Orissa
-
తెలుగు ఉపాధ్యాయుల నిరసన
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో తెలుగు ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డీటీఎఫ్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ నాయకులు ఆరోపించారు. తప్పనిసరి బదిలీలు, రీ–అప్పోర్సన్కు గురైన తెలుగు ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్లో తీవ్ర అన్యాయం జరిగిందని స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ ర్యాంకు తర్వాత పెట్టిన పాఠశాలలకు బదిలీ అయినట్లు ఆర్డర్లు రావడంతో శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. వాస్తవానికి సీనియారిటీ నెంబర్కు ముందు ఉన్న పాఠశాలలకు మాత్రమే బదిలీ కావాల్సి ఉందన్నారు. ఈ మేరకు డీఈఓ తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేశారు. -
17 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి ముంబైకి 17.45 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా నిలంద్రిచంద్రపూర్ గ్రామానికి చెందిన చాబి సాహును శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నమనాయుడు తెలిపారు. ముందస్తు ఒప్పందం మేరకు శుక్రవారం 17.45 కిలోల గంజాయిని ఎనిమిది ప్యాకెట్లు రెండు బ్యాగులలో సిద్ధం చేసి ఒడిశా నుంచి ఇచ్ఛాపురం తీసుకురాగా. రైల్వేస్టేసన్ వద్ద పట్టణ పోలీసులు తనిఖీలలో గర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. తనిఖీలలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగుతున్న ఐటీఐ కౌన్సెలింగ్ ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగించారు. 284 మందికి గాను 128 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 83 మంది వివిధ కళాశాలల్లో సీట్లు పొందారని జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. శనివారం 563 నుంచి 858వ ర్యాంకు వరకూ కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కె.సుధ పర్యవేక్షిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే సలహా మండలి బోర్డు సభ్యుడిగా రాజేష్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఈస్ట్కోస్ట్ రైల్వే డివిజన్ సంప్రదింపుల సలహా మండలి సభ్యుడిగా ప్రముఖ విద్యా వేత్త, బీసీ నేత ప్రొఫెసర్ డాక్టర్ బుడుమూరు రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్తగా రైళ్ల ప్రతిపాదన, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో సూచనలను ఈ నెల 24న జరిగే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాజేష్ ప్రస్తుతం జేఎన్టీయూ పాలక మండలి సభ్యుడిగా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. అంబులెన్సులో ప్రసవం మందస: టిక్కరి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పుష్ప పాయకో పురిటినొప్పులతో బాధపడటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే మందస 108 అంబులెన్సు ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎం.రామచంద్రారెడ్డిలు గ్రామానికి చేరుకున్నారు. అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే ప్రసవం చేయించింది. పుష్ప మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలను హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సచివాలయంలో చోరీ పలాస: టెక్కలిపట్నం గ్రామ సచివాలయంలో రెండు కంప్యూటర్ మానిటర్లు చోరీకి గురయ్యాయి. గురువారం రాత్రి కార్యాలయానికి తాళం వేసి శుక్రవారం ఉదయం చూసే సరికి మానిటర్లు కనిపించకపోవడంతో పంచాయతీ కార్యదర్శి రవి కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్యనారాయణ చెప్పారు. కాగా, వేసిన తాళం వేసినట్టుగానే ఉందని, ఇందులో కార్యాలయం సిబ్బంది హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 9న అప్రెంటిస్ మేళా ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. నాగార్జున అగ్రికమ్, శ్యాంపిస్టన్స్, అరబిందో, ఎస్ఆర్ఎంటీ, అపోలోటైర్స్ తదితర కంపెనీల్లో అప్రెంటిస్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఇదేం మద్దతు?
● అరకొరగా ధాన్యం మద్దతు ధర పెంపు ● క్వింటాల్కు రూ.69 మాత్రమే పెంచడంపై రైతుల్లో అసంతృప్తి ● అమాంతంగా పెరిగిన సాగు ఖర్చులు నరసన్నపేట: కేంద్ర ప్రభుత్వం 2025–26 ఖరీఫ్ సీజన్కు 14 రకాల పంటలకు ఇటీవల మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ప్రధాన పంట వరితో పాటు పత్తి, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, రాగి, మొక్కజొన్న, పెసలు, కంది, మినుములకు కనీస మద్దతు ధర పెంచింది. మిగిలిన పంటల ధరల సంగతి అటుంచితే వరికి ప్రకటించిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలతో పాటు ఎరువులు, కూలీలు తదితర ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధరల పెంపులేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వరి ప్రధాన పంట. సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ధాన్యం దిగుబడి ఎకరాకు సరాసరి 25 బస్తాల వరకూ వస్తుంది. అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఈ పంటకు మద్దతు ధర రూ.69 మాత్రమే పెంచడం పట్ల అన్నదాతలు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సాగు ఖర్చుల ప్రకారం బస్తాకు కనీసం రూ.200 అయినా పెంచితే బాగుంటుందని అంటున్నారు. పెంచిన ధరలను పునఃసమీక్షించాలని రైతులు కోరుతున్నారు. సాగు ఖర్చుల భారం.. కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలు ప్రకటిస్తూనే ఉంది. అయితే అనుకున్న మేర పెంచడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. కంటితుడుపుగా మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోందని, రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. 2018–19 నుంచి ఇప్పటి వరకూ ఏటా సగటున వరి ధాన్యంపై సరాసరి రూ.100 లోపే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో రూ.1300 ఉండే కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు రూ.1800కు చేరుకున్నాయి. డీజిల్, విత్తనాలు, దుక్కు ఖర్చులు, లేబరు ఖర్చులు, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్ని రకాల ధరలూ భారీగా పెరిగాయి. మొత్తమ్మీద సాగు ఖర్చులు ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.16 వేలకు పెరిగాయి. దీంతో దీనికి తగ్గట్టుగా మద్దతు ధరలను పెంచాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. 2018 నుంచి వరికి కనీస మద్దతు ధరలు ఇలా.. సంవత్సరం సాధారణ రకం గ్రేడ్ఏ రకం (రూ.లలో) (రూ.లలో) 2018–19 1750 1777 2019–20 1815 1835 2020–21 1865 1888 2021–22 1940 1960 2022–23 2020 2060 2023–24 2183 2203 2024–25 2300 2320 2025–26 2369 2389 పెరిగిన సాగు ఖర్చులు పని గతేడాది ఇప్పుడు లేబరు (ఒకరికి) రూ.400 రూ.600 దుక్కికి (గంటకు) రూ.900 రూ.1100 రోటావేటర్(గంటకు) రూ.1200 రూ.1400 విత్తనాలు(30కేజీలు) రూ.900 రూ.1140 ఉడుపు రూ.3200 రూ.4000 ఆకుతీత(ప్యాకెట్) రూ.1800 రూ.2300 గాబుతీత రూ.3000 రూ.4200 కంబైండ్ హార్వెస్టెర్ రూ.2600 రూ.3000 గిట్టుబాటు కాదు.. నేను 20 ఏళ్లగా వ్యవసాయం చేస్తున్నా. పెరుగుతున్న సాగు ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు పొంతన ఉండటంలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదేళ్ల క్రితమే ప్రకటించినా కేంద్రం మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం రైతులకు నష్టాలకు గురి చేస్తుంది. వాతావరణంలో ఏమాత్రం తేడా వచ్చినా పెట్టినా ఖర్చంతా వృథాయే. – సురంగి నర్సింగరావు, చింతువానిపేట, నరసన్నపేట మద్దతు ధరలు పెంచాలి.. సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత తక్కువ మద్దతు ధర పెంచడంతో ఏ మాత్రం లాభం లేదు. అన్ని రకాల ఉత్పత్తుల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పునఃపరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటంచాలి. – పోలాకి రమణయ్య, ఉర్లాం, నరసన్నపేట -
దారిలో ప్రసవం
డోలీలో ప్రయాణం..జయపురం: డోలీలో ఓ గర్భిణిని మోసుకు వెళ్తుండగా దారిలో ప్రసవమైన ఘటన జయపురం సమితి రొండాపల్లి పంచాయతీ రామగడ గ్రామ సమీపంలో జరిగింది. ఆమె ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కొండపై గల కెందుగుడ గ్రామంలో గురువారీ పొరజ నివాసం ఉంటున్నారు. ఆమెకు శుక్రవారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ వర్కర్కు చెప్పడంతో ఆమె అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి మార్గం లేక అంబులెన్స్ రాదని డ్రైవర్ తెలపటంతో గ్రామ ప్రజలు వెదురు బుంగలతో ఒక డోలీ కట్టి అందులో గర్భిణిని ఉంచి రెండు పర్వతాలు దాటించారు. ఆస్పత్రి మరో 3 కిలోమీటర్లు ఉందనగా.. గురువారీ పొరజకు ప్రసవమైంది. విషయం ఆశ వర్కర్ స్వర్ణలతకు తెలియజేసి తల్లీబిడ్డలను ఇంటికి తీసుకు వెలుతున్నట్లు తెలియజేశారు. స్వర్ణలత బైరాగి మఠం వద్ద వేచి ఉంది. అక్కడకు వచ్చిన బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్దామని చెప్పినా వారు వినలేదు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఇలా డోలీలు, మంచాలపై రోగులను మోసుకుంటూ వెళ్లాల్సి వస్తోందని, రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు. -
పిడుగుపాటుకు మూగజీవులు మృతి
సారవకోట: రామకృష్ణాపురంలో సాధు అప్పలనాయుడుకు చెందిన ఆవు శుక్రవారం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. సుమారు రూ.60 వేలు విలువైన ఆవు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పిడుగుపాటుకు రెండు మేకలు మృతి బూర్జ: లచ్చయ్యపేటలో దాసరి తాతారావు, దాసరి నీలం, దాసరి అసిరినాయుడులకు చెందిన మేకలు పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాయి. ఉప్పినివలస గ్రామ పరిసరాలలో మేత మేస్తుండగా శుక్రవారం సాయంత్రం పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్ సువ్వారి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిపై పిడుగు టెక్కలి రూరల్: స్థానిక గోపినాథపురం సమీపంలో హనుమంతువీరన్నగారి వీధిలో సత్తారు ధర్మారావు అనే వ్యక్తి ఇంటిపై శుక్రవారం సాయంత్రం పిడుగుపడింది. ఈ ఘటనతో గోడలు బీటలు వారి కింద ఉన్న కారుషెడ్ మరమ్మతులకు గురైంది. పలు విద్యుత్ గృహోపకరణాలు పాడయ్యాయి. -
తనయకు తలకొరివి పెట్టిన తల్లి
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన కాయల కాళిదాసు కుమార్తె కె.జ్యోతి(కేతన) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తండ్రి కాళిదాసు తీవ్రంగా గాయపడి జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు తలకొరివి పెట్టే పరిస్థితిలో లేకపోవడంతో తల్లి రాజేశ్వరి పుట్టెడు దుఃఖంతో అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన చూసి కాలనీవాసులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, చిన్నారి సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు. బాక్సింగ్ పోటీల్లో పతకాల పంట శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. విశాఖపట్నంలోని గాజువాక వేదికగా ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన 6వ ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్, పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో ఎస్.దేవి వరప్రసాద్ (54 కేజీల విభాగం) బంగారు పతకం, జి.సత్య భార్గవ్ (80+ కేజీల విభాగం) బంగారు పతకం, ఆర్.రామ్చరణ్ రెడ్డి (63 కేజీల విభాగం) రజత పతకం, పి.గణేష్ (75 కేజీల విభాగం) రజత పతకం, ఎస్.వినయ్ వరుణ్ (57 కేజీల విభాగం) కాంస్య పతకం, కె.యశ్వంత్ (46 కేజీల విభాగం) కాంస్య పతకం సాధించారు. వీరిని డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బీఏ లక్ష్మణదేవ్, వంగా మహేష్, కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు, సీనియర్ బాక్సర్లు అభినందించారు. -
వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, సుప్రభాత సేవ, విశేష పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని శ్రీరామా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 20కి రథాల నిర్మాణం ప్రారంభించాలి జయపురం: రథయాత్రకు 20వ తేదీలోగా రథ నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో రథాల పనులు జరుపుతున్నట్లు దేవాదాయ విభాగం సీనియర్ క్లర్క్ రథయాత్ర పర్యవేక్షకులు కృష్ణ చంద్రదాస్ వెల్లడించారు. జయపురంలో రథ నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. అక్షయ తృతీయ దినాన రథ నిర్మాణానికి పూజలు చేశామని వెల్లడించారు. జయపురం రథం పొడవు 44 అడుగులు ఉంటుందని తెలిపారు. శ్రీజగన్నాథ్, సుభధ్ర, బలభధ్రల దేవతా మూర్తుల కోసం నిర్మిస్తున్న పెద్ద రథంతో పాటు పతిత పావనునికి చిన్నరథం తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే జయపురం సమితి బాట జగన్నాథ్పూర్ గ్రామం రథం కూడా ఇక్కడ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. పలిగుడ వడ్రంగి ధనుర్జయ కమర, పనసపుట్భగర కముల కమరల నేతృత్వంలో మరో ఆరుగురు రథాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలుగు దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి గుమడ పంచాయతీలో ఒక రైతుపై ఎలుగుబంటి దాడి చేయగా ఆ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని రాధా చలాన్(60)గా గుర్తించారు. అందిన వివరాల ప్రకారం.. రాథా చలాన్ కొట్పాడ్ సమితి ప్రాంతంలో ఇంద్రావతి నది ప్రాంతంలో మొక్కజొన్న పంట వేశాడు. ప్రతిరోజూ అతడు మొక్క జొన్న పంటకు రాత్రిళ్లు కాపలా కాస్తుంటాడు. గురువారం రాత్రి కూడా తోటకు కాపలా కాశాడు. రాత్రి 4 గంటల సమయంలో అతడు నిద్రిస్తున్న సమయంలో సమీప చెరుకు మడి నుంచి ఒక ఎలుగు బంటి వచ్చి అతడిపై దాడి చేసింది. అతడి తల, ముఖంపై బలమైన గాయాలయ్యాయి. కేకలు విని పక్కన ఉన్న రైతులు రావడంతో వారిని చూసి ఎలుగు పారిపోయింది. తీవ్రంగా గాయపడిన రాధా చలాన్ను వెంటనే జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మత సామరస్యానికి ప్రతీక బక్రీద్ : ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగను కులమతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా జిల్లా ప్రజలు జరుపుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మసీదుల వద్ద ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా, డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, గోవధ, పశువుల అక్రమ రవాణా చేసే వారి సమాచారాన్ని డయల్ 100, 112లకు, పరిధి పోలీస్స్టేషన్లకు అందించాలన్నారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. -
కూటమి ప్రభుత్వంపై పోరాటం తప్పదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కారం చేయలేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గత ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ జీవో నెంబర్ 117 రద్దుచేసి పాఠశాల విద్య వ్యవస్థను సమూలంగా మారుస్తానని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చి ఉన్న పాఠశాలలను మూసివేసే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం పథకాలు అమలు కాక విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకపోవతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈ.చందు తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల పేరిట ప్రకృతిని హరిస్తున్నారు
రాయగడ: పరిశ్రమలు ఏర్పాటైతే అభివృద్ధి సాధ్యమని ప్రజలను మభ్యపెట్టి ప్రకృతి సంపదలను హరించివేస్తున్నారని పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంతరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కాసీపూర్ కొంటామాల్ మైదానంలో పృకృతిక సురక్షా సమితి ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పృకృతిక సంపదలను ప్రైవేటు పరం చేస్తున్నాయని.. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోగలిగితేన మన సంపదలను కాపాడుకోవచ్చన్నారు. అందుకు అందరూ ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. రోజురోజుకూ పర్యావరణం సమతుల్యం అంచులు దాటిపొతున్న సమయంలో ఉన్న ప్రకృతి సంపదలను పోగొట్టుకుంటే భావితరాలు పర్యావరణ పరంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాసీపూర్ ప్రాంతం ప్రకృతి సంపదలకు పుట్టినిళ్లని.. వాటిని పోగొట్టుకుంటే మిగిలింది మనకు విషకాలుష్యమేనని భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నారు.. పర్యావరణం కోసం పోరాడేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని ఇది ఎక్కడి విడ్డూరమని సామంతరాయ్ ప్రశ్నించారు. కొంటామాల్లో జరగనున్న సమావేశానికి హజరయ్యేందుకు వచ్చిన ప్రముఖ సమాజ సేవకురాలు, పర్యావరణ వేత్త మేధాపట్కేర్తోపాటు మరికొందరు ప్రముఖులను రాయగడలో పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తిరిగి పంపించివేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసినట్లేనని అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ప్రకృతిని హరించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తమ ఆందోళనలను, పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాలిసురక్షా సమితి అధ్యక్షుడు సుభా మాఝి మాట్లాడుతూ.. పర్యావరణం గురించి శాంతి యుతంగా ఆందోళనలు చేపడితే యంత్రాంగం అడ్డుకోవడం విచారకరమని అన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా తమ ఆందోళనలు కొనసాగించడం తధ్యమని అన్నారు. కార్యక్రమంలొ పృకృతి సురక్షా సమితికి చెందిన దిగంబర్ దురియా, సురేష్రావు, శుభేంద్ర ములిక, సంగ్రామ్ కేసరి, సనాతన్ ప్రధాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సమితి పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంతరాయ్ -
పోలీసులకు చిక్కిన బైకుల దొంగ
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది క్రితం సారవకోట మండలం బుడితిలోని ఓ నివాసలో జరిగిన చోరీలో క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు ఆధారంగా జిల్లా పోలీసులు కీలక నిందితున్ని పట్టుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన కొర్ల శివ అలియాస్ మున్నా (23) విజయనగరంలోని ఓ హోటల్లో పనిచేస్తుండేవాడు. స్థిరత్వం లేకపోవడంతో ఏ పనిచేసినా అక్కడ మానేసేవాడు. జల్సాలకు డబ్బులు లేకపోవడం, చెడు అలవాట్లు ఉండటంతో చోరీలు చేస్తేనే డబ్బులొస్తాయని నిశ్చయించుకున్నాడు. మున్నాకు బైక్లంటే పిచ్చి ఉండటంతో ముందుగా పార్కింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్గా చేసుకున్నాడు. కొన్ని వాహనాలను దొంగిలించాక.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చోరీ చేసిన బైక్తోనే వేరే చోటకు దొంగతనానికి వెళ్లి అక్కడికి కొద్ది దూరంలో ముందుగా తెచ్చుకున్న బైక్ను వదిలేసేవాడు. సమీపంలో ఉండే దేవాలయాలు, నివాస గృహాల్లో చోరీకి పాల్పడటం.. లేదంటే పార్కింగ్ చేసిన బళ్లను అక్కడి నుంచి అపహరించుకుపోవడం మున్నాకు అలవాటుగా మారింది. పట్టుబడ్డాడిలా.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు బుడితి కమలప్రియ మోడరన్ రైస్ మిల్లు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సారవకోట పోలీసులకు నడుచుకుంటూ వస్తున్న మున్నా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా ఎస్ఐ బి.అనిల్కుమార్ సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. మున్నా తెచ్చుకున్న సంచిలో రెండు పాలిథిన్ కవర్లలో బంగారు, వెండి వస్తువులు గుర్తించి విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్లగా నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు విచారించారు. అప్పటికే సమాచారమందుకున్న అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ చంద్రమౌళిలు ఆరా తీశారు. అనేక కేసుల్లో ముద్దాయి.. మున్నా ఫింగర్ప్రింట్ పరిశీలించగా ఏడాది క్రితం బుడితిలోని ఓ మహిళ నివసిస్తున్న గృహంలో జరిగిన చోరీలో మున్నాయే నిందితుడని, జిల్లాలోని అనేక పోలీస్స్టేషన్లలో నమోదైన 15 చోరీ కేసుల్లో ముద్దాయి మున్నానే అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఎచ్చెర్ల పీఎస్లో ఐదు కేసులు, జె.ఆర్.పురం, శ్రీకాకుళం టూటౌన్, సారవకోటల్లో రెండేసి చొప్పున, జలుమూరు, లావేరు, నరసన్నపేటల్లో ఒక్కటేసి, విజయనగరం జిల్లా డెంకాడలో ఒక కేసు మున్నాపై నమోదయ్యాయి. మున్నా వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువైన మూడు తులాల బంగారం, 11 తులాల వెండి, సుమారు 12 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సారవకోట పోలీసులను, సీసీఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు. చోరీ చేసిన బైక్లతోనే దొంగతనాలు దేవాలయాలు, ఇళ్లల్లో సైతం చోరీలు వేలిముద్రలు ఆధారంగా నిందితున్ని పట్టుకున్న పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు -
50 వంట గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
రాయగడ: సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఎన్ఫొర్స్మెంట్ విభాగం గురువారం పలు హోటళ్లలో ఆకస్మిక దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో 50 వంట గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నియమాలను ఉల్లంఘించి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న 14 హోటళ్లలో దాడులను నిర్వహించి సిలిండర్లను సీజ్ చేశారు. జేకేపూర్, రాయగడలోని హోటళ్లలో విస్తృతంగా నిర్వహించిన ఈ దాడుల్లో ఏసీఎస్వో సుధాంశు భొయ్, పౌరసరఫరాల శాఖ రాయగడ సమితి ఇన్స్పెక్టర్ ప్రభంజన్ మహాంతి, మున్సిపాలిటీ సిబ్బంది మహేంద్ర రాయ్ పాల్గొన్నారు. -
కక్షకట్టి రోడ్డున పడేశారు..!
● దౌర్జన్యంగా ఫుట్పాత్ దుకాణం సామాన్లు పడేసిన పంచాయతీ సిబ్బంది ● వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటమే కారణం టెక్కలి: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. పేద, సామాన్య వర్గాలు, దళితులు వ్యాపారాలు చేసుకునే ఫుట్పాత్ దుకాణాలనూ వదలడం లేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే శుక్రవారం కోటబొమ్మాళి మెయిన్రోడ్లో ఓ ఫుట్పాత్ దుకాణాన్ని తొలగించి ఆ కుటుంబాన్ని నడిరోడ్డున పడేశారు. వివరాల్లోకి వెళితే..ప్రకాశ్నగర్ కాలనీకు చెందిన బచ్చు సంధ్య స్థానిక పాఠశాలకు ఎదురుగా ఓ టీ దుకాణం నిర్వహిస్తోంది. సుమారు 25 ఏళ్లుగా కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటంతో స్థానిక టీడీపీ నాయకులు కక్ష కట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్న ఫుట్పాత్ దుకాణాన్ని తొలగించేందుకు పంచాయతీ ఈఓ చింతాడ శ్రీనివాసరావు, సహాయకుడు సన్యాసిరావు, పోలీస్ సిబ్బందిని ఉసిగొల్పారు. వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఫుట్పాత్ దుకాణంలో సామాన్లు నడిరోడ్డున పడేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పాతికేళ్లుగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చిన్నపాటి దుకాణాన్ని నిర్వహిస్తున్న తన కుటుంబాన్ని ఈ విధంగా నడిరోడ్డున పడేయడం తగదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కోటబొమ్మాళిలో ఎంతో మంది ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కేవలం తనపై మాత్రమే కక్ష కట్టారంటూ వాపోయింది. దివ్యాంగుడైన తన భర్తతో పాటు ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్న తనపై ఈ విధంగా కుట్ర చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పంచాయతీ సర్పంచ్ సంజీవరావు సైతం అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా తొలగించారని వాపోయింది. -
పార్టీలో విభేదాల్లేవు
రాయగడ: బీజేడీ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటామని మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షురాలు ప్రమీల మల్లిక్ అన్నారు. జిల్లాలోని బిసంకటక్, రాయగడ, గుణుపూర్ శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం ఆమెతో పాటు మాజీ మంత్రి పద్మనాభ బెహరలు రాయగడ వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక తేజస్వీ హోటల్లో కార్యకర్తలు, సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసంగించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఏదో చేసేస్తుందనే ఆశతో గెలిపించారన్నారు. ఆ పార్టీ సంవత్సర కాలంలో చేసిందేమిటో అందరికీ అర్థమైందన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. అధికారంలోకి వస్తే 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా వినియోగదారులకు ఇస్తామని హామీ ఇచ్చారని, అలాగే చిట్ ఫండ్ మోసాలకు గురైన బాధితులకు అండగా నిలుస్తామని ఇచ్చిన హామీలో ్ల ఒక్కదాన్ని కూడా బీజేపీ నెరవేర్చలేదని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు విరక్తితో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా బీఎస్కేవై (బిజు స్వాస్థ కళ్యాణ యోజన పథకం)ను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం యుష్మాన్ కార్డును ఇచ్చిందని.. అయితే ఈ కార్డు చూపిస్తే ఏక్కడా ఉచితంగా వైద్యం అందించడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ఆ పార్టీకి త్వరల్లో గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని మరోసారి నొక్కి చెప్పారు. కార్యకర్తలు ఎటువంటి నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతా సైనికుల్లా కలసికట్టుగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో బీజేడీ పార్టీయే స్థిరమైనదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటుకుంటాం బీజేడీ పార్టీ నేత, మాజీ మంత్రి ప్రమిలా మల్లిక్ నెక్కంటి నేతృత్వంలో పార్టీ బలోపేతం.. సమావేశంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెక్కంటి నేతృత్వంలో బీజేడీ ఈ జిల్లాలో మరింత బలొపేతం అవుతుందన్నారు. త్వరలో ప్రకటించనున్న బీజేడీ జిల్లా అధ్యక్షుడి పదవిని ఆయనకు ఇవ్వాలని కోరారు. పార్టీని ముందుకు నడిపించే సమర్ధమంతమైన నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన నెక్కంటికి తిరిగి పగ్గాలు చేపట్టే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, అనసూయా మాఝి, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
శ్రీకాకుళం: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు పడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రిమ్స్కు బోయింగ్ ఇండియా సంస్థ (సీఎస్ఆర్) ద్వారా సమకూర్చిన రూ.45 లక్షల విలువైన వైద్య పరికరాలను కేంద్రమంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి, కళాశాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, బోయింగ్ ఇండియా వైద్యులు ప్రవీణ్, రంజిత్, అమృత, రోహిత్, జీజిహెచ్, రిమ్స్ వైద్యుడు మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య, జైన్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీముఖలింగేశ్వరుని కల్యాణోత్సవం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు నిర్వహించారు. ముత్తయిదువులు కొట్నం దంపు కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి క్షీరాభిషేకం జరిపించారు. అనంతరం ఉత్సవమూర్లును నంది వాహనంపై ఉంచి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు హారతిలిస్తూ పార్వతి పరమేశ్వరులను దర్శించుకున్నారు. ఈఓ పి.ప్రభాకరరావు ఎంపీటీసీ కె.హరిప్రసాద్, సర్పంచ్ టి.సతీష్కుమార్ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
రాత్రి దోపిడీలు
పగలు బొమ్మల వ్యాపారం.. ● హైవేల్లో ఆగి ఉన్న వాహనదారులపై దోపీడీ ● చీకటిలో దోపిడీ దొంగల వీరంగం ● పోలీసులకు చిక్కిన నలుగురు దొంగలు, ఒకరు పరారీ ● రోడ్డు పక్కన గుడారాల్లో నివాసాలు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : హైవే పక్కన గుడారాల్లో నివాసం.. పగలు బొమ్మల వ్యాపారం.. రాత్రయితే దోపిడీ.. విశాఖ జిల్లా తగరపువలస నుంచి మన జిల్లా ఇ చ్ఛాపురం వరకు అంతా వీరి రాజ్యమే. జాతీయ రహదారి వెంబడి ఎక్కడైనా వాహనం ఆగి ఉంటే చాలు నగదు, మొబైళ్లు, పార్క్ చేసిన బైక్లు కూడా ఎత్తుకుపోతారు. జిల్లాలోనూ వీరి హస్తకళ చూపించారు. తాజాగా వీరిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఈ రాజస్థానీ దొంగల వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆదాయం చాలక.. జిల్లాలోని రణస్థలం మండలం కోష్ట ప్రాంతంలో గత మూడేళ్లు నుంచి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఆదిత్య పవార్ అలియాస్ వర్షమ్ (22), అతని సోదరులు, మరికొందరు కుటుంబీకులు రోడ్డు ప క్క న గుడారాల్లో నివసిస్తున్నారు. పగటి పూట బొమ్మ లు, దుప్పట్లు అమ్ముకోవడమే వీరి జీవనాధారం. ఆ ఆదాయం సరిపోకపోవడం, ఇంటిల్లిపాదీ చెడు అలవాట్లకు బానిసలు కావడంతో రాత్రిపూట రోడ్డుపక్కన దొంగతనాలకు ఒడిగడుతున్నారు. ఆదిత్యనే ఈ గ్యాంగ్కు లీడర్. అతని సోద రులు బంగారం పవార్ (21), సుధీర్ పవార్ (19)లే కాక బావమరుదులు సంజు షిండే అలియాస్ పటేల్, మరో బాలుడు కూడా ఇదే పనిలో ఉన్నారు. మూడేళ్లుగా ఎవరికీ చిక్కక.. అర్ధరాత్రి వేళల్లో ఆగి ఉన్న లారీలు, వ్యాన్లలో నిద్రిస్తున్న వ్యక్తుల వద్దకు వెళ్లి వారికి తెలియకుండానే నగదు, ఫోన్లను తస్కరించి అక్కడి నుంచి పరారయ్యేవారు. గత ఆరు నెలల నుంచి ఆగి ఉన్న వాహనదారుల వద్దకు వెళ్లి కత్తులతో బెదిరించి.. వారిని కొట్టి డబ్బు, మొబైళ్లు లాక్కోవడం మొదలుపెట్టారు. అదే వారిని పట్టించింది. ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి సతీష్కుమార్, అతని స్నేహితుడు సేపీన బెనర్జీలు తమ బైక్పై గత నెల 18న నంది గాం మండలం కణితూరు గ్రామంలో జరిగే వివా హ వేడుకకు హాజరయ్యారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి పయనమవ్వగా మార్గం మధ్యలో వర్షం కురవడంతో సరిగ్గా 12:50 గంటలకు టెక్కలి మండలం విక్రంపురం గ్రామం జేఎన్ బస్టాప్ (ఎన్హెచ్–16 సమీప) వద్ద ఆగి కాసేపు ఆగారు. పైన పేర్కొన్న నిందితుల్లో నలుగురు ఒక్క ఉదుటున వారివద్దనున్న కత్తులను తీసి సతీష్, బెనర్జీల గొంతుపై పెట్టారు. అంతటితో ఆగక పిడిగుద్దుల వర్షం కురిపించి ఏమేం ఉన్నాయో తీయండంటూ బెదిరించడంతో రూ. 6 వేల నగదు, రెండు మొబైళ్లు ఇచ్చేశారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ ఎస్ఎస్ చంద్రమౌళి, టెక్కలి సీఐ విజయ్కుమార్ రెండు పోలీసు బృందాలుగా ఏర్పడి తీగ లాగారు. ఎలా పట్టుబడ్డారంటే.. ఈ నెల 5న సాయంత్రం 6 గంటల సమయంలో టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామం జగదిమెట్ట ఫ్లై ఓవర్ సమీపంలో కొంతమంది అనుమానంగా రెండు ద్విచక్రవాహనాలపై సంచరిస్తున్న విషయం టెక్కలి ఎస్ఐ కె.మధుసూధనరావుకు తెలియడంతో సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారిలో సంజు షిండే పరారయ్యాడు. వారి వద్ద నుంచి రూ.1,12,000 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, ఎనిమిది మొబైళ్లు, ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్కు తీసుకెళ్లి విచారించడం, జిల్లాలో పలుచోట్ల వారు చేసిన నేరాలు బయటపడ్డాయి. ఎక్కడెక్కడ అంటే.. టెక్కలి, లావేరుల్లో ఒక్కొక్కటి చొప్పున, నందిగాం, నరసన్నపేట పీఎస్ల పరిధిలో రెండేసి చొప్పున వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్, టెక్కలి పోలీసులను ఎస్పీ అభినందించారు. -
మరో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి?
చత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈరోజ(శుక్రవారం) జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బండి ప్రకాష్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్. సింగరేణి కార్మిక సమాఖ్య ఇంచార్జ్గా పనిచేశారు.కాగా, నిన్న(గురువారం) . బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్ సుధాకర్ మృతిచెందారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో సుధాకర్ మృత్యువాత పడ్డారు.ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చర్యలు చేపట్టింది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు సుధాకర్. అయితే గత ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. సుధాకర్పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభు త్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. ఇది గతేడాది నుంచి ఊపందుకోగా, ఈ ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది. -
పాఠశాలల్లో కోవిడ్ నియమావళి అమలు
భువనేశ్వర్: రాష్ట్రంలో కోవిడ్–19 పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం అప్రమత్తం అయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కోవిడ్ సంక్రమణ బారిన పడకుండా నివారణ చర్యల కింద కోవిడ్ – 19 ఆరోగ్య నియమావళిని అమలు చేయనున్నట్లు మంత్రి నిత్యానంద గోండ్ గురువారం ప్రకటించారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరవడంతో కోవిడ్ నియమావళి అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కోవిడ్ – 19 భద్రతా చర్యలను పాటించాల్సి ఉంటుంది. జలుబు వంటి లక్షణాలు ఉన్న విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలకు హాజరు కావలసి ఉంటుందన్నారు. తీవ్రమైన అనారోగ్య లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి హోం క్వారంటైన్ పాటించాలని మంత్రి సలహా ఇచ్చారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ భువనేశ్వర్: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐఆర్ఎస్కు సాయిరాం ఎంపిక రణస్థలం: సివిల్ సర్వీస్– 2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన రణస్థలం మండలం వెల్పురాయి గ్రామానికి చెందిన సేనా పతి సాయిరాం ఇండియ న్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికయ్యారు. ఇతని తండ్రి సూర్యనారాయణ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సాయిరాం ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షేక్ రుక్సాద్కు ప్రతిభా అవార్డు ఇచ్ఛాపురం రూరల్: ఇంటర్మీడియట్ బైపీ సీ విభాగంలో ఉత్తమ మార్కులు సాధించిన షేక్ రుక్సాద్కు ప్రభు త్వం ప్రతిభా అవార్డు ను గురువారం అందజేసింది. ఈ మేరకు ఎం.తోటూరు ఆది త్యా కళాశాల సిబ్బంది విద్యార్థిని అభినందించారు. విద్యార్థి వెయ్యి మార్కులకు 982 మార్కులు సాధించారు. షేక్ రుక్సాద్ తండ్రి ఇచ్ఛాపురం పట్టణంలో టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రెండు తులాల బంగారం చోరీ కొత్తూరు: బలద గ్రామానికి చెందిన కంచరాం పురుషోత్తం ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. వివాహం నిమిత్తం బంధువుల ఇంటి కి వెళ్లి గురువారం ఉదయం వచ్చేసరికి తలుపు లు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువా తాళాలు విరగ్గొట్టి అందులో ఉన్న రెండు తులాల బంగారు వస్తువులను పట్టుకుపోయారు. అనంతరం బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రసాదరావు, క్లూస్టీమ్ గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్ఐ కేసు నమోదు చేశారు. పిడుగు పాటుకు ఆవు మృతి నందిగాం: బడగాం పంచాయతీ కాశీరాజుకాశీపురంలో గురువారం పిడుగు పడి సనపల ముఖలింగంకు చెందిన ఆవు మృతి చెందింది. గ్రామ సమీప పొలాల్లో ఆవును మేతకు తీసుకువెళ్ల ఒక్కసారిగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెటర్నరీ అసిస్టెంట్ సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించి పశుసంవర్ధక శాఖ ఏడీ రవికృష్ణకు విషయం తెలియజేశారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు ఎచ్చెర్ల: లావేరు మండలం బుడుమూరులో పేకాట శిబిరంపై లావేరు పోలీసులు గురువారం దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.9,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. హెచ్సీ హెచ్.జోగారావు కేసు నమోదుచేశారు. -
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
రాయగడ: స్థానిక బాలాజీ నగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. ఉత్సవాలు ఈనెల 11వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు తెలియజేశారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, శాత్తుమురై, వేద పారాయణం, నిత్య శేష హోమాలు, ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామివారి వ్రతములు, సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన ఆరాధన, రక్షాసూత్రధారణ, మత్య్సంగ్రహణం, వాస్తు యోగిశ్వర పూజలు, ప్రసాద వితరణ జరుగుతాయి. అదేవిధంగా 7వ తేదీన స్వామివారి వ్రతములు, గరుడ ధ్వజారోహణం, సాయంత్రం 5 గంటలకు ఎదర్కొలోత్సవం, 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, 8 గంటలకు శేష వాహనోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. -
ప్రాణాలు తోడేస్తూ!
ఇసుక తవ్వేస్తూ.. శ్రీకాకుళం రూరల్: ఇసుక అక్రమార్కులు నిబంధనలకు తూట్లుపొడుస్తున్నారు. నదిలో ఇష్టారాజ్యంగా యంత్రాలతోనే భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నా రు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నా యి. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీరు ఆ గోతుల్లో చేరుతోంది. వాటిని గమనించని సామాన్యులు ప్రమాదవశా త్తు దిగి కూరుకుపోయి మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల శ్రీకాకుళం రూరల్ మండ ల పరిధిలో చోటు చేసుకుంది. ఆదేశాలు బేఖాతరు.. వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. జిల్లా కలెక్టర్ సైతం ఆక్రమ తవ్వకాలపై కన్నెర్ర చేసినా రెవెన్యూ, మైన్స్ అధికారులు తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. బైరి, కరజాడ పరిసర ప్రాంతా ల్లో పగలు రాత్రీ అనే తేడా లేకుండా ఇసుక దందా సాగుతోంది. నదిలో ఎక్కడికక్కడే భారీగా గోతులు తవ్వేస్తూ వదిలేస్తున్నారు. ఇప్పటికే ఇసుక తవ్వకా లు నిత్యం చేపట్టడంతో వ్యవసాయ బోరులు సైతం పాడైపోయాయని పరిసర ప్రాంత రైతులు ఆవేదన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడికక్కడే తవ్వకాలు చేయడంతో గత నెలలో బైరి గ్రామానికి చెందిన గొర్లె రామారావు అనే వ్యక్తి వంశధార నదిలోకి స్నానానికి వెళ్లినప్పుడు భారీగా ఏర్పడిన గోతులో కూరుకుపోయి ప్రాణాలు పోగుట్టుకున్నాడు. ఇలాంటి గోతులే నదిలో ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైన్స్ అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు చేయడం, ఎక్కడికక్కడే గోతులు ఏర్పడటం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయ ని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ పలకలతో ఇసుక ర్యాంప్.. బైరి ర్యాంప్ను ఆనుకొని ఏకంగా నదీ గర్భంలోకే గ్రానైట్ పలకలతో కూడిన ర్యాంప్ను రోడ్డు మాదిరిగా వేసేశారు. దీని మీదుగా పెద్దపెద్ద వాహనాలు వెళ్తూ ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారంలో కూలీలతో ట్రాక్టర్లకు ఇసుక నింపాల్సి ఉండ గా 200 హైస్పీడ్తో కూడిన ప్రొక్లెయినర్లతో ఇక్కడ వినియోగిస్తున్నారు. ఫలితంగా నదీగర్భంలో ఎక్కడికక్కడే పెద్దపెద్ద గోతులు ఏర్పడి సామాన్యుల ప్రాణాలకు మీదకు వస్తోంది. వంశధార నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు ఎక్కడికక్కడే భారీగా గోతులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడుతున్న సామాన్యులు పట్టించుకోని అధికారులు తవ్వకాలు వాస్తవమే.. బైరి ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిత్యం జరుగుతున్నాయి. ఈ ర్యాంపును శ్రీ వెంకటేశ్వర మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. నదిలోకి నేరుగా గ్రానైట్ పలకలతో కూడిన ర్యాంప్ వేశారు. ఇచ్చిన అనుమతులు కన్నా ఎక్కువగానే తవ్వేస్తున్నారు. – శ్రీనివాసరావు, బైరి వీఆర్ఓ అనుమతులకు మించి తవ్వకాలు బైరి గ్రామంలో అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు చేయడంతో ఇటీవల మా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్నానానికి దిగి చనిపోయాడు. అయినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. నదీ పరివాహక ప్రాంతంలో ఏదో ఒక మూల తవ్వేస్తూ ఉన్నారు. అధికారులు గానీ, సచివాలయ సిబ్బంది గానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – ఎండి అసిరినాయుడు, ఉపసర్పంచ్, బైరి గ్రామం -
నాలుగు కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి పూణేకు 4.18 కిలోల గంజాయి తరలిస్తున్న ఎలియా రైత అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్టు సీఐ ఎం చిన్నంనాయుడు తెలిపారు. ఒడిశా రాష్ట్రం లుహకంటి గ్రామానికి చెందిన ఎలియా రైతా తన సోదరుడు జోహర్ రైతాతో కలిసి కుంజన ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి మహరాష్ట్రకు చెందిన రాఖేష్ సుదంప్లంజ్(చాచా)కు అమ్ముతుండేవారు. ఈ క్రమంలో ఎలియా రైతా రెండు ప్యాకెట్ల గంజాయితో బరంపురం నుంచి ఇచ్ఛాపురం వచ్చాడు. రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా గంజాయి గుర్తించడంతో అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. -
అకడమిక్ అంశాలపై దృష్టి సారించండి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యాసంబంధిత అంశాలతోపాటు అకడమిక్ అంశాలపై దృష్టి సారించాలని డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అకడమిక్ అంశాలపై జరుగుతున్న జిల్లాస్థాయి డీఆర్పీల మూడు రోజుల శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు అకడమిక్ అంశాలైన క్యాలెండర్, హ్యాండ్బుక్, అసెస్మెంట్, కరికులం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర పరిశీలకులు గిరిజా శంకర్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడవ విడత ట్రైనింగ్లో ప్రతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అకడమిక్ అంశాలపై శిక్షణ పొందాలన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పలాస మూడు డివిజన్ల పరిధిలో ఉపాధ్యాయులకు తాజాగా శిక్షణ పొందిన డీఆర్పీలతో శిక్షణా తరగతులు ఉంటాయ ని పేర్కొన్నారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులంతా హాజరుకావాల్సిందేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్, ఉప విద్యాశాఖ అధికారులు ఆర్. విజయకుమారి, పి.విలియం, డీసీఈబీ సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, వమ్మరవల్లి డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి తండకి పంచాయతీ బండిగూడలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అటవీ, ఎకై ్సజ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి న్యాయమూర్తి సంగీతా పాత్రో ఈ కర్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కల పెంపకంతో వచ్చే లాభాలు గూర్చి వివరించారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రతాప్ కోత్తపల్లి, మల్కన్గిరి ఎకై ్సజ్ అధికారి బింబధర్ పండా, మల్కన్గిరి అదనపు ఎకై ్సజ్ అధికారి టంకధర్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జయపురంలో.. జయపురం: పర్యావరణ పరిరక్షణే సమస్త జీవుల మనుగడకు శ్రీరామ రక్ష అన్నారు పలువురు ప్రముఖులు అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జయపురంలో పలు సంస్థలు కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. స్థానిక ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం సభాగృహంలో ఒడిశా అటవీ పర్యావరణం, జల వాయు పరివర్తన విభాగం, సహకారంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 50 మంది రైతులు పాల్గొన్నారు. స్వామినాథన్ పరిశోధన కేంద్రంలో వివిధ రకాల మొక్కలను నాటారు. జిల్లా జడ్జి, ప్రదీప్ కుమార మహంతి, జయపురం అటవీ విభాగ అధికారి ప్రతాప్ బెహర, జయపురం సబ్కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, సివిల్ జడ్జి శ్రీమతి అలకానంద మహంతి, తదితరులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలలో.. జయపురం ప్రధాన మంత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పాటించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ చంద్ర పట్నాయక్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ ప్రతాప్ కుమార్ బెహరా, అటవీ రేంజర్ సచ్చిదానంద పొరిడ పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు విశ్వరంజన్ గౌడ, ప్రభాకర మహరాణ, అరుంధతి త్రిపాఠి, రశ్మితా నాహక్, సంతోషిణి పండా, రజణీ కాంత ఘొడాయి పాల్గొని మొక్కలు నాటారు. రాయగడలో.. రాయగడ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు జరిగాయి. మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో పాలిథిన్ వినియోగానికి స్వస్థి పలకాలని గురువారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జిసిడి వాకర్స్ క్లబ్, జేకే పేపర్ మిల్ ఉద్యోగులు మొక్కలు నాటారు. అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గుండిచా మందిరం నుంచి ఒక ర్యాలీని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా, అబ్కారీశాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, పురపాలక ఈఓ లక్ష్మణముర్ము, పోలీసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు. ర్యాలీ అనంతరం మహేంద్రతనయ వద్ద ఉన్న బృందావన ప్యాలస్లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు ఆధ్యక్షతన బృందవన ప్యాలస్లో జరిగిన సాధారణ సమావేశంలో కలెక్టర్ దాస్, మ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు తదితరులు పాల్గొని మొక్కలను నాటారు. డి.ఎఫ్.ఓ. కె.నాగరాజు మాట్లాడుతూ ఈ ఏడాది 740 హెక్టార్లలో 3 లక్షల నర్సరీ పాప్లింగ్స్, మరో 5 లక్షల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. -
విశ్రాంత కార్మికులకు బకాయి బాధ
జయపురం: జయపురం గగణాపూర్ సేవా పేపరుమిల్లు విశ్రాంత కార్మికుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అతడి కుటుంబ సభ్యులు జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చేర్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరో చోటకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. కానీ అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారు ఏం చేయాలో తెలీక తల్లడిల్లుతున్నారు. సేవా యూనియన్ నేత ప్రమోద్ కుమార్ మహంతి వివరిస్తూ.. సేవా పేపరుమిల్లు విశ్రాంత కార్మికుడు బి.ముత్యాల రావు కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడని, ముత్యాల రావు కుమారులు తన తండ్రికి రావాల్సిన గ్రాడ్యుటీ, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని అభ్యర్థించారని, అయితే యాజమాన్యం కేవలం రూ.10వేలు మాత్రమే అందజేసిందన్నారు. రానున్న రెండు నెలల్లో బకాయిలు అందజేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ముత్యాల రావు చికిత్సకు రూ.లక్షల్లో డబ్బు అవసరమవుతుందని, చాలా మంది విశ్రాంత కార్మికులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సకాలంలో యాజమాన్యం విశ్రాంత కార్మికులకు బకాయిలు చెల్లించనందున తగిన వైద్యం అందక ఇటీవల 30 మందికి పైగా మరణించారని ఆయన వెల్లడించారు. ఇప్పటికై నా మిల్లు యాజమాన్యం విశ్రాంత కార్మికుల పట్ల మానవతా దృష్టితో తక్షణ సహాయం అందజేయాలని కోరారు. బకాయి ఉన్న డబ్బు వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు. -
పోలీసుల అదుపులో మేధా పాట్కర్
రాయగడ: పర్యావరణ వేత్త, ప్రముఖ సమాజ సేవకురాలు మేధా పాట్కర్ను రాయగడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రత్యేక వాహనంలో బరంపురం తరలించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె కాశీపూర్ పరిధి హొటొపొదొరొలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలి. గురువారం తెల్లవారున హిరాఖండ్ ఎక్స్ప్రెస్లో రాయగడ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమెతో పాటు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు జరుగుతున్నాయి. మేధా పాట్కర్ ఆ ప్రాంతానికి వెళ్లి ప్రసంగిస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించి ఆమెను అక్కడకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆమెతో పాటు పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంత, కృషక్ నాయకుడు లింగరాజ్, నరేంద్ర మహాంతి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభివృద్ధికి వ్యతిరేకిని కాను.. తాను అభివృద్ధికి వ్యతిరేకిని కానని మేధా పాట్కర్ తెలిపారు. సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. శాంతి యుతంగా జరిగే ఇలాంటి కార్యక్రమాల్లో గతంలోనూ పాల్గొన్నానని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న మేధా పాట్కర్ తాను ఓ పాత్రికేయుడిని కలవాలని కోరగా.. స్థానికంగా ఉంటున్న ప్రముఖ పాత్రికేయుడు కీర్తి చంద్ర సాహు ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటిలో అల్పాహారం తీసుకున్న తర్వాత తిరిగి పోలీసులు ఆమెను ప్రత్యేక వాహనంలో బరంపురం తరలించారు. -
కారణమెవరు..?
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025శోకానికి.. కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ కళాశాలలో వైద్యం వికటించి ఆరుగురు మృతి చెందారు. గురువారం రాష్ట్ర వైద్య మంత్రి ముఖేష్ మహాలింగ అత్యవసర పర్యటన చేశారు. రాజధాని నుంచి ఆగమేఘాల మీద వైద్య కళాశాలకు తరలి వచ్చారు. మంత్రి వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున రక్షణ కల్పించింది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద మంత్రితో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ మాట్లాడానికి ప్రయత్నం చేశారు. ఇది గమనించిన బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో దాడికి ప్రయత్నించారు. నిమయ్ అప్రమత్తమై ఎమ్మెల్యేపై ఎదురు దాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరిని విడదీశారు. అనంతరం మంత్రి వైద్య కళాశాలలో వివిధ వార్డులు సందర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స అడిగి తెలసుకున్నారు. మందుల కౌంటర్ ని పరిశీలించారు. కళాఽశాలలో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు మరణాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. సమావేశంలో కలెక్టర్ వీ.కీర్తి వాసన్, కొట్ పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు. విచారణ జరిపిస్తున్నాం: మంత్రి ముఖేష్ ఇలాంటి మరణాలు విచారకరమని రాష్ట్ర వైద్య మంత్రి ముఖేష్ మహాలింగం ప్రకటించారు. వైద్య కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వ విచారణ జరుగుతుందన్నారు. తాను ఆస్పత్రిలో అన్ని వార్డులు పరిశీలించానన్నారు. పూర్తిస్థాయి సమీక్ష జరిగిందని మంత్రి ప్రకటించారు. వైద్య బృందం పరిశీలన.. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కటక్, బ్రహ్మపుర వైద్య కళాశాలలకు చెందిన వైద్య నిపుణుల బృందం తరలి వచ్చింది. ఆయా వైద్య నిపుణులు కళాశాలలో తమ విచారణ ప్రారంభించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన బృందం కళాశాలలో పర్యటించింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మీనాక్షి వాహీని పతి తదితరులు కళాశాలలో వివిధ వార్డుల్లో పర్యటించారు. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి.. వైద్య కళాశాల మృతులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ చంద్ర ఖడం డిమాండ్ చేశారు. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఇవి ప్రభుత్వ హత్యలని అన్నారు. బాధిత కుటుంబాల గోడు వినలేదన్నారు. నర్సులు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే రోగులు చనిపోయారని పేర్కొన్నారు. మంత్రితో మాట్లాడడానికి వచ్చిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ పై స్థానిక ఎమ్మెల్యే దాడి చేయడం సరికాదన్నారు. చేతకాని ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై బౌతిక దాడులు చేస్తుందన్నారు. ఇలాంటి దాడులతో ప్రజలను భయపెట్టలేరనని రాం చంద్ర ఖడం పేర్కొన్నారు. న్యూస్రీల్ కొరాపుట్ వైద్య కళాశాలలో.. నాయకుల పర్యటన -
పేపర్ మిల్లు పునరుద్ధరణపై సమావేశం
జయపురం: స్థానిక గగణాపూర్లోని సేవా పేపరు మిల్లు పునరుద్ధరణపై జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధ్యక్షతన ఒక సమావేశాన్ని పట్టణంలోని రుతురాజ్ కల్యాణ మండప ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిల్లు పునః ప్రారంభించేందుకు పెట్టుబడులు పెట్టనున్న నూతన యాజమాన్యం త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సంసిద్ధత ప్రకటించిందన్నారు. మిల్లులో ఉత్పత్తి సజావుగా జరిపేందుకు రెండు యూనియన్ల కార్మికులతో చర్చలు జరిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్సర్ అనే పెట్టుబడులు పెట్టే కంపెనీకి మిల్లు నడిపేందుకు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈనెల 25 నాటికి రాష్ట్ర ప్రభుత్వంతో నూతన యాజమాన్యం ఎంవోయూ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే కార్మికులకు గత 10 నెలల బకాయి వేతనాలు చెల్లించడంతో జూలై నుంచి అందరికీ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కంట్రాక్టర్ల ప్రతినిధి నరేంద్ర మహంతి, లాడి శ్రీనివాసరావు, 4వ నంబర్ యూనియన్ ప్రదీప్ కుమార్ రాయ్, సందీప్ మండల్, సునీల్ సాహు, ఉపేంద్ర జెన, 3వ నంబర్ యూనియన్ అధ్యక్షుడు ఉజ్విన్ నాయిక్, ఉమాశంకర పాణిగ్రహి, సుదర్శన సెట్టి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ ఏర్పాటు చేయాలి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి పరిధి మునుష్గా పంచాయతీలోని కొడిగుడ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు రజత్ మదల కోరారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి రాజధానికిలోని రాష్ట్ర ఆదివాసీ, హరిజన వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండొకు గురువారం వినతిపత్రం అందజేశారు. కాసీపూర్ సమితిలో విద్యావిధానం మరింత మెరుగుపరచాలని, అదేవిధంగా ఆస్పత్రి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రయాణికునికి ఫోన్ అప్పగింత భువనేశ్వర్: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని ఎయిర్ కండిషన్డ్ బోగీలో ప్రయాణికుడు మరిచిపోయిన ఫోనుని భద్రంగా సంబంధీకులకు అప్పగించి టికెటు తనిఖీ సిబ్బంది సేవాభావం చాటుకున్నాడు. హౌరా నుంచి ఖుర్దారోడ్ వరకు టికెటు తనిఖీ విధులు నిర్వహించిన చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లక్ష్మీధర మహంతి సత్వర స్పందనతో ఇది సాధ్యమైంది. ఎం–4 ఎయిర్కండిషన్ బోగీలో ప్రయాణించి వ్యక్తి విలువైన మొబైల్ ఫోను మర్చిపోయి జాజ్పూర్ కెంజొహర్ రోడ్ రైల్వే స్టేషనులో దిగిపోయాడు. రైలు బయల్దేరిపోవడంతో రైల్వే శాఖ సహకారంతో టికెటు తనిఖీ అధికారికి సమాచారం చేరదీయడంతో విధి నిర్వహణలో ఉన్న అధికారి తక్షణమే గాలించి ఆ వ్యక్తి ప్రయాణించిన సీటులో మొబైలు ఫోన్ గుర్తించి తెలియజేయడంతో తదుపరి రైల్వే స్టేషన్లో ఫోను మరిచిపోయిన ప్రయాణికుని బంధువు కటక్ రైల్వే స్టేషన్కు చేరి సంబంధిత చీఫ్ టికెట్ నుంచి మొబైల్ ఫోను తిరిగి పొందగలిగాడు. వివాహిత దారుణ హత్య జయపురం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు పిన్ని వరుస మహిళను కామించి ఆమె నిరాకరించటంతో హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ సంఘటన జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధి జయంతగిరి–మినాగుడ మార్గంలో బుధవారం జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మినాగుడ గ్రామం డొంబు పెంటియ తనకు పిన్ని వరుస అయిన రుక్మిణీ పెంటియపై కన్నువేశాడు. శారీరక సంబంధం కోసం ఆమెను వేధించసాగాడు. బుధవారం రుక్మిణీ పెంటియ జయపురంలో బంగారు నగలు కొనేందుకు బయల్దేరింది. విషయం తెలుసుకున్న డుము పెంటియ జయంతిగిరి–మినాగుడ మార్గంలో ఆమెను అడ్డగించాడు. డొంబు కోరికను ఆమె నిరాకరించడంతో అతడు కోపంతో కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె పడిపోయింది. స్థానికులు గమనించి ఆమెను కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య విద్యాలయ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. రుక్మిణి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బొరిగుమ్మ పోలీసు అధికారి శ్వేత పద్మ సెట్టి వెల్లడించారు. రుక్మిణి భర్త మానసిక రోగి కావటం వల్ల, ఆ అవకాశాన్ని తీసుకొని ఆమెను తన వశం చేసుకోవాలని డొంబు పెంటియ ప్రయత్నించి విఫలమై ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసు అధికారి తెలిపారు. -
స్నానోత్సవానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు: ఐజీ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రకు 15 రోజుల ముందుగా స్నానోత్సవం జరగనుంది. ఏటా జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని శ్రీ మందిరం ప్రాంగణంలో భారీ స్థాయిలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీమందిరం ప్రహరి మేఘనాథ్ ప్రాంగణంలో బహిరంగ మండపంపై మూల విరాట్లకు స్నానోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 11న శ్రీ జగన్నాథుని స్నానోత్సవం జరుగుతుంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సెంట్రల్ రేంజ్ ఇన్స్పెక్టరు జనరల్ (ఐజీ) ఎస్. ప్రవీణ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు వినీత్ అగర్వాల్, అదనపు పోలీసు సూపరింటెండెంటు, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ), ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథ యాత్ర పురస్కరించుకుని శాంతిభద్రతల స్థితిగతుల్ని సమీక్షించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై లోతుగా చర్చించారు. త్వరలో జరగనున్న స్నాన యాత్రలో శాంతిభద్రతల పరిరక్షణతో భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాల్ని మోహరించనున్నట్లు కేంద్ర ఐజీ తెలిపారు. ఈ ఉత్సవానికి సమగ్రంగా 70 ప్లాటూన్ల పోలీసు బలగాల్ని మోహరించనున్నారు. 4 మంది పోలీసు సూపరింటెండెంటు హోదా కమాండెంట్లు, 450 మంది ఇతర స్థాయి అధికారుల్ని నియమించనున్నారు. స్నాన యాత్ర సందర్భంగా పూరీ పట్టణంలో ప్రధానంగా యాత్ర ప్రాంగణం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ప్రత్యేక ఆంక్షలు జారీ చేయనున్నారు. తాత్కాలికంగా వాహనాల కదలికని నియంత్రించనున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ద్వితీయ సర్వ సభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర న్యాయ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ అధ్యక్షతన ఈ సమావేవం జరుగుతుంది. పూరీ రథ యాత్ర ఏర్పాట్లుపై సమగ్రంగా ఈ సమావేశంలో సమీక్షిస్తారు. -
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కాల్పుల్లో అగ్రనేత మృతి
చత్తీస్గడ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్ సుధాకర్ మృతిచెందారు. ఈరోజు(గురువారం) ఉదయం నుంచి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గ పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సుధాకర్ మృత్యువాత పడ్డారు. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చర్యలు చేపట్టింది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు సుధాకర్. అయితే గత ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. సుధాకర్పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభు త్వంతో జరిగిన చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. ఇది గతేడాది నుంచి ఊపందుకోగా, ఈ ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది. ఇదిలా ఉంచితే, మావోయిస్టులపై కేంద్ర చేపడుతున్న చర్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా బంద్కు పిలుపునిచ్చింది. అదే సమయంలో జూలై 11 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. -
విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఆరుగురు మృతి..
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం వేకువజాము వరకు ఆరుగురు రోగులు మృత్యువాతపడ్డారు. వైద్యం వికటించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తుండగా.. అవన్నీ సహజ మరణాలు అయి ఉండవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషాద ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మృతుల్లో నలుగురు ఐసీయూలో ప్రాణాలు వదలడం వివాదాస్పదంగా మారింది. మృతుల్లో భగవాన్ పరజా (68), శుక్ర మజ్జి (45), జగన్నాథ్ పూజారి (54), రుకుని పెంటియా (47), బాటి ఖురా(36), పుల్మతి మజ్జి (29)లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీరందరూ అత్యవసర చికిత్స కోసం వచ్చారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తుకు ఆదేశం.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు రుపక్ తురుక్, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ తదితరులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసు బలగాలను మోహరించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తివాసన్ కళాశాలకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు. ఇవి సహజ మరణాలుగానే అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందన్నారు. తనకు వైద్య పరిజ్ఞానం లేదని, అందుకే ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. కళాశాల సూపరింటెండెంట్ సుశాంత్ మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు రోగుల బంధువులు మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు నర్సులు వచ్చి ఇంజక్షన్లు చేశారని, ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కొక్కరూ మృతి చెందారని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.10 వేలు చొప్పున అందజేసింది. -
మరణ మృదంగం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం వేకువజాము వరకు ఆరుగురు రోగులు మృత్యువాతపడ్డారు. వైద్యం వికటించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తుండగా.. అవన్నీ సహజ మరణాలు అయి ఉండవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషాద ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మృతుల్లో నలుగురు ఐసీయూలో ప్రాణాలు వదలడం వివాదాస్పదంగా మారింది. మృతుల్లో భగవాన్ పరజా (68), శుక్ర మజ్జి (45), జగన్నాథ్ పూజారి (54), రుకుని పెంటియా (47), బాటి ఖురా(36), పుల్మతి మజ్జి (29)లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీరందరూ అత్యవసర చికిత్స కోసం వచ్చారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు.దర్యాప్తుకు ఆదేశం..విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు రుపక్ తురుక్, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ తదితరులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసు బలగాలను మోహరించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తివాసన్ కళాశాలకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు. ఇవి సహజ మరణాలుగానే అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందన్నారు. తనకు వైద్య పరిజ్ఞానం లేదని, అందుకే ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. కళాశాల సూపరింటెండెంట్ సుశాంత్ మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు రోగుల బంధువులు మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు నర్సులు వచ్చి ఇంజక్షన్లు చేశారని, ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కొక్కరూ మృతి చెందారని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.10 వేలు చొప్పున అందజేసింది. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: జిల్లా అబ్కారీ సూపరింటెండెంట్ ప్రదీప్కుమార్ సాహు ఆదేశాల మేరకు మొబైల్ యూనిట్ గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనిలో భాగంగా పర్లాకిమిడి కొత్త బస్టాండ్, భవానీ టాకీస్ వద్ద బైక్పై గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52 కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్ పటేల్, యసై మఝి శోబోరో, మోడల్ ఇన్స్పెక్టర్ మోనూ ఆయాల్ తదితరులు పాల్గొన్నారు. నాటుసారా తరలిస్తున్న ముగ్గురు అరెస్టు జయపురం: నాటుసారాను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారీ అధికారి సుబ్రత కేశరీ హరిస్ బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి గొడొపొదర్ పంచాయతీ దుబులి గ్రామానికి చెందిన త్రినాథ్ పొరజ, జయపురం సబ్డివిజన్ నువాగుడ వాసి ఆకాశ హరిజన్, నువాపుట్ గ్రామ వాసి ఈశ్వర బిశాయి ఉన్నారన్నారు. వీరిని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు సుబ్రత్ కేశరీ హరిష్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఎకై ్సజ్ అధికారి హరిష్, ఏఎస్సై బలరాం దాస్లు తమ సిబ్బందితో పెట్రోలింగ్ జరుపుతుండగా నాటుసారా తీసుకెళ్తున్న ముగ్గురు పట్టుబడినట్టు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. -
ఆవుల అక్రమ తరలింపునకు చెక్
జయపురం: ఆవుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ వద్ద మంగళవారం సాయంత్రం కొంతమంది అక్రమంగా గోవులను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 75 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసిటన్టు బుధవారం తెలిపారు. జయపురం సమితి జయంతిగిరి సంత నుంచి ఆవులను నడిపించుకుంటూ బొరిగుమ్మ రాణిగుడ మార్గం గుండా కొరాపుట్ వైపు తీసుకెళ్తుండగా బిసింగపూర్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో సెమిలిగుడ వ్యాపారి ఒకరు ఉన్నట్టు వెల్లడించారు. ఆవులను జయంతిగిరి వారపు సంత నుంచి బొరిగుమ్మ, రాణిగుడ మీదుగా కుందులి సంతకు వెళ్లి అచ్చట నుంచి ఆవులను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు తీసుకెళ్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో గోవుల రవాణాపై అధికారులు ఆంక్షలు విధించినప్పటికీ అనేక మార్గాలలో వ్యాపారులు గోవులను తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కొరాపుట్ జిల్లాలో గోవులను సేకరించి వాటిని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. గత మే నెలలో పలుసార్లు గోవుల రవాణా చేస్తూ అనేక మంది పోలీసులకు చిక్కిన విషయం విదితమే. గత మే 27వ తేదీన పశువులు రవాణా చేసే కంటైనర్లను పట్టుకొని 210 పశువులను పట్టుకున్న సంఘటనలో 17 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మరువక ముదే మంగళవారం సాయంత్రం 76 ఆవులతో ముగ్గురు పట్టు బడ్డారు. 76 ఆవులు స్వాధీనం ముగుర్గు అరెస్టు -
వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడి మృతి
రాయగడ : వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతిచెందాడంటూ కుటుంబ సభ్యులు బ్లడ్బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక న్యూకాలనీలో నివాసముంటున్న మధుసూదన్ టరికి కుమారుడు తొమ్మిదేళ్ల రాజీవ్ టకిరి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. జ్వర తీవ్రత పెరగడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడికి రక్తం తక్కువగా ఉందనే, వెంటనే రక్తాన్ని ఎక్కించాల్సి ఉందని వైద్యులు సూచించారు. బాధితులు వెంటనే రక్త నిధికి వెళ్లగా నిల్వలు లేవని చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రక్తనిధి కేంద్రం డాక్టర్ గౌతం పట్నాయక్ వచ్చి అవసరమైన రక్తం ఉందని చెప్పి రాజీవ్కు రక్తం ఎక్కిస్తుండగా బాలుడు మృతి చెందాడు. దీంతో కోపోద్రుక్తులైన బాధిత కుటుంబీకులు రక్తం రాత్రి లేదని చెప్పి.. తెల్లవారే సరికి ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆందోళనకు దిగారు. రాత్రే రక్తం ఎక్కిస్తే తమ కొడుకు బతికేవాడంటూ విలపించారు. స్థానిక సేవా సంస్థలు విరివిగా బ్లడ్ డొనేషన్ శిబిరాలు నిర్వహిస్తూ ఆయా సంస్థలు సేకరించిన రక్త యూనిట్లను ప్రభుత్వ రక్తనిధికి తరలిస్తుంటే.. ఇక్కడ రక్తం లేదని చెప్పడం తగదని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
విజిలెన్స్ వలలో ఏఎస్ఐ
● రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం రాయగడ: పది వేల రుపాయల లంచం తీసుకుంటూ విజిలెన్స్ వలకు చిక్కారు బరంపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బబిత సునా. ఓ కేసుకు సంబంధించి మహిళను బరంపురం మహిళా పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి ఉంచారు. ఈ కేసును బబిత విచారిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే అందుకు రూ.10 వేలు చెల్లించాలని, లేదంటే వేరే కేసులపై అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని బబిత చెప్పారు. బాధితురాలు ఈ మేరకు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. వల పన్నిన విజిలెన్స్శాఖ అధికారులు ఏఎస్ఐ లంచం తీసుకుంటుండగా బుధవారం పట్టుకున్నారు. ఆమైపె కేసు నమోదు చేశారు. -
తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: అను మతి లేకుండా తుపాకులు కలిగి ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఆదర్శపోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రఫుల్ల జగరంగ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుసాని సమితి తులసిపాడు, డాక్టర్ బంజిరి వద్ద ఇద్దరు వ్యక్తులు ఎస్బీఎంఎల్ (సింగిల్ బ్యారిల్ లోడింగ్) తుపాకులతో పట్టుబడ్డారు. వీరిని పోలీసులు విచారించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో రాయగడ జిల్లా పుట్టాసింగి పంచాయతీ రెజింగ్తల్ గ్రామానికి చెందిన అరుణ్ గోమాంగో, ప్రతాప్ గోమంగోగా పోలీసులు గుర్తించారు. వారిపై 112/2025, సెక్షన్.25(1)(ఎ) ఆర్మ్స్ చట్టం క్రింద అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ రక్షణ కింద నిందితులను అదుపులోకి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలిపారు. -
బ్రిడ్జి నిర్మించారు.. రోడ్డు మరిచారు..!
రాయగడ: జిల్లాలోని కెరడ సమితి పరిధిలోని కిలిమిసిగుడ గ్రామస్తులు రాకపొకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామ ప్రజలు సమితి కేంద్రానికి రావాలంటే మధ్యలోని నాగావళి నదిని దాటుకుంటూ వెళ్లాల్సిందే. అయితే గ్రామస్తులు అవస్థలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టింది. అయితే బ్రిడ్జి పనులు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా అందుకు సంబంధించి ఇంతవరకు అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టక పొవడంతో గ్రామస్తుల రాకపోకలు నరకంగా మారాయి. వర్షాకాలం ముందుగా రోడ్డు పనులు పూర్తి చేయకపొతే వీరికి నరకయాతన తప్పదు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అక్రమాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి సమావేశం బుధవారం జరిగింది. సమితి అధ్యక్షులు దీప్తిమయి నాయిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాలొన్నారు. ఈ సందర్బంగా ఆయన సమితిలో జరిగిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు నకిలీ బిల్లుల సమర్పించి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అటువంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు నల్లబజారులో విక్రయిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే నల్ల బజారుపై చర్యలు చేపట్టాలని వ్యవసాయ విభాగ అధికారులను ఆదేశించారు. అలాగే సమితి విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు విద్యాధికారి సుభాష్ చంధ్ర మఝి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కమతా, బొరిగుమ్మ రైతులకు వెంటనే రెండు వేల బస్తాల డీఏపీ ఎరువులు సమకూర్చాలని ఫోన్ ద్వారా మార్క్ఫెడ్ అధికారిని ఆదేశించారు. 2020 నాటికి పూర్తి కావలసిన మెగా తాగునీటి ప్రాజెక్టు నేటికీ పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ ప్రాజెక్టుపై సమితి సభ్యుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు నలుగురుతో ఒక టీమ్ను ఏర్పాటు చేయాలని బీడీవో సుకాంత కుమార్ పట్నాయక్ను ఆదేశించారు. సమావేశంలో నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి రామ చంధ్ర పాఢి, సమితి ఉపాధ్యక్షులు రాధాకాంత సామంతరాయ్, జిల్లా పరిషత్ సభ్యులు ప్రసాద్ బిడిక, నృశింహనాత్ శతపతి, బొరిగుమ్మ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గంతాయిత్, డిక్టర్ దిలీప్ కుమార్ నాథ్, సీడీపీవో గాయిత్రీ బాహిణీపతి, ఇంజినీర్ సత్యనారాయణ సెటి పాల్గొన్నారు. -
దేశానికి బలం ప్రజలే
భువనేశ్వర్: రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలు, యువత, ఉపాధ్యాయులు, చేతివృత్తులవారు.. ఇలా అన్ని వర్గాల ప్రజలే దేశానికి బలమపి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన ఉత్కర్ష్ నిమాపడా కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సమ్మిళిత వృద్ధి, స్థానిక ఆకాంక్షలకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. ప్రజా కేంద్రీకృత అభివృద్ధికి అర్థవంతమైన ఆవిష్కరణకు దోహదపడే ఈ చొరవను కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడాను ఆయన ప్రశంసించారు. ఈ ప్రాంతంలో యువతకు సాధికారత కల్పించి స్థానిక ప్రతిభను వెలుగులోకి తెచ్చే స్టార్టప్ల ప్రోత్సాహానికి ఇటువంటి కార్యక్రమాలు వారధిగా నిలుస్తాయని ప్రోత్సహించారు. వ్యవసాయ కార్యకలాపాల ఆధునికీకరణ, డిజిటల్ వృద్ధి విస్తరణతో సమగ్ర సామర్థ్యత ఆవిష్కరణకు మార్గం సుగమం చేస్తుందన్నారు. గత 11 నెలల్లో రాష్ట్రం సమగ్ర వృద్ధిలో వ్యవసాయం, పర్యాటకం, మహిళలు, పిల్లలు వంటి కీలక రంగాల అభివృద్ధి, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు గణనీయమైన పురోగతిని సాధించాయని వివరించారు. కార్యక్రమానికి సారథ్యం వహించిన ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిదా ఈ సమావేశాన్ని నిమాపడా పురోగతికి ఒక మేలుకొలుపుగా అభివర్ణించారు. 2036 నాటికి అభివృద్ధి చెందిన ఒడిశా రూపకల్పనకు నిమాపడా కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించడంలో ఈ చర్చలు సహాయపడతాయని పేర్కొన్నారు. జగత్సింగ్పూర్ లోక్సభ సభ్యుడు బిభు ప్రసాద్ తొరాయ్ ఈ సభలో ప్రసంగించారు. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వంయి, సత్యబాది నియోజకవర్గ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ మిశ్రా, పూరీ ఎమ్మెల్యే సునీల్ మహంతి, బ్రహ్మగిరి ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్రొ, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రథచక్రాలు సిద్ధం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ స్వామి యాత్రకు మూడు భారీ రథాల చక్రాల తయారీ పనులు పూర్తయ్యాయి. దీంతో శ్రీ మందిరం సింహద్వా రం అభిముఖంగా చేరేందుకు వీలుగా ఇరుసుకు అమరిన చక్రాల్ని సురక్షితంగా తరలించి క్రమ పద్ధతిలో నిలిపారు. రథాల తయారీ ప్రాంగణంలో నిత్యం రెట్టింపు ఉత్సాహంతో పనులు పుంజుకుంటున్నాయి. దశల వారీగా రథాల తయారీ పనులు నిరవధికంగా సాగుతున్నాయి. చక్రాల తయారీ తర్వాత ఇరుసుతో అనుసంధానం కీలకమైన దశ. తదనంతరం ఒక్కో ఇరుసుకు చక్రాల్ని అమర్చడం బృహత్ ప్రక్రియ. ఇదంతా ముగియడంతో తదుపరి పనులకు అనుకూలతకు అనుగుణంగా చక్రాల్ని క్రమ పద్ధతిలో సురక్షితంగా తరలించి సింహ ద్వారం ముంగిటకు చేర్చడం సవాలుతో కూడిన ప్రక్రియ. భోయ్, మహరణ, వర్గం సేవకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రక్రియని బుధవారం విజయవంతంగా ముగించారు. తొలుత బలభద్ర స్వామి తాళ ధ్వజం తరువాత జగన్నాథుని నందిఘోష రథం చివరగా దేవీ సుభద్ర దర్ప దళనం రథానికి వరుస క్రమంలో అన్ని చక్రాల్ని ఇరుసుకు జోడించారు. అనంతరం మూడు రథాల అధిపతి మహారణ, భోయ్ సర్దార్ రవి భోయ్ ఆధ్వర్యంలో మూడు రథాల చక్రాల తరలింపు దిశను నిర్ణయించారు. రథ యాత్ర ముందురోజున స్వామి ఆగమనం కోసం శ్రీ మందిరం సింహద్వారం ముంగిటకు ఎటువంటి అడ్డంకులు లేకుండా రథాల్ని తరలించేందుకు వీలుగా రథ తయారీ శాల ఆవరణ నుంచి తరలించారు. తదుపరి కార్యకలాపాలకు అంతరా యం తలెత్తకుండా చక్రాలు స్థిరంగా ఉండేందుకు వీలుగా పతి చక్రానికి ఇరు వైపులా మామిడి చెక్కల్ని అడ్డుగా ఏర్పాటు చేశారు. -
తులసీ పాహడ్లో కలెక్టర్ పర్యటన
మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితి తులసీ పాహడ్లో కలుక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ తొలిసారిగా పర్యటించారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఈ పర్వత ప్రాంతాల్లో జనం భయంభయంగా బతికేవారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ఇక్కడి పిల్లలు సైతం పాఠశాలల్లో చేరుతున్నారు. ఈ తరుణంలో కలెక్టర్ టెమురుపల్లి పంచాయతీ తులసీ, కీరమెట్ల, మారియా బెడా, చేరు కట్లా తదితర గ్రామాల్లో పర్యటించారు. పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అంతకుముందు తులసీ పాహడ్ వద్ద బీఎస్ఎఫ్ క్యాంపును సందర్శించారు. కార్యక్రమంలో ఎస్పీ వినోద్ పటేల్, మత్తిలి గ్రామీణాభివృద్ధి విభాగం అధికారి కార్తీక్ నాయిక్, మత్తిలి బీడీఓ ప్రమోద్ కుమార్ బెహరా, సమితి ఈఈ హృదయ రంజన్ బాఘ్, ఏపీఓ లింగరాజ్ కరకరియా, సర్పంచ్ తుంబేశ్వర్ సమార్ద్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ భూమి
● ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి ● రెవెన్యూ వర్క్షాప్ ప్రారంభం భువనేశ్వర్: రెవెన్యు విభాగం పాలనా వ్యవస్థలో తహసీల్దార్లు వెన్నెముక వంటివారని, ప్రజా ఫిర్యా దులను త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించాల ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. తహసీల్దారు కార్యాలయం ప్రజలకు భయానక ప్రదేశంగా కాకూడదని, నమ్మకమైన ప్రదేశంగా ఉండాలని చెప్పారు. స్థానిక లోక్ సేవా భవన్లో బుధవారం రాష్ట్ర రెవెన్యూ అధికారుల సమావేశం, వర్క్షాప్ ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూముల నిర్వహణ వ్యవస్థని ఆధు నీకరించి ప్రజా ఆధారితంగా మార్చేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీని ప్రకారం ఒడిశాలో ఎవరూ భూమి లేనివారుగా ఉండరని హామీ ఇచ్చారు. 4 డెసిమల్ కంటే తక్కువ భూమి ఉన్న వారిని కూడా భూమి లేనివారిగా పరిగణిస్తారని, ప్రభుత్వం వారికి సైతం భూమిని అందిస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రెవెన్యు అధికారుల పాత్ర కీలకమన్నా రు. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందని, అక్రమార్కుల నుంచి ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకుని సద్వినియోగపరచాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం రెవెన్యూ రంగాలలో అనేక సంస్కరణలను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గిరిజనులు, షెడ్యూల్డ్ కులాల భూముల అమ్మకం, కొనుగోలులో తరచుగా అక్రమాలు జరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు నిర్ధారిత కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) ప్రకారం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి మాట్లాడుతూ విధి నిర్వహణలో సాధారణ పని పద్ధతులను మార్చుకు ని సరికొత్త ఆలోచనా విధానంతో ప్రజలకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దేవరంజన్ కుమార్సింగ్, కేంద్ర రెవె న్యూ కమిషనర్ బి.డెమిరియన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మనో జ్ ఆహుజా, రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, అన్ని జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రైతు చైతన్య రథం ప్రారంభం
జయపురం: జయపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రైతు చైతన్య రథా న్ని సబ్కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డి జెండా ఊపి ప్రారంభించార. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎలా విక్రయించాలో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో సంచరిస్తుంది. ప్రతి సమితిలో మూడు రథాలు ఏర్పాటు చేస్తున్న ట్లు ఆమె వెల్లడించారు. రైతుల సౌలభ్యం కోసం మండీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏ మండీలో గిడ్డంగి సౌకర్యం లేదో అక్కడ ధాన్యం తడవకుండా తార్పలిన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షంనీరు నిల్వ ఉండకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్కలెక్టర్ వెల్లడించారు. టోకెన్ ఉన్న రైతులందరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్ప చేశారు. రైతులు ధాన్యం శుభ్రపరిచి తీసుకు రావాలని సూచించారు. ధాన్యం అమ్మకంలో ఎటువంటి సమస్య ఎదుర్కొన్న వెంటనే కంట్రోలు రూంకు ఫోను ద్వారా తెలియజేయాలన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ కార్యదర్శి డైరెక్టర్లు బాలా రాయ్, దేవేంద్ర బాహిణీపతి, నవీణ నాయిక్ పాల్గొన్నారు. -
బంగారం దుకాణం యజమానిపై దాడి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులో ఉన్న ప్రసాద్ బంగారం దుకాణం యజమానిపై దాడి జరిగింది. దుకాణాన్ని ముసేవేసి బంగారంతో ఉన్న బ్యాగ్తో ఇంటికి వెళ్తున్న యజమాని ప్రసాద్ పేల్పై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు దాడి చేశారు. అతని చేతిలో ఉన్న బ్యాగ్ను దుండగులు లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు వెంటనే మల్కన్గిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాధు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్డీపీవో దివ్యడలై, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో కూడా ప్రసాద్ ఇంట్లో బంగారం చోరీకి గురైంది. యాదవుల కలశ యాత్ర రాయగడ: జమ్మూకశ్మీర్ నుంచి బయలు దేరి రాయగడకు చేరుకున్న కలశయాత్రకు ఉత్కళ యాదవ సంఘం రాయగడ శాఖ సభ్యులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. జమ్మూకశ్మీర్లో అఖిల భారతీయ యాదవ సంఘం చేపట్టిన ఈ కలశ యాత్ర ఊరేగింపులో భాగంగా ఇక్కడకు చేరుకొని ప్రధాన వీధుల మీదుగా రాయగడ కళాశాల సమీపంలోని రాధా కృష్ణ మందిరం వరకు కొనసాగింది. కార్యక్రమంలో గోపాల్ సంఘం యువ విభాగం అధ్యక్షుడు అమర్ గోపాల్, జిల్లా కార్యదర్శి ప్రతాప్ చంద్ర గౌడో, కోఆర్డినేటర్ గోపినాథ్ గౌడో పాల్గొన్నారు. మాదకద్రవ్యాలతో అనర్థం రాయగడ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత బంగారు భవిష్యత్ అంధకారమవుతుందని కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో బుధవా రం జిల్లా అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అబ్కారీ శాఖ అధికారి సంతోష్కుమార్ ధల్, ఆర్టీఓ రాజ్కిషొర్ బెహరా, జిల్లా విద్యాశాఖ అధికారి రామ నాహ క్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ భవన నిర్మాణం అడ్డగింత కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కేటీ రోడ్లో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నిర్మితమవుతున్న అక్రమ భవన నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేసి సదరు బిల్డింగ్ యజమాని నిర్మాణ పనులను కొనసాగిస్తుండగా, కమిషనర్ నడిపిన రామారావు ఆదేశానుసారం పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ సిబ్బంది సదరు నిర్మాణ పనులను బుధవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ పురపాలక సంఘంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేస్తే సదరు బిల్డింగ్ యజమానులపై కేసులు వేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అక్రమ భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, నిబంధనల మేరకు నడుచుకోవాలని హెచ్చరించారు. గుండెపోటుతో కళాకారుడు మృతి కంచిలి: గ్రామదేవత ఉత్సవాల్లో స్టేజీ ప్రోగ్రా మ్ ఇచ్చేందుకు వచ్చిన ఒక కళాకారుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం కంచిలిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవా రం రాత్రి కంచిలి ఉత్సవాల్లో భాగంగా సినీ డూప్స్ స్టేజీ ప్రోగ్రాం ఇచ్చేందుకు కళాకారుల బృందం ఉదయమే వచ్చారు. వీరు మంగళవారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో ప్రదర్శన ఇచ్చి, అటునుంచి ఇక్కడికి వచ్చారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోడానికి స్థానిక మఠం చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో బాలకృష్ణ డూప్గా నటిస్తున్న సప్ప కల్యాణ్(65) చెరువు గట్టు మీద ఒక చెట్టుకింద కూర్చొని గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఇతనిది విశాఖపట్నం జిల్లా గాజువాక పెద్దగంట్యాడ ప్రాంతం. తోటి కళాకారుడు మృతి చెందడంతో ఉత్సవ కమిటీ సభ్యులు ఈ ప్రదర్శనను రద్దు చేశారు. -
మత్తుకు దూరంగా ఉండాలి
మల్కన్గిరి: మత్తుపదార్థాలకు దూరంగా ఉండాల ని అధికారులు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాల యం ప్రాంగణంలో కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్శాఖ సిబ్బంది మాదక ద్రవ్యాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన చైతన్యరథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధన్ బుధవారం ప్రారంభించారు. ఈ రథం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగంతో వాటిల్లే నష్టంపై ఏడు సమితుల్లోని 111 పంచాయతీల్లో ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి బింబధర్ పండా, సిబ్బంది పాల్గొన్నారు. -
త్యాగం చేశాం.. న్యాయం చేయండి
● ఆప్షోర్ నిర్వాసితుల విన్నపం మెళియాపుట్టి: రేగులపాడు ఆప్షోర్ కోసం సర్వం త్యాగం చేసిన తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు. చీపురుపల్లిలో నిర్వాసితులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తిలు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి నిర్వాసితులు వినతిపత్రాలు అందజేశారు. ప్రాజెక్టు కోసం సొంతూరు, స్థలాలు, పొలాలు, ఇళ్లు త్యాగం చేసిన తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రాజెక్టు ప్రారంభించి 16 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నిర్వాసితులకు న్యాయం జరగలేదన్నారు. బడ్జెట్ ప్రతీ ఏడాది పెరుగుతున్నా.. నిర్వాసితుల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం 460 జీవో ప్రకారం హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన ప్రాప్తికి ప్యాకేజీలు అందించాలని, ఇప్పటికీ కూడా 132 మందికి ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయన్నారు. సోషల్ ఎకనామిక్లో లేని 40 కుటుంబాలకు వెంటనే సర్వేచేసి పరిహారాలు అందజేయాలని వారి దృష్టికి తీసుకెళ్లారు. పునరావాస కాలనీల్లో ఇప్పటికీ రహదారులు, వీధిదీపాలు, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సర్పంచ్ యవ్వారి ఈశ్వరరావు, నిర్వాసితుల రాష్ట్ర కార్యదర్శి గంగారపు సింహాచలం, సీపీఐ కార్యదర్శి చాపర వెంకటరమణ, దొర విజయ్ కుమార్, కిరణ్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాంతీయ స్థాయి సంబంధాలు అన్వేషించాలి
భువనేశ్వర్: బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు వియత్నాం సందర్శించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సరికొత్త ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చారు. ఒడిశా మరియు వియత్నాంలోని డా నాంగ్ నగరం మధ్య ప్రాంతీయ స్థాయి సంబంధాలను అన్వేషించాలని ప్రతిపాదించారు. వియత్నాం పర్యటనలో భాగంగా డా నాంగ్ పీపుల్స్ కమిటీ చైర్మన్ లే ట్రుంగ్ చిన్తో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఒడిశా ఘన చరిత్ర, బలమైన సాంస్కృతిక సంప్రదాయాలు, వేగవంతమైన ఆర్థిక వృద్ధి కలిగిన రాష్ట్రమని వివరించారు. రాష్ట్రంలో చాలా ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. డా నాంగ్ ఆసక్తి కలిగి ఉంటే, మన రెండు ప్రాంతాల మధ్య సంబంధాలను బలపరిచేందుకు మనం అన్వేషించవచ్చునన్నారు. డా నాంగ్ చారిత్రాత్మక నగరం డా నాంగ్ భారీ పురోగతి సాధిస్తున్న అందమైన చారిత్రాత్మక నగరమని కంభంపాటి హరిబాబు ప్రశంసించారు. డా నాంగ్ ఒక ప్రధాన ఓడరేవు, ఉన్నత సాంకేతికత కేంద్రంగా, ఆర్థిక మరియు పర్యాటక కేంద్రంగా ఎదగడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. మధ్య వియత్నాంలో శక్తివంతమైన తీరప్రాంత నగరంగా డా నాంగ్ భారతదేశం మరియు వియత్నాం మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారానికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బుద్ధుని పవిత్ర అవశేషాల కోసం చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు వియత్నాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బౌద్ధ మతం దాదాపు 1800 సంవత్సరాలుగా భారతదేశం, వియత్నాం మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరిచిందన్నారు. భారతదేశం బౌద్ధ వారసత్వాన్ని విలువైనదిగా పరిగణించి బౌద్ధ స్థలాల రక్షణ, సంరక్షణ మరియు ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య సహకారం వాణిజ్యం, రక్షణ, పర్యాటకం, ఆరోగ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, విద్య మరియు స్థిరమైన అభివృద్ధి వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తరిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. యోగా, సాంస్కృతిక మార్పిడి మరియు విద్యా సంబంధాలను ప్రోత్సహించడానికి భారత రాయబార కార్యాలయంతో కలిసి పని చేయడంలో డా నాంగ్ మద్దతును అభినందించారు. రెండు దేశాల మధ్య మరిన్ని ప్రత్యక్ష విమానాలు ఇరుప్రాంతాల ప్రజల సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడ్డాయని పేర్కొన్నారు. మధ్య వియత్నాంలోని మైసలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో పురాతన దేవాలయాలను పునరుద్ధరించడంలో భారత పురావస్తు బృందం చేసిన కృషిని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశం మరియు వియత్నాం మధ్య సన్నిహిత చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలకు బలమైన చిహ్నంగా మారిందన్నారు. వియత్నం పర్యటనలో గవర్నర్ హరిబాబు ప్రతిపాదన డా నాంగ్ పీపుల్స్ కమిటీ చైర్మన్ లే ట్రుంగ్ చిన్తో సమావేశం -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..!
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025అల్పపీడనం ప్రభావంతో... బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రుతు పవనాలు ఒడిశా ప్రాంతానికి సాధారణం కంటే వారం ముందుగానే ప్రవేశించాయి. అయితే తదుపరి పురోగతి లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రొజ్జొ పండుగ వరకు రాష్ట్రవ్యాప్తంగా రుతు పవనాల కదలికలు లేకపోయే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి రుతు పవనాలు తాత్కాలికంగా విరామం పొందినట్లేనని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మొదట్లో చెల్లాచెదురుగా వర్షాలు కురిపించిన రుతుపవనాల ముందస్తు తిరోగమనం ఈ పరిస్థితికి కారణమని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు భువనేశ్వర్లో గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. 67.2 శాతం తేమ స్థాయి కారణంగా నగరంలో తీవ్రమైన ఉక్కపోత వాతావరణం నెలకొంది. రాష్ట్రస్థాయిలో బాలాసోర్లో అత్యధిక ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తదుపరి స్థానాల్లో పూరీలో 34.6 డిగ్రీల సెల్సియస్, చాంద్బాలిలో 33.4 డిగ్రీల సెల్సియస్, పారాదీప్లో 32.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. భువనేశ్వర్: రాష్ట్రంలో రుతు పవనాలు ఊరించి ఊరుకున్నాయి. వారం రోజులు ముందుగానే ఈ ఏడాది రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయనే ఆనందం వెంటనే ఆవిరైపోయింది. ప్రస్తుతం రుతు పవనాల కదలిక మందగించడంతో అధిక ఉష్టోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పులతో రుతు పవనాల కదలిక బలహీన పడిందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈనెల మధ్యకాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాజా వాతావరణ సూచన జారీ అయింది. జూన్ మధ్య వరకు రాష్ట్రంలో రుతు పవనాలు పుంజుకునే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా అంచనా. రాష్ట్ర వాతావరణంలో ఉష్ణోగ్రత మరియు తేమ స్థాయిలు స్థిరంగా కొనసాగనున్నాయి. మారుమూల ప్రాంతాల్లో వర్షాలు తీరప్రాంత ఒడిశాలో తీవ్రమైన వేడి కొనసాగుతుండగా మల్కన్గిరి, కొరాపుట్, రాయగడ, కెంజొహర్, సుందర్గఢ్ వంటి అంతర్గత జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిపించే కాల వైశాఖి వాతావరణం అలముకుని ఉంది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక ఉపశమనం లభిస్తోంది. కాగా పూరీ, ఖుర్ధా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రాపడా, జాజ్పూర్, భద్రక్, బాలాసోర్, గంజాం, గజపతి మరియు నయాగఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ వడగాడ్పుల హెచ్చరిక జారీ చేసింది. ఈ జిల్లాల్లో వేడి మరియు తేమతో కూడిన ఉక్కపోత పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఈనెల 6వ తేదీ వరకు 11 తీరప్రాంత జిల్లాల్లో వడగాడ్పుల వాతావరణం నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ ఉంది. గత నెల 31 నుంచి రాష్ట్రంలో రుతుపవన వర్షాలు తగ్గాయి. న్యూస్రీల్ ఊరించి ఊరుకున్న రుతు పవనాలు అమాంతం పెరిగిన ఉష్టోగ్రతలు అల్లాడుతున్న ప్రజలు -
కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ
జయపురం: ఈ విద్యా సంవత్సరం నుంచి జయపురం కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమవ్వనున్నాయి. దీంతో తమ పిల్లలను విద్యాలయంలో చేర్పించేందుకు తల్లిదండ్రులు దరఖాస్తుల కోసం క్యూ కడుతున్నారు. సోమవారం నుంచి దరఖాస్తులు పంపిణీ ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్ స్కానర్ ద్వారా దరఖాస్తు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 241 దరఖాస్తులను ప్రజలు ఉచితంగా తీసుకున్నారు. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయనున్నారు. అనంతరం ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రథమ సంవత్సరం 1 నుంచి 5వ తరగతులు ప్రారంభించనున్నారు. ఒక్కొక్క తరగతిలో 40 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. ఎట్టకేలకు నిందితుడు అరెస్టు జయపురం: ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి జరిపి గర్భవతిని చేసి పరారైన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. బొరిగుమ్మ సమితి బీజేపీ నేత కుమారుడైన నిందితుడు రాజేంద్ర బొత్రను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. రాజేంద్ర ఒక మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఘటనను మాఫీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వదంతులు ఉన్నాయి. ఈ విషయం బయట చెబితే చంపుతానని బాధిక కుటుంబాన్ని బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. వైభవంగా అమ్మవారి పండగలు పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి మండళదేవి గ్రామంలో అమ్మవారి పండగలు ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారి పండగల చివరి రోజు కావడంతో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హాజరయ్యారు. సుదీర్ఘ పదేళ్ల తర్వాత మండలదేవి గ్రామంలో అమ్మవారి పండుగలు జరుపుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధువర్గం విచ్చేసి అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. శబరి నదిలో మునిగి యువకుడు మృతి మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి పోటేర్ పంచాయతీ కన్యాశ్రమం సమీపంలోని శబరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు నదిలో మునిగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పోటేర్కు చెందిన అరుణ్ గౌడ్ అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం స్నానానికి వెళ్లాడు. అయితే అటునుంచి ఆయన ఇంటికి రాలేదు. ఎక్కడికో స్నేహితులతో వెళ్లుంటాడు అని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కాగా మంగళవారం ఉదయం పోడియా సమితి ఉండరుకండ పంచాయతీ ఎంపీవీ 57 గ్రామం వద్ద శబరి నది ఒడ్డున మృతదేహం తేలుతూ కనిపించింది. వెంటనే స్థానికులు కలిమెల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. -
సెప్టిక్ ట్యాంక్లో పడి నలుగురు మృతి
కొరాపుట్: నిర్మితమవుతున్న సెప్టిక్ ట్యాంక్లో ప్రమాదవశాత్తు నలుగురు యువకులు మంగళవారం మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నందాహండి సమితి పడాల్గుడ గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మితం అవుతోంది. అందులో దిగిన ముగ్గురు కార్మికులు అమిర్ కొర (30), త్రిలోచన్ బోత్ర (25), లలూ రణ (26)లు అక్కడికక్కడే అచేతన స్థితికి గురయ్యారు. ఇది గమనించిన మిగతా కార్మికులు భయాందోళనతో కేకలు వేశారు. ఇది తెలుసుకున్న స్థానిక వ్యాపారస్తుడు ఎన్.సంతు (28) వారిని రక్షించడానికి లోపలకి దిగగా అతను కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో మరెవ్వరూ లోపలకి దిగడానికి సాహసం చేయలేకపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి నలుగురిని బయటకు తీశారు. వీరిని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సంతుని ఐసీయూలోనికి తరలించి చికిత్స అందిస్తుండగా అతను కూడా మృతి చెందాడు. ఈ వార్త జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి స్పందిస్తూ తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతి చెందిన ప్రతీ కుటుంబంకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జిలు స్పందిస్తూ మృతులకు సంతాపం ప్రకటించారు. -
కొరాపుట్ జిల్లాకు రెజంగళ రాజ్ కలశ యాత్ర
జయపురం: చైనా యుద్ధంలో మరణించిన వీర సైనికులకు గుర్తుగా దేశవ్యాప్తంగా చేపడుతున్న రెజంగళ్ కలశ యాత్ర మంగళవారం కొరాపుట్ చేరింది. కొరాపుట్ జిల్లా యాదవ మహాసభ సభ్యులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. మహా సంఘ జిల్లా అధ్యక్షుడు మదన మోహన్ నాయిక్ నేతృత్వంలో కార్యదర్శి రాజేంద్ర కుమార్ గౌడ, యాదవ మహాసంఘ రాష్ట్ర యువ సమాజ్ అధ్యక్షుడు అమర నాయిక్, ఉపాధ్యక్షుడు అమిత్ నాయిక్, కవిరాజ్ పరమేశ్వర పాత్రో, పరశురాం నాయిక్ మొదలైనవారు స్వాగతం పలికి యాదవ భవనానికి తోడ్కొని వచ్చారు. కార్యక్రమంలో ప్రమోద్కుమార్ గౌడ, నరేంద్ర నాయిక్, రబీ నారాయణ గౌడ, రామచంద్ర మహంకుడో, హరిగౌడ, విజయ గౌడ తదితరులు పాల్గొన్నారు. -
4 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి గుజరాత్కు అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యవకులను ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవా పోలీసులు తనిఖీలు నిర్వహిండగా.. బీహార్లోని బాగల్పూర్జిల్లా కాసరి గ్రామానికి చెందిన ఎండీ షెకావత్ అనే యువకుడు, ఒడిశాలోని గంజాం జిల్లా పాత్రపూర్బ్లాక్ ధర్మపూర్ గ్రామానికి చెందిన దల బెహర చిత్రసేన్ అనే యువకుడు బ్యాగ్లలో 3.990 గ్రాములు గంజాయితో పట్టుబడ్డారు. బీహార్కి చెందిన ఎండీ షెకావత్ అనే వ్యక్తి గుజరాత్ రాష్ట్రం వాపిలో నివాసముంటూ చిత్రసేన్ ద్వారా ఒడిశా నుంచి గంజాయిని తీసుకెళ్లి అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రసేన్ గంజాయిని తీసుకొచ్చి షెకావత్కి అందజేసే క్రమంలో పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరలించారు. అక్రమ రవాణాను అడ్డుకున్న పట్టణ పోలీసులను ఎస్పీ అభినందించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై ముకుందరావు, పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా కంచమ్మతల్లి వారోత్సవాలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో నిర్వహిస్తున్న కంచమ్మతల్లి గ్రామదేవత ఉత్సవాలు రెండోరోజు మంగళవారం వైభవోపేతంగా జరిగాయి. అమ్మవారిని పీఠస్థానం నుంచి మఠం కంచిలి తీసుకొచ్చి, అక్కడి నుంచి ఊరేగింపుగా మెయిన్రోడ్డులోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నాగదేవతలు, అమలాపురం కేరళ డ్రమ్స్, పద్మనాభపురం దూమ్ ధడాకా, పాలబొమ్మలు, స్థానిక కళాకారుల గ్రూపు డ్యాన్స్, రాజమండ్రి సినీ కోయడ్యాన్స్ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుల చేసిన బొడ్డపాడు కళాకారుల జానపదాలు అలరించాయి. రైల్వేస్టేషన్ కూడలిలో మెయిన్రోడ్డు పక్కన కంచమ్మతల్లి అమ్మవారి నమూనా విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. బంగారు, వజ్రాభరణాలను అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
ఇసుకాసురుల ముందుచూపు!
శ్రీకాకుళం రూరల్ : ఉచిత ఇసుక విధానం కూటమి నేతల పంట పండిస్తోంది. కొందరు నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక వ్యాపారం సాగిస్తూ కోట్ల రూపాయలు జేబులు నింపుకొంటున్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలైన బైరి, కరజాడ ప్రాంతాల్లో రాత్రిపగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ, మైన్స్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం.. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీలు సైతం తవ్వకాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో తవ్వకాలు అనుమతులు కంటే భారీగా సాగుతున్నాయి. రానున్న వర్షాకాలంలో పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం సాగించేందుకే ఇలా భారీ ఎత్తున ఇసుకను పోగేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు.. వాస్తవంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చే ముందు గ్రౌండ్ వాటర్ పరిశీలన చేయాల్సి ఉంది. ఇక్కడ తక్కువ మోతాదుల్లో నీటి సాంద్రత ఉండటం, గ్రౌండ్ వాటర్ అడుగంటడం, చుట్టూ వ్యవసాయ బోర్లు ఉన్నప్పటికీ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. భైరి, కరజాడ ప్రాంతాల్లో 1.5 మీటర్లు వరకే తవ్వకాలు చేయాల్సి ఉన్నా దాన్ని అధిగమించి భారీ ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. ఇరువైపులా ఇసుక పోగులే.. బైరి నుంచి కరజాడ జంక్షన్ జాతీయ రహదారి మీదుగా వెళ్లే వంశధార నదికి ఆనుకొని ఉన్న ప్రదేశంలో కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కూటమి నేతలు నిల్వ చేసేశారు. బ్రిడ్జికి రెండువైపులా ఎక్కడికక్కడ ఇసుక పోగులు కనిపిస్తుంటాయి. అక్కడితో ఆగకుండా తోటలు, పంట పొలాల గట్లుపై కూడా సుమారు 15వేల టన్నులకు పైగా ఇసుక నిల్వలు పోగేశారు. ముందస్తు వ్యూహం.. ప్రస్తుతం చేస్తున్న పోగేస్తున్న ఇసుక నిల్వలతో రానున్న వర్షాకాలంలో మరింతగా ఇసుక వ్యాపారం చేసి లాభాలు గడించాలని అక్రమార్కులు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రేట్లు కన్నా వర్షాకాలంలో డబుల్, త్రీబుల్ రేట్లుగా వేసుకొని ఇసుకను బ్లాక్మార్కెట్లో అమ్మడం కోసమే బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో నిల్వలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా భారీగా ఇసుక నిల్వలు బైరి, కరజాడ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో 15 వేల టన్నులకు పైగా పోగులు స్పందించని రెవెన్యూ, మైన్స్ అధికారులు దాడులు చేస్తాం.. అక్రమ ఇసుక నిల్వలపై కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు, మైన్స్ అధికారులు రెండు బృందాలుగా వీడి తనిఖీలు చేయనున్నాం. ఎక్కడ అక్రమంగా నిల్వలు ఉన్నా సీజ్ చేస్తాం. – మురళీకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ -
ప్రైవేటు విద్యాసంస్థల్లో దోపిడీ అరికట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతోందని, అటువంటి నిర్వాహకులపై జిల్లా విద్యాశాఖాధికారులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఎగైనెస్ట్ కరప్షన్ నేషనల్ అంబాసిడర్ నాయుడుగారి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. నేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయాలి ఎచ్చెర్ల: మగ్గమున్న ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటియూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ, చేనేత కార్మిక సంఘం నాయకుడు నక్కిన అసిరప్పడు డిమాండ్చేశారు. మంగళవారం లావేరులో పర్యటించి చేనేత కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించి అనంతరం మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులు గిట్టుబాటు ధరలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సహకార సంఘాలకు రుణమాఫీ చేసి ఆప్కో ద్వారా ప్రభుత్వం వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతన్న నేస్తం పథకం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చేనేత సంఘం నాయుకులు కె.శంకరరావు, కె.రామారావు, యు.గంగరాజు, కె.గంగరాజు, భద్రకాళీ, బి.వెంకటరావు, యు.కాశీవిశ్వేశ్వరరావు, శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీఐల్లో ప్రవేశాలకు ఆహ్వానం ఎచ్చెర్ల: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ విడుదలైందని ఐటీఐ ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ లండ సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 5 నుంచి 10 వరకూ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, మోటార్ వెహికల్, డ్రాఫ్ట్మెన్, సివిల్ ట్రేడ్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కట్టింగ్, టైలరింగ్, కోపా తదితర ట్రేడ్లలో ప్రవేశాలను కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని మూడు ప్రభుత్వ కళాశాలలో 640 సీట్లు, 20 ప్రైవేటు కళాశాలల్లో 2,872 సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. సిమెంట్ లారీ దగ్ధం నరసన్నపేట: తామారాపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సిమెంట్ లారీ దగ్ధమైంది. విశాఖ నుంచి పూరీ వెళ్తుండగా తామరాపల్లి వద్దకు వచ్చే సరికి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయగా లారీ నిలుపు చేసి తగిన జాగ్రత్తలు తీసుకొనే లోపే మరింతగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా ఎస్ఎఫ్ఓ వరహాలు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు. అప్పటికే లారీ కాలిపోయింది. ఈ ఘటనలో రూ. 5 లక్షల పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు లారీ సిబ్బంది చెబుతుండగా.. అగ్నిమాపక సిబ్బంది మాత్రం రూ.2.5 లక్షల వరకూ నష్టం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. విధులకు ఆటంకపరిచారని ఫిర్యాదు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో గతంలో సహాయ సంచాలకులుగా పనిచేసిన పి.సూర్యారావు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది విధులకు ఆటంకపరుస్తున్నారంటూ ప్రస్తుత ఆ శాఖ సంయుక్త సంచాలకుడు రాజగోపాల్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ పి.ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. గతంలో సస్పెన్షన్కు గురైన సూర్యారావుకు హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ క్రమంలో సూర్యారావు కొంతమంది పత్రికా విలేకరులు, వీడియోగ్రాఫర్లను తన వెంట జిల్లా పశుసంవర్ధక కార్యాలయానికి తీసుకెళ్లి విధి నిర్వహణ నిమిత్తం తాను వచ్చానని, అటెండెన్సు రిజిస్టర్లో సంతకం పెడతానంటూ చెప్పడమే కాక వచ్చే పత్రికా విలేకరులతో వీడియో రికార్డింగ్ చేయించారన్నారు. పశుసంవర్ధక శాఖ విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి తగు ఉత్తర్వులు వచ్చేంతవరకు కార్యాలయంలో సూర్యారావును జాయిన్ చేసుకునే అవకాశం లేదని ఎంత చెప్పినప్పటికీ సిబ్బందిని భ భయభ్రాంతులకు గురిచేసి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం రూరల్: శారీరక ఆరోగ్యానికి, మానసిక దృఢత్వానికి ప్రతిఒక్కరూ యోగా సాధన చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనళ్లవానిపేట సముద్ర తీరంలో సుమారు ఐదు వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు ప్రతిరోజూ వేటకు వెళ్తారని, వారికి యోగా చాలా ఉపయోగపడుతుందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మనసు, శ్వాస, వ్యాయామమే యోగాసనమన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత, మహిళా శిశుసంక్షేమాశాఖాధికారి బి.శాంతి, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ పాల్గొన్నారు. పాముకాటుతో కల్లుగీత కార్మికుడు మృతి ఎచ్చెర్ల : అరిణాం అక్కివలస గ్రామ సమీపంలో బుడుమూరు గ్రామానికి చెందిన పొలుసు గోపి (39) మంగళవారం సాయంత్రం పాముకాటుకు గురై మృతి చెందాడు. గోపి వృత్తిరీత్యా తాటికళ్లు తీసేందుకు అరిణాం అక్కివలస వచ్చి తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా పాము కాటువేసింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. గోపికి భార్య దేవి, కుమారుడు ఉన్నారు. ఎచ్చెర్ల ఎస్సై ఎన్.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తీర్థయాత్రలకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు
ఆమదాలవలస: తీర్థయాత్రలకు రైల్వే శాఖ ప్రత్యేక ఎయిర్ రైల్వే ప్యాకేజీలు తీసుకొచ్చినట్లు ఐఆర్సీటీసీ టూరిజం ఎగ్జిక్యూటివ్ సంఘమిత్ర రౌల్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ వద్ద విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అనుకూలంగా విమాన ప్యాకేజీతో శాంకరీ దేవి శక్తి పీఠం, శ్రీలంక రామాయణ యాత్రలకు విశాఖ నుంచి విమాన సర్వీసు నడుపుతున్నట్లు చెప్పారు. జూన్ 28న మొదలై జూలై 3తో ముగుస్తుందని తెలిపారు. ఒక వ్యక్తికి రూ.69,450 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా, కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశామన్నారు. వివరాలకు 9281030748, 9281495847 నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్.ఉమామహేశ్వరరావు, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జి.వినేష్ పాల్గొన్నారు. -
ఘనంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం
జయపురం: పట్టణంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం ఘనంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక సోనీ సైకిల్ మార్టు వారి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మొదట రఘనాథ్ మందిరం వద్దకు చేరిన సైకిలిస్టులు, అక్కడ నుంచి 26వ జాతీయ రహదారి పాత బస్టాండ్ ప్రధాన జంక్షన్ వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ వల్లభాయి పటేల్ మార్గం మీదుగా రథోపొడియ కూడలికి చేరింది. సైక్లింగ్ వలన కలిగే ప్రయోజనాలు తెలియజేసేందుకు కృషి చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త మోహనరావు వెల్లడించారు. సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం పొందవచ్చన్నారు. -
జీఎస్టీ ఆదాయంలో క్షీణత
శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల కొనుగోళ్ల శక్తి తగ్గడంతో ఆ ప్రభావం జీఎస్టీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో అన్ని వ్యాపారాలు కలిపి జనవరి నుంచి మే నెల వరకు రూ.1500 కోట్లు మేర లావాదేవీలు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపేణా ఆదాయం లభించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.15 కోట్లకు పైగా జీఎస్టీ ఆదాయం తగ్గింది. మద్యం మినహాయిస్తే ఏ వ్యాపారాన్ని చూసినా గతేడాది కంటే ఈ ఏడాది 5 నెలల్లో లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడమే దీనికి కారణం. పథకాల్లో కోత.. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు సకాలంలో అందేవి. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, చేదోడు, రైతు బీమా, సున్నా వడ్డీ, కాపు నేస్తం వంటి ఎన్నో పథకాలు సకాలంలో అందేవి. దీంతో పేద ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసుకుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లు సకాలంలో ఇస్తున్నప్పటీకీ చాలా మందికి కోత విధించారు. తల్లికి వందనం, మహిళలకు రూ.1500, రైతు బీమా, సున్నా వడ్డీ వంటివాటితో పాటు సూపర్ సిక్స్ అంటూ ఎన్నో పథకాలను అమలు చేయకుండా వదిలేశారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాన్ అప్రూవల్ జరగకపోవడం, ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. రైతుకు సహాయం చేసే పథకాలు ఎత్తివేయడం, గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో వ్యవసాయ పనులు కూడా తగ్గిపోయాయి. వీటి కారణంగా కూలి పనులు లేకుండా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరిగిపోతుండగా ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందడం లేదు. ఉద్యోగ విరమణ చేసిన వారికి సైతం గ్రాట్యుటీ వంటి ఇతర ప్రయోజనాలకు మంజూరు చేయకపోవడం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవటం, ఉపాధి హామీ వేతనదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరపకపోవటంతో జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అన్ని వర్గాల వారిపై వేటు వేయడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ కారణంగానే లావాదేవీలు తగ్గి జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. జనవరి నుంచి మే వరకు రూ.15 కోట్లకుపైగా తగ్గిన ఆదాయం ప్రజల్లో తగ్గిన కొనుగోలు శక్తి గతంలో పథకాలు రావడంతో పెరిగిన లావాదేవీలు కూటమి వచ్చాక పథకాలు లేక తగ్గిన కొనుగోళ్లు జీఎస్టీ ఆదాయ వివరాలివే.. 2024లో జనవరి 1 నుంచి మే 31 వరకు రూ.105.96 కోట్లు ఆదాయం లభించింది. 2025లో జనవరి 1 నుంచి మే 31 వరకు రూ.86.05 కోట్లకే ఆదాయం పరిమితమైంది. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే 2024 ఆమదాలవలస సర్కిల్లో రూ.17.85 కోట్లు, 2025 రూ.14.25 కోట్లు, కాశీబుగ్గలో 2024లో రూ.8.52 కోట్లు, 2025లో రూ.9 కోట్లు, నరసన్నపేట సర్కిల్లో 2024లో రూ.10.05 కోట్లు, 2025లో రూ.11.15 కోట్లు , 2024లో శ్రీకాకుళం సర్కిల్లో రూ.68.87 కోట్లు, 2025లో రూ.51.75 కోట్లు ఆదాయం వచ్చింది. -
మురుగు నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి
భువనేశ్వర్: వర్షాలకు ముందు పట్టణ ప్రాంతాల సన్నద్ధత గురించి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి విభాగం మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో పట్టణ ప్రాంతాలకు చెందిన వివిధ అధికారులతో మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. వానా కాలంలో కృత్రిమ వరద పరిస్థితిని ప్రేరేపిస్తున్న నీటి ప్రవాహ అడ్డంకి పరిస్థితుల నివారణ కోసం ఈ సమావేశం నిర్వహించడం విశేషం. వాన, మురికి నీరు ప్రవాహ వ్యవస్థ పరిస్థితిని పరిశీలించి, అడ్డంకులు మరియు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రవాహ అడ్డంకితో ముంపునకు గురి అవుతున్న ప్రాంతాలను గుర్తించి సత్వర కార్యాచరణతో సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. బకాయి ఉన్న హోల్డింగ్ పన్ను వసూలు చేయడంపై యంత్రాంగం శ్రద్ధ వహించాలన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. డ్రైనేజీ వ్యవస్థపై సమీక్ష నగర, పట్టణ ప్రాంతాల్లో వర్షాకాలంలో తలెత్తే కృత్రిమ వరద పరిస్థితి ప్రాంతీయుల దైనందిన జీవన శైలికి అంతరాయం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సందర్భంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభావిత ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ వాస్తవ స్థితిగతుల్ని ప్రత్యక్షంగా సమీక్షించారు. కృత్రిమ వరద పరిస్థితి పునరావృతం కాకుండా స్థిరమైన డ్రైనేజీ పరిష్కారాలను అన్వేషణ అనివార్యమని మంత్రి అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో ఈ నిరంతర పట్టణ, నగర సవాళ్లను పరిష్కరించడానికి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి విభాగం మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రో మంగళవారం నగరంలోని అనేక కీలక ప్రదేశాలపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్, బీఎంసీ ఇంజినీర్, స్థానిక ఎమ్మెల్యే బాబూ సింగ్ మరియు అనేక మంది కార్పొరేటర్లతో కలిసి మంత్రి సంయుక్తంగా తనిఖీ చేసి, తక్షణ మరియు దీర్ఘకాలిక పరిష్కార చర్యలపై చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ దార్శనికతకు అనుగుణంగా వర్షపు నీటి ప్రవాహ నీటి నిర్వహణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందన్నారు. నీటి ప్రవాహ మార్గం మూసుకుపోవడంతో ఈ పరిస్థితులు తాండవిస్తున్నట్లు గుర్తించారు. ఈ సమస్య నివారణకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయా లని యోచిస్తున్నారు. 10వ నంబర్ డ్రెయిన్లోకి వర్షం, వినియోగించిన నీటిని విడుదల చేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ నుంచి వాణి విహార్ వరకు ప్రత్యేక మురుగు నీరు ప్రవాహ వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సర్దుబాటుతో కాలక్షేపం చేయడం సోపానంగా భావిస్తున్నారు. మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో -
అంగుల్లో ఆడ ఏనుగు మృతి
భువనేశ్వర్: అంగుల్ జిల్లా చెండీపొదా అటవీ ప్రాంతం డొంగాపాల్ సమీపంలో సౌరశక్తితో నడిచే కంచె దగ్గర ఆడ ఏనుగు చనిపోయి పడి ఉన్నట్లు దృష్టికి వచ్చింది. దీని వయసు దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉంటుందని అటవీ అధికారుల అంచనా. ఈ జిల్లాలో వారం రోజుల స్వల్ప నిడివిలో వరుసగా ఇది రెండో ఏనుగు మరణం కావడం కలవరం సృష్టిస్తోంది. అడవి జంతువులు జనావాసాల్లోకి చొరబడకుండా సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న భద్రత కంచె ఏనుగులకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ భూముల్లోకి ఏనుగులు చొరబడి పంట నష్టం నివారించేందుకు రైతాంగం ఈ చర్యకు పాల్పడుతున్నారు. గత నెల 31న ఇటువంటి ఘటనలో అంగుల్ జిల్లా బొంతొలా అటవీ మండల పరిధిలో తొలొసొరా సమీపంలో 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల ఒక గున్న ఏనుగు మృతి చెందింది. తాజా మరణానికి కార ణం అస్పష్టంగా ఉందని అటవీ అధికారుల సమాచారం. శవ పరీక్ష నివేదిక అందితే స్పష్టం అవుతుందని వేచి చూస్తున్నారు. జనావాసాల్లో ఏనుగుల చొరబాటుతో తలెత్తే సంఘర్షణను తగ్గించే లక్ష్యంతో అటవీ శాఖ సౌర విద్యుత్ భద్రత కంచె చేపట్టిన చొరవలో భాగం. తాజా సంఘటనల దృష్ట్యా అటువంటి కంచెల దగ్గర సంభవిస్తున్న ఏనుగుల మరణాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అంగుల్, ఢెంకనాల్ మరియు కెంజొహర్ వంటి అటవీ సరిహద్దు జిల్లాల్లో ఈ విషమ పరిస్థితి తాండవిస్తుంది. -
స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి
ఇచ్ఛాపురం రూరల్: స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇచ్ఛాపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇదే మండలంలోని లొద్దపుట్టి గ్రామం పెద్ద వీధికి చెందిన దుర్గాశి మహేశ్(45) అదే గ్రామంలో మంగళవారం రేషన్ షాపు డీలర్ వద్ద అసిస్టెంట్గా సరుకులు పంపిణీ చేశాడు. అనంతరం పక్క గ్రామమైన ఒడిశా సవరదేవి పేటకు రాత్రి సమయంలో నడకదారిన వెళ్తుండగా.. ఒడిశా గుడ్డిభద్ర గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై స్పీడుగా వచ్చి మహేశ్ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో మహేశ్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్కూటీ డ్రైవర్ బండిని వదిలి పరారయ్యాడు. మృతుడి భార్య చాలా రోజుల కిందట మృతి చెందగా పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. మరో కుమార్తె ఉంది. కుటుంబ సభ్యులు పిర్యాధు మేరకు ఒడిశా జరడా పోటీసులు కేసు నమోదు చేశారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పర్లాకిమిడి: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో చైతన్య రథాన్ని ఆయన జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఈ సచేతన రథం ద్వారా జిల్లాలోని సమగ్రంగా అన్ని సమితి కేంద్రాలు, కాశీనగర్ ఎన్ఏసీ, పురపాలక పరిధిలో ప్రజలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచారం జూన్ 24 వరకు చేపట్టనున్నట్లు ఎకై ్సజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు తెలియజేశారు. కార్యక్రమంలో ఏడీఎం ఫాల్గుణ మఝి, సబ్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ పటేల్, ఎస్ఐ మఝి శోబోరో, నోడల్ ఇన్స్పెక్టర్ మోనూ ఆయాల్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నీటికుంటలో పడి బాలుడు మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలోని ఖోయిర్పూట్ సమితి ఆండ్రాహల్ పంచాయతీ కాతామీగడ గ్రామంలో నీటికుంటలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంతోష్ కావాతి(3) తోటి పిల్లలతో కలిసి నీటికుంట దగ్గర స్నానానికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది. సమీపంలో ఉన్నవారు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ముదిలిపోడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగించనున్నారు. -
రోడ్డు ప్రమాదాలపై అవగాహన
రోడ్డు భద్రతకు సంబంధించిన ఈ అద్భుతమైన సైకత శిల్పం అంతర్జాతీయంగా ప్రఖ్యాత సైకత కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దారు. శూన్య దుర్ఘటన దినం పురస్కరించుకుని ఈ శిల్పం ఆవిష్కరించినట్లు ఆయన పేర్కొన్నాడు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలకు అవగాహన కల్పించడంలో అందరి సహకారాన్ని కూడగట్టుకుని ముందుకు సాగడం ఈ కళాకృతి లక్ష్యంగా పేర్కొన్నారు. రహదారి భద్రతతో ఇంటికి సురక్షితంగా చేరాలనే నినాదంతో రూపుదిద్దుకున్న ఈ శిల్పం పలువురి దృష్టిని ఆకట్టుకుంది. – భువనేశ్వర్ -
భద్రతా ఏర్పాట్లు పటిష్టం
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాత పూరీ రథయాత్ర కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 27న ఈ యాత్ర జరగనుంది. రథయాత్ర ఆద్యంతాలు సజావుగా, సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. సోమవారం కటక్లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పోలీసు విభాగం సీనియర్ అధికారులు రథ యాత్ర సజావుగా జరిగేలా చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. శ్రీ జగన్నాథ ఆలయ సంప్రదాయం ప్రకారం పలు ఉత్సవాలు, వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ కార్యక్రమాలు వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. వాటిలో ప్రధానమైనవి జూన్ 11న దేవస్నాన పూర్ణిమ, జూన్ 26న నవ యవ్వన అలంకార దర్శనం, జూన్ 27న రథ యాత్ర, జూలై 01న హెరా పంచమి, జూలై 04న సంధ్యా దర్శనం, జూలై 05న బహుడా యాత్ర, జూలై 06న స్వర్ణ అలంకరణ, జూలై 07న ఒధొరొ పొణా మరియు జూలై 8న నీలాద్రి విజేగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా, దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీని సందర్శిస్తారు. ఈ సందర్భంగా యాత్రికుల భద్రత కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను ఈ సమావేశంలో చర్చించారు. రథ యాత్రకు భద్రతా ఏర్పాట్లను పెంచుతారు. ప్రత్యేకంగా సీనియర్ పోలీసు అధికారులను మోహరిస్తారు. పూరీ పట్టణంలో వివిధ ముఖ్యమైన ప్రదేశాలలో సీసీటీవీల ఏర్పాటు, రోడ్ డివైడర్లు, ట్రాఫిక్ నిర్వహణ కోసం డిలినేటర్లు, ట్రాఫిక్ జోన్ ఏర్పాట్లు, నగరంలోని వివిధ ప్రదేశాలలో తగినంత పార్కింగ్ ఏర్పాట్లు, క్రమబద్ధమైన ట్రాఫిక్ ఏర్పాట్ల నిర్వహణ మొదలైన వాటిపై సమావేశంలో చర్చించారు. పూరీ బీచ్లో పోలీసుల గస్తీ, తాత్కాలిక పోలీసు అవుట్పోస్టుల నిర్వహణపై సమీక్షించారు. దీంతో పాటు, పూరీ, భువనేశ్వర్, ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీసుల భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీసు వర్గాలు చర్చించాయి. ఈ నేపథ్యంలో రైల్వే రక్షక దళంలో చక్కని సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో నేరస్థులపై ప్రత్యేక డ్రైవ్లు, హోటళ్లు, లాడ్జీలలో క్రమం తప్పకుండా తనిఖీలు, భద్రతా వాహనాల మోహరింపు, కె – 9 స్క్వాడ్ మోహరింపు, తొక్కిసలాట వంటి పరిస్థితులను నివారించడానికి అప్రమత్తమైన, ప్రత్యేక ఏర్పాట్లు, ప్రముఖ వ్యక్తుల కోసం ప్రత్యేక హెలిప్యాడ్, పోలీసు బలగాల వసతి కోసం ప్రత్యేక సౌకర్యాలు, వాహన రవాణా క్రమబద్ధీకరణ, బారికేడ్ ఏర్పాట్లు, జిల్లా యంత్రాంగం సహకారంతో వివిధ సమస్యలను త్వరగా పరిష్కరించడం, భక్తులకు క్రమబద్ధమైన దర్శనం కోసం ప్రత్యేక సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో, డైరెక్టర్ (ఇంటెలిజెన్స్) ఆర్. పి. కోచే, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (ఆధునికీకరణ) సౌమేంద్ర కుమార్ ప్రియదర్శి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (రైల్, కోస్తా భద్రత) అరుణ్ బోత్రా, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ శాంతిభద్రతలు) సంజయ్ కుమార్, రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (కమ్యూనికేషన్) దయాళ్ గంగ్వార్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (ఎస్ఏపీ) రాజేష్ కుమార్, ఐజీ (సెంట్రల్ రీజియన్) ఎస్. ప్రవీణ్ కుమార్, ఐజీ (ఆపరేషన్స్) డాక్టర్ దీపక్ కుమార్, ఐజీ (బీపీఎస్ పీఏ) అనుప్ సాహు, ఐజీ (క్రైమ్ బ్రాంచ్) డాక్టర్ సార్థక్ సదాంగి, డీఐజీ (ప్రొవిజనింగ్) చరణ్ సింగ్ మీనా, డీఐజీ (ఎస్ఐడబ్ల్యూ) డాక్టర్ కన్వర్ హబీబ్ సింగ్, డీఐజీ (ఎస్ పీఎఫ్) పినాక్ మిశ్రా, పోలీసు సూపరింటెండెంట్ (రైల్వేస్) వివేకానంద్ శర్మ, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వినీత్ అగర్వాల్, అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం గ్రామ సమీప కొండమ్మ కాలనీకి ఆనుకుని వెళ్లే జాతీయ రహదారి ప్రదేశంలో 65 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శ్రీకాకుళం రూరల్ పోలీసులు సోమ వారం గుర్తించారు. మధ్యాహ్నం నుంచి అచేతన స్థితిలో పడి ఉండడాన్ని కొంతమంది చూసినట్లు తెలిపారు. ఎవరో మద్యం మత్తులో ఉన్నారు అనుకొని ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్ఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని రిమ్స్కి తరలించారు. బంధువులు ఎవరైనా గుర్తిస్తే శ్రీకాకుళం రూరల్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. -
ట్రాక్టర్–బైక్ ఢీ: ఒకరి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి సదాశివపూర్ గ్రామ సమీపంలో జయపురం–బలిమెల రహదారిపై సోమవారం సాయంత్రం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వస్తున్న భార్యాభర్తలు, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టి పడిపోయాడు. ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కోరుకొండ సమితి పరిధిలో ఉన్న ఎంవీ 104 గ్రామానికి చెందిన దిలీప్ రూపతాన్ (50) తన భార్య సుచిత్రా (43)తో కలిసి బైక్పై ఉమర్కోటలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సుచిత్రను మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నరసన్నపేట: జాతీయ రహదారిపై గుండవల్లిపేట పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన సల్మాన్ (19) మృతి చెందాడు. ముందున్న లారీకి వెనుక నుంచి బలంగా చైన్నె నుంచి కోల్కతాకు వెళ్తున్న కార్గో లారీ బలంగా ఢీకొంది. దీంతో లారీ నడుపుతున్న సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నరసన్నపేట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి వాహనాలను క్రమబద్దీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. -
పాముకాటుతో మహిళ మృతి
● మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇచ్ఛాపురం టౌన్: మున్సిపాలిటీలోని అమీన్సాహెబ్పేటలో ఆదివారం రాత్రి తలగాన పూజ(27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో తలగాన పూజ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాన పూజ అమీన్సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారింటికి వచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులతోపాటు అర్థరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. అనంతరం ఇంటికి వెళ్లగా ఉక్కగా ఉండడంతో ఇంటి వరండాలో పడుకున్నారు. అయితే ఆ సమయంలో వారి ముగ్గురినీ పాముకాటు వేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండగా మార్గమధ్యలో తలగాన పూజ మృతి చెందినట్లు తెలిపారు. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలకు ఐసీయూ ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త తలగాన శంకర్ రోజుకూలీ చేస్తూ జీవిస్తుంటారు. -
వియత్నాంలో గవర్నర్ పర్యటన
భువనేశ్వర్: బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి వియత్నాం వెళ్లిన విషయం విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం క్వాంగ్ నామ్ ప్రావిన్స్లోని ప్రసిద్ధ మై సన్ ఆలయ సముదాయాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు సాధించింది. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సహాయంతో ఈ ప్రాంతం పునరుద్ధరణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సందర్శన మరింత ప్రాముఖ్యతను జోడిస్తుంది. మై సన్ వియత్నాం అత్యంత విలువైన సాంస్కృతిక ప్రదేశాలలో ఒకటి కావడం విశేషం. ఈ సముదాయంలో 4వ శతాబ్దం నాటి కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాచీన దేవాలయాలను చంపా రాజ్యం నిర్మించింది. ఆగ్నేయాసియా యొక్క ఉమ్మడి సాంస్కృతిక గతానికి కీలక చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈ సందర్శన పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ భారత దేశం మద్దతుతో జరుగుతున్న పునరుద్ధరణ పురోగతిని ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సముదాయంలో పురాతన నిర్మాణాలను సంరక్షించేందుకు ఉపయోగిస్తున్న ప్రత్యేక పద్ధతుల్ని అధికారులు గవర్నర్కు వివరించారు. చుట్టూ పచ్చని పర్వతాలు, జరజర ప్రవహించే నీటి వాగుల మధ్య ఒక సుందరమైన లోయ పరిసరాల్లో మై సన్ ఆలయ సముదాయం నెలకొని ఉంది. ఇది 7వ, 13వ శతాబ్దాల మధ్య చంపా నాగరికతకు ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మై సన్ ఆలయ సముదాయంలో దాదాపు 70 ఆలయ నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా జీవ కళని ప్రతిబింబిస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన పద్ధతితో నిర్మించబడిన ఈ దేవాలయాలు శతాబ్దాలుగా బలంగా నిలిచి ఉండడం చరిత్రకారులు, వాస్తుశిల్పుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం చంపా రాజ్యం మరియు భారత దేశం, చైనా వంటి గొప్ప నాగరికతల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబింప జేస్తుంది. ఒడిశా గవర్నర్ పర్యటన భారత దేశం, వియత్నాం మధ్య సన్నిహిత సాంస్కృతిక బంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించడంలో భారత దేశం యొక్క నిరంతర పాత్రకు నిలువునా అద్దం పడుతుంది. -
ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
జయపురం: మన న్యాయమైన డిమాండ్లు నేరవేరాలంటే అందరం సమైక్యంగా ఆందోళన చేపట్టాలని ఒడిశా డ్రైవర్ల మహాసంఘ బొయిపరిగుడ సమితి శాఖ అధ్యక్షుడు మాధవ బిశాయి పిలుపు నిచ్చారు. నేడు జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి డ్రైవర్ల సమావేశం బొయిపరిగుడ సంత తోటలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ డిమాండ్ల సాధనకు ఒడిశా డ్రైవర్ల మహాసంఘం స్టీరింగ్ చడో ఆందోళన చేపట్టాలని నిర్ణయించిందని, అందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. మహాసంఘం 9 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా పాలకులు కేవలం ఒక్క డిమాండ్ మాత్రం నేరవేర్చారని ఆయన డ్రైవర్లకు వివరించారు. మిగతా 8 డిమాండ్లను తుంగలో తొక్కారని విమర్శించారు. డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, జాతీయ రహదారిలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒకర టాయిలెట్తో పాటు పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, డ్రైవర్ల పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని, డ్రైవర్లు ఏ తప్పు లేకుండా దాడులకు గురవుతున్నారని వాటిని అరికట్టి డ్రైవర్లకు రక్షణ కల్పించాలని కోరారు. డిమాండ్లను మరో సారి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. డిమాండ్లు అంగీకరించకుంటే మరోసారి స్టీరింగ్ చఢో ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ ఉపాద్యక్షులు సీతమ్ సాగరియ, కార్యదర్శి నరేష్ కంశారి, సహాయ కార్యదర్శి మోమణ పాత్రొ, కోశాధ్యక్షుడు శ్యామ సుందర చలాన్ తో పాటు సమితిలోగల అనేకమంది డ్రైవర్లు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం
రాయగడ: మునిగుడలోని బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షులుగా విద్యాధర్ దాస్, కార్యదర్శిగా సింహాచల్ పండా, ఉపాధ్యక్షులుగా రామప్రసాద్ రథో, సహకార్యదర్శిగా లక్ష్మీ పాణిగ్రహి, కోశాధికారిగా రామక్రిష్ణ పాణిగ్రహిలు నియమితులవ్వగా ప్రభాత్ పాణిగ్రహి, సింమాచల్ దాస్, క్షమా సాగర్ దాస్, నారాయణ పండా, దమోదర్ మహాపాత్రో, ఆమీర్ కుమార్ మిశ్రో, తరణీ చరణ్ పండా, సౌమ్యరంజన్ సాహు, రవీంద్ర కుమార్ త్రిపాఠిలు కోర్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ మేరకు మునిగుడలోని బ్రాహ్మణ సమాజం సమావేశం హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి అంతా కలసి కట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. రోడ్డు పనులు పూర్తి చేయాలి జయపురం: జయపురం సమితి కుములిపుట్ రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయక పోతే ఆందోళన చేపడతామని ఆ గ్రామ పెద్దలు ప్రతాప్ గౌఢ, సుదీప్ పొద్దార్, హరిశ్చంఽధ్ర ముదులి, ప్రశాంత ఖొర, సూర్యనారాయణ భొత్ర, సూర్య భొత్ర, పంకజ బోష్,తులారాం నాయిక్ మొదలగు వారు అధికారులను హెచ్చరించారు. కుమిలిపుట్ మీదుగా 26 వ జాతీయ రహదారి ఉందని, ఆ జాతీయ రహదారి గతుకుల మయంగా ఉందని, అంతే కాకుండా జాతీయ రహదారి నుంచి డొంగరుకు రహదారి ఉందని ఆ మార్గం గోతులతో నిండి ఉందని వారు వెల్లడించారు. డొంగర రహదారిపై 6 గ్రామాల ప్రజలు ఆధార పడుతున్నారని, అంతే కాకుండా వారసంత, ధాన్యం మండీ, మొదలగు కార్యాలయాలు డొంగర రహదారిలోనే ఉన్నాయని తెలిపారు. అలాగనే ఈ మార్గం ఇరువైపులా కొంత మంది ఆక్రమించి కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. అందువలన రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ దారిలో అంబులెన్స్లు రావడం లేదని, వెంటనే రోడ్డు బాగు చేయాలని కోరారు. జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణపై సమీక్ష జయపురం: జయపురం చారిత్రాత్మక జగన్నాథ సాగర్ పునరుద్ధరణ పనులను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి సోమవారం సమీక్షించారు. సాగర్ పునరుద్ధరణ పనులు జరుగుతుండగా బాహిణీపతి నేటి ఉదయం జగన్నాథ్ సాగర్ వద్దకు వెళ్లి జరుగుతున్న పనులు ఎలా జరుగుతున్నదీ పరిశీలించారు. సాగర్లో ఉన్న మట్టి, పూడిక పనులపై అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ ప్రతినిధికి తెలిపారు. పనులు వేగంగా జరుపుతున్న సమయంలో వానలు పడడంతో ఆటంకం కలిగిందని అన్నారు. సాగర్ పనులు చేస్తున్న పనివాళ్లకు రక్షణ కరువైందని, తమ కంపెనీ డ్రైవర్ పడుకున్న సమయంలో అతడి సెల్ఫోను, డబ్బు ఎవరో దొంగిలించారని ఎమ్మెల్యేకు తెలిపారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే స్పందించారు. వెంటనే ఆయన పట్టణ పోలీసు అధికారికి ఫోను చేసి వెంటనే సాగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు సాగర్ సందర్శించిన వారిలో మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, మున్సిపాలిటీ అదనపు కార్యనిర్వాహక అధికారి పూజ రవుత్, ఇంజినీర్ అజయ కుమార్ జాని, జూనియర్ ఇంజనీర్ ప్రతాప్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా రథయాత్ర
● సన్నాహక సమావేశంలో అధికారులు రాయగడ: ఈ నెల 27వ తేదీన జరగనున్న జగన్నాథ రథాయాత్రను పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు అన్నారు. రథాయాత్ర నిర్వహణపై స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, ఎడీఎం నిహారి రంజన్ కుహారో, రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాది రథయాత్రను అందరి సహకారంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. గత ఏడాది రథాయాత్ర నిర్వహణలో భాగంగా విరాళాల రూపంలో 34,14,439 రూపాయలు లభించగా అందుకు సంబంధించి ఖర్చయిన 15,47,820 రుపాయల వివరాలను తహసీల్దార్ ప్రియదర్శిని సమావేశంలో నివేదించారు. ఈ ఏడాది విరాళాల వసూళ్ల బాధ్యతను తహసీల్దార్తో సహా మరో ప్రత్యేక కమిటీకి అప్పగించారు. యాత్ర తొమ్మిది రోజులు స్వామి వారిని దర్శించుకునేందుకు గుండిచా మందిరానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ నాయక్ ఆదేశించారు. దీంతో పాటు ప్రత్యేక పోలీస్ దళంతో గస్తీని ఆయా ప్రాంతాలోఏర్పాటు చేయాలని అందుకు పోలీస్ యంత్రాంగం కూడా తగిన విధంగా సహకరించాలని అన్నారు. సమావేశంవో రాజపురోహితుడు బీరంచి నారాయణ దాస్, రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
రాయగడ మామిడికి డిమాండ్
రాయగడ: సేంద్రియ ఎరువులతో పండించే రాయగడ మామిడి పండ్లకు దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉందని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమీపంలో సోమవారం ఒర్మాస్ సంస్థ ఏర్పాటు చేసిన మామిడి మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కాసీపూర్, రాయగడ, బిసంకటక్, కొలనార, మునిగుడ, కల్యాణసింగుపూర్ తదితర ప్రాంతాల్లో పండే మామిడి పండ్లు దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. గతేడాది ఇటలీ, పోలాండ్ వంటి దేశాలకు రాయగడ మామిడి పండ్లు ఎగుమతి అయ్యాయన్నారు. ఢిల్లీ, భువనేశ్వర్ వంటి ప్రారిశ్రామిక ప్రాంతాలకు ఇక్కడి మామిడి ఎగుమతి జరిగి రైతులు మంచి లాభాలను ఆర్జించినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఇక్కడి మామిడిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఓర్మాస్ రాయగడ శాఖ ముఖ్య సంచాలకులు మనోజ్ కుమార్ పాత్రో, జి.లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫార్మ్ ప్రోడెక్ట్ సంస్థలకు చెందిన మహిళా రైతులు ఈ మేళాలో పాల్గొని, వారు పండించిన మామిడి పండ్లను ఈ ప్రదర్శనలో ఉంచారన్నారు. మార్కెట్ ధరల కన్నా ఇక్కడ అతి చౌకగా మామిడి పండ్లు లభించడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సేంద్రియ ఎరువుల సహాయంతో పండించినట్లు తెలిపారు. అత్యంత ప్రాధాన్యత గల అమరాపల్లి, బంగినపల్లి, సుందరి, మల్లిక, దశహరి వంటి ఏడు రాకాల మామిడి పండ్లు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయని వివరించారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మామిడి మేళాకు సంబంధించిన ప్రచార రథాన్ని కలెక్టర్ పట్వారి ప్రారంభించారు. రాయగడ, జేకేపూర్లో ఈ మేళా కొనసాతున్నట్లు పాత్రో తెలియజేశారు. మేళాను ప్రారంభించిన కలెక్టర్ ఫరూల్ పట్వారి -
విశాఖలో రాయగడ కార్మికుడు మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ జిరంగో గ్రామ పంచాయతీ రఘునాథపూర్ గ్రామానికి చెందిన వలస కార్మికులు ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు వెళ్లి విధివశాత్తు రెండు రోజుల క్రితం మృతి చెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ పేద కుటుంబం సుభాష్ బోడోరయితో పెద్ద కుమారుడు సహాదేవ్ బోడోరయితో (22) తన కుటుంబ పోషణ కోసం విశాఖపట్నంకు ఉపాధి కోసం కొద్ది రోజుల కిందట ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అయితే ఇటీవలే పనిచేస్తుండగా తన ఆరోగ్యం విషమించి విశాఖపట్నంలో గీతం ప్రైవేటు మెడికల్ కళాశాలలో సిబ్బంది చికిత్సకోసం చేరిన తర్వాత అక్కడ డాక్టర్లు మృతి చెందాడని మే నెల 30న నిర్ధారించారు. చేతిలో డబ్బులు లేనందున ఆయన చేస్తున్న కంపెనీ సహోద్యోగుల సహకారంతో మే 31న రాయగడ బ్లాక్ రఘునాథ్ పూర్కు మృతుడు సహాదేవ్ బోడోరయితో శవాన్ని అంబులెన్సులో తీసుకువచ్చి ఆదివారం దహన సంస్కారాలు చేశారు. వలస కార్మికుడి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని జిల్లా లేబర్ అధికారిని తండ్రి సుభాష్ బోడోరయితో, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
బస్సు బోల్తా: 25 మందికి గాయాలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజాఘటిలో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలాజి ట్రావెల్స్కు చెందిన ఓ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి భవానీపట్నం వెళ్తోంది. బస్సులో 37 మంది ఉన్నారు. బిజాఘటి వద్దకు చేరేసరికి బస్సు అదుపు తప్పి పడిపోయింది. విషయం తెలుసుకున్న మల్కన్గిరి ఐఐసి రీగాన్కీండో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సబ్ కలేక్టర్ దుర్యోధన్ బోయి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. -
భార్యను హత్య చేసిన భర్త
రాయగడ: భార్య, భర్తలు ఇద్దరూ పూటుగా మద్యం సేవించిన అనంతరం మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో కొపొద్రేక్తుడైన భర్త భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలోని రఘుబారి పంచాయతీలోని మతాబారు గ్రామంలో ఈ ఘోరం ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్డీపీవో సంతొషిణి ఓరం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మతాబారు గ్రామంలో నివసిస్తున్న తుతు మాఝి, చిత్ర మాఝిలు భార్యా భర్తలు. కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో భార్య చిత్ర భర్తను చెంపపై కొట్టింది. కొపొద్రేక్తుడైన భర్త తుతు ఇంట్లోని గొడ్డలిని తీసుకువచ్చి భార్యను దారుణంగా నరికి చంపి అక్కడి నుండి పరారయ్యాడు. దర్యాప్తు చేసిన పోలీసులు సొమవారం తుతుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అంబొదల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. గంజాయి కేసులో మరో నలుగురు అరెస్టు జయపురం: సంత తోటలో గత నెల 29న దొరికిన గంజాయి కేసులో మరో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగన్నాథ్ కాశ్యప్ సోమవారం వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్ సభాగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమర కుమార్ బహుదూర్ ఉరఫ్ శంకర లంబ(37), చింటు ముదులి(29), సంజయ కోశ్ల (29), కేశవ హరిజన్(30)ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ గ్రీవెన్స్కు 51 ఫిర్యాదులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో అదనపు ఎస్పీ (అడ్మిన్) కేవీ రమణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్కాల్స్ ద్వారా తక్షణమే తెలియపరచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలన్నారు. -
సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
● జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● మీకోసంలో 87 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పెండింగ్లో ఉన్న అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన 87 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తహసీల్దార్ల వద్ద వివిధ సర్టిఫికెట్లు పెండింగులో ఉన్నాయని, పెండింగ్కు గల కారణాలు తెలియజేయాలన్నారు. సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడతారన్నారు. సత్వరమే సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రైస్ కార్డులు పెండింగులో లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ లాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, జీజీహెచ్ తదితర శాఖలపై అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్ఎన్ వి.శ్రీధర్రాజ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనికి వెళ్తూ వృద్ధుడు మృతి
పాతపట్నం: మండల కేంద్రంలోని కొత్త దేవాంగుల వీధికి చెందిన ఎర్ర రామారావు (64) ఉపాధి పనికి వెళ్తూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొత్త దేవాంగుల వీధికి చెందిన ఎర్ర రామారావు, అతని భార్య జయమ్మలు కలిసి వీధిలోని అందరితో పాటు సోమవారం ఉదయం నీలమణిదుర్గ ఆలయం సమీపంలో ఉన్న తాడి చెరువులో ఉపాధి పని కోసం ఇంటి నుంచి నడుచుకుంటూ బయల్దేరి వెళ్లాడు. అయితే కాకితోట వద్ద కడుపు నొప్పిగా ఉందని రామారావు కూర్చొనిపోవడంతో ఉపాధి కూలీలందరూ కలిసి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. అనంతరం ఆటోలో పాతపట్నం సీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే అతను అప్పటికే మృతి చెందాడని ఆస్పత్రి సిబ్బంది తెలపడంతో భార్య జయమ్మ రోదన అందరినీ కంటతడి పెట్టించింది. మృతుడికి కుమారుడు, కుమార్తు ఉన్నారు. -
కలెక్టరేట్ గ్రీవెన్స్కు 81 వినతులు
పర్లాకిమిడి: స్థానిక గజపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా యంత్రాంగం గ్రీవెన్సు సెల్ను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా, డీఎఫ్వో కె.నాగరాజు, జిల్లా పరిషత్ ముఖ్యకార్వనిర్వాహణాధికారి శంకర కెరకెటా తదితరులు హాజరయ్యారు. గ్రీవెన్స్కు మొత్తం 81 వినతులు అధికారులకు అందగా వాటిలో రెండు వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా వాటిలో 75 వ్యక్తిగతం కాగా, ఆరు గ్రామసమస్యలకు సంబంధించినవి. తులసిపాడు గ్రామానికి చెందిన దివ్యాంగునికి ఉపాధి అవకాశం కల్పించాలని, త్రీవీలర్ బండి ప్రభుత్వం అందజేయాలని ఆయన కలెక్టర్ను కోరాడు. మరికొంతమంది వృధ్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించి వినతులు అందజేశారు. పర్లాకిమిడి, సిద్ధమణుగు, రాణిపేట, కత్తలకవిటి గ్రామలకు చెందిన వారు వినతులను అందించారు. -
మూడు పోలీస్ స్టేషన్లలో ఐఐసీలు బదిలీలు
రాయగడ: జిల్లాలోని మూడు ప్రధాన పోలీస్ స్టేషన్లలో ఐఐసీలను బదిలీ చేస్తు జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ ఆదివారం ఉత్తర్యులను జారీ చేశారు. శాంతి భద్రతలను మరింత మెరుగు పరిచేందుకు ఈ మేరకు బదిలీలను చేసినట్లు సమాచారం. రాయగడ ఐఐసీగా విధులు నిర్వహిస్తున్న కేకేబీకే కుహోరోను గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్కుబదిలీ చేయగా గుణుపూర్లో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ కుమార్ సాహును చందిలి పోలీస్ స్టేషన్కు.. అదేవిధంగా చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీగా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న బెహర కు రాయగడకు బదిలీ చేశారు. -
బీజేడీలోకి పలువురి చేరిక
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీ తరఫున గత సార్వత్రిక ఎన్నికల్లో నబరంగ్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దిలీప్ ప్రధాని బీజేడీ పార్టీలో చేరారు. ఆదివారం శంఖ భవన్లో జరిగిన కార్యక్రమంలో దిలీప్ చేరికను ఒడియా సినీ హీరో, రాజ్యసభ ఎంపీ మున్నా ఖాన్ ప్రకటించారు. తెంతుల కుంటి సమితిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సమితి సభ్యులు, ముగ్గురు సర్పంచ్లు బీజేడీలో చేరారు. వీరిని పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ సభ్యుడు అరుణ్ మిశ్ర స్వాగతం పలికారు. ఎందుకీ పార్టీ ఫిరాయింపు... సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక ప్రాంతాల్లో బీజేడీ, కాంగ్రెస్లను వీడి అనేక మంది అధికార బీజేపీలో చేరారు. కానీ నబరంగ్పూర్ జిల్లాలో బీజేడీలో చేరికల పట్ల అనేక రాజకీయ మలుపులు ఉన్నాయి. నబంరగ్పూర్ నుంచి 9 సార్లు ఎంపీగా గెలిచిన ఖగుపతి ప్రధాని మనుమడు దిలీప్ ప్రధాని. ఇదే స్థానంలో ఖగుపతి తమ్ముడు మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ కుమారుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని బీజేడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు జరిగిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో తనను తెంతులకుంటి సమితి చైర్మన్ చేయమని సదాశివను దిలీప్ అభ్యర్థించారు. దిలీప్ కాంగ్రెస్ను వీడి బీజేడీలోనికి వస్తే చైర్మన్ చేస్తామని సదాశివ బదులిచ్చారు. దిలీప్ పార్టీ మారకపోవడంతో బీజేడీకి చెందిన నీలాద్రిని చైర్మన్ను చేశారు. దీంతో స్వంత చిన్నాన్న సదాశివను ఓడిస్తానని ప్రతిన బూని దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గౌరి శంకర్ మజ్జి గెలిపొందారు. దిలీప్ ప్రస్తుతం తెంతులకుంటి సమితి సభ్యునిగా ఉన్నారు. తెంతులకుంటి సమితి చైర్మన్గా బీజేడీకి చెందిన నీలాద్రి మజ్జిపై పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఇది తెలిసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనోహర్ రంధారి రంగంలోకి దిగి దిలీప్ ప్రధానితో చర్చలు జరిపారు. ఉన్న చైర్మన్ను అవిశ్వాసం పెట్టి దించేస్తామని హామీ ఇచ్చారు. గతం మర్చి పోయి బీజేడీలో చేరితే అందరం కలిసి చైర్మన్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో దిలీప్ తన మద్దతుదారులతో బీజేడీలో చేరారు. -
సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం
జయపురం: జయపురం సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. సంఘ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలిగా బినోదిని శాంతపాత్రో, సాధారణ కార్యదర్శిగా విష్ణు వర్ధన రెడ్డి, ఉపాధ్యక్షులుగా మదన మోహననాయిక్, దేవేంద్రబాహిణీపతి, భవాణీ శంకర ఆచార్య, సహాయ కార్యదర్శులుగా హరిహర కరసుధా పట్నాయక్, డాక్టర్ నీలాచల ప్రధాన్, జానకీ పాణిగ్రహి, కోశాధికారిగా రబినారాయణ నందో, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుభాష్ చంధ్ర పండ, కార్యవర్గ సభ్యులుగా సత్యబ్రత పండ, పరమేశ్వర పాత్రో, రత్నాకర చౌధురి, ఇంజనీర్ కేధార్ నాథ్ బెహర, నరశింగ పాణిగ్రహి, గీతా ప్రకాశ్ చంధ్ర మిశ్ర, నరశింగ చౌదురి, జదాబ్ సుబుద్ది, రామ నాయిక్, భీమసేన్ అగర్వాల్, జి.వెంకటేశ్వరరావు, పి.మహేశ్వరరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డాక్టర్ సురేష్ దాస్ వ్యవహరించారు. నూతన కార్యవర్గంతో డాక్టర్ దాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. -
ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ విజయవంతం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం (ఈకోర్సా), భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) భువనేశ్వర్ సమన్వయంతో ఆదివారం నిర్వహించిన ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్ 2025 విజయవంతమైంది. స్థానికుల్లో శారీరక దారుఢ్యతపై చైతన్యపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్థానిక మండల రైల్వే అధికారి డీఆర్ఎం హెచ్ఎస్ బజ్వా తెలిపారు. ఎనిమిదేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, మహిళలు, బాలబాలికలు సహా 1,200 మందికి పైగా ఔత్సాహిక వ్యక్తులు ఈ భారీ పరుగు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో అర్జున అవార్డు గ్రహీత ద్యుతీ చాంద్, డీఆర్ఎం హెచ్ఎస్ బజ్వా, తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ ఖుర్దారోడ్ శాఖ అధ్యక్షురాలు గుర్ సిమ్రాన్ కౌర్, ఐఐటీ, భువనేశ్వర్ ప్రొఫెసర్ రాజేష్ రోషన్ దాస్ జెండా ఊపి హాఫ్ మారథాన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సుభ్రజ్యోతి మండల్, అదనపు మండల రైల్వే అధికారి (ఇన్ఫ్రా), పీకే బెహరా అదనపు మండల రైల్వే అధికారి (ఓపీ), క్రీడాధికారి హిమాద్రి భూషణ్ బిస్వాల్ పాల్గొన్నారు. హాఫ్ మారథాన్ స్థానిక రైల్వే స్టేడియం నుంచి ప్రారంభమై ఐఐటీ భువనేశ్వర్ నుంచి వెనుకకు మలుపు తిరిగి (యూ–టర్న్) రైల్వే స్టేడియంలో ముగిసింది. నాలుగు విభాగాలుగా పోటీ నిర్వహించారు. వాటిలో 21.1 కిలో మీటర్ల టైమ్ రన్, 10 కిలో మీటర్లు టైమ్ రన్, 5 కిలో మీటర్లు ఫన్ రన్, 2 కిలోమీటర్ల ఫన్ రన్ ఉన్నాయి. విజేతలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. సమగ్రంగా 2 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. మొత్తం 24 మంది విజేతలు బహుమతులు అందుకున్నారు. ఊర్మిల ఝలక్ విజయవంతమైన ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్ 2025 పరుగు పందెంలో 74 ఏళ్ల వయో వృద్ధ మహిళ ఊర్మిళ దాస్ తళుక్కుమన్నారు. 7 దశకాల వయసు మీరిన ఊర్మిళ అలుపు ఎరగకుండా సుదీర్ఘంగా 5 కిలో మీటర్ల ఫన్ రన్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. మారథాన్లో పాల్గొన్న అతి పెద్ద వయస్కురాలిగా ఆమెను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ‘వంటా–వార్పు’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, కనీస పెన్షన్ రూ.పది వేలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, వై.శ్యామలరావు, ఆర్.సతీష్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల 18వ రోజులుగా చేపడుతున్న మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం వంటా–వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్లు, డీపీఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. అసిరితల్లి సంబరాలకు ముహూర్తం ఖరారు అరసవల్లి: అరసవల్లి–కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాలకు ముహూర్తం ఖరారయ్యింది. వచ్చే ఏడాది వైశాఖ శుద్ధ ద్వాదశి ఏప్రిల్ 28న మంగళవారం అమ్మవారి సంబరాల్లో కీలకమైన సిరిమానోత్సవం జరిపేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం అసిరితల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన గ్రామపెద్దల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్యాలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఘనంగా నెల రోజుల పాటు సంబరాలు, సిరిమానోత్సవం జరుగుతాయని చెప్పారు. అనంతరం పలువురు పెద్దలు మాట్లాడుతూ గతంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, నిర్వహణ కమిటీల్లో యువతరానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. గ్రామ పెద్దల నిర్ణయంపై అరసవల్లి, కాజీపేట, ఆదిత్యనగర్ కాలనీ, కామేశ్వర నగర్, లక్ష్మీనగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, శిమ్మ సూర్యనారాయణ, తెలుగు మంగయ్య, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, ఉంగటి రమణమూర్తి, నక్క రామకృష్ణ, నక్క నారాయణమూర్తి, ఉంగటి పాపారావు, తెలుగు సూర్యనారాయణ, సీర చిన్నారావు, కునుకు గోవింద్, రుప్ప అప్పన్న, తెలుగు జగదీష్, దుంగ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దూడకు అరుదైన చికిత్స శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దూసి గ్రామంలో దుప్పల అప్పారావుకు చెందిన లేగదూడ రెండు కాళ్లు వంకరతో పుట్టడంతో డాక్టర్ సుభాష్ చంద్రబోస్ వైద్యం చేసి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. శ్రీకాకుళం నగరంలోని పశువైద్యశాలలో ఆదివారం రెండు, మూడు గంటలు పాటు శ్రమించి ఆపరేషన్ చేసి అల్యూమినియం స్ట్రిప్తో కట్టు వేసి కాపాడారు. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలి శ్రీకాకుళం క్రైమ్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసు అధికారులు సూచించారు. జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద రౌడీ షీటర్లను పిలించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలుకు దూరంగా ఉండాలన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్నారు. రౌడీషీటర్లపై ఎల్లప్పుడూ పోలీసు నిఘా ఉంటుందన్నారు. -
ఊపందుకున్న రథాల పనులు
పర్లాకిమిడి: జగన్నాథ రథయాత్ర కోసం పట్టణంలోని రాజవీధిలో మూడు రథాల తయారీ పనులు ఊపందుకున్నాయి. కాశీనగర్ బ్లాక్ సింగిపురం నుంచి పది మంది వడ్రంగులు, పర్లాకిమిడి నుంచి మరో ఐదుగురిని ప్రస్తుతం నియమించినట్టు రథయాత్ర రథాల కమిటీ తెలియజేశారు. జగన్నాథ, బలభధ్ర, సుభధ్ర రథాలు తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. మూడు రథాల తయారీకి ప్రస్తుతం పనులు జరుగుతుండగా అవసరమైన నూతన కలప ఫారెస్టు అధికారులు సమకూర్చుతున్నట్టు రథాల కిరిగోరో అశోక్ మహారాణా తెలియజేశారు. వర్షాలు ఆటంకం లేకుండా వుంటే, ఈ మూడు రథాల పనులు జూన్ 26 తేదీకు ముందు పనులు పూర్తవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రథ చక్రాల పనుల్లో నిమగ్నమైన వడ్రంగులు కొత్త శ్రీమందిరం పనులు కూడా సాగుతున్న వైనం -
‘సైబర్’కు సిబ్బంది కొరత
శ్రీకాకుళం క్రైమ్ : సైబర్ ఫ్రాడ్స్.. ప్రపంచం ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. చిన్నోళ్లని చిదిమేస్తుంది.. పెద్దోళ్లను కబళించేస్తుంది.. తారతమ్యాల్లేవు.. ఎంతటి తెలివైన వారైనా సరే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ మోసగాళ్ల వలలో పడి ఆర్థికంగా చితికిపోవాల్సిందే. నిన్న మొన్నటి వరకు జిల్లాలో మేజర్ సైబర్ కేసులు (రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల్లోపు) అధికంగా నమోదయ్యాయి. ఇటీవల ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, యువత, ఉద్యోగస్థుల్లో వీటిపై అవగాహన ఏర్పడటం.. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు విద్యాసంస్థలు, స్టేషన్ పరిధి ముఖ్య కేంద్రాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించడం తదితర కారణాలతో కేసుల సంఖ్య కాస్తు తగ్గుముఖం పట్టింది. రూ. 10 వేలు నుంచి రూ. 20 వేలు లోపు చిన్న చిన్న కేసులు నమోదవుతున్నాయి. అరకొరగా సిబ్బంది.. జిల్లాలోని ఐటీ కోర్ విభాగంలో ఓ ఏఎస్ఐతో కలిపి పది మంది సిబ్బంది ఉన్నారు. వారిలో హెచ్సీలు ముగ్గురు, మిగతా వారంతా కానిస్టేబుళ్లే. సైబర్ సెల్ విభాగానికొస్తే ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. రెండు విభాగాలకు ఇన్చార్జిగా సీఐ శ్రీనివాస్ ఉన్నారు. గతంలో ఇదే సైబర్ సెల్ విభాగానికి సాంకేతికతపై మెండుగా అవగాహన ఉన్న ఐదారుగురికి మించి సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలొచ్చి కూటమి ప్రభుత్వమేర్పడ్డాక.. అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అనుకూలురుగా వ్యవహరించారని ముద్రపడి వీఆర్కు పంపించేశారు. కొంతమంది ఎస్ఐలు, దిగువ స్థాయి సిబ్బంది ఉన్నా వేరే కేసుల్లోనే వినియోగించుకోవడం.. సాంకేతికతపై ఎక్కువశాతం మందికి పట్టు లేకపోవడం ఇబ్బందికి కారణంగా కనిపిస్తోంది. తగ్గని విధుల ఒత్తిడి.. జిల్లాలో వినూత్నమైన కేసులు ప్రస్తుతం నడుస్తున్నాయి.. నిన్న మొన్నటి వరకు అన్యమత ప్రచారాల కేసు, భారీ చోరీ కేసులు, నకిలీ కరెన్సీ, మిస్సింగ్ వంటి కేసుల్లో టెక్నికల్గా ఛేదించే పనిలో పడ్డ సైబర్ నిపుణులు ప్రస్తుతం జిల్లాను పట్టి పీడిస్తున్న బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి జూదాల్లో మునిగి తేలుతున్న ప్రధాన బుకీలు, ఏజెంట్లు, వారి లింకులు టెక్నాలజీ పరంగా కనిపెట్టడంలో బిజీగా ఉన్నారు. ఇంత చేసినా బందోబస్తులకు, విజయవాడ శిక్షణా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అది మాటలకే పరిమితమైంది. ఒకవేళ వచ్చినా సాంకేతికంగా నిపుణులైన పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతమున్న సిబ్బందిపై పని భారం మాటలకే పరిమితమైన సైబర్ పోలీస్ స్టేషన్ -
బృందావన విహార్లో 45 తులాల బంగారం చోరీ
పర్లాకిమిడి: పట్టణంలోని నటరాజ్ సినిమా హాల్ ప్రాంతం బృందావన విహార్లో పట్టపగలు ఒక ఇంట్లో చోరీ జరిగి 45 తులాల బంగారం దోచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నటరాజ్ సినిమా హాల్ బృందావన విహార్ లో మూడంస్తుల భవనంలో స్వర్ణలతా పాల్ తన అన్నదమ్ముడు, తల్లి, భర్తతో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 5.30 గంటలకు మందిరానికి తల్లి వెళ్లినపుడు ఫ్యామిలీ అంతా రెండో అంతస్తులో నిద్రిస్తున్నారు. దొంగలు మొదటి అంతస్తులోకి వెళ్లి బీరువాలో ఉన్న 45 తులాల బంగారం వస్తువులు దోచుకున్నట్టు ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. యజమాని పార్ధరాజ్ పాల్ ఫిర్యాదు మేరకు స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగతనం జరిగిన ఇంటిలో సైంటిఫిక్ టీం వచ్చి దర్యాప్తు ప్రారంభించినట్టు ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలియజేశారు. హత్య కేసులో నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష రాయగడ: ఒక హత్య కేసుకు సంబంధించి జిల్లా అదనపు జడ్జి అక్షన స్వయి నిందితునికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు మరో రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానాను చెల్లించలేకుంటే మరో ఏడాది అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. తన కూతురిని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు సనొమాటికొన గ్రామానికి చెందిన దుర్యొ మాఝి అనే వ్యక్తి ప్రకాష్ ప్రధానిపై టికిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు నిందితుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును శనివారం విచారించిన జిల్లా అదనపు జడ్జి ఈ మేరకు తీర్పునిచ్చారు. విషపూరిత పుట్టగొడుగులు తిని ముగ్గురికి అస్వస్థత రాయగడ: అడవుల్లో లభించే విషపూరిత పుట్టగొడుగులు వండుకు తిన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి శెరిగుమ్మ పంచాయతీలోని తురచితొరాయి గ్రామంలో ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రామి బెడిసిక శనివారం మధ్యాహ్నం అడవికి వెళ్లి వంట చెరుకుని తీసుకువస్తున్న సమయంలో దారిలొ పుట్టగొడుగు కనిపించింది. దాన్ని సేకరించి రాత్రి ఇంటిలొ అంతా వండుకుని తిన్నారు. మధ్యరాత్రి రామి బెడిసిక కు చెందిన మూడేళ్ల కొడుకు దిల్లి బెడిసికకు కడుపు నొప్పి వాంతులయ్యాయి. అనంతరం రామి, అతని భార్య సదారి బెడిసికకు కూడా వాంతులు కావడంతో తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు వారి పరిస్థితిని చూసి వెంటనే ఆంబులెన్స్ సాయంతో కల్యాణసింగుపూర్ ప్రాథమిక ఆరొగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు వెంటనే వారికి చికిత్స చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆరోగ్యం కుదుట పడటంతో ఆదివారం ఉదయం వారిని గ్రామానికి తరలించారు. ఉద్యోగ విరమణ రోజే చనిపోయాడు.. మల్కన్గిరి: ఉద్యోగ విరమణ చేసిన రోజునే ఓ వ్యక్తి మృతి చెందాడు. మల్కన్గిరి మత్తిలి సమితి దలపతిగూఢ గ్రామానికి చెందిన భీమ్సేన్ ప్రధాన్ (60) పంచాయతీ పీఈవోగా పని చేశారు. కొన్ని నెలల క్రితం నవరంగ్పూర్ జిల్లాకు బదిలీ అయింది. మే 31వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. అయితే అదే రోజు రాత్రి ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేక తోటి ఉద్యోగి సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం స్వస్థలం మత్తిలి దళపతిగూఢ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాన్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
జొరిపంగలో మలేరియా విజృంభణ
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి తొంబాగుడ పంచాయతీలోని జొరిపంగ గ్రామంలొ మలేరియా విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడిన వారు కళ్యాణసింగుపూర్ ప్రాథమిక ఆరొగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడిన వారి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా మలేరియా సొకినట్లు తేలింది. ప్రస్తుతం ఈ గ్రామంలొ శాంతి నాగ్ (55), సుభాష్ మాఝి (54), సస్మిత మాఝి (27), సురియా మాఝి (60), నిలు మాఝి (20), ప్రేమీ మాఝి (10), దీనబంధు మాఝి (48), శాంతి మాఝి (40), సూర్య మాఝి (25), శివాని మాఝి (25), రుంబా మాఝి(30), రామీ మాఝి, రస్మీ మాఝి, దిలసన్ మాఝి, సునీల్ మాఝి, మదంతి మాఝి, జగిలొ మాఝి, రొహిద్ మాఝి, శకుంతల మాఝి, సంతొష్ మాఝిలు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. మలేరియా విజృంభణ సమాచారం తెలుసుకున్న వైద్యులు పద్మపూర్ మెడికల్ అధికారి డాక్టర్ రుతుపూర్ణ పట్నయక్ నేతృత్వంలో ఒక బృందం ఆదివారం జొరిపంగ గ్రామంలో పర్యటించింది. అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసిన బృందం అనారోగ్యంతొ ఉన్న కొందరి రక్తనమూనాలను సేకరించింది. అనంతరం వారికి మందులను పంపిణీ చేసింది. అయితే పరిస్థితి అదుపులో ఉందని వైద్య బృందం తెలిపింది. సేకరించిన రక్త నమూనాలను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన చికిత్సను అందిస్తామని తెలియజేసింది. -
సతొబిసిలో ఏనుగుల బీభత్సం
రాయగడ: నియమగిరి పర్వత ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి గ్రామంలో చొరబడిన ఏనుగుల గుంపు ఇళ్లలో ప్రవేవించి సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. గ్రామంలో గల గొపినాథ్ జకసిక ఇంటిలో చొరబడిన ఏనుగులు అతను నిల్వ ఉంచుకున్న చోడి, ధాన్యం బస్తాలను బయటకు తీసుకువెళ్లి ధ్వంసం చేశాయి. గత కొద్ది రోజులుగా ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న సంగతి అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ ఇంతవరకు వాటిని తోలే ప్రయత్నం చేయకపొవడంతో అవి గ్రామాల్లోకి చొరబడి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని వాటిని తరమాలని కోరుతున్నారు. -
అగ్రస్థానం లక్ష్యం
పాల ఉత్పాదనలో ..భువనేశ్వర్: 2023–24 సంవత్సరంలో మన రాష్ట్రం 26.4 లక్షల మెట్రిక్ టన్నుల పాలను ఉత్పత్తి చేసిందని, రానున్న ఐదేళ్లలో దాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, పాల ఉత్పత్తి రాష్ట్రంగా ఒడిశా దేశంలో ఒక నమూనా స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. పాల సంపన్న ఒడిశా, ఆరోగ్యకరమైన ఒడిశా అనే నినాదంతో మనం అంతా కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక అభివృద్ధి శాఖ స్థానిక లోక్ సేవా భవన్ సమావేశ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రపంచ పాల దినోత్సవం – 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ఒడిశా పాల సమాఖ్య (ఓంఫెడ్) రైతులకు రూ.1 లక్ష ప్రమాద మరణ సహాయం, ఓంఫెడ్ పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం లీటరుకు రూ. 3 అదనంగా ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓంఫెడ్ బాల్టి పెరుగు, ఎ–2 పాలు, ఎ–2 నెయ్యి కొత్త ఉత్పాదనల్ని విడుదల చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కామధేను యోజన, ఆవు, దూడల పెంపకం, ఆవుల మందల భీమా, గడ్డి సాగు కోసం నగదు ప్రోత్సాహకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముఖ్యమంత్రి కామధేను యోజన కింద సుమారు 3 లక్షల మంది గోపాలకులకు రూ. 71 కోట్ల సహాయం అందజేశారు. రాష్ట్రంలోని 77 నమోదిత గోశాలలలో నిస్సహాయ గోవుల నిర్వహణ కోసం సంక్షేమ సంస్థలకు రూ. 10.5 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మాట్లాడుతూ పాడి ఉత్పాదన రంగంలో మహిళల స్వావలంబన బలోపేతం అవుతుందన్నారు. మా మిషన్ శక్తి సహకారంతో సేంద్రీయ గత్తం ఉత్పత్తితో మహిళలు లక్ష పతి దీదీలుగా ఎదుగుతున్నారని తెలిపారు. రాష్ట్ర న్యాయ, నిర్మాణం, అబ్కారి శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ తన ప్రసంగంలో ఆవుల పెంపకం మరియు పాల ఉత్పత్తి సమాజంలోని ప్రతి స్థాయిలో ఉపాధిని పెంచడంలో సహాయపడుతుందన్నారు. దేశంలోని ప్రతి గ్రామం స్వావలంబన చెందితేనే దేశ ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కామధేను యోజన పాల ఉత్పత్తి రంగంలో విప్లవం తీసుకొచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడానికి, ఒడిశాను పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక అభివృద్ధి, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల విభాగం మంత్రి గోకులానంద్ మల్లిక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య, పశుసంవర్ధక అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ వశిష్ట, పశు సంవర్ధక మరియు పశు వైద్య శాఖ డైరెక్టర్ విజయ్ అమృత కులంగే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ పశు సంక్షేమ సంస్థల కార్మికులు, గోసంరక్షకులు, పశుసంవర్ధక శాఖ కార్మికులు పాల్గొన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో పాల ఉత్పత్తి రెట్టింపు రాష్ట్ర స్థాయిలో ప్రపంచ పాల దినోత్సవం – 2025 -
దోపిడీ కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: యువకుడిపై మారణాయుధాలతో దాడి చేసి డబ్బు, ఇతర వస్తువులు దోచుకున్న కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని జయపురం సదర్ పోలీసులు ఆదివారం తెలిపారు. అరెస్టయిన వారిలో కొట్పాడ్ సమితి లఠిగుడ గ్రామానికి చెందిన దుబసేన్ మాలి, సనొపొరియ పంచాయతీ భుగుబందర్ గ్రామానికి చెందిన ధనపతి గోండ్ ఉన్నట్టు సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరిని కోర్టులో హాజరు పరచగా జడ్జి బెయిల్ నిరాకరించటంతో వారిని రిమాండ్కు తరలించామన్నారు. జయపురం సమితి సొలప గ్రామ వాసి ఉత్తమ టికాదార్ గత నెల ఏడో తేదీన ద్విచక్ర వాహనంపై జయపురం నుంచి తన గ్రామం సొలపకు వెళ్తుండగా మార్గంలో ధరణహండి అటవీ ప్రాంతంలో నలుగురు దుండగులు అడ్డగించి మారణాయుధాలతో చంపుతామని బెదిరించి అతడి వద్దగల రూ. 10 వేలుతోపాటు మొబైల్ ఫోను లాక్కున్నారు. అంతే కాకుండా అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న మరో 90 వేల రూపాయిలను బలవంతంగా పే ఫోన్ ద్వారా తీసుకొని పరారయ్యారు. దీంతో బాధితుడు ఉత్తమ్ గత నెల ఎనిమిదో తేదీన జయపురం సదర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లభించిన ఆధారాలతో ధనపతి, దుబసేన్లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ తెలిపారు. పట్టుబడిన వారినుంచి ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏఎస్సై ప్రమోద్ కుమార్ పాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పూరీ శ్రీమందిరంపై డ్రోన్
భువనేశ్వర్: పూరీ శ్రీమందిర్ లోపలి ప్రాంగణం, ఆలయ శిఖరం పైన జరుగుతున్న ఆచారాల స్పష్టమైన వైమానిక దృశ్యాలతో వీడియో సోషల్ మీడియాలో ప్రసారమైంది. ఇది డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. కట్టుదిట్టమైన ఆంక్షలు ఉన్నప్పటికీ, పూరీలోని పవిత్ర జగన్నాథ ఆలయ శిఖరంపై డ్రోన్ సంచారం భద్రతా యంత్రాంగం పని తీరును నిలదీస్తుంది. గత నెల 30న స్టోరీ బై నారు గోపాల్ అనే శీర్షికతో సాంఘిక ప్రసార మాధ్యమ వేదిక ద్వారా వీడియో ప్రసారం అవుతోంది. దీనిలో ఒక ఆలయ సేవకుడు ఆలయం పైభాగంలో సంప్రదాయ పతాక సేవ కోసం సన్నద్ధం అవుతున్న దశలో నమస్కార భంగిమలో స్పష్టంగా ప్రసారం అవుతుంది. నిత్యం ధ్వజారోహణ సేవని చున్నార్ వర్గం సేవకులు నిర్వహిస్తారు. వివాదాస్పద సాంఘిక మాధ్యమం ప్రసారంతో ఈ వర్గం సేవకుల చిత్త శుద్ధి వైపు వేలెత్తి చూపుతున్నారు. జగన్నాథ సంప్రదాయంలో ధ్వజారోహణ సేవ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది దైనందిన ఆచారం. ఈ సేవలో భాగంగా ఆలయ శిఖరాన నీల చక్రం ఆవరణలో పతిత పావన పతాకం కట్టే అపురూప క్షణాల దృశ్యాల్ని ఈ వీడియో ప్రసారం చేస్తుంది. భద్రత, మతపరమైన సున్నితత్వం, అనధికారిక నిఘా ప్రమాదం దృష్ట్యా శ్రీ జగన్నాథ ఆలయంపై డ్రోన్ల వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయ శిఖరంపై సేవల శైలిని బహిరంగంగా చిత్రీకరించి, సామాజిక వేదికలలో ప్రసారం చేయడం పర్యవేక్షణ, అమలులో స్పష్టమైన లోపాన్ని బహిర్గతం చేస్తుంది. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ ఈ ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది డ్రోన్ వాడకం నిషేధం పరిమితుల ఉల్లంఘనగా వ్యాఖ్యానించారు. ఈ ప్రసారంతో అనేక లొసుగులు, భద్రతా లోపాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్లో ఇలాంటి చొరబాట్లను అరికట్టడానికి శ్రీ మందిర్, చుట్టుపక్కల డ్రోన్ నిరోధక సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. వైరల్ వీడియో పూర్వాపరాలపై ఆరా తీసి డ్రోన్ను నిర్వహించడంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడంలో అనుబంధ అధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై స్వామి భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
278 మందికి వైద్య పరీక్షలు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కాట్రగడ ప్రాథమిక విద్యాలయ ప్రాంగణంలో శనివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్బంగా దంత చికిత్స సంస్థ ఐడీఏ హిల్ సిటీ శాఖ తరఫున ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ముఖ్యఅతిథిగా జయపురం శాసనసభ్యుడు తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం మహా భాగ్యమన్నారు. అందువలన ప్రజలు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పొగాకు ఉత్పత్తులు సేవించటం వలన వ్యాధులకు కారణం అవుతాయన్నారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు బారినపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు వాటి వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. శిబిరంలో 278 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఐడీఏ హిల్ సిటీ శాఖ అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ దాస్ అధ్యక్షతన జరిగిన శిబిరంలో కోశాధ్యక్షులు డాక్టర్ సిద్ధాంత నాయిక్, డాక్టర్ సురభి మహంతి, డాక్టర్ దీపనిత సర్కార్, డాక్టర్ పూజ సర్కార్, డాక్టర్ సుతీశ్మిత మహాపాత్రో, డాక్టర్ ఫౌజియ తనబీర్, డాక్టర్ పి.సుచేత, డాక్టర్ బెహర, డాక్టర్ ఆర్.కె.బెవురియ, డాక్టర్ ప్రత్యూష్ నంద, డాక్టర్ అమిత్ దాస్, డాక్టర్ దేవార్జున్ రోగులను పరీక్షించారు. శిబిరంలో కొరాపుట్ జిల్లా మాజీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ అరుణ కుమార్ పాఢీ, బొరిగుమ్మ ఆస్పత్రి వైధ్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్ నాథ్, కాట్రగడ ప్రాథమిక వైద్య కేంద్ర డాక్టర్ శివ ప్రసాద్ మహారాణి పర్యవేక్షించారు. -
అవగాహనే ఆయుధం : సీఎం
భువనేశ్వర్: పొగాకు సంబంధిత వైపరీత్యాల నివారణకు అవగాహన ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శని వారం నిర్వహించిన అవగాహన ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. పొగాకు వ్యతిరేకత కార్యకలాపాల సాఫల్యత అంతర్ విభాగ సమన్వయంతో సాధ్యమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ప్రధాన కార్యదర్శి ఎస్.అశ్వస్థి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఎన్టీసీపీ ) కింద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్థానిక గీత గోవింద సదనన్లో రాష్ట్ర స్థాయి ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం 2025ను కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పొగాకు రహిత ఒడిశాకు తమ మద్దతును తెలుపుతూ పౌరులు పాల్గొనేలా సంతకం ప్రచారాన్ని ప్రారంభించారు. పొగాకు వాడకంతో సంబంధం ఉన్న నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువత, దుర్బల వర్గాలకు అవగాహన కల్పించడానికి శాఖ రూపొందించిన సమాచార విద్య సంచిక (ఐఈసీ), 2024–25 వార్షిక కార్యాచరణ నివేదికను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలు జాతీయ పొగాకు రహిత మార్గదర్శకాలపై స్వీయ అవగాహన కోసం పొగాకు రహిత విద్యా సంస్థలు వెబ్ డిజిటల్ అప్లికేషన్ ప్రారంభించారు. పొగాకు నియంత్రణ చొరవలను ఆదర్శప్రాయంగా అమలు చేసిన 3 జిల్లాలను అభినందించారు. ఎన్టీసీపీ సమగ్రంగా అమలు చేసినందుకు గంజాం, పొగాకు నియంత్రణ చట్టాన్ని అమలు చేసినందుకు సుందర్గఢ్, ఈ కార్యక్రమం కింద సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ కోసం కటక్ జిల్లాలు ప్రత్యేక బహుమతులు అందుకున్నాయి. పొగాకు వ్యతిరేక కార్యకలాపాల్లో అనుబంధ మద్దతుకు గుర్తింపుగా పాఠశాల, సామూహిక విద్య, ఉన్నత విద్య, అబ్కారి, పంచాయతీ రాజ్, తాగు నీరు, హోం శాఖ 5 విభాగాలకు అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ జె. ఎం. బబోర్త, డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా, ఎన్టీసీపీ అదనపు డైరెక్టర్ మరియు రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ సుశాంత కుమార్ స్వంయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అథ్లెట్లకు అభినందనలు
భువనేశ్వర్: దక్షిణ కొరియా గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు విశేష ప్రతిభ ప్రదర్శించి పతకాలు సాధించారు. ఏస్ స్ప్రింటర్ అనిమేష్ కుజుర్, శ్రావణి నొందొ ఈ పోటీలో పతకాలు సాధించారు. అనిమేష్ కుజుర్ పురుషుల 200 మీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అతి స్వల్పంగా 20.32 సెకన్ల సమయంతో గమ్యం ఛేదించి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. గుమిలో జరిగిన తన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో అనిమేష్ కుజుర్ తొలిసారి పాల్గొని కాంస్య పతకం సాధించడం విశేషం. ఫుట్బాల్ క్రీడాకారుడి నుంచి ఏస్ స్ప్రింటర్గా ఆవిర్భవించి తనదైన శైలిలో అద్భుత ప్రతిభ ప్రదర్శించాడని అతని కోచ్ మార్టిన్ ఓవెన్స్ కొనియాడారు. ఒడిశా స్టార్ స్ప్రింటర్ శ్రావణి నొందొతో కూడిన భారత మహిళల రిలే జట్టు 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2025లో 400 మీటర్ల ఈవెంట్లో 43.86 సెకన్ల సమయంతో లక్ష్యం ఛేదించి రజత పతకాన్ని సాధించింది. శ్రబాణి, ఎస్. ఎస్. స్నేహ, అభినయ రాజరాజన్, నిత్య గాంధేలతో కూడిన జట్టులో శ్రావణి నొందొ ఒకరుగా పాల్గొని విజయం సాధించింది. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో రజత పతకం సాధించిన శ్రావణి నొందొ, కాంస్య పతకం గెలుచుకున్న అనిమేష్ కుజుర్కు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందనలు తెలిపారు. -
సెంచూరియన్లో యోగోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, మురార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో ‘యోగోత్సవం– 2025’ను జిల్లా కలెక్టర్ బిజయకుమార్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ సుప్రియా పట్నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, ప్రొఫెసర్ బిశ్వజిత్ మిశ్రా (పరిపాలన), డైరక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, క్రీడాశాఖ డైరెక్టర్ రబినారాయణ రౌత్రాయ్ తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ దాస్ మాట్లాడుతూ యోగా ద్వారా మనిషి ఆరోగ్యం, జ్ఞానం కలుగుతుందన్నారు. సంపూర్ణ వెల్నెస్, నిరంతరం సెంచూరియన్ వర్సిటీకి సహాకారం అందిస్తున్నందుకు కలెక్టర్ బిజయకుమార్ దాస్కు ‘సెంచూరియన్ యోగా మిత్ర’ అవార్డును ఉపకులపతి ప్రొఫెసర్ సుప్రియా పట్నాయక్ ద్వారా ప్రదానం చేశారు. యోగాసనాలు చేసిన తరువాత రెండో సెషన్లో ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే వర్క్ షాపును ఐఐటీ ధాన్బాద్ నుంచి విచ్చేసిన ప్రొఫెసర్ అజిత్ కుమార్ బెహరా కుండలినీ యోగా గురించి విద్యార్థులకు తెలియజేశారు. భువనేశ్వర్ నుంచి విచ్చేసిన యోగాభ్యాసం కోచ్ అంశుమాలిని యోగా విద్య ద్వారా లాభాలను తెలియజేశారు. యోగా, ఽధ్యాన నైపుణ్య కోర్సులకు ఫెలిసిటేటర్గా పనిచేసిన ప్రొఫెసర్ ప్రపుల్ల కుమార్ పండా, ఐ.కె.ఎస్ బోధకుడు బాలాజీ పాడీ, భువనేశ్వర్ క్యాంపస్ యోగా బోధకుడు డాక్టర్ జ్ఞానేంద్ర కుమార్ మిశ్రా, సెంటర్ కో ఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ సాహులకు జ్ఞాపికలతో డాక్టర్ అనితా పాత్రో అందజేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థి మెహార్ సచిత్ చేసిన వేద ప్రార్థనలు, భగవద్గీత పారాయణంలో కర్మయోగ పద్యాలు పలువురుని ఆకట్టుకున్నాయి. -
మైనర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తి పరార్
జయపురం.: పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పరచి మైనర్ బాలికను గర్భవతిని చేసిన కొట్పాడ్ ఎమ్మెల్యే బొరిగుమ్మ సమితి ప్రతినిధి, బీజేపీ నేత కుమారుడుపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. నిందితుడు రాజేంద్రభొత్ర ఫరారీలో ఉండటంతో అతడు వినియోగిస్తున్న రెండు కార్లు, ఒక బైక్ను సీజ్ చేశారు. నిందితుడి కుటుంబ సభ్యులను విచారించామన్నారు. అయితే అతడి జాడ తెలియరాలేదని సయపురం సదర్ పోలీసు స్టేషన్ అధికారి సచీంధ ప్రధాన్ శనివారం వెల్లడించారు. నిందితుడు బొరిగుమ్మ సమితి సనపొరియ పంచాయతీ సవునిగిడ గ్రామం రాజేంద్ర భొత్ర కు ఒక వివాహం సమయంలో మైనర్ బాలికను చూశారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం ఏర్పడింది. రాజేంద్ర ఆమెను వివిధ విధాలుగా ప్రలోభ పరచి శారీరకంగా అనుభవించాడు. ఇటీవల బాలిక తనకు కడుపు నొప్పిగా ఉందని తల్లితో చెప్పగా.. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భిణిగా తేల్చారు. బాలిక జరిగిన విషయం తల్లికి తెలపగా ఆమె తల్లి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామ పెద్దలు నిందితుడు రాజేంద్రను గ్రామానికి రమ్మని కబురు చేశారు. అయితే రాజకీయ కుటుంబం కావటంతో రాకుండా ఎంతైనా ఇస్తాను కడుపు తీయించుకొమ్మని కబురు చేశారు. మరో మార్గం లేక బాధితురాలి తల్లి జయపురం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోస్కో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజకీయ రంగుగా మారింది. బీజేడీ పార్టీ నేత.. మాజీ మంత్రి పద్మిణీ దియాన్ మహిళా కార్యకర్తలతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే నిందితుని అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని కలిసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లగా అతను లేకపోవడంతో అతడు వినియోగించే రెండు కార్లు, ఒక బైక్ను సీజ్ చేశారు. -
ఆదివారమైనా బాధ్యతలు స్వీకరించాల్సిందే
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖలో ఇటీవల హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఆదివారం విధుల్లో చేరనున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లలో ఇటీవల 83 మంది స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. వీరికి గత నెల 29న శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆరోజు ఉదయం 10 గంటలకు మొదలువకావాల్సిన ఆన్లైన్ కౌన్సెలింగ్ సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 వరకు మాన్యువల్ విధానంలో పూర్తిచేసిన ఉదంతం విదితమే. కాగా ఆరోజు హెచ్ఎంలగా పదోన్నతి పొందిన వారంతా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించి, విధుల్లో చేరాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఈ 83 మందిలో జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో 80మంది, మున్సిపల్ ఇద్దరు, మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరు ఉన్నారు. వీరంతా శనివారం పాత పాఠశాలల నుంచి రిలీవ్ అయ్యారని డీఈఓ తిరుమల చైతన్య పేర్కొన్నారు. -
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి
భువనేశ్వర్: నయాగడ్ జిల్లాలో శనివారం విషాద సంఘటన వెలుగు చూసింది. శిశర్ సాహు అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని నయాగడ్ జిల్లా బారొమాసి గ్రామంలో అటవీ శాఖ అధికారి (ఫారెస్టర్) స్వాధీనపరచుకున్నారు. శుక్రవారం రాత్రి పూట నిప్పు అంటించడంతో ఈ ఘటన సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడిని నయాగఢ్ జిల్లా పంచరిద ఫారెస్ట్ రేంజ్కు చెందిన ఫారెస్టర్ శిశిర్ సాహుగా గుర్తించారు. అతను రెండు నెలల కిందట పంచరిద రేంజ్లో ఫారెస్టర్గా చేరాడు. రోజు మాదిరిగా శిశిర్ తన భార్య నమిత, కుమారునితో కలిసి నిద్ర పోయాడు. ఇంతలో అర్ధరాత్రి పూట ఇంట్లో మంటలు చెలరేగాయి. శిశిర్ భార్య అరుస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారి సాయం కోరింది. ఈ సమాచారం అందుకున్న నయాగఢ్ అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. నయాగడ్ టౌన్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్టర్ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుగుతోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అస్పష్టంగా ఉండటంతో శిశిర్ సాహు మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శిశిర్ తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా ... గిట్టని వారు ఎవరైనా తనపై కక్షతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా ... అనే దిశలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బంధుమిత్రులతో పోలీసులు సంప్రదిస్తున్నారు. భార్య వివాహేతర సంబంధాల అనుమానంతో తరచూ భర్తని వేధించేదని మృతుని బంధువర్గాల ఆరోపణ. ఈ నేపథ్యంలో తరచూ వీరి మధ్య కలహంతో ఇల్లు రణరంగంగా మారేదని తెలిపారు. -
బీడీవోకు ఘనంగా వీడ్కోలు
జయపురం.: జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి బీడీవో కపిలేశ్వర తండి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు కుంధ్ర సమితి పాత్రికేయ సంఘం తరఫున ఘన వీడ్కోలు లభించింది. ఈ సందర్భణగా పాత్రికేయ సంఘ సలహాదారు కనూచరణ నాయిక్ మాట్లాడుతూ బీడీవో కుంధ్ర సమితి ఉన్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన కుంధ్ర బీడీవోగా వచ్చిన తరువాత సమితిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అంతేకాకుండా పాత్రికేయులతో మంచి మిద్రునిగా ఉండే వారని, జర్నలిస్టుల సంఘ భవనానికి స్థలం కేటాయించటంలో ప్రధాన భూమిక నిర్వహించారన్నారు. ఆయన కృషివలన తహసీల్దార్ బినోద్ కుమార్ నాయిక్ స్థలం సమకూర్చారని వెల్లడించారు. ఆ స్థలంలో జర్నలిస్టు భవనం నిర్మాణాకిని ఇద్దరు అధికారులు సహకరించారని, బీడీవో తండిని కుంధ్ర సమితి పాత్రికేయులు ఎన్నడూ మరవలేరని అన్నారు. బీడీవోను ను సన్మానించిన వారిలో కనూచరణ నాయిక్తో పాటు సీనియర్ పాత్రికేయులు అక్షయ కుమార్ పట్నాయక్, జర్నలిస్టులు ఎన్.సంతోష్ కుమార్, రామ చంద్రనాయిక్, ఇంధ్ర పంగి, బాబుల హరిజన్, నిరంజన్ పాణి, సురేంద్ర సాగరియ,హరిహర కుమార్ పట్నాయిక్ మొదలగు వారున్నారు. వైభవంగా శీతల షష్టి పర్లాకిమిడి: స్థానిక రాజవీధి రామలింగేశ్వర ఆలయం (పొడుగు దేవాలయం)లో శనివారం సాయంత్రం శీతల షష్టి సందర్భంగా శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పర్లాకిమిడి పురవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని అర్చకులు దుర్గాప్రసాద్ దాస్ ఆధ్వర్యంలో జరిపారు. ఈ దేవ కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాపారులు అంధవరపు బాలజీ, మల్లా శ్రీను దంపతులతో వేదపండితులు వనమాలి మాణిక్యశర్మ జరిపించారు. పొడుగు దేవాలయం ప్రధాన అర్చకులు దుర్గాబాబు, ఇతర అర్చకుల శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ శాలిపేట గ్రామానికి చెందిన చలపాక తారకేశ్వరరావు (39)గా గుర్తించినట్లు తెలిపారు. మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉంటాడని, శరీరం డీ హైడ్రేషన్కు గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. కారు బోల్తా.. తప్పిన ప్రాణాపాయం టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఓ కారు బోల్తాపడింది. ఒడిశాకు చెందిన ఏడుగురు వ్యక్తులు దైవ దర్శనానికి విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీపురం సమీపంలో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రూ.23,700 విలువైన కలప స్వాధీనం ఎచ్చెర్ల: ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు లావేరు మండ లం బెజ్జిపురం జంక్షన్ వద్ద విజిలెన్స్, అటవీశా ఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. రణస్థలం మండలం చిల్లపేట గ్రామాని కి చెందిన సిల్లా శంకరరావు అటవీశాఖ అను మతులు లేకుండా బుడతవలస నుంచి చిల్లపేటకు అక్రమంగా తరలిస్తున్న రూ.23,700 విలువైన అకేషియా కలప దుంగలను పట్టుకున్నారు. అనంతరం బొలెరో వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కలపను తరలిస్తు న్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని అధికారులు తెలిపారు. ఈ తనీఖీల్లో విజిలెన్స్ అధికారులు సీఐ సతీష్కుమార్, ఎస్సై రామారావు, సిబ్బంది ఈశ్వరరావు, కన్నబా బు, అటవీశాఖ అధికారులు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గౌరీశంకర్ పాల్గొన్నారు. 23 కేజీల గంజాయి సీజ్ నరసన్నపేట: మడపాం టోల్గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 23 కేజీల 800 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో పర్లాకిమిడికి చెందిన ముక్తా పరిషా, కటక్కు చెందిన రత్నాకర్ జెన్నాలను అరెస్టు చేశారు. శనివారం నరసన్నపేట సర్కిల్ స్టేషన్లో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. మడపాం టోల్గేట్ వద్ద శనివారం ఉదయం , మధ్యాహ్నం వేర్వేరుగా నరసన్నపేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముక్తా పరిషా అనే మహిళ మూడేళ్ల బిడ్డతో 10 కేజీల గంజాయిని పర్లాకిమిడి నుంచి చైన్నెకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆమెతో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. అలాగే కటక్ నుంచి హైదరాబాద్కు రత్నాకర్ అనే వ్యక్తి 13 కేజీల 800 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు కేసుల్లో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధారణ తప్పనిసరి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, ఎఫ్ఏసీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.శ్రీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ట్రాఫిక్ నిబంధనలు, మోటారు యాక్ట్పై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి శ్రీధర్, ట్రాఫిక్ సీఐ వి.నాగరాజు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. నదిలో జారిపడి వృద్ధుడి మృతి శ్రీకాకుళం రూరల్: బైరి గ్రామానికి చెందిన గొర్లె రామారావు(70) శనివారం సాయంత్రం ఆరుబయటకు వెళ్లి వంశధార నది వద్ద ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఎవరూ లేకపోవడంతో మునిగిపోయి చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నదిలో ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరిగాయని, ఆ గోతులే ప్రాణాలు బలిగొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పాములా అమ్మాయి ప్రవర్తన
భువనేశ్వర్: మయూరభంజ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల ఒక అమ్మాయి ప్రవర్తన పామును పోలినట్లు ఉండడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు. మయూరభంజ్ జిల్లా ఉదొలా మండలం చకరపాల్ గ్రామం నడి రోడ్డు మీద ఓ అమ్మాయి పాములా పాకుతూ పడగ విప్పి బుసలు కొడుతున్న దృశ్యం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే .... ఇటీవల మయూరభంజ్ జిలా ఉదొలా మండలం చకరపాల్ గ్రామంలోని రవీంద్ర సింగ్ ఇంట్లోకి ఒక విషపూరిత పాము ప్రవేశించింది. అది నాగు పాముగా గుర్తించి యజమాని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. వారు వెంటనే స్నేక్ హెల్ప్లైన్ సభ్యులకు ఫోన్ చేసి సహాయం కోరారు. సమాచారం అందుకున్న స్నేక్ హెల్ప్లైన్ సభ్యులు ఇంటికి చేరుకుని పామును పట్టుకోవడానికి ప్రయత్నించారు. పాము చొరబడిన మట్టి గోడను వారు కొద్దిగా పగలగొట్టడం ప్రారంభించగానే, రవీంద్ర సింగ్ కూతురు మీనాక్షి అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయి బుసలు కొడుతూ, నేలపై దొర్లుతూ, పాములా ప్రవర్తించడం చూసిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతే కాకుండా తనను అక్కడి నుంచి తీసుకెళ్ల వద్దని, తనకు హాని చేయవద్దని దీనంగా అందరినీ వేడుకుంది. కొన్ని రోజుల కిందట ఆ కుటుంబం దృష్టిలో ఒక పాము తారస పడింది. వారు దాన్ని చాలాసార్లు కొట్టడానికి విఫలయత్నం చేశారు. పాము ఎలాగోలా తప్పించుకుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి శరీరంపై పాముకు కరల్రతో కొట్టిన గుర్తులను పోలిన గుర్తులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మీనాక్షి గతంలో నాగ పంచమి, వసంత పంచమి వంటి పవిత్ర సందర్భాలలో కూడా పాములా ప్రవర్తించిందని వారు చెబుతున్నారు. -
పూరీ రథయాత్రకు 1000 ప్రత్యేక బస్సులు
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీకి 1,000 కి పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా బస్సు యజమానుల సంఘం కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కటక్ నగర డీసీపీ, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఎన్హెచ్ఏఐ అధికారులు, రాష్ట్ర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. సాధారణ ప్రయాణికుల బస్సులతో పాటు వివిధ వాహనాలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేస్తారు. మాలతీపట్టపూర్, తొలబొణియా మైదానాల్లో ప్రత్యేక బస్సులు నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తారు. అక్కడి నుంచి భక్తులను రథ యాత్ర జరిగే బొడొదండొ ప్రాంతానికి తరలించేందుకు బ్యాటరీతో నడిచే ఆటోల్లో తరలిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా 100 ఆటోలు అందుబాటులో ఉంచుతారు. యాత్రికుల నుంచి ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువ వసూలు చేయవద్దని బస్సు, ఆటో వర్గాలకు సూచించారు. తొలబొణియా బస్ స్టాప్లో భక్తులకు సులభంగా రూ. 10 నామమాత్రపు ధరకు స్వచ్ఛమైన శాఖాహార భోజనం సౌకర్యం కల్పిస్తారు. వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా దాదాపు 30 ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లను మోహరించనున్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. భువనేశ్వర్ – పూరీ, పూరీ – కోణార్క్, పిప్పిలి – పూరీతో సహా కీలక మార్గాల్లో వాహనాల రవాణాకు అంతరాయం లేకుండా దారి పొడవునా నియంత్రణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే చార్జీలు వసూలు చేసేందుకు బస్సు యజమానులు అంగీకరించారని రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ తెలిపారు. -
బావిలో పడిన ఎలుగు సురక్షితం
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద అటవీ మండలం కప్తిపడా రేంజ్లోని పాడుబడిన బావిలో ఓ ఎలుగు బంటి పడిపోయింది. బావిలో చిక్కుకున్న ఎలుగుబంటిని తక్షణ స్పందన బృందం (ఆర్ఆర్టీ) సురక్షితంగా రక్షించిందని అధికారులు ప్రకటించారు. బావి నుంచి సురక్షితంగా బయటకు తీసిన ఎలుగుబంటిని బోనులో సురక్షితంగా ఉంచారు. ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. శనివారం వేకువ జామున గ్రామం పొలిమేరల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తుల దృష్టికి వచ్చింది. దీనిని వెంబడించే సరికి పాడుబడిన బావిలో ప్రమాదవశాత్తు పడింది. గ్రామస్తుల నుంచి ఈ సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సమీపంలోని ప్రజలు గుమిగూడారు. చీఫ్ ఇంజినీర్ బైకుంఠ నాథ్ షడంగి అరెస్టు భువనేశ్వర్: రాష్ట్ర ఆర్డబ్ల్యూ చీఫ్ ఇంజినీర్ బైకుంఠ నాథ్ షడంగిని ఒడిశా విజిలెన్స్ అరెస్టు చేసింది. అధికారిక ఆదాయానికి మించి అపరిమిత ఆస్తుల ఆర్జన ఆరోపణ కింద నమోదు చేసిన కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. అంతకు ముందు చేపట్టిన ఆస్తుల సోదా దాడుల్లో నిందిత బైకుంఠ నాథ్ షడంగి ఆదాయానికి మించి 483 శాతం అధికంగా ఆస్తులు ఆర్జించినట్లు తేలింది. ఈ సోదాల్లో రూ. 2.56 కోట్లకు పైగా నగదు, 2 బహుళ అంతస్తుల భవనాలు, 2 ఫ్లాట్లు, 7 ఇళ్ల స్థలాలు, రూ.1.5 కోట్ల డిపాజిట్లు, రూ. 2.7 కోట్ల షేర్ పెట్టుబడులు, 1.141 కిలోల బంగారం మొదలైనవి బయటపడ్డాయి. గంజాయి మాఫియాకు గట్టి షాక్ జయపురం: జయపురం పట్టణ పోలీసులు గంజాయి మాఫియాకు గట్టి షాక్ ఇచ్చారు. గంజాయిని దొంగతనంగా తరలించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి 1318 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ నేడు వెల్లడించారు. గంజాయితో పాటు 120 బస్తాల తవుడు, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1 కోటి 30 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు జయపురం సమితి టంకువ పంచాయతీ బమణగాం దుర్గా బహుదూర్(35), కుసుమగుడ వాసి మీణా బారిక్(35)లు అని వెల్లడించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు కాకపోవటంతో వారిని జైలుకు తరలించినట్లు వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. ఈ నెల 29 వ తేదీన సబ్ఇన్స్పెక్టర్ రాజేంద్ర పంగి, ఏఎస్ఐ రమేష్ చంద్ర మహాపాత్రో తమ సిబ్బందితో పెట్రోలింగ్ జరుపుతున్నారు. స్థానిక హటపొదర్ (సంత తోట) ప్రాంతంలో ఉన్న రెండు షోరూంల మధ్య గల సందులో నుంచి ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకుంటూ వెళ్లడం పోలీసులకు కనిపించింది. అనుమానం వచ్చి వారిని వెంబడించారు. షోరూంల వెనుక ఉన్న ఒక కవాడి దుకాణం(పాత సామానులు కొనే దుకాణం) ముందు దాదాపు 12 మంది నిలుచుని ఉన్నారు. వారు బస్తాలు తీసుకు వస్తూ ఒక ట్రక్కులో లోడు చేస్తున్నారు. వారిలో పట్టణ ప్రాంతంలోను, సదర్ పోలీసు స్టేషన్ పరిధిలో కొంతమంది నేరస్తులు ఉండటం కనిపించింది. వారు పోలీసు అధికారులను, పోలీసు సిబ్బందిని చూసి పారిపోయారు. వారిని పోలీసులు వెంబడించారు. పారిపోతున్న వారిలో ఇద్దరు పోలీసులకు పట్టుబడగా మిగతా వారు పరారయ్యారు. వారిని అరెస్టు చేసి విచారించగా వారు తమతో ఉన్న వారి పేర్లను వెల్లడించారని పోలీసు అధికారి వెల్లడించారు. రెండు ట్రక్కులను తనిఖీ చేయగా అందులో 4 టన్నుల తవుడు ఉండగా వాటి కింద 259 గంజాయి ప్యాకెట్లు బయట పడ్డాయని, వాటిని మెజిస్ట్రేట్ సమక్షంలో తూయించగా అవి 1318 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
ఉత్సవాలకు సిద్ధం
బురదల పోలమ్మ ..అమ్మవారి మందిరం రాయగడ: పట్టణ ప్రజల ఆరాధ్య దైవం బురదల పోలమ్మ అమ్మవారి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. తొమ్మిది రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాలు జూన్ 11తో ముగుస్తాయి. ఉత్సవ కమిటీ ఏర్పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు అందరి సమక్షంలో ఏర్పాటైన కమిటీలో అధ్యక్షులుగా బార్జి జగన్ మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా ఎద్దు శ్రీహరి, కార్యదర్శిగా జె.శివాజి, కన్వీనర్గా కింతలి శ్రీనివాస్ రావు, కోశాధికారిగా బొత్స శ్రీనివాస్ రావు, సహ కోశాధికారిగా టెంటు వెంకటేష్లు ఉన్నారు. చాటింపు ఉత్సవాలపై అమ్మవారికి ప్రీతికరమైన ఆదివాసీ డప్పు వాయిద్యం మధ్య ఊరిబారికి ఈ చాటింపు వేశారు. చాటింపు కార్యక్రమం విన్న వారు ఒకవేళ ఏదైనా పనిమీద బయట ఊరు వెళితే అనుపు పండగ రోజు (ఉత్సవాల ముగింపు రోజు) న తిరిగి రావాలన్నది సంప్రదాయం. ఉజ్జిడి బండి చాటింపు కార్యక్రమం అనంతరం ఆదివారం తెల్లవారున ఉజ్జిడి బండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. వెదురుతో రూపొందించిన బుట్టను ఒక బండిలో ఏర్పాటు చేసి వేకువ జామున బండిని పురవీధుల్లో తిప్పుతారు. ఈ సమయంలో ప్రజలు రాత్రి ఉంచిన చద్దన్నం బుట్టలో వేస్తారు. ఇలా సేకరించిన చద్దన్నాన్ని స్థానిక రాణిగుడఫారంలో గల డీఎఫ్ఓ కాలనీలో (ఏనుగుల శాల) వద్ద పడేస్తారు. ఈ ఉజ్జిడి బండిలో చద్దన్నం వేస్తే కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని నమ్ముతారు. ఉత్సవ విశేషాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఉత్సవాల్లో అదేరోజు సాయంత్రం ఆదివాసీ మేళతాళాలతొ పట్టణ ప్రజలు, ప్రముఖులు అమ్మవారి పాదాలను తీసుకువచ్చేందుకు వెళతారు. స్థానిక భైరవీధిలొ గల దొర ఇంటి నుంచి తీసుకువచ్చిన పాదాలను అమ్మవారి మందిరంలో ఏర్పాటు చేస్తారు. అనంతరం స్థానిక ట్రెజరీ వద్ద అమ్మవారి ఘటాలను తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు ఊరేగింపు, పాలదార, అసర్లు, నాయుడు,నాయురాళ్ల విత్తనాలు వేయడం, అంజలి రథం వంటివి ఉంటాయి. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం చురుగ్గా ఏర్పాట్లు సంప్రదాయాలకు ప్రతీక.. పూర్వీకులు అందించిన సంప్రదాయాలకు ప్రతీకగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అందరి సహకారంతో ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా జరిగేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అనుపోత్సవాలకు లక్షల మంది వస్తారు. అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. – బార్జి జగన్ మోహన్ రావు, ఉత్సక కమిటీ అధ్యక్షుడు అందరి సహకారంతో.. ఉత్సవాలకు ప్రజల సహకారం ఉంటుంది. వారికి తోచిన సహకారం అందిస్తుండడంతో ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతున్నాయి. అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తాం. – ఎద్దు శ్రీహరి, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు రూ.15 లక్షలతో ఉత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని భావిస్తున్నాం. అందుకు అనుగుణంగా ప్రజలు సహకరిస్తున్నారు. సంప్రదాయాలకు ప్రతీకగా ఈ ఉత్సవాలను ఏటా నిర్వహిస్తున్నాం. నిధులు మిగిలితే ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నాం. – బొత్స శ్రీనివాస్ రావు, ఉత్సవ కమిటీ కోశాధికారి -
పొగాకు, గంజాయికి దూరంగా ఉండాలి
పర్లాకిమిడి: విద్యార్థులు పొగాకు, గంజాయి, నల్లమందు, ఛరస్ వంటి మత్తునిచ్చే వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఆదనపు వ్యాధుల కంట్రోల్ అధికారి డాక్టర్ ఆనంద్ సామంతరాయ్ అన్నారు. పర్లాకిమిడిలో శనివారం ఉదయం మెడికల్ నుంచి రాజవీధి, బస్టాండు వరకూ నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థినులు, ఆశ వర్కర్ల ర్యాలీని సీడీఎంవో డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం సీడీఎంవో సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. పోగాకు సేవించడం వల్ల కలిగే అనర్థాలను ఫుడ్ సెక్యూరిటీ అధికారి తపస్వినీ నాయక్ వివరించారు. ఏ వస్తువు కొన్నా ఎక్స్పైరీ తేదీని పరిశీలించాలని, ప్లాస్టిక్ సంచులు తీసుకోరాదని అన్నారు. పోగాకు, క్యాన్సర్పై ఆదనపు పీహెచ్వో డాక్టర్ ఇందిరా కుమారీ మహాపాత్రో, డాక్టర్ నయన్ మల్లిక్ తదితరులు మాట్లాడారు. ఆశ వర్కర్ల మేనేజర్ నారాయణ మల్లిక్, అసిస్టెంటు మేనేజర్ సూర్యకాంత మిశ్రా పాల్గొన్నారు.● డాక్టర్ ఆనంద్ సామంతరాయ్ -
రేపటి నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తుల విక్రయం
● 30 వరకూ దరఖాస్తుల స్వీకరణ జయపురం: జయపురం కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇందులో చేరేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం జూన్ నెల రెండో తేదీ సోమవారం నుంచి దరఖాస్తులను విక్రయించనున్నారు. ఈ విషయాన్ని విద్యాలయం కొరాపుట్ ప్రిన్సిపాల్ ఎస్.కె.దాస్ శనివారం వెల్లడించారు. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. అయితే జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్తో చర్చించిన తరువాత ఎన్ని రోజులు దరఖాస్తు ఫారాలను విక్రయించాలో నిర్ణయిస్తామన్నారు. ఇదిలా ఉండగా జయపురం కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్గా నయాగుడ కేంద్ర విద్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడుని నియమించినట్లు తెలిసింది. జయపురంలో కేవీకే ఏర్పాటు చేయాలని అనేక సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. జయపురం ఎమ్లల్యే తారాప్రసాద్ బాహిణీ పతి , కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్కలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకు రావడంతో ఎట్టకేలకు విద్యాలయం మంజూరైంది. -
బాల్య వివాహం నిలిపివేత
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో బాల్య వివాహాన్ని స్థానిక సీడీపీవో అడ్డుకున్నారు. బొయిపరిగుడ సమితి కోలనీగుడ గ్రామంలో బాల్య వివాహం జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో సీడీపీవో సబిత బ్రహ్మ సమితి అధికారులు, పోలీసులతో శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. వివాహానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకొని బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు బొరిగుమ్మ సమితి కెందుపడ ప్రాంతంలో +2 చదువుతున్న బాలికకు బొయిపరిగుడ ప్రాంతం కోలనీగుడలో 17 ఏళ్ల బాలుడుతో వివాహం నిర్ణయించారు. కొద్దిరోజుల కిందట బాలికను పెండ్లి కుమారుడు తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం బాలికకు అక్కడ పెళ్లి చేస్తుండగా విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న సీడీపీవో సబితా బ్రహ్మ సమితి అధికారులు, పోలీసులతో చేరుకొని ఉభయ వర్గాల వారిని సమావేశ పరిచారు. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకమని, చిన్న వయసులో పెళ్లితో అనేక అనర్థాలు ఉంటాయని వివరించారు. తొలుత వారు అంగీకరించలేదు. బాల్య వివాహాలపై వివరించి అవగాహన కల్పించడంతో పెళ్లి నిలిపేసేందుకు సమ్మతించారు. అమ్మాయికి 18 , అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఉభయవర్గాల సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్ నందినీ స్వై, కెందుపడ అంగన్వాడీ వర్కర్ మధుస్మిత ధల్, బొయిపరిగుడ అంగన్వాడీ వర్కర్ తులసీ చలాన్, బొయిపరిగుడ పోలీసు కానిస్టేబుల్ కౌశల్య రొంధారి పాల్గొన్నారు. -
కిటికీలోంచి నోట్ల కట్టలను విసిరేసిన చీఫ్ ఇంజినీర్
భువనేశ్వర్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణ ఆధారంగా చేపట్టిన దాడుల్లో విజిలెన్స్ విభాగం భారీ స్థాయిలో నగదు స్వాధీనపరచుకుంది. ఈ దాడుల్లో రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీరు బైకుంఠ నాథ్ షడంగికి సంబంధించిన ఆస్తులపై పలు చోట్ల శుక్ర వారం విజిలెన్సు వర్గాలు సోదాలు నిర్వహించారు. నిందితుడు ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నట్లు సమాచారం. విజిలెన్స్, ఎనిమిది మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 మంది సహాయ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సహాయక సిబ్బంది అంగుల్ విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా సోదాలు నిర్వహించారు. అంగుల్, భువనేశ్వర్, పిప్పిలి (పూరీ) తదితర 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ అధికారులను చూడడంతో బైకుంఠ నాథ్ షడంగి భువనేశ్వర్లోని తన ఫ్లాట్ కిటికీలోంచి రూ. 500 నోట్ల నగదు కట్టలను బయటకు రువ్వేసినట్లు ఆరోపణ. అంగుల్లోని షడంగి ఉంటున్న ఇంటి నుంచి రూ.1.30 కోట్లు, భువనేశ్వర్లోని అతని ఫ్లాట్ నుంచి రూ.1.21 కోట్లు సమగ్రంగా రూ. 2.51 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికార వర్గాల సమాచారం. నిందితుడు షేర్ మార్కెట్లో భారీగా రూ. 2.70 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సోదాల్లో తేలింది. విజిలెన్స్ దాడుల సమయంలో 2 బహుళ అంతస్తుల భవనాలు, రెండు ఫ్లాట్లు, 7 అధిక విలువైన ప్లాట్లు, బీమా, రూ. 1.5 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు కనుగొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రాయగడ: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కాసీపూర్ సమితి కొడిపారి పంచాయతీలోని దుండా గ్రామానికి చెందిన జితు నాయక్, తిరాంపూర్ గ్రామానికి చెందిన కర్ణ హరిజన్లు ఉన్నట్లు గుర్తించారు. తీవ్రగాయాలకు గురైన వీరిని చికిత్స కోసం టికిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కర్ణ హరిజన్ టికిరిలోని ఉత్కళ అలూమిన కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా తమ గ్రామం నుంచి వెళ్తుండగా ఎదురుగా మరో బైకుపై వస్తున్న జితు నాయక్ అదుపు తప్పి డీకొన్నాడు. దీంతొ ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయాలతో చికిత్స పొందుతున్న కర్ణ హరిజన్ -
రథ చక్రాలు సిద్ధం
భువనేశ్వర్: జగతి నాథుని యాత్ర కోసం 3 రథాల తయారీ పనులు అంచెలంచెలుగా పూర్తవుతున్నాయి. నిర్ధారిత కాల పరిమితిలో ఈ పనుల్ని పూర్తి చేయడంలో వడ్రంగి సేవకులు నిరవధికంగా శ్రమిస్తున్నారు. రథాల్ని నడిపించే చక్రాల తయారీ ప్రధాన ఘట్టం. ఈ ఘట్టం విజయవంతంగా ముగించారు. అంచెలంచెలుగా 3 రథాల కోసం అవసరమైన 42 చక్రాల తయారీ పూర్తి చేశారు. మరో వైపు తయారైన చక్రాల్ని అమర్చేందుకు ఇరుసు పనులు చకచకా సాగుతున్నాయి. దశలవారీగా తయారు చేస్తున్న ఇరుసులకు చక్రాల్ని జోడించే పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పనులు పూర్తి కావడంతో రథం పైఅంతస్తు రూపుదిద్దుకుంటుంది. అందుకు అవసరమైన పనులు ప్రారంభించారు. దేవదేవుళ్లు యాత్ర చేసే 3 రథాలు నడిపేందుకు సమగ్రంగా 42 చక్రాలు అమర్చుతారు. అత్యధికంగా శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథానికి 16 చక్రాలు అమర్చుతారు. బలభద్ర స్వామి తాళ ధ్వజం కోసం 14 చక్రాలు మరియు దేవీ సుభద్ర యాత్ర చేసే దర్ప దళనం కోసం 12 చక్రాలు తయారీ పూర్తయ్యింది. -
గుప్తేశ్వర క్షేత్రంలోకి కుక్కలపిల్లలతో ఇద్దరి ప్రవేశం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వర్ ఆలయంలోనికి ఇద్దరు యువకులు రెండు కుక్క పిల్లలతో ప్రవేశించటాన్ని భక్తులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గత బుధవారం జరిగిన ఈ సంఘటన నేడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు యువకులు కుక్కలతో వచ్చి పూజలు చేశారని, ఇది గుప్తేశ్వర్ పుణ్య క్షేత్ర పవిత్రతకు, భక్తుల మనోభావాలకు భంగం కల్పించడమేనని విమర్శించారు. భవిష్యత్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తేనెటీగల దాడిలో భార్యాభర్తలకు గాయాలు రాయగడ: తేనెటీగల దాడిలో భార్యభర్తలు గాయాలు పాలైన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. గాయాలు పాలైనవారు సమితిలోని కడంగేలి గ్రామానికి చెందిన కడ్రక మిసి, కడ్రక కొమరాడిలుగా గుర్తించారు. తమ గ్రామం నుంచి కల్యాణ సింగుపూర్ సొంత పనులపై వెళ్లి తిరిగి వస్తుండగా కల్యాణి నది బ్రిడ్జి కింద ఉన్న తేనెపట్టు నుంచి ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు గాయాల పాలయ్యారు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిస అనంతరం వారు స్వగ్రామానికి చేరుకున్నారు. -
కుంతర్కల్లో న్యాయ చైతన్య శిబిరం
జయపురం: జయపురం సమితి బలియ గ్రామ పంచాయతీ కుంతర్కల్ గ్రామంలో శుక్రవారం న్యాయ చైతన్య శిబిరాన్ని నిర్వహించారు. స్థాయి నిరంతర్ లోక్ అదాలత్ కార్యకలాపాలపై జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు నిర్వహించిన శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి, లోక్ అదాలత్ శాశ్వత విచారపతి ప్రద్యోమయి సుజాత వివరించారు. స్పెషల్ కోర్టు స్పెషల్ పోస్కో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ వి.గాయిత్రీ దేవి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.దివాకరరావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ గీతాంజలీదోల్ పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కలిగే లాభాలు, ఉచితంగా లభించే న్యాయ సేవలపై చైతన్యం కలిగించారు. నీరు, విద్యుత్, వంటగ్యాస్, టెలిఫోన్ సేవలపై వివరించారు. దేవేంద్ర కొహూర్, పారా లీగల్ స్వచ్ఛంద సేవక్ దీప్తి నాయక్ శిబిరాన్ని పర్యవేక్షించారు. చేతి వృత్తులను ప్రోత్సహించాలి రాయగడ: చేతి వృత్తి పనులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతున్న వారిని ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో వృత్తులవారికి అవగాహన శిబిరాన్ని జిల్లా పారిశ్రామిక కేంద్రం శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేతి వృత్తులు చేసేవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ బిజయ్ కుమార్ సాహు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తి పనులవారి కోసం ప్రత్యేకంగా అమలు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ కోటి రత్నం, జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుచిత్ర బౌరి తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ ట్రక్కులో దోపిడీ దొంగల అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో గల చితపరి వంతెన వద్ద ఈ నెలా 23న ఓ సిమెంట్ లోడ్ను దోపి డీ దొంగలు దోచుకున్నారు. దీనిపై ఐఐసీ ధీరజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులు చితపరి గ్రామ వాసులని తెలుసుకుని గ్రామానికి వెళ్లి వారిని అరెస్టు చేశారు. బబ్లు అనే వ్యక్తి కోసం మాత్రం గాలిస్తున్నారు. అరెస్టయిన ముగ్గురిలో ఒకరు బాలుడు. పాముకాటుతో నాలుగేళ్ల బాలిక మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధిలో గల శిమిలిబాంఛా పంచాయతీ బపాన్పల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సంధ్య(4) అనేచిన్నారిని పాము కాటు వేసింది. బాలిక కేకలు వేయడంతో తల్లి లేచి చూసేసరికి పాము కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు పామును చంపి బాలికను కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ దారిలోనే పాప చనిపోయింది. విషయం తెలుసుకున్న ఎంవీ 79 పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకుని బాలిక మృతిపై కేసు నమోదు చేశారు. -
మంచం మీద గర్భిణి తరలింపు
కొరాపుట్: గ్రామానికి అంబులెన్స్ రాలేకపోవడంతో ఓ గర్భిణిని గిరిజనులు మంచం మీద తీసుకెళ్లినా శిశువును రక్షించుకోలేకపోయారు. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి ఇచ్ఛాపూర్ పంచాయతీ డుముని గుడ గ్రామంలో చక్రధర్ జానీ భార్య బిమల జానీకి పురిటినొప్పులు వచ్చాయి. గ్రామస్తులు ప్రభుత్వ అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా మార్గం లేక రెండు కిలోమీటర్ల ముందు ఆగిపోయింది. దీంతో మంచం మీద గర్భిణిని అంబులెన్స్ వద్దకు చేర్చారు. దారిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలను జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చగా వైద్యులు పరిశీలించి శిశువు మృతి చెందినట్లు ప్రకటించారు. -
ఈ ఏడాదే కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
జయపురం: జయంపురం పట్టణ ప్రజలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారి వివరాలు నమోదు ప్రారంభించాలని అధికారులు వెల్లడించారు. జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబుల్ డవలప్మెంట్ ఏజన్సీ(ఐటీడీఏ) భవనంలో కేంద్ర విద్యాలయాన్ని ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు అందిన వెంటనే మీడియాకు తెలియజేయనున్నట్లు కొరాపుట్ కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజ్ కుమార్ దాస్ వెల్లడించారు. వాస్తవంగా 2024 డిసెంబర్లో జయపురం కేంద్ర విద్యాలయం ప్రారంభం కానున్నదని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో ప్రకటించారు. 2025–26 విద్యా సంవత్నంలోవి ద్యాబోధన ప్రారంభ మౌతుందని ప్రకటించారు. కేంద్ర విద్యాలయం ప్రారంభానికి తేదీ నిర్ణయించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్గా ప్రారంభిస్తారని సంబంధిత అధికారులు ప్రకటించారు. అందుకు జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాట్లు ప్రారంభించారు. అకస్మాత్తుగా కేంద్ర మంత్రి అమిత్షా ఒడిశా పర్యటన రద్దు కావటంతో కేంద్రవిద్యాలయ ప్రారంభోత్సవం రద్దు అయింది. అప్పటి నుంచి కేంద్ర విద్యాలయంలో తమ పిల్లల పేర్లు నమోదు చేసేందుకు ఎదురు చూశారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరచి అడ్మిషన్లు ప్రారంభం కావటంతో కేంద్ర విద్యాలయంపై ఆశలు వదులుకున్న తల్లిదండ్రులు నిరాశ చెంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లల పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంతలో ఏ ఏడాది నుంచే కేంద్రీయ విద్యాలయం ప్రారంభమౌతుందని.. అడ్మిషన్లకు పేర్లు నమోదు చేసుకోవచ్చని విజ్ఞప్తి వెల్లడి కావటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్న జయపురం వాసులు -
సిక్కిం తీస్తా నదిలో బస్సు బోల్తా
భువనేశ్వర్: సిక్కింలోని తీస్తా నదిలో టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఒడిశాలోని జాజ్పూర్ రోడ్ ప్రాంతానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఇతిశ్రీ జెనా కుటుంబ సభ్యులు ఉన్నారు. పర్యాటకుల్లో అత్యధికులు ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందినవారని సమాచారం. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ బస్సు 11 మంది వ్యక్తులతో (10 మంది పర్యాటకులు మరియు ఒక డ్రైవర్) ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కొండ రోడ్డు నుంచి జారిపోవడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. సిక్కిం రాజధాని నగరం గ్యాంగ్టక్ నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా ఈ దురదృష్టకర సంఘటన సంభవించింది. మంగన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సోనమ్ దేచు భూటియా సమాచారం ప్రకారం ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన వారిని రక్షించారు. గాయపడిన వారిని మంగన్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు. సీఎం మాఝీ జోక్యం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సిక్కిం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అవసరమైన అన్ని వనరులను సమీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో ఫోన్లో సంప్రదించారు. అదనంగా అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒడిశా నుంచి ఒక ప్రత్యేక సహాయ బృందాన్ని పంపించారు. బాధితులకు తక్షణ చికిత్స, వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గల్లంతైన వారిలో 6 మంది ఒడియా వ్యక్తులు ఉన్నట్లు భోగట్టా. రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి ఇతిశ్రీ జెనా కుటుంబీకులు, బంధువులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఆదివారం జాజ్పూర్ రోడ్ నుండి రైలులో ప్రయాణించారు. గాంగ్టక్ 1000 అడుగుల ఎత్తున ఉన్న ఒక ప్రదేశం సందర్శించి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుందని ఆమె బంధువు తెలిపారు. వీరంతా 2 వేర్వేరు వాహనాల్లో సర్దుకుని తిరిగి వస్తుండగా ఒక వాహనంలో నదిలోకి జారింది. ఇతిశ్రీ జెనా ఆమె కుమారుడు మరో 2 మంది బంధువులతో కలిసి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వారిలో ఇద్దరు పిల్లల జాడ గుర్తించారు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారి జాడ ఇంత వరకు లభ్యం కాలేదని బంధువు వాపోయాడు. ఈ విషాదకరమైన ప్రమాదం పట్ల ఓలీవుడ్ నటుడు, కొరై నియోజక వర్గం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతిశ్రీ జెనా తన కుటుంబంతో కలిసి సిక్కింలోని గ్యాంగ్టక్కు విహారయాత్రకు వెళ్లారు. వారు రెండు వాహనాల్లో వెళ్లారు. ఒక వాహనం నదిలో పడిపోయింది. దానిలో ప్రయాణిస్తున్న కుటుంబీకులు గల్లంతు అయ్యారు. అదృష్టవశాత్తూ ఇద్దరు చిన్న పిల్లలకు పెను గండం తప్పింది. గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సిక్కిం ముఖ్యమంత్రితో సంప్రదిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకరు మృతి, 8 మంది గల్లంతు బాధితుల్లో ఒడిశా వాసులే అధికం -
కఠిన చర్యలు తీసుకోవాలి
జయపురం: జర్నలిస్టుల మీద దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్కళ జర్నలిస్టుల సంఘం కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు జర్నలిస్టుల సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు నేతృత్వంలో జర్నలిస్టు ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝికి ఉద్దేశించిన వినతిపత్రం కలెక్టర్కు శుక్రవారం అందజేశారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ‘బొడొకబొరో’ పత్రికలో పనిచేస్తున్న జర్నిలిస్టు బిజయ ప్రధాన్ను బంధించి కాలు చేతులు కట్టేసి దాడులు జరిపారన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాత్రికేయుల సురక్షా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో సంఘ రాష్ట్ర కార్యదర్శి నృసింహ బ్రహ్మ, వర్కింగ్ కార్యదర్శి జయసింగ్ పతా సెట్టి, సుదర్షన పాత్రో, పి.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశా తొలి బీజేపీ ఎమ్మెల్యే ప్రసన్న పట్నాయక్ కన్నుమూత
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రసన్న పట్నాయక్ (74) శుక్రవారం శాశ్వతంగా కన్నుమూశారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన కామాఖ్యనగర్ నియోజక వర్గం నుంచి తొలి బీజేపీ అభ్యర్థిగా శాసన సభకు ప్రాతినిథ్యం వహించి చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన యుగాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయ రంగంలో ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిగా ప్రత్యేక ఉనికిని చాటుకున్నారు. 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా శాసన సభ్యుడిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 1985లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర శాసన సభలో కామాఖ్య నగర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ విజయంతో ఆయన రాష్ట్ర శాసన సభలో తొలి బీజేపీ ఎమ్మెల్యేగా చరిత్ర ఆవిష్కరించారు. ఆ తర్వాత బీజేపీకి గుడ్బై పలికి 1990లో బిజూ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి కామాఖ్యనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై విజేతగా నిలిచారు. ఈ లెక్కన ఆయన కామాఖ్యనగర్ నియోజక వర్గం నుంచి శాసన సభకు 3 సార్లు ఎన్నిక కావడం విశేషం. ఆయన పదవీకాలంలో తన నియోజక వర్గంలో అత్యధికంగా 15 విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఆయన మృతికి రాష్ట్ర ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రసన్న పట్నాయక్ ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని కొనియాడారు. అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు ఆయన మరణం రాష్ట్ర రాజకీయ రంగంలో భర్తీ కాలేని శూన్యంగా మిగిలిపోతుందని విచారం వ్యక్తం చేశారు. అంతిమ వీడ్కోలు దివంగత ఎమ్మెల్యే ప్రసన్న పట్నాయక్ పార్థివ దేహం రాష్ట్ర శాసన సభ ఆవరణకు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభ స్పీకరు సురమా పాఢి మరి కొంత మంది శాసన సభ సభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించి అంతిమ వీడ్కోలు పలికారు. తదుపరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలకు దివంగత నాయకుని పార్థివ దేహం తరలించారు. కార్యాలయం ప్రాంగణంలో పలువురు పార్టీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అంత్యక్రియలు పూరీ స్వర్గద్వార్ స్మశాన వాటికలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యుల సమాచారం. -
నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ రాక
నరసన్నపేట: పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ శనివారం మండలానికి వస్తున్నారని డ్వామా పీడీ సుధాకర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన సెక్రటరీ రాక సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక అధికారులతో సమీక్షించారు. నరసన్నపేట, బొరిగివలస, లుకలాంల్లో ఆయన పర్యటిస్తారని తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక అధికారులు పాల్గొనాలని సూచించారు. సమీక్షలో ఎంపీడీఓ మధుసూదనరావు, ఏపీఓ యుగందర్లతో పాటు పీఆర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.రేపు మోడల్ డీఎస్సీ పరీక్షశ్రీకాకుళం న్యూకాలనీ: పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మోడల్ డీఎస్సీ–2025 ఎస్జీటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.మురళీమోహన్రావు, డి.కేవశరావు తెలిపా రు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరసవల్లి సూర్యనారాయణస్వా మి దేవస్థానం సమీపంలో ఉన్న పీఆర్టీయూ భవనంలో ఉదయం 9 గంటలకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కారు ఢీకొని పరిశ్రమ ఉద్యోగికి గాయాలుఎచ్చెర్ల క్యాంపస్ : అల్లినగరం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పైడి భీమవరం అరబిందో పరిశ్రమ ఉద్యోగి గాయపడ్డాడు. గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన పందిరి పాపారావు శుక్రవారం బైక్పై విధులకు వెళ్తుండగా అల్లినగరం కూడలి సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాపారావును 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు వైద్యులు రిఫర్ చేయగా కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రిమ్స్ ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.గోవులు స్వాధీనంఎచ్చెర్ల: నరసన్నపేట వైపు నుంచి విశాఖపట్న ం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను శుక్రవారం లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై ఎస్సై జి.లక్ష్మణరావు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ పోలవరపు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వివాహిత అనుమానాస్పద మృతికొత్తూరు: మహర్తాపురంలో ప్రవళ్లిక (26) అనే వివాహిత శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కొత్తూరు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం వడ్డంగి గ్రామానికి చెందిన పత్తిక సురేష్కు గుమ్మలక్ష్మిపురం మండలం కేదారపురం గ్రామానికి చెందిన నమ్మక ప్రవళ్లికతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. సురేష్ జియో టవర్ కంపెనీలో పనిచేస్తున్నందున కొత్తూరులోని మహర్తాపురంలో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే సురేష్ శుక్రవారం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ప్రవళ్లిక ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. కాగా, అల్లుడు సురేష్ అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నందున కుమార్తె ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి అరుణకుమారి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, భర్త సురేష్ వేధిస్తున్నట్లు ప్రవళ్లిక గతంలోనూ బత్తిలి, గుమ్మలక్ష్మిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులుఎచ్చెర్ల : రైతులు సాగు యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి తెలిపారు. చిలకపాలెంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగోలు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ ఉదయ్బాబు మాట్లాడుతూ వరి రకాలు, తెగుళ్లను వివరించారు. అనంతరం నవధాన్యాలు, విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ గాంధీ, వ్యవసాయ సహాయ సంచాలకులు బగ్గు రజనీ, భవానీశంకర్, కేవీకే శాస్త్రవేత్త సునీత, మండల ఇన్చార్జి వ్యవసాయాధికారి దుర్గాప్రసాద్, ప్రకృతి మాస్టర్ ట్రైనర్ నాయుడు, విస్తరణాధికారులు జగన్మోహనరావు, రేవతి తదితరులు పాల్గొన్నారు. -
వియత్నాం నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాల తరలింపు
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆధ్వర్యంలో వియత్నాం నుంచి భారత దేశానికి బుద్ధుని పవిత్ర అవశేషాల తరలింపు కోసం ప్రత్యేక ప్రతినిధి బృందం శుక్రవారం న్యూ ఢిల్లీకి బయలుదేరింది. జూన్ 2న న్యూ ఢిల్లీ నుంచి ఈ బృందం వియత్నాంకు వెళ్తుంది. ఐక్యరాజ్య సమితి వెసాక్ దినోత్సవాల సందర్భంగా భారతదేశం నుంచి వియత్నాంకు తీసుకెళ్లారు. ఏటా మే నెలలో పౌర్ణమి నాడు ఈ వేడుకలు ప్రారంభిస్తారు. ఈ ఏడాది మే 6 నుంచి 8 వరకు వెసాక్ వేడుకల సందర్భంగా వియత్నాంలో బుద్ధుని అవశేషాలు ప్రదర్శించారు. బుద్ధుని జననం, జ్ఞానోదయం, మరణం వరకు చోటు చేసుకున్న అపురూప ఘట్టాల స్మరణకు ప్రతీకగా వెసాక్ వేడుకలు నిర్వహిస్తారు. ప్రస్తుతం బుద్ధుని అవశేషాలను వియత్నాంలోని అనేక ప్రదేశాలలో ప్రదర్శిస్తున్నారు. బుద్ధ భగవానుడు తన మొదట ఉపన్యాసం ఇచ్చిన పవిత్ర స్థలం సారనాథ్ నుంచి అవశేషాలను ప్రత్యేక భారత వైమానిక దళ విమానంలో వియత్నాంకు తరలించారు. కేంద్ర బలహీన వర్గాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బౌద్ధ సన్యాసులు, సీనియర్ భారత అధికారుల బృందం ఆధ్వర్యంలో వీటిని వియత్నాం చేర్చారు. ఈ బృందంతో ది జర్నీ ఆఫ్ గౌతమ బుద్ధ‘ నృత్య నాటక ప్రదర్శన కోసం ప్రత్యేక భారతీయ సాంస్కృతిక బృందం హో చి మిన్ నగరం, హనోయ్ తదితర ప్రదేశాలలో బుద్ధుని జీవితం, బోధనలను చిత్రీకరించిన నాటకం ప్రదర్శించింది. ఈ వేడుకలు జూన్ 2తో ముగియనున్నాయి. ఆ తర్వాత బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలు వియత్నాంలోని డా నాంగ్ నగరం నుంచి ప్రత్యేక భారత వైమానిక దళ విమానంలో భారత దేశానికి తిరిగి తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం బయల్దేరింది. ఈ సందర్భంగా గవర్నర్ కంభంపాటి మాట్లాడుతూ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారత దేశానికి తిరిగి తీసుకు రావడం గౌరవప్రదమైన విషయమని, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వియత్నాంతో మన ఉమ్మడి నాగరిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. గవర్నర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పయనం -
శరీర సౌష్టవ పరీక్షల్లో మరొకరు మృతి
పర్లాకిమిడి: గుమ్మా రోడ్డు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన హోంగార్డ్స్ పోస్టుల భర్తీలో శరీర సౌష్టవ పోటీ పరీక్షల్లో మరో అభ్యర్థి దీపక్ పడాల్ (29) ఛాతీ నొప్పితో బరంపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. మృతుడు దీనపక్ పడాల్ రాయఘడ బ్లాక్ నారాయణ్పూర్ గ్రామవాసి. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దీపక్ పడాల్ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ రూ.4లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేశారు. పర్లాకిమిడిలో రామగిరి పంచాయతీ పరిసల్ గ్రామానికి చెందిన సులాంత్ మిసాల్ (24) ఛాతీ నొప్పితో కుప్పకూలిన అనంతరం పర్లాకిమిడి ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ అరెస్టు
భువనేశ్వర్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వ్యూహాత్మక దాడిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ (ఐఆర్ఎస్)ని అరెస్టు చేసింది. చింతన్ రఘువంశీ తొలి వాయిదా కింద రూ. 20 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవినీతి ఆరోపణల ఫిర్యాదు మేరకు వ్యూహాత్మకంగా అతన్ని పట్టుకుపన్నట్లు వివరించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసును పరిష్కరించడానికి కుదిరిన రూ. 5 కోట్లు లంచం వ్యవహారంలో తొలి విడత కింద చెల్లింపు జరుగుతుండగా సీబీఐ వ్యూహాత్మకంగా అక్కడికక్కడే నిర్బంధంలోకి తీసుకుంది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ సోదరుడు ఈ వ్యవహారానిక రాయబారిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయంపై సీబీఐ తదుపరి దర్యాప్తు ప్రారంభించింది.సమలాయి దుర్గా పండుగ ప్రారంభంరాయగడ: స్థానిక పాయికోవీధిలోని సమలాయి దుర్గా వార్షిక పండుగ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. సాయంత్రం పాయికోవీధి నుంచి మజ్జిగౌరి మందిరం పాదాల గుడి వరకు ఊరేగింపుగా వెళ్లిన భక్తులు అమ్మవారి పాదాలను తీసుకువచ్చి సమలాయి దుర్గ మందిరంలో నిలపడంతో పండుగకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజులు జరిగే పండుగ జూన్ మూడో తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.కటక్లో తొలి కోవిడ్ రోగి గుర్తింపుభువనేశ్వర్: కటక్ జిల్లాలో తొలి కోవిడ్ – 19 కేసు నమోదు అయింది. జిల్లా ప్రధాన వైద్య అధికారి సీడీఎంఓ ప్రశాంత్ హత్తా ఈ విషయాన్ని నిర్ధారించారు. పీడితుడు స్థానిక 44 ఏళ్ల వ్యక్తిగా పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ నిర్బంధంలో కోవిడ్ సంబంధిత జాగ్రత్తలతో పరిశీలనలో ఉన్నాడు. దీనికి ముందు అతనికి ప్రయాణ చరిత్ర లేదని తెలిపారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడంతో కోవిడ్ – 19 సోకినట్లు ఖరారైంది. -
ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పర్లాకిమిడి: ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అన్నారు. స్థానిక గజపతి కలెక్టరేట్లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగినది. పదేళ్లు పైబడిన ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దాస్ అన్నారు. 0 – 5 ఏళ్ల వయస్సు బాలబాలికలు కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని అన్నారు. దీని కోసం ఆధార్ కేంద్రాలను బ్యాంకులు, పోస్టాఫీసులు, బ్లాక్ కార్యాలయాలు, ఎన్.ఏ.సి.లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకు అక్కౌంటుకు లింక్ చేసుకోవాలని అన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అనేక ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు విద్యాభృతి, రేషన్ కార్డు, సుభద్ర వంటి తదితర పథకాలు వర్తిస్తాయన్నారు. ఆధార్ అప్డేట్ తప్పనిసరి అన్నారు. అధికారులు పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్, ఎన్ఏసీల వరకూ చైతన్య ర్యాలీలు నిర్వహించాలని కోరారు. జిల్లా ముఖ్యవైద్యాధికారి మహామ్మద్ ముబారక్ ఆలీ, మహిళా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, జిల్లా సామాజిక సురక్షా అధికారి సంతోష్ కుమార్ నాయక్, లీడ్ బ్యాంకు మ్యానేజరు మహేశ్వర్ మండళ్, చిరంజీవి దొర పాల్గొన్నారు. -
నబరంగ్పూర్ మున్సిపాలిటీలో అవినీతి
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల్లో అవినీతి చోటుచేసుకుందని బీజేడీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి ఆరోపించారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలో గ్లేజ్ హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య పేరిట కోట్లాది రూపాయలు కొట్టేశారన్నారు. ఆర్టీవో ఆఫీస్ వద్ద డంపింగ్ యార్డ్ కోసం గోతులు తీయడానికి రు.26 లక్షలు ఖర్చు చేసినట్లు నిధులు డ్రా చేశారన్నారు. అసలు అక్కడ గోతులు తీయలేదని, తీసిన గోతులు ఎక్కడ ఉన్నాయని,వెలికి వచ్చిన మట్టి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 1300 గుంటలు జేసీబీతో పని చేసినట్లు రికార్డులు పుట్టించారన్నారు. అలా చేస్తే నాలుగు పెద్ద చెరువులు తయారు చేయవచ్చనన్నారు. గత ఆరు నెలలుగా డంపింగ్ యార్డ్లో పని చేసిన వారికి రూ. 13 లక్షలు వేతనాలు చెల్లించినట్లు చూపించారన్నారు. కానీ ఇదే పనికి నాలుగు ఎస్హెచ్జీలకు మరో రూ. 13 లక్షలు చెల్లించినట్లు నిధులు డ్రా చేశారన్నారు. ఒకే పనికి రెండు చెల్లింపులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. వీధులను చీపురుతో ఊడ్చడానికి నెలకు రూ..13 లక్షలు వేతనాలు 135 మందికి ఇస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. కానీ అంత మంది పని వాళ్లుని వినియోగించడం లేదన్నారు. కమర్షియల్ ప్రాంతాలలో సాయంత్రం శుభ్ర పరుస్తున్నట్లు వేతనాలు డ్రా చేశారన్నారు. కానీ తనకు తెలిసి ఏనాడు నబరంగ్పూర్ పట్టణంలో సాయంత్రం శుభ్రపరిచినట్లు ఆధారాలు లేవన్నారు. ప్రతి నెల కాలువల క్లినింగ్ కోసం రూ. 5 లక్షలు వాడుకున్నారన్నారు. కానీ ప్రముఖులు ఉండే వీధులలో మాత్రమే కాలువలను శుభ్ర పరుస్తున్నారు తప్పితే మిగిలిన ప్రాంతాల్లో లేదన్నారు. శుభ అభినందన్ పక్కన రూ. 42 లక్షలతో రోడ్డు నిర్మించారన్నారు. కానీ ఈ రోడ్డు నివాసాలు లేని చోట జీడి తోట పక్కన నిర్మాణం జరిగిందన్నారు. తనకు అర్థం కానీ విషయం ఏమిటంటే చదువుకున్న ఇంజినీర్లు ఎలా అక్కడ రోడ్డు నిర్మించారో చెప్పాలన్నారు. అసలు ఆ రోడ్డు మీద ఆధార పడే ఒక్క నివాసం కూడా అక్కడ లేదన్నారు. ఇదే పరిస్థితి ఉత్కళ కాలేజీ వద్ద రు. కోట్లాది రూపాయల వ్యయంతో పొలాల మధ్య రోడ్డు నిర్మించారని, ఇంకా కాలువలు కూడా నిర్మాణం చేస్తారన్నారు. ఒక్క నివాసం లేని చోట కోట్లాది రూపాయలు వృథా చేశారని ఆరోపించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సౌమ్య మహాపాత్రో మాట్లాడుతూ.. తాను వైస్ చైర్మన్ అయినప్పటికీ తనకు తెలియకుండా చైర్మన్, దళారులు, అధికారులు నిర్ణయాలు చేస్తున్నారన్నారు. అవినీతిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమావేశంలో బీజేడీ నాయకులు తపస్ త్రిపాఠి, భీమె హరిజన్, ప్రమెధ్ త్రిపాఠి, సరోజ్ పాత్రో పాల్గొన్నారు. మాజీ ఎంపీ ప్రదిఫ్ మజ్జి ఆరోపణ -
పోడియా సమితిలో ప్రబలిన వ్యాధులు!
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితిలో కొన్ని రోజులుగా వింత వ్యాధితో గిరిజనులు బాధపడుతున్నారు. అయితే ఏ వ్యాధి అనే విషయాన్ని ఇప్పటికీ వైద్యులు గుర్తించలేకపోయారు. వ్యాధి సోకిన వారు కిళ్ల నొప్పులు, జ్వరం, శరీరం పొంగిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లలు ఈ వ్యాధిబారిన ఎక్కువ మంది పడుతున్నారు. స్పందించిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా భవనేశ్వర్ నుంచి ఐఐఎంఆర్సీ బృందం పోడియా సమితికి శుక్రవారం చేరుకుంది. గ్రామాల్లో పర్యటించి ప్రజలు వినియోగిస్తున్న నీటిని పరీక్షించారు. దోమలగుడ్లను పరిశీలించి నమనాలు సేకరించారు. అలానే రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటిని భువనేశ్వరలోని మెడికల్ ల్యాబకి పంపించారు. పరీక్షల తరువాత రిపోర్టు వస్తే వ్యాధికి కారణాలు తెలుస్తాయని వైద్యాధికారులు వెల్లడించారు. -
టికెట్ తనిఖీ సిబ్బందికి డీఆర్ఎం సన్మానం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం టికెట్ తనిఖీ సిబ్బంది సేవల్ని స్థానిక మండల రైల్వే అధికారి డీఆర్ఎం హర్విందర్ సింగ్ బజ్వా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఖుర్దా రోడ్ మండలం రికార్డు స్థాయి జరిమానా వసూలు చేసిందన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో 13 మంది టికెట్ తనిఖీ సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించారు. టికెటు లేని ప్రయాణం నివారించడంలో ముందంజ పాత్ర పోషించిన జితేంద్ర పట్నాయక్, నిరాకర్ సాహు, సుధాకర్ బెహరా, శివ ప్రసాద్ దాస్, అజయ్ కుమార్ సాహు, సుధీర్ కుమార్ సాహు, కె. పి. సామంత, ప్రశాంత్ కుమార్ బెహెరా, సి. హెచ్. బి. రెడ్డి, కె. సి. మల్లిక్, ఆర్. ఆర్. ప్రసాద్, ఎస్. కె. మహాపాత్రొకు డీఆర్ఎం ప్రసంశా పత్రంతో నగదు పురస్కారం ప్రదానం చేశారు. సమలేశ్వర్ బెహెరాను సత్కరించారు. వాణిజ్య విభాగం అద్భుత కార్యదక్షతతో ఈ సంవత్సరం తూర్పు కోస్ట్ రైల్వేలో కమర్షియల్ షీల్డ్ని ఖుర్దారోడ్ మండలం సాధించిందని డీఆర్ఎం అభినందించారు. ఈ కార్యక్రమానికి మండల సీనియర్ వాణిజ్య అధికారి (ఎస్డీసీఎం) ఎస్. అనిల్ కుమార్, మండల వాణిజ్య అధికారి (డీసీఎం) పూజా సింగ్ పాల్గొన్నారు. డీఆర్ఎం సన్మాన గ్రహీతలకు అఖిల భారత టికెటు తనిఖీ సిబ్బంది సంఘం ప్రముఖులు లక్ష్మీధర మహంతి, అనిల్ మిశ్రా, బబ్రూ బాహన్ బెహెరా, సత్యరంజన్ పట్నాయక్ హాజరయ్యారు. -
విజిలెన్స్ వలలో సీనియర్ ఇంజినీర్
రాయగడ: స్థానిక సిరిగుడ సమీపంలోని ప్రజా ఆరోగ్య శాఖలో సీనియర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న సహదేవ్ కిషాన్ విజిలెన్స్ వలలో చిక్కుకున్నారు. అతని నుంచి రూ.1.50 లక్షల నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం... ప్రజారోగ్య శాఖ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొని కార్యాలయం నుంచి తన వాహనంలో ఇంటికి వెళ్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు వెంబడించారు. అనంతరం ఆయన గృహంలో అతనిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో అరెస్టు చేశారు. అలాగే సహదేవ్కు సంబంధించి మరో రెండు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. -
దేశానికి ఒడిశా ఆదర్శం
భువనేశ్వర్: భారత రైతులను ఆర్థిక ప్రధాన స్రవంతితో విలీనం చేయడం భారత ప్రభుత్వం లక్ష్యమని, ఈ లక్ష్యం సాధించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాతీయ చైతన్య కార్యక్రమం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ రూపొందించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. పూరీ సాక్షి గోపాల్లోని కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ జాతీయ ప్రచార కార్యక్రమం గురువారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం కింద అతిథులు మొక్కలు నాటారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రచార కార్యక్రమం దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ ప్రచారంలో దాదాపు ఒకటిన్నర కోట్ల మంది రైతులతో ప్రభుత్వం ప్రత్యక్షంగా స్పందిస్తుంది. కొత్త వ్యవసాయ పరిజ్ఞానం, అధునాతన సాంకేతికతలపై రైతులకు అవగాహన కల్పిస్తుంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మాట్లాడుతూ జూన్ 12 వరకు కొనసాగే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఆధునిక సాంకేతికతలు, కొత్త విత్తన రకాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ ప్రచారం దేశ వ్యాప్తంగా 700 జిల్లాల్లోని సుమారు ఒకటిన్నర కోట్ల మంది రైతులను ప్రభుత్వం చేరుకుని, కొత్త వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల అనువర్తనం గురించి అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రతి జిల్లా స్థాయిలో 3 బృందాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాయి. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయం, ఉద్యానవన విభాగ అధికారులు నేల సంరక్షణకు సంబంధించిన అంశాలను గ్రామీణ రైతులకు సంయుక్తంగా వివరిస్తారు. ప్రతి బృందం రోజుకు 2 గ్రామాల చొప్పున సందర్శిస్తుంది. ఒక్కో గ్రామంలో నిత్యం 250 మంది రైతులను కలుసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంక్షేమ పథకాలను వివరిస్తుంది. వివిధ కార్యక్రమాలు, చొరవలు మరియు కొత్త సాగు పరిజ్ఞానం మరియు నైపుణ్యాల ఆచరణాత్మక అంశాలపై రైతులతో చర్చిస్తుంది. పరిశోధన ఆధారిత వ్యవసాయ సమాచారం రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటారు. భూసార పరీక్ష, భూసార కార్డుల వినియోగం, ఎరువుల నిర్వహణ, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం మొదలైన వాటిపై రైతులకు అవగాహన కల్పించడం ఈ ప్రచార కార్యక్రమం బృహత్తర లక్ష్యంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వరి రైతులకు మెరుగైన ధరలు అందించి ఆర్థిక ప్రధాన స్రవంతిలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ చారిత్రాత్మక చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో రైతాంగం కోసం తరచు కొత్త పథకాలు అందుబాటులోకి తీసుకుని వచ్చి రైతుల సంక్షేమాని పెద్ద పీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఒడిశా నేడు సమగ్ర భారతదేశానికి ఒక ఉదాహరణగా నిలిచిందని అభినందించారు. సమృద్ధ్ కిసాన్ యోజన అమలు చేసి రైతాంగం ఆర్థిక బలోపేతానికి నాంది పలికారని పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం రైతుల నుంచి క్వింటాలుకు రూ. 3,100 చొప్పున వరిని కొనుగోలు చేస్తోంది. ఇది కనీస మద్దతు ధర కంటే రూ. 800 అధికం కావడం విశేషం. ఈ చర్యతో రైతు ఆదాయం పెరిగి దేశ సమగ్ర ఆర్థిక పురోగతికి పునాది వేస్తుందన్నారు. మరో వైపు రాష్ట్రంలోని చాలా మంది మహిళలు నేడు సుభద్ర వంటి పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నారు. మహిళా సాధికారత, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతాంగం సాధికారిత వంటి కార్యక్రమాలతో ఒడిశా యావతు ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని తాము విశ్వసిస్తున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ–రైతు సాధికారత విభాగం మంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ మాట్లాడుతూ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ రైతులను యాంత్రికంగా శక్తివంతం చేయడానికి ఒక ప్రత్యేక మార్గమని అన్నారు. ఈ ప్రచారం ఒడిశా నుంచి ప్రారంభం కావడం ఆనందకరమన్నారు. కార్యక్రమంలో పిిప్పిలి నియోజక వర్గం ఎమ్మెల్యే అశ్రిత్ పట్నాయక్, సత్యబాది నియోజక వర్గం ఎమ్మెల్యే ఓం ప్రకాష్ మిశ్రా, బ్రహ్మగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్రో, వ్యవసాయ, రైతు సాధికారత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ అరవింద్ కుమార్ పాఽఢి, ఓయూఏటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పార్వతి కుమార్ రావల్, భారత ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ కార్యదర్శి, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ శుభం సక్సేనా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వికసిత్ కృషి సంకల్ప్ ప్రచార కార్యక్రమం ప్రారంభం ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి రైతులు: ముఖ్యమంత్రి -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీ సొరిసోపొదొరో గ్రామంలో ఒక నీటి మోటార్ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అరైస్టెన వ్యక్తి సొరిసోపొదొరో గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని గురువారం కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... రెండు రోజుల క్రితం సొరిసోపొదొరో గ్రామంలో తాగునీటికి సంబంధించిన మోటార్ చోరీకి గురయ్యింది. ఈ మేరకు గ్రామస్తులు టికిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నారు. చెరువులో మునిగి బాలుడు మృతి మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితి సాలిమ్ పంచాయతీ బారుబేడ గ్రామంలో గురువారం ఉదయం రాజబీర్ పూజారి అనే నాలుగేళ్ల బాలుడు చెరువులో స్నానానికి వెళ్లి మునిగిపోయి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇంటి పనుల్లో ఉన్నటువంటి తల్లి తన కుమారుడు తోటి పిల్లలతో ఆడుకొని ఉంటాడని అనుకుంది. అయితే ఉదయం 10 గంటల సమయంలో బాలుడి కోసం ఎంత వెదికినా కనిపించలేదు. గ్రామంలో అందరినీ అడిగినా ఎవరూ చూడలేదని చెప్పడంతో అంతటా వెదికారు. ఆ సమయంలో అటుగా వచ్చిన స్థానికులు బాలుడి చెప్పులు చూసి అనుమానంతో చెరువులో దిగి చూస్తే ఒక మూలాన బాలుడి మృతదేహం లభ్యమైంది. వెంటనే సాలీమ్ పంచాయతీ సర్పంచ్ చెరువు వద్దకు వెళ్లి అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సదాసివ పూజారి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలుడి మృతితో తల్లి కన్నీరుమున్నీరు అవుతోంది. శ్రీ జగన్నాథుని దర్శించుకున్న కేంద్ర మంత్రి భువనేశ్వర్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబీకులతో కలిసి శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా గురువారం ఆయన పూరీ శ్రీ మందిరం సందర్శించారు. ఆయనతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్దేవ్ పాల్గొన్నారు. -
కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గం పునరుద్ధరణ
కొరాపుట్: కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. గురువారం రాత్రికి పట్టాలు తప్పిన 37 బోగీల్లో 32 బోగీలు పట్టాలు ఎక్కించారు. టన్నెల్లో ఉన్న మిగతా బోగిలు క్రమబద్ధీకరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో అన్ని రైల్వే సర్వీసులు రాయగడ మీదుగా కొరాపుట్ వైపు వెళ్తున్నాయి. కానీ విశాఖ–కిరండోల్ ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లని పూర్తిగా రద్దు చేశారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కిరండోల్ నుంచి ముడి ఇనుప రజనుతో మూడు ఇంజిన్ల గూడ్స్ రైలు విశాఖ వస్తుండగా అరకు సమీపంలో పట్టాలు తప్పింది. ఇప్పటికే వాల్తేర్ డిఆర్ఎం లళిత్ బోరా, రాయగడ డీఆర్ఎం అమితాబ్ అమితాబ్ సింఘాల్ పునరుద్ధరణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ పట్నం, రాయగడ, కొరాపుట్, పలాస, కొత్తవలస, విజయ నగరం నుంచి రైల్వే సిబ్బంది వచ్చి పనుల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్లో చిక్కుకుండిపోవడంతో పాటు, వర్షాల వల్ల పనులకు ఆటంకం కలుగుతోంది. 2024 ఫిబ్రవరి నుంచి నేటి వరకు సుమారు 7 సార్లు రైళ్లు పట్టాలు తప్పాయి. పట్టాలు ఎక్కిన కొన్ని బోగిలను చిమిడి పల్లి స్టేషన్ వద్దకు తెచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 22నే రైల్వే భద్రతా సేఫ్టీ కమిషనర్ బ్రజేష్ కుమార్ మిశ్ర ఈ మార్గంలో పర్యటించారు. -
హోంగార్డ్స్ శరీర సౌష్టవ పరీక్షల్లో విషాదం
పర్లాకిమిడి: స్థానిక బెత్తగుడ పోలీసు బ్యారక్లో గురువారం ఉదయం హోంగార్డు పోస్టులకు శరీర సౌష్టవం పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా రెండు కిలోమీటర్లు పరుగుల పోటీలో తొలుత మహిళా అభ్యర్థులు అనంతరం పురుషులు పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు అస్వస్థతకు గురికాగా, ఒక అభ్యర్థి ఆర్.ఉదయగిరి బ్లాక్, రామగిరి పంచాయతీ పరిసల గ్రామానికి చెందిన సులంతా మిశాల్ (25) తీవ్ర అస్వస్థతకు గురై గ్రౌండ్లోనే పడిపోయాడు. వెంటనే ఎస్పీ ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా ఆదేశాల మేరకు అతడిని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. జిల్లాలోని 144 హోంగార్డుల పోస్టులకు గత రెండునెలల నుంచి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ హోంగార్డు పోస్టులకు 1200 మంది అభ్యర్థులు ఈరోజు పోటీ పడుతున్నారు. సీఎం ప్రగాఢ సంతాపం మృతుడు సులంతా మిశాల్ మృత్యువార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, కోడూరు నారాయణ రావు భువనేశ్వర్లో సీపీఎం మోహన్ చరణ్ మాఝికి ఈ విషయం తెలియజేశారు. సీఎం మిశాల్ కుటుంబానికి సంతాపం తెలిపి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు నష్టపరిహారం ప్రకటిస్తున్నట్టు ఎక్స్లో పోస్టుచేశారు. -
టోల్గేటు వద్ద ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం టోల్గేటు లో పోలీసులతో కలిసి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. వారంతా కలిసి గురువా రం నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్గేటు వద్దకు బుధవారం కాకినాడకు చెందిన లారీ వచ్చింది. లారీ ఓవర్ లోడుతో ఉందని, అదనంగా డబ్బులు కట్టాలని టోల్ సిబ్బంది కోరగా.. ఏ టోల్ప్లాజాలో లేని ఓవర్ లోడ్ లక్ష్మిపురం టోల్ప్లాజాలో ఎలా ఉందని డ్రైవర్ రమేష్ లంకా ప్రశ్నించారు. దీంతో అదనంగా చెల్లిస్తేనే విడిచిపెడతామని లేకుంటే విడిచిపెట్టబోమని వాహనాన్ని అడ్డుకున్నారు. అదనంగా ఉంటే అపరాధ రుసుం చెల్లిస్తామని డ్రైవర్ చెప్పినా వినకుండా డ్రైవర్పైకి కొట్టడానికి వెళ్లడంతో ఆయన 112కు కాల్ చేసి పోలీసుల సహకారం కోరారు. కాశీబుగ్గ పోలీసులు సైతం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారని స్టేషన్కు తీసుకుని వెళ్లారు. కానీ పరీక్షలో తాగలేదని తేలడంతో విడిచిపెట్టి టోల్ప్లాజా వద్ద గొడవ చేశారని పోలీసులు రూ.1030 అపరాధ రుసుం కట్టించుకున్నారు. దీనిపై డ్రైవర్ స్పందిస్తూ తన తప్పు లేకున్నా టోల్గేటు సిబ్బంది అదనంగా డబ్బులు అడుగుతున్నారని, పోలీసులను సంప్రదిస్తే వారు కూడా టోల్ సిబ్బందికే సహకరించారని తెలిపారు. దీనిపై అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించడంతో గురువారం ఉదయం లక్ష్మిపురం టోల్ప్లాజా వద్దకు వందలాది లారీలకు సంబంధించిన వివిధ అసోషియేషన్ సభ్యులు చేరుకున్నారు. టోల్ప్లాజాలో డిస్ప్లే లేకుండా అదనపు బరువు చెబుతూ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వని వారిపై దాడి చేయడానికి వస్తున్నారని, బరువు తూయకుండా అదనపు లోడ్ అని డబ్బులు తీసుకుంటే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. మీడియా, కాశీబుగ్గ పోలీసుల సమక్షంలో లారీ బరువు తూయగా అదనపు లోడ్ లేదని తేలడంతో టోల్ప్లాజా సిబ్బంది, అధికారులను నిలదీశారు. తక్షణమే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టి లక్ష్మీపురం టోల్ప్లాజా కాంట్రాక్ట్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లారీలు సరుకు రవాణాతో ఉపాధి పొందుతుంటే ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడానికి చూస్తోందని ఆరోపించారు. -
ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితి పెంపు
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో 5 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించడానికి గరిష్ట వయోపరిమితిని 32 నుంచి 42 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వివిధ నియామక పరీక్షలలో పాల్గొనడానికి అభ్యర్థులకు తగినంత అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన మేరకు గరిష్ట వయోపరిమితిని 32 నుంచి 42 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఉద్యోగ భర్తీ పురస్కరించుకుని నిర్ధిష్ట వయోపరిమితి సూచిస్తే ఈ పెంపు వర్తించదు. పోలీసు, అగ్నిమాపక సేవలు, అబ్కారి సేవలు మొదలైన యూనిఫామ్ నియామక నియమాల్లో శారీరక సామర్థ్య పరీక్ష సూచించన సందర్భాల్లో వర్తించదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా షెడ్యూల్డు కులాలు, తెగలు, ఎస్ఈబీసీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు విషయంలో పైన పేర్కొన్న గరిష్ట వయోపరిమితి మరింత సడలింపును కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) విధానం – 2025 మంత్రి మండలి ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో ఏఐ మిషన్, ఏఐ సెల్ ప్రారంభిస్తారు. ఈ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తారు. పాలనను మెరుగుపరచడానికి, ఆవిష్కరణలను ప్రేరేపించడానికి, డేటా ఆధారిత నిర్ణయం మెరుగుదల, సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహానికి కృత్రిమ మేధస్సు సామర్థ్యం ఉపయోగించుకునే దిశలో ఇదో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఢెంకనాల్ జిల్లా జొరండా ప్రాంతంలో మహిమా గద్దె ప్రాంగణం అభివృద్ధి పనులు, శూన్య మండపం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 36 నెలల్లోపు ఈ పనులు పూర్తి చేయాలని మంత్రి మండలి ఆదేశించింది. జగత్సింగ్పూర్లోని జేఎస్డబ్ల్యూ తన సొంత జెట్టీని నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జేఎస్డబ్ల్యూ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ చర్యతో రాష్ట్రంలో 3,450 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అందుబాటులోకి వస్తుంది. ఒడిశా నేత్ర సంరక్షణ సేవల కోసం 141 కొత్త పోస్టుల సృష్టి, 200 పోస్టుల అప్గ్రేడ్ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
● ఇద్దరికి గాయాలు రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి పరికితి ఘాట్ రోడ్డు మలుపులో గురువారం జరిగిన ప్రమాదంలో యువతి మృతి చెందింది. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన యువతి రుగుడుబాయి గ్రామానికి చెందిన పూర్ణిమ మండంగి (20)గా గుర్తించారు. గాయాల పాలైన వారు అదే గ్రామానికి చెందిన పాపిని మండంగి, శివ మండంగిగా సమాచారం. పూర్ణిమ, పాపిని, శివ స్కూటీపై రామనగుడ వెళ్తున్నారు. పరికితి ఘాటీ మలుపు వద్ద వెనుక నుంచి లారీ వచ్చి స్కూటీని బలంగా ఢీకొంది. స్కూటీపై ఉన్న ముగ్గురు కొద్ది దూరం ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో పూర్ణిమ మండంగికి తీవ్రగాయాలు తగిలి సంఘటన స్థలం వద్దే మృతి చెందింది. గాయాల పాలైన ఇద్దరిని రామనగుడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న రామనగుడ పోలీస్ స్టేషన్ ఐఐసీ సునితా బెహర, గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని సబ్ కలక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
విజిలెన్స్ వలలో అకౌంటెంట్
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో చిన్ననీటి పారుదల శాఖ డివిజన్ కార్యాలయంలో గురువారం ఉదయం బరంపురం విజిలెన్సు అధికారులు జరిపిన దాడులలో అకౌంటెంట్ సూరజ్ ప్రసాద్ జైస్వాల్, కోశాధికారి నరేష్ పట్నాయిక్ దొరికిపోయారు. గజపతి జిల్లా గుసాని సమితి గురండి గ్రామానికి చెందిన సరోజ్ పాత్రో అనే కాంట్రాక్టర్ నాలుగు వర్కు బిల్లులు పాస్ చేయడానికి చిన్ననీటి పారుదలశాఖ డివిజన్ అకౌంటెంట్ సూరజ్ ప్రసాద్ జైశ్వాల్, క్యాషియర్ నరేష్ పట్నాయక్ను సంప్రదించాడు. అయితే వారు రూ.30వేలు లంచం డిమాండ్ చేసినట్టు కాంట్రాక్టర్ తెలియజేశాడు. దీనిపై విజిలెన్స్ అధికారులను సంప్రదించగా వారు మాటు వేసి పట్టుకున్నారు. తర్వాత వారు నివాసం ఉంటున్న క్వార్టర్స్, ఛెలిగడ (ఆర్.ఉదయగిరి)లో అకౌంటెంట్ జైశ్వాల్ ఇల్లు, బ్యాంకు అకౌంట్లు తనిఖీలు చేశారు. -
చెట్టును ఢీకొని ఒకరి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి ప్రధాన రహదారిలోని నందాగూడ సమీపంలో గురువారం ఉదయం ఓ యువకుడు బైక్పై అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టాడు. కలిమెల సమితి గినిపల్లి గ్రామానికి చెందిన ఇర్మా మాడ్కమి (23) బుధవారం తన బంధువు కుమార్ గూడ గ్రామానికి వెళ్లాడు. అక్కడ నుంచి గురువారం ఉదయం కలిమెల తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రుడిని పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసిన ఇర్మా తండ్రి గంగా మాడ్కమికి పోడియా ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పోడియా పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు . -
జిల్లా కేంద్రాస్పత్రిలో బాలింత మృతి
జయపురం: జయపురం ఫూల్బెడ ప్రాంతంలో గల కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రిలో ఒక బాలింత గురువారం సాయంత్రం మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సదర్ పోలీసు అధికారులు వచ్చి ఆందోళన కారులను శాంత పరచారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన పూర్ణిమ బాగ్ నిండు గర్భిణి. ఆమెను బంధువులు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను జయపురం ఫూల్బెడలో గల జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. అయితే అకస్మాత్తుగా పూర్ణిమ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆమె బీపీ ెపెరగటంతో పాటు ఆమె శ్వాస తీయటం కష్టంగా మారింది. వెంటనే బంధువులు డాక్టర్ను పిలవమని నర్సుకు తెలిపారు. కానీ డాక్టర్ రావడం ఆలస్యం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే పూర్ణిమ చనిపోయిందని భర్త విజయ సాగరిక ఆరోపించారు. బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. డాక్టర్ను పిలిపించి వాప్తవం తెలుసుకొని సముచిత నిర్ణయం తీసుకుంటామని హామీ ఈయటంతో పూర్ణిమ మృత దేహాన్ని తీసుకువెళ్లారని సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. -
భారీగా గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో సుమారు కోటి రుపాయల విలువ చేసే గంజాయిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని అందిన సమాచారం మేరకు పోలీసులు రాయగడ నుంచి గజపతి వైపు వెళ్తున్న లారీని గుణుపూర్ సరిహద్దు వద్ద పట్టుకుని తనిఖీలు నిర్వహించారు. లారీలో పశువుల దాణా 516 బ్యాగుల మధ్య 29 గంజాయి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు లారీని సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కు రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆలీగడ్ జిల్లా నావున్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్, తేకేడర్ గ్రామానికి చెందిన హరీష్ కుమార్గా గుర్తించారు. వారి నుంచి రెండు ఫోన్లతోపాటు రూ.7,100 నగదు, రవాణాకు వినియోగించే లారీని సీజ్ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. -
ట్రాఫిక్ హోంగార్డ్పై ఆటో డ్రైవర్ దాడి
రాయగడ: ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుపై ఆటో డ్రైవర్ దాడి చేసి గాయపరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆటో డ్రైవర్పై సదరు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 26వ తేదీన స్థానిక కపిలాస్ కూడలిలో ట్రాఫిక్ విధులను హోంగార్డు అశోక్ కుమార్ పాడి నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వస్తున్నాడు. హోంగార్డు ఆటోను ఆపి డ్రైవర్ను మందలించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో హంగార్డుపై ఆటో డ్రైవర్ దాడి చేసి గాయపరిచాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆటో నంబర్ ఆధారంగా గాలించారు. ఆటో రాయగడలోని న్యూకాలనీకి చెందినదిగా గుర్తించారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఐఐసీ కేకేబీకే కుహోరో తెలియజేశారు. ఆటోను సీజ్ చేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం
భువనేశ్వర్: భారత ప్రభుత్వం ఆవిష్కరించిన లక్షపతి దీదీ యోజన మహిళల ఉనికిని కొత్త ఒరవడి దిద్దిందని, ప్రధానంగా గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాల్ని ప్రేరేపించడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ పథకం కింద మహిళలు ఏటా రూ. 1 లక్షకు పైగా సంపాదించడానికి మార్గం సుగమం చేసిందని, ఉపాధి కల్పనతో ఆర్థిక సాధికారితకు పరిమితం కాకుండా వారిలో నాయకత్వ భావాల్ని ప్రేరేపించడం లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం మిషన్ శక్తి విభాగం నిర్వహించిన జాతీయ లక్షపతి దీదీ సమావేశం – 2025 సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లక్షపతి దీదీలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కోసం నారీ శక్తి బంధన్ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిందని, దీని ద్వారా భావి ఎన్నికలలో కనీసం 33 శాతం మహిళలు లోక్ సభ మరియు రాష్ట్ర శాసన సభకు ఎన్నికవుతారని ఆయన అన్నారు. లక్షపతి దీదీ మిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యాచరణతో సుమారు 17 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేశామని, ఈ సాఫల్యం జాతీయ స్థాయిలో రాష్ట్రానికి అగ్ర స్థానాన్ని కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు, మిషన్ శక్తి, ఒడిశా జీవనోపాధి మిషన్ నిజాయితీచ అట్టడుగు స్థాయిలో సమర్థమైన కృషి ఫలితంగా ఈ విజయాన్ని సాధించామన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. రివాల్వింగ్ ఫండ్ సహాయం రూ.15,000 నుండి రూ.30,000 కు పెంచారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను రూ. 35 లక్షల నుంచి రూ. 60 లక్షలకు పెంచారు. ఈ చర్యతో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు ఆత్మవిశ్వాసంతో తమ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించి నిరవధికంగా జీవనోపాధిని పొందగలుగుతున్నారు. సుభద్ర శక్తి మేళా మద్దతుతో సుభద్ర శక్తి కేఫ్ మహిళలకు కొత్త జీవనోపాధి నమూనాగా ప్రారంభమైంది. మహిళల దృఢ సంకల్పం మరియు కృషితో వ్యాపారం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయ’ని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లాకు చెందిన లక్షపతి దీదీ వింధ్యవాసిని, మహారాష్ట్రకు చెందిన శోభ దిగంబర కదమ్ తమ అనుభవాలు, సాఫల్యతనకు సభాముఖంగా పంచుకున్నారు. దేవ్గఢ్ జిల్లాకు చెందిన శకుంతల ధొలొ, గజపతి జిల్లాకు చెందిన సులా మి డాల్బెహెరా, కేంద్రపడా జిల్లాకు చెందిన మమతా నాథ్ శర్మలను ఉత్తమ లక్షపతి దీదీలుగా ఎంపిక చేసి ముఖ్యమంత్రి బహుమతులు ప్రదానం చేశారు. 98 శాతం లక్షపతి దీదీల ఆవిష్కరణతో రాష్ట్ర స్థాయిలో నయాగఢ్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో కేంద్రాపడా, కటక్, భద్రక్, జగత్సింగ్పూర్ జిల్లాలు ద్వితీయ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధికారిగా ఒడిశా జీవనోపాధి మిషన్ అధికారి దేవి ప్రసాద్ నాయక్ను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లక్షపతి దీదీ పథకం సాఫల్యత వీడియో, కాఫీ టేబుల్ పుస్తకం మరియు బుక్లెట్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీ్త్ర, శిశు అభివృద్ధి విభాగం మంత్రి ప్రభాతి పరిడా తన ప్రసంగంలో లక్షపతి దీదీ యోజన ఒక ఉద్యమంగా పేర్కొన్నారు. లక్షపతి దీదీల ఆవిష్కరణలో ఒడిశా నిరంతరం అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ పథకం ప్రోత్సాహంతో వ్యవసాయం, పశుపోషణ, కుట్టుపని, కేఫ్లు వంటి అన్ని రంగాలలో రాష్ట్ర గ్రామీణ మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అభివృద్ధి ప్రక్రియలో మహిళలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం ప్రాముఖ్యత కల్పిస్తుందని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ అన్నారు. మిషన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ షాలిని పండిట్, డైరెక్టర్ డాక్టర్ మోనికా ప్రియదర్శిని ఈ కార్యక్రమంలో ధన్యవాదాలను ప్రతిపాదించారు. జాతీయ లక్షపతి దీదీ సమావేశం 2025– 25 రాష్ట్రాల నుంచి లక్షపతి దీదీలు హాజరు అగ్రస్థానంలో నయాగఢ్ జిల్లా -
కోణార్క్ సూర్య దేవాలయం జలమయం
భువనేశ్వర్: అల్పపీడనం కారణంగా నిరంతరం వర్షం కురుస్తోంది. తెరిపి లేని వర్షాలతో కోణార్క్ సూర్య దేవాలయం జలమయమైంది. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. మెళియాపుట్టి క్రీడాకారుడికి గోల్డ్మెడల్ మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టికి చెందిన పొట్నూరు అనిరుథ్ రోల్బాల్ (స్కేటింగ్)లో సత్తాచాటాడు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటడంతో శ్రీలంక దేశంలోని మినువాంగోడలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు అవకాశం కలిగింది. గురువారం జరిగిన పోటీల్లో భారత్ తరఫున బంగారు పతకం సాధించాడు. అనిరుద్ధ్కు తల్లిదండ్రులు నవీన్కుమార్, మీనాక్షి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మహిళ ఆత్మహత్య సారవకోట : వాండ్రాయి గ్రామానికి చెందిన రాడ పార్వతమ్మ (59) అనారోగ్యంతో బుధవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.భర్త ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. పార్వతమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. చోరీ కేసులో ఇద్దరు అరెస్టు రణస్థలం: పాతర్లపల్లి పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీలో రేగాన ఉత్తరమ్మ ఇంట్లో ఈ నెల 25న బంగారం వస్తువులు చోరీకి గురయ్యాయ ని జె.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అదే ఇంట్లో ఉన్న శైలు, అతని ప్రియుడు డి.దుర్గా ప్రసాద్లే దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. నిందితులకు వచ్చే నెల 11 వరకు కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు. బంగారాన్ని రికవరీ చేశామని తెలిపారు. బాడీబిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కాశీబుగ్గ: అండమాన్ నికోబార్ దీవుల్లోని ల్యాండ్ పోర్టుబ్లెయిర్లో నిర్వహించిన జాతీ య స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పలాస–కాశీబుగ్గకు చెందిన ఎం.శివకుమార్ సత్తాచాటాడు. మిస్టర్ అండమాన్ హంట్ విభాగంలో 170 కేటగిరీలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా విజేతలను సిల్వర్ మెడల్తో సత్కరించారు. ఈ సందర్భంగా జంటపట్టణాల బాడీబిల్డర్స్ గురువారం అభినందనలు తెలిపారు. హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో భాగంగా గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆప్షన్ ప్రకారం ఎంచుకున్న స్కూళ్లకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు అందుకున్న హెచ్ఎంలు విధుల్లో చేరాలని డీఈఓ తిరుమల చైతన్య ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్పై దాడి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మంగువారితోట లెప్రసీ కాలనీ వద్ద మత్తులో ఉన్న యువకులు ఓ హెడ్కానిస్టేబుల్పై దాడి చేశారు. వారు గంజాయి మత్తులో ఉన్నారా.. లేదంటే మద్యం మత్తులోనే దాడికి పాల్పడ్డారా అన్నది తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్ఐ రాంబాబు, స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో (డీసీఆర్బీ) విభాగంలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న త్రినాథ్ గురువారం రాత్రి విధులు ముగించుకుని లెప్రసీ కాలనీలో ఉన్న తన ఇంటికి బయల్దేరాడు. మంగువారి తోట వద్ద కాలనీలో వెళ్తుండగా నలుగురు యువకులు మత్తులో రోడ్డుపై న్యూసెన్సు చేస్తున్నారు. ఈ క్రమంలో బండిపై వెళ్తున్న హెచ్సీ త్రినాథ్కు ఓ యువకుడి చేయి తగలడంతో ‘ఈ సమయంలో ఇలా చేస్తున్నారేంటి’ అని ప్రశ్నించారు. దీంతో నలుగురు యువకులు హెచ్సీతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా దాడికి ఎగబడ్డారు. ఈ పరిణామం నుంచి తేరుకునేలోపే హెచ్సీకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడిన త్రినాథ్ను రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై ఎంఎల్సీ అయ్యిందని రిమ్స్ ఔట్పోస్ట్ అధికారులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్టు
కోరాపుట్: మావోయిస్టు కీలక నేత కుంజమ్ హిడ్మా అరెస్టయ్యాడు. ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్న కుంజమ్ హిద్మాను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన మావోయిస్టు కుంజమ్ హిడ్మామావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా కుంజుమ్ హిడ్మా పోలీసులకు చిక్కాడు. కోరాపుట్ పరిసర ప్రాంతాల్లో హిడ్మా సంచరిస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించగా, హిడ్మా పోలీసులకు తారసపడ్డాడు.హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. హిడ్మా వద్ద నుంచి పలు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్ తో పాటు 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానికి డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు కత్తులు, గొడ్డలి తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అవగాహన తప్పనిసరి
సంక్షేమ పథకాలపై.. భువనేశ్వర్: అధికారులే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. ప్రజలకు, ముఖ్యంగా సమాజంలోని పేద, బలహీన వర్గాలకు మెరుగైన సేవలందించడానికి సమగ్ర సమాచారం అవసరమని చెప్పారు. గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతున్న సహాయ కార్మిక అధికారి (ఏఎల్ఓ), అదనపు జిల్లా సంక్షేమ అధికారుల (ఏడీడబ్ల్యూఓ)ను ఉద్దేశించి బుధవారం గవర్నర్ ప్రసంగించారు. అధికారులు తమ విభాగాలకు సంబంధించిన పథకాలకే పరిమితం కాకండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎమ్ఎంవై), ప్రధాన మంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై), సుభద్ర యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వంటి అనేక ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు సమాజంలో పలు వర్గాల కోసం ఉద్దేశించబడినవిగా పేర్కొన్నారు. కార్మికులు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలకు పథకాల లబ్ది చేకూర్చేందుకు అధికారులు సమగ్ర సమాచారం కలిగి ఉండాలన్నారు. స్కాలర్షిప్లు, న్యాయ సహాయం, పరిహారం, కులాంతర వివాహాలకు మద్దతు, బలహీన గిరిజన వర్గాలకు బీమా సౌకర్యం వంటి ప్రయోజనాలను పొందేలా అధికారులు పనిచేయాలన్నారు. ఏఎల్ఓ శిక్షణార్థులతో మాట్లాడుతూ వారిని కార్మికుల హక్కుల సంరక్షకులుగా అభివర్ణించారు. కార్మిక చట్టాలు అమలు, వాస్తవ కార్యాచరణ, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించడం, సురక్షిత పని ప్రదేశాలు కల్పించడం ప్రధాన కర్తవ్యమని చెప్పారు. అసంఘటిత కార్మిక రంగంలో వలస కార్మికులకు మద్దతు, రక్షణ కల్పించేందుకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.బి.ఎస్.రాజ్పుట్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమగ్ర సమాచారం కలిగి ఉండాలి శిక్షణా కార్యక్రమంలో గవర్నర్ కంభంపాటి హరిబాబు -
భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జైలు శిక్ష
రాయగడ: కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తకు గుణుపూర్ ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార జైలు శిక్షను విధించింది. కేసు న్యాయవిచారణ చేసిన ఏడీజే దేవదత్త పట్నాయక్ ఈమేరకు మంగళవారం నాడు తన తీర్పును ప్రకటించారు. అదేవిధంగా జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని.. లేనిపక్షంలో మరో సంవత్సరం జైలు శిక్షను అనుభవించాలని తన తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో అయిదుగురు నిందితులను నిర్దొషులుగా తీర్పునిచ్చారు. గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలోని పద్మపూర్లో గల కొత్తవీధిలో నివసిస్తున్న హృషికేష్ సాహు తన భార్య సంధ్యారాణిని గొడ్డలితో నరికి హత్యకు పాల్పడినట్టు సంధార్యాణి చెల్లెలు 2020 జనవరి 27వ తేదీన పద్మపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిందితుడు హృషికేష్ సాహుతో సహా మరో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా హృషికేష్ అప్పట్లో పరారయ్యాడు. అనంతరం ఆయనను 2020 అక్టోబర్ 20వ తేదీన హృషికేస్ను కూడా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసు విచారణలోకి రాగా మంగళవారం ఏడీజే పట్నాయక్ 18 మంది సాక్షులను విచారించిన అనంతరం హృషికేష్ను ఏవజ్జీవ కారగార శిక్షను విఽధించగా మిగతా ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తు తీర్పునిచ్చారు. -
ఎన్కేటీ రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభం
జయపురం: జయపురం మున్సిపాలిటీలోని ఎన్కేటీ రోడ్డు విస్తరణకు అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. జయపురం సబ్కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కుమారి అక్కవరమ్ శొశ్యారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపాలిటీ ఇంజినీర్లు, సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఆర్అండ్బీ ఇంజినీర్లు, పోలీసుల సమక్షంలో 40 అడుగుల రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభించారు. పట్టణ ప్రధాన మార్గం వల్లబాయి పటేల్ రోడ్డు నుండి నుంచి ఎన్కేటీ రోడ్డును ప్రభుత్వ ఉన్నత పాఠశాల మీదుగా నీలకంఠేశ్వర మందిర కూడలి వరకు ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే వల్లభాయి పటేల్ మార్గం నుండి 80 మీటర్ల వరకు 30 అడుగుల రోడ్డు ఉంటుందని పేర్కొన్నారు. అందుకు ప్రధాన కారణం 80 మీటర్ల వరకు ఉత్తర వైపు ప్రజల నివాస గృహాలు ఉన్నాయి. దక్షిణ వైపు జయపురం మహారాజు కోట ఎత్తైన ప్రహరీ ఉండటం వలన అంతవరకు 30 అడుగుల వెడల్పు రోడ్డు, అక్కడ నుంచి నీలకంఠేశ్వర మందిర కూడలి వరకు 40 అడుగుల రోడ్డు వేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభించారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
భువనేశ్వర్ : స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ(ఐఐటీ) బుధవారం రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచ రుతుచక్ర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సౌజన్యంతో జరిగిన ఈ సమావేశంలో, భారత దేశంలో రుతుక్రమ ఆరోగ్య సమస్యలకు వినూతన, సమగ్ర, సుస్థిరమైన పరిష్కారాలను చర్చించడానికి విధాన నిర్ణేతలు, ప్రజారోగ్య నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు, సామాజిక ఆవిష్కర్తలు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల, కళాశాలలకు వెళ్లే బాలికలలో పునర్వినియోగ రుతుక్రమ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేర్ (క్యాంపస్ యాక్షన్ ఫర్ రీయూజబుల్ ఎసెన్షియల్స్) నిరుపేద వర్గాల మహిళలకు పర్యావరణ అనుకూలమైన పునర్వినియోగ రుతుక్రమ ప్యాడ్లను పంపిణీ చేసింది. అనంతరం శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లను ప్రారంభించారు. రుతుస్రావం ఒక సహజ జీవ ప్రక్రియగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద్ కర్మల్కర్, యూనిసెఫ్ ఒడిశా ఫీల్డ్ ఆఫీస్ హెడ్ విలియన్ హన్లాన్ జూనియర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డును విస్తరించాలి
పర్లాకిమిడి: పట్టణంలోని టౌన్ రోడ్డును పూర్తిగా విస్తరించాలని, దీనిపై రెండేళ్ల క్రితం ఖంజా వీధి నుంచి మార్కెట్, కొత్త బస్టాండ్ వరకు సేకరించిన భూమిని డెవలప్మెంట్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బసంత పండా బుధవారం కలెక్టర్కు రాసిన వినతిని సబ్ కలెక్టర్ అనుప్పండాకు కలెక్టరేట్లో అందజేశారు. పట్టణంలో పలు కూడళ్లల్లో ఆక్రమణదారులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించారన్నారు. రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లు ఎందుకు రోడ్డును విస్తరించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పలుకుబడి ఉన్న వ్యాపారుల దుకాణాలను తొలగించకుండా పనులు సాగిస్తున్నారని వివరించారు. దీనిపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి టౌన్ రోడ్డును 66 అడుగుల మేరకు విస్తరించాలని కోరారు. చోరీ కేసులో ఇద్దరు అరెస్టు రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి సికిరపాయిలో నివసిస్తున్న గొపాలశెఠి ఉపేంద్ర ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో సికరపాయి గ్రామానికి చెందిన గెంబలి చందన్ కుమార్, గురుతులి గ్రామానికి చెందిన గుడ్ల సంతోష్కుమార్ ఉన్నారు. గత నెల 11వ తేదీన ఇదే కేసుకు సంబంధించి ఈశ్వర్ నాయక్ అనే నిందితుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ప్రత్యేకంగా ఏర్పడిన పోలీస్ బృందం ఈ మేరకు దర్యాప్తు చేస్తుంది. బిసంకటక్, కాసీపూర్, జేకేపూర్ నియమగిరి పర్వత ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్న ఈ బృందం ఈ మేరకు నిందితులను పట్టుకోవడంలో సఫలీకృతమవుతుంది. కళ్యాణ సింగుపూర్ ఐఐసీ నీలకంఠ బెహర మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. దాడి కేసు నమోదు కవిటి: మండలంలో డి.గొనపపుట్టుగ గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన బోనేల హరికృష్ణపై ప్రత్యర్థి వర్గీయులు దాడిచేసి గాయపర్చడంతో 108 అంబులెన్స్లో కవిటి ప్రభుత్వ ఆస్పత్రి వెళ్లాడు. అక్కడి ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు కవిటి పోలీస్స్టేషన్లో బోనేల హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఎల్సీ కేసు నమోదు చేశామని ఎస్ఐ వి.రవివర్మ బుధవారం తెలియజేశారు. తన కొబ్బరితోటలో కాయలు, కమ్మలను ప్రత్యర్థి వర్గంవారు తీసుకెళ్తుంటే అడ్డుకున్నాననే నెపంతో కర్రలతో కొట్టి, కారంచల్లి తీవ్రంగా గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా ఈ కొట్లాటలో తమకు కూడా గాయాలయ్యాయని ప్రత్యర్థి వర్గీయురాలు తెంబ సరోజిని అనే మహిళ సైతం కవిటి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.