Nalgonda
-
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులపైకి విస్తరించిన చెట్ల కొమ్మలు, ముళ్లపొదలను తొలగించాలని సూచించారు. గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రహదారులు కోతకు గురికాకుండా చూడాలని, కనగల్–దేవరకొండ రహదారిపై గుంతలను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లు సహా అన్ని వాహనాలకు రిఫ్లెక్టర్లు, గుర్తింపు బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాంగ్రూట్లో రహదారులు దాటకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చిట్యాల ప్రాంతంలోని పరిశ్రమల వద్ద కార్మికుల రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఆర్ఓ దశరథ్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22 నుంచి 26 వరకు మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 26న 2కే రన్ నిర్వహిస్తామన్నారు. అనంతరం మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
వేములపల్లి : పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్రపవార్ అన్నారు. శుక్రవారం వేములపల్లి పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి స్టేషన్లో పెండింగ్ కేసులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించి మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట, గుట్కా, మాదకద్రవ్యాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్రపవార్ -
ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలను యూనివర్సిటీలో ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 24.96 శాతం, రెండవ సెమిస్టర్లో 32.49 శాతం, మూడవ సెమిస్టర్లో 32.49 శాతం, నాల్గవ సెమిస్టర్లో 43.26 శాతం, ఐదవ సెమిస్టర్లో 47.28 శాతం, ఆరవ సెమిస్టర్లో 53.48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, అసిస్టెంట్ కంట్రోలర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, సంధ్యారాణి, కళ్యాణి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యమునుగోడు : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, ప్రతిఒక్కరు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈఓ సుశీందర్రావు కోరారు. శుక్రవారం మునుగోడులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజనం అందుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి, ఎంఈఓ మల్లేషం, హెచ్ఎం సుంకరి భిక్షంగౌడ్, వెంకట్నారాయణ, యూసుఫ్పాషా పాల్గొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు నల్లగొండ టౌన్ : ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో సంఘమిత్ర కోఆపరేటీవ్, అర్బన్ బ్యాంకు ముందంజలో ఉందని బ్యాంక్ ఫౌండర్, చైర్మన్ సంగం రామకృష్ణ తెలిపారు. శుక్రవారం బ్యాంకు 28వ వార్షికోత్సవ వేడుకలు బ్యాంకు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగం రామకృష్ణ మాట్లాడుతూ 1998లో బ్యాంకును స్థాపించి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు పున్న చండీకేశ్వర్, కొంగరి భిక్షం, గజ్జల వెంకటేశ్వర్లు, గుండ్ల అంజిరెడ్డి, ఎర్రమల్ల లక్ష్మీనర్సు, చెరిపల్లి పద్మ, వీరవెల్లి భవాని, రేణిగుంట చంద్రశేఖర్, సీఈఓ వడ్డె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులను అరికడతాం
క్షేత్రస్థాయిలో అవగాహన.. సీజనల్ వ్యాధులపై గ్రామాలు, పట్టణాల్లో తమ సబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి నీటి తొట్లు, నీళ్ల ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటా సర్వే నిర్వహించి వారి ఇంట్లో ఎవరైనా జ్వరంతో, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అని తెలుసుకుని అవసరమైన మందులు ఇస్తారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్హెల్త్ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. ఎలాంటి మందుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నల్లగొండ టౌన్ : ‘వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులకు నియంత్రణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాటాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యాధులు వ్యాపించే సీజన్.. వర్షాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాల కారణంగా పరిసరాల అపరిశుభ్రంగా మారుతాయి. దీంతో మలేరియా, మెదడువాపు, ఫైలేరియా, చికున్గున్యా, డెంగీ, డయేరియా, కలరా, టైఫాయిడ్, స్వైన్ఫ్లూతో పాటు వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. వాటిని అధిగమించడానికి వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు చేపట్టాం. గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, మురుగునీటి గుంటల్లో మట్టి పోయించడం వంటి పనులకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తాం. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వేలైన్స్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాల్లో ఫిజీషియన్, పిడియాట్రిక్ పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్ఎం, ఎల్టీలు, ఆశ వర్కర్లు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే ఈ బృందం వెంటనే అక్కడికి చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు, సిబ్బందిని స్థానికంగా ఉండాలని ఆదేశించాం. స్థానికంగా ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్సీల వారీగా రోజూ నివేదికలు తెప్పించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.. వర్షాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాల్లోని నీటి గుంటలు ఉండే వాటిలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహర పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి పదార్థాలను బుజించాలి. తాగునీటి ట్యాంకుల్లో క్లోరిన్ బిల్లలు చేసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఫ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం ఫ సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం ఫ పీహెచ్సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాహుల్ -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
చండూరు : చండూరు మండలం దోనిపాములలో అగ్రిప్రమాదానికి గుడిసె దగ్ధమై ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎంపీడీఓ బండారు యాదగిరి కలిసారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘ఆదుకోండి సారూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఎంపీడీఓ యాదగిరి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఇందిరమ్మ రెండో విడతలో వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీఓ కోటయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ టౌన్: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాలు, నీళ్ల విరోచనాలు, ఓఆర్ఎస్ ఉపయోగం, వాడే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పద్మ వైద్యాధికారులకు వివరించారు. సమావేశంలో డాక్టర్ కేవీఎన్ కృష్ణకుమారి, డాక్టర్ నగేష్, డాక్టర్ శంకర్, డీపీఓ విష్ణు, మాతా శిశు సంక్షేమ అధికారి డాక్టర్ దీప పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ రాహుల్ -
లక్ష్యం దిశగా ‘సమీకృత’ అడుగులు
నిడమనూరు: నిడమనూరు మండల పరిధిలోని ఊట్కూరులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రూ.220 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ఊపందుకోవడంతో భారీ సంఖ్యలో ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, నిర్మాణ కార్మికులు ఊట్కూరుకు చేరుకున్నారు. 21.5 ఎకరాల చదునైన భూమి సేకరణ పాఠశాల నిర్మాణం కోసం ఊట్కూరులోని సర్వే నంబరు 354లో గల 12.5 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, దానికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 358, 361లలో మరో 9 ఎకరాల ప్రైవేట్ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. ఎకరాకు రూ.23.5 లక్షల చొప్పున పరిహారం తీసుకునేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది. గతంలో నాగార్జునసాగర్లో ఈ స్కూల్ నిర్మించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ, స్థలం అనుకూలంగా లేకపోవడంతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే జైవీర్ కలిసి ఊట్కూరులోని ఈ చదునైన స్థలాన్ని పరిశీలించి ఖరారు చేశారు. కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాలు వర్షకాలంలో పునాదులు, పిల్లర్ల గుంతల్లో నీరు చేరి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాణ సంస్థ పిల్లర్ల పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన పరిపాలన భవనానికి సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. పనుల నిమిత్తం ప్రత్యేక విద్యుత్ లైన్లు, నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాల నిర్మాణం కూడా పూర్తయింది. ఫ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచిన అధికారులు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కేజీ నుంచి పీజీ వరకు 2600 మంది విద్యార్థుల సరిపడేలా తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్ల నిర్మాణ చేపట్టనున్నారు. ప్రధానంగా విద్యాలయ భవనాలు జీ ప్లస్ 3 నమునాలో 5.5 ఎకరాల్లో నిర్మాణ పనులు పిల్లర్ పనులు వేగంగా చేస్తున్నారు. జీ ప్లస్ 2 నమూనాలో 2 అకాడమిక్ భవనాలు, 68 అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. పరిపాలన భవనం, గ్రంథాలయం, వంటశాల, డార్మెటరీ జీ ప్లస్ 1 నమునాలో 80 వేల చదరపు అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. అదేవిధంగా విద్యార్థుల హాస్టల్, ఉపాధ్యాయుల నివాసానికి జీప్లస్ 2 నమునాలో 24 డబుల్ బెడ్రూం నిర్మాణాలు, ప్రిన్సిపాల్, పరిపాలనాధికారుల నివాసానికి త్రిబుల్ బెడ్రూం నిర్మాణాలు 4, సెక్యూరిటీ, సందర్శకుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. -
మత్స్య సొసైటీకి ముగిసిన నామినేషన్లు
నకిరేకల్: మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ముగిసింది. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకు గురువారం వరకు 71 నామినేషన్ల దాఖలయ్యాయి. చివరి రోజు 29 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీరామ్ తెలిపారు. 25న నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్ హాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అదే రోజు 3.30 గంటల తరువాత ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు జలాశయం చుట్టూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557మంది మత్స్యకారులు ఓటర్లుగా నమోదై ఉండగా వీరంతా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
నిధులు లేక..
రూ. 40 కోట్ల వరకు నిధులు పెండింగ్ జిల్లాలో ఒక కార్పొరేషన్తోపాటు మరో ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు నెలకు సరాసరిగా రూ.3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల వరకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఈ నిధులతో స్థానిక అవసరాలైన స్మశాన వాటికలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపడుతుంటారు. అయితే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్ల వరకు నిధులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లగొండ టూటౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలనెలా విడుదల కావాల్సిన ‘పట్టణ ప్రగతి’ నిధులు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు కాకపోవడంతో పట్టణాల ప్రగతి పూర్తిగా ఆగిపోయింది. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాలకు గత ఏడాది (2025) జూలై నుంచి ఇప్పటివరకు పట్టణ ప్రగతి నిధుల మంజూరు నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో నిధులు సకాలంలో రాక ఇబ్బందులు పడగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్థితి నెలకొంటుండడంతో పట్టణాల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్న మున్సిపాలిటీల అవస్థలు ముఖ్యంగా చిన్న మున్సిపాలిటీలు నిధుల కొరతతో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. కనీసం చిన్నపాటి మరమ్మతులు లేదా అత్యవసర పనులు చేపట్టడానికి కూడా పైసలు లేని పరిస్థితి ఉందని పలువురు అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పట్టణ ప్రగతి నిధులను నెలనెలా విడుదల చేస్తేనే మున్సిపాలిటీలు ప్రగతి సాధిస్తాయని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఏడాదిగా మంజూరు కాని పట్టణ ప్రగతి నిధులు ఫ చిన్నపాటి మరమ్మతులకూ నిధుల కొరత ఫ నిలిచిపోయిన అభివృద్ధి పనులునల్లగొండ 1. 26 కోట్లు మిర్యాలగూడ 78. 91లక్షలు హాలియా 16. 68 లక్షలు నకిరేకల్ 22. 15 లక్షలు నందికొండ 16. 62 లక్షలు చండూరు 11. 65 లక్షలు చిట్యాల 13. 64 లక్షలు దేవరకొండ 23. 54 లక్షలు మొత్తం 3.09 కోట్లు -
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలి
నల్లగొండ: ఈ ఏడాది జిల్లాలో 57లక్షల 70 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. లతీఫ్ సాబ్ గుట్టపై మొక్కల పెంపకానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. ఈ ఏడాది కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1.65 లక్షల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, డీఎఫ్ఓ రాజశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, డీఐఈఓ దశ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యం అందించాలి నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆస్పత్రిలో ఆయన హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు తనకు పంపించాలన్నారు. ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలు, ప్రత్యేక కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 9వ, 10వ తరగతులు చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికిగాను ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సంజీవయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి రూ.4 వేల చొప్పున ప్రీమెట్రిక్ ఉపకార వేతనం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెష్, రెన్యూవల్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని తెలి పారు. స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజు ఫొటో, బ్యాంకు పాస్ బుక్ కాపీ, స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాలలో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు నల్లగొండ: 2026–27 విద్యా సంవత్సరానికిగాను నల్లగొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ పవిత్ర వాణి కర్ష గురువారం తెలిపారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో (మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ), (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్), (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ లైఫ్ సైన్స్లో (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), (మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ), బీకాం (బిజినెస్ అనలైటిక్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఏ (హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్) కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21లోపు కళాశాలలో సంప్రదించాలని కోరారు. గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లేష్కట్టంగూర్ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన గుండాల మల్లేష్గౌడ్ నియామకమయ్యారు. బీసీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గురువారం నియామకపత్రం జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతులమీదుగా మల్లేష్గౌడ్ నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామాకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఇ– కేవైసీ 80 శాతమే..
నల్లగొండ: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతోపాటు, అర్హులకే రేషన్ అందేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇ– కేవైసీ ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తి కాలేదు. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తున్నప్పటికీ, జిల్లాలో ఇప్పటికీ సుమారు 20 శాతం మంది లబ్ధిదారులు ఈ– కేవైసీకి దూరంగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 991 రేషన్ షాపులు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 991 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,28,303 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 80 శాతం మంది మాత్రమే ఈ– కేవైసీ పూర్తి చేసుకోగా.. మిగిలిన 20 శాతం మంది ఇంకా బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న లబ్ధిదారులతో ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు రేషన్ పంపిణీలో అక్రమాలు, అనర్హుల పేర్ల కొనసాగింపు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం ఇ– కేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటికీ మరణించిన వ్యక్తుల పేర్లు కొన్ని రేషన్ కార్డుల్లో కొనసాగుతుండగా, వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు కూడా తొలగించని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి లోపాలను సరిదిద్దడంతో పాటు అర్హులైన కుటుంబాలకు మాత్రమే రేషన్ అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ– కేవైసీ చేయించుకునే విధానం.. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు సమీపంలోని చౌక ధరల దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న ఈ –పాస్ యంత్రంలో వేలిముద్ర నమోదు చేయగానే ఆధార్ వివరాలు ధ్రువీకరించబడతాయి. దీంతో ఈ– కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు ఇ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలి. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం పదేపదే అవకాశం కల్పిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం. ఇంకా పెండింగ్లో ఉన్న 20 శాతం మంది లబ్ధిదారులు వెంటనే తమ సమీప రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ ఫ బయోమెట్రిక్ చేయించుకోని 20 శాతం మంది రేషన్ లబ్ధిదారులు ఫ అలస్యం చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారుల హెచ్చరిక ఫ జిల్లాలో 5.28 లక్షల కార్డులు ఉండగా పెండింగ్లో లక్షకు పైగా లబ్ధిదారులు -
ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
రామగిరి(నల్గొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్ రెడ్డి, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మునిస్వామి ఈ ఫలితాలను విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ రెగ్యులర్ సెమిస్టర్లతో పాటు 1వ, 3వ, 5వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలను కూడా వెల్లడించారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు కలిపి మొత్తం 68శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అకడమిక్ కోఆర్డినేటర్లు బత్తిని నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎగ్జామ్ బ్రాంచ్ మెంబర్ కోటయ్య, అసిస్టెంట్ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాసుదేవ్, వేణు, బొజ్జ అనిల్ కుమార్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సర్’ పేరుతో బీజేపీ కుట్రలు
చండూరు : సర్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని కాపాడుకోవాలన్నారు. మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా బుకింగ్ యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్, సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలి
మిర్యాలగూడ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసే వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు అత్యంత అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగి అక్రమ మార్గంలో బీజేపీ గెలిచిందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణలో కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, జూలై 31న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను సరి చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త వెరిఫికేషన్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మొట్టమొదటగా విజయం సాధించే సీటు మిర్యాలగూడ అని ధీమా వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని, ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్దార్థ, ఇలియాస్ఖాన్, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, మోసిన్అలీ, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, షహనాజ్బేగం, ఎండీ.యూసుఫ్, పాలుట్ల బాబయ్య, షోయబ్, పెద్ది శ్రీనివాస్గౌడ్, హాతీరాం, చిట్టిబాబునాయక్ పాల్గొన్నారు. ఫ వైటీపీఎస్ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
నక్కలగండిని సందర్శించిన ఎన్టీసీఏ బృందం
చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు ప్రాంతాన్ని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) బృందం బుధవారం సందర్శించింది. నక్కలగండి ప్రాజెక్టుకు 450 ఎకరాల అటవీ భూమి అవసరం ఏర్పడింది. ఆ భూమికి బదులుగా ప్రభుత్వం చందంపేట మండలంలో కోరుట్ల, ముర్పునూతల, నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం వద్ద భూమిని అటవీ శాఖకు కేటాయించింది. ఆయా భూములను, నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించేందుకు ఎన్టీసీఏ బృందం సభ్యులు ఇక్కడికి వచ్చారు. భూముల వివరాలు తెలుసుకున్నారు. సందర్శించిన వారిలో హరిణి, ఏఐజి జివి.గోపి, సృష్టిమోడి, ఇరిగేషన్ శాఖ, అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. -
సమస్యలు తీర్చండని మంత్రికి మొర
నల్లగొండ : నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం వివిధ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను విన్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. మంత్రిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్రెడ్డి బుధవారం నల్లగొండలోని ఇందిరాభవన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి మొక్క అందజేశారు. -
రోడ్డు దాటడం ఇక సులభం
ఆటో ఎక్కండి.. స్కూల్కు రండి..నగరంలో ప్రతి రోడ్డులోనూ వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. పలు ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పుడు సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద ఈ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో రోడ్డు దాటే మార్గం సులభం కానుంది. అదే విధంగా రెడ్డి హాస్టల్ వద్ద, మేళ్ల దుప్పలపల్లి రోడ్డు క్రాసింగ్ వద్ద, గంధంవారిగూడెం క్రాసింగ్ వద్ద వాహాణాల వేగాన్ని నిరోధించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని డీవీకే రోడ్డు సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ వద్ద నిర్మిస్తున్న ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 8 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. అత్యధిక రద్దీ గల ఈ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా రోడ్డు దాటే ప్రజలకు ఊరట కలగనుంది. ఉదయం, సాయంత్రం రద్దీ.. డీవీకే రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉంటుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు రోడ్డు దాటాలంటే హడలెత్తిపోవాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారు. జాతీయ రహదారి నిర్మాణం సంస్థ ఈ బ్రిడ్జి నిర్మిస్తోంది. తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. పెద్ద, పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే ఈ ఎస్కలేటర్ బ్రిడ్జి తాజాగా నీలగిరి నగరంలో కూడా అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లాలో తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిగా నిలిచిపోనుంది. అదే విధంగా ఖమ్మం, మహబూబ్నర్ లాంటి జిల్లాల్లో కూడా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవని అధికారులు చెబుతున్నారు. తిప్పర్తి : మండలంలోని సిలార్మియాగూడెం గ్రామంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయులు సొంత నిధులతో ఆటో సౌకర్యం కల్పించారు. ఆ ఆటోను సర్పంచ్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు యర్రమాద కవిత నరేందర్రెడ్డి, చింతకుంట్ల రవీందర్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆదిమల్ల శ్రీనివాస్, మధుబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.నీలగిరిలో శరవేగంగా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఫ సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రూ.8 కోట్లతో పనులు -
డీఎంహెచ్ఓగా డాక్టర్ రాహుల్
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.రాహుల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓగా పని చేస్తున్న ఆయనకు నల్లగొండ డీఎంహెచ్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్.. కరోనా సమయంలో నోడల్ అధికారిగా పనిచేశారు. జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాహుల్ తెలిపారు. ఆయనను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ కలెక్టర్ చంద్రశేఖర్ను మర్యాద పుర్వకంగా కలిశారు. డీఈఈ–సెట్ ఫేజ్–2 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలనల్లగొండ : డీఈఈ–సెట్–2026 ఫేజ్–2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదలైనట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈ–సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోని వారికి జూన్ 18న డైట్, నల్లగొండలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫేజ్–1లో సీటు పొంది కళాశాలలో చేరిన అభ్యర్థులకు స్లైడింగ్ ఆప్షన్, ఫేజ్–1లో సీటు పొందని వారు, గతంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు జూన్ 19, 20 తేదీల్లో కొత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 21న వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్)కు అవకాశం కల్పించారని తెలిపారు. మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన జూన్ 25న సీట్లు కేటాయిస్తారని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులు జూన్ 25 నుంచి 27 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మూసీ మత్స్య సొసైటీకి 42 నామినేషన్లునకిరేకల్ : మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నకిరేకల్ మండలం వల్లభాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకుగాను బుధవారం వరకు 42 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి కే.శ్రీరామ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి తేదీ కావడంతో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైస్ మిల్లర్ లక్ష్మయ్య అరెస్ట్రామగిరి (నల్లగొండ) : సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) అవకతవకల కేసులో నల్లగొండ పట్టణానికి చెందిన గౌతమి రైస్ మిల్లు యజమాని కొండా లక్ష్మయ్యను నల్లగొండ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, భారీగా అవకతవకలకు పాల్పడినట్లు లక్ష్మయ్యపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో, ప్రస్తుతం జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు. లక్ష్మయ్యపై రామ్లక్ష్మణ్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం అవకతవకలపై కూడా కేసు ఉంది. -
అర్హులకు ఓటు హక్కు కల్పించాలి
మునుగోడు : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత గ్రామస్థాయి బీఎల్ఏలదని.. సర్ కార్యక్రమంలో భాగంగా తొలగిస్తున్న ఓట్లు నిజమైనవా.. కాదా అనే విషయాన్ని బీఎల్ఏలు పరిశీలించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల నియోజకవర్గస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2.63 లక్షల ఓటర్లు ఉండగా అందులో 23,139 ఓట్లు బోగస్ అని, మరో 59,342 ఓటర్లలో వివిధ రకాల తేడాలు ఉన్నట్లు సర్ గుర్తించిందన్నారు. వాటిని బూత్స్థాయిలో బీఎల్ఏలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి అధికారులకు ఇవ్వాలని సూచించారు. బోగస్ ఓటర్ల తొలగింపు అనంతరం నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్ నేత అధ్యక్షతనలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, శిక్షకులు ఎండీ.నూమాన్, రుద్ర సంతోష్, మున్సిపల్ చైర్మన్ కొడి శ్రీనివాసులు, మొగుదాల పావనిరమేష్గౌడ్, చండూరు మార్కెట్ చైర్మన్ దొటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
విరిగిన ధ్వజ స్తంభం.. పునర్నిర్మాణం జాప్యం!
ఫ దాతలు సిద్ధంగా ఉన్నా పట్టించుకోని అధికారులు ఫ అరిష్టమంటున్న అర్చకులు మిర్యాలగూడ : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ధ్వజ స్తంభం రెండేండ్ల క్రితం విరిగి పక్కకు ఒరిగిపోయి ఉంది. ఈ ధ్వజ స్తంభాన్ని పునర్నిర్మించేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, మూసీ నదుల సంగమం పవిత్ర పుణ్యక్షేత్రంగా మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి దేవాలయం, లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో రెండేండ్ల క్రితం ధ్వజస్తంభం విరిగిపోయి రేకులపై ఒరిగి ఉంది. ఆ రోజుల్లోనే ప్రముఖ అర్చకులు, సిద్ధాంతులు వెంటనే ధ్వజ స్తంభం నిర్మాణం చేసి దోష నివారణ పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారి కల్యాణం నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలువురు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. అయినా దేవాదాయ శాఖ అధికారులు రెండేళ్లుగా ధ్వజ స్తంభం పునర్నిర్మాణం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది అరిష్టదాయకమని బ్రాహ్మణులు, పులువురు హిందూ సంఘాల నాయకులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ధ్వజ స్తంభం పునర్నిర్మాణం చేపట్టి ఆలయాన్ని ప్రక్షాళన చేసి, పూజలు, హోమాలు, స్వామివారి కల్యాణం నిర్వహిస్తే అందరికీ మంచి జరుగుతుందని భక్తులు అంటున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ జ్యోతిని వివరణ కోరగా త్వరలో నూతన ధ్వజ స్తంభం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు యంత్రాంగం సన్నద్ధం
జిల్లాలోని నల్లగొండ నియోజకవర్గంలోనే ఓటర్ల మ్యాపింగ్ తక్కువగా (75.01 శాతం) పూర్తయింది. 62,373 మంది ఓటర్లు వివరాలను ఇంకా మ్యాపింగ్ చేయలేదు. మిర్యాలగూడలో 77.50 శాతం మ్యాపింగ్ పూర్తికాగా, నాగార్జునసాగర్లో 95.40 శాతం, నకిరేకల్లో 95.04 శాతం, మునుగోడులో 87.90 శాతం, దేవరకొండలో 88.53 శాతం మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్లో భాగంగా ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించినవి దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 96,725 మంది ఓటర్లు ఇచ్చిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పెరిగిన వలసల నేపథ్యంలో ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లను తొలగించే లక్ష్యంతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 2002నాటి, ప్రస్తుత ఓటర్ల జాబితాల ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టింది. ఈనెల 25వ తేదీ నుంచి సర్ను క్షేత్రస్థాయిలో ప్రారంభించనుంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. ఎన్యుమరేషన్ ఫామ్లను అందజేసి సంతకాలతో తిరిగి స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియతో ఇప్పటివరకు గ్రామాల్లో, పట్టణాల్లో రెండు చోట్లా ఓటు ఉంటే ఒకచోట తొలగించనున్నారు. 2002 నాటి జాబితాతో మ్యాపింగ్ జిల్లాలో బూత్ల వారీగా 2002 ఓటర్ల జాబితాను, ప్రస్తుతం ఓటర్ల జాబితాతో పోల్చి ఇప్పటివరకు మ్యాపింగ్ చేపట్టారు. జిల్లాలో 86.62 శాతం మ్యాపింగ్ పూర్తయింది. మిగతా మ్యాపింగ్ ప్రక్రియను కూడా ఈనెల 25వ తేదీలోగానే పూర్తి చేయనున్నారు. పాత జాబితాలో తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యుల వివరాలతో ప్రస్తుతం ఓటర్లను అనుసంధానం చేయనున్నారు. ప్రతి ఇంటికీ బీఎల్ఓ ఈనెల 25వ తేదీ నుంచి చేపట్టబోయే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫామ్లను అందజేయనున్నారు. వాటిలో పూర్తి వివరాలు నింపి ఎన్యుమరేషన్ ఫామ్పై సంతకం చేయాలి. అందులో ఒక ఫామ్ను ఓటరు తన వద్ద ఉంచుకుని.. మరో ఫామ్ను బీఎల్ఓకు అందజేయాలి. ఈ ప్రక్రియపై బీఎల్ఓలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 18,012 మంది బీఎల్ఓలు శిక్షణ పొందారు. ఇందుకు అవసరమైన కిట్ను అందిస్తున్నారు. అసలైన ఓటర్ల గుర్తింపే లక్ష్యం సర్లో అసలైన ఓటర్లను గుర్తించడమే లక్ష్యంగా ఎన్ని కల సంఘం ఈ చర్యలు చేపట్టింది. ఓటరు భారతీయుడా కాదా, ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్నాయా.. బోగస్ ఓట్లు ఏమైనా ఉన్నాయా? మృతి చెందిన వారి ఓట్లు అలాగే ఉన్నాయా? అనే వివరాలను సేకరించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు. 2002 జాబితాలో ఓట్లు లేని వారు, కుటుంబ సభ్యుల వివరాలు లేని వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ఆధారాల్లో ఏదో ఒకటి త గిన పత్రాలను సమర్పిస్తే వారి ఓటును ఉంచుతారు. అభ్యంతరాలకు అవకాశం నెల రోజుల పాటు కొనసాగే సవరణ ప్రక్రియ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఎవరి పేర్లయినా తొలగిస్తే, ఇతర అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని దరఖాస్తుల పరిశీలన తర్వాత అక్టోబరులో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో సర్ మ్యాపింగ్లో 4.02 లక్షల ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 2002 10,92,369 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 15,16,253 మంది ఓటర్లు ఉండగా వారిలో 13,13,325 మంది (86.62 శాతం) ఓటర్ల వివరాలు మ్యాపింగ్ అయ్యాయి. ఇంకా 2,02,928 మంది (13.38 శాతం) ఓటర్లు వివరాలను ధ్రువీకరించలేదు. కొన్నిచోట్ల బీఎల్ఓలు ఆయా ఓటర్లను సంప్రదించనివి కూడా ఉన్నాయి. ఇక మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో 4,02,517 మంది (30.65 శాతం) వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో ఇంటి పేరు, ఓటరు పేరు, తండ్రి పేరులాంటి వాటిల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. ఫ రెండు చోట్లా ఓటుంటే ఒకచోట తొలగింపు ఫ 86.62 శాతం పూర్తయిన మ్యాపింగ్ ఫ మ్యాపింగ్ కాని ఓటర్లు 2.02 లక్షల మంది ఫ 4,02,517 ఓటర్ల వివరాల్లో తప్పులు ఫ 25 నుంచి క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరించనున్న బీఎల్ఓలు వంద రోజుల్లో సర్ ప్రక్రియ ఇలా.. జూన్ 25 నుంచి ఇంటింటి గణన జూలై 31న ముసాయిదా జాబితా ప్రకటన జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరణ సెప్టెంబర్ 28 వరకు విచారణలు అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటన‘సర్’ మ్యాపింగ్ వివరాలు ఇలా.. నియోజకవర్గం మొత్తంఓటర్లు మ్యాపింగ్ అయినవి కానివి తప్పులున్నవి దేవరకొండ 2,69,098 2,38,220 30,878 96,725 నాగార్జునసాగర్ 2,34,722 2,23,925 10,797 66,840 మిర్యాలగూడ 2,40,574 1,86,443 54,131 58,008 నల్లగొండ 2,49,571 1,87,198 62,373 51,249 మునుగోడు 2,63,757 2,31,839 31,918 59,342 నకిరేకల్ 2,58,531 2,45,700 12,831 70,353 మొత్తం 15,16,253 13,13,325 2,02,928 4,02,517 -
నీటి విడుదల సరే.. కాల్వల మరమ్మతులేవీ?
డిండి : వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిండి ప్రాజెకు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే మెయిన్ కెనాలకు ఉన్న 22 డిస్ట్రిబ్యూటర్లలో దాదాపు 10 నుంచి 15 డిస్ట్రిబ్యూటర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ఏటా నీటి విడుదల సమయంలో నీరు వృథాఅయి.. ఆయకట్టు చివరి భూములకు పంట చివరి దశ వరకు నీరందక రైతులు నష్టపోతున్నారు. ప్రాజెక్టులో 2 టీఎంసీల నీరు.. డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు (2.48 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నిల్వ ఉన్న 2 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలోని ఎడమకాలువ కింద 12,500 ఎకరాలు, నాగర్కర్నూల్ జిల్లాలోని కుడి కాలువ కింద 250 ఎకరాల ఆయకట్టు ఉంది. వానాకాలం పంటలకు నీటి విడుదలపై ఇరిగేషన్ శాఖ అధికారుల ఈనెల 8న రైతులతో సమావేశమయ్యారు. ఈనెల 17 లేదా 19వ తేదీన ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని సమావేశంలో రైతులు తీర్మానించారు. కాల్వ డిస్ట్రిబ్యూటర్లకు గడువులోగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను రైతులు కోరారు. నీటి విడుదల తేదీపై జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. నీటి విడుదల సమయంలోనే హడావుడి.. డిండి ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు 22 డిస్ట్రిబ్యూటర్లలో సగానికి పైగా తుప్పు పట్టి పాడైనా గేట్లకు మరమ్మతు, కెనాల్ లోపలి భాగంలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకపోయిన మట్టిని తొలగించే విషయంలో ఏటా నీటి విడుదల సమయంలో మాత్రమే హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నీటి విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. డిస్ట్రిబ్యూటర్ల మరమ్మతు పనులు పూర్తి కాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాడైనా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నీరు వృథా కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.బాపన్కుంట వద్ద మెయిన్ కెనాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు తుప్పపట్టిన గోనకొల్ శివారులోని డిస్ట్రిబ్యూటర్ తలుపు డిండి ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు ఉన్న డిస్ట్రిబ్యూటర్లలో పాడైన వాటికి మరమ్మతులు చేస్తున్నాం. నీరు వృథా కాకుండా చర్యలు చేపడతాం. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని అందిస్తాం. – హన్మంతురావు, ఇరిగేషన్ డీఈ ఫ ఆనవాలు కోల్పోయిన డిండి ప్రాజెక్టు మెయిన్కెనాల్ డిస్ట్రిబ్యూటర్లు ఫ నామమాత్రంగా పనులు చేస్తున్న అధికారులు ఫ తూములు సరిగాలేక 40 శాతం నీరు వృథా -
బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కనగల్ : మండలంలోని ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఎండోమెంట్ సహాయ కమిషనర్ కె.భాస్కర్, అర్చకులు నాగోజు మల్లాచారి, గాదె దామోదర్రావు, జినుకుంట్ల చంద్రయ్య, కె.ఉపేందర్రెడ్డి, ఎన్.ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 21న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలునల్లగొండ టూటౌన్ : మేకల అభినవ్ 36వ జయంతి పురస్కరించుకొని ఈనెల 21వ తేదీన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ సౌజన్యంతో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్రెడ్డి, గాంధీగ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో అండర్ – 7, 9, 11, 13, 15, 17 విభాగాల్లో బాల, బాలికలకు స్విస్ పద్ధతిలో 5 రౌండ్లలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 36 మంది విజేతలకు బహుమతితో పాటు ఫిడే రేటెడ్ టోర్నమెంట్కు ఎంపిక చేస్తామని తెలిపారు. చెస్ పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పిస్తాని, ఇతర వివరాలకు 9985423823 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించొద్దుచందంపేట : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్ సూచించారు. మంగళవారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్ బుక్కులు, విక్రయ రికార్డులను పరిశీలించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదు పొందాలని సూచించారు. రైతులు భూమిలో సరిపడా తేమ లేకుండా విత్తనాలు విత్తడం వల్ల మొలకలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుందన్నారు. ఆయన వెంట ఏడీఏ శ్రీలక్ష్మి, ఏఓ యాదగిరి ఉన్నారు. పశువులకు గొంతువాపు నివారణ టీకాలుమాడుగులపల్లి : పశువులకు ముందస్తుగా గొంతువాపు నివారణ టీకాలు వేయాలని జిల్లా పశువైద్యాధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మాడుగులపల్లి మండలంలోని గండ్రవానిగూడెం గ్రామంలో పశువుల గొంతువాపు నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో పశువులకు వచ్చే జ్వరం, గొంతువాపు నివారణ కోసం ఈ టీకాలు వేస్తామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతినెలా పశువైద్య సిబ్బంది పర్యటించి గొంతువాపు ముందస్తు టీకాలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వినయ్కుమార్, సర్పంచ్ బొబ్బలి కావ్యశ్రీనివాస్, రైతులు మాధవరెడ్డి, సతీష్, రవి, నారాయణ, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, సిబ్బంది రాకేష్, రవిచందర్ పాల్గొన్నారు. -
‘చేయూత’ చెక్కు అందజేత
నల్లగొండ : పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నకిరేకల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కుటుంబానికి చేయూత పథకం కింద రూ.2 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవడం పోలీస్శాఖ బాధ్యత అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం, పెన్షన్, ఇతర సంక్షేమాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
దేవరకొండ, హాలియా : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ, హాలియాలో సర్పై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆర్ఎస్.ప్రవీణ్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సర్పై కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటరు సవరణ కార్యక్రమాన్ని తమ రాజకీయ విస్తరణకు ఉపయోగించుకునేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ కార్యకర్తల ఓట్లను తొలగించే అవకాశం ఉందని.. దానిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డ్రామాలో భాగంగానే మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ రాకుండా చేశారని విమర్శించారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సాగర్ మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, బూడిద భిక్షమయ్య, ఇస్లావత్ రామచంద్రనాయక్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవల్లి విజేందర్రెడ్డి, సాదం సంపత్కుమార్, చింతల వెంకటేశ్వరరెడ్డి, బీల్యానాయక్, కిషన్నాయక్, కూరాకుల వెంకటేశ్వర్లు, వడ్డే సతీష్రెడ్డి, సురభి రాంబాబు, వెంకటేశ్వర్లు, కంకణాల వెంకట్రెడ్డి, సర్వయ్య, టీవీఎన్ రెడ్డి, దస్రూనాయక్, వల్లపురెడ్డి, బొడ్డు గోపాల్గౌడ్, దొంతం చంద్రశేఖర్రెడ్డి, రాజినేని వెంకటేశ్వరరావు, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి -
భూ సమస్యలు పరిష్కరించాలి
తిరుమలగిరి(సాగర్) : ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న భూవివాదాలను పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా, డివిజన్ ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించి, ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. భూముల యజమానులు, సరిహద్దులు, గెజిట్ నోటిఫికేషన్లు, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని పలు విభాగాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా ఫారెప్ట్ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ అనిల్ ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
14 రకాల సరుకులు ఇవ్వాలని ధర్నా
నల్లగొండ టౌన్ : జిల్లాలోని అన్ని రేషన్ షాపులలో 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, కారం పొడి, పసుపు తదితర నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొండ అనురాధ, జిట్ట సరోజ, తుమ్మల పద్మ, నాగమణి, ఎస్కే సుల్తానా, ధనలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మహిళలు -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రామగిరి(నల్లగొండ ): ఆర్టీసీ సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నల్లగొండలోని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ 2013 ీపీఆర్సీ ప్రకారం యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ను వెంటనే పీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు పంపించాలన్నారు. 2017 పీఆర్సీ బకాయిలను 9 సంవత్సరాలుగా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 పీఆర్సీని అమలు పరిచి బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణం కల్పించాలని, తార్నాక ఆస్పత్రిలో పాత పద్ధతిలోనే ఒకేసారి రెండు నెలలకు సరిపడా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భోనగిరి శంకరయ్య, రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల యాదగిరి, పల్రెడ్డి యాదగిరిరెడ్డి, బొమ్మ మల్లయ్య, శ్రీను, విఎస్పి.రావు, వివి.రెడ్డి, విఎ.రెడ్డి, రవీందర్, ఎస్ఆర్రెడ్డి, ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు హాజరు 9 శాతమే
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభమవడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా బడి గంట మోగింది. కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. విద్యార్థుల హాజరుపై అమావాస్య ఎఫెక్ట్ కనిపించింది. పాఠశాల ప్రాంగణాలను రంగురంగుల కాగితాలు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు హాజరైన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. దీంతో విద్యార్థులు కొత్త పుస్తకాలు రావడంతో ఆనందంలో మునిగిపోయారు. చాలా పాఠశాలల్లో ఖాళీగా తరగతి గదులు.. మొదటి రోజు పాఠశాలలకు జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులే రాని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు పాఠశాలను ఓపెన్ చేసి ఖాళీగా కూర్చున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులే పాఠశాలలకు వచ్చారు. అమావాస్య ప్రభావంతో పాటు మొదటి రోజు కావడంతో పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి కనబర్చలేదు. స్వాగత ఏర్పాట్లలో అపశృతి.. పాఠశాలల పునః ప్రారంభం పండుగ వాతావరణంలో చేయాలని భావించి కొండమల్లేపల్లి పాఠశాలలో ఒక విద్యార్థి తోరణాలు కడుతున్న సందర్భంలో విద్యుత్ షాక్కు గురై ఆస్పత్రి పాలయ్యాడు. బుధవారం నుంచి హాజరు పెరిగే చాన్స్ అమావాస్య కావడంతో పిల్లలను పాఠశాలలకు పంపలేదు. మంగళవారం చాలా మంది సెంటిమెంట్తో పాఠశాలలకు పంపే అవకాశం తక్కువ. 17వ తేదీ నుంచి ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది. బడిబాట ద్వారా విద్యార్థులను పాఠశాలలకు తెచ్చే కార్యక్రమం చేపడుతున్నందున హాజరు శాతం పెరగనుంది. వచ్చే రెండు మూడు రోజుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఫ పండుగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభం ఫ అమావాస్య కావడంతో పిల్లలను స్కూళ్లకు పంపని తల్లిదండ్రులు ఫ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపకపోవడంతో విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కేవలం 9 శాతం విద్యార్థులే హాజరైనట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు కూడా 87 శాతం వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అమావాస్య రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభించకూడదనే సంప్రదాయ భావన కారణంగా హాజరు శాతం తగ్గినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మరోవైపు కొందరు విద్యార్థులు ఇంకా బంధువుల ఇళ్ల నుంచి తిరిగి రాకపోవడం, వ్యవసాయ పనుల నేపథ్యంలో కుటుంబాలతో ఉండడం వంటి కారణాలతో కూడా గైర్హాజరైనట్లు తెలుస్తుంది. -
భక్తజన ‘గట్టు’
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం సోమవారం జనసంద్రాన్ని తలపించింది. అమవాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమవాస్య రాత్రి దేవాలయంలో వేద మంత్రలతో లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్శర్మ ఆధ్వర్యంలో పూజలు సాగాయి. ఈఓ మోహన్బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. గట్టు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. -
ప్రజావాణిలో వినతుల స్వీకరణ
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 55, ఇతర శాఖలకు 80 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అధికారులతో ఏర్పాట చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు నెలల నుంచి ప్రజావాణి దరఖాస్తులు పెరుగుతున్నాయని, డివిజన్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందున ఇల్లు లేని వారిని గుర్తించి, డెజిటెడ్ అధికారితో పరిశీలన చేయించాలని తెలిపారు. ఈనెల 18న రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ దశరథనాయక్, డీఎఫ్ఓ రాజశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల కుదింపును ఉపసంహరించుకోవాలి
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల కుదింపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుందన్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే యువజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల ఎరువులు విత్తనాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూరియా అమ్మకం యాప్ ను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
లక్ష్యసాధనలో ముందుండాలి
నల్లగొండ : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంది.. లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా సోమవారం నల్లగొండలోని పానగల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయడం, వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ మానస, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ -
మూతబడ్డ పాఠశాలలను తెరిపిస్తాం
నార్కట్పల్లి : జిల్లాలో మూతబడ్డ 314 పాఠశాలలను పునః ప్రారంభిస్తామని.. ఆ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని సమగ్రశిక్షా జిల్లా కోఆర్డినేటర్ ఆర్.వీరేంద్ర కుమార్ అన్నారు. సోమవారం ఆయన నార్కట్పల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించి మాట్లాడారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న గ్రామాల్లో.. ప్రైవేట్ పాఠశాల పంపించే ఉపాధ్యాయులు తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ఆయన వెంట బాజా మురళి, నరసింహ ఉన్నారు. మేరెడ్డి యాదగిరిరెడ్డికి సాహిత్య పురస్కారంరామగిరి(నల్లగొండ) : నల్లగొండకు చెందిన సీనియర్ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిష్టాత్మక ఆవంచ సీతారామారావు స్మారక సాహిత్య పురస్కారం అందుకున్నారు. నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, దివంగత ఆవంచ సీతారామారావు శత జయంతిని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని యాదగిరిరెడ్డికి ప్రదానం చేశారు. గడిచిన ఆరు దశాబ్దాలుగా మేరెడ్డి యాదగిరిరెడ్డి సాహిత్య రంగంలో కొనసాగిస్తున్న విశిష్ట సేవలకు, ఆయన రాసిన కథలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ సాహితీవేత్త, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మోత్కూరు నరహరి తదితర ప్రముఖుల చేతుల మీదుగా యాదగిరిరెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. పురస్కారాన్ని అందుకున్న యాదగిరిరెడ్డికి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు తండు కృష్ణకౌండిన్య, పెరుమాళ్ల ఆనంద్, సాగర్ల సత్తయ్య, అలుగుబెల్లి రామచంద్రారెడ్డి, ఓరుగంటి పురుషోత్తం, పున్న అంజయ్య, వల్లాల అచ్చయ్య, పరందాం, శీలం భద్రయ్య తదితరులు అభినందనలు తెలిపారు. వాహనాల తనిఖీ.. మూడు కేసులు నమోదు నల్లగొండ : రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, మోటారు వాహనాల చట్టం–1988 నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేపట్టారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 130 వాహనాలను పరిశీలించగా, నిబంధనలు ఉల్లంఘించిన మూడు వాహనాలపై కేసులు నమోదు చేశారు. నల్లగొండ జిల్లాలో 40 వాహనాలను తనిఖీ చేసి రెండు కేసులు నమోదు చేయగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 45 వాహనాలను తనిఖీ చేసి ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించలేదు. సూర్యాపేట జిల్లాలో 45 వాహనాలను తనిఖీ చేసి ఒక కేసు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్, పర్మిట్ తదితర చట్టబద్ధ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి వాణి తెలిపారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
రామగిరి(నల్లగొండ) : వన్యప్రాణుల సంరక్షణలో అటవీ శాఖే కాకుండా భద్రతా సిబ్బంది, ప్రజల పాత్ర కూడా ఎంతో కీలకమైందని సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ కోఆర్డినేటర్ రామిండ్ల తిరుపతి అన్నారు. నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్లో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో వైల్డ్ సురక్ష పేరిట సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, వాటి ప్రవర్తనపై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామిండ్ల తిరుపతి, సురక్ష ట్రైనర్ తిరుపతి త్రివేణి, బెటాలియన్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్ఎల్ఎంలో ప్రథమ స్థానంలో నిలపాలి
నల్లగొండ : పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం(ఎఫ్ఎల్ఎం) కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన నల్లగొండలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, మర్రిగూడెం పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఫౌండేషన్ లిటరసీ, సంఖ్యాశాస్త్ర నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి విద్యార్థి మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. త్వరలోనే విద్యార్థులకు కొత్త యూనిఫాం అందజేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్రావు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, కార్పొరేటర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
ఆస్తి కోసం కొడుకు కుట్ర.. బుద్ధి చెప్పిన కలెక్టర్!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ వృద్ధ దంపతులు తమ సొంత ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చింది. న్యాయపోరాటాలు, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న 71 ఏళ్ల ఎంజం రమణారెడ్డి, ఆయన భార్య 66 ఏళ్ల చంద్రకళకు చివరకు న్యాయం జరిగింది. నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ‘తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం–2007’ కింద ప్రత్యేక అధికారాలను వినియోగించి వారి చిన్న కుమారుడిని ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు.మిర్యాలగూడ హౌసింగ్బోర్డు కాలనీలో నివసించే రమణారెడ్డి, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడగా, కుమార్తెకు వివాహమైంది. ఉద్యోగం లేని చిన్న కుమారుడు దయాకర్రెడ్డికి దాదాపు నాలుగు ఎకరాల భూమిని ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. అంతేకాకుండా అతని భార్య, కుమార్తెలు జీవనోపాధి పొందేందుకు నేరేడుచర్ల మండలం ఎంజంవారిగూడెంలోని తమ ఇంట్లో ఉండే అవకాశం కూడా కల్పించారు. తమ జీవిత పొదుపులతో రమణారెడ్డి దంపతులు మిర్యాలగూడ హౌసింగ్బోర్డు కాలనీలో ఓ ఇల్లు నిర్మించడంతో పాటు పక్కనే మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. పిల్లల చదువుల కోసం అంటూ దయాకర్రెడ్డి తన కుటుంబంతో ఆ ఇంట్లోకి వచ్చి నివసించడం ప్రారంభించాడు. అయితే 2022 అక్టోబర్లో దయాకర్రెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి, ఆ ఇంటిని తన భార్యకు విక్రయించినట్లు చూపించాడని దంపతులు ఆరోపించారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాము మిర్యాలగూడ ఇంటికి వెళ్లాలని ప్రయత్నించగా, తమను ఇంటి నుంచి బలవంతంగా వెళ్లగొట్టినట్లు తెలిపారు. స్థానికులు కూడా న్యాయపరమైన ఇబ్బందుల భయంతో తమకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు తిరిగి గ్రామంలోని పాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.చంద్రకళ మాట్లాడుతూ.. తమ కుమారుడు రైతుబంధు సాయం కూడా నిలిపివేశాడని, గ్రామస్తులు తమ భూములను కౌలుకు తీసుకోకుండా బెదిరించాడని ఆరోపించారు. దీంతో తమకు ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయని చెప్పారు. అంతేకాకుండా కట్న వేధింపులు, భూవివాదాలు వంటి తప్పుడు ఆరోపణలతో వివిధ కోర్టుల్లో తమపై 22 కేసులు పెట్టాడని, వాటి విచారణల కోసం తరచూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వృద్ధ దంపతులు వాపోయారు. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.వృద్ధ దంపతుల ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టి, ‘తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం–2007’ ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దయాకర్రెడ్డిపై కేసు నమోదు కాగా, తాజాగా కలెక్టర్ ఆదేశాలతో వృద్ధ దంపతులు తమ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రమణారెడ్డి ఇటీవల పక్షవాతానికి గురికావడంతో తరచూ వైద్య చికిత్స అవసరమవుతోంది. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, వృద్ధాప్య సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ప్రతి నెలా దాదాపు రూ.15 వేల వరకు మందులు, వైద్య పరీక్షలకే ఖర్చవుతోందని చంద్రకళ తెలిపారు.ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులు తమ కుమార్తె, అమెరికాలో స్థిరపడిన పెద్ద కుమారుడు పంపుతున్న ఆర్థిక సహాయంతో జీవనం సాగిస్తున్నారు. 2022 జూన్లో చివరిసారిగా భారత్కు వచ్చిన పెద్ద కుమారుడు తల్లిదండ్రులను చూసేందుకు మళ్లీ రావాలనుకుంటున్నప్పటికీ, తమ్ముడు సృష్టించిన న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంటాననే భయంతో వెనుకడుగు వేస్తున్నాడని చంద్రకళ పేర్కొన్నారు. తమ మిగిలిన ఆస్తులను కూడా తమ పేర్ల నుంచి బదిలీ చేయించుకునేందుకు దయాకర్రెడ్డి గతంలో కొంతమంది రౌడీలను పంపించి ఒత్తిడి తెచ్చాడని, పొలంలో పని చేస్తున్న సమయంలో తమపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడని వృద్ధ దంపతులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఆరోగ్యం క్షీణించడం, నివసించేందుకు భద్రమైన స్థలం లేకపోవడంతో వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని, మిర్యాలగూడలోని ఇంటిని తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ దయాకర్రెడ్డిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ సిటిజన్స్ విభాగానికి చెందిన ఎం. నాగిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో మిర్యాలగూడలోని ఇంటిని అధికారికంగా వృద్ధ దంపతులకు అప్పగించినట్లు తెలిపారు.“మేము కష్టపడి సంపాదించిన ఇళ్లు, భూములను సమాధి వరకు తీసుకెళ్లం. చివరకు అవన్నీ పిల్లలకే చెందుతాయి. అయినప్పటికీ ఆస్తి కోసం మా చిన్న కుమారుడు మమ్మల్ని ఇంత దారుణంగా ఎందుకు వేధించాడో అర్థం కావడం లేదు” అని రమణారెడ్డి, చంద్రకళ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మిర్యాలగూడ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ, గ్రామంలోని తమ ఆస్తిపై కూడా దయాకర్రెడ్డి కన్నేశాడనే భయం వారిలో ఇంకా ఉంది. గ్రామంలోని ఇంటి తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకుంటానని అతడు బెదిరించినట్లు వారు ఆరోపించారు.ఈ విషయాన్ని నల్గొండ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని వృద్ధ దంపతులు నిర్ణయించుకున్నారు. -
ఉపాధ్యాయుల్లో అపోహలు తొలగించాలి
నల్లగొండ : ఈహెచ్ఎస్పై ఉపాధ్యాయుల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసి పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు బకాయి పారితోషికాలను వెంటనే చెల్లించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు కాళం నారాయణ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు సత్తయ్య, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, నక్క యుగంధర్, సుదర్శన్రెడ్డి, డీవీఎస్ ఫణికుమార్, సుధాకర్రెడ్డి, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు శుభాకాంక్షలు : ఎస్పీ
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు ఎస్పీ శరత్చంద్ర పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు ఉత్సాహం, క్రమశిక్షణ, బాధ్యతతో ప్రారంభించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చదువు, వ్యాయామం, వినోదం, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కష్టపడి చదవాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 1098 చైల్డ్ హెల్ప్లైన్, 100/112 అత్యవసర స్పందన సేవ, 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్, 8712670266 నల్లగొండ జిల్లా మాదకద్రవ్యాల నిర్మూలన హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆలయ అర్చకులు ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మిర్యాలగూడ పట్టణ పరిధిలోని అద్దంకి– నార్కట్పల్లి బైపాస్పై మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రెండేండ్ల కిందట రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, రెండేండ్ల క్రితం శంకుస్థాపన చేసిన గుంతను సైతం పూడ్చివేశారు. ఈ రెండళ్ల కాలంలో సుమారు 25 రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. అయినా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి రూ.180 కోట్లు మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్పల్లి– అద్దంకి బైపాస్రోడ్డు గల వై జంక్షన్, నందిపాడు క్రాస్రోడ్డు, చింతపల్లి క్రాస్రోడ్డు, ఈదులగూడ క్రాస్రోడ్డు నాలుగు చోట్ల రూ.180 కోట్లతో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తొలుత చెప్పారు. అందులో రూ.30 కోట్లు భూములు కోల్పోయిన వారికి కేటాయించారు. ఆ నిధులతో మూడు ఫ్లైఓవర్లకే సరిపోతాయని వై జంక్షన్, నందిపాడు క్రాస్రోడ్డు, చింతపల్లి క్రాస్రోడ్డులో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో ప్రమాదాలు కొన్ని.. ● పట్టణంలోని నందిపాడు బైపాస్రోడ్డు వద్ద పెట్నకోట భరతయ్య(75) స్కూటీపై పట్టణంలోకి వస్తున్న క్రమంలో హైదరాబాద్ వైపుకువెళుతున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. స్కూటీని ఢీ కొట్టిన అనంతరం అదే స్పీడ్తో రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో రెండు డీసీఎం వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదలో భరతయ్య అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ● పట్టణంలోని కృష్ణా కాలనీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడుకు చెందిన దేవులపల్లి నాగభూషణం పద్మ దంపతుల కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది. వీరంతా విజయవాడ పెనుగంచిప్రోలు, మోపిదేవి, కోటప్పకొండ ఆలయాల్లో పూజలు ముగించుకోని కారులో మిర్యాలగూడకు తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణ పరిధిలోని కృష్ణకాలనీ సమీపంలోకి రాగానే లారీ అతివేగంగా రావడంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలివైపు పడింది. అదే సమయంలో అటు నుంచి వస్తున్న బొగ్గు లారీ కారును బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ● చింతపల్లి బైపాస్రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. ఇటీవల కారు బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఇలా మిర్యాలగూడ బైపాస్లో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ పరిధిలో మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జిల పనులను నామ్ ఎక్స్ప్రెస్కు అప్పగించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కానీ, రెండేండ్ల కిందట శంకుస్థాపన చేసి.. ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ప్రారంభించలేదని, ఈసారైనా మంత్రి, ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
ఉద్యమాల చరిత్రలో సుబ్బారావుది చెరగని ముద్ర
మిర్యాలగూడ : మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సుబ్బారావు సేవలు ప్రజా ఉద్యమాల చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతి ఎన్ఎస్పీ క్యాంప్లో నిర్వహించిన సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, రాష్ట్ర నాయకుడు గోసుల మోహన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. సుబ్బారావు సమాజంలోని సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. చైతన్య సమాఖ్య ద్వారా సామాజిక చైతన్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లిన ఆయన హక్కులపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. పౌర హక్కుల పరిరక్షణలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజల తరఫున బలమైన స్వరంగా నిలిచారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సీడీ రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, పొన్నూరు రమేష్, ఉదయ, కిరణ్మయి, సృజన, అజయ్, నీరజ, పాండురంగారావు, రామారావు, రాజు, రంగారావు, కృష్ణయ్య, రామయ్య, విమల, రాధా, జూలూరు గౌరీశంకర్, సజయ, అంబటి వెంకన్న, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి -
అసంపూర్తిగా సీసీ లైనింగ్
నిడమనూరు : నాగార్జున్సాగర్ ఎడమకాల్వ మరమ్మతులు అసంపూర్తిగా చేపడుతున్నారు. కాల్వ నిర్మాణ సమయంలో చేపట్టిన బండల లైనింగ్ తొలగించి.. 2014 సీసీ లైనింగ్ చేపట్టినా.. అక్కడక్కడా అసంపూర్తిగా వదిలేశారు. ఆ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు ఏడాదిక్రితం టెండర్లు ఖరారు చేసి.. రెండు వారాలుగా పనులు ప్రారంభించారు. రూ.54 కోట్లతో సాగర్ మొదటి జోన్ (72కిలోమీటర్లు)పరిధిలో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్మరోసారి అసంపూర్తిగా పనులు చేపడుతున్నారని రైతులు అంటున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న కాల్వ సీసీ పనులు పర్యవేక్షించాల్సిన ఎన్ఎస్పీ అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్నిచోట్ల బండల లైనింగ్ అలాగే వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ 38 కిలోమీటరు ప్రాంతం(బొకమంతలపహాడ్ – ముకుందాపురం) గ్రామాల వద్ద కిలోమీటర్ మేర బండల లైనింగ్ ఉంది. ఇక్కడ సాగర్ కాల్వ భూ ఉపరితలానికి దిగువన ఉండటంతో ఎటువంటి ప్రమాదం ఉండదని.. పాతబండల లైనింగ్ ఉంచుతున్నట్లు కాంట్రాక్టు వర్గాలు చెబుతున్నాయి. టెండరు ప్రకారం కాల్వ పూర్తిగా లైనింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టరు పాత లైనింగ్ను పలుచోట్ల అలాగే ఉంచుతున్నారు. సీసీ లైనింగ్ లేకపోతే కాల్వ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ సాగర్ ప్రధాన కాల్వకు కొన్నిచోట్ల బండల లైనింగ్ ఉంచుతున్న కాంట్రాక్టర్ ఫ పనులను పర్యవేక్షించని ఎన్ఎస్పీ అధికారులు -
దొంగ ఓట్లను తొలగించేందుకే ‘సర్’
సాక్షి యాదాద్రి : దొంగ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) చేపట్టిందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మల యాస్మిన్ నగేష్ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ‘సర్’ పై మజ్లిస్ లాంటి పార్టీలు ప్రజల్లో అనవసరమైన అపోహలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను పరిశీలిస్తే పాతబస్తీలో కొన్ని ఇళ్లల్లో వ్యక్తులు లేకపోయినప్పటికీ వంద నుంచి 120మంది పేర్లతో దొంగ ఓట్లు నమోదై ఉన్నాయన్నారు. ఇలాంటి ఓట్లను ‘సర్’ ద్వారా ప్రక్షాళన చేస్తారని స్పష్టం చేశారు. దీంతో విదేశీ వ్యక్తులు, ఉగ్రవాద మూలాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే బయటపడే అవకాశం ఉందన్నారు. కొన్ని హింసాత్మక శక్తులు రాజకీయ అండ చూసుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అనవసరంగా అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ‘సర్’పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతోందని, ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావడానికి దొంగ ఓట్ల తొలగింపు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, నాయకులు పోతంశెట్టి రవీందర్, నర్లనర్సింగరావు, మాయ దశరథ, చందా మహేందర్గుప్తా, రత్నపురం బలరాం, ఉడుత భాస్కర్ పాల్గొన్నారు.ఫ హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ -
పొదుపు డబ్బులు స్వాహా!
మహిళా సంఘాల సొమ్మును వీబీకే కాజేయడంపై గతంలో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – పురుషోత్తం, ఏపీఎం చందంపేట : సంఘ బంధం సభ్యులు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఇచ్చిన సొత్తును విలేజ్ బుక్ కీపర్ (వీబీకే) స్వాహా చేసేశాడు. నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలో రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు చేసి ఏడాది గడిచిపోయినా ఇంత వరకు సదరు వీబీకేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సొమ్మును కూడా రికవరీ చేయలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలోని ఓ మహిళా సంఘం సభ్యులు రూ.2 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు గ్రామ విలేజ్ బుక్ కీపర్కు అప్పగించారు. సదరు వీబీకే ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా తన సొంతానికి వినియోగించుకున్నాడు. తీరా విషయం బయపడడంతో రేపు డిపాజిట్ చేస్తా.. మాపు డిపాజిట్ చేస్తానంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో విసుగెత్తిన మహిళా సంఘం సభ్యులు నేరెడుగొమ్ము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు కూడా నమోదైంది. రికవరీకాని సొత్తు.. చర్యలు శూన్యం కేసు నమోదైనప్పటికి సదరు వీబీకేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కనీసం సొంతానికి వినియోగించిన సొమ్మును కూడా రికవరీ చేయకపోవడం మహిళా సంఘాల సభ్యులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు సొమ్మును రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. ఫ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు రూ.2 లక్షలు అప్పగింత ఫ చెల్లించకుండా సొంతానికి వాడుకున్న వీబీకే ఫ ఫిర్యాదు చేసి ఏడాది గడుస్తున్నా చర్యలు శూన్యం ఫ న్యాయం చేయాలని వేడుకుంటున్న తిమ్మాపురం సంఘబంధం సభ్యులు -
యాదగిరీశుడి దర్శనానికి వచ్చి వెళ్తుండగా..
యాదగిరిగుట్ట : కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా టాటా ఏస్ వాహనం బోల్తా పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన తప్పాటి నరసింహ (30) జీహెచ్ఎంసీకి చెందిన టాటా ఏస్ వాహనంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండకు దిగువన పార్కింగ్ ఏరియాలో టాటా ఏస్ వాహనాన్ని పార్కింగ్ చేసి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి కిందకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో భాగంగా యాదగిరిగుట్ట రింగ్ రోడ్డులోకి రాగానే టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పెంటి కృష్ణమూర్తి, హరికంటి ధనుష్, రామాంజనేయులు, హరికంటి దర్శిత, పెంటి మధుకృష్ణ, హరికంటి రామాంజనేయులు, డ్రైవర్తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నరసింహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి సమయానికి రాకపోవడంతోనే నరసింహ మృతిచెందినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.ఫ టాటా ఏస్ వాహనం బోల్తా పడి యువకుడు మృతి ఫ మరికొందరికి గాయాలు -
లోక్ అదాలత్తోనే సత్వర న్యాయం
చివ్వెంల (సూర్యాపేట) : న్యాయస్థానాల పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కారం చూపుతారు. బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, సత్వర న్యాయం కోసం న్యాయశాఖ లోక్ అదాలత్ నిర్వహిస్తోంది. లోక్ అదాలత్ అంటే.. కోర్టుల్లో నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాటికి సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు. లోక్ అదాలత్ అనేది లీగల్ సెల్ అథారిటీస్ యాక్టు–1987 ప్రకారం చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశంలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా రూపొందించబడింది. ఎలాంటి ఫీజు ఉండదు.. పెండింగ్లో ఉన్న కేసులు లేదా న్యాయ స్థానాల్లో ప్రీలిటిగేషన్ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వేదిక లోక్ అదాలత్. ఈ చట్టం ప్రకారం లోక్ అదాలత్లు ఇచ్చే అవార్డు(నిర్ణయం) సివిల్ కోర్టు కేసుగా పరిగణించబడుతుంది. రాజీకి అవకాశం ఉన్న కేసులు మాత్రమే లోక్ అదాలత్ల ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు. ఆ సంస్థ ఇచ్చే తీర్పు అంతిమం. కేసులు పరిష్కారమైనప్పుడు అవార్డుకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందు అప్పీల్ చేయడానికి అవకాశం ఉండదు. లోక్ అదాలత్ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. అదే కోర్టులో కేసు వేస్తే పరిష్కారానికి సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. లోక్ అదాలత్ కేసులకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇరువర్గాల వారు రాజీ పడవచ్చు. పరిష్కారమయ్యే కేసులు ఇవీ.. సివిల్, క్రిమినల్, మోటార్ వెహికల్ యాక్టులు, ఎకై ్సజ్ కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ ఘర్షణలు, యాక్సిడెంట్ తదితర కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఫ పై కోర్టుల్లో అప్పీల్ లేకుండానే కేసుల పరిష్కారం ఫ రాజీ మార్గంతో డబ్బు, సమయం ఆదా ఫ 20న జాతీయ మెగా లోక్ అదాలత్ -
‘ఎల్నినో’పై అప్రమత్తత అవసరం
తిరుమలగిరి(సాగర్) : వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని ఫలితంగా భూగర్భజలాల లభ్యత తగ్గడంతో పాటు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. దీంతో వర్షాధార పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రైతులందరూ అప్రమత్తంగా ఉండి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని తిరుమలగిరి(సాగర్) ఏఓ గంట హర్షిత సూచిస్తున్నారు. వానాకాలం పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే.. వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రైతులు దీర్ఘకాలిక వరి రకాల సాగును తగ్గించి స్వల్పకాలిక మరియు సన్న రకాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల పంటను 20–30 రోజుల ముందుగానే కోయవచ్చు. నీటి వినియోగం తగ్గి వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కంది, పెసర, మినుము, సజ్జలు, జొన్నలు, నువ్వులు మరియు ఆముదం సాగు చేయాలి. కరువు పరిస్థితులను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నేల తేమ సంరక్షణ..చెరువు మట్టిని పొలంలో తోలడం, పశువుల ఎరువును వేయడం, పొలంలో కలుపు మొక్కలను తొలగించడం, మల్చింగ్ పద్ధతుల ద్వారా నేలలో తేమను నిల్వ ఉండేలా చూడాలి. అంతేకాకుండా వర్షపు నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను వినియోగించడం ద్వారా నీటి పొదుపు మరియు నీటిని వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ఆరుతడి పంటలు మేలు..బోర్లు, బావుల కింద వరి సాగు చేసే రైతులు సగానికి పైగా వరి విస్తీర్ణాన్ని తగ్గించి ఆరుతడి పంటలైన పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు మరియు నూనెగింజల పంటల విస్తీర్ణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేల సారం, నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచే చర్యలు.. ● రైతులు తమ పొలాల్లో పశువుల ఎరువు మరియు చెరువుల మట్టిని తోలడం ద్వారా నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. ● పచ్చిరొట్ట ఎరువుల పంటలైన జనుము, జీలుగ పంటలను సాగు చేసి పుష్పించే దశలో భూమిలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ పదార్ధం పెరుగుతుంది. ● దీని వల్ల వర్షపు నీరు భూమిలోకి సులభంగా ఇంకి భూగర్భజలాల పెరుగుదలకు దోహదపడతాయి. ● నేలలో నీటి నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం పెరిగి పంటలకు ఎక్కువకాలం తేమ అందుబాటులో ఉంటుంది. ● నేల భౌతిక పరిస్థితి మెరుగుపడంతో పాటు నేల సారం పెరిగి పంటల దిగుబడి మెరుగుపతాయి. ● నీటి వినియోగ సామర్ధ్యం, నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం పెరుగుతుంది.ఎల్నినో పరిస్థితుల ప్రభావ నివారణకు సూచనలు.. వర్షాధార పంటలు సాగు చేసుకునే రైతులు నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన అనంతరం మొత్తం 60–75 మి.మీ. వర్షాపాతం నమోదైన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలి. తక్కువ నీటి అవసరం కలిగిన పంటల సాగును ప్రోత్సహించాలి. పంటలు ఎదిగే దశలో అవసరమైన మేరకు కచ్చితమైన నీళ్లు అందించాలి. సిఫారసు చేయబడిన మోతాదులో ఎరువులను వినియోగిస్తూ సమీకృత పోషక నిర్వహణ పద్ధతులను అనుసరించాలి. కీటక నాశకాల విచక్షణరహిత వినియోగాన్ని నివారించి పర్యావరణ హిత సమగ్ర కీటక నిర్వహణ విధానాలను అమలు చేయాలి. సాధ్యమైన చోట్ల సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలి. వానాకాలం సాగుపై తిరుమలగిరి (సాగర్) ఏఓ హర్షిత సూచనలు -
రిసార్ట్లో యువకుడి అనుమానాస్పద మృతి
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ శివారులోని ఓ రిసార్ట్లో శనివారం అర్ధరాత్రి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నర్సాపూర్ మండలంలోని శ్రీరామ్పూర్ గ్రామానికి చెందిన గాండ్ల రాము(27) హైదరాబాద్లోని ఉప్పల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్పల్లిలో నివాసముంటున్నాడు. వీకెండ్ కావడంతో రాము పనిచేస్తున్న కంపెనీకి చెందిన 20 మంది స్నేహితులు కలిసి పార్టీ చేసుకునేందుకు గాను చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని ఓ రిసార్ట్ను బుక్ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న స్నేహితులు.. రాముతో పాటు అతడి స్నేహితులంతా శనివారం సాయంత్రం రిసార్ట్కు చేరుకున్నారు. ఆనందంగా కలిసిమెలిసి పార్టీ మొదలుపెట్టారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. కొంతసేపటి తర్వాత అంతా సద్దుమణిగింది. అనంతరం స్నేహితులంతా ఎవరి పనిమీద వారు నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పార్టీకి వచ్చిన నలుగురు స్నేహితులు కలిసి రిసార్ట్లోని స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో స్విమ్మింగ్ ఫూల్లో నడుచుకుంటూ మిగతావారిని అనుసరించసాగాడు. ఈ క్రమంలో ఆ ఈతరాని యువకుడి కాళ్లకు నీటి అడుగున ఏదో తగిలింది. ఈ విషయాన్ని మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పడంతో వారంతా కలిసి స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్లి చూడగా.. రాము కనిపించాడు. వెంటనే అతడిని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. రిసార్ట్ లోపల ఉన్న మిగతా స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారంతా బయటకు వచ్చి రాముకు సీపీఆర్ చేశారు. వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రాము మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్, ఎస్ఐ యాదగిరిలు ఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. అయితే తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతడిని స్నేహితులే కొట్టి హత్య చేశారని రాము తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేశారని మృతుడి తండ్రి ఫిర్యాదు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు చౌటుప్పల్ మండలం ఎల్లంబావి శివారులో ఘటన -
ప్రభుత్వ బడులను బాగు చేయాలి
కోదాడ : తెలంగాణలో కొత్త బడులు అవసరం లేదని.. ఉన్న ప్రభుత్వ బడులనే బాగు చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ డివిజన్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అన్నారు. నాణ్యమైన వసతులు లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు హక్కులను, విధులను తమ రెండు కళ్లుగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్. రాములు, సోమయ్య, అనిల్కుమార్, యాకయ్య, శ్రీనివాసరెడ్డి, అరుణభారతి, వెంకటయ్య, సలీం షరీఫ్, తల్లాడ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, చందా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
మూడు పోస్టులకు 23 మంది హాజరు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని దేవాదా యశాఖ కమిషనర్ కార్యాలయంలో స్థానాచార్యులు, పురోహిత్, అథర్వ వేద పండిట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించినట్లు ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. ఈ మూడు పోస్టులకు గాను 23 మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు మౌఖిక, రాత పరీక్షలు దేవాదాయశాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు తెలిపారు. ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని ఈఓ పేర్కొన్నారు. శత ప్రశ్న శర సంధానం గ్రంథావిష్కరణ భువనగిరి : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి సాయి అనుగ్రహ మహా పీఠంలో సిద్ధగురు రమణానంద మహర్షి రచించిన శత ప్రశ్న శర సంధానం గ్రంథాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణానంద మహర్షి మాట్లాడుతూ.. శత ప్రశ్న శర సంధానం గ్రంథంలో సాయిబాబా గురించి పూర్తిగా వివరించినట్లు తెలిపారు. 11 భాషలలో రచించిన ఈ గ్రంథాన్ని చదవితే సాయిబాబాపై సంపూర్ణ అవగాహన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షిర్డీ క్షేత్ర సీఈఓ చంద్రబాగ మహాదేవ్, ఆత్మానందా మహరాజ్, శివప్రసాద్, ధనుంజయ్, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
భగవద్గీత.. మానవాళికి దివ్య సందేశం
నకిరేకల్ : భగవద్గీత మానవాళికి మార్గదర్శకంగా నిలిచే దివ్య సందేశమని శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. అన్నమాచార్య కళాసమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్లోని శ్రీసాయి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ భగవద్గీత పారాయణం ద్వారా మనస్సుకు ప్రశాంతత ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయన్నారు. త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్స్వామి మాట్లాడుతూ.. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మానవ జీవిత సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతుందన్నారు.భగవద్గీత పారాయణం ద్వారా శ్రీకష్ణ భగవానుని దివ్య సందేశాన్ని గ్రహించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సూచించారు. అన్నమాచార్య కళా సమితి ఫౌండేషన్ ప్రెసిడెంట్ గండేపల్లి సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్, డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ మాధవి వెల్లంకి, స్థానిక సాయి ఆలయ ట్రస్ట్ చైర్మన్ తొనుపూనూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్రెడ్డి, కోశాధికారి బాణాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి -
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలి
కోదాడ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసే బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త తన పరిధిలోని యువత, మహిళ, రైతులను పార్టీకి అనుసంధానం చేయడానికి పాటుపడాలన్నారు. గ్రామ బూత్స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రజల తరఫున పోరాడాలని కోరారు. సర్ కార్యక్రమంపై కార్యకర్తలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సుంకర అజయ్కుమార్, సత్యబాబు, ఎస్.కె. నయీం, చింతా కవిత, బట్టు శివాజీ, మామిడి రామారావు, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ -
బడి గంటకు వేళాయే..
నల్లగొండ : విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి బడులు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులను ఆకర్షించేలా రంగు కాగితాలు, మామిడితోరణాలు, కొబ్బరి మట్టలతో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నారు. తొలిరోజే పుస్తకాల పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల్లోనే జిల్లాకు పాఠ్య పుస్తకాలు, నోట్పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాంకు రాగా వాటిని ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేర్చారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు తరలించారు. విద్యార్థులు మొదటి రోజు రాగానే తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. గురుకులాల వైపు మొగ్గు.. ఐదేళ్లుగా జిల్లాలో విద్యార్థుల ఎంపికలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి తర్వాత గురుకులాల్లో చేరుతున్నారు. ఉచిత వసతి, నాణ్యమైన బోధన, పోటీ పరీక్షల శిక్షణ వంటి సౌకర్యాలు ఉండడంతో గురుకులాల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. టీసీల ఆన్లైన్ విధానం అమల్లో ఉండటంతో విద్యార్థుల బదిలీలు సులభంగా సాగుతోంది. నాణ్యమైన విద్యే ధ్యేయం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు కనీసం 10 శాతం పెంచాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు జూలై 20న ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ ఫలితాల ఆధారంగా బోధనలో అవసరమైన మార్పులు చేసి విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే చర్యలు తీసుకోనున్నారు. పాత యూనిఫాంతోనే పాఠశాలలకు... ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు వస్త్రం రాగా వెంటనే కుట్టించేవారు. పాఠశాలలు ప్రారంభం రోజే నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాంలు అందించేవారు. అయితే ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చడంతో కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు ఇంకా జిల్లాకు వస్త్రం రాలేదు. దీంతో విద్యార్థులు గత ఏడాది తీసుకున్న పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు రానున్నారు. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య ఇలా.. ప్రాథమిక 825 ప్రాథమికోన్నత 120 ఉన్నత 225 కేజీబీవీ 27 మోడల్ స్కూళ్లు 17 అర్బన్ రెసిడెన్షియల్ 1 కేంద్రీయ విద్యాలయాలు 2 ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు 75,000కు పైగా.. ప్రైవేట్ పాఠశాలలు 388 ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 30,000కు పైగా.. ఫ నేడు పాఠశాలల పునః ప్రారంభం ఫ గురుకులాలు, ప్రైవేట్ స్కూళ్లవైపు విద్యార్థుల మొగ్గు ఫ ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు -
సీఎం రేవంత్రెడ్డి పర్యటన వాయిదా
కనగల్ : సీఎం రేవంత్రెడ్డి కనగల్ మండల పర్యటన వాయిదా పడిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన కనగల్ వద్ద సభా స్థలాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 17న జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారని.. త్వరలో మరోతేదీ ఖరారవుతుందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ సభ స్థలంలో నల్లరేగడి భూమి ఉండటంతో చిత్తడిగా మారిందన్నారు. పెద్ద టెంట్లు నిలబడటం లేదని, వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేని కారణంగానే వాయిదా వేశామని తెలిపారు. త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు చేస్తామన్నారు. విద్యా రంగాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వంమిర్యాలగూడ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా బడులు ప్రారంభించి, ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ విమర్శించారు. ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని, వాటిని తిరిగి తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే గత బీఆర్ఎస్కు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో కుర్ర సైదానాయక్, రవి, శివ పాల్గొన్నారు. పాలిసెట్ తుదిదశ కౌన్సిలింగ్రామగిరి(నల్లగొండ) : పాలిసెట్–2026 తుదిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, 16న సర్టిఫికెట్ల పరిశీలన, 16 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 17 నుంచి ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి దశ కౌన్సిలింగ్కు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు ఈ తుదిదశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు నిర్ణిత తేదీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్కు హాజరుకావాలని, హెల్ప్లైన్ సెంటర్ సౌకర్యాన్ని వినియోగించుకుని తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లో అభ్యర్థులకు ఉచితంగా స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్ల నమోదు సౌకర్యం కల్పించినట్లు వివరించారు. -
సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం
నల్లగొండ టూటౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, జిల్లా ప్రజలకు క్షమాపన చెప్పిన తరువాతనే జిల్లాకు రావాలని, లేకుంటే సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కుంభకోణాల అడ్డగా మారిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన స్వలాభం కోసం నల్లగొండ బైపాస్ రోడ్డు అలాట్మెంట్ మార్చారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కుంభకోణం జరిగినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నల్లగొండలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని, సర్ అంటేనే కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు. నల్లగొండలో రోహింగ్యాలు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల వైర్లు చోరీ చేసినట్లు డీఎస్పీ చెప్పారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు వీరెళ్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, పకీరు మోహన్రెడ్డి, శాంతస్వరూప్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి -
కార్యకర్తలు యోధుల్లా పనిచేయాలి
నల్లగొండ : ఓటు హక్కును కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా యోధుడిలా పని చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలో బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏ) సర్పై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారి ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేద్దామన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలన్నారు. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అభ్యంతరాలు దాఖలు చేయాలన్నారు. ప్రజల మద్దతును ఓట్లుగా మార్చి భద్రపరచడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడి ఫలితాలను తారుమారు చేసేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో బీజేపీ కుట్రలు చేసి సర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడిందని ఆరోపించారు. రాజ్యసభ సీటు చోరీకి పాల్పడిందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు పోకుండా బీజేపీ కుట్ర చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్, టీపీసీసీ నియమిత ట్రైనర్ వెంకటరమణ.. సర్ విధి విధానాలు, ఓటర్ల జాబితా సవరణ, బీఎల్ఎల బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నియోజకవర్గ సర్ పరిశీలకులు రాంజీ, మేయర్ బురి చైతన్య, డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూకూరి రమేష్, గడ్డం అనూప్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ అర్హుల ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా చూడాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
వడ్డెర సంక్షేమానికి కృషి
దేవరకొండ : వడ్డెర సామాజికవర్గ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుకానారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ్డెరులను తిరిగి సంచార జాతులలో చేరుస్తూ జీవో నంబర్ 10ని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో వడ్డెర జాతి పూర్తి నిర్లక్ష్యానికి గురైందన్నారు. జీవో విడుదలలో కీలక పాత్ర పోషించిన పల్లపు సమ్మయ్యకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలిఫ ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికులు సంస్థ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడానికి సహకరించాలని రీజినల్ మేనేజర్ జ్యోత్స్న వెల్లడించారు. శనివారం ఆమె నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్లో జరిగిన సమ్మె సందర్భంగా కార్మికులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా పరిశీలించిందని తెలిపారు. ఈ కమిటీ ఇప్పటికే సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని వివరించారు. కార్మికుల భవిష్యత్కు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. జిల్లా అధ్యక్షుడిగా లింగస్వామిచిట్యాల : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కత్తుల లింగస్వామి ఎన్నికయ్యారు. తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో ఆ సంఘం జిల్లా మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు. పీజీ పాఠ్యాంశంగా ‘పాన్ మరక’రామగిరి (నల్లగొండ) : డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ (తెలుగు) మొదటి సంవత్సరం, సెకండ్ సెమిస్టర్ ఆధునిక కవిత్వం పాఠ్యాంశాల్లో నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క నివాసి, ప్రముఖ కవి అలీ రాసిన ‘పాన్ మరక’ కవితకు చోటు దక్కినట్లు అకడమిక్ తెలుగు కౌన్సిలర్, కవి, రచయిత పున్నమి అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలీ రాసిన ‘పాన్ మరక’ కవితలో జీవం, జీవితం ఉన్నాయని, నిఖార్సైన ముస్లిం మైనారిటీల జీవితాల్లోని పేదరికాన్ని, యథార్థ పరిస్థితులను ఈ కవిత కళ్లకు కడుతుందని కొనియాడారు. సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబించే ఇలాంటి ఉత్తమ కవితకు పీజీ పాఠ్యాంశాల్లో స్థానం లభించడం నల్లగొండ జిల్లాకే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠ్యాంశాల్లో అలీ కవితతో పాటు తెలుగు సాహితీ లోకంలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎన్.గోపి రాసిన ‘రొట్టె’ కవితకు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి జూలూరు గౌరీశంకర్ రాసిన ‘నాలుగో కన్ను’ కవితకు కూడా స్థానం కల్పించారని అంజయ్య పేర్కొన్నారు. సాహిత్య విలువలున్న ఉత్తమ కవితలను పీజీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఎంపిక చేసినందుకు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి, పాలకమండలికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. -
మేరెడ్డి సాహిత్యంలో రైతు జీవితాలు ప్రతిబింబం
రామగిరి (నల్లగొండ) : తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని, గ్రామీణ సంస్కృతిని మేరెడ్డి యాదగిరిరెడ్డి అత్యంత సమగ్రంగా ఆవిష్కరించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కొనియాడారు. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, సృజన సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి సాహిత్య సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా మేరెడ్డి యాదగిరిరెడ్డి ఎంతో నిబద్ధతతో సాహిత్య సృజన చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, తండు కృష్ణకౌండిన్య, రచయిత శిరంశెట్టి కాంతారావు, గుడిపాటి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, అలుగుబెల్లి రామచంద్రరెడ్డి, భూతం ముత్యాలు, వల్లాల అచ్చయ్య పరందాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, పున్న అంజయ్య, బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్రావు, ఓరుగంటి పురుషోత్తం, కుకుడాల గోవర్దన్, డాక్టర్ మొహమ్మద్ హసేన, మల్లికార్జునచారి, నాగేందర్, సత్తయ్య, జానకిరామ్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మహేందర్, చెరుపల్లి సంధ్య, తరుణోజు భీష్మాచార్య, శ్రీకళా రామ్మూర్తి పాల్గొన్నారు. -
రెండేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తాం
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ కనగల్ వద ్దసీఎం సభ ఏర్పాట్ల పరిశీలనకనగల్ : హ్యాం రోడ్ల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం ఆయన కనగల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి హాజరుకానున్న బహిరంగ సభ స్థలాన్ని, హ్యాం రోడ్ల పైలాన్, హెలిపాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 14 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తగా హ్యాం పద్ధతిలో నిర్మించే రోడ్లకు 17వ తేదీ సీఎం రేవంత్రెడ్డి కనగల్ వద్ద శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రోడ్లు ఉంటేనే పరిశ్రమలు, సంక్షేమం ఉంటాయన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్బీసీ సొరంగం కూడా 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. కేంద్ర సీఆర్ఎఫ్ నిధుల ద్వారా నల్లగొండ నుంచి దర్వేశిపురం వరకు స్ట్రెయిట్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరైందని, దాని పక్కనే బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ కూడా సద్ధమవుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని తెలిపారు. సభకు అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీపీఓ శంకర్నాయక్, డీఎస్పీ కె శివరాంరెడ్డి, ఆర్అండ్బీ డీఈ గణేష్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేదరక్షిత, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, నాయకులు గడ్డం అనూప్రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి, దేవిరెడ్డి వెంకట్రెడ్డి, నర్సింగ్ మురళిగౌడ్, గోలి జగాల్రెడ్డి, నర్సిరెడ్డి, నర్సింగ్ కృష్ణయ్యగౌడ్, ఎండీ.హపీజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలి
నల్లగొండ : విద్యార్థుల సంఖ్య కనుగుణంగా పాఠశాలలను పెంచాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆయన శనివారం నల్లగొండలో నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో నాయన మాట్లాడారు. పారిశ్రామీకరణ పట్టణీకరణతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల వలసలతో నగరాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా నేడు ప్రభుత్వ బడులు లేవన్నారు. నల్లగొండ పట్టణంలో 44 వేల మంది విద్యార్థులు చదువుతుండగా అందులో కేవలం 5 వేలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, నల్లగొండ పట్టణంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయాలన్నారు. అక్రమ డిప్యుటేషన్ల రద్దు కోసం ప్రజలను కూడా సమీకరిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్రెడ్డి, పెరుమాళ్ల వెంకటేశం, నాగమణి, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్రెడ్డి, అరుణ, గేర నరసింహ, శ్రీనివాస్రెడ్డి, నలపరాజు వెంకన్న, భానుప్రకాష్, మధుసూదన్, పగిడిపాటి నరసింహ, ప్రభాకర్, బి.సురేందర్రెడ్డి, ఎరనాగుల సైదులు, శ్యాంకుమార్, శ్రీలత, వరలక్ష్మి, రాగి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
అంగన్వాడీ ఖాళీల భర్తీకి కసరత్తు
మిర్యాలగూడ టౌన్ : అంగన్వాడీ టీచర్, ఆయా పొస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలో 163 అంగన్వాడీ టీచర్, 756 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పోస్టులు భర్తీ అధికారులు శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. కొంతమంది నోటిఫికేషన్కు ముందే రాజకీయ పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తం 2093 కేంద్రాలు.. జిల్లాలోని అనుముల, చింతపల్లి, దామరచర్ల, కొండమల్లేపల్లి, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 65 ఏళ్లు నిండిన టీచర్లు, హెల్పర్లకు పదవివీరమణ కల్పించారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య, లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్వాడీ భర్తీ ప్రక్రియ ఇలా.. గతంలో 10వ తరగతి చదివిన వారికి అంగన్వాడీ పోస్టులను ఇచ్చారు. ఇప్పుడు విద్యా అర్హత ఇంటర్మీడియేట్కు పెంచారు. కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేయనున్నారు. ఈ కమిటీ చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఆర్డీఓ, డీడబ్ల్యూఓ, డీఎంహెచ్ఓలు కమిటీ సభ్యులుగా ఉంటారు. పోస్టుల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తం 100 మార్కుల ప్రక్రియతో భర్తీ చేస్తారు. ఇందులో ఇంటర్మీడియేట్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 70 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేనివారికి 10 మార్కులను అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులను కలిపి మెరిట్ వచ్చిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు. ఫ 163 టీచర్, 756 హెల్పర్ పోస్టులు ఖాళీ ఫ జిల్లాస్థాయి కమిటీ చేత ఎంపిక ఖాళీల వివరాలు ఇలా.. ప్రాజెక్టులు టీచర్ హెల్పర్ అనుముల 18 82 చింతపల్లి 23 75 దామరచర్ల 20 105 దేవరకొండ 35 110 కొండమల్లేపల్లి 22 66 మిర్యాలగూడ 17 68 మునుగోడు 09 69 నకిరేకల్ 10 89 నల్లగొండ 09 92 -
ఎంఆర్సీఓజీ అర్హత సాధించిన డా. సైకం శ్రీలత నాయుడు
నల్గొండ: ప్రసూతి, స్త్రీరోగ వైద్య నిపుణురాలు డాక్టర్ సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక ఎం.ఆర్.సి.ఓ.జి. (MRCOG) అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్స్టిట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) అందించే ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందిన అర్హతను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.డాక్టర్ శ్రీలత నాయుడు గత పదేళ్లుగా నల్గొండలో ప్రసూతి, స్త్రీరోగ వైద్య సేవలతో పాటు వంధ్యత్వ చికిత్సలు, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సల రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. వైద్య వృత్తిలో నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఘనతను సాధించినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.ఎంఆర్సీఓజీ అర్హత సాధించడం ద్వారా శ్రీలత నాయుడు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారని సహచర వైద్యులు అభినందించారు. ఈ విజయం ఆమె వ్యక్తిగత ప్రగతికే కాకుండా నల్గొండ జిల్లా వైద్య రంగానికి, తెలుగు రాష్ట్రాల మహిళా ఆరోగ్య సేవలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైకం శ్రీలత నాయుడుకు పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో ఫిట్నెస్ పరీక్ష చేయించని 418 స్కూల్ బస్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పాఠశాలలు జూన్ 15 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1,739 స్కూల్ బస్సులు ఉండగా, ఇప్పటివరకు 1,321 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. ఇంకా 418 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఫిట్నెస్ పరీక్షలు చేయించని బస్సులను పాఠశాలల ప్రారంభం తర్వాత రోడ్లపైకి అనుమతించబోమని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయడంతో పాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బ్రేకులు, టైర్లు, ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, సీట్ల స్థితి వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తారు. దీనిపై రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. యాజమాన్యాలు ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షల కోసం ముందుకు రావడం లేదు. నల్లగొండ జిల్లాలోనే అధికం.. ● ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్కూల్ బస్సులు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. మొత్తం 759 బస్సుల్లో 578 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోగా, ఇంకా 181 బస్సులు తనిఖీలకు హాజరుకావాల్సి ఉంది. ● సూర్యాపేట జిల్లాలో మొత్తం 592 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిలో 420 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందగా, 172 బస్సులు ఇంకా పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. ● యాదాద్రి–భువనగిరి జిల్లాలో మొత్తం 388 స్కూల్ బస్సులు ఉండగా, 323 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశాయి. మరో 65 బస్సులు ఇంకా తనిఖీలకు రాలేదు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యం రోజూ వేలాది మంది విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు మిగిలిన 418 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పెండింగ్లో ఉన్న వందలాది స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తి కావడం ఇప్పుడు రవాణా శాఖకు సవాల్గా మారింది. విద్యార్థుల భద్రత కోసం యాజమాన్యాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.ఫ 15వ తేదీనే పాఠశాలల పునఃప్రారంభం ఫ ఫిట్నెస్ లేకుండా రోడెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్న అధికారులు జిల్లాల వారీగా స్కూల్ బస్సుల వివరాలు ఇలా.. జిల్లా బస్సులు ఫిట్నెస్ పూర్తి పెండింగ్ నల్లగొండ 759 578 181 సూర్యాపేట 592 420 172 యాదాద్రి 388 323 65 మొత్తం 1739 1321 418 -
17 మున్సిపాలిటీల్లో 20 చెరువులు
ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో 20 చెరువులను అభివృద్ధి చేయనున్నారు. రూ.55 కోట్లతో చెరువు కట్టల వెడల్పు, రాతి కట్టడం, కలుషిత నీరు దారి మళ్లించడం లాంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. చెరువుకు కట్టకు లోపలి భాగంలో మొత్తం రాతి కట్టడం నిర్మించడం ద్వారా చెరువులోని నీరు గాలికి అలలుగా వరద తాకిడికి చెరువు కట్ట కోతకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెరువు కట్టలను విస్తరణ చేపట్టడంతో రాకపోకలకు కూడా సులభంగా మారనుంది. మిర్యాలగూడలో చెరువు కట్టకు రాతి కట్టడం పనులు -
డీసీసీబీకి పాత పాలకవర్గమే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాత పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. వెంటనే ఆయా పాలకవర్గాలను కొనసాగించే ప్రక్రియను చేపట్టాలని జిల్లా సహకార అధికారులకు (డీసీవో) సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నల్లగొండ డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి, ఇతర డైరెక్టర్లు మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమ, బుధవారాల్లో ఆయా పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించనున్నాయి. డీసీసీబీ పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరితో ముగియడంతో ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఆ తరువాత మళ్లీ పాలకవర్గం పదవీ కాలాన్ని పొడగించకుండా, గత ఏడాది డిసెంబరు నెలలో వాటిని రద్దు చేసింది. జిల్లా కలెక్టర్లను పర్సన్ ఇన్చార్జీలుగా నియమించింది. దీనిపై డీసీసీబీలకు చెందిన కొందరు డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జీవో 598పై స్టే విధిస్తూ గత నెల 21న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు.. డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టింది. పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లాల సహకార అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు డీసీసీబీకి పాత పాలకవర్గమే ఉంటుంది.ఫ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాలకవర్గాల రద్దు జీఓ సస్పెన్షన్ ఫ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం -
సాగర్ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్లు
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు శ్రీకాంత్రెడ్డి, సాయిశివాని, పారస్ కుమార్ శుక్రవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్న వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు సాగర్ ప్రధాన ఆనకట్టతో పాటు బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధచరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించారు. బుద్ధవనం విశేషాలను తెలిపే లఘచిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శాసన వారికి కండావాలు కప్పి, బోచర్లను అందచేశారు. టూరిజం గైడ్ సత్యనారాయణ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విశేషాలను వివరించారు. వారివెంట పెద్దవూర తహసీల్దార్ ఖాసీం, ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. -
తొలకరి పలకరింపు
నల్లగొండ అగ్రికల్చర్ : తొలకరి పలకరించింది. జిల్లా అంతటా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు తేలికపాటి నుంచి మొస్తరు వర్షం కురిసింది. జిల్లాలో సగటున 20.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అడవిదేవులపల్లిలో అత్యధికంగా 105.7 మిల్లీమీటర్లు, నాంపల్లి 80.6, దామరచర్ల 70.0, చిట్యాల 8.8, నార్కట్పల్లి 10.7, కట్టంగూర్ 20.3, శాలిగౌరారం 30.4, నార్కట్పల్లి 39.3, కేతేపల్లి 1.5, తిప్పర్తి 6.8, నల్లగొండ 9.2, హాలియా 13.2, నిడమనూరు 17.4, త్రిపురారం 34.7, మిర్యాలగూడ 3.4, తిరుమలగిరిసాగర్ 23.2, పెద్దవూర 70.2, చింతపల్లి 4.0, గుర్రంపోడు 6.2, పీఏపల్లి 14.0, నేరడుగొమ్ము 28.5, కొండమల్లేపల్లి 13.4, దేవరకొండ 7.6, గుండ్లపల్లి 3.1, చందంపేట 8.8, గుడిపల్లి 27.2, మునుగోడు 13.4, చండూరు 7.5, మర్రిగూడలో 37.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంచి వర్షం కురవడంతో వానాకాలం సాగు పనులు రైతులు ముమ్మరం చేశారు. ఇప్పటికే దేవరకొండ, చందంపేట, పెద్దవూర, హాలియా, నకిరేకల్, నాంపల్లి, చింతపల్లి, అడవిదేవులపల్లి, గుర్రంపోడు, మునుగోడు, నార్కట్పల్లి, నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో రైతులు పత్తి కట్టెను తీసి దుక్కులు దున్నుకున్నారు. మరోమారు మోస్తరు వర్షాలు కురిస్తే పత్తి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉంది. వానాకాలం వరిసాగుకు వరినార్లు కూడా పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
కనగల్లో హ్యామ్ రోడ్ల పైలాన్
కనగల్ : సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో చేపట్టే హ్యమ్ రోడ్ల పైలాన్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో.. కనగల్ సబ్ మార్కెట్ యార్డ్ వద్ద పైలాన్ను నిర్మిస్తున్నారు. శుక్రవారం పైలాన్ నిర్మాణ స్థలంలో కంకర మట్టిని పోసి డోజర్లతో చదును చేసి పనులను ప్రారంభించారు. ధర్వేశిపురం స్టేజీ సమీపంలో హెలిపాడ్ పనులు మొదలు పెట్టారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్థానిక అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.పద్మ, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి, డీఈ గణేష్కుమార్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, చండూరు సీఐ టీ.రాము, ఎస్ఐ కె.రాజీవ్రెడ్డి, జేఈలు దినేష్రెడ్డి, శ్రీకాంత్, సర్పంచ్ నర్సింగ్ మురళిగౌడ్, మాజీ సర్పంచ్ సునీత కృష్ణయ్యగౌడ్, ఆర్ఐ సునీత, ఏఆర్ఐ యాదగిరి పాల్గొన్నారు. -
మూసీకి జలకళ
కేతేపల్లి : జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం ప్రాజెక్టుకు 876 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కాల్వలకు విడుదల నిలిపి వేసే నాటిని రిజర్వాయర్లో నీటిమట్టం 627 అడుగులకు (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) తగ్గిపోయింది. నెల రోజుల నుంచి మూసీ ఎగువ, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీకి రోజూ 400 నుంచి 500 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 640 అడుగులకు చేరుకుంది. 4.46 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 3.17 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
ఆలేరు: మహిళల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మహిళా కార్యకర్తలు కీలకం అన్నారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మీనాక్షినటరాజన్కు రాజ్యసభ అవకాశం రాకుండా కుట్రలు చేయడం మహిళల పట్ల బీజేపీ నిజమైన వైఖరికి నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు ఓట్ల దోపిడీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు సీట్ల దోపిడీకి కూడా ప్రయత్నించడంపై మండిపడ్డారు. కొత్తగా వివాహమైన మహిళల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా మహిళా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్పై కుట్ర : ఎంపీ చామల భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఆమె రాజ్యసభ నామినేషన్ను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, కాంగ్రెస్ను ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై ఇప్పుడు బిల్లు పెట్టినా ఓటు వేయడానికి కాంగ్రెస్ సిద్ధమేనన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలే కాంగ్రెస్ను మళ్లీ గెలిపిస్తాయన్నారు. ఇదిలా ఉంటే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి అలిగి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, నల్లగొండ, సూర్యాపేట, యాద్రాది జిల్లాల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.ఫ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్రం విఫలం ఫ సీట్ల దోపిడీకి పాల్పడుతున్న బీజేపీ ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫ ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంచట్టసభల్లో మహిళా రిజర్వేషన్ (33శాతం) బిల్లును తక్షణమే అమలు చేయాలనే డిమాండ్తో పోస్ట్ కార్డులపై మహిళల సంతకాలు సేకరించి వాటిని నేరుగా ప్రధాని నరేంద్రమోదీకి పంపే ఉద్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంలో పోస్టుకార్డుల రాసి ప్రదర్శించారు. గ్రామగ్రామాన తిరుగుతూ మహిళలను చైతన్య పరిచి, పోస్టుకార్డుల ద్వారా తమ అభిప్రాయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. -
సర్పంచ్లకు గౌరవ వేతనం
నల్లగొండ : గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం గౌరవ వేతనాల కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. జిల్లాలోని 866 మంది సర్పంచ్లకు ఐదు నెలల 10 రోజుల గౌరవ వేతనాల చెల్లింపునకు రూ.3.55 కోట్లను విడుదల చేసింది. జిల్లా పంచాయతీ కార్యాలయం బిల్లులను ట్రెజరీకి సమర్పించగా, ఒకటి రెండు రోజుల్లో సర్పంచ్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా, 866 గ్రామపంచాయతీలకు సర్పంచ్లు ఉన్నారు. వీరికి నెలకు రూ.6,500 చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. గతేడాది డిసెంబర్ 20న బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్లకు ఇప్పటివరకు వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంతో సర్పంచ్ల్లో ఆనందం వ్యక్తమవుతోంది. శిక్షణ సంస్థల నుంచి ప్రతిపాదనల ఆహ్వానంనల్లగొండ : తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుంది. తెలంగాణ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ‘ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ప్లేస్మెంట్’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలతో అనుబంధం, ఉపాధి కల్పనలో అనుభవం ఉన్న శిక్షణ భాగస్వామ్య సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజేందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల శిక్షణ సంస్థలు తమ ప్రతిపాదనలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం, నల్లగొండలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల అందజేతకు గడువు, దరఖాస్తు విధానం కోసం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన తెలిపారు. చర్చల కమిటీ ఏర్పాటు చేయాలిమిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల నూతన వేతన సవరణకు సంబంధించి యాజమాన్యాలతో చర్చించేందు వీలుగా వేతన కమిటీని ఏర్పాటు చేయాలని టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం నాయకులతో కలిసి హైదరాబాద్లోని సచివాలయంలో తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ.. గతంలో కుదిరిన వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసి రెండు నెలలు దాటుతున్నా నూతన కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. విద్యుత్ రంగాన్ని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన వేతన సవరణ, అలవెన్సుల ఖరారు కోసం తక్షణమే చర్చల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కూలి పోరాటాలు ఉధృతం చేస్తాంతిప్పర్తి : భూమి, కూలి పోరాటాలను ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. శుక్రవారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 20వ మహసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతన చట్టం చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. భూ సీలింగ్ చట్టాన్ని సవరించి, ప్రాజెక్టుల కింద రెండు పంటలు పండే భూములు ఐదు ఎకరాల కంటే మించి ఉంటే పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేయకుంటే భూ పోరాటాలు చేస్తామన్నారు. భూమి లేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్లో నిధులు తగ్గించి వ్యవసాయ కార్మికుల పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య, నాయకులు నన్నూరి వెంకట రమణారెడ్డి, లింగస్వామి, మన్నెం భిక్షం, రాములు, చెరుకు పెద్దులు, మారయ్య, సుకన్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ అండర్–19 క్రికెట్ జట్టులో నల్గొండ కుర్రాడు..
యాదగిరిగుట్ట: భారత్ అండర్ –19 క్రికెట్ జట్టుకు రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు ఉట్కూరి యష్వీర్గౌడ్ ఎంపికయ్యాడు. జూలై 1వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ అండర్ 19 క్రికెట్ టీమ్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో యష్వీర్గౌడ్ ఉన్నాడు.యష్వీర్గౌడ్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అంబర్పేట్లో ఉంటున్నాడు. రెండేళ్లుగా అండర్ –19 హైదరాబాద్ టీమ్లో ఆయన ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో బెంగళూర్లో బీసీసీఐ ఇచ్చిన శిక్షణలో పాల్గొని ఆకర్షించాడు. దీంతో బీసీసీఐ యష్వీర్గౌడ్ను శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్కు బౌలింగ్ ఆల్రౌండర్గా ఎంపిక చేసింది.మరో రెండు రోజుల్లో భారత్ అండర్–19 జట్టుతో కలిసి బెంగళూర్ నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన తల్లిదండ్రులు ఉట్కూరి రాజ్కుమార్, వాణి, బాబాయ్ దీపక్కుమార్ గురువారం సాక్షికి తెలిపారు. భారత్ అండర్–19 జట్టుకు యష్వీర్ గౌడ్ ఎంపిక కావడం రాజాపేటకే కాదు, తెలంగాణకే గర్వకారణమని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
పానగల్లో మరో పంప్హౌస్
నీలగిరిలో రోజూ తాగునీటి సరఫరాకు 50 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మాణం నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. నగరంలో ఇంటింటికీ రోజూ తాగునీటి సరఫరాకు ప్లాంట్ నిర్మించనున్నారు. ఇందుకుగాను తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) నుంచి రూ.83 కోట్లు మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి జనాభాకు అనుగుణంగా తాగునీరు అందించడానికి కొత్త పంప్హౌస్ నిర్మాణం చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పానగల్లో 50 మిలియన్ లీటర్స్ ఫర్ డే (ఎంఎల్డీ) సామర్థ్యం గల మరో పంప్హౌస్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఈ పానగల్లో పంప్హౌస్ నిర్మాణం పూర్తయితే నీలగిరి నగరంలో తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు. రోజుకు 5 కోట్ల లీటర్ల తాగునీటి సరఫరా.. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లోని 48 డివిజన్ల పరిధిలో సుమారు 2.50 లక్షల వరకు జనాభా ఉంది. ఈ జనాభాకు ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక బోర్ల ద్వారా పలు కాలనీలకు నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నగరంలో 24 గంటలపాటు ఇంటింటికి తాగు నీరందిస్తానని పలుమార్లు చెప్పిన ప్రకారం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి మాట నిలబెట్టుకున్నారు. కొత్త పంప్హౌస్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్లాంట్ నుంచే ప్రతి రోజూ 50 ఎంఎల్డీ తాగునీరు అందనుంది. నగర ప్రజలకు రోజుకు 5 కోట్ల లీటర్ల తాగునీటిని అందించనున్నారు. ప్రస్తుతం నగరంలో 10 నీటి ట్యాంకులను కొత్తగా నిర్మిస్తుండగా పాతవి 15 ఉన్నాయి. మొత్తం 25 ట్యాంకుల నుంచి నగరంలోరి 48 డివిజన్లకు తాగునీటి సరఫరా జరగనుంది. నీలగిరి నగర ప్రజలకు రోజూ తాగునీరు అందించడానికి కొత్త పంప్హౌస్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.83 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేయించిన మంత్రికి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – బుర్రి చైతన్య, నగర మేయర్ ఫ రాబోయే 30 సంవత్సరాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా.. ఫ రూ.83 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ -
ధాన్యం తూకాల్లో మాయాజాలం
ధాన్యం తూకాల్లో రైతులకు అన్యా యం జరిగింది. కేంద్రంలో తూకం లెక్కకు, మిల్లు వద్ద తూకానికి 14క్వింటాళ్లు తక్కువగా చూపడం దారుణం. అధికారులే న్యాయం చేయాలి. – గాదరి ప్రసాద్, రైతు, అయిటిపాముల కట్టంగూర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నాయి. తాజాగా కట్టంగూర్ మండలం అయిటిపాముల ఐకేపీ కేంద్రంలో అక్రమాలు వెలుగు చూడడం ఇందుకు నిదర్శనం. కేంద్రంలో కాంటా వేసిన ధాన్యం లెక్కకు, రైస్ మిల్లులో వేసిన లెక్కకు పొంతన లేకుండా పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈనెల 6న అయిటిపాముల కొనుగోలు కేంద్రంలో రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్యకు చెందిన 27 బస్తాల చొప్పున మొత్తం 634 బస్తాల ధాన్యాన్ని కేంద్ర నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు 42 కేజీల చొప్పున కాంటా వేసి మొత్తం 266 క్వింటాళ్ల ధాన్యం రికార్డులో నమోదు చేశారు. అనంతరం ఈ ధాన్యానిన చెర్వుఅన్నారం గ్రామంలో ఉన్న శివసాయి రైస్ మిల్లుకు తరలించారు. 14.65 క్వింటాళ్లు తక్కువగా చూపారు! లారీ రైస్మిల్లు చేరుకున్నాక దిగుమతి సమయంలో మిల్లు యాజమాన్యం ఒక్కో బస్తాకు 2 కేజీల చొప్పున తరుగు తీసి 40 కేజీల చొప్పున తిరిగి తూకం వేశారు. ఈ క్రమంలో ఏకంగా 14.65 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపించడంతో రైతులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇదేమిటని మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఐకేపీ కేంద్ర నిర్వాహకులనే అడగండి అని సమాధానం ఇచ్చినట్లు రైతులు తెలిపారు. తీరా కేంద్రం నిర్వాహకులను నిలదీస్తే మాకేమీ తెలియదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరుపుతాము.. ఇదే విషయమై సివిల్ సప్లయ్ డీటీ ఆర్.జ్యోతిని వివరణ కోరగా ధాన్యం తూకంలో భారీ మొత్తంలో తక్కువగా రావటానికి ఆస్కారం లేదని చెప్పారు. దీనిపై తక్షణమే స్పందించి రైస్మిల్లు యాజమాన్యంతో పాటు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.కేంద్రంలో ఒక లెక్క.. మిల్లులో మరో లెక్క! ఫ అయిటిపాముల ఐకేపీ కేంద్రంలో తాజాగా వెలుగుచూసిన మోసం ఫ 266 క్వింటాళ్ల ధాన్యానికి 14.65 క్వింటాళ్ల తరుగు ఫ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతుల ఆవేదన -
పూర్తికావొచ్చిన ఫ్లైఓవర్
ఫ పెద్దకాపర్తి వద్ద 700 మీటర్ల పొడవుతో నిర్మాణం ఫ త్వరలోనే ప్రారంభానికి సన్నాహాలు చిట్యాల : జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ నియంత్రణతోపాటు వాహనాలు వేగంగా వెళ్లేందుకు చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ప్రస్తుతం ఫ్లై ఓవర్పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. త్వరలోనే ఈ ఫ్లై ఓవర్ని అధికారికంగా ప్రారంభించేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేలా.. జాతీయ రహదారిపై తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతోపాటు గతంలో ఉన్న ఫ్లై ఓవర్ కింద నుంచి పెద్దకాపర్తి మీదుగా రామన్నపేట, చిన్నకాపర్తికి వెళ్లే వాహనాలకు ఇక్కట్లు కలిగేవి. అంతేకాకుండా పెద్దకాపర్తి వద్ద సాధారణ రోజులతోపాటు వారాంతపు సెలవులు, దసరా, సంక్రాంతి పండుగల సమయాల్లో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయేవి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఇబ్బందులను తొలగించేందుకు 21 జూన్ 2024లో పెద్దకాపర్తి వద్ద హైవేపై ఫ్లై ఓవర్ నిర్మించేందుకు నిర్ణయించారు. 700 మీటర్లు.. రూ.30 కోట్లు పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై 700 మీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.30 కోట్లు కేటాయించింది.ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో పెద్దకాపర్తి వద్ద తరచుగా జరిగే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు వాహనదారులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోనున్నారు. -
ఇన్చార్జి డీఎంహెచ్ఓగా డాక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారి (డీఎంహెచ్ఓ)గా డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు డీఎంహెచ్ఓగా పనిచేసిన పుట్ల శ్రీనివాస్ హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్ఓగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎల్బీనగర్ డీఎంహెచ్ఓగా పనిచేస్తున్న చంద్రశేఖర్ను జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ నియమించింది. గురువారం ఆయన విధుల్లో చేరనున్నట్టు సమాచారం. మాజీ సైనికులు దరఖాస్తు చేసుకోవాలినల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లాలో ఉన్న మాజీ సైనిక వితంతువులు, పెన్షన్ లేని మాజీ సైనికులు హైదరాబాద్ ఇందిరమ్మ హౌసింగ్ పథకం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి వనజ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు తెలంగాణ నివాసి అయి కుటుంబంలో ఎవరికి సొంత ఇల్లు ఉండరాదని, తక్కువ ఆదాయం కలిగి ఉండాలని, ఇంతకుముందు ప్రభుత్వ పథకాల ద్వారా గృహ ప్రయోజనం పొంది ఉండరాదని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం జతచేసి తమ దరఖాస్తులను ఈ నెల 12లోగా నల్లగొండలోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని కోరారు. నీటి వనరులను సంరక్షించుకోవాలిమర్రిగూడ (చింతపల్లి) : నీటి వనరుల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. జల సంచయ్ జన భాగీరథీ కార్యక్రమంలో భాగంగా బుధవారం చింతపల్లి మండలం కొడకొండ్ల గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో నీటి నిల్వ కోసం నీటి కుంటలు నిర్మించుకోవాలన్నారు. వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు వాలుకు అడ్డంగా రాళ్ల కట్టలు నిర్మించడం, గుట్టల ప్రాంతాల్లో కందకాలు తవ్వడం వంటి పనులు చేపట్టడం ద్వారా నేల కోతను నివారించవచ్చన్నారు. నీటి వనరుల సంరక్షణపై అవగాహన పెంపొందించి భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సదస్సులో ఎంపీడీఓ సుజాత, సర్పంచ్ కాశగోని వెంకటయ్య, ఏపీఓ శౌరిరెడ్డి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. ఆలేరులో 12న ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంనల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దినేష్ గార్డెన్లో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
బీఎల్ఏలు బాధ్యతగా పనిచేయాలి
మిర్యాలగూడ : అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బాధ్యతగా వ్యవహరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్నేతతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రభుత్వంపై విశ్వాసం పెంచే దిశగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావడంలోనూ బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో మాసనపల్లి లింగాజి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. ఫ మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి -
కల నెరవేరేనా.. మినిస్ట్రీ దక్కేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా జిల్లాలో మూడో మంత్రి పదవి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో మంత్రి పదవిపై చర్చ జోరందుకుంది. ఈసారైనా జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నేనావత్ బాలునాయక్లలో ఎవరిని మినిస్ట్రీ వరిస్తుందన్న చర్చ సాగుతోంది. ఎప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చినా.. మొదట జిల్లా నేతలకు మంత్రి పదవిపైనే చర్చ జరగడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి పరిస్థితి సానుకూలంగా ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజగోపాల్రెడ్డికి సంకేతాలు!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలువడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. కానీ, సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు అప్పడు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారు. మళ్లీ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి రాజగోపాల్రెడ్డికి సంకేతాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఈసారి రాజగోపాల్రెడ్డి పక్కా బెర్త్ లభిస్తుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన రాహుల్గాంధీతో భేటీ అయిన సందర్భంలోనూ తనకు అధిష్టానం ఏం హామీ ఇచ్చింది... తనకు అప్పగించిన బాధ్యతలను పక్కాగా ఎలా నిర్వర్తించారు.. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై రాహుల్గాంధీకి వివరించినట్లు తెలిసింది. రాజగోపాల్రెడ్డి మాత్రం.. తాను రాహుల్గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు.బాలునాయక్కు అవకాశందేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జిల్లా నుంచి బలహీనవర్గాల కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదీ పాత తరం వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొమ్ము పాపయ్య, రవీంద్రనాయక్కు 1985కు ముందు మంత్రి పదవులు దక్కగా, ఆ తరువాత బలహీనవర్గాల కోటాలో మరెవరికి మంత్రి పదవి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా జిల్లాలో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే బాలునాయక్ అధిష్టానాన్ని కోరారు. రాష్ట్ర కేబినెట్లో ఆదివాసీల నుంచి సీతక్కకు మంత్రి పదవి దక్కగా, లంబాడా కోటాలో బాలునాయక్కు ఇస్తారని, సీఎం రేవంత్రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది.నెలాఖరులో కేబినెట్ విస్తరణ?ఈ నెల 18వ తేదీతో రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తరువాత రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తారని, ఏ క్షణంలోనైనా పిలుపురావచ్చన్న చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లా నుంచి రాజగోపాల్రెడ్డి, బాలునాయక్లలో ఎవరో ఒకరికి మాత్రం పక్కాగా మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
జిల్లా వ్యవసాయాధికారితో రేపు ‘ఫోన్ ఇన్’
వానాకాలం సీజన్ ఆరంభమైంది. ఈ సమయంలో విత్తనాల ఎంపిక, భూసార పరిరక్షణ, ఎరువుల వాడకం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాల సమాచారం, నకిలీ విత్తనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర విషయాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’.. వ్యవసాయ అధికారితో ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు నేరుగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్కి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.తేది. 11.06.2026 గురువారం సమయం : ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 89777 51294 -
బీఎల్ఏలు కాంగ్రెస్ పార్టీకి పునాది
హాలియా : బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) కాంగ్రెస్ పార్టీకి పునాది అని శాసనమండలి విప్ బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షుడు కైలాష్నేత అన్నారు. హాలియాలో మంగళవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గం బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో వారు ముఖ్య మాట్లాడారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని, పటిష్టత కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. బీఎల్ఏలు ఓటర్ల నమోదు సమయంలో అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి ఒక్క ఓటును నమోదు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కర్నాటి లింగారెడ్డి, శిక్షణ అసెంబ్లీ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, వివిధ మండలాల అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సర్వయ్య, కృష్ణనాయక్, రామేశ్వరి, అంబటి సోమయ్య, నాయకులు మజహర్ మైనొద్దీన్, పాండునాయక్, బానుచందర్రెడ్డి, పద్మ ఉన్నారు. -
కాంటా వేసినా కల్లాల్లోనే..
మాడుగులపల్లి : కాలం ముంచుకొస్తున్నా అన్నదాతలకు యాసంగి ధాన్యం అమ్మకం కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షాలు భయపెడుతుంటే.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, రవాణా సౌకర్యాల లేమి రైతులను దెబ్బ తీస్తున్నాయి. మాడ్గులపల్లి మండల పరిధిలోని గండ్రవానిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల సమన్వయ లోపం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి గండ్రవానిగూడెం కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పది రోజులుగా కాంటాలు వేసిన ధాన్యం అక్కడే ఉంది. తాజాగా కురిసిన భారీ వర్షానికి దాదాపు 5 నుంచి 6 లారీల ధాన్యం బస్తాలు తడిశాయి. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కటే లారీ.. నాలుగు రోజుల నిరీక్షణ గండ్రవానిగూడెం కేంద్రానికి రవాణా కాంట్రాక్టర్ కేవలం ఒకే ఒక్క లారీని కేటాయించడం గమనార్హం. ఇక్కడి నుంచి మిల్లులకు వెళ్లిన ఆ లారీ.. అక్కడ అన్లోడ్ అయి తిరిగి ఈ కేంద్రానికి రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతోంది. ఆ లారీ తిరిగి వస్తేనే ఇక్కడ ధాన్యం తరలించేది.రైతుల ఆందోళన మంగళవారం అద్దంకి – నార్కట్పల్లి రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి ఆందోళన చేపట్టారు. కాంటాలు వేసి 25 రోజులైనా ఇప్పటివరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 45 నిమిషాల పాటు ఆందోణ కొనసాగడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ సీఈవో రవీంద్రరావు వచ్చి తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడానని బుధవారం వరకు ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరవించారు. ఫ వర్షాలకు తడుస్తున్న ధాన్యం ఫ లారీల కొరతతో తరలింపు ఆలస్యం ఫ ధాన్యం ఎగుమతి చేయాలని కుక్కడం వద్ద రోడ్డెక్కిన రైతులు -
‘నక్ష’ సర్వేపై అపోహలు వద్దు
● సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ దేవరాజ్ మిర్యాలగూడ టౌన్ : భూ వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు పట్టణంలో ఆస్తులకు కచ్చితమైన హద్దులను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్ష సర్వేపై ప్రజలకు ఆపోహలు వద్దని నక్ష సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ దేవరాజ్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నక్ష సర్వేపై రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్ష సర్వేలో భాగంగా పట్టణంలో ప్రతి ఇంటిని, అస్తులను పక్కాగా సర్వే చేస్తామన్నారు. అధికారులు, సర్వే సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా గృహాలు, భవనాలు, ఖాళీ స్థలాలు మ్యాపింగ్ చేస్తామన్నారు. పట్టణ సర్వే అధికారులకు సహరించాలన్నారు. జూలై చివరి వరకు ఈ నక్ష సర్వే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నక్ష సర్వే డీఐ శ్రీనివాస్రెడ్డి, పవన్, మేనేజర్ జ్ఞానేశ్వరి తదితరులున్నారు. ఎంజీయూలో ‘లైబ్రరీ ఎట్ యువర్ కాలేజ్’నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజర్ కాలేజీల ఆధ్వర్యంలో ‘లైబ్రరీ ఎట్ యువర్ కాలేజ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ల్రైబరీని యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ల్రైబరీ నిర్వహిస్తారని తెలిపారు. లైబ్రరీలో విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలు, సాహిత్య, అకడమిక్ పుస్తకాలను అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్చార్జి ప్రేమ్సాగర్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్స్ శ్రీదేవి, అరుణప్రియ, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. నేడు మంత్రి రాకనల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 9 గంటలకు నల్లగొండకు చేరుకుని.. 10 గంటలకు నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంత్రి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొని.. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరి వెళతారు. డీఎంహెచ్ఓ బదిలీనల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన స్పౌజ్ కింద హైదరాదాద్ జిల్లాకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బదిలీచేశారు. ఈయన స్థానంలో డీంఎహెచ్ఓగా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. -
గ్యాస్ ‘సీరియల్’ కష్టాలు
నిడమనూరు : గ్యాస్ సిలిండర్ కోసం నిడమనూరులో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సిలిండర్లను సీరియల్లో పెట్టి ఎండలో వేచిచూస్తున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ గోదాము వద్ద 200 మీటర్లకు పైగా వరుసగా 4 వందలకు పైగా సిలిండర్లు వరుస క్రమంలో పెట్టి బారులుదీరారు. ఆ ప్రాంతం అంతా గ్యాస్ కోసం వచ్చే వారి వాహనాలతో నిండిపోయింది. గ్రామీణ విత్రక్ పథకంలో మండలానికి గ్యాస్ ఏజెన్సీ కేటాయించినప్పటికీ నిడమనూరు ఏజెన్సీ వారు నిడమనూరు మండలమే కాకుండా హాలియా, త్రిపురారం, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్) మండలాల్లో మొత్తం 25 వేల వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో వినియోగదారులకు డిమాండుకు తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్లు అందించలేకపోతున్నారు. నిడమనూరు భారత్ గ్యాస్ ఏజెన్సీకి వారానికి ఒకటి, రెండు లారీల సిలిండర్లు మాత్రమే వస్తున్నాయి. సిలిండర్లు వచ్చిన రోజునే గోదాం వద్ద పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సమస్యల లేదని కేవలం నిడమనూరులోనే గ్యాస్ కొరత ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా గ్యాస్ వినియోగదారుల డిమాండ్, బుకింగ్ ఆధారంగా గ్యాస్ పంపిణీ మెరుగుపడేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. నిడమనూరులోని గ్యాస్ ఏజెన్సీకి 25 వేల కనెక్షన్లు వారంలో రెండు రోజులే సరఫరా -
స్కూళ్ల మరమ్మతులు పూర్తిచేయాలి
హాలియా : పాఠశాలల పునః ప్రారంభంలోపే పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. హాలియా పట్టణంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్సీ బాలికల హాస్టల్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పట్టణంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసి ప్రారంభోత్సవానికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది తదితర విషయాలపై జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృనాయక్తో చర్చించారు. అనంతరం స్థానిక కేజీబీవీని తనిఖీ చేసి పాఠశాలలో టాయిలెట్లు, తాగునీటి వసతి ఉండేలా చూడాలని డీఈఓ సుశీందర్రావును ఆదేశించారు. సమీపంలోని ఎస్సీ, బీసీ బాలికల హాస్టళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్సీ బాలికల హాస్టల్లో మరమ్మతు పనులు పరిశీలించి హాస్టల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డికి సూచించారు. బీసీ బాలికల వసతి గృహంలో సౌకర్యాలు, స్టోర్ రూం, డార్మెటరీని తనిఖీ చేసి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల ఆవరణలో చేపట్టిన తాగునీటి ట్యాంకు నిర్మాణం మధ్యలో ఆగిపోగా కలెక్టర్ స్పందించి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి తక్షణమే వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వరు, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ గౌని రాజారమేష్ యాదవ్, కమిషనర్ రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు, డిప్యూటీ ఇంజనీర్ విభాగం అధికారులు తదితరులు ఉన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
కంకణబద్ధులై పనిచేయాలి
దేవరకొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పార్టీ బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) కంకణబద్ధులై పని చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, శాసనమండలి విప్ బల్మూరి వెంకట్ అన్నారు. మంగళవారం దేవరకొండలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఓటరు సవరణ కార్యక్రమాన్ని తమ రాజకీయ విస్తరణకు ఉపయోగించుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ట్రైనర్ ప్రతాప్రెడ్డి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక, ఎంఏ సిరాజ్ఖాన్, వేణుధర్రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, వడ్త్యా దేవేందర్, నాయిని మాధవరెడ్డి, ముక్కమళ్ల వెంకటయ్య పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలునాయక్ -
కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్కు ముందే విషాదం..!
నల్గొండ జిల్లా: అమెరికాలో స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన యువకుడు నదిలో జారిపడిన ముగ్గురు స్నేహితులను కాపాడి తాను నీటిలో మునిగి మృతిచెందాడు. వివరాలు.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన చెందిన కోడూరు రాజేందర్రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అశ్రిత్రెడ్డి, అనురూప్రెడ్డి(22) సంతానం. ప్రస్తుతం వారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లిలో స్థిరపడ్డారు. రాజేందర్రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి వెళ్లారు. అశ్రిత్రెడ్డిది గతేడాది ఎంఎస్ పూర్తికాగా.. అనురూప్రెడ్డిది ఇటీవలే కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ పూర్తిచేశాడు. అశ్రిత్రెడ్డికి ఉద్యోగం రాకపోగా.. అనురూప్రెడ్డికి ఇటీవలే కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగానికి సంబంధించిన ఓటీపీ రాకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు.స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి..అశ్రిత్రెడ్డి, అనురూప్రెడ్డితో పాటు మరో నలుగురు స్నేహితులు అమెరికాలో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత నెల 29న తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక కోసమని అనురూప్రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్సాస్–లూసియానా సరిహద్దులో ఉన్న ‘టొలెడోబెండ్ రిజర్వాయర్’ వద్దకు వెళ్లారు. అక్కడ అనురూప్రెడ్డి ఫోన్కాల్ మాట్లాడుతుండగా.. అతడి ముగ్గురు స్నేహితులు సరదాగా చేపలు పడుతూ కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు కేకలు వేయడంతో అనురూప్రెడ్డి వెంటనే నీటి ప్రవాహంలోకి దూకి ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు చేరే క్రమంలో ఫిషింగ్ వైరు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. అక్కడి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి 20 అడుగుల లోతున ఉన్న అనురూప్రెడ్డి మృతదేహాన్ని బయటకు వెలికితీశాయి. చదువులో చురుకుఅనురూప్రెడ్డి హైదరాబాద్లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ రూ.40లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అనురూప్రెడ్డికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ ఆఫర్ను కాదని అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.నేడు హైదరాబాద్కు రానున్న మృతదేహం..అనురూప్రెడ్డి మృతదేహం మంగళవారం ఉద యం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కవాడిపల్లిలోని వారి నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రయాణికురాలి నుంచి బస్సు యజమానులుగా మహిళలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మహిళల ఆర్థిక స్వావలంభనకు మరో అడుగు పడింది. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా ప్రతి మండల సమాఖ్యకు ప్రభుత్వం ఒక్కో బస్సును కేటాయించింది. ఈ పథకం కింద జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు 32 బస్లను అందజేస్తోంది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఆర్టీసీకి ఈ బస్సులను అద్దెకు ఇవ్వడంతో ఒక్కో సమాఖ్యకు ప్రతినెలా అదనపు ఆదాయం సమకూరనుంది. మహిళల ఆర్థిక సాధికారితకు, ఆత్మ విశ్వాసానికి, స్వయం సమృద్ధికి ఈ బస్సులు ప్రతీకలుగా నిలువనున్నాయి. ఈ బస్సులతో మహిళలు యాజమానులుగా మారనున్నారు. ప్రభుత్వం రూ.30 లక్షలు, మహిళా సమాఖ్య రూ.6 లక్షలు మహిళా సమాఖ్యలకు అందజేస్తున్న ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు. ఇందులో కమ్యూనిటీ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (సీఐఎఫ్) ద్వారా ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షలు అందించగా, సంబంధిత మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు వాటాగా చెల్లించాయి. దాని ద్వారా బస్లను కొనుగోలు చేసి వాటన్నింటిని ఆర్టీసీకి అప్పగించారు. మహిళా అభివృద్ధికి వేదిక ఇందిరమ్మ మహిళా శక్తి పథకం మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా గాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రతి నియోజక వర్గంలో ఇప్పటికే మహిళా శక్తి భవనాలు నిర్మించుకున్నారు. జిల్లాలో రాష్ట్రస్థాయి నుంచి ఒక పెట్రోల్ బంక్ మంజూరైంది. అది నిర్మాణ దశలో ఉంది. జిల్లా స్థాయి నుంచి మరో 3 బంక్ల ఏర్పాటుకు భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మూడు రైస్ మిల్లుల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నారు. తిరుమలగిరిసాగర్ అల్వాల, చండూరు మండల కేంద్రంలో సోలార్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 32 బస్లు రావడంతో వారికి మరింత ఆర్థిక తోడ్పాటు దక్కనుంది. నార్కట్పల్లి మహిళా సమాఖ్య బస్సుఫ జిల్లాలోని 32 మండల మహిళా సమాఖ్యలకు 32 బస్సులు ఫ ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు ఫ ప్రతి నెలా రూ.69,468 అద్దె చెల్లించనున్న ఆర్టీసీ ఫ మహిళల ఆర్థిక సాధికారితకు ప్రతీకగా నిలువనున్న బస్సులుసూర్యాపేటకు 23, యాదాద్రికి 17 నల్లగొండ జిల్లాలోని మహిళా సమాఖ్యలకు 32 బస్సులను కేటాయించిన ప్రభుత్వం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండల సమాఖ్యలకు 17 బస్సులు కేటాయించింది. సూర్యాపేట జిల్లాకు 23 బస్సులు వచ్చాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాకు 72 బస్సులు కేటాయించారు. -
జూలై చివరి నాటికి ‘నక్ష’ సర్వే పూర్తిచేస్తాం
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో చేపట్టిన ‘నక్ష సర్వే’ను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. నక్ష సర్వేకు పైలట్ పథకం కింద ఎంపికై న మున్సిపాలిటీల్లో సర్వే పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎంపికై ందని ఇందులో ఇండ్లు, భవనాలు, ఖాళీ స్థలాల కచ్చితమైన మ్యాపింగ్ కోసం సర్వే వేగంగా జరుగుతుందన్నారు. సమాచారాన్ని డిజిటలైజ్ చేసేందుకు మొత్తం 32 వార్డులను ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన కోసం 356 బ్లాకులు, 43 వ్యవసాయ బ్లాకులు, 313 భవనాల బ్లాకులుగా విభజించి పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25వేల ఆస్తులను గుర్తించగా క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర శ్రమతో ఇప్పటివరకు 9,375 ఆస్తులకు సంబంధించిన డిజిటల్ సర్వేను పూర్తి చేసి రికార్డు స్థాయిలో 37శాతం ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరు వార్డుల సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భూములు, ఇళ్ల సమగ్ర మ్యాపింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మొత్తంగా 14 ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినట్లు కలెక్టర్ వివరించారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
వంతెన శిథిలం.. భయంగా ప్రయాణం
ఫ నిర్లక్ష్యం నీడలో ఉప్పలపహాడ్ మూసీ బ్రిడ్జి ఫ కూలిన రక్షణ గోడలు, పట్టించుకోని అధికారులుకేతేపల్లి : మూసీ నదిపై నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మక వంతెన నిర్వహణను పట్టించుకోక పోవటంతో శిథిలావస్థకు చేరింది. 2010లో 65వ నంబర్ జాతీయ రహదారి నాలుగులేన్లుగా విస్తరించిన సమయంలో కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్, సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామాల మధ్య మూసీ నదిపై వారధిగా ఉన్న ఈ వంతెనకు సమాంతరంగా రెండు వరుసలుగా నూతనంగా మరో వంతెన నిర్మించారు. అప్పటి నుంచి ఈ పాత వంతెనను అధికారులు పట్టించకోవడం లేదు. ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో వంతెన రెయిలింగ్ దిమ్మెలను పగులగొట్టి అందులో ఉన్న ఇనుపరాడ్లను దుండుగులు ఎత్తుకెళ్లారు. వంతెనపై రాగి చెట్లు మొలుస్తుండటంతో వంతెన గోడల పగుళ్లు ఏర్పడుతున్నాయి. వర్షం నీరు కిందకు పోయే రంద్రాలు మూసుకపోవటంతో వంతెనపై నీరు నిలిచి గుంతలు ఏర్పడి రోడ్డు ధ్వంసమవుతోంది. నిత్యం వాహనాల రాకపోకలు.. సూర్యాపేట నుంచి మిర్యాలగూడ సుమారు 25 గ్రామాలను కలుపుతూ వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంది. పాత వంతెన పైనుంచే మండలంలోని ఉప్పలపహాడ్, తుంగతుర్తి, చెర్కుపల్లి గ్రామాలతో పాటు నకిరేకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాహనాలు ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ఉన్న రక్షణ దిమ్మెలు ధ్వంసం కావడంతో వంతెనపై నుంచి వెళ్లే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పాత వంతెనకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా జయలతనల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా డాక్టర్ జయలత బదిలీపై వచ్చారు. ఆమె సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ బదిలీపై న్లగొండకు వచ్చారు. సోమవారం ఆమె.. ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ వైద్యులు, మెడికల్ కళాశాల బాధ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలినల్లగొండ : ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్నాయక్ పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్నాంపల్లి : మండలంలోని షర్బాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బేక్కం వీరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం డీఈవో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ మల్లికార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయుడి కుటుంబ కలహాల్లో భాగంగా ప్రజావాణిలో పలు ఫిర్యాదులు రావడం, ఆయన తన భార్య పేరు మీద చిట్టీలు వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలిరామగిరి (నల్లగొండ) : రైతులందరు తప్పనిసరిగా పార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.వినోద్కుమార్ తెలిపారు. సోమవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లిలో నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రీ క్యాంపెయిన్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు రిజిస్ట్రీ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ సుంకోజు శ్రీనివాస్, ఏఈఓ శోభ, గ్రామ రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీ ‘బడి’బాట
రెండున్నర ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లల పేర్లు నమోదు చేయించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మమాట–అంగన్వాడీ బాట అనే బడిబాట చేపడుతున్నాం. పిల్లలకు పౌష్టకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తాం. బడిఈడు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – కృష్ణవేణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, నల్లగొండ మిర్యాలగూడ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ఆట–పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందిస్తోంది. అందులో భాగంగా అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్వాడీ బడిబాట’ పేరుతో అంగన్వాడీ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగుతూ రెండున్నరేళ్ల చిన్నారులను గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా.. ఐదేళ్లు దాటిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేస్తున్నారు. తొమ్మిది ప్రాజెక్టులు జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అనుముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. భోజనం, బ్రేక్ఫాస్ట్ ఒకే దగ్గర అందేలా.. అంగన్వాడీకి వచ్చే చిన్నారులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లోనే ఉంటారు. వారికి ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తారు. వీరికి కేంద్రంలోనే బ్రేక్ఫాస్ట్గా చిరుధాన్యాలతో కూడిన ఉప్మా, మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు గుడ్డు అందివ్వనున్నారు. ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఫ 15వ తేదీనుంచి ప్రత్యేక కార్యక్రమం ఫ రెండున్నరేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీల్లో పూర్వప్రాథమిక విద్య ఫ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్న కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల వివరాలు ఇలా.. 6 నెలల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 72,474 బాలింతలు 5316 -
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
దేవరకొండ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్స్థాయి ప్రజావాణిలో కలెక్టర్ మాట్లాడారు. డివిజన్ స్థాయిలో వచ్చే ప్రజావాణి సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కారం కావాలని, ఒకసారి వచ్చిన ఫిర్యాదుదారుడు మళ్లీ రాకుడదని చెప్పారు. దేవరకొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లో ఎఫ్టీఎల్ నిర్ధారించాలని.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజావాణికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ రానున్న సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదులు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మప్రియ, డీఎస్పీ శ్రీనివాసరావు, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండది మొదటి స్థానం
మిర్యాలగూడ : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమస్థానంలో ఉందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సీజన్లో 459 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 96,769 మంది రైతుల నుంచి రూ.1789 కోట్ల విలువైన 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 2.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1570 కోట్లు జమ చేశామని, ఇంకా రూ.190కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మిల్లర్ల నుంచి 22వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరించామన్నారు. యాదాద్రి జిల్లా నుంచి మరో 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుతం మిర్యాలగూడ ప్రాంత మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నకిరేకల్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్తా సమన్వయంతో పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ టైనర్ ఎండీ నూమాన్ అన్నారు. నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులు అవగాహన కలిగి ఉండి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన కార్యకర్తలను అధిష్టానం గుర్తించి పదవులు కేటాయిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత, చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీత, టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, లక్ష్మీనర్సు, మల్లారెడ్డి, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాజుల సుకన్య, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్ పాల్గొన్నారు.ఫ ఏఐసీసీ ట్రైనర్ ఎండీ.నూమాన్ -
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా
నల్లగొండ టౌన్ : విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ అన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు తన కుమారుడు దివంగత కాసోజు శ్రీకాంతాచారి సమాజంలో చిరస్మరనీయుడన్నారు. తనను గౌరవించేలా అభినందన సభ ఏర్పాటు చేసిన సేవా సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆమెను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము, జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, విశ్వనాథం, సత్యనారాయణ, రమణాచారి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, నరేంద్రబాబు, శోభారాణి, రఘువీర్ ప్రతాప్, షణ్ముఖచారి పాల్గొన్నారు. ఫ తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ -
కిక్కిరిసిన పశువుల సంత
బీజేపీని బలోపేతం చేయాలి బూత్ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.- 8లోకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పశువుల సంత ఆదివారం కిక్కిరిసిపోయింది. రైతులు సాగు పనులు ప్రారంభించడం, రోహిణి కార్తె పూర్తయి.. మృగశిర కార్తె రావడం, వర్షాలు కురస్తుండడంతో రైతులు పత్తి విత్తనాలు వేసేందుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు ఎక్కువగా అరకదున్నే ఎద్దుల కొనుగోలు చేసి పంట చేలు పూర్తయ్యాక వాటిని తిరిగి అమ్ముతుంటారు. అందులో భాగంగానే ప్రతి వేసవికాలంలో మృగశిర కార్తె ముగింపు వరకు పశువుల క్రయ విక్రయాలు కొండమల్లేపల్లిలో ఎక్కువగా జరుగుతాయి. ఆదివారం అరక దున్నే ఎద్దుల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. సంతలో జత ఎద్దులకు రూ.లక్ష నుంచి రూ.1.50లక్ష వరకు ధర ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. -
పూర్వవైభవం దక్కేనా..!
సంస్థాన్ నారాయణపురంలోని సదరన్ ఆన్లైన్ బయో టెక్నాలజీస్ లిమిటెడ్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. - 8లోకొండమల్లేపల్లి మండలంలోని కొర్రోనితండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతో మూడేళ్ల క్రితం మూసివేశారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యాశాఖ అధికారుల కృషితో 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. -
నకిలీలపై ఉక్కుపాదం
దేవరకొండ : విత్తనాల విషయంలో రైతులు మోసాలకు గురికాకుండా నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేసేలా సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 12,02,051 ఎకరాల్లో సాగు అంచనా.. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానిలో వరి 5,86,137 ఎకరాల్లో, పత్తి 5,30,524 ఎకరాల్లో, కంది 14 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కలిపి మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నకిలీ విత్తనాలతోరైతులకు నష్టం గతంలో కొందరు దళారులు ఇతర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అంటగట్టిన ఘటనలు ఉన్నాయి. ఆ విత్తనాలు సాగు చేసిన రైతులు పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వం అనుమతిచ్చిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని దుకాణదారులను ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించి రశీదు ఇవ్వాలని, స్టాక్ వివరాలను డిస్ ప్లే చేయాలని దుకాణాదారులకు సూచిస్తున్నారు. రైతులు గ్రామాల్లో దళారులను నమ్మి మోసపోకూడదని, నకిలీ విత్తనాలు విక్రయించే వారి సమాచారం ఉంటే అధికారులకు తెలియపర్చాలని కోరుతున్నారు. ఫ విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు ఫ నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని ఆదేశాలు ఫ దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన -
ముగిసిన ‘థ్రెడ్. పోచంపల్లి’ ఎగ్జిబిషన్
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న థ్రెడ్. పోచంపల్లి చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొని ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత కళాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్కు దేశ, విదేశాల్లో మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు. డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ కోట జంగారెడ్డి, భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, పోచంపల్లి మున్సిపల్చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, టైఅండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, భారత లవకుమార్, ఈపూరి ముత్యాలు, దోర్నాల శేషగిరి, ఎన్నం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆర్ఎం బదిలీ
రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి బదిలీఅయ్యారు. ఆయన స్థానంలో నూతన రీజనల్ మేనేజర్గా ప్రస్తుతం నిజామాబాద్ ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు నల్లగొండ రీజనల్ మేనేజర్గా సేవలందించిన జానిరెడ్డి హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా బదిలీ అయ్యారు. 15న పాఠశాలల పునః ప్రారంభంనల్లగొండ : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పునః ప్రారంభ తేదీని ప్రభుత్వం మార్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం జూన్ 15న పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అయితే విద్యా పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని పని దినంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు ఈ నెల 15న తెరుచుకోనున్నాయి. పాఠ్యపుస్తకాల రచయితగా మల్లేష్నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సవంత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఇంటర్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం, ఏపీలో ద్వితీయ సంవత్సరం జీవశాస్త్రం తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాల రచయితగా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మోదాల మల్లేష్కు అవకాశం దక్కింది. గతంలో తెలుగు అకాడమీ నుంచి ప్రచురితమైన గ్రూప్–1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలు (ఆంగ్లమం, తెలుగుమాధ్యమం) రచనలో ఆయన భాగస్వామి అయ్యారు. డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పుస్తక రచనలో కూడ సహ రచయితగా ఉన్నారు. టీజీ–20 అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు ఫ 20 మంది క్రికెటర్లను వేలంలో దక్కించుకున్న ఫ్రాంచైజీనల్లగొండ టూటౌన్ : యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) చేపట్టిన టీజీ–20 క్రికెట్ లీగ్ ఆటగాళ్ల వేలం ఆదివారం ముగిసింది. హైదరాబాద్లో నిర్వహించిన వేలంలో ఫ్రాంచైజీ అనురాగ్ నల్లగొండ నైట్స్ భారీ ధర చెల్లించి క్రీడాకారులను దక్కించుకుంది. టీమ్కు అవసరమైన 20 మందిని వేలం ద్వారా దక్కించుకున్నారు. ఆటగాళ్లలో ఎండీ.అర్ఫాజ్అహ్మద్ (రూ. 11 లక్షలు), రాహుల్ బుద్ది (రూ.8 లక్షలు), చింతల రక్షణ్రెడ్డి (రూ.6 లక్షలు), పాట్కూరి నితీష్రెడ్డి (రూ.5.50 లక్షలు), నిశాంత్ సరను (రూ.5.50 లక్షలు), అనికేత్రెడ్డి (రూ.4.75 లక్షలు), ఎలగాని వరుణ్గౌడ్ (రూ.3.50 లక్షలు), ప్రణవ్ సూర్యదేవర (రూ.2.50 లక్షలు), ఇళ్యాన్ సతని (రూ.1 లక్ష) హర్షవర్ధన్సింగ్ (రూ.1 లక్ష), చిన్నుగారి రుత్విక్, డివేష్ సింగ్, జస్వంత్ మోతె, విక్రాంత్రెడ్డి, షేక్ సమీర్, షేక్ సోహెల్, బీరవోలు నాగసుధామ్స్రెడ్డి, శ్రీకాంత్, ఉర్వేష్ కక్కడ్ ఒకొక్కరికి రూ.75 వేల చొప్పున్న చెల్లించి దక్కించుకున్నారు. ఆటోమిషన్ ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపాంనాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని అన్నిగేట్లను సమర్థవంతంగా ఎత్తేందుకు వినియోగించే ఆటోమిషన్ ఆధునీకరణకు తయారు చేసిన అంచానాలను రాష్ట్రప్రభుత్వ పరిపాలన అనుమతి కోసం పంపినట్లు సాగర్డ్యాం ఇంజనీర్లు తెలిపారు. గతంలో ఆంధ్రా అధికారులు ధ్వంసం చేసిన పరికరాలను పునరుద్ధరించేందుకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.29.2 లక్షల ఖర్చుతో ఆటోమిషన్ పరికరాలకు మరమ్మతులు చేసి గేట్ల నియంత్రణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆధునాతన ఎస్సీఏడీఏ వెర్షన్ కోసం రూ.43.20 లక్షల అంచనాలతో సమగ్ర ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. పరిపాలన ఆమోదం రాగానే టెండర్లు పిలిచి ఆధునీకరించి.. 100శాతం రిమోట్ ఆపరేషన్తో పాటు మ్యానువల్ తనిఖీలతో గేట్లను ఎత్తి దింపనున్నట్లు పేర్కొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
వేములపల్లి : ఇల్లు లేని ప్రతి పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో 14 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతోపాటు మహిళా సంఘ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో 931 మహిళా సంఘ భవనాల ఏర్పాటుతో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అగ్రభాగంలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇప్పటికే 7.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సాదాబైనామా దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్పీఓ ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు సుమారు 4కిలోల వరకు తరుగు తీసి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని రైతులు వారికి ఫిర్యాదు చేశారు. దానిపై సమగ్ర విచారణ చేపట్టి తనకు నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే పల్లెబాట.. ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోని వాటిని పరిష్కరించి తగిన న్యాయం చేసేందుకు ‘ప్రగతి సింగిడి జనంతో మాట పల్లె బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, రాబోవు రెండున్నర సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలను అనుసంధానం చేయడమే ప్రగతి సింగిడి అన్నారు. ఈనెల 15 తరువాత వారంలో ఐదు రోజులపాటు నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి రాత్రి ఆ గ్రామాల్లో బసచేసి తెల్లారి ఉదయం అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్రాజు, సీఐ పీఎన్డీ.ప్రసాద్, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ జితేందర్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్లు పిల్లల సందీప్, ఝెల్లికట్టి భరత్, ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ జాని, నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్నాయక్, మాలి కాంతారెడ్డి, రావు ఎల్లారెడ్డి, దేశబోయిన రవికుమార్, బంటు చొక్కయ్యగౌడ్, రేగట్టె రవీందర్రెడ్డి, బ్రహ్మదేవర విద్యాసాగర్, తాళ్ల వెంకటేశ్వర్లు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫ ఆమనగల్లులో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు -
శాలిగౌరారం ప్రాజెక్టుకు వరద
ఫ 11 అడుగులకు చేరిన నీటిమట్టం శాలిగౌరారం : జిల్లాలో మద్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మూసీనదిపై ఉన్న మూసీ ప్రాజెక్టుకు ఎగువ భాగాన శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరువచ్చేందుకు పల్లివాడ వద్ద నిర్మించిన ఆనకట్ట చివరిది. పల్లివాడ ఆనకట్టకు ఎగువభాగంలో అసిఫ్నహర్, భీమలింగం, ధర్మారెడ్డి, బునాదిగాని, పిల్లాయిపల్లి, బాచారం ఆనకట్టలు ఉన్నాయి. ఈ ఆనకట్టల వద్ద మూసీనదికి ఇరువైపుల ఉన్న కాలువల పరిధిలో ప్రస్తుతం నీటిని నిలిపివేయడంతో మూసీనది ప్రవాహం నేరుగా పల్లివాడ ఆనకట్ట మీదుగా మూసీనదిలోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పల్లివాడ ఆనకట్ట వద్ద ఉన్న హెడ్రెగ్యూలేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టు రాచకాల్వలోకి నీటిని మళ్లించడంతో మూసీనదిలోని వరదనీరు శాలిగౌరారం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.. పక్షం రోజుల్లో 11 అడుగులకు చేరిన నీటిమట్టం.. శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. గడిచిన యాసంగి పంటకు నీటిని నిలిపివేసేనాటికి ప్రాజెక్టు నీటిమట్టం 4 అడుగులకు పడిపోయింది. గతనెల 24 నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 15 రోజుల్లో ప్రాజెక్టు నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం సీజన్కు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యం సరిగా అందుతుందా..
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్)ను కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడే వెల్నెస్ సెంటర్ను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా? అవసరమైన మందులు అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని మందులు అందుబాటులో లేవని రోగులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి సరఫరా పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న డి–అడిక్షన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్.. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు తగు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య) వార్డును సందర్శించిన కలెక్టర్.. గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభాగాన్ని కూడా పరిశీలించి మందుల నిల్వలు, పంపిణీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నరసింహారావు నేత, డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు పాల్గొన్నారు. ఫ జీజీహెచ్లో సేవలపై కలెక్టర్ ఆరా -
గ్రామాల అభివృద్ధికి సహకరించాలి
కట్టంగూర్ : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. శనివారం అయిటిపాముల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామసభకు దృష్టికి తీసుకొస్తే అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ బోనగిరి రమేష్, సర్పంచ్ బెల్లి సుధాకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు ఉన్నారు. -
నల్లగొండ, మిర్యాలగూడలో భారీగా పెరిగిన భూముల విలువ
కమర్షియల్ స్థలాలకు పెరిగిన విలువలు ఇలా.. (రూ.లలో/గజం) పాత ధరకొత్త ధరసాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడలో భూ విలువలు భారీగా పెరిగాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఈ రెండు ప్రాంతాల్లోనే ధరలు అత్యధికంగా ఉన్నాయి. నల్లగొండ, మిర్యాలగూడలో కమర్షియల్ ప్లాట్లు గతంలో గజానికి రూ.31,800 ఉండగా ప్రస్తుతం అది 40,700 (21.86 శాతం) పెరిగింది. ఈ రెండు పట్టణాల్లో అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విలువల కూడా భారీగా పెరిగింది. ప్రాంతాల వారీగా వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, కమర్షియల్ ప్లాట్ల విలువలను సమరించింది. సవరించిన విలువలను శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్టంగా 15 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెంపు ఉండడంతో ప్రజలపై భారం పడుతోంది. హాలియాలో ఎకరం రూ.80 లక్షలు.. వ్యవసాయ భూములకు సంబంధించి జిల్లాలో హాలియాలో ఎకరానికి కనిష్టంగా రూ.5 లక్షలు ఉండగా.. హైవే వెంట రూ.80 లక్షలకు పెరిగింది. మునుగోడులో కనిష్టంగా రూ.4.50 లక్షలు ఉండగా అత్యధికంగా 6.75 లక్షలు ఉంది. పెద్దవూరలో అత్యధికంగా రూ.55 లక్షలు ఉండగా తక్కువగా రూ.5 లక్షల వరకు ఉంది. నిడమనూరులో తక్కువగా రూ.5,11,875 ఉండగా ఎక్కువగా రూ.8,58,375 లక్షలకు పెరిగింది. చిట్యాలలో హైవే వెంట వట్టిమర్తి వద్ద రూ.63 లక్షలకు పెరగగా.. ఎలికట్టెలో రూ.5.40 లక్షలుగా ఉంది. కొండమల్లేపల్లిలో అతి తక్కువగా రూ.4.50 లక్షలు ఉండగా.. అత్యధికంగా రూ.76 లక్షలకు పెరిగింది. వేములపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ ఇటిక్యాలలో రూ.30,50,200 ఉండగా.. తక్కువ చలిచీమలపాలెంలో రూ.6,75,000 ఉంది. నాంపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ తక్కువగా రూ.3,36,500 అత్యధికంగా రూ.16,33,500 ఉంది. చండూరు మండలంలోని చండూరులో గరిష్టంగా రూ.63,52,500 కాగా.. తక్కువగా కొండాపురంలో రూ.3,93,750గా ఉంది. అపార్ట్మెంట్ల విలువ పెరిగిందిలా.. నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడ పట్టణంలో అపార్ట్మెంట్లలో చదరపు అడుగుల విస్తీర్ణం ధరలు భారీగా పెరిగాయి. గతంలోకంటే ప్రాంతాన్ని బట్టి 20 శాతం నుంచి 50 శాతానికిపైగా పెంచింది. నల్లగొండలోని ప్రకాశం బజార్లో అపార్ట్మెంట్లలో చదరపు అడుగు మార్కెట్ విలువ గరిష్టంగా రూ.3 వేలకు పెంచగా, శివాజినగర్లో రూ.1,800లకు పెంచింది. మిర్యాలగూడలోనూ పోలీస్స్టేషన్ నుంచి ఓల్డ్ ఎంఆర్వో రోడ్లో కనిష్టంగా రూ.1800 చేయగా, మున్సిపల్ కాంప్లెక్స్ నుంచి బ్రిడ్జి రోడ్డులో గరిష్టంగా రూ.3400లకు పెంచింది ఇళ్ల స్థలాల విలువలు భారీగా పెంపు.. ● నల్లగొండలో రెసిడెన్షియల్ విభాగంలో రూ.1,700 ఉన్న చోట రూ.2,600కు, రూ.2,400 నుంచి రూ.4,200కు పెంచారు. బొట్టుగూడలో రూ.2,400 నుంచి రూ.4,800కు, చర్లపల్లిలో రూ.3,100 నుంచి రూ.5,425కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గజానికి రూ.500 ఉన్న విలువను రూ.900కు పెంచారు. ● మిర్యాలగూడ మండలంలో గతంలో గజం ధర రూ.500 ఉండగా.. రూ.900కు పెంచారు. ● చింతపల్లి హైవే వెంట గజానికి రూ.4200, కనిష్టంగా ముస్లింవాడలో రూ.1600 ఉంది. ● మర్రిగూడలో హైదరాబాద్ రోడ్డులో గరిష్టంగా గజానికి రూ.2600 కాగా, కనిష్టంగా పడమటి వాడలో రూ.1500గా ఉంది. ప్రకాశం బజార్31,80040,7004,100మిర్యాలగూడ రోడ్డు6,00010,000వెంకటేశ్వర కాలనీ16,200గడియారం–రామగిరి మార్గం17,60026,000దేవరకొండ మెయిన్ రోడ్డు5,80027,1003,100అశోక్నగర్5,500ఫ 15 శాతం నుంచి 100 శాతం వరకు విలువల పెంపు ఫ ప్రాంతాల వారీగా సవరణ ఫ ప్రభుత్వానికి ఆదాయం.. జనంపై భారం వ్యవసాయ భూములకు సంబంధించి కొన్ని సర్వే నంబర్లకు మార్కెట్ విలువ చూపించడం లేదు. మిర్యాలగూడ మండల పరిధిలోని జప్తి వీరప్పగూడెంలో సర్వేనంబర్ 157లో, కాల్వపల్లిలో సర్వేనంబర్ 1, తడకమళ్లలో సర్వేనంబర్ 15, మిర్యాలగూడ శివారులో సర్వే నంబర్ 110 ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూమి విలువ రూ.0 గా చూపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూముల విలువ పూర్తిస్థాయిలో అప్డేట్ కాకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. -
పిల్లలే మన భవిష్యత్తు
పిల్లలు తమ సమస్యలను స్వయంగా వ్యక్తపరిచి, సమాజ అభివృద్ధిలో చురుకై న భాగస్వాములుగా ఎదగడమే బాల పంచాయతీ ప్రధాన ఉద్దేశం. గ్రామానికి బస్సు సౌకర్యం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఇంకా ఏ ఇతర సమస్యలు వస్తే.. సంబంధిత శాఖ అధికారుల వద్దకు నేరుగా వెళ్లి విద్యార్థులే వ్యక్తపరచడం. విద్య, ఆరోగ్యం, గ్రామ సమస్యలను గుర్తించి పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖ అధికారులకు చిన్నప్పటినుంచే చేరవేయడాన్ని విద్యార్థులు నేర్చుకోవాలి. వారి హక్కులు, బాధ్యతలను నేర్చుకోవడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదిగేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కనగల్ : ‘పిల్లలే మన భవిష్యత్తు. వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి, ప్రోత్సహించండి’ అని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు అన్నారు. కనగల్ మండలంలోని చర్లగౌరారం గ్రామంలో శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి ఎంతో ముఖ్యమన్నారు. పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్లో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. చిన్నారులు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాలని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని తెలిపారు. బాలలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం యంగిస్థాన్ ఎన్జీఓ ఆశ్రిత బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలకరాజు సునీత వెంకటేశం, ఏఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆదిరెడ్డి, రాము, కరుణాకర్, ఎస్ఐ అంజలి, రాజీవ్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఈఓ సుశీందర్రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, ఆర్టీఏ మెంబర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ కలపూరి నాగరాజు, చీదేటి సంతోష్రెడ్డి పాల్గొన్నారు. ఫ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు ఫ చర్లగౌరారంలో బాల పంచాయతీ -
ప్రపంచంలోనే అరుదైనది మియాజాకి మామిడి
కిలో పండ్ల ధర రూ.రెండున్నర లక్షలు ఫ సిరిపురంలో పెంచుతున్న శేషుకుమార్ ఫ తొలిసారి కాతకొచ్చిన జపాన్ రకం మియాజాకి ఫ దేశీయ, విదేశీ రకాలను కూడా సాగుచేస్తున్న అభ్యుదయ రైతు నడిగూడెం : మామిడిని సాధారణంగా ఫలరాజు అంటుంటాం. అన్ని ఫలాల్లో కంటే రారాజుగా పిలువబడే మామిడిలో ప్రపంచంలోనే అరుదైనది.. అత్యంత ఖరీదైనది ‘మియాజాకి’ రకం. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు వాసికర్ల శేషుకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో మియాజాకి రకం మామిడిని సాగుచేస్తున్నారు. ఎకరంన్నర విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో ఆయన దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల మామిడి మొక్కలు పెంచుతున్నారు. అందులో మియాజాకి కూడా ఉంది. శేషుకుమార్ మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడియం నుంచి ఒక్కో మొక్కకు రూ.1200 చొప్పున పెట్టి మూడు మొక్కలు తెచ్చి నాటగా ఒక మొక్క చనిపోయింది. మిగతా రెండు మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది తొలిసారిగా 20కి పైగా కాయలు కాశాయి. మియాజాకి మామిడి పండ్ల ధర కిలోకు రెండున్నర లక్షల రూపాయల ఉంటుందని, ఈ రకం పండులో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయని రైతు శేషు కుమార్ తెలిపారు. కాయ ఎరుపు రంగులో 300 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. బంగినపల్లి, దశేరి, తోతాపూరి, హిమాయత్, కొత్తపల్లి కొబ్బరి, ఆల్ఫాన్సా, చెరకు రసాలు, చిన్న రసాలు, నీలం, పండూరి మామిడి, కేసరి, తెల్ల గులాబి, ఆమ్రపాలి, ముంత మామిడి, మల్లిక, పందిరి మ్యాంగో, కస్తూరి మ్యాంగో తదితర రకాలు సాగులో ఉన్నాయి. ఆయన క్షేత్రంలో ఒక్కో రకం రెండు నుంచి మూడు మొక్కల చొప్పున సాగుచేస్తున్నారు. ఈ మొక్కలను కడియం, జడ్చర్ల నుంచి తెచ్చినట్లు రైతు తెలిపారు. తాను పండించిన అరుదైన రకాలు జపాన్ రకం మియాజాకి, అమెరికన్ థామిట్ క్వీన్, కేసరి పండ్లను ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐసీఏఆర్ డైరక్టర్ డాక్టర్. షేక్.మీరాకు అందజేశానని చెప్పారు. శేషుకుమార్ సాగుచేస్తున్న విదేశీ రకాలు ఇవీ..మియాజాకి, థామిట్ క్వీన్, నాసిక్ పసంద్, గోల్డెన్ మ్యాంగో, పర్పుల్ మ్యాంగో, ఫోర్ స్టోన్ మ్యాంగో, క్యాట్మెన్ మ్యాంగో, బన్సారా మ్యాంగో, యాపిల్ మ్యాంగో, బర్సూన్ కింగ్, వర్వేటర్, బర్రి మ్యాంగో, టెన్కేజీ మ్యాంగో, బ్లాక్ స్టోన్ మ్యాంగో. గత ఐదేళ్ళుగా పండ్ల తోటలు, కూరగాయలు, అకు కూరలతో పాటు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా అర ఎకరంలో అధిక సాంద్రత పద్ధతిలో 270 మామిడి మొక్కలను సాగు చేస్తున్నాను. దేశ, విదేశాలలో ఉన్న దాదాపు అన్ని రకాలను సాగు చేస్తున్నా. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా సహజ సిద్ధంగా సాగు చేస్తున్నా. నిత్యం ఆదాయం పొందుతున్నాను. – వాసికర్ల శేషు కుమార్, అభ్యుదయ రైతు, సిరిపురం -
గుట్టను 20 మీటర్లు తవ్వడమెందుకు?
నల్లగొండ టూటౌన్ : బ్రహ్మంగారి, లతీఫ్ సాహెబ్ గుట్టలపై ఘాట్ రోడ్డు నిర్మాణానికి గుట్టను 20 మీటర్ల లోతు ఎందుకు తవ్వుతున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రశ్నించారు. గుప్త నిధుల కోసం తవ్వుతున్నారనే అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నల్లగొండ నగరంలోని గుట్టలపై జరుగుతున్న బ్లాస్టింగ్ కారణంగా మునుగోడు హౌసింగ్బోర్డులో రాళ్లు పడి దెబ్బతిన్న ఇళ్లన్నాయన పరిశీలించారు. పేలుళ్ల వల్ల పెద్ద, పెద్ద రాళ్లు వచ్చి తమ నివాసాలపై పడడంతో స్లాబ్ పెచ్చులు ఊడి పడినట్లు స్థానికులు భూపాల్రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో ఉన్న మహిళలు, పిల్లలు భయబ్రాంతులకు గురయ్యే విధంగా గుట్టలపై పేళుల్లు జరుపడం ఎంటని ప్రశ్నించారు. పేళుళ్ల దాటికి స్లాబ్లకు రంద్రాలు పడుతున్నా అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ బాధ్యత లేకుండా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాస పాంత్రాలలో బ్లాస్టింగ్కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఘాట్రోడ్డు నిర్మాణానికి డీపీఆర్, టెండర్ ప్రక్రియ ఉందో లేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో మంజూరు చేసిన నిధులతో కాంగ్రెస్ నాయకులకు వెంచర్లు ఉన్న చోట సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నాణ్యత లేకుండా వేసుకుంటున్నారని వివర్శించారు. వీటన్నింటిపై విచారణ జరిపి, బ్లాస్టింగ్ జరిపిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, బాణావత్ దీప్లా, నాయకులు మారగోని గణేష్, పెరిక కరణ్జయరాజ్, కుందూరు ప్రవీణ్రెడ్డి, గోపగాని రాజశేఖర్, దోటి శ్రీనివాస్, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన -
ఎడుస్యూర్ మ్యాగజైన్లో అనాజిపురం మోడల్ స్కూల్
పెన్పహాడ్ : పెన్పహాడ్ మండలంలోని అనాజిపురంలోని తెలంగాణ మోడల్ స్కూల్.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఈ–మ్యాగజైన్ ఎడుస్యూర్ సంచికలో చోటు సంపాదించింది. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఎక్స్ప్లోరింగ్ ది యూనివర్స్ ఇన్స్పైరింగ్ యంగ్ మైడ్స్ అనే థీమ్తో గతేడాది నిర్వహించిన వరల్డ్ స్పేస్ వీక్–2025 కార్యక్రమాలను ఈ మ్యాగజైన్ ప్రచురించింది. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య వివరాలను వెల్లడించారు. ఎడుస్యూర్ తాజా సంచిక 24, 25 పేజీల్లో తమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల విశిష్టతను తెలియజేస్తూ ప్రత్యేక కథనం ప్రచురించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని రేకెత్తించాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఈ కార్యక్రమాలను చేపట్టినా అనాజిపురం మోడల్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాలు ఉత్తమంగా ఎంపికై ఎడుస్యూర్ మ్యాగజైన్లో కథనంగా ప్రచురితమవడం పాఠశాల విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచినట్లు ఆయన తెలిపారు. అంకితభావంతో సేవలందించాలినల్లగొండ టూటౌన్ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో సేవలందించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, కార్యనిబద్ధత, సంస్థకు నిజమైన సేవ అని ప్రతి ఉద్యోగి దార్శనిక ప్రమాణాలతో నడవాలంటూ సూచించారు. మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అబ్దుల్ రషీద్షేక్, డాక్టర్ ఖుద్ధుస్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాల ద్వారా శిక్షణ, నిధి, మార్గదర్శక సహకారాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం జరిపారు. -
సెంటు భూమి లేకున్నా.. రూ.లక్షల్లో పంట రుణాలు
మర్రిగూడ (చింతపల్లి): సెంటు భూమి కూడా లేని నిరుపేద కూలీల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి.. పంట రుణాలు మంజూరు చేసి లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారు నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఎస్బీఐ సిబ్బంది. 2024లో విధులు నిర్వహించిన బ్యాంకు మేనేజర్, మరికొంతమంది కిందిస్థాయి సిబ్బంది కలిసి పథకం ప్రకారం ఈ అక్రమాలకు తెరతీశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.50 లక్షల చొప్పున పంట రుణాలను మంజూరు చేసి ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసి.. క్షణాల్లో ఇతర ఖాతాలకు మళ్లించారు. మొత్తం మీద రూ.కోటికి పైగానే ఈ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.బంగారం విడిపించుకోవడానికి వెళ్తే షాక్..చింతపల్లి మండలం హరిజనాపురం గ్రామానికి చెందిన ఓ ఖాతాదారుడు తాను బ్యాంకులో కుదవపెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి వెళ్లగా.. అతడి పేరిట రూ.1.50 లక్షల పంట రుణం బకాయి ఉందని సిబ్బంది చెప్పారు. అసలు తనకు భూమే లేదని, రుణం ఎలా ఇస్తారని ఆ ఖాతాదారుడు బ్యాంకు అధికారులతో వాదించడంతో నకిలీ బ్యాంకు ఖాతాల వ్యవహారం బయటపడింది.కూలీల పేరిట భూమి ఉన్నట్లు సృష్టించి..రోజువారీ కూలీల పేరిట ఏకంగా మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. తీరా ఇప్పుడు బ్యాంకు ఉన్నతాధికారులు లోన్ రికవరీ కోసం బాధితుల ఇళ్లకు నోటీసులు పంపించడంతో అమాయక రైతులు, కూలీలు లబోదిబోమంటున్నారు. ఆన్లైన్లో చెక్ చేస్తే ఈ పాసుపుస్తకాల నంబర్లు ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇవన్నీ బ్యాంక్ సిబ్బంది సృష్టించిన నకిలీవేనని స్పష్టమవుతోంది. నాంపల్లి మండలం తుంగపాడుగౌరారం గ్రామానికి చెందిన ఓ మహిళ పేరున 194/1/2 సర్వే నంబర్లో మూడెకరాలు ఉండగా, హరిజనాపురం గ్రామానికి చెందిన దామెర విజయమ్మ పేరు పైన అదే సర్వే నంబర్ సబ్ డివిజన్పై నాలుగు ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించారు. భూమి లేని దాదాపు 60 మందికి పైగా నిరుపేదల పేరిట ఈ దందా చేయగా.. అందులో సగం మంది నుంచి బ్యాంకు సిబ్బంది లోన్ రికవరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, బ్యాంకు అధికారుల తప్పిదానికి మమ్మల్నెలా బాధ్యులను చేస్తారంటూ బాధితులు పెద్దఎత్తున చింతపల్లి ఎస్బీఐ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని, తమ పేరిట ఉన్న అక్రమ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్టీసీని విలీనం చేసేంత వరకు ఉద్యమిస్తాం
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం విలీనం చేసేంత వరకు ఉద్యమం ఆగదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపులోని బీసీ భవనంలో మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, 11శాతం పీఆర్సీతో 2021 వేతన సవరణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అన్నీ సంఘాలు మూడు ఆప్షన్లు రాసి ఇచ్చాయని తెలిపారు. టీఎంయూ నుంచి భారీగా చేరికలు మిర్యాలగూడ ఆర్టీసీ డీపోకు చెందిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)కు చెందిన సోమయ్య, డికె రెడ్డి, హనుమంతు, వెంగల్రెడ్డి, మహేష్, శ్రీను, లక్ష్మయ్య, దుర్గయ్య, రమేష్, టిజిరెడ్డి నాయకత్వంలో ఉద్యోగులు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్లో చేరారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు రాఘవులు, కెఎస్రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాసా ని వెంకటయ్య, తన్నీరు పాండురంగయ్య, ప్రచార కార్యదర్శి మనోహర్, హైదరాబాద్ జోనల్ నాయకులు టీఎస్ రెడ్డి, రీజియన్ కార్యదర్శి ఎన్ఆర్సి.రాజు, నాయకులు ఎండీ.జాబీర్, కెవీ రెడ్డి, మహేందర్, కోటయ్య, సైదులు, బిజి.రావు, తదితరులు ఉన్నారు. ఫ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న -
డబుల్ బెడ్రూమ్ల పనులు పూర్తి చేయాలి
నల్లగొండ : డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని పరిశీలించి మాట్లాడారు. డబుల్బెడ్ రూమ్ఇళ్లలో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూమ్లు, టాయిలెట్లు, కిచెన్లు తదితర పనులను పూర్తిస్థాయిలో చేయాలన్నారు. సముదాయంలో ఓపెన్ జిమ్, పార్కులు, బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, జిరాక్స్ సెంటర్, మీ సేవ కేంద్రం, మెడికల్ షాప్, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రాజ్కుమార్ను ఆదేశించారు. సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, క్రీడా మైదానం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, కాంట్రాక్టర్ సైదిరెడ్డి, అధికారులు ఉన్నారు. ఈవీఎం గోదాము పరిశీలించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) భద్రపరిచిన గోదాంను కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలోని గోదాంను ఆయన.. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆయా పార్టీల రాజకీయ ప్రతినిధుల ఎదురుగా తెరిపించారు. గోదాంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ఫ్యాట్లను పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచే గోదాములో మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో తనిఖీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ దశరథ్నాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ బి.చంద్రశేఖర్ -
నేడు చర్లగౌరారానికి డీజీపీ రాక
కనగల్ : మండల పరిధిలోని చర్లగౌరారం గ్రామంలో శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న బాల పంచాయతీ కార్యక్రమానికి డీజీపీ (ఉమన్ సేఫ్టీ వింగ్) అభిలాష బిస్తు హాజరు కానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల పిల్లల్లో నాయకత్వ పటిమను పెంచడం, వారి హక్కులపై అవగాహన, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించడం బాల పంచాయతీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలినల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని శుక్రవారం ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జీజీహెచ్ ఎదుట వైద్యులు పారామెడికల్ సిబ్బంది నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. జీఓఎంఎస్ నెంబర్ 38, 28 నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ సంఘాల బాధ్యులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవలు మినహా అవుట్ పేషెంట్ సేవలు, ఇతర వైద్య సేవలను బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ యువతకు ప్రోత్సాహంనల్లగొండ టూటౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల ప్రతిభను ప్రోత్సహించడానికి అనురాగ్ యూనివర్సిటీ దీర్ఘకాలిక కార్యక్రమం ప్రారంభించినట్లు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ పల్లా అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువ క్రీడాకారులకు కోచింగ్, శిక్షణ సదుపాయం, ప్రాక్టీస్ తదితర అవకాశాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఒక సీజన్కే కాకుండా ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. అనురాగ్ నల్లగొండ నైట్స్ హెడ్ కోచ్ డిబి.రవితేజ మాట్లాడుతూ యువ ఆటగాళ్లకు ఫిట్నెస్, నైపుణ్యాల అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జట్టు అసిస్టెంట్ కోచ్ రోనాల్డ్ రోడ్రిగ్స్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ పౌరుల బాధ్యతరామగిరి(నల్లగొండ) : పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని వృక్షమిత్ర సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్టీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవీ.రాఘవేందర్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొండ బస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తూ తన మనుగడకు తానే ముప్పుగా తయారవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు వృక్షమిత్ర సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదినం, వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక మొక్క నాటి దానిని వృక్షంగా పెంచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం కె.జానిరెడ్డి, డిప్యూటీ ఆర్ఎం సుచరిత, సిబ్బంది శ్రీహరి, నర్సిరెడ్డి, సూపర్వైజర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ పర్యాటకాభివృద్ధికి ఊతం
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయతీరంలో మూడు పంట్ల నిర్మాణం పనులు చేపట్టారు. వీటి నిర్మాణానికి సుమారుగా రూ.4 కోట్లు ఖర్చు కానుంది. కాంట్రాక్ట్ సంస్థ సాగర్ తీరంలోనే బస చేస్తూ పంట్ల పనులు చేపడుతోంది. 6 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల పొడవతో పంట్లను తయారు చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఇంజన్లు కూడా అమర్చనున్నారు. వీటిపై కార్లు, జేసీబీ తదితర యంత్రాలను తరలించవచ్చు. ప్రస్తుతం వీటిని లాంచీల వద్ద పర్యాటకులు దిగేందుకు వినియోగించనున్నారు. కొత్తగా తయారు చేసే మూడు పంట్లలో ఒకటి సోమశిలకు పంపనున్నారు. సాగర్లో ఉండే రెండింటిలో ఒకటి నాగార్జునకొండలో, మరొకటి ఇక్కడ తీరంలోనే ఉంటుందని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. -
ఎరువులు భారం
వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.- 8లోఫ భారీగా పెరిగిన ధరలు ఫ ఒక్కో బ్యాగ్పై రూ.125 నుంచి రూ.500 వరకు జిల్లా రైతులపై రూ.80 కోట్ల అదనపు భారం నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులపై ఎరువుల ధరల రూపంలో పెద్ద ఎత్తున భారం పడనుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. ఒక్కో బ్యాగ్పై రూ.125 నుంచి రూ.500 వరకు పెరిగింది. ఈ పెంపుతో జిల్లాలో వానాకాలం సీజన్లో రైతులపై సుమారు రూ.80 కోట్ల అదనపు భారం ఎరువులపై పడనుంది. యూరియా, డీఏపీ ధరలను ఎరువుల కంపెనీలు పెంచకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. 12,02,051 ఎకరాల్లో సాగు అంచనా.. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానిలో వరి 5,86,137 ఎకరాల్లో, పత్తి 5,30,524 ఎకరాల్లో, కంది 14 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కలిపి మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానికి గాను జిల్లా వ్యాప్తంగా యూరియా 1.61 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 33,758 మెట్రిక్ టన్నులు, ఎన్ఓపీ 12,932 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,14,043 మెట్రిక్ టన్నులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది. రైతు మహోత్సవ సభకు 8 వేల మంది రైతులు నల్లగొండ అగ్రికల్చర్ : రంగారెడ్డి జిల్లాలోని కోహెడ్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్న రైతు మహోత్సవ సభకు జిల్లా నుంచి 8 వేల మంది రైతులను తరలించడానికి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యనవన శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కోహెడ్ గ్రామంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 279 ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెంగ్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడ జరుగనున్న రైతు మహోత్సవ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ సభకు జిల్లాలోని 33 మండలాల నుంచి సుమారు 8 వేల మంది రైతులను సభకు తరలించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 160 ఆర్టిసీ బస్సులను రైతుల కోసం సిద్ధం చేశారు. ఒక్కో బస్సులు 50 మంది రైతుల చొప్పున సభకు తరలిస్తారు. ఒక్కో బస్సుకు వ్యవసాయ విస్తరణాధికారితో పాటు వ్యవసాయాధికారులను బాధ్యులుగా, పతి 10 బస్సులకు ఒక సమన్వయ అధికారిని నియమించారు. రైతులకు అవసరమైన భోజనం, స్నాక్స్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. బహిరంగ సభ అనంతరం రైతులను సురక్షితంగా వారివారి స్వగ్రామాలకు తరలించడానికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. 50 కేజీల బ్యాగ్పై పెరిగిన ధరలు ఇలా.. (రూ..లలో) ఎరువు ప్రస్తుతం కొత్తదర కాంప్లెక్స్ 1,900 2,450 ఎంవోపీ 1,850 1,975 ఎస్ఎస్పీ 615 1,000 -
వేసవి శిబిరాలతో సృజనాత్మకత
రామగిరి(నల్లగొండ) : బాలభవన్ నల్లగొండ, నాగార్జునసాగర్ సంయుక్త ఆధ్వర్యంలో 40 రోజులుగా నిర్వహించిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీఈఓ సుశీందర్రావు హాజరై మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, అనవసర వ్యాపకాలకు బానిసలు కాకుండా వేసవి శిబిరాల్లో పాల్గొనడం చాలా సంతోషించదగ్గ పరిణామం అన్నారు. పిల్లలను ఈ శిబిరానికి పంపించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు సహకరించిన తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు వసంతకుమారి, రాజేశ్వరి, విశ్వజ్యోతి విద్యార్థినులు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థుల సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు పాలబిందెల బాలు, ఇన్స్ట్రక్టర్స్ ఉపేంద్రాచారి, ఫజల్బేగం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
శాలిగౌరారం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం
శాలిగౌరారం : ఉమ్మడి జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలి గౌరారం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని సూర్యాపేట జిల్లా నీటిపారుదలశాఖ సీఈ నాగభూషణరావు అన్నా రు. శాలిగౌరారం ప్రాజెక్టులోకి ప్రస్తుతం మూసీనది ఎగువ భాగం నుంచి రాచకాల్వ ద్వారా వరదనీరు వచ్చిచేరుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ప్రాజెక్టుతోపాటు రాచకాల్వ, మూసీనదిపై రామన్నపేట మండలం పల్లివాడ వద్ద గల హెడ్రెగ్యులేటర్లను పరిశీలించారు. ధ్వంసమైన షట్టర్ల నుంచి నీటి వృథాను అరికడతామన్నారు. రాచకాల్వను పూర్తిస్థాయిలో సీసీ లైనింగ్ చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. పల్లివాడ హెడ్రెగ్యూలేటర్ వద్ద నీరు వృథా కాంకుడా నేరుగా ప్రాజెక్టులోకి వచ్చేలా చేరేలా చర్యలు చేపడతామన్నారు. ఆయనవెంట నీటిపారుదలశాఖ ఎస్ఈ శివధర్మతేజ, ఈఈ సత్యనారాయణ, ఏఈ విక్రమ్, చామల వెంకటరమణారెడ్డి, సిబ్బంది, రైతులు ఉన్నారు. -
డబ్బులు కాజేసి.. ఆపై దాడి చేసి!
నల్లగొండ : మహిళా సంఘాల పొదుపు డబ్బులను బ్యాంక్లో కట్టకుండా సొంతానికి వాడుకోవడమే కాకుండా.. ఆ డబ్బుల గురించి నిలదీసిన మహిళలపై బాధ్యులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటన నల్లగొండలోని డీఆర్డీఏ కార్యాలయ పరిధిలోని టీటీడీసీ సమావేశ మందిరంలో శుక్రవారం కలకలం రేపింది. బాధితులు కూడా ఎదురుదాడికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను స్టేషన్కు తరలించారు. వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం అప్పలమడుగు గ్రామ పరిధిలోని సీత్యా తండాకు చెందిన సోనియాగాంధి మహిళా సంఘం, వెంకటేశ్వర మహిళా సంఘం సభ్యులు 2018లో సీ్త్రనిధి కింద రూ.1.50 లక్షలు, మైక్రో రుణాల కింద ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున రుణం తీసుకున్నారు. మహిళలు ఈ రుణాలను 2022 నాటికే పూర్తిగా చెల్లించారు. కానీ, సీసీ దేవ్సింగ్నాయక్, వీబీకే భాష్యానాయక్ ఆ డబ్బును బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకున్నారు. తీరా చూస్తే.. సోనియాగాంధీ సంఘం పేరుతో రూ.96 వేలు, వెంకటేశ్వర సంఘం పేరుతో రూ.80 వేలు ఇంకా అప్పు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో నిలదీయగా.. ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని సదరు ఉద్యోగులు నమ్మబలికారు. రెండోసారి కూడా అదే మోసం! 2023లో మిర్యాలగూడ ఎస్బీఐ నుంచి ఈ రెండు సంఘాలకు కొత్తగా రూ.10 లక్షల చొప్పున రుణం ఇప్పించారు. ఈ రుణాన్ని కూడా మహిళలు గత ఏప్రిల్ నాటికి పూర్తిగా కట్టేశారు. మళ్లీ కొత్త రుణం కోసం బ్యాంక్కు వెళ్లగా.. ఒక సంఘంపై రూ.1.53 లక్షలు, మరో సంఘంపై రూ.2.10 లక్షలు అప్పు ఉన్నట్లు బ్యాంకర్లు చెప్పడంతో మహిళలు షాక్కు గురయ్యారు. ఆరు నెలల క్రితం మిర్యాలగూడకు బదిలీ అయిన సీసీ దేవ్సింగ్ ఫోన్ ఎత్తకపోవడంతో, బాధితులు శుక్రవారం నల్లగొండ డీఆర్డీఓ శేఖర్రెడ్డికి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ జరుగుతున్న సమావేశంలో సీసీ దేవ్సింగ్ ఉన్నాడు. బాధితులు పీడీకి ఫిర్యాదు చేయగా.. ‘మీరు మీరు చూసుకోవాలి’ అంటూ ఆయన బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని మహిళలు ఆరోపించారు. సమావేశం ముగిశాక సీసీ దేవ్సింగ్ బయటకు రాకుండా లోపలే ఉండిపోవడంతో, మహిళలే లోపలికి వెళ్లారు. అక్కడ నుంచి అతను పారిపోయేందుకు ప్రయత్నించగా మహిళలు పట్టుకున్నారు. ఈ క్రమంలో అతని చొక్కొ చిరగడంతో, దేవ్సింగ్ మహిళలపై దాడికి దిగాడు. దీంతో మహిళలు కూడా తిరగబడి ఎదురుదాడి చేశారు. అనంతరం దేవ్సింగ్ను ఒక గదిలో నిర్బంధించి 100కు డయల్ చేశారు. వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. కాగా, ఈ విషయమై వివరణ కోరేందుకు డీఆర్డీఓను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు. నిరసన తెలుపుతున్న గ్రామస్తులుఏపీడీలతో వాగ్వాదం చేస్తున్న అప్పలమడుగు వాసులు, ఫ మహిళాల సంఘాల డబ్బులను సొంతానికి వాడుకున్న ఉద్యోగులు ఫ నిలదీసిన మహిళలపై డీఆర్డీఓ ముందే దాడి ఫ ఎదురు దాడి చేసిన మహిళలు ఫ ఇరు వర్గాలను స్టేషన్కు తరలించిన పోలీసులు -
ఘాట్ రోడ్డు పనుల్లో పేలుడు..
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని లతీఫ్ సాబ్, బ్రహ్మం గుట్టల వద్ద జరుగుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొండలను బద్దలు కొట్టేందుకు చేపట్టిన పేలుడు (బ్లాస్టింగ్) తీవ్ర కలకలం రేపింది. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం పేలుడు కారణంగా సమీపంలోని హౌసింగ్ బోర్డు నివాసాలపై శుక్రవారం రాళ్ల వర్షం కురిసింది.పేలుడు దాటికి భారీ రాళ్లు సమీపంలోని ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్ల రేకులు, స్లాబ్ తీవ్రంగా దెబ్బతిని లోపల సిమెంట్ పెచ్చులు ఉండిపోయాయి. పేలుడు సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెంది.. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పేలుడు సమయంలో జనం ఇళ్ల బయట ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం, పాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జనావాసాలకు ఇంత దగ్గరగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు తగిన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటను పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫ ఇళ్లపై పడ్డ భారీ రాళ్లు ఫ దెబ్బతిన్న ఇళ్ల స్లాబ్లు, రేకులు -
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం
సాక్షి, నల్గొండ జిల్లా: మిర్యాలగూడ గాంధీ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనమయ్యారు. మృతులను చంద్రమ్మ(50), లక్ష్మణ్(17), ప్రణతి(14)గా గుర్తించారు.చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
మార్క్ఫెడ్లో ఎన్డీసీఎంఎస్ విలీనం
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (ఎన్డీసీఎంఎస్)ను ప్రభుత్వం మార్క్ఫెడ్లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీఓ త్వరలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఎన్డీసీఎంఎస్కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నిడమనూరు, హుజూర్నగర్, సూర్యాపేట, దేవరకొండలో విలువైన గోదాములు, ఖాళీ స్థలాలను కొన్ని విక్రయించినప్పటికీ ఇంకా కొన్ని ఆస్తులు నేటికీ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్ నాలుగు కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. విత్తనాలు, ఎరువుల విక్రయం ద్వారా రైతులకు సేవలందిస్తూ సంస్థ లాభాలను గడిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం భువనగిరిలో సంఘానికి చెందిన గోదాములు, ఖాళీ స్థలాన్ని విక్రయించగా స్టేషన్ రోడ్డులో దుకాణాల సముదాయం ప్రస్తుతం ఉంది. ఇందులో 13 మడిగెలు ఉన్నాయి. 1987వ సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలోని సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గ్రేడింగ్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలను విక్రయిస్తున్నారు. అప్పట్లో ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్డీసీఎంఎస్లో 120 మంది ఉద్యోగులు పని చేసేవారు. సహకార సంఘాలు రావడంతో ఎన్డీసీఎంఎస్పై ఉన్న బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. సంఘానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్తో ప్రయోజనం లేదని గుర్తించి వ్యయభారం తగ్గించుకునేందుకు మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీసీఎంఎస్ను మార్క్ఫెడ్లో విలీనం చేయడంతో సంస్థకు ఉన్న ఆస్తులు మార్క్ఫెడ్ పరం కానున్నాయి. మార్క్ఫెడ్లో విలీనమైతే రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంస్థ మరిన్ని వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఫ రూ.కోట్లాది విలువ గల ఆస్తులు ఇక మార్క్ఫెడ్ చేతిలోకి ఫ రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం -
బోర్డు సరే.. రోడ్ల సంగతేంటి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు, రియల్టర్లు ఒక్కటయ్యారు. రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులే రియల్టర్లకు కట్టబెట్టారు. నల్లగొండ నగరం పరిధిలోని గిరకబాయగూడెంలో రైతుల భూములకు దారి పేరుతో ప్రైవేటు వెంచర్కు ప్రభుత్వ భూమిని మూడు చోట్ల అప్పనంగా ఇచ్చేశారు. అంతేకాదు ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తులే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరీ భూమిని కబ్జా చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో ఫెన్సింగ్ తొలగించారు. తాజాగా బోర్డులను ఏర్పాటు చేశారు తప్ప అక్రమంగా కట్టబెట్టిన ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. అక్కడున్న భూమి ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీకి చెందినదిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు తప్ప అదే భూమిలో మూడు చోట్ల రియల్టర్లు వేసిన రోడ్లను మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ భూములకు కస్టోడియన్గా ఉన్న రెవెన్యూ శాఖ కూడా దీనిపై నోరెత్తకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోని ఏ శాఖకు చెందిన భూములు కబ్జా అయినా ఫైనల్గా పర్యవేక్షించి, తగిన చర్యలు చేపట్టాల్సిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈ వ్యవహారాన్ని గాలికి వదిలేసింది. గజానికి రూ.20వేల పైనే ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఈ లెక్కన బాట కోసం మూడు చోట్ల 2వేల గజాలకు పైగా స్థలం ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం బాట కోసం ఆక్రమించిన ఆ ప్రభుత్వ భూమి విలువ రూ.4 కోట్లకుపైనే ఉంటుంది. పైగా ప్రభుత్వ భూమికి వెనుకాల ఉన్న రైతుల పేరుతో 20 ఏళ్ల తరువాత తమ భూముల్లోకి వెళ్లేందుకు బాట కాావాలని అడిగిందే తడవుగా దానిని ధారాదత్తం చేసేశారు. రైతులకు బాట కోసం ఇవ్వాల్సిందెంత? నిజంగా రైతులకే ఇవ్వాల్సి వస్తే ఒక చోట, అదీ బండ్ల బాట వెడల్పుతో ఇస్తారు. అంతే తప్ప వెంచర్ కోసం ఈ స్థాయిలో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనిపై శ్రీసాక్ష్ఙి ప్రచురించిన వరుస కథనాల నేపథ్యంలో ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించగా, తాజాగా ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ భూములంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఫ భూమి తమదేనని బోర్డులు పెట్టిన నీటి పారుదల శాఖ ఫ వెంచర్కు మూడు చోట్ల రోడ్లకు ప్రభుత్వ భూమి ధారాదత్తం ఫ వాటిని పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ఫ కబ్జా అయిన భూమి విలువ రూ.4 కోట్లు జిల్లాలో 2004–05లో ఏఎంఆర్పి ప్రధాన కాలువను తవ్వే సమయంలో.. భవిష్యత్తు అవసరాల కోసం గిరకబాయిగూడెం వద్ద కొంత భూమి సేకరించారు. ఆ భూమి ఆక్రమణకు గురైనా నీటి పారుదల శాఖ పట్టించుకోలేదు. భూసేకరణ సమయంలో ఆ భూమిని ఇచ్చిన రైతుల పేరుతో ఓ దరఖాస్తును పెట్టించి మూడు చోట్ల ప్రభుత్వ భూమిలో నుంచి 30 అడుగుల వెడల్పుతో దాదాపు వంద మీటర్ల పొడవునా మూడు చోట్ల దారులను ఏర్పాటు చేస్తే కనీసం స్పందించలేదు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
నల్లగొండ: నల్లగొండ ఏఎంఆర్పీ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనుల అమలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. గురువారం కనగల్ మండలంలోని రేగట్టె గ్రామం వద్ద ఏఎంఆర్పీ కెనాల్ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కంపల్లి నుంచి మూసీ వరకు సుమారు 67 కిలోమీటర్ల మేర కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ పనులు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఈఈ నెహ్రూనాయక్, ప్రాజెక్టు మేనేజర్ అభిషేక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జితేందర్, డీఈ సంపత్, సంబంధిత అధికారులు ఉన్నారు. చండూరు: ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్క నాటి, నర్సరీని పరిశీలించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శంకర్నాయక్, వ్యవసాయ శాఖ ఏడీ వేణుగోపాల్, ఎంపీడీఓ యాదగిరి, ఎంఈఓ సుధాకర్రెడ్డి, తహసీల్దార్ రమాకాంత్శర్మ, ఉపసర్పంచ్ మహబూబ్, వార్డుసభ్యులు, ఇన్చార్జ్ ఎంపీఓ కోటయ్య, వివిధ శాఖల ఏఈలు, మండల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఎరువుల ధరల పెంపుతో రైతులపై పెను భారం
మిర్యాలగూడ : ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, పెంచిన ఎరువుల ధరలు సాగును మరింత భారంగా మార్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ధరలను రూ.300 నుంచి రూ.400 వరకు పెంచి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో డీఏపీ దొరకడం లేదని, జీలుగు, పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సరైన వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేయకపోవడం వల్లే సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. బడ్జెట్లో కొత్త పథకాలకు రూ.వందల కోట్లు కేటాయిస్తూ.. రైతుబంధు, రుణమాఫీ పథకాలను విస్మరించడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని అన్నారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఎరువుల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్నాయక్, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి -
నీలగిరిలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక
ఫ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి రామగిరి(నల్లగొండ): రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను గురువారం తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సందర్శించారు. బస్టాండ్ ప్రాంగణం, గ్యారేజ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాలు, డిపో పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు. గ్యారేజ్ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అనంతరం రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మేయర్ బుర్రి చైతన్యరెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి నాగిరెడ్డి ఉన్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో, ఏ రూట్లలో లాభాలు వస్తున్నాయి, ఎక్కడ నష్టాలు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల వాటి పనితీరు, చార్జింగ్ మౌలిక వసతులు, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనపై చర్చించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి, విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఎండీ స్పష్టం చేశారు. నగర ప్రజలు, విద్యార్థుల అంతర్గత రవాణా అవసరాలను తీర్చడానికి నగరంలోని అన్ని శివారు ప్రాంతాలు, కాలనీలను అనుసంధానిస్తూ సిటీ బస్సులు ముమ్మరంగా నడపాలని ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద ఆధునిక బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ స్థలంలో ఒక భారీ బహుళ అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్, రీజనల్ మేనేజర్ కొణతం జానిరెడ్డి, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్యరెడ్డి, డిపో మేనేజర్, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు.. మిర్యాలగూడ టౌన్ : ప్రతి డిపో పరిధిలోని గ్రామానికి పల్లె వెలుగు బస్సులు నడిపించాలనేదే ఆర్టీసీ లక్ష్యమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్తో కలిసి సందర్శించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ డీఎం చాంబర్స్లో ఆర్టీసీ బస్టాండ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. డిపోలకు 60 కిలోమీటర్ల దూరం ఉంటే పల్లె వెలుగు బస్సులు కాకుండా ఎక్కువ శాతం ఎక్స్ప్రెస్లు నడిచే విధంగా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అన్ని డిపోల్లో అధిక ఆదాయం వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను ఆధునీకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరడంతో ఈ విషయంపై పరిశీలిస్తామని తెలిపారు. ఆయన వెంట నల్లగొండ రీజినల్ మేనేజర్ కొణతం జాన్రెడ్డి, మిర్యాలగూడ డిపో మేనేజర్ రాంమోహన్రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, భార తీ బాయి తదితరులున్నారు. -
మొరాయిస్తున్న రెవెన్యూ సర్వర్
నల్లగొండ టూటౌన్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా జిల్లాలోని మున్సిపాలిటీలు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను సర్వర్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. యాప్ అప్డేట్ కారణంగా గత ఐదు రోజులుగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆన్లైన్ సేవలు స్తంభించిపోయాయి. ఫలితంగా జిల్లా కేంద్రమైన నల్లగొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న జనం సర్వర్ పని చేయకపోవడంతో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కట్టుకోవడానికి ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. గత ఐదు రోజులుగా భవన యజమానులు, సాధారణ పౌరులు తమ పన్నులు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయాలకు, వార్డు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, పైనుంచే సర్వర్ రావడం లేదంటూ అధికారులు చేతులెత్తేయడంతో సామాన్యులు వెనుతిరగాల్సి వస్తోంది. సీడీఎంఏ కార్యాలయంలోనే తరచూ సమస్య హైదరాబాద్లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆన్లైన్ వ్యవస్థ నియంత్రించబడుతుంది. అక్కడ సర్వర్ సమస్య వస్తే అన్ని కార్యాలయాల్లో సేవలు నిలిచిపోతాయి. గత నెలలో కూడా 15 రోజుల పాటు సర్వర్ సమస్య వచ్చింది. ఇంత జరుగుతున్నా ప్రధాన కార్యాలయం నుంచి సకాలంలో స్పందన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వర్ ఎప్పుడు వస్తుందనే సమాచారం మున్సిపాలిటీలకు ఇవ్వకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వర్ సమస్య కారణంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు నెల వారీగా వచ్చే ఆదాయం రాకుండా పోతుంది. ఆస్తి పన్ను సర్వర్ పని చేయకపోతే ఒక్క రోజులోనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ ప్రభావం ఆస్తి పన్ను, నల్లా బిల్లుల వసూళ్లపై పడే అవకాశం ఉంటుంది. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందిస్తూ ఒకటి, రెండు రోజుల్లో సర్వర్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఫ ఐదు రోజులుగా నిలిచిన సేవలు ఫ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఆగిన ఆస్తిపన్ను వసూళ్లు -
భూముల విలువ కనిష్టంగా 50 శాతం.. గరిష్టంగా 100 శాతం పెంపు
ఫ కమర్షియల్ విభాగంలో ప్రకాశంబజార్లో రూ.40వేలకు పెంపు ఫ స్లమ్ ఏరియాల్లో రూ.4800కు పెంపు ఫ పెరిగిన ధరలు నేటి నుంచి అమలు నల్లగొండ: భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది. మార్కెట్ విలువలను సవరిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదించిన కొత్త ధరలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి రానున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి ఏటా మార్కెట్ విలువల సవరణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. గత మూడేళ్లుగా ధరలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఒకేసారి కనిష్టంగా 50 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొనుగోలుదారులపై పెనుభారం పడనుండగా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. కమర్షియల్ విభాగంలో.. నల్లగొండ పట్టణంలోని ప్రకాశంబజార్లో ప్రస్తుతం మార్కెట్ విలువ గజం రూ.27,100 ఉండగా రూ.40వేలకు పెంచారు. మిర్యాలగూడ రోడ్డులో రూ.4100 ఉన్న విలువ రూ.6 వేలకు, హైదరాబాద్ రోడ్డులోని వెంకటేశ్వరకాలనీలో రూ. 10,800 ఉండగా రూ.16,200కు పెరిగింది. హైదరాబాద్ రోడ్డులో ని మెయిన్ రోడ్డు లోపల వైపు ప్రస్తుతం రూ.4800 ఉండగా రూ.7200కు పెంచారు. క్లాక్టవర్ నుంచి రామగిరి వైపు ప్రస్తుతం రూ. 17,600 ఉన్న మార్కెట్ విలువ రూ.26 వేలకు పెంచారు. మిర్యాలగూడ రోడ్డు వెంట రూ.17,600 ఉండగా రూ.26 వేలకు, దేవరకొండ మెయిన్ రోడ్డులో రూ.5,800 ఉండగా ఏకంగా రూ.10 వేలకు పెరిగింది. రెసిడెన్షియల్ విభాగంలో.. రూ.1700 ఉన్న చోట 2600కు, రూ.2400 ఉన్న దగ్గర రూ.4200కు పెంచారు. బొట్టుగూడ స్లమ్ ఏరియాలో రూ.2400 ఉండగా రూ.4800కు, చర్లపల్లిలో రూ.3,100 ఉండగా రూ.5,425కు, గ్రామీణ ప్రాంతాల్లో గజం రూ.500 ఉండగా దానిని రూ.900కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం వరకు పాత భూ విలువలు అమలులో ఉండడం, శుక్రవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనుగోలు అమ్మకందారులతో సందడిగా మారాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రాత్రి 8గంటల వరకు కొనసాగింది. మున్సిపాలిటీలు, హైవేల వెంట కార్యాలయాలు ఉన్న చోట రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. -
రిసోర్స్ సెంటర్ ఎంతో ఉపయోగకరం
చండూరు: జెండర్ రిసోర్స్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం అన్నారు. గురువారం చండూరు మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జెండర్ రిసోర్స్ సెంటర్లో మండలంలోని మహిళలకు కుటుంబ కలహాలు, లేదా ఇతర సమస్యలపై ప్రతి మంగళవారం, శుక్రవారం మండల సమాఖ్య ప్రతినిధులతో కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య కలహాలు పరిపాటిగా మారాయని, వాటిని సులువుగా తీర్చేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, కౌన్సిలర్ కటకం రమేష్, మండల సమాఖ్య ప్రతినిదులు, ఏపీఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలినార్కట్పల్లి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీసీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. గురువారం నార్కట్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెత్త వేరు చేయడం, చెట్లను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జెర్రిపోతుల భరత్ కుమార్, మండల పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీనివాసన్, ఎంపీడీఓ ఉమేష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గౌతమ్, ఉప సర్పంచ్ శిరీష, వడ్డే గోని రామలింగం, పర్రెపాటి సైదులు, ఆమనగంటి ఐలయ్య, జిల్లా మహేష్, మేడబోయిన రాంబాబు పాల్గొన్నారు. జల వనరులను సంరక్షించుకోవాలి చిట్యాల: గ్రామాల్లో భూగర్భ జల వనరులను సంరక్షించేందుకు కృషి చేయాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి కోరారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో గురువారం జలశక్తి ఆభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జల సంచాయ్– జన్భాగి దారి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో చెక్డ్యాంల నిర్మాణాలు, వాలు కట్టల వంటి నిర్మాణాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా కళాజాత బృందంతో నీటి సంరక్షణపై ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఓ వనం శ్రీలత, ఎంపీఓ కోటేష్, సర్పంచ్ సాగర్ల భానుశ్రీభిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, ఫీల్ట్ అసిస్టెంట్ మర్రి రమేష్ పాల్గొన్నారు. -
అమరావతి ఉండగా.. ఎక్కడో ఉండడం ఎందుకు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు. -
ప్రజా వైద్యం బిక్కు.. బిక్కు
ఫ శిథిలావస్థలో చండూరు పీహెచ్సీ భవనం ఫ వైద్యానికి వచ్చేందుకు జంకుతున్న జనం చండూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రిని అద్దె భవనంలోకి మారుస్తామని చెబుతున్నా.. అది కార్యరూపం దాల్చలేదు. దాతల సహకారంతో సేకరించిన స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని 2001లో ప్రారంభించారు. పట్టణానికి చివరన ఉండటం వల్ల రోగులు అంత దూరం వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. సరైన నిర్వహణ లేకపోవడంతో 15 ఏళ్లుగా భవనం లోపల, బయట శ్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఇనుప రాడ్లు బయటపడుతున్నాయి. నేల కూడా కుంగిపోయి, గోడులు బీటలు వారాయి. సమస్య తీవ్రతపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా మంత్రులు, కలెక్టర్లకు విన్నవిస్తూనే ఉన్నారు. 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఈ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి వైద్య సేవలను ప్రైవేటు భవనంలోకి మార్చి, ఆసుపత్రి వెనుక ఉన్న స్థలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని వైద్యులతో చర్చించి నిర్ణయించారు. మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో మిషన్ భగీరథ కంట్రోల్ యూనిట్ స్థలంలో పీహెచ్సీ నిర్మాణానికి గత ఏడాది జూన్ 6న ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. ఈ ఏడాది ఏప్రిపల్ 20న కూడా రెండో సారి ఆ ప్రదేశాన్ని సందర్శించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న దేవాదాయ శాఖ స్థలాన్ని కేటాయించాలని ఆ శాఖ కమిషనర్ను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక తెప్పించుకుంటామని స్థలం కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఏడాది కావస్తున్నా ఈ వ్యవహారం కేవలం స్థల పరిశీలనలకే పరిమితమైందని, కొత్త భవన నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందోనని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. శిథిలావస్థలో కనిపిస్తున్న చండూరు పీహెచ్సీ భవనంఊడుతున్న స్టాబ్పెచ్చులు -
జాతీయ జెండాకు అవమానం
కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మంగళవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. మంగళవారం ఉదయం ఎగరవేసిన జాతీయ జెండాను, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వరకు తొలగించలేదు. జెండా కర్రకు ఉన్న జాతీయ జెండా నేల మీద పడి అవమానానికి గురైంది. సాయంత్రం పంచాయతీ సిబ్బంది జెండాను తీశారు. జాతీయ జెండాపై బాధ్యతలేని సంబంధిత అ ధికారులు, గ్రామపంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంజీయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా అరుణప్రియ నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా కె.అరుణప్రియ నియమితులయ్యారు. రిజి స్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నుంచి బుధవారం ఆమె నియామకపత్రం అందుకున్నారు. గతంలో ప్రిన్సిపాల్గా, అడిషనల్ కంట్రోలర్గా సేవలందించిన ఆమె తిరిగి ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కళాశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు విమాన ప్రయాణంరామగిరి(నల్లగొండ) : మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు విమానం ఎక్కించాడు. పాఠశాల పదో తరగతి ఫలితాల్లో, ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్తానని ఆ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు బివి చారి విద్యార్థులకు మాట ఇచ్చారు. అన్నట్లుగానే.. పాఠశాల టాపర్గా నిలిచిన ఏడుకొండల వైష్ణవి, ఇంగ్లిష్ సబ్జెక్టు టాపర్ బుట్టి ఇందును తన సొంత ఖర్చులతో శంషాబాద్ నుంచి విమానంలో విజయవాడకు తీసుకువెళ్లారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సాహించడం ద్వారా చదువుపై మరింత ఆసక్తిని పెరుగుతుందని సర్పంచ్ జిల్లేపల్లి రేణుకరాజు కొనియాడారు. నీటిని సంరక్షించాలికేతేపల్లి : నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, వర్షాకాలంలో పడిన ప్రతి నీటి చుక్క భూమిలో ఇంకే విధంగా చూడాలని డీఆర్డీఓ వై.శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి, చెర్కుపల్లి, కొండకిందిగూడెం, బండపాలెం గ్రామాల్లో తెలంగాణ కళాజాత బృందం ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలన్నారు. మురుగు నీటి కాలువ చివరన ఖాళీగా వదలకుండా కమ్యునిటీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలన్నారు. పంట కాల్వల్లో పూడికను తొలగించి చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు పి.శ్రీనివాసరావు, సుదర్శన్రెడ్డి, జానయ్య, ఎంపీడీఓ నాగలక్ష్మి, ఏపీఎం మల్లేష్, ఏపీఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక టెట్ నిర్ణయంపై హర్షంనల్లగొండ : ఏటా జరిగే రెండు సాధారణ టెట్లతోపాటు, ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎం రేవంత్రెడ్డికి టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్దన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ భూములను ఆక్రమించొద్దు
నల్లగొండ : ప్రభుత్వ భూములు, చెరువుల శిఖాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. భూభారతి సంబంధిత కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేవ/ంచారు. డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చిన సమస్యలు స్థానికంగానే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై తాను డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. అటవీ, రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన భూముల సర్వేను వేగవంతం చేసి, భూ రికార్డులను సమగ్రంగా రూపొందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్నాయక్, ల్యాండ్ సర్వే ఏడీ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల మరమ్మతు పూర్తి చేయాలి పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులను 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలు, ఆర్సీఓలు, సంక్షేమ శాఖ ఆర్డబ్ల్యూఎస్, రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలను పూర్తిచేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు యూనిఫాం అందజేయాలన్నారు. 12 లోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఈఓ సుశీందర్రావు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ధరలు తగ్గించాలని నిరసన
నకిరేకల్ : పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించడంతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో బుధవారం నకిరేకల్లో ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆప్ రాష్ట్ర అధ్యక్షురాలు హేమ సుదర్శన్ మాట్లాడుతూ ఇందన ధరల భారంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నులను తగ్గించి ఉపశమనం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యార శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాముగౌడ్, జనరల్ సెక్రటరీ డాక్టర్ అన్సారి, నాయకులు దర్శనం రమేష్, పురుషోత్తంరెడ్డి, కొడంగల్ శ్రీనివాస్, బాబూలాల్, రాకేష్రెడ్డి, రాజమల్లయ్య, అద్దంకి రవీందర్, అశోక్, మహేందర్, ఎల్లమ్మ, లక్ష్మి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా..
నే లారీ నడిపేవాడిని. పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పడిపోయాయి. నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. ఎటూ నడవలేను. ప్రభుత్వ పింఛన్ వస్తే ఆసరా అవుతుందని ఐదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా. అప్పటి నుంచి ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందని చెప్పడంతో సంతోషమేసింది. కానీ ఇవ్వకపోవడంతో ఎప్పుడిస్తుందోనని ఆందోళనగా ఉంది. – నిమ్మల అంజయ్య, దివ్యాంగుడు, ఊకొండి, మునుగోడు మండలం మూడేళ్ల క్రితం నా భర్త చనిపోతే ఒంటరి మహిల పెన్షన్ కోసం దరఖాస్తు చేసా. ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారి చదువులకు, కుటుంబం గడిచేందుకు భారమవుతోంది. ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలి. – దీపిక, ఒంటరి మహిళ, నల్లగొండ కొత్త పింఛన్ల మంజూరుపై మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆన్లైన్ ఆప్షన్ కూడా లేదు. కొత్త పించన్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ మండల స్థాయిలోనే ఉన్నాయి. దరఖాస్తులు ఆన్లైన్ చేసేందుకు ఆప్షన్ ఇచ్చి, అర్హుల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు రావాల్సి ఉంది. – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ -
సాగర్లో అటవీశాఖ సైకిల్ ర్యాలీ
నాగార్జునసాగర్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారి సంగీత అన్నారు. బుధవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆమె జెండాను ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదిన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్ష సంపదను రక్షించుకోవాలని, మొక్కలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ గౌతమ్, సెక్షన్ అధికారి రమేష్ పాల్గొన్నారు. -
వైటీపీఎస్ ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్కు సన్మానం
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వి.వెంకటేశ్వర్లును టీఆర్వీకేఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ తదితరులు బుధవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ తిప్పారపు రమేష్, జెన్కో అసిస్టెంట్ సెక్రటరీ సతీష్కుమార్, వైటీపీఎస్ రీజనల్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రసాద్, రాజశేఖర్, యూసుఫ్, ఖదీర్, రామకృష్ణ, పన్నాలాల్, శేఖర్బాబు, శ్యామ్కుమార్, సాజిద్, త్రివేణి పాల్గొన్నారు. -
772 మెగావాట్ల విద్యుత్ డిమాండ్
నల్లగొండ : వేసవి ఎండలు, వ్యవసాయ అవసరాలు, గృహ, వాణిజ్య రంగాల్లో వినియోగంతో నల్లగొండ జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గణాంకాల ప్రకారం బుధవారం జిల్లాలో విద్యుత్ డిమాండ్ 772 మెగావాట్లకు చేరుకుంది. మంగళవారం 709 మెగావాట్లు నమోదుకాగా.. బుధవారం 63 మెగావాట్లు అధికంగా ఉంది. గత ఏడాది ఇదే రోజున 608 మెగావాట్లతో పోలిస్తే 164 మెగావాట్లు ఎక్కువగా నమోదైంది. దీంతో జిల్లాలో విద్యుత్ అవసరాలు ఏటేటా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. గతేడాది కంటే 27 శాతం అధికంగా.. ప్రస్తుతం జిల్లాలో కూరగాయలు సాగు, పండ్ల తోటలకు వ్యవసాయ పంపుసెట్ల వినియోగం పెరిగింది. ఉష్ణోగ్రతల కారణంగా కూలర్లు, ఎయిర్ కండీషనర్లు, ఇతర విద్యుత్ ఉపకరణాల వినియోగం అధికమైంది. ఫలితంగా గత ఏడాదికంటే 27 శాతం అధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తూ నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, వ్యవసాయ కార్యకలాపాల విస్తరణ విద్యుత్ వినియోగం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ గతేడాది కంటే 164 మెగావాట్ల పెరుగుదల ఫ ఎండలతో పెరిగిన విద్యుత్ వినియోగం -
‘ఆసరా’ ఆశలపై నీళ్లు
నల్లగొండ : ఆసరా పింఛన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మంది అర్హుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లినట్లయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ‘చేయూత’ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. కొత్త పింఛన్ల ప్రారంభంపై జూన్ 2న ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అర్హులు అయోమయంలో పడ్డారు. అసలు ఇప్పట్లో పింఛన్లు వస్తాయా లేదా అనే సంశయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పిల్లలపై ఆధారపడి.. గ్రామీణ ప్రాంతాల్లో వయసు పైబడిన ఎంతో మంది వృద్ధులు కోల్పోయి జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండగా, మరికొందరు కుటుంబ సభ్యులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పింఛనే వారికి ఆసరా అవుతుంది. తాజా ఆలస్యంతో మళ్లీ వారికి ఎదురుచూపులే మిగిలాయి. 11 వేల మందికి పైగా కొత్తగా వచ్చే అవకాశం! ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల వర్గాలకు చెందిన 1,99,567 మంది పింఛన్లు పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల పింఛన్లు ఇస్తే జనాభా, అర్హుల ప్రాతిపదికన జిల్లాలో మరో 9 వేల నుంచి 11 వేల మందికి కొత్తగా పింఛన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఆప్షన్ రాక నిలిచిన ప్రక్రియ జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దానికి సంబంధించిన క్షేత్రస్థాయి ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గానీ, ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయడానికి గానీ అవసరమైన ఆన్లైన్ ఆప్షన్ను ప్రభుత్వం ఇంకా అందుబాటులోకి తేలేదు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.ఫ జూన్ 2న కొత్త పింఛన్లు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన ఫ తెలంగాణ అవతరణ వేడుకల్లో స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఫ కొత్త పింఛన్లపై వీడని సందిగ్ధం.. అర్హులకు తప్పని ఎదురుచూపులు జిల్లాలో ప్రస్తుతం అందుతున్న పింఛన్లు పింఛన్ లబ్ధిదారులు వృద్ధాప్య 69,789 దివ్యాంగ 29,792 వితంతు 77,471 చేనేత 2,825 కల్లుగీత 7,536 ఒంటరి మహిళ 7490 హెచ్ఐవీ 3,228 పైలేరియా 1,027 డయాలసిస్ 409 మొత్తం 1,99,567 -
బిగ్ షాక్: రేవంత్, ఉత్తమ్లకు అధికారుల డీమోషన్!
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కారణం.. ఫ్లెక్సీలో హోదాలన్నీ తారుమారయ్యాయి!ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హోదా కనిపించగా, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్ పేరు దర్శనమిచ్చింది. దీంతో "ఒక్క ఫ్లెక్సీతోనే సీఎం డీఈఓగా డిమోట్ అయ్యారా? మంత్రి కలెక్టర్గా ప్రమోట్ అయ్యారా?" అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు."ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ పక్కనపెట్టి.. విద్యాశాఖ ఫ్లెక్సీలోనే కొత్త పోస్టింగులు ఇచ్చేసింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు "ఇది ఫ్లెక్సీనా.. లేక కొత్త గెజిట్ నోటిఫికేషనా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.అయితే ఈ సరదా వ్యాఖ్యల వెనుక అధికారిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక ఫ్లెక్సీ.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! -
పర్యావరణ గ్రామసభలు నిర్వహించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల సందర్భంగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో మండలాల వారీగా గ్రామసభలు, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మండలాల వారీగా అనుకూలమైన తేదీలను చూసుకోవాలని డీపీఓను ఆదేశించారు. గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్రాఉ. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఎస్బీఐ ఆర్సెటీలో ఉచిత శిక్షణనల్లగొండ : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగులకు నెల రోజుల పాటు ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్, సర్వీసింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్సెటీ డైరెక్టర్ సియాజి రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ సమయంలో ఉచితవసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు అర్హత, తదితర పూర్తి వివరాలకు 9701009265 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
7 వరకు రిపోర్ట్ చేయాలి
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని జోనల్ అధికారి విద్యారాణి తెలిపారు. ఇప్పటికే ఫలితాలు విడుదల అయ్యాయని సీటు వచ్చిన వారు ఆయా కళాశాలలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. నేడు టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభనకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో బుధవారం టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహసభ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అద్యక్షుడు గార్లపాటి క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభకు ప్రతి మండలం, పట్టణం నుంచి జర్నలిస్ట్లు తరలి రావాలని కోరారు. జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం నిరంతరం కృషి చేసే ఏకై క సంఘం ఐజేయు అన్నారు. సమావేశంలో ఆ సంఘం ప్రతినిదులు పులిమామిడి మహేందర్, మధనాచారి, శ్రీను, చెరుకు సతీష్, రేపాల సతీష్, గండమళ్ల రాములు, కందగట్ల శ్రీధర్, పరమేష్, రాములు, రవీంద్రాచారి, సాయి, రాజు, నర్సింహ, రమేష్, శంకర్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు. ‘బడిబాట’ పాట ఆవిష్కరణనల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ‘బడిబాట పాట–2026’ సీడీ, పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరాం ఈ పాటను రచించారని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేలా ఈ పాట ఉందన్నారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న సజనాత్మక ప్రయత్నాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాంను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో ఏడీ రామాచారి, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈసం రాంబాబు, సిబ్బంది వీరేంద్రసింగ్, భిక్షం, శ్రీను పాల్గొన్నారు. మరో పర్వతారోహణకు బయలుదేరిన అన్వితారెడ్డిభువనగిరి : ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన పడమటి అన్వి తారెడ్డి.. మరో పర్వతారోహణకు మంగళవారం బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి విమాన మార్గంలో ఉత్తర అమెరికాలోని అలస్కాకు ఈ నెల 3వ తేదీన చేరుకోనుంది. అలస్కాలోఉన్న సుమా రు 6,190 మీటర్ల ఎత్తయిన డేనాలీ పర్వతాన్ని ఎక్కనుంది. ఈ ప్రక్రియ సుమారు నెల రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన అన్వితారెడ్డి 2022 మేలో ఎవరెస్టు పర్వతం, 2022 సెస్టెంబర్లో మనస్లూ పర్వతం, 2021 డిసెంబర్లో మౌంట్ ఎల్బ్రోస్, 2025 జనవరిలో అర్జెంటీనాలోని అకోన్కాగ్వా పర్వతం, 2022 డిసెంబర్లో విన్సన్ పర్వతం, 2021 జనవరిలో కిలిమంజారో, 2021లో ఫిబ్రవరిలో లడఖ్ పర్వతాలను అధిరోహించింది. -
తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి
– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మోత్కూరు : హైదరాబాద్లోని కొత్తపేట ప్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆసుపత్రికి తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు హైదరాబాద్లోని ఒకే ప్రాంతంలో అమర వీరుల కుటుంబాల కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ‘సాక్షి’ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్లోని ఎల్బినగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తన కొడుకు ఆత్మాహుతి చేసుకున్నాడని, ఆస్పత్రికి శ్రీకాంతాచారి పేరు పెట్టడంతో ఆత్మ శాంతిస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, నెలకు రూ.25 వేల పింఛన్, ఆరోగ్య భద్రత కార్డులు అమలు చేస్తే ఆ కుటుంబాలు ఆత్మ గౌరవంగా బతుకుతాయని అన్నారు. కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా తనను నియామకం చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
అంచనాలు దాటని ఆటోమిషన్
నాగార్జునసాగర్ : బహుళార్థసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ గేట్ల రిమోట్ ఆటో మిషన్ మరమ్మతుల పనులు అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. గతంలో ఆంధ్రా అధికారులు డ్యాంపైకి వచ్చి గేట్లను ఎత్తే సమయంలో ఆటోమిషన్కు వినియోగించే పరికరాలు భారీ స్థాయిలో ధంసమయ్యాయి. గతేడాది వాటి విడిభాగాలు మార్చకుండా.. రూ.15 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ యేడాది పరికరాలను పూర్తిస్థాయిలో మార్చేందుకు సుమారు రూ.40 లక్షలతో అంచనాలు తయారు చేశారు. ఇంకా అవి ప్రభుత్వానికి చేరలేదు. ఈ నేపథ్యంలో ఈ వానాకాలం నాటికై నా పనులు చేపట్టడం అనుమానంగానే ఉంది. 2016లో ఆటోమిషన్ ఏర్పాటు సాగర్ వద్ద గేట్లు ఎత్తి, దించేందుకు 2016లో సాంకేతిక నైపుణ్యతను వినియోగించి ఆటోమిషన్ను ఏర్పాటు చేశారు. ఏ గేటు ఎంత ఎత్తు ఎత్తితే దిగువకు నీరెంత వెళుతుందో కంప్యూటర్ స్క్రీన్పై కనిపించడంతో పాటు ఆన్లైన్లో చూసేవిధంగా ఆధునీకరిచారు. అందుకుగాను అప్పట్లో రూ.7 కోట్లు కేటాయించి పనులు చేశారు. 26 రేడియల్ క్రస్ట్గేట్లతోపాటు కుడి, ఎడమకాల్వలు, సూట్గేట్లను రిమోట్తోనే ఆన్ఆఫ్ చేసే విధంగా ఆదునీకరించారు. అందుకుగాను సాగర్డ్యాంపై ఈ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం రిమోట్తో లేపితే గేట్లు లేవడం లేదు. షూట్గేట్లు కూడా.. సాగర్ డ్యాంలో 510 అడుగుల దిగువకు నీరు వెళ్లిన సమయంలో కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు షూట్ గేట్లను వినియోగిస్తారు. జలాశయంలో నీరు నిండుగా ఉండి దిగువకు అధికంగా నీటిని విడుదల చేయాల్సి వచ్చినపుడు కూడా ఈ గేట్లు ఎత్తుతారు. వీటిని కూడా ఆటోమిషన్ ద్వారా లేపి దింపే విధంగా అనుసంధానించారు. దీని ద్వారా నీటిని విడుదల చేస్తే కచ్చితత్వం ఉండే అవకాశాలుండడంతో పాటు నీటి నిల్వలు, పారే నీటి గణాంకాలు ఉంటాయి. ఫ సాగర్లో గేట్లు ఎత్తి, దించేందుకు ఆటోమిషన్ ఏర్పాటు ఫ వాటి పరికరాలు మార్చేందుకురూ.40 లక్షలతో అంచనాలు -
న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం
న్యాయవాదులకు తెలంగాణ న్యాయవాదుల చట్టం–2026 ఉక్కు కవచం లాంటిది. ఇక నుంచి న్యాయవాదులు నిర్భయంగా బాధితుల తరఫున వాదించవచ్చు. లాయర్లకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. – వేముల రంజిత్కుమార్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నల్లగొండ రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం–2026 జూన్ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీసు యంత్రాంగం న్యాయవాదులను ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందస్తు అనుమతి లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 6 నెలల్లోగా కోర్టు విచారణ ముగించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్–2026 అమల్లోకి తీసుకురావడం చరిత్రాత్మక నిర్ణయం. న్యాయవాదులకు భద్రత కల్పించాలని సుధీర్ఘ కాలంగా చేస్తున్న పోరాట ఫలితమే ఈ చట్టం. న్యాయవాదులపై జరిగే దౌర్జన్యాలను నిరోధించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలి. – పందుల సైదులు, న్యాయవాది న్యాయవాదుల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం–2026 ఏర్పాటు చేయడం శుభ పరిణామం. న్యాయవాది వృత్తి ధర్మం పాటిస్తూ బాధితుల పక్షాన ధైర్యంగా న్యాయ పోరాటం చేయవచ్చు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయవాదులపై దాడులకు పాల్పడకుండా ఉండాలి. – మందా నగేష్, బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ, నల్లగొండ -
నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి
కట్టంగూర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో ఉద్యమం తీవ్రంగా ఉన్న సాగుతున్న సమయంలో నాపై పలు రకాల సెక్షన్లకు కింద ఆరు కేసులు నమోదు చేశారు. నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్లోని చర్లపల్లి మొత్తం 18 రోజుల పాటు జైలు జీవితం గడిపాను. ఉద్యమంలో భాగంగా 2007లో తెలంగాణ బార్డర్ నుంచి హైదరాబాద్లోని సెక్రటేరియట్కు వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా నకిరేకల్ సమీపంలోకి రాగానే డీసీఎం డీకొట్టడంతో ఆనకు అంగవైకల్యం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ అమరుల కుటుంబాలను, ఉద్యమంలో అంగవైకల్యం ఏర్పడిన కుటుంబాలను, జైలు జీవితం గడిపినవారిని ప్రభుత్వ గుర్తించాలి. అంగవైకల్యానికి గురైనవారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 12 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేయడం హర్షనీయం. రాష్ట్ర ఏర్పాటుకు సుదీర్ఘంగా పోరాటం చేసిన నిజమైన వ్యక్తులను గుర్తించి న్యాయం చేయాలి. – గద్దపాటి దానయ్య, తెలంగాణ ఉద్యమకారుడు -
పోరాడి తెలంగాణ సాధించుకున్నాం
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రవీంద్రకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్లాక్ టవర్లోని అమరవీరుల స్థూపం వద్ద, శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్రెడ్డి, చీర పంకజ్మాదవ్, రామచంద్రునాయక్, పల్లె రవికుమార్, మాలే శరణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, జమాల్ ఖాద్రి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ -
తెలంగాణ ప్రజల కలలు సాకారం
శాలిగౌరారం : తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం రేవంత్రెడ్డి సాకారం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్నేత అన్నారు. శాలిగౌరారంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయజెండాను ఎగురవేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన, ప్రాణత్యాగాలకు పాల్పడిన వారి కుటుంబాలకు సముచిత స్థానం కల్పించకుండా మోసం చేసిందన్నారు. ప్రజా సంకల్పంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అద్యక్షుడు కందాల సమరంరెడ్డి, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, పీఏసీఎస్ వైస్చైర్మన్ చామల మహేందర్రెడ్డి, నాయకులు అన్నెబోయిన సుధాకర్, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, వేముల గోపినాథ్, బొల్లికొండ గణేశ్, బోడ అరుణ్కుమార్, జమ్ము అశోక్, పెరుమాండ్ల నరేశ్, పరమేశ్, లక్ష్మయ్య, జయరాజు, భిక్షంరెడ్డి, యుగంధర్రెడ్డి, రవి, అంజయ్య, జనార్దన్, వెంకటయ్య, రవీందర్రెడ్డి, యాదయ్య, పవన్ పాల్గొన్నారు. -
కరువు నేలను తడిపేందుకు ఎత్తిపోతలు
డిండి : నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ ప్ర భావిత ప్రాంతాల ప్రజలకు రక్షిత నీరు, బీడు భూములకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా 2015లో శివన్నగూడెంలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కిష్టరాంపల్లి, చింతపల్లి, శివన్నగుడెం, గొట్టిముక్కుల, సింగరాజుపల్లిలో రిజర్వాయర్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించి జిల్లాలో నిర్మించే ఐదు రిజర్యాయర్లు నింపితే.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.61 ఎకరాలకు సాగునీరుతోపాటు ప్రజలకు తాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. ప్రస్తుతం ఈ ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయి. ● సాగర్ ఆయకట్టు చివరి భూములకు, ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఐదు ఎత్తిపోతల పథకాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో బొత్తలపాలెం, దున్నపోతులగండి, కేశవాపురం– కొండ్రపోల్, వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్ట్ పనులు ప్రగతిలో ఉన్నాయి. ● దశాబ్దాల కాలంగా కృష్ణపట్టె గిరిజన రైతాంగం ఎదురుచూస్తున్న నెల్లికల్లు ఎత్తిపోతలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసింది. రూ.692 కోట్లతో ఈ లిఫ్ట్ పనులు సాగుతున్నాయి. ఫ్లోరోసిస్ మహమ్మారి నుంచి విముక్తి నల్లగొండ : ఒకప్పుడు నల్లగొండ జిల్లా పేరు వినగానే గుర్తుకొచ్చేది ఫ్లోరోసిస్ సమస్య. ఇక్కడ వేలాది మంది ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, కట్టంగూరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరోసిస్ అధికంగా ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ.3,000 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా కృష్ణానది నుంచి శుద్ధి చేసిన నీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తోంది. 1,750 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందుతోంది. ఈ పథకం జిల్లా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చింది. -
పోలీసులకు సేవా పతకాలు
నల్లగొండ : ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలను ప్రటించింది. ఏఆర్ ఎస్ఐ జయరాజ్కు ఉత్తమ సేవా పతకం, 12 బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ బి.వెంకట్రెడ్డి, డీఎస్పీ సెల్లో పనిచేస్తున్న రఫియోద్దీన్, సీసీఎస్ కానిస్టేబుల్ పుస్పగిరి, ఏఆర్ పీసీ అంజద్ఖాన్కు సేవా పతకాలకు ప్రకటించింది. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా మంగళవారం వారు పతకాలు అందుకోనున్నారు. బాధ్యతలు స్వీకరించిన డీఈఓనల్లగొండ : నల్లగొండ డీఈఓగా బదిలీపై వచ్చిన సుశీందర్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయం సిబ్బందితోపాటు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా వినోద్కుమార్నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయాధికారిగా వి.వినోద్కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని వ్యవసాయశాఖ కమిషనరేట్లో ఏడీఏగా పనిచేస్తూ పదోన్నతి పొంది నల్లగొండ జిల్లాకు బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్చార్జి జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన పాల్వాయి శ్రవణ్కుమార్ పదోన్నతి పొంది వ్యవసాయ శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. పోలీస్ గ్రీవెన్స్లో 46 ఫిర్యాదులు నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 46 మంది బాధితులు భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు తదితర అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.


