breaking news
Orissa
-
విక్రమ్దేవ్ వర్సిటీలో మౌలిక వసతుల కొరత
జయపురం: అవిభక్త కొరాపుట్ విద్యా ప్రాణకేంద్రం జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయమని, కానీ వర్సిటీలో మౌలిక వసతులు లేవని కొరాపుట్ జిల్లా అఖిల భారత విద్యార్థి పరిషత్ జయపురం అద్యక్షులు జ్యోతీ రంజన్ పాణిగ్రహి అన్నారు. పాణిగ్రహి నేతృత్వంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. గత రాత్రి విశ్వ విద్యాలయం బాలికల హాస్టల్ శ్లాబ్ కూలి ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారని తెలిపారు. చాలాకాలంగా భవనాల విషయం చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నేత ఆరోపించారు. ఉత్కళమణి హాస్టల్ భవనాల శ్లాబ్ కూడా శిథిలావస్థలో ఉందని తెలిపారు. వెంటనే విశ్వ విద్యాలయ సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
హెపటైటీస్పై అవగాహన
రాయగడ: ప్రపంచ హెపటైటీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పితామహాల్లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం క్యాంపస్ నర్సింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. హెపటైటీస్ మహామ్మారి గురించి తెలుసుకుందాం అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా వైరల్ హెపటైటీస్ వ్యాధి, వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, ముందస్తు నిర్ధారణ, టీకాలు, చికిత్స విధానాలపై రోగులు, వారి సహాయకులకు అవగాహన కల్పించారు. అధ్యాపకుల పర్యవేక్షణలో మూడో సెమిస్టర్ నర్సింగ్ విద్యార్థులు హెపటైటీస్ ఎ, బి, సి, డి, ఇ రకాలు, వాటి లక్షణాలు, కారణాలు, కాలేయ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలను వివరించారు. హెపటైటీస్–బీ టీకా ప్రాముఖ్యత, సురక్షిత ఇంజక్షన్లు, రక్తమార్పిడి, చేతుల పరిశుభ్రత, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు వినియోగం, సూదులు, లేదా వ్యక్తిగ వస్తువులను ఇతరులతో పంచుకోకూడదనే విషయాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ మేరకు ఫ్లకార్డులతో చైతన్యం కలిగించారు. -
ఏమైందో ఏమో..?
రణస్థలం: పురుగుల మందు సేవించి భార్యాభర్తలు బలవన్మరణానికి యత్నించిన ఘటన లావేరు మండలంలో కలకలం సృష్టించింది. లావేరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో కోర్టు సమీపంలోని బాయమ్మతోటలో నివాసం ఉంటున్న దవల రామకృష్ణ(62), అతని భార్య శ్రీదేవిలు సోమవారం సాయంత్రం నరసన్నపేట వెళ్తామని చెప్పి ద్విచక్ర వాహనంపై బయ ల్దేరారు. రాత్రి సమయంలో బయట పలు ప్రాంతాలు తిరిగారు. మంగళవారం ఉదయం బయట ఎక్కడో ఎరువుల దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో తాళ్లవలస రెవెన్యూ పరిధి లావేరు రోడ్డు మార్గంలో రోడ్డు పక్క ద్విచక్ర వాహనం పెట్టి సరుగుడు తోటలోని వెళ్లారు. అక్కడ పురుగులు మందును ఇరువురూ సేవించారు. అనంతరం రామకృష్ణ తొలుత భార్య మెడకు వైరు కట్టి, తనుకూడా కట్టుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్య స్పృహలోకి రావడంతో... కొంత సమయం తర్వాత భార్య స్పృహలోని వచ్చి భర్త విగతజీవిలా పడి ఉండడంతో కుటుంబ సభ్యులకు సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్చేసి సమాచారం ఇచ్చింది. అయితే అప్పటికే భర్త మృతి చెందాడు. ఘటన స్థలానికి 108 వాహనం చేరుకుని భార్య శ్రీదేవిని రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి లావేరు పోలీసులు, క్లూస్ టీం చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణ మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుని కుమారుడు కృష్ణసాయి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లా గిద్దలూరులో డెంటిస్ట్గా పని చేస్తున్నాడు. కుమార్తె హర్షిత పూణేలో గైనిక్ డాక్టర్ పనిచేస్తున్నారు. ఈనెల 5వ తేదీన కుమార్తె సీమంతం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బలవన్మరణానికి భార్యాభర్తలు యత్నం భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం -
లొంగిపోయిన మాజీ డీఎఫ్ఓ
పర్లాకిమిడి: రాష్ట్రమంతటా సంచలనం రేపిన గజపతి జిల్లా ఏసీఎఫ్ సౌమ్యరంజన్ మహాపాత్రో హత్య కేసులో ప్రధాన నిందితుడు, అప్పటి డీఎఫ్ఓ సంగ్రాం కేసరి బెహరా సోమవారం సబ్ డివిజనల్ సెషన్స్ జడ్జి ఎదుట లొంగిపోయాడు. హైకోర్టులో బెయిల్ అపీల్ చేయగా అక్కడ చుక్కెదురైంది. రెండు వారాల్లో గజపతి ఎస్.డి.జె.ఎం కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లో వెళ్తే.. స్థానిక డీఎఫ్ఓ కార్యాలయం కాంపౌండ్లోని సిబ్బంది నివాసగృహంలో అప్పటి ఎ.సి.ఎఫ్ సౌమ్యరంజన్ మహాపాత్రో తన గదిలో కాలిపోయి, 90 శాతం గాయాలతో కటక్ మెడికల్లో చేరారు. అనంతరం ఆయన చనిపోయారు. అప్పటి డీఎఫ్ఓ సంగ్రాం కేసరి బెహరా, కోడలు విద్యాభారతి పండా, వంటవాడు మన్మథ కుంబోపై కోర్టులో సౌమ్యరంజన్ మహాపాత్రో తండ్రి అభిరామ్ మహాపాత్రో కేసు పెట్టారు. అనంతరం నిందితుడు సంగ్రాం కేసరి బెహారా సుప్రీం కోర్టుకు బెయిల్ కోసం అపీల్ చేశాడు. అక్కడ ఆయనకు బెయిల్ను నిరాకరించారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పర్లాకిమిడి ఎస్.డి.జె.ఎం కోర్టులల్లో లొంగిపోయారు. అనంతరం జిల్లా కోర్టులో బెయిల్ పిటీషన్ కోసం లాయర్లు దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం తరువాత సంగ్రాం బెహారా బెయిల్ పిటీషన్ రద్దు అవ్వడంతో ఆయనను పోలీసులు పర్లాకిమిడి ఉపకారాగారానికి రాత్రి తొమ్మిది గంటల తరువాత తరలించారు. సంగ్రాం కేసరి బెహరా ప్రస్తుతం ఓ.ఎఫ్.డి.సి డైర్క్టర్గా పని చేస్తున్నారు. -
నెక్ట్స్ జెన్ ఐకానిక్ మిస్ ఇండియాగా బొరిగుమ్మ యువతి
జయపురం: జాతీయ స్థాయి నెక్ట్స్ జెన్ ఐకానిక్ మిస్ ఇండియా–2026గా జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి యువతి ఎన్.త్రిష తన్య ఎన్నికయ్యారు. జాతీయ స్థాయి నెక్ట్స్ జెన్ ఐకానిక్ మిస్ ఇండియా–2026 పోటీల్లోని డ్యాన్స్, వాక్, టాలెంట్, ప్రశ్న–జవాబులు, జాతీయ సంప్రదాయ వస్త్రధారణ వంటి పోటీలు రాజస్థాన్లోని జైపూర్, లక్నో, పూణెలలో జరిగాయి. ఫైనల్ దశ పోటీలు మూడు దినాలు ఉత్తర ప్రదేశ్ లక్నోలో జరిగాయి. ఫైనల్ పోటీల్లో ఫైనల్ పోటీకి నిలిచిన వివిధ రాష్ట్రాల నుంచి 24 మందిలో జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మకు చెందిన ఎన్.త్రిష తన్య మిష్ ఎక్ట్రా ఆర్డనరీ, బెస్ట్ టేలెంట్ టైటిల్ గెలుచుకుంది. ఆమె బొరిగుమ్మలో ఉపాధ్యాయుడు ఎన్.రాజేష్ కుమార్, గాయిత్రిల పెద్ద కుమార్తె.ఎన్.త్రిష తన్య మంచి రచయిత్రి, ఇంగ్లిష్లో పీజీ చేశారు. -
ఎరువుల కోసం రైతుల ధర్నా
కొత్తూరు: స్థానిక పీఏసీఎస్ వద్ద ఎరువులు కోసం రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఏపీసీఎస్కు 400 బస్తాల డీఏపీని వ్యవసాయ శాఖ కేటాయించింది. కేటాయించిన డీఏపీని మంగళవారం పీఏసీఎస్ సిబ్బంది రైతులకు యాప్ ద్వారా విక్రయించారు. ముందుగా డీఏపీ కొనుగోలు కోసం వచ్చిన రైతులకు వరుస క్రమంలో టోకెన్లు ఇచ్చారు. అయితే కొంతమంది మంది రైతులకు సాయంత్రం వరకు ఉన్నా ఎరువులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆందోళన చేపట్టి సొసైటీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎరువుల విక్రయంపై సొసైటీ అధికారి నాగరాజు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ప్రసాద్ అన్నారు. విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 300 బస్తాలకు టోకెన్లను రైతులకు ఇచ్చారని, అయితే టోకెన్లు ఇచ్చిన రైతులకు ఎరువులు ఇవ్వకుండా స్టాక్ అయిపోయిందని చెప్పడం సరికాదన్నారు. అలాంటప్పుడు టోకెన్లు ఎందుకిచ్చారని రైతులు ప్రశ్నిస్తే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎదురుచూసినా డీఏపీ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ అధికారులు ఇష్టానుసారంగా ఎరువులు విక్రయించారన్నారు. లైన్లో ఉన్నవారికి ఎరువులు ఇవ్వకుండా నచ్చినవారికి ఎరువులు అమ్మకాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తూరు, కర్లెమ్మతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు -
చిన్న టెండర్లను ఇతరులు వేయవద్దు
పర్లాకిమిడి: ప్రతి గుత్తేదారు ప్రభుత్వ ప్రజాప్రనులు, ఇరిగేషన్, ఆర్డీ డిపార్ట్మెంట్ టెండర్లను షెడ్యుల్డ్ ధరలకే కోట్ చేయాలని గజపతి గుత్తేదారుల సంఘం అధ్యక్షుడు భరత్ భూషణ్ మహతి అన్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపం ఆవరణలో శ్రీకృష్ణచంద్రగజపతి కంట్రాక్టర్స్ సంఘం సాధారణ సభ్యుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కంట్రాక్టర్లు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐదు కోట్ల రూపాయల లోపు టెండర్లను గజపతి గుత్తేదారులకు విడిచిపెట్టాలన్నారు. భవిష్యత్లో వందలకోట్ల రూపాయల టెండర్లు ఉంటే వాటిని స్పెషల్ క్లాస్ కంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు ఇప్పిస్తామని బి.బి.మహంతి అన్నారు. ఇతర జిల్లాల గుత్తేదారులు కోటి రూపాయలు, అంతకంటే తక్కువ ప్రజాపనుల టెండర్లను తక్కువ ధరలకు కోట్ చేసి పనులు చేజిక్కించుకుంటున్నారని, అందువల్ల జిల్లాకు చెందిన గుత్తేదారులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గుత్తేదారుల సంఘం సర్వసభ్య సమావేశానికి బల్లారాం దోళాయి, గిరిగోవింద, స్పెషల్ క్లాస్ గుత్తేదారు పి.వరప్రసాద్, దేవషిస్ మిశ్రా, పి.నాగరాజు, ఎ, బి, సి, డి క్లాస్ కంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
ఉగ్రరూపం
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026మహానది..భువనేశ్వర్: రాష్ట్రంలో తెరిపి లేని కుండపోత వానల తాకిడితో వరద ముంచెత్తుతుంది. ప్రముఖ నదుల్లో నీటి మట్టం అనుక్షణం ఉప్పొంగుతోంది. తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. పలు చోట్ల పంట పొలాల్లో నీరు చొరబడి పంట నీట మునిగింది. మహా నదిలో నీటిమట్టం రానురాను పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కటక్ జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రేయ భావుసాహెబ్ షిండే ఆంక్షలు జారీ చేశారు. మహానది, శాఖ నదుల వెంబడి ఉన్న అన్ని ఘాట్లలోకి ప్రజల ప్రవేశాన్ని నివారించారు. నదిపై అన్ని కార్యకలాపాలను పరిమితం చేశారు. బాలి జాతర బహిరంగ స్థలం దిగువ ప్రాంతాలలో ఎలాంటి బహిరంగ సమావేశాలు లేదా సభలు నిర్వహించరాదని తెలిపారు. బ్యారేజీలు, వంతెనలు సమీపంలో నిలబడటాన్ని నిషేధించారు. దిగువ, నదీ తీరాల సమీపంలో అన్ని రకాల కార్యక్రమాలను నిలిపివేయాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహా నది ముండలి బ్యారేజీ గుండా వరద నీరు ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయానికి ఈ బ్యారేజి గుండా 6 లక్షల 37 వేల 585 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. సాయంత్రం సరికి దీని గుండా 7 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని అంచనా. ప్రమాద సంకేతం దాటిన బైతరణి కెందుఝొర్ జిల్లా ఆనంద్పూర్లో బైతరణి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. బైతరణి నది ప్రమాద స్థాయి 38.36 మీటర్లు కాగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి నది నీటి మట్టం 38.37 మీటర్లకు చేరింది. రాష్ట్రంలోని సాలంది, జలకా, బైతరణి నదీ పరివాహక ప్రాంతాల్లో రాగల 24 గంటల పాటు వరద హెచ్చరిక జారీ చేశారు. రాజ్ఘాట్లో వరద నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుంది. మంగళ వారం మధ్యాహ్నం 1 గంటకు హెచ్చరిక స్థాయి 37.445 మీటర్లు అధిగమించి నీటి ప్రవాహం 38 మీటర్లకు తాకింది. ఎగువ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా బైతరణి నది అఖువాపొదా వద్ద ప్రమాద స్థాయిని దాటింది. సురక్షిత గరిష్ట నీటి మట్టం 18.33 మీటర్లు కాగా 18.48 మీటర్ల మట్టంతో నదిలో వరద నీరు పొంగి పొరలుతుంది. జిల్లా యంత్రాంగం బహిరంగ ప్రకటనల ద్వారా నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రమాద స్థాయిని దాటిన సాలంది భద్రక్ ప్రాంతంలో రాజ్ఘాట్ వద్ద సాలంది నది ప్రమాద స్థాయిని దాటింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రమాద స్థాయి 17 అడుగులు అధిగమించి 17.20 అడుగుల మట్టంతో వరద ఉధృతితో తాండవిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాలంది నది ఉప్పొంగుతోంది. వరద ముంపు పట్ల తీర ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఉధృతం అయింతే తిహిడి, చాంద్బాలి తదితర 15కు పైగా పంచాయతీలు 7 లక్షల క్యూసెక్కుల నీటితో మునిగిపోతాయి. సాయంత్రం సరికి దెవులొపాలొ వద్ద సాలంది నది గట్టు 100 అడుగుల మేర తెగిపోయింది. వ్యవసాయ భూముల్లోకి వరద నీరు ఈ ఏడాది తొలి వరద నీరు దయా నదిలోకి ప్రవహించింది. పూరీ జిల్లాలో కొణాస్, డెలాంగ్లలో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయని అంచనా. వర్షాల కారణంగా దయా, రాజూవా, మఛొరా నదుల నీటి మట్టం పెరుగుతోంది. వ్యవసాయ భూముల్లోకి వరద నీరు పొంగిపొర్లుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతెనపై 5 అడుగుల నీరు పల్లొలొహడా ప్రాంతం బంవుసొపొదా నది వంతెనపై 5 అడుగుల వరద నీరు ప్రవహిస్తోంది. తెల్కోయి నుండి ఢెంకనాల్, అంగుల్, కటక్లకు వెళ్లే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మండల కార్యాలయం మరియు 10 పంచాయతీలకు అనుసంధానం ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
రాయగడ: విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా శ్రద్ధతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రామనగుడలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాల ప్రిన్సిపాల్ గౌరీప్రసాద్ పండా అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. నూతన విద్యార్థలకు ముందుగా స్వాగతం పలికిన ఆయన క్రమశిక్షణ, విద్యార్థుల బాధ్యతలపై వివరించారు. కార్యక్రమానికి పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కిశోర్ చంద్ర బెహర, మాజీ అధ్యక్షుడు సూర్యారావు కుంబ్రికలు అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల సమయ పట్టిక, యూనిఫారం,ఐడీ కార్డులు, ర్యాగింగ్ రహిత క్యాపంస్, పాఠ్యాంశాలు, పరీక్షా విధానం, ఈ బుక్స్ తదితర విషయాలపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వివరించారు. -
ముగిసిన సాంస్కృతిక కార్యక్రమాలు
పర్లాకిమిడి: రథయాత్ర సందర్భంగా స్థానిక జగన్నాథ మందిరం దేవస్నాన వేదికపై గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు ఉత్సవానికి ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దయామయ పాడీ, తబాలా కళాకారులు రఘునాథ పాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ తదితరులు హాజరయ్యారు. పట్టణంలో స్థానిక కళాకారులుతో పలు భక్తి పాటలకు నృత్యం ప్రదర్శించి పలువురిని అలరించారు. ఈ నృత్యాలలో ఉత్కళ బాలాశ్రమం, గ్రేస్ డ్యాన్సు అకడమీ, బారునర్తన్, వందేమాతరం డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. కళాకారులకు అధికారులు ప్రశంసాపత్రాలను అందజేశారు. చిన్నమొత్తాల పొదుపుపై అవగాహన పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా బ్లాక్ కె.సి.పూర్ ప్రభుత్వ ఎస్.ఎస్.డి ఉన్నత విద్యాలయంలో చిన్న మొత్తాలు పొదుపుశాఖ ఆధ్వర్వంలో స్మాల్, పెద్ద మొత్తాల పొదుపు పథకాలపై మంగళవారం కర్మశాల జరిగింది. ఈ కర్మశాలకు జిల్లా ఆర్థికశాఖ, చిన్నమొత్తాలు పొదుపు శాఖ అధికారి త్రివేణికుమారి దేవి, డీడబ్ల్యూఓ సల్మాన్ రైకా, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ సరితా బెహురియా, గుమ్మా సబ్ పోస్టుమాస్టర్ శంకరపాత్రో, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్న మొత్తాలు పొదుపు చేయడం ద్వారా భవిష్యత్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని అధికారులు వివరించారు. విభిన్న పొదుపు పథకాలను ప్రభుత్వం లాటరీ ద్వారా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని త్రివేణి కుమారీ దేవి తెలియజేశారు. వృద్ధురాలికి మాజీ సైనికులు చేయూత శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని జిల్లా పరిషత్ దగ్గర కంపోస్ట్ కాలనీ ద్వారకా నగర్లో నివాసముంటున్న వృద్ధురాలు సూరాలమ్మకు మాజీ సైనికులు చేయూతనందించారు. ఆమె కోసం ఒక ఇంటిని నియమించి డీఎస్పీ సీహెచ్ వివేకానంద చేతులమీదుగా మంగళవారం ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన మాజీ సైనికుడు కాకర్ల నర్సింగ్ వృద్ధురాలి ఇబ్బందులు తెలుసుకొని చలించిపోయాడు. దీంతో అతని మన సిక్కోలు సైనికుడు ఇన్స్ట్రాగామ్ అకౌంట్ ద్వారా సాయం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ సైనికులు, దాతలు విరాళాలు అందించారు. ఈవిధంగా సేకరించిన విరాళాలతో వృద్ధురాలికి ఒక తాత్కాలిక గృహం నిర్మించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, లయన్ నటుకుల మోహన్, పైడి మురళీధరరావు, సనపల రామకృష్ణ, ఎం.సింహాచలం, పైడి రామారావు, పి.చిన్నరావు, పి.వెంకటేశ్వరరావు, టి.శ్రీను, బి.శంకరరావు, దుర్గా భవానీ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కింతాడ సంతోష్ పాల్గొన్నారు. సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నందికొండ కాలనీకి చెందిన ఫైర్స్టేషన్ ఏఎస్ఐ గుజ్జల అప్పలరాజు మంగళవారం తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరాజు ఎప్పటిలాగే ఆమదాలవలస ఫైర్స్టేషన్లో విధులు ముగించుకొని తన ఇంటికి మంగళవారం వెళ్తున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి కొత్తూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సరుబుజ్జిలి జంక్షన్లో ఢీకొంది. ఈ ప్రమాదంలో అప్పలస్వామికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
స్కూల్ వ్యాన్ ప్రమాదంలో నలుగురికి గాయాలు
రాయగడ: గుణుపూర్ పట్టణంలో సొమవారం జరిగిన స్కూల్ వ్యాన్ ప్రమాదంలో నలుగురు చిన్నారులు గాయపడ్డారు. గుణుపూర్లో గల లండన్ కిడ్స్ ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా విక్రమపూర్ కూడలి సమీపంలో పనసగుడ రోడ్డులో వ్యాన్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే చిన్నారులను రక్షించి గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జగన్నాథపూర్ రాయిగుడ, పెద్ద హరసింగుడ, కై ఠాపదర్, పనసగుడ, గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. దమణమండి గ్రామ దేవత మందిరంలో దొంగతనం జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి దమణహండి గ్రామంలో శీతల ఠకురాణి మందిరంలో తాళాలు విరచి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. సోమవారం రాత్రి దుండగులు మందిరం తాళాలు విరిచి మా శీతల ఠకురాణి కళ్లు, కిరీటం,బంగారు, వెండి కిరీటాలు, కమరపటాలతో పాటు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగిలించారు. అలాగే ఆ గ్రామంలో గల శివమందిరంలో కూడా దుండగులు తాళాలు విరిచి దొంగతనానికి ప్రయత్నించారు. శీతల ఠకురాణి మందిరంలో జరిగిన దొంగతనంపై గ్రామ ప్రజలు పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి దర్యాపు ప్రారంభించారు. దొంగలు కొట్పాడ్ ప్రాంతంలోగల దేవాలయాలు, మందిరాలను టార్గెట్ చేస్తు దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు కేసులు నమోదు చేసి మిన్నకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ విస్తృత పరచి దొంగతనాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
కోవిడ్పై రాయగడలో అప్రమత్తత
రాయగడ: ఆంధ్రాలో కోవిడ్ కేసులు నమోదవుతుండడం, బరంపురంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు సమాచారం రావడంతో రాయగడలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదని, ప్రజలు పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచించాయి. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు మీదుగా ప్రతీరోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లో పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. వ్యాపారం, వైద్యం ఇతర అవసరాల కోసం రాయగడ ప్రాంత ప్రజల్లో చాలా మంది ఆంధ్రప్రదేశ్పై ఆధారపడుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇక వర్షాకాలం ప్రభావంతో రాయగడ జిల్లా ప్రధాన అసుపత్రిలో సాధారణ జ్వరం, జలుబు, దగ్గువంటి సీజనల్ రోగాల సంఖ్య పెరగడంతో ఔట్పేషెండ్ విభాగం, రక్త పరీక్ష కేంద్రాల్లో రద్దీ కనిపిస్తోంది. అయితే ఇది సాధారణమేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్లు, అవసరమైన వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. జ్వరం, జలుబు ,దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రం లేదా వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచించింది. -
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుని ఇంటిలో చోరీ
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెందుగుడ గ్రామంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవేంద్ర పండ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు సుమారు 70 తులాల బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, మరో రూ.1.50 లక్షల నగదును చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం ప్రకారం దేవేంద్ర పండా కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 22 వ తేదీన గంజాం జిల్లా షెర్ఘడ్లో బంధువుల ఇంటికి ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండగా, దుండగులు ప్రధాన తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారు నగలు, బంగారు బిస్కెట్లు, నగుదును దోచుకువెళ్లారు. ఆదివారం సాయంత్రం దేవేంద్ర కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చి తర్వాత ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి లోనికి వెళ్లగా ఇంటి సామగ్రి చిందరవందగా ఉండటంతో పాటు బీరువాలో విలువైన వస్తువులు కనిపించకపోవడంతో వెంటనే పద్మపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పద్మపూర్ పోలీసులు సంఘటన స్థలానికి ఫోరెన్సిక్, డాగ్ స్క్యాడ్తో చేరుకున్నారు. అనంతరం సమీపంలో గల సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఘటనపై పద్మపూర్ ఐఐసీ ధరణీధర్ ప్రదాన్ మాట్లాడుతూ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. -
పశువులను తరలిస్తున్న నలుగురు అరెస్టు
రాయగడ: పికప్ వ్యాన్లో అక్రమంగా పశువులు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను చంద్రపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పశువులతో పాటు వాటిని తరలించేందుకు వినియోగించిన పికప్ వ్యాన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రపూర్ పోలీసులు వాహన తనిఖీలను డంగసొరడ ప్రాంతంలో మంగళవారం నిర్వహించారు. ఒక పికప్ వ్యాన్లో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి తనిఖీలు చేశారు. అందులో ఆరు పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మరోరంజన్ బిశ్వాల్ నేతృత్వంలో జరిగిన వాహన తనిఖీల్లో రఘునాధ్ కొరకొరియా, అనిల్ భత్ర, జగా గంటా, మునా భత్రలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పట్టుబడిన అల్లరి కోతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఎనిమిదో వార్డు తారణీ మందిర ప్రాంతాంలో ఓ కోతి ఇటీవల చిన్నారులపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. దీంతో చాలామంది పిల్లలు గాయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి చిన్నారులతోపాటు పెద్దలు కూడా భయాందోళన చెందారు. కోతి దాడి గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మల్కన్గిరి అటవీ రేంజర్ రమేష్ చంద్రరౌత్ ఆదేశాల మేరకు సిబ్బంది మంగళవారం గంటలకొద్ది శ్రమించి కోతిని వలపన్ని పట్టుకున్నారు. అనంతరం జిల్లా పశువైద్య శాలలో వైద్య పరీక్షలు చేయించారు. కోతి పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు అటవీ రేంజర్ రమేష్ చంద్రరౌత్ తెలిపారు. కోతి పట్టుబడడంతో జయపూరియాగూఢ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. హత్య కేసులో నలుగురు అరెస్టు మల్కన్గిరి: హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు చిత్రకొండ ఎస్డీపీవో ప్రదోష్ ప్రధాన్ మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి రలెగఢ పంచాయతీ బంగురుసుధ గ్రామ సమీపంలోని జలాశయంలో మూడు రోజుల క్రితం ప్రకాష్ ఖిల్ అనే వ్యక్తి మృతదేహన్ని పాపరమేట్ల పోలీసులు వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మురలిగూఢ గ్రామానికి చెందిన ప్రకాష్గా గుర్తించారు. గారిబంధ్ గ్రామానికి చెందిన ఖారా రూపణా, ఖారా బుంజిబాబు, శికాటపల్లి గ్రామానికి చెందిన సాని ఖరా, ఘోడామాడగూల గ్రామానికి చెందిన లక్ష్మణ్ హాంతాల్లు కలిసి పాతకక్షల నేపథ్యంలో ప్రకాష్పై దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని జలాశయంలో పడేసినట్టు దర్యాప్తులో అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. నిందితులను పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని చిత్రకొండ ఎస్డీపీవో ప్రదోష్ ప్రధాన్ వివరించారు. రాయగడలో ఆధునికీకరణ పనులు భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే రాయగడ మండలంలో భద్రతకు సంబంధించిన ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మండలంలో కెవుట్గుడ, సికర్పాయి మధ్య ఉన్న 32వ నంబర్ సొరంగం వద్ద ఈ పనులు త్వరలో ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని నిర్దిష్ట బుధ వారాల్లో 2 ప్రయాణికుల రైళ్ల సేవలు రద్దు చేస్తామని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ నెల 29 నుండి ఆగస్టు 12 వరకు ప్రతి బుధ వారం 2 ప్రయాణికుల రైళ్ల సేవలు రద్దు చేస్తారు. రైలు నంబర్ 58537 కొరాపుట్ – విశాఖపట్నం ప్యాసింజర్, రైలు నంబర్ 58538 విశాఖపట్నం – కొరాపుట్ ప్యాసింజర్ రద్దవుతాయి. -
అంతా సురక్షితం: మంత్రి
భువనేశ్వర్: పలు ప్రాంతాల్లో నదులు గరిష్ట నీటి మట్టం అధిగమించి ప్రమాద స్థాయిలో ఉప్పొంగుతున్న ఇప్పటివరకు ఏ జిల్లా నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, స్థానిక వరద పరిస్థితులను ఎదుర్కోవడం, నిరంతరాయంగా అత్యవసర సేవలు అందించడం, సహాయక చర్యలు చేపట్టడం వంటి ఏర్పాట్లను జిల్లా యంత్రాంగాలు పటిష్టంగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వాయువ్య బంగాళాఖాతం మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. స్థానిక లోక్ సేవా భవన్ రెవెన్యూ సమావేశం హాలులో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లా యంత్రాంగాలూ నిరంతర అప్రమత్తతను కొనసాగించాలని కోరారు. ఎలాంటి పరిస్థితికై నా తక్షణమే స్పందించేలా చూడాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. మానవ ప్రాణాల రక్షణే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించి వండిన ఆహారం, పొడి రేషన్, సురక్షిత తాగు నీరు, ఆశ్రయం, ఇతర అత్యవసర సహాయక చర్యలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మయూర్భంజ్, జగత్సింగ్పూర్, కేంద్రాపడా, కెందుఝర్, బాలేశ్వర్, భద్రక్, కలహండి, సుందరగడ్ వంటి అనేక జిల్లాల కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులు, ఇతర సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశంలో పాలొన్నారు. జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రాల (డీఈఓసీ) సమన్వయంతో రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్ఈఓసీ) వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు. ఈ నెల 1 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో సమగ్రంగా 517.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత సీజన్ సగటు కంటే 75.7 శాతం అధికంగా మంత్రి పేర్కొన్నారు. -
కేసులను వెంటనే పరిష్కరిస్తున్నాం
పర్లాకిమిడి: జిల్లాలో సైబర్ మోసాలు, ట్రాఫిక్ నియంత్రణ, వయోవృద్ధులకు సంబంధించిన కేసులు పోలీసు ష్టేషన్లో త్వరితగతిన పరిష్కారం వంటి అనేక సమస్యలపై మోడల్ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి అడిగి తెలుసుకున్నారు. పర్లాకిమిడి పోలీసు ష్టేషన్లో జరిగిన ఈ సమావేశంలో ఇసెస్పెక్టర్ వాల్మీకి ప్రధాన్, సీనియర్ సిటిజన్ ఫోరం కార్యదర్శి రామచంద్ర పాడీ, తదితరులు పాల్గొన్నారు. పోలీసులంటే ఒకప్పుడు ప్రజల్లో వ్యతిరేక భావం ఉండేదని, ప్రస్తుతం ప్రజలు ఫిర్యాదుల చేయడానికి స్టేషన్కు వస్తుండటం సంతోషించే విషయమన్నారు. ప్రస్తుతం పట్టణంలో డ్రింక్ అండ్ డ్రైవ్ చర్యలు చేపడుతున్నామన్నారు. సెంచూరియన్ వర్సిటీ, రాణిపేట, ఆంధ్రప్రదేశ్ సరిహాద్దు వద్ద హెల్మెట్ చెకింగ్ చేస్తున్నామన్నారు. కొందరు నోఎంట్రీ బోర్డు ఉన్నా వాగ్వివాదానికి దిగుతున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్లో నెలకు 30 నుంచి 40 కేసులు రిజిస్టర్ అవుతున్నాయన్నారు. ఎక్కువగా సరిహద్దు ఆంధ్ర నుంచి సాయంత్రం పర్లాకిమిడికి మద్యం సేవించడానికి ఎక్కువగా వస్తున్నారన్నారు. పట్టణంలో 28 చోట్ల సీసీ కెమెరాలు అమర్చడం వల్ల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు అమర్చాలని సీనియర్ సిటిజన్లను ఐఐసీ కోరారు. సీనియర్ సిటిజన్లు ఉంచిన పలు సమస్యలను జిల్లా ఎస్పీ మీనా దృష్టికి తీసుకువెళ్తానని ఐఐసీ అన్నారు. ఈ సమావేశంలో మనోజ్ దాస్, విశ్రాంత అధ్యాపకులు శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
అంతా నా ఇష్టం..!
● కలెక్షన్ రాజ్పై పెరుగుతున్న ఆరోపణలు ● కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ అధికార దర్పం ప్రదర్శించారని ఆగ్రహం ● విమర్శలు గుప్పిస్తున్న మెడికల్ ఆఫీసర్లు అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్లో కీలకాధికారిగా పనిచేస్తున్న కలెక్షన్ రాజ్.. కేవలం ఓ కాంట్రాక్టు ఉద్యోగే. అయినప్పటికీ డీఎంహెచ్వోకి మించిన అధికార దర్పం ప్రదర్శించాడనే విమర్శలున్నాయి. ఇటీవల వరకు డీఎంహెచ్వోగా పనిచేసిన అధికారి ఇచ్చిన ప్రత్యేక ‘ఆసరా’ ఫలితంగా సదరు కలెక్షన్ రాజ్ హద్దులు మీరి ప్రవర్తించారని మెడికల్ ఆఫీసర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల్లో భాగంగా వైద్యశాఖలో చేపట్టాల్సిన పలు నిర్ణయాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ప్రగతి నివేదికలపై ఏకంగా సదరు కాంట్రాక్టు ఉద్యోగే అంతా తానై వ్యవహరించి జిల్లావ్యాప్తంగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు (పీహెచ్సీ డాక్టర్లు), సీనియర్ అసిస్టెంట్లకు కూడా దిశానిర్దేశం చేసే స్థాయికి చేరారు. ఇక్కడితో ఆగకుండా ఏకంగా పీహెచ్సీ డాక్టర్లపై తిట్లదండకాలకు కూడా పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో జిల్లాలో ఈనెల మొదటివారం వరకు కూడా జూమ్ కాన్ఫరెన్స్లు నిర్వహించి మరీ ఆదేశాలు జారీ చేసే స్థితికి చేరారు. డీఎంహెచ్వో ఇచ్చిన చొరవ కారణంగానే సదరు ఎన్హెచ్ఎం అధికారి చేసిన హడావుడిపై మెడికల్ ఆఫీసర్లు నోరుమెదిపే ధైర్యం చేయలేదు. అయితే ఇటీవల డీఎంహెచ్వో బదిలీ కావడంతో ఒక్కసారిగా మెడికల్ ఆఫీసర్లు అంతా ఒక్కటై ఎన్హెచ్ఎం కాంట్రాక్టు అధికారి తీరుపై ధ్వజమెత్తారు. ఈక్రమంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఎన్హెచ్ఎంలో అవకతవకలపై, సదరు కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకంపై ఫిర్యాదులు పంపించారు. దీంతో ఈ అంశం జిల్లా వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. డీడీవో అధికారం నాకొద్దు..! ఎన్హెచ్ఎం, డెమో ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల ఖర్చులు, నకిలీ బిల్లులను సక్రమం చేసుకునే దిశలో ఆడిట్ బృందానికి ఖర్చులకంటూ జిల్లాలో మొత్తం 100 పీహెచ్సీ, సీహెచ్సీ తదితర వైద్యశాలల నుంచి సుమారు రూ.6 లక్షల వరకు వసూళ్లు చేసిన కలెక్షన్ రాజ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా డీడీవో అధికారాలను చెలాయిస్తూ బలిపశువుగా మారిన డిప్యూటీ డెమో ఎర్రన్న తన అధికారాలను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయన ప్రత్యేక నివేదికతో కూడిన వివరణను కూడా ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే రెగ్యులర్ డీఎంహెచ్వో లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారని కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా వైద్య శాఖలో అవినీతి అక్రమాలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించాలని వైద్యశాఖ ఉద్యోగులే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే అశోక్కు నిరసన సెగ
కంచిలి: ఇచ్చాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్కు కంచిలిలో నిరసన సెగ తగిలింది. స్థానిక గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి మంగళవారం ఆయన వచ్చి, తిరిగి వెళ్తుండగా మెయిన్రోడ్డులోని ఎస్బీఐ కూడలిలో స్థానికులు ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి రోడ్డు సమస్యను వివరించారు. రోడ్డు మరమ్మతులకు గురవ్వడంతో చిన్నపాటి వర్షం కురిసినా గోతుల్లో నీరుచేరి ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఏళ్లు గుడుస్తున్నా ఈ సమస్యపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే అశోక్ బదులిస్తూ త్వరలోనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఆర్అండ్బీ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించినవారిలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు సునీల్ రాథోడ్, స్థానిక మహిళలు ఉన్నారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ను ప్రశ్నిస్తున్న స్థానికులు -
రూ.6.15 లక్షలు సాయం
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 202612 మంది రోగులకు● 19వ ముఖ్యమంత్రి ప్రజాభియోగ శిబిరంభువనేశ్వర్: యూనిట్–2లోని ముఖ్యమంత్రి సమస్యల పరిష్కార గదిలో సోమవారం 19వ ముఖ్యమంత్రి సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ విడతకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో 700కు పైగా ఫిర్యాదులు దాఖలయ్యాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రి వర్గంలోని 6 మంది సీనియర్ మంత్రులు కూడా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. తొలుత బయట వేచి ఉన్న దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ముఖ్యమంత్రి వారి సమస్యలను విన్నారు. వారి ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడ అందుబాటులో ఉన్న అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత సమస్య విచారణ గది లోపల వేచి ఉన్న ఫిర్యాదుదారుల సమస్యలను విన్నారు. సోమ వారం జరిగిన సమస్య పరిష్కార శిబిరంలో ముఖ్యమంత్రి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 12 మందికి వైద్య సహాయంగా రూ. 6.15 లక్షలు తక్షణమే మంజూరు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి సమస్య స్థితిగతులన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దీని వల్ల పరిష్కార రేటు పెరగడంతో ఈ వ్యవస్థపై సామాన్య ప్రజల విశ్వాసం పెరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇంతకు ముందు నిర్వహించిన 18 విడతలలో ప్రజా ఫిర్యాదుల విభాగానికి అందిన 14,941 ఫిర్యాదులలో 14,331 అంటే 96 శాతం ఫిర్యాదులు విజయవంతంగా పరిష్కరించామని తెలిపారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంటు ప్రజల ఫిర్యాదులను క్రమం తప్పకుండా వింటుండగా తహసీల్, మండల స్థాయిలలో కూడా ప్రజా ఫిర్యాదుల విచారణలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి జిల్లా స్థాయిలో 2,59,213 ఫిర్యాదులను పరిశీలించి 89 శాతం సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, పాఠశాలలు, మాధ్యమిక విద్య, షెడ్యూల్డ్ తెగలు, కులాల అభివృద్ధి శాఖ మంత్రి నిత్యానంద్ గోండ్, వాణిజ్య, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా, పంచాయతీ రాజ్, తాగు నీరు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్, పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి సంపద చంద్ర స్వంయి, మత్స్య, పశు సంపద అభివృద్ధి శాఖ మంత్రి గోకులనంద్ మల్లిక్ ప్రత్యక్షంగా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాస్వత్ మిశ్రా, ప్రజా ఫిర్యాదులు మరియు ప్రజా పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వశిష్ఠ, ఇతర శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి సీనియర్ అధికారులు హాజరై ఫిర్యాదుల విచారణ ప్రక్రియలో సహకరించారు. -
ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలు
రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో మహిళను తుపాకీతో బెదిరించి కాల్పులకు యత్నించిన కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడగా మరో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనలొ పోలీసులు అక్రమ తుపాకీలు, పేలని తూటాలు, ఖాళీ కార్ర్టిడ్జ్లు పల్సర్ ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్తో పాటు ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఝార్సుగుడ జిల్లా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర ఈ ఘటనకు సంబంధించి విలేకర్లకు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 26 వ తేదీన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓరియంట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. గత విభేదాల కారణంగా అంకిత్ ఘోస్ ,వకీల్ రాయ్ అనే ఇద్దరు నిందితులు ఆమె ఇంటికి వెళ్లి తుపాకీతో బెదిరిస్తూ కాల్పులకు ప్రయత్నించగా, ఆయుధం పనిచేయకపోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించడంతో 26 వ తేదీ అర్ధరాత్రి బ్రజరాజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓపీఎం ఘాట్ సమీపంలో నిదితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులపై వారు ఎదురు కాల్పులు జరపడంతో పలు మార్లు లొంగిపోవాల్సిందిగా నిందితులను పోలీసులు హెచ్చరించినప్పటికీ వారు కాల్పులను విరమించకపోవడంతో ఆత్మరక్షణ హక్కు మేరకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అంకిత్ ఘోస్ కుడి తొడలొ బుల్లెట్ గాయం కావడంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఝార్సుగుడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి నిందితుడిని తరలించారు. మరో నిందితుడు వకీల్ రాయ్ ఫరారయ్యాడని ఎస్పీ వివరించారు. -
విద్యార్థులకు క్విజ్ పోటీలు
జయపురం: జయపురంలోని సోషియన్ ఎన్విరోన్మెంటల్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) ఆధ్వర్యంలో స్థానిక సిటీ ఉన్నత పాఠశాలలో అంతర పాఠశాలల స్థాయి క్విజ్ పోటీలను సోమవారం నిర్వహించారు. పోటీలను సీవా సభ్యులు, నవరంగపూర్ జిల్లా వ్యవసాయ విభాగ విశ్రాంత అధికారి జి.వెంకటరెడ్డి పర్యవేక్షించగా పట్టణంలోని పలు పాఠశాలలకు 8, 9, 10 తరగతులకు చెందిన 31 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఆరుగురు ఫైనల్ పోటీలకు ఎన్నికయ్యారు. ఆయుష్ పట్నాయక్(జయపురం సిటీ స్కూలు,) సుమిత్ర పండ (ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల), దింపుల్ అక్షయకుడుకుల (మోడరన్ ఇంగ్లిష్ స్కూల్), అనన్య త్రిపాఠీ(ఎస్.ఎస్.వి.ఎం.శారదవిహార్), శ్రేయన్స్ శతపతి (ప్రకాశ్ విద్యాలయ్), సుభ్రాన్సు శేఖర నంద (ఎస్.ఎస్.వి.ఎం.శారదవిహార్)లు ఫైన్లో తలపడ్డారు. అనంతరం ఫైనల్ పోటీలు ఆరు రౌండ్లలో నిర్వహించగా ఆయుష్ పట్నాయక్ ప్రథమ, శ్రేయాన్స్ శతపతి ద్వితీయ, సుభ్రాన్సు శేఖర నంద తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నగదు బహుమతితో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ముఖ్యఅతిథిగా బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీవా నిర్వహించిన ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించటంతో పాటు పోటీతత్వాన్ని అలవాటు చేసుకోవచ్చునన్నారు. జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు ప్రకాశ్ చంద్ర పట్నాయక్, సీవా సంస్థ అధ్యక్షులు అజయ కుమార్ మిశ్ర, కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు. -
భారీ వర్షాలకు టికిరి రైల్వే ట్రాక్పై నీరు
రాయగడ: జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు టికిరి–రౌలీ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై సుమారు మూడు అడుగుల మేర వరద నీరు చేరింది. ట్రాక్ పూర్తిగా నీట మునిగిపోవడంతొ కొరాపుట్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలును టికిరి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో టికిరి స్టేషన్ కు చేరుకున్న ఈ రైలు దాదాపు నాలుగు గంటలుగా అక్కడే నిలిచిపోయింది. దీంతో వందలాది మంది ప్రయాణికులు రైలులోనే చిక్కుకుపోయి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాల కారణంగా కొండల నుంచి వచ్చిన వరద నీరు, బురద రైల్వే పట్టాలపై చేరడంతో పాటు ట్రాక్ పక్కనున్న డ్రైనేజీ నీరు కూడా పట్టాలపై నిలిచిపోయింది. దీంతో రైల్వే అధికారులు భద్రత కారణాల వల్ల రైలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రౌలి స్టేషన్ సమీపంలో కూడా ట్రాక్ వర్షపు నీరు నిల్వ ఉండటంతో పరిస్థితిని అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. వర్షం తగ్గిన అనంతరం రైల్వే ట్రాక్ను పూర్తిగా తనిఖీ చేసి భద్రత పై నిర్ధారణకు వచ్చిన తర్వాతే రైలు ప్రయాణాన్ని పునః ప్రారంభిస్తామని రాయగడ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని రైల్వే సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
ఏం జరుగుతోంది..!
● ఆదిత్యాలయంలో అక్రమ విధానాలపై విజిలెన్స్ దృష్టి ● గతంలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ ఉద్యోగికి లబ్ధి ● డిప్యుటేషన్ పూర్తయినా ఉద్యోగికి ఎల్పీసీ ఇవ్వని ప్రస్తుత ఈవో ● ఐదు నెలలుగా జీతాలకు నోచుకోని సదరు ఉద్యోగి అరసవల్లి: దేవదాయ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా రెండేళ్ల ఎరియర్స్తో కూడిన పీఆర్సీని పొందిన ఓ ఆలయ ఉద్యోగికి.. నాలుగైదు నెలలుగా జీతాలు లేకుండా అవస్థ పడేలా గత అక్రమాలు వెంటాడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ జగన్నాథ స్వామివారి ఆలయానికి చెందిన అటెండర్ శ్రీనివాస్, టెక్కలి రావివలస ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయానికి డిప్యుటేషన్ విధానంలో కొన్నేళ్లు విధులు నిర్వర్తించారు. అనంతరం అరసవల్లి ఆదిత్యాలయానికి డిప్యుటేషన్ మీద 2022లో విధుల్లో చేరాడు. అయితే అప్పట్లో పనిచేసిన డిప్యూటీ కమిషనర్/ఈవో చంద్రశేఖర్ నిబంధనలకు విరుద్ధంగా జీవో 888ని అతిక్రమించి డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న శ్రీనివాస్కు రెండేళ్ల పెండింగ్ ఎరియర్స్తో కూడిన పీఆర్సీని అమలు చేశారు. దీంతో ఒక్కసారిగా రూ.5.72 లక్షల లబ్ధి చేకూర్చి తర్వాత ఈవో చంద్రశేఖర్ బదిలీపై వెళ్లిపోయాడు. తర్వాత జరిగిన పరిణామాల్లో విధుల్లో చేరిన ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ మాత్రం అటెండర్ శ్రీనివాస్ డిప్యుటేషన్ గడువు ముగిసిందంటూ తిరిగి ఆయనను రావివలస ఆలయానికి వెళ్లిపోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్పీసీ ఇవ్వని వైనం అరసవల్లిలో డిప్యుటేషన్ క్యాన్సిల్ కావడంతో యథావిధిగా ముందు పనిచేసిన రావివలస ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయానికి అటెండర్ శ్రీనివాస్ను ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ పంపిస్తూ అరసవల్లి నుంచి రిలీవ్ చేసేశారు. ఇది జరిగి సుమారు నాలుగైదు నెలలు గడిచింది. అయితే అరవసల్లిలో పీఆర్సీ పొందిన తర్వాత అటెండర్ శ్రీనివాస్కు అమాంతం జీతం పెరిగినందున.. అంత జీతం రావివలసలో ఇవ్వలేమంటూ అక్కడి ఈవో గురునాథరావు స్పష్టం చేస్తున్నారు. అయితే లాస్ట్ పేమెంట్ సర్టిఫికేట్(ఎల్పీసీ) తెచ్చుకుంటే జీతాల సంగతి తేలిపోతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా తెర వెనుక కారణమేంటో గానీ అరసవల్లి నుంచి రిలీవ్ చేసినప్పటికీ నేటి వరకు ఎల్పీసీ మాత్రం ఇవ్వకుండా ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ తాత్సారం వహిస్తున్నారు. దీంతో అటెండర్ శ్రీనివాస్ అటు అరసవల్లి నుంచి.. ఇటు రావివలస నుంచి కూడా జీతం పొందలేక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా దీనివెనక ఆర్థిక లావాదేవిలు జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్పీసీ ఇవ్వకుండా మళ్లీ అరసవల్లిలో అటెండర్ శ్రీనివాస్ను విధుల్లో చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాలేవీ బయట పెట్టకుండానే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను సైతం బురిడి కొట్టించి మరీ అనుకూల లెటర్ను కూడా పొందినట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఆర్థిక లావాదేవీల నడుమ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే అధికారులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్ ఆరా..! సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో జరిగిన పలు వివాదాస్పద వ్యవహారాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అప్పట్లో ఇదే ఆలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన కృష్ణమాచార్యులు ఇచ్చిన ఽఆధారపూర్వక ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇందులో అటెండర్ శ్రీనివాస్ పీఆర్సీ వ్యవహారం కూడా ఉండడం గమనార్హం. అయితే తాజాగా గత నాలుగైదు నెలలుగా శ్రీనివాస్కు జీతాలు ఇవ్వకుండా ఎల్పీసీ ఇవ్వని పరిస్థితులపై కూడా విజిలెన్స్ ఆరా తీస్తోందని సమాచారం. ఆర్థిక లావాదేవిలపై కూడా ఇప్పటికే దృష్టి సారించిందని తెలుస్తోంది. అటెండర్ శ్రీనివాస్కు డిప్యుటేషన్ గడువు ముగిశాక తిరిగి రావివలసలో జాయిన్ కావాలని ఉత్తర్వులు జారీ చేశాం. అయితే ఎల్పీసీ ఇంకా ఇవ్వని విషయం వాస్తవమే. ఆయనకు గతంలో పలు ఆర్థిక లబ్ధి అంశాల్లో రికవరీలు చేయాల్సి ఉందని భావిస్తున్నాం. వాటిని పరిశీలించాక ఎల్పీసీ ఇచ్చేందుకు చర్యలు చేపడతాం. అంతవరకు జీతాల పరిస్థితి తేలదు. – కేఎన్వీడీవీ ప్రసాద్, అరసవల్లి ఆలయ ఈవో -
పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లాలోని టిట్లాగఢ్ సమీపంలో బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం వ్యాగన్ పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. బొలంగీర్ నుంచి టిట్లాగఢ్ వైపు గూడ్స్ రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తూర్పు కోస్తా రైల్వే సంబల్ పూర్ మండలంలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. బొగ్గు రవాణా చేస్తుండగా సికిర్, టిట్లాగఢ్ స్టేషన్ల మధ్య సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్ నుంచి 14వ వ్యాగన్ వెనుక ట్రాలీ చక్రం పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. సమాచారం అందడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంటాబంజి నుంచి ప్రమాద సహాయక రైలు సంఘటన స్థలానికి చేరి సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించింది. -
సమయ స్ఫూర్తికి జీఎం సత్కారం
భువనేశ్వర్: రాయగడ డివిజన్ పరిధిలోని రాయగడకు చెందిన క్యారేజ్–వ్యాగన్ గ్రేడ్ 1 టెక్నీషియన్ కె.నరేంద్రను తూర్పు కోస్తా రైల్వే భద్రతా పురస్కారంతో జనరల్ మేనేజరు సత్క రించారు. రైలు రవాణాలో సురక్షిత రైలు కార్యకలాపాలను సమయ స్ఫూర్తితో సకాలంలో గుర్తించి అప్రమత్తత చాటుకుని వృత్తిపరమైన నిబద్ధతకు ఉదాహరణగా నిలిచారని జనరల్ మేనేజరు అభినందించారు. ఈ ఏడాది జూన్ 29న రాయగడలో సరుకులతో నిండిన ఒక గూడ్స్ రైలును సాధారణ తనిఖీ చేస్తున్న సమయంలో కె.నరేంద్ర ఒక వ్యాగన్పై విరిగిన యోక్, దెబ్బతిన్న బ్యాక్ స్టాపర్ వెల్డింగ్ను గమనించారు. ఈ లోపం రైలు సురక్షిత కదలికకు ఆటంకం కలిగించగలదని గ్రహించిన ఆయన రైలు బయల్దేరడానికి ముందే లోపభూయిష్టమైన వ్యాగన్ను మార్చేందుకు తక్షణ ఏర్పాట్లు చేశారు. ఆయన సకాలంలో తీసుకున్న ఈ చర్య సంభవించబోయే భద్రతా ప్రమాదాన్ని నివారించి, రైలు సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడంలో సహాయపడిందని రైల్వే శాఖ అభినందించింది. ఆయన అంకిత భావం, అప్రమత్తత రైల్వే శాఖ బలమైన భద్రతా సంస్కృతిని ప్రతిబింబించింది. విశ్వసనీయమైన రైలు సురక్షిత, భద్రత, కార్యకలాపాలను వాస్తవ కార్యాచరణలో ఆచరించడం ఉద్యోగుల నిబద్ధతకు నిదర్శనమని తూర్పు కోస్తా రైల్వే ప్రశంసించింది. వసతి గృహంలోకి భల్లూకం!● ఆందోళనలో విద్యార్థులుజయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి నువాగాం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల వసతి గృహ పరిసరాల్లోకి ఎలుగుబంటి చొరబడింది. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా సాయంత్రం వేళ ఎలుగుబంటి ప్రహరీ దూకి వసతి గృహం ఆవరణ లోనికి వస్తుందని విద్యార్థులు, ప్రజలు చెబుతున్నారు. భల్లూకాన్ని చూస్తున్న విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది మీడియా, సోషల్ మీడి యా ప్రతినిధులు, యువకులు ఎలుగుబంటి ఫొటోలు తీసి వైరల్ చేస్తున్నారు. వసతి గృహం ఆవరణలోకి ఎలుగుబంటి వస్తుండడంతో విద్యార్థులు సాయంత్రం నుంచి ఉదయం వరకూ గదుల్లోనే భయంతో గడుపుతున్నారు. ఇక్కడ 400 మంది విద్యార్థులు ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు వసతి గృహం పరిసరాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, సిబ్బందికి సూచించారు. ఆరుబయట తిరగవద్దని హెచ్చరించారు. అధికారులు తక్షణమే ఎలుగుబంటిని పట్టుకొని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.గంజాయి స్వాధీనం కొరాపుట్: అక్రమ గంజాయిని మాచ్ఖండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి మాచ్ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర సరిహద్దు డీ–డ్యాం ప్రాంతంలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో మాచ్ఖండ్ ఐఐసీ కులమణి బురడా నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒడిశా నుండి ఆంధ్ర బోర్డర్ వైపు వేగంగా ఒక కారు వెళ్తున్నట్లు గుర్తించి దాన్ని అడ్డగించారు. అందులో 60 కిలోల గంజాయి పట్టుబడింది. కారులో ఉన్న నిందితులు సునాబెడా పోలీస్ స్టేషన్ పరిధిలో చువాగాంకి చెందిన ఈశ్వర్ సునా, భరణీ పుట్కి చెందిన యెగేష్ హంతాల్, గనేల్ గ్రామానికి చెందిన సదాన్ చడ్డాని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. -
మాజీ మంత్రి సుశాంత సింగ్ కన్నుమూత
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ (బీజేడీ) నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి సుశాంత సింగ్ (53) కన్ను మూశారు. స్థానిక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. సుశాంత్ సింగ్ దీర్ఘ కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన 2009, 2014, 2019లో భట్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేడీ శాసన సభ సభ్యులుగా ఎన్నిక అయ్యారు. ఆయన ఒడిశా ప్రభుత్వంలో కార్మిక, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పదవి బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. భట్లి శాసన సభ నియోజక వర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బిజూ జనతా దళ్ (బీజేడీ)తో పాటు పలు ఇతర రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేసి సంతాపం తెలిపారు.నదిలో చిక్కుకున్న ప్రయాణికుల పడవ భువనేశ్వర్: భద్రక్ జిల్లా చాంద్బాలి మండలం పంచుటికిరి ఘాట్ సమీపంలో నది మధ్యలో ప్రయాణికులతో ఉన్న పడవ చిక్కుకుంది. సోమవారం జరిగిన ఈ సంఘటన ప్రయాణికులను బెంబేలెత్తించింది. నది గర్భంలో దట్టమైన నీటి కలుపు మొక్కలలో చిక్కుకుపోవడంతో పడవ ముందుకు వెళ్లడం అసాధ్యమైందని బాధితులు వాపోయారు. పలువురు ప్రయాణికులతో వెళ్తున్న పడవ 2 గంటలకు పైగా నది మధ్యలో నిలిచిపోయింది. ఈ సంఘటన గురించి స్థానిక నివాసితులకు, అధికారులకు తెలియజేయడంతో పడవతో నది నడి బొడ్డున చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు ప్రయ త్నాలు ప్రారంభించారు. పడవకు ఒక తాడు కట్టి పలువురు కలిసి ఆ పడవను నదీ తీరం వైపు లాగారు. అదృష్టవశాత్తు పడవలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. -
వచ్చే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం
పర్లాకిమిడి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ కనీస వసతులు లేని గ్రామాలు ఒడిశాలో గజపతి జిల్లాలో ఉన్నాయి. వాటిలో గుమ్మసమితి పరిడా పంచాయతీలో లోబగుడ, రామంగో గుడ, సెంట్రీగుడ, కొండూరు గుడ వంటి నాలుగు గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో దాదాపు 600 మంది జనాభా నివసిస్తున్నారు. గుమ్మా బ్లాక్ నుంచి రహదారి సౌకర్య లేకపోవడంతో అనారోగ్యానికి గురైన సమయంలో జిల్లా మెడికల్కు తీసుకురాలేకపోతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. మా గ్రామాలకు రహదారి వేయకపోతే వచ్చే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. జిల్లా అధికారులకు, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి ఇదే ఆఖరియత్నంగా తెలియజేస్తున్నామన్నారు. -
నీలాద్రి విజేతో రథ యాత్రకు తెర
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని సోమ వారం శ్రీ క్షేత్రంలో నీలాద్రి విజే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రథాలపై ఆశీనులై ఉన్న మూలవిరాటులను ఒక్కోటిగా వరుస క్రమంలో కిందకు దించి ఆలయ సంప్రదాయ రీతులతో సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికపైకి బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని మూల విరాటులతో చక్ర రాజు సుదర్శనుడు, ఉత్సవ మూర్తులు మదన మోహన్, రామకృష్ణులు తరలించడంతో నీలాద్రి విజే ఘట్టం విజయవంతంగా ముగిసింది. దీంతో పూరీ జగన్నాథ స్వామి రథ యాత్రకు తెర పడింది. శ్రీ గుండిచా నుంచి మారు రథ యాత్రలో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణకు 3 రథాలు చేరిన తర్వాత ఏకాదశి నాడు స్వర్ణ అలంకారం, ద్వాదశి నాడు ఒధొరొ పొణ, త్రయోదశి నాడు నీలాద్రి విజేతో వరుస క్రమంలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలు. నీలాద్రి విజేలో సంధ్యా ధూపం తర్వాత రథాలపై దేవుళ్లను దించే గొట్టి పొహండి కార్యక్రమం ప్రారంభించారు. పొహండి తర్వాత జయ, విజయ ద్వార సమీపంలో లక్ష్మీ నారాయణ వాదన జరుగుతుంది. ఇక్కడ సేవాయత్లు ప్రతీకాత్మకంగా మహాప్రభు జగన్నాథ, శ్రీ మహా లక్ష్మి మధ్య కవితాత్మకంగా సంభాషణను నిర్వహిస్తారు. దీని తర్వాత శ్రీ మహాలక్ష్మికి రస గుల్లను సమర్పించడంతో శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుని సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానం పలుకుతుంది. రస గుల్ల కేవలం మిఠాయి మాత్రమే కాదు. ఇది ఒడిశా గొప్ప పాక సంప్రదాయానికి ప్రతీక. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో జరిగే పవిత్రమైన నీలాద్రి విజే ఆచారంలో ఒక అంతర్భాగం. ఈ సందర్భంగా రసగుల్ల దినం జరుపుకోవడం విశేషం. -
గోవధను వ్యతిరేకిస్తూ ఆందోళన
పర్లాకిమిడి: గోహాత్యలను బంద్ చేయాలని, గోసురక్షా, గోసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో జిల్లా అటవీ డివిజనల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు గోసురక్షా సమితి, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు సోమవారం ర్యాలీ చేపట్టారు. గోవులను కబేళాలకు తరలిస్నున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, గజపతి జిల్లాలో గోశాలలు నిర్మించాలని, గోఅభయారణ్యాలు ఏర్పాటు చేయాలన్న పలు డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిపారు. అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝికి రాసిన వినతిని ఆదనపు జిల్లా మాజిష్ట్రేట్ ఫల్గుణి మఝికి అందజేశారు. ఈ ఆందోళనలో గోసమ్మాన్ జిల్లా అధ్యక్షుడు గిన్నికుమార్ రెడ్డి, గోసమ్మాన్ జిల్లా కార్యదర్శి రమేష్ పాత్రో, మనోజ్ దాస్, నరేంద్ర కుమార్ జన్ని, సత్యనారాయణ సాహు, తదితరులు పాల్గొన్నారు. -
రామనగుడలో 51 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జిల్లాలోని రామనగుడ సమితి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి 51 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందువో 48 వ్యక్తి గత సమస్యలుగా గుర్తించిన అధికారులు మరో ముగ్గురికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 25 వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. అలాగే పశుసంపద అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గోపాలన, పశుగ్రాస అభివృద్ధి, మేకలు, కోళ్ల పెంపకం లబ్ధిదారులకు వర్క్ ఆర్డర్లను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లీప్, జిల్లా విదాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్, గుణుపూర్ ఎస్డీపీవో బబులా నాయక్, బీడీవో ప్రద్యుమ్న మండల్ పాల్గొన్నారు. -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కొరాపుట్: భార్యను గొడ్డలితో నరికి భర్త హత్య చేసిన ఘటన సోమవారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి హత్తి బరి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తులవతి గౌడ (36) ని భర్త ప్రహ్లాద గౌడ గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవ ముదిరి హత్యకు దారి తీసిందని పోలీసులు పేర్కొన్నా రు. మృతురాలి తండ్రి పపడాహండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పపడా హండి పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పపడాహండి ప్రభుత్వాస్పత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. లోయలో పడిన ఓఎస్ఆర్టీసీ బస్సు రాయగడ: భువనేశ్వర్ నుంచి మల్కన్గిరి వైపు వెళుతున్న ఓఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఖంబారిగుడ సమీపంలో ఈ ఘటన సొమవా రం అర్ధరాత్రి చోటు చేసుకుంది. భువనేశ్వర్ నుంచి వస్తుండగా ఖంబారిగుడ వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనానికి సంబంధించిన హెడ్ లైట్లు బస్సు డ్రైవరు పై పడటంతో బండి అదుపుతప్పింది. దీంతో సమీపంలొ గల లోయలో బస్సు పడిపోయింది. అయితే బస్సులో కేవలం డ్రైవరు, కండక్టర్ మాత్రమే ఉన్నారు. ఈ ప్రమాదంలొ ఇద్దరూ సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘రైల్వే నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించాలి’
జయపురం: కొరాపుట్ జిల్లాలో రైలు నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములకు ఇస్తున్న నష్ట పరిహారం ఉచిత మూల్యం లభించటం లేదని, పక్క నవరంగపూర్ జిల్లాలో ఎక్కువ పరిహారం లభిస్తు న్నదని భూములకు నస్ట పరిహారం చెల్లించటంలో పక్షపాతం చూపుతుందని కొరాపుట్ జిల్లా బీజేడీ ఆరోపించింది. వెంటనే కొరాపుట్ జిల్లా కలక్టర్ కలుగ చేసుకొని కొరాపుట్ జిల్లా భూ దాతలకు సముచిత పరిహారం చెల్లించేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. స్థానిక హాల్లో జయపురం సభాగృహంలో సోమవారం బీజేడీ నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ కొరాపుట్ జిల్లా రైతులకు సముచిత మూల్యం లభించడం లేదన్నారు. భూములకు వాస్తవ ధర చెల్లించేందుకు కలెక్టర్కు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవరంగపూర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో హెక్టార్ కు రూ.3 కోట్లు, పట్టణ ప్రాంతాలలో హెక్టారుకు రూ.7 కోట్లకు పైనే చెల్లిస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే కొరాపుట్ జిల్లాలో ఆ ధరలు చెల్లించేందుకు కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
● వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మ పంచాయతీ సమితి కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్కు స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన గ్రీవెన్స్ సెల్కు జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, జిల్లా పరిషత ముఖ్యకార్యనిర్వాహణ అధికారి దయామయ పాడీ, తదితరులు హాజరయ్యారు. 89 వితనతులు అందాయి. వీటిలో 21 వినతులను కలెక్టర్ పరిష్కరించారు. ఒక నిస్సహాయ వ్యక్తికి రెడ్ క్రాస్ సహాయ నిధి నుంచి రూ. 20 వేల చెక్కును కలెక్టర్ అందజేశారు. గ్రీవెన్స్కు గుమ్మా సమితి చైర్మన్ సునేమీ మండల్, బీడీఓ దులారాం మరాండి, తహసీల్దార్ శరత్ శోబోరో, తదితరులు పాల్గొన్నారు. 52 వినతుల స్వీకరణ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి కామ్బేడ పంచాయతీలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధాన్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. 52 వినతులు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయి కిరణ్, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, సపితి అధికారులు, సర్పంచ్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
తారణీ ఆలయ వీధిలో కోతుల అలజడి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రం ఎనిమిదో వార్డు పరిధిలోని తారణీ ఆలయ వీధిలో అలజడి చేస్తూ సామగ్రిని నాశనం చేస్తుండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు కోతుల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మల్కన్గిరి రేంజర్ రమేశ్ చంద్రరౌత్ మాట్లాడుతూ.. ఈ విషయంపై త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలి కొరాపుట్: నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడిన దివంగత విద్యార్థులకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న గాంధీ జంక్షన్ వద్ద గాంధీ బొమ్మ ముందు సంస్మరణ కార్యక్రమం సోమవారం జరిగింది. నీట్ పరీక్ష పత్రం లిక్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి ఫొటోలు పెట్టి కొవ్వోత్తులతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో విద్యార్ధి కాంగ్రేస్ నాయకుడు సూరజ్ లాల్,విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గోన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి గాయాలు నరసన్నపేట: జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక కొత్తవీధిలో నివసిస్తున్న కొనపల రాజశేఖర్ ఈ జంక్షన్ వద్ద ఆటో మొబైల్ షాపు నిర్వహిస్తున్నారు. కస్టమర్కి అవసరమైన వస్తువులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా.. పాతపట్నం ఎల్హెచ్ ఆర్టీసీ బస్సు నరసన్నపేట టౌన్లోకి వస్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్కు తీవ్రగాయాలు అయ్యాయి. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. భర్తకు భార్య తలకొరివి సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బైపల్లి యాదవరావు (60) సోమవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. అతని కుమారుడు కాళీప్రసాద్ కొద్ది నెలల క్రితం బతుకుతెరువు కోసం దుబాయి వెళ్లాడు. దీంతో భార్య తులసమ్మ మానసికస్థితి బాగోలేకున్నా భర్తకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. డివైడర్ని ఢీకొని యువకుడు మృతి నరసన్నపేట/పోలాకి: స్థానిక బైపాస్ సర్వీసు రోడ్డుపై శ్రీకాకుళం నుంచి జమ్ము వైపునకు వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోలాకి మండలం బెలమర పోలవలసకు చెందిన గేదెల శ్రీకాంత్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్పత్రి పనిపై శ్రీకాకుళం వెళ్లి ప్రియాగ్రహారం గ్రామానికి చెందిన స్నేహితుడు తుంగాన సురేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో వాహనం వెనుక కూర్చున్న శ్రీకాంత్ ఎగిరి డివైడర్పై పడగా తలకు తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన చోట ఇసుక ఉండడంతో ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా శ్రీకాంత్కు శ్రీకాకుళం వద్ద మొపసుబందర్కు చెందిన యువతితో గత నెల 21వ తేదీన వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త ఇలా మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అందివచ్చి న కుమారుడు ఇలా దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు ఆనంద్, విజయలక్ష్మి రోదనలు చూపరులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. గ్రామంలోనే కేబుల్ ఆపరేటర్గా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. ప్రమాదంపై నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం నడుపుతున్న సురేష్తో మా ట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
గోవుల అక్రమ రవాణా అరికట్టాలి
పర్లాకిమిడి: గోహత్య బంద్ చేయాలని, గోవులను కబేళాలకు తరలిస్తున్న వ్యక్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం పర్లాకిమిడి ఫారెస్టు గేటు నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భజరంగ్ దళ్ గోసేవా, సురక్షా ప్రభారి మనోజ్దాస్ తెలిపారు. స్థానిక ఓం కాంప్లెక్సు వద్ద ఆదివారం గోసమ్మాన్ అభియాన్ జిల్లా అధ్యక్షుడు గిన్ని కూర్మారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని బ్లాక్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ర్యాలీ నిర్వహించి వినతిపత్రాలు అందిస్తామని చెప్పారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు. రామేష్ పాత్రో, విశ్వ హిందూ పరిషత్ నగరధర్మ రక్షకులు సత్యనారాయణ సాహు, తదితరులు పాల్గొన్నారు. ఘాట్ రోడ్డులో కూలిన చెట్లుమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి నక్కమామ్ముడి పంచాయతీ ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి వానలు కురిసి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చెట్లు నేలకూలాయి. అగ్నిమాపక సిబ్బంది ఆదివారం ఉదయం నుంచి శ్రమించి రాళ్లు, చెట్లను తొలగించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి జయపురం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జయపురం స్వచ్ఛంద సంస్థ సోషియల్ ఎన్విరోన్మెంటల్, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా), స్థానిక బంధన్ బ్యాంక్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం జయపురం సమితి దులిగుడ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురం తెలుగు సాంస్కృతిక నిర్వహిస్తున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాలకు చెందిన 35 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, బ్యాంక్ సిబ్బంది, సీవా కార్యకర్తలు పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీవా కార్యదర్శి ప్రతాప్కుమార్ పట్నాయక్ మాట్లాడుతూ.. వన మహోత్సవాల సందర్భంగా తమ సంస్థ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతీ వారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క వారం మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. గ్రామాల్లో హరిత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీవా కార్యకర్తలు కె.మోహన్ రావు, ఎస్.రాజశేఖర్, బంధన్ బ్యాంక్ అధికారులు స్థిత ప్రజ్ఞ, గోపాల కృష్ణ పాడీ, సంభాన విశ్వనాథ్, శ్రీయ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
బలపడిన అల్పపీడనం
● రాగల 3 రోజులు భారీ వర్షాలు ● రెడ్ అలర్ట్ జారీభువనేశ్వర్: వాయువ్య బంగాళా ఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆది వారం తెలిపింది. ఈ వ్యవస్థ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో పారాదీప్, సాగర్ దీవుల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటుతుందని అంచనా. రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ఐఎండీ ముందస్తు సమాచారం జారీ చేసింది. సోమవారం సుందర్గడ్, కెందుఝొర్ మరియు మయూర్భంజ్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, అంగుల్, ఢెంకనాల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేశారు. సోమవారం ఒడిశా తీర ప్రాంతం పరిసరాల్లో గాలివానల వాతావరణం ఉంటుంది. గాలి వేగం గంటకు 55 నుంచి 65 కిలో మీటర్ల వరకు చేరి గరిష్టంగా గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 29 వరకు ఒడిశా తీరం వెంబడి, తీరానికి దూరంగా సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ముందస్తు జాగ్రత్త సమాచారం జారీ చేశారు. -
సారా బట్టీలపై దాడులు
● ఇద్దరు అరెస్టుజయపురం: జయపురం సమితి ధన్పూర్ గ్రామ పంచాయతీ జిలిమిలిగుడ గ్రామ ప్రాంత అడవిలో సారా బట్టీలపై అబ్కారి సిబ్బంది దాడులు నిర్వహించారు. గ్రామ సమీపంలో సారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అబ్కారి ఇన్స్పెక్టర్ అజయ కుమార్ నాయక్ ఆదివారం వెల్లడించారు. జిలిమిలిగుడ ప్రాంతంలో నిర్వహిస్తున్న మూడు సారా బట్టీలపై దాడులు చేశామన్నారు. రూ.70 వేలకు పైగా విలువైన సారా తయారీకి సిద్ధం చేసిన ఊటతోపాటు సారాను పారబోసినట్లు వెల్లడించారు. తనతో పాటు జయపురం అబ్కారి విభాగ ఓఐసీ సుభ్రత్ కేశరీ హిరన్, అబ్కారీ సిబ్బంది కలిసి పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో జిలిమిలిగుడ గ్రామ సమీప అడవిలో సారా బట్టీల్లో సారా వంటకం జరుగుతుందని అందిన సమాచారంతో దాడులు నిర్వహించినట్లు శ్రీనాయక్ వెల్లడించారు. సారా వండుతున్న వ్యక్తులు అబ్కారీ సిబ్బందిని చూసి పారిపోయారన్నారు. ఆ ప్రాంతంలో సారా వంటకం జరుగుతున్న మూడు సారా బట్టీలపై దాడులు నిర్వహించి 80 లీటర్ల సారా, 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. సారా వండేందుకు వినియోగించే సామగ్రి, డ్రమ్ములు సీజ్ చేశామన్నారు. పెట్రోలింగ్ సమయంలో నాటు సారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన త్రినాథ్, బాసుదేవ్ను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశామన్నారు. -
చిత్రకొండ జలాశయంలో వ్యక్తి మృతదేహం లభ్యం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా పాపరమేట్ల పోలీసులు ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని చిత్రకొండ జలాశయంలో గుర్తించి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వెలికి తీశారు. జలాశయంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడని శనివారం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో గాలించగా ఆదివారం మృతదేహం బాంగురుసుధా గ్రామం సమీపంలో బయటపడింది. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా గూడెం పంచాయతీ మురళిగూడ గ్రామానికి చెందిన ప్రకాష్ ఖీల్(44) గా గుర్తించారు. మృతదేహానికి కాళ్లు, చేతులు కట్టేసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మృతదేహన్ని చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. -
విద్యార్థిని ఆత్మహత్య
గిరిజన ఆశ్రమంలో● విద్యా మంత్రి సొంత నియోజకవర్గంలో ఘటన ● విపక్షాల ఆందోళన ● ఘటనపై అనుమానాలు కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో మరో ఆశ్రమ విద్యార్థిని తుది శ్వాస విడిచింది. జిల్లాలో ఉమ్మర్కోట్ సమితి బట్టిబెడ గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమంలో 8వ తరగతి చదువుతున్న జబా శాంత (12) సమీప హస్టల్ పక్కనే ఉన్న చెట్టుకు మృతదేహమై వేలాడుతూ కనిపించింది. ముందు రోజు రాత్రి ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ బయటకు వెళ్లి తిరిగి ఇద్దరు విద్యార్థినులు తిరిగి వచ్చారు. ఒక బాలిక అదృశ్యం కావడంతో హాస్టల్ సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే హాస్టల్ వార్డెన్ ఉమ్మర్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక స్వగ్రామం సునాబెడా గ్రామ పంచాయతీ దొల్దలి. కుటుంబ సభ్యులు వచ్చి ఇది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపించారు. అనంతరం వారు కూడా ఉమ్మర్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా ఘరో ఆగ్రహం రాష్ట్రంలో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మా ఘరో సంస్థ కన్వీనర్ కాధంబనీ త్రిపాఠి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పెద్ద ఎండి పోయిన చెట్టుని బాలిక ఎక్కడం సాధ్యం కాదన్నారు. ఇది ముమ్మాటికీ హత్య అని ఆరోపించారు. ఇప్పటికే జిల్లాలో చాలా మంది ప్రభుత్వ పాఠశా లలు, ఆఽశ్రమాలలో బాలలు అకాల మరణాలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ పరిహారం ప్రకటించాలని కాదంబని త్రిపాఠి డిమాండ్ చేశారు. ఆమె వెంట ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు హరావతి గొండో ఉన్నారు. విపక్షాల ఆందోళన ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే బీజేడి చెందిన మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫికా మజ్జిల నేతృత్వంలో పార్టీల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యా మంత్రి నిత్యానంద గొండో సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం -
మరమ్మతుకు లేవా నిధులు?
చరిత్రకు ఆనవాలు..పర్లాకిమిడి: ప్రత్యేక ఉద్యమ రాష్ట్రానికి అహోరాత్రులు శ్రమించిన పర్లాకిమిడి ప్యాలెస్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. గజపతి వంశీయుల చారిత్రిక వైభవాన్ని చిహ్నాంగా నిలవాల్సిన కోట ఈరో జు జీర్ణావస్థ నుంచి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. 180 ఏళ్ల కిందట యూరోపియన్ శైలిలో నిర్మించిన పర్లాకిమిడి గజపతి ప్యాలెస్ మరమ్మతుకు నేడు గజపతి వంశీయుల యువరాణి కళ్యాణీ దేవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకప్పుడు ప్రత్యేకరాష్ట్రం కోసం ఉత్కళ హితేషినీ పేరిట ఉద్యమాలు ఇక్కడి నుండే అంకురార్పణ జరిగినవి. ఈరోజు కోటలో రాజా దర్బారు హాలు సీలింగు కూలిపోయి న స్థితిలో ఉంది. కొన్ని గదులు కూలిపోవడంతో కోట లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. కోట కు మరమ్మతులు చేసి సంగ్రహాలయంగా మార్చినా గజపతి వంశీయులకు రెవెన్యూ లభించేది. ఇటీవల బహుడా రథయాత్ర రోజున పర్లాకిమిడి విచ్చేసిన రాష్ట్ర ఖనిజ రవాణాశాఖ మంత్రి బిభూతీ జెన్నా రాజావారి కోట, గజపతుల చిహ్నాం గురించి అనేక మందిని అడిగి తెలుసుకున్నారు. 1821– 1851లో జగన్నాథ గజపతి నారాయణ దేవ్ పరిపాలనకు వీలుగా పర్లాఖిముడిలో భారీ వ్యయంతో సుందరమైన కోట నిర్మించడానికి తల పెట్టారు. కోట నిర్మాణానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రూ.24 లక్షల 20 వేలు గ్రాంటుగా అందజేశారు. తొలుత రూ.4 లక్షల50 వేలు బయానాగా ఇచ్చి బ్రిటిష్ ఆర్కి టెక్టు, ఇంజినీరు రాబర్టు ఫెల్లాస్ చెస్లామ్కు నిర్మాణ బాధ్యతను అప్పగించారు. 1835లో ఈ రాజకోట భవన నిర్మాణ పనులు ప్రారంభమై రెండు అంతస్థులు 80 గదులతో 1843 నాటికి కళ్లు చెదిరే రీతి లో నిర్మించారు. యూరోపియన్ మిశ్రమ వాస్తుకళతో నిర్మించిన ప్యాలస్ లండన్లోని బకింగ్హోమ్ ప్యాల స్కు సరితూగే విధంగా ఉంటుంది. దర్బారు హాలు వెనుక కల్యాణమండపం, పడగ గదులు, వంటగదులు, దాసీలు, పరిచాలకులకు ప్రత్యేకంగా మూడు వరుసల్లో గదులు నిర్మించారంటే అప్పటి రాజరిక వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకోని ప్రభుత్వాలు రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలకులు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత జమీందారి వ్యవస్థ అంతరించిపోయింది. ఇప్పటి పాలకులు, ప్రభుత్వాలు చారిత్రాత్మక ప్రాచీన సంపదను కూడా కాపాడుకోలేకపోతున్నారు. అప్పటి ఎంపీ గోపినాధ గజపతి నారాయణ దేవ్ ఏనాడూ ఏ ప్రభుత్వాన్నీ ప్యాలస్ నిర్వహణ ఖర్చులకు నిధులు అడగలేదు. కానీ ఇప్పటి మంత్రులు ఈ ప్యాలెస్ను ప్రభుత్వానికి అప్పగిస్తే ఒక సంగ్రహాశాలగా మారుస్తామని అంటున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం గోపీనాథ గజపతి నారాయణదేవ్ బృందావన ప్యాలస్ను ప్రభుత్వానికి అప్పగిస్తే అది ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. బీఎన్ ప్యాలస్ను యాంటీ నక్సల్ స్క్వాడ్ ఉండటానికి విడిదిగా వాడుకున్నారు. తర్వా త శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల పీజీ క్లాసులు కొన్ని నెలలు నిర్వహించారు. కొద్దినెలల కిందట ఒడిశా డిప్యూటీ సీఎం ప్రభాతీ పరిడా విచ్చేసి బీఎన్ ప్యాలస్ను అస్మితా ఒడియా ప్రతీకగా భవనాన్ని తీర్చుదిద్దుతామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ప్యాలస్ రూపు రేఖలే మారలేదు. -
ఇంకెన్నాళ్లు..?
పనులు.. నరసన్నపేట: గర్భిణులకు, బాలింతలకు సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో నరసన్నపేట ఏరి యా ఆస్పత్రిని వంద పడకలకు విస్తరించేందుకు గత ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ప్రసూతి వార్డు మంజూరు చేసింది. ఆస్పత్రి సేవలు మెరుగుపరిచేందుకు వీలుగా మరిన్ని గదు లు అవసరమని భావించి రూ.12.56 కోట్లు మంజూరు చేసింది. టెండరు వేసి పనులు ప్రారంభమైనప్పటికీ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో పనుల కు మోక్షం కలగడం లేదు. గతేడాది మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు ప్రకటించారు. తర్వాత డిసెంబర్కు పొడి గించారు. 2026 సంవత్సరం వచ్చి ఏడు నెలలు అవుతున్నాయి. ఇప్పటికీ పనులు సాగుతూనే ఉన్నా యి. గత నెల రోజులుగా పనులు పూర్తిగా నిలిపి వేశారు. ఇంకెన్నాళ్లు ఈ పనులు చేస్తారోనంటూ స్థానికులు నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాతే పనులు మరింత జా ప్యంతో జరుగుతున్నాయని మండిపడుతున్నారు. తాజా అంచనాల ప్రకారం 75 శాతం పనులు జరిగినట్లు ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నా రు. రానున్న డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బిల్లులు పెండింగే కారణమా.. ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు చేస్తున్నా సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, అందుకే పనులు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. జూన్ నాటికి రూ. 1.5 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందని సమాచారం. మరో రూ. 2.5 కోట్లు పనులు చేయా ల్సి ఉంది. గదులు, ఫ్లోరింగ్, ఇతర ఫినిషింగ్ పను లు, రెండు లిఫ్టులు నిర్మించాల్సి ఉంది. ఇంటెర్నెల్ రోడ్లు, ప్రహరీ, పోస్టుమార్టం గది, ప్రసూతి వార్డు లో ఆపరేషన్ గది ఏర్పాటు చేయాల్సి ఉంది. వైద్య సిబ్బందికి అవస్థలు.. ఆస్పత్రి పనులు నత్తనడకన సాగుతుండటంతో వైద్యులు, సిబ్బంది, రోగులు అవస్థలు పడుతున్నా రు. పాత భవనంపై నాలుగో అంతస్తు నిర్మాణం కారణంగా క్రింద అంతస్తుల్లో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా వాటర్ పంపింగ్ ఇబ్బందికరంగా మారుతోంది. వంద పడక లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతానికి అవసరమైన గదులు లేకపోవడంతో 85 బెడ్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు. 22 మంది వైద్యులు ఉండగా అందరూ ఇరుకు గదుల్లో ఉండాల్సి వస్తోంది. స్పెషలి స్టు వైద్యులకు కూడా ప్రత్యేక గదులు లేని పరిస్థితి నెలకొంది. కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల వార్డులు కూడా ప్రధాన భవనంలోనే నిర్వహిస్తున్నా రు. కంటి, ఆర్థో, దంత వైద్యులకు వేర్వేరుగా సదుపాయాలు కల్పించాల్సి ఉంది. తాజాగా ఏరియా ఆసుపత్రిలో ఉన్న బ్లెడ్ స్టోరేజ్ యూనిట్ను బ్లెడ్ సెంటర్గా అప్గ్రేడ్ చేశారు. దీనికి సైతం అదనపు గదులు కేటాయించాల్సి ఉంది. నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్పై ఒత్తిడి చేస్తున్నాం. బిల్లులు పెండింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర పనులు డిమాండ్ ఉన్నందు వల్ల పనులపై దృష్టిపెట్టలేక పోతున్నాం. డిసెంబరు నాటికి భవనాలు పూర్తి చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేష్ ఏఈ, ఏపీఎంఎస్ఐడీసీ అదనపు భవనాలు, ప్రసూతి వార్డు పూర్తి కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. వైద్యు లకు సరిపడా గదులు ల్లేవు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు విభాగాలకు చెందిన సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సకాలంలో భవనా లు పూర్తి చేయాలి. – శ్రీనుబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్, నరసన్నపేట -
నేడు నీలాద్రి విజే..
● రథ యాత్ర అంతిమ ఘట్టం ● రసగుల్ల దినంభువనేశ్వర్: విశ్వవిఖాత్య జగతి నాథుని వార్షిక రథ యాత్ర సోమవారంతో ముగియనుంది. సుదీర్ఘంగా నెలల తరబడి అహర్నిశలు శ్రమించి యాత్రని జయప్రదం చేయడంలో పలు వర్గాలు తలమునకలయ్యాయి. స్వామి యాత్ర ఆద్యంతాలు రస్తవత్తరంగా సాగుతుంది. చిట్ట చివరి నీలాద్రి విజే పురస్కరించుకుని లక్ష్మీనారాయణుల దాంపత్య ముచ్చటలు మురిపిస్తాయి. నవ దినాత్మక గుండిచా యాత్ర ముగించుకుని యధా ప్రకారం మందిరంలోనికి ప్రవేశించిన తరువాత మందిరం సింహ ద్వారం మూత బడుతుంది. అంతకు కొన్ని క్షణాల ముందు అన్న, సోదరి సుభద్ర ఆటంకం లేకుండా ప్రవేశించిన మరుక్షణమే జగతి నాథునికి ద్వారం మూత బడడం వెనక మర్మం ఎరిగిన జగతి నాథుడు ప్రియ సఖి మనస్తాపం తొలగించేందుకు నోరూరించే రసగుల్ల మిఠాయిని సమర్పించడం నీలాద్రి విజే ఘట్టంలో ముచ్చట గొలిపించే తంతు. దేవేరి మహా లక్ష్మిని బుజ్జగించి ఆత్మీయ స్వాగతంతో జగన్నాథుడు సింహ ద్వారం గుండా లోనికి ప్రవేశించి యధాతథంగా శ్రీ మందిరం రత్న వేదికపై ఆసీనుడై తిరిగి స్నాన పూర్ణిమ వరకు నిరవధికంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదిస్తాడు. నీలాద్రి విజే సందర్భంగా భక్తులు, యాత్రికులు రసగుల్ల దేవుళ్లకు నివేదిస్తారు. నోరూరించే మిఠాయి రసగుల్ల ఒడిశా వారసత్వంతో ముడిపడిన వంటకంగా గుర్తింపు సాధించడంతో పాటు రసగుల్ల దినంగా జరుపుకోవడం విశేషం. 2015 సంవత్సరం తొలి సారిగా నీలాద్రి విజే పురస్కరించుకుని రసగుల్ల దినం జరుపుకోవడం ఆరంభమైంది. రసగుల్ల సాంస్కృతిక, వారసత్వం చాటి చెప్పేందుకు ఈ ఉత్సవం ముడిపడడం విశేషం. -
ముగిసిన దారుదేవత చిత్ర కళా ప్రదర్శన
జయపురం: జయపురం విక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన దారు దేవత చిత్ర కళా ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్ హాజరై జయపురం మహారాజు కళాప్రపూర్ణ విక్రమదేవ వర్మ, కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్ సంహాచళ మహారాణల విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం పపర్యవేక్షకులు, రచయిత డాక్టర్ పరేష్ రథ్ రచించిన జయపురం రథాజాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీడీఓ శక్తి మహాపాత్రో, కొరాపుట్ సాంస్కృతిక అధికారి ప్రీతి శుధా ెజెనా, ప్రిన్సిపాల్ యుధిష్టర్ మల్లిక్, రచయిత కృష్ణచంద్ర పాల్గొన్నారు. -
మోక్షదాయకం అధర పానకం
భువనేశ్వర్: పవిత్రమైన ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా ఆదివారం రథంపై ఆశీనులైన బలభద్ర, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథునికి అధర పానకం సమర్పించారు. ఈ వేడుకని ఒధొరొ పొణాగా వ్యవహరిస్తారు. రథాల అధిదేవతలు, పార్శ్వ దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో దేహరహిత ఆత్మలను ప్రసన్నం చేసుకోవడం ఒధొరొ పొణా ఘట్టం ఇతివృత్తంగా పేర్కొంటారు. మధ్యాహ్న ధూపం పూర్తయిన తర్వాత, సాయంకాల ప్రార్థనలకు ముందు ఈ కర్మను నిర్వహిస్తారు. శ్రీ విగ్రహాల పెదవుల ఎత్తుకు సరిపోయేంత ఎత్తులో ఉండే ప్రత్యేకంగా తయారు చేసిన పొడుగాటి మట్టి పాత్రలలో సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పానకం నింపుతారు. ఒక్కో రథానికి 3 పాత్రల వంతున మొత్తం 9 బాణల్లో శ్రీవిగ్రహాలకు ప్రత్యేకంగా తయారు చేసిన పానకం సమర్పిస్తారు. 9 బాణల్లో పాణకం నింపిన తర్వాత పంచోపచార పద్ధతిలో శ్రీవిగ్రహాలకు సమర్పిస్తారు. ఇదంతా ముగిసిన తర్వాత పానకంతో నింపిన కుండలను రథంపై పగలగొడతారు. చండీచాముండ వంటి శక్తులను సంతృప్తి పరిచేందుకు కుండలను పగలగొట్టే పానకం ధారాపాతంగా విడిచి పెడతారు.ఒడియా మఠం పంపిణీ చేసిన అధర పానకం బాణలునందిఘోష్ రథంపై శ్రీ జగన్నాథునికి అధర పానకం సమర్పణ -
ఉత్సాహంగా టెన్నిస్ క్రీడా పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని టెన్నిస్ కోర్టులో ఆదివారం జిల్లాస్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. శ్రీకాకుళం జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–16 (బాలబాలికలు), సీనియర్స్ పురుషు లు, మహిళలు, 35+ పురుషులు మహిళలు ఇలా.. ఆరు విభాగాల్లో పోటీలు జరిగాయి. పోటీలు ఆద్యంతం కోలాహలంగా సాగాయి. చీఫ్ కోచ్ అనీల్కుమార్, కోచ్ శంకరరావు పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ ద్వారా ప్రతి విభాగంలో ఎంపిక చేసిన జిల్లా టాప్–5 ర్యాంక్ క్రీడాకారులు.. సెప్టెంబర్ 2026లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లలో శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్వీఎస్ఆర్కె నేతాజీ తెలిపారు. మొత్తం ఆరు వయో విభాగాల్లో ప్రతి క్యాటగిరీలో విన్నర్స్, రన్నర్స్కు ట్రోఫీలు, ప్రాతినిధ్యం వహించిన ప్రతిఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. -
అక్రమ అరెస్టుపై మత్స్యకారుల ఆగ్రహం
రణస్థలం: రాజకీయ వేధింపుల్లో భాగంగానే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా ఆరెస్టు చేశారని కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు ఆరోపించారు. కొవ్వాడ సముద్రతీరంలో ఆదివారం మాట్లాడు తూ.. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యగా మార్చి కుట్ర పూరితంగా తొలుత సీదిరి కుమారుడిని, ఆపై సీదిరిని అరెస్టు చేయడం తగదన్నారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాల కు పాల్పడుతున్న కూటమి నాయకులకు రానున్న ఎన్నికల్లో మత్స్యకార ప్రజలంతా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘ కన్వీనర్ బడి రాంబాబు, కొవ్వాడ మాజీ సర్పంచ్ అల్లిపల్లి అప్పన్న, మత్స్యకార నాయకులు సూరాడ అప్పన్న, ఎం.మల్లిబాబు, యు.పోలయ్య, వి.పండువాడు, గనగళ్ల రాముడు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
‘రవాణా సదుపాయంతోనే పారిశ్రామికాభివృద్ధి’
రణస్థలం: రోడ్డు మార్గాలకు అనుసంధానంగా వాయు మార్గం చక్కగా ఉంటే ఆ ప్రాంతాలు, పరిశ్రమల సమగ్ర అభివృద్ధి శరవేగంగా పెరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. పైడిభీమవరం పారిశ్రామికవాడలో ని ఏపీఐఐసీ దగ్గర ఏర్పాటు చేసిన ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్టు నుంచి అరగంట ప్రయాణ దూరంలో ఉన్న పైడిభీమవరం, రణస్థలం, స్థానిక పరిశ్రమలకు విదేశీ వ్యాపారవేత్తలు, కొనుగోలుదారులు సులభంగా వచ్చిపోయే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. చిన్న తరహా వ్యాపారాలు, అనుబంధ పరిశ్రమలు, మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తుల విలువ పెంపుదలపై దృష్టి పెట్టాలని అన్నారు. కాలువలో బయటపడిన మృతదేహం సరుబుజ్జిలి,హిరమండలం: బప్పడాం వంశధార కుడి కాలువలో ఆదివారం మృతదేహం గుర్రపు డెక్కలో చిక్కుకొని అటుగా వెళుతున్న కొంతమంది వ్యక్తులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పూర్తి వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మృతుడు జి.సూర్యనారాయణ(45) ఎల్ఎన్పేట మండలం బొర్రంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఈయనకు భార్య పార్వతి, పిల్లలు ఉన్నారు. రెండు రోజుల కిందట ఇంటి నుంచి బహిర్భూమి కోసం బయటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో జారి చనిపోయినట్లు తెలిపారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్ఐ చంద్రినాయుడు తెలిపారు. ముగిసిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ముగిశాయి. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆద్యంతం హోరాహోరీగా సాగి న జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. అంతకుముందు ప్రారంభమైన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా సమానమైన ఆస క్తి పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ప్రశాంతతను అందిస్తాయన్నారు. నిర్వాహకులు తైక్వాండో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్ మా ట్లాడుతు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా ఆతిథ్యంలో వైఎస్సార్ కల్యా ణ మండపం వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు జరుగుతాయన్నా రు. ఇక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రపోటీలకు అర్హత సాధిస్తారని భాస్కర్ చెప్పారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు అందజేశారు. బడికి విష జంతువుల భయం నందిగాం: మండలంలోని కర్లపూడి ప్రాథమిక పాఠశాల గ్రామానికి దూరంగా కొండకు ఆనుకొని ఉంది. పాఠశాలలో 14 మంది విద్యార్థులు, ఒక ఉపా ధ్యాయురాలు ఉన్నారు. పాఠశాల చుట్టూ దట్టమైన పొదలు ఉండడం, కొండ కూడా సమీపంలోనే ఉండడంతో విష జంతువులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడికి రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు. -
స్టేట్ బ్యాడ్మింటన్ పోరుకు సిద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా కొత్త సీజన్లో బ్యాడ్మింటన్ స్టేట్మీట్ పోటీలకు రంగం సిద్ధమౌతోంది. ఏపీబీఏ, బాయ్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఆగస్ట్ 2 నుంచి 5 వరకు ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్జిల్లాల) సీనియర్స్ పురుషులు, మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్– 2026 పోటీలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడి యం వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తొమ్మిది కమిటీలను నియమించింది. బ్యాడ్మింటన్ కోర్టులకు ఇటీవల నూతన మ్యాట్లను అమర్చి, తుది మెరుగులు దిద్దారు. 2న క్వాలిఫయింగ్ రౌండ్స్.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నీ లో భాగంగా ఆగస్ట్ 2న క్వాలిఫైయింగ్ రౌండ్స్ నిర్వహించనున్నారు. 3వ తేదీ నుంచి 5 వరకు మెయిన్ డ్రా పోటీలు జరగనున్నా యి. మొత్తం ఐదు కేటగిరిల్లో పోరు కొనసాగనుంది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. సీనియర్స్ విభాగంలో పోటీలు కావడంతో యువ, వర్ధమాన షట్లర్లతోపాటు పలువురు సీనియర్స్ రేటింగ్ ప్లేయర్స్ హాజరుకానుండటంతో పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగనున్నాయి. 3వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ నాయకులు హాజరవుతున్నా రు. ఇక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు త్వర లో భువనేశ్వర్ వేదికగా జరిగే సీనియర్ నేషనల్స్ బ్యాడ్మింటన్షిప్ పోటీలకు నేరుగా అర్హత సాధిస్తారు. 13 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక.. మెగా టోర్నీ కోసం ఉమ్మడి 13 జిల్లాల నుంచి 156 మంది వరకు క్రీడాకారులతోపాటు మరో 52 మంది కోచ్ మేనేజర్లు హాజరవుతున్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్స్కు హాజరయ్యే క్రీడాకారుల్లో 1:4 నిష్పత్తిలో విజేత షట్లర్లను మెయిన్డ్రాకు ఎంపికచేయనున్నారు. క్రీడాకారులు, తదితరులకు ఇండోర్ స్టేడియంలో సమీపంలో వసతి కల్పించనున్నారు. మీట్ నిర్వహణకు రూ.12లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున సాయం అందిస్తే క్రీడాకారులకు మరింత ఉన్నత స్థాయిలో వసతులు కల్పించడానికి అవకాశం లభిస్తుంది. మీట్ నిర్వహణకు ఇప్పటికే ఏ ర్పాట్లలో నిమగ్నమయ్యాం. జిల్లాలో 2024 తర్వాత మళ్లీ మరో స్టేట్మీట్ నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది. నా తరఫున ఆర్థిక సాయంతోపాటు జెమ్స్, కిమ్స్ హాస్పటల్ తరఫున మెడికిల్ కిట్, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, స్టేట్మీట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీకాకుళంకు వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం తరఫున ప్రతిఒక్కరూ సాయం చేసేందుకు ముందుకొస్తున్నాం. క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం కూడా సాయం అందిస్తే బాగుంటుంది. – నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్, స్టేట్మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ -
లైంగికదాడి కేసులో నిందితుడికి పదేళ్లు జైలు
రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్స్టేషన్ పరిధిలోని బొరిగుడ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగ యువతిపై లైంగికదాడి, హత్యయత్నానికి పాల్పడిన నిందితుడికి జిల్లా సెషన్స్కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అలాగే బాధితురాలికి నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. 2024 అక్టోబర్ 31వ తేదీన నిందితుడు బాబులా కులిసిక బాధిత యువతిని బలవంతంగా తన సోదరుడి ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడడంతోపాటు హత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై 2024 నవంబర్ ఐదో తేదీన బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందిలి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు 17 మంది సాక్షులను విచారించిన అనంతరం జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అల్పనా స్వయి ఈ మేరకు తీర్పును వెల్లడించారు. సునాబేసోలో దేవతామూర్తులు దర్శనం రాయగడ: రథయాత్రలో భాగంగా స్వామి జగన్నాథుడు, బలభద్ర, శుభద్ర దేవతామూర్తులు శనివారం రథంపై కొలువై సునాబేసోలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం గుండిచా మందిరం నుంచి రథంపై జగన్నాథ మందిరానికి చేరుకున్న దేవతామూర్తులు ఏకాదశి కావడంతో రథంపైనే పూజలందుకున్నారు. స్వామి వారి సునాబేసో దివ్యదర్శనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మావో డంప్ స్వాధీనం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జోడాంబు పంచాయతీ ఘనబేఢ గ్రామం అడవిలో శనివారం తెల్లవారుజామున బీఎస్ఎఫ్, డీవీఎఫ్ జవాన్లు ఒక మావో డంప్ను గుర్తించి వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పోలీసు యంత్రాంగం అదేశాలతో శుక్రవారం నుంచే ఘనబేఢ గ్రామానికి ఆనుకొని ఉన్న అడవిలో 177 బెటాలియాన్ బీఎస్ఎఫ్ జవాన్లు, డీవీఎఫ్ జవాన్లు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే శనివారం తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున జవాన్లుకు మావోల డంప్ తారసపడడంతో దానిని బయటకు తీశారు. అందులో 3 కిలోల బరువు ఉన్న 3 ఐఈడీలు, 32 జెలిటిన్ స్టిక్స్, 11 డెటోనేటర్లు, 500 గ్రాముల గన్పౌడర్, 3 మీటర్లు కోడెక్స్ వైరు, 1 రేడియో, 2 టార్చలైట్స్, 12 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. మావో కదలికలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.కట్రిగుడలో పులి పాదాల గుర్తులు జయపురం: జయపురం సబ్డివిజన్ కోట్పాడ్ సమితి ఛతర్ల గ్రామ పంచాయతీ కట్రిగుడ గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి పాదాల గుర్తులు ఆ గ్రామ ప్రజలను భయానికి గురి చేస్తున్నాయి. గ్రామ పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పులి సంచరిస్తోందని ప్రజలు అనుమానిస్తున్నారు. దీంతో సాయంత్రం కాకముందే ఇళ్ల తలుపులు మూసివేస్తున్నారు. తెల్లవారితే గానీ బయటకు రావడం లేదు. దీంతో కోట్పాడ్ అటవీ అధికారులకు తెలియజేయగా.. కోట్పాడ్ అటవీ రేంజ్ గోవింద నాయిక్ కట్రిగుడ గ్రామం వచ్చి కనిపించిన పాదాలను పరిశీలించారు. అవి పులి అడుగులేనని నిర్ధారించారు. ప్రజలు ఇంటి నుంచి రాత్రులు బయటకు రావద్దని హెచ్చరించారు. అటవీ సిబ్బంది పులి జాడలను తెలుసుకునేందుకు గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులి పక్కరాష్ట్రం ఛత్తీష్ఘడ్ కురుంది సమీప అడవి నుంచి వచ్చినట్లు గుర్తించామని రేంజ్ అధికారి వెల్లడించారు. ప్రజలకు పులి జాడ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. -
బలభద్ర స్వామి రథానికి తెర
భువనేశ్వర్: ఉత్కళీయ సంప్రదాయం జగన్నాథ సంస్కృతితో ముడి పడి ఉంది. ఈ సంప్రదాయంలో వదిన–మరుదులు, బావ–మరదలు ముఖాముఖి పడకుండా మెలకువతో కుటుంబంలో మెసలడం ఆచారం. కుటుంబ, సమాజ వ్యవస్థని క్రమశిక్షణతో కొనసాగించేందుకు ఈ ఆచారం దోహదపడుతుంది. బహుడా యాత్ర సందర్భంగా ఈ ఆచారం వాస్తవ కార్యాచరణ ప్రతిబింబిస్తుంది. శ్రీ జగన్నాథ మహాప్రభువు శ్రీమందిరానికి తిరిగి చేరుకునే వేళ ముందుగా బలభద్రుని తాళధ్వజ రథం, అనంతరం సుభద్రాదేవి దర్పదళన రథం సింహ ద్వారం సమీపానికి చేరుకుంటాయి. ఆ తర్వాత గజపతి మహారాజు శ్రీనహర్ వద్ద మహా ప్రభువు నందిఘోష రథాన్ని నిలిపివేస్తారు. అనంతరం శ్రీమందిరం నుంచి మహాలక్ష్మి దేవిని తీసుకొచ్చి లక్ష్మి జగన్నాథుల దివ్య భేటీ జరిపిస్తారు.మహాలక్ష్మీ దేవి సింహ ద్వారం నుంచి వెలుపలకు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో బలభద్రుని రథంపై సేవాయతులు తెర వేస్తారు. దీని వల్ల మహాలక్ష్మి దేవి బావ బలభద్రుడు చూడకుండా కుటుంబ కట్టుబాటుల ప్రకారం తిరిగి శ్రీ మందిరానికి చేరుతుంది. ఇదే జగన్నాథ సంస్కృతిలో సీ్త్ర పట్ల గౌరవానికి, కుటుంబ సంబంధాల మర్యాద పరిమితులకు ప్రతీక. ఈ పవిత్రమైన సంస్కారాన్ని స్వయంగా భగవంతుడే ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవడం మానవీయ లీలల్లో ఒకటి. -
స్వర్ణ భూషణాలు
రథాలపై మూల విరాట్లకు ..భువనేశ్వర్: పూరీలోని జగన్నాథ ధామంలో జరిగే అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటైన స్వర్ణాలంకారంలో మహా ప్రభువు శ్రీ జగన్నాథుడు రాజాధి రాజుగా అన్నా చెల్లెళ్ల సమేతంగా దైవిక సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచాడు. రథంపై అత్యద్భుతమైన బంగారు ఆభరణాలతో అలంకరించబడి అశేష భక్త జనానికి దర్శనం ఇచ్చారు. పవిత్ర ఆషాఢ శుక్ల ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి తిథి సందర్భంగా శని వారం రథారూఢ బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని మూల విరాట్లను బంగారు ఆభరణాలతో పరిపూర్ణ మూర్తులుగా రూపు దిద్దారు. మధ్యాహ్న ధూపదీప నైవేద్యాల అనంతరం దివ్య అరుదైన స్వర్ణ అలంకారంలో దేవదేవుళ్లు భక్తులకు దర్శనమిచ్చారు. 3 రథాలలో మూల విరాటుల స్వర్ణ అలంకరణ సాయంత్రం 5.10 గంటలకు ప్రారంభమై 6.35 గంటలకు ముగిసింది. సంవత్సరానికి 5 సార్లు పూరీ జగన్నాథ్ ధామంలో స్వర్ణ భూషిత శోభతో భగవంతుని దర్శనం లభిస్తుంది. ఏటా ఆషాఢ శుక్ల ఏకాదశి పురస్కరించుకుని బహుడా యాత్ర తర్వాత రోజున రథాలపై స్వర్ణ ఆభరణాలతో దివ్య దర్శనం లభిస్తుంది. మధ్యాహ్నం ధూపం సమర్పణ తర్వాత ఈ అలంకరణ చేపడతారు. ఏటా కార్తీక పౌర్ణమి నాడు పగటి పూట స్వర్ణ శోభతో స్వామి దర్శనం ఇస్తాడు. ప్రాతః ధూపం తరువాత శ్రీ మందిరం రత్న సింహాసనంపై ఈ దర్శనం ప్రాప్తిస్తుంది. పౌష్య పౌర్ణమి పురస్కరించుకుని ఏటా నిర్వహించే పుష్యాభిషేకం సందర్భంగా మూడో సారి స్వామి దర్శనం స్వర్ణ అలంకారంలో లభిస్తుంది. మధ్యాహ్న ధూపం సమర్పించిన తర్వాత ఈ అలంకరణ చేస్తారు. మరో మారు డోల పౌర్ణమి తిథి నాడు ఉదయం రత్న సింహాసనంపై దేవతా మూర్తులకు ధూప సమర్పణ తర్వాత స్వర్ణ శోభతో స్వామి కాంతులీనుతాడు. చివరగా ఐదో సారి ఏటా అశ్విని శుక్ల దశమి (విజయ దశమి) సందర్భంగా దసరా రోజున ఉదయం రత్న సింహాసనంపై మూల విరాటులకు బంగారం ఆభరణాలతో అలంకరిస్తారు. దసరా నాడు విజయ రామచంద్రుని రూపంలో, కార్తీక పౌర్ణమి నాడు ద్వారకానాథుని రూపంలో, డోల పౌర్ణమి నాడు గోపేశ్వరుని రూపంలో మరియు పౌష్య పౌర్ణమి నాడు పుష్యాభిషేకం సందర్భంగా శ్రీరాముని రూపంలో బంగారు కాంతులతో స్వామి ప్రకాశిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తాడు. ఈ సంప్రదాయం క్రీ.శ. 1460 నాటిదని నమ్ముతారు. ఆ కాలంలో రాజు కపిలేంద్ర దేవ్ యుద్ధాలలో విజయం సాధించి స్వాధీనం చేసుకున్న అపారమైన యుద్ధ సంపదన బంగారు ఆభరణాలను సమర్పించాడు. -
పోటెత్తిన భక్తులు
దేవశైనీ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పట్టణంలో రాజవీధిలో మవుసీ (పిన్నిగారు) ఇంట్లో విడిదిచేసిన శ్రీజగన్నాధ, బలభధ్ర, సుభధ్రలు భక్తుల మొక్కులను స్వీకరించారు. మహిళలు ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి వర్షం పడుతున్నా ఆ దేవతామూర్తులను దర్శించుకుని ఉపవాసాలు పాటించారు. చట్టు పక్కల గ్రామాల నుండే కాక పాతపట్నం, చాపర, మెళియాపుట్టి, వసుంధర గ్రామాల నుంచి భక్తులు రావడంతో రాజవీధిలో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీజగన్నాథుడు, నాగార్జున రూపంలో, బలభధ్రుడు, సుభధ్రలు సునాబేషో (బంగారు ఆభరణలుతో) భక్తులకు దర్శనం కల్పించారు. సునాభేషో సంధర్భంగా పోలీసుబలగాలు భధ్రత కట్టుదిట్టం చేశారు. పర్లాకిమిడి -
అడపా మందిరం వద్ద నృత్య ప్రదర్శనలు
పర్లాకిమిడి: మారు రథయాత్ర ముగింపు సందర్భంగా స్థానిక రాజవీధి శ్రీజగన్నాథ మందిరం ఆవరణలో జిల్లా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భక్తి సంగీత, నృత్య కార్యక్రమం గత రాత్రి జరిగింది. రెండురోజుల పాటు జరిగిన ఈ నృత్య కార్యక్రమంలో పదామృత నృత్యనయన, డ్రీమ్స్ డ్యాన్స్ గ్రూపు, ఏజే క్రియేటివ్ తదితర సంస్థల విద్యార్థులు ఒడిస్సీ నృత్యాల ద్వారా ప్రేక్షకులకు అలరించారు. కార్యక్రమంలో ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ అసిస్టెంటు సీడీఓ పృథ్వీరాజ్ మండళ్, పూర్ణచంద్ర మహాపాత్రో, గురు రఘునాథ పాత్రో, జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత బినోద్ చంద్ర జెన్నా, నృసింహా చరణ్పట్నాయిక్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, బిచిత్రా నంద బెబర్తా పాల్గొన్నారు. ఈ నెల 28 వరకూ జగన్నాథ అడపా మందిరం వద్ద సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని డీసీఓ అర్చనా మంగరాజ్ తెలిపారు. -
‘మన్ కీ బాత్’ జిల్లాస్థాయి శిక్షణా శిబిరం
మల్కన్గిరి: స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయంలో మన్ కీ బాత్ జిల్లాస్థాయి శిక్షణ శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నేత, చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డొంబురు శిశా మాట్లాడుతూ 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని 7 సమితులకు చెందిన బీజేపీ సమితి సభ్యులు పాల్గొన్నారు. నీట్ విజేతలకు సన్మానం కొరాపుట్: నీట్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి సన్మానించారు. జిల్లా కేంద్రానికి చెందిన సచిదానంద కుమారుడు స్వాభిమాన్ మిశ్రకి 3,992వ ర్యాంకు, కొసాగుమ్డ సమితి కేంద్రానికి చెందిన కిషన్ కుమార్ మాలిక్ కుమారుడు దిశ్యాంశు కుమార్ మాలిక్కి 7,939వ ర్యాంకులు వచ్చాయి. దీంతో వారిద్దరి కుటుంబాలను ఎమ్మెల్యే కలుసుకొని అభినందించారు.భవిష్యత్లో బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. చిత్రంగపల్లిలో దివ్యాంగ నిర్ధారణ శిబిరం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి చిత్రంగపల్లి పంచాయతీలో భీమ భోయి దివ్యాంగ సామర్ధ్య అభియాన్ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి వివిధ విభాగాల నిపుణులైన వైద్యులు హాజరై దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులుగా గుర్తించిన వారికి దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అలాగే బస్సు, ట్రైన్ పాస్లను జారే చేసే ఏర్పాటు చేశారు. కలిమెల సమితి అభివృద్ధి శాఖ అధికారి ప్రదీప్కుమార్ కర్ ముఖ్యఅతిథిగా హాజరై 382 మంది దివ్యాంగుల పేర్లు నమోదు చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 154 మంది శారీరక (నడక ) వైకల్యం కలిగినవారు, 56 మంది దృష్టి లోపం ఉన్నావారు, 51మంది చెవిటి,మూగ దివ్యాంగులు, 16 మంది మానసిక ఆరోగ్య సమాస్యలతో బాధాపడతుండగా.. పది మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. 58 మంది వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసినట్టు అధికారులు వెల్లడిచారు. అత్యాచారం కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష భువనేశ్వర్: అంగుల్ జిల్లాలో ఒక యువతి, మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో విచారణ జరిపిన అంగుల్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు) శుక్రవారం కీలకమైన తీర్పును వెలువరించారు. ఈ కేసులో నలుగురు నిందితులకు జరిమానాతో పాటు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 6, భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద నిందితులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారిలో ప్రతి ఒక్కరికీ వివిధ సెక్షన్ల కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2024 సంవత్సరం ఆగస్టు 6న అంగుల్ ప్రాంతంలో 21 ఏళ్ల యువతి, ఒక మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై నమోదైన కేసుపై పోలీసులు చర్యలు చేపట్టి, జీతూ సాహు, హృదయ చంద్ర ప్రధాన్, అసిత్ కుమార్ సాహు, దీపు అలియాస్ దివ్య రంజన్ అమంత్లను అరెస్టు చేశారు. అంగుల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ జైన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ సంఘమిత్ర శతపతి ఈ కేసును దర్యాప్తు చేశారు. కేసు నమోదైన 59 రోజుల్లో నేరారోపణ వివరాలు దాఖలు చేశారు. దర్యాప్తు సమయంలో సేకరించిన బలమైన శాసీ్త్రయ ఆధారాలు, వాంగ్మూలాలు, ఇతర సమాచారం ఆధారంగా న్యాయస్థానం నిందితులందరినీ దోషులుగా తేల్చింది. -
మోసగాడు అరెస్టు
మల్కన్గిరి: పరీక్షల్లో పాస్ చేయిస్తానని చెప్పి డబ్బును తీసుకొని మోసం చేసిన వ్యక్తిని బలిమెల పోలీసులు బాలేశ్వర్లో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కోరుకొండ సమితి బలిమెల ఎస్ఏసీ పదోవార్డులో నివసిస్తున్న బి.ఈశ్వరరావు కుమార్తె గత ఏడాది ఇంటర్ పరీక్ష రాసినప్పటికీ ఉత్తీర్ణత కాలేదు. దీంతో సమాధాన పత్రాల రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేశారు. ఆ సమయంలో బాలేశ్వర్ జిల్లా బాలిసాహికు చెందిన నిరంజన్ సేఠి అనే వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమై రూ. 30 వేలు చెల్లిస్తే అమ్మాయిని పాస్ చేయిస్తానని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన ఈశ్వర్రావు ముందస్తుగా రూ. 17 వేలు చెల్లించారు. అయితే డబ్బులు తీసుకున్న అనంతరం నిరంజాన్ ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మోసపోయినట్టు గమనించిన ఈశ్వర్రావు గత నవంబర్ నెలలో బలిమెల పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మాలేశ్వర్లో ఉన్నట్టు గుర్తించి ప్రత్యేక బృందాన్ని ఐఐసీ ప్రభుదత్త మాల్లిక్ పంపించారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు బలిమెలకు గురువారం సాయంత్రానికి తీసుకొని వచ్చారు. పూర్తి విచారణ అనంతరం నిందితున్ని కోర్టుకు తరలిస్తామని ఐఐసీ దేవదత్త మాళ్లిక్ తెలిపారు. కాగా నిందితుడు నుంచి రూ. 17 వేలు నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. -
నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
జయపురం: నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్వో) డిమాండ్ చేసింది. ఈ మేరకు జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడలో ఆందోళన చేపట్టారు. జిల్లా కన్వీనర్ లక్ష్మణ నాయిక్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఏఐడీఎస్వో కొరాపుట్ జిల్లా కార్యదర్శి జగన్నాథ్ హరిజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యా విధానంపై క్రమంగా దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థను బలహీన పరుస్తోందని ఆరోపించారు. అలాగే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జీని ఖండించారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు రఘునాథ్ కుమార్, దీపక్ గౌడ, లోకేష్ తాండియ, హిందూ ఖొర, రాహుల్ గౌడ, విష్ణు గౌడ, నంద గౌడ, సుభాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బహుడా యాత్ర
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా జగన్నాథ్ స్వామి బహుడా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ప్రత్యేక పూజలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ కూర్చుని మౌసమి మందరం నుంచి రథం బయలుదేరి దూర్గగూఢ వీధిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకున్నారు. 4 గంటలకు ప్రారంభమైన యాత్ర రథం 7 గంటలకు ఆలయం వద్దకు చేరింది. కొరాపుట్, నబరంగ్పూర్లో.. కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో బహుదా విజయ వంతంగా ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం గుండిచా మందిరాల వద్ద ఉన్న రథాల పై పొహండి నిర్వహించి విగ్రహాలు చేర్చారు. నబరంగ్పూర్లో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ తొలి దర్శనం చేసుకున్నారు. రాజ పురోహితుడు నర్సింగ త్రిపాఠి చీపురుతో ఊడ్చి చెరాపొర నిర్వహించారు. రాత్రయ్యేసరికి రథాలు జగన్నాథ మందిరాలకు క్షేమంగా చేరుకున్నాయి. బొయిపరిగుడలో.. జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో మారు రథయాత్ర ఘనంగా జరిగింది, గుండిచామందిరం నుంచి బయలు దేరిన రథం జగన్నాథ మందిరం వద్దకు సాయంత్రం చేరింది. ఈ రథాయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. పర్లాకిమిడిలో... పర్లాకిమిడి: బహుడా సందర్భంగా గుండిచా మందిరం వద్ద శ్రీజగన్నాథ, బలభధ్ర, సుభధ్రలకు పూజలు జరిపి పోహాండికి సన్నాహాలు చేశారు. తొలుత రథంపై సుదర్శనుడు, తరువాత బలభధ్రుడు, సుభధ్ర, జగన్నాథస్వామిని వేర్వేరు రథాలపై దైతాపతులు, సేవాయత్లు ఎక్కించారు. అనంతరం గజపతి వంశీయుల యువరాణి కళ్యాణీ గజపతి విచ్చేసి రథంపై సంప్రదాయంగా పూజలు చేసి, చెరా పొహారా చేపట్టారు. మూడు రథాలపై యువరాణి కళ్యాణీ గజపతి పూజల చేసిన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు రధాలను మవుసీ (పిన్నిగారు) ఇంటివైపు బయలుదేరాయి. రాజవీధి మార్గమధ్యలో టౌను హాలు గేటు వద్ద మూడు రధాలను నిలిపివేశారు. శనివారం దశమి సంధర్భంగా శ్రీజగన్నాథ, బలరాములు పిన్నిగారి ఇంట్లో పిండి వంటలు స్వీకరిస్తారు. -
ట్రేడ్మార్కు
●శ్రీ జగన్నాథుని పవిత్ర నామాలకు పవిత్ర చతుర్థామ క్షేత్రాల్లో ఒకటిగా వాసికి ఎక్కిన శ్రీ జగన్నాథుని ప్రధాన దేవస్థానం జగన్నాథ ధామంగా ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో స్థానం సొంతం చేసుకుంది. ఈ పవిత్ర నామాన్ని ఇతర ప్రాంతాల్లో మరి ఏ ఇతర శ్రీ జగన్నాథ ఆలయానికి జోడించేందుకు వీలు లేని రీతిలో జగన్నాథ ధామ్ ట్రేడ్ మార్కు కవచంలా పరిరక్షిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, జగతి నాథుడు కొలువై ఉన్న పూరీ పట్టణం ఆధ్యాత్మిక కోణంలో పలు నామాలతో పేర్కొనబడుతుంది. వాటిలో శ్రీ క్షేత్రం అత్యంత వాడుకలో కొనసాగుతున్న పవిత్ర నామం. ఈ నామానికి ట్రేడ్ మార్కుతో ప్రత్యేక ఉనికి సాధ్యమైంది. -
గజపతి రాజ ప్రాసాదం సందర్శన
పర్లాకిమిడి: రాష్ట్ర ఖనిజ, రవాణా శాఖమంత్రి బిభూతీ భూషణ్ జెన్నా ఒకరోజు గజపతి జిల్లా పర్యటనకు విచ్చేసి శ్రీజగన్నాథ మందిరంలో జరుగుతున్న పునర్నిర్మాన పనులు, గుండిచా మందిరంలో శ్రీజగన్నాథుడు కల్కి అవతారాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట బిజేపీ సీనియర్ నాయకులు ఛిత్రి సింహాద్రి, బిజేపీ నాయకులు సిధ్ధేశ్వర మిశ్రా, రాయఘడ బ్లాక్ మాజీ చైర్మన్ అంతర్యామి గోమంగో, ముల్లి గోపాలరావు తదితరులు ఉన్నారు. తొలుత రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా రాజవీధిలో జగన్నాథ మందిరం వద్ద అన్నప్రసాదాలను స్వయంగా పంపిణీచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పంపిణీలో వీహెచ్పీ, భజరంగ దళ్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జగన్నాథ మందిరం పునర్నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. తరువాత మంత్రి జెన్నా, గజపతి ప్యాలెస్కు వెళ్ళి గజపతి రాజుల చివరి వంశీయురాలు కల్యాణీ గజపతిని కలిసి మట్లాడారు. ఈ సందర్భంగా రాజావారి ప్యాలస్ మరమ్మత్తుకు గాను యువరాణి కళ్యాణీ గజపతి రాష్ట్ర మంత్రి జెన్నాకు వినతిని అందజేశారు. గజపతి రాజవంశీయుల కోట విశేషాలను పూర్ణచంద్ర మహాపాత్రో ద్వారా తెలుసుకున్నారు. అప్పట్లో ఇంగ్లాడు నుంచి వచ్చిన బ్రిటీషు ఆర్కిటెక్ట్ రాబర్టు ఫెల్లోయిస్ ఛిస్లోమ్ పర్లాకిమిడి, కంచిలి వద్ద తర్లా కోట, చైన్నెలో కృష్ణచంద్రగజపతి మార్గ్లో ఉన్న రాజవారి కోట ఒకేసారి నిర్మాణం అయ్యిందని పూర్ణమహాపాత్రో తెలియజేశారు. రాజావారి దర్బారు సీలింగు, దర్బారు ముందుభాగం ప్రస్తుతం పడిపోయి జీర్ణావస్థలో ఉందని, దీనికి సుమారు రూ.3 కోట్ల ఖర్చువుతుందని, అయితే గజపతి మహారాజుల కోట ఒడిషా రాష్ట్ర ప్రజలకే తలమాణికమని, అలాంటి ప్రాచీన జాతీయ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని అన్నారు. యువరాణితో ప్రత్యేక సమావేశం రాజదర్బారులో మంత్రి బిభూతీ జెన్నా సమావేశం అనంతరం యువరాణి కళ్యాణీ దేవితో కోటలో సమావేశమయ్యారు. ఆయన వెంట బిజేపీ నాయకులు, సిధ్ధేశ్వర మిశ్రా, పూర్ణమహాపాత్రో వున్నారు. ఆమెను బీజేపీ పార్టీలోకి రాష్ట్ర మంత్రి బిభూతి జెన్నా ఆహ్వానించినట్టు అబిజ్ఞాన వర్గాల సమాచారం. -
చెరువులో పడిన పెళ్లి ఊరేగింపు కారు
● ఐదుగురు దుర్మరణం భువనేశ్వర్: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెరువులో పడిపోయి విషాదం చోటు చేసుకుంది. ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో 5 మంది దుర్మరణం పాలయ్యారు. అదృష్టవశాత్తు ఇద్దరు ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. బుధవారం రాత్రి ఢెంకనాల్ జిల్లా ఛొతియా గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బంగూరసింగ్ గ్రామానికి చెందిన 7 మంది స్నేహితులు పెళ్లి కొడుకు తరఫున పెళ్లి జరుగుతున్న ఇందిపూర్ గ్రామానికి కారులో వెళ్లారు. వేడుకలో పాల్గొన్న తర్వాత వారు రాత్రి పొద్దు పోయాక ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఛొతియా గ్రామం సమీపంలో కారు అకస్మాత్తుగా అదుపు తప్పి చెరువులో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు ప్రయాణికులు బబ్లూ, శిబు కారు తలుపును పగల గొట్టి ఈదుకుంటూ సురక్షితంగా చెరువు గట్టుకు చేరారు. స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి జనం చేరి నీట మునిగిన వాహనం నుంచి మిగిలిన ఐదుగురు ప్రయాణికులను బయటకు తీశారు. వారిని రక్షించే సమయానికే వారు అంతా మరణించారు. మృతులను చంద్రకాంత్ స్వంయి (డ్రైవర్), అబినాష్ సాహు, రాకేష్ సాహు, శ్రీరామ్ సాహు మరియు అభిజిత్ సాహుగా గుర్తించారు. ఢెంకనాల్ సదర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టారు. వెలికి తీసిన మృత దేహాలను పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి పంపించారు. -
నబరంగ్పూర్లో భగ్గుమన్న విద్యార్థి లోకం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో విద్యార్థి లోకం భగ్గుమంటోంది. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని చమిరియాగుడ నుంచి ర్యాలీలో పాల్గొనడానికి రావాలని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఇది సామాన్య ర్యాలీగానే ప్రజలు భావించారు. న్యూఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావ ర్యాలీగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి కొద్దికొద్దిగా విద్యార్థులు చేరుకున్నారు. పోలీసులు కూడా కొద్ది మందే వచ్చారు. విద్యార్థుల సంఖ్య రానురాను భారీగా పెరిగింది. దీంతో పోలీసులు భారీ ఎత్తున భద్రత కల్పించారు. విద్యార్థులతో చర్చలు జరిపి ప్రశాంతంగా ర్యాలీ జరపడానికి నిర్ణయించారు. నీట్ పరీక్ష లీకేజి తో సంబంధం ఉన్న రాష్ట్రానికి చెందిన కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై దాడి చేసిన ఘటన పై న్యాయ విచారణ జరపాలని, వాంగ్ చుక్ జీవిత భద్రత కేంద్రానిదే అని నినాదాలు చేశారు. కొన్ని చోట్ల విద్యార్థులు ఆగ్రహాలకు గురైనప్పటికీ పోలీసులు నచ్చజెప్పారు. పార్టీలకు అతీతంగా ర్యాలీ జరగడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెర వెనుక ఉండి పరిశీలించారు. ఈ ర్యాలీ సుమారు 4 కిలోమీటర్ల దూరం కలక్టరేట్ జంక్షన్ వరకు సాగింది. అక్కడ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్ర పటాన్ని అవమానించారు. ఊహించని విదంగా వేల సంఖ్యలో విద్యార్థులు రావడంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. కొరాపుట్లో.. కొరాపుట్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఆందోళన చేశారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ వలన రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేసి ఒడిశా పేరు ప్రతిష్టలు పోకుండా చూడాలని హితవు పలికారు. కొరాపుట్,నబరంగ్పూర్ జిల్లాలలో కాంగ్రేస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. -
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు నగదు : రూ.2,79,270 భువనేశ్వర్: శ్రీ జగన్నాథ ఆలయ పవిత్ర సంప్రదాయాలు, వారసత్వాన్ని పరిరక్షించడంలో ఆలయ పరిపాలన విభాగం మరో మైలు రాయిని ఆవిష్కరించింది. స్వామి సంస్కృతితో ముడిపడి దైనందిన వ్యవహారంలో కొనసాగుతున్న ప్రముఖ నామాలు (పేర్లు) పవిత్రత పరిరక్షణకు ప్రత్యేక గుర్తింపు సాధించింది. ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ రెండో విడత పరిశీలన అనంతరం రాబోయే ట్రేడ్మార్క్ జర్నల్లో ప్రచురణ కోసం 5 ట్రేడ్మార్క్ దరఖాస్తులకు ఆమోదం లభించిందని ప్రధాన నిర్వాహకుడు డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఆ జాబితాలో జగన్నాథ ధామ్, శ్రీ క్షేత్రం, మహా ప్రసాదం, నీల చక్రం, కోయిలి వైకుంఠం చోటు చేసుకున్నాయి. శ్రీ జగన్నాథునితో ముడిపడి ఉన్న పవిత్ర నామాలు, సంప్రదాయాలను పరిరక్షించడం, వాటి అనధికారిక వినియోగం, వాణిజ్య దుర్వినియోగాన్ని నివారించడం దిశగా ఈ ఆమోదాలు దోహదపడతాయని తెలిపారు. శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరం శిఖరాన నింగికి చేరువై స్థాయిలో నీల చక్రం దర్శనం ఇస్తుంది. నీల చక్రం అష్ట ధాతువులతో తయారైనదిగా పేర్కొంటారు. తరతరాలుగా ఈ చక్రం ప్రకృతి వైపరీత్యాల్ని ఎదురీదుతు నిత్య నూతనంగా ఆలయ శిఖరాన నెలకొని ఉండడం విశేషం. ఆలయ శిఖరాన మహిమాన్విత చక్రంగా భక్తజనుల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించిన నీల చక్రం తాజాగా ట్రేడ్ మార్కు రిజిస్ట్రీలో చోటు చేసుకుని ఉనికిని మరింత పటిష్టపరచుకుంది. కోయిలి వైకుంఠం శ్రీ మందిరం సముదాయంలో ఇదో పవిత్ర ప్రాంగణం. ప్రధాన దేవస్థానానికి వెనుక వైపు నెలకొని ఉంది. ఈ ప్రాంగణం మూల విరాటుల నవ కళేబర మహోత్సవంతో ముడి పడి ఉండడం విశేషం. ఆలయ సంప్రదాయం, ఆచార వ్యవహారాల నేపథ్యంలో ప్రత్యేక పంచాంగం గణాంకాల ప్రకారం రత్న వేదికపై మూల విరాటులను మార్చుతుంటారు. వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. ఇదో బృహత్తర ప్రక్రియ. కొత్త మూర్తుల తయారీ, బ్రహ్మాండ ప్రదానం, పాత మూర్తుల ఖననం ఈ ప్రాంగణంలోనే జరగడంతో దీనిని కోవెల వైకుంఠంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర క్షేత్రానికి ట్రేడ్ మార్కు కేటాయించడం గౌరవప్రదంగా నిలుస్తుంది. -
పిన్నమ్మ ఇంట పొడొ పిఠా వంటకం
భువనేశ్వర్: పూరీలో శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంచెలంచెలుగా అంతిమ దశకు చేరుకుంటోంది. శ్రీ మహా లక్ష్మి మనస్తాపంతో వెను దిరిగిన మరునాటి నుంచి మారు రథ యాత్రకు సన్నాహాలు ఊపందుకున్నాయి. శ్రీ మందిరానికి వెళ్లేందుకు శారదా బాలిలో దక్షిణం వైపు మలుపు తిరిగి బహుడా యాత్రకు సిద్ధమయ్యాయి. రథాలు సిద్ధం కావవడంతో శ్రీ గుండిచా మందిరం జన్మ వేదికపై స్వామిని కడసారి దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికులు తండోపతండాలుగా తరలి వచ్చారు. గురువారం సాయంత్రం శ్రీ గుండిచా మందిరంలో సాధారణ భక్తులకు దర్శనం నిలిపి వేశారు. నేడు మారు రథయాత్ర శుక్రవారం స్వామి మారు రథ యాత్రలో శ్రీ మందిరం వైపు బయల్దేరనున్నాడు. దారిలో పిన్నమ్మ ఇంటి ముంగిట కాసేపు ఆగి మిఠాయి ఆరగించి తీరిగ్గా ముందుకు సాగుతాడు. నల్లనయ్య కోసం పిన్నమ్మ ఇంటిలో పొడొ పిఠా సంప్రదాయ వంటకం సిద్ధం అవుతుంది. బహుదా యాత్ర రోజున, ఆయన సోదర సోదరీ సమేతంగా శ్రీ జగన్నాథుడు శ్రీ మందిరానికి తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో మౌసి మా ఆలయం ఆవరణలో ఈ విశిష్టమైన పిండి వంటకం పొడొ పిఠాను సమర్పిస్తారు. నిత్యం వినియోగించే పొడొ పిఠా తరహాలో కూడా స్వామి కోసం పొడొ పిఠా ప్రత్యేక శైలిలో తయారు చేయడం విశేషం. సాధారణ పొడొ పిఠాని అవసరమైన మిశ్రమాలతో పొయ్యి నిప్పులపై కాల్చుతారు. స్వామి కోసం పొడొ పిఠా కాల్చడానికి బదులుగా శుద్ధమైన నెయ్యిలో వేయించడం విభిన్నత. కాల్చిన పదార్థాలు భగవంతునికి నివేదించడం ఆమోదయోగ్యం కాదనే ఆచారంతో నేతిలో వేయించి శ్రీ జగన్నాథునికి పిన్నమ్మ సమర్పిస్తుంది. -
ప్రైవేటు బస్సు బోల్తా
● 15 మందికి గాయాలు కొరాపుట్: ప్రైవేట్ బస్సు బోల్తాపడడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర సరిహద్దు ఇంద్రావతి నది ఒడ్డున అమలి జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. నబరంగ్పూర్ జిల్లా చందాహండి నుంచి జయపూర్ వెళ్తున్న ఈ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. అదే సమయంలో పొలాల్లో పనులు చేస్తున్న రైతులు ప్రమాద స్థలం వద్దకు వచ్చి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్ ద్వారా నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో 15 మంది ప్రయాణికుల చేరినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం తెలుసుకున్న నబరంగ్పూర్ కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి వాకబు చేశారు. -
452 కేజీల గంజాయి స్వాధీనం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి యం.వి 79 గ్రామం వద్ద పోలీసులు బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో వ్యాన్ అతివేగంగా రావడంతో దానిని అపి తనిఖీ చేశారు. డ్రైవర్ పరిపోడానికి ప్రయత్నించగా పట్టుకున్నారు. వ్యాన్లో తనిఖీ చేయగా గంజాయి బస్తాలున్నట్లు గుర్తించారు. డ్రైవర్ను అరెస్టు చేశారు. గంజయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం యంవి 79 పోలీసు స్టేషన్ వద్ద గంజాయిని తూకం వేశారు. 452 కేజీలు ఉందని, దీని విలువ రూ.60 లక్షలు వరకు ఉంటుందన్నారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి విచారించారు. గంజాయిని ఛత్తీష్గఢ్ రాష్ట్రానికి తరలిస్తామన్నారు. సుభ్రత్ బిశ్వస్ కలిమెల సమితి యం.వి 80 గ్రామానికి చెందిన వాడని తెలిసింది. వైద్య పరీక్షలు అనంతరం కోర్టుకు తరలిస్తామని తెలిపారు. -
ఐటీఐ ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్
ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదలైందని ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, ప్రవేశాల జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు గురువారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ‘ఐటిఐఅడ్మిషన్స్.ఏపీ.జివోవి.ఇన్’లో ఆగస్టు 3లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని సమీప ప్రభుత్వ ఐటీఐలో ధ్రువపత్రాలను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఆగస్టు 6న, ప్రైవేటు కళాశాలల్లో ఆగస్టు 8న కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో మూడో విడత కౌన్సెలింగ్ ఎచ్చెర్ల : రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ పరిధిలో 2026–27 సంవత్సరానికి మూడో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ గురువారంతో ముగిసింది. సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ ప్రక్రియలో 174 మందికి గాను 106 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇంకా 68 మిగులు సీట్లు ఉన్నాయి. కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ గిరిధర్ మద్రాసు, రిజిస్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్, పరిపాలనాధికారి శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, డీన్ శివరామశాస్త్రి, ప్రకాశరావు, యోగీశ్వరి, కో–ఆర్డినేటర్లు, విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. వెబ్సైట్లో మెరిట్ జాబితా శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రిన్సిపాల్, సిఆర్టీ, పీజీటీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సాహస అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ శ్రీకాకుళం న్యూకాలనీ: భారత ప్రభుత్వ యువజన వ్యవహరాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా నార్గే జాతీయ సాహస అవార్డు(టీఎన్ఎన్ఏఏ)–2025 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్శ్రీ సీఈఓ వి.వి.అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో భూమి, ఆకాశం, నీరు/సముద్రం, గాలిలో విశేష సాహస కార్యక్రమాలు చేసినవారు, జీవితకాలంలో విశిష్ట విజయాలు సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి నార్గే కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, బ్లేజర్, రూ.15లక్షల నగదు బహుమతి అందుతుందన్నారు. అవార్డ్స్.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్లో ఆగస్ట్లో 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సెట్శ్రీ శ్రీకాకుళం జిల్లా కార్యాలయం మేనేజర్ కె.వి.రమణ (7989862755)ను సంప్రదించాలని కోరారు. గుర్తు తెలియని వృద్ధురాలి మృతి నరసన్నపేట: స్థానిక సత్యవరం కూడలిలో బస్షెల్టర్ వద్ద గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. వెంటనే నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమె ఇదే ప్రాంతంలో యాచన చేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. పద్మనాభ గిరిపై వరద పాయసం జలుమూరు: వానలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ అర్చకులు అనంత పద్మనాభ గిరిపై ప్రత్యేక పూజలు నిర్వహించి వరద పాయం పోశారు. గురువారం శ్రీముఖలింగం ఆలయం పరిధి కరకవలస సమీపంలోని అనంత పద్మనాభ గిరిపై శ్రీముఖలింగం, కరకవలస అర్చకులు, రైతులు కలిసి విష్ణుమూర్తికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సింహాచలం మాట్లాడుతూ సంప్రదాయ ప్రకారం పద్మనాభ గిరిపై వరద పాయసం పోస్తే వర్షాలు పడతాయని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు శివ, శ్రీకృష్ణ, అచ్యుతరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. వృద్ధురాలి మృతదేహం -
సంధ్యా దర్శనం
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర ఉత్సవాల్లోసంధ్యా దర్శనం అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీగుండిచా ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి 9 రోజులపాటు కొలువుదీరిన నవ దినాత్మక యాత్ర సంధ్యా దర్శనంతో ముగుస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంధ్యా దర్శనం బహుడా యాత్ర ప్రారంభానికి ముందు జన్మ వేదికపై గురువారం భక్తులకు చివరి దర్శనంగా ప్రాప్తించింది. మారు రథ యాత్ర (బహుడా) సమయంలో మూల విరాట్ల తిరుగు ప్రయాణం ప్రారంభించే ముందు పవిత్ర చతుర్థా మూర్తుల ఆశీర్వాదం పొందడానికి లక్షలాది మంది భక్తులు గుండిచా ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు సింహ ద్వారం ద్వారా గుండిచా ఆలయంలోకి ప్రవేశం కల్పించి కేటాయించిన బహారొ కఠొ (వెలుపలి ప్రాంగణం) దర్శన ప్రదేశం నుంచి అడపా మండపంపై కొలువై ఉన్న దేవతా మూర్తులను దర్శించుకుని నక్కొ చొణ ద్వారం గుండా బయటకు విడిచిపెట్టారు. ఉదయం 5 గంటలకు ద్వారాలు తెరిచి అంతరాలయం శుద్ధి, మంగళ హారతి, మైలమ్, దైనందిన సేవలు ముగించి అలంకరణ పూర్తికావడంతో భక్తులకు దర్శనం కోసం అనుమతించారు. ప్రత్యేక టిక్కెట్లు దర్శనం నివారించారు. సేవాయత్ కుటుంబాలకు చెందిన మహిళా సభ్యులకు అంతరాలయంలోకి ప్రవేశించే సంప్రదాయ హక్కును యథావిధిగా కొనసాగించారు. అర్ధరాత్రి వరకు అడపా ఒభొడా లభ్యత.. దర్శన సమయం ముగిసిన తర్వాత కూడా ఆనంద్ బజార్ సందర్శించే భక్తుల సౌకర్యార్థం నక్కొ చొణ ద్వారం తలుపులు తెరిచి ఉంచారు. గుండిచా ఆలయంలో జన్మ వేదికపై కొలువుదీరిన దేవతలకు నైవేద్యంగా సమర్పించిన పవిత్రమైన ప్రసాదం అడపా ఒభొడా అర్ధ రాత్రి వరకు లభించే ఏర్పాట్లు చేశారు. నిర్దేశించిన నిష్క్రమణ ద్వారం ద్వారా భక్తులు మహా ప్రసాదాన్ని తీసుకు వెళ్లేందుకు వీలు కల్పించారు. పవిత్ర బహుడా యాత్రకు సంబంధించిన ముందుస్తు సన్నాహాలు, క్రతువుల దృష్ట్యా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ గుండిచా ఆలయ సింహ ద్వారం గుండా సాధారణ ప్రజల ప్రవేశం నిలిపి వేసి సంధ్యా దర్శనం మూసివేసినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాడీ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు సంధ్యా హారతి తర్వాత సంధ్యా ధూపం సమర్పించారు. ఆ తర్వాత బొడొ సింగార్ అలంకరణ, పవళింపు కార్యక్రమాలు ఆచారం ప్రకారం ముగించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు జరిగే సాంప్రదాయ అర్ధరాత్రి వేడుకలు నేపథ్యంలో దేవుళ్ల మారు రథ యాత్రకు ముందు శ్రీగుండిచా ఆలయ శుద్ధి కార్యక్రమాలు, అనేక ముఖ్యమైన క్రతువులు నిర్వహించాల్సి ఉన్నందున సాయంత్రం 6 గంటల నుంచి భక్తుల ప్రవేశం నివారించినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు అరవింద కుమార్ పాడీ తెలిపారు. -
ఘనంగా నెక్కంటి జన్మదిన వేడుకలు
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, బిజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు 74 వ జన్మదిన వేడుకలు స్థానిక రాణిగుడఫారంలో గల ఆయన స్వగృహంలో గురువారం వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆయన నివాసానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, సామాజిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, బిజు స్వాభిమాన్ మంచ్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నెక్కంటికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రజా సేవ ప్రస్థానాన్ని కొనియాడారు. జన్మదినం సందర్భంగా స్థానిక తేజస్వీ హోటల్ మైదానంలో గల బిజు స్వాభిమాన్ మంచ్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. నెక్కంటి మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత కాలం ప్రజా సేవలో తాను ఉంటానని ప్రజల కష్ట,సుఖాల్లో ఎల్లవేళలా చేదోడుగా ఉంటానని అన్నారు. ఆదివాసీ,హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో ఎన్నొ మౌలిక సౌకర్యాలను కల్పించానని అన్నారు. తన వెంట ఉన్న వారి కోసం తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గుణుపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడొ, మిలిపాడి, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, శ్రీక్షేత్ర టౌన్షిఫ్ అధినేత దూడల శ్రీనివాస్, మజ్జిగౌరి మందిరం పరిచాలన కమిటి సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు తదితర ప్రముఖులు నెక్కంటికి అభినందనలు తెలియజేశారు. -
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి దుంగయాపూట్ పంచాయతీ దుర్కాజోడి గ్రామానికి చెందిన డంబరు ఒడ (35) వ్యక్తి గ్రామస్తులతో కలిసి బుధవారం మధ్యాహ్నం సమయంలో చేపల వేటకు నదికి వెళ్లారు. నీరు ఎక్కువగా ఉండడంతో పడవ అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయాడు. గ్రామస్తులు గాలించినా దొరకలేదు. మాత్తిలి అగ్నిమాపిక సిబ్బందికి గురువారం సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాలికి చేరుకుని గాలించారు. రాళ్లచాటున చిక్కుకున్న మృతదేహాన్ని తీశారు. ఈ విషయం తెలుసుకున్న మాత్తిలి ఐఐసీ దీపాంజాలి ప్రధాన్, సమితి సభ్యరాలు లక్ష్మీప్రియ నాయక్, ఇద్దరు గ్రామానికి వెళ్లి మృతుడు కుటుంబ సభ్యులతో చర్చించారు. కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
పక్కాగా ఎన్నికల జాబితా
పర్లాకిమిడి: కేంద్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎస్ఐఆర్–2026 గజపతి జిల్లా రాష్ట్రంలో కెల్లా ముందుండగా.. గురువారం గజపతి జిల్లా ఎస్ఐఆర్ పర్యవేక్షకులు, ఇడ్కో ఎండీ డి.ప్రశాంత్ కుమార్ రెడ్డి పర్లాకిమిడి కలెక్టరేట్లో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్– 2026 పురోగతి, ఓటర్ల జాబితా, వివిధ ఓటర్ల పేర్లు సంసోధన, డిజిటలైజేషన్, బూత్ లెవల్ కార్యకలాపాలు, ఆ తరువాత జరుగబోయే తుది ఓటర్ల జాబితాపై పర్యవేక్షకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అక్షయ సునీల్ అగర్వాల్, ఏడీఎం. ఫల్గునీ మఝి, డెప్యూటీ కలెక్టర్ (ఎలక్షన్) అమిత్ బిశ్వాల్, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డిప్యూటీ కలెక్టర్ సుచిస్మితా మఝి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బి.జనార్దనరావు, ప్రభుత్వ ఎన్నికల అధికారి మనోజ్ పట్నాయిక్, తదితరులు పాల్గొన్నారు. గజపతిజిల్లాలో రెండు నియోజకవర్గాలు మోహానా, పర్లాకిమిడికి ఆగస్టు 4వ తేదీ వరకు ఓటర్లు తమ పేర్లులేనిచో సంబంధిత ఫారంలో దాఖలు చేసుకోవచ్చని, తుది ప్రక్రియ అనంతరం సెప్టెంబరు 6వ తేదీ తుది ఓటరు జాబితా పబ్లిష్ అవుతుందన్నారు. -
కల్కి అవతారంలో జగన్నాథుడు
పర్లాకిమిడి: దశవతారాల్లో చివరిదైన కల్కి అవతారంలో గురువారం జగన్నాథుడు భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లని గుర్రంపై కత్తిపట్టుకున్న కల్కి అవతరాన్ని భక్తులు దర్శించుకున్నారు. బలరాముడు కూడా నల్లని గుర్రంపై కనిపించారు. సత్యయుగంలో కల్కి అవతారంలో విష్ణువు వచ్చి అధర్మాన్ని పారద్రోలి, దుష్టలను శిరచ్చేధనం చేయడం వంటి అవతారపురుషుని కథ గరుడ పురాణాల్లో ఉంది. కల్కి అవతారంలో ఆయన పక్కన పద్మాదేవి ఉండటం గమనార్హం. శుక్రవారం బహుడా యాత్ర జరుగుతుంది. రథాలను మందిరానికి దైతాపతులు మార్చడం జరుగుతుంది. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ జయపురం: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని బొయిపరిగుడ సమితి ఫ్రెండ్స్ యూనిట్ క్లబ్ సభ్యులు అన్నారు. జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి కొల్లార్ గ్రామ యువకులు రథయాత్ర పురస్కరించుకొని బొయిపరిగుడ ఫ్రెండ్స్ యూనిట్ క్లబ్ సభ్యులు, కొల్లార గ్రామ పంచాయతీ యువత, సంబాద్ ఒడియా దినపత్రిక సంయుక్తంగా ఆ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈరోజు ఒక మొక్క నాటితే అది రేపటిని రక్షిస్తుందన్నారు. జీవరాశి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చెట్టును ఢీకొన్న థార్ కారు ● ముగ్గురు మృతి భువనేశ్వర్: కెందుఝొర్ జిల్లాలోని చంపువా సమీపంలోని రాజియా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో థార్ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 మంది మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చంపువా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
10 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి పరిధిలోని ఎంవీ 7 గ్రామంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో రహదారిపైకి వచ్చిన పది అడుగుల కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పామును స్థానికులు స్నేక్ హైల్ప్లైన్ బృందానికి సమాచారం ఇచ్చారు. దీంతో శరత్కుమార్ మాఝి, తపన్ కుమాన్ శేఠిమరియు రమేష్ పూజరిల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని గంట సేపు శ్రమించి కొండచిలువును పట్టుకున్నారు. దీని పొడవు పది అడుగులు ఉన్నట్టు తెలిపారు. బుధవారం పామును వైద్యపరీక్షలు నిర్వహించగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తుంటాయన్నారు. సమీప అడవిలో విడిచి పెడతామన్నారు.తుపాకీ స్వాధీనం ● ఒకరు అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి సమితి గౌడిగూడ పంచాయతీ నీలిమారి గ్రామంలో తుపాకీతోపాటు తుపాకీని తయారీ చేసే సామగ్రిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకొని ఒకరుని అరెస్టు చేశారు. టాటా పవర్ సంస్థకు చెందిన కాంట్రక్ట్ ఉద్యోగి దీపక్ విశ్వాస్ నెలవారీ బిల్ కోసం అనుకూల్ నాయక్ ఇంటికి వెళ్లారు. అనుకూల్ నాయక్కు గతంలో సుమారు రూ.17 వేల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. గత నెల రూ. 219 బిల్లు వచ్చింది. బిల్లు వసూలు చేసే సమయంలో దీపక్పై అనుకూల్ నాయక్ ముందుగా కత్తితో దాడి చేశాడు. అనంతరం తుపాకీని చూపించి చంపేస్తానని బెదిరించాడు. అక్కడ ఉన్న గ్రామస్తుల సాయంతో దీపక్ తప్పించుకున్నాడు. ఈ విషయం మల్కన్గిరి ఆదర్శ పోలీస్ స్టేషన్లో దీపక్ ఫిర్యాదు చేశాడు. అనుకూల్ నాయక్ను అరెస్టు చేసి, అతని ఇంటిని పోలీసులు సోదా చేశారు. తుపాకీతోపాటు తుపాకీల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం నిందితుడిని కోర్టుకు తరలిస్తామని ఐఐసీ రీగాన్ కీండో తెలిపారు. రచయిత నాగేశ్వరరావు రెడ్డి కన్నుమూత జయపురం: జయపురం ప్రజలకు చిరపరిచితుడు, మంచి గాయకుడు, చిత్రకారుడు, కళాకారుడు, తెలుగు భాషాభిమాని, రచయిత కె.నాగేశ్వరరెడ్డి అనారోగ్యంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయాయు. జయపురంలో జరిగే తెలుగు సంఘాలు, తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహించే ప్రతిఉత్సవంలోను నాగేశ్వరరెడ్డి పాడే పాటలు శ్రోతలను ఉర్రూత లూగించేవి. జయపురం తెలుగు సాంస్కృతిక సమితిలో క్రియాశీలక సభ్యులుగా ఉండి తెలుగు భాషాప్రగతికి సేవలు అందించారు. నాగేశ్వరరెడ్డి మృతి జయపురం తెలుగు వారికి తీర్చలేనిలోటని జయపురం తెలుగు సాంస్కృతిక సమితి మాజీ అధ్యక్షులు, జయపురం రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వి.భాస్కరరెడ్డి, ప్రస్తుత అధ్యక్షులు కె.దిలీప్ రెడ్డి, సంఘ సభ్యులు వాఖ్యానిస్తూ నివాళులర్పించారు. పట్టణానికి చెందిన పలువురు కళాకారులు, మిత్రులు నాగేశ్వరరెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ నిరసన పర్లాకిమిడి: నీట్ పరీక్షపత్రం లీక్ ఘటనలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీ చార్జిచేసి, ఏఐసీసీ సభ్యులు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా పర్లాకిమిడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట పీఎం మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు పాపారావు, అభిమన్యు పండా, పట్టణ కాంగ్రెస్ నాయకులు సూర్యనారాయణ పాత్రో, ఉపాధ్యక్షుడు బర్నాల జనార్దన రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. -
పకడ్బందీగా మారు రథయాత్ర
భువనేశ్వర్: ఈ నెల 24న జరగనున్న జగన్నాథుని మారు రథయాత్ర (బహుడా) సన్నాహాలపై ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝీ బుధవారం లోక్ సేవా భవన్లో సమీక్షించారు. రథయాత్ర నుంచి ఇప్పటి వరకు జగతినాథుని సేవాదులు అన్ని దాదాపుగా సక్రమంగా అమలు చేశారని, భారీ వర్షం, ప్రతికూల వాతావరణం, ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ భక్తుల తాకిడి, అధికారులు, ఉద్యోగుల్లో అంకితభావం ఏమాత్రం సడలిపోలేదని ముఖ్యమంత్రి అభినందించారు. పొహండి, రథయాత్ర , దక్షిణ మోడొ, అడపా మండప దర్శనాలను పర్యవేక్షణలో ఉన్నతాధికారుల నిరంతర కృషి యాత్ర చిట్ట చివరి వరకు స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని కోరారు. మారు రథ యాత్రలో జన సమూహ నిర్వహణ, నిరంతర సమాచార ప్రసారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సమస్యాత్మక పరిస్థితుల సత్వర పరిష్కారానికి సీసీటీవీ నుంచి పొందిన సమాచారాన్ని సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా సద్వినియోగపరచుకోవాలన్నారు. శ్రీ మందిరం ముఖ్య నిర్వాహకుడు డాక్టర్ అరవింద్ కుమార్ పాఽఢి, పోలీస్ డైరెక్టర్ జనరల్ వై.బి.ఖురానియా, అగ్ని మాపక దళం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాంశు షడంగి రథ యాత్ర నిర్వహణ వివరించారు.సమావేశంలో న్యాయ, పనుల శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్ డీకే సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
తూర్పు కోస్తా రైల్వేలో రోబోట్ సేవలు ప్రారంభం
భువనేశ్వర్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైల్వే భద్రతను బలోపేతం చేసే దిశగా తూర్పు కోస్తా రైల్వేకు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబోటిక్ నిఘా వ్యవస్థ డీఎస్సీ అర్జున్ను (డెడికేటెడ్ సెక్యూరిటీ ఛాసిస్ అడ్వాన్సడ్ రైల్వే జంక్షన్ అండర్ నెట్వర్క్ ఎనేబుల్డ్ సర్వైలెన్న్స్) ప్రవేశపెట్టింది. తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్, సీనియర్ రైల్వే అధికారులు, రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) అధికారుల సమక్షంలో బుధవారం ఏఐ ఆధారిత రోబోటిక్ నిఘా వ్యవస్థ డీఎస్సీ అర్జున్ సేవలను ప్రారంభించారు. ఈ రోబోటిక్ వ్యవస్థను రైల్వే ప్లాట్ ఫారంలు, స్టేషన్ కాంకోర్స్లు, టికెట్ బుకింగ్ కార్యాలయాలు, విరామ గదులు, సర్క్యులేటింగ్ ఏరియాలు, పార్కింగ్ జోనులు, పార్సెల్ కార్యాలయాలు, మెరుగైన నిఘా అవసరమయ్యే ఇతర సమస్యాత్మక ప్రదేశాల్లో మోహరించవచ్చు. నిరంతర పర్యవేక్షణ, ఇంటెలిజెంట్ అనలిటిక్స్ ద్వారా నేరాల నివారణ, రద్దీ సమయాల్లో ప్రయాణికుల రాకపోకల నిర్వహణ, రైల్వే ఆస్తులను రక్షించడం, అగ్ని ప్రమాదాలు, వైద్యపరమైన సంఘటనలు, భద్రతా సంబంధిత పరిస్థితుల వంటి అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడంలో డీఎస్సీ అర్జున్ ఆర్పీఎఫ్ సిబ్బందికి సహాయపడుతుంది. దీని అధునాతన లక్షణాల్లో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు, రియల్ టైమ్ జన సమూహ విశ్లేషణ, ప్రయాణికుల సంఖ్యను లెక్కించడం, అనుమానస్పద సామాను, కార్యకలాపాలను గుర్తించడం, పబ్లిక్ అడ్రస్ ప్రకటనలు, లైవ్ వీడియో స్ట్రీమింగ్, తక్షణ హెచ్చరికలను జారీ చేయడం వంటివి ఉన్నాయి. భారతీయ రైల్వేలో రోబోటిక్ పోలీసింగ్ ప్రస్థానం 2020లో కోవిడ్ 19 మహమ్మారి సమయంలో మధ్య రైల్వేలో కెప్టెన్ అర్జున్తో ప్రారంభమైంది. 2026 జనవరి 23న తూర్పు కోస్తా రైల్వే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సీ అర్జున్ను ప్రవేశ పెట్టారు. -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
సోంపేట: సోంపేట మేజర్ పంచాయతీలో విద్యుత్ పనుల్లో తాత్కాలిక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న నాతి ధర్మారావు(33) విద్యుత్ షాక్తో బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు ధర్మారావు మేజర్ పంచాయతీ పరిధిలో వీధి దీపాలు వెలిగించడం, ఆపివేయడం తదితర సేవల కోసం తాత్కాలిక పద్ధతిలో గత ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం తన సహోద్యోగి దిలీప్కుమార్తో కలిసి విధులు నిర్వహిస్తుండగా, తహసీల్దార్ కార్యాలయానికి ఆనుకుని ప్రధాన రహదారి వద్ద ఉన్న స్తంభానికి విద్యుత్ సరఫరా ఉండడం వలన విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఎప్పుడూ విద్యుత్ సరఫరా ఉండని స్తంభానికి బుధవారం విద్యుత్ సరఫరా అవ్వడం వలనే ప్రమాదం సంభవించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖాధికారులకు సమన్వయం లేకపోవడమే ప్రమాదానికి కారణమని వాపోతున్నారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. ధర్మారావు చెల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.మోహిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధర్మారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ నిమ్మన దాస్ కోరారు. -
ఆర్ఆర్బీ పోస్టింగ్ ప్రక్రియ నిలిపివేయాలి
రాయగడ: దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు నేపథ్యంలో కొత్తగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకొ పైలట్ల పోస్టింగ్ ప్రక్రియను జాయింట్ ప్రొసిజర్ ఆర్డర్ (జేపీనో) విడుదలయ్యే వరకు నిలిపివేయాలని రాయగడ డివిజన్ రైల్వే ఉద్యోగులు కోరారు. ఈ మేరకు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం)కు బుధవారం రాయగడలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నం డివిజనల్లో ఏఎల్పీల పొస్టింగ్లు వేగంగా కొనసాగుతున్నప్పటికీ , జేపీఒ అమలు కాకముందే ప్రక్రియ చేపట్టడం వల్ల జోన్ విభజన నిబంధనలు, సీనియారిటీ సూత్రాలు పూర్తిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం రాయగడ, విశాఖపట్నం డివిజన్లు రెండూ ఓకే సీనియారిటీ యూనిట్ పరిధిలో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ తరుణంలో ముందస్తు పోస్టింగులు చేపట్టడం వల్ల కేకే, కేఆర్ సెక్షన్లలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సీనియారిటీ, బదిలీ హక్కులు, భవిష్యత్ సేవా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వెంటనే ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. -
రాయగడలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
రాయగడ: దేశంలో వరుసగా జరుగుతున్న వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలు, విద్యావ్యవస్థలో అవినీతిని నిరసిస్తూ ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు స్థానిక కపిలాస్ కూడలి వద్ద బుధవారం డీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీక్లతో పాటు మెడికల్ సీట్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టివేసిందని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీక్ల నుంచి మెడికల సీట్ల వరకు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర మంతటా కాంగ్రెస్ నిరసనలు చేపడుతోందన్నారు. విద్యార్థులు, యువ త తమ హక్కుల పరిక్షణ కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, ప్రశ్నపత్రాల లీక్కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. -
చేతులెత్తేశారు!
కొబ్బరి నారు.. ● బారువ నారుమడిలో కానరాని మొక్కలు ● గత ఏడాది కాయలు కొనుగోలు చేయకపోవడమే కారణం ● అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు ● అధిక ధరకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన సోంపేట : జిల్లాలో కొబ్బరి నారుకు కేరాఫ్ అడ్రస్గా బారువలోని కొబ్బరి నారుమడి నిలిచేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 2 లక్షలు వరకు మొక్కలు వరకు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కొబ్బరి మొక్కల కోసం ప్రస్తుతం బారువ నారుమడికి వెళ్తున్న రైతులకు నిరాశే మిగులుతుంది. ఇదీ పరిస్థితి.. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బారువలో పండించే నారుమడి కొంతకాలంగా కల్పతరువుగా ఉండేది. నాణ్యమైన కొబ్బరి మొక్కలు కావడంతో ఇక్కడికే వచ్చి నారు తీసుకెళ్లేవారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా కొబ్బరి మొక్కలు నాటేవారు. అయితే కొబ్బరి ధర గత ఏడాది విపరీతంగా పెరిగింది. పది నెలల కిందట వెయ్యి కాయల ధర రూ.35 వేలకు చేరింది. దీంతో అంత ధర పెట్టి కాయలు కొనడం గిట్టుబాటు కాదని భావించిన అధికారులు కొనడం మానేశారు. ఫలితంగా ఇప్పుడు నారు కరువైంది. దీంతో రైతులకు మొక్కలు అందుబాటులో లేకుండాపోయాయి. బయట మార్కెట్లో ఒక్కో కొబ్బరి మొక్క ధర రూ.200 వరకు వెచ్చించి కొనాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని రాయితీ.. గతంలో బారు నారుమడిలో కొబ్బరి మొక్కను 60 రూపాయలకు కొనుగోలు చేస్తే రైతు ఖాతాలో 40 రూపాయలు జమ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొక్కలు కొనుగోలు చేస్తున్నా రాయితీ నగదు రైతుల ఖాతాల్లో పడటం లేదు. తిత్లీ తుఫాన్ సమయంలోబారువ నారుమడి జీవం కోల్పోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాలో నారుమడికి మళ్లీ జీవం పోశారు. లక్షలాది నాణ్యమైన కొబ్బరిమొక్కలు తయారు చేసి తిత్లీలో కొబ్బరి చెట్లు నష్టపోయిన రైతులకు అందజేశారు. ఇప్పుడు మాత్రం ఎటువంటి ప్రోత్సాహకాలు అందడం లేదు. నారుమడిలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రహరి, రహదారులు పూర్తిస్థాయల్లో లేవు. ఇప్పటికై నా పాలకులు స్పందించి నారుమడి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులు ఈ సీజన్లోనే తోటల్లో కొబ్బరిమొక్కలు నాటుతుంటారు. ప్రస్తుతం బారువలో కొబ్బరి నారు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు స్పందించి మొక్కలు అందుబాటులో ఉంచాలి. – మేరుగు తిరుపతిరెడ్డి, బారువ -
జగన్నాథ వైభవం
–8లోu● రథాల దక్షిణ మలుపు పూర్తి ● శారదా బాలి వద్ద పటిష్ట ఏర్పాట్లుకాంగ్రెస్ శ్రేణుల ఆందోళన ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు, విద్యావ్యవస్థలో అవినీతిని నిరసిస్తూ ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు నగదు : రూ. 2,20,010 వెండి : 4 గ్రాముల 800 మిల్లీ గ్రాములు – భువనేశ్వర్/పూరీభద్రతా వలయం మధ్యం దక్షిణం వైపు మలుపు తిరుగుతున్న జగన్నాథుని నందిఘోష్ రథంభువనేశ్వర్: బహుడా యాత్రకు ముందుగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల మూడు రథాలను విజయవంతంగా దక్షిణ దిశగా మళ్లించారు. శ్రీ మందిరానికి అభిముఖంగా శ్రీ గుండిచా ఆలయం నక్కొచొణ ద్వారం ముంగిట నిలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం ప్రారంభమైన ఈ ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. తొలి రోజున దేవీ సుభద్ర దేవ దళన రథాన్ని విజయవంతంగా మలుపు తిప్పి గుండిచా ఆలయ నక్కొచొణ ద్వారం సమీపంలో నిలిపారు. బలభద్రుని తాళ ధ్వజ రథం, శ్రీ జగన్నాథుని నందిఘోష రథాలను తిప్పడాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం తాళ ధ్వజ రథాన్ని దక్షిణం వైపు మళ్లించారు. దాని వెనుకే నందిఘోష రథాన్ని కూడా నక్కొచొణ ద్వారం వైపు తరలించారు. మూడు రథాలు దక్షిణం వైపునకు తిరిగి స్వామి మారు రథ యాత్రకు సిద్ధం కావడంతో త్వరలో రథాల సాంకేతిక తనిఖీ నిర్వహించి పటిష్టత పర్యవేక్షిస్తారు. శారదా బాలి వద్ద రథాలకు బారికేడ్లు, పటిష్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ప్రత్యేక ఆకర్షణగా నక్కొచొణ ద్వారం.. గుండిచా ఆలయంలోని నక్కొ చొణ ద్వారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ద్వారం గుండా బహుడ రోజున దేవతామూర్తుల మూల విరాటులు అడపా మండపం నుంచి వెలుపలకు వస్తారు. హేరా పంచమి రోజున శ్రీదేవి కూడా ఈ ద్వారం గుండానే తిరిగి వస్తారు. ద్వారం పైభాగం మధ్యలో మహాలక్ష్మి, ద్వారం ఎడమ వైపున బ్రహ్మ, కుడి వైపున మహా దేవుడు (శివుడు) కొలువై ఉన్నారు. బ్రహ్మ, శివుల పైన నవగ్రహాలు చోటు చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. కృష్ణ, బలరాముల అవతారంలో.. పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో బుధవారం జగన్నాథుడు కృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు. కొన్నిచోట్ల బలరామునిగా దర్శనమిచ్చారు. గురువారం కల్కి అవతారంతో మొత్తం దశవతారాలు ముగుస్తాయని సేవాయత్ ప్రదీప్ పండా, సంజుపాఢి తెలిపారు. రాజవీధిలోని శ్రీమందిరం వద్ద గురువారం భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని జగన్నాధ మందిర పునర్నిర్మాణ కమిటీ తెలియజేసింది. రామావతారంలో జగన్నాథుడు రాయగడ: రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా గుండిచా మందిరంలో పూజలందుకుంటున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రా దేవతామూర్తుల్లో ఉన్న స్వామివారు బుధవారం రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బిసంకటక్లోని దుర్గి జగన్నాథ మందిరంలో రామబలరామ అవతారాల్లో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
కేరళంలో మల్కన్గిరి జిల్లా యువకుడు మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి బొండఘటీ ప్రాంతం ముదిలిపోడ పంచాయతీ కిర్సన్గూడ గ్రామానికి చెందిన శుక్ర శిసా (26) యువకుడు కేరళంలో మృతి చెందారు. కిర్సన్గూడ గ్రామానికి చెందిన శుక్ర శిసాతోపాటు మరో ముగ్గురు ఈ నెల 15వ తేదీన కూలి పనుల కోసం కేరళంకు వలస వెళ్లారు. అయితే 18వ తేదీన శుక్ర శిసా ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించింది. 19వ తేదీ తెల్లవారు జామున మృతి చెందాడు. ఈ విషయాన్న అతనితోపాటు వెళ్లినవారు శుక్ర శిసా కుటుంబ సభ్యులకు ఫోన్ద్వారా తెలియజేశారు. దీంతో ఇక్కడ ముదిలిపోఢ పోలీసుస్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్స్పెక్టర్ నీలిమా పాణిగ్రాహి కేసు నమోద్ చేసి ఇక్కడ నుంచి దర్యాప్తు కోసం ఓ బృందం కేరళాకు పంపించారు. వీరు బుధవారం బుదవారం కేరళ చేరుకున్నారు. శుక్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.గంజాయి స్వాధీనం ● యువకుడు అరెస్టు రాయగడ: ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ పోలీసులు జాతీయ రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఓ యువకుడు గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఇతని నుంచి 5.296 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర మీడియా ప్రతినిధులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం నాడు ఎస్సై రస్మి ఓరం నేతృత్వంలో బృందం బెహరాగుడ కూడలి సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ సమయంలో నల్లరంగు ఎయిర్ బ్యాగ్తో అనుమానస్పదంగా అధిక వేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంటాడి నువాబంద్ కూడలి వద్ద అడ్డుకున్నారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అజయ్ కుమార్ నాయక్గా గుర్తించిన పోలీసులు అతని బ్యాగ్ను తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు. -
భక్తుల సేవలో శివసాయి గ్రూపు మహిళలు
జయపురం: జయపురంలో జరుగుతున్న జగన్నాథ్ రథోత్సవంలో పాల్గొంటున్న భక్తులకు స్థానిక శివసాయి సేవా గ్రూపు మహిళలు విశేష సేవలు అందిస్తున్నారు. రోజూ గుండిచా మందిరానికి వెళ్లి మందిర పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నారు. అలాగే భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. దారు దేతలను దర్శించేందుకు వచ్చే వందలాది మంది భక్తలు రద్దీని క్రమబద్ధీకరణ చేయటం, భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. శివ సేవా కార్యక్రమాల్లో జయపురం శివసాయి సేవా గ్రూపునకు చెందిన 40 మంది మహిళా సభ్యులు క్రమశిక్షణతో సేవలందిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. -
రమాదేవికి నివాళులు
భువనేశ్వర్: స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, మహిళా నాయకురాలు రమాదేవీ చౌదరి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర శాసన సభ సమీపంలోని ఆమె విగ్రహానికి స్పీకర్ సురమా పాఢి ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్దేవ్ తదితర ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.విజిలెన్స్ వలలో ఓఏవీ ప్రిన్సిపాల్ కొరాపుట్: ఒడిశా ఆదర్శ విద్యాలయ ప్రిన్సిపాల్ విజిలెన్స్ వలకు చిక్కారు. బుధవారం కలహండి జిల్లా త్వమల్ రాంపూర్లో ఓఏవీ ప్రిన్సిపాల్ సీతాకాంగ్ రణా రూ.10 వేలు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. విద్యాలయంలో పారిశుద్ధ్యం, ఇతర పనులను స్వయం సేవా గ్రూపు నిర్వహిస్తోంది. వారికి మూడు నెలలుగా బిల్లుల చెల్లింపులు జరగలేదు. వాటిని క్లియరెన్స్ చేయాలంటే ప్రిన్సిపాల్ సంతకం అవసరం. అందుకు రణా రు.10 వేలు డిమాండ్ చేశారు. దాంతో బాధితులు కొరాపుట్ విజిలెన్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి సిబ్బంది సూచన మేరకు రణకి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. అనంతరం అతని ఆస్తులు లక్ష్యంగా సోదాలు ప్రారంభించారు. -
దక్షిణ మలుపు తిరిగిన దేవీ సుభద్ర రథం
● తాళధ్వజం, నంది ఘోష్ రథాల మలుపు వాయిదాభువనేశ్వర్: ఈ ఏడాది రథయాత్రలో అడుగడుగున వర్షం అడ్డంకులు సృష్టిస్తోంది. పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష అష్టమి తిథి పురస్కరించుకుని మారు రథయాత్ర కోసం రథాలను సిద్ధం చేసేందుకు దక్షిణ దిశ వైపు మలుపు తిప్పడం ఆచారం. హేరా పంచమి పురస్కరించుకుని విరహ వేదన తాళలేక మహాలక్ష్మి దేవి శ్రీమందిరం నుంచి రత్న శోభిత పల్లకిలో శ్రీగుండిచా మందిరానికి వెళ్లినా, ప్రియనాథుని దర్శనం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపంతో వెనుదిరిగి జగన్నాథుని నందిఘోష్ రథాన్ని చీల్చి చెండాడుతుంది. ప్రియసఖి ఆవేదనకు స్పందించిన జగన్నాథుడు తక్షణమే మర్నాడు మారుయాత్ర కోసం ఆజ్ఞాపించడం విశేషం. అందుకు సంకేంతంగా 3 ఆజ్ఞామాలలు గుండిచా మందిరం ఆవరణ శారదా బాలి ప్రాంగణంలో నిలిచి ఉన్న రథాల ప్రాంగణానికి చేరడంతో యాత్రకు అనుకూలంగా శ్రీమందిరానికి అభిముఖంగా మలుపు తిప్పేందుకు చేసిన సన్నాహం దక్షిణ మోడ్గా పేర్కొంటారు. కుండపోత వర్షం ఆలయ ఆచారాల ప్రకారం మంగళవారం 3 రథాలను దక్షిణ దిశవైపు మలుపు తిప్పేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ఆజ్ఞామాలలు చేరడంతో తొలుత దేవీ సుభద్ర రథం దర్ప దళణ్ మలుపు తిప్పడం ప్రారంభించారు. వెంబడి బలభద్ర స్వామి తాళధ్వజం మలుపు తిప్పడం ఆరంభించారు. ఇంతలో వాన కుండపోతగా కురవడంతో రథాలు మలుపు తిప్పే కార్యక్రమాన్ని వాయిదా వేయడం అనివార్యంగా పరిగణించి నిలిపివేశారు. దీంతో బలభద్ర స్వామి రథం తాళధ్వజం, జగన్నాథుని రథం నందిఘోష్ రథాలను బుధవారం మలుపు తిప్పి దక్షిణ మోడ్ ఘట్టం పూర్తి చేస్తామని శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా తాళధ్వజం మలుపు తిప్పడం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుత ప్రదేశంలోనే రథాన్ని నిలిపివేశారు. అక్కడ నుంచి రేపు నందిఘోష రథంతో పాటు శారదా బాలి వైపు లాగుతారు. ఆలయ పరిపాలన, భద్రతా దళాలు ప్రస్తుత ప్రదేశంలో అన్ని రథాలకు అవసరమైన బారికేడింగ్, భద్రతా ఏర్పాట్లు చేశాయని సీఏవో వివరించారు. మరోవైపు రథాలు మార్గ మధ్యంలో నిలిచిపోయినందున బొడొ దండొలో సాధారణ రవాణాకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. దక్షిణం వైపు దేవీ సుభద్ర రథం తిప్పుతున్న జవానులు -
వాణిజ్య పంటలు పండించండి
పర్లాకిమిడి: గిరిజనులు గంజాయి పంటలు వీడి.. వాణిజ్య పంటలు పండించాలని అధికారులు సూచిస్తున్నారు. గజపతి జిల్లాలోని మోహనా, ఆర్.ఉదయగిరి, అడవ ప్రాంతాల్లో గంజాయి సాగు గిరిజనులకు ప్రధాన జీవనాధారంగా మారింది. దీంతో గత కొద్ది నెలలుగా పోలీసులు, ఎకై ్సజ్, ఫారెస్టు అధికారులు వరుస దాడులు చేయడంతో అనేక మంది పట్టుబడ్డారు. దీంతో పలు గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించేందుకు ఆర్.ఉదయగిరి సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు (ఐపీఎస్) మంగళవారం మారుమూల ఆదివాసీ ప్రాంతాల గిరిజనులు, సర్పంచ్లను ఆర్.ఉదయగిరి పిలిపించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీ ప్రజలతో ఈ పరస్పర చర్చా కార్యక్రమంలో మోహనా వ్యవసాయ అధికారి కూడా పాల్గొన్నారు. గంజాయి పంట బదులు ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ పథకాలు, పనిముట్లు సబ్సిడీ ధరలకే లభిస్తున్నాయని, అలాగే ఆయా ప్రాంతంలో మొక్కజొన్న, పైనాపిల్, బత్తాయి పంటలు పండించేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. అందువల్ల ప్రతీ గిరిజన రైతు కొండవాలు ప్రాంతంలో వాణిజ్య పంటలు వేయాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. -
కొట్లాట కేసులో ముగ్గురు అరెస్టు
జయపురం: జయపురం సమితి సిందిగా గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో ముగ్గురు వ్యక్తులను జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గ్రామానికి చెందిన గోపీనాథ్ గదబ, అతడి కుమారులు త్రినాథ్ గదబ, ప్రఫుల్ల గదబలు ఉన్నట్లు పోలీసు అధికారి సచింద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈనెల 15వ తేదీన గ్రామంలో జరిగిన కొట్లాట విషయంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్డుపై టిప్పర్ బోల్తా జయపురం: fĶæ$-ç³#Æý‡… & MöÆ>-ç³#sŒæ 26Ð]l ¯]l…ºÆŠ‡ gê¡Ä¶æ$ Æý‡çßæ§éÇ çœ*sŒæ Æøyýl$zÌZÏ JMýS sìæç³µÆŠ‡ »ZÌê¢-ç³-yìl…¨. Ð]l$…VýSâýæ-ÐéÆý‡… E§ýlĶæ$… 6 VýS…rÌS çÜÐ]l$-Ķæ$…ÌZ _‹³Þ ÌZyýl$™ø Ð]lçÜ$¢¯]l² sìæç³µÆŠ‡ OsñæÆŠ‡ õ³Í-´ù-Ð]l-r…™ø A¨ »ZÌê¢ ç³yìl…-¨. A…§ýl$-Ð]l-ÌS¯]l Mö°² VýS…rÌS ´ër$ Ðéçßæ¯éÌS Æ>MýS-´ùMýSË$ °Í-_´ù-Ķæ*Ƈ$$. D sìæç³µÆŠ‡ ´÷rt…W ¯]l$…_ _‹³Þ ÌZyýl$ ^ólçÜ$Mö° MöÆ>-ç³#sŒæ & fĶæ$-ç³#Æý‡… çœ*sŒæ Æøyýl$zÌZ E§ýlĶæ$… {ç³Ð]l*-§é-°MìS VýS$Æý‡Æ‡$$Å…-¨. {ç³Ð]l*§ýl çÜÐ]l*-^éÆý‡… A…¨¯]l Ððl…r¯ól fĶæ$-ç³#Æý‡… çܧýlÆŠ‡ ´ùÎ-çÜ$õÜt-çÙ¯ŒS B«©-¯]l…ÌZ E¯]l² ºÇ-×ìæ-ç³#sŒæ ´ùÎçÜ$ ç³…sìæ ´ùÎ-çÜ$Ë$ çßæ$sê-çßæ$-sìæ¯]l çÜ…çœ$-r¯é çܦÌê-°MìS ^ólÆý‡$-MýS$-¯é²Æý‡$. D {ç³Ð]l*-§ýl…ÌZ {OyðlÐ]lÆŠæ, MîSϯ]lÆý‡Ï¯]l$ ÝëŠి-£ýl²MýS$Ë$, ´ùÎ-çÜ$Ë$ Æý‡„ìS…-^éÆý‡$. ÐéÇ-Æý‡$-Ð]l#Æý‡$ „óSÐ]l$…V> E¯]l²r$Ï ´ùÎ-çÜ$Ë$ ÐðlÌSÏyìl…^éÆý‡$. ´ùÎ-çÜ$Ë$ {´÷MðSÏ-Ƈ$$¯]lÆŠ‡ ÝëĶæ$…™ø »ZÌê¢-ç³-yìl¯]l sìæç³µ-ÆŠ‡¯]l$ ™öÌS-W…-_, Æøyýl$zOò³ ç³yìl¯]l _‹³Þ¯]l$ Ô¶æ${¿ýæ… ^ólíÜ {sêíœMŠS¯]l$ ç³#¯]l-Æý‡$§ýl®-Ç…-^éÆý‡$. చోరీ కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: చోరీ జరిగిన 10 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంతో ఝార్సుగుడ జిల్లా బనర్పాలి పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. జిల్లా ఎస్పీ జీఆర్ రఘవేంద్ర తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 20వ తేదీన సరండమాల్ గ్రామానికి చెందిన ధనినాథ రౌత్ బంధ బహాల్లోని స్వాధీన్ కాంప్లెక్స్లో ఉన్న తన కిరాణా షాపులో చోరీ జరిగినట్లు బనర్పాలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి దుకాణం పైకప్పు పగులగొట్టి లోపలికి ప్రవేశించి కిరాణా సామగ్రి, కొంత మొత్తం నగదును దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక విశ్లేషణ, శాసీ్త్రయ ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణ ద్వారా సుందర్ఘడ్ జిల్లా హేమగిరి పోలీస్స్టేషన్ పరిధి లిపాస్పాలి గ్రామానికి చెందిన సూరజ్ సింఘారియా అలియాస్ హనును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ దొంగతనం తానే చేసినట్టు అంగీకరించడంతో పోలీసులు కోర్టుకు తరలించారు. నిందితుడి నుంచి రూ.1,750లు, దొంగతనానికి వినియోగించే పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులు పలువురిని బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం ఒడిశా స్టేట్ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎస్ఎంసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న 2012 సంవత్సరపు ఐఏఎస్ అధికారి డాక్టర్ పోమా టుడును ఎస్టీ, ఎస్సీ అభివృద్ధి, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించారు. ఆమె ఒడిశా ఆహార భద్రత కమిషనర్, టీడీసీసీఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలను కొనసాగిస్తారు. ఇటీవల సాధారణ పరిపాలన మరియు ప్రజా ఫిర్యాదుల శాఖలో చేరిన 2020 సంవత్సరపు ఐఏఎస్ అధికారి స్మిత పాణి రాష్ట్రంలోని కీలక ప్రజా ఆరోగ్య సేకరణ సంస్థ ఒడిశా స్టేట్ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎస్ఎంసీఎల్) లో డాక్టర్ పోమా టుడు స్థానంలో మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. -
చోరీ కేసులో ఇద్దరికి ఆరేళ్ల జైలుశిక్ష
రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి ఝార్సుగుడ జిల్లా కోర్టు ఇద్దరు నిందితులకు ఆరేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అదేవిధంగా రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2023 జనవరి 9వ తేదీన అర్ధరాత్రి బ్రజరాజ్నగర్ పోలీస్స్టేషన్ పరిధి రెమోజ్ గ్రామంలో ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి నగదు, బంగారు ఆభరణాలు, బ్యాంకు పాస్బుక్లు, ఏటీఎంలు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు తదితర విలువైన పత్రాలను దొంగిలించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సురేంద్ర శెఠి, అనంత దురవాలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన సీజీఎం ఇద్దరు నిందితులను దోషులుగా పరిగణించారు. నిందితులకు ఆరేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. చోరీ కేసుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ సాహు దర్యాప్తు చేయగా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర పర్యవేక్షణలో సమర్దవంతమైన దర్యాప్తు చేపట్టారు. చర్చిలో చోరీ ● ఇద్దరు నిందితుల అరెస్టు రాయగడ: ఝార్సుగుడ సదరు పోలీస్స్టేషన్ పరిధిలోని కాక్స్ కాలనీలో ఉన్న సెయింట్ ఆర్నాల్డ్స్ కేథలిక్ చర్చిలో జరిగిన చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈనెల 14, 15వ తేదీ అర్ధరాత్రి మధ్య గుర్తు తెలియని దుండగులు చర్చి ప్రాంగణంలోకి చొరబడి విరాళాల పెట్టెలను పగులగొట్టి రూ.12 వేల నగదు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అరైస్టెనవారిలో దీపక్ కుమార్, అమన్ సింగ్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు దీపక్ కుమార్ నుంచి చోరీకి సంబంధించిన నీలం రంగు ఇనుప కట్టర్ను స్వాధీనం చేసుకోగా, అమన్ సింగ్ నుంచి దొంగిలించిన నగదులో రూ.3 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేశారు. -
వామనావతారంలో జగన్నాథుడు
రాయగడ: గుండిచా మందిరంలో కొలువైవున్న జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులు భక్తుల ద్వారా ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. దశావతారాల్లో భాగంగా స్వామివారు మంగళవారం వామనావతారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. అలాగే ప్రతిరోజూ ప్రత్యేక పూజలతో పాటు సంధ్యా హారతి కొనసాగుతున్నాయి. రథయాత్రలో భాగంగా గుండిచా ప్రాంగణలో సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్లాకిమిడిలో... రథయాత్రలో భాగంగా జగన్నాథుడు వామన, బలరాముడు పరశురాం అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది యాత్రికులు గుండిచా మందిరం వద్ద స్వామివారిని దర్శించుకుంటున్నారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
కొరాపుట్: నీట్ పేపర్ లీకేజీపై న్యూఢిల్లీలోని విద్యార్థుల ఆందోళనలు కొరాపుట్ జిల్లాకు చేరాయి. దేశ రాజధానిలో విద్యార్థులపై లాఠీచార్జీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ జంక్షన్ వద్ద స్థానికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వాంగ్చుక్కి మద్దతుగా నినాదాలు చేశారు. ఒడిశాకి చెందిన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పనితో ఒడిశా పేరు గంగలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు దమంజోడిలో ప్రజా సంఘాలు భారీర్యాలీ చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులకు సంఘీభావంగా నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. నీట్ పరీక్ష రద్దు వలన ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు నివాళులర్పించారు. కాక్రోచ్ జనతా పార్టీని కొరాపుట్ జిల్లాలో ప్రారంభించడానికి ఈ ర్యాలీలో నిర్ణయాలు జరిగాయి. ఇంటిలిజెన్స్ వర్గాలు ఈ ఆందోళనపై వివరాలు సేకరిస్తున్నాయి. -
రాష్ట్రంలో.. రాష్ట్రపతి పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటించనున్నారు. ఆమె ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్, కటక్, బరంపురం ప్రాంతాల్లో పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఆగస్టు 3న భువనేశ్వర్ చేరుకున్న అనంతరం రాష్ట్రపతి స్థానిక లోక్సేవా భవన్లో బస చేస్తారు. అదేరోజు కటక్లో జరిగే జగద్గురు కృపాలు విశ్వ విద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆగస్టు 4వ తేదీ ఉదయం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక రైలులో బరంపురం రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో తప్తపానికి వెళ్లి మా కంధుని దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత గోపాల్పూర్లోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో లేదా మరేదైనా నిర్దేశిత ప్రదేశంలో రాత్రి బస చేస్తారు. ఆగస్టు 5న గోపాల్పూర్ నుంచి బరంపురం రైల్వేస్టేషన్కు చేరి ప్రత్యేక రైలులో భువనేశ్వర్కు తిరిగి వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన కోసం సిద్ధం చేసిన ముసాయిదా షెడ్యూల్ను రాష్ట్రపతి భవన్ రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు పంపింది. రాష్ట్రపతి రైలు ప్రయాణం కోసం భువనేశ్వర్ మరియు బరంపురం రైల్వేస్టేషన్లలో భద్రత, ప్లాట్ఫాం ఏర్పాట్లు, గ్రీన్ రూమ్లు, వీవీఐపీల రాకపోకలు, ప్రత్యేక కోచ్ల ఏర్పాట్లు, రైల్వేలతో సమన్వయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. -
అయోధ్య విరాళాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
రాయగడ: అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల నిధుల వినియోగంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రాయగడ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అప్పల స్వామి కడ్రక ఆరోపించారు. మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించిన నిధుల్లో సుమారు రూ.1,400 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ట్రస్టుకు చెందిన కొందరు కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజల మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని, అదే సమయంలో ఆలయ నిధుల దుర్వినియోగం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో నిజాలు ప్రజలకు వెల్లడించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!
పూరి: ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ, బలభద్రులు ఇద్దరు గుండిచ దేవస్థానంలోకి ప్రవేశించిన తరువాత ఈ ప్రత్యేక పరిశీలన నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.ఒడిశా ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దేవాలయంలోని వేర్వేరు పండుగల నేపథ్యంలో రత్నభాండార్ ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని మే నెల 23వ తేదీన నిలిపివేసిన విషయం తెలిసిందే. గత నెలలో స్నాన పూర్ణిమ సందర్భంగా ఉత్సవమూర్తుల నుంచి తొలగించిన ఆభరణాల లెక్కింపు, బరువు తూచడం వంటివి చేశారు. ‘రాహు రేఖ’, బంగారు ‘చితా’, వెండి ‘రసిక’ఆభరణాలతోపాటు విగ్రహాలకు సంబంధించిన ఇతర ఆభరణాలను కూడా లెక్కించామని, శ్రీ జగన్నాథ్ దేవాలయ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధే తెలిపారు. ‘‘డిజిటల్ డాక్యుమెంటేషన్లో భాగంగా లెక్కింపు, బరువు తూచే ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశాం’’అని ఆయన తెలిపారు. ఆభరణాల్లోని రత్నాలు, ఇతర విలువైన రాళ్లను నిపుణులు పరిశీలించారని, తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రామాణిక ప్రక్రియకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసినట్లు రత్నభాండార్ పరిశీలన కమిటీ అధ్యక్షులు జస్టిస్ (రిటైర్డ్) బిశ్వనాథ్ రథ్ తెలిపారు. దేవాలయానికి సంబంధించి రెండు రత్నభాండార్లు ఉంటే అందులోని బయటి భండాగారం లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం పూర్తవగా లోపలి దాని లెక్కింపు కొనసాగుతున్నట్లు మరో ఆధికారి తెలిపారు. -
కూర్మనాథుని సన్నిధిలో డీజీపీ సతీమణి
గార: ప్రముఖ విష్ణు ఆలయం శ్రీకూర్మం శ్రీకూర్మనాథున్ని రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా సతీమణి సీమా గుప్తా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు, అర్చకులు ఎదు రేగి స్వాగతం పలికారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్షేత్ర మహాత్యాన్ని ఆలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు తెలియజేశారు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో పద్మనాభాచార్యులు, శ్రీనివాసాచార్యులు, కిషోర్బా బు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం సోమవారం శ్రీకాకుళంలోని పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి ఆర్టీసీని ప్రభు త్వ ఆధీనంలోనే కొనసాగించాలని కోరుతూ వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలన్నారు. ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనలను విరమించుకోవాలని, విద్యుత్ బస్సు ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించే ఆలోచనలను విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు చేస్తున్నదే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు వై.అప్పయ్య, జి.త్రినాథ్, కె.బాబూరావు, ఎస్వీ రమణ, ఎన్వీఆర్ మూర్తి, కె.నర్సింహులు, బీఎస్ బాబు, బి.ఆనంద్ తదితరు లు ఉన్నారు. ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్ – 2026 రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్సన్స్ నమోదుకు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు. ఇప్పటివరకు వెబ్ ఆప్సన్లు నమోదు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు వెబ్ ఆప్సన్లు నమోదు చేసే సమయంలో కళాశాలలు, కోర్సులను తమ ప్రాధాన్యత క్రమంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుని అనంతరం ఫ్రీజ్ చేయాలన్నారు. -
వాంగ్చుక్కు మద్దతుగా ధర్నా
పర్లాకిమిడి: నీట్ పరీక్ష పత్రం లీక్ ఘటనలో కేంద్ర ఉన్నత విద్యా మండలి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా పర్లాకిమిడి రాజావారి ప్యాలస్ వద్ద గణ ధర్నా ఆందోళన ఉదయం జరిపారు. ఈ ప్రతిబాద్ ధర్నాలో అనేక మంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రగతి మహిళా సంఘటన్, రైతు కూలీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు శిశిరోకుమార్ భంజ సామంత్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి, రోక్కం లోకనాథం, సంతోష్ కుమార్ పండా, లింగ రాజ్ పాణిగ్రాహి, సెన్యాగోమంగో తదితరులు పాల్గొన్నారు. -
కనికరించే నాథుడే కరువు..!
● అచ్చనాపురం మీదుగా ఆఫ్షోర్ కాలువ ● 60 ఇళ్లలో 40 ఇళ్లవారు మాత్రమే నిర్వాసితులుగా ప్రకటన ● నేటికీ రెండిళ్లకే పరిహారం ● అయోమయంలో గిరిజనులు ● పట్టించుకోని అధికారులు మెళియాపుట్టి: మండలంలోని అచ్చనాపురం గిరిజన గ్రామ ప్రజలు అధికారుల చుట్టూ న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏళ్ల గడుస్తున్నా వేదన తీరక సమస్యలతో సావాసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2009వ సంవత్సరంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే అచ్చనాపురం గ్రామం మీదుగా కాలువ నిర్మాణం జరుగుతుందని అధికారులు అక్కడి ప్రజలకు తెలియజేశారు. అయితే కొంతకాలం క్రితం భూసేకరణకు గ్రామానికి వచ్చిన అధికారులు.. గ్రామంలో ఉన్న 60 ఇళ్లలో 40 ఇళ్లు మాత్రమే రిజర్వాయర్ కాలువ పరిధిలో ఉన్నాయని తెలిపారు. అందువలన 40 ఇళ్లు మాత్రమే తీసుకుని వాటికి పరిహారాలు అందజేస్తామన్నారు. దీంతో గిరిజనులంతా కన్నీరుమున్నీరై అధికారులకు వేడుకున్నారు. తన గ్రామాన్నంతా తీసుకోవాలని.. ఎక్కడున్నా తామంతా కలిసే ఉంటామని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సవర సూరయ్య, రాధమ్మలకు ఉన్న రెండిళ్లకు సంబంధించి వారి ఖాతాలో పరిహారం పడింది. దీంతో మిగతా వాళ్లు స్థానిక తహసీల్దార్ వద్దకు వెళ్లి విషయం కనుక్కోగా 40 ఇళ్లవారిని నిర్వాసితులుగా గుర్తించామని, దానికి సంబంధించి మ్యాప్ చూపించడంతో గిరిజనులు వెనుదిరిగినట్లు తెలిపారు. కానీ కనీసం ఆ 40 ఇళ్లకు కూడా నేటికీ పరిహారం రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇల్లు కట్టుకోలేని దుస్థితి కనీసం గ్రామంలో నూతన గృహ నిర్మాణాలు చేపట్టడానికి పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. దీనికోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రస్తుతం ఆ భూములు తమ పరిధిలో లేవని చెబుతున్నారని వాపోతున్నారు. వేరేచోటైనా ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు ఇవ్వాలని, భూసేకరణ చేసిన ఇళ్లకు, భూములకు పరిహారాలు అందించాలని కోరుతున్నారు. అధికారులు కనీసం తమను పట్టించుకోకపోవడంతో గ్రామానికి ఆనుకుని కాలువ పనులు చేసేటప్పుడు బ్లాస్టింగ్లు చేయడం వలన భయబ్రాంతులకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారులు మమ్మల్ని మోసం చేస్తున్నారు. అసలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాం. అందుకే కాలువ నిర్మాణం విష యంపై ఆర్టీఐ వేశాం. అప్పటికీ మీ గ్రామానికి సంబంధించిన రికార్డ్ మిస్ అయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పట్టుబడితే వివరా లు ఇచ్చారు. దాని ప్రకారం 40 ఇళ్లు భూసేకర ణ చేసినట్లు ఉంది. కానీ వాటికి సంబంధించి మాకు ఎటువంటి పరిహారాలు అందలేదు. ఇప్పటికై నా న్యాయం చేయాలి. – కూర్మారావు, అచ్చనాపురం ఇరిగేషన్ శాఖ వారు కాలువకు ఆనుకుని కావాల్సిన స్థలం మాత్రమే తీసుకుంటామని చెప్పారు. సేకరించిన స్థలమంతా అవసరం లేదని తెలిపారు. దీంతో ఇటీవలే గ్రామంలో కొంతమందికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూ రు చేశాం. వారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ అవి మా పరిధిలో లేవు. అచ్చనాపురం గ్రా మస్తులకు ఆ విషయాన్ని సైతం తెలియజేశాం. – బడే పాపారావు, తహసీల్దార్, మెళియాపుట్టి మా గ్రామంలోని యువత సమస్యలతో సతమతమవుతున్నాం. మాపై అధికారు లు దృష్టి సారించి న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులతో నలిగిపోతున్నాం. అధికారులు రావడం తప్పించి మేలు చేయడానికి చూడడం లేదు. మాకు యూత్ ప్యాకేజీలు ఇప్పించాలి. – సవర బృందావతి, అచ్చనాపురం -
నీటితో నిండిన పడవలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి జలశాయం ప్రాంతంలో 250కు పైగా కొత్త పడవలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జలశాయంపై వందలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారి జీవనోపాధి చేపలు వేటే. ఈ ప్రాంతంలో మత్స్యకారులు జీవనోపాధిని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సేతు పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా కొత్త పడవలను అందించే పథకాన్ని ప్రారంభించింది. ఈ పడవలను నిర్మాణం జరిగి 6 నెలలైనా సరే లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే వదిలేశారు. ఇక్కడ పడుతున్న వర్షాలకు పడవల్లో నీరు చేరింది. దీని చూస్తున్న ప్రజలు నీటిలో ఉండాల్సిన పడవలు నీటితో నిండిపోయాయని అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మత్స్యశాఖతో చర్చించి తమకు పడవలు అప్పగించాలని కోరారు. ఇలా అయితే తమకు లైఫ్ జాకిట్లు, తెడ్లు, వలలు, ఇతర సామగ్రి ఏప్పటికి ఇస్తారో అని అంటున్నారు. ప్రభత్వం ఈ పథకానికి ఎంత నిధులు మంజూరు చేసిందో వివరాలు తలుసుకొని అధికార్లు తమకు పడవలు అప్పగంచాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఖోయిర్పూట్ సమితి గ్రీవెన్స్కు 63 వినతులు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి బోడడూరాల్ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా 63 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో కొన్ని వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా.. మిగతా గ్రామ, రహదారి సమస్యలతోపాటు ఆరోగ్య, విద్యా పరమైన సమస్యలు పరిష్కరించాలని ఉన్నాయి. వీటిని పరిష్కరించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దురోధ్యన్ బోయి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
డిమాండ్లు నెరవేర్చాలి
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో సివిల్ సప్లయ్ సహాయకులు వివిధ డిమాండ్లతో సామూహిక సెలవు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సివిల్ సప్లయ్ సహాయకుల సంఘం ద్వారా ఎంతో కాలంగా న్యాయపరమైన డిమాండ్లను సంబంధిత అధికారులకు వివరిస్తూ. వాటిని పరిష్కరించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని వారి ప్రధాన ఆరోపణ. సామూహిక సెలవులు తీసుకొని నిరసన తెలుపననున్నామని, తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పస్టం చేశారు. సంఘ నేతలు బొయిపరిగుడ బీడీఓకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. బొయిపరిగుడ సమితిలో గ్రామీణ ప్రజలకు ఇచ్చే రేషన్ పంపిణీపై తీవ్ర ప్రభావం పడవచ్చని, సివిల్ సప్లయ్ విభాగంలో పలు పనులపై ప్రభావం పడుతుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. దొంగ దొరికాడు పర్లాకిమిడి: పట్టణంలో గత కొంత కాలంగా పీహెచ్డీ నీటి మీటర్లు దొంగిలిస్తున్న దొంగను ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ మీడియాల్లో ప్రచారం మేరకు ప్రజారోగ్యశాఖ ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని సీసీ టీవీ ఫ్యూటేజ్, స్థానికంగా విచారణ, కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు 9వ వార్డు గజేంద్రవీధికి చెందిన తాడుతూరి విష్ణు (27)ను అరెస్టు చేశారు. పి.డి.పి.పి.చట్టం (పబ్లిక్ ప్రాపెర్టీ డ్యామేజి)పై కేసు పెట్టారు. నిందితుడి వద్ద 15 వాటర్ మీటర్లు, వినియోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. నీటి మీటర్లు ఖరీదు ఒక్కొక్కటీ రూ.7వేలు ఉంటుంది. ప్రభుత్వం వాటిని తాగునీటి వినియోగదారుల వద్ద వాయిదాల పద్ధతిపై కట్టించుకుంది. నీటి మీటర్లను నిందితుడు చోరీ చేసి అందులో ఉన్న ఇత్తడిని తొలగించి స్క్రాప్ క్రింద అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తెలియజేశాడు. ఒక్కొక్క నీటి మీటర్ నుంచి 500 గ్రాములు, 800 మీటర్లు వరకు ఇత్తడి లభిస్తుంది. 2025 నుంచి వరుసగా రోడ్డు పక్క, పలువీధుల్లో రాత్రిళ్లు వాటర్ మీటర్లు దొంగతనానికి పాల్పడి, వాటిని ముక్కలుచేసి అందులో ఉన్న ఇత్తడిని అమ్ముతున్నట్టు నిందితుడు అంగీకరించినట్లు పోలీసు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. వాటర్ మీటర్లు పలువురి వినియోగదారుల ఇళ్ల నుంచి చోరీ జరుగటంతో అధిక ఆర్థిక నష్టం వారికి సంభంవించిదని ఐఐసీ తెలియజేశారు. ఇప్పటివరకు చోరీ జరిగిన మీటర్లను కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మహేంద్ర ఆశ్రమ విద్యాలయం పదో తరగతి విద్యార్థిని అర్పితా నాయక్కు రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రబంధాల పోటీల్లో ప్రథమ స్థానం సాధించినట్టు ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ జెన్నా సోమవారం తెలిపారు. గత నెలలో జిల్లా స్థాయిలో ఒడిశా సాహిత్య అకాడమీ స్వర్ణక్షేత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వం, కవితా పఠనం, ప్రబంధాలు, జనరల్ నాలెడ్డ్ పోటీల్లో కొంతమంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరిలో రాయఘడ బ్లాక్కు చెందిన అర్పితానాయక్ రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. ఈ నెల 25న భువనేశ్వర్లో రవీంద్ర మండపంలో సత్కారం పొందనున్నట్టు జిల్లా శిక్షా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంస్కృతి పరిషత్ అధికారి అర్చనా మంగరాజ్ అభినందనలు తెలిపారు. -
గ్రీవెన్స్ సెల్కు 28 వినతులు
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి పంచాయతీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ జాయింట్ గ్రీవెన్స్ సెల్కు అత్యల్పంగా స్పందన లభించింది. ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్ సి.డి.ఒ దయామయ పాడీ, ఆర్.ఉదయగిరి పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు, తదితరులు హాజరాయ్యరు. మొత్తం 28 వినతులు అందాయి. వీటిలో వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి 15 ఉన్నాయి. నలుగురి వయోవృద్ధులకు మధుబాబు పింఛన్ కార్డులను అందజేశారు. రెడ్ క్రాస్ సహాయ నిధి నుంచి సులోచన రౌత్కు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్.ఉదయగిరి పంచాయతీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ శోబోరో, బీడీఓ లారీమాన్ ఖర్సల్, తహసీల్దార్ జ్యోతిమయ దాస్, సర్పంచ్లు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా న్ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంపై ఉద్యమకారులతో తక్షణమే చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడైన వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంకుశ చర్యలకు పాల్పడడం దారుణంమన్నారు. ఉద్యమకారులతో కనీసం చర్చలకు సిద్ధపడకుండా 21 రోజుల వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉద్యమం ఆగిపోకుండా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఎన్ఎఫ్ఏ అఖిల భారత నాయకులు ఆదర్శ్ ఎం.సాజి, ఐషీ ఘోష్ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మణికొండ ఆదినారాయణమూర్తి, పోస్టల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ యూనియన్ నాయకులు జె.జ్యోతిశ్వరరావు, రిమ్స్ నాయకులు రవి, కృష్ణవేణి, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు ఆర్.వెంకట్, మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొలాకి ప్రసాదరా వు, వివిధ సంఘాలు నాయకులు అంబటి సత్యనారాయణ, ఎన్.నాగేశ్వరరావు, పి.సుధాకర్, సింహాచలం, జి అప్పారావు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
జయపురం: నాన్–గెజిటెడ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ జయపురం ఖెందూలీప్ డివిజన్(కెఎల్డివిజన్) సంఘ సర్వసభ్య సమావేశం సోమవారం జయపురంలో జరిగింది. కె.ఎల్ డివిజన్ జయపురం అధ్యక్షుడు శబీర కుమార్ జెన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒడిశా రాష్ట్ర నాన్–గెజిటెడ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ ఉపాధ్యాయులు మలయ రంజన్ మల్లిక్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా నియమితులైన ఫారెస్టర్లను ఘన స్వాగతం పలికారు. సంఘానికి సంబంధించిన వివిధ సంస్థాగత, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత సమస్యలపై సమావేశంలో విస్తృత చర్చలు జరిపారు. ఈ సమస్యలు పరిష్కరించాలని సమావేశం తీర్మానించింది. ఈ చర్చల్లో నాన్–గెజిటెడ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ ప్రధాన్, ఉపాధ్యక్షుడు గోవింద నాయక్, కోశాధికారి మనోజ్ మహరాణ, రాష్ట్ర సంఘ ప్రతినిధి ఽధీరేష్ శతపతి, కొరాపుట్ టెరిటోరియన్ డివిజన్ అధ్యక్షుడు నిరంజన్ ప్రధాన్, జయపురం కెఎల్ డివిజన్ కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి లోకేష్ మరండి, కోశాధికారి రోహిత్ షరాబ్, సంయుక్త కార్యదర్శి జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘నెట్వర్క్ సదుపాయం కల్పించాలి’
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితిలో ఒకప్పుడు మావోయిస్టుల సమావేశాలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పడు అదే ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సౌకర్యం, ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు గ్రామస్తులే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు చిత్రకొండ సమితి కపాతుట పంచాయతీ ఒర్రగెల్ గ్రామంలో వెలుగు చూశాయి. గ్రామంలో నాలుగేళ్ల కిందట జియో మొబైల్ టవర్ను 13 గ్రామాలకు నెట్వర్క్ సౌకర్యం అందించాలి అనే ఉద్దేశంతో నిర్మించారు. కానీ ఇప్పటికీ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఒక్క ఫోన్ కాల్ చేయాలన్నా సరిహద్దున ఉన్న ఆంధ్ర నెట్వర్క్ పైనే ఆధారపడుతున్నారు. ఆన్లైన్ సేవలు పొందాలంటే జిల్లా ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు. -
విద్యార్థుల ఆందోళన
● నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై.. రాయగడ: వైద్య విద్య కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న ప్రశ్నపత్రం లీక్, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలను నిరసిస్తు రాయగడలో విద్యార్థులు, యువజనులు, సామాజిక కార్యకర్తలు, సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక కపిలాస్ కూడలి నుంచి భారీ ర్యాలీగా విద్యార్థి సంఘాలు వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద నిరసన తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాష్ట్రపతి పేరుతో వినతిపత్రాన్ని నిరసనకారులు డిప్యూటీ కలెక్టర్ మనవాల్ ప్రియదర్శినికి సమర్పించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరుసగా ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకోవడమేనని ఆరోపించారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టివేస్తున్న ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవిచారణ జరిపించాలి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర, కాలపరిమితి ఉన్న ఉన్నతస్థాయి విచాణ కమిటీని ఏర్పాటు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమగ్ర సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణకు మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చాలని కోరారు. పరీక్షల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో విద్యావ్యవస్థ సంక్షోభంపై చర్చించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు తుషార్ కాంత్ తురుక్ మాట్లాడుతూ.. ఢీల్లిలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా తరలించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కోక్రొచ్ జనతాదళ్ తమ మద్దతును ప్రకటించి సభ్యులు, ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు. -
పవర్ హౌస్ మూసివేత
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026బలిమెల..మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా బలిమెల పవర్ హౌస్ను సోమవారం నుంచి మూసివేశారు. రుతు పవనాలు సరిగ్గా లేకపోవడం, రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడం కారణంగా ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ బలిమెల జల విద్యుత్ ప్రాజెక్టు పవర్ హౌస్ను ఆదివారం అర్ధరాత్రీ నుంచే నిలిపివేశారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి కోసం నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో నీటి పారుదల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పోటేరు నీటిపారుదల ప్రాజెక్టు చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజినీర్ త్రూపా కుమార్ పాత్ర తెలిపిన వివరాలు ప్రకారం బలిమెల రిజర్వాయర్ నీటిమట్టం పూర్తి స్థాయి 1,516 అడుగులతో పోలిస్తే 1,455.60 అడుగులకు పడిపోయింది. ప్రత్యక్ష నీటి నిల్వ కూడా కేవలం 13.13 శాతమే ఉంది. గత ఏడాది ఇదే సమయంలో నీటి మట్టం 1,462.60 అడుగులు, ప్రత్యక్షనిల్వ 19.94 శాతం ఉండేది. ఈ సంవత్సరం క్యాచ్మెంట్ ప్రాంతంలో కేవలం 519 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 259 మిల్లీమీటర్లు తక్కువ. ఎల్ నినో ప్రభావం, సగం రుతుపవనాల వర్షాలు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఓహెచ్పీసీ పవర్ హౌస్ మూసివేత నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు బలిమెల ప్రాజెక్టుకు నీటి విడుదలను వెంటనే నిలిపివేశారు. ఓహెచ్పీసీ సూపరింటెండింగ్ ఇంజినీర్ దుర్గా ప్రసాద్ పట్నాయిక్ మాట్లాడుతూ రిజర్వాయర్ స్థాయిని కాపాడటానికి నీటి విడుదలను నిలిపివేశామని తెలిపారు. ఖరీఫ్కు నీరందించే ఉద్దేశంతో నీటి సరఫరాను 40వేల క్యూసెక్కులకు పరిమితం చేశారు. ప్రస్తుతం జలపూట్ రిజర్వాయర్ నుంచి సమారు 600క్యూసెక్కుల నీరు వస్తోంది. శనివారం రాత్రి నాటికి దీన్ని 2,000 క్యూసెక్కులకు పెంచాలని నీటి పారుదల శాఖ అభ్యర్థించింది. మాచ్ఖండ్ పవర్హౌస్ ప్రమాదం తర్వాత జలపూట్ నుంచి నీటి విడుదల నిలిపివేయడం కూడా బలిమెలలో నీటి కొరతకు ఒక కారణమని అంటున్నారు.గుడారిలో వినతుల స్వీకరణ -
రథయాత్రలో హేరా పంచమి
భువనేశ్వర్: రథయాత్రలో ఐదో రోజు హేరా పంచమి. పూరీలోని జగన్నాథ ధామంలో జరిగే రథయాత్రలోని అత్యంత విశిష్టమైన ఆచారాలలో ఒకటైన హేరా పంచమి సోమ వారం నిర్వహించారు. హేరా పంచమి రోజున శ్రీ మహాలక్ష్మి దేవి గుండిచా ఆలయానికి వెళ్లిన శ్రీజగన్నాథుడిపై అలక వ్యక్తం చేస్తూ నందిఘోష రథానికి స్వల్ప నష్టం కలిగించే లీలను ఆచరిస్తుంది. ఈ దివ్యలీల దాంపత్య ప్రేమ, అలక, అనురాగాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజు జగత్తంతా మహాలక్ష్మి దేవి ఆగ్రహాన్ని దర్శించింది. తనకు తెలియజేయకుండా శ్రీ మందిరాన్ని విడిచి వెళ్లినందుకు మహాప్రభువుపై ప్రియ సఖి శ్రీ మహా లక్ష్మి జగతి నాథునిపై అలక ప్రదర్శిస్తుంది. సువిశాల శ్రీ మందరంలో తనకు ఒంటరిగా వీడి స్వామి యాత్రకు వెళ్లడంతో విరహం తాళలేని లక్ష్మీదేవి ఐదో రోజున చీకటి పడిన తర్వాత రత్న శోభిత పల్లకిలో ఊరేగింపుగా శ్రీ గుండిచా ఆలయానికి ప్రయాణించడం హేరా పంచమి వేడుకగా నిర్వహించడం భక్త జనులకు ముచ్చట గొలిపే సన్నివేశం. భక్తి, దైవ ప్రేమ, ఆరాటం లక్ష్మీదేవి, మహా ప్రభువు శ్రీ జగన్నాథుని మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని అందంగా ప్రతిబింబించే ఒక కాలాతీత సంప్రదాయంగా ఈ వేడుకని పేర్కొంటారు. హెరా పంచామిలో భక్తుల సందడి రాయగడ: జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా సోమవారం హెరాపంచమిని పురస్కరించుకుని స్థానిక గుండిచా మందిరలో కొలువైయున్న జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు ప్రత్యేక పూజలందుకున్నారు. ఈ సందర్భంగా జగన్నాథడు దశవతారాల్లో భాగంగా నృసింహ అవతారంల్లో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. భక్తులు స్వామి వారి దివ్యదర్శనాన్ని చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో గుండిచా మందిరం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి దర్శనం కోసం గంటల సమయం పట్టింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. క్యూ లైన్ ద్వారా వారిని గుండిచా మందిరం లోపలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. -
ప్రతి నీటి బొట్టును సంరక్షించాలి
రాయగడ: భవిష్యత్ తరాలకు మంచినీటి కొరత లేకుండా చూడాలంటే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందనే సందేశంతో రాయగడ మున్సిపాలిటీ క్యాచ్ ది రైన్ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల పరిరక్షణపై పట్టణ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని తెలియజేస్తు హోర్డింగ్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో సమాచార స్టాండీలను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్ల ద్వారా కూడా క్యాచ్ ది రైన్ సందేశాన్ని నిరంతరం ప్రసారం చేస్తున్నారు. వర్షపు నీటిని ఎలా సేకరించాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, భాగర్భ జలాల పెంపులో దాని పాత్ర ఎంత ముఖ్యమో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రతీ వర్షపు నీటి బొట్టు అమూల్యమైన సహజ సంపద అని పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, వ్యాపార సముదాయాల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచవచ్చని వివరించారు. అలాగే నీటి కొరతను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలొ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ మాట్లాడుతూ.. వర్షపు నీటిని సంరక్షించండి–భావితరాల కోసం నీటిని ఆదా చేయండి అనే సందేశాన్ని ప్రతీ ఒక్కరూ ఆచరణలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్షపు నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరూ కలిసి చేపట్టే జలనాందోళనగా మార్చాలని అన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న నీటి కొరత దృష్ట్యా వర్షపు నీటి సంరక్షణ అత్యంత అవసరమన్నారు. ఈ నేపథ్యంలో రాయగడ మున్సిపాలిటీ చేపట్టిన క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని అందరికి తెలిసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
దివ్యాంగ సామర్థ్య శిబిరం ప్రారంభం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరిలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రథమ భీమ భొయి దివ్యాంగ సామర్థ్య శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. సమాజంలో వికలాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సహాయ, సంక్షేమ కార్యక్రమాల ద్వారా లభించే లబ్ధిని వివరించారు. వారిని చైతన్యవంతులను చేయాలన్న లక్ష్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ శిబిరంలో అనేక మంది దివ్యాంగులు పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు చేపట్టి ప్రమాణ పత్రాలను అందజేశారు. పరికరాలు సమకూర్చేందుకు వికలాంగులను గర్తించారు. 234 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. వికలాంగులకు అవసరమైన మూడు చక్రాల సైకిళ్లు, హ్యాండ్ స్టిక్స్, శ్రవణ యంత్రాలు, తదితర పరికరాలు అందజేశారు.దుకాణాల్లో తనిఖీలు జయపురం: రథయాత్ర సందర్భంగా జయపురంలోని స్వీట్స్, తదితర దుకాణాల్లో ఆహార సురక్షా విభాగ అధికారులు, జయపురం మున్సిపాలిటీ హెల్త్ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పరిశుభ్రమైన పదార్థాలు విక్రయించాలన్నారు. పాలిథిన్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొరాపుట్ జిల్లా ఖాద్య సురక్షా అధికారి పంకజనీ బెహర, జయపురం మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
గూడు కూలుస్తారా?
గోడు చెబితే.. ● రణస్థలంలో గందరగోళంగా ఫ్లై ఓవర్ నిర్మాణం ● యుటిలిటీ కారిడార్ను మింగేస్తున్న అధికారుల యత్నాలు ● కలెక్టర్కు సమస్య వివరించడంలో హైవే అధికారులు విఫలం ● ఇళ్లకు ముప్పు ఉండటంతో ఆందోళనలో స్థానికులు రణస్థలం : రణస్థలం జంక్షన్లో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్) నిర్మాణంలో జాప్యం తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. అసంపూర్తి ప్రణాళికలు, కాంట్రాక్టర్ల, అధికారులు సమన్వయ లోపం వెరసి ఈ ప్రాజెక్టు ఇప్పుడు స్థానిక గృహ యజమానుల పాలిట శాపంగా మారింది. నిత్యం ట్రాఫిక్ ఏర్పడటంతో ఇటీవల సమస్య పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్కు హైవే ఆధికారులు సరైన రీతిలో చెప్పకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. తాజాగా రోడ్డును ఆనుకుని ఉన్న ఇళ్లపైకి జేసీబీలను పంపేందుకు యంత్రాంగం సిద్ధం కావడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చేతులెత్తేసిన హైవే అథారిటీ.. ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) ప్రకారం పనులు మొదలయ్యాయి. 30 శాతం పనులకే కాంట్రాక్టర్ డీజిల్, తారు, ఇతర అవసరాలు అందించక, లేబర్ దొరక్క, పెరిగిన ధరలతో సతమతమై పనులు మందగించాయి. 2027 జూన్ 30లోగా కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. టెండర్లో అవగాహన లేమి.. ఎన్హెచ్ఏఐ రూ. 254 కోట్లకు టెండర్ పిలవగా రూ.137 కోట్లకే శ్రీనివాస ఎడిఫేసీ ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకులు పనులు దక్కించుకున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకోవాలనే తపనతో తక్కువకు టెండర్కు కోట్ చేశారు. ఇప్పుడు పెరిగిన ఇంధన, సిమెంట్, స్టీల్, తారు, క్రషర్ ధరల వలన నిర్మాణ వ్యయం 20 శాతం నుంచి 30శాతం వరకు పెరిగిపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా వెళ్లిన టెక్నికల్ కూలీలు తిరిగి రాలేదు. ఇదే సమయంలో బీహార్, యూపీ, ఒడిశాలో పనులు పెరగడంతో స్థానికంగా కూలీల కొరత తీవ్రమైంది. కలెక్టర్కు వివరించలేని అధికారులు.. ట్రాఫిక్ సమస్యపై కలెక్టర్, ఎస్పీలు మండల తహసీల్దార్ కార్యాలయంలో హైవే, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో రోడ్డుకు ఇరువైపులా సుమారు 2 మీటర్ల యుటిలిటీ కారిడర్ వదలడం ఒక ప్రాథమిక ఇంజనీరింగ్ నియమం. భవిష్యత్లో ఈ స్థలంలో తాగునీటి పైపులు, గ్యాస్ పైపులైన్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు, టెలికమ్యూనికేషన్ పైబర్ కేబుల్స్ వేయడానికి, అలాగే డ్రైనేజీ యాక్సెస్కు, ప్రజా అవసరాల నిమిత్తం రిజర్వ్ చేస్తారు. ఈ విషయాన్ని ఎన్హెచ్ఏఐ అధికారులు జిల్లా కలెక్టర్ సమీక్షలో వివరించలేకపోయారు. పరిష్కరించమంటే కూల్చేస్తారా.. ఈ నిబంధనల మీద అవగాహన లేమితో, రోడ్డు వెడల్పు చేయడానికంటూ రోడ్డు పక్కన దశాబ్దాలుగా నివసిస్తున్న స్థానికుల గృహ నిర్మాణాలను తొలగించి ప్రస్తుత సర్వీస్ రోడ్డుని విస్తరించాలని కలెక్టర్ హుకుం జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా వెనకా ముందూ ఆలోచించకుండా ఈ ఇళ్లను కూల్చేందుకు సన్నాహలు మొదలెట్టింది. ఆ హామీ ఏమైంది..? గతంలో డీపీఆర్ సమయంలో స్థానికులు ఇదే తహసీల్ధార్ కార్యాలయంలో అప్పటి జేసీ సమక్షంలో తమ అభ్యంతరాలను లేవనెత్తినప్పుడు ప్రస్తుతం ఉన్న డ్రైనేజీల మధ్య పరిధిలోనే ఎలివేటెడ్ కారిడర్ నిర్మిస్తామని, ప్రజల ఇళ్లకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఎన్హెచ్ఏఐ అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేసి, డ్రైనేజీలను ఏకంగా గృహ నివాసాల వైపు రెండు మీటర్ల వరకు జరిపి నిర్మిస్తామని చెబుతున్నారు. దీని వల్ల నివాసాలపైకి డ్రైనేజి నీరు, ఇళ్లపైకి హైవోల్టేజీ విద్యుత్ లైన్లు వచ్చే ప్రమాదం పొంది ఉంది. డ్రైనేజీకి, మా ఇళ్లకు మధ్య కనీసం 1.5 నుంచి 2 మీటర్ల వెడల్పుతో పబ్లిక్ యుటిలిటీ కారిడార్ ఉండాలి. ఇప్పుడు ఖాళీగా కనిపించే ఈ స్థలాన్ని అధికారులు బలవంతంగా లాక్కుంటే, రేపు అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ వేయడానికి స్థలం ఉండదు. సమస్యను పరిష్కరించమని కలెక్టర్ను వేడుకుంటే ఉన్న ఇళ్లను కూల్చేసి కొత్త సమస్యను సృష్టించి వెళ్లారు. – పిన్నింటి సత్యంనాయుడు, జే.ఆర్.పురం నిర్మాణ సంస్థ లోపాలు, అధికారుల వైఫల్యాల వల్ల స్థానికులు, వ్యాపారులు నష్టపోయారు. మరలా గందరగోళం సృష్టించేలా చర్యలు చేపట్టడం, సామాన్యులను బలిపశువులను చేయడం ఎంతవరకు న్యాయం? కొత్తగా లోపలికి డ్రైనేజీ వేస్తామని, ఇళ్లపైకి జేసీబీలను పంపిస్తామని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో హైవే అధికారులు కాలువ దాటి రాబోమని చెప్పిన హామీ నిలబెట్టుకోవాలి. – పచ్చిగుల్ల సాయిరాం, ఎంపీటీసీ సభ్యుడు, జె.ఆర్.పురం -
శతాధిక వృద్ధుడు మృతి
నందిగాం: మండల కేంద్రం నందిగాంకు చెందిన కొన్ని బాలయ్య (107) శనివారం రాత్రి మృతి చెందాడు. ఈయన కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. బాలయ్యకు ముగ్గురు కుమారులు, కుమార్తె. ఇద్దరు కుమారులు మృతి చెందగా.. భార్య వరలక్ష్మీ జీవించి ఉన్నారు. వందేభారత్ రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణంనరసన్నపేట: ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం భువనేశ్వర్ నుంచి విశాఖ వెళ్తున్న వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు 55 ఏళ్లు ఉండవచ్చని చెప్పారు. టీ షర్ట్, టవల్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 91103 05494 నంబర్ను సంప్రదించాలని కోరారు. కుక్కల దాడిలో మేకలు మృతి టెక్కలి రూరల్: టెక్కలి గొల్లవీధిలో ఆదివారం వేకువజామున కుక్కలు స్వైర విహారం చేశాయి. బారికోడుకి చెందిన శాలలో చొరబడి దాడి చేయడంతో ఆరు మేకలు, ఐదు గొర్రెలు మృతిచెందాయి. మరికొన్ని గాయపడ్డాయి. రైలు కింద పడి వ్యక్తి మృతి పలాస: సోంపేట రైల్వేస్టేషన్ యార్డు డౌన్ లైన్లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జి.ఆర్.పి ఎస్ఐ దుంపల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఆకుపచ్చ టీషర్టు, నలుపు ఫ్యాంటు, టీ షర్టుపై శ్రీకృష్ణా ఏజెన్సీ, రాయగడ అని ఉందన్నారు. కుడి చేతిలో కియా, సోని పేరిట పచ్చబొట్టు ఉందని చెప్పారు. వివరాలు తెలిస్తే 9247585743 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. అరసవల్లి : శరీరంలో కనిపించే చిన్నవాపుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ‘సార్కోమా’ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశాఖకు చెందిన ప్రముఖ రేడియేషన్ అంకాలజీ వైద్యుడు డాక్టర్ ఎం.వెంకటరమణ అన్నారు. ఏటా జూలై నెలను ప్రపంచ సార్కోమా అవగాహన మాసంగా జరుపుకుంటారు. ‘తెలుసుకోండి.. చర్య తీసుకోండి..గొంతెత్తండి..’ అనే థీమ్తో ఈ నెల ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు వైద్యులు సంసిద్దమయ్యారు. ఈ సందర్భంగా వెంకటరమణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సార్కోమా లక్షణాలివే.. సాధారణంగా క్యాన్సర్లు రొమ్ము, లివర్, ఊపిరితిత్తులు,పేగు వంటి లోపల పొరల్లో పుడతాయి. సార్కోమా మాత్రం కండరాలు, ఎముకలు, కొవ్వు కణాలు, రక్త నాళాల్లో పుడుతుంది. నెమ్మదిగా పెరిగి, నొప్పి లేని వాపు, గడ్డగా కనిపిస్తుంది. క్రమేణా చేతులు, కాళ్లు కదిలించడంలో ఇబ్బంది పెడతాయి. కడుపు ఉబ్బడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం కూడా వీటి లక్షణాలే. ఎముకల్లో రాత్రి వేళ నొప్పులు, చిన్నపాటుకే ఎముకలు విరగడం వంటివి కూడా ప్రధాన లక్షణాలు. కచ్చితంగా వాపు గడ్డ కనిపిస్తే..అందులో నొప్పి లేదంటే తప్పకుండా బయాప్సీ చేయించాల్సి ఉంటుంది. రేడియేషన్ అంకాలజిస్ట్, సర్జికల్ అంకాలజిస్టు, పాథాలజిస్టు, రేడియాలజిస్టుల బృంద వైద్యులు కలిసి చికిత్స చేయాల్సి ఉంటుంది. గడ్డగా మారిన కణితిని పూర్తిగా తొలిగించేలా ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన వైద్యులతోనే సార్కోమా చికిత్స చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. తల్లి లేని లోకం వద్దని.. సోంపేట: తల్లి మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేట మండలం బారువ మేజర్ పంచాయతీ పరిధిలోని బారువ కొత్తూరు గ్రామానికి చెందిన వలిశెట్టి జోగారావు, మంగమ్మల కుమారుడు అనీష్(20). విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి జోగారావు బీఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేయడంతో అనీష్కు తల్లితోనే అనుబంధం ఎక్కువ. ఆరు నెలల క్రితం తల్లి మంగమ్మ కొర్లాం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి అనీష్ ముభావంగా ఉండేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. రెండు రోజుల క్రితం విజయనగరం నుంచి రథయాత్ర సందర్భంగా ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం కొర్లాం సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి గుర్తు తెలియని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అనీష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
జగన్నాథుడు
యాత్రకు ట్రాఫిక్ సమస్య పర్లాకిమిడిలో గుండిచా యాత్రకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. భక్తులు ఇబ్బంది పడ్డారు. –8లోuదుకాణాల్లో తనిఖీలు జయపురంలో దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్ర వస్తువులనే విక్రయించాలన్నారు. –8లోuమత్స్య, కూర్మావతారాల్లో..శ్రీ మందిరం ఆదాయంనగదు : రూ. 2,71,975 బంగారం : 2 గ్రాముల 600 మిల్లీ గ్రాములు వెండి : 27 గ్రాములు – భువనేశ్వర్/పూరీసోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026జయపురం: రథయాత్ర ఉత్సవాల్లో గుండిచా మందిరంలో శ్రీజగన్నాథ, బలభధ్ర, సుభధ్ర దేవతామూర్తులు పది అవతారాలలో భక్తులకు దర్శనం ఇవ్వడం పరిపాటి. ఆయా అవతారాల్లో తమ ఆరాధ్య దేవతలను దర్శించి భక్త జనం పూజలు జరిపి తరిస్తారు. జయపురంలో ఒక దినం ఆలస్యంగా రథయాత్ర ప్రారంభం కావటం వలన శనివారం రెండు అవతారాల్లో అనగా మత్స్య, కూర్మావతారాలలో దారు దేవతలు భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా అవతారాల్లో జగన్నాథ, బలభధ్ర, సుభద్రలను దర్శించి తరించేందుకు భక్త జనం పోటెత్తారు. అలాగే బోయిపరిగుడ గుండిచా మందిరంలో కూర్మావతారంలో దారు దేవతలు భక్తులకు శనివారం రాత్రి దర్శనమిచ్చారు. అయితే జయపురం సమితి కొట్పాడ్లో వరావతారంలో జగన్నాథుడు దర్శనమిచ్చారు. నృసింహా, వరాహా అవతారాల్లో జగన్నాథ, బలభద్రులు దర్శనం పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో వేంచేసిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు ఆదివారం నృసింహా, వరాహా అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నృసింహా అవతారం వద్ద ప్రహ్లాదుడు, భూమండలాన్ని కాపాడిన స్వయంగా జగన్నాథుడు వరాహా అవతారంలో వచ్చారు. స్వామివారి మహా అవతారాలు చూడటానికి భక్తులు భారీగా పోటెత్తారు. అలాగే రాయగడ బ్లాక్ ప్రసిద్ధి చెందిన జిరంగోలో కూడా చుట్టుపక్కల అదివాసీ గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి జగన్నాథ, బలభద్రుడు, సుభద్రలను దర్శించుకున్నారు. సోమవారం హిరాపంచమి సందర్భంగా లక్ష్మీదేవి గుండిచా మందిరం సందర్శిస్తుంది. జిరంగో గ్రామంలో హిరాపంచమి రోజున చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ● రాయగడ: పొదరి శుభద్ర, సొదరుడు బలభద్రునితో గుండిచా మందిరంలో కొలువైయున్న జగన్నాథుడు దశవతారాల్లో భాగంగా ఆదివారం వరహావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారి దివ్యదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
చోరీ కేసులో ముగ్గురు అరెస్టు
రాయగడ: ఆపరేషన్ నేత్రలో భాగంగా ఝార్సుగుడ పోలీసులు చొరీ కేసును దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర ఈ కేసుకు సంబంధించి వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ ఇంటి తలుపు పగుల గొట్టి రెండు మోబైల్ ఫోన్లు, నగదును అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలొ వారు చోరీ చేసినట్లు అంగీకరించారు. అంతేకాకుండా జూలై 18వ తేదీ సాయంత్రం ఝండా చౌక్ సమీపంలొ పార్కింగ్ చేసిన ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా తామే దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు. అరెస్టయిన వారిలో ఝార్సుగుడ జిల్లాలోని బురొమాల్ గ్రామానికి చెందిన శివమహానంద్ అలియాస్ నాయక్, సూరజ్ శంకర్, భరద్వాజ్ కాక్ అలియాస్ మండల్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులను కోర్టుకు తరలించారు. -
పరారైన నిందితుడి అరెస్టు
రాయగడ: సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్లను అందిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఆపరేషన్ నేత్రలో భాగంగా ఝార్సుగుడ పోలీసులు మరో కీలక విజయాన్ని సాధించారు. ఈ కేసులో పరారీలొ ఉన్న ప్రధాన నిందితుడు ప్రతీక్ సింగ్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. ఝార్సుగుడ పోలీస్స్టేషన్లో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నిందితుడు అరెస్టు నుంచి తప్పించుకుని పరారీలొ ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సుదీర్ఘ గాలింపు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝార్సుగుడ జిల్లా రైల్వే కాలనీలోని తెలుగు పడ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. నేరగాళ్లు స్థానిక ప్రజలను నగదు ఆశ చూపించి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించేవారు. అనంతరం ఆ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, పాస్బుక్లు, ఇంటర్నెంట్ బ్యాంకింగ్ వివరాలు వంటి పూర్తి అకౌంట్ కిట్లను సేకరించి సైబర్ నేర ముఠాలకు లేదా ఇతర రాష్ట్రాల్లోని వారి సహచరులకు అందజేసేవారు. ఈ మ్యూల్ అకౌంట్ల ద్వారా మోసపూరితంగా వచ్చిన డబ్బును బదిలీ చేయడం, ఉపసంహరించడం ద్వారా దర్యాప్తును తప్పుదొవ పట్టించే ప్రయత్నం చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఝార్సుగుడ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అపరిచితుల మాటలు నమ్మి డబ్బు కోసం బ్యాంకు ఖాతాలు తెరవడం లేదా ఏటీఎం కార్డులు, పాస్బుక్లు, బ్యాంకింగ్ వివరాలు ఇతరులకు అప్పగించడం చట్టవిరుద్ధమన్నారు. ఇటువంటి చర్యల వల్ల అమాయకులు కూడా సైబర్ మోసాల కేసుల్లో నిందితులుగా మారే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అంతర్రాష్ట్ర స్క్రాప్ చోరీ ముఠా గుట్టురట్టు
రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని కొలాబిర పోలీస్స్టేషన్ పరిధిలో గ్రామీణ తాగునీటి పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా చేసే అల్యూమినియం విద్యుత్ తీగలను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర స్క్రాప్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రఘునాథ్పల్లి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొలాబిర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి గ్రామీణ నీటి సరఫరా పథకాలకు ఉపయోగించే సుమారు 3,600 మీటర్ల 11 కేవీ అల్యూమినియం విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తీగలను ఝార్సుగుడలోని పురుబాస్తి ప్రాంతంలోని స్క్రాప్ గోదాంలో దాచిపెట్టి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నిందితులు బాబులు అలియాస్ అబ్దుల్ కయ్యం, బల్లా అలియాస్ అబ్దుల్ రహీమ్, అజ్మైల్ మీర్, అష్రప్ రజా లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ కు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి బొలేరొ వాహనం ఆరుకట్టలుగా కత్తిరించిన విద్యుత్ తీగలు, వైర్ కట్టర్, ప్లాస్టిక్ తాడు స్వాదీనం చేసుకున్నారని ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలియజేశారు. -
పర్యాటకులను కాపాడిన లైఫ్ గార్డులు
భువనేశ్వర్: పూరీ సెక్టార్ 3 సమీపం తీరంలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోయిన ఇద్దరు పర్యాటకులు అలల్లో కొట్టుకు పోయారు. విషయం దృష్టికి రావడంతో సాగర తీరంలో పహరా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫ్ గార్డు సిబ్బంది తక్షణమే అలల్లోకి దూకి కాపాడి ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. బతికి బయటపడిన పర్యాటకులను జార్ఖండ్కు చెందిన అమన్, బీహార్కు చెందిన రవి కుమార్గా గుర్తించారు. ధాన్యం కొనుగొళ్లలో వెయ్యి కోత రాయగడ: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యం విక్రయించాల్సిన రైతులు, మిల్లర్ల ఒత్తిడి కారణంగా ప్రతి క్వింటాల్కు వెయ్యి రూపాయల తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ రాయగడ జిల్లా పద్మపూర్ ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గుణుపూర్ సబ్ కలెక్టర్ దూదుల్ అభిషేక్ దిలీప్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కథనం ప్రకారం, ప్రభుత్వ నిబంధనల మేరకు సహకార సంఘాల్లో నమోదు చేసుకుని మండీల ద్వారా ధాన్యం విక్రయించేందుకు అవసరమైన లన్ని ప్రక్రియలను పూర్తి చేశారు. అయితే ధాన్యం కొనుగోలు చేసే సమయంలో కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధరకు కొనుగోలు చేయకుండా ప్రతీ క్వింటాల్కు వెయ్యి రూపాయలు తగ్గించి విక్రయిస్తేనే ధాన్యాన్ని తీసుకుంటామని షరతు విధించారని ఆరోపించారు. అంగీకరించని రైతుల ధాన్యాన్ని వివిధ కారణాలు చూపుతూ రోజుల తరబడి ఖరీదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు వివరించారు. దీంతో ధాన్యం బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉండి వర్షాలు, గాలులు వంటి ప్రకృతి ప్రభావాలతో పంట దెబ్బతింటుందనే భయంతో రైతులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. చివరకు ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్కు రూ.3,100 బదులుగా కేవలం రూ.2,100కే ధాన్యాన్ని విక్రయించాల్సిన దుస్థితి ఎదురైందని రైతులు వాపోయారు. ప్రతి క్వింటాల్కు వెయ్యి రూపాయల చొప్పున నష్టపోయామని అన్నారు. మండీ వ్యవస్థ, మద్దతు ధర విధానాలు సమర్థంగా అమలు కావడం లేదని ఆరోపించారు. లయన్స్ సేవలు ప్రశంసనీయం రాయగడ: లయన్స్ క్లబ్ అపరాజిత సంస్థ సేవలు ప్రశంసనీయమని క్లబ్ డిస్టెట్ గవర్నర్ అశ్విన్ కుమార్ దాస్ కొనియాడారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్లో శనివారం సాయంత్రం లయన్స్ రాయగడ అపరాజిత ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా ప్రసంగించారు. గత ఏడాది ఆవిర్భవించిన లయన్స్ అపరాజిత సంస్థ ఏడాదిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువైందన్నారు. లయన్స్ క్లబ్లో భాగమైన ఈ సంస్థలో మహిళలు సేవాదృక్పథంతో ముందుకు రావడం అభి నందనీయమన్నారు. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ము ఖ్యంగా సంస్థలోని మహిళలు సమయాన్ని కేటాయించి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. లయన్స్ అపరాజిత సంస్థ కార్యదర్శి బరాటం అవంతి వార్షిక నివేదికను చదివి వినిపించారు. నూతన కార్యవర్గం: లయన్స్ అపరాజిత 2026– 27 ఏడాదికి గాను కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యింది. అధ్యక్షురాలిగా పెంట కల్యాణి, కార్యదర్శిగా ఎస్.శ్రావణి, కోవాధికారిగా రంజిత్ బిసోయిలు నియమితులయ్యారని డిస్టెట్ గవ ర్నర్ అశ్విన్ కుమార్ ప్రకటించారు. అనంతరం కొత్త కార్యవర్గానికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి సభ్యు లు అభినందించారు. కార్యక్రమంలొ లయన్స్ జీఎల్టీ కోఆర్డినేటర్ సుస్రిత దాస్, లయన్స్ కేబినేట్ సెక్రటరీ టి.జయరాం పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
పలాస: విద్యార్థులు, యువజనుల న్యాయబద్ధమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వివిధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ను అక్రమంగా తరలించడాన్ని ప్రజలంతా ఖండించాలని పిలుపునిస్తూ పలాస మండలం బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద ఆదివారం ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పత్తిరి దానేసు, కోత ధర్మారావు, వంకల మాధవరావు, మద్దిల రామారావు, ఎం.వినోద్కుమార్ తదితరులు మాట్లాడుతూ పాలకుల విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, నిర్బంధాలు విధించడం సరికాదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో బోకర దుర్యోధనరావు, పుచ్చ దుర్యోధన, పోతనపల్లి కుసుమ, సాలిన వీరాస్వామి, లక్ష్మణ్, ప్రభాకర్, మన్మధరావు, తెప్పల అజయ్కుమార్, సోమనాధం, వైకుంఠరావు, జోగారావు, కుత్తుం దుష్యంతు, గేదెల జగదీష్ తదితరలు పాల్గొన్నారు. -
మొదటి అడపా ఒబొఢా విడుదల
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ రథ యాత్రలో మహా అన్న ప్రసాదాలు (ఒబొఢా) అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అడపా ఒబొఢా సేవనతో అనేక జన్మల పాపాల నుంచి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది యాత్ర నాలుగో రోజు ఆదివారం నుంచి స్వామి వారి జన్మస్థలమైన గుండిచా ఆలయంలో తొలి అడప దర్శనం లభ్యత ప్రారంభమైంది. ప్రాతః ధూపం అనంతరం ఒబొఢా విడుదల చేశారు. అడపా మండపంపై భగవంతుని దర్శనంతో పవిత్ర ఒబొఢా లభ్యతతో భక్తులలో ఉత్సాహం రెట్టింపైంది. ఆదివారం మొదటి రోజు కావడంతో భక్తుల తాకిడి అసాధారణంగా ఉంది. రద్దీ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ వ్యవస్థ గుండా భక్తులు వరుస క్రమంలో శ్రీ గుండిచా మందిరం లోనికి ప్రవేశించి అడపా మండపంపై మూల విరాట్లను దర్శించుకుంటున్నారు. సింహ ద్వారం గుండా గుండిచా ఆలయం లోనికి ప్రవేశించి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు నక్కొ చొణా ద్వారం గుండా బయటకు వెళ్తున్నారు. ఆదివారం మంగళ హారతి తర్వాత ఉదయం 9.55 గంటలకు సర్వ దర్శనం ప్రారంభమైంది. తీవ్రమైన వేడి, ఉక్కపోత కారణంగా చాలా మంది భక్తులు గంటల తరబడి బారులు తీరి నిలబడాల్సి వస్తుంది. దీని కారణంగా భక్తులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. స్పృహ కోల్పోవడం, ఊపిరాడని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉందని పలువురు హితవు కోరుతున్నారు. సువార్ మహాసువార్ ఆదేశాల మేరకు 50 వేల మంది భక్తుల కోసం వివిధ రకాల వంటకాలతో ఒబొఢా సిద్ధం చేశారని సేవా సిబ్బంది తెలిపారు. -
జిల్లా కేంద్రాస్పత్రి సందర్శన
● మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే గౌరీశంకర్ మజ్జి, జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ఆరాకొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్ హోదాలో నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీశంకర్ మజ్జి, జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్లు ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆస్పత్రికి వచ్చి రోగుల వార్డులో ప్రవేశించి అందుతున్న వసతుల గురించి ఆరాతీశారు. మందుల నిల్వ, సిబ్బంది ఖాళీల పరిస్థితి పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వాహణను పరిశీలించారు. ఆస్పత్రిలో కల్పించాల్సిన వసతులపై వైద్య సిబ్బందితో కలిసి చర్చించారు. -
బధిర బాలికలను ఆదుకుందాం: గవర్నర్
భువనేశ్వర్: వినికిడి లోపం ఉన్న బాలికల్లో నైపుణ్యాభివృద్ధికి పదును పెట్టి ఉపాధి అవకాశాల లభ్యతను విస్తరింపజేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగంతో వారిని అనుసంధానించేందుకు కృషి చేసి గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. లోక్ భవన్ అభిషేక్ హాల్లో వినికిడి లోపం ఉన్న బాలికలు, దివ్యాంగులతో సహా కెందుఝొర్లోని సేవా ఫౌండేషన్కు చెందిన సుమారు 50 మంది సభ్యులతో గవర్నర్ ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా వినికిడి లోపం బాలికలకు టైలరింగ్, హస్తకళలలో శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రతిస్పందిస్తు రాష్ట్రంలో అనేక వస్త్ర పరిశ్రమలు రానున్నాయి. టైలరింగు రంగంలో శిక్షణ పొందిన బాలికలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి, గౌరవప్రదమైన జీవితాలను గడిపేందుకు వీలుగా ఈ పరిశ్రమల్లో వారికి ఉపాధి అవకాశాలను అన్వేషించాలని ఆ సంస్థకు సూచించారు. వారికి అందిస్తున్న వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలతో సహా ఇతర సహాయం గురించి కూడా గవర్నర్ పాల్గొన్న వారితో చర్చించారు. మరింత సహాయం అవసరమని గుర్తించి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల ద్వారా వినికిడి పరికరాల (హియరింగ్ ఎయిడ్స్) పంపిణీని సులభతరం చేయడానికి స్థానిక పరిపాలన వర్గాలను సంప్రదించాలని గవర్నర్ సూచించారు. ఈ సంభాషణ అనంతరం ఆ బృందం సభ్యులు లోక్ భవన్ ప్రాంగణంలోని ఉద్యానవనాలు, అటల్ వన్, డీర్ పార్క్ను సందర్శించారు. పూరీ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను లోక్ భవన్ చేస్తుందని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. -
భూ కబ్జాలో నిందితుల అరెస్టు
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ బలగ బౌండరీలో సర్వే నంబరు 35/1లో ప్లాట్లను ఫేక్ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు యత్నించిన 8 మంది నిందితులను రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. సర్వే నంబరు 35/1లో అంధవరపు గోవిందరాజులు, వారి సోదరులు తాలుకా దాదాపు 20 ఎకరాల లేఅవుట్లో 84, 85, 86 నంబర్లు గల ప్లాట్లలో 900 గజాల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో చేజిక్కించుకోవడానికి చూశారని, ఈ విషయంపై ప్లాట్ల యజమాని కట్టా కనక లింగేశ్వరరావు కుమారుడు కట్టా జయకిషోర్ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేవీ సురేష్ కేసు నమోదు చేశారు. పోలీసులు తమ విచారణలో ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి 8 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అడబాల రజిని, తెలుగు సతీష్కుమార్, సాలిపిల్లి లక్ష్మణరావు, ముద్దాడ ఉపేంద్రకుమార్, జెగురిపాటి ఉపేంద్రరావు, మామిడి గోపాల కృష్ణ, సాంబాన సాంబశివరావు, డాక్యుమెంటరీ రైటర్ కూన పెద్దిరాజులున్నారు. మిగిలిన వారిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. మందస ఘటనపై అవాస్తవాలు నమ్మొద్దు.. మందసలో ఈ నెల 13న జరిగిన ఘటనపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలు నమ్మవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి సీసీఫుటేజీ, కాల్డేటా, కాల్వాయిస్ రికార్డు ఎంఎల్సీ, బాధితుల స్టేట్మెంట్లన్నీ ఆధారాలతో సహా ఉన్నాయన్నారు. కార్యాలయంలో సీసీ ఫుటేజీ రెండు మూడు చోట్ల చూపించినా స్పష్టత లేకపోవడం, కాల్వాయిస్ రికార్డ్ వినిపించకపోవడం వంటి వాటిని విలేకరులు ప్రశ్నించారు. కాశీబుగ్గ సీఐ, ఎస్ఐల సస్పెన్షన్ ఇటీవల కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటన కేసుకు సంబంధించి సీఐ వై.రామకృష్ణతో పాటు ఎస్ఐ సునీల్ను శనివారం అర్ధరాత్రి సస్పెన్షన్ చేసినట్లు విలేకర్లకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ప్రమాదం జరిగిన నాటినుంచి ఎవరెవరు సెటిల్మెంట్లో పాల్గొన్నారు. ఎవరెవరి పాత్ర ఎంతవరకుందన్న దానిపై విచారణ చేస్తున్నామని ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
జయపురం: జయపురం స్వచ్ఛంద సంస్థ జయపురం షోషియల్ ఎడ్యుకేషనల్ ఎన్విరోన్మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం జయపురం సమితి ఘొసడ గ్రామంలో నిర్వహించింది. సీవా కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయక్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మన మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు, సుస్థిరమైన ప్రగతికి చెట్లే ప్రధాన ఆధారమన్నారు. పర్యావరణం కోసం తాము నిరంతరం పని చేస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో 120 రకాల మొక్కలు నాటారు. సీవా సభ్యులు, జయపురం సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొని మొక్కలు నాటారు. -
కూటమి పాలనలో వ్యాపారవర్గాలు డీలా
పోలాకి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో వ్యాపారవర్గాలు ఉసూరుమంటున్నాయని, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర కళింగవైశ్య విభాగం అధ్యక్షుడు పట్నాల శ్రీనివాసరావు (కోణార్క్ శ్రీను) అన్నారు. రాష్ట్రస్థాయి పదవి వచ్చిన సందర్భంగా కోణార్క్ శ్రీను ఆదివారం మబగాంలో ధర్మాన కృష్ణదాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వ్యాపారులు నుంచి పెద్ద వ్యాపారులు వరకు రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేయటంతో పేద, మధ్యతరగతి వర్గాల కొనుగోలు సామర్థ్యం పడిపోయిందన్నారు. కార్పొరేట్ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ధర్మాన సోదరుల ఆశీస్సులతో సక్రమంగా నిర్వహించి, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కళింగవైశ్య విభాగం జిల్లా అధ్యక్షుడు తంగుడు జోగారావు, జిల్లా వాణిజ్య విభా గం అధ్యక్షుడు కోరాడ చంద్రభూషణ గుప్తా, నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు వైశ్యరాజు కేశవరాజు, సంఘ నాయకులు తంగుడు బాబి, పొ ట్నూరు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కఠిన చర్యలు తీసుకోవాలి
జయపురం: రాష్ట్ర అమలా సంఘం మాజీ ప్రధాన కార్యదర్శిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర అమలా సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి శశిభూషణ దాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యాదవ భవనంలో జిల్లా అమలా సంఘం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్ తరాశియపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి ఒడిశా అమలా సంఘం లేటర్ హెడ్పై తప్పుడు సమాచారం అందజేసి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది సమావేశాలకు ఆహ్వానించటం, ఎన్నికల పేరుతో వారిని రహస్యంగా ఎంపిక చేయటం, హోం శాఖ కార్యదర్శికి తప్పుడు సమాచారం అందించటం వంటి కారణాలను పరిగణలోనికి తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొరాపుట్ జిల్లా అమలా సంఘం అధ్యక్షుడు జగన్నాథ్ మఝీ, ఒడిశా అమలా సంఘం సంస్థాగత కార్యదర్శి, రాష్ట్ర కండియ సంఘ కార్యదర్శి కై ళాస సామంతరాయ్, సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. -
గుండిచా యాత్రకు ట్రాఫిక్ సమస్య
పర్లాకిమిడి: రథయాత్రకు సరిహద్దు ప్రాంతాలైన పాతపట్నం, కొరసవాడ, బొంతు, శ్రీకాకుళం, చాపర, పలాస నుంచి పర్లాకిమిడికి రావడంతో మెడికల్ జంక్షన్, రాజవీధి, పాతపట్నం రోడ్డులో ఆదివారం ట్రాఫిక్ సమస్య ఎదురైంది. ట్రాఫిక్లో అంబులెన్సులు కూడా మెడికల్కు చేరుకోలేక పోయాయి. గుండిచా మందిరం వద్ద దర్శనం కోసం కనీసం 20 వేల మంది గుమిగూడారు. క్యూ ఏర్పాటు చేయలేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా అగ్నిమాపక దళం జంక్షన్ వద్ద పోలీసులు బైక్లు రాకుండా చేయడంతో ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఊరిలో ఎటుచూసినా బైక్లు, ఆటోలు పార్కింగ్ లేనందున అనేక మంది రథయాత్రలో గుండిచా మందిరానికి వెళ్లలేక నానా తంటాలు పడ్డారు. శ్రీజగన్నాథుడు వరహా, నృసింహా అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు. -
సోనమ్ వాంగ్చుక్ అరెస్టు అప్రజాస్వామికం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం: నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో పాటు ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని జిల్లా ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ రోడ్డు జంక్షన్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. శాంతియుత నిరసనను అణచివేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జూలై 20న నిర్వహించనున్న ‘ఛలో పార్లమెంట్‘ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, కో–కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బడే కామరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కానుకుర్తి గోవింద, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు రాకోటి రాంబాబు, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఆర్.జి.కోటి, జలుమూరు కొండలరావు, తిరుపతిరావు, అనంతరావు, వదినగిరి, ఎడ్ల జానకిరావు, విదసం రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల గోపి, జన సాహితి, జిల్లా బాధ్యులు పి. మోహన్రావు పాల్గొన్నారు. -
నీటిగుంతలో మహిళ మృతి
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బడిగెట పంచాయతీలో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన మహిళ నీటిగుంతలో మునిగి దురదృష్టావశాత్తు మరణించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం ఇర్మా పడియమి అనే వ్యక్తి తన భార్య ముకే పడియమి(35)తో పొలం పనులకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చాక ముకే పడియామి స్నానం కోసం బావి తరహా నీటిగుంత వద్దకు వెళ్లింది. అక్కడ నీటిలో కాలుజారి పడిపోయి బయటకు రాలేకపోయింది. అయితే ఎంతసేపటికీ భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఇర్మా గ్రామంలో వెదికాడు. అయితే శనివారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని బావిలో గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ప్రభుదత్తు బిశ్వల్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మృతదేహన్ని భర్తకు అప్పగించారు. గంజాయి స్వాఽధీనం రాయగడ: రాయడ నుంచి రైలుమార్గం ద్వారా ఛత్తీస్ఘడ్లోని రాయిపూర్కు గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. రైల్వేస్టేషన్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడు జిల్లాలోని బిసంకటక్ పోలీస్స్టేషన్ పరిధి సికబంధ గ్రామానికి చెందిన ధర్మిత్ భత్రగా గుర్తించారు. అతడిని కోర్టుకు తరలించారు. దాడిలో జీఆర్పీ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ మింజా, ఎస్ఐ సంతోష్ కుమార్ పరిడ, ఏఎస్ఐ మానిక్ చంద్రగౌడో, కానిస్టేబుల్ చిత్తరంజన్ స్వయిన్, రమేష్ కందపాణి తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన సదస్సు పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్ వృషభ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం వివిధ చట్టాలపై న్యాయ అవగాహన సదస్సును జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో సంచలన తీర్పులను చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ పీపీ రాజేష్ కుమార్ మిశ్రా, సైకాలజీ స్పెషలిస్టు ప్రాణరంజన్ నాయక్, సెరంగో పోలీసుస్టేషన్ ఎస్ఐ చౌదురి శివ, సామాజిక కార్యకర్త దయా పలక తదితరులు పాల్గొన్నారు. ఉచితంగానే క్యాన్సర్ చికిత్స భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద 121 కొత్త క్యాన్సర్ చికిత్స ప్యాకేజీలను చేర్చాలని నిర్ణయించింది. దీనితో అర్హులైన లబ్ధిదారులకు ఉచిత చికిత్స పొందే అవకాశం గణనీయంగా విస్తరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను బలోపేతం చేసి రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కొత్తగా ఆమోదించిన ప్యాకేజీల లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ విస్తరించిన కవరేజీలో కీమో థెరపీ, రేడియో థెరపీ, అనేక రకాల సంక్లిష్ట క్యాన్సర్ శస్త్ర చికిత్సలు చేర్చారు. దీనివల్ల బాధితులకు అధిక ఖర్చుల భారం లేకుండా అధునాతన చికిత్సను పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అదనపు చికిత్స ప్యాకేజీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోగులు చికిత్సను అర్ధాంతరంగా ఆపకుండా చూస్తామని మంత్రి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఏ రోగికి కూడా సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందకుండా పోకూడదనే ప్రభుత్వ నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమన్నారు. విస్తరించిన కవరేజీ కింద ఆయుష్మాన్ భారత్ కార్డుదారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ఎంప్యానెల్డ్ ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో కూడా కొత్త క్యాన్సర్ చికిత్స ప్యాకేజీలను పొందగలుగుతారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
మల్కన్గిరి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని వక్తలు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ అధ్యక్షతన బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లాస్థాయి ప్రత్యేక అమలు శిక్షణా కార్యక్రమం, సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన జిల్లా యాక్షన్ ప్లాన్ 2026–2029 పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్, ముఖ్య అభివృద్ధి శాఖ అధికారి దాశరథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోదన్ బోయి, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి సుచితా పండా, యూనిసెఫ్ వనరుల వ్యక్తి ఘాసిరామ్ పండా, జిల్లా ఆస్పత్రి వైద్యుడు రణసింగ్, జిల్లా శిశు సంరక్షణ అధికారి నారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
● విద్యాశాఖ మంత్రి నిత్యానంద రాజీనామా డిమాండ్
కొరాపుట్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేడీ భారీ ఆందోళన చేపట్టింది. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి తరలివచ్చిన బీజేడీ పార్టీ విద్యార్థి, యువజన, మహిళ విభాగాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. కలక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్సితా సాహు మాట్లాడుతూ విద్యామంత్రిని దుయ్యబట్టారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు. విద్యామంత్రి సుమారు 40 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం మెహన్ చరణ్ మజ్జి, నిత్యానంద గొండొ చిత్రపటాలకు ఎండు చేపలు బహుకరించారు. నెయ్యి వేసి దగ్ధం చేశారు. ఆందోళనలో మాజీ మంత్రి రబినారాయణ నందో, కేసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహి, కొరాపుట్ జెడ్పీ చైర్పర్సన్ సస్మితా మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, అరుణ్ కుమార్ మిశ్ర, ఈశ్వర్ అల్లాడ, లలెటెందు విద్యాదర్ శెఠి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. -
పంచాయతీ పోరుకు సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) ఎన్నికలకు ఒడిశా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు ప్రారంభించిందని ఎస్ఈసీ కార్యదర్శి సంతోష్ కుమార్ దాస్ శనివారం తెలిపారు. జాతీయ జనాభా గణన ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జనగణన పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కమిషన్ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి నెలలో అధికారిక ప్రకటన జారీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో చైర్పర్సన్ పదవుల కోసం ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను ప్రచురించిన అనంతరం ఎస్ఈసీ ప్రాథమిక పనులను ప్రారంభిస్తుంది. రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసిన తర్వాత కమిషన్ తదుపరి ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను చేపడుతుంది. రిజర్వేషన్ల ముసాయిదా జాబితా ప్రచురణ రాష్ట్రంలో 35 పట్టణ పాలక సంఘాల అధ్యక్షుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా ఉత్తర్వును జారీ చేసింది. సాధారణ ప్రజలు 15 రోజుల్లోపు తమ అభ్యంతరాలు, సూచనలు ఇవ్వవచ్చని ప్రకటించారు. ఈ సూచనలను మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అక్టోబర్లో ప్రారంభం కానుండగా, ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో జారీ అయ్యే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఏప్రిల్–మే నెలల్లో ఏకకాలంలో నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది. ప్రస్తుతం ఎస్ఈసీ వద్ద మున్సిపల్ ఎన్నికల కోసం సుమారు 12,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) ఉన్నాయి. అదనంగా 6,000 మెషీన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేసిన తర్వాత ఇంటింటి సర్వే కూడా నిర్వహించబడుతుంది. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీ)లో సులభమైన మరియు అవాంతరాలు లేని ఓటింగ్ను నిర్ధారించడానికి ప్రతి వార్డులో ఒక పోలింగ్ బూత్ ఉంటుందని పేర్కొన్నారు. -
● చెక్ బౌన్స్ కేసుల పరిస్కారం
జయపురం: నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీల ఆదేశాల మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో జిల్లా న్యాయస్థానం జయపురం ప్రాంగణంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో చెక్ బౌన్స్ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. మొత్తం 16 కేసుల్లో 10 కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి, అదాలత్ శాశ్వత విచారపతి ప్రద్యుమయి సుజాత, ప్రథమ శ్రేణి జడ్జి హరమోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
బాలల అక్రమ రవాణా అరికట్టాలి
పర్లాకిమిడి: బాలల అక్రమ రవాణా అరికట్టాలని వక్తలు అన్నారు. గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ జిరంగో గ్రామంలో బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జన సచేతన కార్యక్రమం జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సమావేశానికి చైల్డ్లైన్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ లక్ష్మీదేవి, పంచాయతీ సర్పంచ్ రిసపా భుయ్యాన్, పంచాయతీ ఈవో రసపాత్రో, వార్డు మెంబర్లు హాజరయ్యారు. ఇటీవల జిరంగో పంచాయతీలో కొంతమంది బాలలను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా వెట్టి చాకిరీ కోసం రవాణా చేస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు బాలలను పనికి పంపుకుండా బడికి పంపాలని డీసీపీవో అరుణ్ త్రిపాఠి సూచించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సత్యబాన్ సాహు తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన మల్కన్గిరి యువకుడు
మల్కన్గిరి: జిల్లా కేంద్రానికి చెందిన సౌభాగ్య సుందర్ నాయక్ నీట్ పరీక్షలో సత్తాచాటాడు. 720 మార్కులకు గానూ 671 మార్కులు సాధించాడు. అలాగే ఎంవీ 37 గ్రామానికి చెందిన బిప్లబ్ ఠాకూర్ 720 మార్కులకు గానూ 621 మార్కులు సాధించాడు. దీంతో వీరిని పలువురు అభినందించారు.రైలు మార్గానికి భూములు అప్పగింత జయపురం: జయపురం – నవరంగపూర్ నూతన రైలు మార్గం కోసం ఎంపిక చేసి సేకరించిన భూములను రైల్వే అధికారులకు అప్పగించే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. బొరిగుమ్మ తహసీల్ ఆధీనంలోని బొరగాం, అవుళి మౌజాల్లో 30.410 ఎకరాల భూమిని రైల్వే అధికారులకు అప్పగించారు. భూమిని అప్పగించిన 34 మంది రైతులకు పరిహారం పంపిణీ చేసినట్లు తహసీల్దార్ బెహర వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్ ఉద్యోగులు సంజీవ్ టక్రి, అవులి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సబితా నాయిక్, బాలాజీ సంగ్, రైల్వే అశికారి సాయి రామకృష్ణ, జూనియర్ ఇంజినీర్ గోవింద బారిక్ తదితరులు పాల్గొన్నారు. -
అడపా మండపానికి జగన్నాథుడు
భువనేశ్వర్: జగన్నాథుని రథయాత్ర కీలక దశ శనివారం ఆరంభమైంది. స్వామివారు గుండిచా మందిరం అడప మండపంపై కొలువుదీరడం యాత్ర ప్రధాన ఆకర్షణ. ఈ మండపంపై శ్రీమందిరం రత్న వేదికపై నిత్యం అందుకునే సేవాదులు, అలంకరణలతో స్వామివారు భక్త జనులకు దర్శనం ప్రసాదిస్తాడు. అడప మండపంపై స్వామి దర్శనం పూర్వ జన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. రథాలపై వేంచేసిన మూల విరాటులు గుండిచా మందిరం ఆవరణ శారదా బాలి ప్రాంగణంలో ఆరుబయట గత 3 రోజులుగా రాత్రింబవళ్లు సర్వ జనులకు కనులనిండా దర్శనం కల్పించారు. శనివారం సాయంత్రం రథాల పైనుంచి దిగి అడప మండపానికి చేరారు. రథాలకు అమర్చిన కొయ్య గుర్రాల్ని తొలగించి, రథాలకు చారుమళ్లు అమర్చి మూల విరాటులను సురక్షితంగా కిందకు దించారు. మందిరంలోకి ప్రవేశింపజేసే పొహండి బృహత్తర ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. -
పర్లాకిమిడి రైల్వే స్టేషన్ ప్రారంభం
పర్లాకిమిడి: అమృత్భారత్ స్టేషన్ల యోజన పథకం కింద రాష్ట్రంలో పునరాభివృద్ధి పనులు పూర్తిచేసుకున్న ఏడు రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవాలు శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి. వాటిలో పర్లాకిమిడిలో పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లో జలంధర్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ వర్చువల్ కార్యక్రమాన్ని పర్లాకిమిడి రైల్వే స్టేషన్లో రాయగడ రైల్వే డివిజన్ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ ఏర్పాటుచేసి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా తదితరులు పాల్గొన్నారు. తొలుత కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రారంభగీతం పాడారు, అనంతరం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సంబల్పురి నాట్యం, రాయగడ చిన్నారుల కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే రూపేష్ శ్రీజగన్నాథునికి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయగడ రైల్వే డివిజన్ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ మాట్లాడుతూ, పర్లాకిమిడి మహారాజా గౌరచంద్ర గజపతి 1900 సంవత్సరంలో ఏడు లక్షలతో పర్లాకిమిడి రైల్వే స్టేషన్ను నిర్మించి ప్రారంభించగా, తదనంతరం ఆయన కుమారుడు కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ 1929–31లో నౌపడకు పొడిగించారని.. ప్రస్తుతం ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయలతో రైల్వే స్టేషన్ నిర్మించామన్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ, పర్లాకిమిడి నుండి విశాఖపట్నం, హైదరాబాద్, భువనేశ్వర్, కోల్కతాకు నూతన ట్రైన్లు వేయాలని, అలాగే పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్రగజపతి దేవ్ ప్రతిమూర్తిని స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ, కట్రా, పంజాబ్కు క్రొత్త రైలుబండితో పాటు, దేశంలో 75 పునర్మించిన రైల్వే స్టేషన్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కార్యక్రమం అనంతరం అమృత్ భారత్ స్టేషన్లనపై రాయగడ డివిజన్ నిర్వహించిన వివిధ సెల్ఫీ ఫొటోలు, రచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. -
బాలుడు అనుమానాస్పద మృతి
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరం వద్ద రఽథయాత్ర సందర్భంగా మీనా బజార్ను ఏర్పాటుచేశారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో రంగులరాట్నం నుంచి ఒక బాలుడు కిందకు దిగి వచ్చినప్పుడు అక్కడ విద్యుత్ తీగలు తగిలి అస్వస్థతకు గురై అచేతనంగా పడిపోయాడు. వెంటనే జిల్లా ప్రధాన ఆస్పత్రికి బాలుడిని తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన బాలుడు స్థానిక 15వార్డులో మహిళా కళాశాల సమీపంలో ఆటో నడుపుతున్న మోహన్ బెహరా కుమారుడు వినోద్ బెహరా (17)గా పోలీసులు గుర్తించారు. రాత్రి అయినందున ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగలేదు. అయితే మృతిచెందిన బాలుడు వినోద్ బెహరా హార్టు సమస్యలో మృతిచెందాడని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా, లేదు తమ కొడుకు రంగులరాట్నం వద్ద విద్యుత్ఘాతంలో మరణించాడని తండ్రి మోహన్ బెహరా చెబుతున్నాడు. వచ్చేనెల తమ కుమారుడు పాలిటెక్నిక్లో డిప్లమా కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉందని తండ్రి విలేకరుల వద్ద విలపించాడు. అయితే గురువారం పొద్దుపోయిన తర్వాత ఆస్పత్రి నిబంధనల మేరకు పోస్టుమార్టం జరగలేదు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ జిల్లాకేంద్రం ఆస్పత్రి వద్ద మృతుడు వినోద్ బంధువులు, తల్లిదండ్రులు, వీఽధిజనం విచ్చేసి తమకు నష్టపరిహారం అందేవరకూ పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని ఆస్పత్రి, పోలీసులతో ఘర్షణ పడ్డారు. దీంతో మధ్యాహ్నం వరకూ పోస్టుమార్టం జరగలేదు. అనంతరం జిల్లా కలెక్టర్ వద్ద ఆటోమోహాన్ బెహారా మృతుని వివరాలు, ఆధార్ కార్డు అందజేశారు. అనంతరం పోస్టుమార్టం జరిపి శవాన్ని వారి బంధువులకు అందజేశారు. -
మత్స్య అవతారంలో జగన్నాథుడి దర్శనం
రాయగడ: రథయాత్రలో భాగంగా స్థానిక గోపబంధు మార్గ్ వద్ద గల గుండిచా మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రదేవతా మూర్తులు కొలువయ్యారు. స్వామివారు శుక్రవారం మత్స్య అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కళకళలాడగా, భజనలు, హరినామ సంక్తీరణలతో ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంది. స్వామి వారి మత్స్యరూప దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలగించిందని భక్తులు తెలిపారు. కొరాపుట్ జిల్లా బీజేపీ మహిళా మోర్చ కార్యదర్శిగా భవానీరెడ్డి జయపురం: కొరాపుట్ జిల్లా బీజేపీ మహిళా మోర్చ కార్యదర్శిగా కె.భవానీరెడ్డి నియమితులయ్యారు. దీంతో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె నియామకంపై కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా భవానీరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 17 శాతం అధిక వర్షపాతం ● పొంగి ప్రవహిస్తున్న నదులు భువనేశ్వర్: ఈ ఏడాది జూలై ఒకటి నుండి 17వ తేదీ వరకు రాష్ట్రంలో 17 శాతం అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నత ఇంజినీర్ దిలీప్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. బొలంగిర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరద పరిస్థితి ఏర్పడిందన్నారు. సపువా నదిలో వరద మధుసూదప ట్న, కకుడియా గ్రామాలను ముంచెత్తింది. నదిలో నీటి మట్టం పెరిగితే ఢెంకనాల్, అఠొగొడొపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. శనివారం నాటికి హీరాకుడ్ జలాశయంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జలకా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. బాలాసోర్ జిల్లా బొస్తా మండలం మథానిలో ప్రమాద స్థాయి 6.50 మీటర్లు కాగా ప్రస్తుతం అక్కడ 6.52 మీటర్లకు పైగా నీరు ప్రవహిస్తోంది. నేడు అడప మండపం ప్రవేశం భువనేశ్వర్: శ్రీ మందిరం నుంచి యాత్రగా తరలి వచ్చిన దేవతా మూర్తులు శని వారం శ్రీ గుండిచా మందిరం అడప మండపంపై ఆశీనులు కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదాబాలి ప్రాంగణానికి చేరుకున్న దేవతలు రథాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకమార్గ దర్శన విధానంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ గుండిచా మందిరం పరిసరాల్లో ఏర్పాట్లు ఆయన శుక్ర వారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రథాలపై కొలువై ఉన్న దేవుళ్లు ఏక మార్గంలో వరుస క్రమంలో సునాయాసంగా దర్శించుకుని సంతృప్తి చెందే దిశలో సన్నాహాలు చేసినట్లు వివరించారు. శనివారం సాయంత్రం రథాలపై కొలువై ఉన్న చతుర్థా మూర్తులను అడప మండపానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది శారదాబాలి ప్రాంగణంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం ముందు జాగ్రత్తలతో ఆచితూచి అడుగు వేస్తుందన్నారు. భక్తులకు క్రమబద్ధమైన దర్శనం కల్పించడంలో పూరీ జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. -
తహసీల్దార్ దురుసు ప్రవర్తన
● న్యాయవాదుల సంఘం ఆగ్రహంరాయగడ: రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయ్ వ్యవహార శైలిపై రాయగడ బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్ను కలిసేందుకు వెళ్లిన ఒక న్యాయవాదితో ఆమె దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్కు బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రజ సుందర్ నాయక్ నేతృత్వంలో న్యాయవాదులు అదనపు కలెక్టర్ను కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. వినతిపత్రం స్వీకరించిన నవీన్ నాయక్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు బ్రజ సుందర్ నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన న్యాయవాది టి.నాగరాజు ఒక కేసుకు సంబంధించిన అంశంపై తహసీల్దార్ను కలిసేందుకు ఆమె కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. అయితే తహసీల్దార్ ఆయనతో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటనను బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయవాదుల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది నాగరాజు మాట్లాడుతూ కోర్టు వ్యవహారాలకు సంబంఽధించిన సమాచారం కోసం సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడం న్యాయవాదుల విధుల్లో భాగమని చెప్పారు. అలాంటి సందర్భంలో తహసీల్దార్ తన చాంబర్ నుంచి బయటకు వెళ్లాలని, లేకపొతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం బాధకరమని పేర్కొన్నారు. తనతో పాటు వచ్చిన క్లయింట్ సమక్షంలో తహసీల్దార్ అనుచితంగా ప్రవర్తించడం విచారకరమని, ఇటువంటి ఘటనలపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
స్ట్రీట్లైట్ల కొనుగోలులో అవినీతిపై దర్యాప్తునకు డిమాండ్
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర, కొట్పాడ్, బొయిపరిగుడ సమితుల్లో బిజూ కేబీకే పథకంలో స్ట్రీట్ లైట్ల కొనుగోలు వ్యవహారంలో అనేక ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని కొరాపుట్ జిల్లా యువ సంఘటన ఆరోపించింది. కొరాపుట్ జిల్లా యువ సంఘటన జిల్లా ఆర్గనైజర్ రవీంధ్ర కుమార్ మహాపాత్రో నేతృత్వంలో యువసంఘటన కార్యకర్తలు కొరాపుట్ రీజనల్ విజిలెన్స్ విభాగం జయపురం ఎస్పీని కలిసి సమితుల్లో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో బిజూ కేబికె యోజనలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు లక్షలాది రూపాయలు బిల్లు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే అనేక చోట్ల లైట్లే లేవని పలు చోట్ల లైట్లు వెలగటం లేదని ఆరోపించారు. కుంద్రా సమితిలో 368 స్ట్రీట్ లైట్లు కోసం రూ.74.36 లక్షలు, ఎమ్మెల్యే నిధి నుంచి 284 స్ట్రీట్ లైట్ల కోసం రూ.57.04 లక్షలు ఖర్చు చేశారని, కానీ నేడు వాటిలో సగం కూడా లైట్లు లేవని ఆరోపించారు. అలాగే కొట్పాడ్ సమితిలో 25 గ్రామ పంచాయతీల్లో 425 స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కోసం రూ.89.25 లక్షలు మంజూరు చేయగా, బొయిపరిగుడ సమితిలో 304 స్ట్రీట్ లైట్లు నెలకొల్పేందుకు రూ.63.74 లక్షలు మంజూరు కాగా వాస్తవంగా అనేక చోట్ల లైట్లు ఏర్పాటు కానరాలేదని మెమొరాండంలో ఆరోపించారు. అలాగే బొరిగుమ్మ సమితిలో ప్రతి స్ట్రీట్ లైట్ రూ.8 వేలు చొప్పన ఖరీదు చేయగా కుంధ్ర, కొట్పాడ్, బొయిపరిగుడ సమితుల్లో రూ.21 వేలు చొప్పున ఖరీదు చేశారని ఆరోపిస్తూ అంత ఎక్కువ పైకానికి ఎలా ఖరీదు చేశారని ప్రశ్నించారు. నియమం ప్రకారం టెండర్లు పిలిచి ఖరీదు చేయాలని, అయితే టెండర్లు పిలవ కుండా ఎలా ఖరీదు చేశారని ప్రశ్నించారు. -
బీజేపీలోకి గుణుపూర్ మున్సిపల్ చైర్మన్
● వైస్ చైర్మన్ కూడా..రాయగడ: జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుణుపూర్ మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ సన్నో గౌడోలు తమ మద్దతుదారులతో కలిసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఇది జిల్లాలో రాజకీయ సమీకరణాలను మార్చే పరిణామంగా మారింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సమక్షంలో వారు కాషాయం కండువ కప్పుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన మమత గౌడో, సన్నో గౌడోలు ప్రజల మద్దతుతో విజయం సాధించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లుగా పదవులను చేపట్టారు. ఇప్పుడు అధికారిక బీజేపీలో చేరడంతో గుణుపూర్ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం మరింత పెరగనున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని గుణుపూర్, రాయగడ, బిసంకటక్ శాసనసభ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ చేరిక కీలక మైలురాయిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భామిస్తున్నారు. స్థానికంగా బలమైన నాయకత్వం కలిగిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడం వల్ల పార్టీ గ్రామీణ, పట్టణ స్థాయిలో సంస్థాగత బలాన్ని మరింత పెంచుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ చేపడుతున్న విస్తరణ వ్యూహానికి గుణుపూర్ నుంచి ఊపిరి లభించనట్లేనని, ఈ పరిణామం జిల్లాలోని రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ వర్గాల్లొ చర్చ సాగుతుంది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలొ జరిగిన చేరికల్లో మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్లతోపాటు పది మంది వార్డు కౌన్సిలర్లు, సమితి చైర్మన్, సమితి సభ్యులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చేరికల సమయంలో రాయగడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపిఆనంద్, శివశంకర్ ఉలక ఉన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితికి సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నలుపు రంగు టీ–షర్ట్ ధరించిన వ్యక్తి రక్తపు మడుగులో రహదారి పక్కన పడి ఉండడంతో స్థానికులు వెంటనే కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడి వైద్యుడు అభిషేక్ సాహు వైద్య పరీక్షలు నిర్వహించి సదరు వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. వెంటనే మల్కన్గిరి ఆదర్శ పోలీసుస్టేషన్ ఐఐసీ రీగాన్ కీండోకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్వయంగా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం లభ్యమైన చోట ఒక ఎరుపు రంగు కారు ఉంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఈ యువకుడు ఎక్కడినుంచి వచ్చాడో ఎటువంటి వివరాలు లేవు. మృతదేహాన్ని మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ పోలీసులు నీటిపంపు చోరీ కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ సమితి తుముసాపల్లి పంచాయతీ ఎంవీ 12 గ్రామానికి చెందిన నారాయణ్ గైన్ అనే వ్యక్తి తన ఇంటికి తాళంవేసి పనిమీద మత్తిలికి వెళ్లారు. దీంతో ఈనెల 11వ తేదీన అదే గ్రామానికి చెందిన అవినాష్ సర్కార్ అనే వ్యక్తి ఇంటి తాళం పగలుగొట్టి ఇంట్లో నీటిపంపును దొంగలించాడు. 12వ తేదీన వచ్చిన నారాయణ్ తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి కోరుకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఎస్ఐ నీలాంచల్ శరబ్ కేసు నమోద్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని నాలుగు రోజుల్లో అరెస్టు చేశారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. -
పవిత్ర రథాలు
గుండిచా ఆవరణకు● నేడు అడప మండప విజేభువనేశ్వర్: రాత్రి విరామం తర్వాత శ్రీ జగన్నాథుని రెండో రోజు వార్షిక రథ యాత్ర తిరిగి శుక్ర వారం ప్రారంభమైంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలు గుండిచా ఆలయం ముందున్న శారదా బాలికి సురక్షితంగా చేరుకున్నాయి. ఉదయం వేలాది మంది పోలీసు సిబ్బంది, లక్షలాది మంది భక్తులు చేతులు కలిపి బొడొ దండొ వెంబడి 3 భారీ చెక్క రథాలను లాగడంతో రథ యాత్ర తిరిగి ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి ఊరేగింపు మిగిలిన మార్గాన్ని పూర్తి చేస్తుండగా పుణ్యక్షేత్ర పట్టణం జై జగన్నాథ్ భక్తి నినాదంతో ప్రతిధ్వనించింది. ఉత్సవ పొహండి ఊరేగింపులో జాప్యం కారణంగా గురువారం యాత్ర అసంపూర్తిగా మిగిలిపోయింది. ఫలితంగా సూర్యాస్తమయం సమయానికి ముందుగా ఏ ఒక్క రథం తమ గమ్య స్థానం చేరుకోలేకపోయింది. దీంతో అధికారులు ఆ రోజు ఊరేగింపును నిలిపి వేశారు. దేవతా మూర్తులు రాత్రంతా తమ తమ రథాలపైనే కొలువై ఉన్నారు. మొదటి రోజు ఊరేగింపు ముగిసే సరికి బలభద్రుని తాల ధ్వజ రథం దాదాపు 700 మీటర్లు ప్రయాణించి మార్కెట్ చౌరస్తాకు చేరుకోగా, సుభద్ర దేవి దర్ప దళన్ రథం సుమారు 400 మీటర్లు ప్రయాణించి మారీచికోట్ ఛక్ వద్ద ఆగిపోయింది. జగన్నాథుని నందిఘోష రథం శ్రీ జగన్నాథ ఆలయ సింహ ద్వారం నుంచి కొద్ది దూరం మాత్రమే కదలగా ఊరేగింపును నిలిపివేశారు. శుక్రవారం ఉదయం యాత్ర పునః ప్రారంభం కావడంతో మిగిలిన దూరాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేసి మూడు రథాలను గుండిచా ఆలయం ముందున్న శారదా బాలి వద్ద నిలిపారు. శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి మాట్లాడుతూ చతుర్థా మూర్తులు శుక్రవారం రాత్రి తమ రథాలపైనే గడుపుతారని తెలిపారు. గుండిచా ఆలయంలోకి అడపా మండప విజేగా ప్రసిద్ధి చెందిన ఉత్సవ ప్రవేశ ఊరేగింపు జూలై 18 శనివారం నాడు జరగనుంది. బహుడా యాత్ర సమయంలో శ్రీ జగన్నాథ ఆలయానికి తిరిగి వచ్చే ముందు చతుర్థా మూర్తులు కొన్ని రోజులపాటు గుండిచా ఆలయంలోనే కొలువుదీరుతారు. -
●రూ.500 ఇచ్చాం
ఉపాధి హామీ పథకం పనికి వెళ్లనివ్వకుండా రోడ్డు పనులకు వస్తే రూ.600 ఇస్తామని మా గ్రామానికి చెందిన సవధల సుధ ఆశ చూపడంతో అక్కడికి వెళ్లాను. నా అకౌంట్లో డబ్బులు పడ్డాక రూ.500 తీసుకుంది. – కొండపల్లి పెంటమ్మ, మోపసుబందరు మూడు రోజులు క్రితం నా అకౌంట్లో రూ.600 పడ్డా యి. మా గ్రామానికి చెంది న సుధ వచ్చి దౌర్జన్యంగా డబ్బులు లాగేసుకుంది. ఇదేంటని ప్రశ్నిస్తే రూ.100 మాత్రమే చేతిలో పెట్టింది. – ఎం.గంగమ్మ, మోపసుబందరు రోడ్డు పనుల్లో ఫొటో దిగకపోతే ఉపాధి పనుల్లో మస్తర్లలో పేరు తొలగిస్తానని బెదిరించింది. మేము చెప్పినట్లుగానే ఉపాధి పనులు జరుగుతాయని, తమను ఎవరూ అడిగేవారు లేరని చెప్పింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. – కె.శిమ్మన్న, మోపసుబందరు -
పక్కా పథకంతో.. డబ్బులు నొక్కేశారు!
● ఉపాధి కూలీలకు వచ్చిన నిధులను కాజేసిన కూటమి నేతలు ● ఒక్కో వేతనదారు నుంచి రూ.500 చొప్పున స్వాహా శ్రీకాకుళం రూరల్ : ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి వేతనదారులకు కమిషన్ రూపంలో వచ్చిన సొమ్మును కూటమి నేతలు మింగేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కల్లేపల్లి పంచాయతీ జాలారీపేట, మోపసుబందరు గ్రామాలకు మూడు నెలల కిందట రోడ్డు మంజూరైంది. మోపసుబందరు రామాలయం నుంచి శ్మశానవాటిక వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షలతో ఈ రోడ్డు వేశారు. ఇదే గ్రామానికి కొందరు కూటమి నాయకులు ఈ పనులను దక్కించుకున్నారు. ఆ సమయంలో సుమారు 275 మంది ఉపాధి వేతనదారులను తీసుకెళ్లి రోడ్డు పనులు జరుగుతున్న చోట వారితో ఫోటోలు తీయించారు. వాస్తవానికి వేజ్ కాంప్రూట్ (కూలీలు ఏర్పాటుకు)కు పది శాతం వేతనదారులకు ఇవ్వాలి. అంటే రూ.10 లక్షల్లో లక్ష రూపాయలు వేతనదారులకు అందించాల్సి ఉంది. ఆ సొమ్ములు కాజేసేందుకు కూటమి నాయకులు పక్కా ప్లాన్ వేసి ఓ మహిళా నాయకురాలిని రంగంలోకి దించారు. ఆమె ద్వారా వేతనదారుల అకౌంట్ల లో పడిన డబ్బులను దౌర్జన్యంగా లాగేసుకున్నారు. ఒక్కో వేతనదారుకు రూ.600 చొప్పున పడగా ఏకంగా రూ.500 చొప్పున లాగేసుకున్నారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం సదరు మహిళను నిలదీయగా వారినే తిరిగి తిట్టడం గమనార్హం. నాకు తెలియదు.. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి లక్ష్మి వద్ద ప్రస్తావించగా పనులు జరిగిన వాస్తవమేనన్నారు. కూలీలకు వచ్చిన వేతనాలు పక్కదారి పట్టిన విషయం తనకు తెలియదన్నారు. -
బ్రౌన్ షుగర్తో ఇద్దరు అరెస్టు
జయపురం: జయపురంలో మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ పోలీసులు జయపురం మున్సిపాలిటీ పరిధి జయనగర్ భూతనాథ్ మందిర ప్రాంతంలో బ్రౌన్ షుగర్ పొట్లాలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో రామ ఛత్రియ, లలన్ కుమార్ సామంతరాయ్లు ఉన్నట్లు వెల్లడించారు. వారి నుంచి 5.140 మిల్లీ గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి 9.45 గంటల సమయంలో ఏఎస్ఐ గోవింద హసద పోలీసులతో పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు భూత మందిరం వద్ద బ్రౌన్ షుగర్ అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టారు. ఆ సమయంలో ఒక స్కూటీ వద్ద నిల్చున్న ఇద్దరు వ్యక్తులను చూసి వారిని విచారించారు. వారిని శోధించగా ఒక కాగితంలో బ్రౌన్ షుగర్ కనుగున్నారు. స్కూటీతో వచ్చి అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. వారి నుంచి రూ.800ల నగదు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు
జయపురం: ఒక దుకాణం తాళాలు బద్దలుగొట్టి దొంగతనం చేసిన వ్యక్తిని జయపురం పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు జయపురం సమితి ఛొటాగుడ ప్రాంతానికి చెందిన కె.రబిరావుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూన్ 20వ తేదీన గొడియమాలిగుడ వీధిలో అజిత్ కుమార్ సామంతరాయ్ దుకాణం తాళాలు పగులగొట్టి డబ్బుతో పాటు సామగ్రి దొంగిలించుకుపోయాడని వెల్లడించారు. దీంతో పట్టణ పోలీసుస్టేషన్లో బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ సాయంతో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ కేపీసీహెచ్ మిశ్ర దర్యాప్తు జరిపి నిందితుడిని గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి దొంగిలించిన సామగ్రిని సీజ్ చేశారు. కాగా పోలీసుల విచారణలో అతడు గతంలో పోస్టాఫీసు ఎదురుగా ఉన్న ప్రభుత్వ క్వార్టర్లో కూడా దొంగతనం చేసినట్లు నిర్ధారించారు. -
పాలిథిన్ కట్టడికి చర్యలు
జయపురం: పట్టణాన్ని పాలిథిన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పట్టణంలోని పలు దుకాణాలపై మున్సిపల్ సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పూజరౌత్, రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు విభాగాలు సంయుక్తంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా దాదాపు 2 క్వింటాళ్లకు పైగా పాలిథిన్ కవర్లు సీజ్ చేసి, జరిమానా విధించినట్లు వెల్లడించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో మున్సిపల్ సిబ్బంది సత్యనారాయణ పాత్రో, భవానీ హల్వ, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల వద్దకే భగవంతుడు
● రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రథయాత్రమల్కన్గిరి: జిల్లా కేంద్రంలో గురువారం జగన్నాథ స్వామి రథయాత్రను కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజాశిర్కే చేతులమీదుగా సాంప్రదాయ పూజ అనంతరం ప్రారంభించారు. ముందుగా సాయంత్రం 4 గంటల సమయంలో రథంపై కలెక్టర్ ప్రథమేశ్ చేత ప్రత్యేక పూజలు, చెరా పహార నిర్వహించి యాత్రకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొరాపుట్లో... కుంభవృష్టి వర్షం మధ్య కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో రథయాత్ర జరిగింది. ఉదయం నుంచి భారీవర్షం పడుతున్నప్పటికీ ప్రజలు రథాలను జగన్నాథ మందిరం నుంచి గుండిచా మందిరాల వరకు తోడ్కొని వెళ్లారు. దక్షిణ ఒడిశా పూరీక్షేత్రంగా పేరుగాంచిన కొరాపుట్ శబరి శ్రీక్షేత్రంలో జగన్నాథ, సుభద్ర, బలభద్ర రథాలు లక్ష్యం చేరుకున్నాయి. రాయగడలో... రథయాత్ర వేడుకలు రాయగడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జగన్నాథ మందిరం నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి పొహోండి ద్వారా రథంపైకి సేవకులు, భక్తులు ఎక్కించారు. అనంతరం 4 గంటలకు రథాన్ని లాగే కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయ్ల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక దంపతులు, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, ఎస్డీసీ వైస్ చైర్పర్సన్ మంజుల మినియాక తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో... పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా తొలుత బలభద్రుడిని మందిరం నుంచి బయటకు తీసుకొచ్చి పొహోండి జరిపారు. అనంతరం సుభద్ర దేవి, చివరగా జగన్నాథుని పొహోండి జరిపి రథాలపై ఎక్కించారు. సేవాయత్లు, పండితుల శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ, పూజలు అనంతరం గజపతి వంశీయుల యువరాణి కల్యాణీ దేవి గజపతి విచ్చేసి జగన్నాథ స్వామి రథంపై పూజలు జరిపి బంగారు చీపురుతో శుభ్రం చేశారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవుళ్లను రథాలపై ఎక్కించడానికి సహాయపడ్డారు. సాయంత్రం మూడు రథాలను గుండిచా మందిరం వైపు భక్తులు లాగారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జయపురంలో రథయాత్ర నేడు జయపురం: పట్టణంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం జరుగుతుంది. గురువారం జగన్నాథ మందిరం నుంచి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను భక్తిశ్రద్ధలతో రఘునాథ్ మందిర కూడలి వద్దనున్న నూతన రథం వరకు సేవాయత్లు తోడ్కొని వచ్చి రథంపై ఆసీనులను చేశారు. మార్గమధ్యలో ప్రజలు దేవతామూర్తులకు ఫలపుష్పాలు, భోగాలతో పూజలు చేశారు. దేవతామూర్తులను రథంపైకి తీసుకెళ్తున్న సమయంలో వేలాది మంది భక్తులు కనుల పండువగా తిలకించారు. గురువారం రాత్రంతా భక్తులు పూజలు చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం రథాలను గుండిచా మందిరం వరకు తీసుకెళ్తారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కాగా గురువారం జయపురం పూర్ణఘడ్లో రథయాత్ర జరిగింది. రథయాత్ర శుభాకాంక్షలు భువనేశ్వర్: పవిత్ర రథయాత్ర రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారతదేశపు శాశ్వతమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రకాశవంతమైన వ్యక్తీకరణగా అభివర్ణించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, విపక్ష నేత నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు. -
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
జయపురం: అయోధ్య రామ మందిరంలో విరాళాలు చోరీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ భవనంలో కాంగ్రెస్ నాయకులు గురువారం మాట్లాడుతూ.. విరాళాల చోరీపై తక్షణమే ప్రధానమంత్రి లేదా ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, రాష్ట్ర విధాన సభలో విపక్ష నేత పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడమ్, మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ సర్కార్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు జయపురం: స్థానిక క్రిస్టియన్పేట 26వ జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఒక వ్యాన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తులను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటల సమయం 26వ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రమాద సమాచారం అందిన పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ నుంచి అతివేగంగా వస్తున్న వ్యాన్ రోడ్డుపక్కన నిలిపి ఉన్న బైక్లను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్న సీజ్చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో కర్రతో దాడి.. వ్యక్తి మృతి కుత్బుల్లాపూర్: తాగిన మైకంలో గొడవ పడి తలపై కర్రతో కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరి నరసింహులు గత 6 నెలలుగా కొంపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కింద ఉంటూ అడ్డా కూలీగా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు కన్నా అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒకే చోట నిద్రపోతూ.. ఉద యం కూలి పనులకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. నరసింహులు తలపై, కాళ్ల పైన కర్రతో కన్నా కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతడు కింద పడిపోయాడు. అతని పక్కనే తాగిన మైకంలో ఉన్న కన్నా సైతం నిద్రపోయి తెల్లవారుజామున పరారయ్యాడని పోలీ సులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన నరసింహులు అని తేలింది. -
సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్గా శ్రీనివాసరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పి.శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈయన కోనసీమ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా మేనేజర్గా పనిచేసిన వేణుగోపాల్ను మాతృభాషకు పంపించారు. ‘కేజీబీవీల్లో ఖాళీలు భర్తీ చేయాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి బోధనా సిబ్బంది నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఖాళీలను భర్తీ చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల చదువు తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నోటిఫికేషన్ ప్రకారం కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నీలకంఠేశ్వర ఆలయంలో హుండీ చోరీ పాతపట్నం: పాతపట్నం మహేంద్రతనయ నదీ తీరాన ఉన్న శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. దుండగులు ఆలయం ప్రహరీ దూకి లోపలకు వచ్చారు. ఆలయం గర్భగుడి నుంచి బయటకు వచ్చే దారిలోని సేఫ్టీ గిల్స్కు ఉన్న రెండు తాళాలు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురు వచ్చినట్లు సీసీ పుటేజ్లో కనిపిస్తోంది. దుండగులు ముసుగులు వేసుకున్నారు. గురువారం ఉదయం ఆలయ అర్చకులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సేఫ్టీ గ్రిల్స్కు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు తెలిపారు. ఎస్ఐ కె.మధుసూదనరావు, క్లూస్ టీం బృందం వచ్చి, ఆధారాలు సేకరించారు. సుమారు రూ.20 వేలు నగదు ఉంటుందని అర్చకులు తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం పలాస, శ్రీకాకుళం క్రైమ్ : పూండి – నౌపడ రైలు మార్గంలోని వల్లభరావుపేట రైలు ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పోల్ నంబర్ 28/30 వద్ద డౌన్లైన్ ట్రాక్పై సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళ ఛామన ఛాయ రంగు, నెరిసిన జుట్టు, కుడి ముంజేటిపై ఒడియా లిపిలో జై శ్రీరామ్ అని పచ్చబొ ట్టు రాసి ఉందని తెలిపారు. ఈమె యాచకురాలై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు పలాస రైల్వే స్టేసన్ ఎస్ఐ డి.శ్రీనివాసరావును 9492250069 నంబర్ ద్వారా ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య టెక్కలి రూరల్: స్థానిక జగతి మెట్ట సమీపంలో నివాసముంటున్న ధవళ అనిత(43) అనే అనే వివాహిత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనిత విజయనగరం జిల్లా జీఎస్టీ కార్యాలయం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త జన్ని హరి సంతబొమ్మాళి మండలంలో డీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ జగతిమెట్ట సమీపంలో నివాసముంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని క్లూస్ టీం పరిశీలించిన తర్వాత శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతురాలికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నా డు. అనంతరం టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భూసేకరణ ప్రక్రియ ప్రారంభం
రాయగడ: జిల్లాలో జాతీయ రహదారి–326 విస్తరణ పనులకు కీలక అడుగు పడింది. ముకుందపూర్ హటొపడ నుంచి కై లాస్పూర్ ఎస్ఎస్డీ ఉన్నత పాఠశాల వరకు రహదారి విస్తరణ కోసం భూముల గుర్తింపు, సర్వే ప్రక్రియను జాతీయ రహదారుల అధికారులు, రెవెన్యూ శాఖ సర్వే బృందం సంయుక్తంగా బుధవారం ప్రారంభించారు. ఈ పరిణామంతో స్థానికుల్లో అభివృద్ధిపై ఆశలు పెరుగుతుండగా.. భూసేకరణ, నష్ట పరిహారంపై భూ యజమానుల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సర్వేలో భాగంగా ఖాతా నంబర్లు, ప్లాట్ నంబర్లు, భూమి రకం, యజమానుల వివరాలు, సేకరించాల్సిన భూమి విస్తీర్ణాన్ని నమోదు చేస్తున్నారు. అలాగే రహదారి వెంట ఉన్న ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర శాశ్వత నిర్మాణాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. సర్వే పనులకు స్థానికులు సహకరించాలని కోరారు. రహదారి విస్తరణ పూర్తయితే పెరుగుతున్న వాహన రద్దీకి ఉపశమనం లభించడంతో పాటు.. ప్రమాదాలు తగ్గి అత్యవసర సేవలు, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారమే భూసేకరణ చేపడతామని, ప్రభావిత భూ యజమానులకు చట్టం ప్రకారం తగిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. సర్వే పూర్తయిన అనంతరం తుది భూసేకరణ జాబితాను ప్రకటించి, తదుపరి దశలో జాతీయ రహదారి –326 విస్తరణ పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.


