Orissa
-
రైలు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి
పొందూరు: రైలు ఢీకొని చేనేత కార్మికుడు దుర్మణం చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం తండ్యాం పంచాయతీ శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన కాకర్ల ఆనంద్(62) చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తాను నేసిన వస్త్రాలను ఆమదాలవలసలో మాస్టర్ వీవర్కు ఇచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత ఆమదాలవలస నుంచి రైలులో పొందూరు చేరుకున్నాడు. పొందూరు రైల్వే ప్లాట్ఫాంపై దిగి పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో గూడ్స్ రైలు కదలడంతో రాడ్డు తగిలి పట్టాలపై పడిపోయాడు. రైలు ఆనంద్ మెడ పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆనంద్కు భార్య నాగరత్నం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
నేల ఆరోగ్యాన్ని కాపాడదాం
రణస్థలం: నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగా సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట, జీవన ఎరువుల ప్రాముఖ్యతను ప్రతి రైతు తెలుసుకోవాలని రైతు శిక్షణా జిల్లా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆర్.శ్రీనివాసరావు అన్నారు. రణస్థలం మండలం తెప్పలవలసలో ఖేతి బచావ్ కార్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్న పీఎండీఎస్ కిట్లు వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ ద్వారా నానో ఎరువుల స్ప్రేయింగ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జి.ఎస్.రాయ్, కె.హరికుమార్, బి.జ్యోతిబసు, ఏవోలు వై.సురేష్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపనపొందూరు: వీఆర్గూడెంలో సర్వేనంబరు–137లో 30 ఎకరాలలో రూ.10.45 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్లు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ఆర్డీఓ సాయిప్రత్యూష, మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, బలగ శంకర్ భాస్కర్, చిగిలిపల్లి రామ్మోహన్రావు, బాడాన గిరి, అధికారులు పాల్గొన్నారు. ఇంధన ధరలు తగ్గించాలి పలాస: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు మంగళవారం పలాస ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ కార్యదర్శి పుచ్చ దుర్యోధనరావు, అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, రైతాంగ కమిటీ నాయకులు దాసరి శ్రీరాములు, కారి పురుషోత్తం, మురిపింటి గంగయ్య, గర్తం కూర్మారావు, సాలిన వీరాస్వామి, మామిడి గణపతి, బి.లక్ష్మణరావు, బొడ్డు పాపారావు, పి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఒడిశా మద్యం కలిగిన వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష పాతపట్నం: ఒడిశా రాష్ట్రం మద్యం బాటిళ్లతో పట్టుబడిన వ్యక్తికి పాతపట్నం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోషిణి ఆరు నెలల పదిహేను రోజులు జైలు శిక్ష విధించారని ఎకై ్సజ్ ప్రొహిబిషనల్ సీఐ కోట కృష్ణారావు మంగళవారం తెలిపారు. 2022 అక్టోబర్లో ఒడిశా రాష్ట్రం నుంచి మద్యం బాటిళ్లను వటుకుళ్ల శంకరరావు తీసుకువస్తుండగా అప్పటి ఎకై ్సజ్ ఎస్ఐ దస్తాగిరి పట్టుకుని కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు సోంపేట: ఒడిశా రాష్ట్రం మహేంద్రగిరి పరిసర ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలం ఎం.జి.పురం పంచాయతీ హంసమొర గ్రామానికి చెందిన నలుగురు గాయపడ్డారు. ఉదయ్ గౌడో కుటుంబ సభ్యులు మహేంద్రగిరుల్లో జరుగుతున్న మేళాలో పాల్గొని తిరిగి వస్తుండగా కంబం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో సంజుగౌడో, సంతోష్, కృష్ణ, డ్రైవర్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బరంపురం తరలించి వైద్యం అందిస్తున్నారు. -
ఓటర్ల జాబితా సవరణపై అవగాహన
రాయగడ: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి తెలిపారు. అర్హత కలిగిన ఓటరు తన పేరును జాబితాలో కొనసాగేందుకు జాన్ 28వ తేదీలోగా గణన ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 7,14,700 మంది ఓటర్లు ఉండగా, పది రోజుల వ్యవధిలో సమారు 70 శాతం మంది ఓటర్లకు గణన ఫారాలను పంపిణీ చేసినట్టు వివరించారు. గుణపూర్ నియోజకవర్గంలో 2,34,902 మంది, రాయగడ నియోజకవర్గంలో 2,57,393 మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఫారాల పంపిణీ, సమాచారం సేకరణ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాయగడ పట్టణంలో సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అవగాహన రథం, ప్రచార వాహనాలతో పాటు వందలాది మంది ఓటర్లు, అధికారులు, ప్రజలు పాల్గొని ఓటరు చైతన్య నినాదాలతో పట్టణంలో ర్యాలీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ద్వారా యువ ఓటర్లు, వృద్ధులు, స్వచ్ఛంద సేవకులకు ఓటరు జాబితా సవరణ అవసరం, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ చెప్పారు. మంగళవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లొ సబ్ కలెక్టర్ ఇంటింటా తిరిగి ఓటర్లకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి -
దివ్యాంగుల ‘భవిత’కు భరోసా
● చిన్నారులను అక్కున చేర్చుకుంటున్న భవిత కేంద్రాలు ● మానసికోల్లాసంతో పాటు 21 రకాల సేవలతో సహిత విద్య ● నేటితో ముగియనున్న దివ్యాంగ చిన్నారుల గుర్తింపు సర్వే నరసన్నపేట: ప్రత్యేక అవసరాల పిల్లల(దివ్యాంగులు)కు భవిత కేంద్రాలు ఆసరాగా నిలుస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తున్నాయి. ఉచిత విద్య, వైద్యం, అవసరమైన ఉపకరణాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో చేరేందుకు అర్హులైన దివ్యాంగ చిన్నారులను గుర్తించేందుకు మే 4 నుంచి సర్వే నిర్వహిస్తుండగా ఈ నెల 10తో ప్రక్రియ ముగియనుంది. ఆసరాగా నిలుస్తూ.. ప్రత్యేక అవసరాల చిన్నారులు చాలాచోట్ల ఇంటికే పరిమితమయ్యేవారు. వీరిని బడికి పంపించే వీలు లేకపోవడంతో ఆలనాపాలనా తల్లిదండ్రులే చూసుకోవాల్సి వచ్చేది. ఇటువంటి పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సహిత విద్యను అందించేందుకు భవిత కేంద్రాలు ఉపకరిస్తున్నాయి. అప్పట్లో భవిత కేంద్రాలు ఎక్కడో ఆమడ దూరంలో ఉండేవి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటిని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనికి మార్చారు. అప్పటి నుంచి ప్రత్యేక అవసరాల పిల్లలు భవిత కేంద్రాల ద్వారా వారి అవసరాలను వారు సొంతంగా చేసుకొనే స్థితికి వస్తున్నారు. తల్లిదండ్రులు భవిత కేంద్రాల నిర్వహణపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు అందచేసే సహిత విద్యను విద్యా శాఖలో భాగమైన సమగ్ర శిక్షా పథకం ద్వారా నిర్వహిస్తున్నారు. 21 రకాల సేవలు.. చిన్నారులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ సంరక్షించి 21 రకాల సేవలతో కూడిన సహిత విద్య బోధిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు మానసిక ఉల్లాసానికి అవసరమైన ఆటపాటలతో ఉత్తేజపరిచి ప్రోత్సహిస్తున్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు జలుమూరు మోడల్ ప్రైమరీ స్కూల్, సారవకోట ఎంఆర్సీ పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్, పోలాకి నర్సాపురం ఎంపీపీఎస్ తదితర చోట్ల భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతివారం చిన్నారులకు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. నరసన్నపేటలో సోమవారం చేస్తుండగా మిగిలిన మండలాల్లో ఇతర రోజుల్లో చేస్తున్నారు. వైకల్యాన్ని తగ్గించేందుకు తేలికపాటి యోగాసనాలు, ఎక్సర్సైజులు వివరిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా సూచనలు చేస్తున్నారు. మంచానికే పరిమితమైన వారిని వారంలో రెండుసార్లు గృహ సందర్శన చేసి సహిత ఉపాధ్యాయుల ద్వారా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. ఉపకరణాలు.. భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ చిన్నారులకు ప్రత్యేక పరికరాలను అందచేస్తున్నారు. సమగ్ర శిక్షా ద్వారా వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, హియరింగ్ మిషన్లు, సీపీ వీల్ చైర్, రొలేటర్స్ వంటివి పంపిణీ చేయడంతో పాటు కేంద్రాలకు వచ్చే పిల్లలకు రవాణా చార్జీలు సైతం చెల్లిస్తున్నారు. మా అబ్బాయి సింహచలం వయసు 13 ఏళ్లు. మాటలు రాకపోవడం, వినికిడి సమస్య కారణంగా ఇంటికే పరిమితమయ్యేవాడు. భవిత కేంద్రానికి పంపడం ద్వారా చదవడం నేర్చుకుంటున్నాడు. ఆటల్లోనూ ఉత్సాహంగా ఉన్నాడు. ఆరోగ్యంపరంగా చాలా మెరుగైంది. – రమణ, కొత్తపేట, నరసన్నపేట మండలం ప్రత్యేక అవసరాల చిన్నారులపై తల్లిదండ్రులు తగిన శ్రద్ధ చూపాలి. క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి పంపిస్తే వారిలో ఉత్సాహం కలుగుతుంది. రోజూ వారికి అవసరమైన శారీరక శిక్షణ కూడా ఇంటి వద్ద అందించాలి. – శ్రీనివాసరావు, ఐఈఆర్టీ, నరసన్నపేట -
బీడీవో ఔదార్యం
కొరాపుట్: మండుటెండలో వెళ్తున్న వృద్ధురాలికి బీడీవో అండగా నిలిచి తన గమ్యస్థానానికి చేరి గొప్ప ఔదర్యాన్ని చాటుకున్నారు. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి బ్లాక్ డెవలప్మెంట్ అధికారి మనోజ్ పాణీగ్రహీ తన సమితిలో మంగళవారం క్షేత్ర పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో మండుటెండలో గౌడగుడ గ్రామానికి చెందిన సుందేయ్ బాగ్ అనే 90 ఏళ్ల వృద్ధురాలు ప్రభుత్వ వైద్యశాల నుంచి ఇంటికి తన కుమార్తెతో కలిసి నడిచి వస్తుంది. తన వాహనంలో వెళ్తున్న బీడీవో ఆమెని దాటి వెళ్లి కొంతదూరం తర్వాత వాహనం ఆపారు. కారు తలుపు తీసేసరికి ఎండ తీవ్రత గట్టిగా తగిలింది. వెంటనే తాను వచ్చే మార్గంలో నడుస్తూ వస్తున్న వృద్ధురాలు గుర్తుకి వచ్చి వెంటనే తన వాహనాన్ని వెనక్కి తిప్పి ఆమె వద్దకు వచ్చారు. వారిద్దరిని వాహనంలో ఎక్కించుకొని నేరుగా వారింటివద్ద దింపారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా..లేదా అని ఆరాతీశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు, రేషన్ కార్డు, పింఛన్ తదితర పథకాలు సక్రమంగా అందుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో రావడంతో బీడీవోపై ప్రశంసలు కురిపించారు. -
రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల పరిశీలన
భువనేశ్వర్: స్థానిక రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులను కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం పరిశీలించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద భువనేశ్వర్ రైల్వే స్టేషన్ను ఆధునిక, ప్రపంచ స్థాయి స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయపడి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు. నిబంధనల మేరకు హై కోర్టు బెంచ్ ఏర్పాటు దీర్ఘ కాలంగా ఊగిసలాడుతున్న పశ్చిమ ఒడిశా శాశ్వత హై కోర్టు బెంచ్ ఏర్పాటుపై కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. శాశ్వత హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు హైకోర్టు, ముఖ్యమంత్రి ఆమోదం అవసరమని, ఈ ఆమోదం కోసం గవర్నర్ దరఖాస్తు చేస్తారని, దీన్ని పరిగణనలోకి తీసుకోవడం ఒక చట్టపరమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
● కూంబింగ్కు వెళ్లి వస్తుండగా పోలీసులకు తారసపడిన భారీ డంప్ ● మల్కన్గిరి జిల్లాలో బయటపడిన వైనం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ వెలుగుచూసింది. కిటిమిటి, కటువాపధర్ గ్రామాల అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్త కూంబింగ్ నిర్వహించి వస్తుండగా డంప్ తారసపడింది. దాన్ని తవ్వితీయగా అందులో ఉన్న వివిధ సామగ్రి ఆధారంగా మావోయిస్టులకు చెందినవిగా గుర్తించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దీనిపై జిల్లా ఎస్పీ వినోధ్ పటెల్ అధ్యక్షతన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్లో లభ్యమైన సామగ్రిని ప్రవేశపేట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులను పూర్తిగా తరిమికొట్టామన్నారు. సోమవారం కూంబింగ్కు వెళ్లి మంగళవారం తిరిగి పోలీసులు, జవాన్లు వస్తుండగా డంప్ను గుర్తించినట్టు పేర్కొన్నారు. దీన్ని వెలికితీయగా.. అందులో 32 రకాల సామగ్రి మావోయిస్టులకు చెందిన సామగ్రి ఉందన్నారు. వీటిలో తుపాకీలు, సీలెన్ బాటిళ్లు, జిలిటెన్ వైర్లు, కరెంట్ వైర్లు, బూలెట్లు, టిఫిన్ బాంబులు, మెడికల్ సామగ్రి, వాకీటాక్, మావో దుస్తులు, సోలార్ ప్లెట్లు, మావో సాహిత్యం ఉందని ఎస్పీ వివరించారు. -
బాధ్యులను కఠినంగా శిక్షించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కర్నూలు జిల్లా వెంకయపల్లె గ్రామ రెవెన్యూ అధికారి మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని, రైస్ మిల్ కస్టోడియన్ అధికారులకు జారీ చేసిన షాకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని జిల్లా గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద డచ్ భవనం సమీపంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వీఆర్వో సంఘం నాయకుడు ప్రగడ వేణుగోపాల్, రాష్ట్ర నాయకుడు ఎం.అప్పలనాయుడు, జిల్లా కార్యదర్శి కోర్ల శ్రావణ్లు మాట్లాడుతూ జిల్లా జేఏసీ పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిబ్బందిపై అధికారులు ఒత్తిడి పెరిగిందని, ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం తగ్గించి, శాఖాపరమైన విధులు మాత్రమే అప్పగించాలని కోరారు. ప్రభుత్వ సెలవులు, పండుగ దినాలలో విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు కల్పించకూడదన్నారు. రైస్ మిల్ కస్టోడియన్ అధికారులుగా నియమితులైన తాము ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా నిబద్ధతతో విధులు నిర్వహించామని, ఇటీవల జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకుని, నిష్పాక్షిక విచారణ జరిపి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో విలేజ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు, వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు గోపి, వీఆర్వో సంఘం కోశాధికారి కె.కె.ప్రసాద్, తౌడు తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో రథ నిర్మాణ సేవకుడు మృతి
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని వార్షిక యాత్ర కోసం రథం తయారీ పనుల్లో నిమగ్నమైన భోయ్ సేవకుల్లో ఒకరు మంగళ వారం గుండె పోటుతో మరణించడంతో రథ నిర్మాణ శాల ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు ధోబా భోయిగా గుర్తించారు. అతడు బలభద్రుని తాళ ధ్వజ రథం నిర్మాణంలో నిమగ్నమై ఉండగా ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికుల సమాచారం ప్రకారం మంగళ వారం ఉదయం ధోబా భోయి ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. సత్వర చికిత్స కోసం తొలుత అతడిని పూరీలోని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియడంతో పూరీ జిల్లా కలెక్టర్ రథ తయారీ శిబిరం సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి సేవకుడి మరణంపై విచారం వ్యక్తం చేశారు. మృతుడు ధోబా బోయి కుటుంబానికి జిల్లా యంత్రాంగం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
ఎంఎస్ఎమ్ఈలకు ఐఐటీ సాంకేతిక మద్దతు
భువనేశ్వర్: స్వయం సహాయక బృందాలను సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలుగా (ఎంఎస్ఎమ్ఈ) మార్చేందుకు ఐఐటీ భువనేశ్వర్, ఒడిశా జీవనోపాధి మిషన్తో అవగాహన ఒప్పందం కుదిరింది. క్షేత్ర స్థాయిలో వ్యవస్థాపకతను పెంపొందించే దిశగా ఒక కీలక అడుగు వేస్తూ ఐఐటీ భువనేశ్వర్, ఒడిశా జీవనోపాధి మిషన్ (ఓఎల్ఎమ్) ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. స్వయం సహాయక బృందాలను సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలుగా (ఎంఎస్ఎమ్ఈ) మార్చే లక్ష్యంతో ఒక వ్యవస్థీకృత ఇంక్యుబేషన్ కార్యక్రమానికి ఇది నాంది పలికింది. ఐఐటీ భువనేశ్వర్ తరపున ప్రొఫెసర్ శ్రీపాద కర్మాళ్కర్, ఒడిశా ప్రభుత్వ ఉప ముఖ్య మంత్రి ప్రభాతి పరిడా మధ్య ఈ అవగాహన ఒప్పందం పత్రాల మార్పిడి జరిగింది. ఈ కార్యక్రమానికి ఒడిశా మిషన్ శక్తి శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి మానసి నింభాల్ మరియు మిషన్ శక్తి డైరెక్టర్ డాక్టర్ మోనికా ప్రియదర్శిని హాజరయ్యారు. ఈ కార్యక్రమం కింద ప్రతి ఇంక్యుబేటీకి ఉద్యమ్ రిజిస్ట్రేషన్, నియంత్రణ సమ్మతి, ఎంటర్ప్రైజ్ సర్టిఫికేషన్లల కోసం పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. విలక్షణమైన ప్రాంతీయ గుర్తింపు, మార్కెట్ గుర్తింపును పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక ఉత్పత్తుల కోసం పేటెంట్లను దాఖలు చేయడానికి, ఉత్పత్తి ధృవీకరణలను సులభతరం చేయడానికి ఐఐటీ భువనేశ్వర్ తన సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్కు ఐఐటీ భువనేశ్వర్లోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిహార్ రంజన్ జెనా మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దుఃఖ బంధు సాహు సారథ్యం వహిస్తారు. కార్యక్రమం రాష్ట్రంలో ఒక పటిష్టమైన వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. స్వయం సహాయక బృదాలకు వారి సంస్థలను విస్తరించి విస్తృత ఆర్థిక వ్యవస్థలో విలీనం చేసేందుకు అవసరమైన సంస్థాగత మద్దతు అందుబాటులోకి వస్తుంది. -
ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
పర్లాకిమిడి: మహేంద్రగిరిలో జరుగుతున్న మేళా సందర్శించి తిరుగు ప్రయాణంలో ఆటో బ్రేకులు ఫెయిలై మడబా సమీపంలో బోల్తాపడిన సంఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలై పర్లాకిమిడి మెడికల్లో చికిత్స పొందుతున్నారు. రాయగడ బ్లాక్ బుర్జంగి నుంచి ఆటోలో మహేంద్రగిరి మేళాకు ఉదయం బయలుదేరిన ఆరుగురు ప్రయాణికులు అక్కడ మేళాను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో గౌతం ఘంట, (తల్లి) అనితా ఘంట తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురికి సాధారణ గాయాలయ్యాయి. తొలుత కోయిపూర్ ఆరోగ్యం కేంద్రంలో ఫస్టు ఎయిడ్ చేసుకుని పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో చేరారు. గాయపడిన వారిలో మిట్టిపాణి, రజితా గంట, అథిక్ కోరోకోరే తదితరులు మెడికల్లో చికిత్స పొందుతున్నారు. సమయానికి అంబులెన్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనంపై పర్లాకిమిడి మెడికల్కు క్షతగాత్రులు చేరుకున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇప్పటికి మహేంద్రం వెళ్లి మూడు ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందారు. -
దీఘా జగన్నాథ ధామ్ పేరు మార్చాలి
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ దీఘా జగన్నాథ ధామ్ పేరులోని ధామ్ అనే పదాన్ని తొలగించాలని కోరుతు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. జగన్నాథ ధామ్ హిందూ మతంలోని నాలుగు ధామాల్లో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీఘా శ్రీ జగన్నాథ ఆలయానికి ప్రత్యామ్నాయ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఈ సందర్భంగా దీఘా జగన్నాథ ధామ్ పేరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైన విషయాన్ని గుర్తు చేశారు. ఘనంగా రోజో క్వీన్–2026 పోటీలు రాయగడ: ఒడిశా సంప్రదాయంలో భాగమైన రోజో పండగ వేడుకల సందర్భంగా నిర్వహించిన రోజో క్వీన్–2026 సీజన్–2 పోటీలు పట్టణంలోని వంశీక్రిష్ణ సమావేశం హాల్లో సోమవారం సాయంత్రం ఆత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 40 మంది బాలబాలికలు, యువతులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వంశీక్రిష్ణ ట్రస్ట్ ఎండీ మధురవాణి, గౌరవఅతిథులుగా జిల్లా సమాచార, పౌరసంబధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ, ఆల్బమ్ హీరోలు ప్రీతమ్ కుమార్ పాణి, ఇసాక్రాజ్లు హాజరయ్యారు. రోజోక్వీన్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా కొనసాగాయి. సబ్ జూనియర్, సీనియర్, విభాగాల్లో రోజోక్వీన్ పోటీలతో పాటు మెహందీ, ముగ్గులు, పొడోపిఠా, నృత్యం, గానం వంటి ఐదు అంశాల్లో ఔత్సాహికులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన మధురవాణి బహుమతులను అందజేశారు. దేబాశిష్ సామంత్రాయ్ నామినేషన్ ఖరారు భువనేశ్వర్: రాజ్యసభ ఉప ఎన్నికకు దేబాశిష్ సామంత్రాయ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు ఖరారయ్యాయి. భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్య సభ అభ్యర్థిగా దేబాశిష్ సామంత్రాయ్ పోటీ చేస్తున్నారు. పరిశీలన అనంతరం ఆయన దాఖలు చేసిన 4 సెట్ల నామినేషన్ దస్తావేజులు ఖరారైనట్లు అధికారికంగా ప్రకటించారు. భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) సమాచారం ప్రకారం రాగల రెండు మూడు రోజుల్లో నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రాష్ట్రం అంతటా రుతు పవనాలకు ముందు వర్షాలు తీవ్రమయ్యే సంకేతాల్ని ఐఎండీ జారీ చేసింది. బంగాళా ఖాతం నుంచి రుతు పవనాల కదలికకు సానుకూల వాతావరణం నెలకొని ఉంది. రుతు పవనాల పురోగతికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. తేమతో కూడిన గాలుల ప్రవాహం కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేమతో కూడిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పలు చోట్ల కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు జరిగే కార్యకలాపాలకు దోహదపడేవిగా వాతావరణ వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. రుతు పవనాలు రాష్ట్రంలో చొరబడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో కాల వైశాఖి అలజడి కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో పగటి పూట వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొని మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణ సరళి మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో గత మూడు నెలలుగా వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు అందడం లేదని కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. ఎన్నికల సమయంలో బీజేపీ తమ ఎన్నికల మ్యానిపెస్టోలో నెలకు రూ.3000 పింఛన్తోపాటు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు ఉచిత విద్యుత్ను అందించలేదన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పింఛన్లు కూడా అందించకపోవడం అన్యాయమన్నారు. 40 డిగ్రీలకు పైగా ఎండలు మండుతున్న పరిస్థితుల్లో కూడా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్రావు ప్రజల పక్షాన నిలబడి జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సభ్యులు పి.కేశురావు, శ్రీనివాస్పాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
కవి శ్రీనివాసరావుకు సన్మానం
జయపురం: గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ చైతన్య సారస్వత్ పరిషత్, శ్రీశ్రీ కళా వేదిక సంయుక్తంగా విజయవాడ వెలుగుబంద సమీపంలో గల గోదావరి గ్లోబల్ వర్సిటీ ప్రాంగణంలో గత శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య మహా సభల్లో జయపురం తెలుగు కవి సింహాద్రి శ్రీనివాసరావు, సుజాత దంపతులను సన్మానించారు. ఒడిశాలో తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణకు శ్రీనివాసరావు అందిస్తున్న సేవలను నిర్వాహకులు కొనియాడారు. వర్సిటీ చాన్స్లర్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్య రాజు), శ్రీశ్రీ కళావేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్, ఏపీ రక్షక విభాగ కమాండెంట్ కొండా నరసింహా రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శ్రీపొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ప్రముఖ తెలుగు సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు శిక్షణ
జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధి జయనగర్ ప్రాంతం పాయిక వీధి సరస్వతీ బాలమందిరం ఉపాధ్యాయులకు పాఠశాల వార్షిక విద్యా ఆధారిక వర్క్షాపును మంగళవారం ప్రారంభించారు. బాల మందిరం అధ్యక్షులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహక కమిటీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ప్రారంభమైన ఈ వర్క్షాపు 10 రోజులు నిర్వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభం కార్యక్రమంలో మానసిక వైద్యుడు ఎన్.సుధాకర్ పాల్గొని విద్యార్థుల మానసిక పరిప్థితిపై వివరించారు. చెప్పటం, వినటం, గుర్తించటంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమలో చిత్ర కళాకారులు నృశింగ షొడంగి, పద్మనాభ చౌదరి చిత్ర కళ, బొమ్మలు వేయటం, కాగితపు బొమ్మలు తయారు చేయటం, చేతి కళా నైపుణ్యాలపై వివరించి, పలు కళాత్మక వస్తువులు చేసి చూపించారు. సంస్థ కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి, ప్రిన్సిపాల్ రీతాలి సాహు, ఆకాశవాణి విశ్రాంత అధికారి ఉదయశంకర్ జానీ, పాఠశాల కమిటీ అధ్యక్షుడు అనూప్ కుమార్ సామంతరాయ్, సి.ఆర్.సిి విజయలక్ష్మీ పాణిగ్రహి, తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్
జయపురం: పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. మంగళవారం బొరిగుమ్మ పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమితి కార్యాలయం ఎదుట భైటాయించారు. పెట్రోలు, డీజల్, వంట గ్యాస్, నిత్యవసర ధరలు తగ్గించాలని, అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రపతి పేరిట వినతిపత్రాన్ని బొరిగుమ్మ బీడీఓకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షన్ ఎవరి దయా కాదని, ప్రజలకు వేసే భిక్షకాదని అన్నారు. ప్రజలు పొందే న్యాయపరమైన హక్కు అన్నారు. అది ఏ రాజకీయ నేత జేబు నుంచి తీసి ఇవ్వటం లేదని, అది ప్రజల డబ్బు అని అన్నారు. వారి డబ్బు వారికి ఇచ్చేందుకు పాలకులకు ఎందుకు కష్టమని దుయ్యబట్టారు. పెన్షన్ కోసం వృద్ధులు సైతం అధికారుల చుట్టూ తిరగడం పాలకులకు సిగ్గుగా లేదా అని నిలదీశారు. గత మూడు నేలలుగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు ఆగిపోవటం వలన ఆర్థికంగా సమస్యలు ఎదుర్కుంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
రూ. 5 లక్షల జరిమానా రాయగడ: ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను బిసంకటక్లో అధికారులు సీజ్ చేయడంతోపాటు ఐదు లక్షల రూపాయల జరీమానా విధించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బిసంకటక్ తహసీల్దార్ కె.వెంకటేశ్వర్రెడ్డి నేతృత్వంలో ఐదుగురు బృందం బిసంకటక్లోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా సోమవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో మూడు ఇసుక ట్రాక్టర్లతో పాటు మరో ఇటుకల ట్రాక్టర్ను అధికారులు గుర్తించి వాటికి సంబంధించి అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు జరీమానా విధించారు. పశువులను తరలిస్తున్న లారీల పట్టివేత సోంపేట: పశువులను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని బారువ ఎస్సై హరిబాబునాయుడు అన్నారు. కొర్లాం జంక్షన్ వద్ద పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు లారీలను పట్టుకున్నట్లు బుధవారం తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. పశువులను పరిమితికి మించి రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వామపక్షాల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
పలాస: పెరిగిన ధరలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని కాశీబుగ్గ పోలీసలు అడ్డుకున్నారు. పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, లిబరేషన్ పార్టీల నాయకులు కాశీబుగ్గ రామాలయం నుంచి కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ రాస్తారోకో నిర్వహించడానికి ప్రయ త్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వామపక్ష పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. రాస్తారోకో చేయకుండా పోలీసులు నాయకులను అక్కడ నుంచి పంపించేశారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కె.మోహనరావు, ఎన్.గణపతి, లండ వెంకటరమణ, టి.సన్యాసిరావు, మద్దిల రామారావు, వంకల మాధవరావు, మద్దిల వినోద్, కె.రమేష్ ఉన్నారు. -
మురుగు కాలువను గుమ్మగెడ్డకు కలపండి
పర్లాకిమిడి: స్థానిక కొత్త బస్టాండు రోడ్డులో ఉన్న నయరా పెట్రోల్ బంకు వద్ద నిర్మాణంలో ఉన్న మురుగునీటి కాలువ రోడ్డుకు మధ్యలో నిర్మించారని, దీనిని తొలిగించి కొంచెం వెనక్కి నిర్మించాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షుడు పైల మురళీకృష్ణ ఇటీవల ఒకరోజు ఆందోళన చేపట్టారు. దీనిపై స్థానికులు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి వినతిత్రం అందజేశారు. దీనిపై రోడ్లు–భవనాల శాఖ ఎస్ఈ అభిషేక్ శెఠితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ డ్రైయిన్ వాటర్ పట్నాయక్ చెరువులోకి వెళ్లకుండా నేరుగా గుమ్మగెడ్డకు కలపాలని రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లకు ఎమ్మెల్యే సూచించారు. దీంతో ఈ నిర్మాణ పనులు తిరిగి సోమవారం నుంచి మొదలయ్యాయి. ఈ డ్రైయిన్ నిర్మాణ వివాదంపై రాజకీయ నాయకుల ప్రామేయం ఉన్నందున పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరుగటం లేదని ఎమ్మెల్యే అన్నారు. -
భార్యకి నివాళులు అర్పించిన మాజీ ఎంపీ
కొరాపుట్: దివంగత భార్యకి మాజీ ఎంపీ నివాళులు అర్పించారు. సోమవారం ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్పూర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి తన దివంగత భార్య తపసి మజ్జికి నివాళులు అర్పించారు. ఆమె 11వ వర్ధంతి సందర్భంగా తన నివాసంలో సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ కుమారుడు, కుమార్తె, సోదరుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ మజ్జి తదితరులు పాల్గొన్నారు. 11 ఏళ్ల క్రితం రమేష్ మంత్రి హోదాలో నియోజకవర్గంలో మారు మూల ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో భువనేశ్వర్లో తపసికి అనారోగ్యం సంభవించింది. ఈ విషయం తెలియక రమేష్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో సిబ్బంది అప్రమత్తమై రమేష్కు సమాచారం ఇచ్చారు. సుదూరంగా ఉన్న రమేష్ రాక ఆలస్యమైంది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ యుద్ద ప్రాతిపదికన ప్రత్యేక విమానంతో తపసిని న్యూఢిల్లి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ తపసి తుది శాస విడిచారు. -
చోరీ కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామం, సింహానగర్లో గత ఏడాది నవంబరు 25న పట్టపగలు రెండుగంటల సమయంలో ఒక ఆటోడ్రైవరు జగన్నాథ ప్రదాన్ ఇంట్లో దొంగతనం చేస్తుండగా నిందితులు ఇద్దరు పట్టుబడ్డారు. సోమవారం జిల్లా కోర్టులో సబ్డివిజనల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ గాయత్రీ మిశ్రా ఇద్దరు నిందితులు సంజయ్ గాంధీ కాలనీకి చెందిన మంగళం చండీ, డోలాట్యాంకు నివాసి ఎన్.నాగరాజులకు ఐ.పి.సి. సెక్షన్ 305, 331 (5) ప్రకారం నిందితులుగా పరిగణింపబడి ఇద్దరికీ వేర్వేరుగా మూడేళ్ల కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఈ కేసును ప్రభుత్వం తరపున ఏపీపీ కాశీనాథ్ దాస్ విచారించగా, సీనియర్ క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్మిశ్రా, ప్రారంభం నుంచి ప్రత్యక్షంగా సహకారం అందజేశారు. కేసులో జడ్జి ఐదుగురు సాక్షులను విచారించారు. ఈకేసు ఆదర్శ పోలీస్స్టేషన్ ఎస్ఐ జగన్నాథ ప్రధాన్ నిందితులను దొంగతనం జరిగిన చోటే పట్టుకోవడం విశేషం. పూరీలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ భువనేశ్వర్: కాల వైశాఖి వైపరీత్యంతో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పయనిస్తున్న హెలికాప్టర్ దారి మళ్లించారు. ముఖ్యమంత్రి మయూర్భంజ్ నుంచి తిరిగి వస్తుండగా వాతావరణం ఆకస్మిక మార్పుతో పూరీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రితో సహా అందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. రాజధాని భువనేశ్వర్లో అకస్మాత్తుగా వాతావరణం క్షీణించడంతో ముఖ్యమంత్రి హెలికాప్టర్ పూరీ సమంగా తాత్కాలిక బస్ స్టాండులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. భువనేశ్వర్ మీదుగా ఆకాశంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు . ఎమర్జెన్సీ కోటాపై కేంద్ర రైల్వే మంత్రికి ఫిర్యాదు రాయగడ: ఎమర్జెన్సీ కోటా కింద రైలు బెర్త్ కేటాయింపు కోసం చేసిన దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘనతోపాటు ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత పరిపాలనా వ్యవహారం జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక సోమవారం ఫిర్యాదు చేశారు. భువనేశ్వర్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాయగడకు తిరిగి రావడానికి ఎమ్మెల్యే జూనాఘడ్ రోడ్డు ఎక్స్ప్రెస్లో ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణానికి సంబంధించి భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ కోటా కింద బెర్త్ కేటాయించాలని సంబంధిత అధికారులకు విధివిధానాల ప్రకారం దరఖాస్తు సమర్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తు సమర్పించిన తరువాత దాని స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు రైల్వే అధికారులను సంప్రదించగా, దరఖాస్తును సరైన విధంగా పరిశీలించకపోవడంతోపాటు ఫోన్లో మాట్లాడిన అధికారులు పరిపాలన మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటన ప్రజాప్రతినిధిగా తనను తీవ్రంగా బాధించడమే కాకుండా ప్రభుత్వ విధానాల అమలుపై ప్రశ్నలు తలెత్తేలా చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రిని ఉద్దేశించి ఎమ్మెల్యే పలు డిమాండ్లు చేశారు. ఎమర్జెన్సీ కోటా దరఖాస్తు పరిశీలనలో ఏవైనా పరిపాలనా లోపాలు, నిర్లక్ష్యం, ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరిగాయా అనే అంశంపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరారు. దరఖాస్తు ప్రొసెసింగ్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బాధ్యతలను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞాప్తి చేశారు. ఫోన్ సంభాషణ సమయంలొ జరిగిన అనుచిత ప్రవర్తనపై కూడా విచారణ జరిపి అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కొరారు. భవిష్యత్లో ప్రజాప్రతినిధులు సమర్పించే దరఖాస్తులను నిబంధనల ప్రకారం, సకాలంలో పరిశీలించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా మెలిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రైల్వే శాఖ తీసుకునే చర్యలను తనకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని న్యాయపరమైన చర్యలు చేపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
పర్లాకిమిడి రథయాత్రకు రఽథాల తయారీ
పర్లాకిమిడి: జగన్నాథ రథయాత్ర సమీపిస్తున్నందున పర్లాకిమిడిలో రథాల తయారీకి శిల్పులు రథచక్రాలు, ఇరుసులు మరమ్మతులు జరుపుతున్నారు. పూరీ రథయాత్ర తర్వాత అత్యంత ఆడంబరంగా జరుగుతున్న పర్లాకిమిడి జగన్నాథ రథయాత్రకు బలభధ్ర, జగన్నాథ, సుభద్ర రథాలను తయారుచేసి మూడు మూర్తులను యాత్రకు వినియోగిస్తారు. మూడు రథాలు తయారుచేయడానికి కనీసం నెలరోజులు పడుతుందని శిల్పి అశోక్ మహారాణా తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఆషాఢ మాసం అధికమాసం కావడం వల్ల జూలై 16 న జగన్నాథ రథయాత్ర ఒడిషాలో జరగనుంది. పర్లాకిమిడి రాజవీధిలో రథాల తయారీకి ఇరుసులు రథాల కలపను బయటకు తీసిన శిల్పులు -
కోరుకొండ గ్రీవెన్స్లో 72 వినతులు స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితిలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. సమితి పరిసర పంచాయతీల ప్రజల నుంచి మొత్తం 72 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో కొన్ని వినతులను పరిశీలించిన కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినతుల్లో భూవివాదాలు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటెల్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరధి సరాబు, కోరుకొండ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. గుణుపూర్లో 20 వినతులు.. రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి అధ్యక్షతన జిల్లాలోని గుణుపూర్లో వినతుల స్వీకరణ కార్యక్రమం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్లో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 20 వినతులను కలెక్టర్ స్వీకరించారు. వీటిలో ఐదు వినతులు వ్యక్తిగతమైనవిగా మిగతా 15 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. వినతుల్లో భాగంగా ఒకరికి రెడ్ క్రాస్ నిధుల నుంచి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గ్రామ సమస్యలు పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, గుణుపూర్ ఐటీడీఏ అధికారి అజయ్ కుమార్ ప్రధాన్, తహసీల్దార్ లీలావతి ఆచార్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ పాల్గొన్నారు. -
భక్తజన సిరి
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026మహేంద్ర గిరి..పర్లాకిమిడి: పవిత్ర పుణ్యక్షేత్రం మహేంద్రగిరి పీఠంలో గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న మహేంద్రమేళాలో రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటి సోమవారం సతీసమేతంగా పాల్గొన్నారు. ఉదయం 9 గటలకు వచ్చిన గవర్నర్ మహా యజ్ఞంలో పాల్గొని ప్రధాన యజ్ఞకుండంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుంతీ మందిరం, గోకర్ణేశ్వర పీఠాన్ని దర్శించి పండితులు, వివిధ పీఠాధిపతుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆయన మహేంద్రంలో ధార్మిక సభల్లో పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సాధు సంతవులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంజాం జిల్లాకు చెందిన ప్రసిధ్ధ దోండ నృత్యం, మహేంద్రగిరి చరిత్రపై రుచించిన ‘ఋషిపుత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ బ్యాటరీ వాహనంలో మహేంద్రగిరిలో వివిధ యజ్ఞ వేదికలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి, రాష్ట్ర రవాణా, గనుల శాఖామంత్రి బిభూతీ భూషణ్ జెన్నా, జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, డి.ఎఫ్.ఓ. కె.నాగరాజు, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. గవర్నరు హారిబాబు, రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి మహేంద్రం నుండి నేరుగా మోహానా దగ్గరలో జిరంగో వద్ద ఉన్న టిబెటియన్ బౌద్ధ మందిరాన్ని సందర్శించారు. గవర్నర్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మరో వైపు మహేంద్రమేళాకు 50వేల మంది భక్తులు సోమవారం తరలి రావడంతో బుర్ఖాత్పాస్ నుంచి మహేంద్రం కొండ మీద వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండ మార్గాల గుండా నడుచుకుంటూ మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకుని పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ భారీగా ఉన్నా మేళా ప్రాంగణంలో ప్రశాంతమైన, క్రమబద్ధమైన వాతావరణం కనబడింది. అందరిలో మహేంద్రంలో జరుగుతున్న యజ్ఞాలు, పూజలు చూడటానికి ఉత్సుకత కనిపించారు. -
చిత్రకొండ సమితిలో ట్రెక్కింగ్ మార్గం ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితిలోని జలాశయం సమీపం నుంచి దోరఘట్ గ్రామం వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వవింద్ రాజశిర్కే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులకు ఏంతో ఆనందాన్ని ఇస్తుంటాయన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా అందరి లక్ష్యం కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతకు కృషి చేస్తామన్నారు. ఈకో టూరిజం కోసం ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటెల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖా సిబ్బంది -
పేపర్ మిల్లు తీరుపై అసంతృప్తి
రాయగడ: జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మక, పురాతనమైన జేకేపూర్లో గల జేకేపేపర్ మిల్ సంస్థ గ్రామాల అభివృద్ధి కోసం చేసుకున్న అవగాహన ఒప్పందం నిబంధనలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తు బొడొచందిలి, సనొ చందిలి గ్రామాల ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఏడీఎం నవీన్ చంద్ర నాయక్ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. జేకేపేపర్ మిల్ స్థాపన కోసం తమ సాగుభూములను అప్పట్లో కంపెనీకి ఇచ్చామని, గ్రామాల సమగ్ర అభివృద్ధి, ఉపాధి ,విద్య, వైద్యం, తాగునీరు. పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందన్నారు. అయితే ఏళ్లు గడిచినా ఆ హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. గ్రామ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, స్థాఽనికుల కంటే బయట ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇస్తొందని పేర్కొన్నారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య కోసం ఆర్థిక సాయం, వైద్య శిబిరాలు, ఆంబులెన్స్ సౌకర్యం, స్వయం సంఘాలకు మద్దతు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి హామీలు అమలు కాలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా పేపర్ మిల్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో సమీప నదులు కలుషితమై సాగునీటి కొరత ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపించారు. కాలుష్యం కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. -
పికప్ వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి
పర్లాకిమిడి: మహేంద్రగిరిలో మేళాను సందర్శించి తిరిగి వస్తున్న యాత్రికుల పికప్ వ్యాను ఆదివారం రాత్రి గంజాం జిల్లా చికిటి నియోజకవర్గం పాత్రపురం బ్లాక్ ఓండోఓండా గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో 30 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. గంజాం జిల్లా పాత్రపురం బ్లాక్ జోరడా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఆదివారం గజపతి జిల్లా కోయిపూర్ పంచాయతీ మహేంద్రగిరిపై జరుగుతున్న మహేంద్రమేళాకు పాత్రపురం బ్లాక్ ఓండోఓండా నుంచి కొందరు వచ్చారు. తిరిగి వెళ్తుండగా గ్రామం సమీపంలో గత రాత్రి పద కొండు గంటల సమయంలో పికప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో మహిళ పాత్రపురం మెడికల్లో మరణించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ప్రతాప్ శెట్టి, లక్ష్మీ గౌడో, రేణు గౌడో, కలియా బెహారా, శిబరాం పాణిగ్రాహి, లక్ష్మీకాంత సాహు, సుభాషినీ బెహరా తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలంలో లభించిన సమాచారం మేరకు గంజాం జిల్లా నువాసాహి నుంచి 31 మందికి పైగా ఒక పికప్ వ్యాన్ భక్తులు మహేంద్రగిరికి వెళ్లారు. మహేంద్రంలో దర్శనాలు పూర్తిచేసుకుని ఆదివారం రాత్రి తిరిగి పికప్ వ్యాన్లో వస్తుండగా ఓండోఒండా గ్రామం సమీపంలో మహేంద్రగిరి రోడ్డులో పికప్ వ్యాను బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు క్షతగాత్రులను రక్షించి పాత్రపురం ప్రభుత్వ మెడికల్ సెంటర్కు తరలించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత జోరడా పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మున్సిపల్ కాంట్రాక్టర్ల నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్ : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించడంలో కమిషనర్ కూర్మారావు తీవ్ర జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ఈ మేరకు జిల్లాపరిషత్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల విభాగంలో సబ్కా, మున్సిపల్ కాంట్రాక్టులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఈఎండీలు, ఎఫ్ఎస్డీ డిపాజిట్లు సైతం ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. అత్యవసర సమయాల్లో సైతం పనులు చేయాలని పిలుపునిస్తే వాటికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తగదన్నారు. కమిషనర్ తీరు మారకుంటే వచ్చే సోమవారం నుంచి నిరవధిక సమ్మె తప్పదన్నారు. కలెక్టర్ని కలిసినవారిలో బాడాన హరికృష్ణ, చల్ల సింహాచలం, జి.సుదర్శనరావు, ఆర్.కామేశ్వరరావు, పి.మహేష్, కె.మోహనరావు, ఎ.వీరభద్రరావు, ఆర్.సూర్యదీప్, తిరుమలరావు, బాలకృష్ణ, కూర్మారావు, తంగి భాస్కరరావు, వై.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో ఓటు బ్యాంకు రాజకీయాలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను విధ్వంసం చేస్తూ, విద్యార్థులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుని వదిలేశారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం మండిపడ్డారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కావాల్సిన వనరులు ఏర్పాటు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ విద్యార్థులను శాసీ్త్రయ విజ్ఞానానికి దూరం చేస్తున్నారని మండిపడ్డాన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలోని దాసరి క్రాంతిభన్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య కుటుంబాలపై ఫీజుల భారం అధికమవుతోందన్నారు. విద్యార్థులు నిలువునా మోసం చేస్తూ పరీక్ష పత్రాలను కూడా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ అన్న విజన్ చంద్రబాబు పథకాలు ఎక్కడా విద్యార్థులకు అందడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలను బద్దలు కొడుతూ విద్యావ్యవస్థపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ సమరశీల పోరాటాలకు సమాయత్తమవుతుందన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్, రవి, జిల్లా ఉపాధ్యక్షులు సాయి, కార్తీక్, కౌశిక్ జిల్లా సహాయ కార్యదర్శులు వేణు, జయ, ప్రశాంత్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తడబడితే తప్పదు మూల్యం!
పాతపట్నం: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు మంచి విద్యాలయాల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పుట్టగొడుగుల్లా నూతన శాఖలను ప్రారంభించేందుకు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. భారీస్ధాయిలో ప్రచారాలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా సంస్థలపై విద్యాశాఖ నియంత్రణ కొరవడటంతో అనుమతులున్న పాఠశాలలను గుర్తించడంలో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి పొందాలి. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. అవగాహన ఉంటేనే.. గతంలో మెళియాపుట్టి మండల కేంద్రంలో ఓ పాఠశాలలో తమకు అన్ని అనుమతులు ఉన్నాయని ప్రచారం చేసుకోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ఆ విద్యా సంస్థలో చేర్చారు. ఫీజులు చెల్లించి, పుస్తకాలు సైతం తీసుకున్న తర్వాత రెండు నెలలు నడిపించారు. విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్, కేంద్ర విద్యామండలి నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో జిల్లా విద్యాశాఖ ఆ సంస్థను మూసివేసింది. దీంతో మరో పాఠశాలలో విద్యార్థులను విలీనం చేస్తుండటంతో నిర్వాహకులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఆరా తీయండి ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొందాలి. చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్డ్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు పిల్లల ను చేర్పించాలి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు కచ్చితంగా అవగాహ న కలిగి ఉండాలి. ప్రతి విద్యా సంవత్సరానికి అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేటు పాఠశాలలు ప్రతి సంవత్సరం విద్యాశాఖ, కమిషనర్ అనుమతులు పొందాలి. ఆయా పాఠశాలలు తప్పనిసరిగా రెవెన్యూవల్ చేసుకోవాలి. – సీహెచ్ తిరుమలరావు, ఎంఈవో–2, పాతపట్నం తొలుత పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత సర్టిఫికెట్ను పరిశీలించాలి. మౌలిక వసతులు చూసుకోవాలి. మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. క్రీడా ప్రాంగణం, ఫిజికల్ ట్రైనర్ వివరాలు తెలుసుకోవాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాలలైతే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి. సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణా శాఖ సామర్థ్య పరీక్ష పత్రం ఉందో లేదో తెలుసుకోవాలి. సుశిక్షితుడైన డ్రైవర్ తప్పనిసరి. జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, స్థాయి దాటితే మంటలు ఆర్పే పూర్తిస్థాయి ఏర్పాట్లు ఉండాలి. ప్రభుత్వం అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యల ఏర్పతాయి. ఆకట్టుకునే ప్రచారాలతో మోసపోవద్దు పాఠశాలల పూర్తి సమాచారం తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి -
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయం
జయపురం: కొరాపుట్ జిల్లాల్లోని 12 గోదావరిష్ మిశ్రా ఆదర్శ పాఠశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి మోహన్ చంద్ర మఝి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితిలో బి.జానిగుడ ప్రభుత్వ నోడల్ ఉన్నత పాఠశాల, బి.సింగపూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నారిగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గోదావరిష్ ఆదర్శ ఉన్నత పాఠశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. బొరిగుమ్మ సమితిలో జరిగిన గోదావరిష్ ఆదర్శ పాఠశాలల శంకుస్థానలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆదర్శ పాఠశాలకు చిన్నారితో ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీిపతి శంకుస్థాపన చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యారంగంలో వెనుకబడిన ఈ ప్రాంతంలో విద్యా ప్రగతికి, విద్యార్థుల ఉజ్వల భవితకు ఆదర్శ పాఠశాలలు ఎంతో అవసరమన్నారు. గుణాత్మకమైన, విలువతో కూడిన విద్య అందించే దిశగా గోదావరిష్ ఆదర్శ పాఠశాలలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా పరిషత్ నృశింహనాథ్ శతపతి, కార్యక్రమం నిర్వాహకులు అదనపు బ్లాక్ విద్యాధికారి అర్పిత ప్రధాన్, సర్పంచ్ టంకుదొర నాయక్, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు డానియల్ కులదీప్, పాఠశాల హెచ్ఎం జితేంద్ర ఖొడ పాల్గొన్నారు. -
పనుల నాణ్యతపై లోకాయుక్త విచారణ
జలుమూరు: శ్రీముఖలింగం కరకట్టపై సుమారు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర పనులపై లోకాయుక్త సోమవారం విచారణ చేపట్టింది. గ్రామానికి చెందిన అర్చకుడు, సామాజిక కార్యకర్త నాయుడు గారి రాజశేఖర్ ఈ ఏడాది జనవరిలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ పనులపై అధికారులు ఎంక్వయిరీ చేసిన నివేదికలో కూటమి నాయకులకు అనుకూలంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గోవిందరావులు తుది విచారణ చేశారు. కరక ట్ట నిబంధనలకు విరుద్ధగా తవ్వకాలు, సీసీరోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, రోడ్డు మద్యలో విద్యుత్ స్తంభాలు పెట్టడం తదితర అంశా లు నమోదు చేశారు. ఇంతలో మాజీ సర్పంచ్ తది తరులు రాజశేఖర్తో వాగ్వాదానికి దిగగా వారిని మందలించారు. పూర్తి స్థాయి విచారణకు అన్ని డాక్యుమెంట్లతో కర్నూలు రావాలని ఆదేశించినట్లు రాజశేఖర్ తెలిపారు. -
బ్యారేజీలో మునిగి యువకుడు మృతి
మల్కన్గిరి: బ్యారేజీలో స్నానానికి దిగిన యువకుడు నీటిమునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్గిరి జిలా కోరుకొండ సమితి సోమనాథ్పూర్ పంచాయతీ పరిధిలోని ఎం.వి.36 గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన అనూప్ ధర్ (18) స్థానికంగా ఉన్న బ్యారేజ్ వద్ద జరిగిన విందుకు స్థానికులతో కలిసి హాజరయ్యాడు. అనంతరం స్నానం కోసం బ్యారేజీలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. అయితే స్నానం కోసం దిగిన అనూప్ ధర్ ఎప్పటికీ బయటకు రాకపోవడంతో అతనితో వెళ్లిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బలిమెల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ దీరాన్ పట్నాయక్ అదేశాలతో ఎస్సై సంజిత్ కుమార్ టక్రితో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బ్యారేజీలో గాలించగా రాళ్ల మధ్యలో అనూప్ ధర్ ఇరుక్కుపోయి చనిపోయి ఉండానికి గుర్తించి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం కోసం మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణ తగదు
శ్రీకాకుళం అర్బన్: తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయ త్నించడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించేదుకే విమాన రాకపోకలు తగ్గించేశారని తెలిపారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాను కష్టపడి తీసుకువచ్చానని, అప్పట్లో ఒకాయన తన దగ్గరకు వచ్చి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం చేసుకుంటానని తనతో చర్చిస్తే తాను ఒప్పుకోలేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధంతా కేవలం టీవీ చానెళ్లు, న్యూస్ చానెళ్లలో మాత్రమే తప్ప మరెక్కడా లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి నరసింహమూర్తి, షణ్ముఖరావు, మామిడి సత్యన్నారాయణ పాల్గొన్నారు. అట్టహాసంగా క్రీడాపోటీలు ఆరంభం టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకల సందర్భంగా కాలేజీ మైదానంలో సోమవారం అంతర్ కళాశాలల క్రీడాపోటీలు అట్టహాసంగా ఆరంభమయ్యా యి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు, విద్యార్థులకు నిర్వహిస్తు న్న ఈ పోటీలను కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధి కారి టి.నాగరాజు తదితరులు ప్రారంభించా రు. మొదటి రోజు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరం ఎంవీజీఆర్ కళాశాల జట్లు తలపడ్డాయి. ఇందులో ఆదిత్య కళాశాల విజయం కై వసం చేసుకుంది. కార్యక్రమంలో డైరెక్టర్ టి.నాగశేషు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, క్రీడా సమన్వయకర్త డి.శ్రీరాములు, సీఎఔన్ఎఎన్.రాజు, పీడీలు ఎస్.లక్ష్మణమూర్తి, టి.మురళీమోహన్, జె.తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రిమాండ్ ఖైదీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇచ్ఛాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదారిపురం గ్రామానికి చెందిన రిమాండ్ ఖైదీ భుక్త బలరామ్ (27) కస్టోడియల్ మరణంపై ఈ నెల 11న మెజిస్టీరియల్ విచారణ జరగనుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను విచారణ అధికారిగా నియమించారు. సదరు ఖైదీని క్రైమ్ నెం.31/2026 కేసులో ఇచ్ఛాపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల ప్రకారం గత ఏప్రిల్ 8న రిమాండ్కు తరలించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ఘటనపై అవగాహన, సమాచారం, ఎలాంటి ఆధారాలైనా ఉన్న బంధువులు, ప్రజలు ఈ నెల 11న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు శ్రీకాకుళం ఆర్డీవో కోర్టులో హాజరై సాక్ష్యం చెప్పవచ్చని విచారణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నేరుగా రాలేని వారు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ ఈ నెల 16లోపు ఆర్డీవో కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు సోంపేట: బారువ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బి.మంగరాజు తెలిపారు. ఏడో తరగతి చదువుతున్న బాలికను ఈ నెల 2న యువకుడు బైక్పై బయటకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటి వద్ద లేకపోవడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు బారువ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. సిక్కోలు కవులకు సత్కారాలు శ్రీకాకుళం కల్చరల్: రాజమండ్రి వేదికగా శ్రీశ్రీ కళావేదిక, జనచైతన్య సాహిత్య పరిషత్ నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో సిక్కోలుకు చెందిన పలువురు కవులను ఘనంగా సత్కరించారు. కవి సమ్మేళనంలో శ్రీకాకుళం అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, కన్వీనర్ భోగిల ఉమామహేశ్వరరావు, ఐఎన్డీ ప్రసాదరావు, కిల్లాన శ్రీనివాసరావు, ఇద్ది పాపయ్య, ఎంటీవీ ఆర్.మూర్తి, తేజ లక్ష్మి, రుష్యశృంగుని ఢిల్లీశ్వరరావు, ముట్నూరు ఉపేంద్రశర్మ తదితరులు తమ కవితా గానాన్ని వినిపించారు. వీరిని శ్రీశ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ ప్రణాళిక అధికారి పార్థసారథి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్, గ్లోబల్ యూనివర్సిటీ అధినేత చైతన్య రాజులు సత్కరించారు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 168 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ (పి.జి.ఆర్.ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి 168 వినతులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 69 అర్జీలు స్వీకరించారు. పంచాయతీరాజ్ శాఖకు 18, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు 14, సెర్ప్ విభాగానికి 13, విద్యుత్ శాఖకు 10 అర్జీలు అందాయి. వినతులన్నింటినీ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని రెగ్యులర్ ప్రాతిపదికన ప్రభుత్వం భర్తీ చేయాలని కోరుతూ వెటర్నరీ వైద్యులు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ వెటర్నరీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ అసోషియేషన్ ప్రతినిధులు డాక్టర్ మురళీ, డాక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
గెడ్డలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
సంతబొమ్మాళి: నౌపడ పంచాయతీ సీతానగరం ముసళ్లఖానా గెడ్డలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. ఎండ తీవ్రతకు రాత్రి పూట గెడ్డలో స్నానానికి దిగి చనిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఉదయం నీటిపై మృతదేహం తేలి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీఆర్వో జోగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నౌపడ ఎస్సై జి.నారాయణస్వామి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహం -
సంతోష్ నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: పలాసకు చెందిన బోయిన సంతోష్కుమార్ (43) శ్రీకాకుళం రిమ్స్లో మర ణించగా ఆయన నేత్రాల ను కుటుంబ సభ్యులు దా నం చేశారు. ముందుగా పలాస శ్రీ సత్యసాయి సేవ సమితి ప్రతినిధి శ్రీనివాసరావు శ్రీకాకుళంలోని కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రా న్ని సంప్రదించారు. రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు సూచనతో టెక్నీషియన్లు కార్నియా సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్కు తరలించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికారు్డ్స్లో చిరంజీవి ఆమదాలవలస: పట్టణంలోని మెట్టక్కివలసలో కుప్పిలివారి వీధికి చెందిన రీసు చిరంజీవి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్ట్స్లో చోటుదక్కించుకున్నాడు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహించిన దండి మార్చ్ 2.0 కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్పై అవగాహన కల్పించడంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డు లభించింది. విజయవాడలోని కేబీఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నట్లు చిరంజీవి సోమవారం పేర్కొన్నారు. వీఆర్ఓపై దాడి అమానుషం శ్రీకాకుళం పాతబస్టాండ్: విధి నిర్వహణలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారిపై దాడి అమానుషమని ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం శాఖ, శ్రీకాకుళం జిల్లా శాఖతో పాటు అనుబంధ సంఘాల సభ్యులు ఖండించారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామ రెవెన్యూ అధికారి పి.రవికుమార్ సచివాలయంలో విధి నిర్వహణలో ఉండగా కొత్తకోట విష్ణు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డం అసాంఘిక చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ మేరకు జిల్లా చైర్మన్, ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.వి.వి.ఎన్.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.రమణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కె.ప్రవల్లిక ప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ ప్రకటన విడుదల చేశారు. ‘పుస్తకాల బాధ్యత ఎంఈఓలదే’ శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేయాల్సిన పాఠ్య పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు మండల కేంద్రం నుంచి పాఠశాలలకు తరలించే బాధ్యత ఎంఈఓలదేనని, కానీ కొన్ని మండలాల్లో హెచ్ఎంలను ఇబ్బందులకు గురి చేస్తుండటం తగదని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. ఈ విషయమై ఇప్పటికే డీఈఓతో మాట్లా డామని, అవసరమైతే రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. -
● మీకోసం సైకిల్పై..!
పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణలో భాగంగా సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని, ప్రతి సోమవారం ‘మీకోసం’ గ్రీవెన్స్డే రోజున జిల్లా అధికారులు అందరూ సైకిళ్లపై రావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సైకిళ్లు తొక్కుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. సైకిళ్లు అందుబాటులో లేని వారు, సైకిల్ తొక్కడంలో ఇబ్బందులు ఉన్నవారు కనీసం ఈ–బైక్లనైనా వినియోగించాలని సూచించారు. – శ్రీకాకుళం పాతబస్టాండ్ -
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు, విద్యార్థులకు నష్టదాయకమైన కేంద్రీకత వంటశాలలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని, వంట కార్మికుల వేతనాలు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా బడి పిల్లల మెనూ చార్జీలు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యా హ్న భోజన పథకం వంట కార్మికుల యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వంట కార్మికుల యూనియన్, సీఐటీయే ఆధ్వర్యంలో సోమవా రం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పథకం నిర్వహణను స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రయివేట్ సంస్థలకు ఇవ్వాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవా లని డిమాండ్ చేశారు. ఇప్పటికే గార, శ్రీకాకుళం, ఆమదాలవలస మండలాల్లో వేడి ఆహారాన్ని అందించడంలో విఫలమయ్యారని చెప్పారు. తాజాగా జిల్లాలో 20 మండలాల్లో స్మార్ట్కిచెన్లు పెట్టాలని భూ సమీకరణ చేసే ప్రయత్నం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి. ప్రవీణ, వి.లక్ష్మీ, కౌసల్య, ఉమ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
లారీ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
నరసన్నపేట: మడపాం టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఉదయం 10.30 సమయంలో లారీ వెళ్తుండగా టైర్ కిందకు కావాలని ఓ వ్యక్తి పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు నరసన్నపేట పోలీసులు అనుమానిస్తున్నారు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలను నరసన్నపేట ఎస్సై బలివాడ గణేష్ పరిశీలించారు. నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి పక్క నుంచి వస్తున్న లారీ కిందకు ఒక్క సారి దూకినట్లు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియలేదు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, గుండు గీసుకొని ఉన్నాడని, తెలుపు ఫ్యాంట్, నీలం చెక్స్ షర్ట్ వేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వివరాలు తెలిస్తే పోలీసు స్టేషన్లో సంప్రదించవచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ‘స్పాట్’ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సస్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ ఆదివారం మొదలైంది. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల క్యాంపస్లో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రం వేదికగా స్పాట్ ఆరంభమైంది. రెండు విడతల్లో జరుగుతున్న ఈ మూల్యాంకనంలో మొదటి స్పెల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, హిస్టరీ, బోటనీ, జువాలనీ, ఫిజిక్స్ తదితర పేపర్ల జవాబుపత్రాలను దిద్దుతున్నారు ఉదయం ఆయా సబ్జెక్టుల్లో సీఈలు, ఏఈలతో కూడిన బోర్డులను ఏర్పాటుచేశారు. అనంతరం సీఈలు, ఏఈలకు ఇంటర్బోర్డు జిల్లా అధికారులు పలు సూచనలు చేశారు. ఏమరపాటు వద్దు.. ఆర్ఐఓ/క్యాంప్ ఆఫీసర్ ఎం.కృష్ణవేణి నేతృత్వంలో జనరల్–1 జి.వెంకటేశ్వరరావు, జనరల్–2 సత్యన్నారాయణ, సీనియర్ ప్రిన్సిపాల్ బి.శ్యామ్సుందర్ తదితరులు మాట్లాడుతూ దిద్దుబాటు ప్రక్రియలో ఏమరుపాటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు సైతం పరీక్షలు రాసిన విషయాన్ని గుర్తుంచుకుని దిద్దుబాటు చేపట్టాలన్నారు. సమయపాలన పాటించాలని, మండే ఎండల నేపథ్యంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కాగా, జిల్లాకు 55వేల జవాబుపత్రాలు చేరుకున్న విషయం తెలిసిందే. -
లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలి
నరసన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నరసన్నపేటలోని విజయదుర్గా లారీ ఓనర్స్ అసోషియేషన్ కార్యాలయంలో న్యూ ఆంధ్రా లారీ, ట్రక్కర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేషగిరిరావు, జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బి.జనార్దనరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. విపరీతంగా పన్నులు వేస్తున్నారని, స్పీడ్ లిమిట్ పేరిట జరిమానాలు విధిస్తున్నారని, జరిమానా ఏ రాష్ట్రంలో పడితే అక్కడి కోర్టుకే వెళ్లి కట్టాలని అంటున్నారని, వీటితో పాటు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లారీ ఓనర్స్ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నరసన్నపేట లారీ ఓనర్స్, ట్రక్ సంఘం ప్రతినిధులు రావాడ భాస్కరరావు, ఊణ్ణ శ్రీధర్, పంచిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. -
తారాభట్టా ప్రాంత రైతుల రాస్తారోఖో
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి తారాభట్టాలో ధాన్యం మండీ ప్రారంభించనందుకు నిరసనగా తారాభట్టా మండీ ప్రాంత రైతులు ఆదివారం రాస్తారోఖో నిర్వహించారు. విషయం తెలిసిన అధికారులు, మిల్లు యజమానులు వచ్చి త్వరలోనే మండీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వటంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ప్రభుత్వ అధికారుల నిర్ణయం ప్రకారం ఈ నెల 3 వ తేదీన రబీ ధాన్యం కొనేందుకు మండీలు ప్రారంభించాలి. అయితే ఇంతవరకు తమ ప్రాంతంలో మండీలు ప్రారంభించలేదని తారాభట్టా మండీ ప్రాంత రైతులు ఆరోపించారు. మండీలో ధాన్యం అమ్మేందుకు గత నెల 28 వ తేదీనే తమకు టోకెన్లు ఇచ్చారని రైతులు వెల్లడించారు. అందుచేత తాము మండీకి ధాన్యం తెచ్చామని నేడు వందల బస్తాల ధాన్యం మండీలో పడి ఉన్నాయని వెల్లడించారు. తమకు ఇచ్చిన టోకెన్ గడువు ముగిస్తే ధాన్యం కొనుగోలు చేయరని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండీ తెరని అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా నేడు మండీ పరిది రైతులు బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ పోలీసు స్టేషన్ సమీపంతో రాస్తారోఖో ఆందోళన చేపట్టినట్లు రైతులు వెల్లడించారు. తమ ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించమని రైతులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్స్ మోనిక రాయ్, సివిల్ సప్లై అధకారి మానస రంజన్ మహాపాత్రో, బొరిగుమ్మ తహసీల్దార్ శోబన్ కుమార్ బెహర, బీడీఓ సుకాంత కుమార్ పట్నాయిక్, కమతా లేంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ మానసీ హొత తదితరులు వచ్చి ఆందోళన జరుపుతున్న రైతులతో కలిసి చర్చించారు. మండీలో ధాన్యం అమ్మేందుకు టోకెన్ కలిగి ఉండి సకాలంలో మండీ ప్రారంభించక పోవటం వల్ల తామ ధాన్యం అమ్ముకోలేక పోతున్నామని రైతులు అధికారుల మందు ఆవేదన వ్యక్తం చేశారు. మండీ త్వరలోనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు, మిల్లర్లు హామీ ఇచ్చిన తర్వాత రైతులు ఆందోళన విరమించారు. -
రాయగడలో బైక్ ర్యాలీ
రాయగడ: పట్టణంలో ఆదివారం నాడు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. సర్–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా, సమగ్రంగా అమలు చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. బూత్ లెవెల్ అధికారులు(బిఎల్ఒ) ఇంటింటా సర్వే సమయంలో ప్రజలు సహకరించాలని, తమతో పాటు అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాతో సక్రమంగా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. అలాగే ఓటర్లు వెబ్ సైట్తో పాటు ఓటరు హెల్ప్లైన్, యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ర్యాలీలో నినాదాలు చేశారు. ర్యాలీలొ బీడీఓ సుజిత్ కుమార్ మిశ్రా, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి మానూయోలా ప్రియదర్శిని, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, జిల్లా సహాయ ఎన్నికల అధికారి బిచిత్ర సేఠి, డిప్యూటీ కలక్టర్లు సిద్దార్ధ ఆనంద్ పండ, రుపాలి పాత్ర తదితరులు పాల్గొన్నారు. -
పొల్యూషన్కు.. ఓ సొల్యూషన్
● సీఏఏక్యూఎంఎస్తో ఉపయోగాలెన్నో ● గాలి కాలుష్యాన్ని ఆపకుంటే భవిష్యత్ అంధకారమే పర్యావరణాన్ని కాపాడుకోవాలి.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఎక్కువగా మొక్కలు నాటాలి. అనవసరంగా వాహనాలు వాడాలి. సీఏఏక్యూఎంఎస్ ద్వారా కాలుష్య శాతం తెలుసుకోవచ్చు. ఇది అందించే సమాచారం కేవలం సంఖ్యలు మాత్రమే కాదు.. అది మన పరిశ్రమలు, మన నదులు, మన అడవులు చివరికి మన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సంకేతంగా ఉంటుంది. – కరుణశ్రీ, పర్యావరణ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, శ్రీకాకుళం. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అందరిదీ. జిల్లా కేంద్రంలో కాలుష్యాన్ని కొలిచేందుకు కంటిన్యూస్ ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ను మున్సిపల్ కార్యాలయం పరిధిలో ఏర్పాటుచేశారు. గాలి కాలుష్యం శాతాన్ని యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఓ కమిటీ సైతం ఉంది. చైర్మన్గా కలెక్టర్ ఉంటారు వీరితో పాటు ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, పీసీబీ అధికారులు, రవాణా శాఖల సమన్వయంతో ఓ కమిటీగా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఏఏక్యూఎంఎస్ సెంటర్సీఏఏక్యూఎంఎస్ అంటే.. కంటిన్యూస్ ఆంబియంట్ ఎయిర్క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ అంటే నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రం. మనం పీల్చే గాలి నాణ్యతను నిరంతరం కొలిచి, ఆ సమాచారాన్ని నేరుగా ఏపీ పీసీబీ, సీపీసీబీ సర్వర్లకు తక్షణమే పంపిస్తుంది. ఈ కేంద్రం మన చుట్టూ ఉన్న పర్యావరణ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. రాత్రింబవళ్లు కాలుష్య స్థాయిలను నిరంతరం కొలుస్తుంది. కాలుష్య ధోరణులను గుర్తించి, అది ఎక్కడి నుంచి వస్తుందో విశ్లేషిస్తుంది. ప్రజలకు తక్షణ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) సమాచారాన్ని అందిస్తుంది. కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను పరిశ్రమలు, ఇతర కాలుష్య వనరులు పాటిస్తున్నాయో లేదో పరిశీలిస్తుంది. ముఖ్య భాగాలు.. అనలైజర్ గది: ప్రతి కాలుష్యకాన్ని కొలిచే అత్యాధునిక పరికరాలు ఇందులో ఉంటాయి. కచ్చితత్వం కోసం వాటిని క్రమం తప్పకుండా కేలిబ్రేట్ చేస్తారు. వాయు నమూనా సేకరణ వ్యవస్థ : పరిసర గాలిని నిరంతరం లోపలికి తీసుకుని విశ్లేషక పరికరాల ద్వారా పంపుతుంది. నమూనా ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. వాతావరణ సెన్సార్ వ్యవస్థ : గాలి, ఉష్ణోగ్రత, తదితర సెన్సార్లు అమర్చిన ఎత్తయిన స్తంభం. అన్ని కేంద్రాల మధ్య సరితూగే విధంగా ప్రామాణిత ఎత్తులో ఏర్పాటు చేస్తారు. డేటా అక్విజిషన్ సిస్టమ్ : ప్రతి నిమిషం అన్ని రీడింగులను సేకరించి స్వయం చాలకంగా నమోదు చేస్తుంది. మానవ జోక్యం అవసరం లేదు. ఏపీ పీసీబీ, సీపీసీబీ ఆన్లైన్ అనుసంధానం : సేకరించిన సమాచారం తక్షణమే రాష్ట్ర, కేంద్ర సర్వర్లకు పంపుతారు. ఈ సమాచారాన్ని సీపీసీబీ వెబ్సైట్, గాలి నాణ్యత యాప్లలో ఎవరైనా చూడవచ్చు. పాయింట్లు ఎలా నిర్ధారించాలి.. వాయు నాణ్యత సూచిక 50 పాయింట్స్ వస్తే అది స్వచ్ఛమైన గాలి నాణ్యతకు సూచిక. 400 పాయింట్స్ వస్తే అది తీవ్రమైన హెచ్చరిక. 0 – 50 మంచి గాలి, 51 నుంచి 100 సంతృప్తికరమైంది. 101 నుంచి 200 మోస్తరు ఆస్తమా, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు, పిల్లలు, వృద్ధులకు ఇబ్బందిగా ఉంటుంది. 201 – 300 అధ్వానం. ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే శ్వాసలో ఇబ్బందులు తప్పవు. 301 – 400 అత్యంత అధ్వానంగా ఉంటుంది. ఎక్కువకాలం ప్రభావితమైతే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. 401 – 500 తీవ్రం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతూ ఆరోగ్యవంతులకు సైతం ప్రమాదకరం. మనకు ఈ కేంద్రం ఎందుకు..? పరిశ్రమల సముదాయాలు, గనుల కార్యకలాపాలు జిల్లాలో ఉన్నాయి. తుఫాన్ల ప్రభావానికి లోనయ్యే విస్తారమైన తీరప్రాంతం ఉంది. పరిశ్రమల సమీపంలో నివసించే అధిక గ్రామీణ జనాభా ఉంటుంది. సీఏఏక్యూఎంఎస్ వీటన్నింటినీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. సంవత్సరానికొకసారి గాలి నాణ్యత మెరుగుపడుతోందా లేదా క్షీణిస్తోందా అనే చారిత్రక రికార్డును రూపొందిస్తుంది. అధిక కాలుష్యం నమోదైనప్పుడు పాఠశాలలు, ఆస్పత్రులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అదనంగా ఎలా ఉపయోగపడుతుంది? గాలి వేగం, గాలి దిశ, కాలుష్యం ఏ దిశలో ప్రయాణిస్తుందో తెలుసుకోవడానికి. ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్థ్రత, వేడి, తేమ గల గాలి కాలుష్యాన్ని తెలుసుకుంటుంది. వాతావరణ పీడనం, తక్కువ పీడనం కాలుష్యాన్ని భూమి ఉపరితలానికి దగ్గరగా తీసుకువస్తుంది. వర్షపాతం–వర్షం గాలిలోని కాలుష్యకారకాలను కడిగి, తాత్కాలికంగా గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. సౌర వికిరణం–భూమి సమీపంలోని ఓజోన్ ఏర్పడే రసాయనిక చర్యలను ప్రేరేపిస్తుంది. -
నేడు మహేంద్ర గిరులకు గవర్నర్ రాక
పర్లాకిమిడి: రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటి సోమవారం గజపతి జిల్లా మహేంద్రగిరి మేళాలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల సమయంలో మహేంద్రగిరులను సందర్శిస్తారని జిల్లా పోలీసు వర్గాలలు ఆదివారం వెల్లడించారు. అయితే గవర్నర్ పర్యటనను జిల్లా సమాచార శాఖ అధికారి గోప్యంగా ఉంచారు. అయితే మహంద్రగిరి, జిరంగో టిబెటియన్ బౌద్ధ మందిరం వద్ద హెలీప్యాడ్, సెక్యూరిటీ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా ఆదివారం పర్యవేక్షించారు. మహేంద్రగిరి మేళా వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతీ భూషణ్జెన్నా గవర్నర్ను ఆహ్వానిస్తారు. అక్కడ పర్యటన ముగించుకుని చంద్రగిరి టిబెటియన్ల కాలనీ, జిరంగో వద్ద బౌద్ధ మానాస్ట్రీని సాయంత్రం నాలుగు గంటల సమయంలో గవర్నర్ సందర్శిస్తారు. కలప అక్రమ రవాణా గుట్టురట్టు ● విలువైన గుగ్గిలం కలప స్వాధీనం ● పరారీలో నిందితులుజయపురం: కలప అక్రమ రవాణా గట్టురట్టయింది. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ అటవీ విభా గ అధికారులు శనివారం రాత్రి ఆకస్మిక దాడులు చేపట్టారు. బొయిపరిగుడ సమితి గుప్తేఽశ్వర్ అటవీ రేంజ్ రామగిరి సెక్షన్లో విలువైన కలపను కొంతమంది తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామని అటవీ రేంజ్ అధికారి ఛొబి రొంధారి చెప్పారు. కలప మాఫియా విలువైన గుగ్గిలం కలపను సైకిళ్లపై తరలిస్తుండగా బొయిపరిగుడ అటవీ విభాగ సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. అటవీ సిబ్బంది రాకను గమనించిన కలప రవాణాదారులు కలపతో ఉన్న సైకిళ్లను విడిచి పరారైనట్టు చెప్పారు. వీరి కోసం సిబ్బంది గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. 12 గుగ్గిలం కలప చెక్కలు, సైకిళ్లను సీజ్ చేసినట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. దాడిలో ఫారెస్టర్ రవీంద్ర హంతాల్, గార్డులు సిప్స దాస్, సోమ్యరంజన్ సుబుద్ధి, పారా ఉద్యోగులు కార్తీక్ దండసేన, రమేష్ పూజారి, పద్మనాభ జాని, భువన్ భాగదెరియ, మోహన ఒడియ, దయితేరి ప్రధాన్, రామ చంద్ర దళపతి పాల్గొన్నట్టు అధికారులు చెప్పారు. మహేంద్ర మేళాలో ప్రయాణ పాట్లు ● సరిపడా బస్సులు లేక భక్తుల పాట్లు ● ఉచిత సీట్ల కోసం తొక్కిసలాట పర్లాకిమిడి: మహేంద్రగిరిపై వారం రోజులుగా జరుగుతున్న మహేంద్రగిరి మేళా కార్యక్రమం తిలకించేందుకు భక్తులు పోటెత్తుతున్నా సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతు న్నా అందుకు తగ్గ బస్సులు వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తొలిరోజు ఒడిశా ఆర్టీసీ నాలుగు బస్సులు మాత్రమే వేశారు. వాస్తవానికి వాటిలో టికెట్లు ఉచితం అయినప్ప టికీ రెండో రోజు నుంచి భక్తుల నుంచి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువవ్వడంతో కొత్త బస్టాండు ఆవల కోర్టు జంక్షన్ వద్ద మహేంద్రగిరి బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట జరిగింది. మహేంద్రం వద్ద ప్రమాదం.. మహేంద్రగిరి మేళాను తిలకించి వస్తున్న శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి గ్రామస్తులు మహేంద్రం ఘాటీ వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడటంతో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మంగళవారంతో మహేంద్రమేళా ముగింపు దశకు రావడం, ఒడిశా రాష్ట్ర గవర్నర్ సోమవారం పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. -
వాగునూ వదల్లేదు!
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీలో వెంకటేశ్వర కాలనీలో ప్రభుత్వ నీటివాగును గుర్తు తెలియని వ్యక్తులు మట్టితో కప్పివేశారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నీటివాగు మట్టితో కప్పేయడం వల్ల ఎగువ నుంచి వచ్చిన వర్షపు నీరు నిలిచిపోయి ఇళ్లల్లోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆక్రమణ తొలగించి నీటి వాగును పరిరక్షించాలని కోరుతున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ సమస్యకు పరిష్కారం కంచిలి: జాడుపూడిలో లో ఓల్టేజీ విద్యుత్ సరఫరాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ దశలో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి దృష్టికి రావడంతో విద్యుత్ శాఖ సీఎండీ కార్యాలయానికి ఆదివారం మధ్యాహ్నం సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి సాయంత్రం 6 గంటలకు గ్రామానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ పంపించారు. కల్తీ ఆహారం విక్రయిస్తే చర్యలు పలాస: కల్తీ ఆహారం విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీరాములు హెచ్చరించారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంఘం, సివిల్ జడ్జి పలాస డివిజన్ ఆదేశాల మేరకు జిల్లా ఆహార భద్రతా సంస్థ ఆధ్వర్యంలో పలాస కాష్యూ అసోసియేషన్ హాలులో సదస్సు నిర్వహించారు. అంతకు ముందు పలు దుకాణాలను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న ఆహారాన్ని విక్రయించరాదని చెప్పారు. కార్యక్రమంలో పి.సి.ఎం.ఎ.అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు, ప్యానల్ న్యాయవాది కె.లోకేశ్వరరావు, హోటళ్ల యజమానులు, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. నీరజకు సాహితీబంధు పురస్కారం శ్రీకాకుళం కల్చరల్ : రాజమండ్రిలో శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీ అభినయ నృత్యానికేతన్ నాట్యాచారిణి డాక్టర్ తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ‘సాహితీ బంధు’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తి మండ ప్రతాప్, జాతీయ అధ్యక్షులు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రణాళికా అధికారి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, జిల్లా కన్వీనర్ బి.ఉమామహేశ్వరరావు, జిల్లా సభ్యులు ఆదివారం అభినందనలు తెలియజేశారు. యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు గార : చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పది అడుగుల మేర తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షం నీరు చేరిన తర్వాత ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా మెండపేట సమీపంలోని మెండవానిచెరువులో టిప్పర్ల ద్వారా మట్టిని శ్రీకాకుళం పట్టణానికి అక్రమంగా తరలిస్తున్నారు. ఎవరైనా అడిగితే అధికార పార్టీ నాయకుడి అనుమతితో చేస్తున్నామని చెబుతున్నారని స్థానికులంటున్నారు. చెరువులను పరిరక్షించాల్సిన పంచాయతీ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పశువైద్యశాల ప్రారంభంలో వివాదం
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితి కుంధ్రాలో కొత్తగా పశుచికిత్సాలయం ప్రారంభోత్సవంలో కుంధ్ర గ్రామ పంచాయతీ సర్పంచ్ కనకలత పెంటియ, పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు రాధావినోద్ సామంతరాయ్లు తమ నిరసన వ్యక్తం చేశారు. కుంద్ర పశు చికిత్సాలయ ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించలేదని వారు నిరసన తెలిపారు. ఒక దశలో వారు నూతన పశువైద్యశాల సైన్ బోర్డును తొలగించి బద్దలు చేసేందుకు ఉద్యమించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ఆగ్రహంతో వారిని అరెస్టు చేయమని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రజా ప్రతినిధులు వారిని అడ్డగించి నచ్చ చెప్పారు. అయినా వారు తమను ఆహ్వానించనందుకు తీవ్ర ఆగ్రహం తెలిపారు. ఒక దశలో ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భోత్ర అనుచరులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పశు చికిత్సాధికారి మీధర బెహర కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవటం భావ్యం కాదని, అందుచేత పశుచికిత్సాలయ అధికారి బదిలీ చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయ పడ్డారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి సమస్యను సమాధానపరిచారు. అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి పశువైద్యశాలను ప్రారంభించారు. -
జయపురంలో ఎస్ఐఆర్ ప్రారంభం
జయపురం: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్) కార్యక్రమంలో భాగంగా నేడు జయపురం మున్సిపాలిటీలో అధికారులు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి నివాస భవనంలో కలసి ఓటరు జాబితా పరిశీలన, దిద్దుబాటుపై చర్చించారు. ఈ సందర్బంగా బాహిణీపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల బలం ఓటర్లని అందుచేత స్వచ్ఛమైన, కచ్చితమైన, తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయటం ఎంతో అవసరమన్నారు. అలాగనే ఈ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తన హక్కు కోల్పోకూడదన్నారు. కొరాపుట్ జిల్లాలో ఆదివాసీలు ఎక్కువ అని, పైగా ఈ ప్రాంతం 5 వ షెడ్యూల ప్రాంతం అని అందుచేత ఇక్కడ చాలా కుటుంబాల వద్ద తమ పూర్వీకులకు సంబంధించిన పత్రాలు, లేదా ధ్రువీకరణ పత్రాలు వెంటనే వారి అందుబాటులో ఉండకపోవచ్చని, అందుచేత ధ్రువీకరణ ప్రక్రియ సున్నితంగా, న్యాయంగా, సమ్మిళితంగా ఉండేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. తద్వారా ఏ అసలైన ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి మినహాయించబడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 47 యూనిట్ల రక్తం సేకరణరాయగడ: స్థానిక లోటస్ ప్యారడైజ్లో ఆదివారం ఫ్రెండ్స్ ఎంజీఎఫ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. క్లబ్ సభ్యులతో పాటు స్వచ్ఛందంగా యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ శిబిరంలో 47 యూనిట్ల రక్తాన్ని సేకరించిన క్లబ్ సభ్యులు దాన్ని జిల్లా కేంద్రాస్పత్రి బ్లడ్ బ్యాంక్కు తరలించారు. ప్రతి నెలలో క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని క్లబ్ అధ్యక్షుడు శ్రీహరి మోనింగి, కార్యదర్శి కింతలి శ్రీధర్, కోశాధికారి లాడి నూకరాజులు తెలియజేశారు. జిల్లా కేంద్రాస్పత్రి వైద్య సిబ్బంది ఈ శిబిరంలో తమ సహాయ సహకారాలను అందించారని చెప్పారు. రక్తదానం చేసిన వారికి క్లబ్ తరఫున మొక్కలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు అంతా సమైక్యంగా పోరాడాలన్న నినాదంతో వారికి అవగాహన కలిగించే విధంగా మొక్కలను అందజేయడం విశేషం. కార్యక్రమంలో గంటేడ శ్రీనివాస రావు, ఇప్పిలి సన్యాసి రాజు ,న్యాయవాది సాన రమేష్ తదితరులు పాల్గొని సహకరించారు. -
సైకిల్ తొక్కితే మెరుగైన ఆరోగ్యం
పర్లాకిమిడి: సైకిల్ తొక్కితే మెరుగైన ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా అన్నారు. ప్రపంచ బైసైకిల్ దినోత్సవం సందర్భంగా స్థానిక బెత్తగుడ ఆర్మ్డ్ పోలీసు బెటాలియన్ కార్యాలయం గ్రౌండ్స్ నుంచి ‘ఫిట్ ఇండియా కాంపైన్’లో సైకిల్ ర్యాలీని ఆదివారం ప్రారంభించారు. ర్యాలీలో ఎస్పీ మీనా సైకిల్ తొక్కుతూ గజపతి స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సైకిల్ తక్కడం అలవర్చుకోవాలన్నారు. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ వస్తుందని, ఎటువంటి రోగాలు దరిచేరవని చెప్పారు. -
డాక్టరేట్ ప్రదానం
సిద్ధా క్రాంతికుమార్కు రాయగడ: సమాజ సేవ, రక్తదాన చైతన్యం, నిరుపేదలకు అండగా నిలుస్తు విశేష సేవలందిస్తున్న తాసుబెల్లి ఫౌండేషన్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు, రాయగడ సమితి జేకేపూర్లో నివసిస్తున్న సిద్ధాక్రాంతి కుమార్కు గౌరవ డాక్టరేట్ లభించింది. అమెరికాలోని టెక్సాస్కు చెందిన డే స్ప్రింగ్ థియాలాజీ విశ్వవిద్యాలయం ఆయన సేవలను గుర్తించి ఈ అరుదైన గౌరవాన్ని ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రం హైదారాబాద్లొని గన్ ఫౌండ్రీ సూర్యలాక్ కాంప్లెక్స్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ ఎం.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో సిద్ధా క్రాంతికుమార్కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. తాసుబెల్లి ఫౌండేషన్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రాంతికుమార్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించడం, రక్తదానంపై అవగాహన కల్పించడం, ఆకలితో బాధపడుతున్న వారికి అన్నదానం, వస్త్రదానం, నిరుపేదల కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడం వంటి అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయుడు, సినీనటుడు ఘర్షణ శ్రీనివాస్, సినీ దర్శకుడు దమ్ములపాటి శ్రీనివాస్, సినీనటుడు, నిర్మాత అనిరాజ్ రాజశేఖర్ హాజరయ్యారు. -
టెట్..కొలువులు కట్!
చాలని ఎన్సీఈఆర్టీతో చెప్పించడం పట్ల ఉపాధ్యాయ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖ లోని జూనియర్ లెక్చరర్లకు గానీ, లెక్చరర్లకు గానీ, ప్రొఫెసర్లకు కానీ టెట్ అవసరం లేదు. పీజీ పూర్తి చేసిన వారు జూనియర్ లెక్చరర్, లెక్చరర్లకు నిర్వహించే అర్హత పరీక్షలో విజయం సాధిస్తే వారు ఆ పోస్టుకు ఎంపికై నట్లే. విద్యాశాఖ మినహా మిగిలిన ఏ స్థాయి పోస్టుకై నా కేవలం అర్హత పరీక్షలో మాత్రమే విజయం సాధించాల్సి ఉంటుంది తప్ప మరో అర్హత పరీక్ష ెటెట్ తరహాలో ఉండదు. అటువంటిది కేవలం విద్యాశాఖలోని ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ తప్పనిసరి చేశారు. ఇంటికి సాగనంపేందుకే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరోక్ష చర్యలు కోర్టు తీర్పుపై ఉపాధ్యాయుల నిర్వేదం ఏ శాఖకూ లేని నిబంధన విద్యాశాఖకే ఎందుకని ఆవేదన -
ఉత్సాహంగా సమ్మర్ తైక్వాండో లీగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్తో ఆత్మరక్షణతోపాటు శారీరక దారుఢ్యం మెరుగవుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా సమ్మర్ తైక్వాండో లీగ్–2026 పేరిట పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్స్, క్యాడిట్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజేతలైన బాలబాలికలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు. క్రీడాకారులకు ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న తైక్వాండో శ్రీను, శిష్యబృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, వైఎస్సార్ సీపీ నాయకులు శిమ్మ రాజశేఖర్, మండవెల్లి రవి, ఊన్న నాగరాజు, దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంఠ వేణు, ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెట్ట నాగరాజు, సీనియర్ న్యాయవాది నౌపాడ విజయకుమార్, జర్నలిస్టులు సుధీర్ వర్మ, గిడుతూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలబద్రుని రాజా, సహారా కృష్ణ, తైక్వాండో అసోసియేషన్ సభ్యులు వైశ్యరాజు మోహన్, బెవర జ్యోతి, ఏపీ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, న్యాయనిర్ణేతలు మజ్జి గౌతమ్, పి.నవీన్, ఎన్.రవి, వి.జాస్మిన్, గణసాయి, సాయిబాలాజీ, ఉదయ్ శంకర్, జోషిని, డి. భవాని, ఎన్.శేఖర్ (టెక్కలి కోచ్), హరి, నాగమణి పాల్గొన్నారు. -
ప్రత్యేక టెట్ నిర్వహించాలి
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ టెట్ నిర్వహించాలి. అర్హత మార్కులను కూడా తగ్గించాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడినవారు. అందువల్ల ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలి. – చావలి శ్రీనివాస్, ఏపీటీఎఫ్ నాయకుడు విద్యాహక్కు చట్టం 2009లో చేశారు. ఏ చట్టమైనా అమల్లోకి వచ్చిన తర్వాత నుంచే వర్తింపచేస్తారు. విద్య హక్కు చట్టం మాత్రం 37 సంవత్సవరాల వెనుక వారికీ వర్తింప చేయడం ఆశ్చర్యకరం. క్లాస్ ఫోర్ నుంచి యూపీఎస్సీ వరకు లేని ప్రత్యేక అర్హత పరీక్ష ఉపాధ్యాయులకు మాత్రమే ఎందుకో? – పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ నాయకుడు ● -
రైలు ఢీకొని యువకుడు మృతి
సోంపేట: జింకిభద్ర గ్రామానికి చెందిన తెలుకుల తేజేశ్వరరావు(35) పలాసపురం గ్రామ సమీపంలో రైల్వేట్రాక్ వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జింకిభద్ర గ్రామానికి చెందిన తెలుకుల చూడామణి కుమారుడు తేజేశ్వరరావుకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంతలో శనివారం రాత్రి గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తేజేశ్వరరావు మృతి చెందాడు. పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కవిటి: కొరికానపుట్టుగ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యపుట్టుగ గ్రామానికి చెందిన బైరెడ్ల ధర్మరాజు మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన మెండ యుగంధర్, బైరెడ్ల చరణ్కు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యపుట్టుగకు చెందిన యుగంధర్, చరణ్, ధర్మరాజు ద్విచక్ర వాహనంపై కవిటికి పనుల నిమిత్తం వెల్లారు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో కొరికాన పుట్టుగ సమీపంలో బండి అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్ పోల్ను బలంగా ఢీకొట్టింది. బైక్ వెనక కూర్చున్న ధర్మరాజు మృతి చెందగా.. చరణ్, యుగంధర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం బరంపురం తరలించారు. కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
సేవా రంగంలో విశేష కృషికి సత్కారం
మల్కన్గిరి: భువనేశ్వర్లో శనివారం నిర్వహించిన ‘భారత్ భాగ్య విధాత’ హిందీ చిత్ర ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా మల్కన్గిరి జిల్లాకు చెందిన ఇద్దరు ఆరోగ్య శాఖ ఉద్యోగులు సత్కారం పొందారు. గిరిజన ప్రాబల్యం ఉన్న మల్కన్గిరి జిల్లాలో ఆరోగ్య సేవలు రంగంలో విశేష సేవలు అందినందుకు జిల్లా ప్రధాన ఆస్పత్రి మెట్రన్ సంయుక్తా సేఠికు, శిఖపల్లి ఆయుష్మన్ ఆరోగ్య మందిరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ స్వర్ణప్రభా రామ్ ఎంపికయ్యారు. భువనేశ్వర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం మోహన్ మాఝి, నటి కంగనా రనౌత్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ స్పాట్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం నుంచి మొదలు కానున్న ఇంటర్ సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్కు ఇంటర్బోర్డు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సప్లిమెంటరీ పేపర్లను దిద్దుబాటు చేసేందుకు జిల్లాకు 55 వేల జవాబుపత్రాలు చేరుకున్నాయి. స్పాట్ వాల్యుయేషన్కు క్యాంప్ ఆఫీసర్గా ఆర్ఐఓ మొదలవలస కృష్ణవేణి వ్యవహరిస్తుండగా, జనరల్–1గా జి.వెంకటేశ్వరరావు, జనరల్–2 సత్యన్నారాయణ వ్యవహరించనున్నారు. మిగిలిన ఏసీఓలు, సీఈ లు, ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్ల నియామక పత్రాలు ఇప్పటికే కాలేజీల లాగిన్లో పొందుపర్చారు. ఆదివారం నుంచి తొలివిడతగా జరగనున్న దిద్దుబాటులో సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, హిస్టరీ, మాథ్స్, బోటనీ, బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్ పేపర్లు జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఈనెల 9 నుంచి మొదలయ్యే రెండవ విడతలో ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, కెమిస్ట్రీ పేపర్ల జవాబుపత్రాలకు మూల్యాంకనం చేపట్టనున్నారు. -
ఘనంగా విత్తన దినోత్సవం
జయపురం: జయపురం సమితి ఫూల్బెడ గ్రామంలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, జయపురం ట్రైబుల్ ఆగ్రో బయో డైవర్సిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఒడిశా బయో డైవర్సిటీ బోర్డు కలిసి ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సభా గృహంలో కమ్యూనిటీ సీడ్ ఫెస్టివల్ (విత్తన మహోత్సవం) శనివారం నిర్వహించారు. రీసెర్చ్ కేంద్రం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ మాట్లాడుతూ.. విత్తన ప్రాధాన్యతను వివరించారు. రీసెర్చ్ సెంటర్ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. పారంపరిక విత్తనాల సంరక్షణ, జలవాయు పరివర్తన వలన వాతావరణ మార్పును ఎదుర్కొవడం, కమ్యూనిటీ విత్తనాల ప్రణాళికలపై ప్రసంగించారు. భవిష్యత్ తరాల కోసం దేశీ విత్తనాలు సంరక్షించాలని శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ లెంక పిలుపునిచ్చారు. మండియ రాణి డాక్టర్ రొమిమతి ఘివురియ మాట్లాడుతూ పౌష్టికాహారం కోసం కోసం దేశీ విత్తనాల పరిరక్షణ అవసరాన్ని వివరించారు. అనంతరం విత్తన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా వ్యవసాయ విభాగ అధికారి సంజీవ కుమార్ మహంతి, విత్తన ప్రమాణిక అధికారి ప్రదీప్ కుమార్ ఖొర, ఉద్యాన వ్యవసాయ అదనపు అధికారి సంజీవ్ కుమార్ మహంతి, మృత్తికా సంరక్షణ అధికారి సొనాలీ నాయక్, ప్రభుత్వ అటవీ విభాగ అధికారి డాక్టర్ అమిత్ కుమార్ నాయిక్, సూర్జిత్ తురుక్ తదితరులు పాల్గొన్నారు. -
చిరుత పులి చర్మం విక్రయం
● 8 మంది అరెస్టురాయగడ: జిల్లాలో చిరుతపులి చర్మం అక్రమ కొనుగోలు, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాపై అటవీ శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో కలహండి జిల్లాకు చెందిన మునియా మాఝి, ఈజేరావు సాహు, సింహాద్రి తాడింగి, కల్యాణ సింగుపూర్కు చెందిన భరత్ నచిక, రాయగడ జిల్లా రివల్కొనకు చెందిన కై లాస్ జాని, చందిలికి చెందిన ప్రశాంత కడ్రక, ధర్మ పతిక, జితేంద్ర బెనియలు ఉన్నారు. కల్యాణ సింగుపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధి విరల్కన ప్రాంతంలో చిరుత పులి చర్మం విక్రయం జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయగడ, కలహండి జిల్లాలకు చెందిన అటవీ శాఖ సిబ్బంది శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చిరుతపులి చర్మం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రాయగడ రేంజర్ అనిల్ పాణిగ్రహి, కల్యాణ సింగుపూర్ రేంజర్ సచ్చిదానంద పరిడ, గౌరీ శంకర్ సాహు, రవిచంద్ర పాత్రో తదితర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉమ్మడి ప్రవేశపరీక్షలు రద్దు చేయాలి
శ్రీకాకుళం: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేసి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఉన్నత, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో డీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజాసంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (ఎన్.టి.ఎ) రద్దు చేయాలని, నీట్ పరీక్షపత్రం లీక్ కావడంతో అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో ఉంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న సిలబస్, కరికులం, విద్యా ప్రణాళికలను ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను ఉమ్మడి జాబితాలో కాకుండా రాష్ట్ర జాబితాలో మాత్రమే ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. నీట్ పేపర్ లీక్ కావడంలో కార్పొరేట్ విద్యా సంస్థల పాత్ర ఉందని, పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నా కేంద్రం మౌనం పాటించడం పట్ల వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ ప్రజాసంఘాల ఐక్య వేదిక ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రజల రక్షణకే పోలీసు యంత్రాంగం
జయపురం: ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రియ అన్నారు. బొయిపరిగుడ పోలీస్స్టేషన్ పరిధి మావో ప్రభావిత కాటపొడ గ్రామ పంచాయతీ పెటగుడ గ్రామంలో జనసంపర్క కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజలకు నమ్మకం, ప్రజలు – పోలీసులకు మధ్య సంబంధాలు ఏర్పడేందుకు జనసంపర్క శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలు మెరుగవ్వడం ద్వారా మావో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అందువలన ప్రజలు నిర్భయంగా ఉంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మావోల ప్రభావం తగ్గడానికి కారణం పోలీసులు ప్రజలకు అండగా ఉండడమేనన్నారు. ప్రజలు ఎప్పుడు పోలీసుల సహాయం కోరినా వెంటనే వారికి సహకరించేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. పోలీసులకు కూడా ప్రజలు సహకరిస్తే దొంగతనాలు, దోపిడీలు, నేరాలు నియంత్రించవచ్చన్నారు. అనంతరం పోలీసులు గ్రామ ప్రజలకు చీరలు, లుంగీలు, గావంచాలు, దుస్తులు, బెడ్షీట్లు, గొడుగులు తదితర సామగ్రి పంపిణీ చేశారు. -
అసలే బెల్టు షాపు.. ఆపై విద్యుత్ చౌర్యం
వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడలో బెల్టు షాపు నిర్వాహకులు బరి తెగించారు. అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపు కోసం పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఫ్లడ్ లైట్ల మధ్య నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు చేప డుతున్నారు. గ్రామంలో బెల్టు షాపు వల్ల అక్రమ మద్యం ఏరులై పారుతున్నా.. అటు ఎకై ్సజ్ అధికారులు గానీ, విద్యుత్ చౌర్యం జరుగుతున్నా విద్యు త్ శాఖ అధికారులు గానీ చర్యలు తీసుకోవడం లేదు. బెల్టు షాపు, లైసెన్సు షాపు నిర్వాహకులు కూటమి నేతలు కావడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. -
19న రీజియన్ తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: విశాఖపట్నం పోస్టల్ రీజియన్ పరిధిలో ఈనెల 19వ తేదీన తపాలా అదాలత్ నిర్వహణ ఉంటుందని పోస్టల్ సహా య సంచాలకులు కేవీడీ సాగర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం, ఎంవీపీ బస్ కాంప్లెక్స్ పక్కన విశాఖపట్నం–530017 నందు పోస్టుమాస్టర్ జనరల్ వారితో 122వ తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు సాగర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 15వ తేదీ లోగా ‘122వ తపాలా అదాలత్ ‘అనే శీర్షికతో కేవీడీ సాగర్, సహాయ సంచాలకులు, పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం విశాఖపట్నం –530017 అనే చిరునామాకు పంపాలని కోరారు. అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఈఆర్వో పరిధిలోని 15 సెక్షన్లలో విద్యుత్ వినియోగదారుల సర్వీసుల కోడ్ నంబర్లు మార్పు చేశామని, ఆన్లైన్లో బిల్లులు చెల్లించేవారు, కొత్త కోడ్ నంబర్లతో మార్పులు చేసుకోవాలని ఈఆర్వో ఏఏఓ ఎం.అప్పారావు సూచించారు. ఇటీవల జరిగిన మార్పులపై శనివారం ఆయ న మాట్లాడారు. ఈఆర్వో పరిధిలోని ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, తొగరాం, పైడిభీమవరం, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు, గార, అరసవల్లి, పిఎన్ కాలనీ, బలగ, రాగోలు తదితర సెక్షన్లలో మొత్తం 2.76 లక్షల మంది గృహవిద్యుత్ వినియోగదారులు ఉన్నారని, వీరి పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ లైన్మెన్లకు పరిధి ప్రకారం కొత్తగా కోడ్ నంబర్లను మార్చామని, దీన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈపీడీసీఎల్ యాప్లో విద్యుత్ వినియోగ బిల్లులు చెల్లిస్తున్న వారు తమ కొత్త కోడ్ నంబర్లను యాప్లో మార్పు చేసుకోవాలన్నారు. మందస: మీల గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని బాధిత రైతులు శనివారం సభ నిర్వహించారు. కానీ పోలీసులు నలువైపులా నిర్బంధించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత రైతులకు సానుభూతి తెలపడానికి వచ్చిన సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద్, సీపీఎంఏల్ జాయింట్ సెక్రటరీ వంకల మాధవరావు, పీఓడబ్ల్యూ కార్యదర్శి కుసుమ, కోనే రు రమేష్, పౌర హక్కుల సంఘం సభ్యులు పత్తిరి దానేష్, ఐఎఫ్టీయూ సభ్యులు జుత్తు వీరస్వామిలను అరెస్టు చేసి నిర్బంధించారని రైతులు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పంట భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. హిరమండలం: వంశధార కాలువల పరిధిలో శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందిస్తామని బీఆర్ఆర్ వంశధార డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ అరవల రవీంద్రబాబు అన్నారు. శనివారం గొట్టా బ్యారేజీ యాఫ్రాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సాగునుకు సంబంధించి చివరి వరకూ సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. వంశధార ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ఈ ఏడాది 226 పనులకు ప్రతిపాదనలు పంపగా మంజూరయ్యాయని తెలిపారు. టెక్కలి సర్కిల్ పరిధిలో 76 పనులు మంజూరైతే 73 పనులు పూర్తయ్యాయన్నారు. నరసన్నపేట సర్కిల్కు సంబంధించి 116 పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గొట్టా బ్యారేజీ యాప్రాన్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తిచేసినట్టు తెలిపారు. ఈ సీజన్ నాటికి రెండు యాప్రాన్లు, తర్వాత రెండు యాప్రాన్లు పూర్తిచేస్తామన్నారు. ఈదురుగాలుల బీభత్సం హిరమండలం: ఎల్.ఎన్.పేట మండలంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు బీభ త్సం సృష్టించాయి. పొడుగుపాడు, జాడిపేట, తురకపేట, కృష్ణాపురం, స్కాట్పేట గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనంతరం అధికారులు, సిబ్బంది స్పందించి సరఫరా పునరుద్ధరించారు. -
ఎస్ఐఆర్పై గిరిజనులకు అవగాహన
రాయగడ: ఎస్ఐఆర్ను గిరిజన ప్రాంతాల్లో సమర్దవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గుణుపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్ నేతృత్వంలో గుణుపూర్ సమితిలోని లంజియా సవర గిరిజనులు అధికంగా నివసించే రైజింగ్తల్ గ్రామాన్ని అధికారులు శనివారం సందర్శించారు. గ్రామస్తులకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి అజిత్ సబర్ స్థానిక లంజియా సౌర గిరిజనులకు వారి మాతృభాషలో వివరించారు. సర్ కార్యక్రమం ఉద్దేశం, ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు ఇతర అప్డేట్ల ప్రక్రియలను గ్రామస్తులకు సులభంగా అర్థమయ్యేలా తెలిపారు. కార్యక్రమంలో గుణుపూర్ తహసీల్దార్, సమితి అధికారి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వక్తలు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గుసాని సమితి కెరండీ పంచాయతీ శ్రీరామలింగేశ్వర మందిరం వద్ద జిల్లా న్యాయసేవాప్రాధికరణ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశాల మేరకు మొక్కలు నాటారు. అనంతరం మందిరం ఆవరణలో చెత్తను ఊడ్చి, పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి బిమల్ రవుళో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, బార్ సభ్యులు ఇతిశ్రీ మహాపాత్రో, సామాజిక కార్యకర్త మనోజ్ దాస్, అఖిల భారత యవ పరిషత్ గిన్ని కుమార్ రెడ్డి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సునీతా రోథ్ తదితరులు పాల్గొన్నారు. పిచ్చి మొక్కల తొలగింపు పర్లాకిమిడి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా లీగల్ ఎయిడ్ ఆధ్వర్యంలో రామసాగరం వద్ద శ్రీరామలింగేశ్వర మందిరం ఆవల స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, అఖిల భారత యువజన సేవా సమితి కూర్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రైనేజీలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, బార్ అసోసియేషన్ సభ్యులు, ఏబీవైఎస్ఎస్ గిన్ని కూర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
●స్పీడ్ డ్రైవింగ్తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత ●నిబంధనలు పాటించని వైనం ●హడలెత్తిపోతున్న ఇతర వాహనదారులు, సామాన్యులు
●ఈ ఏడాది జనవరి 1న కంచిలి పద్మాతుల జాతీయ రహదారి దాటుతున్న ఈసురు పరదేశి అనే వృద్ధుడిని బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందాడు. ●జనవరి 18న సంతబొమ్మాళి నుంచి టెక్కలి వచ్చే మార్గంలోఎదురెదురుగా ద్విచక్రవాహనాలు మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో గార మండళనికి చెందిన ఎల్.రాజశేఖర్ మృతి చెందాడు. ●జిల్లా కేంద్రంలో డే అండ్ నైట్ సమీపంలో మహిళ వీఆర్ఓను మత్తులో ఉన్న యువకుడు ఽఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. ●జిల్లా కేంద్రంలో ఉమెన్స్ కాలేజ్ సమీపంలో తోటి స్నేహితుడితో కలిసి బైక్ స్కిట్లు చేయడంతో అదుపుతప్పి వెనుక కూర్చున్న స్నేహితుడు మృతి చెందాడు. శ్రీకాకుళం కై ౖమ్ : తలకు హెల్మెట్ ఉండదు.. బండికి లైసెన్స్ ఉండదు.. వేగానికి పరిమితి ఉండదు.. చేతిలో బైక్ ఉంటే చాలు.. యూత్ రెచ్చిపోతున్నారు. రోడ్డుపై ఇతరులు కూడా వెళ్తారనే సోయి లేకుండా అతివేగంగా వాహనాలు నడుపుతూ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు. సరదాగా మొదలైన బైక్ రైడింగ్లు ఇప్పుడు ప్రమాదకరమైన ఆటలుగా మారుతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతుండడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. నిబంధనలు గాలికి.. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో యువత నిబంధనలు పాటించకుండా బైక్లు నడుపుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోవడం లేదు. దీనికి తోడు చిన్న వయసులోనే పెద్ద పెద్ద సీసీ వాహనాలను తీసుకుంటూ రయ్మంటూ దూసుకుపోతున్నారు. ఆ వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల్లో పడుతున్నారు. జిల్లా కేంద్రంలో అయితే బైక్ సైలెన్సర్లను మార్చి నగర వీధుల్లో శబ్దాలు చేస్తున్న దాఖలాలు అనేకం కనిపిస్తున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో వేకువజామున జిల్లా కేంద్రంలోని హయాతినగరానికి చెందిన డిగ్రీ చదువుతున్న విద్యార్థి వేకువజామున వేగంగా వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవేమో. నగరంలో రేస్బైక్లతో స్వైరవిహారం -
చెరువులను చెరబట్టి..
సారవకోట: మండలంలోని చెరువులకు కీడు కాలం దాపురించింది. పెద్ద, పెద్ద చెరువుల్లో అడ్డు ఆపు లేకుండా తవ్వకాలు చేపట్టి మట్టి, కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో పర్లాకిమిడి రాజులు తవ్వించిన రంగసాగరంలో జేసీబీలను పెట్టి అందులో ఉన్న మట్టి తరలించుకు పోతున్నారు. ఇప్పటికే చెరువులో ఆక్రమణలు విపరీతంగా పెరిగి పోయాయి. 450 ఎకరాలు కంటే అధికంగా ఉండాల్సిన చెరువు విస్తీర్ణం సుమారు 80 ఎకరాలు వరకు తగ్గినట్లు ప్రాథమిక అంచనా. ఎన్నో వందల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ చెరువును అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయక పోవడంతో పలువురు మట్టి వ్యాపారులు రైతులకు, ఇళ్లు నిర్మాణ పనులు చేపట్టే వారికి మట్టిని తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారం సచివాలయానికి కూత వేటు దూరంలోనే జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది ధర్మలక్ష్మిపురం గ్రామంలోని కలువల చెరువులో వందలాది ట్రాక్టర్ల మట్టి తరలించి అదే గ్రామానికి చెందిన జేసీబీ యజమాని సొమ్ము చేసుకున్నాడు. అధికారులు పట్టించుకోరా..? మండలంలోని జమచక్రం రెవెన్యూ గ్రామంలో జమచక్రం నుంచి సత్రాం పంచాయతీ గొల్లపేట గ్రామానికి రోడ్డు మార్గం గత ఏడాది నిర్మించారు. ఈ నిర్మాణానికి కావాల్సిన గ్రావెల్ను స్థానిక టీడీపీ నాయకులు పక్కనే ఉన్న కొండల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తరలించి రోడ్డు నిర్మాణ పనులు చేట్టారు. ఆ కొండలకు ఆను కుని సర్వే నంబర్ 59లో ఉన్న మాలపల్లి కొండ అంచులో ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వకాలు చేప ట్టి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తన సొంత అవసరాలకు అవసరమైన రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు తన స్థలాన్ని ఈ గ్రావెల్ వేసి చదును చేసుకున్నాడు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విచారకరం. సంబంధిత గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది ఇలాంటి అక్రమ తవ్వకాలను గుర్తించి ఉన్నతాధికారులతో పాటు మైన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నా నోరు మెదపడం లేదు. గత ప్రభుత్వం హయాంలో కొండ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలకు స్థలం కేటాయించారని, ఆ స్థలాలకు పేదలకు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లిన నాయకులు ఇప్పుడు మాత్రం కొండలను తవ్వి వారి సొంత అవసరాలకు వాడుకుంటున్నా.. అడిగే నాథుడే కరువయ్యాడు. అంగూరు గ్రామంలోని సచివాలయానికి కూత వేటు దూరంలో గ్రావెల్తో ఉన్న చెరువు నుంచి ఎప్పటికప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది నోరు మెదపడం లేదు. ఆ ట్రాక్టర్లు నిలుపుదల చేసి ప్రశ్నించే దాఖలాలు లేవు. నౌతళ ఘాట్ రోడ్డుకు సమీపంలో ఉన్న కొండ నుంచి నిత్యం గ్రావెల్ తరలించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగిస్తున్నా ఇక్కడున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
దోపిడీ కేసులో ఐదుగురు అరెస్టు
జయపురం: కాజూ వ్యాపారులపై దాడిచేసి డబ్బు దోచుకుపోయిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో కుములిపుట్ గ్రామ పంచాయతీ దండసేనగుడ గ్రామానికి చెందిన డొంబురుదొర మఝి, పూజారిపుట్కు చెందిన రమేష్ హరిజన్, టుకు హరిజన్, ధైతారి హరిజన్, కుములిపుట్ పంచాయతీకి చెందిన ప్రఫుల్ల నాయిక్లు ఉన్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... జయపురం పట్టణంలోని దాసరి వీధికి చెందిన అమరనాథ్, భూపతి వీధికి చెందిన ఎస్.వైకుంఠంలు జయపురం సమితి కేవీడీ ప్రాంతంలోని కాజు మిల్లులో బిజినెస్ భాగస్వాములు. వారిరువురు మే 30వ తేదీన రాత్రి రెండు ద్విచక్ర వాహనాలపై మిల్లు నుంచి జయపురం వస్తుండగా కుమిలిపుట్ పంచాయతీ దండసేన్ గుడ గ్రామం వద్ద దుండగులు వారిని అడ్డగించారు. అనంతరం అమర్నాథ్ను కొట్టి అతడి బంగారు ఉంగరం, బంగారు గొలుసుతో పాటు రూ.2 వేల నగదు, వైకుంఠంను కొట్టి రూ.2 వేల నగదు దోచుకుపోయారు. దీంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ చేయగా.. డొంబురుదొర కాజు మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతడు మే 14 నుంచి 31వ తేదీ వరకు సెలవులో ఉన్నాడు. అతడు మిల్లు యజమాని వైకుంఠానికి ఫోన్చేసి రూ.2 వేలు కావాలని అడిగాడు. అయితే వైకుంఠం డబ్బు లేదని చెప్పాడు. డొంబురు మిల్లుకు వెళ్లి డబ్బు కావాలన్నాడు. అయితే మిల్లు యజమాని నిరాకరించాడు. అందుకు డొంబురు ఆగ్రహించారు. ఈ మేరకు గతనెల 30వ తేదీ రాత్రి మిల్లు యజమాని మూమెంట్ను దుండగులకు తెలియజేశాడు. వారు దారికాసి డబ్బు, బంగారు గొలుసు, ఉంగర దోచుకున్నారు. బంగారాన్ని సెమిలిగుడలో అమ్మేందుకు ప్రయత్నించారు. అయితే వాటి బిల్లులు చూపించకపోవడంతో అమ్ముడు కాలేదు. అనంతరం ఒక గ్యారేజ్లో పనిచేస్తున్న ప్రఫుల్ల నాయిక్ బంగారు గొలుసు తనది అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఈ ఘటన ఆధారంగా ఒక్కొక్కరినీ అరెస్టు చేశామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ కేసులో మరో వ్యక్తి ఉన్నాడని త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసుని ఎస్ఐ శిరిష్ మహాపాత్రో దర్యాప్తు జరుపుతున్నారు. -
క్రికెట్ టోర్నమెంట్ విజేతగా మల్కన్గిరి
మల్కన్గిరి: సమితి పరిధి పద్మాగిరి పంచాయతీ పెడకొండ గ్రామంలో మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ–20 క్రికెట్ టోర్నమెంట్లో మల్కన్గిరి జట్టు విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్కు కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్లు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను అభినందించారు. మల్కన్గిరి – సుకుమ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో మల్కన్గిరి జట్టు విజయం సాధించింది. విజేతలను పలువురు అభినందించారు.సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు ● నిందితుడు అరెస్టు రాయగడ: సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరంగా, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత పోస్టులు పెడుతున్న వ్యక్తిని ఝార్సుగుడ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర శుక్రవారం వివరాలు వెల్లడించారు. బరఘడ్ జిల్లాలోని పైకమాల్ పోలీస్స్టేషన్ పరిధి గురుండా గ్రామానికి చెందిన ప్రసాద్ మహాదే సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన కంటెంట్ను పోస్టు చేయడంతో పాటు దానిని ఇతరులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యింది. కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు విచారణ చేపట్టి అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాయగడలో మెగా వైద్య శిబిరం రాయగడ: స్థానిక పాత పోలీస్స్టేషన్ సమీపంలోని సరోజిని క్లీనిక్లో డాక్టర్ అందవరపు గౌరీశంకరరావు ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లాలోని బిసంకటక్, కల్యాణ సింగుపూర్, సికరపాయి, రాయగడ పరిసర ప్రాంతాలకు చెందిన 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి మందులను అందజేశారు. ప్రతినెలా ఇటువంటి తరహా ఉచిత వైద్య శిబిరాన్ని క్లినిక్లో నిర్వహిస్తున్నామని డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు. అయితే ఈసారి ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా రాయగడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు ఈ శిబిరంలో పాల్గొని, వారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. సర్వీసు వైర్లు చోరీ రణస్థలం: లావేరు నుంచి ఇజ్జాడపాలెం వైపు వెళ్లే రహదారి మధ్యలో వ్యవసాయ విద్యుత్ మోటార్ సర్వీస్ వైర్ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి చోరీ చేశారు. అదే ప్రాంతంలోని సుమారు 10మంది రైతుల మోటార్లకు ఉన్న సర్వీస్ వైర్లను కట్ చేసి పట్టుకుపోయారు. శనివారం గమనించిన బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొందరి వైర్లు మోటార్ బోరు లోపల పడిపోవడం వల్ల కొత్తగా వేయాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాగి కోసం, ఇతరులకు సర్వీస్ వైరు అమ్మేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం భరిణికాంలో కూడా కొంతమంది రైతుల మోటార్ సర్వీస్ వైర్లు, రాగి చోరీ చేశారని తెలిపారు. అనంతరం లావేరు ఎస్సై కె.అప్పలసూరికి రైతులు ఫిర్యాదు చేశారు. -
హత్యతో మరో ఇద్దరికి సంబంధం..?
● కుమారుడు, అల్లునిపై అనుమానాలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలో గురువారం అర్ధరాత్రి గాజులవీధి ప్రకాష్ నగర్లో భర్త ధర్మాన అసిరినాయుడుని భార్య జయలక్ష్మి అంతమొందించిన సంగతి విధితమే. అయితే ఈ హత్యకేసుకు సంబంధించి పోలీసుల విచారణ చేయగా అనేక విషయా లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యతో మరో ఇద్దరికి సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు ప్రయత్నాలతో హత్య..? పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలక సాంకేతిక ఆధారాలు శనివారం సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినప్పుడు కొన్ని ఆధారాలు లభించాయి. కత్తిపీట గాట్లు పెట్టే ముందే విషమిచ్చి చంపేందుకు య త్నించారని, మెడను తాడుతో నులిమినట్లు ఆధారాలుండటం గుర్తించారని సమాచారం. ఈ దిశగా పోలీసులు జయలక్ష్మిని ఇంటరాగేట్ చేసినట్లు, ఆమె మరో ఇద్దరికి సంబంధాలున్నట్లు తెలపడంతోనే మొత్తం తీగ లాగారు. కొడుకు, అల్లునిపైనే.. ? హత్యకు గురైన అసిరినాయుడు నిత్యం భార్యను మద్యం మత్తుతో వేధించడం, ఇంటికొచ్చి భార్య వద్ద డబ్బులు గుంజేయడం లేదంటే చితకబాదేయ డం చేస్తుండేవాడు. కుమారుడు, అల్లునితో బాధ ను పంచుకుని వారితోనే ఈ హత్యకు పన్నాగమేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తగ్గట్టుగానే పోలీసులు అసిరినాయుడు కుమారుడు మణికంఠ, అల్లునికి ఫోన్లు చేసినా స్విచ్చాఫ్ కావడం, ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో గాలించారు. శనివారం రాత్రి పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే హత్యలో పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్న మృతుని కుమారుడు మణికంఠే తన తండ్రి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
సీసీ ఫుటేజీల ద్వారా పరిశీలిస్తున్నాం
నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వెళ్లేవారిని, స్పోర్ట్స్ బైక్స్తో ర్యాష్గా వెళ్లేవారిని సీసీ ఫుటేజీల ద్వారా పరిశీలిస్తున్నాం. జంక్షన్ నుంచి వేరే జంక్షన్ వెళ్లేలోపు వారిని ఆపుతున్నాం. నిబంధన లు మీరినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. డేఅండ్నైట్, అరవసల్లి మిల్లు జంక్షన్ల వద్ద హెల్మెట్ బ్యాంకులు పెట్టాం. మొన్నటి ప్రమాదంలో పేవ్మెంట్ ఢీకొని యువకుడు చనిపోవడంతో అలాంటివాటిపై దృష్టి పెట్టాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – వి.రామారావు, ట్రాఫిక్ సీఐ, శ్రీకాకుళం -
ఆంధ్రప్రదేశ్ వరి విత్తనాల వైపే మొగ్గు
పర్లాకిమిడి: రెండు రోజులుగా వర్షాలు పడుతుండడంతో గజపతి జిల్లాలో ఖరీఫ్ సీజన్కు రైతులు సమాయత్తమవుతున్నారు. దీంతో గజపతి జిల్లా వ్యవసాయ కేంద్రంలో 25 కిలోల వరి విత్తనాలు సబ్సిడీ ధరలకు అమ్ముతున్నారు. కానీ ఈ ప్రాంతంలోని జాజిపూర్, కాశీనగర్, కెరండీ, అమర గ్రామ రైతులు ఆంధ్రప్రదేశ్ వరి విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్ర నుంచి దిగుమతి అవుతున్న వరి విత్తనాల బ్యాగులు ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా.. వరి విత్తనాలు పొలాల్లో జల్లితే నారు బాగుంటుందని, వరిపంట దిగుబడి బాగుంటుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఒడిశా సీడ్ కార్పొరేషన్ 26 కిలోల బస్తా విత్తనాలు 1061ని రూ.750లకు అమ్ముతుండగా, ఆంధ్రప్రదేశ్ వరి విత్తనాల రకాలు రూ.1500లకు అమ్ముతున్నారు. అయినా ఒడిశా రైతులు సీడ్ కార్పొరేషన్ నుంచి విత్తనాలు కొనడానికి ముందుకు రావడం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీంతో భువనేశ్వర్ వ్యవసాయ సీడ్ కార్పొరేషన్ నుంచి ఇక్కడి అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. గజపతి జిల్లాలో వర్షాలు పర్లాకిమిడి: కాల వైశాఖి ప్రభావంతో శుక్రవారం, శనివారాల్లో గజపతి జిల్లాలో పలు సమితిల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాయగడ బ్లాక్ కోయిపూర్, జిరంగో, గారబంద గ్రామాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఈ వర్షాలతో రైతులు దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం పరిధిలో జాతీయ రహదారికి కొద్ది దూరంలో వంశధార ఎడమ కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, కాఫీ కలర్ రౌండ్ నెక్ టీ షర్టు ధరించి ఉన్నాడని, టీ షర్టు వెనుక వీఎల్ గోల్డు కలర్ అక్షరాలు ఉన్నాయని, లైట్ కాఫీ కలర్ కాటన్ జీన్ ఫ్యాంట్ ధరించి టక్ చేసుకొని ఉన్నాడని వివరించారు. నీలం రంగు బ్యాటరీ వాచ్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు కోటబొ మ్మాళి పోలీసులు(6309990861)కు సమాచారం అందించాలని కోరారు. పెంటిభద్రలో..పలాస: పెంటిభద్రలో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 45 ఏళ్లు వయస్సు కలిగి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఎండవేడికి డీహైడ్రేషన్కు గురై మూడు రోజులు క్రితమే చనిపోయ ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యర్థ రహిత పాఠశాలలుగా తీర్చిదిద్దాలి
శ్రీకాకుళం రూరల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో (కార్బన్ ఉద్గారాల రహిత) పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. పెదపాడు పంచాయతీ శాస్త్రులపేటలో మహాత్మాజ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని, ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. తడిపొడి వ్యర్థాలను వేరుచేసి సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతలు నిర్మాణం, హరిత ఇందనం వినియోగం వంటి పద్ధతులను అవలంబించుకోవాలన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకం, గ్యాస్ ఉద్గారాల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలగడమే కాకుండా కార్బన్ డయాకై ్సడ్ విడుదలై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. గురుకుల పాఠశాలలను నెట్ జీరోగా మారిస్తే అదనపు వనరులను కల్పిస్తామన్నారు. పాఠశాల్లో మైనర్ మరమ్మతుల కోసం రూ.70 లక్షలు మంజూరు చేశామన్నారు. అసంపూర్తిగా ఉన్న 500 మీటర్లు కాంపౌడ్ వాల్, స్కూల్ అప్రోచ్ రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీసీ సంక్షేమ అధికారి అనురాధ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెట్జీరో భావనను జిల్లాలోని ఎంపీజే గురుకులాల్లో అమలు చేస్తామన్నారు. శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా అటవీశాఖాధికారి జ్ఞాన ప్రసూన, సిబ్బంది పాల్గొన్నారు. -
అధిక దిగుబడులు సాధ్యం
విత్తనం సరైనది ఎంపిక చేసుకొని రైతులు పంట పొలాల్లో వేసి.. పంట యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుంది. రైతులు ముంపు ప్రాంతాలు, మెరక ప్రాంతాలకు అనువైన రకాలు, విత్తనాలు విడివిడిగా ఎంపిక చేసుకొని విత్తన శుద్ధిచేసి జల్లుకోవాలి. దీంతో పాటు కలుపు నివారణకు సరైన సమయాల్లో శాస్త్రవేత్తలు సూచించిన మందులను వినియోగిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో దిగుబడులు పెరుగుతాయి. – డాక్టర్ జి.చిట్టిబాబు, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఆమదాలవలస -
అవయవదానంతో పునర్జన్మ
బూర్జ: బూర్జ గ్రామానికి చెందిన సూరి పుండరీకాక్షయ్య (44) రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో కిడ్నీవ్యాధితో చికిత్స పొందుతూ వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మనిచ్చారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పుండరీకాక్షయ్య మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురయ్యారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొంతమంది మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్లో కిడ్నీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే అవయక దానం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో గురువారం అర్ధరాత్రి తరువాత మృతి చెందారు. ఆసుపత్రి యాజమాన్యం కుటుంబీకుల అంగీకారంతో అవయవదాన ప్రక్రియ పూర్తి చేసింది. అనంతరం మృతదేహాన్ని జెమ్స్ ఆస్పత్రి నుంచి బూర్జ గ్రామం వరకు బైక్ ర్యాలీగా తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్గా పనిచేసిన పుండరీకాక్షయ్యకు భార్య ప్రశాంతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
శ్రీకాంత్ శిష్య బృందానికి ప్రత్యేక గుర్తింపు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాకు చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు డాక్టర్ రఘు పాత్రుని శ్రీకాంత్ శిష్యబృందం దూరదర్శన్ కేంద్ర హైదరాబాద్, దూరదర్శన్ కేంద్ర ఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల గ్రేడ్ అక్రిడిటేషన్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. సీనియర్ విద్యార్థి రామ కౌండిన్య ‘ఏ’ గ్రేడ్ అక్రిడిటేషన్ పొంది, ఈ ఘనతను సాధించిన జిల్లా తొలి కళాకారుడిగా నిలిచారు. సీనియర్ విద్యార్థినులు డొంకాడ నేహ, దూలపు హిమబిందు, వోలేటి శాశ్వత ఐశ్వర్య ‘బి’ గ్రేడ్ అక్రిడిటేషన్ పొందారు. విద్యార్థుల కృషి, అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర సాధన, గురువు మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని పలువురు కళాభిమానులు అభినందించారు. రాష్ట్ర ఉత్తమ వసతి గృహాధికారిగా సునీత టెక్కలి: ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో టెక్కలి గిరిజన కళాశాల బాలికల వసతి గృహం విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడంతో వార్డెన్ డి.సునీతను ఉత్తమ వసతి గృహం అధికారిగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. ఈమెతో పాటు విద్యార్థులు పి.శ్రీదేవి, జె.సౌజన్య తదితరులు అవార్డులు అందుకున్నారు. సీఏఏక్యూఎం స్టేషన్ ప్రారంభం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రతిఒక్కరూ చిన్న వయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటిన్యూయస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్(సీఏఏక్యూఎం) స్టేషన్ను కేంద్రమంత్రి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిబ్బంది సంక్షేమానికి కృషి శ్రీకాకుళం క్రైమ్ : ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేలా, పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషిచేసేలా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రతి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ ఎస్పీ (పోలీస్ గ్రీవెన్సు)కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది నేరుగా తన నెంబరు 6309990800కు డయల్ చేసి లీవులు, సర్వీసు అంశాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. -
తీర్థయాత్రలకు వెళ్లి వృద్ధుడు మృతి
సారవకోట: అన్నుపురం గ్రామానికి చెందిన తాడేల శ్రీరాములు (85) తీర్థయాత్రలకు వెళ్లి గురువారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. 15 రోజుల క్రితం గ్రామానికి చెందిన పలువురితో కలిసి శ్రీరాములు బస్సులో తీర్ధయాత్రలకు బయల్దేరాడు. గురువారం రాత్రి బద్రీనాథ్లో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో తోటి ప్రయాణికులు సపర్యలు చేశారు. అనంతరం కాసేపటకి ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి వివాహితులైన నలుగురు కుమారుల, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని స్వగ్రామం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రణస్థలం : జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన కొయ్యాన తనీష్, తలే రాకేష్లు ద్విచక్రవాహనంపై విశాఖ వైపు నుంచి రణస్థలం వైపు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కోష్ట ఫ్లై ఓవర్పై అదుపు తప్పిపడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో తొలుత శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి ఒకరిని శ్రీకాకుళం, మరొకరికి విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని మొండేటి వీధికి చెందిన లంకపల్లి శ్రీనివాసరావు (58) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మృతుడి భార్య నాగమణి, ఎల్.చలపతిరావులు నేత్రదానానికి అంగీకరించి రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియచేశారు. నేత్రదాన మోటివేటర్ డి.వలసయ్య సమన్వయంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, పి.చిన్ని కృష్ణలు శ్రీనివాసరావు కార్నియాలను సేకరించి వాటిని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే 78426 99321 నంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
వరద కట్ట మాయం
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలోని మహేంద్రతనయ నది, శ్మశాన వాటిక పరిసర ప్రాంతంలో 2025 మార్చిలో వరదకట్ట పనులు చేపట్టారు. ఈ పనులను ఉపాధిహామీ సిబ్బంది సామాజిక తనిఖీ అధికారులకు చూపించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి వరదకట్ట నిర్మాణం కానరావడం లేదు. పక్కనే మెళియాపుట్టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. వరదకట్టను పూర్తిగా జేసీబీతో మహేంద్రతనయ నదిలోకి తోసేసి అక్కడ ఇటుకలు కాల్చడానికి ఉపయోగించే కట్టెలు ఇతర సామాగ్రి డంప్ చేస్తున్నాడు. మహేంద్రతనయ నదీగర్భంలో చెత్తాచెదారాలతో పాటు విరిగిన ఇటుకలు వేస్తుండటంతో కొంచెం కొంచెంగా నదీ గర్భం సన్నగిల్లుతోంది. దీనిపై క్షేత్రసహాయకుడు అధికారులకు సైతం తెలియజేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే సదరు వ్యక్తి కొద్దిరోజుల్లో నది గర్భాన్ని ఇటుకల ఫ్యాక్టరీలా మార్చుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరద ఉధృతి నియంత్రణకు లక్షలాది రూపాయల కేంద్రప్రభుత్వ నిధులతో పనులు చేయిస్తూ ఉంటే.. ఓ ప్రయివేట్ వ్యక్తి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మేలైన విత్తనం.. దిగుబడి అనుకూలం..!
ఆమదాలవలస: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కొంతమంది రైతులు పంట పొలాల్లో వరి విత్తనాలు వెదలు జల్లేందుకు సిద్ధం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.82,000 హెక్టార్లలో వరిసాగుకు రైతులు పంట పొలాలు సిద్ధం చేశారు. అయితే అనుకూలమైన, నాణ్యమైన వరి విత్తన ఎంపికతోనే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు, ఆమదాలవలస ఏవో ఎం.మోహన్రావులు సూచిస్తున్నారు. దీనిపై రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. స్వర్ణ (ఎంటీయూ 7029) స్వర్ణ (ఎంటీయూ 7029) ఖరీఫ్ సీజన్కు అనుకూలమైన విత్తనం. 150 రోజుల పంటకాలం. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ మూడు వారాలు. ఎండకు, తెగులును తట్టుకొని నిలబడగలదు. వివిధ రకాల భూముల్లో, ఇతర వాతావరణ పరిస్థితుల్లో, అలాగే రెండు పంటలు పండించు ప్రాంతాలకు స్థిరమైన దిగుబడి నిచ్చే సన్నని గింజ రకం ఇది. తక్కువ నత్రజని వినియోగంతో అధిక దిగుబడినిస్తుంది. ఇంద్ర (ఎంటీయూ 1061) ఇంద్ర (ఎంటీయూ 1061) రకం పంటకాలం 150 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు నుంచి మూడు వారాలు. సుడిదోమ పోటును తట్టుకోగలదు. సన్నని గింజ, చేను పడిపోదు. పది రోజుల వరకు ముంపును, కొద్దిపాటి చౌడును తట్టుకోగలదు. తినేందుకు బియ్యం అనుకూలంగా ఉంటాయి. సోనా మసూరి (బీపీటీ 3291) సోనామసూరి (బీపీటీ 3291) ఖరీఫ్ కాలానికి అనుకూలమైన విత్తనం. 135 నుంచి 140 రోజుల పంటకాలం. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. అగ్గి తెగులును తట్టుకొని నిలబడుతుంది. గింజ సన్నంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్ 2537) శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్ 2537) ఖరీఫ్ కాలానికి ఈ విత్తనం అనుకూలం. పంటకాలం 165 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లి కోడును తట్టుకుని నిలబడుతుంది. సన్న బియ్యం 60 రోజుల వరకు నాటుకోవచ్చు. చేను గాలికి పడిపోదు. సాంబ మసూరి(బీపీటీ 5204) సాంబ మసూరి (బీపీటీ 5204) విత్తనం ఖరీఫ్, రబీ కాలానికి అనుకూలం. 145 నుంచి 150 రోజులు పంట కాలం. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ 4 వారాలు. సన్న బియ్యం అన్నం మృదువుగా రుచిగా ఉండి మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నం తినేందుకు బాగుంటుంది. గ్లెసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ రకం ధాన్యం ద్వారా పండించే బియ్యాన్ని తినడానికి అనుకూలం. పుష్యమి (ఎంటీయూ 1075) పుష్యమి (ఎంటీయూ 1075) రకం ఖరీఫ్ సీజన్కు అనుకూలం. 135 రోజుల పంట కాలం. 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులును, దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. సన్న బియ్యం అలాగే చేను పడిపోదు. అమర (ఎంటీయూ 1064) అమర (ఎంటీయూ 1064) పంటకాలం 150 రోజులు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ మూడు వారాలు. దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. బియ్యం సన్నగా ఉండి గింజ రాలదు, చేను పడిపోదు. ముంపును బాగా తట్టుకుని నిలబడుతుంది. శ్రీధృతి (ఎంటీయూ 1121) శ్రీధృతి (ఎంటీయూ 1121) పంటకాలం 120 నుంచి 125 రోజులు. ఎకరాకు 24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. అగ్గి తెగులు, దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. కాండం ధృడంగా ఉండి చేను పడిపోదు. మధ్యస్థ సన్నరకం అన్నానికి బాగుంటుంది. నేరుగా విత్తే విధానంలో సాగుకు అనుకూలమైనది. సుజాత (ఎంటీయూ 1210) సుజాత (ఎంటీయూ 1210) రకం పంటకాలం 125 నుంచి 135 రోజులు. సార్వాలో 26 నుంచి 28 కింటాళ్ల దిగుబడి, దాళ్వాలో 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. దోమపోటు, అగ్గి తెగులును తట్టుకుని నిలబడుతుంది. కాండం ధృడంగా ఉండి చేను పడిపోదు. గింజ రాలడం తక్కువ. నేరుగా విత్తే విధానానికి అనుకూలం. మార్టేరు సాంబ (ఎంటీయూ 1224) మార్టేరు సాంబ (ఎంటీయూ 1224) రకం పంటకాలం 135 రోజులు. 26 నుంచి 28 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. దోమపోటును తట్టుకుని నిలబడుతుంది. పంట చేను పడిపోదు. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. వరి విత్తనాలు -
అలెర్ట్..!
● గ్యాస్ ఎవరి పేరుమీదో ఉందో సరిచూసుకోవాలి ● మృతుల పేరుతో జిల్లాలో 14 వేల కనెక్షన్లు ● ఈకేవైసీ చేయించుకోని వారు 10 వేల మంది ●కఠిన ఆంక్షలు పెడితే సరఫరా నిలిచిపోయే ప్రమాదం హిరమండలం: గ్యాస్ వినియోగదాలకు కీలక సూచన. గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద ఉందో స్పష్టంగా చూసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. జిల్లాలో చాలా గ్యాస్ కనెక్షన్లు మృతుల పేరుతోనే ఉన్నాయి. దాదాపు ఇలా 14 వేల కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరో 10 వేల మంది వినియోగదారులు ఈకేవైసీ కూడా చేయించుకోలేదు. అయితే ప్రస్తుతం పశ్చిమా ఆసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్పై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఈ తరుణంలో మృతుల పేరుతో కనెక్షన్లు, ఈకేవైసీ చేయించుకోని వారి కనెక్షన్లను తొలగించే అవకాశముంది. ఈ విషయంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. మృతుడి సంబంధిత వివరాలు, కుటుంబ అనుబంధ ఫొటోలు, ఇతర ధ్రువపత్రాలతో వెళ్తే కుటుంబ సభ్యుల పేరుతో మార్చే అవకాశం ఉంది. జిల్లాలో హెచ్పీసీఎల్, భారత్, ఇండేన్ గ్యాస్ వినియోగదారులు అధికం. ప్రస్తుతం ఓటీపీ ఆధారిత సేవలు మాత్రమే అందుతున్నాయి. అందుకే ఏక్షణం అయినా కేంద్ర ప్రభుత్వం మృతుల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లు, ఈకేవైసీపీ పూర్తిచేయని వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందువలన సరైన ధ్రువపత్రాలు జతచేసి సరిచేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ సంస్థలు సూచిస్తున్నాయి. మృతుల పేరుతో ఉండే గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈకేవైసీ చేయించకపోయినా సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సంబంధిత పత్రాలతో వెళ్లి సరిచేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. – సూర్యప్రకాశరావు, డీఎస్వో, శ్రీకాకుళం -
పీడీఎస్ బియ్యం పట్టివేత
రణస్థలం: కమ్మ సిగడాం సెంటర్లో శుక్రవారం శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ బి.రామారావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని ఒక ఆటోలో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కరిమిన ప్రసాదరావు రణస్థలం తీసుకొస్తుండగా కమ్మసిగడాం సెంటర్ దగ్గరలో పట్టుకున్నారు. కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీ నిర్వాహకులకు అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపేందుకు తీసుకొస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలింది. పట్టుకున్న 860 కేజీల బియ్యాన్ని సివిల్ సప్లయ్ డీటీ అరుణకుమారికి అప్పగించారు. ఆమె కమ్మసిగడాం రేషన్ దుకాణానికి తరలించారు. ఆటోను జె.ఆర్.పురం పోలీసు స్టేషన్కు అప్పగించారు. ప్రసాద్పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
పర్యావరణాన్ని కాపాడాలి
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026జయపురం: పర్యావరణాన్ని కాపాల్సిన బాధ్యత అందరిపై ఉందని వక్తలు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో జయపురం అటవీ విభాగ అధికారులు శుక్రవారం నిర్వహించారు. జయపురం జిల్లా కోర్టు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవ ప్రదీకరణ అధికారి ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో జిల్లా ప్రధాన చికిత్సాలయ సభాగృహంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వన్య ప్రాణులు, పర్యావరణ సంరక్షణ చట్టాలను వివరించారు. సివిల్ జడ్జి, మహిళా కోర్టు విచారపతి అలోకానంద మహంతి, ప్రధమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హరమోహణ దాస్, జిల్లా అటవీ విభాగ జయపురం అధికారి ప్రశాంత పటేల్, జయపురం ప్రభుత్వ అటవీ విభాగ అధికారి డాక్టర్ అమిత్ప్రకాశ్ నాయక్, జిల్లా చికిత్సా అధికారి డాక్టర్ అక్షయ కుమార్ రౌత్, శిశు చికిత్స వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ పాత్రో, ఆస్పత్రి మేనేజర్ రూపసీ మధుక్ష్మిత నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆస్పత్రి, కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం జిల్లా కేంధ్ర హాస్పిటల్లో మొక్కలు నాటారు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. జయపురంలో.. జయపురం: ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా జయపురం స్వచ్ఛంద సంస్థ సోషల్ ఎడ్యుకేషనల్, ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్ అసోషియేషన్(సీవా) వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించింది. జయపురం సమితి పాత్రోపుట్ సమీపంలో కొంజాయి మాలిగుడ గ్రామంలో బొప్పాయి, మామిడి, నిమ్మ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జయపురం సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, యువత పాల్గొన్నారు. విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో.. జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ హృషికేష్ సేనాపతి, రిజిస్ట్రార్ మహేశ్వర చంధ్ర నాయిక్ పర్యవేక్షణలో వివిధ జాతుల మొక్కలు నాటారు. బీఎస్ఎఫ్ కార్యాలయంలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఎంవీ 3 గ్రామం వద్ద గల బీఎస్ఎఫ్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బెటాలియన్ 103,110, 177 బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా 2,900 వివిధ పండ్లు, స్థానిక జాతులకు చెందిన మొక్కలు నాటారు. బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండర్ విజయ్ సిన్హా మొక్కల ప్రాధాన్యాన్ని వివరించారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం నుంచి రామసాగరం వరకూ పర్యావరణ చైతన్య ర్యాలీని డీఎఫ్ఓ కె.నాగరాజు ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులు, అటవీశాఖ రేంజ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రామసాగరం గట్టు మీద పలు మొక్కలను డీఎఫ్ఓ నాటారు. అనంతరం జిల్లా అటవీశాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్.. భవిష్యత్ వాతావరణం కోసం స్పూర్తితో ప్రకృతిని కాపాడుదాం..! అనే నినాదంతో పర్లాకిమిడి, కాశీనగర్ అర్బన్లో అనేక చోట్ల మొక్కలు నాటుతామని అన్నారు. మోహన ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం కాపాడటానికి మహేంద్రగిరిపై హెర్బల్ ప్లాంటేషన్ చేయాలని, టూరిజం స్పాట్గా కాకుండా తీర్థ స్థలంగా రూపొందించాలని ఆయన ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించానని అన్నారు. ప్రకృతి మిత్ర, ప్రకృతి బంధు ఆవార్డులు అందజేత జిల్లాలో పలు సమితిలలో చెట్లుపెంచి, సంరక్షణ చేస్తున్న సేవలకు గుర్తించి పలువురికి ప్రకృతి బంధు, ప్రకృతి మిత్ర పురస్కారాలను డీఎఫ్ఓ నాగరాజు ఎమ్మెల్యే దాశరథి గోమాంగో చేతులమీదుగా అందజేశారు. ప్రకృతి బంధు అందుకున్న వారిలో రవీంద్ర సుబుధ్ధి, మమతా పాఢి (హెల్త్ విస్తరణాధికారి), మహేంద్రకుమార్ సాహు, (నువాగడ), ముక్తికాంత మల్లిక్ (ఉపాధ్యాయులు)లకు రూ.10వేల రూపాయల చెక్కు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే మరికోందరికి ప్రకృతి మిత్ర ఆవార్డుల క్రింత రూ.20వేల చెక్కులను నలుగురికి అందజేశారు. కొరాపుట్లో.. కొరాపుట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు రామ్చంద్ర ఖడం అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక స్థలం ఉన్న కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి పర్వతం వద్ద మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి దేవమాలి పర్వతారోహణ చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రాస్పత్రిలో బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ లు మొక్కలు నాటారు. -
శిశు హక్కుల క్యాంప్ కోర్టులో 65 ఫిర్యాదులు
జయపురం: ఒడిశా రాష్ట్ర శిశు పరిరక్షణ ఆయోగ్ ద్వారా కోర్టు క్యాంప్ నిర్వహించారు. శిశు హక్కుల పరిరక్షణ, వాటి తక్షణ పరిష్కారం కోసం స్థానిక జయపురం సబ్ కలెక్టర్ సభాగృహంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన శిశు హక్కుల క్యాంప్ కోర్టులో 65 ఫిర్యాదులు నమోదైనట్లు నిర్వాహక అధికారులు వెల్లడించారు. రాష్ట్ర శిశు పరిరక్షణ ఆయోగ్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ బబిత పాత్రో అధ్యక్షతన జరిగిన క్యాంప్ కోర్టులో ఆయోగ్ సభ్యులు సుజాత నాయిక్, కస్తూరీ మిశ్ర, మనస్మిత ఖుండియ పాటు న్యాయ సలహాదారు మహ్మద్ అబుదూల్ రెహమాన్, కొరాపుట్ జిల్లా అదనపు కలెక్టర్ తపన కుమార్ నాయిక్ క్యాంప్ కోర్టులో పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో శిశువులకు సంక్షేమ పథకాలు అందడం లేదనే ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. శిశు విద్యావ్యవస్థ అనేక లోపాలున్నాయని, రేషన్ కార్డుల పంపిణీలో సమస్యలపైన కూడా ఎక్కువ ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. కొరాపుట్ జిల్లా పాఠశాలో ఎక్కువగా ఉన్న డ్రాపౌట్స్పై డాక్టర్ బబిత పాత్రో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంప్ కోర్టులో బాలికపై దాడి కేసు ఒడిశా శిశు హక్కుల పరిరక్షణ ఆయోగ్ క్యాంప్ కోర్టులో ఒక బాలికపై జరిగిన దాడి కేసు కూడా వచ్చింది. ఆ కేసుని పరిశీలించిన అధ్యక్షురాలు వంటనే పోలీసులను రప్పించి వెంటనే కేసు దర్యాప్తు జరిపి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్యాంపు కోర్టులో జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్,కొరాపుట్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్నేహ ప్రభ మఝి, జయపురం ఐటీడీఏ అధికారి తృప్తి బెహర, జయపురం బీడీఓ శక్తి మహాపాత్ర, జయపురం తహసీల్దార్ సబ్యసాయి జెన, జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి, జయపురం శిశు సురక్షా అధికారి సంగీత రాణి పాణి, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయత్రీ దేవితో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రైస్మిల్లుకు నష్టం
కాల వైశాఖితో పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడి, గుసాని సమితిల్లో శుక్రవారం కాలవైశాఖి ప్రభావంతో పిడుగులు, గాలివానతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి దోనూరు గ్రామంలో రవాణా స్తంభించిపోయింది. గుసాని సమితి కంట్రగడ, బడగాం, పనెద్ద కొత్తూరు, దోనూరులో అనేక వృక్షాలు నేలకొరిగాయి. మచ్చమర గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఒక రైస్ మిల్లు గాలులకు పూర్తిగా నేలకొరగటంతో మిల్లు యజమాని జగదీష్కు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. పెద్ద కొత్తూరు, చిన్నకొత్తూరు మధ్య గాలులు, వర్షాలకు విద్యుత్ తీగలు, స్తంభాలు నేలకొరిగాయి. -
యువకుడిపై కత్తితో దాడి
రాయగడ: పట్టణంలో గురువారం అర్ధరాత్రి టైల్స్ కట్టింగ్ మెషిన్ను తిరిగి ఇవ్వడంపై జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ఒక యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఈ ఘటనలో గాయపడిన యువకుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండీ సర్పరాజ్గా గుర్తించారు. స్థానిక కస్తూరీనగర్లో బీహార్ రాష్ట్రంలోని బేలా ప్రాంతానికి చెందిన కొందరు యువకులు టైల్స్పనులు చేస్తూ ఇక్కడ నివాసముంటున్నారు. ఈ క్రమంలో సర్పరాజ్కు చెందిన టైల్స్కటింగ్ మెషిన్ను అతని పొరుగువాడు ఎండీ సయ్యద్ తీసుకుని వెళ్లి తిరిగి ఇవ్వలేదని సమాచారం. ఈ విషయమై కొంత కాలంగా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే గురువారం రాత్రి ఇదే అంశంపై మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకొని చినికిచినికి గాలివానలా మారింది. ఆగ్రహానికి గురైన సయ్యద్ కత్తితో సర్పరాజ్పై దాడి చేసాడు. దాడిలో సర్పరాజ్ శరీరంలోని పలు భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో అతని సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్లు ప్రస్తుతం అతని పరిస్థితి స్తిమితంగా ఉందని వివరించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి దాడికి దారితీసిన పరిస్తితులను, నిందితుడి పాత్రపై దర్యాప్తు చేపట్టారు. అయితే దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అంబులెన్స్ రాక రోడ్డు ప్రమాద బాధితుడి మృతి రాయగడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడు సమయానికి అంబులెన్స్ రాక వైద్యం అందక చనిపోయాడు. మృతుడిని జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి పరిధిలొని భలుమస్క గ్రామానికి చెందిన అరుణ్ ప్రస్కా (24) గా గుర్తించారు. స్నేహితుడు పుట్టన రోజు వేడుకల్లొ పాల్గొనేందుకు అరుణ్ రాయగడకు గురువారం నాడు వచ్చాడు. కార్యక్రమం ముగిసిన మీదట స్వగ్రామానికి తిరిగి వెళుతున్న సమయంలో రొడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక రైతుల కాలనీ ప్రాంతంలొ జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన అరుణ్ రోడ్డు అచేతనంగా పడి ఉన్నాడు. అక్కడి వారు కొంతమంది ఆటోలో అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బరంపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే రాత్రి సమయంలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులను సంప్రదించినప్పటికీ సరైన సహకారం లభించలేదని కుటుంబీకులు ఆరోపించారు. అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం, చికిత్సలో ఆలస్యం జరగడం వల్లే అరుణ్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. నీటి సమస్యపై మహిళల ఆందోళన రాయగడ: తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించినందుకు నిరసనగా మహిళలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. సదరు సమితి కుంభికోట మెయిన్ రోడ్డుపై వారంతా ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కొద్ది నెలలుగా గ్రామంలో మంచినీటి సమస్య విలయ తాండవం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మహిళలు ఆరోపించారు. సుమారు 100 కుటుంబాలకు పైబడి ఉన్న గ్రామంలో ఉన్న మూడు గొట్టపు బావులు మరమ్మతులకు గురయ్యాయని.. ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ఫలితం లేకపొవడంతో గ త్యంతరం లేక ఆందోళనకు దిగామని మహిళలు పేర్కొన్నారు. కుంభికోట రహదారిపై మహిళలు బైఠాయించడంతో ఆ మార్గంలో రాకపొకలు నిలిచిపోయాయి. దీంతో రాయగడ నుంచి కొరాపుట్, జయపురం, మల్కన్గిరి వంటి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. వారం రోజుల్లో తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని, అంతవరకు ట్యాంకర్ల ద్వారా నీరి స్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన
● జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిజయపురం: విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయల కల్పన అవసరమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జయపురం మున్సిపాలిటీ పరిధి డెప్పిగుడ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు ఏర్పాటు చేయటంతోనే పిల్లలకు విద్యరాదని.. వారు చదువుకొనేందుకు తగిన తరగతుల గదులు, వనరులు, సౌకర్యాలు కల్పించటంతో పాటు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొరాపుట్ జిల్లాలో అనేక పాఠశాలలకు తగినన్ని వసతుల్లేవని, ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహించడంతోపాటు ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. వసతులు, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు కనుమరుగౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుచేత ప్రభుత్వం అన్ని ప్రాధమిక పాఠశాలలో తగిన వసతులు కల్పించి అవసరమైనంత మంది ఉపాధ్యాయులను నియమించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. డెప్పిగుడ పాఠశాలలో మున్సిపాలిటీ అదనపు క్లాసురూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవటం ప్రశంసనీయమన్నారు. జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, బైస్ చైర్మన్ బి.సునీత, 8వ వార్డు కౌన్సిలర్ దేవేంద్రచౌధురి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆప్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం
రాయగడ: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం అమ్ ఆద్మీ పార్టీ ( ఆప్ ) సన్నద్ధమవుతుంది. ఈ మేరకు జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు నాయకులు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు జన్మాజయ్ స్వయ్ స్థానిక రాణిగుడఫారంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆప్ జాతీయ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిశికాంత్ మహాపాత్రో నాయకత్వంలో రాష్ట్రంలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక దృష్టి పెట్టిన అధిష్టానం ఈ మేరకు రాష్ట్ర ఇన్చార్జిగా వీరేంద్ర సింగ్ కడియాన్ను నియమించిందని అన్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు సహా ఇన్చార్జిలు బాధ్యతలు తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాయగడ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, 182 గ్రామ పంచాయతీలు, 11 సమితులు, మున్సిపాలిటీలు, ఎన్ఏసీల్లో వార్డుల స్థాఽయిలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆప్ అమలు చేసిన విద్య, ఆరోగ్య, ఉచిత విద్యుత్, తాగునీరు, ఉపాధి రంగాల్లోని అభివృద్ధి నమూనాలను వివరిస్తారని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాయగడ జిల్లాలో పార్టీని మరింత బలొపేతం చేసి ప్రజల మద్దతును కూడగట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు స్వయ్ వివరించారు. -
ఉద్యానానికి ఊతమేది..?
● ఉద్యాన పంటలపై ప్రభుత్వానికి ఉదాసీనత ● పెద్దపేట పరిశోధన కేంద్రానికి నిధులు మంజూరు చేయని వైనం ● అవస్థలు పడుతున్న శాస్త్రవేత్తలు బూర్జ: కొబ్బరి, మామిడి, జీడి వంటి పంటల మీద పరిశోధనలు చేసి.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనువైన కొత్త వంగడాల అభివృద్ధి, ఉద్యాన రంగానికి సంబంధించి రైతులకు శిక్షణలు ద్వారా అవగాహన కల్పించేందుకు మండలంలోని పెద్దపేటలో ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని 2022 ఆగస్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొత్తం 77 ఎకరాలకు గా నూ సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో మేలైన కొబ్బరి, మామిడి, జీడి పంటలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు చేయాలనేది ఉద్దేశం. దీనిలో భాగంగా ప్రస్తుతం 2 ఎకరాల్లో 160 కొబ్బరి మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. కొత్త మొక్కలు రైతులకు అందజేయడం కోసం నర్సరీ తయారు చేశారు. నర్సరీలో మన ప్రాంతాలకు అనువైన రకాలు అభివృద్ధి చేసి రైతులకు సరఫరా చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. అయితే మరింత అభివృద్ధి కోసం సుమారు రూ.20 లక్షలు మంజూరు కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం మూడు జిల్లాల రైతుల ప్రయోజనం కోసం శిక్షణా కార్యక్రమాలు ని ర్వహించి, ఈస్ట్ కోస్టల్ టాల్ అనే రకం అభివృద్ధి చేసి రైతులకు అందజేయడం జరుగుతోంది. కొబ్బరి మొక్క రూ.100కు అందజేస్తున్నాం. నాణ్యమైన మొక్కల వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. – జి.నరసింహమూర్తి, ప్రధాన శాస్త్రవేత్త, పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రం కొబ్బరి మొక్కలకు వర్షాలు బాగాపడి, గాలులు వీచినప్పుడు మొవ్వుకు కుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొబ్బరిలో కొమ్ము పురుగు ఆశించినప్పుడు మొవ్వు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందువలన రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి. జీడి, మామిడి పంట కోసే సమయంలో రైతులు చెట్ల మొదళ్లను గమనించాలి. తెగుళ్ల బారిన పడినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. – టి.రాజశేఖరం, తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త, పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రం -
లైసెన్స్ లేకుండా మందుల విక్రయం
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలో లైసె న్స్ లేకుండా అల్లోపతి మందులను విక్రయిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడి ఇంటిపై ఔషధ నియంత్రణ శాఖాధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.లక్ష విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే... లొద్దపుట్టి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఎ.అమిత్రాజ్రెడ్డి తన నివాసంలో సరైన అనుమతులు, లైసెన్స్ లేకుండా అల్లోపతి మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు.. గురువారం ఔషధ నియంత్రణశాఖ సహాయ సంచాలకులు ఎం.చంద్రరావు, టెక్కలి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎన్.యుగంధరరావులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి అల్లోపతి మందులను గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా మందుల నిల్వ, విక్రయాలు చేయడం ఔషధ చట్టం –1940 నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న మందులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. -
కార్మికుల సమస్యలపై పోరాటం ఉద్ధృతం
రణస్థలం: శ్యాంపిస్టన్స్ కార్మికుల సమస్యలు వెంట నే పరిష్కరించాలని లేకపోతే దశలవారీగా పోరాటం ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు హెచ్చరించారు. మండలంలోని వరి శాం గ్రామం వద్ద గల శ్యాంపిస్టన్స్ ప్లాంట్–2 పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పరిశ్రమ వద్ద శ్యాంపిస్టన్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబ సభ్యుల 48 గంటల ధర్నా రెండో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పలు సంఘాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యాంపిస్టన్స్ యాజమాన్యం దుర్మార్గానికి నిరసనగా 600మంది కార్మికుల కుటుంబా లు 48 గంటల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 58 ఏళ్ల వరకు కార్మికులకు సర్వీస్ ఉంటుండగానే 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిందని 150 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి అర్ధంతరంగా తొలగించారని వి మర్శించారు. వారి కుటుంబాలు రోడ్డున పడి జీవనం కోల్పోయారని, పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కా ర్మికులు ఏ విధంగా జీవించాలని ప్రశ్నించారు. -
వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి
నరసన్నపేట: ఉత్తరాంధ్రలో పలు చోరీ కేసుల్లో నిందితులైన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన మండూరి సంతోష్ కుమార్, బూర అశోక్ ఎట్టకేల కు నరసన్నపేట పోలీసులకు చిక్కారు. సత్యవరం సర్వీసు రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో ఆరా తీయగా పలు కేసుల్లో నిందితులుగా తేలింది. వీరి నుంచి రూ.23.64 లక్షల విలువైన 157 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావులు నరసన్న పేట సర్కిల్ స్టేషన్లో గురువారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. ఈ ఇద్దరు యువకులు కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ కాలం గడుపుతూ వ్యసనాలకు బానిసలుగా మారారు. కార్పెంటర్ వృత్తిలో అంతగా డబ్బులు రాకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాల్లో భాగంగా దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖానికి మాస్క్లు పెట్టుకొని రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారని వివరించారు. వారిపై నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, పోలాకి, రామభద్రపురం, పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలో 7 చోట్ల చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేయ డంలో కృషి చేసిన నరసన్నపేట ఎస్ఐ బలివాడ గణేష్తో పాటు పలువురు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని అన్నారు. సమావేశంలో నరసన్న పేట సీఐ మరడాన శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
నేటి నుంచే ‘సర్’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల తయారీకి సంబంధించి భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ 5 నుంచి 11 వరకు ‘సర్’ నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారు. ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం అక్కడ ఓటర్లు ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేర్చుతారు. అక్కడ ఓటు ఉంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓట్లు ఒకే చోట ఉండేలా మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ కాకపోతే.. ఓటరుగా మ్యాపింగ్ కాకపోతే ఇబ్బంది తప్పుదు. జిల్లాలోని ఎనిమిది నియోజవర్గాల పరిధిలో ప్రస్తుతం 18,91,782 మంది ఓటర్లు ఉన్నారు. ఎందులో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మంది ఓటర్లకు మాత్రమే మ్యాపింగ్ జరిగింది. ఇంకా 35 శాతం మంది ఓటర్లను మ్యాపింగ్ చేయాల్సి ఉంది. మ్యాపింగ్ కోసం ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. మ్యాపింగ్ కాని వారు ఈ ప్రత్యేక డ్రైవ్లో మ్యాపింగ్ చేయించుకోవాలి. లేదంటే ఓటు పోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఉద్యోగులు, స్థానికంగా ఉండని వారు, బీఎల్ఓలు వచ్చే సమయంలోనూ, ఈ మ్యాపింగ్ డ్రైవ్ సమయంలో లేని వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బీఎల్ఓలే కీలకం ‘సర్’ విషయంలో బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలి. వీరికి రాజకీయ పార్టీలు నిజాయితీగా సహకరించాల్సి ఉంటుంది. ప్రతి ఓటరు మ్యాపింగ్ కావాలి. అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు సరిచేసుకోవాలి. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు వారికి అందించాలి. ఓటరు స్థానికంగా లేనప్పుడు బంధువులు వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పొరపాటున ఓటు తొలగిస్తే.. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు ఓటరుగా నమోదుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో తప్పులు ఉండకూడదు తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)–2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026) ప్రక్రియపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియకు సన్నద్ధత, అధికారులు, సిబ్బందికి శిక్షణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) జనరేషనన్, ప్రింటింగ్, ఈఎఫ్ల అందజేత, బీఎల్ఓ కిట్లు, తదితరాల గురించి వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని, ఆపై జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఉంటుందని, ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం గరిష్టంగా 1200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం కావాలని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ జరగాలన్నారు. సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నుంచి డి.మన్మధరావు, టీడీపీ నుంచి మొదలవలస రమేష్, పీఎంజేబాబు, బీజేపీ నుంచి బీఎల్ సింగ్, ఐటీ కుమార్, కాంగ్రెస్ నుంచి ఎస్.అన్నాజిరావు, కేవీఎల్ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘మ్యాపింగ్ వేగవంతం చేయండి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) – 2026 ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, క్షేత్రస్థాయి మ్యాపింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, బీఎల్ఓలతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన సర్ ప్రక్రియ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,088 మంది బీఎల్ఓలలో అత్యధిక శాతం మంది మ్యాపింగ్ను సమర్థంగా పూర్తిచేశారని, మిగిలిన 60 మంది బీఎల్ఓలు కూడా తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేసే లా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రాబోయే ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందే సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామానికి చెందిన పి. రత్నకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈమె భర్త, పిల్లలతో కలిసి విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ గత ఎనిమిదేళ్లుగా జీవనం సాగిస్తున్నా రు. వీరు బాటిల్స్ ఏరుకుంటూ జీవిస్తున్నారు. భర్త బయటకు వెళ్లి తిరిగి వచ్చి చూసినప్పటికి భార్య చనిపోయి ఉంది. పోలీసులకు వివరాలు తెలియపరచడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. జి.సిగడాం: పాలఖండ్యాం గ్రామానికి చెందిన డొప్ప అప్పన్నకు చెందిన గొర్రెల మందపై గురువారం వీధి కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రెలు చనిపోయాయి. మరో ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామంలో ఉన్న సు మారుగా 20 కుక్కలు ఒకేసారి గొర్రెలపై దాడి చేశాయని బాధితుడు వాపోయారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రణస్థలం: మండల కేంద్రంలోని జేఆర్ పురం పంచాయతీలో గల వెంకటేశ్వర కాలనీలో షేక్ సాజహన్ ద్విచక్ర వాహనం (గ్లామర్ బైక్) గుర్తు తెలియని వ్యక్తి బుధవారం తీసుకువెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో అటూ ఇటూ చాలా సేపు తిరిగి ద్విచక్ర వాహ నం నడిపించుకుని వెళ్లిపోయాడు. ఈ దొంగత నం సమీపంలోని సీసీ పుటేజ్లో నమోదైంది. ఈ చోరీ గురువారం సోషల్ మీడియా ద్వారా బహిర్గతమైంది. దీనిపై జేఆర్ పురం పోలీసు లు ఇంకా కేసు నమోదు చేయలేదు. పలాస: పలాస కాశీబుగ్గ ఔట్ సోర్సింగ్ విద్యుత్ కార్మికుడు బుధవారం సాయంత్రం విధులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. రాజమ్మకాలనీకి చెందిన విద్యుత్ కార్మికుడు నెయ్యిల గణపతి వీధి లైట్లు వెలిగించేందుకు వాటిని సరిచేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో ఉరుములు మెరుపులు రావడంతో పాటు వర్షం పడటంతో ఆయన విద్యుదాఘాతానికి గురై స్తంభం నుంచి కిందకి జారిపడి గాయాలపాలయ్యాడు. అతడిని వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ తర్వాత అక్కడి నుంచి టెక్కలి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య సేవలు అందుతున్నాయి. హిరమండలం : ఎల్ఎన్పేట, హిరమండలం మండలాల్లో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలి, భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు, విద్యు త్ స్తంభాలు నేలకొరిగాయి. భారీగా వీచిన గాలికి జనం భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది హటాహుటిన స్పందించి సహాయక చర్యలు చేపట్టి రాత్రి సమయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. -
‘ఎఫ్ఎన్ఎన్’ ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభం
విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమెరసీ–ఎఫ్ఎల్ఎన్) మెరుగుపరచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఆరు రోజులపాటు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజయనగరం, బొబ్బిలి, రామభద్రపురం, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గ కేంద్రాల పరిధిలో మొత్తం 10 కేంద్రాల్లో 1980 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల నిర్వహణను డీఈఓ యు.మాణిక్యంనాయుడు సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం, బోధనా పద్ధతులు, గ్రూప్ యాక్టివిటీస్, శిక్షణ సామగ్రి వినియోగాన్ని పరిశీలించారు. గణిత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. అసౌకర్యాల ‘శిక్ష’ణ ఆరు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తొలిరోజున అసౌకర్యాల నడుమ జరిగిందని ఉపాధ్యాయులు వాపోయారు. పట్టణంలోని పూల్బాగ్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇరుకు గదులు, పిల్లలకు వినియోగించే బెంచీలు, తిరగని ఫ్యాన్ల నడుమ శిక్షణ ఇవ్వడంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. అయితే, పదో తరగతి సప్లిమెంట్ పరీక్షల కారణంగా తరగతి గదులు ఖాళీగా లేవని, 5వ తేదీ తర్వాత సమస్య ఉండదని సమగ్రశిక్ష అధికారులు తెలిపారు. -
సుందర శ్రీకాకుళం ఏమైంది..?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నాగావళి నదిని మురికి నీటి నదిగా తయారుచేసి విధ్వంసానికి పాల్పడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. శ్రీకాకుళం నాగావళి నదిలో కళ్లకు గంతలు కట్టుకొని జల కాలుష్యం నివారించాలని కోరుతూ బుధవా రం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో సుందర శ్రీకాకుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం అమలు చేస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు. నదిలో కలిసిన ము రుగునీరు తాగడం వల్లే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. నాగావళి జల కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామన్నారు. -
ఎంపీ సప్తగిరి ప్రజలను మభ్యపెడుతున్నారు..
● రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి ఘాటు విమర్శలు రాయగడ: జిల్లా రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొరాపుట్ లోక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలకపై రాజ్యసభ మాజీ ఎంపీ, బీజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరావు ఘాటు విమర్శలు చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక రాణిగుడఫారంలో గల ఆయన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. సప్తగిరిపై విమర్శణా స్త్రాలు సంధించారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో ప్రజలను ఎంపీ సప్తగిరి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాయగడ రైల్వే డివిజన్, గుణుపూర్–తెరువలి రైల్వే లైన్, రాయగడ బైపాస్ రహదారి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం హోస్టళ్లు, బిజు సేతు వంతెనలు, రెండో కేంద్ర విద్యాలయం వంటి అనేక కీలక అభివృద్ధి ప్రాజెక్టుల డీపీఆర్ (డిటెల్ ప్రాజెక్టు రిపోర్టు)లు 2016 నుంచే సిద్ధమయ్యాయన్నారు. అయితే 2019లో ఎంపీగా ఎన్నికై న సప్తగిరి ఉలక ఈ ప్రాజెక్టులన్నింటికీ తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకోవడం ప్జరలను మోసం చేయడేమనని విమర్శించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తు ప్రజల్లో అపొహలు సృష్టిస్తోందని నెక్కంటి అన్నారు. ఎంపీ పదవిలో ఉన్నారని, ఆయన జిల్లా అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాల్లో అంతగా అనుభవం లేని సప్తగిరి ఇంకా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎద్దేవా చేశారు. ఇలా ప్రజలను తప్పుదొవ పట్టిస్తే ఆయన ప్రజల ఆదరణను పొగొట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికై నా ఆయన స్వయంగా ఈ జిల్లాకు చేసే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
బ్యాడ్మింటన్ కోర్టు నవీకరణ పూర్తి
పర్లాకిమిడి: గజపతి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టు నవీకరణ పనులు రూ. 2.4 లక్షలతో అధికారులు పూర్తిచేశారు. బ్యాడ్మింటన్ కోర్టులో కోర్టు మరమ్మతులు, మ్యాట్ మార్పిడి ఇతర పనులను పూర్తిచేశారు. ఈ సందర్భంగా గజపతి ఇండోర్ స్టేడియంలో గజపతి బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో అదనపు జిల్లా మేజిస్ట్రేటు ఫల్గునీ మఝి, జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, గుసాని సమితి బీడీఓ గౌరచంద్ర పట్నాయిక్, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి శాసనసభ్యులు రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ, ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు పూర్తిచేసినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే గజపతి జిల్లా పర్లాకిమిడిలో మరో రెండు ఇండోర్ స్టేడియంలు, ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తొలి బ్యాడ్మింటన్ మ్యాచ్ రూపేష్ పాణిగ్రాహి ఆడి ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో గజపతి బ్యాట్మింటన్ ఆటగాళ్లు మిరపల్లి ప్రసాద్, పైల క్రాంతి, ముఖేష్, కోండల్రావు, శ్యాంకుమార్, లాల్చెట్టి సంజయ్, విజయకుమార్ (చిన్ని), ఇంజా వెంకట రమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
చేతబడి నెపంతో హత్య
జయపురం: ఆదివాసీ గ్రామ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. అలాంటి సంఘటన జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఘుమర గ్రామ పంచాయతీ జొడిగుడ గ్రామంలో చోటు చేసుకుంది. చేతబడి చేసి ఆ గ్రామంలో నారాయణ మినరబలియ అనే వ్యక్తి కమలలోచన కరలియ అనే ఒక వ్యక్తిని హత్య చేశారని ఆరోపణ. దీనిపై బొయిపరిగుడ పోలీసులు ఆ గ్రామం వెల్లి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు తెలిపిన విషయం ప్రకారం.. జొడిగుడ గ్రామంలో కమలోచన కరలియ అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడి కుటుంబ సభ్యులు వైద్యం చేసేందుకు మంగళవారం రాత్రి ఆదివాసీ వైద్యుడు నారాయణ మినరబలియను పిలిచారు. దీంతో వైద్యం చేసేందుకు నారాయణ జొడిగుడ గ్రామంలో కమల లోచన ఇంటికి వెళ్లాడు. అతడు వెళ్లిన తర్వాత కమల లోచన అకస్మాత్తుగా మరణించాడు. అయితే నారాయణ మినరబలియ చేతబడి చేసి హత్య చేశాడని కమలలోచన కుటుంబం అనుమానించింది. దీంతో కమల లోచన సోదరుడు హరిబందు కరలియ, తన మిత్రుడు కఠ ఫాలియతో కలిసి నారాయణ మినరబలియ తలపైన, ముఖంపైన కొట్టి కొట్టి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. హత్య చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని నారాయణ మినరబలియ కుటుంబ సభ్యులు బుదవారం డిమాండ్ చేశారు. హత్య జరిగిన జొడిగుడ గ్రామానికి బొయిపరిగుడ పోలీసులు, కొరాపుట్ సైంటిఫిక్ టీమ్తో వెళ్లి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఎలుగుల స్వైర విహారం
జయపురం: జయపురం సమితి ఛత్రిపుట్ గ్రామంలో ఎలుగు బంట్లు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి దినం సమీప అడవి నుంచి ఎలుగు బంట్లు గ్రామంలోనికి వచ్చి పరిసర పాంతాల్లో ఉన్న పంటలను తిని పాడు చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అటవీ విభాగ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని వాటిని బంధించి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాలని ప్రజలు కోరగా.. అటవీ విభాగ సిబ్బంది ఎలుగుబంట్లను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సాయంత్రం నుంచి ప్రజలు బయటకు రావద్దని మైక్లలో హెచ్చరిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల అటవీ ప్రాంతంలో సరైన ఆహారం తాగునీరు లభించక జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
యువ గాయకులకు ఎస్పీబీ ఆదర్శం
రాయగడ: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నేటి యువ గాయకులకు ఆదర్శంగా నిలుస్తారని స్థానిక స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎస్పీ బాలు జయంతి ఉత్సవాలు స్పందన సంస్ధ ఆధ్యర్యంలో స్వాగత్ రొడ్డు సమీపంలో గల శ్రీకోదండరామ మందిరంలో గురువారం సాయంత్రం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సినీ సంగీత చరిత్రలో బాలు ఒక యుగపురుషుడని, అలాంటి మహానీయుడు, గొప్ప గాయకుడు మళ్లీ పుట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. తన మధురమైన గానంతో కొట్లాది మంది సినీ సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆయన లేని లోటు సంగీత ప్రపంచానికి తీరనిదని అన్నారు. సంస్థ కార్యదర్శి డాక్టర్ తులసీదాస్ అధ్యక్షత వహించగా సాంసృతిక విభాగం కార్యదర్శి కొండవలస కృష్ణమూర్తి పట్నాయక్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో పలువురు కవులు, గాయకులు, సాహితీ వేత్తలు ,వక్తలు పాల్గొని ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత ప్రస్థానం, సినీ జీవిత విశేషాలు, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రస్తావించారు. -
ఓటరు అవగాహన రథం ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ప్రతి గ్రామంలో ఓటరుకు అవగాహన కల్పించడం కోసం అవగాహన రథం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రతి ఒక్కరూ ఈ ఓటరు జాబితాలో తమ పేర్లును నమోదు చేసుకునే వీలుంటుందన్నారు. ఈ రథం ద్వారా ప్రజలకు భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సంక్షిప్త ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత విస్తృతం చేయనున్నారు. జిల్లా వాసులంతా ఈ కార్యక్రమానికి సహకరించి తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవాలని, పరిశుభ్రమైన ఓటరు జాబితా తయారీలో పరిపాలనకు సహకరించాలని కోరారు. చెట్ల నరికివేతపై వృద్ధుడి ఫిర్యాదు రాయగడ: పర్యావరణ పరిరక్షణ కోసం స్వయంగా నాటిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయడంతో ఆవేదన చెందిన ఓ వృద్ధుడు సదరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన సీనియర్ సిటిజన్ విష్ణు ప్రసాద్ ఖడంగా పట్టణాన్ని పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో కొరాపుట్ కూడలి పరిసరాల్లో సొంత ఖర్చుతో విలువైన మొక్కలు నాటారు. వాటిలో కొన్ని చెట్లతో పాటు కొరాపుట్ కూడలి సమీపంలో ఉన్న ఓ పెద్ద రావి చెట్టును కూడా గుర్తు తెలియని దుండగులు సగం వరకు నరికేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఐఐసీ ప్రసన్నకుమార్ బెహరా తెలిపారు. చెట్లు నరకడం నేరమని, పర్యావరణానికి విఘాతం కలిగించే పనులను ఉపేక్షించరాదని తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఆగ్రహం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని కాశీనగర్ బ్లాక్లో వంశధార నది, పురుటిగుడ నుంచి వస్తున్న 5 టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు ఇసుక లోడులను బుధవారం రాత్రి, గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో పర్లాకిమిడి రాయిచెట్టు జంక్షన్, స్టేట్ హైవే వద్ద పోలీసులు పట్టుకుని ఆదర్శ స్టేషన్లో ఉంచారు. అందులో రెండు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళానికి చెందిన మా నా నీలాద్రి ట్రాన్స్పోర్ట్ టిప్పర్లు ఉన్నాయి. అక్రమంగా ఇసుకను ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లు రాయల్టీ, ట్యాక్సు ఫీజు, నకిలీ చలానాలు ఎలాంటివి లేవని, అలాగే ఇసుక ఓవర్లోడింగ్, ప్రభుత్వ ఖనిజ సంపద దోచుకుని దొంగతనంగా రవాణా చేస్తున్నట్టు పోలీసు నిర్ధారించారు. ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు చాలా నష్టం కలుగుతుందని, పోలీసు అధికారులు విలేకరులకు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్ కేసు నంబర్ 199, 200, 201, 202, 203, 204 205, 206 కింద 13మందిని అరెస్టుచేసి, గురువారం మధ్యాహ్నం కోర్టుకు తరలించారు. ఇసుక టిప్పర్లు అక్రమంగా తరలిస్తున్న డ్రైవరు సురేష్ శోబోరో, ఎస్.విజయకుమార్, డ్రైవర్ దినేష్ గౌడో, డ్రైవరు ప్రకాష్ గౌడో, యజమాని దివాకర్ గౌడోలను కోర్టుకు తరలించారు. అక్రమంగా ఇసుకను ఒడిషానుండి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నట్టు దర్యాప్తు తర్వాత తేలిందని ఐఐసి ప్రశాంత్ భూపతి తెలియజేశారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలియజేశారు. -
ఈశ్వర తలియకు ఘనంగా నివాళులు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీలో సహిద్ ఈశ్వర తలియ స్మారక ఉద్యాన వనంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేడు సహిద్ జవాన్ ఈశ్వర తలియ స్మారక కమిటీ తలియ స్మారక ఉద్యాన వనంలో గల ఆయన ప్రతిమకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఖెందుగుడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభినాయిక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈశ్వర తలియ సేవలు తెలియజేశారు. ఈశ్వర తలియ దేశ ప్రేమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అతడి త్యాగం కొరాపుట్ జిల్లాకు గర్వకారణమన్నారు. కార్యక్రమాన్ని సహిద్ జవాన్ ఈశ్వర్ తలియ స్మారక కమిటీ అధ్యక్షుడు న్యాయ వాది విశ్వజిత్ నాయిక్ నిర్వహించారు. కార్యక్రమంలో సహిద్ ఈశ్వర తలియ కుటుంబ సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయుడు దివాకర లెంక, గ్రామ ప్రజలతో పాటు పంచాయతీలో పలు గ్రామాల నుండి ప్రజలు పాల్గొని సహిధ్ జవాన్కు శ్రద్ధాంజలి ఘటించారు. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
రాయగడ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని సాయిప్రియ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు నందకిషోర్ చౌదరి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు మొక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పూలమొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాది శుభ్రా పండా, ఉపాధ్యాయుడు జయదేవ్ శేఠి, ట్రస్ట్ కార్యదర్శి దయానంద ఖడంగా, ఉపాధ్యక్షుడు ఎం.సురేష్కుమార్, సభ్యులు గీతారాణి మిశ్రా, ప్రతిమా పాడి, అమూల్యకుమారి మిశ్రా, జి.బ్రహ్మాజీ, సునంద జెనా, మనోజ్కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు. హమ్మయ్యా.. బాలురు దొరికారు! రాయగడ: ముగ్గురు చిన్నారులు తప్పిపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తమ పిల్లలు సురక్షితంగా తమచెంతకు చేరడంతో ఊపిరిపీల్చుకున్నారు. టికిరి దళిత వీధికి చెందిన గుడు నాయక్, సంజయ్ కులసిక, ప్రీతమ్ గరడ అనే ముగ్గురు బాలురు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అన్నిచోట్లా వెతికారు. దీంతో బాధితులు టికిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారుల వివరాలను ఇతర పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ క్రమంలో రాయగడ రైల్వే స్టేషన్లో జీఆర్పీ సిబ్బంది నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఫాట్ఫారంపై నిలిచి ఉన్న రూర్కెలా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ముగ్గురు చిన్నారులు కనిపించారు. వారిని విచారించగా సరదాగా తిరగడానికి వచ్చినట్లు చెప్పారు. అనంతరం వారిని పోలీసులు బాలల సంక్షేమ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. పేద మహిళకు ఆర్థిక సాయం మల్కన్గిరి: ఖోయిర్పూట్ సమితి ముదిలిపోడ పంచాయతీకి చెందిన కమలా మాఝి అనే మహిళకు కలెక్టర్ ప్రధమేవ్ రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈమె భర్త అనారోగ్యానికి గురికావడంతో బరంపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పేదరికం కావడంతో కుటుంబ పోషణ కష్టమైంది. ఈ నేపథ్యంలో అధికారులను ఆశ్రయించగా సాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి మల్కన్గిరి : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత జీత్ కుసుమకుమార్ అన్నారు. గురువారం మల్కన్గిరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మనోరంజాన్ త్రిపాఠి, కృష్ణ కుల్దీప్, చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ విజేతగా జనకమాడి
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితి కెరమటి గ్రామ పంచాయతీ కాపుగుడలో గత 9 రోజుల నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. టోర్నమెంట్లో 16 టీమ్లు పాల్గొన్నాయి. ఫైనల్కు రాణిగుడ, జనకమాడి గ్రామాల టీమ్లు చేరాయి. టాస్ గెలిచిన రాణిగుడ టీమ్ 10 ఓవర్లలో 80 పరుగులు చేసి అల్ ఔటైంది. 81 పరుగుల విజయ లక్ష్యంతో ఆడిన జనకమాడి టీమ్ 6 ఓవర్లలో 81 పరుగులు చేసి విజయం సాధించింది. టోర్నమెంట్ బహుమతుల ప్రధాన ఉత్సవంలో కాంగ్రెస్ నేత అనామ దియాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేతలను బహుమతులతో సత్కరించారు. చాంపియన్ జట్టుకు రూ.10 వేల నగదు, ట్రోఫీ అందజేశారు. రన్నర్ టీమ్కు రూ.8 వేల నగదు ట్రోఫీ అందజేసి సన్మానించారు. బహుమతుల ప్రదానోత్సవంలో కుంద్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోకుల పట్నాయక్, కార్యదర్శి దైతారి మల్లిక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సాధారణ కార్యదర్శి రాజేష్ గురు, కుంద్ర పంచాయతీ సమితి మాజీ అధ్యక్షుడు సురేంద్ర పొరజ, ఏఐసీసీ సభ్యులు లక్ష్మీకాంత పట్నాయక్ రాణిగుడ సర్పంచ్ శివ ప్రధాన్, గోపాల గౌడ, నంద హరిజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ ర్యాంకర్ చేయని సాహసం.. ఐఐటీ బాంబే సీటు వదులుకుని!
జేఈఈ అడ్వాన్స్డ్.. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటి. అలాంటి పరీక్షంలో సింగిల్, డబుల్ డిజిట్ ర్యాంకులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ ర్యాంక్తో.. ఐఐటీ బాంబే లాంటి ప్రతిషాత్మక వర్సిటీలో సీటు దక్కించుకోవడం గొప్ప అవకాశం కాదంటారా?. కానీ ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి.. అదెంత మాత్రం కాదనే అంటున్నాడు. ఎందరో ఆ అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా చదువుతుంటే.. చేతిదాకా వచ్చిన ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. ఒడిశాకు చెందిన మహరూఫ్.. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో 32వ ర్యాంకర్. ఈ ర్యాంక్తో ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు సులభంగా దక్కుతుందని అతని పేరెంట్స్ ఆశపడ్డారు. అయితే.. మహరూఫ్ మాత్రం వద్దని వాళ్లతో చెప్పేశాడు. అందుకు కారణం.. అన్న మస్రూర్కు దూరం కావడమే!. మస్రూర్, మహరూఫ్ కవలలు. ఇద్దరూ ఈ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మస్రూర్ ఆల్ ఇండియాలో 169వ ర్యాంక్ పొందాడు. అయితే.. అన్నని వీడి ఉండలేని మస్రూర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐఐటీ బాంబే సీటు కాదని.. తన అన్నతోపాటు మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను అన్నతో కలిసి చదవాలనుకుంటున్నాను” అని మహరూఫ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మస్రూర్ కూడా తన తమ్ముడి నిర్ణయాన్ని ఎంతో భావోద్వేగంగా స్వీకరించాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నామని, ఇప్పుడు కూడా కలిసి చదవడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. ఈ నిర్ణయం వారి కుటుంబానికి ఎంతో గర్వకారణంగా మారింది. అలాగే వారి విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. తండ్రి డాక్టర్గా పనిచేస్తుండగా, తల్లి డాక్టర్ జీనత్ బెగం తన ఉద్యోగాన్ని వదిలి పిల్లలతో కలిసి కోటా(రాజస్థాన్, దేశంలో కోచింగ్ హబ్)కు వెళ్లి వారి చదువుకు పూర్తిగా అంకితమయ్యారు. కుటుంబం నుంచి వచ్చిన ఈ మద్దతే ఇద్దరి విజయానికి బలమైన పునాది అయింది.కోటాలో ఉన్న సమయంలో ఇద్దరూ అత్యంత క్రమశిక్షణతో చదివారు. రోజుకు సుమారు ఐదు గంటల కోచింగ్, గంటసేపు డౌట్స్ క్లియరింగ్, ఆపై గంటల తరబడి స్వీయ అధ్యయనం చేసేవారు. అదే సమయంలో పరస్పరం ఒకరికి ఒకరు క్లిష్టమైన అంశాలు వివరించడం, పరీక్షల తర్వాత కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వారి ప్రత్యేకతగా నిలిచింది.ఇప్పుడు ఈ ఇద్దరి కథ కేవలం ర్యాంకుల గురించి మాత్రమే కాదు, బంధాల విలువ గురించి కూడా చెబుతోంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటును కూడా వదిలేసి కుటుంబం కోసం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థి జీవితంలో సక్సెస్ అంటే ఏమిటో కొత్తగా నిర్వచిస్తోంది. ర్యాంకులు, కాలేజీలు ఎంత గొప్పవైనా, బంధాలు వాటికన్నా గొప్పవని మహరూఫ్ తీసుకున్న నిర్ణయం నిరూపిస్తోంది. -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
రాయగడ: ప్రతి చిన్నారీ చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆకాంక్షించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, విద్య హక్కు అమలు, వివిధ శాఖల సమన్వయ చర్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాయగడ జిల్లా పరిషత్ సమవేశ మందిరంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఈఎస్ఐ శాఖలు సంయుక్తంగా ‘ప్రతి చిన్నారి –చదవాలి –ఎదగాలి–కలలు కనాలి’ అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో బాల కార్మిక నిర్మూలన చట్టాలు, బాలల హక్కులు, విద్యావకాశాలు, పునావాస చర్యలు, శాఖల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రాబల్యం గల ఈ జిల్లాలో బాలల విద్య, భద్రత, సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం అత్యున్నత స్థాయి ప్రాధాన్యం కల్పిస్తుందని వివరించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ బబితా పాత్రొ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధమే కాకుండా చిన్నారుల హక్కులు, భవిష్యత్కు తీవ్రమైన దెబ్బగా అభివర్ణించారు. పేదరికం, నిరక్ష్యరాస్యత మాకద్రవ్యాల వ్యసనం, భిక్షాటన, బాలల అక్రమ రవాణా వంటి అంశాలు బాల కార్మిక వ్యవస్థ పెరుగుదలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిర్మూలించడానికి సమాజంలొ ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎస్పీ రాజ్ప్రసాద్ మాట్లాడుతూ బాల కళాకారులు, బాల కార్మికుల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా వివరించారు. నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెషర్ విరాజ్ స్వయిన్ మాట్లాడుతూ బాల, కిశోర కార్మిక చట్టం–1986, ఒడిశా నిబంధనలు –2017, బాల న్యాయ చట్టం –2015 , విద్యాహక్కు చట్టం –2009 మధ్య ఉన్న అనుసంధానాన్ని వివరించారు. -
సబ్ డివిజన్ హాస్పిటల్గా గుర్తించాలి
జయపురం: బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిని సబ్ డివిజన్ హాస్పిటల్గా గుర్తించి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని బొయిపరిగుడ సురక్షా మంచ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావో ప్రభావిత ప్రాంతమైన బొయిపరిగుడ సమితిలో 10 పంచాయతీలతో పాటు సమితి సరిహద్దున కుంధ్ర సమితిలో మరో 5 పంచాయతీల ప్రజలకు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రే ఆధారమని చెప్పారు. పలు కారణాల వల్ల ఉచిత వైద్య సేవలు అందడం లేదన్నారు. డాక్టర్లు, నర్సుల స్థానాలు ఖాళీగా ఉన్నాయన్నారు. బొయిపరిగుడ మీదుగా విజయవాడ– రాంచీ 326 జాతీయ కారిడార్ ఉండటం వల్ల ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, క్షతగాత్రులంతా బొయిపరిగుడ ఆస్పత్రికి వస్తున్నా సరైనా వైద్యసేవలు అందడం లేదన్నారు. తక్షణమే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
యువకుడు అదృశ్యం
పర్లాకిమిడి: మతిస్థిమితం కోల్పోయిన యువకుడు సిద్ధేశ్వర సాబత్ (34) ఈ నెల ఒకటో తేదీ నుంచి కనబడడం లేదని తండ్రి అప్పన్న సాబత్ స్థానిక పోలీసు ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒడియాలో తక్కువగా మాట్లాడుతున్న ఈ యువకుడు మహేంద్ర మేళాకు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎవరికై నా యువకుడి వివరాలు తెలిస్తే పర్లాకిమిడి ఆదర్శ పోలీసు ష్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఐఐసీ ప్రశాంత్ భూపతి బుధవారం తెలియజేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని పోలీసు ష్టేషన్లకు సమాచారం అందజేసినట్లు ఐఐసీ తెలిపారు. దర్యాప్తు చేపడుతున్నామన్నారు. -
మహేంద్ర మేళాను సందర్శించిన శ్రీనివాసానంద సరస్వతి
పర్లాకిమిడి: పవిత్రమైన మహేంద్రగిరి పర్వతంపై జరుగుతున్న యజ్ఞాలు, మేళాను ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి బుధవారం సందర్శించారు. ఆయనతో క్రాంతి మహారాజ్ (రాయగడ), పాతపట్నం బీజేపీ మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గోసమ్మాన్ అభియాన్ జిల్లా కార్యదర్శి (గజపతి) రమేష్ చంద్ర పాత్రో, మానవహక్కుల సంఘం నాయకులు లక్ష్మీకాంత పాఢి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తిరిగి పునర్జన్మ ఉండదన్నారు. ఎక్కడో హిమాలయాల వద్ద ఉన్న కేదారేశ్వర స్వామిని అధిక ఖర్చుతో దర్శించుకుంటారని.. కానీ దగ్గరలో ఉన్న మహేంద్రంను దర్శించుకుని ఇక్కడ జరుగుతున్న యజ్ఞ యాగాదులు చూసి తరించాలని కోరారు. స్వామి శ్రీనివాసానంద సరస్వతికి అఖిలభారత యువజన సేవాసమితి అధ్యక్షులు గిన్ని కూర్మారెడ్డి, బీజేపీ నాయకులు శాసనం లింగరాజు, శ్రీకాంత్ రెడ్డిలు దుశ్శావలతో సన్మానించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పర్లాకిమిడి: ఎస్పీ మీనా ఆదేశాల మేరకు గజపతి స్టేడియం, ఫారెస్టు గేటు వద్ద మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పలువురు పట్టుబడటంతో రూ.1,23,000 జరిమానా విధించారు. జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రివేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యలు చేపడుతున్నారు. కొత్త బస్టాండ్లో సౌకర్యాలు కల్పించాలి జయపురం: జయపురం కొత్త బస్టాండ్లో ఏటీఎం కౌంటర్, డార్మిటరీలు వంటి సౌకర్యాలు కల్పించాలని బీజేడీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జయపురం మాజీ మంత్రి రబినారాయణ నందో నేతృత్వంలో పలువురు యువ కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు డీటీఎం ఆరోశ్రీ సాహును కలిసి వినతిపత్రం అందించారు. బస్టాండ్ ప్రారంభించి రెండేళ్లు గడిచినా ఇంతవరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తగదన్నారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్గా మిశ్ర, మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మినారాయణ, దేవేంద్ర చౌదురి, సత్యాదన మహానందియ, సుజిత్ కుమార్ పాణి, పి.కృష్ణ, బాగ్యానంద నాగ్, కె.శ్రీనివాసరావు, శివపట్నాయిక్, మహేంద్ర అధికారి, హిమాంశు చంద్ర చౌదురి తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి మల్కన్గిరి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని మల్కన్గిరి జిల్లా యువ బీజేడీ, విద్యార్థి బీజేడీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేడీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాసు ముదిలి బుధవారం కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్కేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ర్యాంపులు గడువు ముగిసినా ఇసుక మాఫియా వందలాది వాహనాల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా చూపుతూ తనిఖీలు నిర్వహించకపోవడం తగదన్నారు. ఇప్పటికై నా అక్రమ రవాణా అరికట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కామి, జిల్లా కార్యదర్శి కె.రాహుల్, అధిడు సుబ్రత్కుమార్ దాస్, సుదర్శన్ కోపే, రాకేష్ మండల్, గౌరవ్ సగాడియా పాల్గొన్నారు. -
అమరవీరుల విగ్రహాల ఏర్పాటుకు చర్యలు
పర్లాకిమిడి: పురపాలక సంఘ సమావేశం బుధవారం మున్సిపల్ కార్యాలయం మందిరంలో బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. ఆయనకు కౌన్సిల్ చైర్మన్, సభ్యులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యుల చర్చించారు. ప్రధానంగా పట్టణంలోని పలు ముఖ్యమైన స్థలాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ఒడిశా రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన మహానీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మున్సిపల్ పరిధిలో అనేక వార్డుల్లో డ్రైనేజీలు మరమ్మతులు కొన్నేళ్లుగా జరగకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సభ్యులు అన్నారు. వాటిని తిరిగి పునఃనిర్మాణం చేయాలని కోరారు. మున్సిపల్ వైస్చైర్మన్ లెంక మధు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మణముర్ము, ఎంపీ ప్రతినిధి అదర్శదాస్, సరిహద్దు ప్రహరీ పూర్ణచంద్ర మహాపాత్రో, కౌన్సిలర్లు బాలక్రిష్ణ పాత్రో, బిభూతి పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
ఆశయ సాధనే ధ్యేయం
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026బిజూ పట్నాయక్ ..రాయగడ: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానాయకుడు బిజూ పట్నాయక్ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా బిజూ స్వాభిమాన్ మంచ్ (బీఎస్ఎం ) సంస్థ పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బిజూ స్వాభిమాన్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. సదరు సమితి బాకురుగుడ సమీపంలో బుధవారం నిర్వహించిన బీఎస్ఎం కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించి మహానీయుడిగా గుర్తింపు పొందిన బిజూ పట్నాయక్ పేరిట ఆవిర్భవించిన ఈ సంస్థ ప్రజల ప్రయోజనాలకు, వారి సంక్షేమానికి మాత్రమే పనిచేస్తోందని స్పష్టం చేశారు. జిల్లాలో రాజకీయాలు భ్రష్టుపడ్డాయని అందువల్ల బీఎంఎస్ ఆధ్వర్యంలో రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ప్రజల అభిమతం తెలుసుకునే ప్రయత్నంలో ఇటీవల కొలనార సమితిలో సమావేశం నిర్వహించగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని అన్నారు. అనంతరం రాయగడ సమితిలో నిర్వహించిన సమావేశంలో కూడా అత్యధికంగా ప్రజలు పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జులై నెల నుంచి అన్ని సమితుల్లో సమావేశాలు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో జూలై నెల నుంచి జిల్లాలోని అన్ని సమితుల్లొ బిజు స్వాభిమాన్ మంచ్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని నెక్కంటి ప్రకటించారు. ఈ సమావేశాలతో ప్రజల అభిమతం తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఆవిర్భవించిన ఈ సంస్త ప్రజలకు చేరువయ్యే దిశగా పయనిస్తుందని అన్నారు. అందువల్ల ముందుగా అవిభక్త కొరాపుట్ జిల్లాలో తమ కార్యకలాపాలను విస్తరించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. వారిని తీర్చిదిద్దడమే ధ్యేయంగా తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. తన వెంట ఉన్న వారికి అండగా నిలబడేందుకు తాను ఎటువంటి సహాయాన్ని చేయడానికై నా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. అలాగ రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్ఎం సంస్థను విస్తరించే దిశగా త్వరలో అభిమానులు, మద్దతుదారుల సలహాల మేరకు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఏదిమైనప్పటికీ రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్ఎం తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపుతామని స్పష్టం చేశారు. అవసరమైతే తమ సహాయాన్ని కోరే ఏ పార్టీకై న తమ మద్దతు ఇచ్చే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. రాజకీయ పార్టీకి అతీతంగా ఆవిర్భవించిన బిజూ స్వాభిమాన్ మంచ్ ఇకపై తన సత్తా చాటుకునే విధంగా క్షేత్రస్తాయి నుంచి పనులు ప్రారంభిస్తుందని నెక్కంటి అన్నారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంత వరకు ఈ సంస్థ ముందుకు దూసుకుపోతుందన్నారు. ప్రజల అభీష్టం మేరకు పనిచేస్తుందని ప్రకటించారు. వెన్నుపోటు పార్టీలకు బుద్ధి చెబుతాం: మాజీమంత్రి లాల్ బిహారి హిమిరిక రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నాయకుడు నెక్కంటి భాస్కరావుకు తామెప్పుడు మరిచేదిలేదని రాష్ట్ర మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక అన్నారు. సమావేశంలొ పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. ఆయన హయాంలొ జిల్లా సమగ్రాభివృద్ధి చెందిందని అన్నారు. గ్రామాలకు తాగునీరు, రహదారుల ఏర్పాటు వంటి ఎన్నో మౌలిక సౌకర్యాలు కల్పించారని అన్నారు. అయితే కుటిల రాజకీయ పార్టీల కారణంగా నెక్కంటి కొన్ని పార్టీలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. అయితే పార్టీలకు దూరమైనప్పటికీ ప్రజా సేవయే పరమావధిగా తన నిరంతర కృషి కొనసాగిస్తున్నారని అన్నారు. ఆయన కృషి ఫలితమే బిజూ స్వాభిమాన్ మంచ్ సంస్థ ఆవిర్భవించిందని హిమిరిక అన్నారు. ఈ సంస్థ ద్వారా జిల్లాలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు అంతా కలసి కట్టుగా కృషి చేస్తామని అన్నారు. వెన్నుపోటు పొడిచే నాయకులకు, కొన్ని రాజకీయ పార్టీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పేవిధంగా తమ వ్యూహాలు ఉంటాయని అన్నారు. సమావేశంలొ శ్రీక్షత్ర టౌన్షిప్ అధినేత దూడల శ్రీనివాస్ రావు ఆదివాసీ భాషలో ప్రసంగించి బిజూ స్వాభిమాన్ మంచ్ పనితీరు గురించి వివరించారు. ఈ జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన నెక్కంటికి తామంతా అండగా ఉండి తమవంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. సంస్థ నాయకులు బనాఘటి తిరుపతి, కాసీపూర్ సమితి అధ్యక్షుడు కంఠొ మాఝి, రాయగడ సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుక, సీనియర్ నాయకుడు సుభాష్ బక్షీ, జిల్లా పరిషత్ సభ్యురాలు సంధ్యాపులక తదితరులు ప్రసంగించారు. అంతకు ముందు కొత్తపేట నుంచి సమావేశ వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలొ పాల్గొన్న నెక్కంటి సుమారు రెండు కిలొమీటర్ల దూరం కాలినడకన నడిచి వేదిక వరకు చేరుకున్నారు. ర్యాలీలో ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సమావేశం ఉంటామని వెల్లడి -
చురుగ్గా రథాల తయారీ
భువనేశ్వర్: ప్రసిద్ధ పూరీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. అక్షయ తృతీయ నుంచి మొదలైన రథ తయారీ పనులు 42వ రోజు సరికి ఇరుసుకు చక్రాల అమరిక పూర్తి కావడం విశేషం. ప్రధాన మహారణ మార్గదర్శకంలో రథ కార్మికులు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. సాధారణంగా శీతల షష్టి నాటికి పూర్తి కావలసిన చక్రాల అమరిక చాలా ముందుగానే పూర్తి చేశారు. భంవురి రోజున లాంచనంగా 3 రథాల ఇరుసుకు చక్రాల అమరికను పూర్తి చేశారు. 41వ రోజున 3 రథాల 18 ఇరుసులకు 36 చక్రాలను భోయ్ సేవకులు అనుసంధానించి హరీ బోల్ నినాదంతో ఉర్రూతలూగారు. మొదటగా తాళ ధ్వజ రథం 6 ఇరుసులకు 12 చక్రాలను, నంది ఘోష్ రథం 7 ఇరుసులకు 14 చక్రాలను, దేవ దళన్ రథం 5 ఇరుసులకు 10 చక్రాలను అనుసంధానించడంతో చక్రాల అమరిక ప్రక్రియను పూర్తి చేశారు. దీని తర్వాత రథాల పైభాగం పనులు అంచెలంచెలుగా ఊపందుకుంటాయి. ఈ దశ పనుల్లో రూపకారుల పాత్ర పుంజుకుంటుంది. అలాగే కమ్మరి వర్గం సేవకులు పలు పరిమాణాల మేకులు వగైరా తయారీలో తలమునకలై ఉన్నారు. ఇలా పలు రకాల పనుల్లో 205 మంది సేవకులు పని చేస్తున్నారు. మూడు రథాల తయారీ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 3 రథాలకు చెందిన 21 ఇరుసులకు 42 చక్రాలు అనుసంధానం పూర్తి చేశారు. ఆ తర్వాత రథం యొక్క ఇతర భాగాలను దశల వారీగా అమర్చుతారు. రూపకార్ సేవకులు మూడు రథాలలోని వెలుపలి భాగాల్లో సింహం, ఏనుగు చెక్కడం పనుల్లో హడావిడిగా ఉన్నారు. -
ఘనంగా మహేంద్ర మేళా
పర్లాకిమిడి: మహేంద్రగిరిలో మహేంద్రమేళా ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బిభూతీ జెన్నా మంగళవారం మధ్యాహ్నం మేళాను సందర్శించారు. మంత్రి బిభూతీ జెన్నాకు కాశీ సుమేధుపీఠాధిపతి జగద్గురు సరస్వతీ స్వామి, నరేంద్ర సరస్వతీ మహారాజ్, స్వామి హారిహార మహారాజ్, స్వామి భాస్కర తీర్ధ సరస్వతీ గౌరవంగా స్వాగతించారు. అనంతరం మహారాజ్ తదితరులును స్వాగతించారు. సనాఽతన ధర్మం, విశ్వశాంతి మహాయజ్ఞం జరుపుతున్న పండితుల వద్దకు మంత్రి పలకరించారు. అనంతరం ఆయన కుంతీ మందిరానికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. మహేంద్రగిరి ఆధ్యాత్మిక చింతనకు, భక్తి, ధ్యానం, శాంతి, శాశ్వత సంస్కృతి, దివ్యవైభవంతో ప్రకాశిస్తున్నదని, మహేంద్రుని అనంత కృపతోఈ ఆధ్యాత్మిక మహోత్సవం విజయవంతం కావాలని మంత్రి బిభూతీ జెన్నా ఆకాంక్షించారు. ప్రపంచంలో శాంతి, సద్భావన, ఆధఆ్యత్మిక చైతన్యం సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి జెన్నా అన్నారు. అనంతరం మంత్రి ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్టుకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట గజపతి జిల్లా ఎస్డీసీ చైర్మన్ కామదేవ్ బోడోనాయక్ ఉన్నారు. సందర్శించిన మంత్రి బిభూతీ జెన్నా -
జిల్లా అభివృద్ధిపై సమీక్ష
మల్కన్గిరి: వికసిత ఒడిశా విజన్ 2036–47 లక్ష్యంగా రాష్ట్రంలో అమలవుతున్న మోడల్ విలేజ్ విజన్, స్వాభిమాన్ ప్రాంతాభివృద్ధి కోసం కొనసాగుతున్న సేతు పథకంపై ఉన్నత స్థాయి సంయుక్త సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో జరిగిన సమావేశంలో చిత్రకొండ సమితి స్వాభిమాన్ ప్రాంతంతో పాటు మొత్తం జిల్లా సమగ్ర అభివృద్ధి, రూపాంతరణపై విస్తృత కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్యఅభివృద్ధి అధికారి దశరాథి సరాబు మోడల్ విలేజ్ మిషన్ అమలు విధానాన్ని వివరించారు. గ్రామాలకు, పట్టణస్థాయి సౌకర్యాలను అందించి.. వాటిని స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడమే మిషన్ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలోని 111 గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ప్రత్యేకంగా చిత్రకొండ సమితిలోని 18 పంచాయతీలు, కోరుకొండ సమితిలో నక్కమామిడి పంచాయితీ చేర్చబడ్డాయి. ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
అల్యూమినియం స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టు
రాయగడ: వేదాంత లంజిఘడ్ అల్యూమినియం ప్రాజెక్టు నుంచి భారీ మొత్తంలో అల్యూమిన పౌడర్ను అక్రమంగా తరలిస్తూ ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద రాకెట్ను జిల్లాలోని మునిగుడ పోలీసులు బట్టబయలు చేశారు. సోమవారం రాత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో అల్యూమినియం లోడ్తో వెళ్తున్న 7 పికప్ వ్యాన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ఆ వాహనాల్లో గల ఏడుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు. మునిగుడ ఐఐసీ కేశవ్ షడంగి తెలిపిన వివరాల ప్రకారం వేదంత అల్యూమిన ప్రాజెక్టు నుంచి చోరీ చేసిన అల్యూమిన పౌ డర్ను పికప్ వాహనాల్లో లోడ్ చేసి రాష్ట్రం బయటకు తరలిస్తున్న సమయంలో పోలీసులు వ్యూహం ప్రకారం వాహనాలను పట్టుకున్నారు. ఈ రవాణా చేస్తున్న డ్రైవర్లను కోర్టుకు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు. -
ఎస్ఐఆర్పై అవగాహన
రాయగడ: కొండలు, అడవులు, భాషా అవరోధాలను అధిగమిస్తూ జిల్లా యంత్రాంగం స్వతంత్ర సఘన సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని నియమగిరి కొండల ప్రాంతంలో నివసిస్తున్న ఫకేరి గ్రామంలో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదిమ ఆదివాసీ ప్రాంతంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని 139–బిసంకటక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిఽధిలో ఉన్న ఈ గ్రామంలో ఓటరు అవగాహన కల్పించడం, ఎన్యూమరేషన్ ఫారమ్ల పంపిణీ కార్యక్రమాన్ని సంబంధత శాఖ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ నాయకత్వంలో కళ్యాణసింగుపూర్ సమతి బీడీవో మనీషా దాస్, డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ సాహు, పీఈవో శ్వేతాంబర్ ప్రధాన్ తదితరులు ఫకేరీ గ్రామానికి అత్యంత ప్రయాసపడి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డొంగిరియా గోండి భాషలో గ్రామస్తులతో మాట్లాడి ఎస్ఐఆర్–2026 లక్ష్యాలు, ప్రాధాన్యత, ప్రక్రియ గురించి వివరించారు. జిల్లా యంత్రాంగం ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గిరిజన సముదాయాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత భాగస్వాములను చేయగలిగింది. ప్రజల మాతృభాషలో అవగాహన కల్పించడం వల్ల ఈ కార్యక్రమం మరింత సులభంగా విజయవంతమవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
మల్కన్గిరిలో మామిడి మేళా ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని పాత మెడికల్ కళాశాల మైదానం మామిడిపండ్ల మేళాను మంగళవారం ప్రారంభమైంది. జిల్లా పరిపాలన, ఓర్మాస్ సంయుక్త ఆధ్వర్యంలో మేళాను నిర్వహిస్తున్నారు.మల్కన్గిరి గిరిజన రుతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల పర్యవేక్షణలో ఈ నెల ఐదో తేదీ వరకు నిర్వహించనున్న మేళాను జిల్లా అదనపు కలెక్టర్ వెద్బ్ర్ ప్రధాన్ ప్రారంభించారు. మేళాలో 20 రకాల మామిడి పండ్లను విక్రయాల కోసం రైతులు తీసుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళలు మామిడితో చేసిన వివిధ రకాల పానియాలను విక్రయిస్తున్నారు. మామిడి పానకం, మ్యాంగో షేక్ ప్రత్యేక అకర్షణగా నిలిచింది. మేళా ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, ఓర్మాస్ కార్యనిర్వహక అధికారి స్వస్తికా ప్రధన్, వ్యాపారులు జితేంధ్ర కుమార్ పాత్రో, అమిత్ కుమార్, అధికారులు మమతా మహాపాత్రో, శ్యామ్ ముదిలి, జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు బాలాజీ పట్నాయక్, మానాస్ మిశ్రో, హిమాన్షు మహరాణా పాల్గొన్నారు. -
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి విచ్చేయనున్నారు. రైరంగ్పూర్ను సందర్శించనున్నారు. మయూర్భంజ్ లోక్ సభ సభ్యుడు నొబొ చరణ్ మాఝీ ఈ విషయం తెలిపారు. రాష్ట్రపతి ఈ నెల 19, 20 తేదీలలో రెండు రోజులు రాష్ట్ర పర్యటనలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి ఈ నెల 20వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి మెట్టినింటి గ్రామం పహడ్పూర్, రాయిరంగ్పూర్లో శంకు స్థాపన చేసి పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కుసుమ మండలం సులిదుమాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. భువనేశ్వర్ హై టెక్ మెడికల్ కాలేజీ కొత్త డైరెక్టర్గా సీతారాం భువనేశ్వర్: సీనియర్ వైద్యుడు మరియు పాథాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం మహా పాత్రో భువనేశ్వర్ హై టెక్ వైద్య బోధన ఆస్పత్రి డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మరియు మెడికల్ సూపరింటెండెంట్గా నియమితులు అయ్యారు. డాక్టర్ సీతారాం మహా పాత్రోకు వైద్య, పరిపాలనా రంగాలలో అనేక సంవత్సరాల నైపుణ్యం, అనుభవం ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పదవులలో అంకిత భావంతో పని చేశారు. ప్రస్తుతం జాజ్పూర్ మహా రాజా యయాతి కేశరి వైద్య బోధన ఆస్పత్రి డీన్, చైర్మన్గా పని చేస్తున్న డాక్టర్ సీతారాం మహా పాత్రో ప్రఖ్యాత వైద్యుడిగా, నిర్వాహకుడిగా పేరు పొందారు. టెన్త్ విద్యార్థులకు వేసవి విద్యా శిబిరాలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థుల కోసం 20 రోజుల పాటు వేసవి విద్యా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి శిబిరాలు ఆరంభమయ్యాయి. ప్రతి పాఠశాలలో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. స్మార్ట్ క్లాస్ల ద్వారా అంశాల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేస్తారు. అలాగే ఆదివారం రోజున కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఈ నెల 20వ తేదీన తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖాధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు విద్యాశాఖ అధికారి మాంజులాతా బోయి, భగీరధి బెహరా పాల్గొన్నారు. పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆదివాసీ ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టును అమలు చేస్తుంది. మంగళవారం నువాగడ బ్లాక్ నుంచి సెరంగో (గుమ్మా బ్లాక్) వరకు సుమారు 16 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి నువాగడ బ్లాక్ వద్ద శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.40.21 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దీంతో గుమ్మా బ్లాక్ సెరంగో ప్రజలు పర్లాకిమిడి వచ్చి నువాగడ వెళ్లకుండా నేరుగా సెరంగో గ్రామం నుంచి నువాగడ బ్లాక్కు చేరుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, ఎస్డీసీ చైర్మన్ కామ్దేవ్ బోడోనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోరో శోబోరో, రోడ్లు–భవనాల శాఖ సూపరింటెండింట్ ఇంజినీర్ అభిషేక్ శెఠి, తదతరులు పాల్గొన్నారు. -
వర్సిటీలు సమర్థులను తయారు చేయాలి: గవర్నర్
● వీసీల సదస్సు ముగింపు ● పరిశోధనలు, ఉపాధి కల్పనపై చర్చ భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు విద్యార్థుల్లో జ్ఞానాన్ని సృష్టించి ఆవిష్కరణల ప్రోత్సాహంతో వ్యక్తిత్వ, నాయకత్వ లక్షణాలతో చైతన్యవంతమైన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని వైస్ చాన్స్లర్లకు గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్లర్ల సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విశ్వ విద్యాలయాలు కేవలం డిగ్రీ హోల్డర్లను మాత్రమే కాకుండా సమర్థులైన పౌరులను, సమస్య పరిష్కర్తలను, ఆవిష్కర్తలను, దేశ నిర్మాతలను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. పరిపాలన సంస్కరణలు, పరిశోధన, ఆవిష్కరణలు, అంతర్జాతీకరణ, ఉపాధి కల్పన, డిజిటల్ పరివర్తన, పారిశ్రామిక భాగస్వామ్యాలు, జాతీయ విద్యా విధానం అమలుపై సదస్సులో జరిగిన చర్చలు నిర్దిష్ట చర్యలుగా రూపుదిద్దుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. చాన్స్లర్గా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఒడిశాలో ఉన్నత విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో చేసే వాస్తవ ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ, వ్యవస్థాపక, ఉ పాధి పథకాలపై విద్యార్థులలో అవగాహన కల్పించాలని గవర్నర్ విశ్వవిద్యాలయాలను కోరారు. తద్వారా యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉత్తమ పద్ధతులకు పేరుగాంచిన సంస్థలను సంయుక్తంగా సందర్శించి, విజయవంతమైన నమూనాలను తమ క్యాంపస్లకు అనుగుణంగా మార్చుకోవాలని ఆయన వైస్ చాన్స్లర్లను ప్రోత్సహించారు. ఉన్నత విద్యా సంస్థల దీర్ఘకాలిక వృద్ధి, అభివృద్ధికి సంస్థాగత ఆస్తులను పరిరక్షించడం అత్యవసరం. ముగింపు కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ అనేక సంస్థలు ఆక్రమణలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొత్త ఆక్రమణలను నివారణకు అప్రమత్తతో కూడిన సమర్థవంతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఆయన విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. క్యాంపస్ జీవితంలో భాగంగా ఉపయోగించని భూమిని మొక్కలు నాటే కార్యక్రమాలతో పచ్చదనం విస్తరణకు వినియోగించుకోవాలని కోరారు. ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని, ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూసుకోవడం సంస్థల సమాన బాధ్యతగా గవర్నరు పేర్కొన్నారు. పైకప్పు స్థలాలను ఉపయోగించుకుని సౌర విద్యుత్ ఉత్పత్తితో సంప్రదాయ విద్యుత్ అవసరాలను కొంతమేర తీర్చుకోవాలని గవర్నరు ప్రోత్సహించారు. విశ్వవిద్యాలయాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను అన్వేషించి పునరుత్పాదక ఇంధన సేవా సంస్థ (రెస్కో) నమూనాను అనుసరించాలని సూచించారు. సదస్సు చివరి రోజున రెండు సెషన్లు జరిగాయి. ఈ సెషన్లలో వివిధ విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్లర్లు పలు సమకాలీన అంశాల్ని ప్రదర్శించారు. హరిత ఇంధనం, సుస్థిరత కార్యక్రమాలు, క్వాంటం కంప్యూటింగ్, వర్ధమాన సాంకేతికతలు, సంస్థాగత పాలనలో ఉత్తమ పద్ధతులు, విద్యా నైపుణ్యం వంటివి ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడారు. గవర్నర్ సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉన్నత విద్యా సంస్థలన్నింటిలో నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాలను విస్తరిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. -
రైల్వే అర్బన్ బ్యాంక్ వాటాదారులకు లాభసాటి సౌకర్యాలు
భువనేశ్వర్: ఖుర్దారోడ్ రైల్వే మండలం రైల్వే అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులకు పలు ఆకర్షణీయమైన లాభసాటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డైరెక్టర్ జగ్మోహన్ ఖుంటియా తెలిపారు. రుణాలపై వడ్డీ 1 శాతం తగ్గింపు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ 6 శాతం నుంచి 8.5 శాతానికి పెంపుదల, పొదుపు సొమ్ముపై వడ్డీని 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచడంతో అయోధ్య, తిరుపతి వంటి ప్రముఖ పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో సులభ ధరలకు సౌకర్యవంతమైన వసతితో కూడిన విహార విడిది గృహాల సౌకర్యం, హైదరాబాద్లోని యశోద, బొంబాయిలోని టాటా మెమోరియల్లో రోగుల సహాయకులకు రోజుకు రూ.100 చొప్పున వసతి సదుపాయాలు ప్రముఖమైనవిగా పేర్కొన్నారు. త్వరలో రుణ పరిమితి విస్తరణ, గహ రుణాలు, విద్యా రుణాలపై వడ్డీ తగ్గింపు వంటి చర్యల ద్వారా వాటాదారులు ఇకపై విదేశీ బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ముఖ్య అతిథి అన్నారు. బ్యాంకులోని 40 ఖాళీ పోస్టులకు వాటాదారుల పిల్లలకు మెరిట్ ఆధారంగా నియమించేందుకు యోచిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఒకే రోజున ఉత్తీర్ణుల ఫలితాలతో నియామక పత్రాలను పంపిణీ చేసే ప్రతిపాదన పాలక మండలి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పదవీ విరమణ చేసిన వాటాదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు, హాలిడే హోమ్లలో వసతి కల్పించాలని శాఖ కార్యదర్శి లక్ష్మీధర్ మహంతి చేసిన ప్రతిపాదన తదుపరి డైరెక్టర్ల సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంక్ మేనేజర్ పి. చక్రవర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి తూర్పు కోస్తా రైల్వే శ్రామిక కాంగ్రెస్ మండల సమన్వయకర్త, డైరెక్టర్ నిరంజన్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. -
యువత క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి
● రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి రాయగడ: యువత క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బిజూ స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. జిల్లాలోని సదరు సమితి కర్లకొణ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి కనబరిచే యువత ఆయా రంగాల్లో రాణించాలంటే అందుకు కృషి, శ్రమతో పాటు సహనం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి తరహా పోటీల్లొ పాల్గొంటే వారికి నైపుణ్యం మెరుగుపడటంతో పాటు ప్రతిభను కూడా కనబరిచే అవకాశం ఉంటుందన్నారు. అతిథులుగా మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, ఆదిత్య లాజిస్టిక్స్ ఎండీ కృష్ణ చైతన్య, కర్లకొణ సర్పంచ్ నీలాంబర్ బిడిక, సమితి సభ్యురాలు బందనా అటక, యువ నాయకుడు తపన్ పెద్దింటి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ క్లబ్ అధ్యక్షుడు సదానంద పెద్దింటి పాల్గొన్నారు. కాగా సోమవారం కులిజింగ్, కర్లకొణ జట్ల మధ్య ఫైనల్పోరు రసవత్తరంగా జరిగింది. విజేతగా కలజింగ్ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 15 వేల రూపాయల నగదు బహుమతిని, రన్నర్ జట్టుకు ట్రోఫీని ముఖ్యఅతిథి నెక్కంటి అందజేశారు. -
92 శాతం ప్రజా ఫిర్యాదులు పరిష్కారం
భువనేశ్వర్: స్థానిక యూనిట్ 2లోని సోమవారం జరిగిన ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రజల ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గంలో 13 మంది సీనియర్ మంత్రులు హాజరై ప్రజల ఫిర్యాదులను విన్నారు. సోమవారం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటి ద్వారా 600కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వరుసగా 18 సార్లు ప్రజా ఫిర్యాదుల విచారణలో పాలుపంచుకోవడం విశేషం. తొలుత బయట వేచి ఉన్న 30 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కలిసి వారి సమస్యలను విన్నారు. వారి ఫిర్యాదు పత్రాలను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత గది లోపల నమోదు చేసుకున్న ఫిర్యాదుదారుల ఫిర్యాదులను పరిష్కరించారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా వివిధ వ్యాధులతో బాధపడుతున్న సుమారు 13 మంది ఫిర్యాదుదారులకు వైద్య సహాయంగా రూ. 3.60 లక్షలు ముఖ్యమంత్రి మంజూరు చేశారు. నయాగఢ్ జిల్లాకు చెందిన కామాక్షి సాహు కుమారుడి దుర్ఘటన మృతికి కారుణ్య సహాయంగా ముఖ్యమంత్రి రూ. 2 లక్షలు మంజూరు చేశారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్లు ప్రజల సమస్యలను క్రమం తప్పకుండా వింటుండగా, తహసీల్, మండల స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారం నిరంతరం కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు జిల్లా స్థాయిలో 2.40 లక్షల ఫిర్యాదులను విచారించగా వాటిలో 92 శాతం పరిష్కరించినట్లు తెలిపారు. -
మత్తు ఇంజెక్షన్ల వ్యాపారం చేస్తున్న ఐదుగురు అరెస్టు
జయపురం: జయపురంలో నిషా ఇంజెక్షన్ల వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు. నిషా ఇంజెక్షన్లు తీసుకు వచ్చి జయపురం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.40 వేల విలువ చేసే 750 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ తెలిపారు. వ్యాపారానికి వినియోగించే కారుతో పాటు రూ.15 వేలు నగదు, 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. అరెస్టన నిందితులు జయపురం సౌరాసాహి దేబాసిస్ పట్నాయిక్(29), స్థానిక పారాబెడ వాసి తాపస సాహు(29), జయపురం డొంగాగుడ వాసి రామ హరిజన్(34), క్రిష్టియన్ పేట నివాసి ప్రదీప్ ఖోర ఉరఫ్ రోణి(25) స్థానిక పూర్ణగడ్ నివాసి సూరజ కుమార్ గుప్త ఉరఫ్ సోను(29)లు అని వెల్లడించారు. వీరిలో రామ హరిజన్, సూరజ కుమార్ లను గత ఏడాది పట్టణ పోలీసు అధికారులు నిషా ఇంజెక్షన్ల వ్యవహారంలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. గత అర్ధరాత్రి గాంధీ చౌక్ నుంచి గొడొపొదర్ కెనాల్ రోడ్డు లో సంధ్యా ఫంక్షన్ హాల్ సమీపంలో కొంత మందితో నిషా ఇంజెక్షన్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం అందడంతో పట్టణ పోలీసులు వెంటనే వెళ్లి దాడి జరిపారు. అక్కడ ఆరుగురు ఉండగా ఒకడు పారిపోయాడు. ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఇంజెక్షన్లను డాక్టర్లు మత్తు ఇచ్చే క్రమంలో వినియోగిస్తారు. -
గ్రీవెన్స్లో 28 సమస్యలు పరిష్కారం
రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు మంచి స్పందన లభించింది. ప్రజల బాధలు తెలుసుకున్న కలెక్టర్ వేదిక వద్దే 28 సమస్యలను పరిష్కరించారు. అలాగే వచ్చిన 65 వినతుల్లో భాగంగా మరో ఐదుగురికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 76 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన వినతులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, డీఎఫ్వో సచిన్ అన్నాసాహెబ్ అహలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ మిశ్రో, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ కెముండో , ఇతర శాఖల అధికారులు,ఉద్యొగులు పాల్గొన్నారు. -
మంటల్లో దగ్ధమైన అంబులెన్స్
భువనేశ్వర్: స్థానిక ఖండగిరి సమీపం జగమొర ప్రాంతంలో అంబులెన్స్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం 4.30 గంటలకు కటక్ ప్రాంతానికి రోగిని తరలించి తిరిగి వచ్చి పార్క్ చేసి ఉండగా ఉదయం 6 గంటల ప్రాంతంలో అందులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అదృష్టవశాత్తూ అప్పటికే డ్రైవర్తో పాటు సహాయకుడు వాహనం నుంచి దిగి వారి గదులలో విశ్రాంతి తీసుకుంటుండటంతో ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం జరగలేదు. నగర పాలక సంస్థ (బీఎంసీ) పారిశుద్ధ్య కార్మికుడు వాహనాన్ని చుట్టుముడుతున్న మంటలను గమనించి స్థానికులు, అగ్ని మాపక విభాగాన్ని అప్రమత్తం చేశాడు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పి వేసే సమయానికి అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతిని చాలా భాగం కాలిపోయింది. ఇంజిన్ బేలో సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
కవితా గానం.. చరిత్ర పఠనం
జయపురం: స్థానిక పూజ్యపూజ్ సంసద్ వారు సోమవారం సాహితీ సభలో ఒడిశా కవిసామ్రాట్ ఉపేంధ్ర భంజ్ కవితలపైన, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు రాధామోహన్ సాహుపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు కవిసామ్రాట్ ఉపేంద్ర చిత్రాలను గీశారు. సరస్వతీ శిశుమందిర విద్యార్థులు ఆరాధ్య కౌశిక్, అనితా కౌశిక్లు ఉపేంధ్ర భంజ్పై రాసిన వ్యాసాలను చదివి వినిపించారు. స్వాతంత్య్ర యోధులు రాధామోహన్ సాహు జీవిత చరిత్రను సరస్వతీ శిశుమందిర విద్యార్థిని సంస్కృతి సామంతరాయ్ చదివి వినిపించి ఆ వ్యాసాన్ని సభకు అందజేశారు. పూజ్య పూజ సంసద్ అద్యక్షులు ఉదయ శంకర జాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథిగా పతంజలి విభాగ అధ్యక్షురాలు జానకీ పాణిగ్రహి ఒడియా సాహిత్యంపై కవి సామ్రాట్ ఉపేంధ్ర భంజ్ ప్రభావం, సమాజాన్ని చైతన్యపరచే ఆయన రచనలపై ప్రసంగించారు. అలాగనే అలాగనే స్వాతంత్య్ర ఉద్యమంలో కొరాపుట్ జిల్లా భూమిక స్వాతంత్య్ర యోధులలో రాధామోహన్ సాహు పోరాట పటిమలపై ఆమె ప్రసంగించారు. 10 క్వింటాళ్ల గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి పోలీసులు ఆదివారం రాత్రి అక్రమ రవాణాకు సిద్ధం చేసిన భారీ గంజాయిను పట్టుకున్నారు. చిత్రకొండ సమితి గుంఠబేఢ పంచాయతీ ఆరంగి గ్రామ అడవిలో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గంజాయిని నిల్వ ఉంచారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం అందడంతో ఐఐసీ జయనారాయణ్ ఖండేయ్ తన సిబ్బందితో ఆదివారం రాత్రి దాడి చేయగా పోలీసుల రాకను తెలుసుకున్న మాఫియా సభ్యులు పరారయ్యారు. అక్కడ ఉన్న గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. సోమవారం గంజాయిను తూకం వేయగా 10 క్వింటాళ్లు ఉంది. దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. విద్యుత్ వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ భువనేశ్వర్: ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించే విద్యుత్ వాహనాల (ఈవీల) కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. పశ్చిమ ఆసియాలో తాండవిస్తున్న సంక్లిష్ట పరిస్థితుల దష్ట్యా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు అవుతాయి. తాజా నిబంధనల ప్రకారం ఒక అధికారి ఒక వాహనం ప్రాతిపదికన గవర్నర్, ముఖ్యమంత్రి, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు రూ. 30 లక్షల వరకు విలువైన ఈవీలను కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్, శాఖా కార్యదర్శులు రూ. 25 లక్షల వరకు ఖరీదు చేసే ఈవీలకు అర్హులు కాగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు, కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు రూ. 20 లక్షల వరకు విలువైన టాటా, మహీంద్రా, మారుతీ కంపెనీల ఉత్పాదిత ఈవీలను కొనుగోలు చేయవచ్చు. వాహనాల కొనుగోలుకు ఆర్థిక శాఖ ఆమోదం అవసరం. ప్రస్తుతం ఉన్న అధికారిక వాహనం నిర్దేశిత సేవా కాలాన్ని పూర్తి చేసు కున్న తర్వాతే ఈ కొనుగోలుకు అనుమతిస్తారు. మహేంద్రగిరి, కోయిపూర్ వద్ద కుండపోత పర్లాకిమిడి: మహేంద్రగిరిలో విశ్వశాంతి యజ్ఞం సందర్భంగా పవిత్ర కలశాలు యజ్ఞం వద్ద ఉంచిన తర్వాత మహేంద్ర నుండి కోయిపూర్ వరకూ గంటన్నర సేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో మహంద్ర పర్వతానికి వెళ్లిన భక్తులు తడిసి ముద్దయ్యారు. దీంతో పలువురు మహిళలు తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. -
కలశ యాత్రకు పోటెత్తిన భక్తులు
పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై పురషోత్తమాసం సందర్భంగా సోమవారం అంగరంగవైభవంగా బుర్ఖాత్ పాస్ నుంచి మహేంద్రగిరి పర్వతం వరకూ మహిళలు పెద్ద ఎత్తున కలశ యాత్ర జరిపారు. దాదాపు బుర్ఖాత్ పాస్ నుంచి ఆరు కిలో మీటర్లు కాలినడకన కొండపైకి వెళ్లి పవిత్ర మహేంద్ర పర్వతం పై జరుగుతున్న విశ్వయజ్ఞం వద్ద ఉంచారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాలోకానంద, సత్యనారాయణ దాస్, అంతర్యామి గోమాంగో, రాయగడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్ పాల్గొన్నారు. అలాగే విశ్వహిందూపరిషత్ నాయకులు, భజరంగ్దళ్ నాయకులు రాయగడ, పర్లాకిమిడి, కొరాపుట్, నయాఘడ్, గంజాం, ఫుల్బణి నుంచి విచ్చేశారు. బుర్ఖాత్ పాస్ వద్ద నుంచి మహిళలు పసుపురంగు చీరలు ధరించి పవిత్ర కలశాలను పట్టుకుని నడిచి మహేంద్రగిరికి చేరుకున్నారు. మహిళలు కుంతీ మందిరం వద్ద అభిషేకాలు చేయించారు. ఆదివాసీ సవర సంస్కృతి తలపిస్తూ వారి వాయిద్యాలతో నాట్యాలు చేసి ఆనందోత్సవాలమధ్య విశ్వశాంతి యజ్ఞానికి సహకరించారు. ఈ సందర్భంగా భాస్కరతీర్థ లక్ష్మీబాబా మాట్లాడుతూ, ఈ పురుషోత్తం మాసంలోపవిత్ర మహేంద్రగిరికి వస్తే ప్రతి ఒక్కరికి పుణ్యం కలుగుతోంది. నేటి నుంచి కలశ యాత్ర, హరిహారాత్మక యజ్ఞం, చండీ మహాయజ్ఞం, జ్ఞాణ, ఆర్ణ యజ్ఞం, పూర్య యజ్ఞం వంటివి జరుగుతాయి. అలాగే భాగవతం, రామాయణ మానస చరిత్రను వేదపండితులు పఠిస్తారు. దేశంలోని నలుమూలలనుండి అనే మంది సాధుసంతువులు ఇక్కడకు విచ్చేశారు. వారి ఈ తొమ్మిది రోజుల పాటు పలు యజ్ఞాలను నిర్వహిస్తారు. జూన్ 15 న తిరిగి ఈ సాధుసంతువులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని, అలాగే కలశయాత్రకు 10వేల మంది మహిళలు వస్తారని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా జూన్ 2 మంగళవారం మహంద్రగిరిలో జరుగుతున్న మహేంద్రమేళాకి విచ్చేస్తారని పలువురు అధికారులు తెలియజేశారు. -
ఉచిత దంత వైద్య శిబిరం
జయపురం: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా భారత దంత వైద్యుల సంఘం జయపురం శాఖ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బందితోపాటు స్థానిక ప్రజలకు వైద్యులు దంత పరీక్షలు చేసి మందులు అందజేశారు. దంత పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శిబిరంలో వందమందికి పైగా దంత రోగులు చికిత్స పొందినట్లు భారత దంత వైద్యుల సంఘం జయపురం శాఖ అధ్యక్షుడు డాక్టర్ రూపేష్ కుమార్ బెవురియ వెల్లడించారు. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారిణి అర్చిత మిత్తల్, జయపురం పట్టణ పోలీసు అధికారులు శిబిరం నిర్వహణకు సహకరించారు. సంఘ మాజీ అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ దాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ సంతోష్ కుమార్ నాయిక్, డాక్టర్ అమిత్ దాస్, కోశాధికారి డాక్టర్ దేవ దేవరాహన్ బిశాయి, డాక్టర్ ఎస్.నారాయణ, డాక్టర్ రిచార్డ్ ఆశ, డాక్టర్ నిగమానంద బెహర, డాక్టర్ ఎస్.పూజ, డాక్టర్ శుభశ్రీ డాకువ, డాక్టర్ పి.సుచిత్ర పాల్గొన్నారు. -
జయపురం దేవదాయ కమిటీ అధ్యక్షునిగా దేవేంద్ర బాహిణీపతి
జయపురం: జయపురం దేవదాయ కమిటీ నూతన అధ్యక్షునిగా కాంగ్రెస్ నేత, జయపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి ఎన్నికయ్యారు. జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ పరిచాలన కమిటీ ఎన్నికకు ఏకగ్రీవంగా కమిటీ అధ్యక్షునిగా ఎన్నిక చేయాలన్న ప్రయత్నం ఫలించకపోవటంతో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష పదవికి బాహిణీపతితో సందీప్ సామంతరాయ్ తలపడ్డారు. దేవేంద్ర బాహిణీపతికి 9 మంది ఓటు వేయగా, సామంతరాయ్కు 6 ఓట్లు వచ్చాయి. వ్యక్తి సజీవ దహనం భువనేశ్వర్: బాలాసోర్ ప్రాంతంలోని ఐటీఐ రోడ్డులో ఉన్న రసాయన కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వాడ పోలీస్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం ప్రత్యక్షంగా సందర్శించారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బైక్ దొంగతనం కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టుకు తరలించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశామని ఐఐసీ ప్రసన్నకుమార్ బెహర తెలిపారు. కన్యకాపరమేశ్వరికి ప్రత్యేక పూజలు రాయగడ: పట్టణంలోని కొరాపుట్ కూడలిలో వైశ్యుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి మందిరంలో ఆదివారం అధిక జ్యేష్ఠపౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మామిడి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 7.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కుంకుమ, గులాబీ రేకులు, మల్లెపూలతో 108 అష్టోత్తర శతనామావళి పఠనంతో భవ్యమైన పూజ నిర్వహించారు. విశేష పూజల్లో పాల్గొన్న భక్తులకు అఖండ సౌభాగ్యం, అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధించడంతో పాటు గ్రహ దోష నివారణ కలిగి అమ్మవారి అనుగ్రహం లభిస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం నిర్వహించిన కుంకుమపూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
● అస్నా గ్రామ పంచాయతీలో క్రీడా సందడిజయపురం: జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి అస్నా గ్రామ పంచాయతీలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి ఆటలో ముర్జా గ్రామ టీమ్ విజయం సాధించింది. ప్రారంభ పోటీలో ముర్జ గ్రామ టీమ్ కందులిముండ టీమ్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ముర్జా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పద ఓవర్లలో 120 పరుగులు చేసింది. 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కందులిముండ టీమ్ నిర్ణీత పది ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రం చేయగలిగింది. దీంతో ముర్జ గ్రామ జట్టు 23 పరుగుల ఆధిక్యతతో విజయాన్ని దక్కించుకుంది. పోటీలను దివాకర గౌఢ, మీనకేతన గౌఢ, నరశింహ గౌడ్, దిలీప్ గౌడ్, ఘన గౌఢలు పర్యవేక్షించారు. పోటీలను కొరాపుట్ జిల్లా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యదర్శి చంద్ర శేఖర రథ్ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల దుర్గమ ప్రాంతం అస్నా గ్రామ పంచాయతీలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం ఈ ప్రాంత యువత క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అవసరమైన వనరులు సమకూర్చుతుందని అన్నారు. ఆటలలో గెలుపు ఓటమిలు ప్రధానం కాదన్నారు. మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహద పడతాయన్నారు. క్రీడాకారులు ఆటలలో రాణించి రాష్ట్ర, జాతీయ క్రీడారంగంలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్లో 16 జట్టు పాల్గుంటున్నాయి. టోర్నమెంట్ 15 రోజులు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కొట్పాడ్ ఎంఎల్ఏ ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య, కొరాపుట్ జిల్లా ఐటీ సెల్ కోఆర్డినేటర్ సంతోష్ ప్రహరాజ్, దిగాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు ధనపతి పొరజ,లయిచన్ గౌఢ,సుబాష్ మఝి అతిథులుగా హాజరయ్యారు. -
ఖుర్దా రోడ్ రైల్వే స్టేషన్ తనిఖీ
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ఖుర్దా రోడ్ రైల్వే స్టేషన్ను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్టేషన్ సదుపాయాలు, పరిశుభ్రత, క్యాటరింగ్ సేవలను సమీక్షించడంపై దృష్టి సారించారు. ఆయనతో ఖుర్దా రోడ్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డి.సునీల్ పాల్గొన్నారు. తనిఖీ సందర్భంగా, పరమేశ్వర్ ఫంక్వాల్ బుకింగ్ కార్యాలయాలు, ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు, రాకపోకల ప్రాంతాలు, ఫుట్ ఓవర్బ్రిడ్జ్లు, ప్లాట్ఫారాలు, క్యాటరింగ్ యూనిట్లతో సహా స్టేషన్లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఆయన అధికారులతో మాట్లాడి స్టేషన్లో అందిస్తున్న ప్రయాణికుల సేవల నాణ్యతను సమీక్షించారు. జనరల్ మేనేజర్ భద్రత, ప్రయాణికుల రద్దీ నిర్వహణ, పరిశుభ్రత, స్టేషన్ ప్రాంగణ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలు, వినియోగదారుల సంతృప్తి విషయంలో ఉన్నత ప్రామాణికలను పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ప్రయాణికుల సమస్యలను తక్షణమే, సమర్థంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సురక్షితమైన, సమర్థమైన, భద్రతతో కూడిన సౌకర్యవంతమైన రైల్వే సేవలను అందించడంలో నిరంతరం పర్యవేక్షించాలని జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రయాణికుల కేంద్రీకత అభివృద్ధి, సేవా శ్రేష్టతపై దష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. -
కొంచాసు మామిడి పరిరక్షణ
జయపురం: కొరాపుట్ జిల్లాలో పేరెన్నికగన్న కొంచాసు మామిడి రానురాను కనుమరుగవుతోంది. కొంచాసు మామిడి కాయలను గ్రామీణ ఆదివాసీ ప్రజలు పట్టణాల రోడ్డు సైడ్లలో కాయలను పోగులు వేసి అమ్ముతారు. మామిడి సీజన్ వచ్చిందంటే కొంచాసు మామిడి కాయల కోసం ప్రజలు ఎదురు చూసేవారు. ప్రస్తుతం ఈ కాయలు మార్కెట్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఒక పాత్రికేయుడు కొరాపుట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి కొరాపుట్ జిల్లాలో తప్ప మరే ప్రాంతంలో కనిపించని కొంచాసు మామిడి మొక్కలను పెంచేందుకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని జయపురం ఉద్యానవన విభాగ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశం మేరకు జయపురం ఉద్యానవన విభాగ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ కుమార్ మహంత, ఉద్యానవన సహాయకుడు శేఖర్ చంఽద్రదాస్లు అతి కష్టంతో కొంచాసు మామిడి టెంకలను సేకరించి వాటిని ఒక ప్రత్యేక నర్సరీలో నాటారు. మొక్కలు మొలకెత్తటంతో వాటిని జయపురం సమితి హొరడాపుట్ నర్సరీలో 1500 మొక్కలను పెంచారు. ఒక మొక్కను రూ.45కు అందజేయాలని నిర్ణయించినా, ఈ అపూర్వ జాతి కొంచాసు మామిడి మరింత చౌకగా రైతుకు, ప్రజలకు అందేటట్టు చేసేందుకు రాయితీ ప్రకటించి కేవలం రూ.20 లకే అందిస్తున్నట్లు జయపురం ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ సంజీవ కుమార్ మహంత నేడు పత్రికల వారికి వెల్లడించారు. -
ఓటరు జాబితా సవరణ ఫారాల పంపిణీ
రాయగడ: జిల్లాలోని నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు బిసంకటక్ నియోజకవర్గం ఎన్నికల నమోదు అధికారి నవీన్ చంద్ర నాయక్ పర్యవేక్షణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా అధికారులు నియమగిరి గిరిజన గ్రామాలను సందర్శించారు. అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. బీడీఓ శివప్రసాద్ పట్నాయక్, జీపీడీఓ సుదీప్ కృష్ణబెహర, సూపర్వైజర్ హరిదాస్ భొత్ర, బూత్ స్థాయి అధికారులు ఉమేష్ పెద్దింటి, భీమా కౌసల్య, తదితరులు పాల్గొన్నారు. -
పర్లాకిమిడిలో ఆరు పరీక్ష కేంద్రాల్లో బీఎడ్ అడ్మిషన్ పరీక్షలు
పర్లాకిమిడి: బీఎడ్ అడ్మిషన్ పరీక్ష 2026 ఆదివారం గజపతి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో శాంతియుతంగా జరిగింది. గజపతి జిల్లా వ్యాప్తంగా 1339 అభ్యర్థులు బీఈడీ అడ్మిషన్ టెస్టుకు హాజరవ్వగా అందులో ఆర్ట్స్ అభ్యర్థులు 924, సైన్సు అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పర్లాకిమిడిలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్, మహిళా కళాశాల, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల, ఎం.ఆర్.గర్ల్స్ హైస్కూల్, సరస్వతీ శిశు మందిర్, శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో బీఎడ్ పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు తెలిపారు. -
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం
రాయగడ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాయగడ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం మే 30వ తేదీ నుండి ప్రారంభమైంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు సహాయ ఎన్నికల నమోదు అధికారుల వద్ద నుంచి గణన ఫారాలను స్వీకరించి ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి చెప్పారు. ఈ మేరకు శనివారం సమితి సమావేశం హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతీ అర్హుడైన ఓటరు, ఓటరు జాబితాలొ నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలిగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు వివరించారు. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగాలంటే బీఎల్వోలు నిర్ణీత గడువులోగా ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా బూత్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, సీఆర్పీలు, ఎంబీకేలు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన, మహిళా సంఘాలు, గ్రామీణ యువత బీఎల్వోలకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనాల తనిఖీ పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడి, రాయఘడ, కాశీనగర్, గుసాని, ఆర్.ఉదయగిరి, మోహానా తదతర ప్రాంతాల పోలీసు ష్టేషన్ల పరిధిలో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. గజపతి జిల్లా నుంచి అక్రమంగా గంజాయి, మద్యం, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ అరికట్టడానికి ఈ చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను కూడా పట్టుకుని కౌన్సెలింగ్ చేసి విడిచి పెట్టారు. -
గల్లంతైన వ్యక్తి మృతి
రణస్థలం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కొమర లక్ష్మణ శనివారం చింతపల్లి సమీపంలో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం రణస్థలం మండలంలోని కొవ్వాడ సముద్ర తీరంలో కొమర లక్ష్మణ మృతదేహం లభ్యమైంది. జే.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. పీఆర్ ఏఈ కృష్ణారావుకు సన్మానం టెక్కలి: టెక్కలి డివిజన్ పంచాయతీరాజ్ ఏఈ కణితి కృష్ణారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం పట్టణంలో ఆత్మీయులు, అధికారుల సమక్షంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణారావు, సుబ్బమ్మ దంపతులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ సూర్యప్రకాశ్, ప్రదీప్కుమార్, విశ్రాంత ఎస్ఈ కేఎంవీ ప్రసాదరావు, కేసీహెచ్ మహంతి, మురళీమోహన్, మందస, కంచిలి ఎంపీపీలు డి.దానయ్య, పి.దేవదాస్రెడ్డి, కంచిలి ఎంపీడీవో వి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉంటున్న ఓ రూమ్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో రూమ్ తీసుకుని గ్రూప్–2,పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రూమ్ పక్కనే ఉన్న రీడింగ్ రూమ్కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వేడి నుంచి ఉపశమనం మండే ఎండలు, ఉక్కపోతల నుంచి శ్రీకాకుళం నగర ప్రజలు స్విమ్మింగ్తో ఉపశమనం పొంతున్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్ స్విమ్మర్లతో కిటకిటలాడుతోంది. ఉదయం, సాయంత్రం ఈత కొడుతూ సేదతీరుతున్నారు. వీరికి డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. పలు సూచనలు చేస్తున్నారు. – శ్రీకాకుళం న్యూకాలనీ -
జిల్లా కేంద్రంలో కార్డన్ సెర్చ్
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి పెద్దరెల్లివీధిలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 70 మంది సిబ్బందితో 250 ఇళ్లను సెర్చ్ చేసి సరైన పత్రాలు, రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. సీఐ పి.ఈశ్వరరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం, ఇతర అనధికార పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు, అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సెర్చ్ చేసినట్లు తెలిపారు. వ్యక్తుల ఆధార్కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్ కల్యాణ్, చంద్రకళ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు సత్వర సేవలందించడంలో ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఉత్తమ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని విద్యుత్ శాఖ ఇంజినీర్లు ప్రశంసించారు. సర్కిల్ ఎస్ఈగా పనిచేసిన నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా స్థానిక విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో కృష్ణమూర్తి దంపతులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సిబ్బంది సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. జిల్లా సర్కిల్లో ఎస్ఈ హోదాలో ఉన్నతాధికారులతో ఎంతో గౌరవాన్ని పొంది.. తద్వారా జిల్లా సర్కిల్కు మంచి గుర్తింపు తెచ్చారని వక్తలు కొనియాడారు. అత్యధిక కాలం జిల్లా ఎస్ఈగా పనిచేసి, ఇక్కడే పదవీ విరమణ చేస్తూ రికార్డు సృష్టించారని ఇన్చార్జి ఎస్ఈ సురేష్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పైడి యోగేశ్వరరావు, బయ్యన్నాయుడు, నరసింగ్కుమార్, యజ్ఞేశ్వరరావు, విష్ణుమూర్తి, విశ్రాంత విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు, ఎస్ఈవో శ్రీనివాసరావు, ఏఏవోలు మహంతి ప్రభాకరరావు, సుదర్శనరావు, జేఏవోలు సనపల వెంకటరావు, ఆర్.శ్రీనివాస్, ఏఈలు జె.సురేష్కుమార్, కె.జయరాం, కమల్హాసన్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
స్వర నివేదన
సంగీత సాధన..● సంగీతంలో ఆకట్టుకుంటున్న చిన్నారులు వేదికపై చిన్నారుల ప్రదర్శన సంగీతం అంటే నాకు ప్రాణం. గత నాలుగేళ్లుగా నేర్చుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రదర్శనలో పాడడం చాలా సంతోషంగా ఉంది. – పి.కన్విత, 6వ తరగతి, శ్రీకాకుళం శ్రీకాకుళం కల్చరల్: నగరంలో తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆసక్తి మేరకు వేసవి నేపథ్యంలో పలు రకాల శిక్షణల్లో చేర్చుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా తమ పిల్లలకు సంగీతం నేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. అలా నేర్చుకున్న చిన్నారులు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేస్థాయికి చేరుతున్నారు. స్థానిక బాపూజీ కళా మందిర్లో ఆదివారం శ్రీచరణి సంగీత కళాక్షేత్రంలో సంగీత సాధన చేసి.. పలువురు చిన్నారులు ప్రదర్శన ఇచ్చి తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు. సంగీతంలో రేడియో గ్రేడ్ ఆర్టిస్టుగా ఎదగాలని కోరిక ఉంది. కష్టపడి గత ఆరేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇక్కడి వేదికపై ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. – పి.జాన్విత, ఇంటర్మీడియట్, శ్రీకాకుళం ● -
తొలి మహిళా ఏడీసీగా అనన్య అవస్థి
భువనేశ్వర్: ఐపీఎస్ అధికారిణి అనన్య అవస్థిని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఎయిడ్ డి క్యాంప్ (ఏడీసీ)గా నియమించారు. ఈ ప్రతిష్టాత్మక పదవిలో పని చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఆది వారం లోక్ భవన్లో జరిగిన లాంఛన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, పోలీస్ ఏడీసీగా అనన్య అవస్థికి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరణకు స్వాగతించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సచివాలయం ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నియామకానికి ముందు అనన్య అవస్థి కటక్లోని యూపీడీలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పనిచేశారు. రాష్ట్ర గవర్నర్కు ఏడీసీగా పని చేసిన తొలి మహిళగా, ఆమె నియామకం ప్రభుత్వ సేవలో మహిళలకు ఒక ముఖ్యమైన మైలు రాయిగా నిలుస్తుంది. గవర్నర్కు గతంలో పోలీస్ ఏడీసీగా పని చేసిన ఐపీఎస్ అధికారి కులదీప్ మీనా స్థానంలో ఆమె నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్కు ఇద్దరు ఎయిడ్స్ డి క్యాంప్లు (ఏడీసీలు) సహాయకులుగా ఉంటారు. వారిలో ఒకరు భారత నావికా దళం నుండి, మరొకరు ఒడిశా పోలీసుల నుండి ఉంటారు. అనన్య అవస్థి పోలీస్ ఏడీసీగా, భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ హర్షిత్ దేవ్ గవర్నర్కు నావల్ ఏడీసీగా కొనసాగుతారు. అధికారిక కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు మరియు ఇతర ప్రోటోకాల్ సంబంధిత విధులలో గవర్నర్కు సహాయం చేయడంలో ఏడీసీ కీలక పాత్ర పోషిస్తారు. -
వర్సిటీలు ఎదగాలి: గవర్నర్
భారతీయ విలువలతోభువనేశ్వర్: ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భవిష్యత్ సవాళ్లకు రాష్ట్రాన్ని సిద్ధం చేయడంలో ఉన్నత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాలని, ఒడిశాలోని విశ్వ విద్యాలయాలు భారతీయ విలువలలో లోతుగా పాతుకుపోయి, ప్రపంచ స్థాయిలో పోటీపడగల సామాజిక బాధ్యత కలిగిన, సాంకేతికంగా అభివద్ధి చెందిన సంస్థలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆది వారం పిలుపునిచ్చారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల సదస్సులో ప్రసంగిస్తూ ఒడిశాలో ఉన్నత విద్య భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం ఒక ముఖ్యమైన సామూహిక ప్రయత్నమని గవర్నర్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్, పరిశ్రమల శాఖ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వైస్చాన్స్లర్లకు గవర్నరు స్వాగతం పలుకుతూ విశ్వ విద్యాలయాలు జ్ఞానం, ఆవిష్కరణలు, నాయకత్వానికి కేంద్రాలు. దేశ నిర్మాణంలో వాటికి కీలక బాధ్యత ఉందన్నారు. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, కొత్తగా వస్తున్న విజ్ఞాన శాస్త్రాలు, మారుతున్న ప్రపంచ సవాళ్ల కారణంగా ప్రపంచం అపూర్వమైన పరివర్తనకు లోనవుతూ మరింత సంక్లిష్టంగా మారుతున్న భవిష్యత్తును ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, విలువలతో ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను సన్నద్ధం చేయాలని గవర్నర్ ప్రేరేపించారు. విశ్వ విద్యాలయాలు వ్యవస్థాపకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, తద్వారా యువతను సమాజంలో వృద్ధి, అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎనన్ఈపీ) 2020 విధానం బహుళ విజ్ఞానశాస్త్ర విద్య, విద్యాపరమైన సౌలభ్యం, నైపుణ్యాల ఏకీకరణ, డిజిటల్ అభ్యాసం, పరిశోధనలో శ్రేష్టత, బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఒడిశా గొప్ప గిరిజన వారసత్వంపై దృష్టిని ఆకర్షిస్తూ, దేశీయ జ్ఞాన వ్యవస్థలు, గిరిజన సంప్రదాయాలు, సాంస్కృతిక పరిరక్షణపై అర్థవంతమైన పరిశోధనలు చేపట్టాలని గవర్నర్ విశ్వవిద్యాలయాలను కోరారు. లోక్ భవన్లోని ట్రైబల్ సెల్ రూపొందించిన ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల వివరాలను నమోదు చేసే ప్రచురణలను, విద్యా, పరిశోధన కార్యక్రమాలకు మద్దతుగా విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉంచుతామని ఆయన సభికులకు తెలియజేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదని, అవి జ్ఞాన సృష్టి, ఆవిష్కరణ, పరిశోధనలకు కేంద్రాలని అన్నారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను పెంచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నత విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి చెందుతున్న, సుసంపన్నమైన సమాజానికి విద్యే పునాదిగా పేర్కొన్నారు. 2036 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించి వికసిత భారత్ జాతీయ దార్శనికతకు గణనీయంగా దోహదపడాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఒడిశా నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా జాతీయ ప్రాముఖ్యత గల అంశాలపై చాన్స్లర్ కప్, ఇంగ్లీష్ డిబేట్ కోసం చాన్స్లర్ కప్, ఒడియా డిబేట్ కోసం చాన్స్లర్ కప్లను ప్రకటించి, ఆవిష్కరించారు. మత్తు పదార్థాల వ్యసన విముక్తిపై తీసిన లఘు చిత్రాలకు గాను, ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. -
ఓఆర్ఎస్..!
● జిల్లాలో మండుతున్న ఎండలు ● ఓఆర్ఎస్తో తక్షణ ఉపశమనం ● ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశంపాతపట్నం: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. శరీరంలో నీరు ఆవిరైపోయి జనాలు నీరసించి పోతున్నారు. ఠారెత్తిస్తున్న ఎండల తీవ్రతను తట్టుకునేందుకు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు వేసవిలో ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటించడం అవసరం. సాధారణం కంటే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఈ ఏడాది ఉన్నాయి. దీంతో శ్రామిక, ఉద్యోగ, వ్యాపారులు విధి నిర్వహణలో భాగంగా అనివార్య పరిస్థితుల్లో మండే ఎండల్లో తిరగక తప్పదు. ఉపాధి పనులు, ఇతరత్రా వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మండుటెండలో పనులు చేయాల్సి వస్తుంది. అటువంటి వారు ఎండ ప్రభావానికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓఆర్ఎస్తో ఉపశమనం ఎండల్లో పనిచేసే సమయంలో శరీరంలో సహజంగా నీటిశాతం తగ్గిపోవడం వలన వడదెబ్బకు గురవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ద్రావణం ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. స్థలం, కాలాన్ని బట్టి శరీరాన్ని నిర్దేశించిన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. మెదడులో హైపోథలామస్ అనే భాగం శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. తగిన నీటిని తాగకపోయినా, ఎండలో ఎక్కువ తిరిగినా హైపోథలామస్ భాగమే అధిక ఉష్ణోగ్రతకు లోనై క్రమబద్ధీకరించే పని చేయలేదు. ఈ స్థితిలో తల తిరగడం, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, జ్వరం, చీకటి కమ్మినట్లు అనిపించడం, వాంతి అవుతున్న భావన కలగడం వంటి లక్షణాలు వడదెబ్బకు గురైనట్లు నిర్ధారిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యారోగ్య కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అటువంటి సమయాల్లో వీటిని తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుంది. సమయానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే ఇంటిలోనే ఉప్పు, పంచదార, నీరు సాయంతో ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, అరస్పూన్ పంచదారను కలిపి తాగవచ్చు. ఎండ తీవ్రతకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించడం అవసరం. ఓఆర్ఎస్ తయారీ ఇలా... ఓఆర్ఎస్ అనేది వివిధ లవణాల మిశ్రమంతో కూడిన 20.5 గ్రాముల సోడియం క్లోరైడ్. దీనిలో 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సిట్రేట్, 13.5 గ్రాముల డెక్స్ట్రోజ్ ఉంటాయి. ఈ పౌడర్ ప్యాకెట్ను సురక్షితమైన లీటరు నీటిలో కలిపి రోజు మొత్తంలో వయస్సును బట్టి తగిన మోతాదులో తాగాలి. మితిమీరిన మోతాదులో తాగడమూ అనర్థాలు తెచ్చిపెడుతుంది. వడదెబ్బ బారిన పడినవారు డీ హైడ్రేషన్కు గురవుతారు. అటువంటి సమయంలో ముందుగా ఓఆర్ఎస్ ప్యాకెట్ను వినియోగించడం వల్ల కొంతవరకు కోలుకుంటారు. ఓఆర్ఎస్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. అవసరమైనవారు తీసుకోవచ్చు. – డాక్టర్ జి.వేణుగోపాల్, సూపరింటెండెంట్, పాతపట్నం సీహెచ్సీ -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం కల్చరల్: ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నియామకాలు చేపట్టింది. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో పురోహిత క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నియామక పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని నినాదాలు చేశారు. సమాఖ్య వ్యవస్థాపకుడు యామిజాల నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, పురోహిత సమాజ సర్వతోముఖాభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఏకగ్రీవ తీర్మానం మేరకు నూతన నియామకాలు చేశారు. ఇదే నూతన కార్యవర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పొదిల నారాయణమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడిగా తెన్నేటి విద్యాధర శాస్త్రి సునీల్, ప్రధాన కార్యదర్శిగా వారణాసి శ్రీధర్ శర్మలు ఎన్నికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్ పురోహిత ప్రముఖులు పురాణం శేషు, పెంటా శ్రీధర్ శర్మ, పొన్నాల నరసింహమూర్తి, వాహిణీపతి మణిశర్మ, మేడూరి సంతోష్, కూనపల్లి శ్రీనివాస్, భోగాపురపు సూర్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
మహానది జలాల పంపిణీ వివాదం విచారణ వాయిదా
భువనేశ్వర్: ఒడిశా, చత్తీస్గఢ్ మధ్య కొనసాగుతున్న మహానది జలాల పంపిణీ వివాదం విచారణ వాయిదా పడింది. శనివారం వివాద ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ పాక్షికంగా ముగిసింది. ట్రిబ్యునల్ తదుపరి విచారణను జూన్ 6వ తేదీ ఖరారు చేసింది. మహానది జలాల పంపిణీ వివాదం నేపథ్యంలో ఉభయ చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య 15 ప్రధాన అంశాలలో 12 అంశాలపై ఒప్పందం కుదిరిందని ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలు రెండూ ట్రిబ్యునల్కు తెలియజేశాయి. ఏకాభిప్రాయం ఆధారంగా మరిన్ని పరిష్కారాల కోసం సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఒప్పందం కుదిరిన అంశాల్ని ఇరు రాష్ట్రాల న్యాయ, సాంకేతిక బృందాలు పరిశీలించాలని ట్రిబ్యునల్ కోరింది. కారుని ఈడ్చుకుపోయిన ట్రక్కుభువనేశ్వర్: నగరంలో కారుని ట్రక్కు ఢీకొట్టి ఈడ్చుకుపోయిన భయంకరమైన ఘటన గగుర్పొడిచింది. ప్రత్యక్షంగా చూసిన వారికి తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బతికి బయట పడ్డారు. స్థానిక సత్య విహార్ స్క్వేర్ సమీపంలో అతి వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టి, పొహలా వైపు రోడ్డుపై దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అది చివరకు ఒక వంతెనపై ఇరుక్కుపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న మామ, మేనకోడలు తటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మంచేశ్వర్ ఠాణా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ట్రక్కును స్వాధీన పరచుకున్నారు. ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అనంతరం ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. స్థానికుల దాడి భయంతో ఇలా చేసినట్లు డ్రైవర్ పోలీసులకు వివరించాడు. విద్యాశాఖపై అధికారుల సమీక్ష మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, సమగ్ర అబివృద్ధి సాధించేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్య చేపట్టింది. ఇందులో భాగంగా మల్కన్గిరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క్ అధ్యక్షతన శనివారం విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా మంగళ అధికారి శ్రీనివాస్ ఆచారితో పాటు ఇతర ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా లో విద్యరంగంలో ఏక్కడ నిర్లక్ష్యం పనికిరాదన్నారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు సమయానికి వెళ్లాలని ఆదేశించారు. -
సబ్ పోస్ట్మాస్టర్ సస్పెన్షన్
జయపురం: జయపురం పోస్టల్ డివిజన్లో ఉన్న పోస్ట్ ఆఫీసులో రూ.50 కోట్ల అవినీతి కుంభకోణంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు నవరంగపూర్ జిల్లా ఝోరిగాం తాత్కాలిక సబ్పోస్టు మాస్టర్ గౌరంగ సర్కార్ను ఉద్యోగం నుంచి జయపురం డివిజన్ చీఫ్ అధికారి సత్య ప్రకాశ మిశ్ర తొలగించారు. రూ.50 కోట్ల అవినీతిలో పలువురికి సంబంధాలున్నాయని భావించారు. నవరంగపూర్ జిల్లాడాబుగాం, కొడింగ పోస్టుమాస్టర్లను బదిలీ చేశారు. డాబుగాం సబ్పోస్టు మాస్టర్ శంభుప్రసాద్ పాణిగ్రహిని మల్కనగిరి జిల్లాలో మత్తిలికి, కొడింగ సబ్పోస్టు మాస్టర్ బసంత కుమార్ దాస్ను మల్కనగిరి పోస్టాఫీసుకు బదిలీ చేశారు. దర్యాప్తు పూర్తయిన తరువాత రూ.50 కోట్ల కుంభకోణంలో సంబంధం ఉన్న అధికారులందరిపైనా తగిన చర్యలు తీసుకుంటామని తపాలా విభాగ అధికారి వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజాసంక్షమ, సహాయక పథకాల్లో 5 వేల మందికిపైగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పంచిన డబ్బులను కాజేశాిరు. పోస్టల్ డిపార్ట్మెంట్లోని సాఫ్ట్వేర్ను వినియోగించుకొని మొబైల్ నెంబర్ మార్చి డబ్బు స్వాహా చేసినట్లు ఇటీవల బీజేడీ నాయకులు చేసిన ఆరోపణ విదితమే. ఉద్యోగం నుంచి తొలగించబడిన ఆనాటి ఝోరిగాం సబ్పోస్టు మాస్టర్ గౌరంగ సర్కార్ రూ.7 లక్షల 70 వేలు స్వాహా చేసినట్లు ఆయనే అంగీకరించినట్లు పోస్టల్ విభాగ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్ బెహర సమర్పించిన నివేదికలో పొందుపరిచారు. గౌరంగ సర్కార్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు జయపురం డివిజన్ చీఫ్ వెల్లడించారు. కొడింగా సబ్ పోస్టు మాస్టర్ బసంత కుమార్ దాస్ 90 అకౌంట్లు తెరిచి డబ్బు స్వాహా చేశాడని ఆరోపణ. అవిభక్త కొరాపుట్ జిల్లాలలో 41 పోస్టాఫీసుల్లో డబ్బు స్వాహా జరిగినట్లు నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి, మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపణలను పరిగణలోనికి తీసుకొని పోస్టల్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. -
లారీ యజమానుల సంఘం అధ్యక్షునిగా కొండబాబు
● ఎన్నికల్లో వరించిన విజయంరాయగడ: లారీ యజమానుల సంఘానికి శనివారం జరిగిన ఎన్నికల్లో యాళ్ల కొండబాబు అధ్యక్షునిగా ఘనవిజయం సాధించారు. స్థానిక కపిలాస్ కూడలి వద్ద గల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారులుగా ప్రముఖ న్యాయవాది బ్రజసుందర్ నాయక్, నీలా బిసోయి, సుశాంత్ పండాలు వ్యవహరించారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికై యాళ్ల కొండబాబు, బి.మన్మథరావులు బరిలో ఉన్నారు. పోటాపోటీగా కొనసాగిన ఎన్నికల్లో మొత్తం 361 మంది ఓటర్లు ఉండగా ఇందులొ 328 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా గెలుపొందిన కొండబాబుకు 170 ఓట్లు అనుకూలంగా పోలవ్వగా ప్రత్యర్ధి బి.మన్మథరావుకు 148 ఓట్లు దక్కాయి. దీంతొ కొండబాబు తన సమీప అభ్యర్థిపై 22 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే సాధారణ కార్యదర్శిగా జి.రామ్మోహన్రావు, ఉపాధ్యక్షునిగా బి.రమేష్, సహకార్యదర్శిగా పి.మహానందియా, కోశాధికారిగా పికే సామల్లు విజయం సాఽధించారు. అధ్యక్షునిగా విజయం సాధించిన కొండబాబబుకు ఆయన మద్దతుదారులు అభినందించారు. అలాగే ఎస్డీసీ చైర్మన్ బిద్యాధర్ సబర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈసందర్బంగా కొండబాబు మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాలదో సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్డీపీవో గౌరహరి సాహు, చందిలి ఐఐసీ, గుణుపూర్ ఐఐసీ కేకేబీకే కుహరో, రాయగడ ఐఐసీ ప్రశన్నకుమార్ బెహరలు పర్యవేక్షించారు. -
చెట్టు కూలి ఒకరి మృతి
రాయగడ: జిల్లాలో కాలవైశాఖి తుఫాను విషాదాన్ని మిగిల్చింది. గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల కారణంగా చెట్టు కూలి పంప్ హౌప్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మృతి చెందిన ఘటన జిల్లాలోని మునిగుడ సమితి కుట్రాగుడలో చోటు చేసుకుంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన జితేంద్ర జాల్ (55) గా గుర్తించారు. పంప్హౌస్లో ఉద్యోగిగా విధులు నిర్వహించే జాల్ శుక్రవారం సాయంత్రం పంపులో నీళ్లు విడిచిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అక్కడ గల ఒక చెట్టు కిందకు విరిగి పడిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్నజాల్ పై చెట్టు పడిపోవడంతో తీవ్రగాయాలకు గురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పారాదీప్ పోర్టులో ప్రమాదం ● డ్రైవర్ మృతి భువనేశ్వర్: పారాదీప్ పోర్టులో సీక్యూ–1 బెర్త్ వద్ద శనివారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైవా డ్రైవర్ మతి చెందాడు. బెర్త్లోని ప్లాట్ నుంచి హైవా ఇనుప ఖనిజాన్ని అన్లోడ్ చేస్తుండగా, క్రేన్ నుంచి దానిపై ఇనుప ఖనిజం పడటంతో డ్రైవర్ మరణించాడు. ఐపీటీ డంపర్ డ్రైవర్లు వివిధ ప్లాట్ల నుంచి పనిని నిలిపివేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ కేసులో నిందితుల అరెస్టు రాయగడ: జిల్లాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ మేరకు వారి నుంచి చోరీకి గురైన సామాన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం మల్కన్గిరి: ఒడిశాలో ఈ నెల 30వ తేదీ నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలేక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క్ అన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఈ క్రమంలో మల్కన్గిరి జిల్లాలో కూడా ఓటరు జాబితా కచ్చితత్వాన్ని నిర్థారించడం, అవసరమైన సవరణలు చేయడం కోసం ఈ ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఓటర్ల వివరాల నవీకరణ, తప్పుల సవరణ, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు చేపట్టామన్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలు మల్కన్గిరి, చిత్రకొండ ఉన్నాయని, ఈ రెండు చోట్ల మొత్తం 549 బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) వీరిలో మల్కన్గిరి నియోజకవర్గంలో 302 మంది, చిత్రకొండ నియోజకవర్గంలో 247 మంది ఉన్నారు. మల్కన్గిరిలో 2,52,691 మంది ఓటర్లు, చిత్రకొండలో 2,09,480 మంది ఓటర్లు ఉన్నారు. రెండు గణన ఫారాలను అందజేసి వాటిని ఎలా నింపాలో మార్గనిర్దేశం చేస్తారు. ప్రస్తుతం మల్కన్గిరి నియోజకవర్గంలో 2,36,078 మంది (93.43 శాతం) చిత్రకొండ నియోజకవర్గంలో 1,99,731 మంది (95.35 శాతం) 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేశారు. మల్కన్గిరిలో 16,613 మంది, చిత్రకొండలో 9,749 మంది ఓటర్లు తమ గణన ఫారాలతోపాటు అవసరమైన పత్రాలను బీఎల్ఓలకు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధాన్, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విక్రమదేవ్ వర్సిటీలో ముగిసిన బీఈడీ వర్క్షాప్
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో 12 రోజులుగా నిర్వహించిన బీఈడీ ముగిసింది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)ఆధ్వర్యంలో వర్సిటీ ఉపాధ్యాయ విద్యా విభాగం ప్రాంగణంలో బీఈడీ కోఆర్డినేటర్, విద్యా విభాగఅధిపతి డాక్టర్ మనోరంజన ప్రధాన్ అధ్యక్షతన వర్క్షాపు జరిగింది. కార్యక్రమంలో వికర్మ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వర్క్షాపులో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో అమలు చేయటంతో పాటు జాతీయ విద్యావిధానం 2020లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని హితవు పలికారు. గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయిక్ వర్క్ షాపులో తరగతుల తీరు, విద్యార్థుల అనుభవాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచివచ్చిన ప్రతినిధులను అభినందించారు. గౌరవ అతిధిగా ఇగ్నో రీజనల్ డైరెక్టరేట్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ లలిత మిశ్ర వర్క్షాప్ ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఉజ్వళ కుమార్ షొడంగి బీఈడీ విద్యార్థులకు పరీక్షకులకు సంబంధించి పలు సూచనలు చేశారు. శిక్షణ శిబిరంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మొత్తం 56 మంది హాజరై ఉపాధ్యాయ వృత్తిపై అవగాహన కల్పి్ంచుకున్నారు. పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
కూలిన జిప్సం సీలింగ్
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ప్రభుత్వాస్పత్రి గదిలోపర్లాకిమిడి: స్థానిక కేంద్రప్రభుత్వ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డు రూంలో జిప్సం సీలింగ్ కూలిన సంఘటనలో తృటిలో పేషెంటు తప్పించుకున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వార్డు నంబర్ 3లో సముటియా వీధికి చెందిన భభశ్రీ హాలధర్ చిన్న సర్జరీ నిమిత్తం డి.హెచ్.హెచ్.కి వచ్చింది. అయితే సర్జరీ అయిన తర్వాత ఆమెను ఎమర్జెన్సీ వార్డు నంబర్ 63 గదిలోకి మార్చారు. పెషెంటు భభశ్రీ అనుకోకుండా బాత్రూంకు వెళ్లి వచ్చేలోగా ఫాల్స్సీలింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే తృటిలో ఆమె తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె భర్త తెలియజేశారు. ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగి చాలా సమయం అయినా జిల్లా ముఖ్య చికిత్సాధికారి గానీ అదనపు జిల్లా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గాని సంఘటనా స్థలానికి రాకపోవడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ఇటీవల పర్లాకిమిడి డి.హెచ్.హెచ్.పై పబ్లిక్ అనేకసార్లు రాష్ట్రమంత్రులు, సెక్రటరీల వద్ద ప్రశ్నించినా ఇలాంటి సంఘటనలు జరగటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుత సీడీఎంఓ డాక్టర్ సంతును పాఢి పదవీ బాధ్యతలు చేపట్టినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తోంది. ప్రభుత్వం కొత్తగా నియమించిన సి.డి.యం.ఓ డాక్టర్ మంజురాణి జెన్నా ఇంతవరకూ విధుల్లో జాయిన్ కాలేదని ఏడీఎంఓ మహాపాత్రో తెలియజేశారు. -
‘గ్రామోదయ’ యోజన ప్రారంభం
జయపురం: మావోయిస్టు, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండేందుకు ‘గ్రామోదయ’ యోజన పథకాన్ని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో శనివారం ప్రారంభించారు. బొయిపరిగుడ సమితి మావో ప్రభావిత చంద్రపడ గ్రామ పంచాయతీ పల్లిగుడలో బొయిపరిగుడ సమితి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొయిపరిగుడ బీడీఓ నివేదిత దండసేన హాజరయ్యారు. బొయిపరిగుడ సమితిలో 20 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీల పరిధిలోని 23 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పల్లిగుడలో నిర్వహించిన ‘గ్రామోదయ’ యోజన కార్యక్రమంలో పల్లెగుడ గ్రామ ప్రజలతోపాటు బాలిగుడ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాల్లో ప్రభుత్వ ప్రజా సంక్షేమ, సహాయక పథకాలు పొందలేకపోతున్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించటం జరుగుతుందని బీడీఓ వెల్లడించారు. గ్రామోదయ పథకం ద్వారా మావో ప్రభావిత గ్రామ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేయ సహాయ పథకాల ఫలితాలు సులభంగా అందేలా చూడటమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి పథకం మావో ప్రభావిత ప్రాంత ప్రజలకు చేర్చేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమైఖ్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పాలకులకు ఉన్న దూరం తగ్గుతుందన్నారు. అందువలన ప్రభుత్వ అధికారుల పట్ల ప్రజలలో నమ్మకం, విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ వాటర్ శానిటరీ విభాగ అధికారులతోపాటు వైద్య, విద్యుత్, విద్య, సామాజిక సురక్షా, సుభద్ర యోజన, అంత్యోదయ యోజన అధికారులు పాల్గొన్నారు.


