Nalgonda
-
కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్కు ముందే విషాదం..!
నల్గొండ జిల్లా: అమెరికాలో స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన యువకుడు నదిలో జారిపడిన ముగ్గురు స్నేహితులను కాపాడి తాను నీటిలో మునిగి మృతిచెందాడు. వివరాలు.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన చెందిన కోడూరు రాజేందర్రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అశ్రిత్రెడ్డి, అనురూప్రెడ్డి(22) సంతానం. ప్రస్తుతం వారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లిలో స్థిరపడ్డారు. రాజేందర్రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి వెళ్లారు. అశ్రిత్రెడ్డిది గతేడాది ఎంఎస్ పూర్తికాగా.. అనురూప్రెడ్డిది ఇటీవలే కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ పూర్తిచేశాడు. అశ్రిత్రెడ్డికి ఉద్యోగం రాకపోగా.. అనురూప్రెడ్డికి ఇటీవలే కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగానికి సంబంధించిన ఓటీపీ రాకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు.స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి..అశ్రిత్రెడ్డి, అనురూప్రెడ్డితో పాటు మరో నలుగురు స్నేహితులు అమెరికాలో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత నెల 29న తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక కోసమని అనురూప్రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్సాస్–లూసియానా సరిహద్దులో ఉన్న ‘టొలెడోబెండ్ రిజర్వాయర్’ వద్దకు వెళ్లారు. అక్కడ అనురూప్రెడ్డి ఫోన్కాల్ మాట్లాడుతుండగా.. అతడి ముగ్గురు స్నేహితులు సరదాగా చేపలు పడుతూ కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు కేకలు వేయడంతో అనురూప్రెడ్డి వెంటనే నీటి ప్రవాహంలోకి దూకి ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు చేరే క్రమంలో ఫిషింగ్ వైరు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. అక్కడి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి 20 అడుగుల లోతున ఉన్న అనురూప్రెడ్డి మృతదేహాన్ని బయటకు వెలికితీశాయి. చదువులో చురుకుఅనురూప్రెడ్డి హైదరాబాద్లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ రూ.40లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అనురూప్రెడ్డికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ ఆఫర్ను కాదని అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.నేడు హైదరాబాద్కు రానున్న మృతదేహం..అనురూప్రెడ్డి మృతదేహం మంగళవారం ఉద యం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కవాడిపల్లిలోని వారి నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రయాణికురాలి నుంచి బస్సు యజమానులుగా మహిళలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మహిళల ఆర్థిక స్వావలంభనకు మరో అడుగు పడింది. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా ప్రతి మండల సమాఖ్యకు ప్రభుత్వం ఒక్కో బస్సును కేటాయించింది. ఈ పథకం కింద జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు 32 బస్లను అందజేస్తోంది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఆర్టీసీకి ఈ బస్సులను అద్దెకు ఇవ్వడంతో ఒక్కో సమాఖ్యకు ప్రతినెలా అదనపు ఆదాయం సమకూరనుంది. మహిళల ఆర్థిక సాధికారితకు, ఆత్మ విశ్వాసానికి, స్వయం సమృద్ధికి ఈ బస్సులు ప్రతీకలుగా నిలువనున్నాయి. ఈ బస్సులతో మహిళలు యాజమానులుగా మారనున్నారు. ప్రభుత్వం రూ.30 లక్షలు, మహిళా సమాఖ్య రూ.6 లక్షలు మహిళా సమాఖ్యలకు అందజేస్తున్న ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు. ఇందులో కమ్యూనిటీ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (సీఐఎఫ్) ద్వారా ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షలు అందించగా, సంబంధిత మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు వాటాగా చెల్లించాయి. దాని ద్వారా బస్లను కొనుగోలు చేసి వాటన్నింటిని ఆర్టీసీకి అప్పగించారు. మహిళా అభివృద్ధికి వేదిక ఇందిరమ్మ మహిళా శక్తి పథకం మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా గాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రతి నియోజక వర్గంలో ఇప్పటికే మహిళా శక్తి భవనాలు నిర్మించుకున్నారు. జిల్లాలో రాష్ట్రస్థాయి నుంచి ఒక పెట్రోల్ బంక్ మంజూరైంది. అది నిర్మాణ దశలో ఉంది. జిల్లా స్థాయి నుంచి మరో 3 బంక్ల ఏర్పాటుకు భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మూడు రైస్ మిల్లుల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నారు. తిరుమలగిరిసాగర్ అల్వాల, చండూరు మండల కేంద్రంలో సోలార్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 32 బస్లు రావడంతో వారికి మరింత ఆర్థిక తోడ్పాటు దక్కనుంది. నార్కట్పల్లి మహిళా సమాఖ్య బస్సుఫ జిల్లాలోని 32 మండల మహిళా సమాఖ్యలకు 32 బస్సులు ఫ ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు ఫ ప్రతి నెలా రూ.69,468 అద్దె చెల్లించనున్న ఆర్టీసీ ఫ మహిళల ఆర్థిక సాధికారితకు ప్రతీకగా నిలువనున్న బస్సులుసూర్యాపేటకు 23, యాదాద్రికి 17 నల్లగొండ జిల్లాలోని మహిళా సమాఖ్యలకు 32 బస్సులను కేటాయించిన ప్రభుత్వం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండల సమాఖ్యలకు 17 బస్సులు కేటాయించింది. సూర్యాపేట జిల్లాకు 23 బస్సులు వచ్చాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాకు 72 బస్సులు కేటాయించారు. -
జూలై చివరి నాటికి ‘నక్ష’ సర్వే పూర్తిచేస్తాం
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో చేపట్టిన ‘నక్ష సర్వే’ను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. నక్ష సర్వేకు పైలట్ పథకం కింద ఎంపికై న మున్సిపాలిటీల్లో సర్వే పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎంపికై ందని ఇందులో ఇండ్లు, భవనాలు, ఖాళీ స్థలాల కచ్చితమైన మ్యాపింగ్ కోసం సర్వే వేగంగా జరుగుతుందన్నారు. సమాచారాన్ని డిజిటలైజ్ చేసేందుకు మొత్తం 32 వార్డులను ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన కోసం 356 బ్లాకులు, 43 వ్యవసాయ బ్లాకులు, 313 భవనాల బ్లాకులుగా విభజించి పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25వేల ఆస్తులను గుర్తించగా క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర శ్రమతో ఇప్పటివరకు 9,375 ఆస్తులకు సంబంధించిన డిజిటల్ సర్వేను పూర్తి చేసి రికార్డు స్థాయిలో 37శాతం ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరు వార్డుల సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భూములు, ఇళ్ల సమగ్ర మ్యాపింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మొత్తంగా 14 ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినట్లు కలెక్టర్ వివరించారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
వంతెన శిథిలం.. భయంగా ప్రయాణం
ఫ నిర్లక్ష్యం నీడలో ఉప్పలపహాడ్ మూసీ బ్రిడ్జి ఫ కూలిన రక్షణ గోడలు, పట్టించుకోని అధికారులుకేతేపల్లి : మూసీ నదిపై నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మక వంతెన నిర్వహణను పట్టించుకోక పోవటంతో శిథిలావస్థకు చేరింది. 2010లో 65వ నంబర్ జాతీయ రహదారి నాలుగులేన్లుగా విస్తరించిన సమయంలో కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్, సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామాల మధ్య మూసీ నదిపై వారధిగా ఉన్న ఈ వంతెనకు సమాంతరంగా రెండు వరుసలుగా నూతనంగా మరో వంతెన నిర్మించారు. అప్పటి నుంచి ఈ పాత వంతెనను అధికారులు పట్టించకోవడం లేదు. ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో వంతెన రెయిలింగ్ దిమ్మెలను పగులగొట్టి అందులో ఉన్న ఇనుపరాడ్లను దుండుగులు ఎత్తుకెళ్లారు. వంతెనపై రాగి చెట్లు మొలుస్తుండటంతో వంతెన గోడల పగుళ్లు ఏర్పడుతున్నాయి. వర్షం నీరు కిందకు పోయే రంద్రాలు మూసుకపోవటంతో వంతెనపై నీరు నిలిచి గుంతలు ఏర్పడి రోడ్డు ధ్వంసమవుతోంది. నిత్యం వాహనాల రాకపోకలు.. సూర్యాపేట నుంచి మిర్యాలగూడ సుమారు 25 గ్రామాలను కలుపుతూ వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంది. పాత వంతెన పైనుంచే మండలంలోని ఉప్పలపహాడ్, తుంగతుర్తి, చెర్కుపల్లి గ్రామాలతో పాటు నకిరేకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాహనాలు ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ఉన్న రక్షణ దిమ్మెలు ధ్వంసం కావడంతో వంతెనపై నుంచి వెళ్లే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పాత వంతెనకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా జయలతనల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా డాక్టర్ జయలత బదిలీపై వచ్చారు. ఆమె సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ బదిలీపై న్లగొండకు వచ్చారు. సోమవారం ఆమె.. ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ వైద్యులు, మెడికల్ కళాశాల బాధ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలినల్లగొండ : ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్నాయక్ పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్నాంపల్లి : మండలంలోని షర్బాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బేక్కం వీరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం డీఈవో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ మల్లికార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయుడి కుటుంబ కలహాల్లో భాగంగా ప్రజావాణిలో పలు ఫిర్యాదులు రావడం, ఆయన తన భార్య పేరు మీద చిట్టీలు వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలిరామగిరి (నల్లగొండ) : రైతులందరు తప్పనిసరిగా పార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.వినోద్కుమార్ తెలిపారు. సోమవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లిలో నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రీ క్యాంపెయిన్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు రిజిస్ట్రీ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ సుంకోజు శ్రీనివాస్, ఏఈఓ శోభ, గ్రామ రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీ ‘బడి’బాట
రెండున్నర ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లల పేర్లు నమోదు చేయించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మమాట–అంగన్వాడీ బాట అనే బడిబాట చేపడుతున్నాం. పిల్లలకు పౌష్టకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తాం. బడిఈడు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – కృష్ణవేణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, నల్లగొండ మిర్యాలగూడ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ఆట–పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందిస్తోంది. అందులో భాగంగా అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్వాడీ బడిబాట’ పేరుతో అంగన్వాడీ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగుతూ రెండున్నరేళ్ల చిన్నారులను గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా.. ఐదేళ్లు దాటిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేస్తున్నారు. తొమ్మిది ప్రాజెక్టులు జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అనుముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. భోజనం, బ్రేక్ఫాస్ట్ ఒకే దగ్గర అందేలా.. అంగన్వాడీకి వచ్చే చిన్నారులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లోనే ఉంటారు. వారికి ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తారు. వీరికి కేంద్రంలోనే బ్రేక్ఫాస్ట్గా చిరుధాన్యాలతో కూడిన ఉప్మా, మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు గుడ్డు అందివ్వనున్నారు. ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఫ 15వ తేదీనుంచి ప్రత్యేక కార్యక్రమం ఫ రెండున్నరేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీల్లో పూర్వప్రాథమిక విద్య ఫ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్న కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల వివరాలు ఇలా.. 6 నెలల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 72,474 బాలింతలు 5316 -
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
దేవరకొండ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్స్థాయి ప్రజావాణిలో కలెక్టర్ మాట్లాడారు. డివిజన్ స్థాయిలో వచ్చే ప్రజావాణి సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కారం కావాలని, ఒకసారి వచ్చిన ఫిర్యాదుదారుడు మళ్లీ రాకుడదని చెప్పారు. దేవరకొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లో ఎఫ్టీఎల్ నిర్ధారించాలని.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజావాణికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ రానున్న సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదులు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మప్రియ, డీఎస్పీ శ్రీనివాసరావు, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండది మొదటి స్థానం
మిర్యాలగూడ : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమస్థానంలో ఉందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సీజన్లో 459 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 96,769 మంది రైతుల నుంచి రూ.1789 కోట్ల విలువైన 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 2.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1570 కోట్లు జమ చేశామని, ఇంకా రూ.190కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మిల్లర్ల నుంచి 22వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరించామన్నారు. యాదాద్రి జిల్లా నుంచి మరో 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుతం మిర్యాలగూడ ప్రాంత మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నకిరేకల్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్తా సమన్వయంతో పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ టైనర్ ఎండీ నూమాన్ అన్నారు. నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులు అవగాహన కలిగి ఉండి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన కార్యకర్తలను అధిష్టానం గుర్తించి పదవులు కేటాయిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత, చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీత, టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, లక్ష్మీనర్సు, మల్లారెడ్డి, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాజుల సుకన్య, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్ పాల్గొన్నారు.ఫ ఏఐసీసీ ట్రైనర్ ఎండీ.నూమాన్ -
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా
నల్లగొండ టౌన్ : విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ అన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు తన కుమారుడు దివంగత కాసోజు శ్రీకాంతాచారి సమాజంలో చిరస్మరనీయుడన్నారు. తనను గౌరవించేలా అభినందన సభ ఏర్పాటు చేసిన సేవా సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆమెను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము, జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, విశ్వనాథం, సత్యనారాయణ, రమణాచారి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, నరేంద్రబాబు, శోభారాణి, రఘువీర్ ప్రతాప్, షణ్ముఖచారి పాల్గొన్నారు. ఫ తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ -
కిక్కిరిసిన పశువుల సంత
బీజేపీని బలోపేతం చేయాలి బూత్ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.- 8లోకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పశువుల సంత ఆదివారం కిక్కిరిసిపోయింది. రైతులు సాగు పనులు ప్రారంభించడం, రోహిణి కార్తె పూర్తయి.. మృగశిర కార్తె రావడం, వర్షాలు కురస్తుండడంతో రైతులు పత్తి విత్తనాలు వేసేందుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు ఎక్కువగా అరకదున్నే ఎద్దుల కొనుగోలు చేసి పంట చేలు పూర్తయ్యాక వాటిని తిరిగి అమ్ముతుంటారు. అందులో భాగంగానే ప్రతి వేసవికాలంలో మృగశిర కార్తె ముగింపు వరకు పశువుల క్రయ విక్రయాలు కొండమల్లేపల్లిలో ఎక్కువగా జరుగుతాయి. ఆదివారం అరక దున్నే ఎద్దుల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. సంతలో జత ఎద్దులకు రూ.లక్ష నుంచి రూ.1.50లక్ష వరకు ధర ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. -
పూర్వవైభవం దక్కేనా..!
సంస్థాన్ నారాయణపురంలోని సదరన్ ఆన్లైన్ బయో టెక్నాలజీస్ లిమిటెడ్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. - 8లోకొండమల్లేపల్లి మండలంలోని కొర్రోనితండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతో మూడేళ్ల క్రితం మూసివేశారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యాశాఖ అధికారుల కృషితో 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. -
నకిలీలపై ఉక్కుపాదం
దేవరకొండ : విత్తనాల విషయంలో రైతులు మోసాలకు గురికాకుండా నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేసేలా సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 12,02,051 ఎకరాల్లో సాగు అంచనా.. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానిలో వరి 5,86,137 ఎకరాల్లో, పత్తి 5,30,524 ఎకరాల్లో, కంది 14 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కలిపి మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నకిలీ విత్తనాలతోరైతులకు నష్టం గతంలో కొందరు దళారులు ఇతర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అంటగట్టిన ఘటనలు ఉన్నాయి. ఆ విత్తనాలు సాగు చేసిన రైతులు పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వం అనుమతిచ్చిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని దుకాణదారులను ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించి రశీదు ఇవ్వాలని, స్టాక్ వివరాలను డిస్ ప్లే చేయాలని దుకాణాదారులకు సూచిస్తున్నారు. రైతులు గ్రామాల్లో దళారులను నమ్మి మోసపోకూడదని, నకిలీ విత్తనాలు విక్రయించే వారి సమాచారం ఉంటే అధికారులకు తెలియపర్చాలని కోరుతున్నారు. ఫ విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు ఫ నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని ఆదేశాలు ఫ దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన -
ముగిసిన ‘థ్రెడ్. పోచంపల్లి’ ఎగ్జిబిషన్
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న థ్రెడ్. పోచంపల్లి చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొని ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత కళాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్కు దేశ, విదేశాల్లో మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు. డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ కోట జంగారెడ్డి, భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, పోచంపల్లి మున్సిపల్చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, టైఅండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, భారత లవకుమార్, ఈపూరి ముత్యాలు, దోర్నాల శేషగిరి, ఎన్నం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆర్ఎం బదిలీ
రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి బదిలీఅయ్యారు. ఆయన స్థానంలో నూతన రీజనల్ మేనేజర్గా ప్రస్తుతం నిజామాబాద్ ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు నల్లగొండ రీజనల్ మేనేజర్గా సేవలందించిన జానిరెడ్డి హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా బదిలీ అయ్యారు. 15న పాఠశాలల పునః ప్రారంభంనల్లగొండ : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పునః ప్రారంభ తేదీని ప్రభుత్వం మార్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం జూన్ 15న పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అయితే విద్యా పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని పని దినంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు ఈ నెల 15న తెరుచుకోనున్నాయి. పాఠ్యపుస్తకాల రచయితగా మల్లేష్నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సవంత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఇంటర్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం, ఏపీలో ద్వితీయ సంవత్సరం జీవశాస్త్రం తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాల రచయితగా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మోదాల మల్లేష్కు అవకాశం దక్కింది. గతంలో తెలుగు అకాడమీ నుంచి ప్రచురితమైన గ్రూప్–1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలు (ఆంగ్లమం, తెలుగుమాధ్యమం) రచనలో ఆయన భాగస్వామి అయ్యారు. డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పుస్తక రచనలో కూడ సహ రచయితగా ఉన్నారు. టీజీ–20 అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు ఫ 20 మంది క్రికెటర్లను వేలంలో దక్కించుకున్న ఫ్రాంచైజీనల్లగొండ టూటౌన్ : యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) చేపట్టిన టీజీ–20 క్రికెట్ లీగ్ ఆటగాళ్ల వేలం ఆదివారం ముగిసింది. హైదరాబాద్లో నిర్వహించిన వేలంలో ఫ్రాంచైజీ అనురాగ్ నల్లగొండ నైట్స్ భారీ ధర చెల్లించి క్రీడాకారులను దక్కించుకుంది. టీమ్కు అవసరమైన 20 మందిని వేలం ద్వారా దక్కించుకున్నారు. ఆటగాళ్లలో ఎండీ.అర్ఫాజ్అహ్మద్ (రూ. 11 లక్షలు), రాహుల్ బుద్ది (రూ.8 లక్షలు), చింతల రక్షణ్రెడ్డి (రూ.6 లక్షలు), పాట్కూరి నితీష్రెడ్డి (రూ.5.50 లక్షలు), నిశాంత్ సరను (రూ.5.50 లక్షలు), అనికేత్రెడ్డి (రూ.4.75 లక్షలు), ఎలగాని వరుణ్గౌడ్ (రూ.3.50 లక్షలు), ప్రణవ్ సూర్యదేవర (రూ.2.50 లక్షలు), ఇళ్యాన్ సతని (రూ.1 లక్ష) హర్షవర్ధన్సింగ్ (రూ.1 లక్ష), చిన్నుగారి రుత్విక్, డివేష్ సింగ్, జస్వంత్ మోతె, విక్రాంత్రెడ్డి, షేక్ సమీర్, షేక్ సోహెల్, బీరవోలు నాగసుధామ్స్రెడ్డి, శ్రీకాంత్, ఉర్వేష్ కక్కడ్ ఒకొక్కరికి రూ.75 వేల చొప్పున్న చెల్లించి దక్కించుకున్నారు. ఆటోమిషన్ ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపాంనాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని అన్నిగేట్లను సమర్థవంతంగా ఎత్తేందుకు వినియోగించే ఆటోమిషన్ ఆధునీకరణకు తయారు చేసిన అంచానాలను రాష్ట్రప్రభుత్వ పరిపాలన అనుమతి కోసం పంపినట్లు సాగర్డ్యాం ఇంజనీర్లు తెలిపారు. గతంలో ఆంధ్రా అధికారులు ధ్వంసం చేసిన పరికరాలను పునరుద్ధరించేందుకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.29.2 లక్షల ఖర్చుతో ఆటోమిషన్ పరికరాలకు మరమ్మతులు చేసి గేట్ల నియంత్రణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆధునాతన ఎస్సీఏడీఏ వెర్షన్ కోసం రూ.43.20 లక్షల అంచనాలతో సమగ్ర ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. పరిపాలన ఆమోదం రాగానే టెండర్లు పిలిచి ఆధునీకరించి.. 100శాతం రిమోట్ ఆపరేషన్తో పాటు మ్యానువల్ తనిఖీలతో గేట్లను ఎత్తి దింపనున్నట్లు పేర్కొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
వేములపల్లి : ఇల్లు లేని ప్రతి పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో 14 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతోపాటు మహిళా సంఘ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో 931 మహిళా సంఘ భవనాల ఏర్పాటుతో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అగ్రభాగంలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇప్పటికే 7.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సాదాబైనామా దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్పీఓ ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు సుమారు 4కిలోల వరకు తరుగు తీసి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని రైతులు వారికి ఫిర్యాదు చేశారు. దానిపై సమగ్ర విచారణ చేపట్టి తనకు నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే పల్లెబాట.. ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోని వాటిని పరిష్కరించి తగిన న్యాయం చేసేందుకు ‘ప్రగతి సింగిడి జనంతో మాట పల్లె బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, రాబోవు రెండున్నర సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలను అనుసంధానం చేయడమే ప్రగతి సింగిడి అన్నారు. ఈనెల 15 తరువాత వారంలో ఐదు రోజులపాటు నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి రాత్రి ఆ గ్రామాల్లో బసచేసి తెల్లారి ఉదయం అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్రాజు, సీఐ పీఎన్డీ.ప్రసాద్, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ జితేందర్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్లు పిల్లల సందీప్, ఝెల్లికట్టి భరత్, ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ జాని, నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్నాయక్, మాలి కాంతారెడ్డి, రావు ఎల్లారెడ్డి, దేశబోయిన రవికుమార్, బంటు చొక్కయ్యగౌడ్, రేగట్టె రవీందర్రెడ్డి, బ్రహ్మదేవర విద్యాసాగర్, తాళ్ల వెంకటేశ్వర్లు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫ ఆమనగల్లులో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు -
శాలిగౌరారం ప్రాజెక్టుకు వరద
ఫ 11 అడుగులకు చేరిన నీటిమట్టం శాలిగౌరారం : జిల్లాలో మద్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మూసీనదిపై ఉన్న మూసీ ప్రాజెక్టుకు ఎగువ భాగాన శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరువచ్చేందుకు పల్లివాడ వద్ద నిర్మించిన ఆనకట్ట చివరిది. పల్లివాడ ఆనకట్టకు ఎగువభాగంలో అసిఫ్నహర్, భీమలింగం, ధర్మారెడ్డి, బునాదిగాని, పిల్లాయిపల్లి, బాచారం ఆనకట్టలు ఉన్నాయి. ఈ ఆనకట్టల వద్ద మూసీనదికి ఇరువైపుల ఉన్న కాలువల పరిధిలో ప్రస్తుతం నీటిని నిలిపివేయడంతో మూసీనది ప్రవాహం నేరుగా పల్లివాడ ఆనకట్ట మీదుగా మూసీనదిలోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పల్లివాడ ఆనకట్ట వద్ద ఉన్న హెడ్రెగ్యూలేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టు రాచకాల్వలోకి నీటిని మళ్లించడంతో మూసీనదిలోని వరదనీరు శాలిగౌరారం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.. పక్షం రోజుల్లో 11 అడుగులకు చేరిన నీటిమట్టం.. శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. గడిచిన యాసంగి పంటకు నీటిని నిలిపివేసేనాటికి ప్రాజెక్టు నీటిమట్టం 4 అడుగులకు పడిపోయింది. గతనెల 24 నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 15 రోజుల్లో ప్రాజెక్టు నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం సీజన్కు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యం సరిగా అందుతుందా..
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్)ను కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడే వెల్నెస్ సెంటర్ను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా? అవసరమైన మందులు అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని మందులు అందుబాటులో లేవని రోగులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి సరఫరా పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న డి–అడిక్షన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్.. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు తగు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య) వార్డును సందర్శించిన కలెక్టర్.. గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభాగాన్ని కూడా పరిశీలించి మందుల నిల్వలు, పంపిణీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నరసింహారావు నేత, డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు పాల్గొన్నారు. ఫ జీజీహెచ్లో సేవలపై కలెక్టర్ ఆరా -
గ్రామాల అభివృద్ధికి సహకరించాలి
కట్టంగూర్ : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. శనివారం అయిటిపాముల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామసభకు దృష్టికి తీసుకొస్తే అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ బోనగిరి రమేష్, సర్పంచ్ బెల్లి సుధాకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు ఉన్నారు. -
నల్లగొండ, మిర్యాలగూడలో భారీగా పెరిగిన భూముల విలువ
కమర్షియల్ స్థలాలకు పెరిగిన విలువలు ఇలా.. (రూ.లలో/గజం) పాత ధరకొత్త ధరసాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడలో భూ విలువలు భారీగా పెరిగాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఈ రెండు ప్రాంతాల్లోనే ధరలు అత్యధికంగా ఉన్నాయి. నల్లగొండ, మిర్యాలగూడలో కమర్షియల్ ప్లాట్లు గతంలో గజానికి రూ.31,800 ఉండగా ప్రస్తుతం అది 40,700 (21.86 శాతం) పెరిగింది. ఈ రెండు పట్టణాల్లో అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విలువల కూడా భారీగా పెరిగింది. ప్రాంతాల వారీగా వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, కమర్షియల్ ప్లాట్ల విలువలను సమరించింది. సవరించిన విలువలను శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్టంగా 15 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెంపు ఉండడంతో ప్రజలపై భారం పడుతోంది. హాలియాలో ఎకరం రూ.80 లక్షలు.. వ్యవసాయ భూములకు సంబంధించి జిల్లాలో హాలియాలో ఎకరానికి కనిష్టంగా రూ.5 లక్షలు ఉండగా.. హైవే వెంట రూ.80 లక్షలకు పెరిగింది. మునుగోడులో కనిష్టంగా రూ.4.50 లక్షలు ఉండగా అత్యధికంగా 6.75 లక్షలు ఉంది. పెద్దవూరలో అత్యధికంగా రూ.55 లక్షలు ఉండగా తక్కువగా రూ.5 లక్షల వరకు ఉంది. నిడమనూరులో తక్కువగా రూ.5,11,875 ఉండగా ఎక్కువగా రూ.8,58,375 లక్షలకు పెరిగింది. చిట్యాలలో హైవే వెంట వట్టిమర్తి వద్ద రూ.63 లక్షలకు పెరగగా.. ఎలికట్టెలో రూ.5.40 లక్షలుగా ఉంది. కొండమల్లేపల్లిలో అతి తక్కువగా రూ.4.50 లక్షలు ఉండగా.. అత్యధికంగా రూ.76 లక్షలకు పెరిగింది. వేములపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ ఇటిక్యాలలో రూ.30,50,200 ఉండగా.. తక్కువ చలిచీమలపాలెంలో రూ.6,75,000 ఉంది. నాంపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ తక్కువగా రూ.3,36,500 అత్యధికంగా రూ.16,33,500 ఉంది. చండూరు మండలంలోని చండూరులో గరిష్టంగా రూ.63,52,500 కాగా.. తక్కువగా కొండాపురంలో రూ.3,93,750గా ఉంది. అపార్ట్మెంట్ల విలువ పెరిగిందిలా.. నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడ పట్టణంలో అపార్ట్మెంట్లలో చదరపు అడుగుల విస్తీర్ణం ధరలు భారీగా పెరిగాయి. గతంలోకంటే ప్రాంతాన్ని బట్టి 20 శాతం నుంచి 50 శాతానికిపైగా పెంచింది. నల్లగొండలోని ప్రకాశం బజార్లో అపార్ట్మెంట్లలో చదరపు అడుగు మార్కెట్ విలువ గరిష్టంగా రూ.3 వేలకు పెంచగా, శివాజినగర్లో రూ.1,800లకు పెంచింది. మిర్యాలగూడలోనూ పోలీస్స్టేషన్ నుంచి ఓల్డ్ ఎంఆర్వో రోడ్లో కనిష్టంగా రూ.1800 చేయగా, మున్సిపల్ కాంప్లెక్స్ నుంచి బ్రిడ్జి రోడ్డులో గరిష్టంగా రూ.3400లకు పెంచింది ఇళ్ల స్థలాల విలువలు భారీగా పెంపు.. ● నల్లగొండలో రెసిడెన్షియల్ విభాగంలో రూ.1,700 ఉన్న చోట రూ.2,600కు, రూ.2,400 నుంచి రూ.4,200కు పెంచారు. బొట్టుగూడలో రూ.2,400 నుంచి రూ.4,800కు, చర్లపల్లిలో రూ.3,100 నుంచి రూ.5,425కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గజానికి రూ.500 ఉన్న విలువను రూ.900కు పెంచారు. ● మిర్యాలగూడ మండలంలో గతంలో గజం ధర రూ.500 ఉండగా.. రూ.900కు పెంచారు. ● చింతపల్లి హైవే వెంట గజానికి రూ.4200, కనిష్టంగా ముస్లింవాడలో రూ.1600 ఉంది. ● మర్రిగూడలో హైదరాబాద్ రోడ్డులో గరిష్టంగా గజానికి రూ.2600 కాగా, కనిష్టంగా పడమటి వాడలో రూ.1500గా ఉంది. ప్రకాశం బజార్31,80040,7004,100మిర్యాలగూడ రోడ్డు6,00010,000వెంకటేశ్వర కాలనీ16,200గడియారం–రామగిరి మార్గం17,60026,000దేవరకొండ మెయిన్ రోడ్డు5,80027,1003,100అశోక్నగర్5,500ఫ 15 శాతం నుంచి 100 శాతం వరకు విలువల పెంపు ఫ ప్రాంతాల వారీగా సవరణ ఫ ప్రభుత్వానికి ఆదాయం.. జనంపై భారం వ్యవసాయ భూములకు సంబంధించి కొన్ని సర్వే నంబర్లకు మార్కెట్ విలువ చూపించడం లేదు. మిర్యాలగూడ మండల పరిధిలోని జప్తి వీరప్పగూడెంలో సర్వేనంబర్ 157లో, కాల్వపల్లిలో సర్వేనంబర్ 1, తడకమళ్లలో సర్వేనంబర్ 15, మిర్యాలగూడ శివారులో సర్వే నంబర్ 110 ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూమి విలువ రూ.0 గా చూపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూముల విలువ పూర్తిస్థాయిలో అప్డేట్ కాకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. -
పిల్లలే మన భవిష్యత్తు
పిల్లలు తమ సమస్యలను స్వయంగా వ్యక్తపరిచి, సమాజ అభివృద్ధిలో చురుకై న భాగస్వాములుగా ఎదగడమే బాల పంచాయతీ ప్రధాన ఉద్దేశం. గ్రామానికి బస్సు సౌకర్యం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఇంకా ఏ ఇతర సమస్యలు వస్తే.. సంబంధిత శాఖ అధికారుల వద్దకు నేరుగా వెళ్లి విద్యార్థులే వ్యక్తపరచడం. విద్య, ఆరోగ్యం, గ్రామ సమస్యలను గుర్తించి పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖ అధికారులకు చిన్నప్పటినుంచే చేరవేయడాన్ని విద్యార్థులు నేర్చుకోవాలి. వారి హక్కులు, బాధ్యతలను నేర్చుకోవడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదిగేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కనగల్ : ‘పిల్లలే మన భవిష్యత్తు. వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి, ప్రోత్సహించండి’ అని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు అన్నారు. కనగల్ మండలంలోని చర్లగౌరారం గ్రామంలో శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి ఎంతో ముఖ్యమన్నారు. పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్లో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. చిన్నారులు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాలని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని తెలిపారు. బాలలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం యంగిస్థాన్ ఎన్జీఓ ఆశ్రిత బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలకరాజు సునీత వెంకటేశం, ఏఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆదిరెడ్డి, రాము, కరుణాకర్, ఎస్ఐ అంజలి, రాజీవ్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఈఓ సుశీందర్రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, ఆర్టీఏ మెంబర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ కలపూరి నాగరాజు, చీదేటి సంతోష్రెడ్డి పాల్గొన్నారు. ఫ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు ఫ చర్లగౌరారంలో బాల పంచాయతీ -
ప్రపంచంలోనే అరుదైనది మియాజాకి మామిడి
కిలో పండ్ల ధర రూ.రెండున్నర లక్షలు ఫ సిరిపురంలో పెంచుతున్న శేషుకుమార్ ఫ తొలిసారి కాతకొచ్చిన జపాన్ రకం మియాజాకి ఫ దేశీయ, విదేశీ రకాలను కూడా సాగుచేస్తున్న అభ్యుదయ రైతు నడిగూడెం : మామిడిని సాధారణంగా ఫలరాజు అంటుంటాం. అన్ని ఫలాల్లో కంటే రారాజుగా పిలువబడే మామిడిలో ప్రపంచంలోనే అరుదైనది.. అత్యంత ఖరీదైనది ‘మియాజాకి’ రకం. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు వాసికర్ల శేషుకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో మియాజాకి రకం మామిడిని సాగుచేస్తున్నారు. ఎకరంన్నర విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో ఆయన దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల మామిడి మొక్కలు పెంచుతున్నారు. అందులో మియాజాకి కూడా ఉంది. శేషుకుమార్ మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడియం నుంచి ఒక్కో మొక్కకు రూ.1200 చొప్పున పెట్టి మూడు మొక్కలు తెచ్చి నాటగా ఒక మొక్క చనిపోయింది. మిగతా రెండు మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది తొలిసారిగా 20కి పైగా కాయలు కాశాయి. మియాజాకి మామిడి పండ్ల ధర కిలోకు రెండున్నర లక్షల రూపాయల ఉంటుందని, ఈ రకం పండులో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయని రైతు శేషు కుమార్ తెలిపారు. కాయ ఎరుపు రంగులో 300 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. బంగినపల్లి, దశేరి, తోతాపూరి, హిమాయత్, కొత్తపల్లి కొబ్బరి, ఆల్ఫాన్సా, చెరకు రసాలు, చిన్న రసాలు, నీలం, పండూరి మామిడి, కేసరి, తెల్ల గులాబి, ఆమ్రపాలి, ముంత మామిడి, మల్లిక, పందిరి మ్యాంగో, కస్తూరి మ్యాంగో తదితర రకాలు సాగులో ఉన్నాయి. ఆయన క్షేత్రంలో ఒక్కో రకం రెండు నుంచి మూడు మొక్కల చొప్పున సాగుచేస్తున్నారు. ఈ మొక్కలను కడియం, జడ్చర్ల నుంచి తెచ్చినట్లు రైతు తెలిపారు. తాను పండించిన అరుదైన రకాలు జపాన్ రకం మియాజాకి, అమెరికన్ థామిట్ క్వీన్, కేసరి పండ్లను ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐసీఏఆర్ డైరక్టర్ డాక్టర్. షేక్.మీరాకు అందజేశానని చెప్పారు. శేషుకుమార్ సాగుచేస్తున్న విదేశీ రకాలు ఇవీ..మియాజాకి, థామిట్ క్వీన్, నాసిక్ పసంద్, గోల్డెన్ మ్యాంగో, పర్పుల్ మ్యాంగో, ఫోర్ స్టోన్ మ్యాంగో, క్యాట్మెన్ మ్యాంగో, బన్సారా మ్యాంగో, యాపిల్ మ్యాంగో, బర్సూన్ కింగ్, వర్వేటర్, బర్రి మ్యాంగో, టెన్కేజీ మ్యాంగో, బ్లాక్ స్టోన్ మ్యాంగో. గత ఐదేళ్ళుగా పండ్ల తోటలు, కూరగాయలు, అకు కూరలతో పాటు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా అర ఎకరంలో అధిక సాంద్రత పద్ధతిలో 270 మామిడి మొక్కలను సాగు చేస్తున్నాను. దేశ, విదేశాలలో ఉన్న దాదాపు అన్ని రకాలను సాగు చేస్తున్నా. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా సహజ సిద్ధంగా సాగు చేస్తున్నా. నిత్యం ఆదాయం పొందుతున్నాను. – వాసికర్ల శేషు కుమార్, అభ్యుదయ రైతు, సిరిపురం -
గుట్టను 20 మీటర్లు తవ్వడమెందుకు?
నల్లగొండ టూటౌన్ : బ్రహ్మంగారి, లతీఫ్ సాహెబ్ గుట్టలపై ఘాట్ రోడ్డు నిర్మాణానికి గుట్టను 20 మీటర్ల లోతు ఎందుకు తవ్వుతున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రశ్నించారు. గుప్త నిధుల కోసం తవ్వుతున్నారనే అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నల్లగొండ నగరంలోని గుట్టలపై జరుగుతున్న బ్లాస్టింగ్ కారణంగా మునుగోడు హౌసింగ్బోర్డులో రాళ్లు పడి దెబ్బతిన్న ఇళ్లన్నాయన పరిశీలించారు. పేలుళ్ల వల్ల పెద్ద, పెద్ద రాళ్లు వచ్చి తమ నివాసాలపై పడడంతో స్లాబ్ పెచ్చులు ఊడి పడినట్లు స్థానికులు భూపాల్రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో ఉన్న మహిళలు, పిల్లలు భయబ్రాంతులకు గురయ్యే విధంగా గుట్టలపై పేళుల్లు జరుపడం ఎంటని ప్రశ్నించారు. పేళుళ్ల దాటికి స్లాబ్లకు రంద్రాలు పడుతున్నా అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ బాధ్యత లేకుండా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాస పాంత్రాలలో బ్లాస్టింగ్కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఘాట్రోడ్డు నిర్మాణానికి డీపీఆర్, టెండర్ ప్రక్రియ ఉందో లేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో మంజూరు చేసిన నిధులతో కాంగ్రెస్ నాయకులకు వెంచర్లు ఉన్న చోట సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నాణ్యత లేకుండా వేసుకుంటున్నారని వివర్శించారు. వీటన్నింటిపై విచారణ జరిపి, బ్లాస్టింగ్ జరిపిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, బాణావత్ దీప్లా, నాయకులు మారగోని గణేష్, పెరిక కరణ్జయరాజ్, కుందూరు ప్రవీణ్రెడ్డి, గోపగాని రాజశేఖర్, దోటి శ్రీనివాస్, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన -
ఎడుస్యూర్ మ్యాగజైన్లో అనాజిపురం మోడల్ స్కూల్
పెన్పహాడ్ : పెన్పహాడ్ మండలంలోని అనాజిపురంలోని తెలంగాణ మోడల్ స్కూల్.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఈ–మ్యాగజైన్ ఎడుస్యూర్ సంచికలో చోటు సంపాదించింది. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఎక్స్ప్లోరింగ్ ది యూనివర్స్ ఇన్స్పైరింగ్ యంగ్ మైడ్స్ అనే థీమ్తో గతేడాది నిర్వహించిన వరల్డ్ స్పేస్ వీక్–2025 కార్యక్రమాలను ఈ మ్యాగజైన్ ప్రచురించింది. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య వివరాలను వెల్లడించారు. ఎడుస్యూర్ తాజా సంచిక 24, 25 పేజీల్లో తమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల విశిష్టతను తెలియజేస్తూ ప్రత్యేక కథనం ప్రచురించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని రేకెత్తించాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఈ కార్యక్రమాలను చేపట్టినా అనాజిపురం మోడల్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాలు ఉత్తమంగా ఎంపికై ఎడుస్యూర్ మ్యాగజైన్లో కథనంగా ప్రచురితమవడం పాఠశాల విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచినట్లు ఆయన తెలిపారు. అంకితభావంతో సేవలందించాలినల్లగొండ టూటౌన్ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో సేవలందించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, కార్యనిబద్ధత, సంస్థకు నిజమైన సేవ అని ప్రతి ఉద్యోగి దార్శనిక ప్రమాణాలతో నడవాలంటూ సూచించారు. మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అబ్దుల్ రషీద్షేక్, డాక్టర్ ఖుద్ధుస్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాల ద్వారా శిక్షణ, నిధి, మార్గదర్శక సహకారాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం జరిపారు. -
సెంటు భూమి లేకున్నా.. రూ.లక్షల్లో పంట రుణాలు
మర్రిగూడ (చింతపల్లి): సెంటు భూమి కూడా లేని నిరుపేద కూలీల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి.. పంట రుణాలు మంజూరు చేసి లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారు నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఎస్బీఐ సిబ్బంది. 2024లో విధులు నిర్వహించిన బ్యాంకు మేనేజర్, మరికొంతమంది కిందిస్థాయి సిబ్బంది కలిసి పథకం ప్రకారం ఈ అక్రమాలకు తెరతీశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.50 లక్షల చొప్పున పంట రుణాలను మంజూరు చేసి ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసి.. క్షణాల్లో ఇతర ఖాతాలకు మళ్లించారు. మొత్తం మీద రూ.కోటికి పైగానే ఈ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.బంగారం విడిపించుకోవడానికి వెళ్తే షాక్..చింతపల్లి మండలం హరిజనాపురం గ్రామానికి చెందిన ఓ ఖాతాదారుడు తాను బ్యాంకులో కుదవపెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి వెళ్లగా.. అతడి పేరిట రూ.1.50 లక్షల పంట రుణం బకాయి ఉందని సిబ్బంది చెప్పారు. అసలు తనకు భూమే లేదని, రుణం ఎలా ఇస్తారని ఆ ఖాతాదారుడు బ్యాంకు అధికారులతో వాదించడంతో నకిలీ బ్యాంకు ఖాతాల వ్యవహారం బయటపడింది.కూలీల పేరిట భూమి ఉన్నట్లు సృష్టించి..రోజువారీ కూలీల పేరిట ఏకంగా మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. తీరా ఇప్పుడు బ్యాంకు ఉన్నతాధికారులు లోన్ రికవరీ కోసం బాధితుల ఇళ్లకు నోటీసులు పంపించడంతో అమాయక రైతులు, కూలీలు లబోదిబోమంటున్నారు. ఆన్లైన్లో చెక్ చేస్తే ఈ పాసుపుస్తకాల నంబర్లు ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇవన్నీ బ్యాంక్ సిబ్బంది సృష్టించిన నకిలీవేనని స్పష్టమవుతోంది. నాంపల్లి మండలం తుంగపాడుగౌరారం గ్రామానికి చెందిన ఓ మహిళ పేరున 194/1/2 సర్వే నంబర్లో మూడెకరాలు ఉండగా, హరిజనాపురం గ్రామానికి చెందిన దామెర విజయమ్మ పేరు పైన అదే సర్వే నంబర్ సబ్ డివిజన్పై నాలుగు ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించారు. భూమి లేని దాదాపు 60 మందికి పైగా నిరుపేదల పేరిట ఈ దందా చేయగా.. అందులో సగం మంది నుంచి బ్యాంకు సిబ్బంది లోన్ రికవరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, బ్యాంకు అధికారుల తప్పిదానికి మమ్మల్నెలా బాధ్యులను చేస్తారంటూ బాధితులు పెద్దఎత్తున చింతపల్లి ఎస్బీఐ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని, తమ పేరిట ఉన్న అక్రమ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్టీసీని విలీనం చేసేంత వరకు ఉద్యమిస్తాం
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం విలీనం చేసేంత వరకు ఉద్యమం ఆగదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపులోని బీసీ భవనంలో మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, 11శాతం పీఆర్సీతో 2021 వేతన సవరణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అన్నీ సంఘాలు మూడు ఆప్షన్లు రాసి ఇచ్చాయని తెలిపారు. టీఎంయూ నుంచి భారీగా చేరికలు మిర్యాలగూడ ఆర్టీసీ డీపోకు చెందిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)కు చెందిన సోమయ్య, డికె రెడ్డి, హనుమంతు, వెంగల్రెడ్డి, మహేష్, శ్రీను, లక్ష్మయ్య, దుర్గయ్య, రమేష్, టిజిరెడ్డి నాయకత్వంలో ఉద్యోగులు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్లో చేరారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు రాఘవులు, కెఎస్రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాసా ని వెంకటయ్య, తన్నీరు పాండురంగయ్య, ప్రచార కార్యదర్శి మనోహర్, హైదరాబాద్ జోనల్ నాయకులు టీఎస్ రెడ్డి, రీజియన్ కార్యదర్శి ఎన్ఆర్సి.రాజు, నాయకులు ఎండీ.జాబీర్, కెవీ రెడ్డి, మహేందర్, కోటయ్య, సైదులు, బిజి.రావు, తదితరులు ఉన్నారు. ఫ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న -
డబుల్ బెడ్రూమ్ల పనులు పూర్తి చేయాలి
నల్లగొండ : డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని పరిశీలించి మాట్లాడారు. డబుల్బెడ్ రూమ్ఇళ్లలో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూమ్లు, టాయిలెట్లు, కిచెన్లు తదితర పనులను పూర్తిస్థాయిలో చేయాలన్నారు. సముదాయంలో ఓపెన్ జిమ్, పార్కులు, బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, జిరాక్స్ సెంటర్, మీ సేవ కేంద్రం, మెడికల్ షాప్, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రాజ్కుమార్ను ఆదేశించారు. సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, క్రీడా మైదానం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, కాంట్రాక్టర్ సైదిరెడ్డి, అధికారులు ఉన్నారు. ఈవీఎం గోదాము పరిశీలించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) భద్రపరిచిన గోదాంను కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలోని గోదాంను ఆయన.. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆయా పార్టీల రాజకీయ ప్రతినిధుల ఎదురుగా తెరిపించారు. గోదాంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ఫ్యాట్లను పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచే గోదాములో మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో తనిఖీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ దశరథ్నాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ బి.చంద్రశేఖర్ -
నేడు చర్లగౌరారానికి డీజీపీ రాక
కనగల్ : మండల పరిధిలోని చర్లగౌరారం గ్రామంలో శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న బాల పంచాయతీ కార్యక్రమానికి డీజీపీ (ఉమన్ సేఫ్టీ వింగ్) అభిలాష బిస్తు హాజరు కానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల పిల్లల్లో నాయకత్వ పటిమను పెంచడం, వారి హక్కులపై అవగాహన, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించడం బాల పంచాయతీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలినల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని శుక్రవారం ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జీజీహెచ్ ఎదుట వైద్యులు పారామెడికల్ సిబ్బంది నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. జీఓఎంఎస్ నెంబర్ 38, 28 నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ సంఘాల బాధ్యులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవలు మినహా అవుట్ పేషెంట్ సేవలు, ఇతర వైద్య సేవలను బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ యువతకు ప్రోత్సాహంనల్లగొండ టూటౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల ప్రతిభను ప్రోత్సహించడానికి అనురాగ్ యూనివర్సిటీ దీర్ఘకాలిక కార్యక్రమం ప్రారంభించినట్లు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ పల్లా అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువ క్రీడాకారులకు కోచింగ్, శిక్షణ సదుపాయం, ప్రాక్టీస్ తదితర అవకాశాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఒక సీజన్కే కాకుండా ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. అనురాగ్ నల్లగొండ నైట్స్ హెడ్ కోచ్ డిబి.రవితేజ మాట్లాడుతూ యువ ఆటగాళ్లకు ఫిట్నెస్, నైపుణ్యాల అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జట్టు అసిస్టెంట్ కోచ్ రోనాల్డ్ రోడ్రిగ్స్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ పౌరుల బాధ్యతరామగిరి(నల్లగొండ) : పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని వృక్షమిత్ర సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్టీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవీ.రాఘవేందర్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొండ బస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తూ తన మనుగడకు తానే ముప్పుగా తయారవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు వృక్షమిత్ర సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదినం, వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక మొక్క నాటి దానిని వృక్షంగా పెంచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం కె.జానిరెడ్డి, డిప్యూటీ ఆర్ఎం సుచరిత, సిబ్బంది శ్రీహరి, నర్సిరెడ్డి, సూపర్వైజర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ పర్యాటకాభివృద్ధికి ఊతం
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయతీరంలో మూడు పంట్ల నిర్మాణం పనులు చేపట్టారు. వీటి నిర్మాణానికి సుమారుగా రూ.4 కోట్లు ఖర్చు కానుంది. కాంట్రాక్ట్ సంస్థ సాగర్ తీరంలోనే బస చేస్తూ పంట్ల పనులు చేపడుతోంది. 6 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల పొడవతో పంట్లను తయారు చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఇంజన్లు కూడా అమర్చనున్నారు. వీటిపై కార్లు, జేసీబీ తదితర యంత్రాలను తరలించవచ్చు. ప్రస్తుతం వీటిని లాంచీల వద్ద పర్యాటకులు దిగేందుకు వినియోగించనున్నారు. కొత్తగా తయారు చేసే మూడు పంట్లలో ఒకటి సోమశిలకు పంపనున్నారు. సాగర్లో ఉండే రెండింటిలో ఒకటి నాగార్జునకొండలో, మరొకటి ఇక్కడ తీరంలోనే ఉంటుందని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. -
ఎరువులు భారం
వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.- 8లోఫ భారీగా పెరిగిన ధరలు ఫ ఒక్కో బ్యాగ్పై రూ.125 నుంచి రూ.500 వరకు జిల్లా రైతులపై రూ.80 కోట్ల అదనపు భారం నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులపై ఎరువుల ధరల రూపంలో పెద్ద ఎత్తున భారం పడనుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. ఒక్కో బ్యాగ్పై రూ.125 నుంచి రూ.500 వరకు పెరిగింది. ఈ పెంపుతో జిల్లాలో వానాకాలం సీజన్లో రైతులపై సుమారు రూ.80 కోట్ల అదనపు భారం ఎరువులపై పడనుంది. యూరియా, డీఏపీ ధరలను ఎరువుల కంపెనీలు పెంచకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. 12,02,051 ఎకరాల్లో సాగు అంచనా.. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానిలో వరి 5,86,137 ఎకరాల్లో, పత్తి 5,30,524 ఎకరాల్లో, కంది 14 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కలిపి మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానికి గాను జిల్లా వ్యాప్తంగా యూరియా 1.61 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 33,758 మెట్రిక్ టన్నులు, ఎన్ఓపీ 12,932 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,14,043 మెట్రిక్ టన్నులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది. రైతు మహోత్సవ సభకు 8 వేల మంది రైతులు నల్లగొండ అగ్రికల్చర్ : రంగారెడ్డి జిల్లాలోని కోహెడ్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్న రైతు మహోత్సవ సభకు జిల్లా నుంచి 8 వేల మంది రైతులను తరలించడానికి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యనవన శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కోహెడ్ గ్రామంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 279 ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెంగ్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడ జరుగనున్న రైతు మహోత్సవ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ సభకు జిల్లాలోని 33 మండలాల నుంచి సుమారు 8 వేల మంది రైతులను సభకు తరలించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 160 ఆర్టిసీ బస్సులను రైతుల కోసం సిద్ధం చేశారు. ఒక్కో బస్సులు 50 మంది రైతుల చొప్పున సభకు తరలిస్తారు. ఒక్కో బస్సుకు వ్యవసాయ విస్తరణాధికారితో పాటు వ్యవసాయాధికారులను బాధ్యులుగా, పతి 10 బస్సులకు ఒక సమన్వయ అధికారిని నియమించారు. రైతులకు అవసరమైన భోజనం, స్నాక్స్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. బహిరంగ సభ అనంతరం రైతులను సురక్షితంగా వారివారి స్వగ్రామాలకు తరలించడానికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. 50 కేజీల బ్యాగ్పై పెరిగిన ధరలు ఇలా.. (రూ..లలో) ఎరువు ప్రస్తుతం కొత్తదర కాంప్లెక్స్ 1,900 2,450 ఎంవోపీ 1,850 1,975 ఎస్ఎస్పీ 615 1,000 -
వేసవి శిబిరాలతో సృజనాత్మకత
రామగిరి(నల్లగొండ) : బాలభవన్ నల్లగొండ, నాగార్జునసాగర్ సంయుక్త ఆధ్వర్యంలో 40 రోజులుగా నిర్వహించిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీఈఓ సుశీందర్రావు హాజరై మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, అనవసర వ్యాపకాలకు బానిసలు కాకుండా వేసవి శిబిరాల్లో పాల్గొనడం చాలా సంతోషించదగ్గ పరిణామం అన్నారు. పిల్లలను ఈ శిబిరానికి పంపించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు సహకరించిన తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు వసంతకుమారి, రాజేశ్వరి, విశ్వజ్యోతి విద్యార్థినులు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థుల సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు పాలబిందెల బాలు, ఇన్స్ట్రక్టర్స్ ఉపేంద్రాచారి, ఫజల్బేగం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
శాలిగౌరారం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం
శాలిగౌరారం : ఉమ్మడి జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలి గౌరారం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని సూర్యాపేట జిల్లా నీటిపారుదలశాఖ సీఈ నాగభూషణరావు అన్నా రు. శాలిగౌరారం ప్రాజెక్టులోకి ప్రస్తుతం మూసీనది ఎగువ భాగం నుంచి రాచకాల్వ ద్వారా వరదనీరు వచ్చిచేరుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ప్రాజెక్టుతోపాటు రాచకాల్వ, మూసీనదిపై రామన్నపేట మండలం పల్లివాడ వద్ద గల హెడ్రెగ్యులేటర్లను పరిశీలించారు. ధ్వంసమైన షట్టర్ల నుంచి నీటి వృథాను అరికడతామన్నారు. రాచకాల్వను పూర్తిస్థాయిలో సీసీ లైనింగ్ చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. పల్లివాడ హెడ్రెగ్యూలేటర్ వద్ద నీరు వృథా కాంకుడా నేరుగా ప్రాజెక్టులోకి వచ్చేలా చేరేలా చర్యలు చేపడతామన్నారు. ఆయనవెంట నీటిపారుదలశాఖ ఎస్ఈ శివధర్మతేజ, ఈఈ సత్యనారాయణ, ఏఈ విక్రమ్, చామల వెంకటరమణారెడ్డి, సిబ్బంది, రైతులు ఉన్నారు. -
డబ్బులు కాజేసి.. ఆపై దాడి చేసి!
నల్లగొండ : మహిళా సంఘాల పొదుపు డబ్బులను బ్యాంక్లో కట్టకుండా సొంతానికి వాడుకోవడమే కాకుండా.. ఆ డబ్బుల గురించి నిలదీసిన మహిళలపై బాధ్యులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటన నల్లగొండలోని డీఆర్డీఏ కార్యాలయ పరిధిలోని టీటీడీసీ సమావేశ మందిరంలో శుక్రవారం కలకలం రేపింది. బాధితులు కూడా ఎదురుదాడికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను స్టేషన్కు తరలించారు. వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం అప్పలమడుగు గ్రామ పరిధిలోని సీత్యా తండాకు చెందిన సోనియాగాంధి మహిళా సంఘం, వెంకటేశ్వర మహిళా సంఘం సభ్యులు 2018లో సీ్త్రనిధి కింద రూ.1.50 లక్షలు, మైక్రో రుణాల కింద ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున రుణం తీసుకున్నారు. మహిళలు ఈ రుణాలను 2022 నాటికే పూర్తిగా చెల్లించారు. కానీ, సీసీ దేవ్సింగ్నాయక్, వీబీకే భాష్యానాయక్ ఆ డబ్బును బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకున్నారు. తీరా చూస్తే.. సోనియాగాంధీ సంఘం పేరుతో రూ.96 వేలు, వెంకటేశ్వర సంఘం పేరుతో రూ.80 వేలు ఇంకా అప్పు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో నిలదీయగా.. ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని సదరు ఉద్యోగులు నమ్మబలికారు. రెండోసారి కూడా అదే మోసం! 2023లో మిర్యాలగూడ ఎస్బీఐ నుంచి ఈ రెండు సంఘాలకు కొత్తగా రూ.10 లక్షల చొప్పున రుణం ఇప్పించారు. ఈ రుణాన్ని కూడా మహిళలు గత ఏప్రిల్ నాటికి పూర్తిగా కట్టేశారు. మళ్లీ కొత్త రుణం కోసం బ్యాంక్కు వెళ్లగా.. ఒక సంఘంపై రూ.1.53 లక్షలు, మరో సంఘంపై రూ.2.10 లక్షలు అప్పు ఉన్నట్లు బ్యాంకర్లు చెప్పడంతో మహిళలు షాక్కు గురయ్యారు. ఆరు నెలల క్రితం మిర్యాలగూడకు బదిలీ అయిన సీసీ దేవ్సింగ్ ఫోన్ ఎత్తకపోవడంతో, బాధితులు శుక్రవారం నల్లగొండ డీఆర్డీఓ శేఖర్రెడ్డికి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ జరుగుతున్న సమావేశంలో సీసీ దేవ్సింగ్ ఉన్నాడు. బాధితులు పీడీకి ఫిర్యాదు చేయగా.. ‘మీరు మీరు చూసుకోవాలి’ అంటూ ఆయన బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని మహిళలు ఆరోపించారు. సమావేశం ముగిశాక సీసీ దేవ్సింగ్ బయటకు రాకుండా లోపలే ఉండిపోవడంతో, మహిళలే లోపలికి వెళ్లారు. అక్కడ నుంచి అతను పారిపోయేందుకు ప్రయత్నించగా మహిళలు పట్టుకున్నారు. ఈ క్రమంలో అతని చొక్కొ చిరగడంతో, దేవ్సింగ్ మహిళలపై దాడికి దిగాడు. దీంతో మహిళలు కూడా తిరగబడి ఎదురుదాడి చేశారు. అనంతరం దేవ్సింగ్ను ఒక గదిలో నిర్బంధించి 100కు డయల్ చేశారు. వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. కాగా, ఈ విషయమై వివరణ కోరేందుకు డీఆర్డీఓను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు. నిరసన తెలుపుతున్న గ్రామస్తులుఏపీడీలతో వాగ్వాదం చేస్తున్న అప్పలమడుగు వాసులు, ఫ మహిళాల సంఘాల డబ్బులను సొంతానికి వాడుకున్న ఉద్యోగులు ఫ నిలదీసిన మహిళలపై డీఆర్డీఓ ముందే దాడి ఫ ఎదురు దాడి చేసిన మహిళలు ఫ ఇరు వర్గాలను స్టేషన్కు తరలించిన పోలీసులు -
ఘాట్ రోడ్డు పనుల్లో పేలుడు..
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని లతీఫ్ సాబ్, బ్రహ్మం గుట్టల వద్ద జరుగుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొండలను బద్దలు కొట్టేందుకు చేపట్టిన పేలుడు (బ్లాస్టింగ్) తీవ్ర కలకలం రేపింది. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం పేలుడు కారణంగా సమీపంలోని హౌసింగ్ బోర్డు నివాసాలపై శుక్రవారం రాళ్ల వర్షం కురిసింది.పేలుడు దాటికి భారీ రాళ్లు సమీపంలోని ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్ల రేకులు, స్లాబ్ తీవ్రంగా దెబ్బతిని లోపల సిమెంట్ పెచ్చులు ఉండిపోయాయి. పేలుడు సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెంది.. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పేలుడు సమయంలో జనం ఇళ్ల బయట ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం, పాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జనావాసాలకు ఇంత దగ్గరగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు తగిన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటను పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫ ఇళ్లపై పడ్డ భారీ రాళ్లు ఫ దెబ్బతిన్న ఇళ్ల స్లాబ్లు, రేకులు -
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం
సాక్షి, నల్గొండ జిల్లా: మిర్యాలగూడ గాంధీ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనమయ్యారు. మృతులను చంద్రమ్మ(50), లక్ష్మణ్(17), ప్రణతి(14)గా గుర్తించారు.చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
మార్క్ఫెడ్లో ఎన్డీసీఎంఎస్ విలీనం
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (ఎన్డీసీఎంఎస్)ను ప్రభుత్వం మార్క్ఫెడ్లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీఓ త్వరలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఎన్డీసీఎంఎస్కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నిడమనూరు, హుజూర్నగర్, సూర్యాపేట, దేవరకొండలో విలువైన గోదాములు, ఖాళీ స్థలాలను కొన్ని విక్రయించినప్పటికీ ఇంకా కొన్ని ఆస్తులు నేటికీ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్ నాలుగు కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. విత్తనాలు, ఎరువుల విక్రయం ద్వారా రైతులకు సేవలందిస్తూ సంస్థ లాభాలను గడిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం భువనగిరిలో సంఘానికి చెందిన గోదాములు, ఖాళీ స్థలాన్ని విక్రయించగా స్టేషన్ రోడ్డులో దుకాణాల సముదాయం ప్రస్తుతం ఉంది. ఇందులో 13 మడిగెలు ఉన్నాయి. 1987వ సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలోని సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గ్రేడింగ్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలను విక్రయిస్తున్నారు. అప్పట్లో ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్డీసీఎంఎస్లో 120 మంది ఉద్యోగులు పని చేసేవారు. సహకార సంఘాలు రావడంతో ఎన్డీసీఎంఎస్పై ఉన్న బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. సంఘానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్తో ప్రయోజనం లేదని గుర్తించి వ్యయభారం తగ్గించుకునేందుకు మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీసీఎంఎస్ను మార్క్ఫెడ్లో విలీనం చేయడంతో సంస్థకు ఉన్న ఆస్తులు మార్క్ఫెడ్ పరం కానున్నాయి. మార్క్ఫెడ్లో విలీనమైతే రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంస్థ మరిన్ని వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఫ రూ.కోట్లాది విలువ గల ఆస్తులు ఇక మార్క్ఫెడ్ చేతిలోకి ఫ రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం -
బోర్డు సరే.. రోడ్ల సంగతేంటి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు, రియల్టర్లు ఒక్కటయ్యారు. రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులే రియల్టర్లకు కట్టబెట్టారు. నల్లగొండ నగరం పరిధిలోని గిరకబాయగూడెంలో రైతుల భూములకు దారి పేరుతో ప్రైవేటు వెంచర్కు ప్రభుత్వ భూమిని మూడు చోట్ల అప్పనంగా ఇచ్చేశారు. అంతేకాదు ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తులే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరీ భూమిని కబ్జా చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో ఫెన్సింగ్ తొలగించారు. తాజాగా బోర్డులను ఏర్పాటు చేశారు తప్ప అక్రమంగా కట్టబెట్టిన ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. అక్కడున్న భూమి ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీకి చెందినదిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు తప్ప అదే భూమిలో మూడు చోట్ల రియల్టర్లు వేసిన రోడ్లను మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ భూములకు కస్టోడియన్గా ఉన్న రెవెన్యూ శాఖ కూడా దీనిపై నోరెత్తకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోని ఏ శాఖకు చెందిన భూములు కబ్జా అయినా ఫైనల్గా పర్యవేక్షించి, తగిన చర్యలు చేపట్టాల్సిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈ వ్యవహారాన్ని గాలికి వదిలేసింది. గజానికి రూ.20వేల పైనే ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఈ లెక్కన బాట కోసం మూడు చోట్ల 2వేల గజాలకు పైగా స్థలం ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం బాట కోసం ఆక్రమించిన ఆ ప్రభుత్వ భూమి విలువ రూ.4 కోట్లకుపైనే ఉంటుంది. పైగా ప్రభుత్వ భూమికి వెనుకాల ఉన్న రైతుల పేరుతో 20 ఏళ్ల తరువాత తమ భూముల్లోకి వెళ్లేందుకు బాట కాావాలని అడిగిందే తడవుగా దానిని ధారాదత్తం చేసేశారు. రైతులకు బాట కోసం ఇవ్వాల్సిందెంత? నిజంగా రైతులకే ఇవ్వాల్సి వస్తే ఒక చోట, అదీ బండ్ల బాట వెడల్పుతో ఇస్తారు. అంతే తప్ప వెంచర్ కోసం ఈ స్థాయిలో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనిపై శ్రీసాక్ష్ఙి ప్రచురించిన వరుస కథనాల నేపథ్యంలో ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించగా, తాజాగా ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ భూములంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఫ భూమి తమదేనని బోర్డులు పెట్టిన నీటి పారుదల శాఖ ఫ వెంచర్కు మూడు చోట్ల రోడ్లకు ప్రభుత్వ భూమి ధారాదత్తం ఫ వాటిని పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ఫ కబ్జా అయిన భూమి విలువ రూ.4 కోట్లు జిల్లాలో 2004–05లో ఏఎంఆర్పి ప్రధాన కాలువను తవ్వే సమయంలో.. భవిష్యత్తు అవసరాల కోసం గిరకబాయిగూడెం వద్ద కొంత భూమి సేకరించారు. ఆ భూమి ఆక్రమణకు గురైనా నీటి పారుదల శాఖ పట్టించుకోలేదు. భూసేకరణ సమయంలో ఆ భూమిని ఇచ్చిన రైతుల పేరుతో ఓ దరఖాస్తును పెట్టించి మూడు చోట్ల ప్రభుత్వ భూమిలో నుంచి 30 అడుగుల వెడల్పుతో దాదాపు వంద మీటర్ల పొడవునా మూడు చోట్ల దారులను ఏర్పాటు చేస్తే కనీసం స్పందించలేదు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
నల్లగొండ: నల్లగొండ ఏఎంఆర్పీ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనుల అమలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. గురువారం కనగల్ మండలంలోని రేగట్టె గ్రామం వద్ద ఏఎంఆర్పీ కెనాల్ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కంపల్లి నుంచి మూసీ వరకు సుమారు 67 కిలోమీటర్ల మేర కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ పనులు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఈఈ నెహ్రూనాయక్, ప్రాజెక్టు మేనేజర్ అభిషేక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జితేందర్, డీఈ సంపత్, సంబంధిత అధికారులు ఉన్నారు. చండూరు: ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్క నాటి, నర్సరీని పరిశీలించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శంకర్నాయక్, వ్యవసాయ శాఖ ఏడీ వేణుగోపాల్, ఎంపీడీఓ యాదగిరి, ఎంఈఓ సుధాకర్రెడ్డి, తహసీల్దార్ రమాకాంత్శర్మ, ఉపసర్పంచ్ మహబూబ్, వార్డుసభ్యులు, ఇన్చార్జ్ ఎంపీఓ కోటయ్య, వివిధ శాఖల ఏఈలు, మండల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఎరువుల ధరల పెంపుతో రైతులపై పెను భారం
మిర్యాలగూడ : ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, పెంచిన ఎరువుల ధరలు సాగును మరింత భారంగా మార్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ధరలను రూ.300 నుంచి రూ.400 వరకు పెంచి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో డీఏపీ దొరకడం లేదని, జీలుగు, పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సరైన వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేయకపోవడం వల్లే సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. బడ్జెట్లో కొత్త పథకాలకు రూ.వందల కోట్లు కేటాయిస్తూ.. రైతుబంధు, రుణమాఫీ పథకాలను విస్మరించడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని అన్నారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఎరువుల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్నాయక్, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి -
నీలగిరిలో సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక
ఫ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి రామగిరి(నల్లగొండ): రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను గురువారం తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సందర్శించారు. బస్టాండ్ ప్రాంగణం, గ్యారేజ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాలు, డిపో పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు. గ్యారేజ్ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అనంతరం రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మేయర్ బుర్రి చైతన్యరెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి నాగిరెడ్డి ఉన్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో, ఏ రూట్లలో లాభాలు వస్తున్నాయి, ఎక్కడ నష్టాలు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల వాటి పనితీరు, చార్జింగ్ మౌలిక వసతులు, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనపై చర్చించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి, విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఎండీ స్పష్టం చేశారు. నగర ప్రజలు, విద్యార్థుల అంతర్గత రవాణా అవసరాలను తీర్చడానికి నగరంలోని అన్ని శివారు ప్రాంతాలు, కాలనీలను అనుసంధానిస్తూ సిటీ బస్సులు ముమ్మరంగా నడపాలని ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద ఆధునిక బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ స్థలంలో ఒక భారీ బహుళ అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్, రీజనల్ మేనేజర్ కొణతం జానిరెడ్డి, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్యరెడ్డి, డిపో మేనేజర్, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు.. మిర్యాలగూడ టౌన్ : ప్రతి డిపో పరిధిలోని గ్రామానికి పల్లె వెలుగు బస్సులు నడిపించాలనేదే ఆర్టీసీ లక్ష్యమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్తో కలిసి సందర్శించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ డీఎం చాంబర్స్లో ఆర్టీసీ బస్టాండ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. డిపోలకు 60 కిలోమీటర్ల దూరం ఉంటే పల్లె వెలుగు బస్సులు కాకుండా ఎక్కువ శాతం ఎక్స్ప్రెస్లు నడిచే విధంగా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అన్ని డిపోల్లో అధిక ఆదాయం వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను ఆధునీకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరడంతో ఈ విషయంపై పరిశీలిస్తామని తెలిపారు. ఆయన వెంట నల్లగొండ రీజినల్ మేనేజర్ కొణతం జాన్రెడ్డి, మిర్యాలగూడ డిపో మేనేజర్ రాంమోహన్రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, భార తీ బాయి తదితరులున్నారు. -
మొరాయిస్తున్న రెవెన్యూ సర్వర్
నల్లగొండ టూటౌన్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా జిల్లాలోని మున్సిపాలిటీలు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను సర్వర్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. యాప్ అప్డేట్ కారణంగా గత ఐదు రోజులుగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆన్లైన్ సేవలు స్తంభించిపోయాయి. ఫలితంగా జిల్లా కేంద్రమైన నల్లగొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న జనం సర్వర్ పని చేయకపోవడంతో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కట్టుకోవడానికి ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. గత ఐదు రోజులుగా భవన యజమానులు, సాధారణ పౌరులు తమ పన్నులు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయాలకు, వార్డు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, పైనుంచే సర్వర్ రావడం లేదంటూ అధికారులు చేతులెత్తేయడంతో సామాన్యులు వెనుతిరగాల్సి వస్తోంది. సీడీఎంఏ కార్యాలయంలోనే తరచూ సమస్య హైదరాబాద్లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆన్లైన్ వ్యవస్థ నియంత్రించబడుతుంది. అక్కడ సర్వర్ సమస్య వస్తే అన్ని కార్యాలయాల్లో సేవలు నిలిచిపోతాయి. గత నెలలో కూడా 15 రోజుల పాటు సర్వర్ సమస్య వచ్చింది. ఇంత జరుగుతున్నా ప్రధాన కార్యాలయం నుంచి సకాలంలో స్పందన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వర్ ఎప్పుడు వస్తుందనే సమాచారం మున్సిపాలిటీలకు ఇవ్వకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వర్ సమస్య కారణంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు నెల వారీగా వచ్చే ఆదాయం రాకుండా పోతుంది. ఆస్తి పన్ను సర్వర్ పని చేయకపోతే ఒక్క రోజులోనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ ప్రభావం ఆస్తి పన్ను, నల్లా బిల్లుల వసూళ్లపై పడే అవకాశం ఉంటుంది. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందిస్తూ ఒకటి, రెండు రోజుల్లో సర్వర్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఫ ఐదు రోజులుగా నిలిచిన సేవలు ఫ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఆగిన ఆస్తిపన్ను వసూళ్లు -
భూముల విలువ కనిష్టంగా 50 శాతం.. గరిష్టంగా 100 శాతం పెంపు
ఫ కమర్షియల్ విభాగంలో ప్రకాశంబజార్లో రూ.40వేలకు పెంపు ఫ స్లమ్ ఏరియాల్లో రూ.4800కు పెంపు ఫ పెరిగిన ధరలు నేటి నుంచి అమలు నల్లగొండ: భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది. మార్కెట్ విలువలను సవరిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదించిన కొత్త ధరలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి రానున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి ఏటా మార్కెట్ విలువల సవరణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. గత మూడేళ్లుగా ధరలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఒకేసారి కనిష్టంగా 50 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొనుగోలుదారులపై పెనుభారం పడనుండగా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. కమర్షియల్ విభాగంలో.. నల్లగొండ పట్టణంలోని ప్రకాశంబజార్లో ప్రస్తుతం మార్కెట్ విలువ గజం రూ.27,100 ఉండగా రూ.40వేలకు పెంచారు. మిర్యాలగూడ రోడ్డులో రూ.4100 ఉన్న విలువ రూ.6 వేలకు, హైదరాబాద్ రోడ్డులోని వెంకటేశ్వరకాలనీలో రూ. 10,800 ఉండగా రూ.16,200కు పెరిగింది. హైదరాబాద్ రోడ్డులో ని మెయిన్ రోడ్డు లోపల వైపు ప్రస్తుతం రూ.4800 ఉండగా రూ.7200కు పెంచారు. క్లాక్టవర్ నుంచి రామగిరి వైపు ప్రస్తుతం రూ. 17,600 ఉన్న మార్కెట్ విలువ రూ.26 వేలకు పెంచారు. మిర్యాలగూడ రోడ్డు వెంట రూ.17,600 ఉండగా రూ.26 వేలకు, దేవరకొండ మెయిన్ రోడ్డులో రూ.5,800 ఉండగా ఏకంగా రూ.10 వేలకు పెరిగింది. రెసిడెన్షియల్ విభాగంలో.. రూ.1700 ఉన్న చోట 2600కు, రూ.2400 ఉన్న దగ్గర రూ.4200కు పెంచారు. బొట్టుగూడ స్లమ్ ఏరియాలో రూ.2400 ఉండగా రూ.4800కు, చర్లపల్లిలో రూ.3,100 ఉండగా రూ.5,425కు, గ్రామీణ ప్రాంతాల్లో గజం రూ.500 ఉండగా దానిని రూ.900కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం వరకు పాత భూ విలువలు అమలులో ఉండడం, శుక్రవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనుగోలు అమ్మకందారులతో సందడిగా మారాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రాత్రి 8గంటల వరకు కొనసాగింది. మున్సిపాలిటీలు, హైవేల వెంట కార్యాలయాలు ఉన్న చోట రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. -
రిసోర్స్ సెంటర్ ఎంతో ఉపయోగకరం
చండూరు: జెండర్ రిసోర్స్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం అన్నారు. గురువారం చండూరు మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జెండర్ రిసోర్స్ సెంటర్లో మండలంలోని మహిళలకు కుటుంబ కలహాలు, లేదా ఇతర సమస్యలపై ప్రతి మంగళవారం, శుక్రవారం మండల సమాఖ్య ప్రతినిధులతో కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య కలహాలు పరిపాటిగా మారాయని, వాటిని సులువుగా తీర్చేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, కౌన్సిలర్ కటకం రమేష్, మండల సమాఖ్య ప్రతినిదులు, ఏపీఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలినార్కట్పల్లి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీసీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. గురువారం నార్కట్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెత్త వేరు చేయడం, చెట్లను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జెర్రిపోతుల భరత్ కుమార్, మండల పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీనివాసన్, ఎంపీడీఓ ఉమేష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గౌతమ్, ఉప సర్పంచ్ శిరీష, వడ్డే గోని రామలింగం, పర్రెపాటి సైదులు, ఆమనగంటి ఐలయ్య, జిల్లా మహేష్, మేడబోయిన రాంబాబు పాల్గొన్నారు. జల వనరులను సంరక్షించుకోవాలి చిట్యాల: గ్రామాల్లో భూగర్భ జల వనరులను సంరక్షించేందుకు కృషి చేయాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి కోరారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో గురువారం జలశక్తి ఆభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జల సంచాయ్– జన్భాగి దారి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో చెక్డ్యాంల నిర్మాణాలు, వాలు కట్టల వంటి నిర్మాణాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా కళాజాత బృందంతో నీటి సంరక్షణపై ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఓ వనం శ్రీలత, ఎంపీఓ కోటేష్, సర్పంచ్ సాగర్ల భానుశ్రీభిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, ఫీల్ట్ అసిస్టెంట్ మర్రి రమేష్ పాల్గొన్నారు. -
అమరావతి ఉండగా.. ఎక్కడో ఉండడం ఎందుకు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు. -
ప్రజా వైద్యం బిక్కు.. బిక్కు
ఫ శిథిలావస్థలో చండూరు పీహెచ్సీ భవనం ఫ వైద్యానికి వచ్చేందుకు జంకుతున్న జనం చండూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రిని అద్దె భవనంలోకి మారుస్తామని చెబుతున్నా.. అది కార్యరూపం దాల్చలేదు. దాతల సహకారంతో సేకరించిన స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని 2001లో ప్రారంభించారు. పట్టణానికి చివరన ఉండటం వల్ల రోగులు అంత దూరం వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. సరైన నిర్వహణ లేకపోవడంతో 15 ఏళ్లుగా భవనం లోపల, బయట శ్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఇనుప రాడ్లు బయటపడుతున్నాయి. నేల కూడా కుంగిపోయి, గోడులు బీటలు వారాయి. సమస్య తీవ్రతపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా మంత్రులు, కలెక్టర్లకు విన్నవిస్తూనే ఉన్నారు. 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఈ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి వైద్య సేవలను ప్రైవేటు భవనంలోకి మార్చి, ఆసుపత్రి వెనుక ఉన్న స్థలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని వైద్యులతో చర్చించి నిర్ణయించారు. మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో మిషన్ భగీరథ కంట్రోల్ యూనిట్ స్థలంలో పీహెచ్సీ నిర్మాణానికి గత ఏడాది జూన్ 6న ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. ఈ ఏడాది ఏప్రిపల్ 20న కూడా రెండో సారి ఆ ప్రదేశాన్ని సందర్శించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న దేవాదాయ శాఖ స్థలాన్ని కేటాయించాలని ఆ శాఖ కమిషనర్ను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక తెప్పించుకుంటామని స్థలం కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఏడాది కావస్తున్నా ఈ వ్యవహారం కేవలం స్థల పరిశీలనలకే పరిమితమైందని, కొత్త భవన నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందోనని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. శిథిలావస్థలో కనిపిస్తున్న చండూరు పీహెచ్సీ భవనంఊడుతున్న స్టాబ్పెచ్చులు -
జాతీయ జెండాకు అవమానం
కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మంగళవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. మంగళవారం ఉదయం ఎగరవేసిన జాతీయ జెండాను, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వరకు తొలగించలేదు. జెండా కర్రకు ఉన్న జాతీయ జెండా నేల మీద పడి అవమానానికి గురైంది. సాయంత్రం పంచాయతీ సిబ్బంది జెండాను తీశారు. జాతీయ జెండాపై బాధ్యతలేని సంబంధిత అ ధికారులు, గ్రామపంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంజీయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా అరుణప్రియ నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా కె.అరుణప్రియ నియమితులయ్యారు. రిజి స్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నుంచి బుధవారం ఆమె నియామకపత్రం అందుకున్నారు. గతంలో ప్రిన్సిపాల్గా, అడిషనల్ కంట్రోలర్గా సేవలందించిన ఆమె తిరిగి ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కళాశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు విమాన ప్రయాణంరామగిరి(నల్లగొండ) : మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు విమానం ఎక్కించాడు. పాఠశాల పదో తరగతి ఫలితాల్లో, ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్తానని ఆ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు బివి చారి విద్యార్థులకు మాట ఇచ్చారు. అన్నట్లుగానే.. పాఠశాల టాపర్గా నిలిచిన ఏడుకొండల వైష్ణవి, ఇంగ్లిష్ సబ్జెక్టు టాపర్ బుట్టి ఇందును తన సొంత ఖర్చులతో శంషాబాద్ నుంచి విమానంలో విజయవాడకు తీసుకువెళ్లారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సాహించడం ద్వారా చదువుపై మరింత ఆసక్తిని పెరుగుతుందని సర్పంచ్ జిల్లేపల్లి రేణుకరాజు కొనియాడారు. నీటిని సంరక్షించాలికేతేపల్లి : నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, వర్షాకాలంలో పడిన ప్రతి నీటి చుక్క భూమిలో ఇంకే విధంగా చూడాలని డీఆర్డీఓ వై.శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి, చెర్కుపల్లి, కొండకిందిగూడెం, బండపాలెం గ్రామాల్లో తెలంగాణ కళాజాత బృందం ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలన్నారు. మురుగు నీటి కాలువ చివరన ఖాళీగా వదలకుండా కమ్యునిటీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలన్నారు. పంట కాల్వల్లో పూడికను తొలగించి చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు పి.శ్రీనివాసరావు, సుదర్శన్రెడ్డి, జానయ్య, ఎంపీడీఓ నాగలక్ష్మి, ఏపీఎం మల్లేష్, ఏపీఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక టెట్ నిర్ణయంపై హర్షంనల్లగొండ : ఏటా జరిగే రెండు సాధారణ టెట్లతోపాటు, ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎం రేవంత్రెడ్డికి టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్దన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ భూములను ఆక్రమించొద్దు
నల్లగొండ : ప్రభుత్వ భూములు, చెరువుల శిఖాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. భూభారతి సంబంధిత కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేవ/ంచారు. డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చిన సమస్యలు స్థానికంగానే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై తాను డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. అటవీ, రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన భూముల సర్వేను వేగవంతం చేసి, భూ రికార్డులను సమగ్రంగా రూపొందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్నాయక్, ల్యాండ్ సర్వే ఏడీ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల మరమ్మతు పూర్తి చేయాలి పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులను 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలు, ఆర్సీఓలు, సంక్షేమ శాఖ ఆర్డబ్ల్యూఎస్, రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలను పూర్తిచేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు యూనిఫాం అందజేయాలన్నారు. 12 లోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఈఓ సుశీందర్రావు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ధరలు తగ్గించాలని నిరసన
నకిరేకల్ : పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించడంతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో బుధవారం నకిరేకల్లో ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆప్ రాష్ట్ర అధ్యక్షురాలు హేమ సుదర్శన్ మాట్లాడుతూ ఇందన ధరల భారంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నులను తగ్గించి ఉపశమనం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యార శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాముగౌడ్, జనరల్ సెక్రటరీ డాక్టర్ అన్సారి, నాయకులు దర్శనం రమేష్, పురుషోత్తంరెడ్డి, కొడంగల్ శ్రీనివాస్, బాబూలాల్, రాకేష్రెడ్డి, రాజమల్లయ్య, అద్దంకి రవీందర్, అశోక్, మహేందర్, ఎల్లమ్మ, లక్ష్మి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా..
నే లారీ నడిపేవాడిని. పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పడిపోయాయి. నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. ఎటూ నడవలేను. ప్రభుత్వ పింఛన్ వస్తే ఆసరా అవుతుందని ఐదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా. అప్పటి నుంచి ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందని చెప్పడంతో సంతోషమేసింది. కానీ ఇవ్వకపోవడంతో ఎప్పుడిస్తుందోనని ఆందోళనగా ఉంది. – నిమ్మల అంజయ్య, దివ్యాంగుడు, ఊకొండి, మునుగోడు మండలం మూడేళ్ల క్రితం నా భర్త చనిపోతే ఒంటరి మహిల పెన్షన్ కోసం దరఖాస్తు చేసా. ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారి చదువులకు, కుటుంబం గడిచేందుకు భారమవుతోంది. ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలి. – దీపిక, ఒంటరి మహిళ, నల్లగొండ కొత్త పింఛన్ల మంజూరుపై మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆన్లైన్ ఆప్షన్ కూడా లేదు. కొత్త పించన్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ మండల స్థాయిలోనే ఉన్నాయి. దరఖాస్తులు ఆన్లైన్ చేసేందుకు ఆప్షన్ ఇచ్చి, అర్హుల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు రావాల్సి ఉంది. – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ -
సాగర్లో అటవీశాఖ సైకిల్ ర్యాలీ
నాగార్జునసాగర్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారి సంగీత అన్నారు. బుధవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆమె జెండాను ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదిన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్ష సంపదను రక్షించుకోవాలని, మొక్కలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ గౌతమ్, సెక్షన్ అధికారి రమేష్ పాల్గొన్నారు. -
వైటీపీఎస్ ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్కు సన్మానం
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వి.వెంకటేశ్వర్లును టీఆర్వీకేఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ తదితరులు బుధవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ తిప్పారపు రమేష్, జెన్కో అసిస్టెంట్ సెక్రటరీ సతీష్కుమార్, వైటీపీఎస్ రీజనల్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రసాద్, రాజశేఖర్, యూసుఫ్, ఖదీర్, రామకృష్ణ, పన్నాలాల్, శేఖర్బాబు, శ్యామ్కుమార్, సాజిద్, త్రివేణి పాల్గొన్నారు. -
772 మెగావాట్ల విద్యుత్ డిమాండ్
నల్లగొండ : వేసవి ఎండలు, వ్యవసాయ అవసరాలు, గృహ, వాణిజ్య రంగాల్లో వినియోగంతో నల్లగొండ జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గణాంకాల ప్రకారం బుధవారం జిల్లాలో విద్యుత్ డిమాండ్ 772 మెగావాట్లకు చేరుకుంది. మంగళవారం 709 మెగావాట్లు నమోదుకాగా.. బుధవారం 63 మెగావాట్లు అధికంగా ఉంది. గత ఏడాది ఇదే రోజున 608 మెగావాట్లతో పోలిస్తే 164 మెగావాట్లు ఎక్కువగా నమోదైంది. దీంతో జిల్లాలో విద్యుత్ అవసరాలు ఏటేటా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. గతేడాది కంటే 27 శాతం అధికంగా.. ప్రస్తుతం జిల్లాలో కూరగాయలు సాగు, పండ్ల తోటలకు వ్యవసాయ పంపుసెట్ల వినియోగం పెరిగింది. ఉష్ణోగ్రతల కారణంగా కూలర్లు, ఎయిర్ కండీషనర్లు, ఇతర విద్యుత్ ఉపకరణాల వినియోగం అధికమైంది. ఫలితంగా గత ఏడాదికంటే 27 శాతం అధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తూ నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, వ్యవసాయ కార్యకలాపాల విస్తరణ విద్యుత్ వినియోగం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ గతేడాది కంటే 164 మెగావాట్ల పెరుగుదల ఫ ఎండలతో పెరిగిన విద్యుత్ వినియోగం -
‘ఆసరా’ ఆశలపై నీళ్లు
నల్లగొండ : ఆసరా పింఛన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మంది అర్హుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లినట్లయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ‘చేయూత’ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. కొత్త పింఛన్ల ప్రారంభంపై జూన్ 2న ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అర్హులు అయోమయంలో పడ్డారు. అసలు ఇప్పట్లో పింఛన్లు వస్తాయా లేదా అనే సంశయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పిల్లలపై ఆధారపడి.. గ్రామీణ ప్రాంతాల్లో వయసు పైబడిన ఎంతో మంది వృద్ధులు కోల్పోయి జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండగా, మరికొందరు కుటుంబ సభ్యులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పింఛనే వారికి ఆసరా అవుతుంది. తాజా ఆలస్యంతో మళ్లీ వారికి ఎదురుచూపులే మిగిలాయి. 11 వేల మందికి పైగా కొత్తగా వచ్చే అవకాశం! ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల వర్గాలకు చెందిన 1,99,567 మంది పింఛన్లు పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల పింఛన్లు ఇస్తే జనాభా, అర్హుల ప్రాతిపదికన జిల్లాలో మరో 9 వేల నుంచి 11 వేల మందికి కొత్తగా పింఛన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఆప్షన్ రాక నిలిచిన ప్రక్రియ జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దానికి సంబంధించిన క్షేత్రస్థాయి ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గానీ, ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయడానికి గానీ అవసరమైన ఆన్లైన్ ఆప్షన్ను ప్రభుత్వం ఇంకా అందుబాటులోకి తేలేదు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.ఫ జూన్ 2న కొత్త పింఛన్లు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన ఫ తెలంగాణ అవతరణ వేడుకల్లో స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఫ కొత్త పింఛన్లపై వీడని సందిగ్ధం.. అర్హులకు తప్పని ఎదురుచూపులు జిల్లాలో ప్రస్తుతం అందుతున్న పింఛన్లు పింఛన్ లబ్ధిదారులు వృద్ధాప్య 69,789 దివ్యాంగ 29,792 వితంతు 77,471 చేనేత 2,825 కల్లుగీత 7,536 ఒంటరి మహిళ 7490 హెచ్ఐవీ 3,228 పైలేరియా 1,027 డయాలసిస్ 409 మొత్తం 1,99,567 -
బిగ్ షాక్: రేవంత్, ఉత్తమ్లకు అధికారుల డీమోషన్!
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కారణం.. ఫ్లెక్సీలో హోదాలన్నీ తారుమారయ్యాయి!ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హోదా కనిపించగా, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్ పేరు దర్శనమిచ్చింది. దీంతో "ఒక్క ఫ్లెక్సీతోనే సీఎం డీఈఓగా డిమోట్ అయ్యారా? మంత్రి కలెక్టర్గా ప్రమోట్ అయ్యారా?" అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు."ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ పక్కనపెట్టి.. విద్యాశాఖ ఫ్లెక్సీలోనే కొత్త పోస్టింగులు ఇచ్చేసింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు "ఇది ఫ్లెక్సీనా.. లేక కొత్త గెజిట్ నోటిఫికేషనా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.అయితే ఈ సరదా వ్యాఖ్యల వెనుక అధికారిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక ఫ్లెక్సీ.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! -
పర్యావరణ గ్రామసభలు నిర్వహించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల సందర్భంగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో మండలాల వారీగా గ్రామసభలు, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మండలాల వారీగా అనుకూలమైన తేదీలను చూసుకోవాలని డీపీఓను ఆదేశించారు. గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్రాఉ. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఎస్బీఐ ఆర్సెటీలో ఉచిత శిక్షణనల్లగొండ : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగులకు నెల రోజుల పాటు ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్, సర్వీసింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్సెటీ డైరెక్టర్ సియాజి రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ సమయంలో ఉచితవసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు అర్హత, తదితర పూర్తి వివరాలకు 9701009265 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
7 వరకు రిపోర్ట్ చేయాలి
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని జోనల్ అధికారి విద్యారాణి తెలిపారు. ఇప్పటికే ఫలితాలు విడుదల అయ్యాయని సీటు వచ్చిన వారు ఆయా కళాశాలలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. నేడు టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభనకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో బుధవారం టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహసభ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అద్యక్షుడు గార్లపాటి క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభకు ప్రతి మండలం, పట్టణం నుంచి జర్నలిస్ట్లు తరలి రావాలని కోరారు. జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం నిరంతరం కృషి చేసే ఏకై క సంఘం ఐజేయు అన్నారు. సమావేశంలో ఆ సంఘం ప్రతినిదులు పులిమామిడి మహేందర్, మధనాచారి, శ్రీను, చెరుకు సతీష్, రేపాల సతీష్, గండమళ్ల రాములు, కందగట్ల శ్రీధర్, పరమేష్, రాములు, రవీంద్రాచారి, సాయి, రాజు, నర్సింహ, రమేష్, శంకర్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు. ‘బడిబాట’ పాట ఆవిష్కరణనల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ‘బడిబాట పాట–2026’ సీడీ, పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరాం ఈ పాటను రచించారని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేలా ఈ పాట ఉందన్నారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న సజనాత్మక ప్రయత్నాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాంను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో ఏడీ రామాచారి, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈసం రాంబాబు, సిబ్బంది వీరేంద్రసింగ్, భిక్షం, శ్రీను పాల్గొన్నారు. మరో పర్వతారోహణకు బయలుదేరిన అన్వితారెడ్డిభువనగిరి : ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన పడమటి అన్వి తారెడ్డి.. మరో పర్వతారోహణకు మంగళవారం బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి విమాన మార్గంలో ఉత్తర అమెరికాలోని అలస్కాకు ఈ నెల 3వ తేదీన చేరుకోనుంది. అలస్కాలోఉన్న సుమా రు 6,190 మీటర్ల ఎత్తయిన డేనాలీ పర్వతాన్ని ఎక్కనుంది. ఈ ప్రక్రియ సుమారు నెల రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన అన్వితారెడ్డి 2022 మేలో ఎవరెస్టు పర్వతం, 2022 సెస్టెంబర్లో మనస్లూ పర్వతం, 2021 డిసెంబర్లో మౌంట్ ఎల్బ్రోస్, 2025 జనవరిలో అర్జెంటీనాలోని అకోన్కాగ్వా పర్వతం, 2022 డిసెంబర్లో విన్సన్ పర్వతం, 2021 జనవరిలో కిలిమంజారో, 2021లో ఫిబ్రవరిలో లడఖ్ పర్వతాలను అధిరోహించింది. -
తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి
– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మోత్కూరు : హైదరాబాద్లోని కొత్తపేట ప్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆసుపత్రికి తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు హైదరాబాద్లోని ఒకే ప్రాంతంలో అమర వీరుల కుటుంబాల కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ‘సాక్షి’ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్లోని ఎల్బినగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తన కొడుకు ఆత్మాహుతి చేసుకున్నాడని, ఆస్పత్రికి శ్రీకాంతాచారి పేరు పెట్టడంతో ఆత్మ శాంతిస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, నెలకు రూ.25 వేల పింఛన్, ఆరోగ్య భద్రత కార్డులు అమలు చేస్తే ఆ కుటుంబాలు ఆత్మ గౌరవంగా బతుకుతాయని అన్నారు. కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా తనను నియామకం చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
అంచనాలు దాటని ఆటోమిషన్
నాగార్జునసాగర్ : బహుళార్థసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ గేట్ల రిమోట్ ఆటో మిషన్ మరమ్మతుల పనులు అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. గతంలో ఆంధ్రా అధికారులు డ్యాంపైకి వచ్చి గేట్లను ఎత్తే సమయంలో ఆటోమిషన్కు వినియోగించే పరికరాలు భారీ స్థాయిలో ధంసమయ్యాయి. గతేడాది వాటి విడిభాగాలు మార్చకుండా.. రూ.15 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ యేడాది పరికరాలను పూర్తిస్థాయిలో మార్చేందుకు సుమారు రూ.40 లక్షలతో అంచనాలు తయారు చేశారు. ఇంకా అవి ప్రభుత్వానికి చేరలేదు. ఈ నేపథ్యంలో ఈ వానాకాలం నాటికై నా పనులు చేపట్టడం అనుమానంగానే ఉంది. 2016లో ఆటోమిషన్ ఏర్పాటు సాగర్ వద్ద గేట్లు ఎత్తి, దించేందుకు 2016లో సాంకేతిక నైపుణ్యతను వినియోగించి ఆటోమిషన్ను ఏర్పాటు చేశారు. ఏ గేటు ఎంత ఎత్తు ఎత్తితే దిగువకు నీరెంత వెళుతుందో కంప్యూటర్ స్క్రీన్పై కనిపించడంతో పాటు ఆన్లైన్లో చూసేవిధంగా ఆధునీకరిచారు. అందుకుగాను అప్పట్లో రూ.7 కోట్లు కేటాయించి పనులు చేశారు. 26 రేడియల్ క్రస్ట్గేట్లతోపాటు కుడి, ఎడమకాల్వలు, సూట్గేట్లను రిమోట్తోనే ఆన్ఆఫ్ చేసే విధంగా ఆదునీకరించారు. అందుకుగాను సాగర్డ్యాంపై ఈ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం రిమోట్తో లేపితే గేట్లు లేవడం లేదు. షూట్గేట్లు కూడా.. సాగర్ డ్యాంలో 510 అడుగుల దిగువకు నీరు వెళ్లిన సమయంలో కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు షూట్ గేట్లను వినియోగిస్తారు. జలాశయంలో నీరు నిండుగా ఉండి దిగువకు అధికంగా నీటిని విడుదల చేయాల్సి వచ్చినపుడు కూడా ఈ గేట్లు ఎత్తుతారు. వీటిని కూడా ఆటోమిషన్ ద్వారా లేపి దింపే విధంగా అనుసంధానించారు. దీని ద్వారా నీటిని విడుదల చేస్తే కచ్చితత్వం ఉండే అవకాశాలుండడంతో పాటు నీటి నిల్వలు, పారే నీటి గణాంకాలు ఉంటాయి. ఫ సాగర్లో గేట్లు ఎత్తి, దించేందుకు ఆటోమిషన్ ఏర్పాటు ఫ వాటి పరికరాలు మార్చేందుకురూ.40 లక్షలతో అంచనాలు -
న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం
న్యాయవాదులకు తెలంగాణ న్యాయవాదుల చట్టం–2026 ఉక్కు కవచం లాంటిది. ఇక నుంచి న్యాయవాదులు నిర్భయంగా బాధితుల తరఫున వాదించవచ్చు. లాయర్లకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. – వేముల రంజిత్కుమార్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నల్లగొండ రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం–2026 జూన్ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీసు యంత్రాంగం న్యాయవాదులను ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందస్తు అనుమతి లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 6 నెలల్లోగా కోర్టు విచారణ ముగించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్–2026 అమల్లోకి తీసుకురావడం చరిత్రాత్మక నిర్ణయం. న్యాయవాదులకు భద్రత కల్పించాలని సుధీర్ఘ కాలంగా చేస్తున్న పోరాట ఫలితమే ఈ చట్టం. న్యాయవాదులపై జరిగే దౌర్జన్యాలను నిరోధించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలి. – పందుల సైదులు, న్యాయవాది న్యాయవాదుల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం–2026 ఏర్పాటు చేయడం శుభ పరిణామం. న్యాయవాది వృత్తి ధర్మం పాటిస్తూ బాధితుల పక్షాన ధైర్యంగా న్యాయ పోరాటం చేయవచ్చు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయవాదులపై దాడులకు పాల్పడకుండా ఉండాలి. – మందా నగేష్, బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ, నల్లగొండ -
నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి
కట్టంగూర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో ఉద్యమం తీవ్రంగా ఉన్న సాగుతున్న సమయంలో నాపై పలు రకాల సెక్షన్లకు కింద ఆరు కేసులు నమోదు చేశారు. నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్లోని చర్లపల్లి మొత్తం 18 రోజుల పాటు జైలు జీవితం గడిపాను. ఉద్యమంలో భాగంగా 2007లో తెలంగాణ బార్డర్ నుంచి హైదరాబాద్లోని సెక్రటేరియట్కు వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా నకిరేకల్ సమీపంలోకి రాగానే డీసీఎం డీకొట్టడంతో ఆనకు అంగవైకల్యం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ అమరుల కుటుంబాలను, ఉద్యమంలో అంగవైకల్యం ఏర్పడిన కుటుంబాలను, జైలు జీవితం గడిపినవారిని ప్రభుత్వ గుర్తించాలి. అంగవైకల్యానికి గురైనవారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 12 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేయడం హర్షనీయం. రాష్ట్ర ఏర్పాటుకు సుదీర్ఘంగా పోరాటం చేసిన నిజమైన వ్యక్తులను గుర్తించి న్యాయం చేయాలి. – గద్దపాటి దానయ్య, తెలంగాణ ఉద్యమకారుడు -
పోరాడి తెలంగాణ సాధించుకున్నాం
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రవీంద్రకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్లాక్ టవర్లోని అమరవీరుల స్థూపం వద్ద, శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్రెడ్డి, చీర పంకజ్మాదవ్, రామచంద్రునాయక్, పల్లె రవికుమార్, మాలే శరణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, జమాల్ ఖాద్రి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ -
తెలంగాణ ప్రజల కలలు సాకారం
శాలిగౌరారం : తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం రేవంత్రెడ్డి సాకారం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్నేత అన్నారు. శాలిగౌరారంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయజెండాను ఎగురవేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన, ప్రాణత్యాగాలకు పాల్పడిన వారి కుటుంబాలకు సముచిత స్థానం కల్పించకుండా మోసం చేసిందన్నారు. ప్రజా సంకల్పంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అద్యక్షుడు కందాల సమరంరెడ్డి, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, పీఏసీఎస్ వైస్చైర్మన్ చామల మహేందర్రెడ్డి, నాయకులు అన్నెబోయిన సుధాకర్, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, వేముల గోపినాథ్, బొల్లికొండ గణేశ్, బోడ అరుణ్కుమార్, జమ్ము అశోక్, పెరుమాండ్ల నరేశ్, పరమేశ్, లక్ష్మయ్య, జయరాజు, భిక్షంరెడ్డి, యుగంధర్రెడ్డి, రవి, అంజయ్య, జనార్దన్, వెంకటయ్య, రవీందర్రెడ్డి, యాదయ్య, పవన్ పాల్గొన్నారు. -
అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ
రామగిరి(నల్లగొండ) : అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోవద్దని ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ఏర్పాటై పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు చేసిన పోరాటాలు, వేలాది మంది అమరుల ఆత్మబలిదానాల వల్లే వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పందుల సైదులు, బోనగిరి దేవేందర్, చీర పంకజ్యాదవ్, దూసరి కిరణ్కుమార్, చింతమల్ల గురువయ్య, కె.పర్వతాలు, ఇందూరి సాగర్, ఆర్.విజయ్కుమార్, పి.ఏడుకొండలు, మల్లేశం. ఆర్. లక్ష్మయ్య, పెండెం ధనుంజయనేత, వెంకటేశ్వర్లు, బీవీ చారి, గద్దపాటి సురేందర్, కె.రత్నయ్య, సునీత, గూడూరి జానకిరామ్రెడ్డి, అయితగోని జనార్దన్గౌడ్, మాతంగి అమర్, బట్టు నవీన్, కొండేటి మురళి పాల్గొన్నారు. -
కరువు నేలను తడిపేందుకు ఎత్తిపోతలు
డిండి : నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ ప్ర భావిత ప్రాంతాల ప్రజలకు రక్షిత నీరు, బీడు భూములకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా 2015లో శివన్నగూడెంలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కిష్టరాంపల్లి, చింతపల్లి, శివన్నగుడెం, గొట్టిముక్కుల, సింగరాజుపల్లిలో రిజర్వాయర్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించి జిల్లాలో నిర్మించే ఐదు రిజర్యాయర్లు నింపితే.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.61 ఎకరాలకు సాగునీరుతోపాటు ప్రజలకు తాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. ప్రస్తుతం ఈ ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయి. ● సాగర్ ఆయకట్టు చివరి భూములకు, ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఐదు ఎత్తిపోతల పథకాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో బొత్తలపాలెం, దున్నపోతులగండి, కేశవాపురం– కొండ్రపోల్, వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్ట్ పనులు ప్రగతిలో ఉన్నాయి. ● దశాబ్దాల కాలంగా కృష్ణపట్టె గిరిజన రైతాంగం ఎదురుచూస్తున్న నెల్లికల్లు ఎత్తిపోతలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసింది. రూ.692 కోట్లతో ఈ లిఫ్ట్ పనులు సాగుతున్నాయి. ఫ్లోరోసిస్ మహమ్మారి నుంచి విముక్తి నల్లగొండ : ఒకప్పుడు నల్లగొండ జిల్లా పేరు వినగానే గుర్తుకొచ్చేది ఫ్లోరోసిస్ సమస్య. ఇక్కడ వేలాది మంది ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, కట్టంగూరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరోసిస్ అధికంగా ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ.3,000 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా కృష్ణానది నుంచి శుద్ధి చేసిన నీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తోంది. 1,750 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందుతోంది. ఈ పథకం జిల్లా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చింది. -
గూడు కోసం గోస..
నల్లగొండ నగరం పరిధిలోని చర్లపల్లి చెందిన దివ్యాంగుడు ఏర్పుల మారయ్య (70) తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం నల్లగొండ కలెక్టరేట్కు వచ్చి గోడు వెల్లబోసుకున్నాడు. చర్లపల్లిలో రూ.వెయ్యి అద్దె చెల్లించి తన తల్లి ఈదమ్మ (90)తో కలిసి జీవిస్తున్నానని చెప్పాడు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధుడు, దివ్యాంగుడైన మారయ్య కలెక్టర్ను కలవడానికి ఆటోలో వచ్చేందుకు రూ.200, తిరిగి వెళ్లేందుకు మరో రూ.200 ఖర్చు చేశారు. కలెక్టరేట్ మెట్లు ఎక్కడం కూడా కష్టంగా మారినా, ఇతరుల సహాయంతో పైకి చేరుకుని వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశాడు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
నేడు పరేడ్ గ్రౌండ్లో పతాకావిష్కరణ
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నల్లగొండలో నిర్వహించే వేడుకలకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 7.45 గంటలకు క్లాక్టవర్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం, ఉదయం 8 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకల్లో విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల ప్రదానం చేస్తారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సోమవారం రాత్రి పరిశీలించారు. -
విద్యలో నూతన ఒరవడి
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో విద్యారంగం నూతన ఒరవడిని సంతరించుకుంది. గురుకులాల విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మెడికల్ కళాశాల ఏర్పాటు, లా, నర్సింగ్ కళాశాలల మంజూరు వంటి చర్యలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యారంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. గురుకుల విద్యాసంస్థల విస్తరణతో వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల విద్య వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 24 ఎస్సీ, 34 బీసీ, 13 మైనార్టీ, 20 గిరిజన గురుకులాలు కొనసాగుతున్నాయి. వీటిలో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత వసతి, భోజనం, పోటీ పరీక్షల శిక్షణ ఇస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలు నేడు గురుకులాల ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కళాశాలలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. -
పోలీసులకు సేవా పతకాలు
నల్లగొండ : ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలను ప్రటించింది. ఏఆర్ ఎస్ఐ జయరాజ్కు ఉత్తమ సేవా పతకం, 12 బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ బి.వెంకట్రెడ్డి, డీఎస్పీ సెల్లో పనిచేస్తున్న రఫియోద్దీన్, సీసీఎస్ కానిస్టేబుల్ పుస్పగిరి, ఏఆర్ పీసీ అంజద్ఖాన్కు సేవా పతకాలకు ప్రకటించింది. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా మంగళవారం వారు పతకాలు అందుకోనున్నారు. బాధ్యతలు స్వీకరించిన డీఈఓనల్లగొండ : నల్లగొండ డీఈఓగా బదిలీపై వచ్చిన సుశీందర్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయం సిబ్బందితోపాటు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా వినోద్కుమార్నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయాధికారిగా వి.వినోద్కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని వ్యవసాయశాఖ కమిషనరేట్లో ఏడీఏగా పనిచేస్తూ పదోన్నతి పొంది నల్లగొండ జిల్లాకు బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్చార్జి జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన పాల్వాయి శ్రవణ్కుమార్ పదోన్నతి పొంది వ్యవసాయ శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. పోలీస్ గ్రీవెన్స్లో 46 ఫిర్యాదులు నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 46 మంది బాధితులు భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు తదితర అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. -
పేదల సొంతింటి కల సాకారం
దేవరకొండ : పేదవాడి సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలంలోని శకృనాయక్తండా గ్రామంలో నిర్మించిన 6 ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి లబ్ధిదారులత చేత గృహ ప్రవేశ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ప్రతి కుటుంబం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ తండాల్లో గుడిసెలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గ్రామల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రాజెక్టు భూసేకరణ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మప్రియ, తహసీల్దార్ సంజీవ్కుమార్, ఎంపీడీఓ డానియల్, సర్పంచ్ మోహన్లాల్, రామ్సింగ్, పంచాయతీ కార్యదర్శి కీర్తి, లబ్దిదారులు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ దేవరకొండ మండలం శకృనాయక్తండా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాం
మిర్యాలగూడ : తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ దాక వినిపించాం. 1991 నుంచే పోస్టుకార్టు ఉద్యమాలతోపాటు 1997లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేశాం. కృష్ణాజలాలు, సాగునీటి కోసం ఎడమకాల్వపై పాదయాత్ర నిర్వహించాం. ప్రత్యేకంగా తెలంగాణ కావాల వద్దా అని రెఫరెండం పెట్టి ప్రజల మద్దతును కూడగట్టాం. ఇక్కడి నుంచి ఢిల్లీకి ప్రజలతో కలిసి సోనియాగాంధీకి ఇటలీ భాషలో ఉత్తరం రాశాం. సరిహద్దులో సభలు ఏర్పాటు చేసి గ్రామగ్రామాన పాదయాత్రలు చేపట్టి వినూత్న నిరసనలు చేపట్టాం. కేసీఆర్, గద్దర్, విమలక్క, జయశంకర్, కోదండరామ్లను ఆహ్వానించి మా ప్రాంతంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాం. – వేనేపల్లి పాండురంగారావు (మట్టిమనిషి)ఉద్యమకారులను గౌరవించాలి● డాక్టర్ చెరుకు సుధాకర్ నకిరేకల్ : ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాను అనేక కేసుల్లో ఐదు మాసాలు జైలు జీవితం గడిపాను. అనేక పోరాటల నడుమ స్వరాష్ట్రాన్ని సాధించి పుష్కరకాలం (12 ఏళ్లు) అవుతోంది. ఇక, నిర్బంధాలు లేని తెలంగాణ కావాలి. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గౌరవించాలి’ అని తెలంగాణ ఉద్యమకారుడు, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన వారి జీవిత కాలంలో జూన్ 2వ తేదీ పండుగ రోజు. ఉద్యమకారుడు ఎవరైనా గర్వంగా ఫీల్ అవ్వాలి. చేతనైతే రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. రాష్ట్రం కోసం పోరాడిన వారి కోసం ప్రభుత్వాలు పని చేయకపోతే నిలదీయాలి. ఐదు నెలలు జైలు జీవితం గడిపాను నేను స్వరాష్ట్ర ఏర్పాటు కోసం 1997లో జరిగిన ‘తెలంగాణ మహాసభ’ నుంచి ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయివచ్చాను. మలిదశ ఉద్యమం 2009 నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు జరిగిన అనేక పోరాటాల నడుమ, నాపై పెట్టిన వివిధ కేసుల వల్ల మొత్తం ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపాను. ఆనాటి సమైక్య ప్రభుత్వం నాపై పీడీ యాక్ట్తో పాటు ఇతర అనేక కేసులను ప్రయోగించింది. పీడీ యాక్ట్ కింద ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నప్పటికీ, కోర్టు ఇచ్చిన తీర్పులతో నేను ఆ శిక్షల నుంచి బయటపడ్డాను. నిర్బంధాలు లేని తెలంగాణ కావాలి స్వరాష్ట్రంలో పౌర, మానవ హక్కులు ఉండాలని పోరాడాం. వాటిని ఎక్కడ అణచివేసినా ఎదురించాలి. నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు.. నిర్బంధాలు లేని స్వేచ్ఛను అనుభవించే తెలంగాణ, సామాజిక న్యాయం ఉన్న తెలంగాణ, రాష్ట్రం కోసం పోరాడిన వారిని గౌరవించే తెలంగాణ కావాలన్నదే మా ఆకాంక్ష. రాష్ట్రం కోసం పోరాడిన వారంతా పుష్కర స్నానం చేసినంత పుణ్యం లభించినట్లుగా భావించాలి. నేడు గుండెల నిండా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ గర్వపడాలి. -
ధాన్యాగారం..
నల్లగొండ అగ్రికల్చర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరిగింది. కోటీ 30లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధించి ధాన్యాగారంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2017లో వానాకాలంలో వరి 1,59,152 ఎకరాల్లో, పత్తి 5,83,800 ఎకరాలు, ఇతర పంటలు కలిపి మొత్తం 8,41,745 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు. 2025 వానాకాలంలో వరి 5,41,570 ఎకరాల్లో పత్తి 5,82,062 ఎకరాలు ఇతర పంటలు కలిపి మొత్తం 11,95,601 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏడాది రెండు సీజన్లకు నాగార్జునసాగర్ ఎడమకాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, మూసీ కాలువల ద్వారా సాగు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రధాన కాలువ పరిధిలోని గ్రామాలోని చెరువులు జలసిరులు సంతరించుకుంటున్నాయి. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 43, ఇతర శాఖలకు 75 మొత్తం 118 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులన్నీ జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ‘జల్ సంచయ్ – జల్ భాగీదారి’ కార్యక్రమంలో నల్లగొండ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడంనూ కలెక్టర్.. అధికారులను అభినందించారు. ఈనెల 1 నుంచి 5 వరకు ‘స్వచ్ఛ గావ్ సురక్ష జల్ వాయు’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 12 వరకు పర్యావరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఎఫ్ఓ రాజశేఖర్, తదితరులు ఉన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
స్వరాష్ట్రంలో మారిన జిల్లా రూపురేఖలు
నల్లగొండఫ సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అడుగులు.. ఫ్లోరోసిస్ పీడకు విముక్తి ఫ రికార్డు స్థాయిలో పెరిగిన వరి సాగు.. ధాన్యం దిగుబడిలో అగ్రగామి ఫ మెడికల్ కళాశాల, ఏరియా ఆస్పత్రుల అప్గ్రేడ్తో మెరుగైన వైద్యం ఫ గురుకులాలతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఫ యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్తో విద్యుత్ వెలుగులు ఇక్కడ ఒకప్పుడు ఎండిపోయిన చేలు, అర్ధరాత్రి కరెంట్ కష్టాలు, అన్నింటికీ మించి ఫ్లోరోసిస్ మహమ్మారితో ఒక తరం నలిగి పోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక.. నల్లగొండ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. విద్యా, వైద్య, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో అసాధారణ ప్రగతి సాధించింది. ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారడమే కాకుండా.. పచ్చని పొలాలు, మెడికల్ కాలేజీ, భారీ పవర్ ప్లాంట్, ధాన్యం దిగుబడిలో రికార్డు ఇప్పడు నల్లగొండ సొంతం. నల్లగొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఆవర్భావం తరువాత జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. నల్లగొండలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జీజీహెచ్ను 400 పడకల స్థాయి నుంచి 700 పడకలకు పెంచారు. దాంతో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ ఏరియా ఆస్పత్రులను 100 నుంచి 200 పడకలకు, నకిరేకల్ ఆస్పత్రినిన 50 నుంచి వంద పడకలకు, మర్రిగూడ ఆస్పత్రిని 30 నుంచి 48 పకడలకు హాలియా పీహెచ్సీని 30 పడకలకు పెంచారు. దీంతో పాటుగా పల్లె దవఖానాలను, బస్తీ దావఖానాలను ఏర్పాటు చేశారు. ● జిల్లాలోని జీజీహెచ్తో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మర్రిగూడ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ● హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్లో, అద్దంకి జాతీయ రహదారిపై మిర్యాలగూడలో, నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై మాల్లో, నాగార్జునసాగర్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నల్లగొండ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న నల్లగొండ సాగునీటి విస్తరణ, పారిశ్రామికాభివద్ధి, ిిస్తిరాస్థి వ్యాపారం, సేవారంగం పెరుగుదలతో తలసరి ఆదాయంలో గణనీయమైన పురోగతి సాధించింది. వ్యవసాయం, పాల ఉత్పత్తి, పరిశ్రమలు, సేవారంగం, స్థిరాస్తి వ్యాపారం తలసరి ఆదాయంలో మూడు రెట్లకు పైగా పెరుగుదల తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరాల్లో నల్లగొండ జిల్లా తలసరి ఆదాయం లక్ష రూపాయలలోపే ఉండేది. ప్రస్తుతం రూ.2.62 లక్షలకు పైగా చేరింది. – సాక్షి నెట్వర్క్ -
ఏఐ ఆధారిత బీటెక్తో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఏఐ ఆధారిత బీటెక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ‘ఏఐ ప్రోఫ్’సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పైళ్ల సాయిచరణ్రెడ్డి అన్నారు. ఏఐ ప్రోఫ్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఐటీ టవర్లో ఆదివారం నిర్వహించిన ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్కు ఆయన హాజరై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిశా నిర్దేశం చేశారు. నల్లగొండకు చంఎదిన సాందీప్ కోణం గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఇవ్వాలన్న సంకల్పంతోనే ఈ ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థుల ఆశలను నిజం చేస్తూ వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏఐ ప్రోఫ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అజ్మీర భానుప్రకాష్, కోణం ఫౌండేషన్ ప్రతినిధులు స్నేత, నవ్య, శ్రీనివాస్, అంజి, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. -
నీరు పెరుగుతోంది.. ధాన్యం కొనండి సారూ..!
శాలిగౌరారం : మండలంలోని రామగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాలిగౌరారం ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభమయ్యింది. దీనికి తోడు మిల్లర్ల పేచీలు, హమాలీ, లారీల సమస్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఈనెల 24 నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి మూసీనది ఎగువనుండి వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరిగి.. ధాన్యం రాసులకు సమీపిస్తోంది. ప్రాజెక్టు ఆవరణలోని కొనుగోలు కేంద్రంలో సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం రాశులు నిల్వ ఉన్నాయి. చేతికి అందిన పంట సకాలంలో కొనుగోళ్లు జరగక.. ఎక్కడ ప్రాజెక్టు నీట మునిగి పోతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శాలిగౌరారం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి సుమారు రెండు నెలలు కావస్తోంది. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టులోకి మూసీ నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ధాన్యం రాసులు ప్రాజెక్టు నీటిలో మునిగిపోతాయేమోనని భయమేస్తోంది. ఇప్పటికై నా అధికారులు వేగంగా కొనుగోలు జరిగేలా చూడాలి. – మాద నర్సింహ, రైతు, రామగిరి -
పంటలకు మద్దతు ధర కల్పించాలి
నల్లగొండ టౌన్ : పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆదివారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఎరువుల ధరలను పెంచుతూ సబ్సిడీలు ఎత్తివేయడం వల్ల రైతులకు పెట్టుబడి పెరిగి రైతుల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, రామచంద్రు, పండు వెంకటేశ్వర్లు, కోశాధికారి దుర్గయ్య, జక్కల నరసింహ, కార్యదర్శి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఈఓ భిక్షపతి బదిలీ
నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యా శాఖాధికారి బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలికట్టంగూర్ : భూగర్భ జలాల పెంపునకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జల్ సంచాయ్, జన్ భాగీదారి పనుల ఆన్లైన్ నమోదును ప్రక్రియను పరిశీలించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. సమావేశంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్రావు, ఎంపీఓ స్వరూపారాణి, సూపరింటెండెంట్ చలపతి, కార్యదర్శులు పెద్దయ్య, అశోక్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అగ్నివీర్కు ఎన్జీ కాలేజీ విద్యార్థులు ఎంపికరామగిరి(నల్లగొండ) : ఇండియన్ ఆర్మీ తాజాగా విడుదల చేసిన అగ్నివీర్ ఫలితాల్లో ఎన్జీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఎంపికయ్యారు. కళాశాలకు చెందిన కె.మహేష్, కె.గణేష్, ఎస్.జయప్రకాశ్, పి.అనిల్, కె.మనోజ్కుమార్ కఠినమైన శారీరక, రాత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజయం సాధించడంపై లెఫ్టినెంట్ సిహెచ్.సుధాకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలిరామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ ఉద్యోగులను ఈ నెల 2వ తేదీన ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్ఆర్సి.రాజు, విఎస్.రెడ్డి, డిఎం.రెడ్డి, కెఎల్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టాంప్ కష్టాలు
మిర్యాలగూడ : నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. నల్లగొండ జిల్లా పరిధిలో నాలుగు నెలలుగా రూ.20, రూ.100 విలువ గల నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు, న్యాయవాదులు, డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో స్టాంప్ పేపర్లు దొరకక ప్రభుత్వ, ప్రైవేట్ పనులు నిలిచిపోతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోతున్న పనులు.. ప్రస్తుతం సాధారణ అఫిడవిట్లు, వివిధ రకాల వ్యాపార ఒప్పంద పత్రాలు, బ్యాంకు రుణాలు, అగ్రిమెంట్లు, కోర్టు సంబంధిత లీగల్ పత్రాల తయారీ కోసం రూ.20, రూ.100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అత్యంత కీలకం.జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో ఈ పేపర్లు లభించకపోవడంతో ప్రజలు గంటల తరబడి స్టాంప్ విక్రేతల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పనులు ఉన్న వారు పొరుగున ఉన్న ఇతర జిల్లాలకు వెళ్లి అదనపు ఖర్చులతో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కృత్రిమ కొరత... బ్లాక్ మార్కెట్ హవా జిల్లాలో సుమారు 200 మంది స్టాంప్ వెండర్లు ఉన్నారు. ప్రస్తుతం బాండ్ పేవర్ల కొరతను ఆసరాగా చేసుకోని కొందరు స్టాంప్ వెండర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రూ.100 స్టాంప్ పేపర్లను నిబంధనలకు విరుద్ధంగా రూ.200 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బహిరంగ దోపిడీ జరుగుతున్నా సంబంధిత రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పర్యవేక్షణ లోపమే కారణమా.. తెలంగాణ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిక ఆన్లైన్ పోర్టల్లోనూ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్టాక్ చాలా తక్కువగా చూపిస్తుందని స్టాంప్ వెండర్లు పేర్కొంటున్నారు. పైనుంచి సరఫరా వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని, దానికి తోడు జిల్లా స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్య మరింత జటిలంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో నెలకొన్న స్టాంప్ పేపర్ల సంక్షోభంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని న్యాయవాదులు, డాక్యుమెంట్ రైటర్లు కోరుతున్నారు. ఫ నాలుగు నెలలుగా నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ల కొరత ఫ నిలిచిపోతున్న అగ్రిమెంట్లు ఫ బ్లాక్లో ఎక్కువ రేటుకు విక్రయాలు ఫ పట్టించుకోని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కనగల్ : చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మాణ పనులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలకు చదువును దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ ఎంజీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టలేదని విమర్శించారు. తాను హెలికాప్టర్లో, కారులో, బండిమీద ఎలా తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఎంజీ యూనివర్సిటీని చేశామని.. ఇప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందన్నారు. యూనివర్సిటీలో ఫార్మసీ, ఎల్ఎల్బీ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ధర్వేశిపురం నుంచి కనగల్ –గుర్రంపోడు–దేవరకొండ మీదుగా డిండి వరకు రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీల్లో కనగల్ –గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, చిట్ల వెంకటేశంగౌడ్, ఎంపీడీఓ వేదరక్షిత, ఎంపీఓ సతీష్, సర్పంచ్ నర్సింగ్ మురళీధర్గౌడ్, ఆర్టీఏ నెంబర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీసీ నర్సింగ్ కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ కనగల్లో జూనియర్ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన -
నేరాల నియంత్రణకు నిరంతర తనిఖీలు
నల్లగొండ : నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తారని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఆయన శనివారం అర్ధరాత్రి నల్లగొండలో నాకా బందీ నిర్వహించి వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నాఖాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారని వెల్లడించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్ -
ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత
నల్గొండ జిల్లా: తల్లిదండ్రులు రేణుకా ఎల్లమ్మ పండుగ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి కుమార్తె మధ్యాహ్నం సమయంలో సరదాగా తోటి పిల్లలతో ఈత కొట్టేందుకు వెళ్తుండగా తల్లిదండ్రులు వద్దని వారించిన వినలేదు. బాలిక గుంత లోతు గమనించక ఈత కొడుతూ కొంత దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్లంకానిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మగూడెంలో ఆది, సోమవారాల్లో గంగదేవమ్మ పండగ నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ముందు రోజు శనివారం గ్రామానికి చెందిన ఎలుక శంకర్, కల్పన దంపతులు ఇంట్లో రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. వారు ఈ పనుల్లో నిమగ్నం కాగా.. వారి కుమార్తె హారిక(13) గ్రామ శివారులోని నీటి గుంతలో ఈత కొట్టేందుకు తన అన్న గణేష్, తన మేనత్త కుమార్తె, కుమారుడితో కలిసి గ్రామ శివారులో రైతులు పొలాల దిగువ భాగంలో నీటి నిల్వ కోసం తీసిన పెద్దగుంత వద్దకు వెళ్లారు. గుంత లోతు ఎక్కువగా ఉండటంతో గమనించని హారిక ఈత కొడుతూ దూరంగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. హారిక అన్న గణేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఈ విషయాన్ని గణేష్ తన తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో నకరేకల్ ఫైరింజన్ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. హారిక చిన్నపురిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎవరెస్ట్పై అడుగు
సాక్షి, యాదాద్రి : ఫ ఎత్తుకు పోయిన కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది ‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతారోహణ కేవలం ఒక సాహస యాత్ర మాత్రమే కాదు, అది ప్రకృతి.. మనిషికి విసిరే అతిపెద్ద సవాలు. దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా శారీరకంగా, మానసికంగా శిక్షణ పొందాలి’ అంటున్నారు భువనగిరి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి. ఇటీవల హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఎవరెస్ట్ అధిరోహణలో ప్రాణాలు కోల్పోవడం.. ఆయన పార్థివదేహాన్ని అక్కడే వదిలేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. 2022 మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి అప్పటి తన అనుభవాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ఫ డెత్ జోన్లో ప్రాణాలకు పెనుముప్పు ఫ పర్వతారోహణకు ముందు సరైన శిక్షణ తీసుకోవాలి ఎవరెస్ట్ అధిరోహకురాలు పడమటి అన్వితారెడ్డి -
ప్రమాదాలను ఇలా అధిగమించాలి..
పర్వతాలపై ప్రకృతి మన నియంత్రణలో ఉండదు. ప్రధానంగా తీవ్రమైన చలి వల్ల చేతులు, కాళ్ల వేళ్లకు రక్తం ప్రసరించదు. వేళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. ఒకవేళ మొద్దుబారినట్లు అనిపిస్తే వెంటనే కింది క్యాంపునకు దిగిపోవాలి. అనుభవజ్ఞులైన ‘షెర్పా’ గైడ్ల పర్యవేక్షణలోనే ఉండాలి. అక్కడ ఒక అగ్గిపెట్టె బరువు కూడా వంద కిలోలుగా అనిపిస్తుంది. అనవసరమైన బరువులు లేకుండా శరీరాన్ని సిద్ధం చేసుకుని వెళ్లడమే సురక్షితం. 8వేల మీటర్ల ఎత్తు తర్వాత ఆక్సిజన్ స్థాయి 5 నుంచి 10 శాతం మాత్రమే. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాన్ని డెత్ జోన్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు సరిగా ఉపయోగించాలి. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. 2015, 2019లో మంచు చరియలు విరిగిపడి ఎంతో మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు.పార్థివ దేహాలను అక్కడే వదిలేస్తారు -
ఉద్యోగాలను రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా భర్తీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను వెంటనే రద్దు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంజీయూ విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ జిట్టా బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తెలిపారు. రోస్టర్ పాటించకుండా పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నాయకులు పొలగోని శివ, రాజేష్, యశ్వంత్, రామ్, జితేందర్, సంజీవ, నిరుద్యోగులు తదితరులు ఉన్నారు. -
‘సర్’ వేగవంతం చేయాలి
చిరుచేతుల్లో సృజనాత్మకత మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.ఆర్థిక సాధికారతే లక్ష్యం వికలాంగుల ఆర్థిక సాధికారతే లక్ష్యమని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. - 8లోశనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026జల సంరక్షణ అందరి బాధ్యతపెద్దఅడిశర్లపల్లి : జల సంరక్షణ అందరి బాధ్యత అని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని తిరుమలగిరిలో జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ బెల్లి కృష్ణమ్మఆంజనేయులు, ఎంపీడీఓ చంద్రమౌళి, ఎంపీఓ శేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం నల్లగొండలోని కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. నేడు ప్రత్యేక ప్రజావాణినల్లగొండ : నల్లగొండలోని కలెక్టరేట్లో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశారన్ని దివ్యాంగులు, వృద్ధులకు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మీసేవ కేంద్రాల్లో వేగవంతమైన సేవలుమాడుగులపల్లి : మీసేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని ఈడీఎం చల్లా దుర్గారావు అన్నారు. శుక్రవారం ఆయన మాడుగులపల్లి మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆన్లైన్ సేవలు, ధ్రువపత్రాలు, స్టేషనరీని పరిశీలించి.. కేంద్రంలో సేవలు సకాలంలో అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవ కేంద్రాల్లో ప్రజలు చేశాక.. ప్రక్రియ పూర్తి కాగానే ఆన్లైన్లోనే నేరుగా ధ్రువీకరణ పత్రం అప్లోడ్ అవుతుందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ, మీసేవ కేంద్రం నిర్వాహకులు ఉన్నారు. పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం 340 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు కళాశాల కోఆర్డినేటర్ సీహెచ్.నరసింహారావు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో సమయానికి హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ఎ.వెంకటేశ్వర్లు, అజయ్కుమార్, నరేందర్, నజీమొద్దీన్, రవీంద్ర, వీరేశ్నాయక్, చంద్రశేఖర్, ఇద్దయ్య పాల్గొన్నారు. స్తంభించిన ఆర్టీఏ సేవలు నల్లగొండ : నల్లగొండలో ఆర్టీఏ సేవలు నిలిచిపోయాయి. పట్టణంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, వడగళ్ల వానతో కలెక్టరేట్ పక్కన ఉన్న ఆర్టీఏ కార్యాలయ రోడ్డులో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. దీంతో డీటీసీ వాణి ఆర్టీఏ కార్యాలయ సేవలను శుక్రవారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం స్లాట్ బుకింగ్లు శనివారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆర్టీఏ సేవలు నిలిచిపోవడంతో లైసెన్స్లు, పిట్నెస్ ఇతర సేవల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఫ చదువుకునే వయస్సులో బాలికలకు పెళ్లిళ్లు ఫ ఆడపిల్లను భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు ఫ అధికారులు అడ్డుకుంటున్నా మారని తీరు ఫ మూడు ముళ్లలో బందీ అవుతున్న బాల్యం అడ్డుకున్న బాల్య వివాహాలు, కేసుల వివరాలు..సంవత్సరం అడ్డుకున్నవి కేసులు 2026 34 06 2025 73 16 2024 25 11 2023 38 13 2022 41 14 2021 42 12 2020 50 03 2019 30 03 2018 15 01 2017 09 01 పర్వతారోహణ ఒక కల. ఎవరెస్ట్ ఎక్కడానికి ఏప్రిల్, మే నెల అనువైనది. పర్వతారోహణకు కనీసం 6 నెలల ముందు నుంచే శిక్షణ తీసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, మెట్లు ఎక్కడం వంటివి రోజూ సాధన చేయాలి. వీపుపై 15 నుంచి 20 కిలోల బరువున్న బ్యాగ్ని వేసుకుని ఎత్తయిన ప్రదేశాల్లో నడవడం ప్రాక్టీస్ చేయాలి. తీవ్రమైన చలి, శారీరక అలసటను తట్టుకునేలా మానసిక దృఢత్వం సాధించాలి. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ఉండేలా శిక్షణ పొందాలి. పర్వతం ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి తగ్గుతుంది. శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడటానికి బేస్ క్యాంపుల వద్ద కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లాలి. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారంతా తగు జాగ్రత్తలు పాటించాలి.నల్లగొండ : కాలం మారుతున్నా.. సమాజం ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నా కొందరు తల్లిదండ్రుల ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. చదువుకోవాల్సిన వయస్సులో తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ వారి బాల్యాన్ని మూడు ముళ్లతో బంధిస్తున్నారు. బాలికలకు వివాహాలు చేస్తూ భార్యలు, తల్లులుగా మారుస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడో ఒకచోట బాల్యవివాహం జరుగుతూనే ఉండడం ఇందుకు నిదర్శనం. అడ్డుకున్నా.. ఆగట్లేదు! జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాలు అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ సమాచారం అందిన వెంటనే స్పందిస్తూ బాల్య వివాహాలను పెళ్లిపీటల మీదనే అడ్డుకుంటున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 357 బాల్య వివాహాలను అడ్డకున్నారు. కాగా చట్ట విరుద్ధంగా బాల్య వివాహాలు చేసినందుకు సంబంధికులపై పోలీస్ స్టేషన్లలో 2017 నుంచి ఇప్పటి వరకు 80 కేసులు నమోదయ్యాయి. మారని తల్లిదండ్రుల తీరు పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక ఆచారాలు, ఆడపిల్లల భద్రతపై భయాలు, బాల్య వివాహాలకు ప్రధాన కారణమవుతున్నాయి. ఆడపిల్ల భారమనే పాతతరం భావాల నుంచి బయట పడలేకపోతున్నారు కొందరు తల్లిదండ్రులు. మరికొందరు టీనేజీ ప్రేమలు, భద్రతా సమస్యల నెపంతో చట్టాలను పట్టించుకోకుండా చిన్న వయస్సులోనే బాలికలకు వివాహాలు చేస్తున్నారు. అధికారులు అడ్డుకుంటున్న వివాహాలు ఆగడం లేదు. అమరుల కుటుంబాలను ఆదుకుంటాం ఫ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మోత్కూరు : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అమరుల కుటుంబాలు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతోందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియామకమైన సందర్భంగా వారికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూరులో సన్మాన సభ నిర్వహించారు. ముందుగా అయిలమ్మ, శ్రీకాంతాచారి చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తొలి, మలిదశ దశ ఉద్యమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే పురుడు పోసుకున్నాయన్నారు. కాసోజు శంకరమ్మను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవమానిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెతోపాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియమించి తగిన గౌరవం ఇచ్చిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ గద్దర్ బిడ్డకు సైతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించిందన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా కళాకా రుడు గిద్ద రామనర్సయ్య బృందం ఆట, పాటలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, చౌటుప్పల్ డీఎస్పీ పి.మధుసూదన్రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్నేత, మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, మార్కెట్ చైర్పర్సన్ విమల తదితరులు ఉన్నారు.ఎవరెస్ట్ అధిరోహణలోప్రాణాలు కోల్పోతే.. మృతదేహాలను కిందికి తీసుకురాలేక, అక్కడే వదిలేస్తారు. కృత్రిమ ఆక్సిజన్ సహాయంతో ముందుకు సాగే సాహసకులు బరువును కోల్పోతారు. మైదాన ప్రాంతంలో పది కిలో మీటర్లు పరుగెత్తే వారు ఎవరెస్ట్ మీద ఆయాసంతో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి శవాలను తీసుకురావడానికి ముందుకు వచ్చే వారు తక్కువగా ఉంటారు. సాధారణ మనిషి బరువు 50 నుంచి 60 కిలోలు ఉంటే, వారి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సామగ్రి బరువు మరో 5 నుంచి 10 కిలోలు ఉంటుంది. ఎవరెస్ట్పై దారులు చాలా ఇరుగ్గా, లోయలతో ఉంటాయి. అడుగు అటుఇటు పడితే లోయల్లోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ దారుల్లో, ఒక మృతదేహం, లేదా ప్రమాదంలో చిక్కుకున్నవారిని కిందికి తీసుకురావాలంటే ఎంతో రిస్క్. ప్రస్తుతం ఎవరెస్ట్పై ఎక్కువ మరణాలు సంభవిస్తున్న ప్రాంతం ‘హిల్లరీ స్టెప్’. ఇక్కడ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి గానీ, తాడు కిందకి వేసి రక్షించడానికి గానీ వీలుండదు. ఎందుకంటే ఆ ఎత్తులో హెలికాప్టర్ ఎక్కువసేపు ఆగలేదు. సత్వర వైద్య సేవలు అందించాలి : కలెక్టర్నల్లగొండ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ద్వారా సత్వర సేవలందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆసుపత్రి పనితీరుపై శుక్రవారం తన ఛాంబర్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మానవనరులు, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గల కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్ నరసింహారావు నేత, డీసీహెచ్ డాక్టర్ మాతృ, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన బాలిక తల్లిదండ్రులు మరణించగా తాత సంరక్షణలో పెరిగింది. కట్నం తక్కువ తీసుకునే అబ్బాయిని చూసి ఆ బాలికకు పెళ్లి చేయాలని ఆమె తాత నిశ్చయించాడు. గతేడాది మేలో బాల్య వివాహం చేస్తుండగా సమాచారం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారులు చింతకుంట్లకు వెళ్లి అడ్డుకున్నారు. బంధువులు, బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను చింతకుంట్ల జెడ్పీహెచ్ఎస్లో చేర్పించి పదో తరగతి చదివించగా ఈ ఏడాది 416 మార్కులు సాధించింది. తన మనవరాలు మేజర్ అయ్యేంత వరకు పెళ్లి చేయనని ఆ బాలిక తాత పేర్కొన్నారు. వేములపల్లి మండలం రావులపెంటకు చెందిన బాలికకు తల్లిదండ్రులు బాల్య వివాహం చేయాలనుకున్నారు. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతోపాటు మంచి సంబంధం వచ్చిందని మధ్యవర్తి సంబంధం తేవడంతో గతనెలలో మొదటి వారంలో పెళ్లి నిశ్చయించారు. ఈ సమాచారం తెలిసిన ఐసీడీఎస్, బాలల సంరక్షణ అధికారులు బాలిక కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి గ్రామ సర్పంచ్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి గతనెల 9న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరిచారు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం సూర్యాపేటలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నల్లగొండ మండలం ఆర్జాలబావికి చెందిన ఓ బాలికకు తన కుటుంబ సభ్యులు ఆమెకు ఇష్టం లేకున్నా కనగల్ మండలం అజలాపురానికి చెందిన వ్యక్తితో బాల్య వివాహం చేయాలని చూశారు. ఈ ఏడాది మార్చి 6న బాలికకు వివాహం చేస్తున్నారని 1098కు ఫోన్ రావడంతో శిశు సంక్షేమ అధికారులు అక్కడకు చేరుకుని బాల్య వివాహం ఆపారు. అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ బాలిక నల్లగొండలోని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. -
శాలిగౌరారంలో లారీ డ్రైవర్లు, యజమానుల రాస్తారోకో
శాలిగౌరారం : శాలిగౌరారం అంబేద్కర్ చౌరస్తా వద్ద లారీ డ్రైవర్లు, యజమానులు శుక్రవారం ధాన్యం లోడుతో ఉన్న లారీని రోడ్డుకు అడ్డంగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లారీల యజమానులు, డ్రైవర్లు మాట్లాడుతూ ధాన్యం లోడుతో మార్కెట్యార్డుకు వచ్చి వారం రోజులకుపైగా నిరీక్షిస్తున్నామన్నారు. లారీలో అధిక లోడు ఉండటంతో టైర్లు దెబ్బతింటున్నాయని, దిగుమతులు చేపట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. మార్కెట్యార్డులో కనీసం మంచినీళ్లు కూడా లేవని, తిండిలేక డ్రైవర్లు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ట్రిప్పు కిరాయితో వారం రోజులు పైగా పడిగాపులు కాస్తుంటే లారీల ఫైనాన్స్ చెల్లించలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. లారీల డ్రైవర్ల రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవరావు, ఎస్ఐ సైదులు అక్కడికి చేరుకొని డ్రైవర్లు, యజమానులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు తహసీల్దార్ చేతులు పట్టుకొని మా ఇబ్బందులు తీర్చాలని వేడుకున్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
క్షణాల్లో మంటలు.. కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు!
సాక్షి, నల్లగొండ: డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారి-65పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘనటలో బస్సు క్షణాల్లో కాలి బూడిదైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం ప్రయాణికులందరినీ క్షణాల్లో బస్సు నుంచి బయటకు దించడంతో పెద్ద విషాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొద్ది సేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.ప్రయాణికుల కళ్లెదుటే ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఏ ట్రావెల్స్కు చెందింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. -
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది. -
మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్..
నల్గొండ జిల్లా: ‘మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్.. మీ వల్ల నరకం చూశాను.. అధిక వడ్డీకి అప్పులు తీసుకొని తీర్చలేకపోతున్నా.. నా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి’అని సూసైడ్ నోట్ రాసి వ్యవసాయాధికారి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కొన్నేళ్లుగా కేతేపల్లి క్లస్టర్ వ్యవసాయ శాఖలో ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ అవసరాలతోపాటు వ్యవసాయం చేసేందుకుగాను కొందరి వద్ద అప్పుగా డబ్బు తీసుకొని వాటిపై అధిక వడ్డీ భారం మోస్తూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా గురువారం ఉరుమడ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పుల మీద అప్పులు.. ఆత్మహత్యకు ముందు ఏఈఓ బాలరాజు తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో.. అప్పు ఇచ్చిన వారు ఫోన్ చేస్తూ ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో వ్యక్తితో కలిసి పదెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయగా రూ.3 లక్షల నష్టం వచ్చిందన్నాడు. అది పూడ్చుకునేందుకుగాను ఓ చిట్ఫండ్లో పనిచేసే ఏజెంట్ ద్వారా తన తోటి కౌలుదారుతో చిట్టీ వేయించానని, అందుకు తాను ష్యూరిటీ ఉన్నానని, అతడు చిట్టీ డబ్బులు పూర్తిగా కట్టకపోవడంతో రూ.5 లక్షలు చిట్ఫండ్ కంపెనీకి తానే కట్టాల్సి వచ్చిందని నోట్లో పేర్కొన్నాడు. ఈ భారం నుంచి బయటపడేందుకు.. తెలిసిన వ్యక్తుల ద్వారా మారి్టగేజ్ లోన్లు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని, వడ్డీలు కట్టలేక మరలా అప్పులు చేయాల్సి వచ్చిందని బాలరాజు వివరించాడు. అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న వారిని వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో కలెక్టర్, ఎస్పీలను కోరాడు. -
పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
మిర్యాలగూడ : మండలంలోని శ్రీనివాస్నగర్ గుమస్తాల కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం ఆయన.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని, ఈనెల 30లోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. శానిటేషన్, గదుల శుభ్రత, పెయింటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చివేయాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, డీఈలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పనుల పరిశీలన తిప్పర్తి : డబుల్బెడ్ రూం ఇళ్ల వద్ద మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని డబుల్బెడ్రూం ఇళ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇళ్ల వద్ద విద్యుత్, శానిటేషన్ తదితర పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ రాజ్కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ జ్యోతి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నీలగిరిలో గాలివాన బీభత్సం
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు వడగళ్లతో అరగంట పాటు కురిసిన వానకు జనం అతలాకుతలమయ్యారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా చోట్ల ఇళ్ల పైకప్పు లేయిపోయి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయం సమీపంలో ఓ ఇంటి పైనున్న హోర్డింగ్ విరిగింది. అయితే సగం విరిగి వేలాడుతున్న ఆ హోర్డింగ్ను తొలగించలేదు. మళ్లీ ఈదురుగాలి వస్తే జనాలపై పడే ప్రమాదం ఉంది. గొల్లగూడలోని శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమంలో భారీ వృక్షం నేలకూలింది. రహమత్నగర్ రోడ్డు వరద నీటితో నిండింది. కూలిన వ్యాపార సముదాయం.. కలెక్టరేట్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వెళ్లే దారిలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల పైకప్పు రేకులు లేచిపోయి దూరంగా పడ్డాయి. భారీ ఈదురుగాలులతో విద్యుత్ లైను తెగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని కాలనీలు రాత్రి వేళ అంధకారంలోనే ఉన్నాయి. -
రైల్వే కారిడార్గా దామరచర్ల
మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రం భవిష్యత్లో రైల్వే కారిడార్గా మారనుంది. 30 ఏండ్ల క్రితం దామరచర్ల మీదుగా నడికుడి – బీబీనగర్ రైల్వేలైన్ సింగిల్గా ప్రారంభం కాగా ప్రస్తుతం ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు ఆరు లైన్లుగా విస్తరించనుంది. ఇప్పటికే విష్ణుపురం స్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వరకు రెండు లైన్లు నిర్మించారు. నడికుడి – బీబీనగర్ మార్గంలో ఇప్పటికే సింగిల్లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు జరుగుతుండగా డబుల్ లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. విష్ణుపురం– మోటుమర్రి రైల్వే మార్గం సింగిల్ లైన్ ఉండగా ప్రస్తుతం రెండో లైన్ మంజూరైంది. ఇదిగాక దామరచర్ల వద్ద నడికుడి – బీబీనగర్ రైల్వేలైన్, విష్ణుపురం– మోటుమర్రి లైన్ను అనుసంధానం చేసే బైపాస్ లైన్ (5 కిలో మీటర్ల) ఇటీవల మంజూరు చేశారు. అధికారులు భూసేకరణ పూర్తి చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో దామరచర్ల వద్ద ఎటు చూసినా రైల్వే లైన్లు కనిపించనున్నాయి. ఈ ఆరు లైన్లు వినియోగంలోకి వస్తే దామరచర్లకు మూడు వైపులా ఆర్యుబీ (వంతెన కింద రహదారి) ద్వారానే గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కృష్ణానదిపై రైల్వే వంతెన.. నడికుడి – బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ (డబ్లింగ్) పనుల్లో భాగంగా వాడపల్లి వద్ద కృష్ణా నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 239 కిలో మీటర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు రూ.2,853 కోట్లు మంజూరు కాగా పనులు వేగంగా సాగుతున్నాయి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 50శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. మట్టికట్ట, కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. కృష్ణానదిపై వంతెన ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దామరచర్ల సమీపంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్కు విష్ణుపురం నుంచి 8కిలోమీటర్ల దూరం డబుల్ రైల్వేలైన్ను నిర్మించారు. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిత్యం 70వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. రోజుకు సరాసరి 15 ర్యాక్ రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీని వల్ల బొగ్గు గూడ్సు రైళ్లు నిత్యం తిరగనున్నాయి. వైటీపీఎస్ రైలు మార్గంలో రైళ్ల రద్దీ వల్ల ఈ ప్రాంతంలో రైలు కూత మర్మోగనుంది. ఫ చుట్టూ ఆరు రైల్వే లైన్ల నిర్మాణం ఫ మూడు వైపులా ఆర్యూబీ ద్వారానే గ్రామంలోకి రాకపోకలు -
ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
రామగిరి(నల్లగొండ) : ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగను సందర్భంగా నల్లగొండ పట్టణం మునుగోడు రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి వెంకట్రెడ్డితోపాటు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశ్వాసానికి, త్యాగ నిరతికి బక్రీద్ నిదర్శమన్నారు. దేశంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ ద్వేషాన్ని వీడండి – దేశాన్ని జోడించండి (నఫ్రత్ ఛోడో – భారత్ జోడో) అనే గొప్ప నినాదంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా నల్లగొండలో గంగా–జమునా తహజీబ్ తరహాలో రంజాన్, బక్రీద్, దసరా పండుగలను సోదరభావంతో జరుపుకుంటున్నామని చెప్పారు. త్వరలో భూమిని కేటాయించి షాదిఖానాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఏఎస్పీ రమేష్, డిప్యూటీ మేరకు ఎండీ.అష్రఫ్ అలీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.హఫీజ్ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు
రామగిరి(నల్లగొండ) : సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమల అవసరాలు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తోంది. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అనుబంధంగా కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సరికొత్త డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్వేర్, ఆటోమేషన్, అధునాతన మ్యాన్ఫ్యాక్చరింగ్ రంగాల్లో స్థిరపడటానికి అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ఐదు కళాశాలల్లో కొత్త కోర్సులు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (నల్లగొండ, సూర్యాపేట, తిరుమలగిరి, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట) ఉన్నాయి. నల్లగొండలో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, నాగార్జునసాగర్లో అడ్వాన్స్డ్ మ్యాన్ఫాక్చరింగ్ టెక్నాలజీ, సూర్యాపేటలో ల్యాండ్ స్కేప్ డిజైన్, తిరుమలగిరిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, యాదగిరిగుట్టలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈసారి అడ్వాన్స్డ్ కోర్సులకు అనుమతులు మంజూరయ్యాయి. టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఈ కొత్త కోర్సులతో కలిపి ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్ బుకింగ్, 29 నుంచి జూన్ 1 వరకు సరిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, జూన్ 6న కళాశాలల కేటాయింపు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త కోర్సులు ప్రారంభం కానుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. -
ప్రజలకు మరింత చేరువ కావాలి
రామగిరి(నల్లగొండ) : విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ రూరల్ పోలీస్స్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్టేషన్లో రికార్డులు, క్రైం ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరా పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామస్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తనిఖీలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు ఆదిరెడ్డి, రాఘవరావు, ఎస్ఐ సైదాబాబు, సిబ్బంది ఉన్నారు.ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక
నార్కట్పల్లి : టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్ రీజియన్ స్థాయి కార్యవర్గాన్ని గురువారం నార్కట్పల్లిలో ఎన్నుకున్నారు. రీజియన్ అధ్యక్షుడిగా కొర్ర లింగానాయక్, కార్యదర్శిగా పండి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా బండారు జానకిరాములును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్, బట్టు రాజయ్యనాయక్, బిబి.సింగ్ రాథోడ్, కావలి నిరంజన్, కడియం రమేష్, గాదె లక్ష్మయ్య, కె.శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు. సామూహిక పోరాటాలతోనే తెలంగాణ సాకారంమిర్యాలగూడ టౌన్ : సబ్బండ వర్గాల సామూహిక ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్ర సాకారమైందని సామాజికవేత్త, తొలి, మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ జాడీ రాజు అన్నారు. గురువారం స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవనంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులను గుర్తించి, గౌరవంగా సత్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులను సత్కరించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ నేత మాళోతు దశరథనాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, మాడుగుల శ్రీనివాస్, ధీరావత్ లింగానాయక్, క్రాంతికుమార్, బంటు వెంకటేశ్వర్లు, మురళియాదవ్, నాగేశ్వర్రావు, ఇక్బాల్, జయరాజు, నీలకంఠం, కిరణ్, కోల సైదులు, చిదేళ్ల సత్యనారాయణ, కృష్ణయ్య, లింగయ్య, గంధం సైదులు, చిలుకూరి శ్యాం, షోయబ్, నాగరాజు, మధుసూధన్, రాజ్కుమార్, ఎంవీఆర్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలి మర్రిగూడ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, పేదలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు భారంగా మారాయని అన్నారు. ప్రధాని మోదీ విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట చల్లం పాండురంగారావు, ఆర్.అంజయ్యచారి, నలభరాజు రామలింగయ్య, ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్, ఎరుకల నిరంజన్, ఆకుల రఘుమయ్య, జక్కలి అంజయ్య, కల్లెట్ల లింగయ్య, అయితగోని వెంకటయ్య, బాలకిషన్, అల్వాల్ నరసింహ, బోడ అంజయ్య, కృష్ణయ్య, నజీర్, యాదయ్య, రామచంద్రం, మహేందర్, శేఖర్ తదితరులు ఉన్నారు. -
15 నెలలుగా వేతనాల్లేక..
104 పథకంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సిబ్బందికి నెలనెలా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు అందించి ఆదుకోవాలి. అలాగే ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారిని జిల్లాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. – బైరగోని భిక్షం, పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, (ఐఎన్టీయూసీ 3194) జిల్లా అధ్యక్షుడు నల్లగొండ టౌన్ : ఔట్సోర్సింగ్ పద్ధతిన 104 పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 15 నెలలుగా వేతనాలు అందడం లేదు. గతంలో ఈ పథకాన్ని రద్దు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాల్లో సర్దుబాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 75 మంది ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు మూడేళ్ల క్రితం వరకు పనిచేశారు. ఇందులో 15 మంది రెగ్యులర్ అయ్యాయి. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన తర్వాత 104 సేవలు అవసరం లేదని నిలిపివేసింది. దాంట్లో అందులో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగాం జిల్లాలోని ఆస్పత్రులు, పీహెచ్సీలలో సర్దుబాటు చేసి వారందరిని అక్కడ విధులను నిర్వహించాలని ఆదేశించింది. దీంతో వారందరూ తక్కువ వేతనాలు అయినప్పటికీ బతుకుదెరువు కోసం ఆయా జిల్లాల్లో విధులను నిర్వహిస్తున్నారు. ఇందులో రెండేళ్ల వరకు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసిన 60 మందిని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) పరిధిలోకి తీసుకున్నారు. తక్కువ వేతనంతో వెట్టిచాకిరీ.. ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న 104 వాహన ఉద్యోగులకు విభాగాల వారీగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు ఉంటాయి. వేతనం తక్కువ అయినప్పటికీ విధిలేక ఇతర జిల్లాలో పనిచేస్తున్నా ప్రతినెలా ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు సుమారు పదిహేను నెలల నుంచి వేతనాలను ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తాము బస్సు కిరాయిలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కుటుంబ పోషణకు నెలనెలా అప్పులు చేసి నెట్టుకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలనెలా వేతనాలు అందేలా చూడాలని సిబ్బంది కోరుతున్నారు. ఫ ఆర్థిక ఇబ్బందుల్లో 104 సిబ్బంది ఫ పథకాన్ని రద్దు చేసినా ఇతర జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు ఫ ప్రస్తుతం డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న 60 మంది -
ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తాం
మునుగోడు : రానున్న ఐదేళ్లలో మునుగోడు మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామని డీసీసీబీ మాజీచైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నా రు. రూ.7.5కోట్ల నిధులతో బి.వెల్లెంల ఉదయ సముద్రం నుంచి మండలంలోని పులిపలుపుల, కల్వలపల్లి గ్రామాలకు సాగు నీరు అందించే కాల్వ నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు మండలంలోని చెరువులన్నీ నింపి రైతుల కళ్లల్లో ఆనందం నింపేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే కిష్టాపురం చెరువు వరకు కాల్వ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారా యణ, బీరెల్లిగూడెం, పులిపలుపుల, గంగోనిగూడెం సర్పంచ్లు దాసరి గోవర్ధన్, కమ్మంపాటి జ్యోతివెంకటేశ్వర్లు, గోపగోని పాపయ్యగౌడ్, బొల్గూరి నర్సింహ, సయ్యద్, ముక్తార్, పాష పాల్గొన్నారు. -
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ : బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లాలోని ముస్లింలకు బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. కాగా నేడు నల్లగొండలో ఈద్గా వద్ద జరిగే బక్రీద్ వేడుకలకు మంత్రి హాజరు కానున్నారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి : గుత్తా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులునల్లగొండ : నల్లగొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఉద్యోగులకు జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పు రాంబాబు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. 29న జాబ్మేళా నల్లగొండ : నల్లగొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఐటీఐ క్యాంపస్లో ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించుటకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ :7893420435 నంబర్ను సంప్రదించాలని కోరారు. ధాన్యం దిగుమతికి లారీల బారులుకొండమల్లేపల్లి : మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని సాయిలక్ష్మీ పారా బాయిల్డ్ రైస్ మిల్లు వద్ద వరి ధాన్యం దిగుమతి (అన్ లోడింగ్) కోసం లారీలు రోడ్డుపై బారులుదీరాయి. ప్రస్తుతం మిల్లు ఎదుట రోడ్డుపై ఆరు లారీలు, మిల్లు లోపల 10కి పైగా లారీలు ధాన్యం లోడుతో దిగుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో కొన్ని లారీలు వారం క్రితం రాగా, మరికొన్ని మూడు రోజుల క్రితం, ఇంకొన్ని గత రాత్రి కురిసిన వర్షంలో తడుస్తూ ఇక్కడికి చేరుకున్నాయి. మిల్లులోని గోదాములు నిండిపోవడమే దిగుమతి ఆలస్యానికి ప్రధాన కారణమని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి త్వరగా ధాన్యాన్ని దిగుమతి చేయించాలని డ్రైవర్లు, రైతులు కోరుతున్నారు. యాదగిరీశుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవను జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలను నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజను చేపట్టారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులను అలంకరించి, వివిధ సుగ్రంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు, తులసీ దళాలతో శ్రీస్వామి వారికి లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు. -
మెరుగైన సేవలు అందించాలి
నల్లగొండ : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిపాలన, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్రైమ్ ప్రాపర్టీ రూమ్లో భద్రపరిచిన కేసు సంబంధిత వస్తువులు, స్వాధీనం చేసుకున్న సామగ్రి, వాహనాలను శాసీ్త్రయ పద్ధతిలో భద్రపరచాలని తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులు, స్టేషన్ సిబ్బందితో సమావేశమయ్యారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనునాయక్, టూటౌన్ ఎస్ఐ సైదులు ఉన్నారు. -
మొక్కలంటే లెక్కలేదా
కొండమల్లేపల్లి : వర్షాకాలంలో చేపట్టే వన మహోత్సవానికి మొక్కలు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. కొండమల్లేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో గల నర్సరీల్లో మొక్కల పెంపకంపై నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుమ్మడవల్లి, దేవరోనితండా గ్రామ పంచాయతీల్లోని వన నర్సరీలో మట్టినింపిన సంచుల్లో గింజలు పెట్టినా మొలకెత్తలేదు. వాటిల్లో మళ్లీ గింజలు పెట్టాల్సి ఉన్నా అలాగే వదిలేశారు. మరికొన్ని కవర్లలో మట్టినింపి ఖాళీగా ఉంచారు. గుమ్మడవల్లి గ్రామ పంచాయతీకి, దేవరోనితండా కార్యదర్శి ఇన్చార్జిగా ఉండడం వల్ల ఈ రెండు నర్సరీలను నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలా తయారైందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
రామగిరి (నల్లగొండ) : బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు నిర్వహించనుందని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా ప్రాంగణాన్ని బుధవారం ఎస్పీ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలకు ముస్లింలు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి వసతి, పరిశుభ్రత తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులకు, ఈద్గాను శుభ్రం చేస్తున్న మున్సిపల్ వర్కర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, నీలగిరి నగర మున్సిపల్ డిప్యూటీ మేయర్ అమేర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్స్, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలోని ఈద్గా వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు ముస్తాబైన మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణం ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
నల్లగొండ : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్, జిల్లా సంక్షోభ కమిటీ చైర్మన్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి సంక్షోభ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పరిశ్రమల్లో ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రమాదాల సందర్భంగా ప్రాణ నష్టం జరగకుండా కార్మికుల భద్రతే ధ్యేయంగా ప్రతి శాఖ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల భద్రతలో భాగంగా ప్రతి కంపెనీ వారంలోగా సేఫ్టీ ఆడిట్ నివేదికలను సమర్పించాలన్నారు. వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ విజయకుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి పలు విషయాలను వివరించారు. సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ దామోదర్ సింగ్, ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగన్న, దుర్గాప్రసాద్, ఆర్డీఓ అశోక్రెడ్డి పాల్గొన్నారు. 6.96లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు రూ.1,663 కోట్ల విలువ చేసే 6,96,218 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్రెడ్డి హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఇంకా 46,312 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉందన్నారు. కాన్ఫరెన్స్లో ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల డీఎం రాంపతి నాయక్, డీఎస్ఓ వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
అభివృద్ధితోనే జీడీపీ పెరుగుతుంది
నల్లగొండ : గ్రామాల అభివృద్ధితో గ్రామీణ జీడీపీ (గ్రామీణ స్థూల జాతీయోత్పత్తి) పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులు, మహిళా సూపర్ బజార్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఏపీఓలు, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా 1.23 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. జిల్లాలో 17 ఎంపీడలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ లక్ష్యాల సాధనలో అధికారులు చూపుతున్న కృషిని ప్రశంసించారు. జిల్లాలో 941 గ్రామ సమాఖ్య భవనాలు, 14 ఫుడ్ స్టోరేజ్ గోదాముల నిర్మాణం చేపట్టడం శుభపరిణామన్నారు. సమష్టి నాయకత్వంతో గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్గానిక్ సాగువైపు అడుగులు వేయాలి స్వయం సహాయక మహిళా సంఘాలు కూడా ఆర్గానిక్ సాగు వైపు అడుగులు వేయాలని దాన కిషోర్ సూచించారు. రాష్ట్రంలో 8,029 ధాన్యం కేంద్రాలను స్వయం సహాయక మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రెండేళ్లలో మహిళా సంఘాలకు రూ.65 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి పాల్గొన్నారు. ఫ పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ -
నెలన్నర దాటినా..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వానాకాలం వ్యవసాయ సీజన్ దగ్గర పడుతోంది. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. అయినా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడం లేదు. లారీల కొరతతో నెలరోజుల క్రితం వచ్చిన ధాన్యం కూడా కల్లాల్లోనే ఉండిపోతోంది. దానికి తోడు కొందరు నిర్వాహకులే దళారులు అవతారం ఎత్తారు. కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనకుండా, తక్కువ ధరకు తామే కొనుక్కొని ఎక్కువ ధరకు మిల్లుకు విక్రయిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెనెలన్నర రోజులు దాటిపోయినా రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా? అంటూ ఎదురు చూడాల్సి వస్తోంది. మంగళవారం రాత్రి అక్కడక్కడా అకాల వర్షం పడడంతో ధాన్యం తడిచిపోయింది. మిగితా ప్రాంతాల్లోనూ అకాల వర్షాలు పడితే ధాన్యం తడిచిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్నది 6.96 లక్షల మెట్రిక్ టన్నులే.. జిల్లాలో 7.42 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం మార్కెట్కు వచ్చింది. అందులో 6.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా అంతకంటే ఎక్కువే ఉంటుందని రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ లారీల సమస్య తీరడం లేదు. 820 లారీలు పెట్టామంటున్న జిల్లా పౌరసరఫరాల విభాగం చెబుతున్నా, లారీలు రాకపోవడం వల్లే ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆవేదనఫ ఇంకా కొనుగోలు కేంద్రాల్లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఫ రోజుల తరబడి ఎదురుచూపులే.. ఫ గాలివానకు తడిచిపోతున్న ధాన్యం ఫ కాపాడుకునేందుకు అవస్థలు -
విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తాం : వీసీ
నల్లగొండ టూటౌన్ : సెనెట్ సభ్యుల సూచనలు సలహాలు మేరకు విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఎంజీయూ వైస్ చాన్స్లర్ (వీసీ) ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో మంగళవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన అకడమిక్ సెనెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో విద్య, ఆర్థిక అంశాలను సమీక్షించి ఆమోదించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక లెక్కలు, 2025–26కు సంబంధించిన డ్రాప్టు బడ్టెట్, రివైజ్డ్ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన డీన్, రిజిస్ట్రార్ నియామకాలు, పదోన్నతులు, అనుబంధ విద్యా విభాగాల బలోపేతానికి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి మరింత దోహదం చేయడానికి ఈ నిర్ణయాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. సమావేశంలో మాజీ వీసీ గంగాధర్, ప్రొఫెసర్లు కట్టా నర్సింహారెడ్డి, భాగ్యనారాయణ, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రొఫెసర్ శ్రీదేవి, రేఖ, ఆకుల రవి, అల్వాల రవి, అన్నపూర్ణ, ఉపేందర్రెడ్డి, హరీష్కుమార్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
నల్లగొండ : బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సమీప కాలనీల కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈద్గాలు, మసీదుల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, నల్లగొండ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అమేర్, ఎస్ఐలు సైదులు, లచ్చిరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నాలుగు గ్రామాల్లోవడగండ్ల వానశాలిగౌరారం : మండలంలోని వంగమర్తి, మాధారంకలాన్, ఇటుకులపహాడ్, పెర్కకొండారం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. అకాల వర్షం ధాటికి ఆయా గ్రామాల్లోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాధారంకలాన్లో అత్యధికంగా గంటన్నర సేపు వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వానాకాలం పంటల సాగుకు సిద్ధమయ్యే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేషపూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన జరిపారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
చిట్యాల : చిట్యాల పట్టణంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రెండో వార్డులో కురిసిన రాళ్ల వర్షానికి కూనూరు గాలమ్మ ఇంటి పైకప్పు రేకులు, పైపులు విద్యుత్ స్తంభాలపై పడడంతో వైర్లు తెగాయి. ఓ వేప చెట్టు విరిగి పడింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెండో వార్డుకే చెందిన వనం రేణుక, చింతపల్లి నరేష్, దండుగల లక్ష్మమ్మ ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. కోనేటి యాదయ్య స్లాబ్ చుట్టూ ఉన్న కంటే గోడ కూలి ట్రాక్టర్ మీద పడటంతో ఆస్తి నష్టం ఏర్పడింది. -
ఉచిత కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : రాష్ట్ర మైనార్టీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ఎంట్రెన్స్ టెస్టు రాసే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఉచిత కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజయేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మైనార్టీలుగా పరిగణించబడతారని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 31లోగా ఆన్లైన్ వెబ్సైట్ https://cet.cgg.gov.in/tmreis ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష జూన్ 14న నల్లగొండలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉటుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలను నిర్మూలిద్దాంనల్లగొండ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మహిళా వారోత్సవాల సందర్భంగా మంగళవారం నల్లగొండలోని రెడ్క్రాస్ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిషేధ చట్టం–2006పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల అనేక మంది బాలికల జీవితాలు అంధకామవుతున్నాయన్నారు. విద్యార్థులు తమ ప్రాంతాల్లో జరిగే బాల్య వివాహాలపై పోలీసులకు, అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియాను అతిగా ఉపయోగించకుండా, ఏఐ ఫొటో మార్పింగ్ వంటి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే దరఖాస్తు చేసుకోండి.. చదువుకు ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాలికల సమస్యలపై ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రణామం వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సందర్శించారు. వృద్ధులు క్యారమ్స్ ఆడుతుండగా ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సీడీపీఓ లావణ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ చింత కృష్ణయ్య, సభ్యులు భాస్కర్ వెంకన్న, డీసీపీఓ గణేష్ పాల్గొన్నారు. 30న ప్రత్యేక ప్రజావాణినల్లగొండ : నల్లగొండలోని కలెక్టరేట్లో ఈ నెల 30న దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిసున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి కేవీ.కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కరెంట్ కోతలు లేకుండా చూడాలి
నల్లగొండ టూటౌన్ : మండుతున్న ఎండలకు నీలగిరిలో ఏసీల వినియోగం పెరిగి తరుచూ ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అయి కరెంట్ పోతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అదనపు ట్రాన్స్ఫార్మర్లు త్వరగా మంజూరు చేయించి విద్యుత్ కోతల సమస్యను వెంటనే పరిష్కరించాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కార్పొరేటర్లు పలు సమస్యలను లేవనెత్తారు. 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ కరెంట్ కోతలతో తాగునీటి సమస్య ఏర్పడుతోందని, రూ.10 లక్షల వ్యయంతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభించాలని మేయర్ను కోరారు. 7వ డివిజన్ కార్పొరేటర్ మారగోని భవాని మాట్లాడుతూ వేలాడుతున్న కరెంట్ వైర్లతో మంటలు వస్తున్నాయని, పాత వైర్లు తొలగించి కొత్తవి అమర్చేలా చూడాలన్నారు. సెయింట్ ఆల్ఫన్సెస్ స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం మాట్లాడుతూ నగరంలోని వివిధ కాలనీల్లో పాత స్తంభాలు తొలగించి ఎత్తైన స్తంభాలు పాతాలన్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ రేగట్టే అండాలు లింగస్వామి మాట్లాడుతూ డివిజన్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, వాటిని నియంత్రించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కొత్త స్తంభాలు ఏర్పాటు చేయిస్తాం.. అనంతరం నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కరెంట్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ వైర్లు, కొత్త స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎజెండా అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటి మేయర్ అశ్రఫ్ అలీ (అమేర్), మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర, ఈఈ రాములు, కార్పొరేటర్లు మారగోని నవీన్గౌడ్, అల్లి సుభాష్యాదవ్, గోగుల గణేష్, దాసరి సాయి, అబ్బగోని కవిత, గుమ్ముల జానకి మోహన్రెడ్డి, పెరిక స్వాతి, యామ కవిత, గంట్ల అనంతరెడ్డి పాల్గొన్నారు. ఫ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య పెంచాలి ఫ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కార్పొరేటర్ల విజ్ఞప్తి ఫ సమస్యను పరిష్కరిస్తామన్న మేయర్ బుర్రి చైతన్య -
అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని ధర్నా
మిర్యాలగూడ టౌన్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడ మున్సి పల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ డీఈఈ వెంకన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణానికి చెందిన పేదల కోసం 565 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి డ్రా పద్ధతిలోనే కేటాయించి, ఇప్పుడు కేవలం 332 మందికే ఇళ్లు ఇస్తామనడం విడ్డురంగా ఉందన్నారు. మిగిలిన ఇళ్లను అధికార పార్టీ వారికి కేటాయించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అర్హులకు పింఛన్లు అందించాలని, పట్టణంలో ఇబ్బందిగా నిర్మించిన డివైడర్లను తొలగించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యడవల్లి శ్రీనివాస్రెడ్డి, అన్నబిమోజు నాగార్జునాచారి, ఎండి మగ్ధూం, కౌన్సిలర్లు ఎండి ఇలియాస్, పెద్ది శ్రీనివాస్గౌడ్, గడ్డం దీపిక, గుడిసె జానకమ్మ, లావూరి అరుణ, సందేశి రజని, సునిత, యరమళ్ల దీనేష్, లక్ష్మి, సీత, భిక్షం, అంజిబాబు, తిరుమలగిరి వజ్రం, షోయబర్, కోటేశ్వర్రావు, భూక్య రాంబాబు, ఆంజనేయరాజు, తిరుపతిరావు, ఈశ్వరాచారి, వినోద్, శ్రవణ్రెడ్డి, సంతోష్రెడ్డి, దైద సత్యం, మస్తాన్, వెంకటేష్, రామస్వామి, లక్ష్మీనారాయణ, మురళిచారి, అఖిల్నాయక్, రామావతారం, ఫయిజ్, రమేష్చారి పాల్గొన్నారు. -
క్వార్టర్స్ ఖాళీ చేయాలనడం అన్యాయం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెస్పీ క్వార్టర్స్లో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న ప్రజలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం సాగర్ డ్యాం పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఈఈ సీతీరాంకునాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్ రమేశ్జీ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎన్నెస్పీ క్వార్టర్స్లో నివాసముంటున్న ప్రజలను అకస్మాత్తుగా ఖాళీచేయాలంటూ నోటీసులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. 58,59 జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నివాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి సైదులు, మహ్మద్ ఘని, విజయ్, చంద్రమౌళినాయక్, కోడె విజయ్, ఆదాసు విక్రం, నరేష్, నజీర్, షరీఫ్, ఎస్కె.రఫీభాషా, శేఖరాచారి, లక్ష్మణ్నాయక్, కోదండం, ధార రవి తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన ఘనత..
విహారెడ్డి సాధించిన ఈ అంతర్జాతీయ విజయం వెనుక ఎన్నో కన్నీళ్లు.. అంతకుమించి కఠిన శ్రమ ఉన్నాయి. 2023లో జరిగిన ఒక టోర్నమెంట్లో ఆడుతున్న సమయంలో ఆమె కుడికాలికి గాయమైంది. గాయం నుంచి కోలుకోగానే పట్టుదలతో మళ్లీ సాధన మొదలు పెట్టింది. 2024లో జాతీయ పోటీల సమయంలో కాలి మడిమకు తీవ్ర గాయమైంది. ఆ గాయాన్ని జయించి రెట్టింపు పట్టుదలతో ఆటలోకి అడుగుపెట్టింది.విహారెడ్డి భవిష్యత్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ స్థాయిలో దేశానికి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే ఎఫ్ఐబీఏ ఆసియా కప్ అండర్–18 బాస్కెట్బాల్ టోర్నీలో భారతజట్టును విజేతగా నిలపడమే తన తదుపరి లక్ష్యమని విహారెడ్డి పేర్కొంది. రోజూ గంటల తరబడి సాధన చేస్తూ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటోంది. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో రాణించగలరని నిరూపిస్తోంది విహారెడ్డి.ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న దక్షిణాసియా క్వాలిఫయింగ్ అండర్–18 టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విహారెడ్డి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చింది. అంతకుముందు 2025 అక్టోబర్ బహ్రెయిన్లో నిర్వహించిన మూడో ఏసియా యూత్ గేమ్స్ బాస్కెట్బాల్ టోర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించింది. -
వానాకాలానికి ఎరువులు సిద్ధం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత యాసంగిలో రైతులకు ఎదురైన సమస్యలు వానాకాలంలో పునరావృతంగా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని పలు సంస్థల వద్ద యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచారు. వేర్హౌసింగ్ గోదాములు, హోల్సేల్ డీలర్లు, రిటైల్ డీలర్ల వద్ద 66,938 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచారు. ఎరువుల కోసం ఇండెంట్.. రానున్న వానాకాలం సీజన్లో 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో పత్తి 5,3,524 ఎకరాలు, వరి 5,86,137, కంది 14,000, సజ్జ 200, జొన్న 500, మొక్కజొన్న, పెసర 7,000, వేరుశనగ ఇతర పంటలు కలిపి మొత్తం 12,02,051 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేయనున్నట్లు అంచనాలు వేసింది. దీనికి అవసరంగా యూరియా 1.61 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 61,342 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 33,758 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 12,932 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 1,14,043 మెట్రిక్ టన్నులు అవసరంగా అంచనాలు వేసి గత నెలక్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రావాల్సిన ఎరువులను జూన్ మొదటి వారం నుంచి నెలనెలా రైతుల అవసరం మేరకు సరఫరా చేయనుంది. సీజన్ ముగిసే వరకు ప్రతి నెలాపంపించనుంది. ఫ గత యాసంగి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు సన్నాహాలు ఫ ప్రస్తుతం అందుబాటులో 66,938 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్న ఎరువులు ఇలా.. ఎరువు మెట్రిక్ టన్నులు యూరియా 30,023 డీఏపీ 3,238 ఎంఓపీ 2593 ఎన్పీకేఎస్ 29087 ఎస్ఎస్పీ 1863 యూరియా కోసం రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ను జూన్ మొదటి వారంలో రైతులకు అందుబాటులో ఉంచనున్నాం. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరం మేరకు మాత్రమే వాడాలి. అధిక మోతాదులో వాడితే నష్టం తప్ప లాభం లేదు. ఇప్పటికే నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాం. రైతులు నానో యూరియాను వాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
మహిళా సమాఖ్యకు సీఎం అభినందన
నల్లగొండ : రాష్ట్రంలోనే అత్యధికంగా 937 గ్రామ మహిళా సమాఖ్య భవనాలకు స్థల సేకరణ చేసి, 48 భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్యను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్గా 8 వేల మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవితో మాట్లాడారు. నెల రోజుల్లోనే 937 భవనాలకు స్థల సేకరణ ఎలా చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ జిల్లాలో 38 మండల సమాఖ్యలు, 1144 గ్రామ సమాఖ్యలు, మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో వేగంగా స్థల సేకరణ పూర్తి చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఉద్యోగాలు, ఉపాధి, విద్య కోసం వెళ్లే వారికి ఎంతో మేలు చేకూరుతోందని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఉచిత బస్సు పథకం వల్ల బాలికల చదువు మధ్యలో మానేసే పరిస్థితులు తగ్గాయన్నారు. గ్రామ సమాఖ్య సమావేశాల్లో పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెట్రోల్ బంకులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు ఆయనకు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని పోలీస్ అధికారులుకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పండువలా జరుపుకోవాలినల్లగొండ టౌన్ : ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగ జాతి పండుగలా జరుపుకోవాలని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ అన్నారు. నల్లగొండలోని టీఎన్జీవోస్ భవనంలో సోమవారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. తెలంగంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్నందున 9 శాతం రిజర్వేషన్ సదుపాయాలు మాదిగలు ఉపయోగించుకోవాలన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో నూతన జెండా గద్దెలను నిర్మించుకోవాలన్నారు. జూలై 7న మాదిగ జాతి పండుగగా జెండా పండుగ చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, జానకి రామయ్యచౌదరి, మల్లెపాక వెంకన్న, తరి ఏడుకొండలు, కురుపాటి కమలమ్మ, ఆడెపు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మేథమెటిక్స్ ప్రోగ్రాంకు ఎన్జీ విద్యార్థినుల ఎంపికరామగిరి(నల్లగొండ): సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మేథమెటిక్స్ ప్రోగ్రాంకు నల్లగొండ ఎన్జీ కాలేజీలో డిగ్రీ సెంకడ్ ఇయర్ చదువుతున్న కె. నవ్య, జె.శిరీష ఎంపికయ్యారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మేథమెటిక్స్ అండ్ కమిటీ ఫర్ ఉమెన్ ఇన్ మేథమెటిక్స్ సౌజన్యంతో ఇండియన్ ఉమెన్ అండ్ మేథమెటిక్స్ సహకారంతో హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్లో జూన్ 22 నుంచి జూలై 2వ తేదీ వరకు ఈ శిక్షణ జరగనుంది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు గణితం సబ్జెక్టుపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశం. ఐఐటీ, వివిధ రాష్ట్రాల సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించగా.. తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎన్జీ కాలేజీ నుంచి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, మేథమెటిక్స్ హెచ్ఓడీ వెంకట్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ మధుకర్, కనకయ్య, మతిన్ హుస్సేన్, బాల కార్తీక్ విద్యార్థినులను అభినందించారు. అకాల వర్షం.. రైతులకు నష్టం మర్రిగూడ : అకాల వర్షంతో అన్నదాతలు అతలాకుతలమయ్యారు. సోమవారం సాయంత్రం మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం కారణంగా రాంరెడ్డిపల్లి గ్రామంలో నక్క శ్రీనివాస్యాదవ్, నక్క బుగ్గరాములుతోపాటు రాజాపేటతండాకు చెందిన రాజయ్యకు పశువులపాకలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలగోని యాదయ్య, వడ్డె రమేష్కు చెందిన మామిడి, నిమ్మ చెట్లు నేలకొరిగాయి. అదేవిధంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, రహదారుల వెంట ఉన్న చెట్లు కూలిపోయాయి. మర్రిగూడ, శివన్నగూడ, ఖుదాబాక్షపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కె.నవ్యజె.శిరీష -
క్వార్టుర్లు ఖాళీ చేయండి
దశాబ్దాల క్రితమే ఈ క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని నివాసయోగ్యం కావని ఉన్నతాధికారులు నివేదికలు ఇచ్చి డిస్మెంటల్ చేయాలని సూచించారు. అయినప్పటికీ స్థానికులు తమ ఖర్చులతో మరమ్మతులు చేసుకుని ఇండ్లలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్ జలాశయంలో పూడిక తొలగింపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పనులకు వచ్చే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బందికి వసతి కల్పించేందుకు ఈ క్వార్టర్లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎన్నెస్పీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే మేమే లక్షల రూపాయలు ఖర్చు చేసి నివాస యోగ్యంగా మార్చుకున్న ఇండ్లను ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎంతవరకు న్యాయమని అంటూ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇప్పటికే నివసిస్తున్న కుటుంబాలకు శాశ్వాత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నందికొండ హిల్కాలనీ, పైలాన్కాలనీలో దశాబ్దాలుగా నివాసముంటున్న కుటుంబాలకు ఇళ్లు ఖాళీ చేయాలంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం క్వార్టర్లు కావాలని, నోటీసు అందిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలకు నివాసులు బాధ్యులవుతారని పేర్కొనడంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో హిల్కాలనీ, పైలాన్కాలనీ, కెనాల్స్, బండల క్వారీ, రైట్బ్యాంక్ ప్రాంతాల్లో సుమారు 4,800 క్వార్టర్లు నిర్మించారు. అప్పట్లో ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, కార్మికుల నివాసం కోసం ఈఈ, ఏఈ, ఏ, బీ, హెచ్ టైపు క్వార్టర్లను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా సుమారు ఏడు దశాబ్దాలు గడవడంతో అనేక క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోగా కొన్ని పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రసుతం హిల్కాలనీ, పైలాన్కాలనీలే ప్రధానంగా మిగిలాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీవో 58, 59 కింద అనేక క్వార్టర్లను నివాసితులకే విక్రయించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. పలువురు ప్రభుత్వానికి భారీ మొత్తాలు చెల్లించి రిజిప్ట్రేషన్ కూడా చేయంచుకున్నారు. మరికొందరు దరఖాస్తులు సమర్పించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోలను నిలిపి వేయడంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉండగా పాత క్వార్టర్లు నివాసయోగ్యం కాకపోవడంతో స్థానికులు తమ సొంత డబ్బులుతో లక్షలాధి రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. కొందరు పూర్తిగా పాడైపోయిన ఇండ్లను కూల్చివేసి కొత్తగా నిర్మించుకోగా మరికొందరు పాత గోడలను ఆధారంగా చేసుకుని ఆధునిక స్లాబులు వేసుకోని రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆ ఇండ్లకు పాత క్వార్టర్ల రూపమే లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకు నోటీసులు ఇవ్వడం ఏంటి, ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా బయటకు వెళ్లమంటే ఎక్కడి వెళ్లాలని అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి నివాసితుడికి ఇండ్ల హక్కులు కల్పిస్తామని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయమంటూ నోటీసులు రావడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతుంది. ఇప్పటికే హిల్కాలనీ, పైలాన్కాలనీల్లో సుమారు 50 కుటుంబాలకు నోటీసులు అందగా మరికొంత మందికి కూడా ఇవ్వడానికి అధికారులు సిద్దమవుతున్నటు సమాచారం. ఫ నందికొండలో ఇళ్లకు అధికారుల నోటీసులు ఫ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నివాసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇండ్లకు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం 50 ఇండ్లకు ఇచ్చాం. మరో 50 ఇండ్లకు ఇచ్చేందుకు సమాయత్తమయ్యాం. – ఏఈ విమల -
బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని క్లీయో స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ జిల్లా జట్లను సోమవారం ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. అండర్–11 విభాగంలో అన్షు శ్రీయన్, విదురు కృష్ణారెడ్డి, భవ్యన్షి, ఆరాధ్య, సంజన, అండర్ –13 విభాగంలో దీపక్నాయుడు, అద్వైత్రెడ్డి, కుషల్, శ్రయన్, సహాస్రార్షిత, చైత్రరెడ్డి, లోహిత, మనస్వీ, అండర్ –17 విభాగంలో అక్షిత్రెడ్డి, అభినవ్, చాణిక్య, చందన, రిదాహష్మి, శ్రీచైత్ర, యశస్విని, మసాదిక్ అలీ, అండర్–19 విభాగంలో అన్విత్ నిీహాల్రెడ్డి, అభినవ్, రోహిత్సాయి, వంశీ, తేజస్విని, మెన్ అండ్ ఉమెన్ విభాగంలో ప్రణిత్, అన్వీత్ నిహాల్రెడ్డి, చందన, పూజిత ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జి.అంజయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రశాంత్, నవీన్కుమార్ తెలిపారు. జిల్లా జట్లల్లో ప్రతిభను కనబరిచిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధుబాబు, సికిందర్రెడ్డి, గంజి శ్రీనివాస్, జిల్లా కోచ్ రామకృష్ణ తదితరులున్నారు. -
ఆపదమిత్రలు గ్రామాల్లో సేవలు అందించాలి
నల్లగొండ టూటౌన్ : యువ ఆపదమిత్రలు గ్రామాల్లో సేవలు అందించాలని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో యువ ఆపదమిత్రలకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. 31వ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు 300 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని విపత్తు నిర్వహణకు సంబంధించిన సైద్దాంతిక, ప్రాక్టికల్ శిక్షణ పొందారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఇంజరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రేఖ, శశిధర్రావు, మాధవరావు, మల్లయ్య, ఆశిష్ కుమార్, యూసుఫుద్దీన్, మచ్చేందర్, రాము, సీటీఓ నాగు నాయక్ పాల్గొన్నారు. -
గోడు వినండి.. గోస తీర్చండి
నల్లగొండ : అయ్యా.. మా గోడు వినండి.. గోస తీర్చండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్కు విన్నవించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. గ్రీవెన్స్లో రెవెన్యూ శాఖకు 46, ఇతర శాఖలకు 57.. మొత్తం 103 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరిస్తే ప్రజలకు సులభంగా ఉంటుందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, సీఎం కార్యాలయం నుంచి వచ్చినవి, ఇతర ఫిర్యాదులను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశానికి అవసరమైన నివేదికలను ఆయా శాఖలు తక్షణమే సీపీఓకు సమర్పించాలని చెప్పారు. అనంతరం యూనిక్ డిజెబిలిటీ ఐడీపై రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, సీపీఓ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజావాణిలో బాధితుల వినతులు ఫ ఫిర్యాదులు పరిష్కరించాలి : కలెక్టర్ -
శాలిగౌరారం ప్రాజెక్టులోకి మూసీ నీటి రాక
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టులోకి ఆదివారం ఎగువ నుంచి మూసీ నది వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ నదిపై యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ వద్ద నిర్మించిన హెడ్ రెగ్యూలేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి సుమారు 30 కిలోమీటర్ల పొడవు ఉన్న రాచకాల్వ ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం 5 అడుగుల దిగువన నీటి నిల్వ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మూసీనది ద్వారా ప్రవహించే ఆ నీటిని పల్లివాడ హెడ్ రెగ్యులేటర్ ద్వారా శాలిగౌరారం ప్రాజెక్టులోకి ఇటీవలే మళ్లించారు. ఈక్రమంలో ప్రాజెక్టు రాచకాల్వకు అనుసంధానంగా ఉన్న రామన్నపేట, నార్కట్పల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన పలు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. -
ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయొద్దు
నకిరేకల్ : అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్రావు ఏమి చేయాలో అర్థంకాక ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వంపై నిరంతరం తప్పుడు ప్రచారం చేయడం తగదని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. నెలా ఖారులోగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. ఆదివారం నకిరేకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిస్తూనే ఉన్నామని తెలిపారు. కేవలం రాజకీయం చేయాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని అబద్ధాలు, తప్పుడు అంకెలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘సెలవు రోజుల్లో కూడా మా ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు చేస్తున్న విషయం నిజం కాదా’ అని ప్రశ్నించారు. ‘మీ హయాంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేశారని, మేము మాత్రం అలా చేయబోమని.. ప్రతి పక్షం ఉండాలి మా తప్పులు ఎత్తి చూపుతూనే ఉండాలి’ అని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇక్కడి ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గ వ్యాప్తంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కేలాష్ నేత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుత్తా మంజులమాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నూక కిరణ్యాదవ్, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్, గాజుల సుకన్య, దాసరి వీరార్జున్రెడ్డి, కందాల భిక్షంరెడ్డి పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
వర్షపు నీటిని ఒడిసిపట్టేలా..
ఇంకుడుగుంత నిర్మించుకుని నీటిని ఒడిసి పట్టుకుంటే నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. 200 గజాల విస్తీర్ణం దాటిన నివాస, వాణిజ్య భవనాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాలి. వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇంకుడు గుంత లేనివారికి నోటీస్లు జారీ చేస్తున్నాం. – బి.శరత్చంద్ర, నల్లగొండ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లగొండ టూటౌన్ : వర్షాలు కురిసినప్పుడు వరద నీరు వృథాగా పోకుండా నీటిని ఒడిసి పట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్యలు రాకుండా ఉంటాయని ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నల్లగొండ నగరంతోపాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాల్లో 200 గజాలకుపైగా విస్తీర్ణంలో ఇల్లు నిర్మించిన వారు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలనే నిబంధన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాల్లో మున్సిపల్ యంత్రాంగం ఇంకుడు గుంతల లెక్క తీస్తున్నారు. ఇంకుడు గుంతల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్మించుకోని ఇళ్ల వారికి ఇంకుడు గుంత తీయాలని మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేస్తున్నారు. నీటి ఎద్దడి రాకుండా.. వేసవి కాలం దాటగానే సకాలంలో వర్షాలు పడకుంటే పట్టణాల్లో నీటి ఎద్దడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పలుసార్లు పట్టణాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు నీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రధానంగా 200 గజాల విస్తీర్ణం దాటిన భవనాలు, అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య దుకాణాల సముదాయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తీయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంకుడు గుంతలు ఎన్ని ఉన్నాయి. లేనివి ఎన్ని భవనాలు ఉన్నాయనే వివరాలను మున్సిపల్ సిబ్బంది సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. 70 శాతం వరకు భారీ భవనాలున్నా.. మున్సిపాలిటీల్లో ఇంకుడు గుంతలు తీయాలనే నిబంధన కచ్చితంగా ఉంటుంది. గత పుష్కర కాలం నుంచి వర్షాలు భారీగానే కురువడంతో ఇంకుడు గుంతలపై ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది. కొన్నేళ్ల నుంచి చేపట్టిన నిర్మించిన భవనాల్లో ఇంకుడు గుంతలు చాలా తక్కువ మంది తీసినట్లు మున్సిపల్ యంత్రాంగం పరిశీలనలో వెల్లడవుతుంది. దాదాపు 70 శాతం మంది భారీ భవనాలు ఉన్నా ఇంకుడు గుంతలు మాత్రం తీయించలేదు. దాంతో 200 గజాలు దాటిన భవనాలు, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా వాటిల్లో ఇంకుడు గుంతలు లేవనే చెప్పాలి. కాంక్రీట్ నిర్మాణంతో తగ్గిన భూగర్భ జలాలు.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంక్రీట్ నిర్మాణాలు భారీగా పెరిగిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు ప్రతి కాలనీల్లో కాంక్రీట్ రోడ్లు వేశారు. కాలనీల్లో ప్రజలు కూడా తమ భవనాలు ముందు శుభ్రంగా ఉండేలా సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించుకున్నారు. భారీ వర్షాలు కురిసినా వరద నీరు దిగువకు వెళ్తుంది తప్ప భూమిలోకి ఇంకిపోయే పరిస్థితులు లేక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇళ్లలోనూ బోర్లు సైతం ఎండిపోతున్నాయి. దాంతో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు, ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ పట్టణాల్లో లెక్కలు తీస్తున్న మున్సిపల్ యంత్రాంగం ఫ 200 గజాల విస్తీర్ణం దాటిన ఇంట్లో విధిగా నిర్మించుకోవాలని నిబంధన ఫ నిర్మించుకోని వారికి నోటీసులు జారీ -
157 మంది జెడ్పీ ఉద్యోగుల బదిలీ
నల్లగొండ : జిల్లా పరిషత్లో పనిచేసే వివిధ కేటగిరీలకు చెందిన 157 మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్ ద్వారా ఆదివారం బదిలీలు నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగుల సీనియారిటీ, ఖాళీల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్లో 39 మంది జూనియర్ అసిస్టెంట్లు, 22 మంది రికార్డు అసిస్టెంట్లు, 9 మంది టైపిస్టులు, 79 మంది అటెండర్లు, 8 మంది నైట్వాచ్మెన్లను ఖాళీల ఆధారంగా కోరుకున్న చోట బదిలీ చేశారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సిలింగ్లో జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
26న ముదిరాజ్ల సదస్సు
నల్లగొండ టౌన్ : ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో ముదిరాజ్ల సింహావలోకనం సదస్సు నిర్వహించనున్నట్లు ఆ వేదిక నాయకుడు, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. ఆదివారం నల్లగొండలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు సంబంధించి పిట్టల రవీందర్ రాసిన పుస్తకంతోపాటు, పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో కేశబోయిన శంకర్, కట్ల సైదులు, మేకల శ్రీహరి, సుదర్శన్, బాల్య, పి.శంకర్, అజయ్, శివ పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు కావాల్సిన జీలుగ, జనుము విత్తనాలను మిర్యాలగూడ పరిధిలోని నందిపాడు విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీకి సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, రైతు పరస్పర సెంటర్లలో జీలుగ 3,500 క్వింటాళ్లు, జనుము 500 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. పచ్చిరొట్టతో ప్రయోజనాలు పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల భూమి సారవంతంగా తయారవుతుంది. అధిక దిగుబడులు రావడంతోపాటు పెట్టుబడులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నేలలో సేంద్రియ పదార్థం పెరగడంతోపాటు నైట్రోజన్ స్థాయి సహజంగా అధికమవుతోంది. ఈ ఎరువులు వాడిన భూమి గట్టిదనం తగ్గి మెత్తబడుతుంది. మట్టిలో సూక్ష్మ జీవాల సంఖ్య పెరిగి మట్టి ఆరోగ్యంగా తయారవుతుంది. ధరలు ఇలా.. (కేజీ రూపాయల్లో..) పంట కేజీ సబ్సిడీ రైతు వాటా జీలుగ 163.50 81.85 81.75 జనుము 155.50 77.75 77.75పచ్చిరొట్ట ఎరువుల వాకంతో రసాయన ఎరువుల అవసరం తగ్గి సాగు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా సుస్థిర వ్యవసాయానికి దోహదపడనున్నాయి. రైతులు పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఫ 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేత ఫ సహకార సంఘాలు, ఆగ్రోస్ సెంటర్లో అందుబాటులో విత్తనాలు ఫ పంపిణీకి ఏర్పాట్లు చేసిన విత్తనాభివృద్ధి సంస్థ -
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
మిర్యాలగూడ టౌన్ : బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జి.అంజయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్ పిలుపునిచ్చారు. జూన్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు జిల్లా జట్టును ఎంపిక కోసం ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన బ్యాడ్మింటన్ పోటీలను వారు అధికారికంగా ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారుల్లో పట్టుదల, నిరంతర కృషి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారన్నారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జూన్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నవీన్కుమార్, జాయింట్ సెక్రటరీ గంజి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మధుబాబు, సికిందర్, కోశాధికారి శరన్కుమార్, జిల్లా కోచ్ రామకృష్ణ పాల్గొన్నారు. వైభవంగా యాదగిరీశుడి నిత్యకల్యాణ వేడుకయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో నిత్యకల్యాణ వేడుకను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆదివారం వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేశారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు. మట్టపల్లిలో నిత్యపూజలు మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి అమ్మవార్లకు అర్చకులు నిత్యపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలో మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం నిర్వహించి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
చిన్నారికి.. ఎంతకష్టం
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన నాలుగు నెలల పసికందు అక్షితకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మూ డు రోజులుగా చిన్నపిల్లల వార్డులో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి పరీక్షల కోసం ఎక్స్రే తీయాలని సూచించారు. చిన్నపిల్లల వార్డు నుంచి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఎక్స్రే కేంద్రానికి పాపను తీసుకెళ్లాల్సి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని, పసికందును ఎత్తుకొని మండుటెండలో నడుచుకుంటూ ఎక్స్రే కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అన్ని సేవలు ఒకేచోట అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ భజరంగ్ ప్రసాద్, నల్లగొండ -
ధాన్యం లారీల డ్రైవర్ల ఆందోళన
శాలిగౌరారం : సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా ధాన్యం లారీల్లోని బస్తాలను దిగుమతి చేస్తున్నారంటూ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ వద్ద శనివారం ధాన్యం లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. గోడౌన్ వద్ద లారీలను అడ్డుగాపెట్టడంతో ధాన్యం దిగుమతులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గోడౌన్ వద్దకు చేరుకొని లారీ డ్రైవర్లు, హమాలీలతో మాట్లాడారు. నకిరేకల్ డీటీసీఎస్ జ్యోతి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టారీతిన ధాన్యం దిగుమతులు చేయడంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని పలువురు లారీ డ్రైవర్లు తెలిపారు. మార్కెట్యార్డు పరిధిలో 217 మంది హమాలీలు ఉన్నా కేవలం 20 మంది మాత్రమే రావడం ఏమిటని డీటీసీఎస్ ప్రశ్నించారు. ఎండవేడితో పాటు దిగుమతుల డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే ఎవరూ రావడం లేదని హమాలీలు తెలిపారు. లారీలను సీరియల్ ప్రకారం దిగుమతి చేయాలని డీటీసీఎస్ ఆదేశించారు. దాంతో లారీ డ్రైవర్లు ఆందోళన విరమించారు. శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిలిచిన ధాన్యం దిగుమతులు -
గాలివాన బీభత్సం
పెద్దవూర : పెద్దవూర మండల కేంద్రంతో పాటు ఈదులగూడెం, సంగారం గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలోని వండర్కిడ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ భవనం పైనున్న రేకులు లేచిపోయి పక్కనే ఉన్న గ్రామపంచాయతీ భవనంపై పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందున్న రేకులు పగిలిపోయాయి. కట్టెబోయిన సైదులు ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. ఈదులగూడెం గ్రామానికి చెందిన లింగాల కోటయ్య, గుండెబోయిన రాములుకు చెందిన ఇంటికప్పు రేకులు లేచిపోయాయి. దీంతో ఇంట్లోని సామగ్రి తడిసిపోయింది. సంగారం గ్రామానికి చెందిన కంచర్ల శ్యాంసుందర్ ఇంటి పక్కన ఉన్న మర్రి చెట్టు కూలి ఇంటిపై పడటంతో గోడలు కూలిపోవడంతో పాటు ఇంటిపై కప్పు రేకులు పగిలిపోయి సామగ్రి ధ్వంసమైంది. ఏనేమీదిగూడెం గ్రామంలోని పీర్ల కొట్టం పైకప్పు రేకులు లేచిపోయి సమీపంలో పడిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సబ్ మార్కెట్ యార్డు సమీపంలో స్తంభం కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం
నల్లగొండ టూటౌన్ : యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో బహుమతులు ప్రదానం చేశారు. జాబ్మేళాలో ఎంపికై న యువతకు నియమక పత్రాలు అందజేసి మాట్లాడారు. దేశంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, యువతే దేశానికి గొప్ప వరమన్నారు. ఫిట్నెస్కు ప్రాధాన్యం పెంచే ఉద్దేశంతో ‘ఫిట్ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నల్లగొండలోని న్యాక్, సెట్విన్ సెంటర్, ఇందిరా మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు కెరీర్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఎంఎస్ఎంఈ ద్వారా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఎం కప్ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన హాకీ జట్టును అభినందించారు. అనంతరం క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోచ్ శంభులింగం తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఫిట్నెస్ లేకుంటే సీజ్ !
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కనీస ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూల్ బస్సులను రోడ్లపైకి వదిలితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 745 స్కూల్ బస్లు ఉండగా.. ఇప్పటి వరకు 254 బస్లు ఫిట్నెస్ పొందాయి. ఇంకా 491 బస్లు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. జూన్ 12 నాటికి అన్ని వాహనాలకు భద్రతా ప్రమాణాలు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఫిట్నెస్ తనిఖీలు ఇలా.. ఫిట్నెస్ తనిఖీల్లో భాగంగా బస్లకు బ్రేకులు, టైర్లు, లైట్లు, ఎమర్జెన్సి డోర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, భద్రతా పరికరాలను పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలకు ఫిట్నెట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. లోపాలున్న వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజీపడకుండా ప్రతి బస్కు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. డ్రైవర్లకు శిక్షణ సర్టిఫికెట్ ఉంటేనే.. సిరిసిల్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్కూల్ బస్లు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నారు. డ్రైవర్లు, రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతోపాటు విద్యార్థుల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేలా శిక్షణ ఇస్తున్నారు. అనుకోని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి.. ప్రమాదాల నుంచి విద్యార్థులను సురక్షితంగా ఎలా కాపాడాలని అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. సిరిసిల్లలో శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆ సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే స్కూల్ బస్లను నడిపేందుకు అర్హత పొందుతారు. ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. జరిమానా విధించడంతోపాటు బస్లు సీజ్ చేస్తాం. పిల్లల భద్రత విషయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. యాజమాన్యాలు తప్పనిసరిగా బస్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. –వాణి, జిల్లా రవాణాశాఖ అధికారిఫ జిల్లాలో 745 స్కూల్ బస్లు ఫ తనిఖీలు చేయించింది 254 మాత్రమే ఫ స్కూల్ బస్ డ్రైవర్లకు సిరిసిల్లలో శిక్షణ ఫ సర్టిఫికెట్ పొందిన వారికి మాత్రమే అనుమతి -
పారదర్శకంగా భూ విలువల సవరణ
నల్లగొండ : భూముల విలువల సవరణ ప్రక్రియను పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం హెదరాబాద్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఇక్కడ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ను బట్టి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి భూ విలువల సవరణ ఉంటుందన్నారు. మే 28 నాటికి విలువల సవరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్జే శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్నల్లగొండ : నల్లగొండలోని జెడ్పీలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, నైట్ వాచ్మన్ల బదిలీల కౌన్సిలింగ్ షెడ్యూల్ను జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ నెల 24న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ క్యాటరింగ్కు దరఖాస్తులురామగిరి(నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి హాస్టల్ క్యాటరింగ్ నిర్వహించేందుకు ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. దరఖాస్తు ఫారంలు కళాశాలలో తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులు జూన్ 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రోడ్డు పనులు చేపట్టాలని పాదయాత్ర మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం గూడూరు నుంచి బోట్యానాయక్తండా వరకు ఉన్న గుంతలమయంగా మారిన రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధర్యంలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భఃగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నడవడానికి కూడా వీలు లేకుండా అత్యంత దారుణంగా గుంతలమయమైన ఈ రోడ్డు మరమ్మతుల పనులు 10వ తేదీలోగా ప్రారంభించకుంటే ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు ఖరారైనప్పటికీ.. ఇప్పటివరకు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, రవినాయక్, పరుశురాములు, మల్లు గౌతంరెడ్డి, నూకల జగదీశ్ చంద్ర, సాగర్నాయక్, శ్రీను, కృష్ణయ్య, పిల్లుట్ల సైదులు, బొంగరాల వెంకటయ్య, మేక రాంబాబు, మంగా, కరీమున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నేత దారుణ హత్య.. అర్థరాత్రి హైటెన్షన్
సాక్షి, సూర్యాపేట: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సూర్యాపేట మండలం యర్కారంలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. మూడు ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. రాజకీయ హత్యలకు యర్కారం కేరాఫ్ అడ్రస్గా మారింది. కొన్నేళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యర్కారంలో హత్యకు గురైన మధు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు . ఆయన భార్య మౌనిక యర్కారం మాజీ సర్పంచ్. మధును హత్య చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లేనని మౌనిక ఆరోపిస్తున్నారు. తన భర్తను మిద్దె రవీందర్ కుమారుడితో పాటు మరో 15 మంది కలిసి హత్య చేసినట్టు చెబుతున్నారు.ఇదిగా ఉండగా.. సూర్యాపేట ప్రాంతంలో ఫ్యాక్షన్ గ్రామంగా యర్కారానికి పేరు. గ్రామంలో 1985 నుంచి ఇప్పటి వరకు హత్యకు గురైన వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది నాయకులు ఉన్నారు. తాజాగా హత్యకు గురైన చింతలపాటి మధు గతంలో జరిగిన ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. 2004లో జరిగిన మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. నిన్న రాత్రి 11-12 గంటల ప్రాంతంలో మధు హత్య జరిగింది. అత్యంత దారుణంగా కత్తులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. హత్య అనంతరం గోనె సంచుల్లో కుక్కి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. -
గే యాప్ పరిచయం.. యువకుడి దారుణ హత్య..!
కోదాడ: సోషల్ మీడియాలో ఓ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం యువకుడి హత్యకు కారణమైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన బల్గూరి గణేష్(20) ఈ నెల 15న హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సామాజిక మాధ్యమంలో ఉన్న ‘పోలో’ గే యాప్ కారణమని, హత్యకు కారణమైన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గణపవరానికి చెందిన బల్గూరి గణేష్కు, హుజూర్నగర్కు చెందిన బర్రెంకుల సోమేష్కు పోలో అనే గే యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఏకాంతంలో తీసుకున్న ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గణేష్ను చంపాలని సోమేష్ నిర్ణయించుకున్నాడు. దీనికి గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు పగిల్ల ఉదయ్కిరణ్ సాయం తీసుకున్నాడు. గణేష్ హత్యకు సోమేష్ పథకం వేస్తున్న విషయం తెలిసినప్పటికీ సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతి మిన్నకుండిపోయారు. ఈ నెల 15న రాత్రి పథకం ప్రకారం సోమేష్.. గణేష్ను గణపవరానికి సమీపంలో ఉన్న మామిడి తోట వద్దకు పిలిచాడు. ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అక్కడే ఉన్న సోమేష్ స్నేహితుడు ఉదయ్కిరణ్ సాయంతో గణేష్పై రాయితో దాడి చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. సంఘటన స్థలం నుంచి కత్తి, మొబైల్ ఫోన్లు ఇతర ఆధారాలను సేకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, మొబైల్ లొకేషన్లు పరిశీలించి నిందితులైన పగిళ్ల ఉదయ్కిరణ్, ప్రధాన నిందితుడైన సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతిలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్క పంపినట్లు ఆయన వెల్లడించారు. సోమేష్ పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో కోదాడ రూరల్ ఇన్చార్జీ సీఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్కుమార్, చింతలపాలెం ఎస్ఐ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం
బుధవారం ప్లాట్ రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకున్నా. గురువారం ఉద యం వచ్చా, సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. గంటల తరబడి సమయం పడుతోంది. సిబ్బంది సరిపోవడం లేదని చెబుతున్నారు. ఆలస్యమైనా చేస్తామంటున్నారు. ఎండకు కార్యాలయంలో తట్టుకోలేకపోతున్నాం. కనీసం మంచినీరు లేవు. – లింగయ్య, పారేపల్లిగూడెం భూముల ధరలు పెరుగుతుండటంతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చాం. గంటలకొద్దీ నిలబడాల్సి వచ్చింది. కూర్చోవడానికి కుర్చీలు లేవు. అందరు నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు ఎన్ని గంటలు నిలబడాలి. కనీసం మంచినీరు కూడా లేదు. గ్రామాల నుంచి వచ్చి ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. – విష్ణువర్ధన్, నల్లగొండ -
కొనుగోళ్ల వేగవంతానికి చర్యలు
పెద్దఅడిశర్లపల్లి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లారీల కొరతను తీర్చేందుకు హైవేలపై లారీలను ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గుడిపల్లి మండలంలోని చిల్కమర్రి వద్ద ఉన్న మిల్లును పరిశీలించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తక్షణమే తనకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌర సరఫరాల మేనేజర్ రాంపతినాయక్, తహసీల్దార్ జయశ్రీ, పీఏసీఎస్ సీఈఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తుల రిజిస్ట్రేషన్కు పాట్లు
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. త్వరలోనే ప్రభుత్వ భూముల విలువలు పెరగనున్నాయనే సమాచారంతో, ధరల భారం తప్పించుకోవడానికి జనాలు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడుతున్నారు. రెండు మూడు రోజుల్లోనే కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉండటంతో గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయం కొనుగోలుదారులు, డాక్యుమెంట్ రైటర్లతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు రద్దీ పెరగడం, మరోవైపు అధికారులు పెరగనున్న ధరల కసరత్తులోనే పూర్తిగా నిమగ్నమవ్వడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని వచ్చినప్పటికీ.. ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి అమ్మకం, కొనుగోలుదారులు 7 నుంచి 8 గంటల పాటు కార్యాలయంలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో పనులు ఆలస్యం ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. గత నెలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తనిఖీల తర్వాత ఇక్కడి నలుగురు అవుట్సోర్సింగ్ సిబ్బంది కాలపరిమితిని రెన్యువల్ చేయకుండా విధులకు దూరం పెట్టారు. మిగతా చోట్ల అవుట్సోర్సింగ్ సిబ్బంది కొనసాగుతున్నప్పటికీ, నల్లగొండలో మాత్రం వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆ అదనపు పనిభారమంతా ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పడుతోంది. తీవ్ర ఎండలు.. కనీస వసతులు కరువు.. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న తరుణంలో, కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేకపోవడం ప్రజల ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. జిల్లాలో ఎండ తీవ్రత 44 డిగ్రీలు దాటడంతో వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. పాత మున్సిపల్ భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్నా, కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. మూత్రశాలలు (వాష్రూమ్లు) లేకపోవడంతో మహిళలు, వృద్ధులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంపై పెట్టిన శ్రద్ధ, ఆ ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పెట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది కొరతను తీర్చి, కార్యాలయంలో వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు. ఫ అమ్మకం, కొనుగోలుదారులతో కిక్కిరిసిన నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఫ రిజిస్ట్రేషన్కు 7 గంటలకుపైగా నిరీక్షణ ఫ భూముల విలువ పెరుగుతుందని ముందే వస్తున్న జనం ఫ సిబ్బంది కొరతతో రిజిస్ట్రేషన్ల్లలో జాప్యం ఫ కార్యాలయంలో కనీస వసతులు లేక అల్లాడుతున్న ప్రజలు -
ఉదయసముద్రంలో మాక్ డ్రిల్
నల్లగొండ టూటౌన్ : ఆకస్మత్తుగా వచ్చే విపత్తును ఎలా ఎదుర్కొని బయట పడాలనే అంశంపై ఎంజీ యూనివర్సిటీకి చెందిన యువ ఆపద మిత్ర – ఎన్సీసీ క్యాడెట్లకు గురువారం పానగల్ ఉదయ సముద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా యువతను సమాజస్థాయి విపత్తు ప్రతిస్పందన బృందాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 31వ బెటాలియన్, ఎన్సీసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో పానగల్ ఉదయ సముద్రంలో మాక్డ్రిల్ నిర్వహించి గర్భిణులు, వృద్ధులు, పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న వారు అత్యంత సున్నిత మార్గాల ద్వారా ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఎలా ఇవ్వాలి, ఎలా రక్షించాలి, ఎలా సురక్షిత ప్రాంతానికి చేర్చాలి అనే అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 31వ బెటాలియన్ ఎన్సీసీ అధికారులు, లెఫ్టినెంట్ కల్నల్ శశిధర్రావు, సుబేదార్ మేజర్ మాధవరావు, సుబేధార్ కొమ్ము మల్లయ్య, ఏపీడీ హరీష్కుమార్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులు సాయిదీపక్, ఏఎన్ఓ మశ్చేందర్, రామునాయక్, నాగు, భాగ్యలక్ష్మి, శిక్షకులు శివకుమార్, తేజస్విని, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలు
నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి లను నియమించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజవర్గానికి చింతల వెంకటేశ్వర్రెడ్డి, నాగార్జునసాగర్కు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడకు మాజీ ఎంపీ లింగయ్యయాదవ్, హుజూర్నగర్కు కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడకు తిప్పన విజయసింహారెడ్డి, సూర్యాపేటకు ఇస్లావత్ రామచందర్నాయక్, నల్లగొండకు ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి, మునుగోడుకు వెంకటనారాయణగౌడ్, భువనగిరికి క్యామ మల్లేష్, నకిరేకల్కు గుజ్జా దీపిక యుగందర్రావు, తుంగతుర్తికి ఎలగందుల వెంకటేశ్వర్, ఆలేరు నియోజకవర్గానికి బండా నరేందర్రెడ్డిని సభ్యత్వ నమోదు ఇన్చార్జిలుగా నియమించింది. నల్లగొండకు నేడు మంత్రుల రాకనల్లగొండ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమానికి శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో సమీపంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ప్రజా పాలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 27 నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్నాగార్జునసాగర్ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం పాలిసెట్–2026 వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈనెల 27నుంచి ప్రారంభమవుతుందని సాగర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ఐలయ్య గురువారం తెలిపారు. సాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 27 నుంచి 31వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుంచి జూన్3 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్తో పాటు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 6న సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్స్, మూడు సెట్లు జిరాక్స్ ప్రతులతో సమయానికి హాజరుకావాలని సూచించారు. పాలిసెట్ హాల్టికెట్, ర్యాంకు కార్డు, ఎస్ఎస్సీ మెమో, టీసీ, ఆధార్కార్డు, ఆదాయం, నివాస ధ్రువీకరణపత్రాలు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా తీసుకరావాలని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ కోసం విద్యార్థులు tgpolycet.nic.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట క్షేత్రంలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాలభోగం, సహస్ర నామార్చనలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మిర్యాలగూడ టౌన్ : జిల్లాలో అక్రమ ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం మిర్యాలగూడ రూరల్పోలీస్ స్టేషన్లో ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక ద్వారా 2024లో రూ.35 కోట్లు, 2025లో రూ.43 కోట్లు, 2026లో ఇప్పటి వరకు రూ.83 కోట్లు వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 196 వరకు అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేకంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సహాజ వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు పీఎన్డీ ప్రసాద్, సోమనర్సయ్య, ఎస్ఐలు మల్లికంటి లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, నరేష్ తదితరులు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్ -
జీవ వైవిధ్యం..
భూమిపై జీవరాశులు, వాటి జన్యువులు, జీవావరణ వ్యవస్థల సమాహారమే జీవ వైవిధ్యం. శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026- 8లోభానుడి ఉగ్రరూపంఫ 44 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ బెంబేలెత్తుతున్న జనం నల్లగొండ : భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దీంతో నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వాతావరణం వేడెక్కి ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి అయితేనే బయటికి వస్తున్నారు. చాలాచోట్ల ఉదయం 11 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రి 7 గంటలైనా వేడి తగ్గడం లేదు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానియాలు తాగుతున్నారు. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. -
ధాన్యం డబ్బు సకాలంలో చెల్లించాలి
నల్లగొండ : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో డీఆర్డీఏ, ఐకేపీ, పీఏసీఎస్ ఏజెన్సీల ప్రతినిధులు, ట్యాబ్ ఆపరేటర్లు, ఏపీఎంలు, పీఏసీఎస్ సీఈఓలు, మండల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసి రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీసీఓ పత్యనాయక్, పౌరసరఫరాల అధికారి వెంకటేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
బీఆర్ఎస్ది.. రైతులకు బేడీలు వేయించిన చరిత్ర
నల్లగొండ : రైతులకు బేడీలు వేయింని చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. గురువారం రాజీవ్గాంధీ వర్థంతి సందర్భంగా నల్లగొండలో రాజీవ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్, వారి చెంచాలు రైతులకు ద్రోహం చేసి వారి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సుమారు పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేయించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 75 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని ఈనెల 25వ తేదీ లోపు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు యాల రవీందర్రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, మధగోని వెంకన్న, వావిళ్ల దేవదాస్, నాగరాజు, పొట్ట మధు, శరత్, వినీత్, సచిన్ పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ -
కాంటా తంటా..తాలు మోసాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 54,53,622 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యం వచ్చింది. అందులో ఈ నెల 18వ తేదీ వరకు 39,74,335 ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా మరో 14,79,287 ఎంటీల ధాన్యం కేంద్రాల్లోనే ఉంది. ఇక కొనుగోలు చేసిన ధాన్యంలోనూ 2,87,540 ఎంటీల ధాన్యం మిల్లులకు పంపకుండా కేంద్రాల్లోనే ఉంచారు. అంటే అధికారిక లెక్కల ప్రకారమే 17,66,827 ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. ఇక 36,86,795 ఎంటీల ధాన్యం మిల్లులకు వెళ్లినా, అందులో 6,00,143 ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లు దింపుకోలేదు. మొత్తంగా ఇలా 23.66 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర దాటిపోయింది. మే నెలాఖరుకల్లా కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవాల్సి ఉంది. అయినా 43.38 శాతం ధాన్యానికి సంబంధించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోళ్ల వ్యవహారంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు రాక మండుటెండలో.. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో 60 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేయగా, 151 ఎల్ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో దాదాపు 40 శాతం మిల్లర్లు నేరుగా కొను గోలు చేసినా, మిగతా 60 శాతం కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనాలి. కానీ అందులో కొనుగోలు చేసింది 65 శాతం లోపే. ఇక 8,575 కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు కలిపి 11500 రవాణా వాహనాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో అందులో సగం కూడా కనిపించడం లేదు. రాష్ట్ర స్థాయి లో లారీలను సమకూర్చుతామంటూ టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్నొ న్న లారీల్లో సగం కూడా ధాన్యం రవాణాకు సమకూర్చకపోవడంతో రైతులకు తంటాలు తప్పడం లేదు. ఈ విషయంలో అధికార యంత్రాంగం వారికే వంత పాడుతోందనే ఆరోపణలున్నాయి. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు రోజు విడిచి రోజు కూడా లారీలు రావడం లేదు. దీంతో రైతులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అకాల వర్షాల భయంతో ఏదోలా అమ్ముకొని ఇంటికి వెళదామంటే సకాలంలో లారీలు రాకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. తాలు పేరుతో అడ్డగోలు దోపిడీ మరోవైపు కొనుగోలు కేంద్రంలోనే తాలు పేరుతో కిలో, రెండు కిలోలు అదనంగా దోపిడీ చేస్తుండగా, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకునేందుకు తాలు పేరుతో కొర్రీలు పెడుతూ నాలుగైదు కిలోలు కోత పెడుతున్నారు. మొత్తం మీద కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం తూకం వేసినందుకు హమాలీలకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుండగా, లారీల వారు కూడా రైతులనుంచి బస్తాకు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు ఇస్తేనే కొనుగోలు కేంద్రానికి లారీలను పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద కష్టపడి ధాన్యం పండించిన రైతులు ఆ ధాన్యం అమ్ముకోవడానికి సైతం నానా కష్టాలూ పడుతూ, నష్టపోవాల్సిన పరిస్థితులు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్డగోలుగా ధాన్యం దోపిడీ నల్లగొండ జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున తూకం వేయాల్సి ఉన్నా, దానిని 42.5 కిలోల చొప్పున తూకం వేసి ఒక్కో బస్తాకు కిలో 800 గ్రాములు దోచుకున్నారు. ఒక లారీలో 1057 బస్తాలు వేస్తే దానిపై 19 క్వింటాళ్లు కోత పెట్టా రు.ఆ ధాన్యం బస్తాలను మిల్లుకు పంపించగా, సదరు మిల్లర్.. బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున లెక్కించి 1,038 బస్తాలుగానే పరిగణనలోకి తీసున్నాడు. అంటే ఇక్కడ 19 బస్తాలకు కోత పెట్టారు. అంటే మిల్లులో దాదాపు 7.7 క్వింటాళ్లు కోత పెట్టారు. ఇలా ఒక్క లారీపైనే ఇటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అటు మిల్లర్లు కలిసి 26.7 క్వింటాళ్ల వరకు కోత పెట్టి, ఆ రైతుల నుంచి ఏకంగా రూ.63 వేలు దోచుకున్నారు. లారీలు ఎప్పుడొస్తాయో..ధాన్యం మార్కెట్కు తెచ్చి నెల అవుతోంది. ఇంతవరకు తరలించలేదు. లారీలు రాలేదు. ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో పట్టాలు కప్పి కాపలా ఉండాల్సి వస్తోంది. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. – బోడ హెమ్లా, బిస్రాజుపల్లి తండా, తిరుమలాయపాలెం, ఖమ్మం కోతకు ఒప్పుకుంటేనే అన్లోడ్నేను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయించా. 437 బస్తాలు తూకం వేసి మిల్లుకు పంపించారు. మిల్లర్ క్వింటాలుకు 14 కిలో ల తరుగు అడిగాడు. అడిగినంత తరుగుకు ఒప్పుకుంటేనే బస్తాలు దింపుకుంటాననడంతో ఏం చేయలేక అంగీకరించా. ఇదేం దోపిడీయో అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. – ఏనుగు చిన్న బాల్రెడ్డి, మైలారం, ధర్పల్లి, నిజామాబాద్ లారీకి రూ.5 వేలు ఇవ్వాలంటధాన్యం ఆరబెట్టి మంగపేట ఎఫ్ఎస్సీఎస్ సెంటర్లో బస్తాలు నింపి కాంటా కోసం సిద్ధంగా ఉంచా. ఇప్పటికి 29 రోజులు కావస్తున్నా నేటికీ కాంటా పెట్టలేదు. లారీకి రూ.5 వేలు ఇస్తే కాంటా పెడతామని చెపుతున్నారు. – జక్కం నాగేశ్వర్రావు, బోరునర్సాపురం, ములుగు -
స్వచ్ఛ సర్వేక్షణ్పై నజర్
నల్లగొండ టూటౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ –2026లో సింగిల్ డిజిట్ (10)లోపు ర్యాంకు సాధించేలా నీలగిరి కార్పొరేషన్ దృష్టి సారించింది. నగరంలోని అన్ని కూడళ్లు, ప్రజా మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్ధాల శుద్ధి, మార్కెట్లు, పచ్చదనం, సుందరీకరణ తదితర వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మార్కులు కేటాయిస్తుంది. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం వీటిపై ప్రత్యేక నజర్ పెట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, శానిటేషన్ సిబ్బంది, వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలతో ఇటీవల పలుసార్లు సమావేశం నిర్వహించి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ప్రత్యేకతపై కమిషనర్ వివరించారు. ప్రతి ఉద్యోగి స్థానిక కాలనీల్లోని ప్రజలతో మమేకమై వారి ద్వారా పౌర సేవలపై ఆన్లైన్లో మున్సిపాలిటీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసేలా చూడాలని సూచించారు. మెరుగైన ర్యాంకు సాధించేలా ప్రజలను భాగస్వామ్యులను చేయడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్లైన్లో ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్పై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ర్యాంకులు ఇస్తుంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నగరాలు, పట్టణాలు తీసుకున్న విధానంపై ప్రజలు ఆన్లైన్లో ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాల ప్రజలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్, మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాలు ఇచ్చే రికార్డుల ఆధారంగానే మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకులు వస్తాయి. దాంతో నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పక్కా ప్రణాళికతో ముందుకు పోతూ గతంలో కంటే మెరుగైన ర్యాంకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ మెరుగైన ర్యాంకు సాధించేలా కార్పొరేషన్ కృషి ఫ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న యంత్రాంగం స్వచ్చ సర్వేక్షణ్లో కేంద్ర ప్రభుత్వం మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. గతేడాదికంటే కచ్చితంగా మెరుగైన ర్యాంకు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరం అందించాలి. – శరత్చంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
నిప్పుల కొలిమి
పోలీస్స్టేషన్ వద్ద అగ్ని పమాదం కేతేపల్లి పోలీస్స్టేషన్ వద్ద జరిగిన అగ్నిపమాదంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి. - 8లోనల్లగొండ : నల్లగొండ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో బుధవారం సగటున గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీలుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజు 39.2 డిగ్రీలుగా ఉంది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని చోట్ల 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోడ్లన్నీ నిర్మానుష్యం ఎండవేడిమి, వడగాలులకు తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రోడ్లపై జన సంచారం తగ్గింది. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు కూడా వాతావరణ చల్లబడడం లేదు. ఏసీలు, కూలర్లు వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ జిల్లాలో కూడా పెరిగింది. గత సంవత్సరం మే 20వ తేదీన జిల్లాలో 608 మెగావాట్ల విద్యుత్ వినియోగం కాగా.. ఈ నెల 19న 709 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. బుధవారం 772 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది కంటే 164 మెగావాట్ల విద్యుత్ ఒక రోజులో ప్రజలు అధికంగా వినియోగించారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుందిఫ జిల్లాలో సగటున 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఫ కట్టంగూర్లో అత్యధికంగా 45.8 డిగ్రీలు ఫ భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం -
సాగర్కు.. ఆదాయమేదీ!
ఫ కాలనీలు, మిగులు భూములు మున్సిపాలిటీకి ఇవ్వాలని గత ప్రభుత్వం ఆదేశం ఫ ఇప్పటికీ ఆస్తులు అప్పగించని ఎన్ఎస్పీ ఫ సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్న సాగర్ కాలనీ వాసులునాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ వాసులకు కష్టాలు తప్పడం లేదు. అక్కడి ఇళ్లలో నివాసం ఉంటున్నా.. అవి వారి సొంతం కాదని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రైవేట్ భూమి లేకపోవడంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరడం లేదు. నందికొండ మున్సిపాలిటీకి ఆదాయ వనరులను సమకూర్చేందుకు ఎన్నెస్పీ ఆస్తులైన నివాస ప్రభుత్వ క్వార్టర్లు, మిగులు భూములను అప్పగించాలని గత ప్రభుత్వం ఎన్నెస్పీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు గతంలో సంయుక్తంగా సర్వే కూడా నిర్వహించారు. ప్రభుత్వం మారడంతో అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు. అప్పటి ప్రభుత్వం ఆదేశించినా.. 65 ఏళ్లుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలనీలైన హిల్కాలనీ, పైలాన్ కాలనీల ప్రజలు ప్రాజెక్టు అధికారుల పాలనలో మగ్గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే జరిగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే సాగర్ కాలనీలను మున్సిపాలిటీ చేస్తానని ప్రకటించారు. ఆ హామీ మేరకు నందికొండ పేరుతో మున్సిపాలిటీ చేశారు. ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ ఇండ్లన్నీ ఎన్నెస్పీవే. ప్రైవేట్ ఆస్తులేమీ ఉండవు. మున్సిపాలిటీకి ఎలాంటి ఆదాయ వనరులు లేవు. ఈ విషయాలను స్థానికులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నెస్పీ క్వార్టర్లను, మిగులు భూములను మున్సిపాలిటీకి అప్పగిస్తే స్టాండెడ్ అద్దైలెనా వస్తాయని వాటిని అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. రికార్డుల్లో 2,555.15 ఎకరాల విస్తీర్ణం.. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు భూముల రికార్డులను పరిశీలించి సర్వే చేశారు. జీఓ ఎంఎస్ నంబర్ 783 అగ్రికల్చర్ డెవలప్మెంట్ తేదీ 15 ఏప్రిల్ 1959లో నల్లగొండ కలెక్టర్కు 1612 ఎకరాల ఫారెస్ట్ భూములను అప్పగించారు. అనంతరం బండల క్వారీ దగ్గర మెమో నంబర్ 5587 ఫారెస్ట్ తేదీ 05 ఫిబ్రవరి 1966లో 381.29 ఎకరాలు అప్పగించారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి 3,104 ఎకరాలు అప్పగించారు. ఆ భూములు ప్రస్తుతం ఆ జిల్లా పరిధిలోకే వెళ్లాయి. హిల్కాలనీ, పైలాన్కాలనీ భూములు 525.12 ఎకరాలుగా గుర్తించారు. ఎర్త్డ్యాం, హాస్పిటల్, పార్కులు, రోడ్లు, కాలనీలు, ఆలయాలు, ప్రాజెక్టు పరిధిలోగల భూములన్నీ కలిపి 2,555.15 ఎకరాల విస్తీర్ణం రికార్డులో ఉంది. ఆనాడు జరిగిన సర్వే కొలతల్లో ఎంత భూమి తేలిందనేది ఏ అధికారి దగ్గరా సమాచారం లేదు. రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లకు ట్యాక్స్ మున్సిపాలిటీకి ఆధాయం సమకూరాలంటే ఇప్పటికే 58, 59 జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లకు మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ కాని ఇళ్లకు దరకాస్తు చేసుకున్న వారికి నోటీసులు అందజేసి ఆ జీఓ ప్రకారం నగదు చలానా రూపేనా కట్టించుకుని రిజిస్టేషన్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్టేషన్ కాగానే మున్సిపాలిటీకి ట్యాక్స్ చెల్లించనున్నారు. రిజిస్టేషన్ కాకున్నా మున్సిపాలిటీ నుంచి స్థానిక కాలనీల ప్రజలు సేవలను పొందుతున్న దృష్ట్యా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుని భూములన్నింటినీ మున్సిపాలిటీకి అప్పగించి నివాసుల నుంచి ట్యాక్స్ వసూలు చేసేందుకు మార్గం సుగమం చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీంతో నివాసల మీద హక్కులు వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
‘సర్’ను పారదర్శకంగా పూర్తిచేయాలి
నల్లగొండ : ఓటరు జాబితా సమ గ్ర సవరణ ప్రక్రియను (సర్) పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన తన ఛాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా ప్రస్తుతం ఆ ఓటర్ల పరిస్థితి, 2002 తర్వాత కొత్తగా జాబితాలో చేరిన వారి అంశాలను పరిశీలిస్తూ 2026 ఓటరు మ్యాపింగ్ చేపట్టాలని తెలిపారు. ఇప్పటివరకు 80.65 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగతా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు 1,575 మంది బీఎల్ఓలను నియమించామని, సర్ ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ 2 ఫారాలు అందజేస్తామని, ఓటర్లు ఒక దానిని పూరించి సమర్పించాలని చెప్పారు. ఓటరు జాబితాకు సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారిని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్


