Orissa
-
సమాజ సేవే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యం
జయపురం: సమాజ సేవే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని రోటరీ డిస్ట్రిక్ట్ 3262 గవర్నర్ రొటేరియన్ మనోజ్ కుమార్ త్రిపాఠీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక సిగ్నేచర్ సభా వేదికలో జరిగిని జయపురం రోటరీ క్లబ్ ప్రైడ్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. జయపురం రోటరీ క్లబ్ ప్రైడ్ అధ్యక్షుడు రబినారాయణ నందో అధ్యక్షతన జరిగిన సమావేశంలో త్రిపాఠీ ప్రసంగించారు. ప్రతీ రొటేరియన్ సమాజంతో ప్రజల జీవనప్రమాణాల మెరుగుకు, ప్రజలకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. జయపురం రోటరీ క్లబ్ కార్యదర్శి గతేడాది నిర్వహించిన వివిధ ప్రజా సేవా కార్యక్రమాలను వివరించారు. వివిధ రంగాల్లో సమాజానికి ప్రశంసనీయ సేవలు అందించిన 11 మందిని సన్మానించారు. సంజయ కుమార్ గొలాబ్, శంకర దళపతి, రామకృష్ణ భోల్, రామానుజ బెహరా, అభయ చంద్ర పండా, కృష్ణ కేశవ షొడంగి, ప్రేమలత మహారాణ, సుధీర్ భాగ్, రబి మఝి, విక్రమదేవ్ విశ్వవిద్యాలయ పురుష, మహిళ ఎన్సీసీ కేడర్ విద్యార్థులను సన్మానించారు. 25 ఏళ్లుగా రోటరీ క్లబ్ సభ్యులుగా ఉంటూ సమాజానికి సేవలు అందిస్తున్న 20 మంది సభ్యులను డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ మనోజ్ కుమార్ త్రిపాఠీ రోటరీ బ్యాడ్జ్లతో సత్కరించారు. రోటరీ సభ్యులు నారాయణ నిశంకొ, మధుశ్మిత త్రిపాఠీ, వెంకట రాబు, శివాజీ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు
● ప్రశాంతంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల ఎన్నికలు ● క్యూ కట్టిన ఓటర్లుజయపురం: జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల ఎన్నికల్లో ఆదివారం ఓటర్లు క్యూ కట్టారు. 21 మంది చాంబర్ డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఓటర్లను గుర్తించి ఓటు వేసేందుకు అనుమతించారు. ప్రజాస్వామ్య బద్ధంగా సీక్రెట్ బెలట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలకు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎన్.ఆనందరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికలను ఆనందరావు స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక నెహ్రూనగర్లో గల చాంబర్ కార్యాలయం ‘వేదిక’లో నిర్వహించిన ఎన్నికల్లో కార్యాలయం బయట అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. 21 మంది డైరెక్టర్ల పదవులకు 36 మంది పోటీ చేశారు. 843 మంది ఓటర్లు ఉంటే 760 మంది ఓటు హక్కును వినియోగించారు. -
కిరండోల్ రైల్వే మార్గంలో బాలుడి మృతదేహం
కొరాపుట్: కిరండోల్ రైల్వే మార్గంలో బాలుడి మృతదేహం వివాదం రేపింది. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి మీదుగా వెళ్లే విశాఖ పట్నం–కిరండోల్ రైల్వే మార్గంలో మాలి బెల్గావ్ గ్రామ పంచాయతీ ఖజేల్ గ్రామ సమీపంలో సంసాగర్ గ్రామానికి చెందిన రామ్ రంగుడ కుమారుడు సుభం రంగుడ (17) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఒక చేయి,కాలు తెగి పడి ఉన్నాయి. హఫ్ ప్యాంట్లో మృతదేహం ఉంది. ఇతడు శుభం పాడువాలో రాధాకృష్ణ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఇంటర్ చదువుతున్నాడని కుటుంబీకులు పేర్కొన్నారు. తన మేనమామ ఇంటికి ఉత్సవాలు సందర్భంగా వచ్చి మృతదేహమై కనిపించాడని తెలిపారు. కొరాపుట్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ దీపక్ మజ్జి ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నందపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ సాగరిక ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పశ్చిమాసియాలో గత కొద్దిరోజుల నుంచి అమెరికా, ఇజ్రాయిల్లు ఇరాన్పై ఉమ్మడిగా చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని పౌర హక్కుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ప్రపంచ శాంతిని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్రి దానేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నంశెట్టి రాజశేఖర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్ కుమార్, సీపీఐ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల రామారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ అమ్మన్నాయుడు, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావులు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు ప్రమాదకరమైనటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. యుద్ధం వల్ల అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ యుద్ధాలను సృష్టించి తన ఆయుధ సంపదను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న అమెరికా కుటీల బుద్ధిని, వ్యాపార విధానాన్ని వ్యతిరేకించారు. చర్చలు ద్వారా రెండు దేశాలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులు నాగమణి, భానుమతి, నాయకులు గీతారాణి, జోగారావు, దానయ్య, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒడియా పక్షోత్సవాలు
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఉత్సాహంగా..● మహాపురుషులకు వందనాలు కార్యక్రమానికి ప్రముఖులు హాజరులయంలో సంస్కృతం, ఒడియా భాషల్లో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తిచేశారన్నారు. ఆయన పురుషోత్తమ శ్రీజగన్నాథ గ్రంధాన్ని రాశారని అన్నారు. తదుపరి పర్లాకిమిడి మహారాజా శ్రీక్రిష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ ఉత్కళ రాష్ట్ర సాధనకు చేసిన కృషిని మాజీ ఒడియా సాహిత్య అకాడమి సభ్యులు బిచిత్రా నంద బెబర్తా వివరించారు. అలాగే జయపురం మహారాజా విక్రందేవ్ వర్మ, పండిత మధుసూదన్ దాస్, గంగాధర్ మెహార్, చికిటి మహారాజు, గోపబంధుదాస్, మహాపురుషులు స్వతంత్ర ఒడిశా కోసం చేసిన పోరాటాన్ని ప్రస్తావించారు. అనేక మంది ఉపాధ్యాయులు, రచయితలు మాట్లాడారు. వారికి ముఖ్యఅతిథి డీసీవో అర్చనా మంగరాజ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. శుభ్రాంశు పట్నాయక్ సభకు ముఖ్యవక్తగా వ్యవహారించారు.పర్లాకిమిడి: ఒడిశా దివస్ పక్షోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో ‘వందనాలు మహాపురుషులు’కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా. అనేక మంది కవులు, రచయితలు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, రాష్ట్రపతి ఆవార్డు గ్రహీత బినోద్ జెన్నా, బిచిత్రానంద బెబర్తా, పర్యాటక శాఖ మాజీ అధికారి రామచంద్ర హాజరయ్యారు. తొలుత ఒడిశా ప్రత్యేక రాష్ట్రానికి పునాది వేసిన డాక్టర్ సత్యన్నారాయణ రాజగురు చరిత్ర గురించి బినోద్ జెన్నా వివరించారు. శతాబ్ది పురుషుడైన పద్మశ్రీ సత్యన్నారాయణ రాజగురు తండ్రిగారు హారికృష్ణరాజగురు పర్లాకిమిడి మహారాజా క్రిష్ణచంద్రగజపతి నారాయణదేవ్కు గురువుగా విద్యాబుద్ధులు చెప్పేవారని అన్నారు. 1903 ఆగస్టు 19న జన్మించిన సత్యన్నారాయణ రాజగురు 1997లో కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్నారని గుర్తు చేశారు. ఆయనకు తెలుగుతో పాటు ఏడు భాషలపై పట్టుసాధించారన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాబిషుభ సంక్రాంతికి ముహూర్తపు రాట -
సెక్యూరిటీ గార్డుకి తుపాకీతో బెదిరింపు
● యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు ● తుపాకీ స్వాధీనంరాయగడ: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఓ యువకుడు తుపాకీ గురిపెట్టి బెదిరించిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత సెక్యూరిటీ గార్డు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సదరు పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి జిల్లాలోని కాసీపూర్ సమితి మండిబిసి ప్రాంతానికి చెందిన గొవర్ధన్ నాయక్ కొడుకు ప్రభాత్ నాయక్గా గుర్తించారు. నిందితుడిని ఆదివారం కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా నాగ్ కై లాస్, రాజు జకకలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది వచ్చి తమ బంధువులు పైఅంతస్తులో ఉన్నారని.. వారిని చూడాలని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. అయితే నిబంధనల ప్రకారం ఒక్కరే లోపలకు వెళ్లే అవకాశం ఉందని.. మిగతా వారిని లోపలకు ప్రవేశించేందుకు అనుమతించనని అభ్యంతరం తెలిపాడు. దీంతో కొపోద్రేక్తుడైన ప్రభాత్ నాయక్ తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసి లోనికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపొతే కాల్చివేస్తానని బెదిరించి దౌర్జన్యంగా లోనికి వెళ్లాడు. ఈ విషయమై సెక్యూరిటీ గార్డు నాగ్ కై లాస్ సదరు పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రిలని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు ప్రభాత్ నాయక్ను అరెస్టు చేసి అని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గించాం
గ్యాస్ కొరతతో అన్నదాన ప్రసాదాలను గతంలో లాగా అన్లిమిటెడ్ విధానంలో కాకుండా లిమిటెడ్ విధానంలో టోకెన్ల సంఖ్యలో అందజేస్తున్నాం. అలాగే దర్శనాలకు వచ్చిన భక్తులకు అత్యంత ప్రాధాన్యతగా ఈ ప్రసాదాలను అందించాలని ఆదేశించాం. గ్యాస్ బండలు డెలివరీ తక్కువగా వస్తున్న నేపథ్యంలో రోజుకు సగటున 500 మంది భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందించేలా చర్యలు చేపట్టాం. గ్యాస్ కొరత సమస్య ఇంకా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎన్జీ విధానాన్ని అమలు చేసేలా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – కేఎన్వీడీవీ ప్రసాద్, అరసవల్లి ఆలయ ఈవో ● -
విక్రమదేవ్ వర్సిటీ కులపతిగా హృషికేష్ శనాపతి
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతిగా ప్రొఫెసర్ డాక్టర్ హృషికేష్ శనాపతి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్రా నూతన కులపతికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన కులపతి డాక్టర్ హృషికేష్ శనాపతి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ సర్వాంగ ఉన్నతికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటం తన ప్రధాన లక్ష్యమన్నారు. కొత్త కులపతికి విశ్వ విద్యాలయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు కులపతి దేవీ ప్రసాద్ మిశ్రతో పాటు రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రంజన్ కుమార్ ప్రధాన్, పీజీ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్ కుమార్ పాత్రో, విక్రమదేవ్ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, అధ్యాపకులు, ఉద్యోగులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్రాకు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు సభకు రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగింది. వీడ్కోలు సభలో వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. -
సరా గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన
పర్లాకిమిడి: సుప్రీంకోర్టు ఇటీవల నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాశీనగర్ బ్లాక్ వంశధార పరివాహక ప్రాంతం సరా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం కాశీనగర్ బ్లాక్ ముంపు గ్రామాలైన సరా, బడిగాంలు సందర్శించి అక్కడ వంశధార సురక్షామంచ్ సభ్యులతో భేటీ అయ్యారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాట్రగడ వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడితే ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ ప్రాంతంలో ఏడు గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తదుపరి రైతులకు నష్టపరిహారం, ఒడిశా ప్రభుత్వం దీనికి ప్రత్నామ్యాయంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, అలాగే గజపతి జిల్లా కాశీనగర్ రైతుల ప్రయోజనం కోసం, దీనిపై ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అసెంబ్లీలో ఒడిషా డబుల్ ఇంజిన్ సర్కారుపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తానని ఆయన విలేకరులకు తెలియజేశారు. -
ఉత్సాహంగా సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవం
మల్కనగిరి: పట్టణంలోని శ్రీరామనగర్లోఉన్న సరస్వతి శిశుమందిర్ వార్షికోత్సవాన్ని ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షుడు రవీంద్ర కుమార్ మహారాణ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారీ తాంగులు ముఖ్యఅతిథిగా, జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రహి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు నీలమణి ప్రధాన్ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఘడాయి కాలేజీ నిర్వహణ డైరెక్టర్ డాక్టర్ సురేష్ చంద్ర ఘడాయి, విద్యుత్ శాఖ కార్యనిర్వాహక అధికారి ఆశీస్ కుమార్ జెన, విద్యా వికాస సమితి దక్షిణ విభాగ పరిశీలకుడు సుకాంత్ కుమార్ బెహర గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో అతథులను సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం భారత మాతకు దీప ప్రజ్వలన చేసి వందన కార్యక్రమంతో సభను ప్రారంభించారు. పదో తరగతి విద్యార్థినులు ప్రారంభ గీతాన్ని ఆలపించారు. పాఠశాల ప్రధానాచార్యులు సరోజ్ కుమార్ సామల్ అతిథులను పరిచయం చేసి స్వాగత ప్రసంగం చేశారు. నిర్వాహణ కమిటీ కార్యదర్శి రమేష్ చంద్రరావత్ పాఠశాల వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉత్తమంగా స్థిరపడాలంటే చిన్నప్పటి నుండే క్రమశిక్షణ, సద్గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. క్రీడలు, విద్య, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యఅతిథి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పాఠశాల శ్రేయోభిలాషులు బనమాలి పాత్రొ, విప్రమండల్ను సత్కరించారు. శ్రీశయన కులస్తులకు ఎమ్మెల్సీ ఇవ్వాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీశయన కులస్తులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నూతన కార్యవర్గ నాయకులు కోరారు. నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీశయన సంఘ, జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కోల బలరాం, ప్రధాన కార్యదర్శిగా గురు జగదీష్, కోశాధికారిగా బమ్మిడి రమణ, సంఘ జిల్లా అధ్యక్షుడిగా కై బాడి రాజు, ప్రధాన కార్యదర్శిగా దండాసి జ్యోతి భాస్కర్, కోశాధికారిగా బంటుపల్లి కోటేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు డీపీ దేవ్, కేంద్ర సంఘ అధ్యక్షుడు వంగా మహేష్దేవ్, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కోల బలరాం తదితరులు మాట్లాడుతూ.. జిల్లాలోని కల్లుగీత కార్మికులకు తాటిచెట్లు పెంచుకోవడానికి అసైన్డ్ ల్యాండ్ ఇవ్వాలని కోరారు. శ్రీశయన కులస్తులను ఎంబీసీ మోస్ట్ బ్యాక్వార్డ్ క్లాస్ జాబితాలో చేర్చాలని, ప్రతి జిల్లాలో ఒక సామాజిక భవనం నిర్మాణానికి స్థలాలు మంజూరు చేయాలన్నారు. శ్రీశయన కార్పొరేషన్ సభ్యుల నియామకం ప్రభుత్వం వెంటనే జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ పూర్వపు అధ్యక్షులు మెండలాల్ బహదూర్ శాస్త్రి, మండల మన్మథరావు, గుజ్జల శాంతిశ్వరరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాణాల కృష్ణారావు, విశాఖపట్నం అధ్యక్షుడు పెంట వెంకట్రావు, తోట వాసుదేవరావు, కేంద్ర శ్రీశయన సంఘ గౌరవ అధ్యక్షుడు దేవాడ మోహనరావు, కార్యదర్శి బైరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి బూర్జ: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన చుక్కర తౌవుడు(70) గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చుక్కర తౌవుడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని, రెండు ఎకరాల్లో వరిపంట, మరో రెండు ఎకరాల్లో అరటి పంటలు వేశాడు. ఇటీవల వడగండ్లతో ఆకాల వర్షం పడడంతో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. వరిపంటకు కూడా తీవ్రనష్టం జరిగింది. దీంతో అప్పులు పాలయ్యానని మనస్థాపం చెందాడు. ఈనెల 10వ తేదీన ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదికారు. సాగు చేసిన పొలం వద్దకు వెళ్లి చూడగా అతడు గడ్డిమందు తాగినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య చుక్కర లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.ప్రవల్లిక తెలిపారు. -
సేంద్రియ ఉత్పత్తుల సంత
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక 80 ఫీట్ రోడ్లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ఆదివారం నిర్వహించారు. సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులను ఒక వేదికపైకి తీసుకొచ్చి, పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా ప్రజలకు అందించడంతో రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుతున్నాయని నిర్వాహకులు అన్నారు. ఈ సంత ప్రతినెలా రెండో ఆదివారం, నాలుగో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. సంతలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారని, అలాగే వివిధ రకాల విత్తనాలు, పండ్లు, మొక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు. -
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 57 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. యూనివర్సిటీ ఎన్.సి.సి (నేషనల్ క్రెడెట్ క్రాఫ్) క్యాడెట్లు, ఎన్.ఎస్.ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) యూనిట్, వైఆర్సీ(యూత్ రెడ్ క్రాస్) విద్యార్థులు సంయుక్తంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సీపీజీసీ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన అవసరాన్ని వివరించారు. సమాజంలో ఏ ఒక్కరూ రక్త లేమి వలన మరణించ కూడదన్నారు. జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్ రక్త భండార్ టెక్నీషియన్లు దాతల నుంచి రక్తం సేకరించారు. కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, లెఫ్ట్నెంట్ సంతోషి, వైఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ రుసవ కుమార్ సాహు, తదితరులు పాల్గొన్నారు. -
వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం
రాయగడ: స్థానిక ఫ్రెండ్స్ ఎంజీఎఫ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టులో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ట్రస్టులో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద ఆదివాసీ విద్యార్థినులకు దంత వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ రాజేష్కుమార్ పాత్రో, డాక్టర్ భోగి సంతోష్కుమార్, డాక్టర్ భోగి స్వరూపలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు టూత్ బ్రష్లు, టూత్ ఫేస్టులు, టంగ్ క్లీనర్లను క్లబ్ సభ్యులు పంపిణీ చేశారు. దంతాల రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షులు మోనింగి శ్రీహరి, సాధారణ కార్యదర్శి కింతలి శ్రీధర్, కోశాధికారి లాడి నూకరాజు, సభ్యు లు ఇప్పిలి సన్యాసిరాజులు ట్రస్టు నిర్వహకులకు ధన్యవాదాలు తెలియజేసారు. వైద్య శిబిరాలను తరచూ నిర్వహిస్తామని క్లబ్ సభ్యులు తెలిపారు. -
విజిలెన్స్ వలలో గుడారి ఫారెస్ట్ రేంజర్
రాయగడ: జిల్లాలోని గుడారి అటవీ శాఖ పరిధిలో రేంజర్గా విధులు నిర్వహిస్తున్న సుకుమార్ దుఖును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.2.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫారెస్ట్ రేంజర్గా గుడారిలో విధులు నిర్వహిస్తున్న సుకుమార్ ఆదివారం ఒక బొలేరొలొ గుడారి నుంచి నవరంగపూర్లొ గల సేనాపతి వీధికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు నవరంగపూర్ జిల్లా పరిధిలోని ఇంద్రావతి బ్రిడ్జిపై అతడిని పట్టుకున్నారు. అనంతరం బొలేరొలో తనిఖీ చేయగా అందులో రూ.2.33 లక్షలు దొరికాయి. ఈ నగదుకు సంబంధించి సరైన సమాధానం చెప్పలేకపోవడంతో రేంజర్ సుకుమార్ ప్రయాణించే బొలేరొతొ సహా అతడిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. పారాదీప్లో చేపల మృతి భువనేశ్వర్: పారాదీప్లోని కపిలఝొరొ వాగులో చేపలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చేపలు చనిపోయి నీటిపై గుట్టలు గుట్టలుగా తేలుతున్నాయి. దీనికి కారణం అస్పష్టంగా ఉంది. పారిశ్రామిక రసాయనాలు వాగులోకి చేరడం వల్లే చేపలు చనిపోతున్నాయని భావిస్తున్నారు. మల్కన్గిరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజ్వంత్కౌర్ మృతి మల్కన్గిరి: మల్కన్గిరి మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ రాజ్వంత్ కౌర్ ఆదివారం వేకువజామున 4.10 గంటలకు తన నివాసంలో కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు దుర్గాగుడి సాహి ప్రాంతంలోని నివాసంలో ఉంచారు. వసతి గృహంలో ఒడియా దివస్ వేడుకలుమల్కనగిరి: ఒడియా పక్షోత్సవ వేడుకలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతిని ప్రొత్సాహించేందుకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖ అఽధికారి చిత్తరంజన్ పాణిగ్రహి, విద్యాశాఖ తరఫున బూటిగుడలోని నేతాజీ సుభాష్బోస్ వసతి గృహంలో ఒడియా దివస్ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఒడియా పుస్తకాలు, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా విద్యా అధికారి మంలతా భొయి, భాగీరధి బెహర హాజరై విద్యార్థులతో కొంతసేపు గడిపి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు కూడా ఒడియా పుస్తకాలు పంపిణీ చేశారు. బుడాగుటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్ణ చంద్ర ఖండపాణి, సమగ్ర విక్షా యోజన సమన్వయకర్త విజయలక్ష్మీ చౌదరి పాల్గొన్నారు. -
● కన్నతల్లే కడతేర్చింది
రాయగడ: నవ మాసాలు మోసి, కని పెంచిన కన్న తల్లే తన పిల్లలను కడ తేర్చింది. అత్యంత కర్కశంగా తన పిల్లలను పదునైన మరణాయుధంతో హతమార్చింది. ఝార్సుగుడ జిల్లా ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తంగరపల్లి ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఝార్సుగుడ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఝార్సుగుడ ఆస్పత్రికి తరలించారు. ఝార్సుగుడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర ఈ సందర్భంగా హస్పటల్కు వెళ్లి దర్యాప్తు చేశారు. డీఎస్పీ బనిత మాఝి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఆదివారం నాడు జిల్లాలోని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తంగరపల్లి ప్రాంతంలో నివసిస్తున్న రంజితా ఓరం అనే మహిళ తన పదేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురుని అత్యంత దారుణంగా ఒక పదునైన మరణాయుధంతో హతమార్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తన భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె ఈ దారుణానికి ఆమె ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదేవిధంగా నిందితురాలి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు సమాచారం. -
అందని ప్రసాదం..!
గ్యాస్ ప్రభావం..● అరసవల్లిలో ప్రసాదాలకు గ్యాస్ కష్టాలు ● టోకెన్లతో అన్నప్రసాదాలు అందిస్తున్న వైనం ● సగం మందికే అందుతున్న ప్రసాదాలు ● ఇబ్బందులు పడుతున్న భక్తులు అరసవల్లి: ఎక్కడో అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో నిత్యాన్న ప్రసాదంపై ప్రభావం చూపించింది. ఇప్పటికే గత నెల రోజులుగా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ దొరక్క చాలా ప్రాంతాల్లో ఇటు వినియోగదారులు.. అటు ఫుడ్ మార్కెట్ వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ఇంతవరకు లేని సమస్య.. ఇప్పుడిప్పుడే అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి తాకుతోంది. వంట గ్యాస్పై ఆధారపడుతూ రోజూ వందలాది మందికి అన్నప్రసాదాలను అందిస్తున్న ఆలయ వర్గాలకు ఈ గ్యాస్పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఇక్కడి అన్నప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీపై కూడా పెద్ద ప్రభావమే చూపుతోంది. అయితే ఫిక్స్డ్గా నంబర్ టోకెన్ల ద్వారా అన్నదాన ప్రసాదాలను అందజేస్తే గ్యాస్ కష్టాల నుంచి కొంతమేరకు గట్టెక్కవచ్చుననే భావనతో ఆలయ అధికారులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రసాదాలను కూడా ఒక పూట మాత్రమే విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి తాత్కాలిక విధానాలే అని.. గ్యాస్ కష్టాలు తీరిపోతే మళ్లీ అంతా యథావిధిగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇదే నిర్థిష్ట టోకెన్ల విధానమే కొనసాగిస్తారనేలా భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇండెంట్ ఇస్తున్నా.. అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో గ్యాస్ వినియోగం అధికంగానే ఉంటుంది. నిత్యం పులిహోర, లడ్డూ తయారీతో పాటు.. ప్రధానంగా నిత్యాన్నదాన ప్రసాదాల తయారీ కోసం రోజుకు కనీసంగా 10 నుంచి 12 సిలిండర్ల వినియోగం తప్పనిసరి. సరాసరి నెలకు రూ.250 నుంచి 300 వరకు సిలిండర్లు వినియోగమవుతుంటాయి. అయితే ప్రత్యేక అనుమతుల ద్వారా ఆలయంలో భక్తుల అవసరాల నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఇక్కడ డొమస్టిక్ సిలిండర్లు (ఇంటికి వినియోగిస్తున్నవి) మాత్రమే వినియోగిస్తున్నారు. నిత్యం ఇక్కడ 800 నుంచి 1,000 మంది వరకు అన్నదాన ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. అయితే ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా నెలకు 300 వరకు సిలిండర్లు అవసరమంటూ ఇండెంట్ పెట్టినప్పటికీ, సగం మాత్రమే డెలివరీ అవుతున్నాయి. దీంతో ఈ ప్రభావం ఇటు భక్తులకు విక్రయించే ప్రసాదాలపైన, అటు అన్న ప్రసాదాల వంటల తయారీపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రోజుకు 500 మందికే భోజనాలు అరసవల్లి ఆలయంలో ప్రసాదాలుగా లడ్డూ, పులిహోరతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాదాలు స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాధాన్యమిస్తుంటారు. అయితే గ్యాస్ కొరత కారణంగా ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదాలను లెక్కమీద అందించాలని నిర్ణయించారు. ఆలయంలో దర్శనాలు ముగించుకుని వస్తున్న భక్తులకు ప్రత్యేకంగా ఉచిత అన్నప్రసాదాల టోకెన్లు పేరిట పరిమితంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో గత కొద్ది రోజులుగా సగం మందికే అన్నప్రసాదాలు అందుతున్నాయి. మొన్నటి వరకు రోజుకు వెయ్యిమంది ప్రసాదాలను స్వీకరిస్తే.. నేడు కేవలం 500 మందికే పరిమితం చేశారు. ఆదివారాల్లో అయితే 3 వేల మంది వరకు గతంలో ప్రసాదాలకు వచ్చేవారు. ఇప్పుడు అంతా లెక్క మీద టోకెన్ల పేరుతో 1,200 మంది నుంచి 1,500 మంది వరకు భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అదనంగా భోజనాలు పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వందలాది మంది భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా ఆదివారం అయితే చాలా మందికి భోజనాలు అందని పరిస్థితి కనిపించింది. ఇదేం పద్ధతి..? ఇటీవల ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి పనులు కాంట్రాక్టు క్రింద సుమారు 70 మంది వరకు కూలీలు రోజూ ఆలయం వద్ద పనులు చేస్తున్నారు. వీరు కూడా రోజూ ఈ నిత్యాన్నదాన పథకంలో ఉచితంగా భోజనం చేస్తున్నారు. వాస్తవానికి వీరికి సంబంధిత కాంట్రాక్టర్ బిల్లుల రూపంలో భోజనాలు పెట్టించాల్సి ఉంది. అయినప్పటికీ సదరు సబ్ కాంట్రాక్టర్ మాత్రం కూలీలకు ఎంచక్కా ఆలయంలోనే భోజనాలు పెట్టించేస్తున్నాడు. దీంతో దర్శనాలకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం దొరక్క వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల భక్తులకు అన్నప్రసాదాలు అందడం లేదు.. తక్కువ మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్న దృశ్యం -
సారా మహమ్మారిపై పోరుబాట
● కారుబాయి గ్రామస్తుల ఉద్యమం ● మద్యనిషేధమే ధ్యేయమంటున్న ప్రజలురాయగడ: సదరు సమితి కారుబాయి గ్రామంలో మద్యవ్యతిరేక ఆందోళనకు గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామ శివారులో నాటుసారా తయారీ, విక్రయాలు ఊపందుకోవడంతో యువత మత్తుకు బానిసై వారి భవిష్యత్ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దీంతో తమ కుటుంబాలు గమ్యం లేని జీవితాలుగా మిగిలిపోతున్నాయని భావించిన గ్రామస్తులు అంతా ఏకమై గ్రామంలో సారా, మద్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీంతో పక్కనే ఉన్న పనొగుడ గ్రామస్తులు కూడా అందుకు సై అంటూ ఆందోళనకు ఊపిరి పొసింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన పురుషులు, మహిళలు గ్రామ శివారల్లో ఉన్న నదీ తీర ప్రాంతాల్లో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారా కేంద్రాలపై ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. సారా తయారీ కేంద్రాల్లో ఉన్న సామగ్రీలను, పొదల్లో దాచిఉంచిన ఊటను బయటకు తీసి మహిళలు ధ్వంసం చేశారు. గ్రామస్తులకు అండగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు మద్దతు ఇస్తున్నారు. వారంతా గ్రామాల్లో తిరిగి మధ్య నిషేధం గురించి అవగాహన కల్పిస్తున్నారు. తమ ప్రాంతంలో సంపూర్ణ మద్య నిషేధమే ధ్యేయంగా తాము చేపట్టిన ఈ ఆందోళన విజయవంతమయ్యేంత నిద్రపోమని శపథం చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ, విదేశీ మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. ఎవరైన మద్యం విక్రయాలు, తయారీకి ఒడిగడితే తాము ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. ఏదిఏమైనప్పటికీ వీరి ఆందోళనకు అంతా మద్దతు పలకడంతో ఆయా గ్రామాల్లో సంపూర్ణ మద్యనిషేధానికి బీజం పడిందని భావిస్తున్నారు. ఆందోళనకు కారుబాయి పంచాయతీ సర్పంచ్ మరియా శిరిక నాయకత్వం వహించారు. -
జెండా ఎత్తేసిన వ్యాపారి
● రూ. కోటికి పైగా నగదుతో ఉడాయించిన వైనం ● లబోదిబోమంటున్న బాధితులు సంతబొమ్మాళి: ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న ఓ వ్యాపారి నగదు, బంగారం పట్టుకుని ఉడాయించిన ఘటన మండలంలోని బోరుభధ్రలో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని బోరుభద్రలో పోలాకి మండలం పిన్నింటిపేటకు చెందిన పొట్నూరు కృష్ణారావు 30 ఏళ్లుగా వెంకట భగవాన్ పేరుతో మెడికల్ షాపు నడుపుతున్నారు. మెడికల్ షాపులో మందులు అమ్ముతూ చాలా కాలం నుంచి వడ్డీకి డబ్బులు అప్పులు ఇస్తున్నారు. బంగారు వస్తువులు తనఖాగా ఉంచుకుని డబ్బులు అప్పుగా ఇస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా తన మరదలి కుమారుడైన పొట్నూరి నానిని బోరుభద్ర తీసుకువచ్చి మెడికల్ షాపు వ్యాపారం అప్పగించాడు. కృష్ణారావు మకాం నరసన్నపేటకు మార్చి అక్కడ వేరే వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడూ బోరుభద్ర వచ్చి షాపు లెక్కలు చూసి వెళ్లిపోయేవాడు. అయితే అప్పటి నుంచి బంగారం వస్తువుల తనఖా వ్యాపారాన్ని నాని చూసుకుంటూ అందరితో నమ్మకంగా మెలిగేవాడు. అయితే గత కొద్ది రోజులుగా బంగారం వస్తువులు తనఖా పెట్టిన వారు డబ్బులు తీసుకువచ్చి తమ వస్తువులు ఇవ్వమని అడగ్గా వేరే వారి వద్ద ఉన్నాయని నాని తిప్పుతున్నాడు. మరికొంతమంది వద్ద డబ్బులు తీసుకొని నెలలు కా వస్తున్నా బంగారం తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో బాధితులు గట్టిగా నిలదీశారు. దీంతో గురువారం మెడికల్ షాపునకు తాళాలు వేసి నాని పరారైపోయాయడని స్థానికులు చెబుతున్నారు. నాని ఈ ప్రాంతంలో రూ. 30లక్షలు వరకు అప్పులు చేశాడని, మరి కొందరి వద్ద నెలకు నూటి కి రూ. 10లు వరకు వడ్డీకి అప్పులు వాడాడని సమాచారం. డబ్బులతో పాటు తనఖా పెట్టిన 50తులాల బంగారం వస్తువులను తీసుకుని మెడికల్ షాపు మూసి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మోసపోయిన వారిలో బోరుభద్ర, గొదలాం, మలగాం, పాలతలగాం, శిమ్మయ్యపేట, కొల్లిపాడు, గెద్దలపాడు, పిట్టవానిపేట, పాత మేఘవరం బాధితులు ఉన్నారు. పిట్టవానిపేట గ్రామానికి చెందిన పిట్ట చిన్నమ్మ రెండున్నర తులాలు, మలగాంకు చెందిన లండ వరలక్ష్మి అరతులం, చిన్నమ్మి ఐదుతులాల బంగారాన్ని తాకట్టు పెట్టామని డబ్బులు ఇస్తామన్నా నెలలు తరబడి ఇవ్వకపోవడంతో పాటు పరారు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంతబొ మ్మాళి ఎస్ఐ వై. సింహాచలంకు అడుగగా ఎవరూ లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
నందిగాం: టెక్కలి పోలీస్స్టేషన్లో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామానికి కూతవేటు దూరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాంకు చెందిన కానిస్టేబుల్ చీమల గోపాలకృష్ణ(40) మృతి చెందారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కానిస్టేబుల్ గోపాలకృష్ణ శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని తన బుల్లెట్ వాహనంపై జాతీయ రహదారి మీదుగా నందిగాం వస్తుండగా, సుమారు రాత్రి 11.30 – 12 గంటల మధ్య వరిపంటను కోసుకొని వస్తున్న కోత మిషన్ రేవడిమెరక వద్ద జాతీయ రహదారి ఎక్కే క్రమంలో గోపాలకృష్ణను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయలు పాలైన గోపాలకృష్ణను విడిచిపెట్టి కోత మిషన్తో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి మిషన్తో పాటు వెళ్లిపోయారు. అయితే రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న బుల్లెట్ను చూసిన గుర్తు తెలియని వాహనదారుడు, 100కు ఫోన్ చేసి ప్రమాద విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న నందిగాం పోలీస్స్టేషన్ ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తదితరులు ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహన సిబ్బంది గోపాలకృష్ణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలంలో దొరికిన ఆనవాళ్లతో దర్యాప్తు సాగించిన పోలీసులు కోత మిషన్ ఢీకొట్టినట్లు అనుమానించి ఒడిశా రాష్ట్రం జాజ్పూర్కు చెందిన విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. గోపాలకృష్ణ మృతదేహానికి శవపంచనామా అనంతరం గ్రామానికి తీసుకొచ్చి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో టెక్కలి సీఐ విజయ్కుమార్, టెక్కలి ఎస్ఐ రాము తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ మృతితో నందిగాంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య యెతీష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
స్పా, మసాజ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా
రణస్థలం: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వ హిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద హెచ్చరించారు. ‘మసాజ్ పేరు.. అసాంఘిక కార్యక్రమాల జోరు..’ శీర్షికతో ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో స్పా, మసాజ్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్పా, మసాజ్ సెంటర్లపై ప్రత్యేక నిఘాతో పాటు తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమాచారం ఇవ్వండి నిబంధనల పాటించకపోతే చర్యలు తప్పవని డీఎస్పీ తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు భవనం అద్దెకు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సెంటర్లు నిర్వహిస్తే అనుమతి ధ్రువీకరణ పత్రాలను ప్రవేశ మార్గం వద్ద ఉంచాలన్నారు. స్పా/మసాజ్ సెంటర్ల పేరుతో ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే 112తో పాటు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ 6309990804, సంబంధిత పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సీహెచ్ వివేకానంద వెల్లడి -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తితో పాటు అతను అనుచరుడు అనపాన నగేష్పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, ఒక పత్రిక విలేకరి సదాశివ, మరికొందరు టీడీపీ కార్యకర్తలు శనివారం దాడిచేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. నౌపడ గ్రామానికి చెందిన అనపాన నగేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ చేయి అడ్డుపట్టి ఉమ్ము వేశాడు. అయితే అతని వెనుక ద్విచక్ర వాహనంపై వస్తున్న టీడీపీ కార్యకర్త, విలేకరి సదాశివ కాలుపై పడింది. దీంతో సీతానగరం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి కావాలనే నా మీద ఉమ్ము వేశావని.. సారీ చెప్పమని నగేష్కు సదాశివ సూచించాడు. అయితే కావాలని తాను చేయలేదని అనడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్నవారు ఇరువురికీ నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు. అంతటితో సదాశివ ఆగకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలతో వెళ్లి.. పార్టీ కార్యాలయంలో ఉన్న అనపాన నగేష్ను పిలిచి దాడి చేశారు. ఇరువురూ కొట్టుకోవడంతో ఈ దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తిపై సైతం దాడి చేశారు. ఈ దాడిలో విష్ణుమూర్తి కళ్లజోడు విరిగిపోగా, కాళ్లకు గాయమై రక్తస్రావం అయింది. దీనిపై ఇరువర్గాలు పరస్పరం నౌపడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అనపాన నగేష్ ఫిర్యాదు మేరకు సదాశివ, తిప్పాన కామరాజు, కీలుగు సత్యంపై.. సదాశివ ఫిర్యాదు మేరకు అనపాన నగేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు. -
ట్రక్కుని ఢీకొట్టిన అంబులెన్స్
● ఒకరి మృతి ● మరొకరికి తీవ్రగాయాలు భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా హల్దియాబహాల్ 55వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ట్రక్కును శనివారం అంబులెనన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్న్స్ సిబ్బంది ఒకరు మృతి చెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రిలో చేర్చారు. భువనేశ్వర్లో ఓ రోగిని దింపి అంగుల్ ప్రాంతానికి అంబులెన్స్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మోటంగా ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం పంపించారు. -
మహా నది ట్రిబ్యునల్ కాల పరిమితి పొడిగింపు
భువనేశ్వర్: ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న నీటి పంపకాల వివాదం పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మహా నది జలాల పంపిణీ వివాదాల ట్రిబ్యునల్ (ఎండబ్ల్యూడీటీ) కాల పరిమితిని వచ్చే ఏడాది జనవరి 13 వరకు పొడిగించారు. మహానది నదిపై ఉన్న అంతర్ రాష్ట్ర వివాదాన్ని పరిష్కరించడానికి 2018లో ఈ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ మునుపటి కాల పరిమితి ఈ ఏడాది ఏప్రిల్ 13తో ముగియాల్సి ఉంది. ఒడిశా, చత్తీస్గఢ్ ప్రభుత్వాల ఉమ్మడి అభ్యర్థన మేరకు తీర్పు ప్రక్రియ సమర్థంగా పూర్తయ్యేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 9 నెలల కాల పరిమితి పొడిగింపును మంజూరు చేసింది. ఈ పొడిగింపు ఒడిశాకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు. మహా నది ఎగువ చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బ్యారేజీలు, ప్రాజెక్టుల వల్ల దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం దెబ్బతింటోందని ఒడిశా నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మహా నది జలాల పంపిణీ వివాదాల ట్రిబ్యునల్ చైర్పర్సన్ పదవి దాదాపు 9 నెలల పాటు ఖాళీగా ఉండటంతో విచారణ ప్రభావితమైంది. దీంతో సరైన తీర్పు కోసం ఇరు రాష్ట్రాలు అదనపు సమయం కోరాయి. ప్రస్తుతం విచారణలు కొనసాగుతున్నాయి. మరో వైపు ట్రిబ్యునల్ ఇటీవల ఇరు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించింది. ట్రిబ్యునల్ గడువు పొడిగింపుతో సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించి వాదోపవాదాలు లోతుగా విచారించేందుకు దోహదపడి నిర్మాణాత్మకమైన తుది తీర్పు వెల్లడించేందుకు ఉపకరిస్తుందని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతోంది. -
ఈఆర్ఎస్ఎస్ ఉద్యోగుల సమ్మె
భువనేశ్వర్: రాష్ట్ర అత్యవసర స్పందన కేంద్రం (ఎస్ఈఆర్సీ) ఉద్యోగులు సామూహికంగా సమ్మె ప్రారంభించారు. 112 వాహనాల సేవలు నిలిపివేశారు. న్యాయసమ్మతమైన తమ డిమాండ్లు నెరవేర్చకుంటే పీసీఆర్ జాడ లేకుండా పోతుందని స్పష్టం చేశారు. కాల్ సెంటర్ ఉద్యోగులకు గత 5 నెలలుగా జీతాలు అందలేదన్నారు. ఉద్యోగులకు ఏడాదిగా ఈపీఎఫ్ జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టేంత వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. జీతాలు అందే వరకు సమ్మె నిరవధికంగా కొనసాగిస్తామన్నారు. ఈ నిరసన కారణంగా 112 సేవలు ప్రభావితమయ్యాయి. -
స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలి
● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ● తాజా, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లకు సత్కారంపలాస: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే గ్రామాల్లో తగిన వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ తాజా, మాజీ కౌన్సిలర్లు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన మాజీ సర్పంచ్లను శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీలోని కౌన్సిలర్ల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. గెలిచే అభ్యర్థికే అవకాశాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. 2027లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఉంటుందని, ఆ సమయంలో మనం కూడా స్థానికంగా అందుకు అనుగుణమైన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నాయకులంతా కష్టపడి పనిచేసి పార్టీని గెలుపించుకోవడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడ దుర్యోధనరావు, పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకటరావు, పలాస ఏఎంసీ మాజీ చైర్మన్ పి.వి.సతీష్, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం నాయకుడు మొదలవలస మన్మథరావు, పలాస–కాశీబుగ్గ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, పైల వెంకటరావు, ఉంగ సాయికృష్ణ, డల్లి జానకిరెడ్డి, దువ్వాడ రవి, తిర్రి రాజారావు, బత్తిన హేమేశ్వరరావు, బోర చంద్రకళ, సుజాత పండా, మీసాల సురేష్బాబు, బెల్లాల శ్రీనివాసరావు, మందస మాజీ ఎంపీపీ డొక్కర దానయ్య, ఉప్పరపల్లి ఉదయ్కుమార్, మచ్చ రత్నాలు, సవర చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో గజపతి కలెక్టర్
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు.గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ బుక్ ఆవిష్కరణ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజినీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రూపొందించిన కౌన్సిలింగ్ బుక్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు, ప్రత్యేకతలు, మౌలిక వసతులు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిఏటా రూ.100 కోట్ల స్కాలర్షిప్స్ మెరిట్ విద్యార్థులకు అందించే ప్రణాళిక విషయమై ప్రశంసించారు. యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్తో పాటు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థుల గురించి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి రాధాకృష్ణ, సీనియర్ మేనేజర్స్ కుమార్, రెడ్డి, నరసింహులు, వెంకట్ పాల్గొన్నారు. కోర్ ఇంజినీరింగ్తో అపారమైన అవకాశాలు టెక్కలి: కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్లతో భవిష్యత్లో అపారమైన అవకాశాలు ఉంటాయని అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి అధ్యాపక శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృత్రిమ మేథస్సు, ఆధునిక సాంకేతిక రంగాల అభివృద్ధితో కోర్ ఇంజినీరింగ్ విభాగాలు కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్ కళాశాలలు సమకాలిన అవసరాలకు అనుగుణంగా కోర్సులను విస్తరించాలని సూచించారు. సాంకేతిక రంగంలో వేగవంతంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ తరగతులు అందజేసి తద్వారా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఐఎస్టీఈ–2026 వార్షిక అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 2007లో ఐఎస్టీఈ మెంబర్ షిప్తో అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి 2026 వరకు తమ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అవార్డులను అందజేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఐఎస్టీఈ అధ్యక్షుడు ప్రతాప్ సింహాకసాహెబ్ దేశాయ్, జేఎన్టీయూ జీవీ పూర్వపు వీసీ ప్రొఫెసర్ కట సుబ్బయ్య, ఐఎస్టీఈ ఏపీ చైర్మన్ ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన, కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, డైరక్టర్ కె.మధుకుమార్, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హిరమండలంలో చోరీ హిరమండలం: హిరమండలం మేజర్ పంచాయతీ దేవరశెట్టి వీధిలోని అందవరపు కస్తూరి ఇంట్లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాదరావు, హిరమండలం, కొత్తూరు ఎస్ఐలు వై.మధుసూదనరావు, కె.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ బృందం, జాగిలాలను తెప్పించారు. ఇంటి యాజమాని అందవరపు కస్తూరి పొలాకిలోని తన కన్నవారింటికి వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరీ సంఘటనపై కొత్తూరు సీఐ వద్ద ప్రస్తావించగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. -
ఏఓబీలో లోయలో పడిన బస్సు
● ఒకరు మృతి ● 15 మందికి గాయాలుకొరాపుట్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో లోయలో బస్సు పడడంతో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం వేకువ జామున కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి సుంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా సరిహద్దుకు కూత వేటు దూరంలో ఒడి02డీఈ5446 నంబర్ గల ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓల్వో బస్సు లోయలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కలహండి జిల్లా బలగాం గ్రామానికి చెందిన జంబాబ్ బిహారీ (50) మృతి చెందాడు. తీవ్రంగా గాయాలపాలైన జంబాబ్ని పొట్టంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ బస్సు ఒడిశాలోని కలహండి జిల్లా నుంచి విశాఖ పట్నం వెళ్తుంది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే జయపూర్, పొట్టంగి, సిమిలిగుడల నుంచి అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 40 అడుగుల లోతుకి దిగి రాత్రి వేళ టవర్ లైట్ ఏర్పాటు చేశారు. రోప్ లైన్లు ఏర్పాటు చేసి 8 మందిని స్ట్రెచర్ల మీద తరలించారు. ప్రమాదం వేకువ జామున 3 గంటలకు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో విషమ పరిస్థితిలో ఉన్న ఇద్దరిని విశాఖ, నలుగురిని కొరాపుట్లోని ప్రభుత్వ షహీద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారు పొట్టంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పొట్టంగి ఎమ్మెల్యే రామ చంద్ర ఖడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ సాలురు–సుంకి ల మధ్య బస్సులు ప్రమాదానికి గురవుతుండడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. -
తస్మాత్ జాగ్రత్త
● వడగాలులు ముంచుకొస్తున్నాయి ● కలెక్టర్లకు ఎస్ఆర్సీ హెచ్చరిక జారీభువనేశ్వర్: రాష్ట్రంలో వేసవి తాపం ఉగ్ర రూపం దాల్చనుంది. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కాల వైశాఖి ప్రభావంతో ఉపశమనం కలిగించిన వాతావరణం వేడెక్కనుంది. వడగళ్ల వానతో అతలాకుతలమైన ప్రజానీకానికి వడగాడ్పులు బెంబేలెత్తించనున్నాయి. స్వీయ అప్రమత్తతతో వడ దెబ్బ వంటి ప్రాణాంతక చర్యల నుంచి రక్షణ పొందాలని వాతావరణ విభాగం సూచన మేరకు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనరు (ఎస్ఆర్సీ) కార్యాలయం పలు జాగ్రత్తలు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 16 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ నెల 13, 14 తేదీలలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలతో అనుబంధ విభాగాలు, శాఖలు అప్రమత్తం కావాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల దష్ట్యా పలు ప్రాంతాలకు పసుపు హెచ్చరిక జారీ చేసి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరులు, గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి, విద్యుత్, తాగు నీరు, పంచాయతీ రాజ్, మత్స్య, ఆరోగ్యం, విద్య, కార్మిక తదితర విభాగాల వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు, ఆర్డీసీలు, ఓఎస్డిఎంఏ, మున్సిపల్ కార్య నిర్వాహక డైరెక్టర్కు ఈ లేఖ జారీ చేశారు. వడగాడ్పుల పరిస్థితి పట్ల అనుక్షణం పర్యవేక్షించాలని ఎస్ఆర్సీ ఆదేశించింది. ఉత్తర కోస్తా ఒడిశాలో ఒకటి రెండు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత ఇప్పటికే సుమారు 3 డిగ్రీల సెల్సియస్ మేర గణనీయంగా పెరిగింది. బౌధ్లో అత్యధికంగా పగటి పూట ఉష్ణోగ్రత 38.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఝార్సుగుడలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 18.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. శిశువులు, వృద్ధులు, గర్భిణీ సీ్త్రలు, అనారోగ్య పీడితులు ఉన్నవారు వంటి బలహీన వర్గాల వారికి ఈ వాతావరణం స్వల్ప ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. రైతులకు సూచన చెరుకు, వేసవి మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలకు నిరంతర నీటి పారుదల కొనసాగించాలని రైతులకు సూచించారు. పెంపుడు జంతువులు, పశువులను చల్లని, నీడ ఉన్న ప్రదేశాలలో తగినంత తాగు నీటితో ఉంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల సమయంలో సంబంధిత శాఖలన్నీ అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతను నిర్ధారించాలని ఎస్ఆర్సీ నొక్కి చెప్పింది. ఐఎండీ పసుపు హెచ్చరిక బాలాసోర్, భద్రక్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, జాజ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, గజపతి, గంజాం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రేపటి వాతావరణం బొలంగీర్, బర్గడ్, సంబల్ పూర్ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల వడగాడ్పుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తీర ప్రాంత, దక్షిణ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం చూసుకోవాలి రద్దీ సమయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బయటకు వెళ్లేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అవసరం. ఎక్కువసేపు ఎండలో ఉండకుండా, లేత రంగు, వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించి, టోపీ, గొడుగు లేదా తడి గుడ్డతో తలను కప్పుకోవాలి. దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గుదల (డీహైడ్రేషన్) నివారణకు ఓఆర్ఎస్, లస్సీ, తరవాణి (పుల్లటి గంజి), చెరకు రసం, నిమ్మ రసం, మజ్జిగ వంటివి వాడాలని సిఫార్సు చేశారు. మద్యం, టీ, కాఫీ, కార్బోనేటెడ్ పానీయాలు, అధిక ప్రోటీన్ లేదా నిల్వ ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం శ్రేయోదాయకం. శ్రమతో కూడిన బహిరంగ పనులను రోజులో చల్లగా ఉండే సమయాల్లో తరచుగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేలా షెడ్యూల్ చేసుకోవాలి. కార్మికులు, ముఖ్యంగా గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల తిరగడం, తల నొప్పి, వికారం, నీరసం లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. -
గజపతి ఎస్డీసీ చైర్మన్గా కామదేవ్ బోడోనాయక్
పర్లాకిమిడి: గజపతి జిల్లా స్పెషల్ ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ పరిషత్ చైర్మన్గా కామదేవ్ బోడోనాయక్, వైస్ చైర్మన్గా పంకజినీ దోళాయి నియమితులయ్యారు. దీంతో శనివారం పర్లాకిమిడి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు నారాయణ రావు, జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, ఛిత్రి సింహాద్రి, సాధారణ కార్యదర్శి ఇ.ప్రశాంత్, ఎంపీ ప్రతినిధి రాజేష్కుమార్, రౌతు విజయకుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలక్రిష్ణ పాత్రో, కౌన్సిలరు బిభూతీ భూషణ్ బెహారా, కె.జీవన్రావు, ప్రసాద్ నాయుడు నూతన చైర్మన్ కామదేవ్ బోడోనాయక్కు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్డీసీ చైర్మన్ పదవి ఏడాదిన్నరగా భర్తీకాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఎట్టకేలక పాలకవర్గాన్ని నియమించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ మఝికి గజపతి జిల్లా బీజేపీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు.పిచ్చికుక్క కాటుతో ఆవు మృతి ● పాలు తాగిన వారంతా ఆస్పత్రికి పరుగులు కొరాపుట్: పిచ్చికుక్క కరవడంతో ఆవు చనిపోయింది. ఈ ఘటన నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణంలోని 12వ వార్డులో శనివారం చోటుచేసుకుంది. ఆసుర్ రాయ్కి చెందిన ఆవు కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుండేది. దీంతో యజమాని ఆసుర్ రాయ్ ఆవుని పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పిచ్చికుక్క కరిచిందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆవు శనివారం ప్రాణాలు కోల్పోయింది. కాగా సుమారు నెల రోజులుగా ఆవు పాలు వినియోగిస్తున్న వినియెగిస్తున్న సుమారు 30 ఇళ్లలో అలజడి రేగింది. వీరంతా రాయ్ వద్ద ఆవుపాలు కొనుగోళ్లు చేస్తుండేవారు. పిచ్చికుక్క కరవడంతో ఆవు చనిపోయిందనే సమాచారం తెలుసుకున్న వారంతా భయంతో ఉమ్మర్ కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పటికే 15 మంది పిల్లలు, 20 మంది పెద్దలు వ్యాక్సిన్ వేయించుకున్నారని వైద్యులు ప్రకటించారు.ఖంజావీధిలో యువతి ఆత్మహత్య పర్లాకిమిడి: పట్టణంలో ఖంజావీధిలో యువతి (అవివాహిత) శుభ్రా సామల్ (24) స్వగృంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన 15వ వార్డులో సంచలనం కలిగించింది. ఆదర్శ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రశాంత్ భూపతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యా ప్తు చేశారు. ఇటీవలే మంచి మార్కులతో పాసై న శుభ్రా సామల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నా రు. ఈమెకు ఇద్దరు అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆదర్శ పోలీసు ష్టేషన్ అధికారులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గ్రంథాలయం.. దయనీయం..!
శ్రీకాకుళం అర్బన్: గత నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన గ్రాంట్ సక్రమంగా విడుదల చేయకపోవడం వలన నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు, 10 నెలలుగా పత్రికల బిల్లులు, కరెంట్ బిల్లులు, స్వీపర్ ఛార్జీలు కూడా చెల్లించక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక నెలకు గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పేపర్ బిల్లులకు రూ.45 లక్షలు అవసరమవ్వగా.. ఆ నిధులను విడుదల చేయడం లేదు. జిల్లాలో 20 మంది శాశ్వత ఉద్యోగులు, 60 మంది పెన్షనర్లు, 13 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీరికి ఏడాదికి చెల్లించేందుకు కనీసం రూ.6 కోట్లు కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ కేవలం రూ.2.22 కోట్లు మాత్రమే గ్రాంటు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అదనపు గ్రాంటు కోసం ప్రభుత్వాన్ని కోరగా ఇవ్వడం కుదరదని ఫైలు తిప్పి పంపించి వేసింది. దీంతో సక్రమంగా జీతాలు, పింఛన్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. నిర్వహణకు గడ్డు పరిస్థితి ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడం వలన గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రంథాలయాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు వసూలైన సెస్సుతో అభివృద్ధి జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో గ్రంథాలయాలకు, పుస్తకాల కొనుగోళ్లకు, రోజువారీ వచ్చే దిన, వార, మాస పత్రికలకు సొమ్ములు చెల్లించడం లేదు. ఇలా అయితే గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించని పక్షంలో దశలవారీగా ఆందోళన చేపడతాం. అలాగే వేసవి శిక్షణా శిబిరాలను కూడా బహిష్కరిస్తాం. – పి.ఉగ్రసేన, జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం. ఇటీవలే మంత్రి నారా లోకేష్కు సమస్యను వివరించాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిధుల కోసం కృషి చేస్తున్నాం. ఇటీవల వసూలైన సెస్సు నుంచి రెగ్యులర్ ఉద్యోగులకు డిసెంబర్ నెల జీతం ఇవ్వడం జరిగింది. మరికొంత వసూలైన సెస్లో పెన్షనర్లకు ఒక నెల పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అయితే మార్చినెలాఖరు కావడంతో ఆగింది. త్వరలోనే పెన్షనర్లకు ఒక నెల పెన్షన్ చెల్లిస్తాం. జిల్లాలో కూడా ఇళ్లు, పంచాయతీల నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – పీరుకట్ల విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గత నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలపై జేసీ, మున్సిపల్ అధికారులను కలిశాం. శ్రీకాకుళం మున్సిపాలిటీ కట్టాల్సిన సెస్ను త్వరలోనే కట్టించే ఏర్పాట్లు చేస్తామని జేసీ చెప్పడం జరిగింది. సెస్ వసూలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మా జీతాలను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదని, స్థానిక సంస్థల నుంచే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం శోచనీయం. – వీవీజీ శంకరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. గత 33 ఏళ్ల చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. 40 శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేసి.. 60 శాతం ఇళ్లు, పంచాయతీల నుంచి వసూలైన సెస్ నుంచి జీతాలు, పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడం సరికాదు. నాలుగు నెలలుగా పెన్షన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మందులకు, నెలవారీ ఖర్చులకు కూడా అవస్థలు పడుతున్నాం. – టి.వైకుంఠరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ములిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ఈనెల 26వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాల్సి ఉంది. అయితే గ్రంథాలయ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ, వాటి ఖర్చు ఉద్యోగులే భరించాలని అనడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించినా వాటికి సంబంధించి ఎటువంటి బిల్లులూ చెల్లించలేదని, ఆ నిర్వహణ ఖర్చుల భారం గ్రంథాలయ ఉద్యోగులే భరించాల్సి వచ్చిందని వాపోతున్నారు. గ్రాంట్ సక్రమంగా విడుదల చేయని ప్రభుత్వం నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లకు ఉద్యోగుల ఎదురుచూపులు పత్రికల బిల్లులూ చెల్లించలేని వైనం ప్రశ్నార్థకంగా వేసవి శిక్షణా శిబిరాలు -
22 నుంచి విగ్రహ ప్రతిష్టోత్సవాలు
రాయగడ: స్థానిక ఉమాశంకర్ లైన్ సమీపంలోని అయ్యప్ప స్వామి మందిరం ప్రాంగణంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు గురుస్వామి ఎం.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. పురాతనమైన అయ్యప్ప మందిరం ఇప్పటికే అందరి సహకారంతో అభివృద్ధి చెందగా ఉప ఆలయాల్లో భాగంగా గణేష్, సుబ్రహ్మణ్యం, హనుమాన్, దత్తాత్రేయ, మహాలక్ష్మి, సరస్వతి, మాలికాపురిమాత విగ్రహాలను ప్రతిష్టించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన ప్రముఖ వేద పండితులు వెంకటరామ్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా 22వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ, రక్షాబంధన్, అఖండ దీపార్చన, సాయంత్రం 4.30 గంటలకు కలశ యాత్ర ఉంటందన్నారు. 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు క్షీరాభిషేకం, కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, సాయంత్రం 4.30 గంటలకు మహాలింగార్చన, అష్టదిగ్భంధన పూజలు ఉంటాయి. చివరి రోజైన 24వ తేదీన ఉదయం ఎరిమిది గంటలకు సంప్రొక్షణ, హోమం, పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయని నాగేశ్వరావు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. -
గడ్డిమందు తాగి ఆటోడ్రైవర్ ఆత్మహత్య
పాతపట్నం: మండలంలోని చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి సోయి(30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నలోగిడి గ్రామానికి చెందిన దయానిధి సోయి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త జైనవలస చిలకమ్మకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. చిలకమ్మకు ఐదు రోజుల క్రితం డబ్బులు అడగగా.. చిలకమ్మ, ఆమె భర్త ముఖలింగంలు కలిసి పోలీసుస్టేషన్లో దయానిధిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దయానిధి సోయిని పోలీసు స్టేషన్కు పిలిపించారు. స్టేషన్లోనే దయానిధి సోయిని చిలకమ్మ ధూషించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈనెల 10వ తేదీన గడ్డిమందు తాగాడు. అనంతరం ఆటోలో సెల్ఫీ వీడియో తీశాడు. తన మృతికి పెద్దలోగిడి ఆశ వర్కర్ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త మొఖలింగంలు కారణమని, అప్పు ఇచ్చిన డబ్బులు అడిగితే తనపై కేసు పెట్టారని వాపోయాడు. వీడియోని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దయానిధిని పాతపట్నం సీహెచ్సీకి తరలించగా, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. రిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. రిమ్స్లో పంచనామా , పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కె.శ్రీరామమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్’ పాతపట్నం: మహానేత మరణంపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మంత్రి ఇలా వాఖ్యలు చేయడం దగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురా లు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు. శనివారం మాజీ ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో రెడ్డి శాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లడం మంత్రి అచ్చెన్నాయుడికి తగదన్నారు. ఎర్రన్నాయుడు మరణిస్తే గానీ మంత్రి పదవి రాదు అని అచ్చెన్న సహచరుల వద్ద ఎన్నోసార్లు అన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు అచ్చెన్న రాజీనామా చేసి, పోటీ చేయాలని, డిపాజిట్ కూడా రాదని అన్నారు. సమావేశంలో పాతపట్నం, మెళియాపుట్టి పీఏసీఎస్ అధ్యక్షులు మిరి బిల్లి శ్యామ్సుందరరావు, ఉర్లాన బాలరాజు, పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్, పోలాకి జయమునిరావు, పెనుమజ్జి విష్ణుమూర్తి, కొత్తూ రు ఎంపీపీ సవర సావిత్రి, రాష్ట్ర బీసీ సెఎల్ జాయింట్ సెక్రటరీ చింతాడ సూర్యనారాయణ, రాష్ట వాణిజ్య విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ యరుకోల వెంకటరమణ, రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ రమేష్, రెడ్డి రామారావు, మడ్డు తాతయ్య, వెంకటరమణ పాల్గొన్నారు. -
ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాసలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్వో చొప్పున ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. వీఆర్వోలు ఆయా గ్రా మాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి రెవెన్యూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామసభలు ఏర్పాటు చేసినపుడు తహసీల్దార్లు, పోలీసులకు పలు సూచనలు జారీ చే శారు. వీఆర్వోల వద్ద వారికి కేటాయించిన వారి వివరాలు ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, పలాస ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
ముఖేష్ అంబానీకి ఊరట
23 ఏళ్లుగా సా..గుతున్న ఓ కేసులో బిలీయనీర్ ముఖేష్ అంబానీకి ఊరట లభించింది. కేసును కొట్టిపారేసిన న్యాయస్థానం.. ఫిర్యాదు చేసిన వ్యక్తికే జరిమానా విధించి షాకిచ్చింది. ఈ క్రమంలో అంబానీకి సమన్లు జారీ చేసిన కింది కోర్టు తీరును ఒడిశా హైకోర్టు తప్పుబట్టింది. రూ.501 ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే.. ఒడిశా రూర్కెలాకు చెందిన ప్రఫుల్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి 2003లో.. ఆనాడు ముఖేష్ అంబానీ అధినేతగా ఉన్న రిలయన్స్ ఇన్ఫోకమ్(రిలయన్స్ గ్రూప్లో భాగంగా..) తీసుకొచ్చిన ఓ స్కీమ్లో చేరాడు. సబ్సిడీ కింద రూ.501 చెల్లించి ఫోన్ను కొనుగోలు చేశాడు. అయితే ఆ సేవలు నాసిరకంగా ఉన్నాయని.. తాను ఎంతో నష్టపోయానని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో ముఖేష్ అంబానీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాడు.అయితే.. ఈ వ్యవహారంలో అతను కోర్టులను పదే పదే ఆశ్రయించాడు. 2003, 2004లో వేసిన పిటిషన్లను 2004, 2005లో నిశితంగా పరిశీలించిన ఒడిశా హైకోర్టు కొట్టి పారేసింది. 2007లో అయితే ఏకంగా సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేస్తే.. అక్కడా అతనికి చుక్కెదురైంది.నాలుగోసారి హైకోర్టును ఆశ్రయించగా.. ఈసారి న్యాయస్థానం పిటిషన్ను పరిశీలించి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు దశాబ్దాలుగా పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేశారంటూ.. రూ.1000 జరిమానా విధించింది. మార్చి 31న తీర్పు వెలువడగా.. తాజాగా ఆ ఆర్డర్ కాపీని ఆన్లైన్లో పబ్లిష్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.న్యాయ పరిశీలన చేయరా?..సాధారణంగా మొబైల్ సేవలపై వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదీ సంబంధిత ఫోరమ్లలో. కానీ, ఈ కేసులో ప్రఫుల్.. ఏకంగా క్రిమినల్ కేసు పెట్టాలంటూ కోర్టులను ఆశ్రయించాడు. అయితే అతని పిటిషన్ ఆధారంగా.. పాన్పోష్లోని సబ్-డివిజనల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (SDJM) ముఖేష్ అంబానీకి సమన్లు కూడా జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటిపై తాజా విచారణలో.. ఒడిశా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘చిన్న మొత్తానికి సంబంధించిన వినియోగదారుడి ఫిర్యాదుతో.. ఓ పేరొందిన వ్యాపారవేత్తను నిందితుడిగా పేర్కొనడం ఏంటి?.. సమన్లు జారీ చేయడం ఏంటి?. ఇది కచ్చితంగా సరైన న్యాయ పరిశీలన లేకుండా జరిగిన వ్యవహారమేనని స్పష్టమవుతోంది’’ అని కింది కోర్టును మందలించింది. ఈ కేసులో అంబానీకి జారీ చేసిన సమన్లు, అలాగే ఈ పెండింగ్ కేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.అలాంటి హక్కు ఉండదు.. మొబైల్ సేవల్లో అంతరాయం ఏర్పడితే వినియోగదారుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉండి ఉండొచ్చు. కానీ అలాంటి వివాదాలను క్రిమినల్ చట్టం ద్వారా కొనసాగించడం తగదు. “ఫిర్యాదు ఎలాంటిదైనా.. అది క్రిమినల్ బాధ్యత లేని వారిపై క్రిమినల్ చట్టాన్ని ఆయుధంగా వాడుకునే హక్కు ఇవ్వదు” అని తీర్పు సందర్భంగా జస్టిస్ పాణిగ్రాహి వ్యాఖ్యానించారు. -
ప్రజలకు నాణ్యమైన విద్యుత్
● ఒడిశా గ్రిడ్ ఆధునీకరణతో 22 లక్షల మందికి ప్రయోజనం ● గ్రిడ్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవంలో సీఎం మోహన్చరణ్ మాఝిభువనేశ్వర్: ప్రపంచ శ్రేణి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి వినియోగదారులకు అధిక నాణ్యత, నికరమైన, నిలకడ విద్యుత్ను నిరంతరాయం సరఫరా చేయడం లక్ష్యమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ఖుర్దా జిల్లా బలియంత, సత్యనగర్, కటక్లోని ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి వద్ద ఉన్న 3 అత్యాధునిక జీఐఎస్ గ్రిడ్ సబ్స్టేషన్లతో పాటు, ఓపీటీసీఎల్ 8 ప్రధాన ట్రాన్స్మిషన్ లైన్లను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర రాజధానిలో నిరంతరాయంగా అధిక నాణ్యత, నమ్మకమైన విద్యుత్ సరఫరాకు ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. పరిశ్రమలు, వ్యాపారం, సాంకేతిక సమాచారం, పట్టణ జీవనం సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ఒడిశా గ్రిడ్ ఆధునీకరణ 22 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చుతుందని విద్యుత్ శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. దాదాపు రూ. 600 కోట్ల భారీ పెట్టుబడితో ఏడాదిలోపే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. దీంతో భువనేశ్వర్, సమీప ప్రాంతాలలోని సుమారు 22 లక్షల మంది వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా సుసాధ్యం అయ్యింన్నారు. చట్టపరమైన, అధికారిక పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఈ ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఆలస్యం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొత్త సబ్స్టేషన్లు తక్కువ వోల్టేజ్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయని, నికరమైన నిలకడ విద్యుత్ను అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని ఫీడర్లను జోడించి పంపిణీని బలోపేతం చేయాలని ఆయన టాటా పవర్ను ఆదేశించారు. -
క్రీడా కాంప్లెక్స్ సందర్శన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని క్రీడా కాంప్లెక్స్, వసతి గృహాన్ని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ సందర్శించారు. జిల్లాలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం, యువకుల ప్రతిభలను వెలుగులోకి తీసుకురావడం కోసం జిల్లా పరిపాలన యంత్రాంగి చర్యలు చేపట్టిందన్నారు. ఈ సందర్భగా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ క్రీడాకారులకు సంబంధించి వసతుల అబివృద్ధి, రాబోయే రోజుల్లో జరగనున్న సీఎం ట్రోఫీకి ఏర్పాట్లను పరిశీలించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని వివిధ విభాగాలను సందర్శించారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు అథ్లెట్లకు మెరుగైన శిక్షణ కోసం ట్రాక్ స్థితిని పరిశీలించి.. దాని సంరక్షణతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ సమితుల్లో ఉన్న ఇండోర్ స్టేడియాలను సక్రమంగా నిర్వహిస్తూ ఎల్లప్పుడు క్రీడాకారులకు ఉపయోగపడేలా ఉంచాలని జిల్లా క్రీడాధికారికి సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణాన్ని సురక్షితంగా ఉంచేందుకు గోడ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను మల్కన్గిరిలో ఘనంగా నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించా రు. అలానే హస్టల్లో ఉంటున్న క్రీడాకారుల సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారులు ఉన్నారు. -
పుస్తకం కొనుగోలు చేద్దాం
మల్కన్గిరి: రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒడియా భాషా పక్షోత్సవంలో భాగంగా శుక్రవారం ‘రండి పుస్తకం కొనుగోలు చేద్దాం’ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సోమనా థ్ ప్రధాన్, వేద్బర్ ప్రధాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ మాట్లాడుతూ పుస్తకాలు సంస్కృతి సంప్రదా యాలకు ప్రతిబింబమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దాశరథి సరాబు, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, డీఐపీఆర్ఓ ప్రమిళ మాఝి పాల్గొన్నారు. పర్లాకిమిడి: ఒడిషా పక్షోత్సవాలు సంధర్బంగా పురపాలక సంఘం పర్లాకిమిడి పరిధిలోని పలువురు లోకనృత్య కళాకారులను శుక్రవారం మున్సిపల్ కాన్ఫరెన్సు హాలులో ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలరు బబునా బెహరా మాట్లాడుతూ పర్లాకిమిడి మహారాజుల కాలం నుంచి రంగస్థల నాటికలు, కవులు, సంగీత కళాకారులకు ఆదరణ వుండేదని, ఇప్పుడు స్థానిక కళాకారులను గౌరవించడం హార్షనీయమన్నారు. అనంతరం రంగస్థల నటులు దేవేంద్ర దాస్, లోక సంగీత దర్శకులు రఘునాథ పాత్రో, రంగస్థల నాటకం దర్శకులు నృసింహాచరణ్ పట్నాయిక్, కూచిపూడి, భరత నాట్యం మాస్టారు వి.హిమగిరి, కర్ర,కత్తిసాము నిపుణుడు బెబర్తావీధికి చెందిన త్రిపతి పాత్రోలను సన్మానించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, వైస్ చైర్మన్ లెంకమధు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, కౌన్సిలర్లు బాలకృష్ణపాత్రో, నారాయణ బెహరా తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వహణలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాలుగో ఆహ్వాన నాటిక పోటీలు బాపూజీ కళామందిర్లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ అకాడమీ రచయిత్రి, దర్శకురాలు పెమ్మరాజు పూర్ణిమ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ఆద్యంతం అలరించింది. ప్రతి కుటుంబాన్ని నడిపించి, గెలిపించే సీ్త్రని కూడా సీ్త్ర మాత్రే నమః అని పూజించాలనే సందేశంతో ప్రదర్శన సాగింది. పెందుర్తికి చెందిన నటరాజ డ్రామాటిక్ అసోసియేషన్ బి.శెట్టి శేఖర్ దర్శకత్వంలో చందు తులసి రచనలో ‘నీళ్లు– నీళ్లు‘ నాటికలో ప్రస్తుత కాలంలో గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని పేర్కొంటూ నటీనటులు అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆహూతులను అలరించింది. కార్యక్రమంలో కేతిరెడ్డి రాజేశ్వరి, నిక్కు హరిసత్యనారాయణ, పొగిరి సత్యం, పూజారి మన్మధరావు, ఉంగటి రమణమూర్తి, పాత్రుని పాపారావు, సనపల అన్నాజిరావు, పొగిరి సుగుణాకరరావు, నల్లి ధర్మారావు, బలివాడ శ్రీనివాసరావు, కీర్తి పాల్గొన్నారు. రణస్థలం: జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన నాగవరపు వీరబాబు(39) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరబాబు తల్లి చనిపోయినప్పటి నుంచి మానసిక ఆవేదన చెందుతూ మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రణస్థలం సీహెచ్సీకి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వీరబాబుకు భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
● స్వర్గ రథం ప్రారంభం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మలో ఉచితంగా మృతదేహాలను తరలించడం కోసం సమాజ సేవకుడు, న్యాయవాది మున్న దొర సొంత నిధులతో స్వర్గ రథాన్ని సమకూర్చారు. దీన్ని కొరాపుట్ జిల్లా అదనపు కలెక్టర్ నరేష్ చంద్రశబర శుక్రవారం ప్రారంభించారు. బొరిగుమ్మ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ఉపయోగంగా ఉంటుందన్నారు. దాత మున్న దొరను అభినందించారు. ప్రజల సామాజిక అవసరాలు తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బొరిగుమ్మ సూర్యభాను గ్రంథాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బొరిగుమ్మ సబ్డివిజనల్ పోలీసు అధికారి (ఎస్డీపీవో) సత్యబ్రత లెంక, బొరిగుమ్మ అదనపు తహసీల్దార్ బోయిన సతీష్, విశ్రాంత ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ రథ్, మునా దొర తండ్రి, రిటైర్డ్ పోలీసు అధికారి బిజయ కుమార్ దొర, సూర్యభాను గ్రంథాలయ పరిశీలన కమిటీ అధ్యక్షులు బిజయనారాయణ సాహు, బొరిగుమ్మ న్యాయవాదుల సంఘ అధ్యక్షులు నాగరాజు దొర, సూర్య ఆచారి, న్యాయవాదులు అశోక్ గంతాయిత్, ప్రసాద్ బాడిక, బిష్ణు షొడంగి పాల్గొన్నారు. -
రోడ్డు నిర్మాణం చేపట్టాలి
● కర్తాన్పల్లి పంచాయతీ ప్రజల విజ్ఞప్తిమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి కర్తాన్పల్లి పంచాయతీ దుతిబేడ గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామం నుంచి కియాంగ్, సలీమ్ పంచాయలు దాటి కర్తన్పల్లి పంచాయతీ రావాలంటే నరకాన్ని చైస్తున్నారు. సుమారు 12 కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా శిథిలమైంది. దీంతో చినుకుపడితే చిత్తడిగా మారి నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. వర్షం కురిస్తే రాకపోకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ పరిస్థితి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుతూ సమితి అధ్యక్షురాలు లక్ష్మీప్రియా నాయక్ పలుమార్లు జిల్లా పరిపాలన కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. అయిన్పటికీ ఎలాంటి స్పందన లేదు. పింఛన్లు, రేషన్ సరుకులు తీసుకోవడానికి వెళ్లేందుకు కూడా ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని కూడా లక్ష్మీప్రియా నాయక్ అధికారులకు విన్నవించి ఉన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డును ఆమె గురువారం మారోసారి పరిశీలించారు. రోడ్డు దుస్థితిపై మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని గ్రామస్తులకు వివరించారు. -
ఘనంగా కళాశాల వార్షికోత్సవం
జయపురం: పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాల 40వ వార్షికోత్సవాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి విద్యార్థినులు సాంప్రదాయ గౌరవాన్ని కాపాడుతూ చదువులో కళాశాలకు మంచి గుర్తింపు తెస్తున్నట్లు కొనియాడారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ వివేకానంద సున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విక్రమదేవ్ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.పోలీస్స్టేషన్ తనిఖీ కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్స్టేషన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం స్టేషన్లో వివిధ గదులు పరిశీలించారు. రికార్డులు, నిందితుల సెల్, వసతులు, కక్షిదారుల ప్రాంతం తదితర అంశాలు క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు నిబంధనలు ప్రకారం ఈ పరిశీలన జరిగింది. ఈ సమయంలో ఐఐసీ సంబిత్ బెహరా కలెక్టర్కి స్టేషన్ వివరాలు తెలియజేశారు.చోరీ కేసులో నిందితుడు అరెస్టు కొరాపుట్: ఒక ఇంట్లో దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్స్టేషన్ ఐఐసీ సంబిత్ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. పట్టణంలోని ఆర్కే కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక పాత్రో నివాసంలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 6 ఆభరణాలు, రూ.10 వేల నగదు, ఒక చేతి గడియారం చోరీకి గురయ్యాయి. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా పట్టణంలోని తొట్టా వీధికి చెందిన రోమ్యా అలియస్ రొణ్య ఖొరఖొర దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకి తరలించినట్లు పోలీసులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం ● ఇద్దరికి గాయాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి లిటిగుడ కూడలి వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతుడు కలహండి జిల్లాలోని కలమ్పూర్ ప్రాంతానికి చెందిన కేశవ సాహు (34) కాగా గాయపడిన వారు మురిబహాల్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ సాహు, కేదారనాథ్ సాహులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న మునిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం మునిగుడ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆంబులెన్స్లో మునిగుడ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లాకు చెందిన కేశవ, ప్రమోద్, కేదార్నాథ్లు ఒకే బైక్పై మునిగుడకు వస్తుండగా లిటిగుడ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న మరో బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వీరిలో కేశవ సంఘటనా స్థలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తీరానికి చేరిన తిమింగలం కళేబరం
భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లా గహిర్మఠ్ సముద్ర అభయారణ్యం ప్రాంతం మదాలి నది ముఖ ద్వారం సమీపంలో భారీ నీలి తిమింగలం కళేబరం ఒడ్డుకు చేరింది. స్థానికులు వెంటనే మండల అటవీ అధికారి (డీఎఫ్ఓ)కు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కపిలేంద్ర ప్రధాన్, జంతు వైద్య అధికారి డాక్టర్ ప్రకాష్ కుమార్ జెనా ఆధ్వర్యంలో ప్రత్యేక బందం ఘటనా స్థలం సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రాథమిక పరీక్షలో సుమారు 4 నుంచి 5 ఏళ్ల వయసు కలిగిన ఆడ తిమింగలంగా ధ్రువీకరించారు. కళేబరం దాదాపు సగం కుళ్లిపోయినట్లు గుర్తించారు. 12 నుంచి 15 రోజుల క్రితం సముద్రంలోనే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కళేబరం నుంచి తీవ్ర దుర్వాసన వెలువడడంతో లోతుగా పరిశీలించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. బలమైన గాలులు, ఆటుపోట్ల ప్రవాహాలతో కళేబరం ఒడ్డుకు చేరి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరణానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. చేపల వేట పడవను ఢీకొనడం, ఇతర తెలియని కారణాలు కావచ్చని చెబుతున్నారు. ఐదేళ్ల కిందట ఇదే ప్రాంతంలోని చించీరి నదీ ముఖ ద్వారం, కొంతియా ఖాయ్ సమీపంలో 2 భారీ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. గహిర్మఠ్ తీరం నీలి తిమింగలాలు, ఇతర సముద్ర జీవజాతులు కనిపించే ముఖ్యమైన సముద్ర ఆవాసాలలో ఒకటిగా నిలుస్తోంది. -
కాశీపూర్ ఘటనపై నిరసన
జయపురం: రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో కంటిమాల గ్రామాన్ని పోలీసులు చుట్టిముట్టి టియర్ గ్యాస్ ప్రయోగం చేయడమే కాకుండా, లాఠీచార్జి చేయడంపై కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ గ్రామం నుంచి ప్రజలను పంపించేందుకు పాలకులు, పోలీసులు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఈ మేరకు జయపురంలో నిరసన ర్యాలీ శుక్రవారం చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో వేదాంత అల్యూమిన కంపెనీకి రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందని ఆరోపించారు. కావాల్సిన భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించలేదని మండిపడ్డారు. ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియా కావడంతో పాటు ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని గుర్తు చేస్తూ వెంటనే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని పోలీసు శిబిరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరసనలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్, సహాయ కార్యదర్శి బుద్ర బడనాయిక్, యువనేత నంద హరిజన్, విద్యార్థి నాయకుడు కృష్ణ ఖొర తదితరులు పాల్గొన్నారు. -
కంటామాల్లో శాంతియుత వాతావరణం తీసుకురావాలి
రాయగడ: ప్రకృతి సంపదను హరించి వేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న దమన కాండను ఆపివేయాలని, అమాయకులైన ఆదివాసీలపై పెట్టిన అబద్ధపు కేసులను ఉపసంహరించుకోవాలని.. లేదంటే తమ పార్టీ తరఫున ఆదివాసీలకు మద్దతుగా ఆందోళన చేపట్టడం ఖాయమని అటాఘడ్ ఎంఎల్ఏ, బీజేడీ సీనియర్ నాయకుడు రాణేంద్ర ప్రతాప్ స్వయి అన్నారు. జిల్లాలొని కాసీపూర్ లోని కంటామాల్లో ఇటీవల పోలీసులు, గ్రామస్తు ల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి గురువా రం నాడు ఆ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంలో పాల్గొని వివరాలు సేకరించిన అనంతరం శుక్రవారం నాడు స్థానిక హోటల్ విజేత కాంటినంటల్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాసీపూర్లో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారని అన్నారు. పోలీసులు చేసిన దమనకాండ కారణంగా గ్రామంలొ ఎంతొ మంది గాయాలు పాలయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమితిలొ గల సిజిమాలి బాక్సయిట్ తవ్వకాలకొసం వేదంత కంపెనీకి అనుమతులు ఇవ్వడంతొ ఆ కంపెనీ ప్రజల గ్రామస్తులు అనుమతులు లేకుండా రహదారిని ఏర్పాటు చేయడం తొ గ్రామస్తులు అడ్డుకున్నారని అన్నారు. అయితే అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతొ పాటు అర్ధరాత్రి సమయంలొ కంటామాల్ గ్రామంలొ సృష్టించిన దమన కాండ కారణంగానే పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని వివరించారు. గ్రా మ, పల్లెసభలు లేకుండా బాక్సయిట్ నిక్షేపాలను తవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృధ్ది పేరిట వినాసం సృష్టిస్తుందనడానికి కంటమాల్లొ ఇటీవల చోటు చేసుకున్న పరిణామమే నిదర్శనమని అన్నారు. పోలీసులు దాడులకు అమాయక ఆదివాసీలు గాయాలు పాలవ్వడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికై న నిద్ర లేచి పరిస్ధితిని సమీక్షించాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా కంటామాల్ గ్రామంలొ అమలు చేసిన బిఎన్ఎస్ 163 సెక్షన్ ను ఎత్తి వేయడంతొ పాటు అక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జంగల్, జమీ అన్న నినాదాలతొ ఆదివాసీలు వారి హక్కుల కొసం పోరాడుతున్నారని వారి హక్కులను కాలరాయడం ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చోరవ తీసుకుని ఖనిజ నిక్షేపాలు గల ప్రాంతాల్లొ ఉన్న ప్రజలతొ సమావేశాలను నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే తవ్వకాల కొసం ఏ కంపెనీకి అను మతులు ఇచ్చినా అభ్యంతరాలు ఎదురవ్వవని అ న్నారు. ఈ సమావేశంలొ బిజేడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాధ సరక, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు అనసూయా మాఝిలు పాల్గొన్నారు. -
138 మందికి గృహ నిర్మాణాలు
జయపురం: ఒడిశా ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి విభాగం అనుమతి మేరకు 138 మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక బాబా సాహేబ్ కల్యాణ మండపంలో శుక్రవారం జయపురం మున్సిపల్ అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జయపు రం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధా న మంత్రి అవాస్ యోజన పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశామన్నారు. జయపురం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వేలకు పైగా లబ్ధిదారుల జాబితా తయారీ చేసి మంజూరు చేయటం జరిగిందన్నారు. వారిలో 3,400 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం పత్రాలుపొందిన వారు కూడా సకాలంలో గృహ నిర్మాణాలు చేపట్టాలన్నారు. మున్సిపల్ చైర్మ న్ నరేంద్రకుమార్ మహంతి, వైస్ చైర్మన్ బి.సునీ త, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పూజా రౌ త్, కౌన్సిలర్లు, మునిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
కంటామాల్లో వామపక్ష నేతల పర్యటన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కంటమాల్ లో రహదారి నిర్మించే విషయంలో అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనపై వామపక్ష నాయకులు శుక్రవారం ఆ గ్రామంలో పర్యటించారు. సీపీఐ రాష్ట్ర శాఖ కార్యద ర్శి డాక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రో నేతృత్వంలో సీపీఐఎంకి చెందిన రాష్ట్ర శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర పాణిగ్రహి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్కి చెందిన రాష్ట్ర శాఖ కార్యదర్శి యుధిష్టర్ మహాపాత్రో, ఆలిండి యా ఫార్వర్డ్ తరగతులకు చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పూర్ణచంద్ర షడంగి, తిరుపతి గొమాంగో తదితర నాయకులు పర్యటనలో ఉన్నారు. ముందుగా గ్రామస్తులతో సమావేశమైన నాయకులు అసలు జరిగిన విషయమై ఆరాతీశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటా మని భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందుకు తాము కూడా ఆందోళనకు సహకరిస్తామ ని అన్నారు. అర్ధరాత్రి నిందితుని అరెస్టు చేసేందు కు పోలీసులు కంటమాల్ గ్రామానికి వెళ్లి సృష్టించి న రభస గురించి తెలుసుకున్నారు. అక్కడితో ప్రా రంభమైన ఘటన చినికి చినికి వానలా మారిందని అన్నారు. రహదారి నిర్మించే విషయంలో అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు టియర్ గ్యాస్ వంటివి వినియోగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో కేవలం పోలీసులకు మాత్రమే గాయాలైనట్లు వస్తున్న ప్రచారా న్ని వామపక్ష నేతలు ఖండించారు. అంతకు ముందురోజు కంటమాల్ గ్రామంలో పోలీసులు అర్ధరా త్రి చేపట్టిన నిర్వాకంలో చాలామంది గ్రామస్తులు గాయపడిన విషయం మరిచిపొకూడదని అన్నారు. మహిళలని చూడకుండా వారిపై దాడి చేయడం పోలీసుల నిరంకుశ వైఖరికి నిదర్శనంగా ఉందని నాయకులు ఆరోపించారు. అనంతరం కంటమాల్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంఽధించి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి వినతిపత్రం సమర్పించారు. -
పురపాలక సంఘ వార్షిక బడ్జెట్పై చర్చ
పర్లాకిమిడి: పర్లాకిమిడి పురపాలక సంఘం 2026–27 బడ్జెట్ సమావేశాలు మున్సిపల్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగాయి. సమావేశానికి పురపాలక సంఘం చైర్మన్ నిర్మల శెఠి అధ్యక్షత వహించగా, గౌరవ అతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, వైస్ చైర్మన్ లెంకమధు, ఎగ్జిక్యూటివ్ అధికారి లక్ష్మణ ముర్ము, ఇంజినీర్లు, కౌన్సిలర్లు హాజరయ్యారు. కౌన్సిలర్లు యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని చైర్మన్ నిర్మలా శెఠి కోరారు. అలాగే వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ముక్తా పథకం, వీధి లైట్లు, పాఠశాలల మరామతులపై నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థిక సంవంత్సరంలో గృహాలు, వ్యాపార సమూదాయాల ప్రాపర్టీ, హోల్డింగ్ ట్యాక్సులు, కలెక్షన్ కూడా లక్ష్యాలు చేరుకోవాలని ట్యాక్స్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలర్లు బబునా బెహారా, అమ్ములమ్మ, బబునా బెహారా, నారాయణరావు బెహారా ఉన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ రాయగడ: స్థానిక రైతుల కాలనీలో నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన 40 మంది వృద్ధ ఆదివాసీ మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్టు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతీనెల ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీధర్ ఆచార్యులు ఇక్కడ ట్రస్టుని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతినెలా ఆదివాసీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడంతో పాటు ట్రస్టు ద్వారా అనాథ, పేద ఆదివాసీ యువతులకు ఉచితంగా చదివించడంతో పాటు వారికి భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు వంద మందికిపైగా ఆదివాసీ యువతులు ట్రస్టు ద్వారా ఈ సౌకర్యాలు పొందుతున్నారని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై పునఃపరిశీలించాలిభువనేశ్వర్: భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టును నిలిపివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భువనేశ్వర్ లోక్సభ సభ్యురాలు అపరాజిత షడంగి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ప్రకటించారు. ప్రాజెక్టును మూసివేయడానికి పేర్కొన్న కొన్ని కారణాలు, వాస్తవ అవసరాల వాస్తవిక విశ్లేషణపై ఆధారపడినట్లు కనిపించడం లేదని లేఖలో వివరించారు. విస్తృతంగా పట్టణీకరణ చెందుతున్న రాజధాని ప్రాంతానికి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్నారు. -
మైనింగ్ తవ్వకాలపై రాజకీయ సెగ!
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని కాసీపూర్ సమితి సిజిమాలి మైనింగ్ తవ్వకాలకు సంబంధించి వేదంత కంపెనీకి అనుమతులు ఇచ్చి్ంది. దీ.ంతో ఆ ప్రాంతంలొ బాక్సయిట్ నిక్షేపాలను తవ్వేందుకు రహదారి నిర్మాణంలో భాగంగా తలెత్తిన వివాదంతో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోడ్డు నిర్మించేందుకు ఇటు జిల్లా యంత్రాంగం పట్టుబడుతుండగా స్థానికులు తమ భూమిని కాపాడుకోవడానికి ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు కాసీపూర్లోని ప్రభావిత గ్రామాలో విస్తృతంగా పర్యటించి తమ సానుభూతిని గ్రామస్తులకు తెలపడంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతున్నారు. మరో వైపు పోలీసుల దురుసు ప్రవర్తనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలొ శుక్రవారం రాష్ట్ర పీసీసీ అధినేత భక్తచర ణ్ దాస్ ఆదేశాను సారం 13 మందితో కూడిన కాంగ్రెస్ సభ్యుల బృందం కంటమాల్ గ్రామంలో పర్యటించింది. కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల క నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తారాప్రసాద్ బాహిని పతి, సురేంద్ర రౌత్రాయ్, మీనాక్షి బాహిని పతి, ఎమ్మెల్యే రామచంద్ర కడమ్, రాయగడ ఎంఎల్ఏ, డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎంఎల్ఏ సత్యజీత్ గొమాంగో, మాజీ ఎంపి యశ్వంత్ నారాయన్ సింగ్ లగురి, మాజీ ఎంఎల్ఏ భజ్బల్ మాఝి, రత్నమణి ఉలక తదితర సీనియర్ నాయకులతో కూడిన బృందం గ్రామంలో పర్యటించి స్థానికుల తో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక నివేదికను పీసీ అధ్యక్షుడికి సమర్పించనున్నారు. ఏది ఏమైనప్పటికీ కంటమాల్లొ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయనడంలో ఏమాత్రం అతశయోక్తి కాదు. -
11 కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ 38వ సమావేశం లోక్ సేవా భవన్లో శుక్రవారం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి మండలి కీలక తీర్మానాల వివరాలను ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ మీడియాకు వివరించారు. మంత్రి మండలి ఆమోదం కోసం 5 శాఖలు 11 ప్రతిపాదనలు ప్రవేశ పెట్టాయి. ప్రధాన ప్రతిపాదనలలో పార్వతీ గిరి మెగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో భాగంగా రూ. 626 కోట్ల వ్యయ ప్రణాళికతో హదువా ప్రాజెక్ట్ పథకానికి మంత్రి మండలి ప్రాధాన్యత కల్పించింది. సోన్పూర్, సంబల్పూర్, జాజ్పూర్, కెంజొహర్, మయూర్భంజ్, కటక్ లబ్ది పొందుతాయి. మెట్ట, కరువు పీడిత ప్రాంతాల్లో పంటల వైవిధ్యీకరణ (వాణిజ్య పంట లు) ప్రోత్సాహానికి సూక్ష్మ నీటిపారుదల సౌకర్యా లు అందుబాటులోకి తెస్తారు. అటల్ బస్ స్టాండ్ పథకం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో రూ. 3,400 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రతిష్టాత్మక అటల్ బస్ స్టాండ్ పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2031–32 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకీకృత నిర్వహణ కింద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, సబ్ డివిజన్లు, మండలాలు, పట్టణ స్థానిక సంస్థలు, పర్యాటక కేంద్రాల్లో బస్ స్టాండ్ల ఆధునీకరణ పూర్తి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రాధాన్యతకు అనుగుణంగా ఎ, బి, సి తరగతులుగా వర్గీకరించి బస్ స్టాండ్లలో ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఉభయ వర్గాలకు అవకాశం కల్పించేందుకు మంత్రి వర్గం అంగీకరించింది. 318 బస్టాండ్ల ఉన్నతీకరణ.. రాష్ట్ర వ్యాప్తంగా 318 బస్ స్టాండ్లను ఉన్నతీకరించనున్నారు. ఈ చర్య ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, రవాణా అనుసంధానా న్ని బలోపేతం చేస్తుందని మంత్రి మండలి అభిప్రాయపడింది. మౌలిక సదుపాయాల పెంపు.. రాష్ట్రంలో అత్యంత ఖనిజ సంపద కలిగిన ప్రాంతాలలో అధిక విద్యుత్ వినియోగం గల అనేక భారీ పరిశ్రమలకు కేంద్రంగా వెలుగొందుతున్న జోడా, బర్బిల్, పలాస్పంగ్ ప్రాంతంలో ఉన్న గ్రిడ్ సబ్–స్టేషన్లు ప్రస్తుతం గరిష్ట సామర్థ్యంతో పని చేస్తున్నాయి, అదనపు మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కెంజొహర్ జిల్లా బాసుదేవ్పూర్లో అనుబంధ ట్రాన్స్మిషన్ లైన్లతో పాటు జీఐఎస్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. రూ. 1,647.00 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును ఓపీటీసీఎల్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 494.10 కోట్ల 30 శాతం ఈక్విటీ మద్దతు కల్పిస్తుంది. కార్మిక సేవా నిబంధనలకు సవరణ.. ఒడిశా కార్మిక సేవా (నియామక విధానం, సేవా నిబంధనలు) నియమావళి, 2019 సవరణలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మార్పుల ప్రకారం 2019లో ఈ నియమావళి అమల్లోకి రాకముందు నియమితులైన సహాయ కార్మిక అధికారు లు, గ్రామీణ కార్మిక ఇన్స్పెక్టర్లకు శాఖాపరమైన పరీక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. కటక్ మండలాల కోసం నీటిపారుదల ప్రాజెక్ట్.. కటక్ జిల్లాలోని నరసింహపూర్, బొడొంబ, టిగిరి యా మండలాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న హదువా నీటిపారుదల ప్రాజెక్టుతో కరువు పీడిత ప్రాంతాల్లోని 3,641 హెక్టార్ల సాగు భూమికి హామీతో కూడిన నీటిపారుదల అందించేందుకు ఖరోడ్ గ్రామం సమీపంలో హదువా నదిపై ఒక జలాశయంతో పాటు పంపిణీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. హదువా డ్యామ్ నిర్మాణం ఇప్పటికే పురోగతిలో ఉంది. -
ఘనంగా సీఆర్పీఎఫ్ శౌర్య దివాస్
కొరాపుట్: కేంద్ర రక్షణ దళాలలో ఒకటైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 61వ శౌర్య దివాస్ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో జానకీనగర్లో 12వ బెటాలియన్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం సమీపంలో మవుళీ గ్రామానికి చెందిన విజయ్కుమార్ హరిజన్ 2009 ఏప్రిల్ 16న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులతో పోరాటం చేస్తూ అమరుడయ్యాడు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులైన హేమలత్ హరిజన్, బుధన్ హరిజన్లను బెటాలియన్ ఆహ్వానించి గౌరవ సత్కారం చేశారు. కార్యక్రమంలో కమాండెడ్ ఎన్కేకే ప్రసాద్, డిప్యూటీ కమాండెడ్ రాజీవ్కుమార్, అసిస్టెంట్ కమాండెడ్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ సుజిత్ కుమార్, పీకే సాహు, సబ్ ఇన్స్పెక్టర్ బంద్ నామ్దేవ్ పాల్గొన్నారు. -
22 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పోలీసులు 22 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొరాపుట్ నందపూర్ సమితి పాడువా పోలీస్స్టేషన్ ఆవరణలో ఎస్డీపీవో దేవేంద్ర కుమార్ మాలిక్ కేసు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దేవతీగుడ అటవీ ప్రాంతంలో దాడులు చేపట్టామన్నారు. రవాణా కోసం సిద్ధంగా 180 బస్తాల్లో ఉంచిన గంజాయిని తమ సిబ్బంది గుర్తించరన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీస్స్టేషన్కి తరలించి తూకం వేయగా 22 క్వింటాళ్లు ఉందన్నారు. దీని విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని ప్రకటించారు. మెజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేసి కోర్టుకి నివేదించామన్నారు. గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపులు చేస్తున్నామని ఎస్డీపీవో ప్రకటించారు. -
510 కిలోల గంజాయిని స్వాధీనం
పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ గోయిబడి ఏజెన్సీలో గురువారం తెల్లవారుజామున సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు తన బృందంతో జరిపిన దాడుల్లో 17 సంచుల్లో గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో దాచిన 510 కిల్లోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్.డి.పి.ఓ రాకేష్ సాహు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్లో రూ.50 లక్షలు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలియజేశారు. -
చేనేత క్లస్టర్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పొందూరు: చేనేత క్లస్టర్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ మీనా అపనేందర్, డిజైనర్ గౌరంగ్షా అన్నారు మండలంలోని రాపాక కూడలి సమీపంలో గల 310 సర్వే నంబర్లో ఉన్న ఐదు ఎకరాల్లో చేనేత క్లస్టర్ ఏర్పాటు గురువారం స్థలాన్ని పరిశీలించారు. చేనేత క్లస్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా అధునాతన డిజైన్ల తో చేనేత వస్త్రాలను రూపొందించడంతో మార్కెటింగ్ విస్తృతమవుతుందని అన్నారు. స్థల పరిశీలన చేసిన వారిలో ఆర్కిటిక్ నీలేష్, రీసర్వే డీటీ రాధాకృష్ణ, మండల సర్వేయర్ గణపతి, ఈఓ పొన్నాడ జగదీష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలిక హత్యపై ఆరా హిరమండలం: జిల్లాలో ఇటీవల జరిగిన గిరిజన బాలిక హత్యపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ కె.హరిబాబు గురువారం ఆరా తీశారు. ఈ కేసులో నిందితుడు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక తహసీల్దార్ బాలకృష్ణతో పాటు పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సైతం పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రేమసాయి వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ హరిబాబు సందర్శించారు. ఆశ్రమవాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయసంబంధ సమస్యలు ఉన్నా, ప్రభుత్వ పథకాలు అందకపోయినా, పింఛన్లు అందకపోయినా విన్నవించాలని కోరారు. అనధికార ర్యాంప్పై దాడులు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కిల్లిపాలెం పరిసర ప్రాంతం కలెక్టరేట్ సమీపంలో గల నాగావళి నదీ తీరాన గడిచిన కొన్ని నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న అనధికారిక ఇసుక ర్యాంప్పై జిల్లా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ సి.మోహన్రావు నేతృత్వంలో గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక జేసీబీతో పాటు ఒక ట్రాక్టర్ను మైన్స్ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం పరిధిలోని ఎవరైనా అనధికారికంగా ఇలాంటి ర్యాంప్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా యంత్రాంగం ఇచ్చిన అనుమతులు మేరకు మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, వాల్టా చట్టాన్ని అధిగమించకూడదన్నారు. ‘పనుల్లో జాప్యం వద్దు’శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఎంపీ లాడ్స్ నిధులు ప్రతి పైసా సద్వినియోగం కావాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 17, 18వ లోక్సభ ఎంపీ లాడ్స్ నిధుల సమీక్షలో ఆయన పాల్గొని, నిధుల వినియోగంపై శాఖల వారీగా విశ్లేషణ చేశారు. పనులు పూర్తయిన వెంటనే వాటికి సంబంధించిన ఫొటోలను ‘ఈ–సాక్షి’ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, అప్పుడే నిధుల విడుదల వేగవంతం అవుతుందని అధికారు లను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖలో ఇంకా 76 పనులు, విద్యుత్ శాఖలో 42 పనులు పెండింగ్లో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కార్యనిర్వాహక ఇంజినీర్లను ఆదేశించారు. ‘పోషణ్ పక్వాడాను విజయవంతం చేయండి’ శ్రీకాకుళం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 వరకు నిర్వహించనున్న పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐసీడీఎస్ పీడీ కె.రూపలత పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోగల ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా రూపలత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈనెల 9వ తేదీ నుంచి 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని అందరు అంగన్వాడీలు చేపట్టేలా చూడాలన్నారు. రాపాక కూడలి సమీపంలో చేనేత క్లస్టర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు మాట్లాడుతున్న రూపలత -
బంగారు ఆభరణాల చోరీ
రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్స్టేషన్ పరిధి హటొ దైహికాల్ గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యాపారి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి కత్తులు, మరణాయుధాలతో బెదిరించి ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు, పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఆరుగురు గుర్తు తెలియని దుండగులు అజిత్ సాహుకార్ అనే వ్యాపారి ఇంటికి సంబంధించిన ఇనుప గ్రిల్ను కట్ చేసి లోపలకు వెళ్లారు. మాస్కులు, గ్లౌవ్స్ ధరించిన దుండగులను చూసిన అందరూ లేచి కేకలు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో దుండగులు ఇంట్లో ఒకరి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. అనంతరం ఇంట్లోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దోచుకున్నారు. కేసు నమోదు చేసిన ఐఐసీ కేశవ్షడంగి పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. -
రంగస్థలం సిద్ధం
● నేటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి బాపూజీ కళామందిర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బాపూజీ కళామందిర్ వద్ద ఏర్పాట్లు చేశారు. ● రాత్రి 7 గంటలకు శివశ్రీ నృత్య కళానికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శన. ● 7.30 గంటలకు హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ప్రదర్శన. ● 9 గంటలకు పెందుర్తికి చెందిన నటరాజ డ్రమోటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘నీళ్లు– నీళు’ సాంఘిక నాటిక. ● 11న 7గంటలకు విశాఖపట్నం వారికి చెందిన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ‘చిటికెన వేలు’ నాటిక. ● 8.30 గంటలకు విజయవాడకు చెందిన శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ‘మరో పుత్తడి బొమ్మ’ నాటిక. ● 12న 6గంటలకు ఎల్.రామలింగస్వామికి జీవితి సాఫల్య పురస్కార సభ. ● 7.30 గంటలకు కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘కన్నీటికి విలువెంత’ నాటిక ప్రదర్శిస్తారు. ● 9గంటలకు విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు పోటీలు ప్రదర్శిస్తారు. ఆనంతరం ముగింపు సభ, బహుమతి ప్రధానోత్సవం ఉంటాయి. -
ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం
భువనేశ్వర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ గురువారం ఆకస్మికంగా స్థానిక మైత్రి విహార్లోని విద్యుత్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం సందర్శించారు. ఇటీవల ఈ కార్యాలయంలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు వెలుగు చూడడంతో ఆయన విజిలెన్స్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3.15 గంటలకు సందర్శించిన వేళలో కార్యాలయంలో ఏ ఉద్యోగి కనిపించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరు సిబ్బంది వ్యతిరేకంగా తక్షణ చర్యకు ఆదేశాలు జారీ చేశారు. -
నేడు కాంగ్రెస్ బృందం పర్యటన
రాయగడ: కాసీపూర్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కాంగ్రెస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం శుక్రవారం పర్యటించనుంది. పి.సి.సి అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీని కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో మాజీ మంత్రి సురేష్ కుమార్ రవుత్రాయ్, ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణిపతి, గునుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సావుంత, మంగుఖిలి, మాజీ ఎంపీ యశ్వంత్ సింహ్ లగురీ, బుజబల్ మాఝి, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణిపతి, రత్నమణి ఉలక, అమిత బిశ్వాల్ ఉన్నారు. సగుబారి, కంటమాల్ గ్రామాల ప్రజలతో సమావేశమై వివరాలను సేకరిస్తారు. చెట్లు నరికితే చర్యలు తప్పవు మల్కన్గిరి: మల్కన్గిరి సమితి ఎంవీ 109 గ్రామ సమీప అడవిలో బుధవారం రాత్రి కొంతమంది గ్రామస్తులు అటవీ శాఖ అనుమతి లేకుండా 20 చెట్లు నరికివేశారు. అయితే గురువారం ఈ విషయం తెలుసుకున్న ఫారెస్టర్ అడవిని చూసి విచక్షణారహితంగా చెట్లు నరికివేసిన గ్రామస్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్గిరికి చెందిన సురేంద్ర కుమార్ బేమల్ అనే వ్యక్తి అటవీ శాఖ అనుమతి లేకుండా తన సొంత భూమి పనులు కోసం గ్రామాస్తులు కొందరి సాయంతో చెట్లను నరికించాడు. వాటిలో ప్రభుత్వ భూములకు చెందిన కొన్ని చెట్లు ఉన్నాయి. సమాచారం రావడంతో ఫారెస్ట్ గార్డు ప్రశాంతి రౌత్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక వ్యక్తి తన సొంత పనులు కోసం ఇలా చెట్లు అవసరమైతే ముందుగా అటవీ శాఖకు ఒక లేఖను రాయలని సూచించారు. బైక్ చోరీ నిందితుడు అరెస్టు మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బెజంగివాడ పంచాయతీలో నివసిస్తున్న సహదేవ్ సాహు అనే ఉపాధ్యాయుడి బైక్ను దొంగలించిన వ్యక్తిని కలిమెల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బెంగంగ్వాడ పంచాయతీలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయుడు సహదేవ్ గత ఆదివారం తన బైక్ను ఇంటిముందు పార్క్ చేశాడు. అయితే ఆ బైక్ను దొంగలించారు. దీంతో సోమవారం ఉదయం కలిమెల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఐఐసీ ప్రభుదత్ విశ్వాల్ కేసు నమోదు చేసి దర్యాస్తు చేపట్టారు. దీంట్లో భాగంగా బెంజంగవాడ గ్రామానికి చెందిన డి.ప్రకాశరావు అనే వ్యక్తి ఈ దొంగతనం చేసినట్లు తేలుసుకొని, బైక్, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామన్నారు. -
నిర్మానుష్యంగా కంటామాల్
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ పరిధిలో పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ పలు గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలను విడిచి వేరే ప్రాంతంలో తలదాచుకునేందుకు వెళ్లడంతో నిర్మానుష్యంగా మారాయి. సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేదంత కంపెనీకి అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో బాకై ్సట్ను తవ్వి తరలించేందుకు వీలుగా సగుబారి నుంచి సిజిమాల్ బాకై ్సట్ కొండల వరకు కంపెనీ రహదారి నిర్మిస్తున్న సమయంలో అడ్డుకున్న బాధిత గ్రామాల ప్రజలు పోలీసులపై రాళ్లురువ్వడంతో 58 మంది వరకు పోలీసులు గాయాలపాలైన సంగతి తెలిసిందే. పోలీసులను గాయపరచడంతో ఎప్పుడు ఏ పరిస్థితి సంభవిస్తుందో అన్న భయంతో గ్రామస్తులు తమ ఇళ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. సమితిలోని కంటామల్ గ్రామంలో సుభాషిన్ మాఝి అనే వ్యక్తిపై 14 కేసులు ఉండటంతో అమెను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారం రాత్రి బలగాలతో చేరుకున్నారు. సుభాషిన్ మాఝిని అరెస్టు చేసందుకు సన్నహాలు చేశారు. అప్పటికే గ్రామస్తులను పోలీసులు బెదించడంతోపాటు కొంతమంది గ్రామస్తులను గాయపరిచారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి నుండి పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. మరుచటి రోజు మంగళవారం పూర్తి పోలీస్ బందోబస్తుతో సగుబారి రహదారిని వేసేలా కంపెనీకి అండగా నిలిచారు. ఆది నుంచి తమ ప్రాంతంలో బాకై ్సట్ నిక్షేపాలను తవ్వద్దని, దీని వల్ల పర్యావరణం నష్టమవ్వడంతోపాటు అడవి తల్లినే నమ్ముకుని ఉన్న ఆదివాసీల జీవనోపాధి కోల్పోతారని అంతా వ్యతిరేకించారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు మరణాయుధాలతో ప్రతిఘటించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ను విడుదల చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలసులపై గ్రామస్తులు రాళ్లు రవ్వడంతో 58 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు దక్షిణాంచల్ డీఐజీ చరణ్ సింగ్ మీనా కాసీపూర్లో మంగళవారం పర్యటించారు. -
కంటామాల్లో బీజేడీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్లో మంగళవారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బీజేడీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ గురువారం సమితిలోని కంటామాల్ గ్రామంలో పర్యటించింది. మాజీ మంత్రులు జగన్నాథ సరక, రవినారాయణ నందొ, సీనియర్ నాయకుడు రమేష్ చంద్ర ప్రతాప్ స్వాయి, మాజీ ఎంపీ జిన్ను హికక, అనసూయా మాఝి లతో కలిసి పది మందితో కూడిన బృందం గ్రామస్తులతో సమావేశమైంది. సగుబారి నుంచి సిజిమాలి వరకు వేదంత కంపెనీ నిర్మిస్తున్న రహదారిని అడ్డుకున్నందుకు గ్రామస్తులు, పోలీసుల మధ్య జరిగిన దమన కాండకు సంబంధించి పూర్తి వివరాలను గ్రామస్తుల ద్వారా కమిటీ తెలుసుకుంది. సుమారు మూడు గంటల పాటు గ్రామస్తులతో సమావేశమైన కమిటిటీ అసలు ఈ సంఘటన ఎదురవ్వడానికి గల కారణాలను పరిశీలించింది. అనంతరం సగుబారిలో పర్యటించిన బృందం అక్కడి ప్రజలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక మాట్లాడుతూ.. కాసీపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి విముక్తి లభించాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం బాధిత గ్రామాలకు చెందిన ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేలా వారితో మరొసారి మంతనాలు చేయాలన్నారు. అంతేగాని పోలీసుల దుశ్చర్యలతో గ్రామస్తులను భయపెట్టే విధంగా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు. బాధిత గ్రామాల్లో సిజిమాలి బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి గ్రామ సభలను నిర్వహించాలని సూచించారు. ప్రజల అనుమతితోనే ఏదైన వికాశం చెందుతుందన్నారు. తమ బృందం సమీకరించిన నివేదికను బీజేడీ సుప్రీంకు అందజేస్తామన్నారు. -
ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
జయపురం: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైనంత ఎరువులు సమకూర్చే విషయంపై చర్చించేందుకు గురువారం వ్యవసాయ అధికారులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు ఎరువులు కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ ఎరువుల విక్రేతగా నియమించిన మార్క్ఫెడ్, ప్రాంతీయ సహకార మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జయపురం ప్రధాన వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ ధళబెహర అధ్యక్షతన జరిగిన సమావేశంలో రానున్న ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ధాన్యం రైతులకు అవసరమైన యూరియా, పొటాస్, తదితర ఎరువులు ఎలా సమకూర్చాలన్న దానిపై చర్చించారు. గత ఏడాది యూరియా కొరత ఏర్పడిన విషాయాన్ని గుర్తుచేసిన అధికారులు, ఈ ఖరీఫ్ సీజన్లో అటువంటి పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఎరువుల కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఎరువుల విక్రేతలు.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకే ఎరువులు అమ్మాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సహకార విభాగం డిప్యూటీ రిజస్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్, మనోస్ రాయ్, జయపురం సహాయ వ్యవసాయ అధికారి లలిటేందు మహాపాత్ర, నందపూర్ వ్యవసాయ విభాగ సహాయ అధికారి సుజాత నిశంకొ, కొరాపుట్ వ్యవసాయ అధికారి కహ్నూచరణ దాస్, ఎరువుల సరఫరా విభాగ అధికారి సంగీత బెహరా, తదితరులు పాల్గొన్నారు. ఎరువులు నల్ల బజారుకు వెళ్ల కుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ విభాగ అధికారి సంబంధిత వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు అమ్మే సమయంలో రైతుల గుర్తింపు కార్డులు పరిశీలించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అమ్మాలని, ఎరువులు నిల్వ ఉంచేందుకు గొదాంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
రైల్వే ప్రాజెక్టు బాధితులకు పరిహారం చెల్లింపు
జయపురం: జయపురం–నవరంగపూర్, జయపురం–మల్కనగిరి రైల్వే ప్రాజెక్టుల వలన ప్రభావితులైన బాధితులకు నష్ట పరిహారం అందజేసేందుకు గురువారం సభ నిర్వహించారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి జేఝారి గ్రామంలో నిర్వహించిన నష్టపరిహార ప్రధాన కార్యక్రమంలో నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు బలభద్ర మఝి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జయపురం– నవరంగపూర్, జయపురం–మల్కనగిరి రైల్వే ప్రాజెక్టులు ఆదివాసీల అభ్యున్నతి, నవరంగపూర్, కొరాపుట్, మల్కనగిరి జిల్లాల ప్రజల ఆర్థిక, సామాజిక ప్రగతికి దోహదపడతాయని ఎంపీ అన్నారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్టల వలన జయపురం సబ్డివిజన్లో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ,, కుంద్రా సమితుల్లో భూములు కోల్పోయిన బాధిత ప్రజలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటి విడత 30 మంది బాధిత కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.15 కోట్లను ఎంపీ, అతిథులు అందజేశారు. జయపురం నుంచి నవరంగపూర్, జయపురం నుంచి మల్కనగిరి కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసం 700 హెక్టర్ల భూమి సేకరించటం జరుగుతుందని సూచన ప్రాయంగా వెల్లడించారు. మిగతా వారికి త్వరలోనే పరిహారం చెల్లించటం జరుగుతుందని ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, బొరిగుమ్మ పంచాయతీ సమితి అధ్యక్షుడు దీప్తి మయి నాయక్, రైల్వే, రెవెన్యూ అధికారులు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రైల్వే ప్రాజెక్టుల వలన భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు బలభధ్ర మఝికి ప్రజలు, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. -
అమృత్ భారత్ బోగీలు
సరికొత్త సొబగులతో ..భువనేశ్వర్: రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అమృత్ భారత్ రైలు బోగీలు సరికొత్త సొంపులతో ప్రత్యక్షం కానున్నాయి. ఆకట్టుకునే రంగుల మేళవింపుతో ప్రతిపాదిత అంతర్గత డిజైన్ నమూనా కోచ్ సిద్ధమైంది. పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రెక్సిన్, స్నాక్ టేబుల్స్, కర్టెన్లు, లావెటరీ ప్రాంతాలు వంటి కీలక భాగాలలో సమన్వయ రంగులను పొందుపరిచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ బోగీలను విభిన్నమైన అంతర్గత రంగుల థీమ్లతో అమర్చారు. ప్రయాణికుల అధిక స్థాయి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన రూపకల్పనలో వీటిలో హెచ్ఎల్ 3 అగ్ని మాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సామగ్రి వినియోగించారు. -
తాగునీటి పైపు దొంగతనం
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీసులు తాగునీటి పైపుల దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 80 ఇనుప పైపులతో సహ మినీ వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిలో కలహండి జిల్లాకు చెందిన పరిమిల్ బిశి, మిధున్ రాణాల ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని డంగసొరడ, హనుమంత్పూర్, బిసంకటక్, అంబొదల, చంద్రపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ స్టాకు గమనించి ఒక పథకం ప్రకారం చోరీ చేస్తున్నారు. బుధవారం రాత్రి తుముడిబొంధొ, భవాణీపట్నం రహదారి గుండా పైపులను పశ్చిమ బెంగాల్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి డంగసొరడ వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. మునిగుడ ఐఐసీ కేశవ్ షడంగీ నేతృత్వంలొ ఈ దాడులు చేపట్టారు. -
80 అడుగుల లోతులో జారిపడిన ట్రక్కు
జయపురం: జయపురం– కొరాపుట్ 26వ జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో బుధ వారం రాత్రి ట్రక్కు బ్రేక్ ఫైల్ అయి అదుపుతప్పి ప్రమాదానికి లోనైంది. ట్రక్కు జయపురం వైపు వస్తూ బ్రేక్ ఫెయిల్ కావటంతో ఘాట్ రోడ్డు రక్షణ గోడపై నుంచి 80 అడుగుల కిందకు జారిపడింది. ట్రక్కు డైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందిన జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటన ప్రాంతానికి చేరి అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 80 అడుగుల లోతున పడి న ట్రక్కును తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ట్రక్కు డ్రైవర్ను వెంటనే జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. ఒడియా సాహిత్యం, చరిత్ర పుస్తకాల విక్రయాలు పర్లాకిమిడి: ఒడియా సాహిత్యం, చరిత్ర, ప్రబంధాలు, కవితల పుస్తకాల సంపుటాలు స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిపారు. ఒడియా దివాస్ పక్షోత్సవాలు సంధర్బంగా స్థానిక రచయితలు, కవులే కాక భువనేశ్వర్ నుంచి ప్రింట్అయి వచ్చిన పుస్తకాలు కూడా స్టాల్లో అమ్మకాలు జరిపారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మునీంద్ర హానగ, జిల్లా అబ్కారీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ సాహు, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్లు కూడా పాల్గొని ప్రోత్సహించారు. ‘శాంతి నెలకొల్పాలి’ రాయగడ: పోలీసులు, ఆదివాసీల మధ్య జరిగిన దమనకాండలో ఇటు పోలీసులు అటు ఆదివాసీలు కూడా గాయాలపాలయ్యారని, ఈ పరిస్థితిని అధిగమించి కాశీపూర్లో శాంతియుతమైన వాతావరణం నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. ఆయన కాశీపూర్లో జరిగిన ఘటనకు సంబంధించి సొషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి వేళ కాకుండా ఉదయం గ్రామానికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ఈ గొడవ జరిగి ఉండేది కాదన్నారు. ఆదివాసీలపై పోలీసుల అమానుష ప్రవర్తనను ఆయన ఖండించారు. నియమనిబంధనల ప్రకారం కాశీపూర్లో గల ఖనిజ నిక్షేపాలను తవ్వుకుంటే ఏ సమస్యా ఎదురయ్యేది కాదన్నారు. ప్రజల అభిమతం తెలుసుకోకుండా వ్యవహరిస్తే వారి నుంచి ఇలాంటి తరహా ప్రతిఘటనలే ఎదురవుతాయన్నారు. వచ్చే వారం నుంచి ఉక్కపోత భువనేశ్వర్ : భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ నెల 12 నుంచి 14 తేదీల మధ్య రాష్ట్రంలో తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాల వైశాఖి ప్రభావం గురువారం నుంచి బలహీనపడుతంది. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొనడం ప్రారంభం అవుతుంది. రాగల 2 రోజులు పగటి ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతాయి. తదుపరి రాబోయే రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రత 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ సమయంలో ముఖ్యంగా ఆరుబయట పని చేసే కార్మికులు, వృద్ధులు, పిల్లలతో సహా ప్రజలు అధిక సమయం ఎండలో ఉండకుండా తరచూ తగినంత నీరు తాగుతూ ఉండాలని భారత వాతావరణ శాఖ కోరింది. -
లక్ష్యం కోసం
లాభం కోసం కాదు..● విద్యాసేవలో తనదైన మార్క్ చాటుకుంటున్న శంకరరావు ● తక్కువ ఫీజుతో అడ్మిషన్లు ● 10 మంది పేదలకు ఉచిత వద్య రాయగడ: పేదరికంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి.. సమాజానికి వెలుగునిచ్చే విద్యాసేవలో తనదైన మార్క్ను చాటుకుంటున్నారు ప్రముఖ విద్యా సేవకుడు బుడ్డా శంకరరావు. ఉపాధి అవకాశాలు ఎన్నో వచ్చినప్పటికీ వాటిని కాదని విద్యారంగంలో స్థిరపడ్డారు. దీనిలో భాగంగా స్థానిక కస్తూరీనగర్లో 2007లో పది మంది పిల్లలతో మదర్ థెరిస్సా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో ఉత్తమ విలువలతో కూడిన విద్యా బోధన అందించడంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరిగి పదో తరగతి వరకు చేరుకుంది. నర్సరీ నుంచి ప్రారంభమైన పాఠశాల నేడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో సదరు సమితి పరిధి కొత్తపేట పంచాయతీ కొల్లిగుడ వద్ద 2017లో మదర్ థెరిస్సా టెక్నో స్కూల్ పేరిట మరో బ్రాంచ్ ప్రారంభించారు. ఆదివాసీలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో వారి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఫీజులు తీసుకుంటూ విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా పది మంది విద్యార్థులను ఉచితంగా తమ పాఠశాలలో చదివిస్తూ అవసరమైన విద్యా సామగ్రి సమకూరుస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే సమయాన్ని వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. తమ విద్యాసంస్థల్లో సుమారు 60 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. విద్యను వ్యాపార దృక్పథంతో చూడకుండా.. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్కు దిశా నిర్దేశం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో తనతో పాటు తన సోదరుడు సంతోష్ కుమార్ చేదోడుగా వ్యవహరిస్తుండడంతో సంస్థ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ ట్రస్టుకు కార్యదర్శిగా తన సోదరుడు విధులు నిర్వహిస్తుండడం తన విజయానికి మరో కారణంగా వివరించారు. త్వరలో ఇంటర్మీయడిట్ తరగతులు మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా మరో మైలురాయిని చేరుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రస్టు ఎండీ శంకరరావు తెలియజేశారు. ప్లస్ –టూ సైన్స్, ఆర్ట్స్ తరగతులను త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లతో ప్రారంభమవ్వనున్న ఈ తరగతుల్లో జేఈఈ, ఎన్ఐఐటీ, ప్రొఫెషనల్, అడ్వాన్స్డ్ కోర్సుల శిక్షణ కూడా కల్పించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఏడాది జూన్లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
సెంచూరియన్ వర్సిటీలో ఆరోగ్య పరీక్షలు
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగాభ్యాసాలు, కంటి పరీక్షలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి డాక్టర్ సన్యాసి బెహరా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సన్యాసి బెహారా, డీన్ డాక్టర్ సుశాంత్ కుమార్ పట్నాయిక్, పర్లాకిమిడి డిప్యూటీ సూపరింటెండెంటు (సైబర్విభాగం) సరితా బెవురియా, సంజయ్కుమార్ పాఢి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కంటి పరీక్షలు కూడా చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, డీన్ సుశాంత్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఆడిటోరియంలో గురువారం సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల విముక్తిపై ఒక కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి డాక్టర్ సన్యాసి బెహరా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారి ప్రశాంత భూపతి, సబ్డివిజనల్ పోలీసుఅధికారి మాధవాన ంద నాయక్, గురండి హెల్త్ విస్తరణాధికారి మమతా పాఢి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, డీన్ ఎస్పీ నందా తదితరులు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్డీపీఓ మాధవానంద నాయక్ సూచించారు. అలాగే సైబర్ నైరాలు, ఇతర ఆర్థిక మోసాలపై పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలని, దీనికై ప్రత్యేక సెల్ ఏర్పాటుచేశామని ఐఐసీ ప్రశాంత భూపతి అన్నారు. కార్యక్రమంలో బరంపురం విశ్వవిద్యాలయం, విక్రందేవ్ వర్సిటీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. -
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి
కొరాపుట్: చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ సమితి కుర్సి గ్రామ పంచాయతీ ఉప్పరపొడ గ్రామంలో రాజ్ మాన్ గొండో ఇద్దరు కుమార్తెలు ఆధార్ గొండొ (6), సంజితా గొండొ (5), బాల్ సాయి గొండొ కుమార్తే ఫలాల్ గొండొ (7)లు మృతి చెందారు. వీరంతా సమీప ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నారు. ఉదయం 11 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. అనంతరం సమీప చెరువులో స్నానానికి వెళ్లి మునిగిపోయారు. గమనించిన మిగతా పిల్లలు ఇళ్లకు వెళ్లి పెద్దలకు చెప్పారు. వారు వచ్చి నీటి నుంచి వెలికి తీసి సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే వీరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బంధువులు కావడంతో గ్రామం రోదనలతో మునిగి పోయింది. -
విద్యార్థుల్లో సేవా దృక్పథం ఉండాలి
రాయగడ: విద్యార్థి దశ నుండే సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని స్థానిక అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ అన్నారు. బుధవారం కళాశాలలొ యువరెడ్ క్రాస్, ఎన్సీసీ, జాతీయ సేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు స్వ చ్ఛందంగా పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 23 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందించారు. -
దోపిడీ దొంగల దారెటు..?
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా మంగళవారం పట్టపగలు బంగారం దుకాణంలో దోపిడీ దొంగలు చొరబడి భయానక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. తనకు చూపించిన గన్ ఒరిజినల్దేనని షాపు యజమాని చెప్పడం గమనార్హం. షాపు ఓనరైన కిల్లంశెట్టి రామకృష్ణారావు నుంచి దుండగులు మంగళవారం మొబైల్ఫోన్ ఎత్తుకు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గా ల సమాచారం. టవర్ డంప్ లొకేషన్ ఆధారంగా విజయనగరం బొబ్బిలి దగ్గర ఒకసారి చూపించగా మరోసారి రాయపూర్ వద్ద సిగ్నల్స్ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి మంగళవారం గారబంద మీదుగా లూప్ మార్గాల్లో దుండగులు పర్లాఖిముడి (ఒడిశా) చేరి అక్కడి నుంచి బొబ్బిలి, సాలూరు ఘాట్రోడ్డు మీదుగా చత్తీస్గఢ్ చేరి రాయపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చిన వారు హిందీ భాషలో ఎక్కువగా మాట్లాడటంతో పక్కా గా మహారాష్ట్ర గ్యాంగ్ లేదంటే బీహార్ గ్యాంగు పనేనని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగుల్లో బంగారం ఎత్తుకుపోయిన కొందరు ఒకవైపు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన వారు మరో వైపు వెళ్లి పోలీసులకు రాంగ్ డైవర్షన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూ డా 3 చోట్ల చోరీలు జరిగాయి. పాత జాతీయ రహదారికి ఆనుకుని మంకినమ్మ చికెన్, మటన్ సెంటర్, డెకరేషన్ సాపు, రైల్వేస్టేషన్ దారిలో చోరీలు జరిగాయి. ఇటీవల కాలంలో 3 మెడికల్స్టోర్స్లో దాదాపు రూ. 4 లక్షల వరకు చోరీకి గురైనా పోలీసులు రికవరీ చేయలేకపోయారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. లక్ష్మీస్వీటుషాపులో సైతం రూ. 1.20 లక్షలు నగదు దొంగిలించారు. ‘పక్కా ప్లాన్తోనే వచ్చారు’ పలాస: దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారని, దేవు డి దయ వల్ల తన ప్రాణాలు మిగిలాయని కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్ షాపు యజ మాని కిల్లం శెట్టి రామకృష్ణారావు అన్నారు. ఆయన బుధవారం తన ఇంటి వద్ద భార్య లలిత, అతను అక్కడకు వచ్చిన వారితో జరిగిన సంఘటన గురించి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారన్నారు. హిందీలో ఏదేదో చెప్పారని, ఆ తర్వాత రెండు చేతులకు బేడీలు వేశారు. మొత్తం బంగారం దోచుకు పోయారని, తన మెడలో ఉన్న గొలుసు కూడా తీసుకుపోయారని, అంతా ఒక్క 5 నిమిషాల్లో జరిగిపోయిందని తెలిపారు. ఆయనను మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు బుధవారం పరామర్శించారు. దొంగతనం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, తాజా మాజీ కౌన్సిలరు బెల్లాల శ్రీనివాసరావు, పెంట రత్నాకర్, బోర బుజ్జి, బత్తిన హేమేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
● బాలికలకు ఈతపై శిక్షణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా యంత్రగం తరఫున బండాబాకులి చెరువు వద్ద బాలికలకు ఈత, ప్రాణ రక్షణ నైపుణ్యాల శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే బుధవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల భద్రత, శక్తివంతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు . ఈత కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఆపద సమయంలో ప్రాణ రక్షణకు దోహదపడుతోందన్నారు. ఈ శిక్షణ బాలికల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్ాధ్యన్ని కలిగిస్తుందని కలెక్టర్ అన్నారు. శిక్షణలో ఓడ్రాఫ్ బృందానికి చెందిన 20 మంది అనుభవజ్ఞులైన శిక్షణదారులు 30 మంది బాలికలకు ఏడు రోజులు శిక్షణ ఇస్తారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధన్, మల్కన్గిరి ఎస్డీపీవో దివ్యజ్యోతి దళై, డిప్యూటీ కలెక్టర్ దీప్తి రంజన్ సాహు ఉన్నారు. -
● క్రికెట్ టోర్నీ ప్రారంభం
జయపురం: జయపురం స్టేడియం గ్రౌండ్లో బుధవారం క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. జయపురం ఈవినింగ్ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ లీగ్ను జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ (ఐపీఎస్) ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆటలు మనోవికాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహద పడతాయన్నారు. యువత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండు మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో జగన్నాథ్ సూపర్ జియాండ్ ధల్, బ్రాండెడ్ వాయిస్ జట్లు తలపడ్డాయి. జగన్నాథ్ సూపర్ జియాండ్ దల్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో జెకెసిఇటి స్పార్కింగ్ స్పోర్ట్స్, జయపురం జాగుతార్ టీమ్లు తలపడ్డాయి. ఈ బ్యాచ్లో జయపురం టీమ్ విజయం సాధించింది. దేబొ చౌదరి, బాబుల, అనంత నాయక్, సుబేన్ అంపైర్లుగా వ్యవహరించారు. క్రికెట్ పోటీలు ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. -
ప్రకృతి వనరులపై హక్కులు కల్పించాలి
జయపురం: కొరాపుట్ జిల్లాలోని ఆదివాసీ ప్రజలకు ప్రకృతి వనరులపై హక్కులు కల్పించాలని సోషలిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు)(ఎస్యూసీఐ) జిల్లా కార్యదర్శి కనూచరణ్ బిశ్వాల్ అన్నారు. కొరాపుట్ జిల్లా కార్యకర్తలతో జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ బొయిపరిగుడ సహిద్ లక్ష్మణ నాయక్ గ్రంథాలయ ప్రాంగణంలో బుధవారం సమావేశం నిర్వహించారు. కనూచరణ్ బిశ్వాల్ మాట్లాడారు. దేశంలో నేడు మత రాజకీయాలు, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. కొరాపుట్ జిల్లా ఆదివాసీలు స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక వహించారన్నారు. ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. నేడు అడవులు, ప్రకృతి సంపదలపై ఆదివాసీ ప్రజలకు హక్కులు కల్పించాలన్నారు. పరిశ్రమలలో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నేటి పాలకులు ప్రజలను పీడిస్తున్నారని, వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సమైఖ్యంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాలకు ప్రజలను సంఘటితపరిచి ఎస్యుసీఐ కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. ఎస్యూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సదాశివ దాస్, రాష్ట్ర కార్యదర్శి శంకర దాస్, తదితరులు ప్రసంగించారు. -
‘కార్గో ఎయిర్పోర్టు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నాం’
మందస: మందస మండలం భేతాళపురం రైతులు కార్గోఎయిర్ పోర్టుకు వ్యతిరేకిస్తూ భూ వివరాల జాబితాపై నిరసన తెలిపారు. ఈ సందర్భంలో మందస ఎమ్మార్వో కార్యాలయం, పలాస ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. మందస ఎమ్మార్వో మిస్క శ్రీకాంత్కు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో మడియా పురోషోత్తం, బత్తిన దేశయ్య, బొడ్డు శంకర్రావు, బత్తిని కృష్ణరావు, గార ఆనందరావు, బత్తిని ఉమాపతి, కీలు భీమారావు, ఇరోతు దేవరాజు, మడియా జగన్నాథం, ఆడతాల కూర్మారావు, మడియా ఋషి, బత్తిని మాధవరావు, బత్తిన మహేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు శివాజీ రాజాకు సత్కారం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల పల్లిసారథిలో బుధవారం ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజాను ఏపీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ సత్కరించారు. డొక్క కృష్ణారావు స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చలన చిత్రంలో పలు సన్నివేశాలు ఉద్దాన ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం పల్లిసారథి ప్రాంతంలో చలన చిత్ర షూటింగ్ జరిగింది. చిత్రంలో నటించేందుకు శివాజీ రాజా వచ్చారు. కాగా హీరోగా, ప్రతి నాయకుడిగా సుమారు 500 పైచిలుకు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. పెళ్లి సందడి, కళ్లు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ ఉద్దాన ప్రాంతంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సత్కా రం చేసిన వారిలో ఫెడరేషన్ సభ్యులు కొండల ప్రకాశ్, షేక్ రాజాబాబు, మేకప్ ఆర్టిస్ట్ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. జనసేన, టీడీపీ నాయకుల కుమ్ములాట రణస్థలం: లావేరు మండలంలోని కొత్తరౌతుపేట గ్రామంలో కూటమి నాయకులు ఆల య నిర్మాణ స్థలంపై గొడవ పడ్డారు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్తరౌతు పేట గ్రామంలో కొంత స్థలంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించేందుకు టీడీపీ నాయకులు, గ్రామస్తులు పూనుకున్నారు. బుధవారం ఉదయం ఆ స్థలంలో కొలతలు వేస్తుండగా స్థానిక జనసేన నాయకుడు మా ఇంటికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా ఆలయ నిర్మాణం కట్టడం సరికాదని నిలదీశారు. ఇరు పక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని తోసుకున్నారు. దీంతో జనసేన నాయకుడు 100కి ఫోన్ చేయడంతో లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి వెళ్లి పరిస్థితిని గమనించి గొడవ పడవద్దని ఇరుపక్షాలకు సూచించారు. రెవెన్యూ అధికారులు వచ్చి కొలతలు వేసిన తర్వాత పనులు చేపట్టాలని చెప్పి వెనుదిరిగారు. సారా స్థావరాలపై దాడులు పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురు జోల, సింగిపూర్ తదితర సరిసరాల్లో 1,080 లీటర్ల నాటు సారా, 10,500 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా ఎకై ్సజ్ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం శ్రీనివాసరావు, పాతపట్నం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ ఎకై ్సజ్ అధికారులు, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, ఉదయ్గిరి, కాశీనగర్ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
తీసుకున్నారా..?
మ్యారేజ్ సర్టిఫికెట్ ..● మ్యారేజ్ సర్టిఫికెట్ అత్యంత కీలకం ● రిజిస్ట్రేషన్తో సర్టిఫికెట్ జారీ ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది. పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. – యు.ఉపేంద్ర, జనన,మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివా లయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. -
‘అంకితభావం, సమర్థత కలిగిన ఉద్యోగులు సంస్థకు బలం’
భువనేశ్వర్: సమర్థంగా, కష్టపడి పనిచేసే ఉద్యోగుల వల్లే సంస్థ స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తుంది. వారే సంస్థకు శక్తివంతమైన సంపద, మూలధనమని హైటెక్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ ఆస్పత్రిగా హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి రాష్ట్రం, జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జిస్తుంది. ఒడిశాలో ఆరోగ్య విద్య, చికిత్స, సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థగా వెలుగొందుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమర్థమైన వైద్య, పారామెడికల్, నర్సింగ్, ఫార్మసిస్టులతో సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యంగా ఈ సంస్థలో కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగానికి చెందిన సమర్థమైన వైద్య సిబ్బంది, ప్రొఫెసర్ డాక్టర్ రితేష్ కుమార్ ఆచార్య, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్మృతి ప్రకాష్ సాహు ప్రత్యేక ఆరోగ్య సేవలను అందిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుండి గౌరవాభిమానాలు చూరగొంటున్నారు. హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సంస్థలోని ప్రతి ఉద్యోగిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి ట్రస్టీ, డైరెక్టర్ మధుస్మిత త్రిపాఠి పాల్గొని దక్షత, నైపుణ్యత చాటుకున్న సిబ్బందిని ఉత్తరీయం, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రనాథ్ బెహెరా, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందన్ సామంత్రాయ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ శ్రద్ధ, జాగరూకతతో సేవలు అందించడంలో నిబద్ధత, సంకల్పంతో పని చేయాలని ప్రోత్సహించారు. -
కత్తలకవిటిలో జడ్డిమా అమ్మవారి పూర్ణాహుతి
పర్లాకిమిడి: గుసాని సమితి కత్తలకవిటిలో మాశీతాలయి (జడ్డిమా) గ్రామదేవత నూతన మందిర నిర్మాణం ప్రతిష్టాపన మహోత్సవాలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు మందిరానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పూరీ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన అమ్మవారికి ప్రాణపతిష్ట, పూర్ణాహుతి, యజ్ఞాలు నిర్వహించి బుధవారం రెండుగంటల సమయంలో గుడి తలుపులు తెరిచి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కత్తలకవిటి గ్రామకమిటీ, తమిళనాడుకు చెందిన బ్రాహ్మణులు విచ్చేసి మంత్రోచ్ఛరణ చేశారు. -
ఎదురెదురుగా కార్లు ఢీ.. నలుగురు మృతి
కొరాపుట్: ఎదురెదురుగా కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మంగళవారం రాత్రి నబరంగ్ఫూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణం సమీపం బడకుమరి గ్రామ సమీపంలో భారత మాల 6 అంచెల జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. కొరాపుట్ జిల్లా సునాబెడాకి చెందిన అరుణ్ కుమార్ పండా (65), అతని మనుమడు అశుతోష్ రధ్ (10), మేనల్లుడు సుభ్రత్ సత్పతి (35) లు సంఘటన స్థలంలో మృతి చెందారు. వీరు నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితిలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నబరంగ్పూర్ జిల్లా జోరిగాంలో మరో శుభ కార్యానికి వెళ్తున్న కారు వీరి కారుని ఢీకొట్టింది. ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నబరంగ్పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బంశీధర్ పండా (40) మృతి చెందాడు. -
రాజ్య సభ నాయకత్వానికి సస్మిత్ పాత్రో రాజీనామా
భువనేశ్వర్: డాక్టర్ సస్మిత్ పాత్రో బుధవారం రాజ్య సభలో బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక రాజకీయ పరిణామంగా చర్చ ఊపందుకుంది. సస్మిత్ పాత్రో తన రాజీనామా పత్రం బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్కు సమర్పించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఎగువ సభలో నాయకత్వ మార్పు కోరుతూ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు నాయకత్వానికి లేఖ రాశారన్న వార్తల నేపథ్యంలో ఈ రాజీనామా చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. రాజ్య సభలో కొత్తగా ఎన్నికై న బీజేడీ ఎంపీ సంతృప్త్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సస్మిత్ పాత్రోను తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుందని తెలిసింది. కొంత మంది ఎంపీలు తమ ఆందోళనలను అధినేత నవీన్ పట్నాయక్కు లాంఛనంగా తెలియజేసి నాయకత్వ పునర్వ్యవస్థీకరణకు ఒత్తిడి చేశారని పార్టీ అంతర్గత వర్గాలు సమాచారం. ప్రస్తుతం రాజ్య సభలో బీజేడీకి 6 మంది సభ్యులు ఉన్నారు. 2022 నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేస్తున్న సస్మిత్ పాత్రో రాజ్య సభలో పార్టీ వైఖరిని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రాజీనామాతో ఆ కీలక నాయకత్వ పాత్రను ఎవరు చేపడతారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సంతృప్త్ మిశ్రా తొలిసారిగా రాజ్య సభలోకి ప్రవేశించారు. డాక్టరు సస్మిత్ పాత్రో రాజీనామా లేదా తదుపరి కార్యాచరణకు సంబంధించి గానీ, బీజేడీ నాయకత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదా ప్రకటన వెలువడలేదు. -
పూరీలో కాల వైశాఖి తాండవం
భువనేశ్వర్: పూరీలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణంతో తుఫాను వంటి తీవ్రతర పరిస్థితి అలముకుంది. వాతావరణ శాఖ ముందస్తుగా జారీ చేసిన సమాచారం ప్రకారం ఈ జిల్లా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాల వైశాఖి వాతావరణం తాండవించింది. జగన్నాథుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు బెంబేలెత్తారు. భారీ వర్షం, ఉరుములు, ఈదురు గాలులతో శ్రీ మందిరం పరిసరాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూరీ జిల్లా కొణాస్ గ్రామంలో పిడుగుపాటుకు ఒక రైతు మృతి చెందాడు. మృతుడిని బంధముండ గ్రామానికి చెందిన సిద్దియా ధోలేరసింఘాగా గుర్తించారు. బడికి తాళం మల్కన్గిరి: గౌడగూఢ పంచాయతీ ఎంవీ 9 గ్రామం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అందకపోవడంతో గ్రామస్తులు బుధవారం బడికి తాళం వేశారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ సామంతరాయ్ కొద్ది నెలల కిందట 7వ తరగతి విద్యార్థిని శారీరకంగా, మానసికంగా వేధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ ఆయనపై వేటు వేసింది. ఆయన స్థానంలో విధుల్లో ఉన్న మహిళా ఉపాధ్యాయురాలికి బాధ్యతలు అప్పగించింది. ఆమె సక్రమంగా చేయకపోవడంతో మరో టీచర్ సరస్వతి పూజారికి బాధ్యతలు అప్పగించారు. అయితే బుధవారం పాఠశాల ముందు పిల్లలను కూర్చోబెట్టి స్థానికులు నిరసన తెలిపారు. ఇక్కడ 8వ తరగతి లో 46 మంది చదువుతున్నారు. ఇక్కడ పాస్ అయిన వారు 9వ తరగతిలో చేరేందుకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్తదానం.. ప్రాణదానం పర్లాకిమిడి: రక్తదానం.. ప్రాణదానంతో సమానమని అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గుణీ మఝి అన్నారు. ఒడియా దివాస్ పక్షోత్సవాల సందర్భంగా భారతీయ రెడ్ క్రాస్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఫల్గుణీ మఝి ప్రారంభించారు. రక్తదాతల నుంచి 38 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు బ్లడ్ బ్యాంకు ఫార్మాసిస్టు ఖగేశ్వర బెహరా తెలిపారు. సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, జిల్లా అబ్కారీశాఖ అధికారి ప్రదీప్ సాహు, డాక్టర్ అనిల్ ఆచార్య పాల్గొన్నారు. రక్తదానం చేసిన దాతలను అభినందించారు. భార్యను హతమార్చిన భర్త భువనేశ్వర్: స్థానిక స్వస్తిక్ నగర్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఒక దారుణ హత్య ఘటన నివాసితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేవరాజ్ అనే రిటైర్డ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తన భార్య ప్రియంబద షడంగి గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణ. పదవీ విరమణ చేసిన అకౌంటెంటు జనరల్ కార్యాలయం ఉద్యోగి అయిన దేవరాజ్ ఉద్యోగ విరమణ తర్వాత గత 2 సంవత్సరాల నుంచి తన భార్యతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. రక్తసిక్తమైన పడక గదిలో రక్తపు మడుగులో ప్రియంబద పడి ఉన్నట్లు ఇరుగు పొరుగు వారి దృష్టికి రావడంతో ఎయిర్ ఫీల్డు ఠాణా పోలీసులకు సమాచారం చేరదీశారు. వీరి సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరి పర్యవేక్షించడంతో రక్తపు మడుగులో మహిళ మృత దేహం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దేవరాజ్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు సూచిస్తున్నాయి. సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం, కమిషనరేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య వెనుక కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. కానీ కుటుంబ కలహాలే ఈ విషాద ఘటనకు దారి తీసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. -
ఎస్ిసీబీ అగ్ని ప్రమాదంపై కేంద్ర బృందం దర్యాప్తు
భువనేశ్వర్: కటక్ ఎస్ిసీబీ అగ్ని ప్రమాదంపై కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభమైంది. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కేంద్ర దర్యాప్తు బృందం బుధవారం ఎస్ిసీబీ వైద్య బోధన ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతాలు, సంబంధిత వర్గాలతో విచారణ చేపట్టింది. ఈ ఆస్పత్రి ట్రామా ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 12 మంది రోగులు మరణించిన సంఘటన ఇటీవల ముగిసిన శాసన సభ సమావేశాల్లో తీవ్ర అలజడి రేపిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ విచారకర సంఘటనపై నైతిక బాధ్యత వహిస్తు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ పదవికి రాజీనామా చేసి వైదొలగాలని విపక్షాలు గట్టి గా పట్టుబట్టి నిరవధికంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటిని సంప్రదించి చొరవ కల్పించుకుని సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని విపక్ష వర్గం అభ్యర్థించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం కటక్ ఎస్సీబీ సందర్శించి విచారణ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందం ఈ ఏడాది మార్చి 16న ట్రామా ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ బృందంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి (ఎన్డీఎంఏ), ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రముఖులు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రతినిధి, ఒడిశా రాష్ట్ర విపత్తు స్పందన అథారిటీ (ఓస్డమా), అగ్ని మాపక, పౌర రక్షణ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. యువకుడి మృతదేహం లభ్యం రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల జంఝావతి నది వంతెన పైనుంచి మంగళవారం దూకిన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానిక కోపరేటీవ్ కాలనీకి చెందిన రంజిత్ కుమార్ సాహు(34) అనే యు వకుడు మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తన సొంత బైక్పై వచ్చి జంఝా వతి నది వద్ద పార్కింగ్ చేశాడు. వంతెన పైనుంచి దూకేశాడు. అగ్నిమాపక సిబ్బంది యువకుని ఆచూకీ కోసం గాలించారు. బుధవారం ఉద యం 9 గంటల ప్రాంతంలో యువకుని మృతదేహం బ్రిడ్జికి కొంత దూరంలో లభించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అందరి కృషితోనే ఆరోగ్యకరమైన సమాజం
రాయగడ: అందరి కృషితోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని ఝార్సుగుడ ఎస్పీ గుండాలరెడ్డి రాఘవేంద్ర అన్నారు. మంగళవారం ఝార్సుగుడలో గల మేఫెయర్ ఒయాసీస్ ప్రాంగణంలో ఇండియన్ మెడికల్ అసొసియేషన్ సంస్థ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటైతే శాంతియుత వాతావరణం వస్తుందన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్ను బుగ్గిపాలు చేసుకుంటున్నారని అన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ఏకీకృతం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిస్తుందన్నారు. పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ముందస్తు రోగాలు నిర్ధారణ చేయడం సాధ్యమవుతోందన్నారు. ఝార్సుగుడ వంటి జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించేలా అందరూ సహకరించాలని కోరారు. మొదటి సెషన్లో మెంటల్ హెల్త్ ప్రయారిటీపై మోడరన్ మెడిసిన్ అన్న అంశంపై జరిగిన చర్చలో ముఖ్యవక్తగా డాక్టర్ ఎస్జే పాల్ పాల్గొని ప్రసంగించారు. అదేవిధంగా రెండొ సెషన్లో రొల్ ఆఫ్ ఆ ర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అన్న అంశంపై ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ శక్తి కుమార్ త్రిపాఠి వివరించారు. అలాగే మూడో సెషన్లో ఫిజికల్ హెల్త్ ఎ హిస్టొరిక్ అప్రొచ్ అన్న అంశంపై జరగిన చర్చలో డాక్టర్ శక్తి కుమార్ త్రిపాఠి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పి రాఘవేంద్రకు ఇండియన్ మెడికల్ అసొసియేషన్ సంస్ధ సన్మానించింది. -
ఆత్మహత్యకు అనుమతివ్వండి
● సబ్ కలెక్టర్ను కోరిన మాజీ సర్పంచ్ త్రిపాఠిజయపురం: మాజీ సర్పంచ్ నిరంజన్ త్రిపాఠీ ఆత్మహత్య చేసుకొనేందుకు జయపురం సబ్ కలెక్టర్ను అనుమతి కోరారు. త్రిపాఠి వ్యవసాయం వదలి కంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. చేసిన పనుల బిల్లుల పాస్ చేసేందుకు అధికారులు లంచాలు అడగటంతో మనో వేదన చెందిన త్రిపాఠి ఆత్మహత్య చేసుకొనేందుకు నిర్ణయించి స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి కోరడం గమనార్హం. వ్యవసాయ దారుడైన త్రిపాఠీ 2022 లో బొరిగుమ్మ సమితి బెణాపూర్ పంచాయితీ బాగభధ్ర గ్రామం సమీపంలో గల తన 8 ఎకరాల భూమిని అమ్మి వేసి బొరిగుమ్మ సమితిలో కంట్రాక్టు పనులు చేయటం ప్రారంభించారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల కాలంలో మనోరెగ పనుల కాంట్రాక్ట్ తీసుకున్నారు. బాగభధ్ర గ్రామంలో 5–టి విద్యాలయ ప్రహరీ, యూజీహెచ్సీ విద్యాలయ ప్రహరీ, సమితి రోడ్డు పనులు, గ్రామాల అప్రోచ్ రోడ్డు పనులకు అనుమతులు లభించాయి. ఆ పనులు చేస్తున్న త్రిపాఠీ మనోరెగ పనుల్లో కూలీలకు కాంట్రాక్ట్ పనుల కోసం పనులకు తన డబ్బులు చెల్లించారు. అయితే బిల్లు పైకం చేతికి రాలేదు. బిల్లు పాస్ చేసేందుకు 27 శాతం పీసీ కావాలని సంబంధిత అధికారులు డిమాండ్ చేశారు. అయితే 12 శాతం ఇచ్చేందుకు త్రిపాఠీ అంగీకరించాడు. అందుకు సంబందిత అధికారులు ఎవరూ సమ్మతించలేదు. ఈ విషయం బీడీఓకు తెలియజేసినా ఫలితం లేక పోయిందని, అందు చేత మరో మార్గం కనిపించక ఆత్మహత్యే శరణ్యం అని భావించిన త్రిపాఠి సబ్ కలెక్టర్ను అనుమతి కోరాడు. ఈ ఆరోపణపై వెంటనే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనకు రావాల్సిన బిల్లు డబ్బు చెల్లించక పోతే ఆత్మహత్యకు అనుమతించాలని నిరంజన్ త్రిపాఠీ విజ్ఞప్తి చేశారు. -
తాగునీటికి కటకట
లిబ్రిగుడలో..● నెల రోజులుగా పనిచేయని మంచినీటి పథకం ● బావిలోని బురదనీరే దిక్కు.. ● పట్టించుకోని అధికారులుపర్లాకిమిడి: గజపతి జిల్లాలో నువాగడ బ్లాక్ పరిమళ పంచాయతీ లిబ్రిగుడ గ్రామంలో నెల రోజులుగా ప్రజలు తాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నారు. వంద కుటుంబాలు ఉన్న లిబ్రిగుడలో గ్రామీణ తాగునీటి, శానిటేషన్ శాఖ మంచినీటి పథకం నిర్మించినా.. నాలాల నుంచి తాగునీరు రావడం లేదు. గ్రామంలో ట్యూబ్ వెల్ కోన్నేళ్లుగా మరమ్మతులకు గురైంది. ఉన్న ఒక్క మంచినీటి బావి ఎండలకు అడుగంటింది. ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి తాగునీరు రావడం లేదు. మంచినీటి బావి నుంచి బురదనీరు వడబోసి ప్రజలు తాగుతున్నారు. గ్రామంలో పిల్లలు, వృద్ధులు దగ్గు, జ్వరాల బారిన పడుతున్నట్టు లిబ్రిగుడ గ్రామసభ సభ్యుడు బిశ్వంబర రయితో ఆందోళన చెందుతున్నారు. తాగునీటి సమస్యలపై ఏప్రిల్ 6న లిబ్రిగుడ గ్రామవాసులు పర్లాకిమిడి కలెక్టరేట్లో అధికారులకు వినతిని అందజేశారు. అధికారులు ప్రభుత్వ గ్రామీణ తాగునీరు, శానిటేషన్ ఇంజినీర్కు వినతిని పంపారు. ఇప్పటివరకు నువాగడ బ్లాక్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రామంలో మహిళలు తాగునీటికి ఆందోళన చెందుతున్నారు. దీనిపై మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో తగిన చర్యలు తీసుకోవాలని లిబ్రిగుడ గ్రామస్తులు కోరుతున్నారు. -
రాష్ట్రపతి రౌర్కెలా పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన రౌర్కెలా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో చర్చించారు. ఈ చర్చలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా పాల్గొన్నారు. ఉత్పత్తి రంగంలో నాల్కో కొత్త రికార్డు జయపురం: కొరాపుట్ జిల్లా ధమన్జోడిలోని నాల్కో సంస్థ రికార్డు సృష్టించింది. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉత్పత్త సాధించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాకై ్సట్ ఉత్పాదనలో, ఎగుమతులలో రికార్డులు సృష్టిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 77.01 లక్షల టన్నులు అల్యూమినియం ఉత్పత్తి చేసి కొత్త రికార్డు సృష్టించిందని అధికార వర్గాల వర్గాలు వెల్లడించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 77.7 లక్షల టన్నుల బాకై ్సట్ ఎగుమతి చేసి నూతన రికార్డు స్థాపించింది. అలాగే అల్యూమిన హైగ్రేడ్ 23.00 లక్షల టన్నులు, క్యాలసైడ్ అల్యూమినియం 22.75 లక్షల టన్నులు ఉత్పాదన చేసినట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2026 మార్చ్ 31 నాటికి సాధించిన రికార్డుతో ఉత్పత్తి సాధించిన నాల్కో మతాబులు కాల్చి, మిఠాయిలు పంచుకుంది. రత్న భాండాగారంలో ఆభరణాల లెక్కింపు పునః ప్రారంభం భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం రత్న భాండాగారంలో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు బుధవారం నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని శ్రీ మందిర్ ముఖ్య నిర్వాహకుడు డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలిపారు. ఈ లెక్కింపు 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 13వ తేదీన, 16 నుంచి 18వ తేదీ వరకు లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సామాన్య భక్తుల దర్శన ఏర్పాట్లలో స్వల్ప మార్పులు చేశారు. లెక్కింపు జరిగే రోజున లోపలి ప్రాంగణం (భిత్తొరొ కఠొ) దర్శనం మూసివేయబడుతుంది. వెలుపలి ప్రాంగణం (బహారొ కఠొ) నుండి సర్వ దర్శనం పరిమితం చేశారు. ఈ దశ తర్వాత తదుపరి లెక్కింపు తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మార్చి 25న ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధీకృత సేవకులు జగ మోహన్, గర్భగుడి లోపల తమ విధులను యథావిధిగా నిర్వర్తిస్తారు. శ్రీ జగన్నాథుని ఆలయ ఆచారాలు నిరాటంకంగా కొనసాగుతాయన్నారు. పిడుగుపాటుకు ఆవు మృతి జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి బలిగాం గ్రామ పంచాయితీ లకమాలియగుడ గ్రామంలో సోమవారం సాయంత్రం పెనుగాలులతో పిలుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడి ఒక ఆవు ప్రాణాలు కోల్పోయింది. పశువుల కాపర్లు లకమాలియగుడ గ్రామ సమీపంలో ఆవులు, మేకలు గొర్రెలకు మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం పడటంతో పశువులు చెల్లాచెదురై చెట్ల కిందకు చేరాయి. అందులో ఒక ఆవు చెట్టు కింద నిల్చొని ఉండగా పిడుగు పడి సంఘటనా స్థలంలోనే మరణించింది. మరణించిన ఆవు అదే గ్రామానికి చెందిన కమలలోచన పంగిదిగా గుర్తించారు. బాధితుడికి ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పది గంటల ట్రాఫిక్ జామ్
కొరాపుట్: అంతర్రాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల 10 గంటల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో రాష్ట్ర సరిహద్దు కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి సుంకికి సమీపంలో ఆంధ్ర లోని కంకణా ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. కొరాపుట్ జిల్లా నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దాంతో రోడ్డు మార్గం మూసుకుపోయింది. ఈ మార్గంలో వందలాది వాహనాలు నిలిచి పోయాయి. విజయనగరం–రాయ్పూర్ జాతీయ రహదారి 26 కావడం తో వందలాది వాహనాలు నిలిచి పోయాయి. రాత్రి పూట తిరిగే అంతర్రాష్ట్ర బస్సులు నిలిచి పోయాయి. విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం, విజయ నగరం, బ్రహ్మపుర, భువనేశ్వర్, కటక్, పూరి నుంచి ఒడిశా వైపు జయపూర్, నబరంగ్పూర్, మల్కన్గిరి, జగదల్పూర్ వెళ్లే వందలాది బస్సులు ఇరు వైపులా నిలిచి పోయాయి. ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి వచ్చే బస్సులు కూడా చిక్కుకున్నాయి. ఉదయం 7 గంటలకు ఆంధ్రా పోలీసుల వచ్చేంత వరకు వేలాది ప్రజలు నరక యాతన పడ్డారు. మంగళ వారం ఉదయం 9 గంటలకు రెండు వైపులా వాహనాలు ముందుకు కదిలాయి. -
కాశీపూర్లో ఉద్రిక్త పరిస్థితులు
ఉత్సాహంగా ర గ్బీ పోటీలు రగ్బీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. క్రీడాకారులు ప్రతిభ చూపారు. –8లోuజడ్డిమా మందిర ప్రారంభం పర్లాకిమిడిలో జడ్డిమా మందిరం ప్రారంభోత్సవం జరిగింది. మహిళలు పాల్గొన్నారు. –8లోu● 163 సెక్షన్ జారీ ● పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు ● 53 మంది పోలీసులకు గాయాలుశ్రీమందిరం ఆదాయం లెక్కింపు భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం మంగళవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,64,753లు, బంగారం 10 గ్రాములు, వెండి 6 గ్రాముల 400 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు. బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పోలీసులపై దాడి అమానుషం రాయగడ: విధులు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులపై ఆందోళనకారులు చేసిన దాడి అమానుషమని ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ అన్నారు. ఈ మేరకు దాడిని ఖండిస్తూ ఆమె మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. కాశీపూర్ సమితి కండమాల్ గ్రామానికి చెందిన సుభాషిన్ మాఝి అనే నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారని అన్నారు. నిందితుడిపై 14 కేసులు ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసేందుకు వెళ్లగా అప్పటికే సగుబారి, కంధమాల్ తదితర గ్రామాలకు చెందిన గ్రామస్తులు ముందస్తు వ్యూహం ప్రకారం సామూహికంగా పోలీసులను రౌండప్ చేసి రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో 58 మంది పోలీసులు గాయపడ్డారని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు టియర్ ఫాగ్ విడుదల చేశామన్నారు. రాయగడ: జిల్లాలోని కాశీపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమితిలోని సగుబారి పంచాయతీలోని సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలకు సంబంధించి తవ్వుకునేందుకు ప్రభుత్వం వేదాంత్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో సగుబారి గ్రామం నుంచి సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలు గల ప్రాంతం వరకు రహదారిని నిర్మించేందుకు కంపెనీ సన్నహాలు చేశారు. బాకై ్సట్ నిక్షేపాలు కొల్లగొడితే ఈ ప్రాంతం పర్యావరణం పరంగా పూర్తిగా దెబ్బ తింటుందని అందుకు ఆది నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభావిత గ్రామాలకు చెందిన వారు రహదారి నిర్మాణానికి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసేందుకు మంగళవారం వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లు రువ్వడంతో 53 మంది పోలీసులకు గాయాలయ్యాయి. గాయాలు తగిలిన వారిలో ఎస్డీపీఓ గౌరహరి సాహు, ఏఎస్పీ అమూల్యకుమార్ ధర్, అండ్రాకంచ్ ఐఐసీ కూడా ఉన్నారు. గాయాలు తగిలిన వారిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం వైజాగ్ తరలించారు. మిగిలిన వారిలో కొందరిని కాశీపూర్ పీహెచ్సీకి, మరికొందరిని టికిరిలొ గల ఉషాపాడు ఆస్పత్రికి తరలించారు. శాంతి భద్రతలు క్షీణించడంతో 163 సెక్షన్ అమలు చేశారు. ఆందోళన జరిగే సగుబారి గ్రామంలొ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు బందోబస్తుతో పాటు రిజర్వ్ పోలీసుల దళాలు మోహరించాయి. అసలు జరిగిందేమిటి.. సగుబారి గ్రామానికి సమీపంలో గల సిజిమాలి ప్రాంతంలో ఉన్న బాకై ్సట్ ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు వేదాంత కంపెనీకి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీన్ని అనుసరించి ఆ ఖనిజ నిక్షేపాలను తవ్వేందుకు కంపెనీ యాజమాన్యం ఆయా ప్రభావిత ప్రాంతాల్లో గల గ్రామస్తులతో ఎలాంటి సమావేశాలను నిర్వహించకుండా వారి అనుమతులను తీసుకోకుండా కొండను తవ్వేందుకు కంపెనీ సన్నాహాలు చేసింది. ఈ నేపథ్యంలో సగుబారి నుంచి బాకై ్సట్ లభించే కొండ వరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అందుకు ఆది నుంచి ఆ ప్రాంత వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా సొమవారం నాడు గ్రామస్తులకు, కంపెనీ సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కావడంతో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సోమవారం సగుబారి గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించారు. అందుకు గ్రామస్తులు ఎలాంటి సహకారం అందించకపోవడంతో కలెక్టర్ పోలీస్ బందోబస్తు నడుమ వారిని మైకు ద్వారా బాకై ్సట్ తవ్వుకునేందుకు ప్రభుత్వం వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిందని, అందుకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పకూడదని వివరించారు. అదే రోజు రాత్రి కొంత మంది పోలీసులు సగుబారి గ్రామంలో చొరబడి గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలొ పోలీసులు తమపై దాడి చేయడంతొ గ్రామానికి అనీ మాఝి, నారింగ దేయి మాఝి, లాలి మాఝి, కుముటి మాఝి, బామిణి మాఝి, బురుస మాఝి, నింగి మాఝి, ఆగాధ నాయక్, రామచంద్ర నాయక్తొ పాటు మరి కొందరు పోలీసుల దాడిలో గాయాలు పాలయ్యారని గ్రామస్తులు ఆరొపించారు. మంగళవారం పోలీసుల బందోబస్తుతో సగుబారి గ్రామానికి చేరుకున్నారు. అయితే కొండపై ఉన్న గ్రామస్తులు మరణాయుధాలతో వ్యతిరేకించారు. తమ గ్రామంలొ గల ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు తామెంతమాత్రం అనుమతించేది లేదని దీని వల్ల పర్యావరణం పూర్తిగా కలుషితమవ్వడంతొ పాటు అడవి తల్లిని నమ్ముకున్న తామంతా అనాథలమై జీవనోపాధిని కోల్పోతామని హెచ్చరించారు. అనంతరం పోలీసులపై రాళ్లు రువ్వారు. -
విద్యార్థులకు ‘ఒడియా భాష వాచకం’ పుస్తకాల పంపిణీ
పర్లాకిమిడి: ఒడిశా దినోత్సవ పక్షోత్సవాలు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం తరపున మంగళవారం స్థానిక గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మధుసూదన్రావు రాసిన ‘బొర్నోబోధో’(ఒడియాభాష వాచకం) పుస్తకాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఒడియా వాచకం ఒకటి, రెండవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ప్రాథమిక స్థాయి నుంచి ఒడియా భాషను ప్రతిఒక్క విద్యార్థి నేర్చుకోవాలని ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడీఎం మునీంద్ర హానగ అన్నారు. కార్యక్రమంలో డీఈవో డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, ప్రధాన ఉపాధ్యాయులు ఎస్.తిరుపతిరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఖుర్దా రోడ్దే అధిక ఆదాయం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వేకు చెందిన ఖుర్దా రోడ్ మండలం 2025–26 ఆర్థిక సంవత్సరంలో జోనల్ స్థాయిలో టికెట్ తనిఖీల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జించడం విశేషం. ఈ సాఫల్యత టికెట్ తనిఖీల పనితీరులో మైలురాయిని ఆవిష్కరించిందని అధికార వర్గాలు టికెట్ తనిఖీ సిబ్బందిని అభినందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 7.38 లక్షల అనధికార, అక్రమ ప్రయాణికుల నుండి చార్జీలు, జరిమానాల రూపంలో మొత్తం రూ. 39.71 కోట్లు వసూలు చేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం పెరుగుదలను సూచిస్తుందని విభాగం ప్రముఖ అధికారి సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అనిల్ కుమార్ ఎస్ తెలిపారు. ఖుర్దారోడ్ మండల వ్యాప్తంగా వివిధ రైళ్లు, స్టేషన్లలో సుమారు 3,000 విస్తృతమైన, ప్రత్యేక టికెట్ తనిఖీ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనధికార ప్రయాణాలను అరికట్టి క్రమశిక్షణతో కూడిన ప్రయాణ వాతావరణం నిర్ధారణకు మండల టికెట్ తనిఖీ దాడులు మరింత ముమ్మరం చేస్తున్నారు. -
శ్రమదానంతో బావి నిర్మాణం
● తాగునీటి సమస్యను పరిష్కరించుకున్న టికరపడ గ్రామస్తులు రాయగడ: తాగునీటి సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ ఇటు పంచాయతీ కార్యాలయం అధికారులకు అటు సంబంధిత శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విసిగిపోయిన సమస్యను తామే పరిష్కరించుకోవాలని గ్రామస్తులంతా ఏకమయ్యారు. శ్రమదానంతో సమీపంలో బావి నిర్మించుకున్నారు. బావి నుండి నీటిని పైపుల సహాయంతో గ్రామానికి తరలించి సమస్యను పరిష్కరించుకున్నారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తామే తమ సమస్యను పరిష్కరించుకున్నామని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కాసీపూర్ సమితి హడియా పంచాయతీలోని టికరపడ గ్రామంలో కొన్నాళ్లుగా తాగునీటి సమస్య నెలకుంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఎవ్వరూ స్పందించకపొవడంతో గ్రామస్తులంతా కలసి కొంత మేర డబ్బులు పొగు చేసుకుని శ్రమదానంతో బావిని తవ్వుకున్నారు. పిల్లా.. పెద్ద, ఆడమగా అనే తేడా లేకుండా అంతా కలసి శ్రమించారు. వారం రోజుల్లో బావిని తవ్వుకున్నారు. గ్రామంలో ఇంటింటా సేకరించిన డబ్బులతో బావి నుంచి గ్రామం వరకు తాగునీటి పైపులను, మోటారును ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 30 కుటుంబాలు గల ఈ గ్రామస్తులు తమ ఐక్యతను చాటుకున్నారు. -
బ్రిడ్జి పైనుంచి దూకిన యువకుడు
రాయగడ: Ý린MýS Møç³ç³-Æð‡-sîæÐŒæ M>ÌS±ÌZ °Ð]líÜ-çÜ$¢¯]l² Æý‡…h™Œæ MýS$Ð]l*ÆŠ‡ Ýëçßæ$ (34) Ð]l$hjVúÇ Ð]l$…¨Æ>-°MìS çÜÒ$-ç³…ÌZ° f…Æý‡n*Ð]l† ¯]l¨ Ð]l…™ðl¯]l Oò³¯]l$…_ Ð]l$…VýS-âýæÐéÆý‡… ±sìæ-ÌZMìS §ýl*MóS-Ô>yýl$. E§ýlĶæ$… çÜ$Ð]l*Æý‡$ 11 VýS…rÌS çÜÐ]l$Ķæ$…ÌZ ™èl¯]l Ý÷…™èl O»ñæMýS$Oò³ {¼yìlj Ð]l§ýlªMýS$ Ð]l_a¯]l Æý‡…h™Œæ AMýSPyólే ´ëÇP…VŠæ ^ólíܯ]l A¯]l…™èlÆý‡… A™èl° gZâ¶æ$Ï ç³MýSP¯ól E…_ {¼yìlj Oò³¯]l$…_ ±sìæÌZMìS VðS…™ól-Ô>yýl$. C¨ ^èl*íܯ]l AMýSPyìl ÐéÆý‡$ Ððl…r¯ól ´ùÎ-çÜ$ÌSMýS$ çÜÐ]l*^éÆý‡… A…¨…-^éÆý‡$. çÜÐ]l*^éÆý‡… A…§ýl$MýS$¯]l² ´ùÎçÜ$Ë$ çÜ…çœ$-r¯é çܦÌê-°MìS ^ólÆý‡$-MýS$¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… AW-²-Ð]l*-ç³MýS íܺ¾…¨MìS çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓ-yýl…™ø ÐéÆý‡$ ¯]l¨-ÌZMìS ¨W Ķæ¬Ð]lMýS$° B^èl*MîS MøçÜ… V>Í-çÜ$¢-¯é²Æý‡$. çÜ$Ð]l*Æý‡$ Ð]lÊyýl$ VýS…rË$ {ÔèæÑ$…-_-¯]lç³µ-sìæMîS B^èl*MîS ™ðlÍ-Ķæ$-Æ>Ìôæ§ýl$. D Ðól$Æý‡MýS$ ´ùÎ-çÜ$Ë$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ §ýlÆ>Åç³#¢ ^ólçÜ$¢-¯é²Æý‡$. Æý‡…h™Œæ G…§ýl$MýS$ Cr$-Ð]l…sìæ Açœ*-Ƈ$$-™éÅ-°MìS ´ëyýl-µyéz-yýl¯ól Mø×æ…ÌZ BÆ> ¡çÜ$¢-¯é²Æý‡$. గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది -
నా కుమారుడి ఆచూకీ తెలపండి!
రాయగడ: నా కుమారుడి ఆచూకీ తెలపండని ఓ విద్యార్థి తండ్రి మోర పెట్టుకున్నారు. ఈ ఘటన స్థానిక అంబాగుడ గ్రామంలో గల ఆర్డబ్ల్యూ ఎస్అండ్ఎస్ పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మయిలిగుడ గ్రామానికి చెందిన సాలు మాఝి కుమారుడు ప్రకాష్ మాఝి పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన హాస్టల్లో ఉంటున్నాడు. ప్రకాష్ గత 14 రోజులుగా ఇంటికి రాలేదని ఆందోళన చెందిన విద్యార్థి తండ్రి ఈ మేరకు పాఠశాల హెచ్ఎం బిభూతి భూషన్ రొథొను కలిశారు. ఇదివరకే తాను ఇంటికి వెళ్తున్నట్లు హాస్టల్ వార్డెన్కు చెప్పి ప్రకాష్ వెళ్లిపోయాడని హెచ్ఎం సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా మార్చి 27వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఉందని అందరికీ ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించడం జరిగిందని, ఆ సమయంలో సమావేశానికి రాకపొవడంతో ఏదో కారణంతో రాలేదని భావించామని హెచ్ఎం సమాధానం చెప్పాడు. గత 14 రోజులుగా తన కుమారుడు ఇంటికి రాలేదని, పాఠశాలలో లేడని, ఎక్కడికి వెళ్లినట్లని విద్యార్థి తండ్రి బోరుమన్నాడు. ఈ విషయమై పోలీసులకు విద్యార్థి తండ్రి సాలు మాఝి, పాఠశాలకు చెందిన వారు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. -
మ్యాథ్స్ ఒలింపియాడ్లో విద్యార్థుల ప్రతిభ
కంచిలి: కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ వారు నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్–2025 పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. వీటిని సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.చాణక్య, మిగతా ఉపాధ్యాయులు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. బంగారు పతకాలను సాయి కిషోర్ పాత్రో, మల్లార్పు బాలకృష్ణ, గుడియా యువశ్రీ, రజిత పతక విజేతలైన మారేడు దీపిక, నక్క పవన్, గణప అవంతిక, కొండా శ్యాం, కాంస్య పతక విజేతలైన లోపింటి ధనలక్ష్మి, గుడియా చరణ్, గగన్ పాత్రో, లండ ప్రసాద్రెడ్డి, యజ్జల పూజ ఉన్నారు. ఒలింపియాడ్ కోసం ప్రత్యేక తర్ఫీదునిచ్చిన గణిత ఉపాధ్యాయులు అశోక్ కుమార్, సూర్యప్రకాశ్, ప్రసాదరావు, సుధాకర్లను హెచ్ఎం సత్కరించారు. -
పరిహారం కోసం ఆందోళన
భువనేశ్వర్: ఇటీవల కురిసిన వడగళ్ల వాన వల్ల జరిగిన భారీ నష్టానికి పరిహారం కోరుతూ బొలంగీర్ జిల్లాలో స్థానికులు మంగళవారం రహదారిని దిగ్బంధించారు. పట్నగడ్, పద్మాపూర్ రహదారిపై పడేల్ కూడలి వద్ద నిరసన ప్రదర్శించారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వాన ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అధికార యంత్రాంగం, ప్రభుత్వం గానీ ఎలాంటి సహాయం అందించకపోవడంతో అసంతృప్తి పెరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. తక్షణ సహాయం, నష్టపరిహారం కోసం ఒత్తిడి చేస్తూ స్థానికులు రహదారిని దిగ్బంధించారు. వడగళ్ల వాన కారణంగా అనేక కచ్చా ఇళ్ల పైకప్పులు దెబ్బతిని, ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు సమాచారం. వంట పాత్రలతో సహా నిత్య వినియోగ గృహోపకరణాలు దెబ్బతిన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విపత్తుతో జరిగిన నష్టాలను పూడ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
జయపురం: వ్యవసాయ విభాగ అధికారులు పట్టణంలోని రసాయినిక ఎరువుల దుకాణాలు, వేర్ హౌస్లపై మంగళవారం దాడులు నిర్వహించారు. ఎరువులు సక్రమంగా లభించటం లేదని రైతుల ఆరోపణల నేపథ్యంలో రెండు ప్రభుత్వ వేర్ హౌస్లు, మూడు ప్రైవేట్ ఎరువుల దుకాణాలపై దాడులు జరిపిన అధికారులు ఎరువుల నిల్వలు పరిశీలించి రికార్డులు సరిచూశారు. ముఖ్యంగా యూరియాను నిబంధనల మేరకు అమ్ముతున్నారా లేదా తెలుసుకున్నారు. దాడుల్లో సీడీఏలో సంతోష్ కుమార్ దళబెహర, జిల్లా వ్యవసాయ విభాగ అధికారి లలితేందు మహాపాత్ర, ఏడీఏ కనూచరణ దాస్, జయపురం సమితి అగ్రికల్చర్ అధికారి ిశితికాంత దాస్, అసిస్టెంట్ అగ్రి కల్చర్ ఆఫీసర్ ప్రశాంత పుష్టి, శ్మిత పాఢీ పాల్గొన్నారు. -
బీజేడీ పార్టీలోకి బోడోగుడా గ్రామస్తులు
పర్లాకిమిడి: గుమ్మా బ్లాక్ పోరిడా గ్రామపంచాయతీ పరిధి బోడోగుడా గ్రామానికి చెందిన 40 మంది బీజేపీకి గుడ్బై చెప్పి బీజేడీ పార్టీలో చేశారు. వీరంతా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రూపేష్ సమక్షంలో బీజేడీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించి బీజేడీ పార్టీలో చేరినట్టు ప్రదీప్ నాయక్ తెలియజేశారు. ఈ మిశ్రణ్ పర్వ్లో జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, మహిళా అధ్యక్షురాలు సంయుక్తా బెహారా, యువజన ప్రెసిడెంటు (బీజేడీ) లెంక సిమ్మాద్రి, సిమాన్ మండళ్, రమేష్ బాబు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ సి.హెచ్.వసంత్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ రితీష్ కుమార్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.ఎన్.సంధ్య, డెంటిస్టు డాక్టర్ సల్లాన శరత్కుమార్, తదితరులు హాజరయ్యారు. ఈ వర్క్షాపులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ గుండెపోటు వచ్చి పడిపోయినప్పుడు మనం ఎలా సీపీఆర్ చేయాలి, ప్రతిఒక్కరికీ ప్రాణాపాయం సమయంలో ప్రాథమిక జీవరక్షణ ఎలా చేయాలో ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.సంధ్య తెలియజేశారు. దీనిపై నర్సింగ్ విద్యార్థులకు డెమో చేసి చూపించారు. సీపీఆర్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
పలు భవనాల ప్రారంభం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ బూదర పంచాయతీ గౌరీ గ్రామంలో ముఖ్యమంత్రి స్వతంత్ర సహాయ నిధి నుంచి రూ.4 లక్షలతో పునర్ నిర్మించిన శివ మందిరం, భోగ మండపాలను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మంగళవారం ప్రారంభించారు. వన్న గ్రామంలో సామాజిక భవనం, భామిని గ్రామంలో సీఎం సహాయనిధి రూ.3 లక్షలతో నిర్మించిన స్వర్గద్వార్ (శ్మశానం)ను ప్రారంభించారు. కాశీనగర్ సమితి చైర్పర్సన్ బల్ల శాయమ్మ, జెడ్పీటీసీ (కాశీనగర్–1) రోక్కం రాజ్యలక్ష్మి, బూదర గ్రామ సమితి సభ్యులు బి.బాబూరావు, మాజీ ఉపాధ్యక్షుడు రఘురాం సాహు, తదితరులు పాల్గొన్నారు. -
మిషన్.. అడ్మిషన్
● ఇంటర్ అడ్మిషన్ల వేట ● సంక్రాంతి నుంచే కార్పొరేట్ కాలేజీల హవా మేము విశాఖలో కార్పొరేట్ కాలేజీ నుంచి వచ్చాం. మీ అమ్మాయి బాగా చదువుతుందట. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెస్తుందట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పించండి. అమ్మాయి భవిష్యత్కు మాది భరోసా. మంచి విద్యాబోధనతో పాటు అన్నిరకాల వసతులు ఉంటాయి. ఆలస్యం చేస్తే అడ్మిషన్లు పూర్తవుతాయి. ఇలాంటి అవకాశం మీకు రాదు. కొంత మొత్తం అడ్వాన్స్ కట్టి అడ్మిషన్ను ఖరారు చేసుకోండి. – ఎల్ఎన్పేటకు చెందిన వెన్నెల అనే విద్యార్థిని తల్లిదండ్రులను కార్పొరేట్ ప్రతినిధులు ఒప్పిస్తున్న తీరు ఇది.. హిరమండలం: టెన్త్ పరీక్షలు అయ్యాక కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలలు పెద్ద మిషనే మొదలుపెట్టాయి. నిజానికి పరీక్షల ముందు నుంచే విద్యార్థుల వేట మొదలైంది. తాజాగా పరీక్షలన్నీ ముగియడంతో ప్రచారాలు పతాక స్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా నడిచే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి పీఆర్వోలు వందలా ది మంది జిల్లాలో ఉన్నారు. వారు విద్యాశాఖ వద్ద ఉన్న పదో తరగతి విద్యార్థుల వివరాలు తీసుకొని తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడు చేజారిపోకూడదనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. వీరి దూకుడుకు జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉన్నా అడ్మిషన్ల విషయంలో వెనుకబడుతున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38, ఆదర్శ పాఠశాలలు 13, కేజీబీవీలు 25, ప్లస్ 2 పాఠశాలలు 6, గురుకుల పాఠశాలలు 9 ఉన్నాయి. ప్రతి సంవత్సరం 20 వేలకుపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు 28,176 మంది పరీక్షలకు హాజరుకాగా.. 23,219 మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇందులో కేవలం 6,491 మంది మాత్రమే జిల్లాలో ఇంటర్లో చేరారు. ఈ ఏడాది 29,362 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరికలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నా యి. అధ్యాపకుల కొరత విద్యాబోధనపై ప్రభావం చూపుతోంది. అటు ఆశించిన స్థాయిలో జూనియర్ కాలేజీల్లో వసతులు ఉండడం లేదు. ఉత్తీర్ణతా శాతం అంతంత మాత్రమే. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. వైఎస్సార్సీపీ హయాంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీబీవీల్లో ఇంటర్ కాలేజీలను అప్గ్రేడ్ చేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులు సబ్జెక్టులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగం, ఉపాధినిచ్చే కోర్సులు సైతం వచ్చాయి. అలాగే 2021లో నరసన్నపేట మండలం ఉర్లాం, సరుబుజ్జిలి మండలం రొట్టవలస, పలాస మండలం బ్రాహ్మణతర్లా, మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు, టెక్కలి మండలం టెక్కలిలో ప్లస్ 2గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేశారు. అప్పట్లో ఇవన్నీ విద్యార్థులతో నిండిపోయి కళకళలాడేవి. కానీ గత రెండేళ్లలో సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేసవిలో అధికారులు అవగాహన పెంచుతున్నా విద్యార్థులు ఆసక్తి చూపని పరిస్థితి. పీఆర్వోల హల్చల్ జిల్లా నుంచి ఎక్కువగా విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో చేరుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. కానీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం సీట్లు నిండడం లేదు. సంక్రాంతి నుంచే కార్పొరేట్ కంపెనీల పీఆర్వోలు గ్రామాల్లో ప్రవేశిస్తున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి ఫీజులతో పాటు హాస్టల్కు రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. మీ పిల్లాడు చాలా బాగా చదువుతాడట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పిస్తే పిల్లాడి భవిష్యత్కు మాదీ భరోసా. విద్యార్థికి ఇంటర్ కీలకం. అందుకే మా కాలేజీలో చేర్పించండి. మంచి విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి అన్నిరకాల శిక్షణలు ఇస్తాం. నీట్, జేఈఈ, ఎంసెట్ ఇలా అన్ని రకాల శిక్షణలు ఉంటాయి. ముందుగా చేరితే ఫీజుల్లో రాయితీ ఉంటుంది. ఆలస్యం చేస్తే వెనుకబడి పోతారు. – హిరమండంలో శ్రీనివాస్ అనే పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను కలిసి కార్పొరేట్ కాలేజీ ప్రతినిధులు చెప్పిన మాట ఇది..ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధనతో పాటు సౌకర్యాలు ఉంటాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇవి ఎంతో మేలు. అనవసరం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భారం పడవద్దు. కేజీబీవీల్లో విద్యార్థినులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధన, రక్షణ, వసతులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి. – కృష్ణవేణి, ఎస్ఓ, హిరమండలం కేజీబీవీ -
రైలు ఢీ కొని యువకుడు మృతి
పాతపట్నం: మండలంలోని తెంబూరు రైల్వే స్టేషన్ సమీపంలోని తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో రైలు ఢీ కొని తెంబూరు ఎస్టీ వీధికి చెందిన గిట్టంగి హిమగిరిరావు(20)మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... మంగళవాం సాయంత్రం గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు తెంబూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత.. తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో గిట్టంగి హిమగిరిరావును ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తండ్రి గిట్టంగి అప్పలస్వామి, తల్లి గిట్టంగి లక్ష్మి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు పోవు ఎన్హెచ్–16 రోడ్డు మీద సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు. తాళ్లవలస వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేశారు. మృతుని శరీరంపై బిస్కట్ రంగు చొక్కా లుంగీ ధరించి ఉన్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందిచాలని లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి తెలిపారు. వివరాలు తెలిస్తే ఫోన్ నంబర్స్ 6309990816, 6309990851 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సంపద పంపిణీతోనే సామాజిక న్యాయమని, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ జయంతులను వాడవాడలా నిర్వహించి సామాజిక న్యాయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో కొద్దిమంది దగ్గర పోగుపడిన సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునఃపంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలని, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న అన్ని శ్రామిక సంఘాలు, దళిత, బహుజన, మైనార్టీ, మహిళా సంఘాలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాంగానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం అంటేనే బిలియనీర్లు, కార్పొరేట్ల ప్రభుత్వమని పేరు పొందిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై.వేణు తదితరులు పాల్గొన్నారు. మందస: మందస మండలం పుచ్చపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడి వృద్ధుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన శిష్టు బీమారావు(72) ఊరిలోని రావి చెట్టు చెరువు వద్దకు వెళ్లి కాళ్లు కడుగుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే నీటిలో పడి ప్రాణాలు వదిలేశారు. సాయంత్రం అటుగా వెళ్తున్న గ్రామస్తులు బీమారావును గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే అంబుగాం గ్రామంలో ఇంటిపై పిడుగు పడి ఓ మహిళ అస్వస్థతకు గురైంది. భిన్నళమదనాపురంలోనూ చెట్టుపై పిడుగు పడి పక్కన ఉన్న పూరి గుడిసైపె మంటలు రేగాయి. -
మనస్తాపంతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
రాయగడ: మనస్తాపానికి గురైన ఉపాధ్యాయుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని గునుపూర్లో సోమవారం చోటు చేసుకుంది. మృతుడు గుణుపూర్లో గల శివశక్తి నగర్ రెండో నంబరు కాలనీలో నివాసముంటున్న కృష్ణ సేనాపతి (53)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గుడారి సమితి డిమిరిగుడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సేనాపతి గత కొద్ది నెలలుగా పక్షవాతంతో మంచం పట్టారు. నడవలేని దుస్థిఽతి ఏర్పడింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేందుకు ఇష్టం లేక మానసికంగా ఆందోళన చెందారు. మనస్థాపానికి గురై ఇంటికి సమీపంలో గల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సబ్ డివిజన్ హాస్పటల్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా రగ్బీ పోటీలు
భువనేశ్వర్: 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) రగ్బీ చాంపియన్షిప్ 2025–26 అండర్ 17 పోటీలు కళింగ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగాయి. ఈ పోటీల్లో ఆతిథ్య ఒడిశా బాలికల జట్టు టైటిల్ కై వసం చేసుకోగా, బీహార్ బాలుర జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. అండర్ 17 బాలికల విభాగంలో ఒడిశా అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. బీహార్ రన్నర్ అప్గా నిలిచింది. మహారాష్ట్ర మరియు ఢిల్లీ వరుసగా మూడు, నాల్గో స్థానాలను దక్కించుకున్నాయి. అండర్ 17 బాలుర విభాగంలో ఫైనల్లో ఒడిశాపై బలమైన ప్రదర్శన కనబరిచిన బీహార్ విజయం సాధించింది. ఒడిశా రన్నరప్గా నిలిచింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా మూడు, నాల్గో స్థానాల్లో నిలిచాయి. అండర్ 17 విభాగం ముగింపు వేడుకకు క్రీడలు, యువజన సేవల డైరెక్టర్ డాక్టర్ యెద్దుల విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాజరైన ఇతర ప్రముఖులలో మాధ్యమిక విద్యా విభాగం డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా, సహాయ డైరెక్టర్ (పీఈటీ) జ్యోతి ప్రసాద్ పరిడా, టోర్నమెంట్ పరిశీలకుడు అరవింద్ యాదవ్ ఉన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ యెద్దుల విజయ్ యువ క్రీడాకారుల అంకితభావం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని ప్రశంసించారు. ఆయన విజేతలను అభినందించి పాల్గొన్న వారందరూ శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేయాలి. ఉన్నత స్థాయి పోటీలను లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రోత్సహించారు. వ్యక్తులను అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దడంలో పాఠశాల క్రీడల ప్రాముఖ్యతను మాధ్యమిక విద్యా విభాగం డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా వివరించారు. క్షేత్రస్థాయిలో రగ్బీని ప్రోత్సహించడంలో ఇలాంటి చాంపియన్షిప్లు కీలక పాత్ర పోషిస్తాయని టోర్నమెంట్ పరిశీలకుడు అరవింద్ యాదవ్ అన్నారు. ఈ చాంపియన్షిప్లో భాగంగా అండర్ 14 బాలురు, బాలికల మ్యాచ్లు ఈ నెల 9 మరియు 10 తేదీలలో కళింగ స్టేడియం ప్రాంగణంలో జరగనున్నాయి. -
ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
● వంటగదిని వేరే చోటుకు మార్చాలని ఆదేశం రాయగడ: జిల్లా కేంద్రాస్పత్రిని రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక సోమవారం ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగో అంతస్తులో నిర్వహిస్తున్న వంటగదిని అక్కడ నుంచి తరలించి వేరే సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. నాలుగో అంతస్తులో పిడియాట్రిక్, అర్థోపెడిక్ తదితర వార్డులు ఉన్న నేపథ్యంలో ఏదైన అగ్ని ప్రమాదం సంభవిస్తే అయా వార్డుల్లోని రోగులను తరలించడం కష్టంగామారే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తులో రోగులను తరలించడానికి ర్యాంప్, లిఫ్టు వంటి సౌకర్యాలు లేకపొవడంతో కేవలం మెట్ల ద్వారా రాకపోకలు చేయాల్సిన దుస్థితి ఉండటం విచారకరమన్నారు. అలాగే నాలుగో అంతస్తులో పిల్లల కోసం కేటాయించిన వార్డుని మూసివేసి ఆ స్థానంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను ఉంచి స్టోర్ రూంగా మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా భవనం ఐదో అంతస్తులో ఉన్న డ్రెస్సింగ్ సామగ్రి, కుప్పలుగా పడి ఉన్న వాటి పరికరాలు, స్పిరిట్ వంటివి ఎంఎల్ఏ పరిశీలించారు. వీటన్నిటి దృష్ట్యా పై అంతస్తులో ఉన్న వంట గదిని వేరే ప్రాంతానికి తరలించాలని లేదంటే ప్రమాదం సంభవిస్తే చాలా ప్రాణనష్టం సంభవించే అవకాశం లేకపొలేదని హెచ్చరించారు. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం భువనేశ్వర్: రాష్ట్రంలో సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన రహదారి దుర్ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రౌర్కెలా యమునాఢిప్ప వద్ద 143 నంబరు జాతీయ రహదారిపై కారు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చంపరాణ్ మటన్ హండి ఢాబా హోటల్ లోకి దూసుకు పోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కుంవర్ముండా సమీపంలో ముగ్గురు యువకులు నల్లటి కారులో రౌర్కెలా వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం రౌర్కెలా ఆస్పత్రిలో చేర్చారు. బీరమిత్రపూర్ ఠాణా మరియు కుంవర్ముండా ఔట్ పోస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టిన ట్రక్కు బాలాసోర్ జిల్లా 16వ నంబరు జాతీయ రహదారిపై దొహిసొడ కూడలి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక ట్రక్కు మరో ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్సాహంగా రేస్ జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో ఒడియా పక్ష 2026 సందర్భంగా సోమవారం ఒక చారిత్రక మాస్ రేస్–2026ను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్, యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ ఒడియ లాంగ్వేజ్, లిటరేచర్, అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ సమాచార ప్రజా సంబంధాల విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షించింది. ఈ మాస్ రేస్లో వివిధ విభాగాలకు చెందిన మహిళలు పాల్గొని ఒడియా భాష, సంస్కృతి, సాహిత్యాల ప్రగతికి ప్రతి వారు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రతి దుకాణం, వ్యాపార వాణిజ్య సంస్థలు ఒడియా భాషలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. -
రాజ్యసభలో ఒడిశా ఎంపీల ప్రమాణ స్వీకారం
భువనేశ్వర్: ఒడిశా నుంచి కొత్తగా ఎన్నికై న ముగ్గురు రాజ్య సభ ఎంపీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో మన్మోహన్ సామల్, సంతృప్త్ మిశ్రా, దిలీప్ రే ఉన్నారు. రాజ్య సభ ఛైర్మన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. బిజూ జనతా దళ్ టికెట్పై ఎన్నికై న డాక్టర్ సంతృప్త్ మిశ్రా తొలిసారిగా రాజ్య సభకు ఎన్నికై సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మన్మోహన్ సామల్ రాజ్య సభకు ఎన్నిక కావడం ఇది రెండో పర్యాయం. ఆయన గతంలో 2000 నుండి 2004 వరకు ఎగువ సభలో ప్రాతినిథ్యం వహించారు. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై న దిలీప్ రే 18 ఏళ్ల తర్వాత రాజ్య సభలోకి తిరిగి అడుగు పెట్టడం విశేషం. రాజ్య సభకు ఎన్నిక కావడం తనకు ఇది మూడో సారి. ఆయన గతంలో 1996 నుంచి 2002 వరకు, 2002 నుండి 2008 వరకు వరుసగా 2 పర్యాయాలు రాజ్య సభ సభ్యుడిగా పని చేశారు. ఒకసారి జనతా దళ్ టికెట్పై, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. -
ఎస్డీసీ చైర్మన్ల నియామకం
● రాయగడ జిల్లాకు చైర్మన్గా బిద్యాధర్ సబర్, వైస్ చైర్మన్గా మంజుల రాయగడ,భువనేశ్వర్: రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 23 జిల్లాలకు స్వతంత్ర అభివృద్ధి మండలి (ఎస్డీసీ )చైర్మన్, వైస్చైర్మలను నియమిస్తూ రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాయగడ జిల్లా ఎస్డీసీ చైర్మన్గా బిద్యాధర్ సబర్, వైస్ చైర్మన్ గా మంజుల మినియాకలు నియమితులయ్యారు. జిల్లాలోని ఆదివాసీ, హరిజన ప్రాంతాల సమన్వయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడే ఎస్డీసీ సంస్థ గత బీజేడీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. అయితే గత ఎన్నికల్లో బీజేడీ పార్టీ అధికారం కోల్పోవడం.. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్డీసీని రద్దు చేసింది. అనంతరం 19 నెలల సుధీర్ఘకాలం తరువాత మళ్లీ ఆ సంస్థను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా ఎస్డీసీలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో అనుగుల్ జిల్లాకు చైర్మన్గా బషిష్ట నాయక్, వైస్ చైర్మన్గా సురుమాణి ఛత్తర్, బలంగీర్ జిల్లాకు చైర్మన్గా బల్లవ్ దరువ, వైస్ చైర్మన్గా జయంతీ భొయ్, బాలేశ్వర్ జిల్లాకు చైర్మన్గా బిపిన్ మారండి, వైస్ చైర్మన్గా ఝరనా సింగ్, బరఘడ్కు చైర్మన్గా గొవర్ధర్ భొయ్, వైస్ చైర్మన్గా తిలొత్తమా బూయి, బౌధ్కు చైర్మన్గా దమరూధర్ కన్హర్, వైస్ చైర్మన్గా ఝరనా జాని, దేవఘడ్కు చైర్మన్గా ప్రశాంత కుమార్ బెహర, వైస్ చైర్మన్గా ప్రమీలా కిషన్, ఢెంకానల్ జిల్లాకు చైర్మన్గా నవురి సింగ్ వైస్ చైర్మన్గా సేబతి భొయ్, గజపతి జిల్లాకు నీలమాధవ్ పాత్రో, వైస్ చైర్మన్గా లలితా ప్రధాన్, జాజాపూర్కు చైర్మన్గా రాజేంద్ర కండులియా, వైస్ చైర్మన్గా సని జరిక, ఝార్సుగుడకు చైర్మన్గా సునీల్ నాయక్, వైస్ చైర్మన్గా సంజుక్త ఓరం, కలహండి జిల్లాకు చైర్మన్గా బిజయ్ కుమార్ దిసారి, వైస్ చైర్మన్గా రినా భొయ్, కంధమాల్ జిల్లాకు చైర్మన్గా మనగొవింద ప్రధాన్, వైస్ చైర్మన్గా కల్పనా కుమారి కన్హర్, కేంజర్ జిల్లాకు చైర్మన్గా మమిత నాయక్, వైస్ చైర్మన్గా మానస్ కుమార్ నాయక్, కొరాపుట్ జిల్లాకు చైర్మన్గా భగవాన్ ముదులి, వైస్ చైర్మన్గా సుశాంతి మాఝి, మల్కనగిరి జిల్లాకు చైర్మన్గా గంగాధర్ సొడి, వైస్ చైర్మన్గా సావిత్రీ పడియామి, మయూర్భంజ్ జిల్లాకు చైర్మన్గా డాక్టర్ బుధామ్ ముర్ము, వైస్ చైర్మన్గా కౌసల్యనాయక్, నవరంగపూర్ జిల్లాకు చైర్మన్గా బాసంతి మాఝి, వైస్ చైర్మన్గా లింగరాజ్ భత్ర, నయాఘడ్కు చైర్మన్గా త్రినాఽథ్, వైస్ చైర్మన్గా మల్లిక్, సమితి డెవురి, నువాపడకు చైర్మన్గా హోమి సింగ్ మాఝి, వైస్ చైర్మన్గా బెలమతి మాఝి, సంబల్పూర్కు చైర్మన్గా భాగీంద్ర కిషాన్, వైస్ చైర్మన్గా సుస్మా ముండ, సుందర్ఘడ్ జిల్లాకు చైర్మన్గా సంతోష్ కుమార్ అమిత్, వైస్ చైర్మన్గా గంగీ కింపోలు నియమితులయ్యారు. బిద్యాధర్ సబర్ మంజుల మినియాక -
విద్యార్థులపై సీనియర్ల దాడి!
● ఇద్దరికి గాయాలు ● పోలీలకు తల్లిదండ్రుల ఫిర్యాదు రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య శనివారం రాత్రి కొట్లాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు తీవ్రగాయాలకు గురయ్యారు. దీనికి సంబంఽధించి బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అంబొదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న కొంతమంది సీనియర్ విద్యార్థులు శనివారం రాత్రి అదే పాఠశాలకు చెందిన హాస్టల్లో ఉంటున్న కొంతమంది విద్యార్థులపై దాడి చేశారు. మంచాలకు కట్టిఉన్న దోమతెరలు ఇనుప ఊచలతొ దాడి చేయడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలకు గురయ్యారు. గాయాలకు గురైన వారిని ఎనిమిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. వీపు, కాళ్లపై వీరికి గాయాలయ్యాయి. కాగా తాము దాడి చేసినట్లుగా ఎవరికై నా చెబితే ఇదేతరహా మళ్లీ దాడి చేస్తామని దాడికి పాల్పడిన విద్యార్థులు హెచ్చరించారు. అయితే తమకు జరిగిన దాడి విషయమై బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు హాస్టల్ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే అటువంటిదేమీ లేదని వారు సంఘటనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇటవంటి తరహా ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతున్నప్పటికీ నిర్వాహకుల్లో ఎటువంటి స్పందన లేకపొవడంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. -
బలిమెల గ్రీవెన్స్లో 16 వినతులు స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల టౌన్హాల్లో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 16 వినతులు అధికారులకు అందాయి. వాటిలో పది వ్యక్తిగత సమస్యలు కాగా ఆరు గ్రామీణ సమస్యలకు వినతులకు చెందనవి ఉన్నాయి. ఫిర్యాదుల పరిశీలన అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, భూమిపట్టాలు, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, సహాయంపై అధికారులు చర్చించారు. తాగునీరు, విద్యుత్ కనెక్షన్, రహదారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, అటవీశాఖ అధికారి సాయికిరణ్, అభివృద్ధి శాఖ అధికారి దశరాధి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధన్, బీడీవోలు పాల్గొన్నారు. -
జాతీయ రగ్బీ చాంపియన్షిప్
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కళింగ స్టేడియంలో ..భువనేశ్వర్: అండర్ 17 బాలురు, బాలికల 69వ భారత పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్.జి.ఎఫ్.ఐ) రగ్బీ జాతీయ చాంపియన్షిప్ పోటీలు స్థానిక కళింగ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడలు, యువజన సేవల శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి భూపేంద్ర సింగ్ పూనియా ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాస్తవ క్రీడా స్ఫూర్తితో పోటీపడి అంతర్జాతీయ స్థాయిలో తమ రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కృషి చేయాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులలో పాఠశాల, సామూహిక విద్యా శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి డాక్టర్ ఎన్.తిరుమల నాయక్, మాధ్యమిక విద్యా డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా, సహాయ డైరెక్టర్ (పీ.ఈ.టి) జ్యోతి ప్రసాద్ పరిడా, ఎస్జిఎఫ్ఐ పరిశీలకుడు అరవింద్ యాదవ్, అంతర్జాతీయ రగ్బీ క్రీడాకారిణి డుముణి మరాండి పాల్గొన్నారు. యువ క్రీడాకారులతో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. కళింగ స్టేడియం వంటి అంతర్జాతీయ వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల, సామూహిక విద్యా శాఖను ఎస్జిఎఫ్ఐ పరిశీలకుడు యాదవ్ అభినందించారు. భవిష్యత్లో ఒడిశాలో మరిన్ని అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, న్యూఢిల్లీ, గుజరాత్, జమ్మూ – కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, సీబీఎస్ఈ వెల్ఫేర్ స్పోర్ట్సు ఆర్గనైజేషన్, కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్తో సహా 15 రాష్ట్రాలు, సంస్థల నుంచి మొత్తం సుమారు 460 మంది క్రీడాకారులు అండర్ 17 చాంపియన్ షిప్లో పాల్గొంటున్నారు. -
వీధికెక్కిన ఉత్తీర్ణ వైద్యులు
భువనేశ్వర్: ఉత్తీర్ణ వైద్యుల అసంతృప్తి కట్టలు తెంచుకుంది. 10 ప్రధాన డిమాండ్లతో ఈ వర్గం సోమవారం నిరసన ప్రదర్శించింది. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓపీఎస్సీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. తమ వృత్తి భవిష్యత్పై నెలకొన్న అనిశ్చితి తొలగించడంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారుల సమాచారం ప్రకారం, ఓపీఎస్సీ గత సంవత్సరం మే నెలలో మొత్తం 5,284 మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. వారిలో దాదాపు 3,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 1,840 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 822 మంది అభ్యర్థులకు మాత్రమే నియామక పత్రాలు జారీ చేశారు. మిగిలిన 1,018 మంది ఉత్తీర్ణ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయలేదు. ఈ మేరకు స్పష్టమైన వివరణ లేకుండా అనుబంధ వర్గాలు వేధిస్తున్నారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో ష్పక్షపాత వైఖరితో పారదర్శకత ప్రదర్శించాలని ఓపీఎస్సీ అధికారులను కోరారు. ఈ సమస్య పరిష్కరించి తమ వృత్తిపరమైన అనిశ్చితి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. -
ముగిసిన బంగారమ్మతల్లి ప్రతిష్టోత్సవాలు
రాయగడ: సదరు సమితి కొత్తపేట వద్ద గ్రామదేవతగా పూజలందుకుంటున్న బంగారమ్మతల్లి మందిర, విగ్రహ ప్రతిష్టోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ నెల నాలుగో తేదీ నుంచి కొనసాగిన ప్రతిష్టోత్సవాల్లో భాగంగా చివరి రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, చండీహోమ పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సామూహిక కుంకుమార్చన పూజలను వీరఘట్టం నుంచి వచ్చిన ప్రముఖ యజ్ఞయుగకర్త ఎస్ఎల్వీఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్తపేట ప్రముఖులు పెద్దీన మురళి, పొట్నూరు మణిరత్నం, సతీష్ కుమార్, తపన్ కుమార్, ప్రసాద్ హుయిక, కిశోర్కుమార్, నకిన గౌరి, ముర్రా ప్రసాద్, మోహన్ సాహుల నేతృత్వంలో ఉత్సవాలు జరిగాయి. -
రూ.44 లక్షలతో బృందావన ప్యాలస్ అభివృద్ధి
పర్లాకిమిడి: మహేంద్రతనయ నది ఒడ్డున ఉన్న బృందావన ప్యాలస్ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు రూ.44 లక్షల నిధులు మంజూరు చేసినట్లు జిల్లా టూరిజం అఽధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి సోమవారం తెలియజేశారు. ఈ నిధులను ఒడిశా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఓ. టి.డి.సి)కి పనులు అప్పగించడంతో ప్యాలస్ పను లు జోరందుకున్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ పాలకు ల విలాస విడిదిగా నిలయమైన బృందావన్ ప్యాలస్లో అనేక ఒడియా చలనచిత్రాలు షూటింగ్లు జరిగాయి. ఇన్నాళ్లకు ఒడిషా టూరిజం శాఖ ఈ ప్యాలస్ మరమ్మతులకు శ్రద్ధ పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
అడవులను రక్షించేందుకు యువకుల కృషి
జయపురం: కార్చిచ్చు నుంచి అడవులను కాపాడుకొనేందుకు జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి గ్రామాలకు చెందిన యువకులు కృషి చేస్తున్నారు. ఇటీవల అరణ్యంలో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. వీటిని చూసిన వెంటనే గ్రామస్తులు వెళ్లి మంటలను అదుపు చేస్తున్నారు. బొయిపరిగు డ సమితి రామగిరి పంచాయితీ కుంభిఖార గ్రామ సమీపంలోని అడవులపై కలప అక్రమ రవాణా మాఫీయ కన్నుపడడంతో నిప్పు పెట్టి విలువైన చెట్లను కాల్చివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారి బారినుంచి అడవులను రక్షించేందుకు మహిళలు, యువకులు, పురుషులు కాపుకాస్తున్నా రు. ఆ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో 50 హెక్టార్లలో అడవి ఉంది. ఆ అడవులను రక్షించుకొ నేందుకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ వేసవి కావడంతో తరచూ ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆదివారం సా యంత్రం కుంభిఖారి గ్రామానికి కొంత దూరంలో అడవిలో మంటలు వ్యాపించడాన్ని చూసిన గ్రామస్తులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు.ఇలా సమితిలోని పలు ప్రాంతాలలో గ్రామస్తులు అడవుల పరిరక్షణకు ముందుకు వస్తున్నారని అటవీ అధికారులు తెలిపారు. -
రూ.25 వేల చెక్కు అందజేత
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి (స్వ యం ప్రతిపత్తి) కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్పుల కోసం పూర్వ విద్యార్థి, ప్రొఫెసర్ పరనందిబాబు (యు.ఎస్.ఎ.) రూ.25 వేల చెక్కును ప్రిన్సిపా ల్ రాధాకాంత భుయ్యాన్కు సోమవారం అందజేశారు. చెక్కు అందించిన వారిలో సీనియర్ న్యాయవాది వి.ఎస్.ఎన్.రాజు, టి.సీతారాం, మల్లా శ్రీను, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఉన్నారు. పర్లాకిమిడి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇరదల వీధిలో గజపతి జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో, నృసింహా చరణ్ పట్నాయక్, సీనియర్ నాయకులు ఛిత్రి సింహాద్రి, కాశీనగర్ మండల అధ్యక్షుడు కోడూరు జీవన్రావు, ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి: గంజాయ్ అక్రమ రవాణా గుట్టురట్టయింది. గజపతి జిల్లా మోహానా నియోజకవర్గం అడవ పంచాయతీలోని కరిగేజు ఏజెన్సీ లో సోమవారం వేకువజాము నుంచి పోలీసు లు, ఎకై ్సజ్ సిబ్బంది ముమ్మరంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 112 ప్లాస్టిక్ బ్యాగుల్లో భద్రపరిచిన గంజాయిని అడవుల్లో గమనించి స్వాధీనం చేసుకున్నారు. దీనిని మోహానా మేజిస్ట్రట్ ఆధ్వర్యంలోకాటా వేయగా 2,811 కిలోలు (2.8 టన్నులు) ఉన్నట్టు నిర్ధారించారు. దీని విలువ మార్కెట్లో రూ. 2.81 కోట్లకు పైగా ఉంటుందని ఆర్.ఉదయగిరి ఎస్డీపీవో రాకేష్కుమార్ సాహు తెలిపారు. ఈ ఘటనపై అడవ పోలీసుస్టేషన్ అధికారులు కేసునమోదు చేశారు. జయపురం: జయపురం–నవరంగపూర్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తక్కువగా ఉందని.. ప్రస్తుత మార్కెట్ ధర మేరకు పరిహారం ఇవ్వాలని జయపురం సమి తి ధనపూర్ పంచాయతీ రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం రైల్వే లైన్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న 16 మంది రైతులు జిలిమిలిలోని ధనపూర్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 4.40 లక్షలుగా నిర్ణయించారని.. అయితే మార్కెట్లో ఎకరా రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు ఉందని వారు వెల్లడించారు. అందుచేత కనీసం ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఐదు రెట్లు పెంచాలని, భూములు ఇచ్చిన ప్రతి కుటుంబంలో ఒకరికి రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలని కోరారు. రెవెన్యూ అధికారిని కలిసిన వారిలో రామ పాణిగ్రహి, ప్రహ్లాద్ తదితరులున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక చిన్న బ్రాహ్మణ వీధి సమీప జాతీయ రహదారిపై సోమవారం ఒక కారు అదుపు తప్పి రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోవడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బరంపురం నుంచి నిక్కి మహాంతి తన కుమారుడు కేదార్ మహంతితో కలసి కారులో శ్రీకాకుళం వైపు వెళ్తుండగా టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారిపోవడంతో కారు రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. -
14 విశ్వ విద్యాలయాలకు వీసీల నియామకం
భువనేశ్వర్: దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న విశ్వ విద్యాల యాల వైస్ చాన్స్లర్ల నియామకం ప్రక్రియ పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబా బు కంభంపాటి ఆమోదం మేరకు ఈ నియామకా లు జరిగాయి. ఉత్కల్ విశ్వవిద్యాలయం, రెవెన్షా విశ్వవిద్యాలయం, ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం, ధరణీధర్ విశ్వవిద్యాలయం, గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయం, ఖల్లికోట యూనిటరీ విశ్వవిద్యాలయం, మధుసూదన్ లా విశ్వవిద్యాల యం, మా మణికేశ్వరి విశ్వవిద్యాలయం, మహా రా జా శ్రీరామ్ చంద్ర భంజ్ దేవ్ విశ్వవిద్యాలయం, రమా దేవి మహిళా విశ్వవిద్యాలయం, రాజేంద్ర విశ్వవిద్యాలయం, శ్రీ జగన్నాథ సంస్కృత విశ్వవిద్యాలయం, విక్రమ్దేవ్ విశ్వవిద్యాలయం మరి యు ఒడియా విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్ల ను గవర్నర్ నియమించారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్ల దార్శనికత మరియు మార్గదర్శకత్వంలో ఆయా విశ్వవిద్యాలయాలు విద్య, పరిశోధన, ఆవిష్కరణలలో రాణించడం కొనసాగిస్తూ ఒడిశాలో ఉన్నత విద్య భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని చాన్స్లరు డాక్టరు హరి బాబు కంభంపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. -
వడగళ్ల వాన బీభత్సం
భువనేశ్వర్: కాలవైశాఖి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా బొలంగీర్ జిల్లా పట్నాగడ్ ప్రాంతంలో భారీ వడగళ్ల వాన ముంచెత్తి, ఆస్తి, వ్యవసాయ రంగానికి అపార నష్టాన్ని కలిగించింది. ఈ ప్రాంతంలో పంటలకు, ఇళ్లకు తీవ్ర నష్టం సంభవించింది. పెసర, కూరగాయల పంటలు నీట మునిగాయి. భారీ వడగళ్లు ఆస్బెస్టాస్ షీట్లను చిల్లు లు పడేలా చేసి, మట్టి పెంకులను పగలగొట్టి నివా స భవనాలను దెబ్బతీశాయి. పఢేల్ గ్రామం అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చవిచూసింది. కటక్ జిల్లా అఠొగొడొ పట్టణంలో కాలవైశాఖి తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రాంతంలో నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్ఏసీ) స్వాగత తోరణం కుప్పకూలిపోయింది. పాత కటక్,, సంబల్పూర్ రహదారిపై కరికోల్ పెట్రోల్ పంప్ సమీపంలో అఠొగొడొ భారీ కాంక్రీట్ ఎన్ఏసీ స్వాగత తోరణం కారుపై కూలిపోయింది. కారు నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. గాలులకు పెద్ద చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించబడ్డాయి, విద్యు త్ తీగలు తెగిపోయాయి. -
బుజ్జాయికి పెద్ద కష్టం
ఇచ్ఛాపురం రూరల్: లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన ఇసురు దానయ్య–శ్రావణి దంపతులకు చెందిన రెండు నెలల పసిపాప యామిని ప్రాణాల కోసం పోరాడుతోంది. జన్మతః మలవిసర్జనకు అవసరమైన మార్గం సరిగా ఏర్పడకపోవడంతో చిన్నారి తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ప్రస్తుతం పాప వయసు కేవలం రెండు నెలల 7 రోజులు మాత్రమే కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స కోసం మరో అత్యవసర ఆపరేషన్ అవసరమని సూచించారు. శస్త్ర చికిత్స, మందులు, ఆస్పత్రి ఖర్చులు కలిపి సుమారు నాలుగు లక్షలు అవసరమని వైద్యులు తెలిపినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవించే చిన్నారి తల్లిదండ్రులు దానయ్య–శ్రావణి దంపతులకు ఈ భారీ ఖర్చు భరించడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు కుమార్తెల్లో చిన్న కుమార్తెకు ఈ సమస్య రావడంతో తమ కుమార్తెను కాపాడుకోవాలని తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. పాప ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని వారు అభ్యర్థిస్తున్నారు. మానవత్వంతో స్పందించి చిన్నారి ప్రాణాలను రక్షించాలని కుటుంబం వేడుకుంటోంది. ఆర్థిక సాయం అందించే దాతలు 9986856973 నంబర్కు సంప్రదించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మల విసర్జన లోపంతో ఆస్పత్రి పాలు కుమార్తెను దక్కించుకునేందుకు తల్లిదండ్రుల ఆరాటం దాతల సాయం కోసం ఎదురు చూపులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసిపాప యామిని -
స్కూటీని ఢీకొన్న బస్సు
● ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం ● మృతురాలిది గోరఖ్పూర్ ఆరిలోవ: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోర ఖ్పూర్కు చెందిన షాతక్షిరావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కళాశాల కు సెలవులు కావడంతో వారిద్దరూ కలిసి సోమవా రం విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుకనే వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకు న్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కు తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్వచ్ఛ భారత్
పర్లాకిమిడి: ఒడిశా దివాస్ పక్షోత్సవాల సంద ర్భంగా సోమవారం ఉదయం బృందావన్ ప్యాలస్లో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. బృందావన్ ప్యాలస్ ఆవరణలో చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్ను తొలగించారు. మున్సిపల్ చైర్పర్సన్ నిర్మలాశె ఠి, జిల్లా టూరిజంశాఖ అధికారి అరుణ్కుమార్ త్రిపాఠి, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, ఎస్ఐ (పురపాలక) ఎన్.ధనేశ్వరరావు, జిల్లా సాంస్కృతికశాఖ అధికారి అర్చనా మంగరాజ్, 9వ వార్డు కౌన్సిలర్ నారాయణ బెహరా, పురపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ప్రేమ్ పహాడ్ వద్ద.. రాయగడ: మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వ ర్యంలో సొమవారం స్థానిక చెక్కాగుడ వద్ద గల ప్రేమ్ పహాడ్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయ క్, కార్యనిర్వాహక అధికారి కులదీప్కుమార్ ఆధ్వర్యంలో పేమ్ పహాడ్ పరిసర ప్రాంతాల్లో గల చెత్తాచెదారాన్ని తొలగించారు. మున్సిపాలి టీ పరిధిలో గల వార్డుల కౌన్పిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. -
నాటిక పరిషత్ పోటీల విజేత హైదరాబాద్
కవిటి : మండలంలోని బొరివంకలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల పరిషత్ నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలు మానాపురం సత్యన్నారాయణ, బల్లెడ మోహనరావు, ఎల్.రామలింగ స్వా మిలు ఫలితాలు వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్ గోవాడ ఆర్ట్స్ వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయా ఆర్ట్స్ గుంటూరు వారి ‘సహాన’, తృతీయ స్థానంలో కరీనగర్ చైతన్య కళాభారతి వారి స్వప్నం కురిసిన అమృతం నిలిచాయి. ఉత్తమ సంగీతం సహాన నాటికలో లీలామోహన్, ఉత్తమ రంగాలంకరణ రమణ అప్పారావు(చిటికెనవేలునాటిక), ఉత్తమ ఆహార్యం మా ఇంట్లో మహాభారతం చిత్రాలకు దక్కాయి. స్వర్గీయ బెందాళం ప్రకాష్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రముఖ రంగస్థల నటుడు యడ్ల గోపాలం, ప్రముఖ సంగీత కళాకారునిగా గుర్తింపు పొందిన బొంతలకోటి కృష్ణారావుకు నిమ్మన పురుషోత్తం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేశామని కళింగసీమ కళాపీఠం అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణమూర్తి తెలిపారు. -
68 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం డీఆర్డీఏ సమావేశం హాల్లో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెంది న వారి నుంచి 68 వినతులను స్వీకరించారు. జిల్లా అదనపు కలక్టర్ నవీన్ చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వీకరించిన వినతుల్లో 53 వ్యక్తిగత సమస్యలున్నాయి. మరో 15 గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. గ్రామ సమస్యలను సంబంధితశాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహ క అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, ఏఎస్పీ గొసేన్ బర్లా, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చంద్రకాంత్ మాఝి, పలువురు అధికారులు పాల్గొన్నారు. వినతుల వెల్లువ పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు అధిక స్పందన లభించింది. ఉదయం 8 గంటల నుంచే ప్రజా సమస్యలు వినడానికి అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గుణీ మఝి విచ్చేశారు. అదనపు ఎస్పీ సునీల్ కాంత మహంతి, జిల్లా పరిషత్ సి.డి.ఓ దయామయ పాడీ, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. గ్రీవెన్స్కు పర్లాకిమిడి పురపాలక, రాణిపేట, సిద్ధమణుగు గ్రామ పంచాయతీల నుంచి 60 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 49, గ్రామ సమస్యల కు సంబంధించినవి 11 ఉన్నాయి. రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, ప్రథానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. నువాగడ బ్లాక్లో లిబిరిగూడలో తాగునీటికి అవస్థలు పడుతున్నట్టు గ్రామస్థులు ఏ.డి.ఎంకు వినతిపత్రం అందజేశారు. సి.డి.ఎం.ఓ డాక్టర్ శంతుని పాడీ, గుసాని బి.డి.ఓ గౌరచంద్ర పట్నాయక్, తహసీల్దార్ నారాయణ బెహరా, తదితరులు పాల్గొన్నారు. -
అగ్నికి తోటలు దగ్ధం
టెక్కలి: కోటబొమ్మాళిలో వంశధార విద్యా సంస్థలకు ఆనుకుని ఉన్న సుమారు 6 ఎకరాల జీడి, మామిడి, టేకు తోటలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రతి రోజూ కొంత మంది ఆకతాయిలు ఇదే తోటల్లో మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతుంటారని ఈ క్రమంలో సిగరెట్లు తాగి పడేసి ఉండడంతో ఎండిపోయిన ఆకులకు మంటలు వ్యాపించి ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన కొంత మంది పాఠశాలలో ఉన్న మోటారు సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పాఠశాల యజమాని చింతాడ అనిరుద్రడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ ప్రమాదంలో అనిరుద్రుడు, టి.కృష్ణారావు, బోయిన సాయి, మణిపాత్రుని భాను, బాబులు, రవి, భగవాన్లకు చెందిన 6 ఎకరాల జీడి, మామిడి, టేకు తోటలు దగ్ధమై లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. -
అదుపు తప్పిన కారు.. ముగ్గురికి గాయాలు
పలాస: పలాస నెమలినారాయణపురం జాతీయ రహదారి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పర్లాకిమిడికి చెందిన అక్షయ (24), ముఖేష్ పాణిగ్రాహి (52), అమూల్య పాత్రో(52)లు భువ నేశ్వర్ నుంచి తిరుగు ప్రయాణంలో తన సొంతూరు పర్లాకిమిడికి ఇన్నోవా కారులో వస్తుండగా నెమలినారాయణపురం వద్ద సాయంత్రం 5.30 గంటలకు గాలి, దూళి, వర్షం కారణంగా కారు డివైడర్ మీదుగా అవతలి రోడ్డుకు వెళ్లి ఒక లారీని గుద్ది పక్క పొలాల్లోకి దూసుకు పోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముఖేష్ పాణిగ్రాహి, అక్షయలు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయారు. అమూల్య పాత్రో స్వల్పంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముఖేష్ పాణిగ్రాహి పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిఫర్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ సి.ఐ రామకృష్ణ చెప్పారు. -
కొరాపుట్లో స్వల్పంగా భూప్రకంపనలు
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. శనివారం రాత్రి 11 గంటల 31 నిమిషాలకు భూమి ప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొరాపుట్, సిమిలిగుడ, నందపూర్, పొట్టంగి తదితర సమితుల్లో ప్రజలు స్వయంగా ప్రకంపన అనుభూతిని పొందారు. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలలో భూకంప ప్రకంపం వల్ల ఇళ్లు కదలడం రికార్డు అయింది. హఠాత్తుగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడ్డారు. పలువురు గిరిజనులు ఇళ్ల బయట జాగారం చేశారు. ఈ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేల్ మీద 4.4 మాగ్నిట్యుడ్ గా నమోదైంది. -
కళాశాల ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తాను
జయపురం: పట్టణంలోని ప్రభుత్వ బీటెక్ కళాశాల స్థాపనపై సీఎం మోహన్చరణ్ మాఝితో చర్చిస్తానని కొరాపుట్ జిల్లా ప్రణాళిక బోర్డు అధ్యక్షుడు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ వెల్లడించారు. ఆదివారం ఆయన జయపురం వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని వెళ్లడించారు. కాగా పట్టణానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ట్రాక్టర్ ప్రమాదంలో యజమాని మృతి పర్లాకిమిడి: ట్రాక్టర్ను డ్రైవరు బ్యాక్ చేస్తుండగా ఏమరపాటుతో యజమానికి ఢీకొనడంతో ఎం.నాగేశ్వరరావు(48) మృతి చెందారు. ఈ సంఘటన అనుకుండ గూడ గ్రామంలో కలకలం రేపింది. గుమ్మబ్లాక్ జీబ పంచాయతీ ఐదో మైలు వద్ద అనుకుండ గూడ గ్రామంలో ఆదివారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. సొంత ట్రాక్టర్ను బ్యాక్ చేయమని డ్రైవర్ను ఓనరు ముద్దాని నాగేశ్వరరావు చెబుతుండగా, వెనుకన ఉన్న ఇంటి గోడ చూసుకోకపోవడంతో ట్రాక్టరు, గోడ మధ్య యజమాని నలిగిపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని పర్లాకిమిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పర్లాకిమిడి ఆదర్శ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైనట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట సమీపంలోని బాబాయ్ హోటల్ దగ్గర ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన హనుమంతు వనజాక్షి (38) మృతి చెందారు. ఈమె భర్త కామేశ్వరరావుకు కాలికి గాయాలయ్యాయి. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై ఎచ్చెర్ల బంధువుల ఇంటికి పరా మర్శకు వెళ్తుండగా.. బాబాయ్ హొటల్ వద్దకు వచ్చే సమయంలో రాత్రి 9 గంటలకు ఎదురుగా ఒడిశాకు చెందిన బొలేరో వ్యాన్ ఢీకొట్టింది. దీంతో దంపతులు గాయపడ్డారు. వీరిని వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వనజ మృతి చెందారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి జ్ఞానేశ్ ఇంటర్ చదువుతున్నాడు. సాత్విక్ 10వ తరగతి ఎగ్జామ్ రాశాడు. కామేశ్వరరావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వనజ మృతిని తెలుసుకున్న బంధువులు రిమ్స్ ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఎచ్చెర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
మృత్యు పాశం
● పిడుగు పడి తల్లీకూతుళ్ల మృతి ● విషాదంలో మునిగిన పెద్దకేశుపురం ఆ ఇల్లు ఓ చావు చూసి ఎంతో కాలం కాలేదు. అంతలోనే మృత్యుదేవత మళ్లీ ఆ ఇంటిపై మృత్యుపాశం విసిరింది. కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న కుటుంబంపై పిడుగు వేసింది. పెద్ద కేశుపురం గ్రామంలో పిడుగుపాటుకు తల్లీకూతుళ్లు మృతి చెందారు. అచేతనంగా పడి ఉన్న తల్లీకూతుళ్లను చూసి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. మందస: నారాయణపురం పంచాయతీ పెద్ద కేశుపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి మడియా కృష్ణవేణి(35), మడియా లోకేశ్వరి(చిన్ని)(15) అనే తల్లీకూతుళ్లు మృతి చెందారు. కృష్ణవేణి జీడిపిక్కల బడ్డీకి వెళ్లి జీడి పిక్కలు కటింగ్ చేసుకుంటూ జీవనం గడుపుకునేవారు. ఆమె భర్త సుగర్ వ్యాధి కారణంగా గత ఏడాది డిసెంబర్లో చనిపోయారు. అప్ప టి నుంచి మడియా కృష్ణవేణి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె కుమార్తె లోకేశ్వరి ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశారు. ఆదివారం కృష్ణవేణి ఆవులకు నీరు పెట్టడానికి పశువుల శాలకు వెళ్లారు. ఆమె వెంటే కూ తురు కూడా వెళ్లారు. సరిగా అదే సమయంలో వర్షం ప్రారంభమై హఠాత్తుగా పిడుగు పడింది. ఆ ధాటికి తల్లీ కూతుళ్లు ఉన్న చోటనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశారు. చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికే వారికి ప్రాణాలు లేవు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ తిరుమలరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మడియా లోకేశ్వరి(చిన్ని) మడియా కృష్ణవేణి -
ఉత్సాహంగా పరుగు పందాలు
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా, యువజన సాధికారత శాఖ సూచనల మేరకు కొనసాగుతున్న పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం సామూహిక పరుగు పందాల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్చంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా పోటీలను ప్రారంభించారు. స్థానిక కాళీ మందిరం నుంచి ప్రారంభమైన పోటీలు సాధన స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒడియా భాషా దినోత్సవం సందర్భంగా కొనసాగుతున్న పక్షోత్సవాల్లో భాగంగా పరుగు పందాలను జిల్లా యంత్రాంగం నిర్వహించిందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, ఏపీడీ విజయ్ నాయక్, జిల్లా సాంఘీక భద్రత శాఖ అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి పాల్గొన్నారు. పోటీల్లో వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎండలో భక్తుల అవస్థలు
అరసవల్లి: సూర్య నారాయణ స్వామి క్షేత్రంలో భక్తులు ఎండలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు పలు ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం వేసిన టార్పాన్లు నాసిరకానివి కావడంతో ఎక్కడికక్కడ చిరిగిపోయి తెగిపడ్డాయి. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఏర్పా టు చేసిన టార్పాలిన్లు భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పించాయి. ఇక ఆలయం నుంచి బయట ప్రాంతంలో కూడా టెంట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంజాయితో ఇద్దరు అరెస్టు ఇచ్ఛాపురం రూరల్: మండలం ఎం.తోటూరు వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం. చిన్నంనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్ గేటు వద్ద రూరల్ ఎస్ఐ ఆర్.జనార్ధనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం, బింగి కుమార్ను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి 2.100 కిలోల గంజాయి, రెండు మొబై ల్ ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన పత్రి కా సమావేశంలో సీఐ చిన్నంనాయుడు మాట్లాడుతూ గంజాయికి అలవాటుపడిన భుక్త బలరాం, బింగి కుమార్లు వారు పనిచేసే అచ్యుతాపురం పట్టణంలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, అధిక ధరలకు అమ్ముకుంటుంటారని తెలిపారు. బరంపురానికి చెందిన గంజాయి వ్యాపారి నిలంచల వద్ద రూ.3వేలుకు రెండు కిలోలు కొనుగోలు చేసి అచ్యుతాపురం వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్కు వెళ్తున్న సమయంలో ఎల్సీ గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అండర్–18 బాలబాలికల బాస్కెట్ బాల్ ఎంపికలు రేపు శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ జట్ల ఎంపిక ఈనెల 7వ తేదీ మంగళవారం జరుగుతుందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వద్దనున్న ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉన్న బాస్కెట్బాల్ సెలక్షన్ ట్రైన్స్ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు 18 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. డీఎస్సీ కోచ్ అర్జునరెడ్డి మాట్లాడుతూ ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఈ– సేవ సర్టిఫికెట్, రెండు పాస్పోర్ట్సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 9949291288 సంప్రదించాలని ఆయన కోరారు. రణస్థలంలో భారీ ట్రాఫిక్ జామ్ రణస్థలం: రణస్థలంలో జరుగుతున్న పై వంతెన పనులు వాహనదారులకు దినదిన గండంలా మారుతున్నాయి. అలాగే రోడ్డు దాటే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం 9గంటల సమయంలో రామతీర్థాలు కూడలిలో ఉన్న భారీ స్పీడ్ బ్రేకర్ వల్ల అధిక లోడుతో వెళుతున్న లారీ వెనుక చక్రాల వద్ద కట్ ప్లేట్లు విరిగిపోయాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. రణస్థలం నుంచి యూబీ పరిశ్రమ వరకు వాహనాలు బారులు తీరాయి. రణస్థలం దాటేందుకు పక్కాగా రెండు గంటలు పట్టిందంటే ట్రాఫిక్ తీవ్రత ఎంత ఉందో తెలుస్తోంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు జేఆర్ పురం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి గార: వత్సవలస రాజమ్మ తల్లి యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా పడటంతో గాయాలపాలైన లుకలాపు వెంకటరమణ (45) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. గార పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రేగిడి ఆమదాలవలస మండలం లంబకండి గ్రామానికి చెందిన మృతుడు వెంకటరమణతో పాటు గ్రామస్తులు ఆటోలో శనివారం వత్సవలస వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొర్ని గ్రామం మీదుగా వెళ్తుండగా మలుపు వద్ద ఆటో అదుపు తప్పడంతో బోల్తా పడగా, ఆటో కింద ఉండిపోవడంతో గాయాలపాలయ్యాడు. ముందుగా రిమ్స్లో చే ర్పించగా, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం మృతి చెందాడు. కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చోడిపల్లి గంగరాజు తెలిపారు. -
కన్న కొడుకే కాలయముడు
పచ్చటి గ్రామంలో రక్తం చిందింది. మానసిక సమస్యలకు తోడైన తాగుడు అలవాటు ఓ మనిషిని హంతకుడిలా మార్చింది. ఎవరి చేయి పట్టుకుని నడక నేర్చుకున్నాడో, ఎవరి గుండెలపై ఆడుకున్నాడో, ఎవరి రక్తం పంచుకుని పుట్టాడో ఆ వ్యక్తి మీదే దాడికి తెగబడేంతలా పరిస్థితి మారింది. తల కొరివి పెట్టాల్సిన కొడుకే ఆయుష్షును తీసేయడంతో పెద్ద లోహరిబంద బోరున విలపించింది. మందస: పెద్ద లోహరిబంద ఆదివారం రోదించింది. కొడుకు చేతిలో కన్నతండ్రి హతం కావ డంతో ఊరుఊరంతా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన తాళ్ల ఏకాంబరరావు పదేళ్లుగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు. దీని కోసం చికిత్స కూడా తీసుకుంటున్నాడు. దీనికి తోడు ఆయనకు తాగుడు అలవాటు ఉంది. ఈ నేప థ్యంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఏకాంబరరావుకు ఆయన తండ్రి తాళ్ల లక్ష్మీ నారాయణ(60)కు గొడవ జరిగింది. ఈ గొడవలో ఏకాంబరరావు విచక్షణ కోల్పోయి తండ్రిని తీవ్రంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గొడవ జరిగాక ఏకాంబరరావు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతడిని చూసిన చిన్న కోడలు ఇంటిలోకి వెళ్లి చూడగా లక్ష్మీ నారాయణ రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే ఆమె తన భర్త గోపికి విషయం చెప్పింది. చుట్టుపక్కల వారికి కూడా విషయం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హరిపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. తండ్రిని చంపిన తనయుడు పెద్దలోహరిబందలో ఘటన మానసిక సమస్యలతో బాధ పడుతున్న కొడుకు -
జనగణన దేశ ప్రగతికి పునాది
జయపురం: జనగణన దేశ ప్రగతికి పునాది అని జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ (ఐపీఎస్) అన్నారు. ప్రతి పౌరుడు తన పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదివారం స్థానిక స్వచ్ఛంద సంస్థ సోషల్ ఎన్విరోన్మెంటల్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్(సీవా) ఆధ్వర్యంలో నిర్వహించబడిన సెన్షస్ 2026 అవగాహనపై సైకిల్ని నిర్వహించారు. చారిత్రాత్మక రాజనగర్ పేలస్ నుంచి బయలు దేరిన ర్యాలీని పచ్చ జెడా ఊపి మిత్తల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించిన జనగణనకు ప్రజలు సహకరించాలన్నారు. సీవా మహిళా విభాగ అధ్యక్షురాలు విజయలక్ష్మీ పాణిగ్రహి మాట్లాడుతూ.. ఇంటికి సంబంధించిన కచ్చితమైన వివరాలు అందించటంలో మహిళల పాత్ర ముఖ్యమైనదన్నారు. కార్యక్రమంలోజయపురం బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్., సీవా అధ్యక్షులు అజయ కుమార్ మిశ్ర, కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాలవైశాఖి తాండవం
భువనేశ్వర్: రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు కుప్ప కూలాయి. ప్రధాన రహదారులపై చెట్లు విరిగి పడడంతో సాధారణ, వాహన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖుర్దా, పూరీ, కటక్, బాలాసోర్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాతావరణం చల్లబడిన కాసేపటికే భారీ వర్షం కురిసింది. ఖొయిరా, సమూలియా, ఔపడా, సిర్, బహంగా ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కాల వైశాఖి తాండవంతో కటక్ జిల్లా బంకి మండలం డొంపొడా ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రభావంతో పలు చోట్ల చెట్టు నేలకొరిగాయి. ఆయా మార్గాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది కాల వైశాఖి ప్రభావిత ప్రాంతాలు సందర్శించి రోడ్లపై విరిగి పడిన చెట్లను తొలగించి రహదారిపై రాకపోకలు పునరుద్ధరించారు. పలు ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ ఈ నెల 10 వరకు రాష్ట్రంలో పలు చోట్ల మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో గంటకు 60 కిలో మీటర్ల వరకు వేగం పుంజుకున్న గాలులతో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు నారింజ మరియు పసుపు హెచ్చరికలను జారీ చేసింది. నేటి వాతావరణం సోమవారం మయూర్భంజ్, బాలాసోర్ మరియు భద్రక్ జిల్లాలకు నారింజ హెచ్చరిక జారీ అయింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. జాజ్పూర్, కేంద్రాపడా, కటక్, జగత్సింగ్పూర్, నువాపడా, బొలంగిర్, బర్గడ్, సోన్పూర్, సంబల్పూర్, ఝార్సుగుడ, సుందర్గఢ్, దేవ్గడ్, కెంజొహర్ జిల్లాలతో సహా పలు ఇతర జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా. పూరీ, ఖుర్దా, నయాగడ్, గంజాం, గజపతి, కలహండి, కంధమల్, అంగుల్, బౌధ్, రాయగడ, ఢెంకనాల్ వంటి జిల్లాల్లో గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు పుంజుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. చెట్ల నీడలో తలదాచుకోవడం తగదు. మెరుపులు, బలమైన గాలులు వీచేటప్పుడు ఇళ్లలోనే ఉండాలని భారత వాతావరణ విభాగం ప్రజలకు సూచించింది. -
సొమ్ముసిల్లే వంచన
సైబర్ కేసులను ఛేదిస్తున్నాం.. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు, బాగా చదువుకున్నవాళ్లే అధికంగా మోసపోవడం వాస్తవం. గత ఏడాది నుంచే డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ప్రాడ్స్ వంటి కేసుల్లో పురోగతి సాధిస్తున్నాం. చదువుకున్న వారే సరిగా చెక్ చేసుకోక మోసపోతున్నారు. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం తక్షణం ఫిర్యాదు చేయాలి డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వంటి సైబర్ నేరాల్లో తక్షణమే ఫిర్యాదు చేస్తే ఖాతాలను ఫ్రీజ్ చేసే వీలుంటుంది. ఏ అకౌంట్లలోకి డబ్బు వెళ్లిందో.. ఆ అకౌంట్లు ఎవరివో తెలుసుకుని కోర్టులో మెమో వేస్తాం. కోర్టు ఆర్డర్ను బట్టి సంబంధిత ఖాతాల నుంచి అమౌంట్ రికవరీ చేసి నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తాం. ఇటీవల ఓకేసుకు సంబంధించి విజయవాడలో ముగ్గురిని పట్టుకున్నాం. మరికొందరు అనుమానితులకై వెస్ట్బెంగాల్, రాజస్థాన్ వరకు వెళ్లాం. – ఈశ్వరరావు, సీఐ, రెండో పట్టణ పోలీస్స్టేషన్, శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్ : లాయర్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులే.. వారి టార్గెట్. బ్యాంకులో అంతో ఇంతో సొమ్ము దాచుకునే వారే వారి లక్ష్యం. వారు చదువుకున్న వారని, అన్నీ వారికి తెలిసే ఉంటాయన్న భయమే లేదు. డిజిటల్ అరెస్టు పేరుతో నాటకాలు ఆడి ఖాతాల్లో సొమ్ము కాజేస్తున్నారు. వేధింపులు, ఆరోపణలతో.. ఈ నేరాల ప్రక్రియే వింతగా ఉంటుంది. ముందుగా పోలీస్ సెటప్తో ఉన్న వ్యక్తులు వీడియో కాల్ చేస్తారు. ముంబై క్రైమ్ బ్రాంచి, ఢిల్లీ సీబీఐ, సీఐడీ, కస్టమ్స్ ఆఫీసర్లమంటూ నమ్మబలుకుతారు. విదేశాల్లో ఉన్న మీ కొడుక్కి అక్కడి గ్యాంగ్స్టర్లతో లింకులు ఉన్నాయంటూ, మీకు వచ్చిన కొరియ ర్లో డ్రగ్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారంటూ.. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. విద్యార్థినుల అశ్లీల వీడియోలు చిత్రించి వెబ్సైట్లలో పెడుతున్నారంటూ.. దొంగ ఆరోపణలు చేసి ముందుగా బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు చేస్తామని హెచ్చరిస్తారు. తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తే తప్పించుకునే వీలుందని, ఎవరి వద్దనైనా విషయం చెప్పినా, మీడియాలో వచ్చినా మీ పరువే పోతుందని, కేసు కూడా రిజిస్టర్ అవ్వడం ఖాయమని చెప్పి డబ్బులు గుంజేస్తారు. ఆ ఖాతాలన్నీ ఫేకే.. ఇలా మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా జార్ఖండ్, యూపీ, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు. వీరు పేద ప్రజలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లించి వారి పేరు మీద కరెంట్ ఖాతా తెరిచి వాడుతుంటారు. మోసం చేసేటప్పుడు వారి ఖాతాల్లోనే డబ్బులు పడేలా చేసి పడ్డాక విత్డ్రా చేసేస్తారు. ఫోన్ సిమ్లు కూడా ఇలా పేదల పేర్లతోనే తీసుకుంటారు. పని పూర్తయ్యాక ఆ ఖాతాలను క్లోజ్ చేసేసి సిమ్లను పడేస్తారు. సామాన్య ప్రజల ఖాతాల్లో తక్కువ డబ్బులుండటం, వారికి అన్ని భాషల పరిజ్ఞానం ఉండకపోవడంతో ఇలా కాస్త డబ్బున్న వారినే టార్గెట్గా పెట్టుకుంటున్నారు. కొన్ని కేసులు.. ● ఇటీవల జిల్లాకేంద్రంలో రిటైర్డ్ డీఎంహెచ్ఓను బెదిరించి రూ. 56 లక్షలకు పైగా కాజేశారు. ● రాగోలు జెమ్స్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలిని సైతం డిజిటల్ అరెస్టు పేరు చెప్పి రూ. 13.5 లక్షలు కాజేశారు. ● జిల్లా కేంద్రానికి చెందిన చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ డిజిటల్ అరెస్టు పేరిట రూ. 11 లక్షలు మోసపోయాడు. ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్నని చెప్పి పోలీస్ గెటప్లో వచ్చిన సైబర్ మోసగాళ్లు ఓటీపీలు అడిగి ఖాతాలోని సొమ్మును మాయం చేశారు. ● ఓ ప్రముఖ వైద్యుడు డిజిటల్ అరెస్టు పేరిట రూ. 80 లక్షలకు పైగా మోసపోయాడు. తక్షణమే అప్రమత్తమై సైబర్సెల్కు, బ్యాంకు ప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో కొంత మొత్తాన్ని రికవరీ చేయగలిగారు. ● జిల్లాకేంద్రంలో ఓ మెకానికల్ ఇంజినీర్ నుంచి డిజిటల్ అరెస్టు పేరిట రూ. 1.03 కోట్లు కాజేశారు. కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ● ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ పేరిట తైవాన్ నుంచి ముంబై అడ్రస్కు మీకు డ్రగ్ పార్సిల్ వచ్చిందంటూ జిల్లాకేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరును బురిడీ కొట్టించి రూ. 20 లక్షలు కాజేశారు. ● కాశీబుగ్గలో ఓ రిటైర్డ్ ఆర్మీ జవాను రూ. 1.05 కోట్లు నష్టపోయాడు. ● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఓ అడ్వకేట్ డిజిటల్ అరెస్టు పేరిట రూ. 1.32 కోట్లు మోసపోయినట్లు సమాచారం. రెచ్చిపోతున్న సైబరాసురులు అబద్ధపు ఆరోపణలతో డిజిటల్ అరెస్టుల నాటకం బాధితుల్లో లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్, రిటైర్డ్ ఉన్నతోద్యోగులు -
అలరించిన నాటిక పోటీలు
కవిటి: బొరివంక కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానిత నాటిక పరిషత్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మచెక్కిన బొమ్మ, స్వప్నంరాల్చిన అమృతం అనే రెండునాటికలు ప్రదర్శించారు. గోదావరి క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన అమ్మచెక్కిన బొమ్మ సమాజంలో పెరుగుతున్న ఆస్తి కాజేసే మోసాలు, అమాయక యువతులపై జరుగుతున్న మోసాలు ఇతివృత్తంగా సాగింది. అనంతరం కరీంనగర్ చైతన్యకళాభారతి సంస్థ వారు ప్రదర్శించిన స్వప్నం రాల్చిన అమృతంనాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. -
బహిరంగ మార్కెట్లో ఎల్పీజీ అమ్మకాలు నిషేధం
● గ్యాస్ బండల కోసం ఈ–కేవైసీ తప్పనిసరి: మంత్రి పాత్రో భువనేశ్వర్: వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఎల్పీజీ లభ్యతపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇకపై గ్యాస్ను స్వేచ్ఛగా విక్రయించరు. అలాగే 5 కేజీల సిలిండర్ల రీఫిల్లింగ్ను పూర్తిగా నిలిపి వేశారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలే ఈ నిర్ణయానికి కారణమని ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కష్ణ చంద్ర పాత్రో ప్రకటించారు. ఈ సంఘర్షణ బహిరంగ మార్కెట్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడానికి దారి తీసింది. దీంతో సామాన్య వినియోగదారులు సరసమైన ధరలకు ఎల్పీజీని పొందడం మరింత కష్టంగా మారింది. తలెత్తుతున్న ఎల్పీజీ సంక్షోభం దృష్ట్యా బహిరంగ మార్కెట్లో గ్యాస్ అమ్మకాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఇకపై 5 కేజీల సిలిండర్లలో గ్యాస్ నింపబడదు. పారదర్శకత నిర్ధారణ, దుర్వినియోగం నివారణ నేపథ్యంలో అన్ని గ్యాస్ లావాదేవీలకు ఇకపై ఈ–కేవైసీ తప్పనిసరి అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. తమ సొంత పేరు మీద ఎల్పీజీ కనెక్షన్ నమోదు చేసుకున్న వారు మాత్రమే అధీకృత గ్యాస్ ఏజెన్సీల నుంచి సిలిండర్లను పొందగలుగుతారు. రాష్ట్రంలో గ్యాస్ లేదా పెట్రోల్ కొరత లేదు. బ్లాక్ మార్కెట్ పరిస్థితులు ఇంత వరకు తలెత్తలేదని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. దేశీయ ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతుంది. సాధారణ గృహ అవసరాలను తీర్చడానికి తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి అభయం ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన ప్రపంచ సరఫరా గొలుసు సవాళ్ల నేపథ్యంలో పంపిణీని క్రమబద్ధీకరించి రాయితీతో కూడిన ఎల్పీజీ వాస్తవ లబ్ధిదారులకు చేరేలా చూడటమే ఈ నిర్ణయం లక్ష్యంగా పేర్కొన్నారు. దీర్ఘకాలంలో సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ప్రధాన పట్టణ ప్రాంతాలలో పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్జీ) పంపిణీని కూడా వేగవంతం చేస్తోందన్నారు. -
కొరాపుట్ బాలుర ప్రతిభ
జయపురం: భువనేశ్వర్ హైటెక్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన అంతర్ రాజ్యస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ ప్రదర్శణ పోటీలలో కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థి ప్రశ్న హరిజన్ అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇతను కొరాపుట్ జిల్లా గుమడ ఉన్నత పాఠశాల కొట్పాడ్ విద్యార్థి. అతడు తన ప్రదర్శనతో ప్రథమ స్థానం పొంది నిర్వాహకుల ప్రశంసలు పొందాడు. ఈ పోటీలలో పలు రాష్ట్రాల నుంచి జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.చైత్రపర్వం కోసం చందాలు వసూలు కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాలలో చైత్ర పర్వం వచ్చిందటే చాలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నెలరోజులపాటు గిరిజనులు రోడ్లకు అడ్డంగా కర్రలు, తాళ్లు పెట్టి వాహనాలను నిలిపేసి చందాగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. డబ్బులను ఇవ్వనిదే వాహనాలను విడిచిపెట్టరు. ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, అధికారుల వాహనాలను సైతం విడిచి పెట్టరు. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వలన చిల్లర లేకుండా పోయింది. పరిస్తితి గమనించిన గిరిజనులు స్కానర్లో డిజిటల్ చెల్లింపుతో చందాలు వసూలు చేస్తున్నారు. పొట్టంగి ప్రాంతంలో డిజిటల్ చెల్లింపు కోసం రోడ్డు మీద ఆదివారం గిరిజనులు కాపుకాశారు. పెండిలి సర్పంచ్ రాజీనామా రాయగడ: జిల్లాలోని గుడారి సమితి పరిధి పెండి గ్రామ పంచాయతీ సర్పంచ్ రేణుక సబర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని శనివారం గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, బీడీవో సుచిస్మిత బెహరకు అందజేశారు. జిల్లా విద్యాశాఖలో ఉద్యోగం రావడంతో తాను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమితిలోని తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మూడు సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో జిల్లా యంత్రాంగం ఆదేశానుసారం నాయబ్ సర్పంచులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. బస్సులకు డీజిల్ సమస్య కొరాపుట్: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒడిశా రోడ్డు ట్రాన్స్పోర్టు సర్వీస్ బస్సులకు డీజిల్ సమస్య ఏర్పడింది. కొరాపుట్ జిల్లా జయపూర్ నుంచి వెళ్తున్న 6 సర్వీసులను ముందస్తుగా ప్రకటించకుండా నిలపివేశారు. ఆన్లైన్లో టిక్కెట్లు తీసుకున్నవారికి సమాచారం ఇవ్వకపోవడంతో జిల్లావ్యాప్తంగా వందలాది మంది ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో పడిగాపులు కాశారు. ముఖ్యంగా పార్వతీపురం – నారాయణపట్న – జయపూర్ సర్వీసుకి ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈ మార్గంలో ఒకే బస్సు కావడంతో ప్రాధాన్యత ఉంది. రద్దయిన సర్వీసుల్లో ఈ బస్సు కూడా ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులకు డీజిల్ వేయడానికి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఓఎస్ఆర్టీసీకి ఒప్పందం ఉంది. యుద్ధం నేపథ్యంలో డీజిల్కు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.17లక్షలు ఆ సంస్థకు బకాయి పడి ఉంది. దీంతో గత 10 రోజులుగా ప్రభుత్వం నుంచి బాకీ తీరుతుందని ఎదురుచూసిన ప్రైవేట్ సంస్థకి నిరాశ ఎదురైంది. దీంతో డీజిల్ వేయలేకపోవడంతో పార్వతీపురం, రాయగడ మీదుగా కటక్, పుల్బాణీ తదితర ప్రాంతాలకు సర్వీసులు నిలిచిపోయాయి. -
వంశధార ట్రిబ్యునల్ తీర్పుపై ఆందోళన
పర్లాకిమిడి: వంశధార నదిపై నేరడి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వాయరు నిర్మాణంపై గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్లో ఖండవ పంచాయితీ సరా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశధారపై ట్రిబ్యునల్కు వెళ్లిన ఆంధ్ర ప్రభుత్వం శుక్రవారం తమకు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు నిచ్చిందని ప్రకటించడంతో గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్లో ఖండవ పంచాయితీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మాణం చేస్తే కాశీనగర్ బ్లాక్ ఖండవ పంచాయితీలో సరా గ్రామంలో 108 ఎకరాలు ముంపుకు గురవుతాయని జిల్లా పరిషత్ అధ్యక్షులు, న్యాయవాది గవర తిరుపతి రావు విలేకరులతో అన్నారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్లో వరి, ఇతర వాణిజ్య పంటలు ఖరీఫ్, రబీ కోసం కోట్లాది రూపాయలతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు మెగా ప్రాజెక్టులు నిర్మించింది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ మెగా ఎత్తిపోతల పథకాలు ఒట్టిపోయి కాశీనగర్ బ్లాక్లో పంట పొలాలు ఎండిపోతాయని ఆయన అన్నారు. 1962లో ఉభయ ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు వంశధార నదీ జలాల పంపకంపై ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఒడిషా, ఆంధ్ర రాష్ట్రాలు 50ః50 నిష్పత్తితో 117 టీఎంసీల వంశధార నదీ జలాలు వాడుకోవాలని నిర్ణయించారు. 2015లో వంశధారపై నదిపై ఆంధ్రప్రదేశ్ బ్యారేజీ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకి వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హిరమండలం వద్ద రిజర్వాయర్ నిర్మించడానికి ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. అయితే వంశధార వద్ద నేరడి నుండి ఒక వీఆర్ కాలువ ద్వారా హిరమండలంకు సాగునీటిని తరలించారు. ప్రస్తుతం వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణం చేస్తే గజపతిజిల్లా కాశీనగర్ బ్లాక్ సరా గ్రామంలో 108 ఎకరాలు ముంపునకు గురికావడంతో పాటు, గుణుపురం ఎన్ఏసీ నదికి గ్రామం ఆనుకుని ఉండటంతో ఇసుక సిల్క్ అయ్యి గుణుపురం గ్రామం పూర్తిగా కనుమరుగై, కరువు కాటకాలు దారితీస్తుందని గవర తిరుపతి రావు అన్నారు. అంతేకాక వంశధార ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చేముందు గుణుపురం, గజపతివంశధార నదీ జలాల రైతుల కమిటీకి కనీసం తెలియజేయలేదని తిరుపతి రావు ఆరోపిస్తున్నారు. వంశధార ట్రిబ్యునల్ జడ్జిమెంట్పై సరా, బడిగాం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. తమకు న్యాయం చేసి నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే సమీప భవిష్యత్లో రోడ్డుపై ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు. -
ఇక ఒడియాలోనే వాణిజ్య సంస్థల పేర్లు
పర్లాకిమిడి: ఒడియా భాషలోనే వాణిజ్య సంస్థలు, బస్సులు, దుకాణాల పేర్లను రాయాలని అధికారులు అన్నారు. అలాగే సైన్ బోర్డులను సైతం ఒడియాలోనే రాయాలని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం చైతన్యం ర్యాలీలు నిర్వహించారు. ఒడియా పక్షోత్సవాల్లో భాగంగా గజపతి జిల్లా యంత్రాంగం, జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నుంచి చైతన్య ర్యాలీని ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ జెండా ఊపి ప్రారంభించారు. ఒడియా భాషలోనే వాణిజ్య సంస్థలు, ప్రైవేటు బస్సులు, దుకాణాలు నామఫలకాలు, సైన్బోర్డులు ఉండాలని అధికారులు అన్నారు. అనంతరం కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ అధికారులు, పోలీసుశాఖతో ఏడీఎం హారా, జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా సామా జిక సంక్షేమ అధికారిని మనోరమా దేవి, జిల్లా సమాచారశాఖ అధికారి ప్రదీప్త గురుమయి, వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఒడియా భాషలో సైన్బోర్డులు పెట్టాలని ర్యాలీ జయపురం: జయపురం పట్టణంలో కూడా ఒడియాలోనే సంస్థల పేర్లు రాయాలంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి పంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేట్ తృప్తి బరైయ్ ప్రారంభించారు. విద్యార్థులు రంగురంగుల ప్లకార్డులు పట్టుకొని, కరపత్రాలు ప్రజలకు, వ్యాపారులకు పంచుతూ ఒడియా భాషలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఒడియా భాష పక్ష కార్యక్రమంలో భాగంగా జయపురం తెలుగు సాంస్కృతిక సమితి వారి జయపురం సిటీ ఉన్నత పాఠశాల తరఫున 50 మందికి పైగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుంచి ర్యాలీ నిర్వహించారు. జిల్లా లేబర్ కార్యాలయం వద్ద అధికారులు ప్రారంభించిన ర్యాలీ, అలాగే సిటీ స్కూలు విద్యార్థుల ర్యాలీ పట్టణ ప్రధానమార్గం, 26వ జాతీయ రహదారి, రాజా పేలస్, మహాత్మా గాంధీ రోడ్డు, నెహ్రూనగర్, డెప్పగుడ గుండా సాగి జిల్లా లేబర్ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డివిజనల్ లేబర్ కమిషనర్ బృందావన్ సేఽఠి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చైతన్య ప్రసాద్ మఝి, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చందన కుమార్ నాయిక్ మాట్లాడుతూ.. ఈ ప్రచారం కేవలం సైన్ బోర్డుల కోసమే కాదని.. ఇది మన భాషా పరిరక్షణ కోసమన్నారు. ప్రతి దుకాణం ముందు ఒడియా భాష కనిపించేలా చేస్తే మన సంస్కృతిని గౌరవించిన వార మౌతామని అలాగనే ప్రజలకు సమాచారం సులభంగా అర్థమయ్యేలా ఉంటుందన్నారు. జయపురం సిటీ స్కూలు విద్యార్థుల బృందానికి పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయక్, వందితా పాణిగ్రహి, సీహెచ్ మానస పర్యవేక్షించారు. -
రాజధాని వ్యవస్థాపక దినోత్సవానికి సన్నాహాలు
భువనేశ్వర్: రాజధాని వ్యవస్థాపక దినోత్సవ సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ చంద్ర జెనా అధ్యక్షతన స్థానిక క్యాపిటల్ హైస్కూల్ ఆడిటోరియంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న 78వ రాజధాని వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు వివిధ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. 13వ తేదీ ఉదయం పాఠశాల, కళాశాల విద్యార్థులచే ప్రదర్శన పరేడ్, కాగడా శోభాయాత్ర నగరంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు సాయంత్రం వేళల్లో స్థానిక ఉత్కల్ మండపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విశేష సేవలు అందించిన ప్రముఖులను రాజధాని గౌరవ్ సమ్మాన్తో సత్కరిస్తారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థుల మధ్య సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. రాజధాని వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ప్రభుత్వ భవనం విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. సమావేశానికి రాజధాని వ్యవస్థాపక దినోత్సవ వేడుకల కమిటీ చైర్మన్ ప్రదోష్ పట్నాయక్, ఉపాధ్యక్షులు ప్రద్యుమ్న మహంతి, ప్రధాన కార్యదర్శి సనత్ మిశ్రా, బీఎంసీ అదనపు కమిషనర్ స్మృతి స్వంయి, భువనేశ్వర్ మండల విద్యాధికారి బ్రహ్మానంద రౌత్, క్యాపిటల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సత్య సుందర్ దాస్, ఎస్. కె. అబ్దుల్లా జనాబ్, ఒలింపియన్ ద్యుతీ చాంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
గోవిందా హరి గోవింద
భువనేశ్వర్: ఖుర్దా రోడ్డు అకౌంట్సు కాలనీ కొండపై నెలకొని ఉన్న బాలాజీ మందిరం 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పవిత్ర చైత్ర శుద్ధ చతుర్దశి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు చైత్ర బహుళ తదియ (ఆది వారం) వరకు జరిగాయి. ఈ సందర్భంగా నిత్యం ఉదయం మంగళ ధ్వని మొదలుకొని సాయంత్రం వరకు నిర్వహించిన పలు ప్రత్యేక పూజాదుల్లో ఔత్సాహిక భక్తులు పాలుపంచుకున్నారు. నిత్యం రెండు పూట ఉత్సవ మూర్తుల్ని చంద్ర ప్రభ, గరుడ, అశ్వ, హనుమత్, సూర్య ప్రభ వాహనాలపై జట్నీ పుర వీధుల్లో ఊరేగించారు. బాల బ్రహ్మానంద సరస్వతి వారి శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా వైభవం ప్రవచనం తదితర ఆకర్షణీయ కార్యక్రమాలతో దేవస్థాన ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. సౌభాగ్య లక్ష్మి కుంకుమ అర్చనలో పాల్గొన్న మహిళా సమూహం -
ఒడియాపై అవగాహన ర్యాలీ
మల్కన్గిరి: ఒడియా భాషపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా దుకాణాలు, ప్రైవేట్ బస్సులు, మాల్స్పై ఒడియా భాషలో నేమ్ప్లేట్లు రాయాలని సూచిస్తూ శనివారం ర్యాలీలు చేపట్టారు. స్థానిక బస్స్టాండ్ నుంచి డీఎన్కే క్రీడా మైదానం వరకు ర్యాలీ సాగింది. ముందుగా జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అరవింద్ రాజశిర్కే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుడూ.. ఒడియా మన మాతృభాష అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వ్యాపార సంస్థలు, కార్యాలయాలలో ఒడియా భాషలో పేరు, ఫలకాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని..మన భాష, సంస్కృతిపై మన గర్వానికి ప్రతీక అన్నారు. మల్కన్గిరి ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించి తమ దుకాణాలు, సంస్థలలో ఒడియా పేరు ఫలకాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు .ఈ అదనపు జిల్లా కలెక్టర్ సోమనాథ్ ప్రధన్, జిల్లా అదనపు కలెక్టర్ వేధ్బర్ప్రధన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్బోయి, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
కాథలిక్ చర్చిలో రక్తదాన శిబిరం
పర్లాకిమిడి: స్థానిక డోలాట్యాంకు రోడ్డులోని సెయింట్ జోసఫ్ కాథలిక్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. దీన్న పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఏటా గుడ్ ఫ్రైడే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో మనం మరొకరి ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుందని చర్చి ఫాదర్ అజిత్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా 61 సార్లు రక్తదానం చేసిన అట్టాడ రమేష్, 32 సార్లు రక్తదానం చేసిన కె.వరదరాజును దుశ్శాలువతో సన్మానించారు. రక్తదాన శిబిరంలో సీడీఎంవో, జిల్లా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శంతును పాఢి, డాక్టర్ రమ్య, డాక్టర్ అనప్తి, ప్రేం రంజన్ నాయక్ పాలొన్నారు. 60 యూనిట్ల రక్తాన్ని సేకరంచినట్టు సీనియర్ ఫార్మసిస్టు ఖగేశ్వర బెహారా తెలిపారు. -
‘రాష్ట్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు’
భువనేశ్వర్: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాల్ని సులభ రీతిలో కల్పించడమే ధ్యేయంగా హై టెక్ గ్రూపు వైద్య సంస్థలు పని చేస్తాయని వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. స్థానిక హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి సముదాయంలో 2 కొత్త ఓపీడీలను ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. రోగులకు ఆధునిక, సరసమైన చికిత్సను అందించే లక్ష్యంతో ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్లో సర్జికల్ (శస్త్ర చికిత్స) విభాగం ఓపీడీని, చర్మ వ్యాధులు (డెర్మటాలజీ) విభాగం విస్తరించిన ఓపీడీని ప్రారంభించారు. హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, డైరెక్టర్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి ఈ రెండు విభాగాలను ప్రారంభించారు. ఈ కొత్త ఓపీడీలో ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన శస్త్ర చికిత్స నిపుణులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులతో సంప్రదింపులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సామాన్యులకు సులభమైన, సత్వర ఆరోగ్య సేవల కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆస్పత్రికి చెందిన పలువురు సీనియర్ వైద్యులు, విభాగాధిపతులు, ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది హాజరయ్యారు. -
పాఠశాలల్లో 100 శాతం నమోదు లక్ష్యం: ముఖ్యమంత్రి
భువనేశ్వర్: కొత్త విద్యా సంవత్సరం ఆరంభం పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శనివారం రాష్ట్ర స్థాయి పాఠశాల ప్రవేశం, అక్షరా భ్యాసం కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని, పిల్లల మనసుల్లో విద్య పట్ల ఆసక్తిని, అంకితభావాన్ని పెంపొందించాలని, పాఠశాలల్లో 100 శాతం నమోదు సాధించడం ఈ ఉత్సవం ఏకై క లక్ష్యంగా పేర్కొన్నారు. స్థానిక రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిన్నారులతో పలకపై బలపంతో అమ్మ, నాన్న పదాలను రాయించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు. ఈ సందర్భంగా నిపుణ్ ఒడిశా, పొఢిబా, గొడిబా ఒడిశా ప్రచార కార్యక్రమాలల కింద వివిధ పాఠశాలల్లో పిల్లల కోసం అభివృద్ధి చేసిన విషయ ఆధారిత విద్యా సామగ్రి ప్రదర్శనను సందర్శించారు. అనంతరం పిల్లలకు విద్యా సహాయక కిట్లను బహూకరించారు. కార్యక్రమంలో పిల్లలు ఏర్పాటు చేసిన చిత్రలేఖన స్టాల్ను సందర్శించి పిల్లలను ప్రశంసించారు. చిన్న పిల్లలు సైతం తాము స్వయంగా గీసిన చిత్రాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. కొత్త విద్యా విధానం ప్రకారం అంగన్వాడీలను దశలవారీగా శిశు వాటికలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జెండా ఊపి విద్యా అవగాహన రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద్ గోండ్, పలువురు ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా మల్కన్గిరిలో అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఎంవీ 7 గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి హాజరై మాట్లాడారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను విద్యావంతులు చేయాలన్నారు. సీఎం సంతకం చేసిన ప్రత్యేత ఆహ్వాన పత్రాలు, గులాబీ పువ్వులు, మిఠాయిలు, చాక్లెట్లు అందజేశారు. విద్యతోనే వికాసం రాయగడ: విద్యతోనే వికాసం సాధ్యమని, అంతా చదువుకోవాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక గాంధీనగర్లో గల ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన పలకా–బలపం పట్టుకోండి అన్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అందరికీ ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా 25 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. కలెక్టర్ ఒడిలొ చిన్నారులు కూర్చుని ఓనమాలు దిద్దారు. అంతకు ముందు చదువుల తల్లి సరస్వతీ దేవికి పూజలను నిర్వహించారు. అనంతరం చైతన్య రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి శాంతిలత ముని, సస్మిత బౌరి తదితరులు పాల్గొన్నారు. -
పుల్లట్లు తిని ముగ్గురికి అస్వస్థత
రాయగడ: ఇంట్లో తయారు చేసుకున్న పుల్లట్లు తిన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ధమునిపొంగ పంచాయతీలోని చొంచాడగుడ గ్రామంలో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే కల్యాణ సింగుపూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. చొంచాడగుడ గ్రామానికి చెందిన డాలింబొ కర్గమా, పన్నెండేళ్ల మణికాంత్ కర్గమ, పదేళ్ల జితేంద్ర కర్గమలు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మినపగుళ్లు, బియ్యంతో తయారు చేసిన పుల్లట్లను తిన్నారు. తిన్న రెండు గంటల తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. అయితే అందరూ ఇదే పరిస్థితి రాత్రి వరకు అనుభవించడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే తయారు చేసిన పుల్లట్లలో విషపూరిత పదార్థం కలిసి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. -
అట్టహాసంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రవేశ వేడుకలు
పర్లాకిమిడి: జిల్లా స్థాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు, పలకాబలపం ఉత్సవాలను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, కౌన్సిలర్లు బబునా బెహరా, బాలకృష్ణ పాత్రో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ప్రవేశ ఉత్సవాలపై ప్రచార రథాలను ముఖ్యఅతిథి ఎమ్మెల్యే రూపేష్పాణిగ్రాహి చేతులమీదుగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు తగ్గి ప్రైవేటు ఇంగ్లిష్ మీడియంలో చేరుతున్నారని, అయితే బి.టెక్, ఎం.బి.బి.యస్. సీట్ల కోసం మాత్రం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు పోటీ పడుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య ఆవశ్యకతపై డ్యాన్స్ రూపంలో రూపకం ప్రదర్శించారు. కొత్తగా మహేంద్రగిరి ఉన్నత పాఠశాలలో చేరిన ఆరో తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లతో పాటు పలకా బలపం, పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా జిల్లా ముఖ్య శిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు అందజేశారు. కార్యక్రమాన్ని మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణ చంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
దోపిడీ కేసులో నిందితులు అరెస్టు
రాయగడ: ఒక దోపిడీ కేసుకు సంబంధించి సదరు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో రాజేష్ శెఠి అలియాస్ రాజ, రాజనీరాణి శెఠి అలియాస్ రోజి, దేవాశిష్ పాడి, యశ్వంత్ నాయక్ అలియస్ యేసు, హరేష్ రత్నాలు ఉన్నారు. నిందితుల నుంచి వంట గ్యాస్ సిలిండర్, గ్రైండర్, రెండు స్పీకర్లు, రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ కెటిల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక రింగ్రోడ్డు సమీపంలోని అగ్నిమాపక కార్యాలయం ఎదురుగా ఉన్న కాలనీలో నివసిస్తున్న బసంత కుమార్ మిశ్రో అనే వ్యక్తి ఇంట్లో మార్చి 12వ తేదీ అర్ధరాత్రి దుండగులు చొరబడి, మరణాయుధాలతో భయపెట్టి ఇంట్లో చోరీ చేశారు. దీనిపై సదరు పోలీస్స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. రాయగడ: సదరు సమితి కొత్తపేట గ్రామ దేవతగా పూజలందుకుంటున్న బంగారమ్మ తల్లి విగ్రహ, మందిర ప్రతిష్టోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంకు చెందిన ప్రముఖ యజ్ఞ యుగకర్త ఎస్ఎల్వీఎన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం రక్షణ కంకణాధారణ, కలశ, జలాభిషేకం, సన్నిహాకము, గో మాతృకా ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. కొత్తపేటకు చెందిన ప్రముఖులు, గ్రామస్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. బైక్ షోరూమ్లో అగ్ని ప్రమాదం భువనేశ్వర్: బాలాసోర్లోని టీవీఎస్ బైక్ షోరూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన వాహనాలు ధ్వంసమయ్యాయి. షోరూమ్ మూసి ఉన్న సమయంలో మంటలు చెలరేగినట్లు యాజమాన్య వర్గాల సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలం చేరి మంటలను నివారించారు. 312 కిలోల గంజాయి పట్టివేత మల్కన్గిరి: గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. ముందస్తుగా అందిన సమాచారం మేరకు మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు దాడులు నిర్వహించా చిత్రకొండ–బలిమెల ప్రధాన రహదారి నూవగూఢ గ్రామ అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధం చేసిన గంజాయితో ఉన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వేరే రాష్ట్రాలకు గంజాయిని తరలించేందుకు సిద్ధం చేసినట్టు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయినిచిత్రకొండ అదనపు తహసీల్దార్, ఎస్డీడీవో ప్రదోష్ ప్రధాన్ ఆధ్వర్యంలో తూకం వేయగా 26 బస్తాల్లో 312 కిలోలు ఉన్నట్టు తేలింది. దీని విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాన్ పట్నాయక్ తెలిపారు. ఈ గంజాయి ఎవరిదో తేల్చాలని తహసీల్దార్ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసి పట్టుబడిన గంజాయిని కోర్టు అవరణకు తరలించారు . -
ఆకట్టుకున్న నాటిక ప్రదర్శన
జయపురం: కొరాపుట్ జిల్లా ధమన్జొడి నాల్కో సంస్థ నిర్వహిస్తున్న 25 వ పంచమటమాలి నాట్య మహోత్సవాల్లో శుక్రవారం సాయంత్రం జయపురం సాంస్కృతిక సంస్థ కళాకారులు ప్రదర్శించిన ’కిన్నెర’ నాటకం అభినందనలు పొందింది. ఈ నాటకోత్సవాల్లో జయపురం కళాకారులు ప్రదర్శించిన రెండో నాటకం ‘కిన్నెర’. ఒక కిన్నెర జీవిత గాథను ఆధారంగా తీసుకొని రూపొందించిన ఈ నాటకంలో సమాజంలో కిన్నెరలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, సామాజిక వివక్ష, గృహ హింస తదితర సమస్యలను నాటకంలో ప్రతిబింబింపచేశారు. అదే సమయంలో కిన్నెర అయినప్పటికీ ప్రపంచంతో పోరాడుతూ, ప్రజలకు సేవలు చేస్తూ ఆదర్శంగా నిలిచిన ‘మీనూ’ పాత్ర ద్వారా ప్రేరణాత్మక సందేశాన్ని సమాజానికి అందించారు రచయిత శేఖర్ దాస్. విద్య, పట్టుదలతో ప్రజల మనసులను గెలవవచ్చని కష్టపడి సమాజానికి సేవ చేసి గుర్తింపు పొందవచ్చని ఈ నాటకం ద్వారా రచయిత సందేశ మిచ్చారు. సమాజానికి అద్భుతమైన సందేశాన్ని అందించిన ఈ నాటకానికి దర్శకుడు నిరంజన్ పాణిగ్రహి. ఈ నాటకానికి పిల్లన గ్రోవితో అద్భుత మైన సంగీతం అందించారు సంగీత కళాకారుడు జి. మహేష్, ఆకాశ వాణి కళాకారుడు ఈశ్వర్ షరాఫ్. -
జయపురంలో జలఛత్ర కేంద్రాలు
జయపురం: జయపురం పట్టణంలో పోలీసు విభాగ అధికారులు మొదటి సారి జలఛత్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిని జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ ప్రారంభించారు. జయపురంలో పోలీసు స్టేషన్లు నెలకొల్పిన నాటి నుంచి నేటి వరకు పోలీసు స్టేషన్లలో వేసవి కాలంలో ప్రజల దప్పిక తీర్చేందుకు ఇలాంటి జలఛత్ర కేంద్రాలు జిల్లాలో ఎన్నడూ ఏర్పాటు చేయలేదు. ఇటీవల బాద్యతలు చేపట్టిన సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ ఆదేశాల మేరకు జయపురం పట్టణ పోలీసు స్టేషన్, సదర్ పోలీసు స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్లలో జల ఛత్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా సిడబ్ల్యూసీ అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయిత్రీ దేవి, ఐపీఎస్ అధికారి కేబీ రామ్ సదన్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్ర రౌత్, సదర్ పోలీసు అధికారి సచీంద్ర కుమార్ ప్రధాన్, మహిళా పోలీసు స్టేషన్ అధికారి ఖాలక్ లతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మన పోలీసు సమితి సమావేశం
జయపురం: పట్టణ పోలీసుస్టేషన్ సభాగృహంలో అమ పోలీస్ సమితి(మన పోలీసు సమితి) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. వృద్ధుల భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై చర్యలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ తదితర విషయాలపై చర్చించారు. సమావేశంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, వైస్ చైర్పర్సన్ బి.సునీత, జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంద్రరౌత్, న్యాయవాదుల సంఘ జయపురం అధ్యక్షుడు బిజయరాయ్ జనాదేవ్, ఉపాధ్యక్షుడు శరత్ కుమార్ మఝి, కార్యదర్శి సహదేవ్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాహిత కార్యక్రమాలకే పెద్దపీట జయపురం: పట్టణంలో ప్రజాహిత కార్యక్రమాలకు సీవా స్వచ్ఛంద సంస్థ పెద్దపీట వేస్తుందని జయపురం సోషియల్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) అధ్యక్షుడు అజయ కుమార్ మిశ్ర అన్నారు. ఆ సంస్థ నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడు అజయ్ కుమార్ మిశ్ర, కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయిక్, కోశాధికారి రంజిత్ కుమార్ నాయిక్, ఉపాధ్యక్షుడు జి.వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి కె.కృష్ణారావులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అజయ్ కుమార్ మిశ్ర మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీన రక్తదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా భజన్లాల్ రాయగడ: జిల్లా అదనపు విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భజన్లాల్ మాఝి జిల్లా విద్యాశాఖ అధికారి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన రామచంద్ర నాహక్ పదవీ కాలం పూర్తవ్వడంతో పదవీ విరమణ చేశారు. ఈ మేరకు శుక్రవారం భజన్లాల్ జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. పలువురు సిబ్బంది అభినందించారు. మినీ లారీ బోల్తా.. మహిళ మృతి రాయగడ : బియ్యం లోడుతో వస్తున్న మినీ లారీ బోల్తా పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. జిల్లాలోని కొలనార సమితి బఘుడి ఘాటీ మలుపు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. జిల్లాలొని బిసంకటక్ నుంచి బియ్యం లోడుతో మినీ లారీ బరంపురానికి వెళుతున్న సమయంలో కొలనార సమితి బఘుడి ఘాటి మలుపులో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీలొ ప్రయాణిస్తున్న భార్యాభర్తల్లో భార్య తీవ్ర గాయాలకు గురై సంఘటన స్థలం వద్దే మృతి చెందగా ఆమె భర్త, లారీ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. -
బాణసంచా తయారీ సమయంలో పేలుడు
● ఆరుగురికి తీవ్ర గాయాలు భువనేశ్వర్: నయాగఢ్ జిల్లా నువాగావ్ ప్రాంతం కొరొడా గ్రామంలో బాణసంచా పేలుడు సంఘటన సంభవించింది. బాణసంచా తయారీ చేస్తుండగా శుక్ర వారం ఉదయం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు, వారందరినీ నయాగఢ్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన జరగనున్న లంకా దహనం ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న బాణసంచా పోటీల్లో పాలుపంచుకునేందుకు బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక మైనర్ ఉన్నట్లు సమాచారం. నువాగావ్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి క్షేత్ర స్థాయిలో తీవ్రతను సమీక్షించారు. -
సంప్రదాయ వస్త్రధారణలో అధికారులు, సిబ్బంది
పర్లాకిమిడి: ఒడియా భాషా, సాహిత్యం, సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఒడియా దివాస్ పక్షోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టరేట్ మినీస్టీరియన్ సిబ్బందితో జిల్లా పరిషత్ కార్యనిర్వాహణ అధికారి, సీడీఓ దయామయ పాఢి అధ్యక్షతన సంప్రదాయ వస్త్రధారణ కార్యక్రమం జరిగింది. జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి కుమారీ అర్చనా మంగరాజ్, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్గీతా బోడోరయితో, డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ పాఢి, ఉత్కళ బాలాశ్రమం ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. గజపతి జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సిబ్బంది ఒడియా సంప్రదాయ వస్త్రధారణలో మీడియాకు ఫోజులిచ్చారు. ఏప్రిల్ ఒకటి నుంచి మహాబిషువ సంక్రాంతి 14తేదీ వరకూ రోజుకో కార్యక్రమం చేపడతామని జిల్లా సాంస్కృతిక శాఖఅధికారి అర్చనా మంగరాజ్ తెలియజేశారు.


