికి చెందిన బొడ్డేపల్లి రమేష్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈయన 2013 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు రమేష్కుమార్కు అభినందనలు తెలిపారు. ఆప్కో వస్త్రాలపై రాయితీ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కో షోరూంలలో ఆషాఢ మాసం సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 నుంచి 70 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు డివిజనల్ మార్కెటింగ్ అధికారి అనుపమదాస్ శనివారం తెలిపారు. ధర్మవరం, మాధవరం, వెంకటగి, ఉప్పాడ, బందరు, రాజమండ్రి, మంగళగిరి చీరలు, బెడ్షీట్స్, లుంగీలు, టవల్స్ అందు బాటులో ఉన్నాయని వివరించారు. ఆప్కోహేండ్లూమ్స్.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ స్టోర్స్లోనూ ఆప్కో వస్త్రాలు లభి స్తాయని తెలిపారు. వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు. -
గాంధీజీ విగ్రహం ధ్వంసం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డు గాంధీ నగర్లో గాంధీజీ విగ్రహాన్ని ఒక యువకుడు ధ్వంసం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది తెలిసిన వెంటనే పార్టీలకు అతీతంగా నాయకులు సంఘటన స్థలానికి వెళ్లి ఖండించారు. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విగ్రహాన్ని 1964లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడర్ ఆవిష్కరించారని డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి పేర్కొన్నారు. దీనిని 1994లో స్వాతంత్య్ర సమరయోధుడు జగన్నాథ త్రిపాఠి పున ప్రతిష్ట చేశారన్నారు. అటువంటి చారిత్రాత్మక విగ్రహాన్ని మరలా పునః ప్రతిష్ట చేసేవరకు ఆందోళన చేస్తామన్నారు. దీంతో అక్కడే ఉన్న అన్ని పార్టీల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అమిత్ ప్రధాన్(బీజేపీ), సుమిత్ పూజారి (బీజేడీ), అఖిల్ బోత్ర, బృందావన పండా, పొరి సాహు, పిరోజ్ (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లపై అధికారుల దాడులు
జయపురం: సబ్ డివిజన్ పరిధి కోట్పాడ్ ఎన్ఏసీలో హోటళ్లు, బేకరీలపై అధికారులు శనివారం దాడులు జరిపారు. హోటళ్ల వంట గదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు, వంట నూనె వినియోగించాలని, పరిశుభ్రత పాటించాలని కోట్పాడ్ ఎన్ఏసీ కార్యనిర్వాహక అధికారి కమలేష్ మహంతి హోటల్ యజమానులకు సూచించారు. దాడుల్లో శానిటేషన్ అధికారి సుధీర్ కుమార్ నందో, గోపీ మఝి తదితరులు పాల్గొన్నారు.నారాయణరావు నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న పడాల నారాయణరావు(84) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారులు పి.శ్రీనివాస్, పి.శ్రీకాంత్, కుమార్తె పి.శ్రీదేవిలు విషయం రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుధీర్ పర్యవేక్షణలో మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి పి.సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్తో పాటు కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని కోరారు. -
ఆశ్రమ పాఠశాలలో భారీ కుంభకోణం
కొరాపుట్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సామగ్రిలో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష బీజేడీ పార్టీ ఆరోపించింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం 28 వేల ప్లేట్లు కొనుగోలు చేసిందన్నారు. కానీ వాటి వాస్తవ ధర రూ.120 కాగా, టెండర్ మాత్రం రూ.400లకి ఖరారు చేశారన్నారు. ఇలాంటి కుంభకోణం తాము ఏనాడు చూడలేదన్నారు. హాస్టల్లో ఉండే పెద్ద తపేలా ఖరీదు రూ.3,200లు కాగా, దానిని రూ.11 వేలకి కొనుగోలు చేశారని మండిపడ్డారు. రూ.30 వేల దోమ తెరలను ఒక్కొక్కటీ రూ.2 వేలకు కొనుగోలు చేశారని, అయితే దోమ తెరలు రూ.2 వేలు ఎక్కడైనా ఉంటుందని ప్రశ్నించారు. ఇలా అనేక విధాలుగా విద్యార్థుల సొమ్మును కాజేశారని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, నాయకులు సరోజ్ పాత్రో, భీమొ పూజారి, లల్లు త్రిపాఠి, దిలీప్ పండా, ప్రమెద్ రథ్, సుమిత్ పూజారి తదితరులు పాల్గొన్నారు. బీజేడీ నాయకుల ఆరోపణ -
రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహించేందుకు తన సొంత గ్రామమైన ఖెదాపడ నుంచి స్కూటీపై రాయగడ వస్తున్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. మృతురాలు లావణ్య గంట (24 )గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. చందిలి పోలీసుస్టేషన్ పరిధి గునాఖాల్ రోడ్డు కూడలి వద్ద లావణ్య నడుపుతున్న స్కూటీని వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీకొంది. దీంతో ఆమె తన ఎదురుగా వస్తున్న లారీకింద పడిపోవడంతో తీవ్రగాయాలపై సంఘటన స్థలంలోనే మృత్యువాతపడింది. బైక్పై వస్తున్న బిసంకటక్ పరిధి మునిగా గ్రామానికి చెందిన కాంతారావు కడ్రక, సుబ్బారావు కడ్రకలు కూడా కిందపడిపోయి తీవ్రగాయాలకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కానిస్టేబుల్ లావణ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి ● మాజీ మంత్రి, ఆదివాసీ నేత జయరాం పంగి డిమాండ్ జయపురం: దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, అవిభక్త కొరాపుట్ ఆదివాసీ నేత, దండకారణ్య పర్వతమాల వికాస పరిషత్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు జయరాం పంగి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కొరాపుట్, నవరంగపూర్, రాయగడ, మల్కన్గిరి, గజపతి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, పాడేరు ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన డిమాండ్కు ఆ ప్రాంతాల నేతలు, ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర రాష్ట్రం ఏర్పడితే ఇంతవరకు ఒడిశా– ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరుత దాడిలో 5 మేకలు మృతి మల్కన్గిరి: జిల్లాలోని ఖోయిర్పూట్ సమితి కుమారపూట్ గ్రామంలో శుక్రవారం రాత్రి చిరుత దాడిలో మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సమారీ దాంగడమాఝి అనే వ్యక్తి తన మేకలను ఒక శాలలో కట్టి ఇంటికి వెళ్లాడు. అయితే శనివారం ఉదయం వచ్చి చూస్తే 5 మేకలను పులి చంపి పడేసింది. ఒక మేకను పులి ఈడ్చుకొని వెళ్లినట్లు ఆనవాలు ఉన్నాయి. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మత్తిలి రేంజర్ వాసుదేవ్ నాయక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక్కో మేకకు పరిహరంగా రూ.3,000 చొప్పున రైతుకు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కొలనార సమితి సూరి పంచాయతీలోని బొడొపొడియా గ్రామానికి చెందిన పెంటి ఉలక(64)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకు పనిమీద పెంటి తన బంధువులతో స్యూటీపై వస్తోంది. అదే సమయంలో స్థానిక జియోమార్ట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక బస్సు స్యూటీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన ఆమె సంఘటన స్థలం వద్దే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కమల దళపతి ఎవరో..?
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోనుంది. కొత్త సారథిపై రాష్ట్ర రాజకీయ పక్షాలు పలు అంచనాలతో ఉన్నాయి. ప్రధానంగా ఈ వర్గాలు పాలక పార్టీ నాయకత్వ సారథ్యం యథాతథంగా కొనసాగుతుందా లేదా మార్పు వస్తుందా అనేది చూస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఈ ఉత్కంఠకు తెర పడుతుంది. దీనిలో భాగంగా ఆదివారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అవుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రతాప్ చంద్ర షడంగ తెలిపారు. ఔత్సాహిక అభ్యర్థులు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసేందుకు ఈనెల 7వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడేళ్ల పదవీ కాలం కొత్త అధ్యక్షుడి సారథ్యంపై రాష్ట్రంలో బీజేపీ మనుగడ ముడిపడి ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ, ప్రభుత్వ సంబంధాన్ని మరియు ఒడిశా రాజకీయ పరపతిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్ మధ్య అద్భుతమైన సమన్వయం ఫలిత ఆధారిత దక్షతను చాటుకుంది. మన్మోహన్ సామల్ తిరిగి ఎన్నికై తే ఈ పరిస్థితి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. ఆయన పదవీ కాలంలో పలు కీలక అంశాలు హుందాగా పరిష్కరించబడ్డాయి. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ పాలన పగ్గాలు చేపట్టినా ఎటువంటి ఒడిదుడుకులకు అవకాశం లేకుండా తన వంతు కర్తవ్యాన్ని దక్షతతో నిర్వహించి పార్టీ అంతర్గత వ్యవహారాల్ని వివాదరహితంగా నిర్వహించారు. నాయకత్వం మారితే... నాయకత్వం మారితే సమన్వయ సమీకరణాలు కొత్త పుంతలు తొక్కడం తథ్యం. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలపై హోరా హోరీ పోరు కొనసాగుతోంది. కొత్త నాయకుని సారథ్యంలో బీజేపీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్త అధ్యక్షుడికి వివిధ ప్రభావవంతమైన రాష్ట్ర నాయకులకు ఉన్న సామీప్యత పరిశీలనలోకి వస్తుంది. రాష్ట్ర బీజేపీ తన ప్రస్తుత సమతుల్యతను కాపాడుకుంటుందా లేదా దాని అంతర్గత అధికార నిర్మాణాన్ని మరియు రాజకీయ వ్యూహాన్ని పునర్నిర్మించగల పరివర్తనను స్వీకరిస్తుందా అనే దానిపై అందరి దృష్టి ఉంది. రానున్న 48 గంటలు పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. అవసరమైతే ఈనెల 8న ఎన్నికలు జరుగుతాయి. కొత్త రాష్ట్ర శాఖ ప్రముఖుడు (అధ్యక్షుడు) మరియు కేంద్ర మండలి సభ్యుల పేర్లను అదే రోజున ప్రకటిస్తామని ప్రతాప్ చంద్ర షడంగి తెలిపారు. పూరీలో రథయాత్రలో తొక్కిసలాట ఘటనతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు కేంద్ర మండలి సభ్యుల ఎన్నిక స్వల్పంగా వాయిదా పడింది. ఉత్కంఠగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక నేడు నోటిఫికేషన్ జారీ -
రథయాత్రలో కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని పద్మపూర్ సమితి ఇఛ్చామొనొగుడ గ్రామానికి చెందిన తరణీ చరన్ గొమాంగో(50)గా గుర్తించారు. స్థానిక కొత్త బస్టాండ్ కూడలిలో రథయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న గొమాంగో శనివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర వేదన కనిపించింది. -
రాజ్భవన్లో వన మహోత్సవం
భువనేశ్వర్: వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజ్ భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామానంద పార్క్లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి మొక్క నాటి నీరు పోశారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, రాజ్ భవన్ ప్రాంగణంలో అనేక మొక్కలు నాటారు. గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన మరియు పచ్చటి వాతావరణం అందించేందుకు వ్యక్తులు, సంస్థలు ఉత్సాహంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
నదిని దాటాల్సిందే..!
చదువు సాగాలంటే..అక్షరాలు నేర్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు అక్కడి గిరిజన విద్యార్థులు. చదువుకోవాలనే ఆశయంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని నడుకుంటూ దాటుతున్నారు. కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి పిండాపొదర్ గ్రామ పంచాయతీ శేషకుడి గ్రామ ప్రజలు అంధారి నది దాటుతున్న దృశ్యమిది. గత వారం రోజులుగా వర్షాలు వలన పిల్లలు చదువులకు వెళ్లలేకపోయారు. ఇలా అయితే తమ పిల్లలు తమలాగే వెనుకబాటుతనానికి గురవుతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చిన్నారులను తమ భుజాల మీద కూర్చొనబెట్టి ప్రమాదకర పరిస్థితిలో నదిని దాటించారు. ఈ గ్రామంలో 280 మంది జనాభా నివసిస్తున్నారు. దీంతో నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా పాలకులను వేడుకుంటున్నా తమ మొర వినడం లేదని వాపోతున్నారు. కనీసం పాద వంతెన నిర్మించినా తమ ప్రాణాలకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇలాగే ప్రతిరోజు రెండు పూటలు గిరిజనులు పిల్లలను పాఠశాలకి పంపించడం, తీసుకొని రావడం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా తమ జీవనోపాధి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నదిని దాటుతున్నారు. – కొరాపుట్ -
రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి
–8లోuఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025నృత్యాలు చేస్తున్న కళాకారులుశ్రీమందిరం సింహద్వారం వద్దకు చేరిన రథాలుపూరీ శ్రీజగన్నాథుని మారు రథయాత్ర బహుడా సందర్భంగా సాగర తీరంలో సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ సైకత శుభాకాంక్షలుభువనేవ్వర్: శ్రీజగన్నాథుని రథయాత్ర ద్వితీయ ఘట్టం బహుడా అత్యంత భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. అధికారులు, సేవాయత్ వర్గాల మధ్య సమన్వయంతో యాత్ర పూజాదులు నిర్ధారిత వేళ కంటే ముందుగా పూర్తి చేయడంతో అడప మండపం నుంచి వరుస క్రమంలో రథాలపైకి మూలవిరాటుల తరలింపు పొహండి ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మూల విరాటులు తరలి వస్తుండగా శారదా బాలి ప్రాంగణం శంఖ ధ్వని, ఘంటానాదంతో మారుమోగింది. భక్తుల జైజగన్నాథ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. ఔత్సాహిక కళాకారులు భక్తిశ్రద్ధలతో రథాల ఆవరణలో శాసీ్త్రయంగా నృత్యం ప్రదర్శించి భక్తజనం దృష్టిని ఆకట్టుకున్నారు. ఆసీనులైన దేవతామూర్తులు తొలుత చక్రరాజ్ సుదర్శనుడు గుండిచా ఆలయం అడప మండపం నుంచి తరలివచ్చి దేవీ సుభద్ర రథం దర్ప దళనంపై ఆసీనుడయ్యాడు. వెంబడి తాళధ్వజంపైకి బలభద్రుని మూలవిరాటు చేరింది. దేవీ సుభద్ర దర్ప దళనంపైకి చేరడంతో, చివరగా శ్రీజగన్నాథుడు నందిఘోష్ రథంపై ఆసీనుడు అయ్యాడు. వెంబడి మూలవిరాటుల ఉత్సవమూర్తులను రథాలపైకి వరుస క్రమంలో తరలించడంతో పొహండి ముగిసింది. ఉదయం 9.55 గంటలకు ప్రారంభమైన పొహండి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిసింది. అంతకు ముందు మంగళ హారతి, మైలం వంటి అనేక ఆచారబద్ధమైన పూజలు, సేవాదులు నిర్వహించారు. మూల విరాటులు రథాలపై ఆసీనులు కావడంతో పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ చెర పహార కార్యక్రమంలో పాల్గొని 3 రథాలను శుద్ధి చేశారు. అనంతరం రథాల మారుయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభం తొలుత బలభద్రుని తాళధ్వజం మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరింది. వాస్తవానికి రథాలు లాగడం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబడుతుందని ప్రకటించారు. ఆ తర్వాత దేవి సుభద్ర దర్ప దళనం యాత్ర ప్రారంభించింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం దారి పొడవునా ఆత్మీయుల్ని పలకరించుకుంటూ నిదానంగా శ్రీమందిరం గమ్యం చేరింది. దారిలో బాలగండి చౌరస్తా ప్రాంతంలో మౌసీ మా (పిన్నమ్మ) ఆలయం ఆవరణలో నందిఘోష్ రథం ఆనవాయితీ ప్రకారం కాసేపు ఆగింది. యాత్ర ముగించుకుని శ్రీమందిరానికి చేరబోతున్న జగతినాథునికి పిన్నమ్మ ప్రేమతో తయారు చేసిన తీపి వంటకం పొడొ పిఠా మట్టి పాత్రలో నివేదించింది. ఏటా మారు రథయాత్ర ముందు రోజున మౌసీ మా ఆలయంలో ఈ వంటకం సిద్ధం చేస్తారు. ఈ సాంప్రదాయ ఒడియా రుచికరమైన వంటకం గోధుమ పిండి, చెన్నా (విరిగిన పాలు), చక్కెర, పిస్తాపప్పులు, ఏలకులు, లవంగాలు మరియు శుద్ధ నెయ్యిల గొప్ప మిశ్రమంతో తయారై ఘుమఘుమలాడుతు రుచికరంగా ఉంటుంది. మౌసీ మా ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీ జగన్నాథుని రథం మరోమారు గజపతి మహారాజా భవంతి ఆవరణలో ఆగింది. అన్నాచెల్లెళ్లతో యాత్రకు వెళ్లి తనను ఒంటరి చేశారన్న మనస్తాపంతో కలత చెందుతున్న శ్రీమహాలక్ష్మీ దేవిని బుజ్జగించి నచ్చజెప్పడంలో గజపతి మహారాజా రాయబారిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ముచ్చట గొలిపే లక్ష్మీనారాయణుల భేటీ అత్యంత భక్తిశ్రద్ధలతో భక్త జన సంద్రం సమక్షంలో జరిగి యాత్రలో ఆకర్షణీయ ఘట్టంగా నిలిచిపోతుంది. ● మంత్రి సూర్యవంశీ సూరజ్న్యూస్రీల్ఎట్టకేలకు..! కొరాపుట్ – జయపూర్ మార్గంలో కదిలిన రైలు -
సత్యసాయి భక్తుల సేవలు నిరుపమానం
కొరాపుట్: భగవాన్ సత్యసాయి భక్తుల సేవలు నిరుపమానమని కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత పేర్కొన్నారు. కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి కేంద్రంలో నూతనంగా నిర్మించిన భగవాన్ సత్యసాయి సమితి కేంద్ర భవనం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని ఆశయాలు సజీవంగా కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన కొరాపుట్ జిల్లాలో సాయి భక్తులు నిత్యం ఏదో ఒక సమాజ సేవ చేయడం తాను బాల్యం నుంచే గమనించానని పేర్కొన్నారు. తన వంతుగా సాయి సమితికి ఎటువంటి సాయం కావాలన్నా అందిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో సాయి సమితి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్కే దాస్, సచిదానంద, డాక్టర్ బెహర, ఆరుణ్ పాత్రో (రాజా), ఎస్.నాగభూషణ్రావు, మర్కెండయ్ షరాఫ్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే వికాసం
రాయగడ: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందా లంటే విద్యతోనే సాధ్యపడుతోందని రాష్ట్ర ఉన్నత విద్య, క్రీడా, సాంస్కృతిక శాఖల మంత్రి సూర్యవంశీ సూరజ్ అన్నారు. స్థానిక అటానమస్ కళాశాల 59వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. విద్యావిధానంలో రాష్ట్రం కొంత పుంతలు తొక్కుతోందన్నారు. ఆధునిక, సాంకకేతిక పరంగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు వారు ఆసక్తి కనబరిచే రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. శ్రద్ధతో విద్యను అభ్యసిస్తే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారుతుంద ని హితవు పలికారు. ఉన్నత విద్యవిధానంలో ఎన్నోమార్పులు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఆధునిక, సాంకేతిక రంగాల్లో రాణించాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టిసారించాలని అన్నారు. పట్టుదల, కృషితో ముందుకు సాగితే స్వయం ఉపాధిలో రాణించి మరికొంతమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులతో మాటా..మంతి కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యార్థులతో మంత్రి మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమస్యలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలొ రాయగడ వంటి ప్రాంతం ఎంతో గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఆదివాసీ, హరిజనుల సంఖ్య అధికంగా గల ఈ జిల్లాలో విద్యావిధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం యోచిస్తుందని వివరించారు. ఆటానమస్ కళాశాలలోని పలు సమస్యలను విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నివేదిక సమర్పణ.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్ కళాశా ల వార్షిక నివేదకను చదివి వినిపించారు. 1966వ సంవత్సరంలో ఏర్పాటైన కళాశాల అంచెలంచెలు గా అభివృద్ధి చెందిందని అన్నారు. 2007లో స్వయం ప్రతిపత్తి కళాశాలగా గుర్తింపు పొందిందని వివరించారు. ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ నుంచి పీజీ వరకు తరగతులు ఉన్నాయని.. సుమారు 5,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎందోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగుతున్న ఈ కళాశాలలో వసతుల ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, ఏడీఎం నిహారి రంజన్ కుహరో పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో వివిధ శ్రేణుల్లొ టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు మంత్రి జ్ఞాపికలను అందించి సత్కరించారు. మంత్రి సూర్యవంశీ సూరజ్ ఘనంగా కళాశాల వ్యవస్థాపక దినోత్సవం -
సమావేశంలోనే గుండెపోటుతో ఆశకార్యకర్త మృతి
మల్కన్గిరి: సమావేశంలోనే గుండెపోటుకు గురై ఆశ కార్యకర్త ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి కార్యాలయంలో చోటుచేసుకుంది. ఆరోగ్యపధ్ శిక్షణ కార్యక్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఖోయిర్పూట్ సమితి కేంద్రంలో గురు, శుక్రవారాల్లో ఆరోగ్యపధ్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాుర. ముదిలిపోడ పంచాయతీకి చెందిన మంగులి కిర్సని (43) హాజరైంది. శిక్షణ సమయంలో సహోద్యోగులతో నవ్వుతూ అప్పటివరకు ఆనందంగా ఉన్న ఆమె గురువారం సాయంత్రం స్పృహతప్పి పడిపోయింది. ఆమెను వెంటనే తోటి ఉద్యోగులు ఖోయిర్పూట్ ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. దీంతో తోటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి గురయ్యారు. కాగా శుక్రవారం ఆశ వర్కర్ల సంఘం ప్రతినిధులు మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలాయనికి వచ్చి తమతో పని చేసి మంగులి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని, పిల్లలు ఉండేందుకు ఇల్లు, పిల్లల చదువుకు ప్రభుత్వ సహయం, కుటుంబంలో ఒకరికు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. -
బయటకు వచ్చిన రైల్వే ట్రాక్
కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే మార్గంలో జయపూర్–కొరాపుట్ రైల్వే స్టేషన్ల మధ్య జర్తి–మాలిగూడ మధ్య కనుమరుగైన రైల్వే ట్రాక్ బయట పడింది. ఈ ప్రదేశంలో బుధవారం మట్టి, కొండ చరియలు వర్షం వల్ల ట్రాక్ మీదకు చొచ్చుకు వచ్చి న విషయం పాఠకులకు విధితమే. మూడు రోజులు గా రైల్వే సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి ట్రాక్ని వెలికి తీశారు. ట్రాక్ మీద ఉన్న మట్టి,బండ రాళ్లని తొలగించారు. శుక్రవారం సాయంత్రం ట్రాక్ పూర్తిస్థాయిలో కనిపించింది. ట్రాక్ పటిష్టత పరిశీలన జరుగుతుంది. ఈ ఆపరేషన్లో 25 వేల క్యుబిక్ బురదని ట్రాక్ మీద నుంచి తొలగించారు. 16 హెవీ ఎర్త్ మూవర్స్ రాత్రింబవళ్లు పనిలో నిమగ్నమయ్యాయి. 300 మంది సిబ్బంది, కార్మికులు, టెక్నికల్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు ప్రకటించారు. వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోరా, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘల్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంకువాల్ ఈ ట్రాక్ పునరుద్ధరణతో హర్షం వ్యక్తం చేశారు. కొరాపుట్ నుంచి యథావిధిగా రైళ్లు కొరాపుట్ నుంచి రైళ్లు యథావిధిగా నడుస్తాయి. కొరాపుట్–కోల్కత, కొరాపుట్–భువనేశ్వర్, కొరాపుట్–విశాఖ పట్నంలో రైళ్ల రాకపోకల్లో మార్పేమి లేదు. అన్ని రైళ్లు ఈ మార్గంలో నడుస్తున్నాయి. ఇక కిరండోల్–కొరాపుట్ మార్గంలో ట్రాక్ పటిష్టత పూర్తయిన తర్వాత రైళ్లు నడుస్తాయి. రథయాత్ర ప్రత్యేక రైళ్లు రద్దు పూరి రథయాత్ర కోసం జగదల్పూర్–పూరి, విశాఖ పట్నం–పూరికి ప్రత్యేక రైళ్లని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కానీ వెళ్లాల్సిన రెండు ర్యాక్లలో ఒకటి కిరండోల్ దగ్గర ఒకటి,అంబుగాం దగ్గర మరోకటి ఉండి పోయాయి. ఈ రెండు ర్యాక్లు వెళ్లే లోపు ఇక్కడ ప్రమాదం జరి గింది. దీంతో శుక్ర వారం రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటన చేసింది.ఈ నెల 5,7 తేదీల్లో జగదల్పూర్ నుంచి పూరీ వెళ్లాల్సిన రైళ్లు, 6న విశాఖ–పూరి, 7న పూరి–విశాఖ పట్నం ప్రత్యేక రథయాత్ర రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది. -
జనావాసాల్లో చిరుత సంచారం
కొరాపుట్: జనావాసాల్లో చిరుత పులి సంచా రం ఆందోళన రేకెత్తించింది. శుక్రవారం వేకువజామున నబరంగ్పూర్ జిల్లా సరిహద్దు చత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్లోని ఇమిలి పరాలో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద చిరుత కనిపించింది. కాలనీ వద్ద ప్రహరీపై చిరుత కదలికలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. నేటి నుంచి కేంద్ర మంత్రి పర్యటన కొరాపుట్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శని, ఆదివారాల్లో కొరాపుట్ జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నిత్యానంద గోండో ప్రకటించారు. శుక్రవారం జయపూర్ పట్టణంలో జగత్ జనని జంక్షన్ వద్ద బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించా రు. శనివారం ఉదయం కొరాపుట్ జిల్లా ధమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) వద్దకు కేంద్రమంత్రి చేరుకుంటారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జగన్నాథ శ బరి శ్రీక్షేత్రంలో జరగనున్న మారు రధాయాత్ర బహుడాలో పాల్గొంటారు. అనంతరం కేంద్రి య విశ్వ విద్యాలయంలో రూ .480 కోట్లతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తా రు. ఆదివారం జయపూర్ పట్టణంలోని జగన్నాధ సాగర్ సమీపంలో పంచానన్ మందిర్ సమీపంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్ధాపన చేస్తారు. కేంద్ర ప్రభుత్వ అకాంక్ష జిల్లాలో ఉన్న కొరాపుట్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమీక్ష చేస్తారు. ఈ పథకాలు త్వరగతిన ప్రజలకు చేరేందుకు దిశ నిర్దేశం చేస్తారు. సమావేశానికి అవిభక్త కొరాపు ట్ జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తారని మంత్రి నిత్యానంద గోండో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న కొరాపుట్ జిల్లాలో బీజేపీని పటిష్టత చేస్తారని మంత్రి పేర్కొనా రు. సమావేశంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘు రాం మచ్చో, బీజేపీ నాయకుడు గౌతం శాంత్ర ఉన్నారు. రైతులను కోలుకోలేని దెబ్బ తీసిన వర్షాలు జయపురం: కొద్దిరోజులుగా జయపురం సబ్డివిజన్లో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. పలు ప్రాంతాలలో రబీ ధాన్యం పంట కోతలు జరిగిన తరువాత కొంత పంట నూర్పులు జరిగినా మరికొంత పంట కోతలు జరగి పొలాలోనే ఉన్నాయి. ఆ సమయంలో వర్షాలు పడటం వలన ధాన్యం మొక్కలు మొలిచాయని జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి రాణీగుడ పంచాయతీ సర్గిగుడ గ్రామ రైతులు వెల్లడించారు. ధాన్యం కోతలు జరిగి నూర్పులు ప్రారంభించే సమయంలో వర్షాలు పడటంవలన ధాన్యం మొలకలొచ్చాయని, వర్షం నుంచి ధాన్యం మరో సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు విరామం లేకుండా పడిన వర్షాలు వలన అవరోధం ఏర్పడిందని రైతులు వాపోయారు. ఆ గ్రామంలో మనోజ్ కుమార్ మహంకుర తన 5 ఎకరాలలో వరి పండించగా వచ్చిన 130 క్వింటాళ్ల ధాన్యం వర్షాలు కారణంగా మొలకలెత్తయని వారు వెల్లడించారు. విద్యార్థులకు చదువు కష్టాలు! పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా బ్లాక్లో స్కూల్కు వెళ్లడానికి విద్యార్థులు పడరాని కష్టాలు ఎదుర్కుంటున్నారు. మోహానా బ్లాక్ గరడమా పంచాయతీ రాజఖమా గ్రామస్తులు వర్షాకాలంలో కిలోమీటరున్నర నడిచి గడపుర్ నదిని దాటి బడసాయి స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. స్వాతంత్య్రం సాధించి 76 ఏళ్లు గడిచినా గడపూర్ నదిపై వంతెనను ప్రజాప్రభుత్వాలు నిర్మించలేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. మోహానా బ్లాక్ ఖుంబర్పాడ, రాంసింగ్, గురిమెరా, బెత్తగుండ, బెముడిపద, చిందన్కపంక, లుటిపదర్, గురుఝలి, బలిబంద, గంగుడిపంకల్ మరియు రాజఖమా గ్రామాలకు వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో బాహ్యాప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. -
ఘనంగా వనమహోత్సవం
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు, జయపురం అటవీ డివిజన్ సహకారంతో శుక్రవారం నుంచి మహోత్సవ వారోత్సవాలను ప్రారంభించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో జీవరాశి మనుగడకు చెట్లు ఎంతో అవసరం అన్నా రు. ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి పర్యవేక్షణ లో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి మొ దట మొక్కలు నాటి వనమహోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ విచారపతి స్వయం ప్రకాశ్ దాస్, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యామయి సునీత, సివిల్ కోర్టు రిజస్ట్రార్ విష్ణు ప్రసాద్ బెహర పాల్గొన్నారు. -
భయపెడుతున్న వరద
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో నదులు కట్టలు తెంచుకున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతంగా కొరాపుట్ జిల్లా కొట్పాడ్లో 152 మిల్లీమీటర్లు పడింది. ఈ విషయం రాష్ట్ర వాతావరణ శాఖ ప్రత్యేక బులెటిన్లో ప్రకటించింది. లమ్తాపుట్ సమితిలో ఆంధ్రా–ఒడిశా ఉమ్మడి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాచ్ఖండ్లో డీ డ్యాం లో 6,7 గేట్లు ఎత్తేశారు. ఈ రెండు గేట్ల నుంచి క్యూసెక్కుల నీటిని చిత్రకొండ జలపాతానికి వదిలారు. డ్యామ్ సామర్థ్యం 2,590 అడుగులు కాగా అక్కడ 2,588 అడుగుల వరకు నీటి పరిమాణం వచ్చింది. గత ఐదు రోజుల్లో ఈ బేసిన్లో 262 మిల్లీ మీటర్ల వర్షం పడింది. దీంతో నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డ్యామ్లో 2,586.5 అడుగుల నీరు ఉంది. రైతుల కష్టాలు కుంద్రా సమితిలో పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయింది. 25 ఎకరాల పంట పొలంలో ధాన్యం మొలకలెత్తాయి. ఈ రైతులకు ధాన్యం కొనడానికి ఇప్పటికే ప్రభుత్వం టోకెన్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ ధాన్యం ఏం చేయాలో తెలియక రైతులు రోదిస్తున్నారు. లమ్తాపుట్ సమితిలో కల్వర్టు వద్ద నీరు ప్రవహిస్తోంది. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ సమీపం డొడ్ర వద్ద రోడ్లు తెగి వర్షం నీరు పారుతోంది. ఈ ప్రాంతాన్ని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రమేష్ సాహు సందర్శించారు. పరిస్థితి మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లారు. కొరాపుట్ జిల్లాలో 47 ఇళ్లు ధ్వంసం గురువారం ఉదయానికి కొరాపుట్ జిల్లాలో వర్షాల వల్ల 47 ఇళ్లు కూలి పోయాయి. బాధిత ప్రజలు తమ వద్దకు ప్రభుత్వ సిబ్బంది వచ్చి పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నందపూర్ సమితి సెమలా వద్ద రోడ్డు పై భారీవృక్షం కూలి పోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందపూర్ అగ్ని మాపక బృందం వచ్చినప్పటికీ భారీ వృక్షం కావడంతో తొలగించడం కష్టమైంది. దీంతో స్థానిక గిరిజనుల సాయంతో చెట్టును తొలగించారు. నబరంగ్పూర్ జిల్లా ఖాతీ గుడకి వెళ్లే మార్గంలో లమ్తాగుడ వద్ద కల్వర్టు మునిగి పోయింది. దీంతో ఇంద్రావతి నుండి జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. -
కిరండోల్–కొత్తవలస రైల్వేలైన్ పునరుద్ధరణ
కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్ పునరుద్ధరణ కోసం భారీ ఎత్తున్న రైల్వే సిబ్బంది మోహరించారు. బుధవారం కొరాపుట్–జయపూర్ రైల్వే స్టేషన్ల మార్గంలో జర్తి–మాలిగుడల మధ్య పెద్ద ఎత్తున మట్టి చరియలు ట్రాక్ మీదకు చొచ్చుకువచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. బుధవారం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు రైల్వే సిబ్బంది మట్టిని తొలగించడానికి పనులు చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాలు పనులకు ఆడ్డంకిగా మారాయి. 13 హెవీ జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రక్లు, సుమారు 300 మందికి పైగా కార్మికులు ఈ పనులలో నిమగ్నమయ్యారు. రాళ్లు తొలగిస్తున్నప్పటికీ వర్షం నీరు వస్తుండడంతో పనులు మరింత ఆలస్యం అవుతున్నాయి. రాయగడ రైల్వే డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ సంఘటన స్థలంలో టెంట్ వేసుకొని మకాం వేశారు. రాత్రింబవళ్లు డీఆర్ఎం అక్కడే ఉండడంతో పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి.ఇప్పటికే జగదల్పూర్–భువనేశ్వర్, జగదల్పూర్–రౌర్కెలా, కిరండోల్– విశాఖ పట్నం ప్యాసింజర్, కిరండోల్–విశాఖపట్నం నైట్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. గురువారం కూడా కిరండోల్–కొరాపుట్ల మధ్య రైళ్లు నడవలేదు. కొరాపుట్ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని రైళ్లు నడుపుతున్నారు. శుక్రవారం ఉదయానికి పునరుద్ధరణ పనులు పూర్తవ్వవచ్చని రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘల్ ప్రకటించారు. -
క్రీడా రత్నాలు
భువనేశ్వర్: ప్రపంచ క్రీడా వేదికపై ఒడిశా పోలీసు క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. అమెరికా బర్మింగ్హామ్లో జరిగిన ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2025లో కరాటే, 800 మీటర్లు, 1500 మీటర్లు పందెంలో బంగారు పతకాలు సాధించారు. మరిన్ని తేజోవంతమైన విజయాలతో వీరి భవిష్యత్ ఉజ్వలం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. కరాటే (64 కిలోల లోపు) విభాగంలో కానిస్టేబుల్ భగవాన్ రెడ్డి, పురుషుల (84 కిలోల లోపు) కరాటే పోటీలో కానిస్టేబుల్ సుమన్ శేఖర్ దాస్ బంగారు పతకాలు సాధించారు. మహిళల 1500 మీటర్ల రేసులో కానిస్టేబుల్ సుష్మితా టిగ్గా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె గతంలో 800 మీటర్ల రేసులో రజత పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 1500 మీటర్లు మరియు 800 మీటర్ల రేసులో కానిస్టేబుల్ అశోక్ దండసేన వరుగా 2 బంగారు పతకాలు చేజిక్కించుకున్నాడు. -
జయపూర్ యువరాజుకి గిరిజనుల కానుకలు
కొరాపుట్: జయపూర్ రాజా నగర్లోని మోతిమహల్ కి నందపూర్ నుంచి గిరిజనులు తరలి వచ్చారు. యువరాజు విశ్వేశ్వర చంద్ర చుడ్ దేవ్కి అటవీ ఉత్పత్తులు బహూకరించారు. తలపాగా కట్టి రాజరిక గౌరవం చేశారు. యువరాజు చంద్ర చుడ్ ఇటీవల నందపూర్ రథయాత్రలో రథ నిర్మాణం కోసం రు.లక్ష విరాళం పంపించారు. అక్కడ జగన్నాథ పూజా కమిటీకి చెందిన ప్రదీప్ దాస్, జగన్నాఽథ్ పంగి, కాశీనాథ్, భువనేశ్వర్ దళపతి, అజయ్ ఖెముండు తదితరులు వచ్చి ప్రసాదాలు అందిచారు. అనేక దశాబ్దాలుగా మోతీ మహల్ తలుపులు తెరవలేదు. ప్రస్తుత యువరాజు చంద్ర చుడ్ దేవ్ అలహాబాద్లో బాల్యం గడిపి ఇటీవలే జయపూర్ సంస్థానానికి తిరిగి వచ్చారు. తమ వంశీయుల సంప్రదాయాలు కొనసాగించడానికి ప్రజలకు సహాయ సహాకారాలు ప్రారంభించారు. ఇటీవలే ఆంధ్రా యూనివర్సిటీకి రు.లక్ష పంపించారు. -
అలరించిన గుహారి
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా కొనసాగుతున్న గుహారి భక్తి, ఆధ్యాత్మిక సంగీత ఉత్సవం శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. స్థానిక ఉత్కళ రంగస్థలంపై ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతిశాఖతో కలిసి గురు కేలూ చరణ్ మహాపాత్రో ఒడిస్సీ పరిశోధన కేంద్రం ఈ ఉత్సవం నిర్వహించింది. జగన్నాథుని ఆధారంగా రూపొందించిన గాయకుల భక్తి సంగీత ప్రదర్శన ఉత్సవంలో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. గాయకులు మహాప్రసాద్ కొరొ, అనుసూయ నాథ్, బసంత పాత్రో, సృష్టి సురూప, అలోక్ కుండు, నిషి ప్రభ పాణి, ప్రభాత్ కుమార్ పాత్రో, దీప్తి దా్స్, దిబ్యరంజన్ దాస్ జగన్నాథునిపై ఆధారిత భుజ తాళే, అహే నీలగిరి, దుఃఖ నాశన హే, ఏహి కఠారే మో మన, మొన్నొ రే హరి భజన, పతితపావన బన్నా, రాధా శ్రీపాద బ్రజా, జై జగబంధు హే జాదు నందన, జై జై జగన్నాథ్ తదితర భక్తి గీతాలు ఆలపించారు. దుష్మంత్ కుమార్ పరిడా (తబలా), వైభవ కుమార్ దాస్ (డ్రమ్), ప్రీతి రంజన్ స్వంయి (వేణువు), సుధాంశు శేఖర్ జెనా (ఆక్టోపాడ్), చింతామణి మిశ్రా (కీబోర్డ్), సుమంత మహరణ (హార్మోనియం) వాద్య సహకారం అందజేశారు. ప్రముఖ గాయని పద్మశ్రీ శ్యామ మణి దేవి, ఒడిస్సీ నృత్యకారిణి పద్మశ్రీ కుంకుమ్ మహంతి, ప్రఖ్యాత గాయని గీతా పట్నాయక్, ప్రముఖ పండితుడు డాక్టర్ కీర్తన్ నారాయణ్ పర్హి, జీకేసీఎం ఒడిస్సీ రీసెర్చ్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనుజా తరిణి మిశ్రా అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ మృత్యుంజయ రథ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
తెలంగాణ పేలుడులో నబరంగ్పూర్ వాసులు
కొరాపుట్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేలుడులో ఇద్దరు జిల్లా వాసులు మృతి చెందారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితిలో అనేక గ్రామాలకు ఈ సమాచారం వచ్చింది. సంగారెడ్డి జిల్లా పాశమైలవరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి సుమారు 45 మంది మృతి చెందారు. ఇదే పరిశ్రమలో నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి కొడాబెట్ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ (30), చైతు బోత్ర (31) లు మృతి చెందారని సమాచారం వచ్చింది. సమితిలో కోడాబెట్ గ్రామంతో పాటు బుబాలిబెధ, పరసాల గ్రామాలకు చెందిన అనేక మంది యువకులు ఇదే పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొడాబెట్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులలో ఇద్దరు మాత్రమే పనికి వెళ్లారు. వారి మృతదేహాలను అక్కడ మార్చురీలో ఉంచినట్లు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. మృతుల బంధువుల డీఎన్ఏ కావాలని సమాచారం రాగా ఇక్కడ నుండి కొందరు యువకులు సంగారెడ్డి బయలు దేరి వెళ్లారు. -
జాతీయ స్థాయి బూత్ అధికారుల శిక్షణ ప్రారంభం
పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం హాల్లో గురువారం జాతీయ స్థాయి బూత్ అధికారుల శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మాయాధర్ సాహు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా, జిల్లా సామాజిక సురక్షా అధికారి సంతోష్ కుమార్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ శిక్షణ శిబిరంలో 136– మోహానా అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ సంఖ్య 297, 137– పర్లాఖిముండి నియోజికవర్గంలో 276 బూత్లు ఉన్నాయి. ఓటరు జాబితాలో కొత్తగా చేరాలనుకున్నావారు ఫారం 6, ఫారం 6(బి) ఓటరు పరిచయ పత్రానికి ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. ఫారం 8 ఓటరు జాబితాలో తన పేరు, అడ్రస్ సవరణ చేయాలన్నారు. ఓటర్లు నమోదు చేయడానికి ఓటరు హెల్ప్ లైన్లో బూత్ అధికారులకు ఫారం 6, 7, 8, 6(బి)ను అందజేయలన్నారు. ఈ శిక్షణ శిబిరంలో మోహానా అసెంబ్లీ నియోజకవర్గం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కొరాపుట్ జిల్లాలకు సముచిత స్థానం
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల ప్రజలకు రాజధానిలో సుముచిత స్థానం ఉంటుందని సీఎం మోహన్చరణ్ మాఝి అన్నారు. గురువారం రాజధానిలోని శబరి సాంస్కృతి సంసద్ సంస్థ ద్వారా నిర్మితమైన సాహిద్ భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలైన కొరాపుట్, నబరంగ్పూర్, రాయగడ, మల్కన్గిరి జిల్లాల ప్రజలకు ఈ భవనం ఎన్నోవిధాలుగా ఉపయెగపడుతుందన్నారు. శబరి అంటే సవర అనే పదం నుంచి మార్పు అన్నారు. అటువంటి శబరి పేరు భవనానికి ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. అనేక గిరిజన సంస్కృతులు, కళలకు ఈ జిల్లాలు నిలయాలని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రి నిత్యానంద గోండో, ఎంపీలు మున్నాఖాన్, బలభద్ర మజ్జి, మాజీ మంత్రులు రమేష్ చంద్ర మజ్జి, జగన్నాథ సారక, ఎమ్మెల్యేలు తారాప్రసాద్ బాహీణీపతి, గౌరీ శంకర్ మజ్జి, నర్సింగ్ బోత్ర, రుపుధర్ బోత్ర, రఘురాం మచ్చో, అప్పలస్వామి కడ్రక, నీలమాధవ్, మడ్కామి తదితరులు పాల్గొన్నారు. సీఎం మోహన్చరణ్ మాఝి -
బహుడాకు రథాలు సిద్ధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర ఆద్యంతాలు యుద్ధ సన్నాహమే. భక్తి శ్రద్ధల మేళవింపుతో స్వామి యాత్ర అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. స్వామి భక్తులు విభిన్నం. భగవంతుని అపురూప దర్శనం కోసం పరిమితం కాకుండా భక్తి భావోద్వేగంతో స్వామి యాత్రలో అడుగడుగున ప్రత్యక్ష పాత్రధారులుగా పాలుపంచుకుంటారు. అగణిత భక్త జనం మధ్య స్వామి ఆప్యాయ అనురాగాలతో యాత్రలో పాల్గొంటాడని వీరి విశ్వాసం. ఇదే స్ఫూర్తితో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణ నుంచి శ్రీ గుండిచా నక్కొ చొణ ద్వారం ఆవరణకు యాంత్రిక, సాంకేతిక వినియోగం లేకుండా 3 భారీ రథాల్ని సురక్షితంగా గమ్యం చేర్చారు. ఇదే తరహాలో మారు రథ యాత్రకు 3 రథాలు సిద్ధమయ్యాయి. వర్షం ప్రభావంతో బుధవారం నాడు ప్రారంభించిన రథాల మలుపు కార్యక్రమం పాక్షికంగా పూర్తయ్యింది. శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథం లాగే సమయానికి కుండపోత వాన కురవడంతో వాయిదా పడింది. మరునాడు గురువారం ఉదయం నందిఘోష్ రథాన్ని లాగి శ్రీ గుండిచా నక్కొచొణ ద్వారం ముంగిటకు పోలీసు జవానులు చేర్చారు. -
రాష్ట్ర గవర్నర్తో కలిసిన మోంటానా ప్రతినిధి బృందం
భువనేశ్వర్: భారత దేశ ఘనమైన సంస్కృతి, కళలు, సామాజిక పురోగతి రంగాల్లో వైవిధ్యాన్ని అన్వేషించాలని అమెరికాలో మోంటానా ప్రతినిధి బృందాన్ని గవర్నర్ కోరారు. ట్రెక్ 2025 కార్యక్రమం కింద 10 మంది సభ్యుల మోంటానా ప్రతినిధి బృందం గురువారం రాజ్ భవన్న్లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటిని కలిసింది. ఇలాంటి సందర్శనలు వివిధ దేశాల ప్రజల మధ్య మెరుగైన అవగాహనను పెంపొందించడానికి సహాయపడతాయని గవర్నరు అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సభ్యులు రాజ్ భవన్ సందర్శించారు. జన జీవనం అస్తవ్యస్తం జయపురం: జయపురం సబ్డివిజన్లో భారీ వర్షాలు పడుతుండగా జయపురంలో అత్యధికంగా 73.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొయిపరిగుడ సమితిలో 73 మిల్లీ మీటర్ల వర్షం నమోదు కాగా జయపురం, బొయిపరిగుడ సమితిలో జన జీవనం అస్తవ్యస్తమైంది. జయపురం పట్టణంలోని పలు వీధుల్లో వరద నీరు మోకాలు ఎత్తున పారింది. పదికిపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బి.సునీత ముంపుకు లోనైన ప్రాంతాలను తిరిగి పరిస్థితిని సమీక్షించారు. విజయవాడ– రాంచీ 326 జాతీయ రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుప్తేశ్వర వెళ్లే రహదారిలో రోడ్డు ధ్వంసమైంది. పేకాట శిబిరంలో రూ.3.66 లక్షలు స్వాధీనం పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్ కుర్లండ గ్రామశివార్లలో జీడితోటలో పేకాట శిబిరంపై పర్లాకిమిడి ఆదర్శపోలీసు స్టేషన్ సిబ్బంది దాడిచేసి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3.66 లక్షలు, 30 టూవీలర్స్ బైక్లు, 5 ప్యాకెట్ల పేకలు స్వాధీనం చేసుకున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ తెలియజేశారు. ఏడుగురు నిందితులపై కేసును నమోదు చేశారు. బ్యాగ్ అప్పగింత భువనేశ్వర్: తొందరపాటులో రైలులో బ్యాగ్ని వదిలి దిగిపోయిన ప్రయాణికునికి టికెటు తనిఖీ అధికారి సురక్షితంగా అందజేశారు. గురువారం సిలిగురి (గువాహతి) – కోయంబత్తూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడు రాణా సర్కార్ విలువైన సామగ్రితో నిండిన బ్యాగును మరిచిపోయారు. ఖుర్దారోడ్ మండలం చీఫ్ టికెట్ ఇనస్పెక్టర్ (సీటీఐ) లక్ష్మీధర మహంతి బ్యాగును ప్రయాణికునికి అప్పగించారు. ప్రయాణికుని ఫిర్యాదు అందడంతో చేపట్టిన సత్వర గాలింపుతో ఇది సాధ్యమైందని సీటీఐ వివరించారు. మండల కమర్షియల్ కంట్రోల్, రక్షక దళం వర్గాల సమన్వయంతో ప్రయాణికునికి సామగ్రి సురక్షితంగా అందజేశామన్నారు. కలెక్టర్కు కృతజ్ఞతలు కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీలు) నిర్వహణ ఇచ్చినందుకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం సాయంత్రం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కి రాణీ లక్ష్మీభాయి స్వయం సహాయక బృందం తరలివెళ్లింది. తమకు మండీలు నిర్వహణ బాధ్యత అప్పగించినందుకు కలెక్టర్ వి.కీర్తి వాసన్కి అభినందించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ 2 నుంచి 30వ తేదీ వరకు మండీలు నిర్వహించామన్నారు. కొరాపుట్ జిల్లాలో 14.5 లక్షల క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కలహండి, బలంగీర్ జిల్లాల నుంచి వచ్చిన మిల్లర్లు ఈ ధాన్యం కొనుగోలు చేశారన్నారు. ఈ మండీల నిర్వహణ ఎస్హెచ్జీ, పానీ పంచాయతీ, ల్యాంప్స్కి అప్పగించామని కలెక్టర్ ప్రకటించారు. -
ఎయిర్పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు
మందస: తమకు ఎయిర్పోర్టు వద్దని, పచ్చని భూములే ముద్దు అని మందస మండలం టి.గంగువాడ గ్రామస్తులు తేల్చిచెప్పారు. గ్రామానికి చెందిన చిత్త గున్నయ్య ఆధ్వర్యంలో బాధిత రైతులు కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులుగా గ్రామానికి కొందరు అధికారులు వచ్చి సర్వే పేరిట వచ్చి కొలతలు వేయడానికి మిషన్లు తీసుకురావడం బాధాకరమన్నారు. తమ భూములపై ఏ హక్కుతో కొలతలు వేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శిరీష స్పందించి తమ భూములను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో దాసరి మోహన్రావు, జోగి మోహన్రావు, రామారావు, పుక్కల్ల నారాయణ, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
భువనేశ్వర్: రాష్ట్రంలో బుధవారం వేర్వేరు రహదారి దుర్ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా దంపతులు, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మహిళా హోమ్ గార్డు, స్కూటరుని ట్రక్కున ఢీకొన్న దుర్ఘటనలో యువకుడు దుర్మరణం పాలయ్యారు. ఖుర్ధా–బొలంగీర్ 57వ నంబరు జాతీయ రహదారిపై నిలకడగా నిలిచి ఉన్న ట్రక్కుని కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుని కొడుకు, కోడలు మృతి చెందారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు భార్యతో కలిసి వెళ్తుండగా కారు ట్రక్కుని ఢీకొనడంతో దంపతులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బౌధ్ జిల్లా రంభికట టోల్గేట్ సమీపం నువాపడా కూడలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతులు నయాగడ్ గొణియా ప్రాంతానికి చెందిన రాజ్కిషోర్, మీనాక్షి సాహుగా గుర్తించారు. మరో దుర్ఘటనలో ట్రక్కు దూసుకెళ్లి మహిళా హోమ్ గార్డు దుర్మరణం పాలైంది. సైకిల్పై వెళ్తున్న మహిళా హోమ్ గార్డుపై ట్రక్కు దూసుకుని పోవడంతో దుర్మరణం పాలైంది. కటక్ నగరం ఛత్ర బజార్ అర్బన్ హట్ సమీపంలో ట్రక్కు హోం గార్డుపైకి దూసుకెళ్లింది. మృతురాలు మనోరమ పండాగా గుర్తించారు. ఆమె మాల్ గోదాం పోలీస్ ఠాణాలో హోమ్ గార్డుగా పనిచేస్తోంది. ఆమె తన విధిని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు స్కూటర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. కటక్ బాదంబాడి నుంచి లింక్ రోడ్ వెళ్తున్న స్కూటీని లింక్ రోడ్ మధుపట్న కూడలి వద్ద బస్సు స్కూటర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మృతుని ఆచూకీ తెలియాల్సి ఉంది. -
వెదజల్లుతున్న దుర్గంధం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని డైలీ మార్కెట్ వద్ద తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. బస్టాండ్ సమీపంలో రైతు బజార్ పేరిట ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఇదే ప్రధాన మార్కెట్ కావడంలో నిత్యం వందల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. అంతేకాకుండా ఆంధ్ర, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల నుంచి అనేక వస్తువులు వస్తుంటాయి. ఇక్కడ నుంచి అనేక ఉత్పత్తులు వెళ్తుంటాయి. అటువంటి మార్కెట్లో పారిశుద్ధ్యం తీవ్రంగా లోపించింది. ఎక్కడికక్కడే మురికి కుంటలు ఏర్పడ్డాయి. వాటిని శుభ్రం చేసే నాథుడే కరువయ్యాడు. మురికికూపాల పక్కన గిరిజనులు తమ ఉత్పత్తులు విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకి రెండుసార్లు మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయాలి. కానీ అలా జరగడం లేదు. చేసేది ఏమీ లేక, చెప్తే వినేవారు లేక ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ద్వారం.. సుగంధ భరితం భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయం నక్కొచొణ ద్వారం శోభాయమానంగా సుగంధం విరజిమ్ముతోంది. మారు రథ యాత్ర (బహుడా) రోజున బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథునితో చక్ర రాజు సుదర్శనుడు మూల విరాట్ల ఈ ద్వారం గుండా వెలుపలికి విచ్చేస్తారు. యాత్రలో భాగంగా అడపా మండపంపై పూజలు అందుకున్న దేవతలు తిరిగి శ్రీ మందిరంలో రత్న వేదిక చేరేందుకు వరుస క్రమంలో (గొట్టి పొహండి) బయటకు తరలి వచ్చి రథాలపై ఆసీనులు అవుతారు. అనంతరం మారు యాత్రకు రథాలు బయల్దేరుతాయి. హీరా పంచమి రోజున శ్రీదేవి కూడా ఈ ద్వారం గుండా తిరిగి వస్తుంది. నక్కొచొణా ద్వారం పైభాగం మధ్యలో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. ద్వారం ఎడమ వైపున బ్రహ్మ, కుడి వైపున మహా దేవుడు ఉంటాడు. బ్రహ్మ మరియు శివుని పైన, నవ గ్రహాలు కూడా ఉంటాయి. బహుడా యాత్ర కోసం ఈ ద్వారం ముస్తాబు అవుతోంది. భారీ రంగవళ్లులతో యాత్ర శోభ రంగరించుకుంటుంది. దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ రాయగడ: జిల్లాలోని గుడారిలో కలెక్టర్ ఫరూల్ పట్వారీ ఆదేశాల మేరకు జిల్లా సామాజిక సురక్షా అధికారి రంజిత బెహర ఆధ్వర్యంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వైద్యుల సమక్షంలో నిర్వహించిన పరీక్షల్లో వివిధ సమస్యలతో ఉన్న దివ్యాంగులకు గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలు అందేలా పేర్లు నమోదు చేశారు. కార్యక్రమంలో పద్మపూర్ సామాజిక సురక్షా అధికారి సిగ్నమయి బారిక్, పీఏ మనోజ్ కుమార్ మిశాల్, అనీల్ గౌడొ తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని బోడెమ్మకోవెల సమీపంలో బలగవీధిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి రూ.1.70 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి కె.శ్రీనుబాబు వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. గార మండలం కొర్లాం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న కుప్పిలి రామామణి బలగవీధిలో పెంకుటిల్లులో కుమారుడు లోకేష్తో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నారు. లోకేష్ విశాఖలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం విధుల నిమిత్తం రామామణి కొర్లాం వెవెళ్లింది. దేవుని గుడిలో ఉన్న దీపం ప్రమిద మంచంపై పడి మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురై ఆర్పేందుకు యత్నించారు. ఈలోగా ఫైర్ సిబ్బంది జీవీకే నాయుడు, ఎస్ ప్రసాద్, ఎం.శ్రీనివాస్, డి.శ్రీనివాస్, పి.జగన్నాథరావు, వై.పాపారావులు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామాన్లు కాలిపోయాయి. -
బీఎంసీ కమిషనర్పై దాడికి నిరసన
మల్కర్గిరి: మల్కన్గిరిలో గురువారం కూడా జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, ఓఎస్ అధికారులు పెన్డౌన్ చేశారు. భువనేశ్వర్లో బీఎంసీ కమిషనర్ రత్నకర్ సాహుపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా యునీట్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున మద్దతు తెలిపారు. రెండు రోజులుగా ప్రఽభుత్వ పనులను అపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే తిరిగి విధులు నిర్వహిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. జిల్లా క్లర్క్ సంఘం అధ్యక్షుడు సి.హెచ్.కృష్ణరావు, తదితరులు పాల్గొన్నారు. బస్సులో వర్షం నీరు ● ప్రయాణికుల అవస్థలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా భలిమెల నుంచి బరంపురం పట్టణానికి నడిచే బస్సు పైకప్పు నుంచి సీట్లపై వర్షం నీరు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ బస్సు ప్రతీరోజు మధ్యహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుతుంది. ప్రయాణికులు తడిచి ముద్దవుతున్నారు. గురువారం కూడా బస్సు బయలిదేరినప్పుడు సీట్లు పూర్తిగా తడిచిపోయి ఉండటంతో కండక్టర్ను ప్రయాణికులు అడిగితే ఏ మాత్రం పట్టించుకోలేదు. తాము ఏమీ చేయలేమని, పైఅధికారులతో సంప్రదించాలని డ్రైవర్, కండక్టర్ చెప్పారు. రూ.600 టికెట్ కొని నరకయాతన పడి ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంపై బరంపురం డీటీఎం అరవింద్ మహంతిని వివరణ కోరగా.. బస్సు పైకప్పును బాగు చేస్తామన్నారు. శుక్రవారం నుంచి ఆ బస్సు స్థానంలో మరొక బస్సును పంపుతామన్నారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్, కండక్టర్పై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ షాక్తో భవన నిర్మాణ కార్మికుడు మృతి ఆమదాలవలస/ఎచ్చెర్ల: ఆమదాలవలస మున్సి పాలిటీ పరిధిలోని చొట్ట వానిపేట కాలనీలో గురువారం విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెంద గా మరొకరు గాయపడ్డారు. స్థానికులు తెలిపి న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చొట్టవానిపేట కాలనీలో గొర్లె పెంటయ్య ఇంటి నిర్మా ణం జరుగుతోంది. లావేరు మండలం చిన్నమురపాకకు చెందిన గేదెల లక్ష్మణ్(40), మురపాక రమణ రాడ్ బెండింగ్ పనుల కోసం గురువారం వచ్చారు. ఇనుప రాడ్లను భవనంపైకి తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగలగడంతో షాక్కు గురై కిందపడ్డారు. ఈ ఘటనలో లక్ష్మ ణ్ అక్కడికక్కడే మృతిచెందగా రమణ తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఆమదాలవలస పోలీసులు తెలిపారు. మృతుడు లక్ష్మణ్కు భార్య అసిరితల్లి, ఇద్దరు కుమారులు భాస్కరరావు, బాలరాజు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
మోహన్ సర్కారుకు అగ్ని పరీక్ష
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాల ప్రతిష్టంభన నెలకొంది. అధికారిపై కొందరు నేతలు దాడికి పాల్పడడంపై ప్రభుత్వ అధికారుల ఆగ్రహం చల్లారడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సర్కారుకు అగ్ని పరీక్షగా ఎదురైంది. మంత్రుల ఓదార్పు, సానుభూతి చర్యలకు ఓఏఎస్ అధికారులు తలొగ్గకుండా దాడి తెర వెనక వాస్తవ సూత్రధారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి అరెస్టు డిమాండ్తో ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు సామూహికంగా ఉద్యమిస్తున్నారు. ఈ మేరకు స్థానిక ఠాణాలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రభావిత ఓఏఎస్ అధికార వర్గం డిమాండ్ మేరకు చర్యలు చేపట్టేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, ముఖ్యమంత్రి ఎవరి తరహాలో వారు మంత్రులు, కార్యవర్గ సభ్యులు తదితర ప్రముఖులతో ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. బుధవారం నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ చేతులెత్తేసింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని బహిరంగంగా ప్రకటించి తప్పుకుంది. రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలుకుబడి, పరపతికి అతీతంగా నిందితులు ఎవరైనా వారి వ్యతిరేకంగా చర్యలు తథ్యమని భరోసా ఇస్తున్నారు. మోహన్ చరణ్ మాఝి కొలువులో ఇరువురు ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్దేవ్, ప్రభాతి పరిడా ఇంత వరకు పెదవి కదపలేదు. ఓఏఎస్ అధికారిపై దాడిలో ప్రధాన సూత్రధారిగా బీజేపీ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యుడు జగన్నాథ్ ప్రధాన్కు వ్యతిరేకంగా స్థానిక ఠాణాలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలైంది. నాలుగు రోజులు గడిచినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. 3 రోజులే గడువు: ఓఏఎస్ సంఘం తొలుత 24 గంటల్లో చర్యల్ని ఆశించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ, హామీ పట్ల నమ్మకంతో 3 రోజుల పాటు సహనంతో మెసులుకుని ప్రభుత్వానికి సహకరిస్తామని ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సంఘం (ఓఏఎస్ఏ) చెప్పింది. మంత్రి అభ్యర్థన మేరకు అధికారులు అత్యవసర సేవల కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర కార్యకలాపాలకు ఏ మాత్రం అంతరాయం లేకుండా నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. పూరీ రథ యాత్రలో దాదాపు 100 మంది అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఓఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రిపై పూర్తి నమ్మకం ఉందని ఓఏఎస్ఏ ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ప్రత్యక్షమయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, జగన్నాథ్ ప్రధాన్ మధ్య బుధవారం రాత్రి సుమారు మూడు గంటలు పైబడి నిర్విరామంగా జరిగిన చర్చల నేపథ్యంలో ప్రకాష్ మిశ్రా సందర్శించినట్లు స్పష్టం అవుతుంది. -
ఉత్తర ఒడిశాలో వరద ఉధృతి
● ఏరియల్ సర్వే నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి భువనేశ్వర్: ఉత్తర ఒడిశాలో ఎడతెరిపి లేని వానలతో పలు నదులు ఉప్పొంగాయి. జనావాసాలు వరద నీటిలో మునిగాయి. ఒడ్రాఫ్, తదితర వర్గాల సకాల సహాయ, సహకారాలతో చిరు ప్రమాదాలు మినహా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. గురువారం ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధానంగా బాలాసోర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. భొగొరాయి, బలియాపాల్, బొస్తా, జలేశ్వర్, బాలాసోర్ సదర్, రెముణ తదితర ప్రాంతాల్ని సందర్శించారు. ఈ జిల్లాలోని 6 మండలాల్లో 154 గ్రామాలు, జలేశ్వర్ మునిసిపాలిటీలోని 8 వార్డులు వరద నీటితో ప్రభావితమైనట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి ఆశ్రయంతోపాటు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం ఒడ్రాఫ్, అగ్నిమాపక దళాలను నియమించారు. కెంజొహర్ జిల్లాలో వరద ఉధృతి కెంజొహర్ జిల్లా జోడా కాన్పూర్ ప్రాంతంలో తాత్కాలిక మట్టి కట్ట తెగడంతో వరద నీరు జనావాస ప్రాంతాల్లోకి వెళ్లింది. ఎటువంటి హాని జరగకుండా సత్వర చర్యలు చేపట్టినట్లు ఆనకట్ట చీఫ్ ఇంజినీర్ తెలిపారు. -
జయపూర్లో పట్టపగలు రూ.లక్ష లూటీ
కొరాపుట్: జయపూర్ పట్టణంలో దోపిడీ దొంగలు పట్టపగలు చెలరేగిపోయారు. గురువారం సాయంత్రం బెల్ రోడ్డులో ప్రజలందరూ చూస్తుండగా దోపిడీ చేశారు. హడియా గ్రామానికి చెందిన గిరిజన రైతు కమలోచన్ బోత్ర తనకు ప్రభుత్వం నుంచి అందిన రు.3.9 లక్షల నగదు ఎంజీ రోడ్డులోని షిర్డీ సాయి మందిరం సమీపంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో డ్రా చేశాడు. తనతో వచ్చిన గిరిజనులతో కలిసి బెల్ రోడ్డు గుండా రాజానగర్ వెళ్లి హడియా గ్రామానికి వెళ్లాలని బయలుదేరాడు. వాహనం బెల్ రోడ్డులో వెళ్తుండగా సొంబారు తోట సమీపంలో పంచముఖ హనుమన్ విగ్రహ సమీపంలో ముగ్గురు యువకులు రోడ్డుకు అడ్డంగా వచ్చి వాహనం ఆపారు. ఒక యువకుడు బోలిరోలో ఉన్న నగదు సంచి లాగడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే తేరుకున్న కమలోచన్ బోత్ర సంచి గట్టిగా పట్టుకున్నాడు. బోలోరోలో ఉన్న మిగతా గిరిజనులు స్పందించే లోపు రు.లక్ష నగదు (రెండు యాబై వేల కట్టలు) పట్టుకొని పరారయ్యారు. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్బీఐలో గిరిజనులు డబ్బులు డ్రా చేసినప్పటి నుంచి దొంగలు అనుసరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
వంతెన గోడను ఢీకొట్టిన వ్యాన్
● రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన అరటి గెలలు టెక్కలి రూరల్: బొప్పాయిపురం సమీపంలో జాతీ య రహదారిపై గురువారం వేకువజామున జరిగి న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాన్ వంతెన గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాల తో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రావులపాలెం నుంచి ఒడిశా వైపు అరటి గెలల లోడుతో వెళ్తున్న వ్యాన్ టెక్కలి సమీపంలో బొప్పాయిపురం వద్దకు వచ్చేసరికి ఇరుకు వంతెన ఉండటంతో గమనించక వంతెను గోడను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ శాంతన్ శెట్టికి స్వల్ప గాయాలు కాగా.. వ్యాన్ రెండు భాగాలుగా విడిపోవడంతో అరటిగెలలు రోడ్డుపై పడిపోయా యి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఘట నా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పకి తరలించారు. అనంతరం ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
● చిత్రకారులకు ఘన సత్కారం
జయపురం: స్థానిక విక్రమ ఆర్ట్స్ అండ్ క్రాఫ్టు కళాశాలలో రథాయాత్ర సందర్భంగా నిర్వహించిన ధారుదేవత చిత్రాల వర్క్షాపుల్లో పాల్గొని జగన్నాథుని వివిధ రూపాలతో విద్యార్థులు వేసిన చిత్రలను సిమ్మాద్రి మహారాణ కళా భవనంలో బుధవారం ప్రదర్శించారు. ఈ చిత్రాలతో పాటు డాక్టర్ పరేష్ రథ్ ప్రదర్శించిన జయపురం చారిత్రిక చిత్రాల ప్రదర్శన కూడా ఈ భవనంలోనే జరుగుతోంది. ఈ ప్రదర్శనలో ధారు దేవతపై 40 చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర కారులైన విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాహిణీపతి ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ ప్రదర్శన ఈ నెల ఐదో తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ఝుధిష్టర్ మల్లిక తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్ర కళలో విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఒడిశాలో ప్రథమ శ్రీవిక్రమ అర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలను ఇంకా అభివృద్ధి చేయాలని.. అందుకు తాను చేయూతనిస్తానని అన్నారు. కార్యక్రమంలో కొరాపుట్ భారతీయ జాతీయ కళా సాంస్కృతిక చారిత్రిక ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రఫుల్ల చంద్ర మహారాణ, కొరాపుట్ కోట్స్ (కౌన్సిల్ ఆఫ్ అనాలిటికల్ ట్రైబుల్ స్టడీష్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరేష్ రథ్ పాల్గొన్నారు. అతిథులకు ధారుదేవత చిత్రాలను నిర్వాహకులు అందజేశారు. -
● ప్రజా సేవలు బంద్
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో బుధవారం ప్రజా సేవలు స్తంభించాయి. భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో జాయింట్ కమిషనర్ రత్నాకర్ సాహుపై బీజేపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. రత్నకర్ సాహు అత్యధిక కాలం నబరంగ్పూర్, కొరాపుట్ జిల్లాలో పని చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో హత్యాయత్యాన్ని నిరసి స్తూ నబరంగ్పూర్ జిల్లాలో ఓఏఎస్ అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్ర భుత్వ కార్యాలయాలలో ప్రజలకు సేవలు నిలిచి పోయాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఏఎస్ అధికారులు భారీ వర్షంలో ర్యాలీ నిర్వహించారు. తమ సహచర ఓఏఎస్ అధికారిపై జరిగిన దాడిని ఖండించారు. భద్రత లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లలేమని నినాదాలు చేశారు. ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో జిల్లాస్థాయి ముఖ్య కార్యాలయాలు వెలవెలబోయాయి. జయపూర్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి దాడులను సహించమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ పార్టీల కార్యకర్తల దాడులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర రెవెన్యూ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సాహు నబరంగ్పూర్లో మాట్లాడుతూ.. రత్నకర్ సాహుకి తాము అండగా ఉన్నామని ప్రకటించారు. మున్సిపల్ అధికారిపై బీజేపీ కార్తకర్తల దాడి నేపథ్యంలో మూకుమ్మడి సెలవులో ఉద్యోగులు -
లైంగిక దాడి కేసులో ఒకరి అరెస్టు
జయపురం: జయపురంలో ఉంటున్న హర్యానకు చెందిన మహిళపై జరిగిన లైంగిక దాడిలో కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు మహిళా పోలీసు అధికారి ఆశ్రిత ఖాల్కో బుధవారం వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక మహాత్మా గాంధీ రోడ్డు గాంధీచౌక్ పరిదికి చెందిన దేవ్ సోనిగా తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు. కోర్టు బెయిల్ నిరాకరించటంతో జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసు అధికారి తెలిపిన వివరాలు ప్రకారం.. జయపురం సమీప బరిణిపుట్లోని రాహుల్ గర్గ్ షోరూంలో హర్యానకు చెందిన మహిళ పని చేస్తూ.. పట్టణంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గతనెల 28వ తేదీ రాత్రి సమయంలో జయపురం రథాయాత్ర తిలకించేందుకు ఆమె వెళ్లింది. మార్గమధ్యలో దేవసోని కలిశాడు. అనంతరం వారంతా రథాయాత్ర చూసి అందరూ ఇంటికి వచ్చారు. ఆ మహిళ తన ఇంటిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో దేవ్ సోని వచ్చి ఆమైపె దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అరిస్తే చంపుతానని బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. బాధిత మహిళ జయపురం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితుని అరెస్టు చేశామన్నారు. ఈ సంఘటనలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి వెల్లడించారు.