breaking news
Orissa
-
తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి
● లేదంటే 26న సీఎస్వో కార్యాలయం ముట్టడి ● మాజీ మంత్రి రబినారాయణ నందో డిమాండ్జయపురం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ నెల 24వ తేదీలోగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, రాష్ట్ర బిజేడీ ఉపాద్యక్షులు రబినారాయణ నందో కోరారు. లేదంటే ఈ నెల 26వ తేదీన జిల్లా సివిల్ సప్లై కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం బీజేడీ నేత బాలారాయ్ కార్యాలయం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మండీల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. జిల్లాలో గత 11వ తేదీన మండీలు ప్రాంభించిన అధికారులు టీ తాగి వెళ్లిపోయారు తప్పితే నేటి వరకు ఎక్కడా ఒక్క కేజీ ధాన్యం ఖరీదు చేయలేదని దుయ్యబట్టారు. మండీలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయటం అధికారుల నైతిక బాధ్యతన్నారు. అయితే అధికారులు బాధ్యత విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని మండీల్లో వేలాది బస్తాల ధాన్యం పడి ఉన్నాయని వివరించారు. రెండు దినాల కిందట కొరాపుట్ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని తాము కలసి కొరాపుట్ జిల్లా రైతుల సమస్యలతో పాటు మండీలలో పడిఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. మండీలలొ రైతుల ధాన్యం కొంటామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదన్నారు. దీంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. సమావేశంలో బీజేడీ నేతలు బాలారాయ్, బి.బాలంకిరావు, ఎ.శ్రీనివాసరావు, టున రథో పాల్గొన్నారు. -
ఉపాధి పేరిట మోసం!
పర్లాకిమిడి: పశ్చిమ బెంగాల్కు చెందిన సుహాన ట్రస్టు, సిమ్ గ్రూప్ కంపెనీ పేరిట సంబల్పూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి స్థానిక వ్యక్తులతో కలిసి ఆదివాసీ, హరిజన యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తామని పర్లాకిమిడి కలెక్టరేట్ వద్ద యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం హాలులో శిబిరం నిర్వహించారు. వారి వద్ద నుంచి రిజిష్ట్రేషన్ ఫీజుగా కొంత సొమ్మును తీసుకుని రెట్టింపు డబ్బులు ఇస్తామని, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని ప్రలోభాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆదర్శ పోలీసుస్టేషన్కు సమాచారం అందజేశారు. వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు, పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకుని స్వచ్ఛంద సంస్థ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేకపోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదర్శ పోలీసు స్టేషన్లో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. -
సెంచూరియన్ వర్సిటీలో రైతు దినోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో మంగళవారం భారత మాజీ ప్రధాని డాక్టర్ చౌదురీ చరణ్సింగ్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సాగర్ మైత్రా, అగ్రోనమీ ఉన్నత విభాగం అధిపతి తన్మయ శంకర్ రైతు దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్లో నిర్వహించిన ర్యాలీలో ప్రొఫెసర్లు సుప్రదీప్ సర్కార్, వై.నంజారెడ్డి, బి.చక్రపాణి పాల్గొన్నారు. సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాలలో ఆగ్రోనమీ, అగ్రో ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవంలో రైతులకు వర్మి కంపోస్టు, డ్రాగన్ ఫ్రూట్, సీవీడ్ ఎక్స్ట్రాక్టుపై అవగాహన కల్పించి వారికి సొరకాయ విత్తనాలను అందజేశారు. రైతులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. -
కొనసాగుతున్న ధనుర్మాస పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీనివాసనుకి, గొదాదేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారామ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి హారతి, వ్రత పూజలు జరిగాయి. భక్తులు స్వామివారి వ్రతాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పర్యాటకుల ప్రాణాలు కాపాడిన లైఫ్ గార్డులు భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తుండగా భారీ అలల కారణంగా యువకుడు మునిగిపోయాడు. తీరంలో పహరా నిర్వహిస్తున్న 4 మంది లైఫ్గార్డ్లు ఈ ప్రాణాపాయ పరిస్థితి గమనించి సముద్రంలోకి దూకి యువకుడిని రక్షించారు. బిసంకటక్లో బీఎస్పీ కార్యకర్తల సమావేశం రాయగడ: జిల్లాలోని బిసంకటక్లో బహుజన్ సమాజ్ పార్టీ మంగళవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ నాయక్, సీనియర్ నాయకుడు జితు జకసికలు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని బలొపేతానికి కార్యకర్తలు సహకరించాలని ఈ సందర్భంగా నాయక్ అన్నారు. సమితీ వార్లగా సమావేశాలను నిర్వహించి కార్యకర్తలను చైతన్య పరచాలని అన్నారు. భవిష్యత్లో బీఎస్పీని ప్రజలు ఆదరిస్తారని ఆకాంక్షించారు. కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిమతాన్ని తెలుసుకుని అందుకు సంబంధించిన నివేదికను సమర్పిస్తే దానికి అనుగుణంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొందరు పార్టీలో చేరారు. వారికి సాదరంగా నాయకులు ఆహ్వానించారు. బిసంకటక్కు చెందిన గౌరీప్రసాద్ పాత్రో తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.విద్యుద్ఘాతంతో లారీ డ్రైవర్ మృతి రాయగడ: విద్యుత్ షాక్తో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన జిల్లాలోని చంద్రపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడు ప్రశాంత జెన్న (39)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్కోకి వెళితే.. చంద్రపూర్ సమితి పరిధిలోని బంధిరి నుంచి చంద్రపూర్ వరకు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో లారీ డ్రైవరు ప్రశాంత్ మెటల్ లోడ్ ను తీసుకువస్తున్న సమయంలో లోడ్ను డాలా ఎత్తి అన్లోడింగ్ చేస్తున్న సమయంలో పైనఉన్న విద్యుత్ తీగలు లారీకి తాకడంతో విద్యుత్ ఘాతం ఏర్పడింది. దీంతో సంఘటన స్థలంలోనే ప్రశాంత్ మృతి చెందాడు. మృతునిది జిల్లాలోని గుణుపూర్ పరిధి జల్తార్ గ్రామం.కలెక్టరేట్లో గుడ్ గవర్నెన్స్పై వర్క్షాప్ పర్లాకిమిడి: స్థానిక లెక్టరేట్లో జిల్లాస్థాయి గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు సందర్భంగా ఓస్వాన్ హాలులో ‘ప్రశాసన్ గావ్ కి ఔర్’ అనే వర్క్షాపు జరిగింది. ఈ కర్మశాలలో ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి అధ్యక్షత వహించారు. జిల్లాలోని అన్ని మండలస్థాయిలో ఆరోగ్యం, విద్య, శిశువికాస్, సాధరణ ప్రజా వినతులను వినడం, వాటి పరిష్కారం దిశగా అధికారులు ముందుకు సాగటంపై ఏడీఎం మఝి చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గుడ్ గవర్నన్స్ ఈ నెల 25వ తేదీ వరకూ కొనసాగుతాయని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మిధాలీ మధుస్మితా పాఢి, కష్యప్ బెహరా సహా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మహానది జల వివాదంపై అంతర్ మంత్రివర్గ కమిటీ తొలి సమావేశం
భువనేశ్వర్: మహా నది అంతర్ రాష్ట్ర జలాల పంపిణీ సమస్యలపై అంతర్ మంత్రివర్గ కమిటీ తొలి సమావేశం ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన మంగళ వారం జలవనరుల శాఖ రాజీవ్ భవన్లో జరిగింది. సమావేశానికి మంత్రులు సురేష్ కుమార్ పూజారి, పృథ్వీరాజ్ హరిచందన్, సంపద్ చంద్ర స్వంయి, ఎమ్మెల్యేలు సరోజ్ కుమార్ ప్రధాన్, నిరంజన్ పూజారి, సోఫియా ఫిర్దౌస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే జయ నారాయణ్ మిశ్రా వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మనోజ్ అహుజా, అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, జల వనరుల శాఖ సంబంధిత అధికారులు, ఇంజినీర్లు కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడానికి సమావేశంలో పాలుపంచుకున్నారు. సమావేశంలో హీరాకుద్ ప్రాజెక్ట్, మహానది జల వివాదం చారిత్రక నేపథ్యం, మహానది జల వివాదాల ట్రైబ్యునల్ ముందు జరుగుతున్న విచారణల ప్రస్తుత స్థితి, మహానది సంబంధిత సమస్యల స్నేహపూర్వక పరిష్కార ప్రక్రియ మరియు మహానది బేసిన్కు సంబంధించిన విషయాల సమగ్ర స్థితిపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఒడిశా రాష్ట్రం యొక్క వాదనను మరింత బలోపేతం చేయడానికి, మహా నది జల సమస్యల స్నేహపూర్వక పరిష్కారం దిశగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి అంతర్ మంత్రివర్గ కమిటీ తదుపరి సమావేశాన్ని కొత్త సంవత్సరం జనవరి నెలలో నిర్వహించాలని నిర్ణయించారు. -
కోరుకొండలో శాంతిచర్చలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రఖల్గూఢ, యం.వి.26 గ్రామల మధ్య గిరిజన మహిళ విషయమై గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇరు గ్రామాల మధ్య శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అధ్యక్షతన శాంతి చర్చలు మంగళవారం జరిపారు. ఈ నెల ఐదో తేదీన జరిగిన గిరిజన మహిళ హత్య నేపథ్యంలో ఇరు గ్రామాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ గ్రామాల్లో పర్యటించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు గ్రామాల ప్రజలతో చర్చలు జరిపారు. పొట్టంగి, గుణుపూర్, చిత్రకొండ ఎమ్మెల్యేలు రామచంద్ర కడాం, సత్యజీత్ గోమెంగో, మంగుఖీలో, మినాక్షీ బాహినిపతి, నిమాయ్ సర్క్ర్, మనోజ్ నాయక్, జి.శ్రీనివాస్రావు, గోవిందపాత్రో, మున్న త్రిపాఠి, భోజాబాల్ మాఝి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సమాజ శ్రేయస్సులో విద్యార్థుల పాత్రకీలకం
● జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి రాయగడ: సమాజ శ్రేయస్సులో విద్యార్తుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక గాయత్రీనగర్లోని సరస్వతి శిశువిద్యామందిరం 33వ వార్షికోత్సావాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే సమాజ శ్రేయస్సు గురించి అవగాహన కల్పించుకోవాలన్నారు. చదువుతో పాటు వారికి సమాజ హితం గురించి ఉపాధ్యాయులు నేర్పించాలని అన్నారు. అవగాహన లోపంతో చాలామంది పక్కదారిపట్టి భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారన్నారు. అందువల్ల ప్రాథమిక దశలోనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్య పరచాలని ఉద్బోంధించారు. జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి పౌరులని అన్నారు. బాగా చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. విద్యాలయం కమిటీ అధ్యక్షులు మంగీలాల్ జైన్, కార్యదర్శి ప్రమోద్ కుమార్ మహాంతి, విద్యాలయం ప్రధానోపాధ్యాయులు మనోరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అడవులను సంరక్షించాలి రాయగడ: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో అటవీ, పోలీస్ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో అడవుల్లో కొనసాగుతున్న అగ్ని ప్రమాదాల గురించి వివరించారు. అవగాహన రహితంతో అడవులను కాల్చివేస్తున్నారని దీనివల్ల పచ్చదనం అంతరించడంతోపాటు విలువైన వృక్ష సంపదను మనమంతా కోల్పొతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ తరహా అగ్నిప్రమాదాలను నివారించేందుకు అధికారులు అధిక శ్రద్ధతీసుకోవాలని అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి సచిన్ అన్నా సాహేబ్ అహూలే మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. జిల్లాలోని మునిగుడ, కళ్యాణసింగుపూర్, రాయగడ సమితుల్లో అగ్ని ప్రమాదాల వల్ల కలిగే నష్టం గురించి వివరించారు. అగ్ని ప్రమాదాల నుంచి అడవులను సంరక్షించేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. అటవీ శాఖ, పోలీస్ అదేవిధంగా జిల్లా యంత్రాంగం సంయుక్తంగా అడవుల సంరక్షణకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చేపట్టాల్సిన చైతన్య కార్యక్రమాలపై చర్చించారు. -
150 కొత్త అంబులెన్స్ల ప్రారంభం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంగళవారం కళింగ స్టేడియంలో 150 అంబులెన్స్లను ప్రజా సేవకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.111 కోట్లు ఖర్చు చేసి 428 అంబులెన్స్లు సేవా రంగంలోకి దింపాలని నిర్ణయించింది. వాటిలో తొలి విడత కింద 150 కొత్త అత్యవసర అంబులెన్స్లను (ఈఎంఏఎస్) ప్రారంభించారు. 108 అంబులెన్స్ల ద్వారా నిత్యం 5,000 మంది రోగులను రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర అంబులెన్స్ సేవలను మరింత మెరుగుపరచడానికి పాత అంబులెన్స్లను దశలవారీగా కొత్త అంబులెన్స్లతో భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య సేవను మరింత వేగవంతం చేయడానికి మరో 108 ఈఎమ్ఏఎస్ అంబులెన్స్లను కొనుగోలు చేశారు. పాత అత్యవసర వైద్య అంబులెన్స్ సర్వీస్ లేదా ఈఎమ్ఏఎస్ ఫ్లీట్తో పాటు మిగిలిన కొత్త అంబులెన్స్లను త్వరలో అంబులెన్స్ సేవలో మోహరిస్తామని ప్రకటించారు. కొత్తగా ప్రారంభించిన అంబులెన్సు వాహనాల్లో వాణిజ్య, రవాణా శాఖ అధీనంలో విమానాశ్రయాలు, ఎయిర్స్ట్రిప్లలో ఉపయోగించడానికి 5 ఏఎల్ఎస్ అంబులెన్సులను, ఝార్సుగుడ కార్డియాక్ కేర్ హాస్పిటల్ కోసం 2 ఏఎల్ఎస్ అంబులెన్స్లను ఉపయోగిస్తారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, ఏకామ్రా భువనేశ్వర్ నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, ఆరోగ్య కమిషనర్, కార్యదర్శి అశ్వతి ఎస్, రాష్ట్ర శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ బృందా, ఆరోగ్య శాఖలోని వివిధ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పనికితగ్గ వేతనం ఇవ్వాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పనిచేస్తున్న ఆశవర్కర్లు, గావ్ కళ్యాణసమితి, మహిళా ఆరోగ్య సమితి, జేఏఎస్ (జన ఆరోగ్య సమితి) వర్కర్లకు పనికి తగ్గ వేతనం రాక ఇబ్బందులుపడుతున్నారని జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారిని మనోరమా దేవి అన్నారు. ఆమె స్థానిక బిజూ కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లాస్థాయి ఆశ, గాకళ్యాణ సమితి, ఎం.ఏ.యస్., జె.ఎ.యస్. వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లాముఖ్యవైద్యాధికారి డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ, ఆదనపు పీహెచ్వో డాక్టర్ రబినారాయణ దాస్, జన స్వస్థ్య అధికారి ప్రదీప్ కుమార్ మహాపాత్రో, జిల్లాపరిషత్తు ఆదనపు ఈవో ఫృధ్వీరాజ్ మండళ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ స్వస్థ్య మిషన్లో పనిచేస్తున్న ఆశవర్కర్లు, ఎంఏఎస్, జేఏఎస్, జీకేఎస్ వర్కర్లు ఎప్పటికై న వారికి కేంద్ర ప్రభుత్వం మంచి జీతాలు పెంచుతారన్న ఆశాభావం వ్యక్తపరిచారు. అనంతరం ఆశ, గావ్ కళ్యాణసమితి, జన ఆరోగ్యసమితి వర్కర్లు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. -
జవాన్ ఈశ్వర్ తలియ విగ్రహావిష్కరణ
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీ గుడ గ్రామంలో సహిద్ జవాన్ ఈశ్వర తలియ విగ్రహాన్ని ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన జన్మస్థలం బొడొగుడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాద్ మచ్చ పాల్గొని ఈశ్వర తలియ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ ప్రసంగిస్తూ సహిద్ జవాన్ ఈశ్వర్ దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్ అన్నారు. కొరాపుట్ జిల్లా వీరుల, త్యాగధనుల మట్టి అని అన్నారు. బొయిపరిగుడ సమితి తెంతులిగుమ్మ గ్రామంలో పుట్టి ఆంగ్లేయులతో పోరాడి చిరు నవ్వుతో ఉరికంబ మెక్కి ప్రాణ త్యాగం చేసిన ఆదివాసీ నేత సహిద్ లక్ష్మణ నాయిక్ దేశ స్వాతంత్య్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారని, అతడితో పాటు బొయిపరిగుడ సమితికి చెందిన అనేక మంది దేశం కోసం రక్తం చిందించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి దేశ భక్తులు పుట్టిన బొయిపరిగుడ సమితి లోమరో కలికి తురాయి సహిద్ ఈశ్వర తలియ అని ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ పడాల్, మాజీ మంత్రి పద్మిణి దియాన్, మాజీ ఎంపీ జిన్నా హికాక, బొయిపరిగుడ సమితి చైర్మన్ ప్రశాంత గుప్త, జిల్లా పరిషత్ సభ్యులు రాజేష్ మహురియ, మొణ జాని, బొయిపరిగుడ సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రియ, తహసీల్దార్ స్నిగ్ధ చౌధురి, ఖెందుగుడ పంచాయతీ సర్పంచ్ అభిమణ్య నాయిక్ తో పాటు పలు గ్రామాల ప్రజలు పాల్గొని సహిద్ జవాన్ ఈశ్వర్కు ఘనమైన నివాళులు అర్పించారు. -
శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల సెమినార్
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో రెండురోజులుగా సుస్థిర అభివృద్ధి, లక్ష్యాలు, డిజిటల్ పేమెంట్స్, వ్యాపారం, నిర్వహణ, సమాజాభివృద్ధిపై సెమినార్ జరుగుతోంది. ఈ రెండు రోజుల సెమినార్ను ముఖ్యఅతిథిగా ఉన్నత విద్యా మండలి ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ నారాయణ బెహరా విచ్చేసి ప్రారంభించారు. అతిఽథి పరిచయం, స్వాగత ఉపన్యాసం కనన్బాలా పాత్రో వ్యవహరించగా, అతిథులుగా స్టార్టప్, ఇన్నోవేషన్ సెల్ (గ్లోబల్ బిజినెస్ స్కూల్, పరిశోధనకేంద్రం) డాక్టర్ ప్రబీర్ చంద్ర పాఢి, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జితేంద్ర పట్నాయిక్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మేధావులు, అర్ధశాస్త్ర పరిశోధన బోధకులు, ప్రస్తుత అంతర్జాతీయ బిజినెస్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల భారత వృద్ధి రేటు పెరుగుతుందని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్ నారాయణ బెహరా అన్నారు. కాలంతో పాటు వ్యాపారం, విద్య, గూగుల్పే, ఫోన్పే, ఇతర సాధానాల వల్ల ప్రజల అవసరాలు సకాలంలో తీరడం కాకుండా సమయ పాలన తగ్గుతుందని అన్నారు. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల అనేకమంది ప్రజల డబ్బులు సైబర్ వలలో పడి పోగొట్టుకుంటున్నారని అన్నారు. రెండో రోజు సెమినార్లో కామర్సు విభాగం (బరంపురం విశ్వవిద్యాలయం) డాక్టర్ మహేశ్వర్ శెఠి, గంజాం జిల్లా సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ రథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒడియా వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ
రాయగడ: జిల్లా ఒడియా బ్రాహ్మణ మహా సమాజం ఆధ్వర్యంలో 2026వ ఏడాది వార్షిక క్యాలెండర్ను ఆ సమాజం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది మదన్ మోహన్ పాడి ఆవిష్కరించారు. మంగళవారం స్థానిక జగన్నాథ మందిరం ప్రాంగణంలో సమాజం సభ్యులు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన వార్షిక క్యాలెండర్ని ఆవిష్కరించడంతో పాటు సమాజం తరుపున కొత్త సంవత్సరంలో నిర్వహించే భవిష్యత్ ప్రణాళిక గురించి సభ్యులతో చర్చించారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన స్థానిక రామకృష్ణ నగర్లో జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. కార్యక్రమంలో సమాజం కార్యదర్శి కిషోర్ పండ, సభ్యులు రంజన్ కుమార్ రథ్, రాజేష్ పాఢి తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డు అదృశ్యం భువనేశ్వర్: ఇంఫా సెక్యూరిటీ గార్డు అదృశ్యం అయ్యాడు. అతడి కోసం విశాఖపట్నంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. దేవ్గడ్ జిల్లాకు చెందిన జితేంద్రియ సాహు చౌద్వార్లోని ఇంఫాలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. చౌద్వార్ నుంచి విశాఖపట్నంకు 3 క్రోమైట్ నిండిన ట్రక్కుల రవాణాకు సాహు ఎస్కార్ట్ బాధ్యతలతో డిసెంబర్ 13న బయలుదేరాడు. డిసెంబర్ 15న విశాఖపట్నం పోర్టుకు చేరుకున్న తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. చివరిసారిగా రైల్వే స్టేషన్్ నుంచి మాట్లాడిన తర్వాత అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ నేపథ్యంలో చౌద్వార్ పోలీస్ ఠాణాలో అదృశ్యం కేసు నమోదు చేయబడింది. సీసీటీవీ ఫుటేజ్లను సమీక్షించి అతడు ఎలా, ఎక్కడ అదృశ్యమయ్యాడో పసిగట్టేందుకు దర్యాప్తు బృందం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఆయన ఎస్కార్టు బాధ్యతలు నిర్వహించిన ట్రక్ డ్రైవర్లను దర్యాప్తు బృందం ఆరా తీసేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని విశాఖపట్నంకు పంపినట్లు ఏసీపీ అరుణ్ కుమార్ స్వంయి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 24 ఎన్ఏసీలు భువనేశ్వర్: రాష్ట్ర గృహ నిర్మాణం మరియు నగర అభివృద్ధి విభాగం 24 కొత్త నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీలు) ఏర్పాటు కోసం తుది ఉత్తర్వులు జారీ చేసింది. బహుళ జిల్లాల్లోని 5 ఎన్ఏసీలను మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేయడానికి ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. 14 జిల్లాల్లో కొత్తగా 24 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీలు) ఏర్పాటు అవుతాయి. ఈ జాబితాలో పల్లొలొహడా, సిములియా, సోహెల, తిహిడి, ధుసూరి, సలేపూర్, బొడొంబా, నరసింగ్పూర్, గొందియా, జగన్నాథప్రసాద్, పత్రాపూర్, నొర్ల, జయపట్న, ఖుర్దా టంగి, బొరిగుమ్మ, బెత్తొనట్టి, బంగిరిపోషి, చిత్రడా, కప్తిపొదా, రాసగోబింద్పూర్ బీర్ మహారాజ్ పూర్ ప్రాంతాలు ఉన్నాయి. బౌధ్, గంజాం మరియు మయూరభంజ్ జిల్లాల్లో 5 మున్సిపల్ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. అత్యధికంగా గంజాం జిల్లాలో 3 మిగిలిన 2 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త మున్సిపల్ సంస్థల ఏర్పాటు కోసం ముసాయిదా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ జాబితాలో గంజాం జిల్లాలో భంజనగర్, కబి సూర్యనగర్ మరియు పొలొసొర, బౌధ్ జిల్లాలో బౌధ్గడ్, మయూరభంజ్ జిల్లాలో కరంజియా ప్రాంతాలు ఉన్నాయి. -
మజ్జిగౌరి మందిరంలో అభివృద్ధి పనుల పరిశీలన
● సౌకర్యాలపై ఆరా తీసిన దేవదాయ శాఖ కమిషనర్ రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ లలాటేందు జెన్న మంగళవారం సందర్శించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి మందిరానికి మంజూరు చేసిన నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయం నిర్వాహకులు విక్రయిస్తున్న లడ్డూ, పులిహోర ప్రసాదంలో నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీతో సమావేశమై వివరాలు సేకరించారు. అలయానికి భక్తుల ద్వారా వస్తున్న కానుకలకు సంబంధించిన నగదు వివరాలు, వచ్చే ఆదాయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. అమ్మవారి హుండీ ఆదాయం వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన ఆ మొత్తం నగదును ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయసింగి బిడిక బదులిస్తూ అమ్మవారికి కానుకల రూపంలో వచ్చే ఆదాయాన్ని పట్టణంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న 16 అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు అభ్యంతరం చెప్పిన దేవదాయ శాఖ కమిషనర్ జెన్న అన్ని అకౌంట్లతో గందరగొళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నార. కేవలం అమ్మవారి పేరిట మూడు అకౌంట్లను మాత్రమే తెరిచి వాటిలో ఆదాయాన్ని నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. ఇదిలాఉండగా రద్దీ సమయంలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం చెల్లిస్తున్న మూడు వందల స్పెషల్ టికెట్టు మంజూరులొ వచ్చిన ఫిర్యాదులపై ఆయన సమీక్షించారు. ఇదేవిషయమై ట్రస్ట్ సభ్యులు, తహసీల్దార్కు లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయడంపై సమగ్ర స్థాయి దర్యాప్తు చేపట్టాలని అన్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయ ట్రస్టు సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, రాధాకాంత్ దొలాయి. అకౌంటెంట్ సంగాపు వెంకటరావు ఉన్నారు. -
ధాన్యం విక్రయ కేంద్రాలు తెరవాలని ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ధాన్యం విక్రయ కేంద్రాలు వెంటనే తెరవాలని, ధాన్యం అమ్ముకునే మండీల వద్ద వెయిట్ చార్జీల కటింగ్, చీటింగ్ బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, మోహానా ఎమ్మెల్యే దాశరథి గోమంగో రాస్తారోకో ఆందోళన చేపట్టారు. తొలుత సొండివీధి కాంగ్రెస్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉపజిల్లా కారాగారం వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో బరంపురం, పలాస, మోహన నుంచి విచ్చే బస్సులు, వాహనాలు గంటసేపు నిలిచిపోయాయి. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఇంతవరకూ రైతులకు న్యాయం చేకూరడం లేదని, వెంటనే మండీలు తెరిపించాలని ప్రభుత్వానికి కోరుతున్నామని డీసీసీ అధ్యక్షులు దాశరథి గొమంగో విలేకరులతో అన్నారు. అయితే జిల్లా అధికారులు డిసెంబరు 30న మండీలు తెరుస్తామని ప్రకటించినట్టు విలేకరులు అడిగిన ప్రశ్నకు ...అదంతా మాకు తెలియదు..జిల్లా కలెక్టర్, పౌరసరఫరాలశాఖ, ఆర్ఎంసీ, కలెక్టర్ వెంటనే పర్లాకిమిడి, మోహన, కాశీనగర్, గుసాని సమితిల్లో ధాన్యం విక్రయ కేంద్రాలు తెరిచి రైతు ఇంటి వద్ద నుండి మండీలకు తీసుకువెళ్లేవరకూ ప్రభుత్వమే ఖర్చులు భరించాలని, గోనె అంకెం సంచులు డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో జమ చేయాలని ఎమ్మెల్యే దాశరథి గోమాంగో డిమాండ్ చేశారు. రాస్తారోకో ఆందోళన చేపడుతున్న కాంగ్రెస్ శ్రేణుల వద్దకు సబ్ కలెక్టర్ అనుప్ పండా వచ్చి కలెక్టర్కు రాసిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే వద్ద నుంచి స్వీకరించారు. అనంతరం రాస్తారోకో ఆందోళనను కాంగ్రెస్ పార్టీ నాయకులు విరమించారు. ఈ ఆందోళనలో పట్టణ కాంగ్రెస్ నాయకులు బసంత పండా, అభిమన్యు పండా, కున్నామఝి, సూర్యనారాయణ పాత్రో, మోహానా, ఆర్.ఉదయగిరి నాయకులు పాల్గొన్నారు. -
విద్యతోనే సమాజ వికాసం
రాయగడ: విద్యతోనే సమాజ వికాసం సాధ్యమవుతుందని జిల్లా అదనపు మేజిస్ట్రేట్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. సదరు సమితి పితామహల్లోని సెంచురియన్ పబ్లిక్ స్కూల్ 15వ వార్షికోత్సవాన్ని సెన్ఫెస్ట్ పేరిట మంగళవారం స్కూల్ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో కాకుండా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. సెంచూరియన్ విద్యాసంస్థలు అవిభక్త కొరాపుట్ జిల్లాలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు విద్యాసంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారికి ఆయా రంగాల్లో మెలకువలు అందించాలన్నారు. ఎంతోమంది విద్యార్థులు క్రీడా రంగంలో ఈ జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా గౌరవాన్ని నిలబెట్టారని గుర్తు చేశారు. సెంచురియన్ విద్యాసంస్థల డైరక్టర్ డాక్టర్ రాజేష్ పాఢి మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేవిధంగా ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహిస్తున్నారన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ మహాపాత్రో వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. -
లొంగుబాటు
22 మంది మావోయిస్టులు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది మావోయిస్టులు పోలీసు కార్యాలంయలో డీజీ వై.బి.ఖురానియా సమక్షంలో మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరు వద్ద నుంచి తొమ్మిది తుపాకులు, 14 టిఫిన్బాక్స్ బాంబులు, బుల్లెట్లు, పేలుడు పదార్ధాలు, ఇతర మావోసామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీజీ వైబీ ఖురానియ మాట్లాడుతూ.. ప్రస్తుతం మావోయిస్టులు చివరి దశలో ఉన్నారన్నారు. ఇంకా ఎవరైన మావో సంస్థలో ఉంటే దళం వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా లొంగుపోయిన వారికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన 22 మందిలో ఇద్దరు ఆంధ్రా, ఒడిశా జోనల్ కమిటీ సభ్యులుగా పనిచేయగా మిగిలిన 20 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారన్నారు. లొంగిపోయిన వారినలో మావో ముఖ్యనేత లింగే మడ్కకామ్ ఉన్నారన్నారు. వీరంతా పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారన్నారు. లొంగిపోయిన మావోలపై రూ. 2.25 కోట్ల రివార్డులు ఉన్నట్టు వివరించారు. విలేకరుల మావేశంలో డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, మల్కన్గిరి ఎస్పీ వినోద్ పటేల్, బీఎస్ఎఫ్ డీఐజీ విజయ్ సిన్హా, డీఐజీ కేవీ సింగ్, ఎస్ఐడబ్ల్యూడీ డీఐజీ సంజీవ్ పాండా, యాంటీ నక్సల్ ఆపరేషన్ డీఐజీ అఖిలేశ్వర్ సింగ్, మల్కన్గిరి జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు వీరే.. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లింగే మడ్కమ్, బామన్ మడ్కం, సాక్ ముచకి, ఐత ఔలామి, కోసా కబాసి, బాటి మడ్కం, జోగి ముచకి, రీటా పోడియామి, లీగల్ సోడి, భీమ కల్ము, మాంగ్లి బంజామి, జోగాముచాచి, అడ్మే ముచాకి, ఉర్రగ్, మాదా మద్వి, ముచకి అద్మా, దేబా మద్వి, అర్జున్ మాద్వి, సాగర్ పునెమ్, సోమీ పోడియమి, అనీల్ కావాసీ తదితరులున్నారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సొమవారం జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుడిని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్ఛాపూర్ పంచాయతీలోని నాగజొరి గ్రామానికి చెందిన పులేన్ ప్రస్కా (23)గా గుర్తించారు. సైకిల్పై కర్రలను తీసుకువెళుతున్న యువకుడి మీదుగా ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొంది. దీంతో సంఘటన స్థలం వద్దే ప్రస్కా మృతి చెందాడు. డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైంని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ.. మరీ అంత ఎక్కువా?
అసలు కంటే కొసరు మక్కువ అనేది నానుడి. ఒడిశా అటవీశాఖ అధికారులు చేసిన ఓ పని ఇలాగే ఉంది. అసలు కంటే కొసరు కోసం ఎక్కువ ఖర్చు చేసి వివాదంలో చిక్కుకున్నారు. డిపార్ట్మెంట్ అవసరాల కోసం 51 కార్లు కొన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే కార్లు కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కార్లకు అదనపు హంగుల కోసం వెచ్చించిన ధర దాదాపు వాహనాల రేటుకు దగ్గర ఉండడంతో వివాదం రాజుకుంది. అటవీశాఖ అధికారుల కొను గోల్మాల్ బయటపడడంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.అటవీ శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా కంపెనీకి చెందిన 51 థార్ (Thar) ఎస్యూవీలను కొనుగోలు చేసింది. ఒక్కో కారుకు రూ.14 లక్షలు చొప్పున 7 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. తమ విభాగం అవసరాలకు అనుగుణంగా ఈ కార్లలో మార్పులు చేయడానికి అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేయడంతో సమస్య మొదలైంది. మొత్తం 51 వాహనాలకు అదనపు హంగులతో కలిపి రూ. 12.35 కోట్లు వ్యయం అయినట్టు అధికార పత్రాలు ధ్రువీకరించాయి. దీంతో తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.నిగ్గు తేల్చాల్సిందే..బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సాహూ (Arun Kumar Sahoo) గత మార్చి నెలలో ఈ అంశాన్ని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. అటవీశాఖ కొనుగోలు చేసిన వాహనాలకు అయిన ఖర్చు వివరాలు ఇవ్వాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కార్లు కొనడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చయితే, అదనపు హంగులకు ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చించినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా స్పందించారు. ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, నిగ్గు తేల్చాలని అకౌంటెంట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించారు. వాహనాల కొనుగోలు ప్రక్రియతో పాటు మార్పుల కోసం అయిన ఖర్చులను కూడా పరిశీలించాలని సూచించారు. అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని ఆయన హెచ్చరించారు.అనవసరంగా ఖర్చు చేస్తే సహించంవాహనాలకు అదనపు హంగుల కోసం పెట్టిన ఖర్చు సహేతుకమా, కాదా అనేది తేల్చేందుకే ప్రత్యేక ఆడిట్ చేయాలని ఆదేశించినట్టు మంత్రి గణేష్ రామ్ సింగ్ (Ganesh Ram Singh Khuntia) తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. అటవీశాఖ అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో కొన్ని మార్పులు చేస్తుంటారని చెప్పారు. అడవుల్లో విధులు నిర్వహించేందుకు అనువుగా ఉండేలా వాహనాల్లో అదనపు లైట్లు, కెమెరాలు, సైరన్లు, ప్రత్యేక టైర్లు, ఇతర పరికరాలను అమర్చుతారని తెలిపారు. అయితే అధికంగా లేదా అనవసరంగా చేసే ఎలాంటి ఖర్చునైనా తాము సహించబోమని ఆయన స్పష్టం చేశారు.చదవండి: త్వరలో మోదీ 3.ఓ కేబినెట్ విస్తరణ!మార్పులు అవసరంతాము కొనుగోలు చేసిన వాహనాలకు అవసరానికి మించి ఖర్చు చేశామా, లేదా అనేది ఆడిటింగ్ తేలుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. తమ శాఖ విధులకు అనుగుణంగా వాహనాలకు మార్పులు చేయడం అవసరమని వారు చెబుతున్నారు. ఫ్రంట్లైన్ సిబ్బంది పెట్రోలింగ్, దావానలం నియంత్రణ, వన్యప్రాణుల రక్షణ, కలప అక్రమ రవాణా నివారణ, పర్యాటకుల జంగిల్ సఫారీల కోసం ఈ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్, సత్కోసియా టైగర్ రిజర్వ్, డెబ్రిఘర్ వన్యప్రాణుల అభయారణ్యం సహా ఇతర ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో విధులకు ఈ కస్టమైజ్డ్ ఎస్యూవీలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. -
33 యూనిట్లు రక్తం సేకరణ
జయపురం: స్థానిక మోటారు ఓనర్స్ అసోసియేషన్, సంబాద్–అమొ ఒడిశా సహకారంతో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక 26వ జాతీయ రహదారిలోని జయపురం మోటార్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మేగా రక్తదాన శిబిరాన్ని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి మీణకేతన దాస్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తం ప్రమాదాలలో గాయపడిన వారికి ఎంతో అవసరం అని అన్నారు. సకాలంలో రక్తం లభించక మరణాలు సంభవిస్తున్నాయని.. అటువంటి మరణాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ రక్తదాన చేయాలని పిలుపు నిచ్చారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి రక్తబాండార్ టెక్నీషియన్లు అభయ చరణ పండ, ప్రతిమ పాత్రో, గురు పొరజ మొదలగు వారు దాతల నుంచి రక్తం సేకరించారు. ఈ సందర్భంగా 33 యూనిట్ల రక్తం సేకరించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షులు జి.రమేష్కుమార్, సహాయ కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్, కోశాధికారి ఎస్.రామకృష్ణ పాల్గొన్నారు. టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి నెట్బాల్ ఎంపికలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు తదితరులు ఈ ఎంపికలను ప్రారంభించారు. మహిళలు, పురుషుల విభాగంలో 12 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈనెల 27న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎంపికల్లో కె.రఘనాథరావు, కేకే రామిరెడ్డి, తిరుపతిరావు, బసవరాజు, జగదీష్, శైలజ, ప్రశాంతి, జానకి, శ్యామలరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలాకి: మండల కేంద్రం పోలాకిలో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట నుంచి పోలాకి వైపు వస్తున్న ఆటో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి, ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డుపక్కనే పున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న పల్లిపేటకు చెందిన ఒక యువకుడు, వెదుళ్లవలసకు చెందిన వృద్ధురాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. హెచ్సీ రామ్జీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పొందూరు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సనాతన హిందూ ధర్మ ప్రచారకులు, ప్రవచన శిరోమణి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని కృష్ణాపురం ఆనందాశ్రమంలో సోమవారం ప్రవచనాలు చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. తల్లి, తండ్రి, గురువును గౌరవించినప్పుడు ఆరోగ్యకరమైన సమాజ స్థాపన జరుగుతుందన్నారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శ్రీకాకుళం చాప్టర్ నూతన చైర్మన్గా వాటర్ రిసోర్స్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ డోల తిరుమలరావు, కార్యదర్శిగా ఐతం కళాశాల ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నూతన కార్యవర్గ ఎన్నిక పరిశీలకులు ముని శ్రీనివాస్, చింతాడ రాజశేఖర్ పర్యవేక్షణలో నూతన కమిటీలో 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. -
‘ఉపాధి’ పేరు మార్చడం తగదు
మల్కన్గిరి: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం కేంద్రంలోని బీజేపీ సర్కార్కు తగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. పేరు మార్చే విషయంపై పనరాలోచన చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరుతో రాసిన లేఖను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధానకు సోమవారం అందజేశారు. ఉపాధి పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఒక బిల్లును తీసుకువచ్చి భయంకరమైన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడిందని దుయ్యబట్టారు. ఇది ఒక రాజకీయ కుట్రన్నారు. దీని లక్ష్యం ఒక చారిత్రాత్మకమైన, హక్కుల ఆధారిత ప్రజా సంక్షేమ చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరు తప్పించడం న్యాయం కాదన్నారు. అదనపు కలెక్టర్ను కలిసినవారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు ఇతర నేతలు ఉన్నారు. -
గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గుసాని సమితిలో లావణ్యగడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్కు నాలుగు పంచాయతీల నుంచి వినతులు వెల్లువెత్తాయి. స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ (ఇన్చార్జి) మునీంద్ర హనగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్తు అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని సమతి చైర్మన్ ఎన్.వీర్రాజు హాజరయ్యారు. లావణ్యగడ, రంప, గారబంద, శోబర పంచాయతీల నుంచి మొత్తం 64 వినతులు రాగా, వాటిలో వ్యక్తిగతం 36, గ్రామ పంచాయతీలకు సంబంధించినవి 28 ఉన్నాయి. పది మందికి వార్ధక్య, దివ్యాంగుల పింఛన్ పత్రాలు, భూ పట్టాలను జిల్లా కలెక్టర్ మునీంద్ర హనగ లబ్ధిదారులకు అందజేశారు. ఈ స్పందన కార్యక్రమానికి గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నాయక్ తహసీల్దార్ నారాయణ బెహరా, తదితరులు పాల్గొన్నారు. కలిమెల సమితిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి చింతాలవాడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రామస్తులు అందజేసిన 82 వినతులను కలెక్టర్కు స్వీకరించారు. వాటిలో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు అదేశించారు. అనంతరం గిరిజనులతో కలెక్టర్ చర్చించారు. గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. ఎస్పీ వినోద్ పటేల్, మల్కన్గిరి సబ్ కలెక్టర్ అశ్ని ఎ.ఎల్, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర సభోరో, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సహస్ర కలశాభిషేకం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సోమవారం సహస్ర కలశాభిషేకం, శ్రీవారి గరుడవాహాన సేవ రాసూరు గ్రామం వరకు సాగింది. ఈ కార్యక్రమాలు సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, పద్మ దంపతులు ఆధ్వర్యంలో కొనసాగాయి. విద్యావేంకటేశ్వర స్వామి శహస్ర కలశాభిషేకం పూజలను శ్రీకూర్మం ఆచార్యులు సరిసఖ్యాత మహాచార్యులు, ప్రధాన ఆలయ పూజారి ఆరవెళ్లి శేఖరాచార్యులు, ఇతర పండితులతో ఘనంగా జరిపించారు. మధ్యాహ్నం ప్రసాద సేవనం ఏర్పాటు చేశారు. -
ప్రజల వద్దకు పాలన
రాయగడ: సదరు సమితి జింగిలి గ్రామంలో సోమవారం ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీడీఓ సుజీత్ కుమార్ మిశ్రో, తహసీల్దార్ ప్రియదర్శిణి స్వయి హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై నాటకాన్ని ప్రదర్శించారు. జిమిడిపేట ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ సుభ్రతా పండా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అధికారులకు జంగిలి గ్రామస్తులు పలు సమస్యలను వివరించారు. గ్రామానికి చెందిన 10 మందికి ఇళ్ల పట్టాలను, మరో ఐదుగురుకి మనొరేగ జాబ్ కార్డులు, మూడు స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. నలుగురుకి ఆయుస్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను అందజేశారు. ఏబీబీఓ కాలుచరణ్ నాయక్, సీడీపీఓ నళిని బైరాగి, ఏబీఈఓ బలరాం హుయిక, తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ మేధపై అవగాహన
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో సోమవారం కృత్రిమ మేధ, ఏ.ఐ.క్యూ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ క్వోషియెంట్) సెమినార్ను వర్చువల్గా వర్సిటీ ఉపాధ్యక్షుడు డి.ఎన్.రావు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కంప్యూటర్ సైన్సు వైజ్ఞానికులు, నిపుణులు దృశ్యశ్రవణ విధానంలో నేటి తరం కృత్రిమ మేధ, చాట్ జి.పి.టి, జెమినీ వంటి సాంకేతిక సాధనాలు అవశ్యకతపై పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ మ్యానేజిమేంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. -
పల్లెసభ నిర్వహించకుండా చెక్డ్యాం నిర్మాణం తగదు
● ఏడీఎంకు ప్రజల ఫిర్యాదు రాయగడ: పల్లెసభ అనుమతి లేకుండా చెక్ డ్యాం నిర్మాణం కొనసాగుతుండడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్కు గ్రామస్తులు సోమవారం వినతిపత్రం ను సమర్పించారు. కొరాపుట్ జిల్లా పిపాల్పదర్ గ్రామపంచాయతీ పరిధిలోని కుటింగగుడ, షియాలిమాల్, బారిగాన్, పిపాల్పదర్, బగ్మారి, కందుపాయ్ గ్రామాలకు చెందిన ప్రజలు, అదేవిధంగా రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి శంకరడ గ్రామ పంచాయతీలొని కరజొల, తయాపుట్, ఖాదికయోడి, కన్సారిగుడ, పుంజిగుమ్మ, శంకరడ, బార్కుతుమి గ్రామాలకు చెందిన ప్రజలు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. కాసీపూర్ సమితిలోని కన్సారిగుడలో నిర్మితం కానున్న ఆదిత్యా అల్యూమిన కంపెనీ కుటింగుడ గ్రామంలో చెక్ డ్యామ్తో పాటు పైప్లైన్ వేయడం వంటి పనులను కొనసాగిస్తున్నారు. గ్రామ సభ అనుమతి లేకుండా ఆయా పనులు ఎలా చేస్తున్నారని గ్రామస్తులు వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ తమ గ్రామాల మీదుగా పారే నదిని చెక్డ్యాం నిర్మాణం ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దీని వల్ల తమ గ్రామాలకు ఆయా నది జలాలు అందక తాగు, సాగునీటికి కరువయ్యే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ పనులను నిలిపివేయాలని కొరారు. -
రెవెన్యూ ఇన్స్పెక్టర్ల శిక్షణ భవనాలు ప్రారంభం
జయపురం: జయపురం సమితి ఫూల్బెడ గ్రామంలో 2.9 కోట్ల రూపాయలతో నిర్మించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ల శిక్షణ భవన సముదాయాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి సోమవారం ప్రారంభించారు. తొలుత వినాయక ప్రతిమకు పూజలు చేిసి ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ల శిక్షక్ష కేంద్రం ఏర్పాటుతో అవిభక్త కొరాపుట్లోగల రాయగడ, కొరాపుట్, నవరంగపూర్, మల్కన్గిరి జిల్లాలకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లే కాకుండా కలహండి, నువాపడ జిల్లాల్లో నియమితులైన వారందరూ శిక్షణ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతాల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శిక్షణ కోసం మరో ప్రాంతానికి వెళ్లే సమస్య తీరిందన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆన్లైన్ సేవలతో పాటు మొబైల్ యాప్ ద్వారా భూములు కొనేందుకు, అమ్మేందుకు సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్, జయపురం సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం, మచ్చకొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, జిల్లా ఎస్పీ రోహిత వర్మ, ఐఏఎస్ అధికారి సంతోష్ కుమార్ పాత్రో, జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన, అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, రెవెన్యూ సూపర్వైజర్ హరిహర శతపది పాల్గొన్నార. -
వివాహిత ఆత్మహత్య
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి భువనపల్లి పంచాయతీ గిన్నిపల్లి గ్రామంలో యోగి మాడీ (26) అనే వివాహిత సోమవారం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి భర్త ఎంక మాడీతో గొడవ అనంతరం అందరూ నిద్రపోయారు. ఆ సమయంలో పొలం పనుల కోసం తీసుకొచ్చిన పురుగుల మందును యోగి తాగింది. అర్ధరాత్రి వాంతులు రావడంతో గమనించిన భర్త వెంటనే ఆమెను ఎం.వి.79 ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చేందింది. ఐఐసీ చంద్రకాంత్ తండి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన జయపురం: స్థానిక దొలమండప వీధిలో వాగ్దేవి ఆంగ్ల పాఠశాల ప్రాంగణంలో ఆదివారం అఖిల భారత చిరంజీవి యువత జయపురం శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 295 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు సతీష్ రెడ్డి, ప్రసాద్ నల్లన, కె.సాయి తేజశ్విణి, ఎన్.ఎస్.సాయి అనూష, అఖిల భారత చిరంజీవి యువత ఒడిశా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా తదితరులు పాల్గొన్నారు. చెట్టు పైనుంచి జారిపడి విద్యార్థి మృతి రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి హటోమునిగుడని రామక్రిష్ణ మిషన్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి చెట్టు పైనుంచి జారిపడి మృతి చెందాడు. సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో వంశీ దిసారి (15) ప్రాణాలు కోల్పోయాడు. మిషన్ ప్రాంగణంలోని మామిడి చెట్టు పైకి ఎక్కిన వంశీ కాలుజారి కిందపడిపోయాడు. సమాచారం తెలుసుకున్న మిషన్ నిర్వాహకులు అతన్ని బిసంకటక్లోని క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందించారు. -
ఉపాధి పథకం పేరు మార్పుపై ఆందోళన
పర్లాకిమిడి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని (మన్రేగా) కేంద్ర సర్కారు పేరు మార్పు చేయనుండడంతో గజపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆధ్వర్వంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఘెరావ్ కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ భవనం నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని మెయిన్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. వలస కార్మికులకు ఉపాధి పథకం ద్వారా ఏడాదికి కనీసం వంద రోజుల పనిదినాలు కల్పించడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం చేశారన్నారు. దీనిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేయనుండడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రస్తారోకో ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే గోమాంగో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి హాయ్, హాయ్ అని నినాదాలు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ రాసిన వినతిని గజపతి జిల్లా డిప్యూటీ కలెక్టర్ మిత్తాలి మధుసూదన్ పాడికి అందజేశారు. ఈ ఆందోళనలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా, కున్నా మఝి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యనారాయణ పాత్రో, సంజయ్ అధికారి, పాపారావు, అనంత గురు, తదితరులు పాల్గోన్నారు. -
కూలీ మృతదేహానికి అంత్యక్రియలు
మల్కన్గిరి: నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి జారిపడి తీవ్రంగా గాయాలపాలై మల్కన్గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సతీష్కుమార్(22) సోమవారం మృతిచెందాడు. స్వగ్రామానికి మృతదేహం తరలించేందుకు బంధువులు రాకపోవడంతో స్థానిక సమాజ సేవకులు ముందుకొచ్చి మల్కన్గిరి శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. మల్కన్గిరి పురపాలక అధ్యక్షుడు మనోజ్కుమార్ బారిక్, వార్డు మెంబర్ గణేష్ సాహా, కుందన్కుమార్, ఎం.చంద్రరావు పర్యవేక్షించారు. -
పెరగనున్న చలి తీవ్రత
భువనేశ్వర్: రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి వాయువ్య దిశ నుంచి పొడి.. చల్లని గాలుల ప్రవాహం పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో పశ్చిమ గాలుల ఉపసంహరణ ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గుతోందని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఉత్సాహంగా ముగ్గుల పోటీలు రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సేవా సమాజ్ సమీపంలోని మైదానంలో ఇడితాల్ పేరిట నిర్వహిస్తున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నర్మదా సాహు, కుడేశ్వరి నాయక్, సౌదామిణి గొమాంగొ తొలి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు. గోదాదేవికి విశేష పూజలు రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా సోమవారం గోదాదేవి అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. అర్చన, తిరుప్పావై ఏడవ పాశుర విన్నపం పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంల్లో జరిగిన పూజల్లో భాగంగా గోదా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానిస్టేబుల్కు డీజీపీ అభినందనలు భువనేశ్వర్: కటక్ నగర పోలీసుకు చెందిన కానిస్టేబుల్ రస్మితా సాహు క్రీడా ప్రతిభను గుర్తించి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా సోమవారం ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఉత్తరాఖండ్ టెహ్రీలో జరిగిన అంతర్జాతీయ ప్రెసిడెంట్ కప్ – 2025లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఒడిశా పోలీసులకు కీర్తి సాధించింది. ఈ పోటీలో రస్మితా సాహు కానోయింగ్ సి–1 1000 మీటర్ల విభాగంలో రజతం, కానోయింగ్ సి–1 500 మీటర్ల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమెను డీజీపీ సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో తంరడ్రీ కొడుకులకు గాయాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు తీవ్రగాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గులిగుడ గ్రామానికి చెందిన గలియాదు బ్రేకబడ, అతని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి కుచేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గలియాదు బ్రేకబడ ద్విచక్ర వాహనంపై అంబొదల గ్రామంలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు కొడకుతో వెళ్తుండగా మునిగుడ నుంచి భవానీపట్నం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని అక్కడే విడిచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కొరాపుట్
● అమాయకత్వమే ఇక్కడి ప్రజల చిరునామా ● పరవ్–25లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాయగడ/కొరాపుట్: కళలు, భాష, సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా కొరాపుట్ నిలుస్తోందని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి అన్నారు. కొరాపుట్లో జరుగుతున్న పరవ్–25 ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకత్వమే ఇక్కడి ప్రజల చిరునామా అని, జీవన శైలి, ఆచార వ్యవహారాలు అందరినీ మైమరపిస్తుంటాయని చెప్పారు. ఎంతోమంది అమర వీరులకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన కొరాపుట్ పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకృతి సంపదలకు నియమైన ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సహీద్ లక్ష్మణ్ నాయక్ వంటి స్వాతంత్ర సమరయోధులకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన కొరాపుట్ జిల్లా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. కొరాపుట్ జిల్లా కాఫీ తొటలకు అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రగతి చెందేలా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కొట్పాడ్లో రూపొందుతున్న చేనేత వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయని చెప్పారు. మిల్లెట్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జిల్లాలో 71 హెక్టార్ల విస్తీర్ణంలొ మిల్లెట్లు సాగవుతున్నాయని వివరించారు. అభివృద్ధి పనులకు రు.545 కోట్లు.. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.545 కోట్లు మంజూరు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. మంజూరైన నిధులతో సుమారు 86 ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మంజూరైన నిధుల్లో రూ.24 కోట్లతో 16 ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మరో రూ.521 కోట్లతో 70 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగిందన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశ్రామిక ప్రగతి, రహదారులు, మిశన్ శక్తి భవనాల నిర్మాణం, అటవీ సంరక్షణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పరవ్ ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను సీఎం మాఝి ఆవిష్కరించారు. రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి గోకులానంద మల్లిక్ మాట్లాడుతూ కొరాపుట్ జిల్లాలోని ఆదివాసీల భాష, సంస్కృతి, కళారంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అంబరాన్నంటిన సంబరాలు.. పరవ్–25 ఉత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం సహీద్ లక్ష్మణ్ నాయక్ మైదానంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి మాఝి ప్రారంభించారు. ఎస్హెచ్జీ బృందాలకు చెందిన మహిళలు రూపొందించిన వస్తువులను పరిశీలించారు. వ్యవసాయ శాఖ రైతులకు చైతన్యవంతులను చేయడంతో పాటు భూసంరక్షణ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం పుష్ప ప్రదర్శన తిలకించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండ, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురామ్ మచ్చ, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత తదితరులు హాజరయ్యారు. విద్యుత్ అలంకరణలతో పరవ్–25 ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులను సన్మానించారు. -
ఆకట్టుకున్న సంగీత విభావరి
పర్లాకిమిడి: అన్నమయ్య సంగీత కీర్తనలు వింటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుందని కిరణ్మయి పాఠశాల (పాతపట్నం) తిరుపతిరావు మాస్టారు అన్నారు. స్థానిక జంగం వీధి జంక్షన్లో సింహాద్రి అప్పన్న ఫంక్షన్ హాలులో సోమవారం లలిత సంగీత పాఠశాల పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఫ్లూట్ కళాకారుడు వెల్లంకి కూర్మనాథం ఆధ్వర్యంలో సులలిత సంగీత భారతి కార్యక్రమం నిర్వహించారు. సినీ గాయనీ, విజయనగరానికి చెందిన సురభి శ్రావణి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. తబలాపై బండారు రమణమూర్తి, కీబోర్డుపై మండా కామేశ్వరరావు, రమణ, వర్ధమాన కళాకారుడు నరేష్ తదితరులు సహకరించారు. కార్యక్రమంలో డాక్టర్ రామలక్ష్మీ, లలిత సంగీత పాఠశాల అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆర్.రవి, మరువాడ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవం అదిరింది..
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లొ ఆదివారం నుంచి కొనసాగుతున్న ఇడితాల్ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. కళాకారులను ప్రోత్సాహించడంతో పాటు ఆదివాసీల భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు ఇడితాల్ పేరిట ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. లంజియా సవర తెగకు చెందిన ఆదివాసీల కళారంగానికి ప్రతీకగా నిలిచే ఇడితాల్ చిత్రపటాన్ని ఈ సందర్భంగా గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లిప్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగోకు అందించి సన్మానించారు. కళారంగంలో గొమాంగో హిడెన్ టాలెంట్ పేరిట ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన గిరిధర్ గొమాంగో కళారంగానికి చేసిన సేవలు ప్రశంసనీయమని సబ్ కలెక్టర్ దిల్లిప్ కొనియాడారు. అనంతరం వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా అదనపు కలక్టర్ నిహారి రంజన్ కుహరో ప్రారంభించారు. కార్యక్రమంలొ గుణుపూర్ ఎంఎల్ఏ సత్యజీత్ గొమాంగో, మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివగౌడో పాల్గొన్నారు. -
పశువుల కంటైనర్ బోల్తా
జయపురం: చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న ఒక కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న దాదాపు 40 పశువులు దుర్మరణం చెందాయి. ఈ సంఘటన శనివారం రాత్రి జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి కుమరగాం గ్రామ సమీపంలో జరిగింది. ఆ కంటైనర్లో 50 పశువులు రవాణ చేస్తున్నారని, వాటిలో 40 మరణించగా 10 పశువులు జీవించి ఉన్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన తర్వాత కంటైనర్ డ్రైవర్ పారిపోయాడు. నేటి ఉదయం కొంత మంది స్వయం సేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) సభ్యులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కంటైనర్లో చిక్కుకొని ఉన్న 10 పశువులను వారు అతికష్టంతో బయటకు తీసి రక్షించారు. సమాచారం అందుకున్న కొట్పాడ్ తహసీల్దార్ ట్వింకిల్ సెట్టి, కొట్పాడ్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మరణించిన పశువులను ట్రాక్టర్ ద్వారా సమీప అడవిలో ఒక చోటికి చేర్చి వాటిపై తెల్లని కొత్త బట్టలు కప్పి పూడ్చి పెట్టారు. చట్ట వ్యతిరేకంగా పశువులను ఇతర రాష్ట్రానికి తీసుకువెళ్తున్న వ్యక్తులను, డ్రైవర్ని అరెస్టు చేయాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వైభవంగా ..రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఇడితాల్ ఉత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జగన్నాథ మందిరం నుంచి ఆదివాసీ మేళ తాళాలతో, సంప్రదాయ వాయిద్యాలతో, ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాల నడుమ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలు గుణుపూర్ సేవాసమాజ్ సమీపంలోని మైదానంలో నిర్వహిస్తారు. ప్రారంభోత్సవాల్లో భాగంగా వంశధార నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి జగన్నాథ మందిరంలో నిలిపారు. అనంతరం అక్కడ నుంచి కలశ యాత్ర ప్రారంభమయ్యింది. సబ్ కలక్టర్ (గుణుపూర్) దుదూల్ అభిషేక్ దిల్లిప్, మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడో, వైస్చైర్మన్ శివ నారాయణ గౌడో, గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్ర ధ్వజ పండ, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో తదితరులు కలశ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడుగడుగునా సబ్ కలెక్టర్ వాయిద్యాలను వాయిస్తూ.. నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం వేదిక వద్ద జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో సబ్కలెక్టర్ అభిషేక్ మాట్లాడుతూ.. చొయితీ ఉత్సవాలను ప్రతిఏడాది గుణుపూర్లో ఇడితాల్ పేరిట నిర్వహిస్తుండటం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ ప్రాంతంలోని లంజియా సవర కళలను ఇడితాల్గా పిలుస్తుంటారు కాబట్టి వారి సంప్రదాయాన్ని గౌరవించి ఈ ఉత్సవాలను ఇడితాల్గా గుర్తించి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా దివ్యదర్శన్ వారి స్టాల్ను ఏర్పాటు చేశారు. -
ఘన సత్కారం
పర్లాకిమిడి: దక్షిణ ఒడిశాలో విశిష్ట యువ గాయకుడు డాక్టర్ చందన్ గంతాయత్ను ఒడిశా సంగీత నాటక అకాడమీ ద్వారా కవిచంద్ర కాళీచరణ్ పట్నాయక్ యువప్రతిభా అవార్డు అందుకున్న సందర్భంగా పర్లాకిమిడి క్రియేటివ్ ఆర్ట్స్, పేరొందిన సంస్కృతిక సంస్థ భక్తి నైవేద్యంతో కలిసి సత్కరించారు. ఈ సత్కార సభ స్థానిక కరణం వీధిలో లక్ష్మీనర్సింహ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సత్కార సభకు జిల్లా సాంస్కృతికశాఖ అధికారి అర్చనా మంగరాజ్, సంగీత దర్శకులు రఘునాథ పాత్రో, నాటకరంగం కళాకారుడు ఆదర్శ దాస్, నృసింహా చరణ్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. డాక్టర్ చందన్ గంతాయత్ రాయగడ జిల్లా గుణుపురం వాసి అయినా గంజాం జిల్లాలో డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. సంగీత సాధనలో అనేక కార్యక్రమాల్లో డాక్టర్ చందన్ గంతాయత్ పర్లాకిమిడి కళాకారులకు సుపరిచితుడే అని క్రియేటివ్ ఆర్ట్స్ అధ్యక్షుడు నృసింహా చరణ్ పట్నాయక్ అన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
రాయగడ: ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్ర పశుసంవర్ధక, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల మంత్రి గోకులానంద మల్లిక్ అన్నారు. కొరాపుట్లో ఆదివారం జరిగిన పరబ్–25 కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం స్థానిక ప్రేమ్ పహాడ్ను సందర్శించారు. సుమారు కిలోమీటరు దూరం గల ప్రేమ్ పహాడ్ చుట్టూ నడకను కొనసాగించిన ఆయన అనంతరం అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్, పట్టణ ప్రముఖులు ఆయనతో పలు సమస్యలు చెప్పుకున్నారు. ప్రేమ్ పహాడ్కు ఎంతొ మంది వాకింగ్ కోసం వస్తుంటారని వాకర్స్ క్లబ్కు చెందిన బ్రజసుందర్ నాయక్, సత్యవాది పతి తదితరులు వివరించారు. ప్రేమ్ పహాడ్ను సుందరీకరణ చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, పహాడ్ మీద యోగా గదుల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి మల్లిక్ వెంటనే కలెక్టర్ అశుతొష్ కులకర్ణికి ఫోన్ చేసి ఈ ప్రేమ్ పహాడ్ అభివృద్ధికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్లును సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రభాతి పరిడ దృష్టికి తీసుకువెళతానని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో ఈ ప్రాంతం పర్యాటక రంగంగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఆయన ఒక టీ దుకాణంలో కూర్చుని టీ తాగారు. అక్కడ ఉన్న జనాన్ని పిలిచి మరీ రాయగడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్, బీజేడీ హయాంలో రాయగడ జిల్లా ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాయగడపై ప్రత్యేక దృష్టిని సారించారని మంత్రి మల్లిక్ అన్నారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బ్రజసుందర్ నాయక్ మాట్లాడుతూ మంత్రి ఆకస్మికంగా ప్రజల వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకోవడం ఇదే మొదటి సారని అన్నారు. -
వైజ్ఞానిక రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం
రాయగడ: వైజ్ఞానిక రంగంలో విద్యార్థులను ప్రోత్సాహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అన్నారు. అందుకు ఇటువంటి తరహా సైన్స్ ప్రదర్శనలు దోహద పడతాయని ఆకాంక్షించారు. ఆధునిక యుగంలో అడుగులు వేస్తున్న మనం అందుకు అనుగుణంగా ముందుకు సాగాలంటే అందుకు శ్రద్ధతోపాటు ఏకాగ్రత ఎంతో అవసరమని అన్నారు. ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని.. దానిని వెలుగు తీసేందుకు ఇటువంటి తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, పాఠశాల ప్రధానొపాధ్యాయురాలు సునీత భొయ్, జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ సూపర్వైజర్ దీపక్ కుమార్ బెహర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 11 సమితుల నుంచి 70 పాఠశాలలకు చెందిన 143 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. -
అదుపుతప్పిన మినీ బస్సులు
● 17 మంది ప్రయాణికులకు గాయాలు పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మహేంద్రగిరి పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న రెండు మినీ బస్సులు కొండ దిగుతుండగా మలుపు వద్ద అదుపుతప్పి పల్టీ కోట్టాయి. 17 మందికి గాయాలయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. గారబంద పోలీసు అధికారి ప్రఽషాంత్ కుమార్ నిషిక తెలియజేసిన వివరాల మేరకు.. ఖుర్దా, డెంకనాల్ నుంచి రెండు మినీ టూరిస్టు బస్సుల్లో మహేంద్రగిరి పర్వత్వానికి బయలుదేరారు. అక్కడ మందిరాలు దర్శించుకుని తిరిగి బుర్ఖాత్ పాస్ వస్తుండగా ఒక బస్సు బ్రేకులు ఫెయిలయ్యి అదుపుతప్పి రోడ్డు పక్క తిరగబడింది. వెనుక నుంచి వస్తున్న మరో టూరిస్టు బస్సు అదే స్థలం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ సంఘటనలో గాయపడిన వారిని దగ్గరలో ఉన్న కోయిపూర్ వద్ద ప్రాథమిక చికిత్స చేశారు. సంఘటనా స్థలానికి గారబంద పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత కుమార్ నిషిక సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను ఖోజురిపద సీహెచ్సీ అంబులెన్స్లో పంపించారు. కేసును గారబంద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
రాయగడ: బీజేడీ పార్టీలో కీలకపాత్ర పొషించే స్థానిక రైతుల కాలనీకి చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక సమక్షంలో వారంతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. బీజేడీకి రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఉన్న వారంతా ఇతర పార్టీలకు వలస పోతున్నారు. తాజాగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఇదే తరహా బీజేడీ (రాయగడ) పార్టీకి సేవలందిస్తున్న యువత కూడా ఆ పార్టీకి దూరమవుతుండటం చూస్తే జిల్లాలో ఆ పార్టీ ఉనికి కొల్పొతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందని ఈ సందర్భంగా అన్నారు. గత ఎన్నికల్లో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ కై వసం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. తుబాటి రాము, వేణు, అరవింద్, మనోజ్, సంతోష్, మహేష్ తదితరులు కాంగ్రెస్లో చేరిన వారిలో ఉన్నారు. -
ఘనంగా సరస్వతి శిశు విద్యామందిర్ వార్షికోత్సవం
పర్లాకిమిడి: సరస్వతి శిశు విద్యా మందిర్లో చదువుతున్న విద్యార్థులకు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, సుసంప్రదాయం ప్రతీక అని ఏడీఎం, ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగా అన్నారు. ఒడిశాలో ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం, ఏ1 గ్రేడ్లు సాధిస్తున్న ఏకై క విద్యాలయం సరస్వతి శిశు విద్యామందిర్ అని అన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ ముఖ్యఅతిథిగా విచ్చేసి సోండివీధి సమీపంలో ఉన్న సరస్వతి శిశు విద్యామందిర్ 36 వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వార్షికోత్సవానికి పోలీసు విభాగం మాజీ సూపరింటెండెంట్ సుభాష్చంద్ర జమాదార్, ఎత్తిపోతల శాఖ, అసిస్టెంటు ఇంజినీరు మనోజ్ కుమార్ చౌదరి, ఉపప్రధాన అచార్యులు సంతోష్ పాడి, విద్యాలయం కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, వివిధ క్రీడా పోటీలలో విజయం సాధించినవారికి బహుమతులను ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఆచార్యులు సరోజ్ కుమార్ పండా ఆధ్వర్యంలో నిర్వహించారు. -
పురస్కారం అందజేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితికి చెందిన సుక్దేవ్, రుక్మిణి జంటకు శనివారం భూవనేశ్వర్లో కనక న్యూస్, సంబాద్ దినపత్రిక తరఫున పురస్కారం అందజేశారు. ఈ జంట 2003 నుంచి కలిమెల దళంలో చేరారు . వీరు ప్రేమించుకోని దళం వదిలి 2014లో వివాహం చేసుకున్నారు. సమితిలో ఉంటూ ఎందరో మావోలను జనజీవనంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత్తం సుక్దేవ్ కలిమెల ల్యాంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజాలకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ జంటకు కనక న్యూస్ మేకర్ 2025 కార్యక్రమంలో భాగంగా పురస్కారన్ని అందజేశారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రైతుబజారు వద్ద ఉన్న చేపల మార్కెట్లో తూనికలు కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ బలరామకృష్ణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకాల్లో తేడాలు ఉండటంతో 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాటాలను కార్యాలయానికి తీసుకెళ్లి నిర్వాహకులకు జరిమానా విధించినట్లు చెప్పారు. -
కాలి బూడిదైన పదెకరాల పంట
జయపురం: పది ఎకరాల్లో పండిన ధాన్యం చేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. జయపురంసబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఖిలోగుడ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఖిలోగుడ గ్రామంలో శివ నాయిక్ తనకున్న 10 ఎకరాల పొలంలో ధాన్యం పండించారు. పంట కోసి కళ్లంలో కుప్ప వేశాడు. అయితే సోమవారం అకస్మత్తుగా కుప్పలకు నిప్పు అంటుకుని మంటలు విస్తరించాయి. మంటలు ఆర్పేందుకు అక్కడి రైతులు ప్రయత్నించారు. అంతే కాకుండా వారు బొయిపరిగుడ అగ్ని మాపక విభాగానికి ఫోన్ చేశారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి స్థానికుల సహకారంతో మంటలు ఆర్పారు. అయితే అప్పటికే ధాన్యం కుప్పలు కాలి బూడిదయ్యాయి. ఆ కళ్లంలో ఇతర రైతుల ధాన్యం కుప్పలు ఉన్నాయి అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇతర ధాన్యం చేను కుప్పలకు మంటలు విస్తరించకుండా ఆర్పారు. అతిథి గృహం నుంచి మృత దేహం స్వాధీనం భువనేశ్వర్: స్థానిక మైత్రి విహార్ ఠాణా పోలీసులు నాల్కో చౌక్లోని అతిథి గృహం నుంచి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముక్కు నుంచి నురగ, నోటి నుంచి రక్తం రావడంతో సందిగ్ధత నెలకొంది. ఈ నెల 20వ తేదీన అతడి భార్య ధౌలీ పోలీస్ ఠాణాలో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. 19వ తేదీన ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని చిట్ట చివరి సారిగా ఫోన్ చేసినట్లు పోలీసులకు వివరించింది. ఆమె ఒక యువతి పేరుతో హత్య ఫిర్యాదు నమోదైంది. సీసీటీవీని తనిఖీ చేసి యువతిని అదుపులోకి నిజాన్ని వెలుగులోకి తెస్తామని పోలీసు దర్యాప్తు బృందం అభయం ఇచ్చింది. భక్తిశ్రద్ధలతో ధనుర్మాస వ్రతాలు రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయంలో పవిత్ర ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలతో పాటు వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్వామి వారికి సుప్రభాత సేవలతో పాటు విశేష అలంకరణ, హోమం, అర్చనలు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రతాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు సేవించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరునికి పూలు, తులసీ దళాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చిలికా సరస్సులో మునిగి పర్యాటకుడు మృతి భువనేశ్వర్: పూరీ జిల్లా బ్రహ్మగిరి ప్రాంతం సతొపొడా సందర్శనకు వెళ్లిన పర్యాటకుడు చిలికా సరసులో మునిగిపోయాడు. చిలికా నది ముఖద్వారంలో ఈత కొడుతూ ఈ ప్రమాదానికి గురయ్యాడు. బఘొముండా తీరంలో గాలించి అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రాయగడలో వైఎస్ జగన్ జన్మదినోత్సవం రాయగడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాలను స్థానిక డైలీ మార్కెట్లో ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎస్.సునీత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొంతమంది పేదలకు అన్నదానం చేయడంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బాణసంచాలు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. -
తీగ లాగితే పిస్టల్ బయటకొచ్చింది!
● సీతారత్నం హత్య కేసు దర్యాప్తులో కీలకమలుపు ● పిస్టల్తో సంబంధమున్న ఐదుగురు అరెసు్ట శ్రీకాకుళం క్రైమ్ : నగరానికి చెందిన గురుగుబెల్లి సీతారత్నం (42) హత్యకేసు మరో కీలక కేసుకు క్లూ అందించింది. సీతారత్నంను కారులో ఎక్కించుకుని ఎచ్చెర్ల కేశవరావుపేట సమీపంలో ఈ నెల 2న హత్య చేసిన నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్కుమార్ వద్ద పిస్టల్ ఉందన్న సమాచారం విచారణ సమయంలో పోలీసులకు తెలిసింది. ఆ పిస్టల్ ఎలా వచ్చింది.. ఎక్కడ దాచావ్ అన్న కోణంలో విచారించగా మరో ఐదుగురు నిందితుల సమాచారం పోలీసులకు చిక్కింది. నిందితులైన పంచిరెడ్డి కై లాస్(బొంతలకోడూరు), అలబాన మణి (గుజరాతీపేట), కలగ ఉమామహేశ్వరరావు (పెద్దపాడు), పూర్ణాన ప్రశాంత్కుమార్ (కోటబొమ్మాళి మండలం నారాయణవలస), దండాసి కార్తీక్ (ఎల్ బీఎస్ కాలనీ, శ్రీకాకుళం)లను అరెస్టు చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రశాంత్ను విచారిస్తున్నప్పుడే.. సీతారత్నం హత్య కేసులో ప్రశాంత్ను డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారంలు విచారణ చేస్తున్నపుడు పిస్టల్ ఉందన్న సమాచారం తెలియడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఒకప్పుడు ఉన్నమాట వాస్తవమేనని, ఆ పిస్టల్ నగరంలోని ఎల్బీఎస్కాలనీకి చెందిన దండాసి కార్తీక్కు రూ. 17 వేలకు అమ్మినట్లు చెప్పాడు. ఇదే విషయం ఎస్పీకి తెలియడంతో మరింత లోతుగా దర్యాప్తు చేయమని డీఎస్పీకి ఆదేశించారు. కార్తీక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో తనతో పాటు మరికొందరున్నారని చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది ఫరీద్పేటలో టీడీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన సత్తారు గోపి రెండేళ్లక్రితం బొంతలకోడూరుకు చెందిన పంచిరెడ్డి కై లాస్తో కలసి నేరాలు చేసేందుకు ఒడిశా రాష్ట్రం బరంపురంలో సంతోష్ అనే వ్యక్తి వద్దరూ.90 వేలు పెట్టి పిస్టల్ను, 3 రౌండ్లను కొనుగోలు చేశాడని నిర్ధారించారు. అదే పిస్టల్ను పంచిరెడ్డి కై లాస్ వద్ద తాజా హత్యకేసులో నిందితుడైన గొల్లపల్లి ప్రశాంత్కుమార్ కొంతమొత్తానికి కొన్నట్లు చెప్పారు. తర్వాత కార్తీక్కు రూ.17 వేలకు అమ్మిన సంగతి తెలిసిందే. పిస్టల్ మళ్లీ అడగడంతో.. కార్తీక్ వద్ద ఉన్న పిస్టల్ను పంచిరెడ్డి కై లాస్, మణి, ఉమామహేశ్వరరావు, పూర్ణాన ప్రశాంత్కుమార్లు మళ్లీ అడగడంతో తండేవలస ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో పిస్ట్ల్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని, అదే సమయంలో రూరల్ ఎస్ఐ రాము తమ సిబ్బందితో మాటువేసి పట్టుకున్నారన్నారు. అసలు ఆ పిస్టల్ ఎందుకు కొన్నారు.. ఏ నేరం చేయడానికి కొన్నారు.. ఎవరు ఆర్థిక సహాయం చేశారన్నదానిపై దర్యాప్తు చేసి పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐ, ఇతర బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పిస్టల్, మూడు రౌండ్ల మాక్టిన్ -
హంతకుడిని పట్టించిన వాట్సాప్ కాల్
● కేశవరావుపేట వద్ద మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ ● నిందితుడు సంతపేటకు చెందిన ప్రశాంత్గా గుర్తింపు ● వివాహేతర సంబంధమే కారణం శ్రీకాకుళం క్రైమ్ : హత్య కేసులో నిందితుడిని వాట్సాప్ కాల్స్ పట్టించాయి. అదే హంతకున్ని పోలీసులు విచారిస్తున్నప్పుడు మరో కీలక కేసుకు క్లూ లభించింది. ఈ నెల 3న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట హైవే వద్ద బయటపడిన మహిళ మృతదేహం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరానికి చెందిన గురుగుబెల్లి సీతారత్నం (42)ను కేశవరావుపేట వద్ద హత్య చేసి హైవే మీద పడేసింది నరసన్నపేట సంతపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్కుమార్ (32)గా పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రెండేళ్లుగా పరిచయం.. సీతారత్నంకు నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్కుమార్తో రెండేళ్లక్రితం పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రశాంత్ మొదట్లో పెయింటర్గాను తర్వాతి కాలంలో సొంతంగా ఆటో నడుపుకుంటూ ఓ కారు కూడా కొన్నాడు. ఈ నెల 2న ప్రశాంత్కు సీతారత్నం కలిసి కారులో సింహద్వారం నుంచి కొత్తరోడ్డువైపు సర్వీసురోడ్డులో వెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆగారు. తనకు రూ.50 వేలు కావాలని, ఇవ్వకపోతే తన విషయాన్ని భార్యకు చెప్పేస్తానని సీతారత్నం బెదిరించింది. దీంతో సీతారత్నం వల్ల ఎప్పటికై నా ప్రమాదమేనని భావించి కారును ఎచ్లెర్ల వైపు తీసుకొచ్చి జనసంచారం లేని చోట కారు ఆపాడు. సీతరాత్నం చీర చెంగు, పుస్తెల తాడుతో మెడను బిగించి చంపేశాడు. అదేమార్గంలో రెండు మూడు చోట్ల శవాన్ని పడేద్దామన్నా కుదరకపోవడంతో కింతలి మిల్లు జంక్షన్కు వచ్చే సర్వీసురోడ్డు పక్కన శవాన్ని పడేసి, పుస్తెల తాడు, ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్తో పరారయ్యాడు. వాట్సాప్ కాల్సే పట్టించాయి.. 3న మృతదేహం బయటపడటం, పోలీసులు సీతా రత్నం కుటుంబీకుల వాంగ్మూలంతో గుర్తించడం.. డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలోని సీఐ ఎం.అవతారం తమ బృందంతో దర్యాప్తు చేపట్టి మృతురాలి వాట్సాప్కాల్స్ మాట్లాడిన నంబర్లను గుర్తించారు. హత్య జరిగిన సమయానికి ముందుగా, కొద్ది రోజులుగా ఎక్కువగా మాట్లాడింది ప్రశాంత్ నంబర్ అని తేలడం.. అడ్రస్ నరసన్నపేట అని ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల్లో కారునెంబరును గుర్తించి నిందితుడు ప్రశాంత్గా నిర్ధారించారు. ప్రశాంత్ చిన్నతనంలోనే ద్విచక్రవాహనాన్ని దొంగిలించి జువైనల్ హోమ్కు వెళ్లాడని ఎస్పీ తెలిపారు. పట్టుకున్నారిలా.. సీఐ అవతారానికి వచ్చిన సమాచారంతో జర్జాం కూడలిలో దాబా వద్ద కారులో ఉన్న ప్రశాంత్ను ఎస్ఐ, సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. అతని వద్ద రోల్డ్ గోల్డ్ చైను, బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారం, ఎచ్చెర్ల పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
జీసీడీ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గం
రాయగడ: స్థానిక జీసీడీ వాకర్స్క్లబ్కు నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. క్లబ్ అధ్యక్షులుగా జగన్నాధ సాహు, ఉపాధ్యక్షులుగా వివేకానంద సాహు, జామి రాజ, కార్యదర్శిగా ముచ్చి రవి, సహాయ కార్యదర్శిగా కింతలి సురేష్, పొలి వాకర్స్గా గుడ్ల నెహ్రూ, కోశాధికారిగా సుభాష్ చంద్ర బారిక్లు నియమితులయ్యారు. జీసీడీ మైదానంలో ఆదివారం ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో క్లబ్ వ్యవస్థాపకులు సురేంద్ర సాహు, మాజీ అధ్యక్షులు చిన్నారి విజయ్ మోహన్, మనోజ్ రథ్, దీపక్ పృష్టి, అజిత్ కుమార్ సుబుద్ధి పాల్గొన్నారు. కొత్త ఏడాది నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తుందని సభ్యులు తెలిపారు. -
ఖుర్దా రోడ్లో సండే ఆన్ సైకిల్–సైక్లోథాన్ 2025
భువనేశ్వర్: ఫిట్ ఇండియా చొరవలో భాగంగా, ఖుర్దా రోడ్లోని తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం (ఈకోర్సా) ఆదివారం సండే ఆన్ సైకిల్–సైక్లోథాన్ 2025 నిర్వహించింది. మండల రైల్వే అధికారులు పచ్చ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు, సాధారణ ప్రజలలో శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ అవగాహన ప్రోత్సాహం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఖుర్దా రోడ్ రైల్వే మండలం సీనియర్ వాణిజ్య అధికారి, క్రీడాధికారి అనిల్ కుమార్, ఎస్ సమక్షంలో అదనపు మండల రైల్వే అధికారి సుభ్రో జ్యోతి మండల్ ఈ సైక్లోథాన్ను ప్రారంభించారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన రవాణా విధానాల పట్ల రైల్వేల నిబద్దతకు ఈ కార్యక్రమం అద్దం పడుతుందన్నారు. -
కూర్మనాథున్ని దర్శించుకున్న వరప్రసాద్రెడ్డి
గార : ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని శాంతా బయోటిక్ అధినేత పద్మభూ షణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఎన్ఆర్ఐ తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్, సంప్రదాయం డైరెక్టర్ స్వాతిసోమనాథ్, పి.సుగుణాకరరావు ఉన్నారు. కార్యక్రమంలో ఈఓ టి.వాసుదేవరా వు, అర్చకులు పాల్గొన్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ ప్రధా న రహదారిపై కొత్తకోటవారి వీధి జంక్షన్ వద్ద ఆదివారం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం తప్పించబోయి డివైడర్పై ఉన్న విగ్రహం దిమ్మను ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు, ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యా యి. ఆటో పొందూరు మండలం లోలుగు నుంచి సరుబుజ్జలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెళియాపుట్టి: గొప్పిలి గ్రామంలో రైతు పిట్ట శంకరరావుకు చెందిన వరి కుప్ప కాలిపోయింది. ఆదివారం సాయంత్రం పక్కపొలంలో గడ్డికాల్చడానికి రైతు మంటపెట్టడంతో నిప్పురాజుకుంది. పలాస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చినా పొలాల్లోకి వాహనం వెళ్లడానికి వీలు కాలేదు. గ్రామస్తులు నిప్పు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాంతో 50 సెంట్లకు సంబంధించి సుమారు 13 బస్తాల ధాన్యం కాలిపోయింది. పలాస: కోసంగిపురం జంక్షన్ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన రాజేంద్ర సబార్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు కాశీబుగ్గు ఎస్ఐ ఆర్.నరసింహమూర్తి తెలిపారు. 10.795కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): హక్కుల పరిరక్షణ కు పోరాటాలు తప్పనిసరని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పిలుపుని చ్చారు. ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 15వ మహాసభల సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని డైమండ్ పార్క్ నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఆదివారం నిర్వహించారు. లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టం తప్పదని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, నాయకులు టి.తిరుపతిరావు, సీహెచ్ గోవిందరావు, శేషు, టి.ముత్యాలరా వు, డి.కిరణ్, వై.సూర్యనారాయణ, బి.అప్పలరాజు, లబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు. సోంపేట: క్రీడలతో పోటీతత్వం పెరుగుతుంద ని సోంపేట ఎస్ఐ వి.లోవరాజు అన్నారు. స్థానిక ధ్యాన్చంద్ స్కేటర్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం స్కేటింగ్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలు ఆదివారం నిర్వహించారు. విజేతలకు ఎస్ఐ చేతు ల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు టి.వెంకటరమణ, టి.ప్రణీత్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుఽలు ఎ.షణ్ముఖరావు, బి.చంద్రావతి పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి స్కూల్గే మ్స్ అండర్–17 బాలికల క్రికెట్ పోటీల్లో విజేతలై తిరిగిరావాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బీవీ రమణ ఆకాంక్షించారు. విజయవాడలో ఈ నెల 22 నుంచి జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలికల జట్టు ఆదివారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లారు. -
సెంచూరియన్ వర్సిటీలో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో శ్రీవిద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామివారి మంగళాశాసనం, విశ్వక్షేనారాధన, వాసుదేవ పూర్ణావహాం, సుదర్శన కుంభ ప్రతిష్ట, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహనం, నిత్యపూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను పర్లాకిమిడికి చెందిన పండితులు అనుమంచిపళ్లి రాజగోపాలాచారి, ఆచారత్వంను సరిసఖ్యాత మమాచార్యులు (శ్రీకూర్మం), అర్చకులు ఆరవెల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్ రావు దంపతులు, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మంగళవారం వరకూ క్యాంపస్లో జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలియజేశారు. -
ఏడుగురు విద్యార్థులు సస్పెండ్
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి బలిమెల ప్రాంతంలో ఉన్న నవోదయ విద్యాలయంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యాలయంలో శనివారం ఇద్దరు 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 11వ తరగతి విద్యార్థులు ఘర్షణ చేసిన విద్యార్థులను పిలిచి కొట్టారు. వారికి కేర్ టేకర్ విశ్వజీత్ సర్కార్ సహకరించి మరింతగా కొట్లేలా ప్రోత్సహించాడు. ఈ విషయం పాఠశాల ప్రిన్సిపాల్ రాము రాచాకు తెలియడంతో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించారు. దీనిలో భాగంగా విద్యార్థులను కొట్టిన ఏడుగురు 11వ తరగతి విద్యార్థులను సస్పెండ్ చేశారు. అలాగే కేర్ టేకర్ విశ్వజీత్ను విధుల నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలియజేశారు. -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
జయపురం: జయపురంలో అమాయకులను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన కాటుగాళ్లు మరో ఇద్దరినీ మోసం చేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేశారు. జయపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గొడియదొబాసాహిలోకి చెందిన దేబాశిష్ నాయిక్కు ఈనెల 16 తేదీన ఒక కాల్ వచ్చింది. తాము బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి, తాము వాట్సాప్కు పంపించిన ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలని సూచించారు. దీంతో అతడు డౌన్లోడ్ చేశాడు. అనంతరం అనుమానం వచ్చి తర్వాత రోజు తన బ్యాంక్ అకౌంట్ను చెక్ చేయగా, అతడి అకౌంట్ నుంచి రూ.99,970లు మాయమయ్యాయి. వెంటనే అతడు 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. బహుమతి పేరుతో బోల్తా పట్టణానికి చెందిన బీకే పాత్రో సైతం సైబర్ ఉచ్చులో చిక్కుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అతడికి గత నెల 30వ తేదీన ఒక కాల్ వచ్చింది. అకౌంట్ బాగా నిర్వహిస్తున్న కారణంగా బ్యాంక్ నుంచి రూ.40 వేలు బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ డబ్బు తీసుకునేందుకు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.7,139లు చెల్లించాలని తెలిపారు. అలాగే కొన్ని రోజుల తర్వాత అతడికి మరో ఫోను వచ్చింది. తన బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ ఫోటో తీసి పంపమని చెప్పారు. అతడు అలాగే చేయడంతో అకౌంట్ నుంచి రూ.7,139లు కట్ అయ్యాయి. మరలా 2027 తర్వాత డబ్బు కట్ చేస్తామని మెసేజ్ వచ్చింది. తనకు ఏ డబ్బు రాకుండా ఎందుకు తన ఖాతా నుంచి డబ్బులు కట్ చేస్తున్నారనే అనుమానంతో జయపురం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్ వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
కోట్పాడ్లో సినిమా షూటింగ్
కొరాపుట్: జిల్లాలోని కోట్పాడ్ పట్టణంలో తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎటువంటి హంగామా లేకుండా కోట్పాడ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. కోట్పాడ్కి చెందిన వివేకనంద వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ స్వస్థలంలో షూటింగ్ చేయిస్తున్నారు. ఈ సినిమాకి వరప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోగా వివేక్ వర్మ, హీరోయిన్గా సంకీర్తన, మరో ముఖ్యపాత్రలో కామెడియన్ సప్తగిరి నటిస్తున్నారు. షూటింగ్ను చూసేందుకు సమీప తెలుగు ప్రజలు తరలి వెళ్తున్నారు. మరో 15 రోజులు కోట్పాడ్ ప్రాంతంలో షూటింగ్ జరగనుంది. ఈనెల 25వ తేదీ నుండి భారీ సన్నివేశాల షూటింగ్ జరపనున్నారు.రైతుకు పరిహారం అందజేత జయపురం: ఈనెల 17వ తేదీన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి చికాపూర్ పంచాయతీ డొంగధార గ్రామంలోని ఒక కల్లంలో 4 ఎకరాల్లో పండిన ధాన్యం కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ తహసీల్దార్ స్నిగ్ద చౌదరి, చికాపూర్ పంచాయతీ సర్పంచ్ రాజు ఖిళో కలిసి గ్రామానికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. దీంతో బాధిత రైతు రమేష్ గొలారికి పరిహారంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని శనివారం అందజేశారు. రక్తదాన శిబిరం జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్రలోని అరవింద శిక్షా నికేతన్ ప్రాంగణంలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా దాతల నుంచి 33 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ సాధన సభ్యుడు యజ్ఞేశ్వర పండ మాట్లాడుతూ రక్తదానం మహత్తర దానమని, మనం ఇచ్చే ప్రతి రక్తపుబొట్టు ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులను కాపాడుతుందన్నారు. అనంతరం జిల్లా జూనియర్ రెడ్క్రాస్ సాధన సభ్యుడు రాధాశ్యామ్ సాహు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్క్రాస్ అధికారి హరేకృష్ణ మహరాణ, కొరాపుట్ జిల్లా సాధన సభ్యుడు జ్యోతీ రంజన్ నంద తదితరులు పాల్గొన్నారు.కోరుకొండ ఐఐసీగా విజయ్కుమార్ మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి నూతన ఐఐసీగా ఆర్.విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఐఐసీ హిమాంశు శేఖర్ బారిక్ను మల్కన్గిరి ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. అందరి సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని విజయ్కుమార్ తెలియజేశారు.ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణశ్రీకాకుళం రూరల్: హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
కోత కోసిన వరిపంట దగ్ధం
మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి నువగూడ పంచాయతీ ఆర్ఎస్సీ 11 గ్రామంలో కోతకోసిన వంటపంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన నలుగురు రైతులు కోత కోసిన పంటను నూర్పు చేసేందుకు ఒక దగ్గర ఉంచారు. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోయింది. దీంతో సుబా తామరబువ, మంగళా మల్లిక్, బలరాంహంతాల్, నారాయణ్ ఖిల్కు భారీ నష్టం వచ్చింది. విషయం తెలుసుకున్న చిత్రకొండ అగ్నిమాపక బృందం వచ్చి మంటలను అదుపు చేశారు. అలానే రెవెన్యూ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేశారు. త్వరలో నష్ట పరిహారం అందజేస్తామన్నారు. -
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● ముగిసిన సైన్స్ ఎగ్జిబిషన్మల్కన్గిరిలోని ఉన్నత పాఠశాల అవరణలో జరుగుతున్న రెండు రోజుల సైన్స్ ఎగ్జిబిషన్ శనివారంతో ముగిసింది. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి మాట్లాడుతూ.. ఇటువంటి పోటీల్లో పాల్గొంటే విద్యార్థుల మేధాశక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. మొత్తం 7 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి మంజులత బోయి, మల్కన్గిరి సమితి విద్యాశాఖ అధికారి భగీర్థి బెహరా తదితరులు పాల్గొన్నారు. – మల్కన్గిరి -
ఎయిర్పోర్టుని విస్తరిస్తాం
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాలోని జయపూర్లో ఉన్న ఎయిర్పోర్టుని విస్తరిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి ప్రకటించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పరబ్ మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి కొరాపుట్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం పరబ్–2025లో శనివారం ప్రసంగించారు. జయపూర్ ఎయిర్పోర్టు విస్తరణ చేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాగా వరుసగా రెండు రోజులుగా పరబ్ కవరేజీ చేస్తున్న మీడియాను పోలీసులు నియంత్రిస్తుండడంతో పాత్రికేయులు ఆందోళనకి దిగారు. దీంతో వారికి అధికారులు సర్ది చెప్పారు. మరోవైపు పాత్రికేయులు సౌమ్య రంజన్, సీహెచ్ భగవతి ఆచారీలు పెన్సిల్ ద్వారా మంత్రి సురేష్ పూజారి చిత్రం గీసి బహుకరించారు. గిరిజనుల సమస్యలపై బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సస్మితా మెలక మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో, రూపుధర్ బోత్ర, కలెక్టర్ సత్యవాన్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలి
జయపురం: జయపురం ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్న రెవెన్యూ డివిజన్ కమిషనర్ కార్యాలయంతో పాటు స్పెషల్ సర్క్యూట్ హౌస్ ఏర్పాటు చేయాలని జయపురం వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం వికాస్ మంచ్ తరపున మంచ్ సాధారణ కార్యదర్శి నబకృష్ణ చౌదరి మంత్రి సురేష్ చంద్ర పూజారిని కొరాపుట్లో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కమిషన్ కార్యాలయం ఈ ప్రాంతానికి దూరంలో ఉందని, దీనివలన కార్యాలయానికి వచ్చేందుకు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్త చేశారు. అవిభక్త కొరాపుట్ జిల్లాకు కేంద్ర బిందువైన జయపురంలో ఏర్పాటు చేస్తే రెవెన్యూ సంబంధిత విషయాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పలువురు సభ్యులు ఉన్నారు. -
పరిసరాల శుభ్రత పాటించాలి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ అన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రయాణికులు తినుబండారాలు, వాటర్బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో మాత్రమే వేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు ఎం.హాటకేశ్వరరావు, టీఐ–3 ఆచారి, గోవిందరాజులు, సెక్యూరిటీ సిబ్బంది రామారావు, గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు. -
సృజన్ ఉత్సవాలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వ విద్యాలయంలో సృజన్ 4.0 పేరిట వార్షిక సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూఢిల్లి ఏఐసీటీఈ అసిస్టెంట్ డైరెక్టర్ (భారత ప్రభుత్వం) డాక్టర్ దీపన్ కుమార్ సాహు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయంలోని మెగా ఆడిటోరియం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశోధన, ఆధునిక ఆలోచనలతో ఏదైనా ముందుకు సాగుతుందని, అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్కు చెందిన ఐడాస్ టెక్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరక్టర్ కొలూరి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు ఎల్లవేళలా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు చంద్రధ్వజ్ పండ, డైరక్టర్ జగదీష్ పండ, రిజిస్ట్రార్ ఏవీఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయాలను కాపాడదాం
శ్రీకాకుళం రూరల్ : కళలను బతికించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని పద్మభూషణ్ అవార్డు గ్రహీత వరప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. కల్లేపల్లి గ్రామంలోని సంప్రదాయ గురుకులంలో శనివారం అర్ధనారీశ్వర నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయ నృత్యాలకు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. రానున్న రథసప్తమికి టూరిజం తరఫున జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్లు మాట్లాడుతూ కళలకు కులం, జాతీ ఏదీ అడ్డురాదన్నారు. అనంతరం వరప్రసాద్రెడ్డి సంప్రదాయ గురుకులం ట్రస్టుకు కలెక్టర్ చేతుల మీదుగా రూ.50 లక్షలు అందించారు. కార్యక్రమంలో సంప్రదాయం గురుకుల డైరెక్టర్ స్వాతి సోమనాథ్, తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● రోడ్డు నిర్మించాలని ఆందోళన
గజపతి జిల్లా గుసాని సమితి పాటికోట నుంచి చందనకోలా గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ స్థానికులు శనివారం ఆందోళన చేపట్టారు. దీంతో పర్లాకిమిడి – ఆర్.ఉదయగిరి, మోహనా 326ఏ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కనీసం అంబులెన్స్ కూడా వెళ్లక అవస్థలు పడుతున్నామని వాపోయారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు వెళ్లి అందోళనకారులతో మాట్లాడారు. సమస్యపై మాట్లాడేందుకు 10 రోజుల గడువు కోరారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. – పర్లాకిమిడి -
గ్రిగ్స్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : బడివానిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ నెల 18, 19 తేదీల్లో అల్లినగరం ఉన్నత పాఠశాల వేదిక జరిగిన నియోజకవర్గ స్థాయి గ్రిగ్స్ పోటీల్లో స్పోర్ట్స్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నారని పాఠశాల పీడీ ఆనంద్ శనివారం తెలిపారు. సూరాడ లక్షణ్ 100 మీటర్లు పరుగు, హైజంప్, లాంగ్జంప్, 400 రిలేలో బంగారు పతకాలు సాధించి వ్యక్తిగత చాంపియన్షిప్ కై వసం చేసుకున్నాడని చెప్పారు. మైలపల్లి పోలీసు త్రిపుల్ జంప్లో బంగారు, కాంస్య పతకాలు, ఉప్పాడ ఆది 1500 మీటర్ల పరుగు, త్రిపుల్ జంప్లో రజత పతకాలు, బాలికల విభాగంలో సీహెచ్ చంద్రకళ బంగారు పతకం, రెండు వెండి పతకాలు, ఉప్పాడ స్వప్న రెండు వెండి పతకాలు, మూగి చందు బంగారు, కాంస్య పతకాలు సాధించినట్లు వివరించారు. వీరిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. బ్యాడ్మింటన్ పోటీల్లో.. జి.సిగడాం: నియోజకవర్గ స్థాయిలో జరిగిన గ్రిగ్స్ పోటీల్లో పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. బ్యాడ్మింటన్లో విజేతలుగా నిలిచారు. వీరిని సర్పంచ్ పున్నాన సోనియా, ఎంపీటీసీ మక్క శ్రీలత, హెచ్ఎం ఎస్.భానుమూర్తి, వి.రవికుమార్, బి.వెంకటేష్ శనివారం అభినందించారు. కొచ్చెర్ల విద్యార్థులకు అభినందనలు రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయిలో అల్లినగరంలో జరిగిన గ్రిగ్స్ పోటీల్లో కొచ్చెర్ల హైస్కూల్ విద్యార్థుర్ధులు సత్తా చాటారు. సీనియర్ గర్ల్స్ కోకో, టెన్నికాయిట్, ప్రథమ స్థానంలో నిలవగా జూనియర్ గర్ల్స్ విభాగంలో టెన్నికాయిట్ ద్వితీయ స్థానం సాధించారు. అథ్లెటిక్స్ 100 మీటర్లు, 400 మీటర్లు షాట్ పుట్లో ప్రథమ స్థానం సాథించారు. వీరిని హెచ్ఎం తిరుపతిరావు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. -
మత్తుతో జీవితం చిత్తు
ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు అరసవల్లి : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14 నుంచి జిల్లావ్యాప్తంగా పొదుపు వారోత్సవాల పేరిట విద్యుత్ శాఖ పలు కార్యక్రమాలను ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్ఈ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ సురేష్కుమార్, కమర్షియల్ ఏడీఈ రామ్మోహన్, డీ–1 ఏఈ జె.సురేష్కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం పాల్గొన్నారు. ఇంధన పొదుపుతోనే భవిష్యత్ ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆవరణలో శనివారం ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పల్స్ పోలియో తప్పనిసరి గార: ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు కచ్చితంగా వేయాలని గార పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ రమ్య, డాక్టర్ సోనియా అన్నారు. ఆదివారం జరగనున్న పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి శనివారం గారలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. 22న నెట్బాల్ ఎంపికలు టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. వివరాలకు 8500007272 నంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ‘ముస్తాబు’ గార: విద్యాశాఖలో నూతనంగా ముస్తాబు కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీధర్ శాలిహుండం కేజీబీవీలో శనివారం ప్రారంభించారు. విద్యార్థినులంతా వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టిసారించాలన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ఆర్.సత్యన్నారాయణ, మండల ఇంజినీర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల: పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ముస్తాబు కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, డీసీఎంఎస్ జిల్లా అధ్యక్షులు చౌదరి అవినాష్ హాజరై ముస్తాబు కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త యశోదలక్ష్మీ, ప్రధానాచార్యులు పి.పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్యకు సైకిల్ యాత్ర
మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి కేంద్రంలో టెంపరీ కాలనీకి చెందిన సునాధర్ ఖరా అనే వృద్ధుడు స్వగ్రామం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్రకు శనివారం శ్రీకారం చుట్టారు. ఇదివరకు ఈయన పూరీ శ్రీమందిరానికి ఇలాగే సైకిల్పై వెళ్లడం జరిగింది. ఆయనకు గ్రామస్తు లు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ప్రయాణం దాదాపు 2 వేల కిలోమీటర్లు సాగుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటుపర్లాకిమిడి: పట్టణంలో ట్రాఫిక్, నేరాల నియంత్రణకు జిల్లా ఫారెస్టు జంక్షన్ నుంచి పాతకోర్టు జంక్షన్ వరకు 23 చోట్ల 60 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం రూ.28 లక్షలతో కెమారాలు ఏర్పాటు చేసి, నిర్వహణను పర్లాకిమిడి ఆదర్శ పోలీసుస్టేషన్కు ఎస్పీ జ్యోతింద్ర పండా అప్పగించారు. నూతన సంవంత్సరం నుంచి వీటి పనితీరు ప్రారంభమవ్వనుందని తెలియజేశారు. గంజాయి స్వాధీనం పర్లాకిమిడి: జిల్లాలోని అడవ పోలీసులు 26 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నలాఘాట్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక కారును తనిఖీ చేయడంతో గంజాయి బస్తా బయటపడింది. అందులో 26 కిలోల గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి మోహనా కోర్టుకు తరలించినట్లు ఐఐసీ సుబ్రాంత్ పండా తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రాయగడ: చందిలి పోలీస్స్టేషన్ పరిధి డొంగరపడ నాగావళి వంతెనపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. మృతుడు సదరు సమితి అలుబడి పంచాయతీలోని సనొకొసపాడు గ్రామానికి చెందిన అజిత్ జిలకర (17)గా గుర్తించారు. అదేవిధంగా గాయాలు తగిలిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన జితు జిలకరగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సనొకొసబడి గ్రామానికి చెందిన జితు, అజిత్లు కొత్త దుస్తులు కొనేందుకు ఒక ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. వీరు డొంగరపడ నాగావళి నది బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి జేకేపూర్ నుంచి పేపర్ లోడ్తో రాయిపూర్ వైపు వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైకు డ్రైవింగ్ చేస్తున్న అజిత్ జిలకర లారీ చక్రం కింద పడిపోవడంతో తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైకు వెనుక కూర్చున్న జితు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు
ఎచ్చెర్ల : కుశాలపురంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. తొమ్మిది కళాశాలల నుంచి సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు బి.జానకిరామయ్య, విక్టర్పాల్, అధ్యాపకులు దామోదరరావు, డి.మురళీకృష్ణ, ఇన్చార్జ్ పీడీ ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
డోర్ డెలివరీ సేవలు వినియోగించుకోవాలి
శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగదారులు, ఖాతాదారులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్.అప్పలనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కాంప్లెక్స్లోని పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 84 పట్టణాలకు డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం–1వ డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్కుమార్, స్టేషన్ మేనేజర్ మీసాల ప్రసాదరావు, సెక్యూరిటీ సిబ్బంది రామారావు, పార్సిల్ కౌంటర్ సూపర్వైజర్ రాజేష్, కౌంటర్ సిబ్బంది పాల్గొన్నారు. -
సగం కాలిన మృతదేహం స్వాధీనం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబోదల పోలీస్స్టేషన్ పరిధి కుముడాబలి గ్రామంలో సగం కాలిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు చందనతుల డొంగారి (68)గా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా చందనతుల ఒక్కడే తన ఇంట్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుడి వద్దనున్న బంగారం, నగదును దుండగులు తీసుకున్న అనంతరం, అతనిని కాల్చి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కలహండి జిల్లా ఎస్పీ దేవరకొండ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. రాయగడ జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సెలవులపై ఉండడంతో ఇన్చార్జి ఎస్పీగా నాగరాజు వ్యవహరిస్తున్నారు. -
పాఠశాలలో ఏనుగుల బీభత్సం
రాయగడ: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి పొలమ పంచాయతీ పొడబట్టి గ్రామంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాఠశాల తలుపులను విరగ్గొట్టి అందులోకి చొరబడ్డాయి. విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని చెల్లాచెదురు చేశాయి. పాఠశాలలోని టేబుల్స్, బెంచీలను విరగ్గొట్టి వీరంగాన్ని సృష్టించాయి. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. మూడు ఏనుగులు పాఠశాలలో చొరబడి సామగ్రి ధ్వంసం చేసినట్లు పాఠశాల హెచ్ఎం హలధర్ కౌసల్యకు సమాచారం అందించారు. విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత కొద్ది రోజులుగా ఈ సమితి పరిధిలోని పర్శాలి, పొలమ, బుడాగుడ తదితర ప్రాంతాల్లోని ఏనుగులు హల్చల్ సృష్టిస్తున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పరిస్థితిని అధ్యయనం చేశారు. -
నవ్వుపై విద్యార్థులకు శిక్షణ
రాయగడ: స్థానిక ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా గురువు డాక్టర్ బాబూరావు మహాంతి స్థానిక కస్తూరీనగర్లోని బాల్వాడి పాఠశాల విద్యార్థులకు నవ్వుపై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నవ్వుతో ఆరోగ్యంతో పాటు మంచి స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చని అన్నారు. నవ్వువల్ల అలసట వంటివి మటుమాయం అయ్యి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు సహకరిస్తుందని అన్నారు. ప్రతీ విద్యార్థి రోజులో కొంతసేపు తమకు ఇష్టమైన స్నేహితులతో కలసి కాసేపు నవ్వే విధంగా సమయాన్ని కేటాయించాలని అన్నారు. రోజూ క్రమం తప్పకుండా పాటిస్తే వారి దైనందిన చర్యలో భాగమై వారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలరన్నారు. శిక్షణ కార్యక్రమంలో బాల్వడి పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవతి మాట్లాడుతూ.. చదువుతో పాటు ఇటువంటి ఉల్లాసాన్నిచ్చే కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించే ఇటువంటి తరహా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ముందుకు రావడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం విద్యార్థులు నవ్వుతూ కాసేపు గడిపారు. షార్ట్ సర్క్యూట్తో వ్యక్తి మృతి మల్కన్గిరి: షార్ట్ సర్క్యూట్తో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి సోమనాధ్పూర్ పంచాయతీ ఖారిగూఢ గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగు చూడగా.. దినేశ్ లామ్త (28) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కట్టెలు తీసుకురావడానికి దినేశ్ గురువారం మధ్యాహ్నం సమీపంలో అడవికి వెళ్లారు. అయితే చీకటిపడినప్పటికీ ఇంటికీ రాకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు గ్రామంలో, అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం స్థానికంగా ఓ మహిళ చెప్పిన ఆధారాల మేరకు అడవిలో గాలించగా ఓ చెట్టు వద్ద విద్యుత్ తీగకు తగిలి షాక్తో మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న కోరుకొండ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశేష అలంకరణలో గోదాదేవిరాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం గోదాదేవికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానార్చకులు భాస్కరాచార్యులు స్వామివారికి సుప్రభాత పూజలు, అభిషేకాలు నిర్వహించారు. -
వ్యాన్ బీభత్సం
● మూడు కార్లు, ఏడు బైకులు ధ్వంసంకొరాపుట్: కొరాపుట్ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ఐచర్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు సాగింది. దీంతో రోడ్డుపై ఉన్న జనం భయాందోళనతో పరుగులు తీశారు. చివరకు వ్యాన్పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నగదుతో వస్తున్న ఏటీఎం వ్యాన్ ఎగిరి రోడ్డుకి అడ్డంగా పడింది. అందులో అప్పటికే నిండుగా నగదు ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నగదును పోలీస్ వ్యాన్లో సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో మూడు కార్లు, ఏడు బైకులు ధ్వంసమయ్యాయి. గాయపడిన పది మందిని ఆస్పత్రికి తరలించారు. -
రెడ్క్రాస్ సేవలు విస్తృతం చేయాలి
● శిక్షణ శిబిరం ప్రారంభంలో వక్తలుజయపురం: రెడ్క్రాస్ సేవలు విస్తృతం చేయాలని వక్తలు అన్నారు. జయపురం సబ్డివిజన్ కుంద్రాలో శ్రీఅరవింద శిక్షా నికేతన్ వారు జిల్లాస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ అధ్యాయనం, శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా విద్యాధికారి, జిల్లా జూనియర్ రెడ్క్రాస్ అథ్యక్షులు కరుణాకర్ భుయె అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ సాధనకర్మి యజ్ఞేశ్వర పండ, గౌరవ అతిథిగా కుంధ్ర సమితి బీడీవో పి.మనస్మిత, కొరాపుట్ జిల్లా కోఆర్డినేటర్ చంద్రకళా బగర్ది, విశ్రాంత శారీరక శిక్షణాధికారి బి.ప్రచరణ పండ, కుంధ్ర బ్లాక్ విద్యాధికారి రఘునాథ్ పంగి పాల్గొన్నారు. తొలుత ముఖ్యఅతిథి కరుణాకర భుయె రెడ్క్రాస్ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా జూనియర్ రెడ్క్రాస్ అధికారి హరేకృష్ణ మహరాణ అతిథులకు స్వాగతం పలికి శిబిరం ప్రాధాన్యాన్ని వివరించారు. జిల్లా సాధన కార్యకర్త జ్యోతిరంజన్ నంద అతిథిులను పరిచయం చేశారు. శారీరక క్రీడా శిక్షణ అధికారి లలాటేందు పూజారి మాట్లాడుతూ.. సమాజ సేవలో జూనియర్ రెడ్ క్రాస్ కేడర్ నిర్వహిస్తున్న భూమికను కొనియాడారు. శ్రీఅరవింద శిక్షా నికేతన్, కుంధ్ర ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రభావతి సెట్టి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ సాధన కర్మి యజ్ఞేశ్వర పండ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. రెడ్క్రాస్ ఆవిర్భావం, దాని ప్రధాన లక్ష్యం, నీతి నియమాలు, సమాజ సేవలపై అవగాహన కల్పించారు. అగ్ని మాపక సిబ్బంది హాజరై అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి, మంటలను ఎలా ఆర్పాలి, ప్రజలను, ప్రజాధానాన్ని ఎలా రక్షించాలో మాక్ డ్రిల్ ద్వారా చూపారు. ఫైర్ విధాగ అధికారి సరోజ్ కుమార్ బుతియ, సిబ్బంది రుద్రప్రసాద్ బారిక్, రామకృష్ణ గౌఢ, శ్యామలాల్ గోండ్, సుశాంత కుమార్ పండా, అజయ హరిజన్ పాల్గొన్నారు. -
బీఎస్పీలోకి జెడ్పీ మాజీ అధ్యక్షుడు గంగాధర్
రాయగడ: జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల బహుజన్ సమాజ్ పార్టీ తీర్థాన్ని తీసుకున్నారు. ఢిల్లీలోని ఆపార్టీ కార్యాలయంలో బీఎస్పీ అధినేత మాయావతి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. దీంతో రాయగడ జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీజేడీలో కీలక పాత్ర పొషిస్తున్న గంగాధర్ పువ్వల గత సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కొద్ది నెలలు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని బీఎస్పీలో చేరినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జితు జకసిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ కుమార్ నాయక్లు ఢిల్లీ వెళ్లి అధినేత్రి మాయావతితో గంగాధర్ పువ్వలను పరిచయం చేసిన అనంతరం పార్టీలో చేరినట్లు తెలిసింది. ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి తాను కృషిచేస్తానని ఈ సందర్భంగా పువ్వల తెలిపారు. -
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ, జాతీయ ఆవిష్కార్ అభియాన్ పథకం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జయపురం విక్రమదేవ్ కాలేజ్ ప్రొఫెసర్ లోకేశ్ హాజరై ప్రదర్శనలను తిలకించారు. జిల్లాకు చెందిన జాతీయ బాల శాస్త్రవేత అవార్డు గ్రహీత, లలితా ఖీలో తన అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణను వేదికపై వినిపించి తోటి బాలలకు ప్రేరణనిచ్చారు. జిల్లాలోని 7 సమితులకు చెందిన మొత్తం 49 శాసీ్త్రయ ప్రాజెక్టులు ఈ ప్రదర్శనలో చోటు దక్కించుకున్నాయి. అందులో ఏడు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికు ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు సందీప్త కుమార్దాస్, సనాతన్దాస్, సంజీవ్కుమార్ వైద్య, దేవరాజ్ శేఠి, నిరంజన్ మహరణా, వాసుదేవ్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
ఎలుగు దాడిలో వృద్ధునికి గాయాలు
రాయగడ: ఎలుగుబంటి దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలకు గురైన వ్యక్తి కందురు ప్రస్కాగా గుర్తించారు. ఈ ఘటన కొలనార సమితి పాయికోపొడ గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. గాయపడిన కందురు ప్రస్కాను చికిత్స కోసం స్థానిక క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించారు. తన సొంత పొలానికి వెళుతున్న సమయంలో సమీప అడవుల నుంచి రెండు ఎలుగులు వచ్చి ఆకస్మికంగా అతనిపై దాడి చేశాయి. దాడిలో కందురుకు తల, చేతులకు గాయాలయ్యాయి. అగ్నివీర్కు ఎన్సీసీ క్యాడెట్లు ● రికార్డు స్థాయిలో 25 మంది ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇటీవల జరిగిన అగ్నివీర్ ఎంపికల్లో.. అదే కళాశాలలో చదువుతున్న 14వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు రికార్డు స్థాయిలో 25 మంది ఎంపికయ్యారు. 2025 ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్, కల్యాణ్తో పాటు అనేకమంది ఎన్సీసీ–బీ సర్టిఫి కెట్లు అర్హతలు పొందిన విద్యార్థులు అగ్నివీర్కు ఎంపికై నవారిలో ఉన్నారు. దీంతో వీరిని కళాశాలలో ఎన్సీసీ అధికారి కెప్టెన్ యాళ్ల పోలినాయుడు శుక్రవారం కళాశాలలో అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సరుబుజ్జిలి మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ గేదెల సుధాపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసు నమోదు చేసి మూడు రోజులు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాల పెరుగుతున్నా పోలీసులు నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని ధ్వజమెత్తారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శైలజకు అవార్డు శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర సైనిక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ తరపున లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆదిభట్ల శైలజ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుపై జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు, యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని మాజీ సైనికులు, సైనిక వితంతువులకు ఆమె చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా సేవలు అందిస్తున్న బైరి మురళీ కూడా అవార్డు అందుకున్నారు. అలాగే ఇటీవల వీర మరణం పొందిన బైరి గ్రామానికి చెందిన జవాన్ వెంపటాపు రాజు భార్య రూ.50,000ల చెక్కు అందుకున్నారు. కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, రాష్ట్ర సైనిక డిపార్ట్మెంట్ సంచాలకుడు విశ్రాంత బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈక్యూ ఫర్ పీస్తో బీఆర్ఏయూ ఎంవోయూ ఎచ్చెర్ల: ఆన్లైన్ క్లాసుల బోధనపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా(అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థతో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకుంది. బీఆర్ఏయూ వీసీ కేఆర్ రజనీ సమక్షంలో రిజిస్ట్రార్ అచార్య బి.అడ్డయ్య, ఈక్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షులు డా.చల్లా కష్ణానీర్, అభిషేక్లు సంతకాలు చేశారు. ఎంవోయూల వలన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందుతుందన్నారు. మహిళ అదృశ్యం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని చంపాగల్లివీధికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు. కూరగాయలు కొనేందుకు పొట్టి శ్రీరాములు మార్కెట్కు తల్లితో వచ్చిన ఈమె, మతిస్థిమితం సరిగాలేక తప్పిపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
పార్టీ బలోపేతమే లక్ష్యం
పర్లాకిమిడి: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, గజపతి జిల్లా ప్రభారిగా నియమించిన విశ్వేశ్వర టుడు అన్నారు. శుక్రవారం గజపతిజిల్లాలో పర్యటించారు. స్థానిక సర్క్యూట్ హౌస్లో సాక్షితో మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో వచ్చే పంచాయతీ ఎన్నికలకు పార్టీ మండలాధ్యక్షులతో పార్టీ పటిష్టతపై సమీక్ష జరపనున్నట్టు తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2024) జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో తక్కువ మెజార్టీతో అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. వాటిపై కూడా చర్చించి తిరిగి జిల్లాలో పార్టీ పటిష్టతకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన సవరకంజావీధిలో బీజేపీ కార్యాలయంలో మోహనా, పర్లాకిమిడి నియోజికవర్గాల మండలాధ్యక్షులతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో, మోహనా అభ్యర్థి ప్రసన్న కుమార్ మల్లిక్, పార్టీ సాధారణ కార్యదర్శి జగన్నాఽథ మహాపాత్రో హాజరయ్యారు. విశ్వేశ్వర టుడును కోడూరు నారాయణ రావు సత్కరించారు. ఈ పార్టీ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గేదెల శ్రీధర్నాయుడు, ప్రశాంత్, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, మాజీ చైర్మన్ నృసింహా చరణ్ పట్నాయక్, పార్టీ మహిళా మోర్చా నాయకురాలు అరుణిమా సాహు తదితరులు పాల్గొన్నారు. -
క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!
● రేపు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ● కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఎంపికలు ● రాణిస్తే నేరుగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికశ్రీకాకుళం న్యూకాలనీ: క్రాస్ కంట్రీ ఎంపికల పోటీలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరగనున్న జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ(దూరపు పరుగు) ఎంపిక పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. సెలక్షన్ కమిటీని, టెక్నికల్ అఫీషియల్స్ను నియమించారు. శనివారం సాయంత్రం తుది మెరుగులు దిద్దనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 నుంచి 500 మంది అథ్లెట్లు పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ రాణించినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. నాలుగు వయో విభాగాల్లో పోరు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో జరగనున్నాయి. అండర్–16, 18, 20, సీనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. అండర్–16 నుంచి అండర్–20 మధ్య మూడు వయో విభాగాలకు 2012 జనవరి 24 నుంచి 2006 జనవరి 25 మధ్య జన్మించినవారు అర్హులుగా నిర్ణయించారు. సీనియర్స్ పురుషులు, మహిళల విభాగానికి 2006 జనవరి 24వ తేదీలోపు జన్మించినవారు అర్హులని సెలక్షన్ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు(9441570361)ను సంప్రదించాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు), అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తిలు తెలిపారు. ఎంపికై తే రాష్ట్రస్థాయి పోటీలకు ఇక్కడ ఎంపికై న అథ్లెట్లను రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. కాకినాడ వేదికగా ఈనెల 24వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్–2025 పోటీలకు పంపించనున్నారు. ఇక్కడ రాణించినవారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. కేఆర్ స్టేడియంలో జరిగే ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు గ్రౌండ్కు చేరుకోవాలి. – మెంటాడ సాంబమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాస్ కంట్రీ అథ్లెట్స్కు ఇదొక గొప్ప అవకాశం. జిల్లాస్థాయి ఎంపికలను క్రీడాకారులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికవ్వాలి. అక్కడ రాణిస్తే జాతీయ పోటీలకు ఎంపిక కావచ్చు. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు -
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో నిరంతర అభివృద్ధి, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, మనకున్న 19 లక్ష్యాలు దీర్ఘకాలిక స్థాయిలో సాధించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ అన్నారు. స్థానిక జిల్లా పంచాయతీ రిసోర్సు భవనంలో దీర్ఘకాలిక అభివృద్ధిపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం ప్రారంభించారు. గౌరవ అతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, తదిరులు హాజరయ్యారు. వికసిత భారత్, వికసిత్ ఒడిశాలో సుస్థిర వికాస్ సాధించడానికి ఆహార భఽద్రత, గ్రామస్థాయిలో పోషక ఆహారం, గుణాత్మక విద్య, ఉత్తమ ఆరోగ్య సేవలు, మహిళా స్వశక్తీకరణ, అసమానతలు తొలగించడం, అందరికీ తాగునీరు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాకాలు, వాయు, జలకాలుష్యం వల్ల జరిగే అనర్థాలను ఎదుర్కోవడంపై సి.డి.పి.ఓ.లు, బి.డి.ఓలకు అధికారులు ట్రైనింగ్ కల్పించారు. 2030లో వికసిత్ ఒడిశా దిశగా మన 17 లక్ష్యాలు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ మునీంద్ర హనగ అధికారులను సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో ఆకాంక్ష బ్లాక్లు ఆర్.ఉదయగిరి, గుమ్మా బ్లాక్ల నుంచి కన్హూచరణ్ పాణిగ్రాహి, బప్పికిశోర్ దిగాల్ పాల్గొని శిక్షణ ఇచ్చారు. -
పాత్రికేయుల సేవలు అపారం
రాయగడ: విధినిర్వహణలో పాత్రికేయుల పాత్ర కీలకమని.. సమాజ శ్రేయస్సుకు వారు చేస్తున్న సేవలు అపారమని ప్రియఖబర్ ఒడియా దినపత్రిక సంపాదకులు రాజ్కిశోర్ దాస్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్లో శుక్రవారం రాష్ట్ర పాత్రికేయుల సంఘం వార్షికోత్సవసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాత్రికేయులు గ్రామీణ ప్రాంత సమస్యలపై దృష్టిసారించాలని అన్నారు. అధికారులకు, ప్రజలకు వారధులుగా నిలిచి సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ఇదిలాఉండగా పాత్రికేయుల సమస్యలను పరిష్కరించే విధంగా సంఘాలు ప్రభుత్వంతో పోరాడుతుండటం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమార్ధం కృషి చేయాలని అన్నారు. స్థానిక న్యాయవాది ప్రదీప్ కుమార్ దాస్ ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. పత్రికలకు స్వేచ్ఛకలిగిన నాడే సమాజం మెరుగుపడుతోందని అభిప్రాయపడ్డారు. సమాజ శ్రేయస్సుకు పత్రికలు, పాత్రికేయులు చేస్తున్న సేవలు చాలా విలువైనవని అన్నారు. సంఘం రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు హరిహర దాస్, సురేష్ కుమార్ దాస్ తదితరులు పత్రికలు, పాత్రికేయుల గురించి కొనియాడారు. అనంతరం విశేష సేవలందించిన కొంతమంది పాత్రికేయులను సత్కరించారు. -
అబ్బురపరిచిన.. వైజ్ఞానిక ప్రదర్శన
● సైన్స్ ఎగ్జిబిషన్లో 310 ప్రాజెక్టుల ప్రదర్శన ● రాష్ట్రస్థాయికి 11 ప్రాజెక్టుల ఎంపిక శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని గురజాడ విద్యాసంస్థల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. దీనిలో గ్రూప్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత, ఉపాధ్యాయ కేటగిరికు చెందిన 310 సైన్సు ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించారు. గ్రూప్ విభాగం నుంచి 7 ప్రాజెక్టులు, వ్యక్తిగత విభాగం నుంచి 2 ప్రాజెక్టులు, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండు సైన్సు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబు ప్రారంభించిన కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయ్కుమారి, పి.విలియన్స్, జిల్లా సైన్సు ప్రాజెక్టు అధికారి ఎన్.కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు ● ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్కు చెందిన విద్యార్థులు ఐ.సంజన, అనిల్లు కలిసి మల్టీపర్పస్ అగ్రికల్చర్ (సూర్యశక్తి ద్వారా సోలార్ ప్యానల్లో విద్యుత్ సరఫరాపై) ప్రాజెక్టును వివరించారు. ● సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎంజేపీ స్కూల్ విద్యార్థులు బి.నరేష్, ఎ.సుధ ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన వాటర్ ఎక్స్ట్రాక్టింగ్ విజనరీ హౌస్(మురుగునీటి పునర్వినియోగం)ను తయారు చేశారు. ● సోంపేటకు చెందిన జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు బి.యోగేశ్వరి, నిఖిత, విజయలక్ష్మిలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి న్యూ క్లియర్ పవర్ ప్లాంట్ను తయారు చేశారు. ● శ్రీకాకుళం గవర్నమెంట్ బాలికల స్కూల్కు చెందిన బి.హరిశ్రీ, తనుశ్రీ, బి.కృష్ణారావులు ఎమర్జింగ్ టెక్నాలజీతో యాంటీ సూసైడ్ ఫ్యాన్ను తయారు చేసి వివరించారు. ● పొందూరు గవర్నమెంట్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు కేకే పృథ్వీరాజ్, కె.దిలీప్కుమార్, బి.రమణలు హెల్త్ అండ్ హైజనిక్పై ప్రాజెక్టు తయారు చేశారు. ● జి.సిగడాం జెడ్పీహెచ్ స్కూల్కు చెందిన కె.గోపి, ఎం.ఆనంద్రాజులు కలిసి ప్యూరిఫికేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు. ● సోంపేట ఏపీఎంఎస్ స్కూల్కు చెందిన విద్యార్థి కృష్ణవర్దన్ స్మార్ట్ సెన్సార్పై ప్రాజెక్టును తయారు చేశారు. ● టెక్కలి జెడ్పీహెచ్ పోలవరం స్కూల్కు చెందిన ఎన్.కౌషీ, కె.ఆచార్య కలిసి రియల్ టైమ్ విజిటర్స్ కౌంటర్ ప్రాజెక్టును తయారు చేశారు. ● టీచర్స్ ప్రాజెక్టుకు సంబంధించి లావేరు మండలంలోని అదపాక జెడ్పీహెచ్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న కె.కిరణ్కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అప్లికేషన్పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు. ● గార మండలంలోని వాడాడ జెడ్పీహెచ్ స్కూల్కి చెందిన సైన్స్ టీచర్ బి.వెంకట్రావు ఇన్నోవేట్ లోకాస్ట్ టీచింగ్ టూల్స్పై ప్రాజెక్టును వివరించారు. -
ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి ల్యాంప్స్ పరిధిలోని తార్లాకోటా పంచాయతీలో ధాన్యం మండీ ద్వారా కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ను రైతులు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సంవత్సరం తార్లకోటా మండీలో 1500 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 400 మందికి పైగా రైతులు ధాన్యం విక్రయానికి నమోదు చేసుకున్నారన్నారు. ల్యాంప్స్ నిర్ణయించిన ధర రూ.1,500 అమ్మితే.. మిగిలిన రైతులు ఈ అవకాశాన్ని కోల్పోయో పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అదే విధంగా వారానికి కేవలం ఒకరోజు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. దీనిని రెండు రోజులకు పెంచాలని రైతులు కోరారు. 1,500 క్వింటాళ్లకు బదులుగా 2,500 క్వింటాళ్ల వరకు కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని పంచాయతీ పరిధిలోని రైతులందరూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదాన్ ద్వారా జిల్లా కలెక్టర్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ ల్యాంప్స్ అధ్యక్షుడు సాలు ఖీలో, తార్లకోటా సర్ప్ంచ్ పద్మనాభ మాడ్కమి, మాజీ సర్పంచ్ సోమనాథ్ బార్సే, గోవింద గోలారీ పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో గుడ్ గవర్నన్స్ వారోత్సవాలు
పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ‘గుడ్ గవర్నన్స్ వారోత్సవాలు’ను అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గుణి మఝి లాంఛనంగా ప్రారంభించారు. గుడ్ గవర్నన్స్ వీక్ డిసెంబర్ 1 నుంచి 25 వరకు కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల అభియోగాలు, వినతులు పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. సుశాసనం, గావ్కి ఆవుర్పై కలెక్టరేట్లో వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మైథిలీ పాడీ, కశ్యప్ బెహరా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రన్వేపైనే తల‘రాతలు’
ఆకాశమంత చదువు చదివితే ఏం లాభం.. పొట్టకూటి కోసం నేలపై కూర్చుని పరీక్ష రాయక తప్పలేదు. డిగ్రీలు, పీజీలు చేతిలో ఉన్నా.. కనీసం హోంగార్డు ఉద్యోగమైనా దొరక్కపోతుందా.. అన్న నిరాశ నిండిన నిరీక్షణ అది. ఒడిశాలోని సంబల్పూర్లో డిసెంబర్ 16న కనిపించిన దృశ్యం, దేశంలో నిరుద్యోగ సమస్యకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కేవలం 187 హోంగార్డు పోస్టుల భర్తీ కోసం ఏకంగా 8,000 మంది యువత కదిలివచ్చారు. దీనికి కనీస అర్హత కేవలం 5వ తరగతి ఉత్తీర్ణత. కానీ, వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. సాధారణ పరీక్ష కేంద్రాలు సరిపోకపోవడంతో, అధికారులు జమాదర్పాలి ఎయిర్స్ట్రిప్ (విమానాశ్రయం) రన్వేనే వేదికగా మార్చారు. నిరుద్యోగ యువత మండుతున్న ఎండలో, ఆకాశం కింద నేలపైనే కూర్చుని తమ భవిష్యత్తును వెతుక్కుంటూ పరీక్ష రాశారు. ఈ నియామకాలు కేవలం ఒప్పంద ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయినప్పటికీ, కనీస ఉపాధి కరువైన తరుణంలో యువత వీటిపైనే ఆశలు పెట్టుకుంది. దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, 8,000 మంది హాజరయ్యారు. ఇంతమంది కోసం 20 పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ) : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం ప్రమాదకరమైనదని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయికుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానంతో విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించామని, ఇప్పు డు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయ డం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయ కులు అన్నాజీ, వసంతరావు, ఏఐవైఎఫ్ నాయకులు వై.వేణు, మహేష్, కిషోర్, రామోజీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
చేతబడి నెపంతో వ్యక్తి హత్య
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఉస్కాపల్లి గ్రామంలో గురువారం చేతబడి నెపంతో ముక్క పోడియామి (51) అనే వ్యక్తిని హత్య చేశారు. ఇంటిలో నిద్రపోతున్న ముక్కపై గురువారం తెల్లవారుజామున ఇద్దరు కత్తితో దాడి చేశారు. ముక్క గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతోనే ఇలా చేశారు. ముక్క కుటుంబ సభ్యులు పొట్టేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించగా ఇద్దరిపై అనుమానం వ్యక్తమైంది. దీంతో ఆడమా పోడియామి, ఇర్మా పోడియామిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బాల్య వివాహాల కట్టడికి చర్యలు
రాయగడ: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ్ కుమార్ ఖెముండొ వంద రోజుల చైతన్య కార్యక్రమాలను ప్రారంభించారు. బాల్య వివాహ ముక్త భారత్ అభిజాన్ కార్యక్రమంలో భాగంగా ఈ చైతన్య కార్యక్రమాలు విజయవంతమయ్యేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక, సంక్షేమ శాఖ అధికారి మీనతి దేవ్, డీపీహెచ్వో డాక్టర్ రుమా మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం!
జయపురం: తమ ఇంటిపై నుంచి వేసిన 33 కేవీ విద్యుత్ తీగలను తొలగించాలని ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్షయ పీడిత మహిళ, ఆమె తల్లి టాటా పవర్ ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీర్ను హెచ్చరించారు. ఈ మేరకు జయపురం బమునిగాం గ్రామంలోని టాటా పవర్ ఇంజినీరు కార్యాలయం వద్ద వారు ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జయపురం మునిసిపాలిటీ ఒకటో వార్డు వాసి సంజుక్త సాహు ఇంటిపై నుంచి 33 కేవీ విద్యుత్లైన్ ఉంది. ఇంటి పైనుంచి విద్యుత్ లైన్ ఉండడంతో పలుమార్లు విద్యుత్ షాక్కు గురవుతున్నామని.. అలాగే ఏ క్షణంలో ఏది జరుగుతుందోననే భయంతో ఉన్నామంటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇంటిలో క్షయవ్యాధి పీడిత మహిళ సంజుక్త సాహుతో పాటు దివ్యాంగురాలైన ఆమె తల్లి నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఆ లైన్తో పాటు విద్యుత్ స్తంభాన్ని వెంటనే తొలగించాలని సంజుక్త సాహు కుటుంబ సభ్యులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అందుచేతనే తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వారు వెల్లడించారు. విద్యుత్ లైన్లను తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, విద్యుత్ విభాగ అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేక పోయిందని వాపోయారు. అందుచేత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు వెల్లడించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి మోహణ మఝి జిల్లా కలెక్టర్ను ఆదేశించారన్నారు. విద్యుత్ లైన్, స్తంభాన్ని తొలగించేందకు రూ. 1.20 లక్షలు చెల్లించాలని విద్యుత్ విభాగం లేఖ ద్వారా తెలిపిందని.. వెంటనే తాము జిల్లా కలెక్టర్ను కలిసి లేఖ చూపామని వెల్లడించారు. అయితే ఈ విషయంలో తామేమీ చేయలేమని.. కేవలం రూ. 30 వేలు మాత్రం సహాయం అందించగలమని కలెక్టర్ తెలిపారన్నారు. తాను క్షయ పీడిత రోగినని.. అంత డబ్బు మా వద్ద లేకపోవడంతో ఆత్మహ్యత్య చేసుకోవాలని నిర్ణయించామని సంజుక్త సాహు వాపోయారు. -
నిధులు మంజూరు
మహిళా కళాశాలకు ..పర్లాకిమిడి: మహిళా ప్లస్ టు కళాశాల రెండేళ్లుగా అనేక మౌలిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అనేక వినతులు సమర్పించిన దృష్ట్యా వారికి ఎమ్మెల్యే ల్యాడ్ నిధుల నుంచి రూ. 3లక్షలు మంజూరు చేస్తున్నామని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గురువారం సాయంత్రం స్థానిక మహిళా ఉన్నత మాధ్యమిక విద్యాలయం 40 వ వార్షికోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి మాట్లాడారు. ఈ మహిళా ప్లస్టు కళాశాలలో చదివి ఎంతో మంది ఉన్నత పదవులు అలంకరించారని, తాను కూడా ఈ కళాశాల ఉన్నతికి ఆకాంక్షిస్తున్నానని పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి అన్నారు. మహిళా మాధ్యమిక విద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ మహేంద్ర రయితో వార్షిక పట్టికను చదివి వినిపించారు. అనంతరం జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, ఎమ్మెల్యే రూపేష్ చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు క్యాష్ అవార్డులను అందజేశారు. ఈ బహుమతి ప్రదాన ఉత్సవంలో పర్లాకిమిడి పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, మహిళా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్లస్టు కళాశాల విద్యార్థినులు ఒడిషా సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. ప్లస్టు కళాశాల ఉపాధ్యక్షులు సంయుక్తా పాత్రో, సాంస్కృతిక పరిషద్ ఉపాధ్యక్షులు స్వగతికి పండా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
రైతుల కష్టం బూడిద
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కుములి గ్రామ పంచాయతీ పొరజపాత్రోపుట్ గ్రామంలో బుధవారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు రైతులకు చెందిన వరిధాన్యం కుప్పలు కాలిబూడిదయ్యాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరిపంటను కోసి కళ్లంలో కుప్పలు వేసి ఉండగా అగ్నిప్రమాదం సంభవించింది. సమీపంలో ఉన్నవారు మంటలను చూసి ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితంలేక పోవటంతో బొరిగుమ్మ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ధాన్యం కుప్పలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి కారణం తెలియలేదు. కాగా అప్పులు చేసి వరిని పండించామని.. కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ప్రకాశ బిశాయి, శ్యామ బిశాయి, కన్హూ బివాయిలు కన్నీరుమున్నీరుగా రోదించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
యువకుడిపై దాడి
రాయగడ: ఇద్దరు అన్నదమ్ముల తగాదాలో మధ్యలో తలదూర్చిని వ్యక్తిపై మారణాయుధంతో దాడి చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. చందిలి పోలీస్ స్టేషన్ పరిధి మల్లిగాంలో జరిగిన ఈ ఘటనలో జిల్లాలోని కొలనార సమితి గువాకొన గ్రామానికి చెందిన సంతోష్ కుండ్రుక గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గువాకొన గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు మల్లిగాంలో ఒక పొలంలో ధాన్యం కోతల్లొ కూలిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పొలం యజమానులైన ఇద్దరు అన్నదమ్ములు ఏదో విషయమై ధాన్యం కొస్తున్న పొలంలొ గొడవపడ్డారు. ఇద్దరి గొడవ చినికిచినికి గాలివానలా మరడంతో ఇద్దరిని నచ్చజెప్పేందుకు సందోష్ మధ్యలో దూరాడు. తమ గొడవ మధ్యలో ఎందుకు వచ్చావంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరూ సంతోష్పై మరణాయుధంతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలకు గురై పడిపోయిన సంతోష్ను అక్కడి వారు స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది. -
లోయలో పడిన లారీ
రాయగడ: సదరు సమితి పాత్రపూర్ సమీపంలో ఆంధ్ర నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి సమీపంలోని లోయలో పడిపొయింది. రాయిపూర్కు వెళుతున్న లారీ బుధవారం అర్ధరాత్రి ప్రమాదానికి గురవ్వగా.. డ్రైవర్ కాశ్యాప రాజు గాయాలపాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డైవర్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరశురాముడి విగ్రహం ధ్వంసం రాయగడ: పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న దుర్గాపాడు వద్ద జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన భగవాన్ పరశురాం విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తలను వేరుచేసి, వివిధ భాగాలను ధ్వంసం చేశారు. అందమైన జలపాతం, చుట్టుపక్కల పచ్చని చెట్లు, అహ్లాదకమైన వాతావరణం ఈ ప్రాంతానికి సొంతం. ప్రతీ ఏడాది డిసెంబర్లో సుదూర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వచ్చి పిక్నిక్లు చేసుకుని సమయాన్ని గడుపుతుంటారు. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో పరశురాం విగ్రహాన్ని జలపాతంకు సమీపంలో ఏర్పాటు చేసింది. అయితే దుండగుల పైశాచికత్వానికి విగ్రహం ధ్వంసం కావడంతో పరిసర గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేయాలని ప్రజల డిమాండ్ జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మలో అయోధ్య నగర్కు రోడ్డు వేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. అయోధ్య నగర వాసులు బిష్ణు నాయిక్, ప్రకాశ్ చంధ్ర మిశ్ర, ప్రతాప్ సాహు, టునా నాయిక్, ప్రపుల్ల స్వై, పాత్రికేయుడు కె.సికిల్ దొర తదితరులు బొరిగుమ్మ బీడీఓ సుకాంత కుమార్ పట్నాయిక్ను కలసి మెమొరాండం సమర్పించారు. సమితి అధికారులు కొన్ని వీధులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాటికి రోడ్లు లేవని మెమొరాండంలో వెల్లడించారు. దుల్లుగుడ రోడ్డు సమీపంలో గల అయోధ్య నగర్ –3 నంబరు వీధికి రోడ్డు లేదని వారు తెలిపారు. అయోధ్య నగర్కు పక్కనే లక్ష్మీవిహార్ సాహి ఏర్పడిందని, ఆ రెండు వీధులకు రోడ్లు లేక పోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు బీడీఓకు సమర్పించిన మెమొరాండంలో వివరించారు. వర్షాకాలంలో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే స్పందించి సిమెంటు రోడ్డు వేయాలని కోరారు. బాత్రూమ్లో పడి ఐదో తరగతి విద్యార్థిని మృతి మల్కన్గిరి : మల్కన్గిరి సమితి బియల్పూర్ గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ధరిత్రీ ఖెముడు (10) అనే విద్యార్థిని గురువారం ఉదయం బడిలోని బాత్రూమ్కు వెళ్లి అక్కడ పడిపోయింది. చాలాసేపటి వరకు బాలిక రాకపోవడంతో టీచర్ విద్యార్థులను పంపగా.. బాలిక పడిపోయిన విషయాన్ని వారు చెప్పారు. దీంతో వెంటనే బాలికను పాండ్రీపాణి ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడి వైద్యులు మల్కన్గిరి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడకు తరలిస్తుండగా దారిలోనే బాలిక చనిపోయింది. ఎలా చనిపోయిందో తెలీదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. మల్కన్గిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కన్గిరి ఆదర్శ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కారణాలు తెలుస్తాయని ఐఐసీ రీగన్ కీండో తెలిపారు. -
విద్యాశాఖపై.. పరాయి పెత్తనం!
రాష్ట్ర విద్యాశాఖ అధికారు లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఉపసంహరించుకోకుంటే ఆందోళన చేప డతాం. వందరోజుల ప్రణాళికలోనే లోపభూయిష్టమైన నిర్ణయాలు ఉన్నాయి. ఇది వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది. – పేడాడ కృష్ణారావు, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఉత్తీర్ణతలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళం నెలకొంటోందని విద్యాశాఖ వర్గాలు విమర్శిస్తున్నాయి. వందరోజుల ప్రణాళిక లోపభూయిష్టంగా, విద్యార్థులకు నష్టం కలిగించేలా రూపకల్పన చేయగా, ఇప్పుడు ఉపాధ్యాయులకు సైతం ఇది ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నియమించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. ప్రతి మండలానికి రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ తోపాటు మరికొన్ని శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించి వారి ఆమోదంతో పర్యవేక్షకులను నియమించాలని సూచించారు. ఇదేం తీరు.. పర్యవేక్షకులు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఆయా మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రణాళికను పరిశీలిస్తారు. స్లిప్ టెస్ట్లు, పేపర్ల దిద్దుబాటు, మార్కులు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాలతో పాటు ఉపాధ్యాయుల హాజరు పరిశీలిస్తారు. పర్యవేక్షకులు ఎప్పుడూ పరిశీలనకు వచ్చినా వారు అడిగిన తేదీకి సంబంధించిన పరీక్ష పేపర్లను వారి ముందు ఉంచాలి. ఉపాధ్యాయులు చేపట్టిన షైనింగ్, రైసింగ్ స్టార్ల విభజన తెలియజేయాలి. సెలవు దినాల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నారా లేదా అన్నది కూడా పర్యవేక్షకులు తనిఖీ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం తేడాలు గుర్తించినా సదరు ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అయితే, పేపర్ల దిద్దుబాటు, బోధన ఇతర విషయాలపై ఇతర శాఖలకు అంతగా పట్టు ఉండదని, ఈ లెక్కన ఏదైనా ఉపాధ్యాయునిపై ఫిర్యాదు చేస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కులు హరించడమే.. 100 రోజులు పాటు ఉపాధ్యాయులకు సెలవు పెట్టే అవకాశం కూడా లేకుండా చేయడం హక్కులను కాలరాయడమేనని విద్యాసంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఏ కారణం చేతైనా సదరు ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించకపోయినా, మార్కులు నమోదు చేయకపోయినా రాష్ట్రస్థాయిలో కమిషనర్ ఎదుట సంజాయిషీ ఉంచుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడాన్ని తప్పుపడుతున్నారు. హైస్కూళ్లలో ఉపాధ్యాయునికి పర్యవేక్షణాధికారిగా ప్రధానోపాధ్యాయుడు, ఉప విద్యాశాఖాధికారి, ఆపైన జిల్లా విద్యాశాఖ అధికారి, వీరందరికీ సూపర్ బాస్ కలెక్టర్ ఉండగా.. రాష్ట్రస్థాయికి వచ్చి సమాధానాలు చెప్పాలని, అక్కడ సంతప్తి చెందకపోతే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయాలు మార్చుకోకుంటే ఉద్యమం తప్పదంటూ సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి మండలానికి పర్యవేక్షకులను నియమించాలని రాష్ట్ర అధికారులు వెబ్ సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ నియామకాలు జరుగుతాయి. శతశాతం ఉత్తీర్ణత సాధించడం కోసమే రాష్ట్రస్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. – ఏ.రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులకు సెలవు లేకుండా చేయడం వారి హక్కులను కాలరాయడ మే. చావుపుట్టుకలు, తీవ్ర అనారోగ్యం ఉన్నా ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సిందే అనడం సరి కాదు. ఇతర శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించి విద్యాశాఖ అధికారులను ఉత్సవమూర్తులను చేయడం మంచిది కాదు. – బి.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
గిరిజనులకు రగ్గులు పంపిణీ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి బోండాఘాటీలో ముదిలిపోప పంచాయతీలో రోటరీక్లబ్ తరఫున గిరిజనులకు గురువారం రగ్గులు పంపిణీ చేశారు. కొండలపై నివసిస్తున్న బోండా తెగ గిరిజనులు చలితీవ్రతతో ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ 13 డిగ్రీలకంటే ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రోటరీక్లబ్ ప్రతినిధులు రగ్గులు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. రానున్న రోజుల్లో కూడా గిరిజనులకు సహాయ సహకారాలు అందజేస్తామని రోటరీ సభ్యులు లోభోసాహు తెలిపారు. -
ఉత్సాహంగా పాఠశాలల క్రీడా పోటీలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 గ్రామంలోని సాభరీ విద్యాభవన్లో పాఠశాల 45వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. రెండురోజులు జరగనున్న పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు వివిధ క్రీడా ఈవెంట్లలో పాల్గొని తమ ప్రతిభను చూపుతున్నారు . అ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ నాయక్ అధ్యక్షతన జరుగుతున్న ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా దీపక్ దత్త పాల్గొన్నారు. షలానే స్వగ్రాం మల్లవారం పంచాయతీ అధ్యక్షుడు జయంత్ ముజూందార్ గౌరవ అతిథిగా, ఉపాధ్యాయులు పాల్గొనాన్ుర. -
వలస కార్మికులకు తప్పని పాట్లు
రాయగడ : జిల్లాలో ఎన్నో బృహత్తర పరిశ్రమలు ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపొవడంతో పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు పనులకని వెళుతున్న వలస కార్మికులకు పాట్లు తప్పడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన ఎంతో మంది యువతీ, యువకులు ఆయా ప్రాంతాలకు వెళ్లి విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తున్న సంఘటనలు కోకొల్లలు. జిల్లా యంత్రాంగం గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఈ సమస్యపై మౌనం వహిస్తుండటంతో ఉపాధి కోసం అని వెళ్లిన యువత ఉసూరుమంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కాసీపూర్కు చెందిన బిటు మాఝి, దయితారి మాఝి, బిభీషన్ మాఝి, కొబి మాఝి, రాజు మాఝి, బులు మాఝి, మోహన్ మాఝి, సామ్రాట్ మాఝి, బ్రజ మాఝిలు గత కొద్ది రొజుల కిందట తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్లో ఒక ప్రయివేట్ కంపెనీలో పనులకని వెళ్లారు. ప్రతి నెల రూ.25 వేల జీతంతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని ముందుగా ఆశ చూపిన కంపెనీ యాజమాన్యం వారు పనుల్లోకి చేరిన తర్వాత వారిని పట్టించుకోవడం మరిచింది. నెలలు గడుస్తున్నా ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన జీతాలు యాజమాన్యం ఇవ్వకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంటికి తిరిగి వచ్చేందుకు అవసరమైన డబ్బులు కూడా చేతిలో లేకపోవడంతో అక్కడే నరకయాతన చూస్తున్నామని ఒక వీడియోను తమ బంధువులకు పంపించారు. వారి పరిస్థితిని గమనించిన కుటుంబీకులు, బంధువులు వారు పంపించిన వీడియోను జిల్లా శ్రామిక విభాగాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు వారిని తిరిగి ఆ ఉచ్చు నుంచి బయట పడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్లో గల ఆ కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపులు చేసి వారిని స్వగ్రామాలకు తరలించాలని వివరించారు. -
ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతీరావు పూలే పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. 2025 జూన్లో బదిలీ కోరుకున్న వందలాది ఉపాధ్యాయులు నేటికీ రిలీవింగ్కు నోచుకోలేదన్నారు. వారి స్థానంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, సింగిల్ టీచర్స్ స్కూల్ ఉపాధ్యాయులు సెలవులు వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులపై ఆ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, విద్యార్థుల మరణాలకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేస్తున్నారని, ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల రాత్రి బస రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వందరోజుల ప్రణాళిక నుంచి ఆదివారం, రెండో శనివారం, పండగ దినాలను మినహాయించాలని, పరీక్ష మార్కుల అప్లోడ్ చేయాలనే ఒత్తిడిని తగ్గించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో జె.వి.వి.రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శులు బి.శంకరరావు, హెచ్ అన్నాజీరావు, జి.సురేష్, జి.నారాయణరావు, టి.వి.టి.భాస్కరరావు, జి.శ్రీరామచంద్రమూర్తి, బి.గౌరీశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్.దమయంతి, రాష్ట్ర కౌన్సిలర్లు కె.దాలయ్య, బి.తవిటమ్మ, సీపీఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.రవికుమార్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి.ఉమాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
విజిలెన్స్ వలలో దశమంత్పూర్ ఐఐసీ
కొరాపుట్: విజిలెన్స్ వలలో దశమంతపూర్ సమితి కేంద్ర పోలీస్ స్టేషన్ ఐఐసి సుక్ము హన్సద చిక్కుకున్నారు. గురువారం కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ పోలీస్ స్టేషన్ పై విజిలెన్స్ ట్రాప్ చేసి హన్సదని అరెస్ట్ చేశారు. స్టేషన్లో ఒక కేసు విషయం పై నిందితుడికి బెయిల్ రాలేదు. స్టేషన్ నుంచి కేసు డైరీ రానందున కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో నిందితుడి బంధువులు కేసు డైరీని కోర్టుకి పంపాలని ఐఐసీని విజ్ఞప్తి చేశారు. కేసు డైరీ పంపడానికి ఆమె రు.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో నిందితుడి బంధువులు విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించారు. వారు పౌడర్ పూసిన నగదుని విజిలెన్స్ వారు నిందితుడి బంధువులకు అందించారు. ఆ నగదు స్టేషన్లో నిందితుడి బంధువులు ఐఐసీకి అందించగానే విజిలెన్స్ వారు మెరుపు వేగం తో స్టేషన్ లోనికి చొరబడి ఆమెను పట్టుకున్నారు. వెను వెంటనే స్టేషన్ తలుపులు మూసి వేసి సోదాలు ప్రారంభించారు. ఆమెకు సంబందించి రెండు చోట్ల స్థిరాస్తులపై విజిలెన్స్ విభాగం దాడులు ప్రారంబించింది. ఈ ఘటన జరిగిన వెంటనే దశమంత్పూర్ వాసులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. తమ ప్రాంతంలో అక్రమ మద్యం పై తాము ఫిర్యాదులు చేస్తే ఐఐసి తమనే బెదిరించేవారన్నారు. అంతే కాక అక్రమ మద్యం ఉత్పత్తి దారుల వద్ద నెలకు రూ.30 వేలు లంచం తీసుకుంటున్నట్లు ఆమే స్వయంగా చెబుతూ బెదిరించే వారని తెలిపారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మీద హన్సద ని కొరాపుట్ తరలించారు. పోలీసు ఉన్నతాధికారి స్థాయిలో వ్యక్తిని విజిలెన్స్ అరెస్ట్ చేయడం తో పోలీసు వర్గాలు ఉలిక్కి పడ్డాయి. -
జనావాసాల మధ్య జైల్ తరలించాలి
మల్కన్గిరి: మల్కన్గిరి సదర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో దీర్ఘకాలంగా నివసిస్తున్న 200 కుటుంబాలు ఆందోళనకు గురువారం దిగారు. జైల్ సమీపంలో ఉండకూడదంటూ బస్తీను ఖాళీ చేయాలని పోలీసు శాఖ నుంచి ఆదేశాలు రావడంతో జనం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ను కలిసి ముఖ్యమంత్రి పేరున రాసిన వినతి పత్రాన్ని అందజేశారు. బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలంటూ ఏడాదిన్నర కాలం రనిరాహర దీక్షలు చేయడంతో 2023లో పట్టాలు మంజూరు చేశారు. ఆ తరువతా బస్తీ వాసులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కూడా పేర్లు చేర్చి ఇళ్ల నిర్మాణం చేయాలని కొద్దిగా నిధులు మంజూరు చేశారు. దీంతో సంతోషంతో ఇళ్లను నిర్మిస్తున్న సమయంలో ఇక్కడ ఎవరూ ఉండకూడదని.. ఇళ్లను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బస్తీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న జైలునే వేరే చోటకి తరలించాలి తప్పితే తాము వెళ్లేదిలేదని తెంగించి చెప్పారు. బస్తీ వాసులకు మద్దతుగా మల్కన్గిరి మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్, డీసీసీ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు కలెక్టరేట్కు చేరారు. -
జనవరి 18 నుంచి గజపతి ఉత్సవాలు
పర్లాకిమిడి: జిల్లా స్థాయి గజపతి ఉత్సవాలు జనవరి 18 నుంచి 22 వరకూ జరుగుతాయని జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఏడీఎం మునీంద్ర హానగ గజపతి ఉత్సవాల ప్రిపరేషన్ మీటింగులో ప్రకటించారు. అలాగే పల్లెశ్రీ ఉత్సవాలు కూడా అదే రోజు నుంచి ఐదు రోజులు గజపతి స్టేడియంలో జరుగుతాయని ఓర్మాస్ అధికారులు తెలియజేశారు. అంతకు ముందు రెండు సార్లు గజపతి ఉత్సవాల సన్నాహాక సమావేశాలు జమ, ఖర్చులు సరిగా కమిటీకి తెలియజేయనందున సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసి వాయిదాలు వేశారు. గురువారం సాయంత్రం యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్ర హాలులో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా పరిషత్ అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సబ్కలెక్టర్ అనుప్ పండా తదితరులు విచ్చేశారు. జనవరి తొలివారంలో కృషి యంత్రమేళా, సంక్రాంతి పండుగ సందర్భంగా గజపతి ఉత్సవాలు జనవరి 18 నుంచి 22 వరకూ నిర్వహించడమే సముచితం అని ఎమ్మెల్యే రూపేష్ అన్నారు. దీనికి సభ్యులంతా ఏకీభవించారు. అనంతరం ఐదురోజుల ఉత్సవాలకు స్టేజ్కమిటీ, స్టాల్స్, ఫుడ్, సాంస్కృతిక, సావనీర్, వంటి వివిధ కమిటీల సభ్యుల నియామకం జరిగింది. సమావేశాలకు ప్రెస్, సీనియర్ సలహాదారు పూర్ణచంద్ర మహాపాత్రో, వివిధ సాంస్కృతిక కమిటీల సభ్యులు హాజరయ్యారు. జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ సమావేశాన్ని సజావుగా జరిపారు. -
గండాహతిలో రెడ్క్రాస్ రక్తదానం
పర్లాకిమిడి: జిల్లాలోని రాయగడ బ్లాక్ గండాహతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి జూనియర్ రెడ్ క్రాస్ విద్య, శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో విచ్చేసి రెడ్ క్రాస్ విద్యార్థుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గండాహతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న రెడ్ క్రాస్ విద్యార్థులు 33 యూనిట్ల రక్తాన్ని దాతలు స్వచ్ఛందంగా అందజేశారు. రెడ్ క్రాస్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు మోహన ఎమ్మెల్యే గోమాంగో అభినందనలు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమానికి అదనపు డీఈఓ ఎస్.గిరిధర్, అధ్యక్షత వహించగా, మరో అతిథి మనోజ్ కుమార్ బెహారా, సిద్ధార్థ శంకర పాఠి, గౌరవ అతిధిగా విద్యాలయం కమిటీ అధ్యక్షులు అశోక్ దోళాయి పాల్గొన్నారు. చివరి రోజున 170 మంది రెడ్క్రాస్ పరామర్శ దాతలు పాల్గొన్నారు. జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహు ఈ శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షించారు. -
ఘనంగా మహాలింగార్చన
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం మా స శివరాత్రి సందర్భంగా అనివెట్టి మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో శివ పంచాయతన సహిత మహా లింగార్చనను అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయ హుండీ కానుకల ఆదాయం రూ. 20,05,150 వచ్చిందని ఇన్చార్జి ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. గురువారం ఆలయ బేడా మంట పం వద్ద పర్యవేక్షణాధికారి జి.గురునాథం ఆధ్వర్యంలో ఆలయ హుండీలతో పాటు సమీ ప పాతాళ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. 70 రోజులుకు గాను ఈ ఆదాయం వచ్చిందని, ఈ మొత్తాన్ని బ్యాంకు లో జమచేశామని పర్యవేక్షణాధికారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు, పాలకమండలి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఉపాధి హామీ చట్టంలోని మార్పులను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో ఈ నెల 20న కలెక్టర్కు వినతి పత్రం, మండల కేంద్రాలు, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వెలమల రమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో సీఐటీయూ కార్యాలయంలో నాలు గు సంఘాలతో కలిపి ఐక్యతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిక్ భారత్– గ్యారంటీ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్(వీజీ జీఆర్ ఏఎంజీ) బిల్లును ఖండించారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాసరి లక్ష్మీనారాయణ, కేవీపీఎస్ నాయకులు బొమ్మాలి రమణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టులంతా ఏకంకావాలి పలాస : దేశంలో కాషాయికరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులంతా ఏకం కావాలని సి.పి.ఐ.ఎం.ఎల్.లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో గురువారం లిబరేషన్ పార్టీ జాతీయ నాయకుడు వినోద్ మిశ్రా వర్ధంతి సందర్భంగా ఆయన రచనల తలుగు అనువాద పుస్తకాన్ని బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద ఆవిష్కరించారు. లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల మల్లేశ్వరరావు, సి.పి.ఐ జల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సి.పి.ఎం.జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూడెమొక్రసీ నాయకుడు జుత్తు వీరాస్వామి, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకురాలు పోతనపల్లి అరుణ, ప్రజాకళామండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొర్రాయి నీలకంఠం, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల రామారావు, పత్తిరి దానేసు, దాసరి శ్రీరాములు, పోతనపల్లి కుసుమ, కుత్తుం దుష్యంతు, పి.అప్పారావు, మద్దిల కై లాస్ తదితరులు ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల తోవలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొర్రాయి నీలకంఠం బృందం ప్రజా ఉద్యమ గీతాలను ఆలపించారు. -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
రాయగడ: స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూరీనగర్లోని బాల్వాడి పాఠశాలలో చదువుతున్న 5, 6, 7 తరగతులకు చెందిన విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు జరిగాయి. తెలుగు, ఒడియా విద్యార్థుల మధ్య వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఆరోగ్యవంతమైన జీవితానికి నవ్వు ఔషధం అనే అంశంపై పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన నెలవారీ సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహాంతి మాట్లాడుతూ.. నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ప్రతీఒక్కరూ నవ్వును అలవాటు చేసుకోవాలని సూచించారు. మనిషి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే వ్యాయామం, ప్రాణాయం ఎంత అవసరమో నవ్వు కూడా అంతే అవసరమని వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు తమ స్నేహితులతో కలసి కొంత సేపు నవ్వుతూ రోజులు గడపాలని సూచించారు. నవ్వును మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని అన్నారు. తమ క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి చర్చించారు. వ్యాసరచన పోటీల్లొ గెలుపొందిన విద్యార్థులకు క్లబ్ సభ్యులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యవతి, కోఆర్డినేటర్ అభిమన్యు నాయక్, టి.జయరాం, దాశరథి రాజ్గురు, లాల్బిహారి లెంక, సలహాదారుడు ఉదయ్ చంద్ర పండ, కోశాధికారి గుడ్ల వెంకటరమణ, ఆర్తాత్రాణ్ మహాంతి, విద్యాలయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సమన్వయంతో సర్వే చేపట్టాలి
పాతపట్నం: అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రీ సర్వే పూర్తి చేయాలని జిల్లా అటవీశాఖ భూసెటిల్మెంట్ అధికారి ఎం.లావణ్య సూచించారు. పాతపట్నం ఫారెస్ట్ పరిధిలోని అంతరాబ రిజర్వు ఫారెస్ట్, పాతపట్నం రెవెన్యూ భూములకు ఆనుకుని ఉన్న స్థలాలను బుధవారం పరిశీలించారు. పాతపట్నం రెవెన్యూ పరిధిలో కొంత అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించారు. రీ సర్వేలో వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో రీ సర్వే చేపట్టి శాఖల పరంగా హద్దులు నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అటవీ రేంజర్ పి.అమ్మన్నాయుడు, తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, మండల సర్వేయర్ మహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీఆర్ఏయూలో సౌకర్యాలపై ఆరా
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి బుధవారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ ప్రధాన పరిపాలనా భవనం పరిశీలించి భవనం రాజమందిరాన్ని తలపిస్తోందంటూ ప్రశంసించారు. వర్శిటీలోని ఖాళీ ప్రదేశంలో హంపీ థియేటర్ నిర్మిస్తే క్యాంపస్ మరింత శోభాయమానంగా ఉంటుందని సూచించారు. ఔషధ మొక్కలు పెంచితే పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, మాజీ రిజిస్ట్రార్ పి.సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.స్వప్నవాహిని, ఎస్ఓ కె.సామ్రాజ్యలక్ష్మీ, ఎన్ సంతోష్రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ కోసం కక్కుర్తి!
● డ్వాక్రా సభ్యులకు తెలియకుండా రూ.10 లక్షల రుణం మంజూరు ● పొదుపు ఖాతాలో జమ చేయించిన నౌపడ వెలుగు సీఎఫ్ ● వడ్డీ పడటంతో సభ్యుల ఆందోళన సంతబొమ్మాళి: బ్యాంకులు, డ్వాక్రా సభ్యులకు అనుసంధానంగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన వెలుగు సీఎఫ్ (కమ్యూనిటీ ఫెసిలిటేటర్) నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సభ్యులకు శాపంగా మారింది. నౌపడ గ్రామానికి చెందిన మదర్ థెథెరిస్సా ఎస్హెచ్సీ గ్రూప్ సభ్యులకు తెలియకుండా గ్రూప్ పేరిట నౌపడ వెలుగు సీఎఫ్ డి.సాయిలక్ష్మి రూ.10 లక్షలు రుణాన్ని నౌపడ స్టేట్బ్యాంకులో ఈ ఏడాది సెప్టెంబర్లో మంజూరు చేయించారు. ఈ మొత్తాన్ని మదర్ థెరిస్సా పొదుపు ఖాతాలో జమ చేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా సభ్యులకు మాత్రం సీఎఫ్ చెప్పలేదు. దీంతో సభ్యులకు తెలియకుండా పొదుపు అకౌంట్ నుంచి ప్రతి నెలా వడ్డీ కింద రూ.7500 వేలు చొప్పున మూడు నెలలగా రూ.23వేలు కట్ అయింది. బుధవారం పొదుపు, లోన్ బ్యాంకు బుక్లను సభ్యులు పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. దీంతో సీఎఫ్ సాయిలక్ష్మిని సభ్యులు నిలదీశారు. తమకు తెలియకుండా తమ సంతకాలు, ఫొటోలు లేకుండా, తీర్మానం చేయకుండా రూ.10 లక్షలు రుణం ఏ విధంగా మంజూరు చేయించావని ప్రశ్నించారు. ఆ డబ్బులు తమ చేతికి రాకపోయినా ప్రతి నెలా రూ.7500 వేలు చొప్పున రూ.23వేలు వడ్డీ కింద బ్యాంకు జమ చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. కమీషన్ కోసం తమను బలి పశువులు చేశావంటూ సభ్యులు మండిపడ్డారు. కాగా, రుణం మంజూరు అయినది, లేనిదీ ఎప్పుటికప్పుడు తెలుసుకోవాలని సీఎఫ్ సాయిలక్ష్మి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు సభ్యులను బెదిరింపులకు పాల్పడటం కొసమెరుపు. రుణం డబ్బులు తమ చేతికి రాకపోయినా రూ.23 వేలు వడ్డీ చెల్లించామని, దీనికి ఎవ్వరు బాధ్యత వహిస్తారంటూ సభ్యులు ఆందోళన చెపట్టారు. పరిశీలిస్తాం.. ఎస్హెచ్సీ గ్రూపులకు బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు గురించి సభ్యులకు తెలియజేయకపోవడం అవగాహనా రాహిత్యం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రుణం మంజూరు, వడ్డీ విషయమై బ్యాంకు అధికారులతో మాట్లాడుతాం. – శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం, సంతబొమ్మాళి -
1,098 లీటర్ల సారా స్వాధీనం
పర్లాకిమిడి: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అబ్కారీ, పోలీసు శాఖలు ఉమ్మడిగా సరిహద్దుల్లో ఉన్న గుసాని సమితి గారబంద, గొప్పిలి పోలీసు ష్టేషన్ల మధ్య దుర్గం, బలేం, సింగిపురం, కుయ్యురో గ్రామాల్లో బుధవారం ఆకస్మికంగా దాడులు చేపట్టాయి. 14,950 ఎఫ్.ఎం.వాష్, 1098 లీటర్ల వంట సారాను పట్టుకున్నారు. వీటిని అక్రమంగా తయారుచేస్తున్న వారిని అరెస్టు చేసి పర్లాకిమిడి ఎకై ్సజ్శాఖకు తరలించి వారిపై ఏడు కేసులను రిజిస్టర్ చేసినట్టు గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు తెలియజేశారు. ఈ దాడుల్లో పర్లాకిమిడి సదర్ ఎకై ్సజ్శాఖ అధికారి ప్రసన్న కుమార్ పటేల్, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎకై ్సజ్శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ముప్పు తప్పదు!
మేలుకోకుంటే.. ● మహిళలూ.. మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే ● ప్రాణాంతక వ్యాధులపై అప్రమత్త అవసరం ● 30 ఏళ్లు దాటితే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి టెక్కలి: ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలు కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు. ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోరు. ఈ క్రమంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. పూర్తి స్థాయిలో నిద్రపోకపోవడం.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల చివరకు ప్రాణాంతకమైన వ్యాధులకు దారి తీసే ప్రమాదాలు ఉన్నాయంటూ ప్రసూతి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ప్రసూతి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కచ్చితంగా చేసుకోవాల్సిందే. ● మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలి. ● 9 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలకు వైద్య సిబ్బంది సూచనల మేరకు వ్యాక్సిన్లు వేయించాలి. హెచ్పీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి. ● సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు సరిపడా నిద్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వారి పనుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాకాకుండా ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగరూకతతో మెలగాలని వైద్యులు సూచిస్తున్నారు.మహిళల్లో ప్రధానంగా థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్తో పాటు ఇటీవల పీసీఓఎస్ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను గోప్యతగా ఉంచడం మంచిది కాదు. 65 ఏళ్లు దాటిన మహిళల్లో సైతం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి బిడియం లేకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. – డాక్టర్ వి.జి.ప్రసూన, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎన్నో రకాల వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చు. మారుతున్న జీవన శైలిలో భాగంగా ఆహారపు అలవాట్లు మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇంట్లో పనుల హడావుడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న పాటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా మారుతాయి. – డాక్టర్ కె.ధనలక్ష్మి, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి -
కుల ధ్రువీకరణ మంజూరుపై విచారణ
గార : మండలంలోని సతివాడ, శాలిహుండం, కొమరవానిపేట గ్రామాల్లో 15 కుటుంబాలకు ఎరుకుల కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుపై తహశీల్దార్ మునగవలస చక్రవర్తి అధ్యక్షతన గిరిజన సంక్షేమశాఖాధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టారు. సతివాడ గ్రామంలో ఎరుకుల కుటుంబాల సమక్షంలో జరిగిన విచారణలో సీతంపేట ఐటీడీఏ అధికారుల బృందం పాల్గొంది. గతంలో గార తహశీల్దార్ బలివాడ దయానిధి మంజూరు చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఇప్పుడు అమల్లో లేకపోవడంతో వీరంతా జిల్లా కలెక్టర్తో పాటు జాతీయ ఎరుకుల కులస్ధుల సంఘ నాయకులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో మాజీ మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, ఆర్ఐ దివిలి రాజేంద్ర, పెదలాపు సుందర్, ముద్దాడ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. పశువుల మృత్యువాత ఎచ్చెర్ల: అరిణాం అక్కివలస పంచాయతీ శేషపేట గ్రామంలో పాడి రైతు దత్తుకు చెందిన పశువుల పాక బుధవారం కాలిపోయింది. ఈ ఘటనలో పాకలో కట్టిన రెండు పశువులు కాలిపోయి మృతిచెందాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. -
సిల్క్ సిటీని గ్రేటర్ సిటీగా తీర్చిదిద్దుతాం
● ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి ● బరంపురంలో సరస్వతీ శిశు విద్యామందిర్ 42వ వార్షికోత్సవంలో వెల్లడిపర్లాకిమిడి: సిల్క్ సిటీగా ఉన్న బరంపురం పట్టణాన్ని గ్రేటర్ సిటీగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి మోహాన్ చరణ్మఝి బుధవారం అన్నారు. ఆయన ముఖ్యఅతిథిగా బరంపురంలోని నీలకంఠపురంలో ఉన్న సరస్వతి శిశు విద్యామందిర్ 42వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సరస్వతి శిశుమందిర్లో చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్నత ఉద్యోగాలు, పదవుల్లో ఉన్నారన్నారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నామని, అందుకు గోదబరీష మిశ్రా ఆదర్శ ప్రాథమిక పాఠశాల పథకం, శిశు బాటిక పథకాలను నూతన విద్యావిధానం 2020 లో జోడిస్తామన్నారు. ఒకప్పుడు సరస్వతి శిశు విద్యా మందిర్లో ఉపాధ్యాయునిగా పనిచేసిన జ్ఞాపకాలు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుతెస్తున్నాయన్నారు. ఈ వార్షికోత్సవంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బిభూతి జెన్నా, బరంపురం ఎమ్మెల్యే కె.అనిల్కుమార్, చికిటి ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో, పూర్ణచంద్ర శెఠి, సరోజ్ పాడీలు మాట్లాడారు. ఈ సంద్భరంగా సరస్వతి శిశు మందిర్ మెరిట్ విద్యార్థులను ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి, రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా బహుమతులు అందజేసి సత్కరించారు. ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝిని సరస్వతి శిశు విద్యామందిర్ విద్యా కమిటీ ఘనంగా సన్మానించారు. బరంపురం పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం.. ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి విలేకరులతో మాట్లాడారు. బరంపురం సిటీని అత్యున్నత టెక్నాలజీతో పట్టణంలో కీలకమైన పదిలైన్ల రోడ్లను నిర్మిస్తామన్నారు. దీనికి జిల్లా రోడ్లు, భవనాలశాఖ డి.పి.ఆర్లను తయారుచేసి గ్రేటర్ బరంపురం సిటీగా తీర్చిదిద్దడానికి అంచానాలు పంపాలని ఆదేశించారు. దక్షిణ ఒడిశాలో గంజాం జిల్లా ఒక కీలక భూమిక పోషిస్తుందని, అందువల్ల వ్యాపారం, రవాణా కోసం సుమారు రూ. 52.17 కోట్లతో 10 లైన్ల రోడ్లను బరంపురం నుంచి జయపురం వరకు పొడిగించడం జరుగుతుందన్నారు. బరంపురం సిటీలో టౌన్ ప్లానింగ్ పథకాలు అమలుచేస్తామని, మోడ్రన్ టెక్నాలజీ అనుసరిస్తామని.. దీనివల్ల సిటీలో అవుట్ స్కర్ట్స్లో నివసిస్తున్న భూయజమానులకు కూడా ఉపయోగం కలుగుతుందని ముఖ్యమంత్రి మోహాన్ మఝి అన్నారు. -
బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
సరుబుజ్జిలి: రొట్టవలసలోని కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అవతరాబాద్ గ్రామానికి చెందిన సురవరపు రామినాయుడు(77) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామినాయుడు రొట్టవలస వెళ్లి తన స్వగ్రామం అవతరాబాద్ వస్తుండగా శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామినాయుడు కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. 20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2, టెక్కలి, పలాస డిపోల ద్వారా రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలకు త్వరితగతిన వస్తువులు డోర్ డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు, ఖాతాదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైస్మిల్లుల్లో తనిఖీలు శ్రీకాకుళం రూరల్: వప్పంగి, వాకలవలస గ్రామాల్లోని రైస్మిల్లులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ బుధవారం తనిఖీ చేశారు. సీతారామ మోడరన్ రైస్మిల్, లలిత ట్రేడర్స్ ధాన్యం మిల్లుల్లో స్టాక్ రికార్డులను పరిశీలించారు. వప్పంగి, రామచంద్రపురంలలో ప్రైవేట్ వే బ్రిడ్జిలను తనిఖీ చేశారు. తూకాల్లో తేడా లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జేసీతో పాటు జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి తదితరులు ఉన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం చేయండి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం టౌన్హాల్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, వైఎస్సార్సీపీ అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ డాక్టర్స్సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతాడ వరుణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, లుకలాపు గోవిందరావు, కరణం శ్రీనివాసరావు, రాజు, ఆబోతుల రామ్మోహన్, డాక్టర్ సుధీర్, కింజరాపు రమేష్ పాల్గొన్నారు. కలెక్టర్ల సదస్సుకు హాజరు శ్రీకాకుళం పాతబస్టాండ్: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. డేటా ఆధారిత పాలన, ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ‘ఉపాధి’ పథకం పేరు మార్చడం తగదు శ్రీకాకుళం అర్బన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వీబీ జీ రాంజీ’గా పేరు మార్చడం తగదని, ఇది మహాత్మా గాంధీని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పీసీసీ పిలుపు మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చారి్జ్ గాదం వెంకట త్రినాథరావు, అంబటి కృష్ణారావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి, మామిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి’
రాయగడ: పాత్రికేయ రంగంలో యువత ఆసక్తి కనబరచాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్లో బుధవారం స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 5 వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సమస్యలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను వెలుగులోకి తీసుకువస్తే సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహొరొ మాట్లాడుతూ పత్రిక రంగంలొ పాటించాల్సిన నియమనిబంధనలకు అనుగుణంగా పాత్రికేయులు తమ విధులు నిర్వహించి సమాజాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అసోసియేషన్ కార్యదర్శి సుభాష్ చంద్ర సూర్య వార్షిక నివేదికను చదివి వినిపించారు. అధ్యక్షులు శివనారాయణ గౌడొ అసొసియేషన్ తీరు తెన్నుల గురించి వివరించారు. అసోసియేషన్లో చేరిన కొత్త సభ్యులకు ఆయన ఆహ్వానించి వారికి గుర్తింపు కార్డులను అందించారు. అసోసియేషన్ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక అధ్యక్షుడు కీర్తి చంద్ర సాహు తదితరులు ప్రసంగించారు. -
పెన్షన్ వేలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
శ్రీకాకుళం కల్చరల్: పింఛనుదారులకు అన్యాయం చేస్తూ దొడ్డిదారిన ప్రవేశపెట్టిన పెన్షన్ వేలిడేషన్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ పెన్షనర్స్ అసోషియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాత పెన్షన్ విధానం కొనసాగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తాత్కాలిక పద్ధతిన నియమించిన ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వాళ్లు రిటైరయ్యాక పాత పద్ధతిలో నెలకు రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ కింద ఇస్తున్నారని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.9 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వే, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులంతా కలిసి అసోషియేషన్గా ఏర్పడి సమస్యలపై పోరాడుతున్నట్లు చెప్పారు. ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు బి.ప్రసాదరావు, కన్వీనర్ కె.చంద్రశేఖరరావు, బీఎస్ఎన్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వేంకటేశ్వరరావు, ఎం.రమేష్, ఏఐబీడీఓటీపీ ప్రతినిధి ఎం.గోవర్దనరావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాసరచన పోటీలకు విశేష స్పందన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా సుస్థిర అభివృద్ధి, లక్ష్యాలు, ప్రచారం, విస్తరణ లక్ష్యంతో జిల్లా ప్రణాళిక, పరిశీలన కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక బుటిగూడ నోడల్ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో వ్యాసరచన, చిత్రలేఖనం, డిబేట్, క్వీజ్ పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ పోట్టీల్లో జూనియర్ గ్రూప్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు, సీనియర్ గ్రూప్లో +2, +3 విద్యర్థులు పాల్గొన్నారు. చిత్రలేఖనంలో జూనియర్ గ్రూప్లో మొదటి స్థానంలో అర్జున్ హంతాళ్, రెండో స్థానంలో కృష్ణశీశా, మూడో స్థానంలో అశిష్ కుమార్ సాబత్, సినియర్ గ్రూప్లో మొదటి స్థానంలో రుద్రప్రసాద్ గౌడ, రెండో స్థానంలో కుమారి విదిశా మహంతి, మూడో స్థానంలో ఓం మహంతి, తేజస్విని మిశ్రా నిలిచారు. ప్రోత్సాహక బహుమతులను శివ మటామ్ అందజేశారు. క్వీజ్ పోటీలో జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో దివాకర్ మండల్, రెండోస్థానలో కుముద్, పి.అజ్మేరా, మూడో స్థానంలో రష్మితా పడిఆరి, సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో పరాయణీ హంసదా, రెండో స్థానంలో శుభశ్రీ ఇసాలబత్, మూడో స్థానంలో మణిరామ్ ధారువా నిలిచారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహుకులు తెలిపారు. -
ధాన్యం మండీ ప్రారంభోత్సవంలో రభస
రాయగడ: ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం కొనుగొలు చేసేందుకు జిల్లా యంత్రాంగం బుధవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధాన్యం మండీల ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. తమకు పూర్తి స్థాయి టోకెన్లను మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని రైతులందరికీ టోకెన్లు మంజూరైన తర్వాతే మండీలను ప్రారంభించాలని రైతులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు. మండీ ప్రారంభొత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ హాజరయ్యారు. అయితే రైతులు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుని వారి సమస్యలను అదనపు కలెక్టర్కు విన్నవించారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశంలో ప్రతి సారీ రైతులను ఆహ్వానించకుండా సమావేశాన్ని నిర్వహించి మండీల ప్రారంభానికి తేదీలను ఖరారు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం విక్రయానికి సంబంధించి రైతులకు సకాలంలో టొకెన్లు మంజూరు చేయకపోవడంతో పంటపొలం నుండి కోసిన ధాన్యం భద్రపరిచేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు వివరించారు. అదీ కాకుండా రైతులు సుమారు 80 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే వారికి కేవలం పది నుంచి 25 క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి టోకెన్లు ఇవ్వడంతో మిగతా ధాన్యం విక్రయాల్లో సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. అందువల్ల రైతులందరికీ ఒకేసారి టోకెన్లను మంజూరు చేసేంతవరకు మండీలను ప్రారంభించవద్దని ఆందోళన చేపట్టారు. దీంతో ఏడీఎం నవీన్ చంద్రనాయక్ అక్కడ నుంచి వెళ్లిపోగా సమస్యను పరిష్కరించేందుకు సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న హాజరయ్యారు. రైతులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే సమస్యను పరిష్కరించే విషయంలో అంతా కలిసి కూర్చుని సమాధానం పరుచుకోవాలని అంతేకాకుండా మండీలను ప్రారంభించేందుకు అడ్డుకోవడం చట్ట విరుద్ధమని అన్నారు. ధాన్యం క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం దశల వారీగా టోకెన్లను మంజూరు చేస్తుందని సబ్ కలెక్టర్ జెన్న అన్నారు. అనంతరం రైతులను ఆయన పిలిచి సమావేశం ఏర్పాటు చేసి వారిని బుజ్జగించారు. దీంతో చల్లబడిన రైతులు ప్రారంభోత్సవానికి అంగీకరించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న మండీలను ప్రారంభించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి దాసరథి సొరేన్, ఆర్ఎంసి కార్యదర్శి కస్తూరీ సన్యాసి రాజు, డీఆర్సీసీ జన్మాజయ్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలో బోర్డు కూలి విద్యార్థి మృతి
కొరాపుట్: ఆశ్రమ పాఠశాలలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం కొరాపుట్ జిల్లా కొట్పాడ్ సమితి గాంధీ నగర్ ఆశ్రమ పాఠశాలో సిమెంట్ బోర్డు కూలి 3వ తరగతి విద్యార్థి ప్రేమానంద బోత్ర (7) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే బోర్డు కింద పడి మరో విద్యార్థి కాలు విరగ్గా, ఇంకో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన ఉదయం 6 గంటలకు జరగగా 11 వరకు విద్యార్థులను సంఘటన స్థలం నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం అనుమానాలకు తావిస్తోంది. క్షతగాత్రులను కొట్పాడ్ ఆస్పత్రికి తరలించగా ప్రేమానంద బోత్ర మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. క్షతగాత్ర విద్యార్థులు కిరణ్ బోత్ర, సన్న బోత్రలను జయపూర్ లోని కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విషయం తెలిసి ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్పూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆశ్రమ తలుపులు తెరవకపోవడంతో కొట్పాడ్ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. సోషల్మీడియా ద్వారా సమాచారం రావడంతో మాజీ మంత్రి పద్మిని దియాన్, మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ మజ్జి, కొరాపుట్ జిల్లా బీజేడి వర్కింగ్ ప్రెసిడెంట్ రాస్తారోకోలో పాల్గొన్నారు. అధికారులు సైతం సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాస్తారోకోలో ప్రదీప్ మజ్జి మాట్లాడుతూ విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది హత్యగా అభివర్ణించారు. గత 3 నెలల్లో 9 మంది గిరిజన విద్యార్థులు ఆశ్రమాల్లో మృతిచెందారని తెలిపారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మల్కన్ గిరి జిల్లాలో గిరిజన మహిళను హత్య చేసి తలను మొండెం నుండి వేరు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేవని ప్రదిప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారి పై వందలాది వాహనాలు నిలిచి పోయాయి. -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీలు) ప్రారంభమయ్యాయి. బుధవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎంసీ కార్యాలయం ఎదుట రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి నిత్యానంద గొండో ప్రారంభ పూజలు చేసి కేంద్రం ప్రారంభించారు. ఈ ఏడాది రైతులకు క్వింటాల్కి రూ..2,389 తో పాటు ప్రోత్సాహకంగా మరో రూ.731 కలిపి ఇస్తామన్నారు. జిల్లాలో 58 మండీలు ఏర్పాటు చేశామని తెలిపారు. 50,919 మంది రైతుల నుంచి 14 లక్షల 88 వేలు క్వింటాళ్ల వరి ధాన్యం సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపక్ష బీజేడీకి చెందిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి మండీలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా టెట్ పరీక్ష
పర్లాకిమిడి: రాష్ట్రవ్యాప్తంగా ఓటెట్ (ఒడిశా టీచర్స్ యోగ్యతా పరీక్ష) పరీక్ష 30 జిల్లాల్లో బుధవారం ప్రశాంతంగా ముగిసింది. గజపతి జిల్లాలోని పర్లాకిమిడి, మోహనాలో 16 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4,549 మంది పరీక్షలకు హాజరయ్యారు. పర్లాకిమిడిలోని మహారాజా బాలుర ఉన్నత పాఠశాల, మహారాజా బాలికల ఉన్నత పాఠశాల, సెంచూరియన్ పబ్లిక్ స్కూల్, సరస్వతీ శిశు మందిర్, మహిళా కళాశాలల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. అన్ని కేంద్రాల్లో జిల్లా ముఖ్య విద్యాధికారి డా.మయాధర్ సాహు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఓటెట్ పరీక్ష పాసయ్యే విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక రాత పరీక్షకు అర్హులు.పొగమంచుతో ఇబ్బందులుపర్లాకిమిడి: పట్టణంలో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. దీంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయఘడ బ్లాక్ మర్లబ ఘాటి, రామగిరి ఘాటి వద్ద బస్సులు ఎదురురెదుదుగా కనిపించకపోవడంతో పోలీసులు ఘాట్ సెక్షన్ల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈ పొగమంచు మరో రెండు రోజులు ఉంటుందని, గుండె జబ్బులు ఉన్నవారు ఉదయం బయటకు వెళ్లకపోవడమే మంచిదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.భారీగా గంజాయి పట్టివేత జయపురం: జయపురం సమితి పాత్రోపుట్ సమీపంలో జయపురం సదర్ పోలీసులు 195 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. పట్టుబడిన నిందితులు మాచ్ఖండ్ పోలీసుస్టేషన్ పరిధి ప్రధాన పూజారిగుడ గ్రామానికి చెందిన గోపీ బొడొనాయిక్, బొయిపరిగుడ పోలీసుస్టేషన్ పరిధి మఝిగుడకు చెందిన కృష్ణ గదబలుగా పేర్కొన్నారు. ఎస్ఐ ఏఆర్ సాగరియ నేతృత్వంలో పోలీసుల టీమ్ పాత్రోపుట్ ప్రాంతంలో వేకువజామున పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో ఒక నంబర్ లేని ట్రాక్టర్ పాత్రోపుట్ వైపు రావడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ట్రాక్టర్లో గంజాయిని గుర్తించారు. దీంతో ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసుని ఎస్ఐ శిరీష్ మహాపాత్రో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
టీ కొట్టులోనే రాజకీయాలకు పునాది
జయపురం: చాలా మంది రాజకీయ నేతలు టీ కొట్టు వద్ద రాజకీయాలు మాట్లాడుతూ ఎదిగారని రాష్ట్ర గణవిద్యామంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. ఆయన భువనేశ్వర్ నుంచి నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్కు వెళ్తూ జయపురంలో కొంత సమయం ఆగగా బీజేపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. బీజేపీ కార్యకర్తలు, ఆయన జయపురం మెయిన్ రోడ్డులో గల పురాతన సూర్య హొటల్కు వచ్చి పెసరట్టు టిఫిన్ చేసి టీ తాగారు. మంత్రి వచ్చారన్న విషయం తెలుసుకుని స్థానికులు హొటల్ చుట్టూ చేరి ఆయనతో ముచ్చటించారు. మంత్రి వారి కష్ట సుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తనకెంతో ఆనందంగా ఉందని, మిత్రులతో టీ తాగేందుకు వచ్చిన తనకు అనేక మందిని కలిసే అదృష్టం కలిగిందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి టీ దుకాణాలే మంచి వేదికలని తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులు నరశింగ చౌదురి, (సన చౌదురి)రబి నాయిక్, ఎ.వెంకట రావు, కమల భొత్ర, మనోజ్ కుమార్ దాస్, రుణ మహాపాత్రోలతో పాటు, జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎస్.మనోజ్ బాను రావు, సురభి పాణి, మధు హియాల్, పి.కనకా రావు, బాపి పొరిడ, పలువురు స్థానికులతో ఆయన చర్చించారు. -
ధాన్యం, మొక్కజొన్న మండీలు ప్రారంభించాలని డిమాండ్
జయపురం: కొరాపుట్ జిల్లా కృషక్ కల్యాణ మంచ్ నేతలు జిల్లా సివిల్ సప్లై అధికారి జయపురం ద్వారా కొరాపుట్ కలెక్టర్కు ఒక మెమొరాండం అందజేశారు. వెంటనే ధాన్యం, మొక్కజొన్న మండీలు ప్రారంభించి మండీలలో సమస్యలను పరిష్కరించాలని మెమొరాండంలో డిమాండ్ చేశారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న అతి తక్కవ ధరలకు రైతులు అమ్మే పరిస్థతి నెలకొందని వారు కలెక్టర్కు తెలిపారు. మండీలు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్నలు ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11 వ తేదీన మండీలు ప్రారంభించినా నేటి వరకు ఒక కిలో ధాన్యం కూడా కొనలేదని తెలిపారు. రైతులందరికీ టోకెన్లు అందించాలని, జనవరి 2026 నాటికి రైతుల వద్ద ఉన్న ధాన్యం, మొక్కజొన్నలు పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు టోకెన్ ల గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మండీల్లోనే ధాన్యం తూకం వేయాలని అలాగే ధాన్యం కొనుగోలు చేసిననాడే రైతుకు వెండర్ రశీదు ఇవ్వాలని కోరారు. కొనుగోలు సంస్థలు లేదా సివిల్ సప్లై కార్పొరేషన్లు మండీలలో ఖాళీ గోనెలు, హ్యాండిలింగ్ చార్జీలు రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. గతంలో బకాయి ఉన్న డబ్బులు చెల్లించాలన్నారు. ధాన్యం కొన్న తర్వాత రైతుల వద్ద మిగిలి ఉన్న ధాన్యం కూడా ప్రభుత్వమే కొనాలని, ఎఫ్ఎక్యూ పేరుతో రైతుల నుంచి అధిక ధాన్యం తీసుకోవడం ఆపాలని కోరారు. కొరాపుట్ పర్వ్ ప్రారంభానికి ముందే మండీలు ప్రారంభించాలని జిల్లా కృషక్ కళ్యాణ మంచ్ జిల్లా కార్యదర్శి నరేంద్ర కుమార్ ప్రధాన్ జిల్లా సివిల్ సప్లై అధికారికి అందజేసిన మెమోరాండంలో డిమాండ్ చేశారు. -
మల్కన్గిరి జిల్లాలో 8 ఓటీఈటీ పరీక్ష కేంద్రాలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఓటీఈటీ పరీక్షకు మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2597 మంది హాజరయ్యారు. కటక్ మాధ్యమిక విద్యా మండలి వారి ఆదేశాలతో జిల్లా విద్యా శాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి నేతృత్వంలో పరీక్ష నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి మాట్లాడుతూ మొదటి పేపర్ ఉదయం 8.30 నుంచి 11.00గంటల వరకు 3 కేంద్రాల్లో 746 మంది అభ్యర్థులకు నిర్వహించాల్సి ఉండగా, రెండోపేపర్ మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు 8 కేంద్రాల్లో 1851 మంది అభ్యర్థుల కోసం ఏర్పాటు చేశామన్నారు. మొదటి పేపర్కు 694 మంది హాజరయ్యారని, రెండో పేపర్కు 1772 మంది హాజరయ్యారని తెలపారు.మహిళా సంఘ భవనం ప్రారంభం పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ సీతాపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు స్మార్ట్ తరగతి గదుల భవనాన్ని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రారంభించారు. అలాగే భూపతి లక్ష్మీపురం పంచాయతీ గోరిబంద గ్రామంలో మహిళ సంఘ్ అతిథి గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి చైర్పర్సన్ బల్ల శాయమ్మ, సర్పంచ్ తేజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.అభివృద్ధికి దూరంగా దక్షణ ఒడిశా రాయగడ: రాష్ట్రంలో దక్షిణ ఒడిశా అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉందని దండకారణ్య మంచ్ కన్వీనర్ గౌర చంద్ర త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమీపంలో బుధవారం మంచ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల విడదులైన జాతీయ స్థాయి నివేదికలో అవిభక్త కొరాపుట్ జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయన్నారు. అపారమైన ఖనిజ సంపదలు గల ఈ జిల్లాల్లో ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవడం విచారకరమన్నారు. విద్య, వైద్య, మౌళిక వసతుల కల్పన వంటి రంగాల్లో బాగా వెనకబడిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. ఇటువంటి తరుణంలో అంతా సమాయత్తమై ప్రశ్నించాలని, అందుకు అనుగుణంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ తక్షణం సవతి తల్లి ప్రేమ ఒడిలో ఉందని, దీనిని వీడి అభివృద్ధికి కృషి చేయాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు గుప్తేశ్వర్ పాణిగ్రహి, కృష్ణకేశవ్ షడంగి, బాదల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
కొట్పాడ్లో సంసద్ ఖేల్ మహోత్సవం ప్రారంభం
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్లో బుధవారం సంసద్ ఖేల్ మహోత్సవం ప్రారంభించారు. కొట్పాడ్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉత్సవం ప్రారంభమైంది. సంసద్ ఖేల్ మహోత్సవంలో పలు గ్రామ పంచాయతీల నుంచి అనేక మంది క్రీడాకారులు, ఆదివాసీలు శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర ముందుగా కొట్పాడ్ ప్రజల ఆరాధ్య దేవి మా మవుళీ మందిరానికి వెళ్లి పూజలు చేశారు. ఆ పూజల్లో కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ క్రీడాజ్యోతి వెలిగించారు. ఆయనతో పాటు కొట్పాడ్ బీడీఓ మనోజ్ కుమార్ నాయిక్, సమితి సంక్షేమ అధికారి అశోక్ జెన తదితరులు పాల్గొన్నారు. మైదానంలో ముఖ్య అతిథి రూపు భొత్ర క్రీడా పతకాన్ని ఎగురవేసి సంసద్ ఖేల్ మహోత్సవాలను ప్రారంభించారు. రెండు దినాలు నిర్వహించనున్న ఈ ఖేల్ మహోత్సవాల్లో 17 పంచాయతీల నుంచి వందలాది మంది పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో 100, 200 మీటర్ల పరుగు పందాలు, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్జంప్, హైజంప్ తదితర పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్, ఫుట్బాల్ పోటీలు భైరవ మైదానంలో నిర్వహిస్తామని మిగతా పోటీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరుపనున్నట్లు వెల్లడించారు. -
పారిశ్రామిక రంగంలో పురోగతి
రాయగడ: పారిశ్రామిక రంగంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని జేకేపూర్లో గల జేకేపేపర్ మిల్ ఉపాధ్యక్షుడు వినయ్ ద్వివేది అన్నారు. జేకే పేపర్ మిల్ 141 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మిల్ ప్రాంగణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖనిజ, ప్రాకృతిక సంపదలను వినియోగించడంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని అన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. 1962లో జేకేపూర్లో ఏర్పాటైన జేకే పేపర్ మిల్లు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సామాజిక రంగంలోనూ సేవలు కనబరిచిందని తెలిపారు. పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నాణ్యత విషయంలో జేకే సంస్థలు దేశంలోనే ప్రత్యేకస్థానాన్ని సంపాదించాయని తెలిపారు. అంతకు ముందు జేకే పేపర్ మిల్ వ్యవస్థాపకులు లాలాకమలాపత్ సింఘానియా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగన సమావేశంలో భాగంగా పేపర్ మిల్లో 25, 45 ఏళ్ల సేవలను అందించిన ఉద్యోగులకు ఆయన సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యవస్థాపక వేడుకలకు ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
యువకుడికి తీవ్ర గాయాలు
రణస్థలం : లావేరు మండలం బెజ్జిపురం జాతీయ రహదారిపై రణస్థలం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న లావేటి నవీన్ అనే యువకుడు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. శ్రీకూర్మంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం గార: ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు సౌజన్యంతో తిరుప్పావై ప్రవచనాలు మంగళవారం సాయంత్రం ప్రత్యేక మంటపంలో ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు ప్రవచకులుగా ప్రారంభోనోపాస్యం చేశారు. ఇక్కడతో పాటు శ్రీకాకుళం నగరంలోని కోదండ రామాలయం, వేణుగోపాలస్వామి ఆలయంలోనూ ప్రవచనాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అదే విధంగా, మార్గశిర మాసం బహుళ ద్వాదశి మంగళవారం మధ్యాహ్నం నుంచి నెలగంట ప్రారంభమైందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ 2026 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోగా తప్పనిసరిగా తమ జీవన ప్రమాణ పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించాలని ఉప ఖజానా అధికారి చింతాడ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలోని హెడ్ క్వార్టర్స్ ఉప ఖజానా కార్యాలయం పరిధిలో 6,790 మంది పింఛనుదారులు ఉన్నారని, వీరందరూ నెట్ సెంటర్లలోగానీ లేదా దగ్గరలోని ఖజానా కార్యాలయాల్లో గానీ జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా తమ పత్రాలను సమర్పించాలని ఆయన సూచించారు. అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా బయోమెట్రిక్ నమోదు చేయలేని వారు సంబంధిత ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. అంతేకాక జీఓ 315 ప్రకారం పింఛను పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న ఫ్యామిలీ పెన్షన్దారులు, ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు సంబంధిత పత్రాలతో నేరుగా శ్రీకాకుళం ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించి జీవన ప్రమాణ పత్రాలను సమర్పించాలని ఆయన తెలియజేశారు. ‘అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదు’ మందస: కార్గో ఎయిర్పోర్టుకు అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. భేతాళపురం గ్రామంలోని సచివాలయ ప్రాంగణంలో పలాస ఆర్డీఓ జి.వెంకటేశ్వరరావు కార్గో ఎయిర్పోర్టు బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అంగీకరిస్తే ప్రభుత్వం నుంచి లాంగ్ పూలింగ్ విధానం తీసుకువచ్చి ఎకరాకు 25 సెంట్లు భూమి తిరిగి ఇస్తామని, ఏ ఒక్కరి ఇళ్లకు నష్టం కలిగించకుండా ప్లాన్ చేశామని, జిరాయితీ తోటల్లో ఉన్నా చెట్లకు ప్రత్యేక ధర ప్రకటిస్తామని, ప్రభుత్వ ధర కంటే 2.5 రెట్లు అధికంగా చేసి ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పారు. అనంతరం రైతు మామిడి రాజేశ్వరి మాట్లాడుతూ ప్రాణాలైనా ఇస్తాం గానీ భూమి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కీలు గున్నమ్మ, బత్తిన ఉమాపతి, గార ఆనంద్ మాట్లాడుతూ భూములు ఇచ్చేస్తే భవిష్యత్ తరాల మనుగడ ఏమవుతుందని ప్రశ్నించారు. అంగుళం భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రైతు బత్తిన లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 23న భేతాళపురంలో సభ ఏర్పాటు చేసి భూమి ఇచ్చేది లేదంటూ తీర్మానం పంపిస్తామని తెలిపారు. పచ్చని ఉద్దానం భూములను నాశనం చేసే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. -
47
ఆ కాలువకు..ఏళ్లు! హిరమండలం : జిల్లాను సస్యశ్యామలం చేస్తూ అపర భగీరథిగా నిలుస్తున్న గొట్టా బ్యారేజీ నిర్మాణం దాదాపు ఐదు దశాబ్దాల కిందట చేపట్టారు. అప్పటి సాగునీటి అవసరాలకు తగ్గట్టు కాలువలు నిర్మించారు. ముందుగా నిర్మాణం చేపట్టిన ఎడమ ప్రధాన కాలువ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కాలువ బాగోగులు పట్టించుకోవడం లేదు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికై నా బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. 1978లో గొట్టా బ్యారేజీ నిర్మాణం జరిగింది. కాలువ తవ్విన నాటి నుంచి ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టిన దాఖలాలు లేవు. నేతల జేబులు నింపేలా నీరు–చెట్టు పనులు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదినక పనులు చేపట్టడం లేదు. ఎడమ ప్రధాన కాలువ అందుబాటులోకి వచ్చి 47 ఏళ్లు దాటడంతో దారిపొడవునా కాలువ దారుణంగా తయారైంది. కనీస నిర్వహణ లేక కాలువకు ఎక్కడికక్కడే గండ్లు పడుతున్నాయి. షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. అనుసంధాన పిల్ల కాలువలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. అంతా అస్తవ్యస్తం.. సాధారణంగా చిన్నపాటి కాలువను నిర్వహణ లేక విడిచిపెడితేనే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అటువంటిది జిల్లాలో సగం పంటకు సాగునీరు అందించే కాలువను పట్టించుకోకుండా వదిలేయడంతో పూర్తిగా ధ్వంసమైంది. కాలువపై స్ట్రక్చర్లు ధ్వంసమయ్యాయి. షట్టర్లు కొట్టుకుపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు, రెగ్యులేటర్లు శిథిలమయ్యాయి. 2,480 క్యూసెక్కుల నీటి సామర్థ్యం 1700 క్యూసెక్కులకు పడిపోయిందంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రైతుల పాట్లు.. ఏటా ఖరీఫ్ వచ్చిందంటే చాలు.. కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు రైతులకు అదనపు పని తప్పడం లేదు. కర్ర చెక్కలు, ఇసుక బస్తాలు, గడ్డివాములు అడ్డుపెట్టుకొని నీరు మళ్లించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటోంది. 2022–23లో అప్పటి ప్రభుత్వం రూ.954 కోట్ల అంచనాలతో ఆధునీకరణ పనులు చేపట్టాలని భావించింది. ఇంతలో గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం నిర్మాణం, వంశధార–నాగావళి అనుసంధానంతో ఆధునీకరణ అంశం పక్కకు వెళ్లింది. అయితే ఇప్పుడు రూ.1600 కోట్లతో అధికారులు కొత్త ప్రతిపాదనలు చేశారు. దీనిపై జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎడమ ప్రధాన కాలువ ఆధునీకరణకు సంబంధించి తాత్కాలిక అంచనాలు రూపొందించాం. ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపడుతున్నాం. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. – ఎం.మురళీమోహన్ ఈఈ నరసన్నపేట డివిజన్ , బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు -
క్వారీలో పేలుళ్లు
● పక్కనే వ్యవసాయ పనుల్లో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలు కొత్తూరు: శోభనాపురం కొండపై నిర్వహిస్తున్న క్వారీలో పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరిపడటంతో పక్కనే తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళా కూలీలు గాయపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..శోభనాపురం గ్రామానికి చెందిన బైరి భానుమతి, రామలక్ష్మి, పుష్పలు క్వారీకు ఆనుకొని ఉన్న మామిడితోటలో పసుపు పంటను తవ్వేందుకు వెళ్లారు. పసుపు తవ్వుతుండగా ఒక్కసారి క్వారీ నుంచి భారీ శబ్దాలు వెలువడటంతో భానుమతి, రామలక్ష్మి స్పృహ తప్పి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి గాయాలు కనిపించడంతో పుష్ప కేకలు పెట్టడంతో వెంటనే సమీప వరి పొలాల్లో పనులు చేస్తున్న వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా పేలుళ్లు చేస్తుండటం వల్లే తమకు గాయాలు తగిలాయని బాధితురాలు భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భానుమతి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం జీడీ నమోదు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. -
జ్యుడీషియల్ కమిటీ వేయాలి
జలుమూరు: కూటమి ప్రభుత్వం చేస్తుటన్న అరాచాకాలపై జ్యుడీషియల్ కమిటీ వేసి న్యాయ విచారణ చేపట్టాలని శ్రీముఖలింగం అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీముఖలింగం మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదని.. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదం పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయని ప్రకటించడం, ఆవి వెనక్కు వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. ప్రసాదం పథకం అంటే ప్రసాదాలు మాదిరిగా తినేయేడమా అని ప్రశ్నించారు. నరసన్నపేట ఎమ్మేల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు ఆలయం లోపల, బయట జరిగే పనులలో అవినీతికి పాల్పడుతున్నారని, వాటిపై ప్రశ్నించినందుకు తనపై హత్యాయత్నం చేశారన్నారు. అర్చకులకే భద్రత లేని ఈ ప్రభుత్వంలో ఎవరికి భద్రత ఉంటుందని మండిపడ్డాడు. జంతర్ మంతర్ సాక్షిగా దేశంలో ఉన్న వంశపారం పర్య అర్చకుల భద్రత కల్పించాలని కోరారు. -
పశుసంవర్థకశాఖ జేడీపై విచారణ
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బొబ్బిలిలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న కె.రాజగోపాలరావును సొంత జిల్లా శ్రీకాకుళంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని, ఎస్సీ సబ్ప్లాన్ నిధులు సైతం దుర్వినియోగం చేశారని ఎచ్చెర్ల గ్రామానికి చెందిన ఇనుప రాజారావు ఈ ఏడాది జనవరి 23న విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్న డాక్టర్ జయరాజ్, మనోజ్, సత్యప్రకాష్, రామ్మోహన్లను కాదని వేరే జిల్లాలో పనిచేస్తున్న రాజగోపాలరావుకు జేడీగా బాధ్యతలు అప్పగించడం అన్యాయమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మంగళవారం శ్రీకాకుళం వచ్చి జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. సంబంధిత జేడీ, నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఫిర్యాదుదారిని పిలిపించి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తానని హనుమంతరావు పేర్కొన్నారు. చర్యలు తీసుకోకపోవడం అన్యాయం.. ఎస్సీసబ్ప్లాన్ నిధులు సుమారు రూ.11కోట్లు పక్కదారి పడితే చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ఫిర్యాదుదారు రాజారావు అన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం చూడి ఆవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఏ ఒక్క ఎస్సీకి కూడా ఇవ్వకుండా ఆ డబ్బులతో దాణా కొనుగోలు చేసి ఎస్సీయేతర కులాలకు ఇచ్చి నిధులు దారిమళ్లించినట్లు చెప్పారు. రాయితీతో పశువుల దాణా సరఫరా చేయాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. తప్పుడు నివేదికలు, తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికిచ్చి మోసం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిత్లీ తుఫాన్ సమయంలో ఇచ్చిన దాణాను సైతం పశువుల రైతులకు ఇవ్వలేదన్నారు. ఆడిట్లో అనేక ఆరోపణలు రుజువైనా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించినట్లు ఫిర్యాదుచేస్తే దానిపై త్రిసభ్య కమిటీ వేసినా దోషుల నుంచి రికవరీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. -
గ్రామాల్లో బీజేడీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ పర్యటన
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రఖుల్గూడ గ్రామంలో లక్కే పోడియమి అనే మహిళ తల నరికిన ఘటన చోటు చేసుకున్న ఘటన తెలిసిందే. వారం రోజులుగా ఈ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరిని శాంతింపజేసేందుకు ఈ బృందం ఎంవీ 26 గ్రామంలో పర్యటించి ప్రతి ఇళ్లను పరిశీలించారు. పర్యటన సందర్భంగా పోలీసులు 40 ప్లటూన్ల బలగాలను మోహరించారు. బృందంలో మాజీ మంత్రి రమేశ్ మాఝి, రవి నారాయణ్ నంద్, మాజీ ఎంపీ ప్రదిప్ మాఝి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, సీనియర్ బీజేడీ అధ్యక్షుడు మనాస్ మాడ్కమి, సీనియర్ నేత ఈశ్వర్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా 25వ వార్షికోత్సవం
జయపురం: జయపురం రాజువీధిలో గల అరవింద పూర్ణాంగ విద్యా కేంద్రం సేవలు అభినందనీయమని జయపురం మున్సిలప్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అన్నారు. సోమవారం సాయంత్రం జరిగిన విద్యా కేంద్రం 25వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అరవిందుని చిత్రపటానికి పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గత 25 ఏళ్లుగా నిస్వార్థంగా విద్యార్థులకు సేవలు అందిస్తోందన్నారు. ఈ విద్యా కేంద్రం ఉన్నతికి మున్సిపాలిటీ తరఫున అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అరవిందాశ్రమ సాధకురాలు సుజాత పాడీ ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఆమె ప్రసంగిస్తూ విద్యార్థులకు గుణాత్మక విద్యతోపాటు సక్రమ మార్గంలో నడిపించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే అరవింద పూర్ణాంగ విద్యా కేంద్రం లక్ష్యం కావాలన్నారు. హరిహర కరసుధా పట్నాయక్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ పంచానన మిశ్ర పర్యవేక్షణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కొరాపుట్ జిల్లాలోని 9 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చినవారికి మెమొంటాలతో సన్మానించారు. కొరాపుట్ జిల్లా అరవింద ఖర్మధార కోఆర్డినేటర్ ప్రశాంత కుమార్ స్వైయ్, కార్యకర్తలు తరణీ చరణ పాడీ, మీనకేతన సాహు, విద్యాలయ పరిచాలన కమిటీ సభ్యులు ప్రశాంత పొరిడ, తేజేశ్వర పండా, ఉమాశంకర ఆచారి, బైద్యనాథ్ మిశ్ర, విద్యాలయ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విపత్తులను ఎదుర్కోవడంపై శిక్షణ
పర్లాకిమిడి: రాయఘడ బ్లాక్ గండాహతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 11 వ జిల్లా స్థాయి రెడ్ క్రాస్ స్టడీ, శిక్షణ శిబిరాన్ని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రారంభించారు. ఈ రెడ్ క్రాస్ శిక్షణ శిబిరానికి జిల్లా ముఖ్య విద్యాధికారి మాయాధర్ సాహు అధ్యక్షత వహించారు 400 జూనియర్ క్యాడెట్లు, 150 మంది పరామర్శ దాతలు పాల్గొన్నారు. వీరికి మూడు రోజుల పాటు అగ్ని ప్రమాదంలో అనుసరించాల్సిన శిక్షణ, వరదల సమయంలో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, రాహదారి భద్రత, ప్రాథమిక చికిత్సపై శిక్షణ అందిస్తారు. ఈ రెడ్ క్రాస్ శిక్షణ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు. తుఫాన్, కరువు, వరదలు, అగ్నిప్రమాదాల సమయంలో ప్రజల రక్షించాలన్నారు. ఈ శిక్షణ శిబిరంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ, గౌరవ అతిథులుగా రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా, బీడీఓ సంతోష్ కుమార్ బారిక్, రాయఘడ వైస్ చైర్మన్ జ్యోతి ప్రసాద్ పాణి, పాఠశాల పర్యవేక్షన కమిటీ అధ్యక్షుడు అశోక్ దోళాయి, ప్రధాన ఉపాధ్యాయులు సౌమ్యరంజన్ సాహు, జిల్లా పాఠశాలల శారీరిక శిక్షణాధికారి సురేంద్ర పాత్రో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడు రోజుల పాటు గండాహతి పాఠశాలలో రెడ్క్రాస్ శిక్షణ కార్యక్రమం కోనసాగుతోందని డీఈఓ తెలియజేశారు. -
తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం
పర్లాకిమిడి: ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీవేంకటేశ్వర మందిరం కల్యాణ మండపంలో వీటిని ప్రారంభించారు. ముప్పై రోజుల పాటు సాగే ఈ తిరుప్పావై ప్రవచనాలు భోగి పండుగ నాడు గోదా కల్యాణంతో ముగుస్తాయి. రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకూ ఈ ప్రవచనాలు చెబుతారు. ఆలయ ప్రధాన అర్చకులు భధ్రం శ్రీనివాసా చార్యులు ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధాలలో తొలిరోజు రెండు పాశురాలు భక్తులకు తెలియజేశారు. వృద్ధునికి గాయాలు రాయగడ: చలి వేస్తుండడంతో వెచ్చగా ఉంటుందని మంచం కింద కుంపటి పెట్టుకొని నిద్రిస్తుండగా మంటలు వ్యాపించడంతో మంచంపై పడుకున్న వృద్ధుడు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధి కొత్తగుడ గ్రామంలో చోటు చేసుకుంది. గాయాలు పాలైన మంగేతన్ గరడియాను వెంటనే కుటుంబీకులు అంబులెన్స్లో ఆస్పత్రిలో చేర్పించారు. వృద్ధుడు గరడియా సోమవారం రాత్రి భోజనాలు చేసిన అనంతరం కుంపట్లో కట్టెలు వేసి మంట పెట్టుకున్నాడు. అనంతరం నిప్పుగా అవి మారడంతో కుంపటిని తాళ్ల మంచం కిందపెట్టి నిద్రించాడు. కొద్ది సమయం తరువాత తాళ్లు కాలిపోయి మంచానికి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో గాఢనిద్రలో ఉన్న వృద్ధుడు మంటల్లో చిక్కుకుని గాయాలు పాలయ్యాడు. ఇళ్లంతా పొగ కమ్ముకోవడంతొ అంతాలేచి చూసేసరికి గరడియా మంటల్లో చిక్కుకోవడం గమనించిన కుటుంబీకులు మంటలను ఆర్పి వెంటనే ఆంబులెన్స్కు సమాచారం అందించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తపేట పంచాయతీ వీర నారాయణపూర్ గ్రామ సమీపంలని పొలంలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభించింది. అటువైపుగా వెళుతున్న కొందరు మృతదేహాన్ని చూసి చందిలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వయసు 70 ఏళ్లకు పైబడి ఉంటుందని, శరీరంపై నీలపురంగు చొక్కా, లుంగీ ఉన్నట్టు చెప్పారు. గుర్తించినవారు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
పర్యాటక రంగానికి పెద్దపీట
రాయగడ: రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ అన్నారు. రాయగడ పర్యటనకు సోమవారంవచ్చిన ఆమె స్థానిక సర్క్యూట్ హౌస్లో అధికారుల తో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాయగడలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. అనంతరం జిల్లాలో శిశు వికాసం, మిషన్ శక్తి, విద్య, వైద్యం, సమగ్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. గర్భిణులకు పౌష్టికాహరం పంపిణీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఐసీడీఎస్ కార్యకర్తలు సమన్వయంగా వ్యవహరించాలని అన్నారు. ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ -
ధాన్యం మండీ ప్రారంభం
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్ సమితి బొతాసన గ్రామ పంచాయతీలో ధాన్యం మండీని కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర మంగళవారం ప్రారంభించారు. కొట్పాడ్ లేంప్ ఎమ్డీ రాజేంద్రనాయక్ మాట్లాడుతూ కొట్పాడ్ ప్రాంతంలో 6813 మంది రైతుల పేర్లు నమోదు చేయటం జరిగిందన్నారు. వారి నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు సమితిలో గల 17 గ్రామ పంచాయతీల్లో నోటిఫైడ్ ఏరియా కౌన్సల్లలో 9 మండీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రారంభించిన మండీలో రైతులు అనేక మంది ధాన్యం అమ్మేందుకు తీసుకువచ్చారు. పొక్యూర్మెంట్ ఏజెంట్, సంస్థల ప్రతినిధులు కనిపించలేదు. కనీసం లేంప్లు, ఆర్.ఎం.సిలు కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు. మండీలలో ధాన్యం కొనుగోలు చేయకపోతే చిన్న రైతులు దళారులకు అతి తక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఏర్పడుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని కృషక్ సమాజ్ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి రైతుల నుంచి మండీలలో ధాన్యం కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సమితి ఉపాధ్యక్షుడు బబులి పాణిగ్రహి, కొట్పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి పాల్గొన్నారు. -
శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రాఖల్గూఢ, మరరివాడ, నీలిగూఢ, ఎంవీ 18 గ్రామాల వాసులతో మంగళవారం కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్, ఎస్పీ వినోద్ పటేల్లు శాంతి చర్చలు జరిపారు. భవిష్యత్ కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. నాలుగు గ్రామాల ప్రజలు శాంతి భధ్రతలకు సంబంధించి సమస్యల గురించి నేరుగా ఎస్పీకి చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించవద్దని ఎస్పీ కోరారు. నకిలీ వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ప్రాథమిక సమస్యలు విన్నారు. గిరిజనుల ఇళ్ల పట్టాలను త్వరగా జారీ చేయాలని కలెక్టర్ తహసీల్దార్కు ఆదేశించారు. నీలిగూడ గ్రామంలో చదువు మానేసిన ఒక విద్యార్థి గురించి కలెక్టర్కు తెలియడంతో ఆమెను హాస్టల్లో చేర్పించాలని ఆదేశించారు. -
రామేశ్వరం–మధురై తీర్థయాత్రలకు వృద్ధుల పయనం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా స్పోర్ట్స్ స్టేడియం నుంచి మంగళవారం కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రదన్ రెండు బస్సుల్లో 75 మంది వృద్ధులను రామేశ్వరం, మధురై తీర్థయాత్రలకు పంపించేందుకు బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు రాయగడ వరకు వెళ్తాయి. అక్కడి నుంచి రైలులో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం, మధురై పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వీరందరికీ వారం ముందుగానే వైద్యపరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రైలులో వైద్య, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. వృద్ధులకు ఎస్కార్ట్ అధికారులుగా క్రీడా శిక్షకురాలు బబితా మహంతి, ఖోయిర్పూట్ తహసీల్దార్ సరోజ్ నాయక్ యాత్రలో పాల్గొంటారు. -
గుణుపూర్–తెరువలి రైలు లైన్ నిర్మాణంపై సమీక్ష
రాయగడ: దక్షిణాంచల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డిసి) సంగ్రామ్ కేసరి మహాపాత్రో సొమవారం గుణుపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గుణుపూర్ నుంచి తెరువలి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన పనులపై సమీక్షించారు. గుణుపూర్ సబ్ కలెక్టర్ దదుల్ అభిషేక అనిల్, రామనగుడ తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి, గునుపూర్ అదనపు తహసీల్దార్ గయా డొంబురు ధర బెహర, బిసంకటక్ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, మునిగుడ తహసీల్దార్ ఎం.అనురాధ, రైల్వే శాఖ అధికారి సుభ్రత్ పండ, ఇంజినీర్లు బి.రమేష్, ప్రద్యుమ్న దొలాయి తదితరులు పాల్గొన్నారు. గుణుపూర్ నుంచి తెరువలి వరకు అనుసంధానించే కొత్త రైలు లైన్ నిర్మాణానికి సంబంధించి చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్న ఆర్డీసీ కేసరి మహాపాత్రో ఆయా మార్గంలొ అవసరమయ్యే స్థల సేకరణకు సంబంధించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. స్థల సేకరణ పనులు పూర్తయితే రైలు నిర్మాణానికి సంబంధించి ఆ శాఖ పనులకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1165 కోట్ల నిధులను వినియోగిస్తుందని అన్నారు. -
ప్రావీణ్యం సంపాదించాలి
సారవకోట: నూతన గృహోపకరణాల తయారీలో కార్మికులు మరింత ప్రావీణ్యం సంపాదించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మండలంలోని బుడితి గ్రామానికి చెందిన కంచు, ఇత్తడి కార్మికులు తయారు చేసిన నూతన గృహోపకరణాలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు అందజేశారు. కంచు, ఇత్తడి కార్మికులకు ఇటీవల లేపాక్షి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వగా, వారిచ్చిన శిక్షణలో సూచించిన వస్తువులు తయారు చేశారు. లేపాక్షి ద్వారా వాటిని విక్రయించేందుకు తనవంతు కృషి చేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు శ్రీకాకుళం క్రైమ్: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలో అభ్యుదయ సైకిల్ యాత్ర మంగళవారం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ను పోలీసులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్రలో ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు అత్యధికంగా పాల్గొనాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. యాత్ర అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో భారీ బహిరంగ అవగాహన సభ జరుగుతుందన్నారు. యాత్ర సాగే మార్గం సింహద్వారం – ఎర్రంనాయుడు ఆర్చి కూడలి – డే అండ్ నైట్ కూడలి – రామలక్ష్మణ కూడలి – సూర్యమహల్ కూడలి – జీటీ రోడ్డు – ఏడురోడ్ల కూడలి చోరీలు చేసిన వ్యక్తి అరెస్టు పొందూరు: మండల కేంద్రంలోని గాంధీనగర్–1, 2 వీధుల్లో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనాలకు సంబంధించి దొంగను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జరజాపుపేటకు చెందిన అవనాపు అప్పలస్వామి పొందూరు బస్టాండ్లో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కాడు. పొందూరులో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిందని, గాంధీనగర్ వీధుల్లో దొంగతనాలు చేసిన వ్యక్తిగా గుర్తించామని ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో దొంగతనం చేసిన సొత్తును అప్పలస్వామి నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు. ఒక కేసుకు సంబంధించి అరతులం బంగారం, వెండి, రెండో కేసుకు సంబంధించి 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. పొందూరు కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. పంచ్ అందిరింది శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం పంచ్ అదిరింది. ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడ వేదికగా 9వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు ఒక బంగారు, మూడు రజత, మరో మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి శభాష్ అనిపించారు. అలాగే రాష్ట్ర ఛాంపియన్షిప్ రన్నరప్ టైటిల్ను సాధించారు. బంగారు పతకం సాధించిన పి.విశ్వేశ్వరరావు ఆలిండియా సీనియర్స్ నేషనల్ బా క్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా క్రీడాకారుల రాణింపునకు ప్రధాన కారణం డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు అని జిల్లా బాక్సింగ్ సంఘ పెద్దలు కొనియాడారు. క్రీడాకారులు ఉన్నతమైన రాణింపునకు కోచ్ అందిస్తున్న కఠోర శిక్షణే కారణమని డీఎస్డీవో ఎ.మహేష్బాబు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్ (అను), వంగా మహేష్ పేర్కొన్నారు. -
సెంచూరియన్ విద్యార్థి ప్రతిభ
పర్లాకిమిడి: స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్.కుమార్ భరద్వాజ్ ప్రతిష్టాత్మకమైన 18వ యంగ్ ఆస్ట్రానమర్ టాలెంట్ సెర్చ్ పోటీల్లో 30 మంది ఫైనలిస్టులలో ఎంపికై బహుమతి గెలుచుకున్నాడు. భువనేశ్వర్లో జయదేవ్ భవన్లో ఈ నెల 13న రాష్ట్ర ఆహార శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో చేతుల మీదుగా బహు మతి అందుకుఆన్నరు. కుమార్ భరధ్వాజ్కు ఇస్రో సంస్థకు చెందిన ఒక కేంద్రాన్ని సందర్శించే అరుదై న అవకాశం లభించనుంది. అంతరిక్ష ఖగోళ శాస్త్రంపై భరద్వాజ్కు మరింత ఆసక్తిని పెంపొందించి భవిష్యత్తులో ఆ రంగంలో కేరీర్ను ఎంచుకునేందు కు ప్రేరణగా నిలవనున్నట్టు ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి అన్నారు. సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంతీయ అడ్మిషన్స్ డైరెక్టర్ సంబిత్ పాత్రో, ఫ్యాకల్టీ భరధ్వాజ్కు అభినందనలు తెలిపారు. -
మొక్కజొన్నపై మక్కువ..!
● అధిక విస్తీర్ణంలో ఈ ఏడాది సాగు ● ఎరువుల కొరతపై ఆందోళన జలుమూరు: ఆరుతడి పంటల్లో మొక్కజొన్న రైతులకు ప్రధాన పంట. ఈ పంట సాగులో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు. అందువలన సాగుకు రైతులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 30 శాతం సాగు విస్తీర్ణం పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదివరకు జిల్లావ్యాప్తంగా అధికంగా లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట, పోలాకి, జలుమూరు మండలాల్లో సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి నరసన్నపేట, సారవకోట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, గార, శ్రీకాకుళం రూరల్ తదితర మండలాల్లోనూ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చాలా వరకూ ఇప్పటికే మొక్కజొన్న వేయగా.. మరికొన్ని మండలాల్లో సైతం ప్రస్తుతం సాగుకు సమయాత్తమవుతున్నారు. ఇప్పటికే ఆయా పొలాలను ట్రాక్టర్, రోటావేటర్తో సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 70.319 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయనున్నట్లు అంచనా. యూరియాకు డిమాండ్ గడిచిన ఖరీఫ్లో వరిపంటలో యూరియాకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. దీంతో ప్రస్తుత రబీకు కూడా ఇదే దుస్థితి నెలకొందని రైతులు అందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రధాన ఎరువు యూరియా కాగా.. కాంప్లెక్స్ తదితర ఎరువుల అవసరం కూడా ఉంటుంది. ఎకరాకు సుమారు ఎనిమిది నుంచి పది బస్తాలు వరకు ఆయా ఎరువులు తప్పనిసరి. మొదటి దశలో మొక్కజొన్న వేసిన రైతులు యూరియా ఇప్పటికే మొదటి ఎరువుగా వేయడం జరిగింది. ఇక రెండోసారి కోసం లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల తదితర మండలాల్లో ఎరువుల షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు రైతులకు వివిధ రకాల ఎరువులను అంటగడుతున్నారు. దీంతో వాటి అవసరం లేకపోయినా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు కొందరు ధాన్యం వ్యాపారులు కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా గ్రామాల్లో లారీలతో యూరియా తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. తెగుళ్లపై అప్రమత్తత అవసరం మొక్కజొన్నను లద్దె(కత్తెర) పురుగు ఆశిస్తుంది. ఇది తిరగబడిన వై ఆకారాంలో తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఉదర భాగంలో నల్లటి నాలుగు చుక్కలు చతురుస్ర ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా వీటిని గుర్తించవచ్చు. వీటి లార్వాలు పంట ఆకు, కాండను తింటాయి. మొదటి దశలో ఆకు పత్రహరితాన్ని పూర్తిగా తింటాయి. ఆకులు తిన్న అనంతరం కాండం తింటూ పూర్తిగా మొక్క లేకుండా చేస్తాయి. అందువలన వీటిని గుర్తించిన వెంటనే లార్వాను ఏరివేసి నాశనం చేయాలి. పురుగు, గుడ్ల సముదాయాన్ని గుర్తించి వెంటనే వేప సంబంధిత మందులు వాడుకోవాలి. ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోరి ఫైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు, క్విన్లాల్ ఫాస్ 2.0 మిల్లీ లీటర్ల మందు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎక్కువగా ఉన్నప్పుడు ఎమాక్సిన్ బెంజొయట్ 0.4 గ్రామాలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే విషపు ఎరలతో కూడా తెగుళ్లను నివారించుకోవచ్చు. మొక్కజొన్న పంట మొక్క దశ నుంచి పంట ఏపుగా పెరిగే వరకు కత్తెర పురుగు తీవ్రత ఉంటుంది. పంటను ఒకటి రెండు రాత్రుల్లోనే పూర్తిగా తినేసేవిధంగా వ్యాప్తి చెందుతుంది. ఇదే సమయంలో రైతులు ఆప్రమత్తంగా ఉంటే వీటి దాడి నుంచి పంటను రక్షించుకోగలము. అలాగే ఒకే ఏరియాలో సుమారు 10 నుంచి 15 ఎకరాల వరకు సాగు చేస్తే పంట నష్టం తగ్గించడం సులభమవుతుంది. – కింజరాపు రవి కుమార్, మండల వ్యవసాయ అధికారి, జలుమూరు -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష పరిధిలో జిల్లాలో పనిచేస్తున్న సీఆర్ఎం టీచర్లు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆత్మగౌరవ దీక్షను సోమవారం నిర్వహించారు. ముందుగా ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా చేరుకొని దీక్షను నిర్వహించారు. ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు సంపూర్ణ మద్ద తు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫారం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షు డు పోలాకి తవిటినాయుడు, ప్రధాన కార్యదర్శి బి. గిరిధర్, కోశాధికారి ఎన్.ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్సుల్లో ఏ, బీ క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. 2016లో పీఏబీ ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నారని, అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. సీఆర్ఎంటీల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి, అందరికీ ఒకే విధమైన హోదా, పనిని కల్పించాలన్నారు. ఫీ ల్డు లెవల్లో పనిచేస్తున్నవారికి అలవెన్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్లో డీఆర్వోకు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో యూనియన్ నాయకులు కె.రామకృష్ణ, డి. శ్రీనివాసరావు, టి.ప్రసాదరావు, పి.వైకుంఠరావు, జయలక్ష్మి, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. -
తీర్థ యాత్రకు బయలుదేరిన సీనియర్ సిటిజన్లు
జయపురం: సీనియర్ సిటిజన్ల తీర్థ యాత్రల పథకంలో భాగంగా జయపురం పట్టణం నుంచి 15 మందిని పంపుతున్నారు. వీరు తమిళనాడు రాష్ట్రం రామేశ్వర్కు సోమవారం బయలుదేరారు. వీరికి జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి వారికి వీడ్కోలు పలికారు. తీర్థ యాత్రల కు జయపురం నుంచి బయలు దేరిన వారిలో నలుగురు పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. ఒక ప్రత్యేక వాహనంలో వీరు కొరాపుట్ మీదుగా రాయగడకు బయలుదేరివెళ్లారు. వీరందరికీ అవస రమైన పత్రాలు సమకూర్చారు. వీరు రాయగడలో ట్రైన్ ఎక్కి దక్షిణ భారత దేశ యాత్రకు బయలుదేరారని అధికారులు వెల్లడించారు. వీరు తమిళనాడులో రామేశ్వర్, మధురై, తదితర పుణ్యక్షేత్రాలను దర్శిస్తారన్నారు. -
ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకోవాలి
జయపురం: ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలు, కళలను కాపాడుకోవాలని వక్తలు అన్నారు. వీటి కోసం ఉద్యమిస్తున్న తరుణ ప్రజ్ఞాభారతి సంస్థ కార్యక్రమాలు కొనియాడ దగ్గవని స్థానిక విక్రమదే వ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర అన్నారు. ఆదివారం రాత్రి జయనగర్ గ్రామంలోని సంఘం కళ్యాణ మండపంలో జరిగిన జయపురం తరుణ ప్రజ్ఞా భారతి 37వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తరుణ ప్రజ్ఞాభారతి అధ్యక్షులు తపన్ కిరన్ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తరుణ ప్రజ్ఞాభారతి వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ గంగాధర నందో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐదు ఆదివారాల్లో జరిగిన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీ ల్లో విజేలకు ముఖ్యఅతిథి డాక్టర్ దేవీప్రసాద్ మిశ్ర తో పాటు గౌరవ అతిథి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చందనకుమార్ నాయిక్, సమాజ సేవక్ ప్రకాశ్ చంద్రనాయిక్, పతాంజలీ యోగాపీఠ రాష్ట్ర సహాయ ప్రహారీ జానకీ పాణిగ్రహిలు బహుమతులు అందజేశారు. ప్రజ్ఞాభారతి కార్యదర్శి అజయ కుమార్ మల్లిక్ సంస్థ నివేదికను సమర్పించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను నిర్వా హకులు దుశ్శాలువలతో సత్కరించి గౌరవించాుర. ప్రఖ్యాత నేత్ర వైద్యులు డాక్టర్ డి.హరికృష్ణ, సంధ్యారాణి దంపతులను డాక్టర్ గంగాధర నందో ఆదర్శ దంపతులు సత్కరించారు. అలాగే వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని కూడా సత్కరించి గౌరవించారు. సభ్యులు సబిత శతపతి, లిపిక దొలాయ్, ఉపాధ్యక్షులు రామశంకర షొడంగి, క్షేత్ర మోహణ నాయిక్, న్యాయ సలహాదారు జి.మహేష్, జగన్నాథ్ పాణిగ్రహి, కృష్ణకేశవ షొడంగి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. -
అదృష్టం వరించేనా..!
● నేడు ఐపీఎల్–19 మినీ అక్షన్ ● జిల్లా నుంచి రేసులో ఎస్డీఎన్వీ ప్రసాద్ త్రిపురాన విజయ్ఎస్డీఎన్వీ ప్రసాద్ శ్రీకాకుళం న్యూకాలనీ: భారత క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకసారైనా ఐపీఎల్కు ఎంపికై తే చాలని సగటు క్రికెటర్ కలగంటాడు. ఐపీఎల్కు ఎంపికై తే వారి దశ, దిశ తిరిగిపోవడం ఖాయం. ఇందుకు భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న పలువురు క్రికెటర్లే నిలువెత్తు సాక్ష్యం. 2026 మార్చి నుంచి మే నెలల్లో జరగనున్న ఐపీఎల్ సీజన్–19కు మినీ వేలం మంగళవారం యూఏఈలోని అబుదాబి వేదికగా షురూ కానుంది. వివిధ ప్రాంచైజీలు వేలంలో క్రీడాకారులను కొనుగోలు చేసే ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో జిల్లాకు చెందిన సింగుపురం దుర్గా నాగవర(ఎస్డీఎన్వీ) ప్రసాద్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్ రేసులో ఉన్న యువ క్రికెటర్ జలుమూరు చెందిన సింగుపురం దుర్గా నాగ వర (ఎస్డీఎన్వీ)ప్రసాద్. గత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు. అనంతరం జరిగిన కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీ, టీ–20 టోర్నీ అనేక టోర్నీల్లో విశేషంగా రాణిస్తూ వచ్చాడు. ఏపీఎల్ సీజన్–4లో అమరావతి రాయల్స్ జట్టుకు రికార్డు స్థాయిలో రూ. 9.50 లక్షలకు అమ్ముడయ్యాడు. తాజాగా బీసీసీఐ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ సీనియర్స్ టీ–20 క్రికెట్ టోర్నీలో కీపర్ కమ్ బ్యాటర్గా సత్తా చాటుతున్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్ షార్ట్ లిస్టులో ఉండడంతో ఎంట్రీ దొరుకుతుందని భావిస్తున్నాడు. జలుమూరు పోలీస్స్టేషన్ వీధిలో నివాసం ఉంటున్న ఎస్డీఎన్వీ ప్రసాద్.. తండ్రి సింగుపురం ఉపేంద్రం కారు డ్రైవర్గా పనిచేస్తు 2019లో అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి రేవతి జలుమూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్–18లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి జాక్పాట్ కొట్డాడు త్రిపురాన విజయ్. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్గా గుర్తింపు పొందాడు. ఈ 23 ఏళ్ల కుర్రాడిని గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ లెవన్లో చోటు దక్కనప్పటికీ.. పలు మ్యాచ్ల్లో సబ్స్టిట్యూట్గా మైదానంలో అలరించాడు. ఐపీఎల్ అనంతరం ఈ ఏడాది అనేక రంజీ మ్యాచ్ల్లో అటు రైటార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్తోపాటు బ్యాటింగ్లోను మెరిశాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఏపీఎల్ 4వ సీజన్లో రాణించాడు. విజయ్ను రూ.7.55 లక్షలకు వైజాగ్ లయన్స్ కొనుగోలు చేసింది. టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి త్రిపురాన వెంకటకృష్ణరాజు సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. ఈ సీజన్లో విజయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి రిటైన్ చేసుకుంది. -
దివ్యాంగులకు ట్రై సైకిల్ పోటీలు
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చోయితీ జిల్లాస్థాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీతోత్సవాలను పురస్కరించుకుని దివ్యాంగులకు ట్రై సైకిల్ పోటీలను ఉత్సవ కమిటీ సోమవారం నిర్వహించింది. స్థానిక అంబేడ్కర్ కూడలి నుంచి పోటీలను ప్రారంభించారు. జిల్లా సామాజిక సురక్షా అధికారి అనిల్కుమార్ పాణిగ్రహి ముఖ్యఅతిథిగా పచ్చజెండా ఊపి పోటీలను ఆరంభించారు. పోటీల్లో మొత్తం 12 మంది పాల్గొనగా నీలకంఠం ప్రథమ, అభిరాం కొరొకొరియా ద్వితీయ, సంజయ్ సేనాపతి తృతీయస్థానంలో నిలిచారు. అలాగే చిరంజీవి పట్రిక, కె.రామారావు, జానకీ సాహులు ప్రోత్సాహక బహుమతులను గెలుచుకున్నారు. జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ విజేతలను అభినందించారు. జిల్లాస్థాయి చొయితీ ఉత్సవ వేదికపై వీరికి బహుమతులు అందజేస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు. -
మజ్జి గౌరి మందిరానికి గుర్తింపు తీసుకువస్తాం
రాయగడ: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరానికి దేశంలోనే మంచి గుర్తింపు వచ్చేలా చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడ అన్నారు. ఆమె సోమవారం రాయగడలో పర్యటించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని, వారికి సదుపాయాలు కల్పించడంతో పాటు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.29 కోట్లు మంజూరు చేసిందన్నారు. టెండర్లు కూడా పిలిచారని త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి ప్రభాతీ పరిడకు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయసింగి బిడిక, ట్రస్ట్ సభ్యులు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, బాబు దళాయి, వడ్దాది శ్రీనివాస్రావు, పెద్దీన వాసు, బాబు దళాయి, దేవేంద్ర నాథ్ బెహర, ఇంజనీర్ వెంకట్ తదితరులు ఆమెను సన్మానించి అమ్మవారి ఫొటోను అందజేశారు. -
గుండెలు మండయ్
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 వేదిక మీద దూషణ పర్వం అందరినీ విస్తుగొలిపింది. ఆదివారం రాత్రి నబరంగ్పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మండయ్ వేదిక మీద 3వ రోజు సాంస్కృతిక ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. వేదిక మీద జిల్లాకు చెందిన ప్రతిపక్ష బీజేడీ డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి ప్రసంగం కొనసాగింది. అకస్మాత్తుగా రంధారి ఆగ్రహవేశాలకు లోనయ్యారు. అదే వేదిక మీద ఉన్న కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ని నేరుగా ఉద్దేశిస్తూ నిలదీశారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని గుర్తు చేశారు. తనను కలెక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో కలెక్టర్ను ఏకవచనంతో సంబోధించారు. జిల్లాలో సుమారు 200 గ్రామాలకు కనెక్టవిటీ లేదని, జిల్లాలో వరి, మొక్కజొన్న రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నారన్నారు. ఈ పరిస్థితి చూసి వేదిక మీద బీజేపికి చెందిన మంత్రులు రబి నాయక్, నిత్యానంద గొండో అవాక్కయ్యారు. బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల ఆగ్రహావేశాలు బీజేడి ఎమ్మెల్యే రంధారి ప్రసంగం పై ప్రజలలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ వేదిక కిందకు దూసుకు వచ్చారు. అప్పటికీ రంధారీ తన విమర్శలు కొనసాగించారు. బీజేపీకి చెందిన కను దాస్, అర్జున్ త్రిపాఠి తదితరులు రంధారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంధారి స్పందిస్తూ తను పులి నని ఇలాంటి నినాదాలకు భయపడనని పదే పదే ఉద్ఘాటించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రంధారిని పులి కాదని పిల్లి అని కేకలు వేశారు. చివరకు ఈ పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వైపులా బూతు పురాణం ప్రారంభమైంది. వేదిక మీద ఉన్న డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఇరు వర్గాలను సుమదాయించేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ వేదిక కింద ఉన్న బీజేపీ కార్యకర్తలకు సముదాయించారు. వేదిక మీద ఉన్న రంధారిని అధికారులతో పాటు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ పరశురాం మజ్జి, ఇతర నాయకులు సముదాయించి బలవంతంగా తీసుకువెళ్లారు. చివరలో రంధారి మాట్లాడుతూ ఇది బీజేపీ మండయ్ కాదని ప్రజల మండయ్ అంటూ నిష్క్రమించారు. ఇదే వేదిక మీద ఉన్న మంత్రి నిత్యానంద గోండో మాట్లాడుతూ ఎవరూ పులి,పిల్లి కాదన్నారు. అభివృద్ధి మార్గంలో ప్రతిభ చూపి పులి అనిపించుకోవాలని హితవు పలికారు. -
జిరంగో వద్ద ఫైవ్స్టార్ హొటల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ జిరంగో వద్ద టిబెటియన్ల బౌద్ధ మందిరం సమీపంలో టూరిస్టుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి ఇండోనేషియా నుంచి ఎండీ ప్రత్యకాష్ ఆర్కిటెక్ట్, ఎస్టేట్స్ సోమవారం పర్యటించారు. ఇక్కడకు వచ్చే టూరిస్టుల కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తెలియజేశారు. ఎండీ ప్రత్యకాష్ సబ్ కలెక్టర్ అనుప్ పండా, మోహన తహసీల్దార్తో టిబెటియన్ శరణార్థుల గెస్టు హౌస్లో బసచేసి అధికారులతో మాట్లాడారు. చంద్రగిరి సమీపంలో ఉన్న జిరంగోలో ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మిస్తే ఈ ప్రాంతం పర్యాటక రంగంలో కొత్త రూపం దాల్చడమే కాకుండా పలువురికి ఉపాధి కలుగుతుందని ప్రత్యకాష్ తెలిపారు. -
ట్రాక్టర్ ఢీకొని 9 జీవాలు మృతి
పర్లాకిమిడి: రాణిపేట రోడ్డులో పవర్ స్టేషన్ వద్ద ఒక ట్రాక్టర్ సోమవారం వేకువ జామున 4.30 గంటలకు విపరీత మంచు కారణంగా రోడ్డుపై మేతకు వెళ్తున్న మేకలపై ఎక్కించడంతో 9 జీవాలు మృతి చెందాయి. పాతపట్నం మండలం గంగువాడ పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన కిర్రాయి ఆనంద్, చిన్ని సోమేష్లు తమ యాదవ కుల సంఘానికి ఈ విషయం తెలియజేయడంతో క్రిష్ణ గొల్ల సంఘం అధ్యక్షుడు ఎ.కులవర్ధన రావు సంఘటనా స్థలంకు విచ్చేసి ట్రాక్టరు యజమాని నుంచి రూ. 50వేలు వసూలు చేసి కిర్రాయి ఆనంద్, సోమేష్లకు నష్టపరిహారం కింద అందజేశారు. ఈ ట్రాక్టరు దుర్ఘటనలో రెండు మేకలు, 7 గొర్రెలు మృతి చెందాయి. -
మహేంద్రగిరి, చంద్రగిరిలో రవాణా శాఖ మంత్రి పర్యటన
పర్లాకిమిడి: రాష్ట్ర రవాణా, ఖనిజ శాఖ మంత్రి బిభూతీ జెన్నా గజపతి జిల్లాలోని మహేంద్రగిరి, చంద్రగిరి టిబెటియన్ శరణార్ధుల బౌద్ధ మందిరాన్ని సోమవారం దర్శించుకున్నారు. ఆయన వెంట పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, గంజాం జిల్లా రాజకీయ ప్రతినిధులు ఉన్నారు. తొలుత మంత్రి బిభూతీ జెన్నా మహేంద్రంలో కుంతీ మందిరం వద్ద రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి జిరంగో వద్ద వున్న టిబెటియన్ల బౌద్ధ మందిరాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి బిభూతి జెన్నాను బౌద్ధ మెనాస్ట్రీ గురుజీ ఖెంపో సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా, గంజాం జిల్లా బీజేపీ ప్రతినిధులకు కండువా, కొమ్ముతో చేసిన జ్ఞాపికలను అందజేశారు. -
రగ్గుల పంపిణీ
జయపురం: ఒడిశా బలిజి సంఘం జయపురం వారు సోమవారం 40 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా మాట్లాడుతూ జయపురంలో బలిజిల ఆర్థిక, సామాజిక వికాసమే లక్ష్యంగా సంఘం పని చేస్తుందన్నారు. త్వరలోనే బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు రగ్గుల వితరణకు జిసాగడం రంగనాథ్ ట్రస్టు వారు సహకరించినట్లు తెలిపారు. రగ్గుల వితరణ అనంతరం సంఘ నేతల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నాతో పాటు ఉపాధ్యక్షులు బల్లిడి ఛత్రపతి శివాజీ, పుప్పాల లక్ష్మీ, కార్యదర్శి బరిగెడ శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శులు మహాదాశ్యం నారాయణ రావు, పల్లా తవిటమ్మ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్ గులుబ పంచాయతీ కార్యాలయంలో సోమవా రం గ్రామముఖిపరిపాలన, గ్రీవెన్స్కు స్పంద న లభించింది. ఈ జాయింట్ గ్రీవెన్స్కు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ, జిల్లా పరిష త్ అదనపు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, బీడీఓ రాజీవ్ దాస్, తదితరులు హాజరయ్యారు. గులుబ పంచాయతీ తో సహా డెంగాస్కల్, బిరికోట్, మండిమర, గ్రామ పంచాయతీల నుంచి 146 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 44, గ్రామ సమ స్యలకు సంబంధించినవి 102 ఉన్నాయి. నాలుగు వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. ముఖ్యంగా పీఎం ఆవాస్ యోజనా, సామాజిక పింఛన్లు, ఉపాధి పథకంపై అనేక వినతులు అందినట్టు అధికారులు తెలియజేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపు సభ్యులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. పర్లాకిమిడి: ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచడానికి స్థానిక సరస్వతీ శిశువిద్యామందిర్లో గణితంలో పోటీలను నిర్వహించారు. పోటీలు రామశంకర్ గంతాయత్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గణితమంటే భయం వీడాలన్నారు. 17 విద్యాలయాల నుంచి 147 విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రదానం చేస్తామని ప్రధాన అచార్యులు సరోజ్ పండా తెలియజేశారు. రామానుజం మాథమెటిక్స్ క్లబ్ సభ్యులు రమాకాంత పట్నాయక్, మనోజ్కుమార్ పండా, హరినాథ పాత్రో, తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
పద్మపూర్లో ఘనంగా చొయితీ ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్లో సమితి స్థాయి చొయితీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. గుణుపూర్ ఎంఎల్ఏ సత్యజీత్ గొమాంగో ముఖ్యఅతిథిగా ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు బీడీవో కురేష్ చంద్ర జాని, సమితి అధ్యక్షురాలు మణిమాల సబర్లు సమీపంలోని ఖమాపదర్ నది జలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవ వేదిక వద్ద ఉంచారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఎల్ఏ గొమాంగో మాట్లాడుతూ.. మన ప్రాంత ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించేందుకు ఇలాంటి ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని అన్నారు . దీనితోపాటు ఈ ప్రాంత కళాకారులను ప్రొత్సాహించేందుకు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు వారికి చేదోడుగా నిలుస్తాయన్నారు. వారికి కళారంగంపై మరింత ఆసక్తి పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి మాట్లాడుతూ.. చొయితీ ఉత్సవాలు ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. వారిలో దాగిఉన్న ప్రతిభను కనబరిచేందుకు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పత్రికారంగంలొ విశేష సేవలు అందిస్తున్న కొంతమంది పాత్రికేయులు, సమాజ సేవకులను వేదికపై సత్కరించి గౌరవించారు.


