breaking news
Nalgonda
-
మదర్ డెయిరీలో మరో ముసలం.. ఛైర్మన్ ప్రభాకర్రెడ్డి రాజీనామా?
సాక్షి, నల్గొండ జిల్లా: మదర్ డెయిరీలో మరో ముసలం పుట్టింది. జనవరి 9 తేదీన చైర్మన్గా మందడి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 14 రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. గతంలో మదర్ డైరీ చైర్మన్గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. మధుసూదన్ రెడ్డి రాజీనామాతో ప్రభాకర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రభాకర్ రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.తనను చైర్మన్ చేస్తే రూ.12 కోట్ల పాల బిల్లులు చెల్లిస్తానంటూ ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారని.. చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మూడు కోట్లు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, 14 రోజుల్లోనే ప్రభాకర్ రెడ్డి రాజీనామా వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ప్రచారమవుతోంది. ప్రస్తుతం మదర్ డెయిరీ రూ. 35 కోట్ల అప్పుల్లో మదర్ డెయిరీ ఉండగా.. పలువురి సొంత రాజకీయ క్రీడలో మదర్ డెయిరీని కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నారనే ఆరోపణలుర వ్యక్తమవుతున్నాయి. -
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
నల్లగొండ : క్రీడలతో పోలీసు సిబ్బందిలో ఆత్మవిశాసం పెరుగుతుందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని పోలీస్ క్రీడా మైదానంలో యాదాద్రి జోన్–5 పోలీస్ క్రీడలు, రాష్ట్రస్థాయి జోనల్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు ఫిబ్రవరి 2న హైదరాబాద్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొంటారని తెలిపారు. దాదాపు 140 మంది పోలీస్ క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబర్చి.. యాదాద్రి జోన్–5కు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, అదనపు ఎస్పీ వినోద్, ఏఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ రాము, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, నరసింహ, కళ్యాణ్రాజ్, సురేష్, ఆర్ఎస్ఐ సాయిరాం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
జంతు సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి
నల్లగొండ : వేసవిలో జంతువుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయాలన్నారు. పెట్ డాగ్ దత్తత మాదిరిగా.. ఆవులను దత్తతతీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జంతువులు, పశువులకు అవసరమైన మందులు, మొబైల్ వెటర్నరీ సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు మల్టీపర్పస్ ఎండోస్కోప్ టూల్ కిట్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పీ సీఈఓ బి.శ్రీనివాసరావు, డీటీఓ లావణ్య, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు జిల్లాలో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేశామని, 70 మంది ఆర్వోలు, 68 మంది ఏఆర్వోలను నియమించామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నేడు జాబ్ మేళా
నల్లగొండ : నల్లగొండలోని ఐటీఐ క్యాంపస్ ఉపాధి కల్పన కార్యాలయంలో 23న ఉదయం 10.30 గంటలకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాల కోసం నల్లగొండలోని ఐటీఐ క్యాంపస్లోని ఉపాధి కల్పన కార్యాలయానికి బయోడేటా, ఒరిజి నల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె తెలి పారు. ఎస్ఎస్సీ నుంచి ఏదేని డిగ్రీ, ఐటీఐ, బీఎస్సీ నర్సింగ్, డీబీఎం ఫార్మసీ చదివి 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 7095612963 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపునల్లగొండ : తెలంగాణ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ గురుకులాల ఆర్సీఓ ఇ.స్వప్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. పౌర కేంద్రిత పోలీసింగ్తో సత్వర న్యాయంకనగల్ : పౌర కేంద్రిత పోలీసింగ్ విధానంతో అసహాయులకు సత్వర న్యాయం అందుతుందని కనగల్ ఎస్ఐ రాజీవ్రెడ్డి తెలిపారు. గురువారం మదనాపురంలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లిగొర్ల గురవయ్యపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కర్రతో దాడి చేసి గాయపరిచాడు. బాధితుడు నల్లగొండ పట్టణంలోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్పీ ఆదేశాల మేరకు బాధితుడి వద్దకు వెళ్లిన ఫిర్యాదు తీసుకొని అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయిల్పామ్తో అధిక లాభాలు రామగిరి(నల్లగొండ) : ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా హర్టికల్చర్ అధికారి సుభాషిణి అన్నారు. ఆయిల్పామ్ సాగు యాజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలపై పానగల్ రైతు వేదికలో నల్లగొండ మండలం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, పతంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్పామ్.. అధిక ఆదాయాన్ని అందించే సులభతరమైన వాణిజ్య పంట అన్నారు. ఈ మొక్కను ఒకసారి నాటితే 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పతాంజలి ఫుడ్స్ మేనేజర్ మధుసూదన్రెడ్డి, డీజీఎం యాదగిరి, జైన్ డ్రిప్ అగ్రోనమిస్టు శంకర్ మానె, హర్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, ఆయిల్పామ్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు గురువారెడ్డి, కార్యదర్శి గురవయ్య, రైతులు కరుణాకర్రెడ్డి, రత్నారెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాప్ ద్వారానే ఎరువులు అందించాలినల్లగొండ అగ్రికల్చర్: రైతులకు యాప్ ద్వారానే డీసీఎంఎస్ సిబ్బంది ఎరువులు అందించాలని జిల్లా సహకార అధికారి, ఎన్డీసీఎంఎస్ జిల్లా మేనేజర్ నాగిళ్ల మురళి అన్నారు. గురువారం నల్లగొండలోని టీఎన్జీవోస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా ఎప్పుడు నిల్వ ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిదే అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పార్టీల సన్నాహకం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆయా పార్టీలు మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు వేగవంతం చేశాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ మున్సిపాలిటీల్లో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వడబోత చేపట్టగా, బీఆర్ఎస్, బీజేపీ కూడా అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరికొందరు ఆశావహులు టికెట్లపై హామీల కోసం ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నల్లగొండను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు నల్లగొండలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అభ్యర్థుల ఖరారు విషయంలో కసరత్తు మొదలు పెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో చేరికలను ప్రోత్సహించే దిశగా ఆయా పార్టీలు చర్యలు చేపట్టాయి. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మిర్యాలగూడలో రంగంలోకి నేతలు మిర్యాలగూడలో ప్రధాన పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నలమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన నివాసంలో ఇప్పటికే తన అనుచరులతో చర్చించారు. బీజేపీ.. సన్నాహక సమావేశం నిర్వహించింది. ఆభ్యర్థుల ఎంపిక విషయం అన్ని పార్టీలు అచి తూచి అడుగులు వేస్తున్నారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో సర్వేలు చేయిస్తున్నాయి. చిట్యాల మున్సిపాలిటీ ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ సమావేశాలను పూర్తి చేశాయి. వార్డుల వారీగా ఇతర మండలాలకు చెందిన ముఖ్య నాయకులను ఇన్చార్జిలుగా నియమించి అభిప్రాయ సేకరణ చేపట్టాయి. దేవరకొండలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సన్నాహక సమావేశం నిర్వహించగా, బీజేపీ సమావేశం నిర్వహించింది. చండూరులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సమావేశాలు నిర్వహించారు. హాలియా, నందికొండలో కాంగ్రెస్ పార్టీ.. పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫ మున్సిపాలిటీల వారీగా సమావేశాల నిర్వహణ ఫ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఫ అవసరమైన చోట సర్వేలు, వాటి ఆధారంగానే టికెట్లు ఫ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దమైన పార్టీలు -
బస్సులేని బడిబాట!
అణిచివేయడం సరికాదు ప్రశ్నించే వారిని అణిచివేయడం సరికాదని అరుణోదయ సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. శిక్షపడే వరకు ఉద్యమం కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసులకు శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని మంద కృష్ణమాదిగ అన్నారు. - 8లోకేతేపల్లి : కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామంలో గల మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 600 మంది విద్యనభ్యసిస్తున్నారు. మండలంలోని విద్యార్థులే కాకుండా సమీపంలోని నకిరేకల్, సూర్యాపేట తదితర మండలాల నుంచి కూడా విద్యార్ధులు ఈ పాఠశాలకు వస్తారు. పాఠశాలలో కేవలం 100 మంది విద్యార్థినులకు మాత్రమే హాస్టల్ సౌకర్యం ఉంది. మిగిలిన వారు రోజూ వచ్చి పోవాల్సిందే. మండలంలో హైవేపై ఉన్న ఐదు గ్రామాలకు తప్ప వేరే గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇక, కొర్లపహాడ్ గ్రామం హైవేపై ఉన్నప్పటికీ పాఠశాల మాత్రం బస్స్టేజీ నుంచి 3 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. నకిరేకల్ మండలం నోముల, వల్లభాపురం, కేతేపల్లి మండలంలోని గుడివాడ, ఇప్పలగూడెం, కాసనగోడు, బొప్పారం, కొత్తపేట గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. ఆర్థికస్థోమత లేనివారు సైకిళ్లు, కాలినడకన పాఠశాలకు వచ్చిపోతున్నారు. నా ఇద్దరు కూతుళ్లు కొర్లపహాడ్ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. మా గ్రామం నుంచి పాఠశాల ఐదు కి.మీ దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లేకపోవటంతో ఆటోలో పంపిస్తున్నాను. నెలకు రూ.2వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా ఇబ్బండి పడుతున్నాను. అధికారులు స్పందించి బస్సు నడిపించాలి. – ఎ.జగన్నాదం, గుడివాడ -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణ సమస్యలపై పాలకులకు చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన అమృత్ స్కీం తాగునీటి పథకం, రోడ్లు, యూజీడీ పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మేనేజర్ కల్యాణికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మాదగోని శ్రీనివాస్గౌడ్, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నూకల వెంకట్నారాయణరెడ్డి, నాగిరెడ్డి, నాగరాజు, వెంకన్న, వెంకటేశం, సాయి, లింగస్వామి, విద్యాసాగర్రెడ్డి, మోహన్రెడ్డి, పాశం శ్రీనివాస్రెడ్డి, మండల వెంకన్న, హరి, సైదులు, రామగిరి అఖిల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదపుటంచున ప్రయాణం
చండూరు : పాఠశాల విద్యార్థులు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామాలకు చుట్టుపక్కల పల్లెల నుంచి నిత్యం ఆటోల్లో, కాలినడకన, సైకిళ్లపై ప్రయాణం చేస్తున్నారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో దోనిపాముల నుంచి వచ్చే విద్యార్థులు ఒకే ఆటోలో 17 మంది పాఠశాలకు వస్తున్నారు. తుమ్మలపల్లి నుంచి చండూరుకు గతుకుల రోడ్డుపై ఆటోలో 15 మందికిపైగా విద్యార్థులు వస్తూ పోతున్నారు. బోడంగిపర్తి పాఠశాలకు వచ్చే ఆటో లోపల 18 మంది, వెనుక మరో ఐదుగురు నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. -
ఇక్కడా వెలుగులోకి..
● చండూరు మండలం ఇడికూడ రెవెన్యూ పరిధిలోని తాస్కానిగూడెం గ్రామానికి చెందిన వంగూరి శ్రీనివాస్ తన 39 గుంటల భూమిని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి గ్రామానికి చెందిన గంజి పాండుకు రిజిస్ట్రేషన్ చేశాడు. అందుకోసం చౌటుప్పల్లోని తరుణ్ డాక్యుమెంట్ రైటింగ్ సెంటర్లోనే స్టాట్ను బుక్ చేశారు. అందుకు రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.18,300 తీసుకున్నా.. ఎడిట్ ఆప్షన్తో రూ.572లే చెల్లించాడు. ● గట్టుప్పల్ మండలం తేరట్పల్లికి చెందిన కానుగుల వెంకటయ్య తన 1.20 ఎకరాల భూమిని ముగ్గురు కొడుకుల పేరున పట్టా చేయించేందుకు చౌటుప్పల్లోని బాతరాజు తరుణ్కు చెందిన డాక్యుమెంట్ రైటింగ్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఇందుకు ప్రతి డాక్యుమెంట్కు రూ.8500 చొప్పున రూ.25,500, బుకింగ్ చార్జీల కింద రూ.2 వేలు మొత్తం రూ.27,500 తరుణ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ తరుణ్ ఒక్కో డాక్యుమెంట్కు రూ.8,500 చొప్పున కాకుండా ఎడిట్ ఆప్షన్తో రూ.500 చొప్పునే చెల్లించి రూ.24 వేలు తనే మింగేశాడు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూభారతి పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఆధారంగా చోటుచేసుకున్న భారీ కుంభకోణం నల్లగొండ జిల్లాలో కూడా వెలుగుచూసింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి అందాల్సి సొమ్ము రూ.కోట్లు స్వాహా చేశారు. యాదాద్రి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున బయటపడిన ఈ బాగోతం నల్లగొండ జిల్లాలోనూ వెలుగుచూసింది. జిల్లాలోని చిట్యాల, గట్టుప్పల్, చండూరు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల్లోనూ స్లాట్ బుకింగ్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. చౌటుప్పల్లోనే స్లాట్ల బుకింగ్ భూభారతి పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఆధారంగా చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ షాపు నిర్వహిస్తున్న తాళ్ల సింగారం గ్రామానికి చెందిన బాతరాజు తరుణ్ కీలకపాత్ర పోషించాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులోని ప్రధాన నిందితుడైన యాదగిరిగుట్టకు చెందిన బసవరాజుతో నేరుగా సంబంధాలు పెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. చౌటుప్పల్కు చెందిన తొర్పునూరి లింగస్వామి కూడా ఇందులో కీలక పాత్రధారిగా ఉన్నాడు. తరుణ్ తన వద్దకు వచ్చే రైతుల భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ డబ్బులను చలానా రూపంలో నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉన్నా.. ఎడిట్ ఆప్షన్ను ఆసరాగా చేసుకొని డబ్బులను దారి మళ్లించారు. వీరు వివిధ జిల్లాల్లోని డాక్యుమెంట్ రైటర్లతోనూ చేతులు కలిపారు. అక్కడి భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్లు ఇక్కడి నుంచే చేశారు. రైతుల వద్ద నిర్దేశించిన ప్రకారంగా డబ్బులు తీసుకున్నప్పటికీ ప్రభుత్వ ఖాతాకు పూర్తిగా జమ చేయకుండా కాజేసి పంచుకున్నారు. ఇలా 2024 నుంచి ఇప్పటి వరకు 237 డాక్యుమెంట్లకు సంబంధించిన రూ.1.17 కోట్లు కొల్లగొట్టారు. నిందితులు బాతరాజు తరుణ్, పాలమాకుల హరీష్, తూర్పునూరి లింగస్వామిపై కేసు నమోదు చేసిన పోలీసులు నల్లగొండ జైలుకు తరలించారు. మాట్లాడుతున్న కలెక్టర్ చంద్రశేఖర్ ఫ నల్లగొండ జిల్లాలో 11 డాక్యుమెంట్లకు చెందిన రూ.4 లక్షలు పక్కదారి ఫ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కేంద్రంగా భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు ఫ సీసీఎల్ఏకు అందిన నివేదిక ఫ ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలపై అధికారుల దృష్టియాదగిరిగుట్ట కేంద్రంగా స్లాట్ బుకింగ్లో అక్రమాలు బయటకు రావడంతో జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయా? అనే అంశంపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్ దృష్టి సారించారు. తహసీల్దార్లతో విచారణ చేయించారు. చిట్యాలలో ఆరు, గట్టుప్పల్లో మూడు, నాంపల్లిలో ఒకటి, చండూరులో ఒకటి చొప్పున జరిగిన రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగనట్లు గుర్తించారు. మొత్తంగా 11 రిజిస్ట్రేషన్లలో దాదాపు రూ. 4 లక్షల మేర కొల్లగొట్టినట్లు తేల్చారు. వాటిపై నివేదికలను రూపొందించి సీసీఎల్ఏకు పంపించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని నార్కట్పల్లి, నిడమనూరు, గుర్రంపోడు తదితర మండలాల్లోనూ వారు స్లాట్ బుకింగ్లో డబ్బు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిపైనా అధికారులు పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. -
జైల్ సూపరింటెండెంట్గా ఆనందరావు
నల్లగొండ : నల్లగొండ జిల్లా జైల్ నూతన సూపరింటెండెంట్గా కె.ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ పదోన్నతిపై కేంద్ర కారాగారం చర్లపల్లి జైల్కు బదిలీ అయ్యారు. ఆనందరావు గతంలో నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్గా పనిచేశారు. నల్లగొండ జైల్లో బాధ్యతలు స్వీకరించిన ఆనందరావుకు జైలర్ బాలకృష్ణ, డిప్యూటీ జైలర్ వెంకట్రెడ్డి, జైల్ సిబ్బంది శ్రీరామ్ ఆయనకు బొకే అందజేసి శుభ కాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నుంచిబీఆర్ఎస్లో చేరికనల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఏర్పుల తర్షనరవి 150 మంది కార్యకర్తలతో కలిసి బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో రమేష్, నాగరాజు, శ్రీను, కోటయ్య, క్రాంతి, వెంకన్న, అశోక్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. -
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
వలిగొండ : మండలంలోని రెడ్లరేపాక గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. రెడ్లరేపాకకు చెందిన పంతంగి వెంకటేశం అతని కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వచేసి అమ్ముతున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడి చేసి రూ.61,473 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ యుగంధర్ తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని..ఫ తండ్రికి కోర్టు నోటీసు పంపిన కొడుకు నడిగూడెం : ఇల్లు ఖాళీ చేయాలని తండ్రికి కొడుకు కోర్టు ద్వారా నోటీసు పంపించాడు. ఈ సంఘటన నడిగూడెం మండలం చాకిరాలలో బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన గుంజ లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఎంతో కష్టపడి తన పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లును చదివించి ప్రయోజకుడిని చేశాడు. లక్ష్మయ్య చిన్న కుమారుడు రాంబాబు కులాంతర వివాహం చేసుకున్నాడు. లక్ష్మయ్య ఇంటిని 2025లో రాంబాబు తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో కక్ష కట్టిన వెంకటేశ్వర్లు.. లక్ష్మయ్య ఉంటున్న ఇల్లును ఖాళీ చేయాలంటూ కోర్టు ద్వారా నోటీసు పంపించాడు. గత ఏడాదిగా తన ఆరోగ్యం బాగోలేదని, తనను చిన్న కుమారుడు రాంబాబు పోషిస్తున్నాడని లక్ష్మయ్య తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. -
విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం
డిండి : డిండి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఏపీలో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఏపీలోని రాజమండ్రి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్కు గాయాలయ్యాయి. వివరాలు.. డిండి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న 110 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు ఈ నెల 17న రెండు బస్సుల్లో విహారయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. అక్కడ అరకు, బొర్రా గుహలు, వైజాగ్ బీచ్తో పాటు సింహచలం, అన్నవర పుణ్యక్షేతాలను దర్శించుకుని మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైపు వస్తుండగా.. దివాన్ చెరువు సమీపంలోకి రాగానే బాలురతో వస్తున్న బస్సుకు ఆవు అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాని వెనుకనే వస్తున్న రెండు ట్రావెల్స్ బస్సులు, బాలికల బస్సు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. దీంతో బాలికల బస్సులో ఉన్న దాదాపు 20 మంది విద్యార్థినులకు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్ నారాయణరెడ్డికి గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన విద్యార్థులను దివాన్చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. నల్లగొండ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు.. రాత్రంతా దివాన్ చెరువు సమీపంలోని బాలవికాస్ మందిరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకున్నారు. వీరు వెళ్లిన రెండు బస్సుల్లో ఒకటి ధ్వంసం కాగా.. ఇంకొక బస్సుతో పాటు మరో బస్సును మాట్లాడుకొని బుధవారం ఉదయం డిండికి బయల్దేరారు. ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు 24 మంది విద్యార్థులను నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో డీఈఓ భిక్షపతికి అప్పగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహారావు నేత చెప్పారు. దేవరకొండ ఎమ్మెల్యే పరామర్శ విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, డీఈఓ భిక్షపతి ప్రిన్సిపాల్తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరాతీసి ఆందోళనకు గురైన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు వారు ధైర్యం చెప్పారు.బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బాలుర బస్సు, 11.15 గంటలకు బా లికల బస్సు డిండి ఆదర్శ పాఠశాలకు చేరుకోగా.. వారిని చూసి తల్లిదండ్రులు రోదించారు. తమ పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఫ ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు ప్రైవేట్ బస్సులు ఫ డిండి ఆదర్శ పాఠశాలకు చెందిన 20మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్కు గాయాలు ఫ ఏపీలోని రాజమండ్రి వద్ద ఘటన ఫ డిండికి తిరిగి వచ్చిన విద్యార్థులు -
దళితుడిని చంపిన వారిని కాపాడడం దారుణం
కోదాడ: అకారణంగా దళిత యువకుడు కర్ల రాజేష్ను పొట్టన పెట్టుకున్న వారిని కాపాడాలనుకోవడం దారుణమని, గడిచిన 55 రోజులుగా తాము శాంతియుతంగా ఽనిరసన వ్యక్తం చేస్తున్నా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి కనీసం స్పందించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం కోదాడలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్ల రాజేష్ మృతికి కారణమైన కేసులో ఏ–1గా చిలుకూరు ఎస్ఐ సురేష్రెడ్డి, ఏ–2గా కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగం ఉన్నారని.. కానీ సీఐ ప్రతాపలింగంను సస్పెండ్ చేసిన అధికారులు ఎస్ఐ సురేష్రెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందినవాడు కాబట్టే చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో సూర్యాపేట ఎస్పీ నరసింహను ఏ–4గా, అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డిని ఏ–3గా చేర్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ.. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అఖిలపక్ష నాయకులు కర్ల రాజేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మేకల శ్రీనివాసరావు, ములకలపల్లి రాములు, ముత్యాలు, వంగవేటి శ్రీనివాసరావు, ఓరుగంటి ప్రభాకర్, ఎస్కే రఫీ, సంజీవ్నాయక్, మామిడి అంజయ్య, గోపాల్ యాదవ్, కాంపాటి వీరస్వామి, గొడ్డలి నరసయ్య, వక్కంతుల నరసింహారావు, ఉదయగిరి, పిట్టల బాగ్యమ్మ, యలమర్తి రాము, ఆంజనేయులు, సత్యరాజు, వెంకట్రావ్, శ్రీను, గోపి, నాగరాజు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
హాస్టల్కు వెళ్లడం ఇష్టంలేక..
ఫ ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య డిండి : సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన 10వ తరగతి విద్యార్థి తిరిగి హాస్టల్కు వెళ్లడం ఇష్టంలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన డిండి మండల పరిధిలోని కామేపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి గ్రామానికి చెందిన జఠమోని ఆంజనేయులు, విజయ దంపతుల కుమారుడు శివ(14) హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగకు కామేపల్లికి వచ్చిన శివ తిరిగి హాస్టల్కు వెళ్లడానికి నిరాకరించడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శివ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంజాయి పట్టివేతఫ ఐదుగురిపై కేసు నమోదు నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలో గంజాయి పంచుకుంటున్న ఐదుగురిని బుధవారం స్థానిక పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల పట్టణానికి చెందిన ఇంజమూరి యశ్వంత్, ఇంజమూరి సాయివర్మ, మచ్చ పవన్, కొల్లోజు రోహిత్, ఒగ్గు నాగరాజు ముఠాగా ఏర్పడి ఈ నెల 18న రెండు కేజీల గంజాయిని రూ.20వేలకు బిహార్ రాష్ట్రానికి చెందిన హుస్సేన్ వద్ద కొనుగోలు చేశారు. ఆ గంజాయిని నేరేడుచర్లలోని హుజూర్నగర్ రోడ్డులో గల పాత అట్టాల ఫ్యాక్టరీ వద్ద అందరూ కలిసి పంచుకుంటుండగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి గంజాయితో పాటు ఐదు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నేటి నుంచి జాన్పహాడ్ దర్గా ఉర్సు
పాలకవీడు: మతసామరస్యానికి ప్రతీకై న పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు గురువారం ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు వక్ఫ్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దర్గాను దర్శించుకుని అనంతరం సమీపంలోని నాగుల పుట్ట వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సూర్యోదయానికి ముందే గుసుల్.. గురువారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే గుసుల్ కార్యక్రమంతో ఉర్సు ప్రారంభంకానుంది. ముజావర్ జానీ ఇంటి నుంచి తెచ్చిన పవిత్ర గంధాన్ని బాబా సమాధులపై సమర్పించి నూతన చాదర్, దట్టీలు, రకరకాల పూలతో బాబాను అలంకరిస్తారు. బాబా సమాధుల వద్ద ఖవ్వాలీ, డప్పు వాయిద్యాల నడుమ ఉల్సా ఈ సిరత్ అల్లా నమాజ్ నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలు పూర్తయిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రేపు గంధోత్సవం.. ఈ ఉర్సులో ప్రధాన ఘట్టం శుక్రవారం పవిత్ర గంధోత్సవం. వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నడుమ తయారుచేసిన పవిత్ర గంధాన్ని దర్గా పూజారి ఇంటికి చేరుస్తారు. ఉదయాన్నే గంధాన్ని దర్గా సమీపంలోని సందల్ఖానాకు తరలించి మతపెద్దల సమక్షంలో ఈద్ జుమా నిర్వహిస్తారు. అనంతరం అశ్వంపై జాన్పహాడ్, కల్మేట్తండా, చెరువుతండా గ్రామాల పుర వీధుల్లో గంధాన్ని ఊరేగిస్తారు. ఊరేగింపు పూర్తయిన తర్వాత గంధాన్ని సైదులు బాబా సమాధులపై సమర్పిస్తారు. గంధం ఊరేగింపు కార్యక్రమానికి నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి హాజరవుతున్నట్లు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్ తెలిపారు. దీపారాధనతో ఉత్సవాలకు ముగింపు శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధ కార్యక్రమం నిర్వహించి ఉర్సు ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఫ గంధోత్సవానికి హాజరుకారున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
చౌటుప్పల్ : భార్యతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెలకు వద్దకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. గుండెపోటుతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. వివరాలు.. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన చీర్క నర్సిరెడ్డి(65)కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కుమారుడు గతంలోనే మృతిచెందగా.. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నర్సిరెడ్డి ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. నర్సిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలు వస్తుండడంతో ఆస్పత్రిలో చూపించుకునేందుకు కుమార్తె వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం భార్య లక్ష్మమ్మతో కలిసి ఆటోలో చౌటుప్పల్కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆర్టీసీ బస్స్టేషన్లో బస్సు ఎక్కారు. బస్సు బస్టాండ్ నుంచి బయల్దేరి కొద్దిగా ముందుకు వెళ్లగానే తనకు దమ్ము వస్తుందంటూ నర్సిరెడ్డి భార్యకు చెప్పాడు. అంతలోనే సీట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్ల ఎదుటే భర్త చనిపోవడంతో నర్సిరెడ్డి భార్య లక్ష్మమ్మ బోరున విలపించింది. ఫ హైదరాబాద్లో కుమార్తె వద్దకు వెళ్తుండగా భార్య కళ్లెదుటే ప్రాణాలొదిలిన వృద్ధుడు -
రోడ్డు ప్రమాదంలో రికార్డు అసిస్టెంట్ మృతి
మద్దిరాల : మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తి మృతిచెందాడు. బుధవారం స్థానిక ఎస్ఐ ఎం. వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న మచ్కురి రాజేష్( 22) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారి మీదుగా కుంటపల్లి నుంచి మద్దిరాల వైపు వస్తుండగా.. మద్దిరాల శివారులో ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ ఎడమ కాలుకు, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రాజేష్ భౌతికకాయానికి ఆర్డీఓ వేణుమాధవరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అతడి కుటుంబానికి రూ.30వేల ఆర్థికసాయం అందజేశారు. -
విద్యలో నాణ్యత పెంపునకు కృషిచేయాలి
ఫ ఎంజీయూ వైస్ చాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్: డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషిచేయాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు హాజరు 75శాతం ఉండేలా ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై. ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత పాల్గొన్నారు. బంగారం చోరీ కేసులో ముగ్గురు మహిళల అరెస్టుసూర్యాపేటటౌన్ : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి మెడలోని బంగారు నల్లపూసల గొలుసును అపహరించిన ముగ్గురు మహిళలను సూర్యాపేట రూరల్ పోలీస్లు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మెంతమైన బుచ్చమ్మ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ నెల 19న బుచ్చమ్మ ఇంట్లో ఉండగా.. ముగ్గురు మహిళలు వచ్చి ఆమె మెడలోని బంగారు నల్లపూసల గొలుసును లాక్కోని వెళ్లారు. బాధితురాలి కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట మండలం రామ్లతండాకు చెందిన వాంకుడోతు పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ చోరీ చేసినట్లు గుర్తించి వారిని పట్టుకుని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ బాలునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాపేట : ఇంట్లో జారిపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామానికి మాలోతు నాను(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న నాను ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు గజ్వేల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ మైసయ్య తెలిపారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జాన్పహాడ్ ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వక్ఫ్బోర్డు, ప్రభుత్వ ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎస్పీ రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన దర్గా వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. 60 మంది కార్మికులతో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని ఎంపీడీఓ లక్ష్మి తెలిపారు. మిర్యాలగూడ, కోదాడ ఆర్టీసీ డిపోల నుంచి 18 బస్సులను దర్గాకు నడుపుతున్నట్లు ఆయా డిపోల మేనేజర్లు పేర్కొన్నారు. దర్గా పరిసరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, 108 వాహనాలను అందుబాటులో ఉంచుతామని వైద్యారోగ్యశాఖ అధికారి నాగిని వివరించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు సీలు, 27మంది ఎస్ఐలు, రోప్పార్టీ బలాలు, మొత్తం 450 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉర్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ చరమందరాజు, ఎస్ఐ కోటేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల మృతితో అనాథలుగా బాలికలు
యాదగిరిగుట్ట రూరల్ : గతంలో తండ్రి, ఇప్పడు తల్లి మృతిచెందడంతో యాదగిరిగుట్ట మండలంలోని చిన్న గౌరాయపల్లి గ్రామంలో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరాయపల్లి గ్రామానికి చెందిన గుజ్జ రాధ (30), రాజుకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రాజు అంధుడు కాగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె సంకీర్తన 7వ తరగతి, చిన్న కుమార్తె వర్షిణి 5వ తరగతి చదువుతోంది. రాజుకు వచ్చే పెన్షన్తో పాటు, రాధ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. మూడేళ్ల రాజు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి రాధ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఆరోగ్యం బాగోలేక రాధ కూడా బుధవారం మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. రాజుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం, రాధ తల్లి వృద్ధురాలు కావడంతో పిల్లల జీవతం ప్రశ్నార్ధకంగా మారింది. గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు నిరుపేద కుటుంబం కావడంతో రాధ అంత్యక్రియలను గ్రామస్తులు తలా ఓ చేయి వేసి జరిపించారు. చిన్న కుమార్తె వర్షిణి తలకొరివి పెట్టింది. అనాథలుగా మారిన చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
బత్తాయి రైతులు లాభాలు ఆర్జించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : బత్తాయి రైతులు లాభాలను ఆర్జించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో బత్తాయి రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బత్తాయి మార్కెట్ లేకపోవడం వల్ల తాము నష్టపోతున్నమని, దళారుల చేతిలో మోసపోతున్నామని, మార్కెట్ తెరిపించాలని కలెక్టర్ను రైతులు కోరారు. తాము ఎఫ్బీఓ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నల్లగొండ బత్తాయి ఎక్కువగా పండించే జిల్లా అన్నారు. బత్తాయి రైతుల ఆలోచనలను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో హార్టికల్చర్ జిల్లా అధికారి సుభాషిని, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, శాస్త్రవేత్త హరీఫ్ఖాన్, నాబార్డ్ డీజీఎం వినయ్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
బత్తాయి మార్కెట్.. అలంకారప్రాయం!
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీలో నిర్మించిన బత్తాయి మార్కెట్ క్రయవిక్రయాలు లేక అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. రూ.కోటి 78 లక్షలు వెచ్చించి నిర్మించిన మార్కెట్లో విశాలమైన రేకుల షెడ్డుతో పాటు వేబ్రిడ్జ్ లైటింగ్ కాంపౌండ్ వాల్ నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కొనుగోళ్లు జరగకపోవడంతో రేకుల షెడ్డులో సీఎంఆర్ ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్న బత్తాయి మార్కెట్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. 2018లో మార్కెట్ ప్రారంభం పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా బత్తాయి తోటలకు నిలయంగా ఉండేది. అప్పుడు జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల వరకు బత్తాయి తోటలు సాగయ్యాయి. రైతులు బత్తాయిలు అమ్ముకోవడానికి దళారును ఆశ్రయించే పరిస్థితి ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టాలపాలు కావొద్దనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 మేలో 12 ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి 2018లో మార్కెట్ను ప్రారంభించారు. అప్పుడు 20 మంది వ్యాపారులు నల్లగొండ వ్యవసాయ మార్కెట్ నుంచి లైసెన్స్లు కూడా పొందారు. మార్కెట్పై ఆసక్తి చూపని రైతులు.. జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న బత్తాయి తోటలు తెగుళ్ల కారణంగా చాలా వరకు చనిపోయాయి. దీంతో రైతులు బత్తాయి తోటలు నరికి వేసి వరి సాగుకు మొగ్గు చూపారు. ఏటేటా బత్తాయి తోటల విస్తీర్ణం తగ్గుతూ ప్రస్తుతం 50 వేల ఎకరాలలోపే ఉన్నాయి. బత్తాయి సాగు తగ్గిపోతుండటంతో పండించిన బత్తాయిలను మార్కెట్కు తీసుకొస్తే రవాణా భారం రైతులపై పడుతుంది. రైతులు తోటల వద్దనే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితులు ఉండటంతో రైతులు మార్కెట్కు రావడం లేదు. దీంతో వ్యాపారులు కూడా లైసెన్స్లను రెన్యువల్ చేసుకోలేదు. బత్తాయి మార్కెట్లో కాయలు అమ్మడానికి రైతులు రావడం లేదు. తోటల వద్దనే బత్తాయిలు అమ్ముకుంటున్నారు. దీంతో వ్యాపారులు కూడా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదు. – ఛాయాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఫ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం ఫ ప్రారంభించి ఎనిమిదేళ్లయినా క్రయవిక్రయాలు లేవు -
రోడ్డు భద్రత.. ప్రతి పౌరుడి బాధ్యత
నల్లగొండ : రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. రోడ్డు భద్రత మాసోవ్సవాల్లో భాగంగా మంగళవారం నల్లగొండలోని పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ – అలైవ్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా పరిధిలో గతేడాది కాలంలో సుమారు 900 నుంచి 950 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. అందులో దాదాపు 360 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటిలో సుమారు 90 శాతం మంది హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే ఉన్నారని పేర్కొన్నారు. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని.. ప్రాణ రక్షణకు అత్యంత కీలకమైన సాధనమన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. అనంతరం ప్రమాదరహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివారెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్రెడ్డి, రాము, మహాలక్ష్మయ్య, టూటౌన్ ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కాషాయ జెండా ఎగరడం ఖాయం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఈసారి కాషాయం జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి ఉదయ్ ప్రతాప్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల విజయ సంకల్ప సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడ ప్రాంతానికి రూ.400 కోట్లు తెచ్చామని మాటల గారడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మెస్థితిలో లేరన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా గర్జనను నిర్వహించాలన్నారు. పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాధినేని శ్రీనివాస్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తంరెడ్డి, కన్మంతరెడ్డి అశోక్రెడ్డి, యాదగిరి, వెంకటరమణ, నాగిరెడ్డి, సత్యప్రసాద్, కర్నాటి ప్రభాకర్, రమేష్, తుమ్మలపల్లి హన్మంతరెడ్డి, ఆశాలత, వనం మధన్మోహన్, అశోక్రెడ్డి, శ్యాం, వేణు, బాషా, మూల రాజీరెడ్డి తదితరులు ఉన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి -
బాలికా విద్యను ప్రోత్సహించాలి
నల్లగొండ : బాల్య వివాహాలను అరికట్టేందుకు బాలికల విద్యను ప్రోత్సహించడమే పరిష్కారమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ సహకారంతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ‘జాగ్రత్త’ పేరుతో బాల్య వివాహాల విముక్తి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయడం చట్ట విరుద్దం, నేరమన్నారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్ను దెబ్బతీయడమే కాకుండా, వారి ఆరోగ్యం, విద్య, హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. బాల్యవివాహాలు జరగకుండా ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమని, విద్యపై పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్యవివాహల నిర్మూలనకు రూపొందించిన ప్రచార రథం జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, మండలాల్లో తిరుగుతూ పాటలు, నినాదాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, సీడీపీఓ హరిత, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నాగరాజు, గణేష్, చింతకృష్ణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఈ నెల 30లోగా tso bmms.cgg.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 శాతం సబ్సిడీతో అర్హులైన దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిల్, ట్యాప్టాప్, ట్యాబ్స్, మూడు చక్రాల రిక్షాలు, వీల్చైర్స్, చంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ అందజేస్తుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9441032444 నంబర్ను సంప్రదించాలని సూచించారు. క్రీడలతో పని ఒత్తిడి దూరం రామగిరి(నల్లగొండ) : క్రీడలతో పని ఒత్తిడి దూరమవుతుందని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కోర్టులో క్రీడా పోటీలను మంగళవారం ఆయయన ప్రారంభించి మాట్లాడారు. న్యాయవృత్తిలో ఉన్న సిబ్బంది క్రీడలు ఆడడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో జడ్జిలు సంపూర్ణ ఆనంద్, కులకర్ణి, పురుషోత్తంరావు, శిరీష, మేఘన, తేజ, బార్ అసోసయేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేష్, గేమ్స్ సెక్రటరీ జిఎన్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులునల్లగొండ : నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటిషియన్ కో ర్సులో శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎ.అనిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉండి, 8వ తరగతి పూర్తయిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. కోర్సులో 25 సీట్లు ఉన్నాయని తెలి పారు. పూర్తి వివరాలకు దుర్గాబాయి మహిళా ప్రాంగణం నల్లగొండ, ఫోన్ నంబర్ (76600 22517)ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వం పెద్దపీటనల్లగొండ : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు అన్నారు. మంగళవారం నల్లగొండలోని లైన్వాడి బషీర్బాగ్ అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమంలో భాగంగా బాలికలు, మహిళలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతినెలా జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200 మందికి శానిటరీ నాప్కిన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుబ్బ సాత్విక, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
నల్లగొండ : మాది రైతు పక్షపాతి ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఆవరణలో రూ.8 కోట్ల విలువచేసే వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. రూ. 2 లక్షల లోపు రుణాలున్న రైతులకు సంబంధించి రూ. 20 వేల కోట్ల రుణాలను రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 8 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను సన్న, చిన్న కారు, మహిళా రైతులకు సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చామని, రైతులు, మహిళల కళ్లల్లో సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు అవగాహన సదస్సు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులకు ఈ నెల 20న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ జాతీయ సమన్వయకర్త మారం వెంకట రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ప్రోగ్రాం అధికారులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. 30న ఎన్జీ కాలేజీలో జాతీయ సదస్సురామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో జనవరి 30న తెలుగు భాషా వికాసం–వివిధ వైఖరులుపై ఒక్కరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, తెలుగు శాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్ తెలిపారు. అధ్యాపకులతో కలిసి సోమవారం సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సదస్సులో పాల్గొనే వారు తమ పేరు నమోదు చేసుకొని జనవరి 29వ తేదీలోపు పూర్తి పరిశోధనా పత్రాన్ని telugungc2022@gmail.comకు మెయిల్ పంపాలని పేర్కొన్నారు. అధ్యాపకులు రూ.1000, రీసెర్చ్ స్కాలర్స్ రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. వివరాలకు 9866977741 నంబరును సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అంతటి శ్రీనివాస్, సీఓఈ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గోపాలమిత్రల సంఘం జిల్లా కమిటీ ఎన్నికనల్లగొండ అగ్రికల్చర్ : గోపాలమిత్ర సంఘం జిల్లా కమిటీని సోమవారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొప్పెర నాగయ్య(బంకపురం), ఉపాధ్యక్షుడిగా మహేశ్వరం సతీష్కుమార్(కల్వపల్లి), ప్రధాన కార్యదర్శిగా పల్చ మహేష్గౌడ్(మైనంపల్లి)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికై న నాయకులు సభ్యులు ఘనంగా సన్మానించారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులుచందంపేట : మండలంలోని పోలేపల్లి స్టేజీ వద్ద సోమవారం పలువురు రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వారం రోజులుగా యాప్ ద్వారా బుక్ చేసుకున్నా యూరియా ఇవ్వడం లేదన్నారు. దుకాణం వద్ద బయోమెట్రిక్లో సాంకేతిక లోపంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన విషయం తెలుసుకున్న ఏఓ లక్పతి జిల్లా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతుల ఐడీ ఆధారంగా యూరియా అందించడంతో రైతులు శాంతించారు. మహాశివుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. మహా శివుడికి అభిషేక పూజలను సంప్రదాయంగా చేపట్టారు. ఇక ప్రధానాలయంలో వేకువజామునే సుప్రభాతం నిర్వహించిన అర్చకులు సహస్రనామార్చనలు చేపట్టారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు నిర్వహించారు. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
నల్లగొండ : రానున్న మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్లగొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల ఆర్వోలు, ఏఆర్ఓల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, కౌంటింగ్ అయ్యే వరకు అన్ని అంశాలపై ముందే సంసిద్ధం కావాలని సూచించారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థుల డిపాజిట్, ఖర్చుల పరిమితి తదితర వివరాలను ఆర్ఓలు, ఏఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించాలి ప్రభుత్వ పథకాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు సమీక్షించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక అధికారులు మండలాల్లో అన్ని సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి ప్రతి నెలా నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి అధికారులు పాల్గొన్నారు. నల్లగొండ : నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం నల్లగొండలోని టీటీడీసీలో సర్పంచ్ల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్లు ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. వారి పదవీకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కె.అనిల్కుమార్, హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ డి.రాఘవేంద్రరావు, డీపీఓ శంకర్నాయక్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, చొల్లేటి ప్రభాకర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
జీజీహెచ్లో ప్రత్యేక నిఘా
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) నిఘా నీడలో ఉంది. రోజూ సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు ఆస్పత్రి ప్రధాన 2 గేట్లను మూసివేస్తున్నారు. ఒక్క గేటు నుంచే వైద్యులు, సిబ్బంది, రోగుల సహాయకులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. తెరిచి ఉన్న గేటు వద్ద 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతోపాటు అన్ని వార్డులు, ఎంసీహెచ్ ఆవరణలో ఉన్న 32 సీసీ కెమెరాలను మరమ్మతు చేయించి నిఘా పెంచారు. చోరీలను అరికట్టేలా.. ఆస్పత్రిలో గతంలో రోగుల సహాయకులతో పాటు రోగుల సెల్ఫోన్లు, బైక్ చోరీలు జరిగాయి. ఆస్పత్రికి ఉన్న మూడు ప్రధాన గేట్లను 24 గంటలు తెరిచి ఉంచడంతో రాత్రివేళ ఆస్పత్రిలోకి ఎవరు వస్తున్నారో.. పోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఇటీవల సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన గుర్రం నర్సింహారావు ఆస్పత్రిలో చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవుట్ పోస్టు సిబ్బందితో సమన్వయం జీజీహెచ్లో పోలీసు అవుట్పోస్ట్ సిబ్బందితో ఆస్పత్రి సెక్యూరిటీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక వాట్సప్ గ్రూప్ తయారు చేశారు. ఆస్పత్రిలో ఏదేని సంఘటన జరిగితే గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సమస్య పరిష్కరించేలా చొరవ తీసుకుంటున్నారు. ఫ సాయంత్రం 5 గంటలకే ప్రధాన గేట్లు మూసివేత.. ఒకే గేటు నుంచి రాకపోకలు ఫ సీసీ కెమెరాలకు మరమ్మతు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన గేట్లు నిత్యం తెరిచి ఉండటంతో ఎవరు వస్తుపోతున్నారో తెలియడం లేదు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో దొంగతనాలు జరుగకుండా కృషి చేస్తున్నాం. రోగులు, వారి సహాయకులు సహకరించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. – గుర్రం నరసింహరావు, సూపరింటెండెంట్ -
అప్పుడు ఆయన.. ఇప్పుడు ఆమె!
మున్సిపల్ బరిలో భార్యలను నిలిపే యోచనలో నేతలు మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026ఫ 18 మున్సిపాలిటీల్లో తొమ్మిదింట చైర్మన్లుగా అతివలకే అవకాశం ఫ నీలగిరి కార్పొరేషన్లోనూ మహిళకే మేయర్ పీఠం ఫ రొటేషన్లో హాలియా మినహా అన్నిచోట్లా మారిన రిజర్వేషన్ ఫ అత్యధిక వార్డుల్లో పోటీ చేయనున్న మహిళలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ముఖ్యనేతల స్థానాల్లో మహిళలే ఎక్కువ మంది పోటీ పడనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారిపోవడంతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో మహిళలు పోటీ చేయనున్నారు. నల్లగొండ కార్పొరేషన్ సహా చాలా మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 18 మున్సిపాలిటీల్లో తొమ్మిది చోట్ల మహిళలే చైర్మన్ కానున్నారు. నీలగిరి కార్పొరేషన్లో కూడా మేయర్గా మహిళకే అవకాశం దక్కింది. దీంతో పట్టణాల్లో ముఖ్య నేతలు తమ సతీమణులను పోటీలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. హాలియా మున్సిపాలిటీ చైర్మన్ స్థానం రిజర్వేషన్లలో మారలేదు. గతంలో, ఇప్పుడు జనరల్గానే ఉంది. నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గ పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. పోటీపై మల్లగుల్లాలు నల్లగొండ కార్పొరేషన్ మేయర్ పీఠం ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. గతంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన బుర్రి శ్రీనివాస్రెడ్డికి చెందిన 32వ వార్డు ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన సతీమణి చైతన్యరెడ్డిని నిలబెట్టి, మేయర్ పీఠం కోసం పోటీపడే అవకాశాలు ఉన్నాయి. మరో మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డికి చెందిన 17వ వార్డు కూడా ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన తన సతీమణినే నిలబెట్టే అవకాశం ఉంది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్కు చెందిన 47వ వార్డు మహిళకే రిజర్వ్ ఆయింది. దీంతో ఆయన అదే దిశగా ఆలోచిస్తున్నారు. బీజేపీ నేత పిల్లి రామరాజుయాదవ్దీ అదే పరిస్థితి. మిర్యాలగూడ చైర్మన్ స్థానం గతంలో జనరల్ కాగా, ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. మరోవైపు గతంలో చైర్మన్గా చేసిన తిరునగరు భార్గవ్ 36వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. మరోవైపు వైస్ చైర్మన్గా చేసిన కుర్ర కోటేశ్వర్రావు 21వ వార్డు కూడా బీసీ మహిళ అయింది. దీంతో వారు గందరగోళంలో పడ్డారు. వీరితోపాటు పలు ముఖ్యనేతలు కూడా ఎక్కడ పోటీ చేయాలోనని వెతుక్కునే పనిలో పడ్డారు. నందికొండలో మున్సిపల్ చైర్మన్ గతంలో జనరల్ మహిళ కాగా, ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో అక్కడ చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరికి ఈసారి అవకాశం లేకుండా పోయింది. దేవరకొండలో గతంలో చైర్మన్ స్థానం జనరల్ కాగా ప్రస్తుతం బీసీ మహిళకు కేటాయించారు. దీంతో అక్కడ చైర్మన్గా చేసిన ఆలంపల్లి నర్సింహకు అవకాశం లేకుండాపోయింది. ఆయన గతంలో గెలిచిన 16వ వార్డు కూడా ఎస్టీ జనరల్ కావడంతో ఆయన మరోవార్డుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వైస్ చైర్మన్గా చేసిన రహమత్ అలీది అదే పరిస్థితి. చండూరు గతంలో బీసీ మహిళ కోటాలో తోకల చంద్రకళ చైర్పర్సన్ కాగా, ఈసారి అది జనరల్కు రిజర్వ్ అయింది. చిట్యాల మున్సిపాలిటీ గతంలో జనరల్ కాగా, ప్రస్తుతం జనరల్ మహిళ అయ్యింది. గత చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి ప్రస్తుతం చైర్మన్ స్థానానికి పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. ఆయన వార్డు రిజర్వేషన్ కూడా మారిపోయింది. మున్సిపల్ చైర్మన్గా గతంలో పనిచేసిన వారి ఆశలు ఈసారి గల్లంతయ్యాయి. తాము చైర్మన్ స్థానంలో కూర్చోవాలనుకున్నా రిజర్వేషన్లు మారిపోవడంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు కార్పొరేటర్, కౌన్సిలర్గా పోటీ చేయాలకున్నా వారి వార్డుల రిజర్వేషన్లు కూడా మారిపోయాయి. దీంతో వారిలో కొందరు పక్క వార్డుల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు అవకాశం ఉన్న చోట తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధవుతున్నారు. -
కార్మిక, కర్షకులపై కేంద్రం దాడిచేస్తోంది
నల్లగొండ టౌన్ : దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపైన బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నల్లగొండలోని సీపీఎం కార్యాలయం నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూదోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తన కార్పొరేట్, మతతత్వ విధానాలను వేగవంతం చేసిందన్నారు. అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడులను అమలు చేస్తోందని, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, బీబీజీ రాంజీ చట్టం తెచ్చిందన్నారు. వీటిని రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేశ్, కందాల ప్రమీల, నారి ఐలయ్య, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్న వెంకులు, సయ్యద్ హాశం, దండెంపల్లి సరోజ, బండ శ్రీశైలం, ఎండీ.సలీం, కంబాలపల్లి ఆనంద్, దండెంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం
నల్లగొండ టూటౌన్ : మహిళల ఆర్థికాబివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు చెక్కులను, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటివరకు 265 కోట్ల మంది ఉచిత బస్సులో ప్రయాణం చేశారని చెప్పారు. రేషన్కార్డుదారులకు సన్న బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని పేదలందరికీ ఏడాదిలోగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. అయిటిపాములలో రూ.50 లక్షలతో 50 మంది ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయించామని, దాని ద్వారా మహిళలు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ జూపూడి రమేష్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జయమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
హాస్టల్లో ఉండటం ఇష్టం లేక..
గట్టుప్పల్: ప్రభుత్వ వసతి గృహం (హాస్టల్)లో ఉండటం ఇష్టం లేక పురుగు మందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట న నల్లగొండ జిల్లా అంతంపేట గ్రామంలో శనివారం జరిగింది. ఆదివారం పోలీసులు, గ్రా మస్తులు వివరాలు తెలిపారు. అంతంపేట గ్రా మానికి చెందిçన వీరమళ్ల వెంకటయ్యకు ముగ్గురు కుమార్తెలు.పెద్ద కుమార్తె వివాహం చేయగా.. రెండో కుమార్తె నవ్య (15) నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలైంది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన నవ్య తిరిగి హాస్టల్ వెళ్లడం ఇష్టం లేక శనివారం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. -
గుట్టలు తవ్వి.. మట్టి దందా!
మిర్యాలగూడ : మట్టి దందాలో గుట్టలు మాయమవుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో గుట్టలను తవ్వి మట్టి విక్రయించి సొమ్ము చేసుకోవడంతో పాటు ఆ భూములను సైతం ఆక్రమిస్తున్నారు. అనుమతులు ఒకచోట తీసుకుని వారికి అనువుగా ఉన్న చోట తవ్వకాలు చేస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. జేసీబీలు ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా రా త్రింబవళ్లు ఆ మట్టిని టిప్పర్ల ద్వారా వెంచర్లకు, ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నా.. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి.. జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాల్వ కట్ట మట్టి సైతం తరలింపు.. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో భాగంగా ఎడమకాల్వకు నీరందించాలని చేపట్టిన కాల్వ తవ్వకాల మట్టిని ఆ కాల్వ పటిష్టత కోసం ఇరువైపులా మట్టితో నింపి ఉంచారు. అట్టి మట్టిని కొందరు యథేచ్ఛగా తరలిస్తున్నారు. రైల్వే పనుల పేరుతో ఎన్ఎస్పీ కాల్వ కట్ట మట్టి, ఆలగడప, అవంతీపురం గ్రామాల్లోని గుట్టలతోపాటు కొత్తగూడెం శివారులోగల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 34, 36, 38లలో 8 ఎకరాల్లో ఉన్న ఏనెను తొలచి మట్టిని తరలిస్తున్నారు.బీ మట్టి దందాతో దామరచర్ల మండలం రాళ్లవాగుతండా వద్ద గతంలో అద్దంకి– నార్కట్పల్లి రహదారికి ఆనుకుని ఉన్న గుట్ట కనుమరుగైంది. దానికి వెనుకాలే ఉన్న మరో గుట్టను సైతం ఇప్పుడు సగ భాగానికి పైగా తవ్వేశారు. మట్టిని కొనుగోలు చేయాల్సి ఉన్నా.. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని బీబీనగర్– నల్లపాడు, కుక్కడం– విష్ణుపురం వరకు 55కి.మీ మేర రెండవ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా రైల్వే లైన్కు అవసరమైన మట్టిని సదరు కాంట్రాక్టర్ కొనుగోలు చేసి తరలించాల్సి ఉంది. కానీ మిర్యాలగూడ మండంలోని రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో వాటర్ ట్యాంక్తండా, మైసమ్మకుంటతండా, ఐలాపురం, చిల్లాపురం, నందిపాడు శివారులో ఎన్ఎస్పీ కాల్వకు ఆనుకుని ఉన్న మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లలో నింపి రాత్రి, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. రూ.కోట్లు విలువల చేసే మట్టి తరలిపోతున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా.. ఎన్ఎస్పీ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఫ రైల్వే లైన్, అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తవ్వకం ఫ టిప్పర్ల ద్వారా వెంచర్లకు, ఆంధ్రా ప్రాంతానికి రవాణా ఫ పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులురైల్వే పనుల కోసం మట్టి తరలించేందుకు గతంలో అనుమతి ఇచ్చాం. ఆ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 1000టన్నులు మట్టిని తరలించుకునేందుకు ఆయా తహసీల్దార్లు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. అక్రమంగా మట్టి తవ్వకాల విషయం మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జాకబ్, మైనింగ్ ఏడీ -
మద్యం నియంత్రణపై వెనక్కి తగ్గేదేలేదు
మునుగోడు : నియోజకవర్గంలో మద్యం నియంత్రణకు తాను తీసుకున్న నిర్ణయంపై తగ్గేదిలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తేల్చిచెప్పారు. ఆదివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో పలువురు మద్యం వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి మద్యం విక్రయాల సమయంలో మార్పులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలు పాడుచేసే వ్యాపారం చేయడం సరికాదని, కనీసం కొందరి ఆరోగ్యాన్ని అయినా కాపాడేందుకు తాను నిర్ణయించినా సమయాల ప్రకారం విక్రయాలు కొనసాగించాలని ఆదేశించారు. వైన్స్ యజమానులు మధ్యాహ్నం ఒంటి గంటకు దుకాణం తెరిచి, రాత్రి 9 గంటల వరకు విక్రయించాలన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లో మద్యం తాగేందుకు అనుమతించాలని సూచించారు. మద్యం ప్రియులను కట్టడి చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో కంటే అధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయిస్తానన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం విక్రయాలని విచ్చలవిడిగా కొనసాగనించే ప్రసక్తే లేదన్నారు.ఫ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి -
రేణుకా ఎల్లమ్మకు పూజలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు గాదే ఉమామహేశ్వరరావు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : ఎస్పీనల్లగొండ : సంక్రాంతి పండుగ ముగయడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణాలు అధికంగా సాగుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్శాఖ సమగ్ర చర్యలు చేపట్టిందని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ముఖ్య కూడళ్లలో 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామని పేర్కొన్నారు. వాహన రద్దీని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ అవసరమైన చోట్ల వెంటనే ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పార్టీల మోసాన్ని ఓటర్లు గుర్తించాలిమిర్యాలగూడ : మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు చేసే మోసాలను ఓటర్లు గుర్తించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే నాయకులను వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యంతో ప్రలోభాలకు గురిచేసే నాయకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లను మోసం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దరఖాస్తులను స్వీకరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిర్యాలగూడలో అధికార పార్టీ దరఖాస్తులను స్వీకరించి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితా సక్రమంగా లేదని వెంటనే విచారణ జరిపి ఓటరు జాబితాను సవరించి పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలన్నారు. బలం ఉన్న అన్ని చోట్ల సీపీఎం పోటీ చేస్తుందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రాంచంద్రు, సాంబానాయక్, సత్యనారాయణరావు, శ్రీను, వాడపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ‘కూచిపూడి’భువనగిరి : మండల పరిధిలోని రాయగిరి గ్రామ సమీపంలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం భువనగిరికి చెందిన కూచిపూడి నాట్య గురువు రమేష్బాబు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. వివిధ అంశాలపై చేసిన నృత్య ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్య క్రమంలో కళాకారులు శ్లోక, అవికా, దీక్షిత, సిరిశ్రీ, నిత్య, శ్రీమానస తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్లకు ‘పాలనా’ పాఠాలు
నల్లగొండ : నూతన సర్పంచ్లకు సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. విడతల వారీగా ఐదు రోజుల పాటు ఇచ్చే ఈ శిక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శిక్షణలో భాగంగా పంచాయతీరాజ్ చట్టం, పాలనపై సర్పంచ్లకు అవగాహన కల్పిస్తారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చేందుకు రిసోర్సు పర్సన్లను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. బ్యాచ్లుగా విభజన జిల్లాలో 869 పంచాయతీలు ఉండగా 866 పంచాయతీలకు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరాయి. ఎన్నికై న సర్పంచులు పాలనాపరంగా ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని సర్పంచులను తొమ్మిది బ్యాచ్లుగా విభజించి, ఐదు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఒక్కో బ్యాచ్కు ఐదు రోజుల చొప్పున శిక్షణ ఇస్తారు. ఇందుకోసం నల్లగొండలోని రామ్నగర్లో గల టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తారు. రాత్రి బస కూడా అక్కడే ఏర్పాటు చేశారు. వీరికి 12 మంది ట్రైనింగ్ పొంది వచ్చిన రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు. 24 అంశాలపై.. గ్రామ పాలనలో వ్యవస్ధలు ఎలా ఉంటాయి, పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం పంచాయతీ అధికారులు ఏంటి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బాధ్యతలు ఏంటన్నవి ఈ శిక్షణలో నూతన సర్పంచులకు బోధించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వనమహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజారోగ్యం, జనన మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక.. ఇలా మొత్తంగా 24 అంశాలపై శిక్షణ ఉండనుంది. పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా పల్లె అభివృద్ధికి కృషి చేసేలా అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణ సమయంలో హాజరయ్యే సర్పంచులకు బయోమెట్రిక్ ద్వారా శిక్షణ కేంద్రంలో హాజరు సైతం తీసుకోనున్నారు.ఫ నేటి నుంచి విడతల వారీగా శిక్షణ ఫ 24 అంశాలపై అవగాహన ఫ నల్లగొండలోని టీటీడీసీలో ఏర్పాట్లు పూర్తి విడత సర్పంచులు మొదటి 157 రెండవ 178 మూడవ 165 నాలుగో 187 ఐదవ 179 -
శిశుగృహ పిల్లలను దత్తత ఇవ్వాలి
నల్లగొండ : నల్లగొండ శిశు గృహలో ఉన్న పిల్లలను వెంటనే దత్తత ప్రక్రియలోకి తీసుకురావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత అన్నారు. ఆదివారం ఆమె నల్లగొండలోని బాలసదనం, శిశుగృహలను ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పిల్లల దత్తత సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. శిశుగృహ పిల్లలకు సంబంధించి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బాలికలంతా పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం బాలసదనం, శిశుగృహ పరిసరాలు, స్టోర్రూమ్, డార్మెటరీలను పరిశీలించారు. శిశుగృహలో పిల్లలకు అందుతున్న సేవలను, పిల్లల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.గణేష్, సిబ్బంది ఆర్.తేజస్వి, వెంకట సింహ, నరసింహరావు, రాము, ఎల్లేశ్వర్, మహేష్, నాగలక్ష్మి, సిబ్బంది ఉన్నారు. ఫ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరిత -
చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ఆదివారం రాత్రి అమావాస్య కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ఈఓ మోహన్బాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ , సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, అర్చకులు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆలయ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాలను గట్టు పైకి అనుమతించలేదు. నల్లగొండ, నార్కట్పల్లి నుంచి ఆలయానికి వచ్చే వాహనాలను కిలోమీటరు దూరంలో నిలిపివేశారు. -
నీలగిరి నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతా
జనరల్ ఆసుపత్రిలో రూ.25 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ను ఏడాదిలో పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చాం. రూ.150 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి కొత్త బ్లాక్ను నిర్మిస్తున్నాం. మెడికల్ కాలేజీ పెండింగ్ పనులను పూర్తి చేశాం. రూ.1.43 కోట్లతో మాన్యంచెల్కలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు నూతన భవన నిర్మాణం చేపట్టాం. రూ.1 కోటి జాతీయ ఆరోగ్యమిషన్ నిధులతో ఫుడ్ స్ట్రీట్ను అభివృద్ధి చేస్తున్నాం. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘నల్లగొండకు ఎంత చేసినా తక్కువే. ఈ నగరాన్ని మెగాసిటీలతో పోటీగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కార్పొరేషన్గా ఏర్పాటు చేశాం. నల్లగొండ కార్పొరేషన్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తాం, భవిష్యత్లో పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి అత్యున్నత జీవనప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీగా మార్చాలన్నదే మా ముందున్న తక్షణ కర్తవ్యం’ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ కార్పొరేషన్గా ప్రకటించిన తరువాత మంత్రి వెంకట్రెడ్డి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మా ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే పట్టణాభివృద్ధికి రూ.2 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. అవసరమైతే మరో రూ.2 వేల కోట్లు తేవడానికై నా సిద్ధమే. నల్లగొండకు ఏది కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో మాతో కలిసి నడిచేవారిని ఎన్నుకుంటే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నల్లగొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. దాదాపు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవబోతున్నారని ప్రజలే చెబుతున్నారు. నగరంలో ఇకపై ప్రతిరోజూ తాగునీటిని అందించే కార్యాచరణ చేపట్టాం. ప్రజలకు రోజూ కృష్ణాజలాలను తాగునీరుగా అందిస్తాం. ఇందుకోసం అమృత్ 2.0 కింద రూ.56.75 కోట్లతో నగరంలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచేందుకు కొత్తగా 11 వాటర్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణ పనులు చేపట్టాం. ఇవి 80 శాతం మేర పూర్తయ్యాయి. రా వాటర్ పంప్ హౌస్ వద్ద జనరేటర్ను ఏర్పాటు చేశాం. తద్వారా నీటి సరఫరాకు ఆటంకం లేకుండా పోయింది. హైదరాబాద్లాంటి మెట్రోసిటీలకే పరిమితమైన రింగురోడ్డుని నల్లగొండకు మంజూరు చేయించా. రూ.545 కోట్లతో పానగల్ ఛాయాసోమేశ్వరాలయం నుంచి మెడికల్ కాలేజీ (ఎస్ఎల్బీసీ కాలనీ) వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే రూ.260 కోట్ల ఆర్అండ్బీ నిధులతో మెడికల్ కాలేజీ నుంచి అద్దంకి–నార్కట్పలి్ల్ రహదారి (దుప్పలపల్లి) వరకు గ్రీన్ కారిడార్ రహదారిని నిర్మిస్తున్నాం. దర్వేశిపురం నాలుగులైన్ల రోడ్డును రూ.50 కోట్లతో, నల్లగొండ– ముశంపల్లి రోడ్డును రూ.100 కోట్లతో, నల్లగొండ–గుండ్లపల్లి–కురంపల్లి రోడ్డు పనులను రూ.60 కోట్లతో చేపట్టాం. నగరంలో మెరుగైన డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలో అమృత్ 2.0 పథకం కింద రూ.216.19 కోట్లతో అండర్ర్గౌండ్ డ్రెయినేజీ, నూతన ఎన్టీపీ నిర్మాణ పనులు చేపట్టాం. రూ.53 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.109.21 కోట్ల ఎస్ఎఫ్ నిధులతో నగరంలో అంతర్గత సీసీరోడ్లు, వరదలకాల్వలు, శ్మశానవాటికల నిర్మాణ పనులు చేపట్టాం. నల్లగొండలో అంతర్గత సీసీ రోడ్లు, బీటీ రోడ్లను వేస్తున్నాం. రూ.14కోట్లతో బస్టాండ్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు బీటీరోడ్డు అభివృద్ధి పనులు, రూ.18 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో డీఈఓ ఆఫీసు నుంచి మిర్యాలగూడ రోడ్డు బీటీరోడ్డు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రూ.4.01 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టాం. తాజాగా రూ.18.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశా. నగరంలో విద్యుత్ కోతలను నివారించడంతో పాటుగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇందుకోసం నగరం నలువైపులా ఐదు సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నాం. బీట్మార్కెట్, చర్లపల్లి, మునుగోడు రోడ్డు, లెప్రసీకాలనీ, కలెక్టరేట్ వెనుకవైపున చేపట్టిన ఈ పనులన్నీ కొనసాగుతున్నాయి. ఫ హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తా ఫ రెండేళ్లలోనే రూ.2 వేల కోట్ల పనులు చేపట్టాం ఫ విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం ఫ నగరం చుట్టూ రింగురోడ్డు నిర్మిస్తున్నాం ఫ కార్పొరేషన్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే ‘సాక్షి’తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేదపిల్లలకు కార్పొరేట్ తరహాలో విద్యనందించడంతో పాటు, పీజీ వరకు ఉన్నత విద్య నల్లగొండలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే నేను పట్టుబట్టి మహాత్మాగాంధీ యూనివర్శిటీని మంజూరు చేయించా. ప్రస్తుతం యూనివర్శిటీలో రూ.25 కోట్లతో చేపట్టిన న్యాక్ బిల్డింగ్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. రూ.175 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాలను ప్రారంభించాం. రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీని నిర్మిస్తున్నాం. రూ.200 కోట్లతో నగరంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను నిర్మిస్తున్నాం. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.9 కోట్లతో బొట్టుగూడలోని ప్రభుత్వ హైస్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు మెడికల్, ఐఐటీ ఫీజులను చెల్లిస్తున్నాం. రూ.85 కోట్లతో ఐటీఐలో ఏటీసీ సెంటర్ను ప్రారంభించాం. -
విజయవాడ హైవేపై యాక్సిడెంట్.. ఢీకొట్టిన మూడు కార్లు
సాక్షి, నల్గొండ: హైదరాబాద్ -విజయవాడ నేషనల్ హైవేపై సినిమాస్టంట్ను తలపించే యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కార్లు ఒకదానికొకటి వరుసగా మూడుకార్లు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ కారు అక్కడ హైవే నెంబర్ 65 వద్ద కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో దాని వెనుక వచ్చిన రెండు కార్లు వెనువెంటనే ఢీకొన్నాయి. దీంతో అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్తో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.మరోవైపు సంక్రాంతి సెలవులు ముగియడంతో పండగకు హైదరాబాద్ నుంచి ఊరెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
హైవేపై వాహనాల రద్దీ.. ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..
సాక్షి, నల్లగొండ: సంక్రాంతి పండుగ ముగిసింది. నగరవాసులు.. ఒక్కొక్కరుగా పల్లెలను వీడుతున్నారు. సిటీ వైపు పరుగు తీశారు. దీంతో, రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో హైవేలపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు.. పటుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశారు.సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు.. హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో, జాతీయ రహదారి-65పై హైదరాబాదు వైపు వాహనాలు పరుగులు తీస్తున్నాయి. శనివారం ఒక్కరోజే హైదరాబాద్ వైపు లక్షన్నర వాహనాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక, ఏపీ నుంచి వచ్చే భారీ వాహనాలను కోదాడ నుంచి హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, మల్లేపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ డైవర్షన్ చేశారు. మరికొన్ని వాహనాలను టోల్ ఫ్లాజాల వద్ద నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఉన్నట్టు వాహనదారులకు సూచిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి
అర్వపల్లి, నల్లగొండ: సంక్రాంతి సెలవులు ముగిసి శనివారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన (43), తుంగతుర్తి మండలం రావులపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత (48)తోపాటు తుంగతుర్తి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల సునీతారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్వపల్లి శివారులోని ముదిరాజ్కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఇంటి నిర్మాణం కోసం పోసిన ఇసుక కుప్పపై నుంచి వెళ్లి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో కారు ముందుభాగం ఎడమవైపు టైరు పేలింది. కారు పల్టీ కొట్టడంతోనే కల్పన రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత సునీతారాణి, గీత ఎగిరి కిందపడ్డారు. ప్రవీణ్కుమార్ కారులో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. కారు డ్రైవర్ నదిపల్లి గిరి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కల్పన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సునీతారాణి, ప్రవీణ్కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్కు తరలించారు. వీరిద్దరు అన్నాచెల్లెళ్లు. ఈ ప్రమాదం కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసముంటున్న గీత.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు సాయినితన్రెడ్డి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. కూతురు సౌమికకు పెళ్లి అయి భర్తతో కలిసి అమెరికాలో ఉంటోంది. వచ్చే నెలలో కుమారుడికి కాన్వొకేషన్ ఉంది. దీంతో గీత ఫిబ్రవరిలో పిల్లల వద్దకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, శనివారం పాఠశాలకు వెళ్తూ గీత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తల్లి మృతి విషయం తెలుసుకున్న కూతురు, కుమారుడు.. భారత్కు బయల్దేరారు. కాగా.. నల్లగొండలోని హనుమాన్నగర్లో నివాసం ఉండే లింగంపల్లి కల్పన తుంగతుర్తి కేజీబీవీలో ప్రత్యేకాధికారి(ఎస్ఓ)గా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పి.. రోజూ వచ్చే సమయం కంటే ముందుగానే శవమై వచ్చిందని ఆమె భర్త, పిల్లలు విలపించారు. గీత, కల్పన మృతదేహాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాళులర్పించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
మహిళలకే 50 శాతం వార్డులు
నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని నల్లగొండ నగర పాలక సంస్థతోపాటు, ఇతర మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్లో శనివారం ఆరు మున్సిపాలిటీలు, నల్లగొండ నగరపాలక సంస్థలో వార్డులకు రిజర్వేషన్ల ఖరారు చేసి మాట్లాడారు. ప్రభుత్వ జీఓ ప్రకారం 2011 జనాభా ప్రాతిపదికన, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రిజర్వేషన్ కేటాయింపులు చేశామన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఎన్నికలు జరగనున్న ఆరు మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు గాను నిబంధనల ప్రకారం 50 శాతం వార్డులను మహిళలకు కేటాయించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, చండూరు, దేవరకొండ ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
19 నుంచి సర్పంచ్లకు శిక్షణ
నల్లగొండ : నూతన సర్పంచ్లకు ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఐదు విడతల్లో ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి డీపీఓ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ, డీఆర్డీఓ సమావేశ మందిరాల్లో ఈ శిక్షణ తరగతులు ఉంటాయని, సర్పంచ్లు విధిగా హాజరు కావాలని కోరారు. విధుల్లో అలసత్వం వద్దుమర్రిగూడ(చింతపల్లి) : వైద్యులు, సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహించవద్దని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన చింతపల్లి మండలంలోని గడియగౌరారం పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానాలో అందుతున్న వైద్య సేవలతోపాటు మందుల వివరాలు, రిజిస్టర్లు పరిశీలించారు. పిల్లలకు అందుతున్న వ్యాదినిరోదక టీకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రాహుల పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, పల్లె దవాఖానా ఎంఎల్హెచ్పీ మనీషా, హెల్త్ అసిస్టెంట్ జనార్దన్, ఏఎన్ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలినల్లగొండ : సీఎం కప్ పోటీలు విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం నల్లగొండలోని కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంఈఓలు, పీడీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేలా తయారు చేయాలని సూచించారు. క్రీడాకారులకు అవసరమైన మైదానాలు, వసతులు, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. సీఎం కప్ పోటీల ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
త్వరగా వస్తానని చెప్పి..
నల్లగొండ పట్టణంలోని హనుమాన్నగర్లో నివాసం ఉండే లింగంపల్లి కల్పనకు 2024 డిసెంబరులో తుంగతుర్తి కేజీబీవీ పాఠశాలలో ఎస్వోగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం వచ్చింది. ఆమె భర్త యాదగిరి నల్లగొండలో ఎన్జీ కాలేజీ ఎదురుగా ఉన్న పోలీస్ కాంప్లెక్స్లో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు శ్రీకర్, కూతురు సాత్విక ఉన్నారు. కుమారుడు బీటెక్ మొదటి సంవత్సరం, కూతురు ఎంబీబీఎస్ చదువుతున్నది. సంక్రాంతి పండుగకు పిల్లలు ఇద్దరు నల్లగొండకు వచ్చారు. అంతా ఆనందంగా గడిపారు. కూతురు సాత్విక పుట్టిన రోజు శుక్రవారం కావడంతో కుటుంబ సభ్యులు సాత్విక స్నేహితులు కలిసి ఇంట్లో వేడుకలు చేసుకున్నారు. మరుసటి రోజైన శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరి మృతిచెందింది. ఇంత ఘోరం జరిగిందని అనుకోలేదు.. నా భార్యను నేను వెంకటేశ్వర కాలనీ వద్ద కారు ఎక్కించి వచ్చాను. మా తోడల్లుడు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. నేను ఏదో దెబ్బలు తగిలాయని అనుకున్నా. 9.10 గంటలకు నా భర్య చనిపోయిందని చెప్పారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని కల్ప న భర్త యాదగిరి బోరున విలపించారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పింది.. సాయంత్రం కంటే ముందుగానే శవమై వచ్చిందని విలపించారు. -
మహిళే తొలి మేయర్
నల్లగొండ కార్పొరేషన్ ‘జనరల్ మహిళ’కు కేటాయింపు ఫ 19 మున్సిపాలిటీల్లో 14 స్థానాలు జనరల్.. ఏడు మహిళలకు.. ఫ ఏడు నుంచి మూడుకు పడిపోయిన బీసీ స్థానాలు ఫ ఎస్సీలకు 2 స్థానాలు, ఎస్టీలకు దక్కని రిజర్వేషన్ ఫ మున్సిపల్ రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన నల్లగొండలో తొలి మేయర్ పదవి మహిళ దక్కించుకోబోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం శనివారం రిజర్వేషన్లను ఖరారు చేసింది. నల్లగొండ మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మిగతా 18 మున్సిపాలిటీలకు చైర్మన్/చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో కార్పొరేషన్తోపాటు 17 మున్సిపాలిటీల్లో (నకిరేకల్ మినహా) ఎన్నికలు జరుగనున్నాయి. మేయర్, చైర్మన్ల ఎంపికలో పార్టీల నిర్ణయమే ఫైనల్ నల్లగొండ కార్పొరేషన్ జనరల్ మహిళకు రిజర్వు కావడంతో మేయర్ ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాల నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిలో ఏ సామాజి వర్గానికి చెందిన మహిళ అయినా పోటీ పడొచ్చు. అయితే మేయర్ స్థానం ప్రత్యక్ష ఎన్నిక కానుందున, పార్టీల నిర్ణయమే కీలకం కానుంది. డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన వారిలో ఎవరిని కూర్చోబెట్టాలన్నది పార్టీ నిర్ణయమే. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లలోని 48 డివిజన్లలో అత్యధిక డివిజన్లను గెలుచుకున్న పార్టీకి చెందిన వారే మేయర్ కానున్నారు. 14 స్థానాలు జనరల్కే.. ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో 14 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలను అన్రిజర్వుడ్/జనరల్ చేసింది. ఇందులో 9 స్థానాలను మహిళలకు కేటాయించింది. ఆ స్థానాల్లో ఏ సామాజిక వర్గం వారైనా మహిళలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక బీసీలకు 2020 ఎన్నికల్లో ఏడు స్థానాలు లభించగా, ఈసారి కేవలం మూడు స్థానాలే దక్కాయి. ఎస్సీలకు రెండు స్థానాలు కేటాయించింది. ఎస్టీలకు జిల్లాలో ఒక్కస్థానం కూడా కేటాయించలేదు. ముఖ్యనేతల చుట్టూ ఆశావహులు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్, వార్డులు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పోటీ చేసేందుకు ముఖ్యనేతలను సంప్రదించిన అభ్యర్థులు ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు కావడంతో తమకు అవకాశం కల్పించాలంటూ మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించి గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు కూడా ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ప్రాంతం ప్రస్తుత రిజర్వేషన్ 2020లో.. నల్లగొండ కార్పొరేషన్ జనరల్ (మహిళ) జనరల్ చండూరు జనరల్ బీసీ (మహిళ) హాలియా జనరల్ జనరల్ మిర్యాలగూడ జనరల్ (మహిళ) జనరల్ చిట్యాల జనరల్ (మహిళ)జనరల్ నకిరేకల్ జనరల్ బీసీ దేవరకొండ బీసీ (మహిళ) జనరల్ నందికొండ ఎస్సీ జనరల్ (మహిళ) నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ పదవి ఈ సారి జనరల్ కేటగిరీకి రిజర్వు చేశారు. రాష్ట్ర యూనిట్గా మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయించడంతో నకిరేకల్ జనరల్ చేశారు. అయితే 20 వార్డులతో నకిరేకల్ మున్సిపాలిటీ 2020 డిసెంబర్ 16న ఏర్పాటైంది. 2021 ఏప్రిల్ 30న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2021 మే 7న కొత్త పాలకవర్గం కొలువుదీరింది. చైర్మన్ పదవి బీసీ జనరల్ అయ్యింది. ప్రస్తుతం నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం 2026 మే 6 వరకు ఉంది. ఈ నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లు ప్రకటించలేదు. నల్లగొండ కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు మారిపోయాయి. తాము పోటీచేసిన స్థానంలో అనుకూలమైన రిజర్వేషన్ కాకుండా మహిళలకు వచ్చిన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోట్ల తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు. నల్లగొండ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల్లోనూ గతంలో పోటీచేసి గెలిచిన స్థానాల్లో ఈసారి రిజర్వేషన్లు మారిపోయాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డితో సహా పలువురు కౌన్సి లర్ల స్థానాలు మారిపోయాయి. ఆయా స్థానాల్లో మహిళలకు రావడంతో అక్కడ తమ సతీమణులను నిలబెట్టే అవకాశం ఉంది. మరోవైపు తమకు అనుకూలమైన డివిజన్లలో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. -
సెలవులు జీవితాలు
నల్లగొండ, అర్వపల్లి : ఆ నలుగురు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు. వారంతా ఒకే మండలంలో పనిచేస్తున్నారు. నల్లగొండ నుంచి తుంగతుర్తి మండలానికి ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వెళుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్న వారు సెలవులు ముగియడంతో శనివారం పాఠశాలలకు పయనమయ్యారు. మరో అరగంటలో బడులకు చేరుకుంటారనగా.. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి శివారులో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన ఉపాధ్యాయ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసింది. విద్యార్థులను కలిచివేసింది. నల్లగొండ నుంచి తుంగతుర్తికి.. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన(43), తుంగతుర్తి మండలం రావులపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత(48)తో పాటు తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు అలువాల సునితారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరగా అర్వపల్లి శివారులోని ముదిరాజ్కాలనీ వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ టైరు పేలి 200 మీటర్ల దూరంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రోడ్డుపై దుమ్ములేవడంతో అక్కడ ఏమీ కనిపించలేదని స్థానికులు తెలిపారు. కల్పన, గీత తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. సునితారాణి, ప్రవీన్కుమార్లు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ గిరికి స్వల్ప గాయాలయ్యాయి. సీటు బెల్టులు ధరించి ఉంటే.. కారులో డ్రైవర్తో పాటు ఉపాధ్యాయులు కూడా సీటు బెల్టులు ధరించలేదు. ఈ బెల్టులు ధరించి ఉంటే ఇంతపెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. నివాళులర్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిఫ మరో అరగంట అయితే పాఠశాలలకు వెళ్లేవారే.. ఫ ఈలోపే కబళించిన మృత్యువు ఫ రోడ్డు ప్రమాదంలో ఎస్ఓ, హెచ్ఎం మృతి ఫ మరో ఇద్దరు హెచ్ఎంలకు తీవ్ర గాయాలు ఫ గాయపడిన హెచ్ఎంలు అన్నాచెల్లెళ్లు ఫ విషాదంలో ఉపాధ్యాయ లోకం -
ఆరు మాసాల క్రితమే ప్రమోషన్
నల్లగొండంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పోరెడ్డి గీతకు ఆరు మాసాల క్రితమే గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతి లభించింది. పెద్దకాపర్తి నుంచి తుంగతుర్తి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పోస్టింగ్ వచ్చింది. భర్త రఘుపతిరెడ్డి నల్లగొండ ఎస్పీ కార్యాలయంలోని ఎస్బీలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కొడుకు సాయినితిన్రెడ్డి, కూతురు సౌమిక ఉన్నారు. ఇరువురు అమెరికాలో ఉంటున్నారు. కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. సౌమిక తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటుంది. ఫిబ్రవరి 22న అమెరికా వెళ్లి రెండు నెలలు అక్కడే ఉండి తిరిగి వద్దామని అనుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంతలోనే గీత మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబమం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తల్లిని కడసారి చూసేందుకు అమెరికాలో ఉన్న ఇద్దరు పిల్లలు బయల్దేరారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం గీత అంత్యక్రియలు నల్లగొండలో జరగనున్నాయి. ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ప్రార్థనకు రాలేదని.. గీత ఆరు నెలలుగా క్రమంతప్పకుండా ప్రా ర్థన సమయానికి పాఠశాలకు హాజరవుతుంది. శనివారం ప్రార్థనకు రాలేదని, ఇంతలో ఈ దుర్వా ర్త వినాల్సి వచ్చిందని తోటి టీచర్లు కన్నీరు పెట్టారు. -
‘ఫార్మర్ రిజిస్ట్రీ’పై అనాసక్తి
పట్టాదార్ పాస్పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు ఫార్మర్ యూనిక్ ఐడీ కార్డు తప్పనిసరి. రైతులు ఏఈఓల వద్ద కాని తమ సమీప మీ సేవ కేంద్రాల్లో గాని విధిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారినల్లగొండ అగ్రికల్చర్: వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది మే 6వ తేదీన చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 5,65,782 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండగా.. ఇప్పటివరకు 2,32,755 మంది రైతులే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ప్రారంభమై 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు 52.72 శాతం పట్టాదార్ పాస్బుక్లు కలిగిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇంకా సగం మంది నమోదు చేసుకోలేదు. అదేవిధంగా అందులో జిల్లా వ్యాప్తంగా 2,81,413 మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులుగా ఉండగా.. కేవలం 1,26,072 మంది రైతులు (44.8 శాతం) రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. కేంద్ర పథకాలకు యూనిక్ నంబర్ తప్పనిసరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వనుంది. ఇందులో 11 అంకెల యూనిక్ ఐడీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్కార్డులు, ఫసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. భవిష్యత్లో ఎరువుల పంపిణీ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఉండనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గత నెల వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ను వ్యవసాయ విస్తరణ అధికారులే తమ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కల్పించింది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇలా.. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏఈఓల ద్వారాగాని, మీ సేవ కేంద్రాల్లో గాని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇందు కోసం ఆధార్కార్డుతో పాటు ఆధార్కు లింక్ అయిన మొబైల్ను తీసుకెళ్లాలి. ఫోన్కు 3 సార్లు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీ వస్తుంది. ఫ జిల్లావ్యాప్తంగా 5,65,782 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఫ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది 2,32,755 మంది రైతులే -
నీలగిరిని సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ కార్పొరేషన్గా మారిన నీలగిరిని సూపర్ స్మార్ట్ సిటీ చేయడమే ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్తో కలిసి మంత్రి కోమటిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా పాలనలో రూ.2,236.29 కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. రూ.216.19 కోట్లతో చేపట్టిన అమృత్ పథకం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, నూతన ఎస్టీపీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు కొత్త పైపులైన్ వేయిస్తున్నట్లు తెలిపారు. అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణాల కోసం టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.53 కోట్లు కేటాయించామన్నారు. ఎస్డీఎఫ్ ఫండ్స్ రూ.109.21 కోట్లతో పట్టణంలో అంతర్గత రోడ్లు, వరద కాల్వల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రూ.545 కోట్లతో పానగల్ నుంచి ఎస్ఎల్బీసీ వరకు జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయని, ఎస్ఎల్బీసీ నుంచి అద్దంకి–దుప్పలపల్లి రోడ్డు వరకు రూ.250 కోట్లతో నూతన రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. ఎంజీ యూనివర్సిటీలో రూ.250 కోట్లతో కొత్త భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు తాగునీటి సరఫరాకు రూ.125 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. లతీఫ్సాహెబ్, బ్రహ్మంగారి గుట్టల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. తొలి మేయర్ అదృష్టలక్ష్మి.. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పదవి మహిళకు రిజర్వు అయ్యిందని, మేయర్ పదవి దక్కించుకునేవారు అదృష్టలక్ష్మి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మున్సి పల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శంకర్నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్రెడ్డి, వంగూరి లక్ష్మయ్యనాయకులు పాల్గొన్నారు. ఫ రెండు సంవత్సరాలలో రూ.2,236.29 కోట్లతో అభివృద్ధి ఫ ఇంటింటికీ తాగునీరందిస్తాం ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. సంక్రాంతి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన యువకులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. పోరండ్ల వద్ద పార్టీ ముగించుకుని కారులో తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభానికి ఢీకొని, అనంతరం డివైడర్ను మోదింది. ఈ ప్రమాదంలో నవనీత్, సాయి తేజ ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడు సృజన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో జగిత్యాలలో విషాద వాతావరణం నెలకొంది. అతివేగం, మద్యం మత్తుతో పాటు యువకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సమాచారం.నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైవేపై ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికీ గాయాల పాలైయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. -
‘సర్’ మ్యాపింగ్ 69 శాతం
జిల్లాలో మూడు నెలల నుంచి ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 15,30,737 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 40 సంవత్సరాలు పైబడిన వారు 7,53,027 మంది ఉండగా ఇప్పటి వరకు 5,48,237 మంది ఓటర్లకు సంబంధించి 2002 నాటి సర్ జాబితాలోని ఓటర్లు, 2025 నాటి ఓటర్ల జాబితాతో పోల్చి మ్యాపింగ్ చేస్తున్నారు. ఇది 73 శాతం పూర్తయింది. 40 ఏళ్ల లోపువారు 7,77,710 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,06,212 మంది మ్యాపింగ్ పూర్తయింది. అంటే 67 శాతం పూర్తయింది. మొత్తం 40 ఏళ్లు పైబడిన వారు, 40 ఏళ్ల లోపు వారి మ్యాపింగ్ ప్రక్రియ 10,54,449 మందికి (69 శాతం) పూర్తయింది. నల్లగొండ : ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)కు సంబంధించి ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో 69 శాతం పూర్తయింది. 2025 ఓటరు జాబితాను 2002 నాటి జాబితాతో సరి చూస్తున్నారు. సీరియల్ నంబర్ ఆధారంగా రెండు ఓటర్ల జాబితాలో ఎక్కడెక్కడ ఓట్లు కలిగి ఉన్న విషయంపై మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బీఎల్ఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇల్లిల్లూ తిరిగి రెండు జాబితాల్లో పేర్లను సరిచూస్తూ సెల్ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తున్నారు. 2026 సర్ ఓటరు జాబితా తయారుకు ఎన్నికల కమిషన్ మార్చిలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆలోగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం చేపట్టనుంది. 2002 జాబితాలో ఎవరున్నారని ఆరా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడుతుంది. 2002లో ఉమ్మడి రాష్ట్రంలో సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం చేపట్టింది. అయితే తిరిగి 2026లో ఈ సర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంటే ప్రస్తుతం ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు 2002 సర్ ఓటర్ల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారో గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. 2002 జాబితాలో ఓట్లు లేకపోతే.. ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు 2002 సర్ జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రుల పేర్లను ఆ జాబితాలో వెతికి మ్యాపింగ్ చేస్తున్నారు. ఇందులో ఏవైనా అనుమానాలు ఉంటే ఓటర్లు సంబందిత బీఎల్ఓలను ఫోన్ ద్వారా సంప్రదించి తెలుసుకోవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అందుకు సంబందించి ఓటర్లకు అనుమానాలుంటే వెబ్సైట్ https-://voters.eci.gov.in/-home/book AcallRequest ఆన్లైన్లో వెళ్లి ఎపిక్ నంబర్, పోన్ నంబర్ను నమోదు చేస్తే సంబంధిత బీఎల్ఓకు ఆ ఓటరు ఫోన్ నంబర్ను ఈసీ నేరుగా పంపిస్తుంది. దాంతో బీఎల్ఓ ఆ ఓటరుకు ఫోన్ చేస్తుంది. 2002 జాబితాలోని తమ ఓటరు పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ నంబర్ వివరాలను చెప్పి 2025 జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఫ జిల్లాలో మూడు నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక విస్తృత సవరణ ఫ 2002 నాటి ఓటర్ల జాబితాతో 2025 జాబితా మ్యాపింగ్ ఫ 2002 సర్ జాబితాలో ఓటు ఎక్కడుందని ఆరా ఫ ఇల్లిల్లూ తిరిగి మ్యాపింగ్ చేస్తున్న బీఎల్ఓలు -
పునర్విభజన..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలు, మండలాల భౌగోళిక హద్దులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెవెన్యూపరంగా పాలన ఒక మండలం పరిధిలోకి వస్తే, శాంతిభద్రతలు మరో మండల పరిధిలో ఉన్నాయి. రెండు మూడు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను తెరపైకి తెచ్చింది. కొన్ని జిల్లాలు, డివిజన్ల పునర్విభజనే సరిగా లేదని, వాటిని సరిచేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు జిల్లాలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. 2016లో జిల్లాల పునర్విభజన రాష్ట్రంలో 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. పూర్వ నల్లగొండ జిల్లా మూడు జిల్లాలుగా నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. వాటితోపాటే రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలను చేసింది. అయితే అప్పట్లో చేసిన పునర్విభజన సరిగ్గా లేదని, వాటిని సరిచేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గందరగోళ పరిస్థితులు.. పలు మండలాలు, గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు పాలనపరంగా ఇబ్బందులు తప్పడం లేదు. మాడుగులపల్లి మండలం అప్పట్లో కొత్తగా ఏర్పడింది. నిడమనూరు, త్రిపురారం మండలాల్లోని 10 గ్రామాలు, తిప్పర్తి మండలంలో 5 గ్రామాలు, వేములపల్లి మండలంలో 13 గ్రామాలు తీసుకుని మాడుగులపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామం రెవెన్యూపరంగా త్రిపురారం మండలంలో ఉండగా, శాంతిభద్రతల పరంగా మాడుగులపల్లి మండలంలో ఉంది. గోపాలపురం, ధర్మాపురం, మాచినపల్లి రెవెన్యూపరంగా మాడుగలపల్లిలో ఉండగా, శాంతిభద్రతలు నిడమనూరు పరిధిలో ఉన్నాయి. బొమ్మకల్, భీమనపల్లి, పోరెడ్డిగూడెం, గుర్రప్పగూడెం, పామలపాడు గ్రామాల రెవెన్యూ మాడుగులపల్లిలో ఉండగా, శాంతిభద్రతలు వేములపల్లి మండల పరిధిలో ఉన్నాయి. పెద్ద సూరారం, చిన్న సూరారం, ఖాజీరామారం గ్రామాలు రెవెన్యూపరంగా నల్లగొండలో ఉండగా, శాంతిభద్రతలు తిప్పర్తి పరిధిలో ఉన్నాయి. నల్లగొండ మండల పరిధిలోని తొరగళ్లు, జి.చెన్నారం శాంతిభద్రతలు కనగల్ పరిధిలో ఉన్నాయి.ఫ జిల్లాల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం ఫ ప్రస్తుతం రెవెన్యూ ఒక మండలంలో, శాంతిభద్రతలు మరో మండలంలో.. ఫ కొన్ని మండలాల భౌగోళిక రూపు అస్తవ్యస్తం ఫ జిల్లాల పునర్విభజనతో ఇలాంటి ఇబ్బందులు తొలగుతాయని భావన ఫ తెరపైకి కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల డిమాండ్లు ప్రస్తుతం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల డిమాండ్ తెరపైకి వచ్చింది. మిర్యాలగూడను జిల్లా చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చినా ఆచరణకు నోచుకోలేదు. అదే సమయంలో నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలను కలిపి నల్లమల జిల్లా ఏర్పాటు చేయాలని అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. అదీ ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ఆలేరు, మోత్కూరును రెవెన్యూ డివిజన్లు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనూ పెట్టింది. అయినా అమలుకు నోచుకోలేదు. నకిరేకల్ను డివిజన్ చేయాలని ఇటీవల ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో మాట్లాడుతూ కోరారు. ఇదే క్రమంలో అప్పట్లో కొన్ని మండలాలను అవసరం లేకున్నా అసంబద్దంగా ఏర్పాటు చేశారన్న వాదన ఉంది. ఆయా మండలాలను రద్దుచేయవచ్చన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కొత్త మండలాల ఏర్పాటుకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండను కొత్త మండలం చేసేందుకు చర్యలు చేపట్టినా అమలుకు నోచుకోలేదు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి అడుగుతున్నారు. డిండి మండలంలోని చెరుకుపల్లిని కొత్త మండలంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం, మోతె మండలంలోని ఉర్లుగొండ లేదా రావిపహాడ్, మునగాల మండలంలోని రేపాల గ్రామాలను మండలాలుగా చేయాలన్న డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం మాడుగులపల్లి మండలంలో ఉన్న పూసలపాడ్, గజలాపురం, అభంగాపురం గ్రా మాలను తిరిగి త్రిపురారం మండలంలో కలపాలని, కన్నెకల్, ధర్మాపురం గ్రామాలను నిడమనూరు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్ మండలంలో ఏడు గ్రామాలే ఉన్నాయి. నారాయణపురం మండలంలోని లచ్చుగూడెం, చిల్లాపురం, పుట్టపాక, వావిల్లపల్లి , డి.చిల్లాపురం, చండూరు మండలంలోని కొండాపురం గ్రామాలను గట్టుప్పల్లో కలుపాలన్న డిమాండ్ ఉంది. గుర్రంపోడు మండలంలోని పాల్వాయి, మునింఖాన్గూడెం, కాల్వలపల్లి, శాఖా జిపురం గ్రామాలు కొండమల్లేపల్లి మండలానికి దగ్గరగా ఉన్నందున వాటిని ఆ మండలంలో చేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
మంత్రి చేతులమీదుగా నేడు పలు శంకుస్థాపనలు
నల్లగొండ : నల్లగొండలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డు వీటీ టెంపుల్ వద్ద రూ.2 కోట్ల వ్యయంతో 24గంటలు నీటిని అందించే పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. 10.30 గంటలకు చింతల్, రామ్నగర్, రాజీవ్ పార్క్, మామిళ్లగూడెం పార్కుల అభివృద్ధి, ఎన్జీ కాలనీలో రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను ఆయన ప్రారంభిస్తారు. ఎన్జీ కాలేజి నుంచి రామగిరి వరకు రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేణుకాఎల్లమ్మ ఆలయంలో పూజలుకనగల్ : మండలంలోని ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హారతినిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్కుమారాచార్యులు, గాదే ఉమామహేశ్వరరావు, దామోదర్రావు పాల్గొన్నారు. ఓటరు తుది జాబితా విడుదలనల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్కు సంబంధించిన ఓటరు తుది జాబితాను కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 48 వార్డుల్లో 180 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నీలగిరి కార్పొరేషన్లో మొత్తం 1,42,437 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో సీ్త్రలు 73,507, పురుషులు 68,874, ఇతరులు 56 మంది ఉన్నారని, వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీపీలు కృష్ణవేణి, సుకన్య, ఆర్వో శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ● జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత స్పష్టం చేశారు. శుక్రవారం జీజీహెచ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రికి నిత్యం వందలాది మంది రోగులు వస్తున్నారన్నారు. ప్రధానంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పుల కోసం.. క్లిష్టమైన రెఫరల్ కేసులు వస్తున్నాయని వారికి సరైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కొన్ని అనుకోని సంఘటనల్లో జరిగిన సమయంలో దుష్ప్రాచారం చేసే వారి విషయంలో.. మీడియా వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలన్నారు. ప్రజల ఆరోగ్యమే తమ లక్ష్యమని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ రవికాంత్ వర్మ, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై వాహనాల దారి మళ్లింపు
నల్లగొండ : సంక్రాంతి పండుగ ముగియడంతో ఏపీ నుంచి హైదరాబాద్కు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉండడంతో ఎన్హెచ్ 65పై ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహనాలను దారి మళ్లించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నందున్న ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని పేర్కొన్నారు. -
తప్పులు లేకుండా వార్డుల రిజర్వేషన్లు
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల అమలుకు జీవో ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం, పారదర్శకంగా అమలు చేయాలన్నారు. గత ఎన్నికల రిజర్వేషన్ డేటా, జనాభా గణాంకాలు, రొటేషన్ విధానం వంటి అంశాలను పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
తిరుమలగిరి(సాగర్) : తిరుమలగిరి మండల పరిధిలోని జువ్విచెట్టుతండా గ్రామ పంచాయతీకి చెందిన సపావత్ శ్రీను(36) అదృశ్యమైనట్లు ఎస్ఐ వీరశేఖర్ బుధవారం తెలిపారు. శ్రీను ఈ నెల 13వ తేదీన ఉదయం వేళ గ్రామ శివారులోని పెద్దవాగులో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాలేదని చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. బుధవారం శ్రీను తండ్రి సీర ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శ్రీను గురించిన ఆచూకీ తెలిసిన వారు 87126 70199 నంబర్కు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. -
సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో ‘జయ’ విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేటటౌన్ : ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏఎస్ రావు 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు 14 మంది అత్యత్తుమ ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. 9వ తరగతిలో 21 ర్యాంకులు ప్రకటించగా అందులో ఆరుగురు, 10వ తరగతిలో 20 ర్యాంకులు ప్రకటించగా అందులో ఎనిమిది మంది జయ పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. 9వ తరగతి నుంచి వై. వీక్షణ, 10వ తరగతి నుంచి వి. వైష్ణవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. -
గంజి శ్రీరేఖకు డాక్టరేట్
రామగిరి (నల్లగొండ): నల్లగొండ పట్టణానికి చెందిన గంజి శ్రీరేఖకు ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం డాక్టరేట్ ప్రకటించింది. శ్రీరేఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో డాక్టర్ జి. విద్యాసాగర్ మార్గదర్శకత్వంలో ‘ఇంపాక్ట్ ఆఫ్ హెచ్ఆర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ డబ్ల్యూ.ఎస్.ఆర్.టి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. దీంతో ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. శ్రీరేఖను ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు, తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, వెంకటరమణ, భర్త అమర్నాథ్ అభినందించారు. -
కారు ఢీకొని వ్యక్తి, ఐదు మేకలు మృతి
తుంగతుర్తి : కారు ఢీకొని వ్యక్తితో పాటు ఐదు మేకలు మృతిచెందాయి. ఈ ఘటన తుంగతుర్తి మండలం కొత్తగూడెం టోల్గేట్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన విరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కంచం వీరన్న(40) తన వ్యవసాయ క్షేత్రానికి మేకలను తోలుకొని వెళ్తుండగా.. అదే సమయంలో మద్దిరాల నుంచి హైదరాబాద్ వైపు కారులో వెళ్తున్న జస్వాల్ నిశాన్ అతివేగంగా వచ్చి కొత్తగూడెం టోల్గేట్ సమీపంలో వీరన్నతో పాటు మేకలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వీరన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఐదు మేకలు మృతిచెందగా.. మరో మూడు మేకలకు గాయాలయ్యాయి. వీరన్నను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్భువనగిరి : మండలంలోని పెంచికల్పహాడ్ గ్రామంలో మంగళవారం చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన సిలువేరు ఎల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించనట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాగా ఎల్లయ్య నివాసానికి మంగళవారం చిన్నారి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే గ్రామానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. మాంజా నుంచి తప్పించుకోవడం ఇలా.. మాడుగులపల్లి : సంక్రాంతి సందర్భంగా కొందరు చైనా మాంజాతో పతంగులు ఎగురవేస్తూ మనుషులు, పక్షుల ప్రాణాలను తీస్తున్నారు. అయితే చైనా మాంజా నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. బుధవారం నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు.. ద్విచక్ర వాహనంపై గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న రసూల్ అనే వ్యక్తి హెల్మెట్కు, షర్ట్ బటన్కు మధ్య కర్చీఫ్ను రక్షణ కవచంలా కట్టుకోని కనిపించాడు. ఎందుకిలా కట్టుకున్నావని పోలీసులు రసూల్ను ఆరా తీయగా.. మాంజా దారం గొంతుకు తగలకుండా ఉండేందుకు ఇలా కట్టుకున్నట్లు చెప్పాడు. చైనా మాంజా తగలకుండా తీసుకున్న జాగ్రత్తల పట్ల రసూల్ను ఎస్ఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది అభినందించారు. ఇతర వాహనదారులు కూడా చైనా మాంజా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వేపచెట్టుకు డ్రోన్తో రసాయనాలు స్ప్రే
ఆత్మకూరు(ఎం) : చాలా చోట్ల వేప చెట్లకు వైరస్ సోకడంతో ఆకులు రాలి చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఆత్మకూరు(ఎం) మండల పరిధిలోని రహీంఖాన్పేట గ్రామానికి చెందిన రైతు దుంప శివరాజు తన వ్యవసాయ పొలంలోని వేప చెట్లను కాపాడుకునేందుకు రసాయన మందును డ్రోన్ సహాయంతో పిచికారీ చేస్తున్నాడు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్టు అధికారులకు తెలియజేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో తానే స్వయంగా తెలుసుకుని డ్రోన్ ద్వారా రసాయన మందు పిచికారీ చేస్తున్నట్లు రైతు పేర్కొన్నాడు. గిరిజన నాయకులతో మాజీ మంత్రి సమావేశంనాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని విజయ విహార్లో మాజీ మంత్రి రవీంద్రనాయక్ బుధవారం గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు–గిరిజనుల పాత్ర, గిరిజనులు ఎదురొటున్న సమస్యలపై ఆయన చర్చించారు. త్వరలో నాగార్జునసాగర్ నుంచి ఢిల్లీవరకు బంజారా రథయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంత గిరిజనులంతా యాత్రకు మద్దతు తెలుపాలని అన్నారు. ఈ కార్యరక్రమంలో రమావత్ దినేష్నాయక్, గోపినాయక్, సర్దార్నాయక్, బాలునాయక్, రాములనాయక్, నరేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతుల్లో వరి సాగు
బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలంలోని ప్యారారం గ్రామానికి చెందిన చిమ్ముల మధుసూదన్రెడ్డి సేంద్రియ వ్యవసాయంతో పాటు వరి సాగులో డ్రమ్ సీడర్, విత్తనాలను వెదజల్లే ఆధునిక విధానాలు అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ ద్వారా ఎరువులు పిచికారీ చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తూ పెట్టుబడి ఖర్చులు ఆదా చేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా వెదజల్లే విధానంలోనే సాగుబొమ్మలరామారం మండలంలో ఎక్కువ మంది రైతులు సాంప్రదాయ విధానంలోనే వరి సాగు చేస్తుండగా.. చిమ్ముల మధుసూదన్రెడ్డి మాత్రం అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేస్తున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా తనకున్న 10 ఎకరాల్లో వెదజల్లే విధానంలోనే వరి సాగు చేస్తూ అధిక దిగుబడులు ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ సహాయంతో పురుగు మందులు పిచికారీ చేయిస్తున్నారు. అదేవిధంగా రైతుల నుంచి పశువుల పెంట కొనుగోలు చేసి సాగుకు ముందే పొలాల్లో వేసుకుని పూర్తిగా సేంద్రియ విధానంలో వరి సాగు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కరువువ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించకపోవడంతో డ్రమ్ సీడర్, వెదజల్లే విధానాలను గురించి వారికి తెలియడం లేదు. దీంతో రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. వెదజల్లే విధానంలో రైతు మధుసూదన్రెడ్డి వేసిన వరి చేనుడ్రోన్ సహాయంతో పురుగు మందు పిచికారీ చేయిస్తున్న మధుసూదన్రెడ్డి నాలుగేళ్లుగా వెదజల్లే విధానంతో అధిక దిగుబడులు పొందుతున్న రైతు మధుసూదన్రెడ్డి డ్రోన్ ద్వారా రసాయనాలు పిచికారీ చేస్తూ పలువురికి ఆదర్శం -
పల్లెల్లో క్రీడాపోటీలు
యాదగిరిగుట్ట: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కొత్తగా గెలిచిన సర్పంచ్ల ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఊరూ వాడా ఈ పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రధానంగా కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి బహుమతులు, పారితోషికాలు అందించారు. కనుమ వరకు కూడా వీటిని నిర్వహించనున్నారు. గెలుపోటములు ప్రధానం కాకుండా యువతలో ఉత్సాహం నింపేందుకు ఈ పోటీలు చేపట్టారు. -
ఎద్దులతోనే ఎవుసం
ఫ యంత్రాలు లేకుండా సేంద్రియ ఎరువులతో సాగు ఫ విభిన్న పంటలు సాగు చేస్తున్న అడ్డగూడూరు రైతు సురేష్ ఫ దేశీయ విత్తనాలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు అడ్డగూడూరు : యంత్రాల వినియోగం లేకుండా ఎద్దులతో అరకదున్ని సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తున్నాడు అడ్డగూడూరుకు చెందిన యువ రైతు తుప్పతి సురేష్. డిగ్రీ వరకు చదువుకున్న ఈ రైతు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఐదేళ్లుగా పాడి ఆవులు సాకుతూ దేశీయ వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. యూట్యూబ్లో ‘సురేష్ ఫార్మర్ చానల్’ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. విభిన్న పంటలు అంతరించి పోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణంతోపాటు నీటి, భూసారాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో యువ రైతు సురేష్ ముందుకు సాగుతున్నాడు. పంటల సాగులో యంత్రాలు వచ్చాక పశువుల పెంపకం తగ్గిపోయింది. వీటివాడకాన్ని పునరుద్ధరించాలన్న తలంపుతో ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నాడు. ఈ రైతుకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాల్లో దేశీయఽ వరి విత్తనాలైన బురూపి, కుకర్, రత్నం చోడి, నారాయణ కామిణి పంటను పండిస్తున్నాడు. 30 గుంటల్లో కొర్రలు, 30 గుంటల విస్తీర్ణంలో సజ్జలు, 2 ఎకరాల్లో దేశవాళీ వేరుశనగ, 30 గుంటల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు. పంటలను స్థానికంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లలో విక్రయిస్తున్నాడు. డ్రాగన్ఫ్రూట్ను మాత్రం స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తున్నాడు. వ్యవసాయంలో పాడి కూడా ప్రధానమైనదే. దీనికోసం రూ.2 లక్షలతో సాహివాలు జాతికి చెందిన రెండు ఆవులు, గిర్ జాతికి చెందిన ఒక ఆవు, ఒంగోలు జాతికి చెందిన ఒక ఆవు కొనుగోలు చేసి సాకుతున్నాడు. వాటి ద్వారా వచ్చే పేడ, మూత్రాన్ని పంటలకు సేంద్రియ ఎరువుగా వాడుతున్నాడు. వీటి నుంచి వచ్చే పాల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు. ఆవులకు కలిగిన లేగదూడలకు తిరుపతి, మంగ, గౌరి పేర్లు పెట్టి వాటిని తన బిడ్డలుగా భావిస్తూ సాకుతున్నాడు. -
సీఎం కప్ క్రీడలతో ప్రతిభ వెలుగులోకి..
● కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : సీఎం కప్ క్రీడాపోటీలతో క్రీడాకారుల ప్రతిభ వెలికితీయొచ్చని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 17 నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయికి క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కప్ పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల క్రీడాకారులను ప్రోత్సహించాలని ఎంఈఓలు, పీఈటీలతో కోరారు. ఈ పోటీల్లో అందరినీ భాగస్వాములు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, మల్లారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, గుమ్మల మోహన్రెడ్డి, మీర్ అక్బర్అలీ పాల్గొన్నారు. డబుల్ బెడ్రూంలు పంపిణీ చేయాలిమిర్యాలగూడ : మిర్యాలగూడలో వృథాగా పడి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మరమ్మతు చేయించి మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు పేదలకు ఇళ్లు అందించకపోవడం దురదృష్టకరమన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడు పేదల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న నల్లగొండలో జరిగే నిరసన ప్రదర్శనకు, ఈనెల 25న హైదరాబాద్లో జరిగే ఐద్వా జాతీయ మహాసభలకు మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, పాదూరి శశిధర్రెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రొండి శ్రీనివాస్, పరుశురాములు, వినోద్నాయక్, రామ్మూర్తి, గోవర్ధన, ఊర్మిళ, సత్యనారాయణరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. గోదా కల్యాణం
రామగిరి(నల్లగొండ) : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నల్లగొండలోని రామగిరి రామాలయంలో గోదాదేవీ, రంగనాథ స్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి దంపతులు, బుర్రి శ్రీనివాస్రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఆలయాల్లో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, కల్యాణ మంగళారతులు నిర్వహించారు. భక్తులు తిరుప్పావై పారాయణం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
వైభవంగా ‘భోగి’ బోనాలు
మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో బుధవారం భోగి బోనాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్దంగా బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి, గౌడ కులస్తులు కంఠమహేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించారు. ఆలయాల వద్ద బోనాలతో ప్రదక్షిణలు నిర్వహించారు. మోత్కూరు కొత్త బస్టాండ్లోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద, బిక్కేరు చెంత, అమ్మనబోలు రోడ్డు పక్కన కంఠ మహేశ్వర స్వామి ఆలయాల వద్ద బోనాలను మహిళలు సమర్పించారు. శివసత్తుల పూనకాలతో డప్పు చప్పుళ్లతో బాణసంచా పేలుస్తూ బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. -
సంబరాల సంక్రాంతి
సాక్షి, నెట్వర్క్ : ముంగిట్లో భోగిమంటలు.. వాకిట్లో ముగ్గులు.. పసుపుకుంకుమలు అద్దుకున్న గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తలనలు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. పిండివంటల ఘుమఘుమలు.. పిల్లలు, యువతుల కేరింతలు.. నింగికెగిరిన పతంగులు.. ఇలా పల్లెలన్నీ సంక్రాంతి శోభనుసంతరించుకున్నాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా బుధవారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువజామునే భోగిమంటలు వేసి భోగిభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకున్నారు. పిల్లలతల పై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందజేశారు. గురువారం సంక్రాంతి పండుగను జరుపుకోనుననారు. సంక్రాంతి రోజు చేయాల్సింది ఇదే.. శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షరూపం సూర్యభగవానుడు. సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి. సూర్యుడు సంక్రమణం జరిగే సమయంలో పూజలు చేస్తే పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. సంక్రాంతి రోజు మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు, దేవతలకు దానాలు చేయాలి. ఫ అంబరాన్నంటిన భోగి వేడుకలు ఫ రంగవల్లులతో ఆకట్టుకున్న లోగిళ్లు ఫ హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు ఫ బంధుమిత్రులు, ఆడపడుచుల రాకతో మురిసిన పల్లె, పట్నం -
బసవన్నలతో భుక్తి
ఆత్మకూర్(ఎస్) (సూర్యాపేట) : మండలంలోని ఏనుబాముల గ్రామానికి చెందిన బత్తుల వెంకట్రాములు గంగిరెద్దులను ఆడించడమే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నాడు. దాంతో ఇతడి పేరే గంగిరెద్దుల వెంకట్రాములుగా మారిపోయింది. వెంకట్రాములుతో పాటు అతడి కుటుంబ సభ్యులు సైతం తాతల కాలం నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. సంక్రాంతితో పాటు ఇతర రోజులలోకూడా గంగిరెద్దులను ఆడిస్తూ మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్తుంటారు. శుభ, అశుభ కార్యాలకు సైతం వీరిని ఆహ్వానిస్తుంటారు. దశదిన కార్యాలకు, కొందరు పెద్ద రైతులు, భూస్వాములు అందించే కొడే దూడలను తీసుకొచ్చి తమ వద్దే ఉంచుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. దూడలను గంగిరెద్దుగా మార్చేందుకు రెండు, మూడేళ్ల పాటు శిక్షణ ఇచ్చి ఆ తరువాత రంగంలోకి దింపుతారు. గంగిరెద్దులను వెంకట్రాములు కుటుంబం దైవంలా భావిస్తుంటారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు, మూడురోజులుగా వివిధ గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తున్నారు. -
బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు వివరాలు సమర్పించాలి
నార్కట్పల్లి: బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద సేకరించిన భూమి, చెల్లింపు వివరాలన్నీ వెంటనే సమర్పించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్, పంపు హౌ్స్ను పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటివరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, భూసేకరణకు చేసిన చెల్లింపులు తదితర వివరాలను ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ బద్రును అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ పనులు, వాటికి చేసిన చెల్లింపులు, నిధుల పెండింగ్ వివరాలు ఇవ్వాలని సంబంఽధిత అధికారులకు చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీఓ అశోక్రెడ్డి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, డీఈలు పిచ్చయ్య, మారం శ్రీనివాస్ ఉన్నారు. -
డీఎల్ఐ భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి
డిండి: డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్ఐ) లో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణానికి భూ సేకరణ, పునరావాస సమస్యలను అధిగమించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై నీటి పారుదల శాఖ అతిథి గృహంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ ఈఈలు డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి నీటి తరలింపు, రిజర్వాయర్ల నిర్మాణ వివరాలను కలెక్టర్కు వివరించారు. 3లక్షల 41 వేల ఎకరాలకు సాగునీరందించే డిండి ప్రాజెక్టు పనులకు రూ. 6190 కోట్లు కేటాయించారని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ తదితర పనులకు ఇప్పటి వరకు రూ.4450 కోట్లు చెల్లింపులు జరిగాయని తెలిపారు. ప్రాజెక్టు పనులు 7 ప్యాకేజీలో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. డిండి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను సర్పంచ్ రవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓ వెంకన్నకు సూచించారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
60ఏళ్లుగా పతంగుల తయారీలో ‘సాహు’ కుటుంబం
భువనగిరి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది గాలిపటాలు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వీటిని ఎగురవేస్తుంటారు. ఆరుదశాబ్దాలుగా ఈ పంతంగుల తయారీనే వృత్తిగా మలుచుకుంది భువనగిరికి చెందిన ఓ కుటుంబం. పట్టణంలోని సమ్మద్ చౌరస్తా సమీపంలో సాహు లక్ష్మీనారాయణ కుటుంబం 1963లో ఇంట్లోనే పతంగుల తయారీకి శ్రీకారం చుట్టింది. పతంగుల తయారీలో ఎన్నోమార్పులు వచ్చినా నేటికి సంప్రదాయ రీతిలో పేపర్, వెదురు కర్రలతో తయారు చేసి విక్రయిస్తున్నారు. గాలిపటాల తయారీకి అవసరమైన ముడిసరుకును హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లోనే పతంగుల సీజన్ వస్తుంది. దీనికోసం ఆగస్టు నుంచే పతంగులను తయారీకి శ్రీకారం చుడుతారు. నవంబర్కు వరకు తయారు చేసినవాటిని మార్కెట్లోకి తెస్తారు. ప్రతి సీజన్లో సుమారు 1,500 నుంచి రెండు వేల వరకు పతంగులను వివిధ డిజైన్లలో తయారు చేస్తారు. సీజన్లో పట్టణంలో నాలుగు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో డిజైన్, సైజులను బట్టి ఒక్కో పతంగికి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తుంటారు. ఎన్నో రకాల కవర్ పతంగులు వచ్చినప్పటికీ పేపర్ పతంగులకు మంచి డిమాండ్ ఉంటుంది. సీజన్కు 5 నెలల ముందు తయారు చేయడం ప్రారంభిస్తాం. ఇంట్లో అందరికీ పతంగులు తయారు చేయడం వచ్చు. ప్రస్తుతం మనవరాళ్లు కూడా తయారు చేస్తున్నారు. స్వయంగా తయారు చేసి విక్రయించడం ద్వారా కూలి డబ్బులు లాభంగా ఉంటుంది. – లక్ష్మీనారాయణ, పతంగుల తయారీదారుడు, భువనగిరి -
బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి
నల్లగొండ: ఆర్టీసీ బస్సు, ఆటో డ్రైవర్లకు పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరగడానికి మానవ తప్పిదాలే కారణమన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, సీట్బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆర్టీసీ బస్సు, ఆటో డ్రైవర్లు వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలన్నారు. అనంతరం ఎరైవ్ ఎలైవ్ పేరుతో ప్రయాణికుల ప్రాణ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రమాద రహిత ప్రయాణానికి సహకరిస్తామని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సైదులు, ఆర్టీసీ డిప్యూటీ రిజినల్ మేనేజర్ రాంరెడ్డి, డీఏం వెంకటరమణ, అంజయ్య పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి మర్రిగూడ: వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని యూపీహెచ్సీ, సీహెచ్సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా ఆరోగ్య మహిళా కేంద్రం, డయాలసిస్ యూనిట్, ఫార్మసీ, ల్యాబ్ను పరిశీలించి ఆరోగ్య కేంద్రాలను సమీక్షించారు. వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్నాయక్, షాలిని, దీపక్ తదితరులున్నారు. కాలుష్యాన్ని పరిశీలించిన ఈఈ చిట్యాల: పట్టణంలోని రైస్ మిల్లుల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ఇటీవల పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న చిట్యాల పట్టణంలోని చంద్రపురి కాలనీ, ఆదర్శనగర్, ముత్యాలమ్మగూడెంలలో రైస్ మిల్లుల నుంచి వెదజల్లుతున్న కాలుష్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య కారక పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాదయ్య, సంజీవ, ఎల్లేష్, యాదగిరి, శ్రీనివాస్, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. -
దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలి
శాలిగౌరారం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కందాల ప్రమీల అన్నారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న జీపు ప్రచార యాత్రను మంగళవారం ఆమె శాలిగౌరారం మండల కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు, వీబీ జీ రాంజీ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లుల రద్దుకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షుడు బొజ్జ చినవెంకులు, చలకాని మల్లయ్య, ఆంజనేయులు, జగన్, జ్యోతిబస్, వెంకన్న, రామచంద్రు, నర్సింహ, ఇస్మాయిల్, సత్తెమ్మ పాల్గొన్నారు. -
పండుగొచ్చింది
పల్లెగూటికి..పిండి వంటలకు కేరాఫ్ తాళ్లగడ్డఆనందం.. ఆరోగ్యంహరిదాసు.. భాగ్యలక్ష్మిఫ 30 ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతం పిండివంటలకు కేరాఫ్గా నిలిచింది. తాళ్లగడ్డకు చెందిన శ్రీరాముల అంజమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ విక్రయిస్తోంది. అంజమ్మ మొదట్లో కారపూస చేసి విక్రయించేది. ఆమె చేసిన పిండి వంటలు బాగుండడంతో గిరాకీ పెరగడం ప్రారంభమైంది. దాంతో ఆమె కూడా అన్నిరకాల పిండి వంటలను తయారు చేయడం మొదలు పెట్టారు. అంజమ్మ కుమారులు, మనుమళ్లు సైతం నాలుగు దుకాణాలు ఏర్పాటు చేసి పిండి వంటలను తయారు చేసి విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి తీసుకెళ్తుంటారు. కొందరు ఆర్డర్లు ఇచ్చి మరీ పిండి వంటలు చేయించి తీసుకెళ్తుంటారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే గిరాకీ అధికంగా ఉంటుంది. కారపూస, సకినాలు, చెకోడీలు, బూందీ, లడ్డూలు, అరిసెలు, కట్టె గారెలు, పూర్ణాలు, గవ్వలు, మైసూర్పాక్ ఇలా అన్ని రకాల పిడి వంటలు వీరు తయారు చేసి కిలోల చొప్పున విక్రయిస్తున్నారు.ఫ మూడు రోజులు సందడే.. సందడి ఫ తొలిరోజు భోగి మంటలు, భోగిపండ్లు ప్రత్యేకం ఫ రంగవల్లులతో కళకళలాడనున్న లోగిళ్లు సూర్యాపేటటౌన్, రామగిరి(నల్లగొండ) : సంక్రాంతి పండుగకు చిన్నారులు, యువత పతంగులను ఉత్సాహంగా ఎగురవేస్తుంటారు. వీటిని ఎగురవేయడంలోనూ ఆరోగ్యపరమైన కారణాలతోపాటు, శాసీ్త్రయత కూడా దాగి ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేశాడని, అది ఇంద్రలోకానికి చేరిందని చెప్పుకుంటారు. అదేవిధంగా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఆకాశం వైపు చూస్తూ పతంగులు ఎగురవేయడం సూర్యారాధనకు గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. ఎముకలు బలపడతాయి. విటమిన్ ఈ సరఫరా పెరుగుతుంది. చలి తగ్గే సమయంలో సూర్యకిరణాలు శరీరానికి అందడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో వారు దానివైపు చూసే తీక్షణ చూపు చిన్నారుల కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇదిలా ఉండగా.. దుకాణాల్లో కొన్నవే కాకుండా కొంతమంది చిన్నారులు గాలిపటాలను వారే సొంతంగా తయారు చేసుకుంటుంటారు. చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారంలో పేపర్లను కత్తిరించుకొని అందంగా తీర్చిదిద్దుతుంటారు. దీని ద్వారా గణితంలోని జ్యామితి, ఆకారాలు వారికి తెలుస్తాయి. సూర్యాపేటలో గంగిరెద్దును ఆడిస్తున్న దృశ్యంఫ ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణ ఫ ప్రభాత సమయంలో ప్రజలను మేల్కొలుపుతున్న మహిళ రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అయ్యోరి మురళి గతంలో ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణతో సంకీర్తనలు, పాశురాలు పాడుతూ ప్రతి గడప ముందుకు వచ్చేవాడు. ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారే వరకు గ్రామంలో సంచరిస్తూ తన మధురమైన గాత్రంతో ప్రజలను మేల్కొలిపేవాడు. మూడేళ్ల క్రితం ఆయన హఠాన్మరణంతో ఆ గ్రామం చిన్నబోయినట్లయింది. దాంతో తండ్రి వృత్తిని తానే స్వీకరించింది భాగ్యలక్ష్మి. ధనుర్మాసం రావడంతోటే తెల్లవారుజామున ప్రతి ఇంటికి వెళ్లి తన శ్రావ్యమైన గొంతుతో పాశురాలు, సంకీర్తనలు పాడుతూ ఇంటిల్లిపాదినీ మేల్కొలుపుతుంది భాగ్యలక్ష్మి. ఆమె సంకీర్తనలు విన్న రాజాపేట ప్రజలు ఆమె తండ్రి మురళిని గుర్తుతెచ్చుకోకుండా ఉండలేరు. మురళికి ఒక్కగానొక్క కుమార్తె అయిన రేపాక భాగ్యక్ష్మి తన తండ్రితోపాటే పాటలు, సంకీర్తనలు సంకీర్తనలు పాడుతూ తిరిగేది. తండ్రి తదనంతరం ప్రతి ధనుర్మాసంలో ఉదయంపూట గ్రామంలోని కాలనీల్లో మహిళా హరిదాసు వేషధారణతో సంచరిస్తూ తండ్రి పాడిన పాటలను మైక్ ద్వారా వినిపించడమే కాకుండా తన గాత్రంతో తండ్రి చదివే పద్యాలను చదువుతూ ప్రజలకు మేల్కొలపడాన్ని వృత్తిగా స్వీకరించింది. పండగ రోజుల్లో గ్రామ ప్రజలు ఇచ్చిన కానుకలను స్వీరిస్తూ వారికి ఆశీర్వచనాలు తెలియజేస్తుంది. పురుషులకు తీసిపోకుండా పౌరోహిత్యం మురళి కుమార్తె భాగ్యలక్ష్మి తన తండ్రి బాటలోనే నడుస్తుంది. మురళి బతికున్న రోజుల్లో శుభాకార్యాలు నిర్వహించేవాడు. అతని ఒక్కగానొక్క కుమార్తె భాగ్యలక్ష్మి తండ్రిలాగా పౌరహిత్యం నేర్చుకుంది. పురుషులకు తీసిపోకుండా చక్కటి ఉచ్చారణతో మంత్రాలు చదువుతూ వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వినాయక విగ్రహ ప్రతిష్ఠలు, సత్యనారాయణ వ్రతాలు వంటివి నిర్వహిస్తోంది. గ్రామ ప్రజలు కూడా ఆమె తండ్రిని ఆదరించినట్లే ఆమెనూ ఆదరించడం విశేషం. చిన్నారులకు జ్ఞానం కలగాలని భోగి పండ్లు పోస్తారుఫ కాండూరి వెంకటాచార్యులు, గుట్ట ఆలయ ప్రధాన అర్చకుడు యాదగిరిగుట్ట : భగవంతుడి అనుగ్రహం ఉండాలని ధనుర్మాసంలో గోదాదేవి పూజలు చేస్తుంది. ఇందులో భాగంగానే అమ్మవారు కృష్ణ పరమాత్మను అత్యంత పవిత్రంగా భావించి వర్షాలు బాగా పడాలని, ఆరోగ్యం బాగుండాలని, పంటలుబాగా పండాలని వేడుకుంటూ గోదాదేవి అమ్మవారు వ్రతాన్ని ఆచరిస్తుంది. మకరంలో సూర్యుడు సాయంత్రం 8.45గంటలకు ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో చిన్న పిల్లలకు కొత్త పంటల నుంచి వచ్చిన బియ్యం, నువ్వులు, పైసలు, రేగు పండ్లు శ్రీస్వామి వారి పాదాల వద్ద పెట్టి పిల్లల నెత్తిపై పోస్తారు. చిన్నారులకు జ్ఞానం కలుగాలని భదిరికా (రేగుపండ్లు) ఫలాలను భోగి రోజున పోస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. మంచి వెలుతురును ఇచ్చే పండుగనే సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈశ్వర తత్వం కలిగిన గోవును పూజించే సమయమే సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యనారాయణుడిని ధాన్యం చేస్తే చాలా బాగుంటుంది. విశాలమైన ప్రదేశంలోనే పతంగులను ఎగురవేసేందుకు పిల్లలకు అవకాశమివ్వాలి. దారం తెగి చెట్లు, ఇళ్లపై పడితే వారిని అక్కడకు వెళ్లనీయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో భవనాలపై గాలిపటాలు ఎగరవేయకుండా జాగ్రత్తపడాలి. చైనా మాంజా వాడకుండా చూడాలి. విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో పతంగులను ఎగురవేయొద్దు. మూడు రోజుల పండుగ సంక్రాంతికి పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే పనిలో రైతులు.. ఇళ్ల లోగిళ్లలో రంగవల్లులు వేస్తూ యువతులు.. పిండివంటల తయారీలో మహిళలు.. గాలిపటాల ఎగురవేతలో చిన్నారులు.. ఆటల పోటీల్లో యువకులు.. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. మరో పక్క బంధుమిత్రుల రాక.. కొత్త కోడళ్లు, అల్లుళ్ల సందడితో పండుగ కళ ఉట్టిపడుతోంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ఊర్లన్నీ సందడిగా మారాయి. బుధవారం భోగి సందర్భంగా భోగి మంటలు వేస్తారు. చిన్నారులకు భోగి పళ్లు పోస్తారు. -
దద్దరిల్లిన పంతంగి టోల్ప్లాజా.. మరో రికార్డు!
సాక్షి, యాదాద్రి: సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ (మం) పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి సంక్రాంతికి నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లినట్టు టోల్ సిబ్బంది చెబుతున్నారు.మరోవైపు.. కొందరు పోకిరీలు టోల్ ప్లాజాల వద్ద విచ్చలవిడిగా అత్యవరస సైరన్స్(పోలీస్, అంబులెన్స్) దుర్వినియోగం చేస్తున్నారు. సైరన్తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు కొందరు పోకిరీలు ఇలా సైరన్ మోగిస్తూ హంగామా చేస్తున్నట్టు టోల్ సిబ్బంది గుర్తించారు. వీఐపీల్లా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టోకరా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరన్ చప్పుడుతో మిగతా వాహనదారులను హడలెత్తిస్తున్నారు.మూడు రోజులుగా సైరన్లతో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లినట్టు సిబ్బంది చెబుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే బామ్మర్దిని, మంత్రి గారి బంధువును అంటూ ఫేక్ వీఐపీలు టోల్ సిబ్బందిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో, పోకిరీల సైరన్స్ పోలీసులకు సవాల్గా మారాయి. -
Nalgonda: వామ్మో.. పూర్తిగా తిన్న తర్వాత..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణంలోని ప్రసాద్ ఉడిపి హోటల్ దారుణం జరిగింది. సాంబారులో జెర్రీ కనిపించింది. పూర్తిగా తిన్న తర్వాత సాంబారులో జెర్రీని గమనించిన ఓ వ్యక్తి.. హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. భారీగా రేట్లు తీసుకోవడమే కాదని.. ప్రజల ప్రాణాలను లెక్కలోకి తీసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల విజయవాడ సూర్యారావుపేటలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్ అండ్ అడల్ట్ట్రేషన్ కేసు నమోదు చేసి హోటల్ను సీజ్ చేశారు.మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రెస్టారెంట్, హోటల్ నిర్వాహకుల నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి నిల్వచేసిన పదార్థాలు.. కుళ్లిన ఆహారాన్ని నిబంధనలు అతిక్రమించి విక్రయిస్తున్నారు. అధికారుల తనిఖీల్లోనూ వాస్తవాలు బట్టబయలవుతున్నాయి. కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. -
సోలార్ వినియోగదారులకు షాక్!
కోదాడ : సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఓ వైపు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండగా.. మరోవైపు వినియోగదారుడిపై అధిక భారం మోపుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) గుట్టుచప్పుడు కాకుండా సోలార్ బిల్లంగ్లో మార్పులు చేసింది. పథకం ప్రారంభంలో ఉన్న నెట్ మీటరింగ్కు బదులు నెట్ బిల్లింగ్ను అమలు చేస్తోంది. దీని లోగుట్టు అర్ధంకాక వినియోగదారుడు భారీగా నష్టపోతున్నాడు. సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ఇదేమిటని ప్రశ్నిస్తే అదంతా మాకు తెలియదు.. రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే బిల్లింగ్ విధానంలో మార్పు వచ్చిందని స్థానిక విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇంటి అవసరాలకు అవసరమయ్యే విద్యుత్ను సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ అనే పథకాన్ని గత సంవత్సరం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే అయ్యే ఖర్చు సుమారు రూ.2లక్షల్లో సబ్సిడీ కింద రూ.78వేలు కేంద్ర ప్రభుత్వం వినియోగదారుడి అకౌంట్లో వేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వమే బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో పలువురు ఈ పథకం ద్వారా తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో నెట్ మీటరింగ్ విధానం అమలు చేసేవారు గత అక్టోబర్ నుంచి దీన్ని నెట్ బిల్లింగ్గా మార్చారు. సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారుడు వాటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ను విద్యుత్ సంస్థకు సరఫరా చేస్తాడు. దీన్ని ఎక్స్పోర్ట్ విద్యుత్ అంటారు. అదే సమయంలో వినియోగదారుడు విద్యుత్ సంస్థ నుంచి తన ఇంటి అవసరాలకు వాడుకుంటాడు. దీన్ని ఇంపోర్ట్ విద్యుత్ అంటారు. గతంలో వినియోగదారుడు వాడుకున్న విద్యుత్కు తన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్లో నుంచి తీసేసి మిగిలిన యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. ఉదాహరణకు వినియోగదారుడు ఒక నెల 300 యూనిట్ల విద్యుత్ వాడుకుంటే.. అతడు తన సోలార్ ప్యానల్స్ ద్వారా 200 యూనిట్లు ఉత్పత్తి చేశాడనుకుంటే దాన్ని అతను వాడుకున్న 300 యూనిట్ల నుంచి తీసివేసి మిగిలిన 100 యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. దీన్నే నెట్ మీటరింగ్ అంటారు. అమ్మబొతే అడవి.. కొనబోతే కొరివి విద్యుత్ సంస్థ వినియోగదారుడికి 200 యూనిట్ల వరకు యూనిట్ రూ.5 చొప్పున, 200 నుంచి 300 యూనిట్ల వరకు రూ.6, 300 యూనిట్లు దాటితే సుమారు రూ.7 వరకు వసూలు చేస్తుంది. ఒక వినియోగదారుడు 300 యూనిట్లు వాడుకుంటే దానికి విద్యుత్ సంస్థ రూ.7 చొప్పున రూ.2100 వసూలు చేస్తుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా వినియోగదారుడు 200 యూనిట్లు ఉత్పత్తి చేస్తే దానికి యూనిట్కు రూ.5.25 చొప్పున రూ.1050 మాత్రమే ఇస్తుంది. అంటే తన విద్యుత్ను యూనిట్కు రూ.7 అమ్ముతున్న సంస్థ వినియోగదారుడి విద్యుత్కు మాత్రం యూనిట్కు రూ.5.25 మాత్రమే ఇస్తుంది. దీన్నె నెట్ బిల్లింగ్ అంటారు. నెట్ మీటరింగ్ విధానంలో వాడుకున్న విద్యుత్ 300 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ 200 యూనిట్లు ముందుగానే తీసేవేస్తే మిగిలిన వంద యూనిట్లకు స్లాబ్ ప్రకారం రూ.5 వసూలు చేయాలి. దీని కోసమే నెట్ బిల్లింగ్ విధానాన్ని టీజీఎస్పీడీసీఎల్ అమలు చేస్తుందని వినయోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో నెట్ మీటరింగ్ విధానం అమలు దానిని ప్రసుత్తం నెట్ బిల్లింగ్ విధానంలోకి మార్చిన టీజీఎస్పీడీసీఎల్ ఇంపోర్ట్కు ఎక్కువ ఛార్జీ వసూలు ఎక్స్పోర్ట్కు తక్కువ ధర చెల్లింపుఅధికారులు ఏమంటున్నారంటే.. సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు గృహజ్యోతి పథకాన్ని వినయోగించుకోవడం వల్ల సంస్థకు భారీ నష్టం జరుగుతుంది. దీంతో సంస్థ ఉన్నతాధికారులు బిల్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లోనే మార్చారు. దీనిలో మా ప్రమేయం ఏమిలేదని స్థానిక విద్యుత్ అధికారులు అంటున్నారు. -
చలికాలం జీవాల పెంపకంలో జాగ్రత్తలు
22 వరకు అమ్మతల్లి టీకాలుపశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో పశువైద్య సిబ్బంది ఈ నెల 22వ తేదీ వరకు జీవాలకు అమ్మతల్లి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రైతు ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టీకాలు వేయించకపోతే జీవాలు మరణించి రైతులు, కాపరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.త్రిపురారం : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ ఉంది. దీంతో జీవాలు, పశువులు జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జీవాలు, పశువులు వ్యాదుల బారిన పశు పోషకులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని త్రిపురారం మండల పశువైద్యాధికారి నాగేందర్ సూచిస్తున్నారు. చలికాలం జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. 1. జలుబు, దగ్గు : తీవ్రమైన చలి ఉన్నప్పుడు జీవాలకు జలుబు, దగ్గు సోకితే తుమ్ములతో పాటు కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చీమిడి పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రిముల ద్వారా సోకే అంటువ్యాధులతో పాటు ఆహారం ద్వారా శ్యాసకోశంలోకి వచ్చే కణాలు, నూనె పదార్థాలు, శ్వాసకోశాన్ని చికాకు పెట్టే ఇతర పదార్థాలు జలుబు, దగ్గుకు కారణమవుతాయి. జీవాల పాకలు ఇరుకుగా ఉండటం.. గాలి, వెలుతురు సరిగా లేకపోవడం.. పాకల్లో తేమ, తడి ఎక్కువగా ఉండడం.. కాలుష్యం, దుమ్ము వాతావరణంలో అకస్మాతుగా వచ్చే మార్పులు ఈ జబ్బుకు కారణమవుతాయి. వ్యాధి నివారణకు పాకలోకి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. వాతావరణం సరిగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచాలి. జబ్బులు సోకిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలి. ఒకవేళ జీవం చనిపోతే పోస్టుమార్టం ద్వారా వ్యాధి నిర్ధారించుకొని మందలో మిగిలిన జీవాలకు వెంటనే చికిత్స చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్త టీకాలు వేయించుకోవాలి. 2. దొమ్మ రోగం : పశువుల్లో దొమ్మ రోగం వ్యాప్తికి పలు రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్న జీవులు కారణం. కంటేజియస్ కాప్రెస్ ప్లూరో నిమోనియా అనే వైరస్ కారణంగా మేకలకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది. ఈ వ్యాధి సోకిన జీవాలకు తీవ్రమైన జ్వరం ఉంటుంది. వేగంగా శ్వాస పీల్చుకోవడం, ఎగ శ్వాస, ముక్కు నుంచి నీరు, చీమిడి కారడం, ఆకలి లేకపోవడంతో జీవాలు రోజురోజుకు నీరసించిపోతాయి. కల్లు ఎర్రబడి నీరుగారడం, వీపు భాగం వంగి ఉండడం, తల, మెడ ముందుకు సాగినట్లు కనిపిస్తాయి. ముక్కు రంధ్రాలు వెడల్పు అవుతాయి. త్వరగా చికిత్స చేయించకపోతే ఊపిరితిత్తులు వాచి వాటికి చీము పట్టే ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణాలు అమ్మతల్లి వీవీఆర్ మొదలైన జబ్బుల్లో కూడా కనిపిస్తాయి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, శుభ్రమైన నీటిని అందిస్తూ ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి. -
ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత
శాలిగౌరారం : ఆస్తి తగాదాతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిలిపివేశారు. రెండు రోజులుగా ఇంటిముందు మృతదేహంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన అయితగోని పెంటయ్య, అక్కులయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు తల్లిదండ్రులు సంపాందించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక్కొక్కరు 6 ఎకరాలు చొప్పున సమానంగా పంచుకున్నారు. పెంటయ్యకు ఇద్దరు కుమారులు రవీందర్, జానయ్యతో పాటు కుమార్తె ఉన్నారు. అక్కులయ్యకు సంతానం లేరు. దీంతో అక్కులయ్య అతడి భార్య శాంతమ్మ(65)ను పెంటయ్య ఇద్దరు కుమారులు చూసుకునేవారు. అక్కులయ్య తన భాగానికి చెందిన 6 ఎకరాల భూమిని అన్న కుమారులైన రవీందర్, జానయ్యకు 3 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. అక్కులయ్య భార్య శాంతమ్మ తల్లిగారి గ్రామం కూడా ఆకారం కావడంతో శాంతమ్మకు ఆమె తల్లిదండ్రులు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అందులో ప్రస్తుతం శాంతమ్మ పేరున 5.15 ఎకరాల భూమి పట్టా ఉండగా.. 2.25 ఎకరాల భూమి ఇతరుల పేరున పట్టా కలిగి ఉంది. ఇదిలా ఉండగా నాలుగు సంవత్సరాల క్రితం అక్కులయ్య అన్న కుమారుల్లో చిన్న కుమారుడు జానయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి అక్కులయ్య–శాంతమ్మ దంపతులు పెద్ద కుమారుడైన రవీందర్ వద్ద ఉంటున్నారు. దీంతో శాంతమ్మ తన పేరున ఉన్న 5.15 ఎకరాల భూమిలో 5 ఎకరాలను రవీందర్ కుమారులైన శ్రవణ్కుమార్కు 2 ఎకరాలు, లవకుమార్కు 3 ఎకరాలు పట్టా మార్పిడి చేసేందుకు గత సంవత్సరం ఫిబ్రవరిలో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లింది. దీంతో విషయం తెలుసుకున్న జానయ్య భార్య, కుమారుడు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కులయ్య–శాంతమ్మ దంపతులతో పాటు రవీందర్ కుటుంబ సభ్యులతో గొడవ పడటంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్లో శాంతమ్మ తనకున్న 5.15 ఎకరాల భూమిలో నుంచి రవీందర్ కుమారులకు 5 ఎకరాలు రిజిష్ట్రేషన్ చేసింది. దీంతో రవీందర్, జానయ్య కుటుంబ సభ్యుల మధ్య భూతగాదాలు జరుగుతూనే ఉన్నాయి. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఘటన అనారోగ్యంతో శాంతమ్మ మృతి రవీందర్ ఇంటి వద్ద ఉంటున్న అక్కులయ్య–శాంతమ్మ దంపతుల్లో శాంతమ్మ అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు రవీందర్ ప్రయత్నించగా జానయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. శాంతమ్మ ఆస్తి నుంచి తమ వాటా సమానంగా పంపిణీ జరిగే వరకు అంత్యక్రియలు జరుగనీయమన్నారు. రాత్రి కావడంతో శాంతమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. సోమవారం కూడా పరిస్థితి అలాగే మారడంతో గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సైదులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్ఐల నేతృత్వంలో 10 మంది పోలీసులు శాంతమ్మ మృతదేహం బందోబస్తు నిర్వహించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పినా వినలేదు. సోమవారం రాత్రి వరకు శాంతమ్మ మృతదేహం రవీందర్ ఇంటిముందే ఉంది. అయితే జానయ్య కుమారుడు ఉమేశ్.. శాంతమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని శాంతమ్మ మృతదేహాన్ని సోమవారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సరైన పద్ధతులతో నల్ల తామర నివారణ
గుర్రంపోడు : నాలుగేళ్లుగా మిరుపలో నల్ల తామర తెగులు తీవ్రంగా ఉంటోందని, దీని ఉనికిని సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ప్రాంతీయ ఉద్యానవన అధికారి కె. మురళి అన్నారు. సోమవారం గుర్రంపోడు మండలంలోని చేపూరు, మొసంగి గ్రామాల్లో మిరుప తోటలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అధిక నత్రజని ఎరువులను వేసుకోకుండా సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా అందించాలన్నారు. నల్ల తామర పురుగుకు కలుపు మొక్కలు ఆవాసాలుగా ఉంటాయి కాబట్టి పొలం గట్టు మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలన్నారు. పురుగులు బెట్ట పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉన్నందున భూమిలో తగినంత తేమతో పురుగు ఉధృతిని నివారించవచ్చున్నారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బెవరియా బెసినియా లేదా లెకానిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. చివరి అస్త్రంగా సయాంట్రానిలిప్రోల్ 1.2 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.32 మి.లీ. లేదా ఫిఫ్రోనోల్ 80 డబ్లుజీ 0.2 గ్రాములు లేదా పిప్రోనిల్ మరియు ఇమిడా క్లోఫ్రిడ్ 0.2 గ్రాములు లేదా స్పైనటోరం ఒక మిల్లీలీటరు ఒక లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేయాలని సూచించారు. -
అటవీ సంపద కొల్లగొట్టేందుకే మావోల హత్య
చౌటుప్పల్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అటవీ సంపదను కొల్లగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై హత్యాకాండ మొదలు పెట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. అడవులకు, గిరిజనులకు, ఆదివాసీలకు రక్షణగా ఉన్న మావోయిస్టులను లేకుండా చేయడం ద్వారా విస్తారమైన ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం చౌటుప్పల్లో సీపీఎం మున్సిపల్ కమిటీ విస్త్రతస్థాయి సమావేశానికి జాన్వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ చింతల భూపాల్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారని, పేదలను ఉపాధికి దూరం చేసేందుకే ఉపాధి హామీ పథకం పేరు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పక్షాన పనిచేసే సీపీఎం అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
షార్ట్ సర్క్యూట్తో ప్రింటింగ్ ప్రెస్ దగ్ధం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలోని సమతా ప్రింటింగ్ ప్రెస్లో సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రింటింగ్ మిషన్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, కౌంటర్లో ఉన్న రూ.4500 కాలిబూడిదయ్యాయి. రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లుదుకాణ యజమాని గుండు కిరణ్కుమార్ తెలిపారు. ఇంట్లో సామగ్రి..నార్కట్పల్లి : మండలంలోని మాధవఎడవెల్లి గ్రామానికి చెందిన ఎడమ మల్లేష్ ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి కాలిపోయాయి. ఇంట్లోని విద్యుత్ వైర్లకు మంటలు రావడంతో బీరువా, బీరువాలో ఉన్న విలువైన సర్టిఫికెట్లు, రూ.70 వేల నగదు, మంచం మీద సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు మల్లేష్ తెలిపారు. వ్యక్తి కిడ్నాప్నకు యత్నం.. నలుగురిపై కేసు నమోదుమోటకొండూర్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి కారులో ఎక్కించుకెళ్లిన నలుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ హజీమ్ తన భార్య షేక్ హసీనా బేగంతో కలిసి బైక్పై వెళ్తుండగా.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు బైక్ను ఆపి హజీమ్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. హజీమ్ భార్య హసీనా బేగం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. చౌటుప్పల్ సమీపంలో పోలీసులు కారును పట్టుకుని హజీమ్ను కిడ్నాప్ చేసిన పీసరి నవీన్రెడ్డి, పీసరి మల్లారెడ్డి, తుమ్మల వెంకట్రెడ్డి, ముత్తినేని సందీప్కుమార్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నలుగురిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.. చోరీ కేసులో ముగ్గురు రోహింగ్యాల అరెస్టు రామగిరి(నల్లగొండ) : చోరీ కేసులో బర్మా దేశానికి చెందిన ముగ్గురు రోహింగ్యాలను నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. బర్మా దేశానికి చెందిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం, మహ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసీం 2012లో ఇండియాకు శరణార్ధులుగా వచ్చి హైదరాబాద్లోని బాలాపూర్లో నివసిస్తున్నారు. వీరు ఈ నెల 7న హైదరాబాద్ నుంచి వచ్చి నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న నిధి పాలిమర్ కంపెనీలో పైపుల తయారీకి వినియోగించే విలువైన వస్తువులను దొంగిలించి కంపెనీ దగ్గరలో చెట్ల పొదల్లో ఉంచి వెళ్లారు. హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం ఆదివారం అర్ధరాత్రి నల్ల గొండకు వచ్చి దొంగిలించిన వస్తువులను ఆటోలో తరలిస్తుండగా.. చర్లపల్లి శివారులో టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.60లక్షల విలువైన 40 ఇత్తడి సైజర్లు, 35 అమరాన్ బ్యాటరీలు, యూపీఎస్ కేబుల్, 50 కేజీల కాపర్ వైరు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
బెట్టింగ్లకు అలవాటుపడి చోరీలు
నకిరేకల్ : ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్ తాను పండించిన పత్తిని అమ్మేందుకు గాను ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన జటంగి బుచ్చయ్య ట్రాక్టర్లో లోడు చేశాడు. మరుసటి రోజు ఉదయం మార్కెట్కు తీసుకెళ్లి పత్తిని అమ్ముదామనుకుని ట్రాక్టర్ను అదే గ్రామానికి చెందిన ప్రదీప్రెడ్డి ఇంటి సమీపంలో పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి పత్తి లోడు ట్రాక్టర్ కనింపించలేదు. దీంతో వీరబోయిన మహేష్ కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంధువుతో కలిసి.. అయితే కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన నూకల కోటేష్ ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతుండేవాడు. 2019లో మాడుగులపల్లి, వేములపల్లి, కేతేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాక్టర్లు చోరీ చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కోటేష్ మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తన బంధువు అయిన సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయికుమార్తో కలిసి తిరిగి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 8వ తేదీ రాత్రి కేతేపల్లి మండల కేంద్రంలో వీరబోయిన మహేష్ పత్తి లోడు ట్రాక్టర్ను చోరీ చేసి సూర్యాపేటకు తరలించారు. ట్రాక్టర్లోని కొంత పత్తిని సూర్యాపేట శివారులోని బాలెంలోని కాటన్ మిల్లులో అమ్మగా రూ.72,475 నగదు వచ్చాయి. మిగిలిన పత్తిని సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల వద్ద గల కాటన్ మిల్లుకు తీసుకెళ్తుండగా.. కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో పోలీసులు పట్టుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులు కోటేష్, సాయికుమార్పై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.50వేల నగదు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, కేతేపల్లి ఎస్ఐ సతీష్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారని డీఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు -
ఎంజీయూ హాకీ జట్టు కోచ్గా లింగస్వామి
రామన్నపేట : మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) హాకీ జట్టు కోచ్గా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రాపోలు లింగస్వామి నియమితులయ్యారు. ఈ నెల 18వ తేదీ వరకు తమిళనాడు రాజధాని చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీ మైదానంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాపియన్షిప్లో పాల్గొనే ఎంజీయూ హాకీ జట్టుకు ఆయన కోచ్గా వ్యవహరించనున్నారు. లింగస్వామి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో హాకీలో రాణించి ఎంజీయూ జట్టుకు ఎంపికై రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అతడి ప్రతిభను గుర్తించి హాకీ అసోసియేషన్, యూనివర్సిటీ క్రీడా విభాగం వారు కోచ్ బాధ్యతలను అప్పగించారు. లింగస్వామికి పలువురు అభినందనలు తెలిపారు. -
అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారు
మేము ముగ్గురు సోదరులం. మా తండ్రి పేరు మీద 7.36 ఎకరాల భూమిని మూడు బాగాలుగా చేసుకుని 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. నాకు తెలియకుండా నాకు రావాల్సిన భూమిని నా సోదరులు నర్సిరెడ్డి, యాదగిరిరెడ్డి వారి పేరు మీదకు మార్చుకున్నారు. నాకు 75 సంవత్సరాలు, నడవలేను. ఇద్దరు కూతుళ్లు, పెద్ద కూతురు అంధురాలు, రెండో కూతురికి 23 ఏళ్ల క్రితం వివాహమైంది. నా భార్య కూడా వృద్ధురాలు. నా అంధురాలైన కూతురితో కలిసి వ్యవసాయం చేయించుకుంటున్నా. అధికారులు విచారణ చేసి మాకు న్యాయం చేయాలి. – పబ్బతిరెడ్డి లక్ష్మారెడ్డి, అప్పాజిపేట(మిర్లోనిగూడెం), నల్లగొండ మండలం -
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
నల్లగొండ : గణతంత్ర దినోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో సాంస్క్రతిక కార్యక్రమాలు, వివిధ శాఖల అభివృద్ధి తెలిపే శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉత్తమ ఉద్యోగులకు ఇచ్చే అవార్డుల జాబితాను ఈనెల 20వ తేదీలోగా పంపించాలన్నారు. 30 ప్రభుత్వ శాఖలు అద్దె భవనాల్లో ఉన్నట్లు గుర్తించామని, వాటిని ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేస్తామన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా రైతులను చైతన్యం చేయాలని, రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. పంటల మార్పిడి విధానం పై అవగాహన కల్పించి వ్యవసాయ యాంత్ర పరికరాలను రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ పూర్తయిన రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఆర్ఓ, ఏఆర్ఓ, నోడల్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను గుర్తించామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్ను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో భాగంగా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 6 పాఠశాలలను నిర్మించేందుకు భూములను గుర్తించామని కలెక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పాఠశాల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన నాలుగు పాఠశాలల టెండర్లు పూర్తయ్యాయని వివరించారు. -
వివేకానంద.. యువతకు ఆదర్శం
మర్రిగూడ(చింతపల్లి) : స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శప్రాయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం మాల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఆయన, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. స్వామి వివేకానంద యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, కర్తవ్య బోధనను పెంపొందించారని అన్నారు. వివేకానంద బోధనలు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. విద్య, సంస్కృతి, జాతీయభావం పరిరక్షణలో స్వామి వివేకానంద ఆలోచలను ఎప్పటికీ ఆచరణీయమన్నారు. ప్రతి విద్యార్థి ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ను సిరిసిల్లలో ఓడించే బాధ్యత నాదే బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తే సిరిసిల్లలో కేటీఆర్ను గెలవకుండా చేస్తానని ఎంపీ రఘునందన్రావు అన్నారు. చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. కేటీఆర్కు ఉద్యమాలు చేయడం చేతకాదని ఆయన సొంత చెల్లె కవిత చెప్పిందని అన్నారు. హైదరాబాద్ని అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పుకుంటున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ నాలుగు సీట్లు ఎక్కువ గెలిచి చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. వాస్తవాలు విస్మరించి గ్రౌండ్రిపోర్ట్కు విరుద్ధంగా కేటీఆర్ బీజేపీకి బలం లేదని విమర్శించడం ఆయన అవగాహన రాహిత్యమన్నారు. అధికారం కోల్పోయాక తన మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. ఫ మెదక్ ఎంపీ రఘునందన్రావు -
జీజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్స
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి (40) కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. పరీక్షంచిన వైద్యులు ఆమె రక్తహీనత, కడుపులో 6 నెలల గర్భంతో సమానమైన పరిమాణంలో గడ్డ(కణితి) ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ప్రొఫెసర్ డాక్టర్ స్వరూపారాణి బృందం డాక్టర్ విద్యాభార్గవి, డాక్టర్ నిఖిత, డాక్టర్ ప్రఖ్య, అనస్తియా బృందం డాక్టర్ నేహా, డాక్టర్ శ్వేత, నర్సింగ్ సిబ్బంది సుధాక, పద్మ, రఘు.. లక్ష్మికి శ్రస్త చికిత్స చేసి కిలోన్నర కణితితో కూడిన గర్భసంచిని తొలగించారని తెలిపారు. ప్రస్తుతం పేషంట్ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మారంటూ రైతు నిరసనకొండమల్లేపల్లి : తనకు నకిలీ విత్తనాలు అమ్మారంటూ ఓ రైతు మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల మన గ్రోమోర్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశాడు. చింతపల్లి మండలంలోని వెంకటంపేటకు చెందిన ఓ రైతు 10 రోజుల క్రితం కొండమల్లేపల్లిలోని మన గ్రోమోర్ దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేసి తన పొలంలో నారు చల్లాడు. ఐదు రోజులు గడిచినా మొలకెత్తకపోవడంతో రైతు ఆందోళన చెంది సోమవారం మన గ్రోమోర్ వద్దకు వచ్చి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఓ జానకి రాములు అక్కడకు వచ్చి రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రైతుకు వరి విత్తనాల బస్తాలు తిరిగి ఇప్పించడంతో రైతు నిరసన విరమించాడు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసినపుడు రశీదు తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని కళాకారులు చేపట్టిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కొండకు దిగువన ఉన్న వైకుంఠద్వారం వద్ద ప్రత్యేక వేదికపై కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. -
మమ్మల్ని ఆదుకోండి సారూ..
నల్లగొండ : మమ్మల్ని ఆదుకోండి సారూ.. అంటూ పలువురు బాధితులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్కు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ ఫిర్యాదులు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నా కూతురు వరలక్ష్మీ 9వ తరగతి చదువుతున్న సమయంలో రెండేళ్ల క్రితం స్కూల్లో మెట్లపై నుంచి పడి మెదడుకు దెబ్బ తగిలింది. అప్పట్లో సదరం సర్టిఫికెట్ 30 శాతం ఇచ్చారు. ప్రస్తుతం ఉస్మానియాలో బ్రెయిన్ ఆపరేషన్ అయింది. సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో ఉన్న సర్టిఫికెట్ ఆన్లైన్లో చూపుతున్నందున వికలాంగుల పింఛన్కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. పెన్షన్ ఇప్పించి న్యాయం చేయాలి. – నాగమ్మ, పోతిరెడ్డిపల్లి, పీఏపల్లి మండలం నిరుపేద కుటుంబానికి చెందిన మహిళను. నాకు ఆస్తి పాస్తులు లేవు. సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. చేతికర్రలతో నడుస్తున్నాను. ఇప్పుడు నడవలేకపోతున్నాను. బ్యాటరీ సైకిల్ ఇప్పించాలి. – కుందూరు పద్మ, దుగ్గిరాల, త్రిపురారం మండలం ఫ ప్రజావాణిలో బాధితుల విన్నపం ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
విద్యుత్ వినియోగదారులకు ‘భట్టి’ లేఖ
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి, వ్యవసాయ ఉచితవిద్యుత్ లబ్ధిదారులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపింది. ఉచితంగా విద్యుత్ పొందుతున్న వినియోగదారుడి పేరున లేఖలు రాసి విద్యుత్ అధికారులతో అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో పరిధిలోని ఉచిత విద్యుత్ వినియోగదారులకు విద్యుత్శాఖ అధికారులు లేఖలు అందజేస్తున్నారు. ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది.. ఆ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవాలని లేఖలో సూచించింది. భవిష్యతులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తామని, సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపింది. 2,49,309 మంది గృహజ్యోతి లబ్ధిదారులు జిల్లాలో ఉచిత విద్యుత్ పొందే వినియోగదారులు 2,49,309 మంది ఉన్నారు. ఇందులో నల్లగొండ డివిజన్ పరిధిలో 1,20,339, మిర్యాలగూడ డివిజన్లో 78,623, దేవరకొండ డివిజన్లో 50,347 మంది ఉన్నారు. వీరితోపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పొందుతున్న వారు జిల్లాలో 2,44,622 మంది ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం నుంచి వినియోగదారుడి పేరు, సర్వీస్ నెంబర్ ముద్రించి లేఖలు అందిస్తున్నారు. ఆ లేఖను విద్యుత్ సిబ్బంది, అధికారులు కలిసి వినియోగదారుల ఇంటికి వెళ్లి చదివి వినిపిస్తున్నారు.ఫ గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్ వినయోగదారుల పేరున లేఖలు పంపిన డిప్యూటీ సీఎం ఫ ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్న విద్యుత్శాఖ సిబ్బంది -
ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను పక్కనపెట్టిన అధికారులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఓటర్ల జాబితాపై వెల్లువెత్తిన అభ్యంతరాలు చాలావరకు పరిష్కారానికి నోచుకోలేదు. ఈనెల 1వ తేదీన మున్సిపాలిటీ వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయి జాబితాలపై ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఓటు హక్కు పక్క వార్డులో ఉందని, తాము ఉంటున్న వార్డుకు మార్చాలని, ఇంటి నంబర్లు మార్చాలంటూ అభ్యంతరాలు పలువురు వ్యక్తం చేశారు. అయితే అందులో కొన్నింటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి, పరిష్కరించారు. మరికొన్నింటిని మాత్రం తిరస్కరించారు. ఇలా జిల్లాలో ఐదు వందలకు పైగా అభ్యంతరాలు తిరస్కారానికి గురయ్యాయి. ఇక, ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో నకిరేకల్ మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్కల తేలింది. 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,68,437 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇందులో పురుషులు 3,23,647 మంది, మహిళలు 3,44,661 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 129 మంది ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను, 16న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. 16న ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రకటించారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. అలాగే ఫొటోలతో కూడిన ఓటర్ల జాబి తాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని కూడా ప్రదర్శించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేశారు. ఫొటోలో కూడిన జాబితాల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సరి చేసేందుకు మూడు రోజుల సమయం ఇచ్చారు. వాటన్నింటిని సరిచేసి, ఈ నెల 16న ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను అధికారులు మున్సిపాలిటీ వార్డుల వారిగా ప్రచురించనున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్దం కావడంతో ఎన్నికల సంఘం ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ఈ నెల 16న ప్రకటించనుంది. ఆ తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 17, 18 తేదీల్లోనే షెడ్యూల్ రావచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు.. మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్జెండర్ మొత్తం నల్లగొండ 68,874 73,507 56 1,42,437 మిర్యాలగూడ 45,128 47,878 14 93,020 దేవరకొండ 11,629 12,200 1 23,830 హాలియా 6,270 6,529 2 12,801 నందికొండ 6,475 7,027 1 13,503 చండూరు 5,652 5,717 1 11,370 చిట్యాల 5,930 6,188 1 12,118 సూర్యాపేట 52,170 56,664 14 1,08,848 కోదాడ 28,069 30,520 12 58,601 హుజూర్నగర్ 14,257 15,731 8 29,996 నేరేడుచర్ల 6,629 7,116 1 13,746 తిరుమలగిరి 7,638 7817 0 15,455 భువనగిరి 23,037 24,793 1 47,831 చౌటుప్పల్ 13,553 13,663 0 27,216 యాదగిరిగుట్ట 6,760 7,046 16 13,822 పోచంపల్లి 7,799 8,028 0 15,827 మోత్కూర్ 7,106 7,277 0 14,383 ఆలేరు 6,671 6,960 1 13,632 మొత్తం 3,23,647 3,44,661 129 6,68,437 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే నల్లగొండలోని మున్సిపాలిటీల పరిధిలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో నకిరేకల్ మినహా మిగతా ఏడు మున్సిపాలిటీల్లో 3,09,080 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,49,958 మంది పురుషులు, 1,59,046 మంది మహిళలు, 76 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,08,763 మంది పురుషులు, 1,17,848 మంది మహిళలు, 35 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,32,711 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 64,926 మంది పురుషులు, 67,767 మంది మహిళలు, 18 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఫ 18 మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితా ప్రకటన ఫ ఉమ్మడి జిల్లాలో 6,68,437 మంది మున్సిపల్ ఓటర్లు ఫ నేడు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల ఫ 16వ తేదీన ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రదర్శన -
నల్లగొండలో భారీ దోపిడీకి పాల్పడ్డ రోహింగ్యాలు
నల్లగొండ: నల్లగొండలో రోహింగ్యాలు హల్చల్ చేశారు. నల్లగొండ సమీపంలో ఉన్న ఓ పైపుల కంపెనీలో చోరీకి పాల్పడ్డారు. బ్యాటరీలతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు రోహింగ్యాలు. ఈ చోరీకి పాల్పడిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీక్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. అరవై లక్షల విలువైన సామాగ్రితో పాటు ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు 2012-2013లో హైదరాబాద్ నగరానికి వచ్చారని, గతంలో ఓ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లొచ్చారని, అయినప్పటికీ తీరు మారలేదని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం కేసులో మరో నలుగురు రోహింగ్యాలు పరారీ అయినట్లు సమాచారం. -
ఉద్యోగం వదిలి ఉపాధి కల్పించే స్థాయికి..
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత కుటుంబానికి చెందిన సాయిని భరత్(33) ఎంటెక్ పూర్తి చేసి ఆరేళ్లపాటు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. తన తల్లిదండ్రులు చేస్తున్న కులవృత్తిని పదికాలాల పాటు సజీవంగా ఉంచాలని ఉద్యోగానికి గుడ్బై చెప్పి చేనేత వృత్తిని ఎంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ చిన్న, లఘు, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కళా పునర్వి పేరిట హ్యాండ్లూమ్ నెలకొల్పి 80 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎన్నో అవార్డులు సొంతం – 2022లో చేనేతలో నూతన ఆవిష్కరణలు, ఉపాధి కల్పనకు గాను బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు అందుకున్నాడు. – 2018లో చేనేతలో డిజైనింగ్లో నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నాడు – 2018లో ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డు – 2014లో చిన్న మగ్గంపై జాతయ నాయకుల కళాఖండాలను రూపొందించినందుకు లిమ్కా బుక్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. -
గ్రామానికి సేవ చేసేందుకే
అడవిదేవులపల్లి : గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. బీటెక్ చదివి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న నన్ను సర్పంచ్గా పోటీ చేయమని స్థానికులు కోరడంతో ఉద్యోగం వదిలేసి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నా. గతంలో నా తండ్రి సూర్యానాయక్ ఉమ్మడి మొల్కచర్ల సర్పంచ్గా పని చేసినందుకు గ్రామ సమస్యలపై నాకు చిన్ననాటి నుంచి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తా. పదవీ కాలం పూర్తయ్యే సరికి శాశ్వతంగా గుర్తుండేలా నా వంతుగా అభివృద్ధి చేసి చూపిస్తా. – మూడావత్ సేవానాయక్, మొల్కచర్ల సర్పంచ్ పెద్దఅడిశర్లపల్లి : ప్రస్తుతం కొండమల్లేపల్లిలో డిగ్రీ చదువుతున్నా. 24 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికయ్యా. రానున్న రోజుల్లో మల్లాపురం గ్రామంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకొని అధికారులు, వార్డు సభ్యులు, ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తా. ముఖ్యంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తా. – కొలుకులపల్లి చందన, మల్లాపురం సర్పంచ్ -
ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ హడావుడి
చిట్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు హడావుడి చేస్తున్నారు తప్పితే గత రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. చిట్యాల మున్సిపాలిటీలోని ఏడవ వార్డులో ఆదివారం ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నేరవేర్చలేదని, మళ్లీ మాయ మాటలతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. ప్రజలకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసా, ఆసరా పింఛన్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు చిట్యాల మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, నాయకులు కొలను వెంకటేష్, కందాటి రమేష్రెడ్డి, జిట్ట శేఖర్, బొల్గూరి సైదులు, మేడి ఉపేందర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
సమాజాభివృద్ధిలో తోడ్పాటు
హాలియా : నూతనంగా ఏర్పడ్డ కుపాసిపల్లి గ్రామపంచాయతీని అనుముల మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో విద్యనభ్యసించాను. బహుజన వాదిగా, విద్యార్థుల సమస్యలపై కొంతకాలంగా పనిచేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీసీ రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీల నిర్మాణం, లైబ్రరీ ఏర్పాటు చేయటమై నా ముందున్న లక్ష్యం. ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చి మా గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యం. – పెరుమాళ్ల వేణుగోపాల్, కుపాసిపల్లి సర్పంచ్ -
నిధులు దుర్వినియోగం కాకుండా..
భువనగిరి: నేను వ్యవసాయం చేస్తున్నా. పెంచికల్పహాడ్ గ్రామంలో సర్పంచ్ బరిలో యువత ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అయితే అమలుకు సాధ్యంకాని పనుల విషయంలో ముందుగానే హామీ ఇవ్వలేనని సూటిగా చెప్పా. అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటిక, పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తా. అవసరమైన చోట్ల సీసీ రోడ్డు నిర్మాణాలు, అండర్ డ్రెయినేజీ నిర్మాణాలు చేపడుతా. గ్రామాభివృద్ధి కోసం వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా పనిచేస్తా. – మల్లికార్జున్రెడ్డి, సర్పంచ్, పెంచికల్పహాడ్, భువనగిరి మండలం -
పల్లెపాలనలో యువ తరంగాలు
ఫ సర్పంచ్గా ఎన్నికై గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న యువత ఫ ఇచ్చిన హామీలపై దృష్టి ఫ ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు చేస్తామంటున్న నవయువ సర్పంచ్లు నేడు జాతీయ యువజన దినోత్సవంకొండమల్లేపల్లి : ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన నేను 26 ఏళ్ల వయసులోనే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇటీవల జరిగిన కొండమల్లేపల్లి మండలం గుర్రపుతండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాను. డెత్ సర్టిఫికెట్లు తీయడం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం వితంతు పెన్షన్లు ఇప్పించడంతో తమ తండాలో ఆడ బిడ్డ పుడితే రూ.1,016, అమ్మాయి వివాహానికి కల్యాణ కానుకగా రూ.2,016 ఇస్తాను. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. – రమావత్ సేవానాయక్, గుర్రపుతండా సర్పంచ్ ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో యువత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇంజనీరింగ్, సాంకేతిక విద్యతోపాటు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుని గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. సోమవారం వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువ సర్పంచ్లు గ్రామాభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలు, వాటి అమలుకు తీసుకుబోయే కార్యాచరణ వారి మాటల్లోనే.. -
సేంద్రియ సాగులో రాణిస్తూ..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిళ్లపాటి గోవర్ధన్రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తూ రాణిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్లో అర్ధశాస్త్రం పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా భూ ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించి పోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గిపోతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవాళి వరి విత్తనాల వరి సాగు చేపట్టారు. తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత కౌలుకు భూమి తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా 20 గుంటల విస్తీర్ణంలో 23 రకాల దేశవాళీ వరి విత్తనాల సాగు చేస్తున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్లో పుడమి పుత్ర పురస్కారం అందుకున్నారు. -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడి వందవ బర్త్ డే
గరిడేపల్లి: గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరఽయోధుడు బండా పుల్లారెడ్డికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆయన భార్య కాంతమ్మ, విజయలక్ష్మి, చంద్రశేఖర్రెడ్డి, లలిత, మురళీధర్రెడ్డి, ప్రశాంతి, పుల్లమ్మ, చంద్రమ్మ, జానకమ్మ, కోటమ్మ, ధనమ్మ, కృష్ణ, చంద్రమ్మ, రాములయ్య, సీతారామరెడ్డి పాల్గొన్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న ఆరుగురిపై కేసుసూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో చైనా మాంజా విక్రయాలపై ఆదివారం ఎస్ఐలు శివతేజ్, మహేందర్నాథ్, ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. -
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
తిప్పర్తి: యువత స్వయం ఉపాధి కోసం ప్రోత్సహిస్తా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గ్రామస్తులు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, నిరంతరం వారి వెంట ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా. గ్రామంలో ఇప్పటికే సమస్యలు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించాం. తాగు నీరు, విద్యుత్, డ్రెయినేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తా. – హేమలత, పజ్జూరు సర్పంచ్ -
అమ్మా.. నాకు దిక్కెవరు
ఖమ్మంక్రైం : చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లితోనే తన జీవితం, తల్లి వెంటే తాను అన్నట్టుగా గడిపాడు. తినడానికి తిండి, ఉండడానికి గూడు కూడా లేదు. దీంతో తన కొడుకు పస్తులుండకుండా ఆ తల్లి నిత్యం భిక్షాటన చేస్తూ బాలుడి కడుపు నింపేది. అయితే ఆ చిన్నారిపై విధి వక్రించింది. యాచనతో తన కడుపు నింపే తల్లిని కూడా దూరం చేసింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. కోదాడకు చెందిన మోతె లక్ష్మి( 40), లక్ష్మణ్ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఐదేళ్ల క్రితం లక్ష్మణ్ అనారోగ్యంతో మృతిచెందడంతో కుమారుడు కిట్టూను పోషించేందుకు లక్ష్మి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో కొడుకుతో సహా ఖమ్మం వచ్చి కూలి పనులు చేస్తూ కాలం గడుపుతుండగా ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో భిక్షాటన చేస్తూ కిట్టూను పోషించేది. కాగా, ఆమె పరిస్థితి విషమించి ఆదివారం ఖమ్మం రైల్వే స్టేషన్లో తనువు చాలించింది. ఈ విషయం తెలియని తొమ్మిదేళ్ల కిట్టూ తల్లిని ఎంత లేపినా లేవకపోవడంతో బిగ్గరగా రోదిస్తుండగా ప్రయాణికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. పక్కనే కూర్చుని రోదిస్తున్న కిట్టూను వివరాలు అడగగా తన పేరు, వివరాలు తెలిపాడు. తనకు ఒక మేనత్త ఉందని, ఆమె ఆచూకీ తెలియదని చెప్పాడు. దీంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించిన పోలీసులు బంధువుల ఆచూకీ కోసం కోదాడ పోలీసులను సంప్రదించారు. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు సాయంతో మృతదేహన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ● తల్లి మృతదేహం వద్ద బాలుడి రోదన -
40 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్ఎస్లో 1984 –85 బ్యాచ్కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు రంగారెడ్డి, అహల్య ప్రభాకర్ రెడ్డి, విమల శ్రీనివాస్రెడ్డి, పూర్వ విద్యార్థులు మైదం నారాయణ, ఎస్కే జానీ హనుమంతురెడ్డి, విట్టల్రెడ్డి, సోమరాజు, అల్లం శ్రీను, వెంకన్న, బీజాల ఇంద్ర, భారతి, మాలతి, శ్రీలక్ష్మీ, ఆయూష భాను, పద్మ, కళమ్మ, వినోద పాల్గొన్నారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారంతో పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామానికి వెళ్లే వారు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ముఖ మండపం క్యూలైన్, ప్రసాద విక్రయశాల వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపించింది. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామివారిని 35వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా.. నిత్యాదాయం రూ.39,22,539 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఆలయ ముఖ మండపంలో క్యూలైన్లో ఉన్న భక్తులు -
● వ్యవసాయం, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న యువత ● నచ్చిన పనులు చేస్తూ విజయ తీరాలకు
యువతా మేలుకో.. నిద్ర నుంచి మేల్కొని గమ్యం చేరే వరకు విశ్రమించకు అనే స్వామి వివేకానంద సూక్తిని నిజం చేస్తూ యువత ముందుకు సాగుతోంది. వ్యవసాయ రంగాల్లో, కుల వృత్తుల్లో నైపుణ్యం ప్రదర్శిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విభిన్న రంగాల్లో విజయం సాధించిన వారిపై ప్రత్యేక కథనాలు. హుజూర్నగర్ : మండలంలోని అంజలీపురం గ్రామానికి చెందిన గొర్రె అశోక్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన యువ సృష్టికర్తగా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ ఇండియా అవార్డ్స్ సీజన్–2లో టెక్ లీడ్ సోషల్ ఇన్నోవేషన్ విభాగంలో ఎంపికై గత నెలలో జాతీయ అవార్డు అందుకున్నాడు. డిస్టెన్స్లో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో వారికి చేదోడు వాదోడుగా ఉండాలని చిన్నతనం నుంచే భావించాడు. అందులో భాగంగా వ్యవసాయ పరికరాల తయారీపై దృష్టి సారించి పత్తి, మిరప పంటల్లో విత్తనాలు వేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, పురుగుల మందు పిచికారీ యంత్రాలను రూపొందించాడు. ఆతర్వాత రూరల్ రైజ్ అగ్రినరీ అనే స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. పరికరాలను తయారు చేసి తక్కువ ధరలో రైతులకు అందుబాటులోకి తెచ్చాడు.. ఈనేపథ్యంలో అతని ప్రతిభను గుర్తించిన ఫోర్బ్స్ ఇండియా ఇటీవల అశోక్ను జాతీయ స్థాయి అవార్డుతో సత్కరించింది. -
హామీల అమలే లక్ష్యం
చౌటుప్పల్ : మాది చౌటుప్పల్ మండలం పీపల్పహాడ్ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు పులనగారి నాగేశ్వరి సర్పంచ్గా విజయం సాధించింది. కేవలం 28ఏళ్ల వయస్సున్న ఆమె పోటీ చేసిన తొలిసారే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు వివాహం జరిగినప్పటికీ చదువును మాత్రం ఆపలేదు. ఉస్మానియా కళాశాలలో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉండి ఎంఎస్సీ జియో కెమిస్ట్రీ పూర్తి చేశా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయడమే నా కర్తవ్యం. – పులనగారి నాగేశ్వరి, పీపల్పహాడ్ సర్పంచ్ -
45 ఏళ్ల ఆత్మీయ సమ్మేళనం
పెద్దఅడిశర్లపల్లి : గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1980–81 పదో తరగతి బ్యాచ్ ఆదివారం ఆ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో వీరు సుమారు 45 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకుని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వారి హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, మల్లయ్య, మాధవరెడ్డి, నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం అన్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు వడ్లపల్లి చంద్రారెడ్డి, విడియాల వెంకటేశ్వర్లు, పాశం శ్రీనివాస్రెడ్డి, సామ వెంకటేశ్వర్రెడ్డి, సముద్రాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క రోజే 40 వేలకుపైగా..
హైవేపై సాఫీగా వాహనాల రాకపోకలు చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. పండగకు స్వస్థలాలకు వెళ్లేవారి వాహనాలతో 65వ నంబరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో 18 నుంచి 20 వేల వాహనాలు కొర్లపహాడ్ టోల్ప్లాజా నుంచి రాకపోకలు సాగిస్తుండగా ఆదివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ అధికారులు పేర్కొన్నారు. అయితే.. హైవేపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించాయి. కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్కు అంతరాయం కాకుండా చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పోలీసులను రప్పించి వాహనదారులకు సూచనలు చేస్తూ టోల్ప్లాజా వద్ద వాహనాలు నిలవకుండా చూశారు. హైవేపై ట్రాఫిక్జాం ఏర్పడుతుండడంతో పలువురు ప్రయాణికులు తమ కుటుంబసభ్యులతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు చిట్యాల మీదుగా ఆదివారం బైక్లపై ప్రయాణించారు. ప్రజలు రోడ్డు దాటేలా.. చిట్యాలలోని బస్స్టేషన్, పాల కేంద్రం, రైల్వేస్టేషన్ రోడ్డు ఎదురుగా ప్రజలు రోడ్డును దాటేందుకుగాను తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాల్లో పోలీసులతో పాటు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్డు దాటేందుకుగాను ప్రజలకు సహకరించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే తగిన ప్రథమ చికిత్స అందించేందుకుగాను చిట్యాలలోని పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పికెట్లో ప్రత్యేకంగా ప్రభుత్వ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. పట్టణంలోని కాలనీల నుంచి హైవే సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు, ద్విచక్ర వాహనాలు నేరుగా హైవే మీదకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాగా.. మండలంలోని పెద్దకాపర్తి శివారులో ఆదివారం మధ్యాహ్నం హైవే రోడ్డు మధ్యలో కొన్ని చెట్లకు ప్రమాదవశాత్తు నిప్పుంటుకుంది. గుర్తించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిన సిగరెట్ పీకను పడేయటంతో మంటలు లేచినట్లు తెలుస్తోంది. రెండు రెట్లు పెరిగిన వాహనాలు సాధారణ రోజుల్లో వచ్చే వాహనాల కంటే ఆదివారం రెండురెట్ల వాహనాలు రావటంతో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఉన్న 12 కౌంటర్లకు గాను 7 కౌంటర్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. విజయవాడ వైపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాహనాల రద్దీ తగ్గుముఖం పట్టగా సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్ వైపునకు వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టోల్ నిర్వాహకులు, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టోల్ అధికారులు, ఇతర సిబ్బంది, కేతేపల్లి ఎస్ఐ యు.సతీష్ టోల్ప్లాజా వద్దనే మకాం వేశారు. ట్రాఫిక్ను పరిశీలించిన ఏఎస్పీ రమేష్ జాతీయ రహదారిపై ట్రాపిక్ అంతరాయం జరగకుండా తగిన ముందస్తు చర్యలను తీసుకున్నట్లు ఏఎస్పీ రమేష్ తెలిపారు. చిట్యాల మండలంలోని చిట్యాల, పెద్దకాపర్తి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డ్రోన్ కెమెరాల ద్వారా హైవేపై ట్రాఫిక్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణతో పాటు వాహనాలు వేగంగా వెళ్లేందుకుగాను పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ ఉన్నారు. ఫ ట్రాఫిక్ నియంత్రించిన పోలీసులు ఫ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పర్యవేక్షణ ఫ ద్విచక్ర వాహనాలపై ఎక్కువ సంఖ్యలో వెళ్లిన ప్రజలు ఫ కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాల బారులు -
బహిరంగ సభను జయప్రదం చేయాలి
దేవరకొండ : ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న సీపీఐ బహిరంగసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం దేవరకొండలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిందని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎర్ర జెండా ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీ, పార్లమెంట్లోనూ గలమెత్తిన పార్టీ సీపీఐ అన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు దేవరకొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, కనకాచారి, పల్లె నర్సింహ, తూం బుచ్చిరెడ్డి, దేప సుదర్శన్రెడ్డి, వెంకటయ్య, వెంకటరమణ, జయరాములు, నూనె రామస్వామి, వలమల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పద్మానగర్ జంక్షన్ మూసివేత
హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారిపై బాక్ల్ స్పాట్గా ఉన్న నకిరేకల్ పట్టణ శివారులోని పద్మానగర్ జంక్షన్ క్రాసింగ్ను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. సంక్రాంతి పండుగు నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండడం.. ఈ జంక్షన్ వద్ద రోడ్డు క్రాసింగ్ చేస్తూ నకిరేకల్ నుంచి హైదారాబాద్ వైపునకు ఆర్టీసీ బస్సులతో పాటు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి. రోడ్డు క్రాసింగ్ చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందుస్తుగా స్థానిక పోలీసులు ఈ రోడ్డు క్రాసింగ్ను మూసివేయించారు. నకిరేకల్ నుంచి నల్లగొండ, హైదరాబాద్ వైపునకు వేళ్లే వాహనదారులు చీమలగడ్డ అండర్ పాసింగ్ నుంచి తాటికల్ రోడు అండర్ పాసింగ్ సర్వీస్ రోడ్ల గుండా హైవే పైకి మళ్లీంచారు. పద్మానగర్ కాలనీ వాసులు నకిరేకల్కు రావాలన్నా చందంపల్లి ఫ్లైవర్ వంతెన పైనుంచి రావాలని నకిరేకల్ సీఐ వెంకటేశం సూచించారు. -
రైతు వేదికల నిర్వహణ భారం
నల్లగొండ అగ్రికల్చర్ : గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలు నిర్వహణ భారంగా మారింది. కానీ మూడు సంవత్సరాలుగా వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కావడం లేదు. నెలనెలా చేతి నుంచే డబ్బులను వెచ్చించాల్సి వస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 140 వేదికలకు గాను ఇప్పటి వరకు సుమారు రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో ఏఈఓలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 140 రైతు వేదికలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా 140 రైతు వేదికలను నిర్మించింది. వారం వారం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణనిస్తు సీజన్లో పంటల వారీగా సాగులో మెళకువలను తెలియజేయాలనేది రైతు వేదికల లక్ష్యం. ఈ వేదికల నిర్వహణ బాధ్యతలను క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించింది. వేదికల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.9 వేల చొప్పున నిధులను కూడా విడుదల చేసింది. ఆ నిధులతో వేదికను శుభ్రం చేయించడం, ఇతర కార్యక్రమాలు చేపట్టేవారు. ఆ 9 వేల రూపాయలు చాలక వ్యవసాయ విస్తరణ అధికారులకు అదనంగా చేతి నుంచి ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే ఏఈఓలు చేతి నుంచి ఖర్చు పెడుతూ నిధులు వచ్చినప్పుడు తీసుకునేవారు. ప్రతి వారం వీడియో కాన్పరెన్స్లు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం జిల్లాలోని రైతు వేదికల ద్వారా వీడియో కాన్పరెన్స్లు నిర్వహిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరవుతున్నారు. వారికి ప్రతివారం స్నాక్స్, బిస్కెట్లు, టీ తదితర ఖర్చులకు నిధులు లేకపోవడంతో అదనంగా తామే భరించాల్సి వస్తోందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. రైతు వేదికల నిర్వహణ నిధులు ప్రభుత్వం విడుదల చేయగానే వ్యవసాయ విస్తరణ అధికారుల ఖాతాల్లో జమ చేస్తాం. నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. – శ్రవణ్కుమార్, డీఏవో, నల్లగొండఫ మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం ఫ సుమారు రూ.3 కోట్లమేర పెండింగ్ ఫ ఏఈఓలపై తప్పని భారంవివరం ఖర్చు.పరిశుభ్రతకు 3,000 శిక్షణకు 2500 స్టేషనరీ 1000 కరెంట్ బిల్లు 1000 మరమ్మతులు 1000 తాగునీరు 500 మొత్తం 9,000 -
డ్రాయింగ్ పరీక్ష ప్రశాంతం
నల్లగొండ టూటౌన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు రెండవ రోజు ఆదివారం నల్లగొండలో డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ హైయర్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఉదయం జరిగిన పరీక్షకు 875 మంది అభ్యర్థులు హాజరు కాగా 241 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 993 మందికి గాను 760 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరైనట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా కార్తీక్హాలియా : హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన తగుళ్ల కార్తీక్ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి 16 వరకు హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో జరిగే అండర్–19 జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించనున్నారు. తనను ప్రోత్సహించిన అనుముల స్పోర్ట్ క్లబ్ కబడ్డీ కోచ్ కాకునూరి రాము, నరేష్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి డోమినిక్, పీడీ వెంకటరామిరెడ్డి, రమేష్గౌడ్కి కార్తీక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత పింఛన్ కోసం పోరాటంనల్లగొండ : పాత పింఛన్ విధానం కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని ఆలిండియా న్యూ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎన్పీఎస్ఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకంలో ఉన్నారని తెలిపారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య పింఛను పథకం ప్రారంభం అయ్యిందన్నారు. సీపీఎస్లో ఉన్న ఉద్యోగికి ఆర్థిక, సామాజిక భద్రత కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. శివన్నగూడెం పనుల అడ్డగింతమర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్నగూడెంలో నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు ఆదివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పనులను నడవనీయమని హెచ్చరించారు. ప్రజాకవి అలిశెట్టి జయంతిరామగిరి(నల్లగొండ): సమాజాన్ని ప్రభావితం చేసే ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులు అరుదుగా ఉంటారని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్కుమార్ అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు పున్నమి అంజయ్య, నర్సింహ, లింగస్వామి, అంజయ్య, గిరి, రాములు, లింగమూర్తి, కొండ కృష్ణ, జగదీష్, శ్రీనివాసరావు, కలీం, మహ్మద్ పాషా, శంకరయ్య పాల్గొన్నారు. -
చైనా మాంజాకు చెక్ పెట్టేలా..
నల్లగొండ : జనవరి నెలలో ప్రధాన పండుగైన సంక్రాంతి వస్తుందంటే పిల్లలకు గుర్తుకు వచ్చేది గాలిపటాలు (పతంగులు)ఎగురవేయడమే. పిల్లలే కాదు పెద్దలు కూడా సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పక్కనోడి గాలిపటాన్ని పడేయాలని తెగ ఆసక్తి చూపిస్తారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉన్నా అది బలంగా లేక తెగిపోతుందని కొందరు నిషేధిత చైనా మాంజాను వినియోగిస్తుంటారు. ఈ మాంజా మనుషులు, జంతువులు, పక్షులకు ముప్పు తెచ్చిపెడుతోంది. నిషేధిత చైనా మాంజాను కొందరు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా మాంజా వినియోగించొద్దని, మీ సరదా కోసం ఇతరుల ప్రాణాల మీదకు తేవొద్దని పోలీసులు అంటున్నారు. నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగం వద్దని సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. చాటుమాటుగా ఎవరైనా అమ్మితే తమకు సమచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు వ్యాపారులు చైనా మాంజాను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే చైనా మాంజా విక్రయించకుండా, వాడకుండా దుకాణదారులు, వియోగదారులను కట్టడి చేస్తే ప్రమాదాలు జరగవని ప్రజలు అంటున్నారు. ఫ సోషల్ మీడియా ద్వారా ముమ్మర ప్రచారం ఫ గాలిపటాలు ఎగురవేసేందుకు సంప్రదాయ దారం వాడాలి ఫ నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే సమాచారం ఇవ్వండి ఫ పేర్లు గోప్యంగా ఉంచుతామంటున్న పోలీసులు -
టోల్ప్లాజాల వద్ద కొనసాగుతున్న రద్దీ.. వాహనదారుల ఆగ్రహం!
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నంవాసులు ఏపీకి తరలి వెళ్లారు. ఇవాళ రాత్రి వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో టోల్ ప్లాజా నిర్వాహకులకు సైతం భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు.. ఆదాయం వస్తున్నా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. -
నల్లగొండ: కొర్లపహాడ్ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం
నల్లగొండ: జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. కొర్లపహాడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి, ముందు వెళ్తోన్న వాహనాన్ని తిరువూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్గా బ్రే్క్ వేయడంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బస్సులు మెల్లగానే వెళ్తూ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పలువురు స్వల్ప గాయాలతోనే బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వాహనదారులు హెల్మెట్ ధరించాలి
మిర్యాలగూడ అర్బన్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) చేపట్టిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసులు చేపట్టిన నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతమైందన్నారు. హెల్మెట్లను ఇళ్లలో గోడలకు, స్కూటీ డిక్కీల్లో పెట్టకుండా తలకు ధరించి వాహనం నడపాలన్నారు. సబ్కలెక్టర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఏ పని తలపెట్టినా పూర్తి అంకితభావంతో చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ మాట్లాడుతూ మానవ ప్రయత్నంగా ప్రస్తుతం 500 మందికి హెల్మెట్లు పంచినట్లు చెప్పారు. శివరాత్రి వరకు పట్టణంలో అందరికీ హెల్మెట్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు ప్రసాద్, నాగభూషణం, సోమనర్సయ్య, ఎన్ఐలు నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, గాయం ఉపేందర్రెడ్డి, పొదిల శ్రీనివాస్, కొమ్మన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
చిరునామా ఆధారం
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లోని ఇటీవల అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 9న ముగిసింది. వార్డుల వారీగా రాజకీయ పార్టీలు, స్థానిక ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలపై మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశీలిన ప్రారంభించారు. పరిశీలన పూర్తిచేసి చిరునామా ఆధారంగా తుది ఓటరు జాబితాను తయారు చేయనున్నారు. ఫిర్యాదులను క్రోడీకరించి.. వార్డుల్లో ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్రోడీకరించి వార్డుల హద్దులు, కాలనీల్లో ఉన్న ఓటర్లు, ఓటరు కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తి చేసి ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రదర్శిస్తారు. దాంతో పాటు టీ పోల్ యాప్లో జాబితాను అప్లోడ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 16న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. నీలగిరిలో అధికారిక ఆదేశాలు అందితేనే.. నీలగిరి కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ కోసం కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించిన అధికారులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించకుండా నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. నీలగిరి కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే. ఈ బిల్లు రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరగా గెజిట్ విడుదల కావాల్సి ఉంది. ఈ నెల 12 లేదా 13న గవర్నర్ నుంచి గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ జాప్యం జరిగితే సంక్రాంతి తరువాత విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందుకే మున్సిపల్ ఉన్నతాధికారులు తుది ఓటరు జాబితా ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారమే ఓటరు జాబితా రూపొందించే పనులను అధికారులు చేస్తున్నారు. ఫ మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితా రూపకల్పన ఫ ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ఫ 16న ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటన ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను ప్రదర్శిస్తాం. ఎన్నికల నిబంధనల ప్రకరమే ఓటరు జాబితాను ప్రచురిస్తున్నాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ -
రైతు భరోసా రాదాయే..
యాసంగి సీజన్ రైతు భరోసా సకాలంలో ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీపై అప్పు చేయాల్సి వచ్చింది. వెంటనే భరోసా సాయాన్ని అందించాలి. – పనస కాశయ్యగౌడ్, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత యాసంగి సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్ గత నవంబర్లో ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు సీజన్ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు యాసంగి సీజన్ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. 6,57,229 ఎకరాల్లో సాగు యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 6,57,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా చేసింది. అందులో వరి 5,64,678 ఎకరాల్లో సాగువుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా వరినాట్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. పెట్టుబడుల కోసం అప్పులు యాసంగి సీజన్లో రైతు భరోసా అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకర్లు కూడా పంట రుణాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రైతులు అధిక వడ్డీపై అప్పులను తీసుకొచ్చి యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. 5,65,803 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.738 కోట్ల 67 లక్షల 60 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఎ లాంటి ప్రకటనా చేయకపోవడంతో రైతులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల భరోసాను వెంటనే జమ చేయాలని కోరుతున్నారు. ఫ యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని సాయం ఫ పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు -
వీ బీ జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామసభలు
● డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నల్లగొండ : కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న వీ బీ జీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఈ నెల 20 నుంచి 30 వరకు గ్రామసభలు నిర్వహించి.. ఆ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణాలు చేయాలని నిర్ణయించామని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ తెలిపారు. శనివారం నల్లగొండలోని యాదవ సంఘం భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చి పేదలకు మరణ శాసనం రాసిందని ధ్వజమెత్తారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీరామ్జీ చట్టంలో పని దినాలు పెరిగినా కూలీలకు ప్రయోజనం లేదన్నారు. పనులు దొరక్క ప్రజలు.. పట్టణాలకు పోతే గ్రామాల్లో ఉన్న ఆస్తులను కార్పొరేట్లకు అప్పచెప్పాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పాత ఉపాధి హామి చట్టం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్తగా తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా జిల్లాలో ఫిబ్రవరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని.. ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీను, ఎండీ.ముంతాజ్ అలీ, కన్నారావు, వెంకటయ్య, గౌతమ్, శివ, వెంకట్గౌడ్ పాల్గొన్నారు. -
భారీగానే.. గౌరవం!
సాక్షి ప్రతినిది, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్లో మేయర్ అయ్యే రూ.65 వేల గౌరవ వేతనం అందనుంది. నీలగిరి మున్సిపాలిటీ.. కార్పొరేషన్ కావడంతో ఆ మేరకు ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు ప్రయోజనాలు లభించనున్నాయి. కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్కు, కార్పొరేటర్లకు కూడా గౌరవ వేతనాలు భారీగా లభించనున్నాయి. కార్పొరేషన్ పరిధిలో వివిధ శాఖల్లో పనిచేసే దాదాపు 2 వేల మంది ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కూడా పెద్ద మొత్తంలో పెరగనుంది. భారీగా ఆర్థిక ప్రయోజనం మేయర్ అయ్యే వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్న వారికి నెలకు రూ.19,500 గౌరవ వేతనం ఉంది. ఇప్పుడు కార్పొషన్లో మేయర్ అయ్యే వారికి నెలకు రూ.65 వేల వేతనం లభించనుంది. ఇక మున్సిపల్ వైస్ చైర్మన్కు నెలకు రూ.9,750 గౌరవ వేతనం ఉండగా.. డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యే వారికి నెలకు రూ.32,500 గౌరవ వేతనం లభించనుంది. కార్పొరేటర్లకు రూ.7,800 వేతనం ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిలర్గా పని చేసిన వారికి నెలకు రూ.4,550 గౌరవ వేతనం ఉండేది. నల్లగొండ కార్పొరేషన్ కావడంతో కౌన్సిలర్ స్థానం కార్పొరేటర్గా మారనుంది. దీంతో కార్పొరేటర్గా గెలిచే వారికి ప్రతి నెలా గౌరవ వేతనం రూ.7500 లభించనుంది. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపొందే 48 మంది కార్పొరేటర్లకు ఇది వర్తించనుంది. కార్పొరేషన్ పరిధిలో రూ.2 లక్షలకుపైగా జనాభా ఉంటే కార్పొరేషన్ పరిధిలో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరగనుంది. ప్రస్తుతం నల్లగొండ 2,43,615 జనాభాతో కార్పొరేషన్గా అవతరించబోతోంది. దీంతో కార్పొరేషన్ పరిధిలో పనిచేసే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరగనుంది. ప్రధానంగా కలెక్టరేట్ పరిధిలో 500 మంది వరకు ఉద్యోగులు ఉండగా, జిల్లా వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల, వ్యవసాయ, సంక్షేమ, విద్య, పోలీసు ఇతరత్రా అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం 50 వేలకు పైగా జనాభా కలిగిన మున్సిపాలిటీలో వారికి 13 శాతం హెచ్ఆర్ఏ వస్తోంది. ఇక కార్పొరేషన్ కానుండడంతో ఇక్కడ 17 శాతం హెచ్ఆర్ఏ లభించనుంది. దీంతో ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఫ నీలగిరి కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులకు పెరగనున్న గౌరవ వేతనాలు ఫ ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా 17 శాతానికి పెరుగుదల ఫ రెండు వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం -
పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సర్కిల్స్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శశికళ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.నర్సింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్టడీ సర్కిల్లో ప్రవేశాలకు పోటీ పరీక్షలో అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష హాల్ టికెట్లు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని.. పోటీ పరీక్ష ఫిబ్రవరి 8న ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతుందని తెలిపారు. అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 20 నుంచి జూలై 19, 2026 శిక్షణలో కొనసాగుతారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 84650 35932, 96031 67257 ఫోన్ నంబర్లఅను సంప్రదించాలని సూచించారు. పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీనే ప్రామాణికంరామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ అన్నారు. మండలంలోని మేళ్ల దుప్పలపల్లిలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ తరహాలో ప్రభుత్వం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రశాంతంగా టీసీసీ పరీక్షలునల్లగొండ టూటౌన్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో నిర్వహించిన వివిధ టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఉదయం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ లోయర్ అండ్ హైయర్ పరీక్షలకు 1,378 మందికి గాను 1,049 మంది హాజరయ్యారని, 329 మంది గైర్వాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 1,047 మంది అభ్యర్థులు హాజరు కాగా, 331 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. ఏసీబీ దాడులపై ముందే సమాచారం!నల్లగొండ : అవినీతికి పాల్పడిన వారిని అరికట్టాల్సిన ఏసీబీ వారే ముందస్తు దాడులు జరుగుతున్నాయనే సమాచారం ఇచ్చి వారినుంచి డబ్బులు వసూలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ ఏసీబీలో పనిచేస్తున్న ఒక సీఐ, ఒక హోంగార్డు ఈ తతంగానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాంపల్లి, మఠంపల్లి, గరిడేపల్లిలో గతంలో పనిచేసిన ఎస్ఐలపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దానిపై ముందే వారికి మీపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటూ సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. మఠంపల్లి ఎస్ఐకి ఏసీబీ ట్రాప్ సమాచారం ముందే ఇచ్చి రూ.10 లక్షలకు సెటిల్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులే ముందే సమాచారం లీక్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం విస్మయం గొల్పుతోంది. -
నిరాటోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవికి నిరాటోత్సవాలను అర్చకులు ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ నీరాటోత్సవాల్లో శ్రీస్వామి వారి నిత్య కల్యాణ సేవతో పాటు గోదాదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాఢ వీధుల్లో అమ్మవారి సేవతో పాటు శ్రీస్వామి వారి గజవాహన సేవను ఊరేగించారు.మధ్యాహ్నం ఉత్సవ మండపంలో అమ్మవారికి కట్టెపొంగళిని ఆరగింపుగా పెట్టారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 రాత్రి ఆలయంలో గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవం, 15 ఉదయం 11.45గంటలకు వడి బియ్యం సమర్పించే వేడుకలను నిర్వహిస్తున్నామని అర్చకులు వెల్లడించారు. -
సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
నల్లగొండ టూటౌన్ : ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టర్ ఎదుట నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, జిల్లాకార్యదర్శి అద్దంకి రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి వెంకన్న, ఉమ్మడి జిల్లా కన్వీనర్ అప్పల మధు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జోగు అంజన్న, షేక్ చాంద్పాషా, చింత స్వామి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యమకారుల దీక్ష -
చెర్వుగట్టులో దుకాణాల నిర్వహణకు టెండర్లు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి ఆలయంలో దుకాణాలతో పాటు వివిధ పనుల నిర్వహణ హక్కుల కోసం శనివారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈఓ కార్యాలయంలో వీటిని నిర్వహించారు. కొండపైన టోల్గేట్ నిర్వహణ, కొబ్బరిచిప్పల సేకరణ, టాయిటెట్ బ్లాక్ నిర్వహణ, కొండకింద కూల్డ్రింక్స్ షాపు, హోటల్, అమ్మవారి వస్త్రాల సేకరణ, క్యారీ బ్యాగుల విక్రయం, నందిసర్కిల్ వద్ద షాప్ నంబర్– 2, షాప్ నంబర్– 4, షాప్ నంబర్– 5, షాప్ నంబర్– 6, ఆవులకు పచ్చిగడ్డి అమ్ముకునే హక్కు కోసం వేలం నిర్వహించారు. టెండర్ల నిర్వహణ ద్వారా ఆలయానికి రూ.1,87,34,528 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.1,21,36,777 రాగా ప్రస్తుతం వేసిన టెండర్లకు రూ. 65,97,751 అధికంగా వచ్చిందని ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్ నేతకాని కృష్ణయ్య, దేవాలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరఽశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఆలయానికి రూ.1.87 కోట్ల ఆదాయం -
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా, ఛానెల్స్లో మహిళా అధికారులపై పనికట్టుకుని వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని ఖండిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారు. బాధ పడుతారని ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అధికారుల బదిలీలు సీఎం, సీఎస్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు. ఐఏఎస్, IPS కావాలంటే ఎంతో కష్టపడాలి. ఐఏఎస్ అధికారులకు సెలవులు ఉండవు. ఐఏఎస్, IPS అధికారుల బదిలీలు సర్వసాధారణం. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న.. మీకు కుటుంబాలు ఉంటాయి. రాసే వారికి భార్య పిల్లలు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయి.. మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో సీఎం పై విమర్శలు వచ్చాయి.. లిమిట్ లేకుండా పోయింది.ఆ ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి మీరు ఆలోచన చేసుకోండి. మహిళలు ఉద్యోగాలు చేయడమే తప్పా!. మంత్రుల ఇళ్లలో ఇబ్బందులు పెట్టి.. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు. మమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనుకుంటే వేసుకోంది. ఫోన్ మాట్లాడకపోతే.. ఫోన్ ఎత్తకపోతే అసత్య వార్తలు రాస్తారా?. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అధికారులతో రివ్యూ ఎప్పుడు చేయాలి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా... ఇలాంటి వార్తల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. నాలాంటి వాడిని ఏడుపిస్తా అనుకుంటే ఏడిపించండి. ఇప్పటికే కొడుకును కోల్పోయి ఏడుస్తున్నాను.సినిమాపై క్లారిటీ.. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసాను. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకి రాలేదు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయి. నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు.. పెట్ట దల్చుకోలేదు. నిప్పులాగా బతికిన వాడిని ఇలా మానసికంగా బాధ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను దేవుడే శిక్షిస్తాడు. జిల్లా మంత్రిగా రివ్యూ పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా?. ఎన్నో విమర్శలు వచ్చినా ఆరుసార్లు గెలిచాను. వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
జిల్లా స్థాయి ఆంగ్ల ప్రతిభా పోటీలు
రామగిరి(నల్లగొండ): పట్టణంలోని డైట్ కళాశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆంగ్ల ప్రతిభ పోటీలను శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భాషా నైపుణ్యాలు అభివృద్ధి పరిచే కార్యక్రమంగా ఒలంపియాడ్, ఎడ్యుటాక్ అంశాలతో ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నర్సింహ, ఎల్టా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ.అబ్బాస్, ప్రధాన కార్యదర్శి కె.బాలరాజు, ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఎం.అనిల్కుమార్, కోశాధికారి ఏ.రాధాకిషన్, ఎన్.విష్ణు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలి
తిప్పర్తి : పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం తిప్పర్తి పీహెచ్సీని ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి, మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని పేషంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, వైద్యులు మమత, నవనీత, షాబుద్దిన్ పాల్గొన్నారు. జీజీహెచ్లో హెల్ప్ డెస్క్నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగుల కోసం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఇటీవల బాధ్యతలను స్వీకరించిన సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు నేత రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వైద్యం పొందడంలో ఆలస్యం కాకుండా సకాలంలో రోగులకు వైద్యం అందాలనే లక్ష్యంతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం, అత్యవసర విభాగం, అవుట్ పేషంట్ రోగుల విభాగాల్లో శుక్రవారం హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయించారు. హెల్ప్ డెస్క్లలో సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఇక ఎంసీహెచ్ వద్ద పాదరక్షలు విడిచేందుకు ప్రత్యేకంగా స్టాండ్లను ఏర్పాటు చేయించి.. అక్కడ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. అత్యవసర విభాగం గేటు వద్ద ప్రత్యేకంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయించారు. రోగులకు అందించే డైట్ వివరాలను ప్రతి వార్డులో డిస్ప్లే చేయాలని, రోగులకు స్కానింగ్, ఇతర పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. నార్కట్పల్లి ఎస్ఐ ఎస్పీ ఆఫీస్కు అటాచ్నార్కట్పల్లి : నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ను ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఆయనను వీఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో చిట్యాల ఎస్ఐ రవికుమార్కు.. నార్కట్పల్లి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
సంక్రాంతికి వస్తున్నాయ్
రైతుల చెంతకు యాంత్రీకరణ పరికరాలు నల్లగొండ అగ్రికల్చర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన(2018)లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకం అమలు చేసి రైతులకు సబ్సిడీపై పరికరాలను అందించాలని నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను జిల్లాకు 1.81 కోట్ల నిధులను కేటాయించింది. 2025 మార్చి 31లోగా పరకరాలను పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరికరాల పంపిణీకి మోక్షం లభించలేదు. తిరిగి 2025 సంవత్సరానికి గాను పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వాటా ఉంటుంది. గతంలోనే కొందరిని ఎంపిక చేయగా.. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్ ఇచ్చేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. సబ్సిడీ ఇలా.. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు ఇచ్చే సబ్సిడీలో ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు పరికరం ధరలో 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రైతు ఎంపిక చేసుకున్న కంపెనీ ధరలో సబ్సిడీ పోను మిగతా వాటా డబ్బులను రైతు డీడీ రూపంలో దరఖాస్తుతో అందించాల్సి ఉంటుంది. పరికరాలు ఇవే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యాంత్రీకరణ పరికరాలను పెద్ద సంఖ్యలో కేటాయించింది. పవర్ టిల్లర్లు 50, బ్రష్కట్టర్స్ 83, పవర్టిల్లర్లు 58, మేజ్సెల్లర్స్ 20, స్ట్రాబెల్లర్స్ 90, చేతిపంపులు 8,289, పవర్ స్ప్రేయర్స్ 1,047, రోటోవేటర్స్ 463, విత్తనాలు, ఎరువులు వేసే పరికరాలు 107, ట్రాక్టర్ పనిముట్లు 475, బండ్ ఫార్మర్స్ 45 జిల్లాకు కేటాయించింది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ ఆయా నియోజకవర్గ, మండలాల వారీగా పరికరాలను కేటాయించి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పండుగ తరువాత పంపిణీ చేసేలా.. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను జిల్లాలో సంక్రాంతి పండుగ తరువాత పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల లబ్ధిదారుల ఎంపిక చేసింది. అయితే దాదాపు 10 వేల వరకు పరికరాలు ఉండగా.. ఐదు వేలలోపే దరఖాస్తులు రావడంతో.. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరణ చేపట్టారు. పండుగలోపు ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికను తయారు చేసింది. శుక్రవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరికరాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. పండుగ తరువాత జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పరికరాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.సబ్సిడీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రైతులు తమ పరిధిలోని వ్యవసాయాధికారులను సంప్రదించి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ ఫ జిల్లాకు రూ.8 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఫ కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ఫ పండుగ తర్వాత పంపిణీకి సన్నాహాలు -
చెర్వుగట్టులో సౌకర్యాలు కల్పించాలి
నార్కట్పల్లి : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దేవాలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్యం, నీరు, బారికేడ్లు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎక్కువ శాతం సిబ్బందిని కేటాయించాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టు పైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయానికి రూ.వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని, వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు కొనసాగించాలని తెలిపారు. హయత్నగర్ నుంచి నేరుగా చెర్వుగట్టుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఈఓ మోహన్బాబు, సర్పంచ్ నేతగాని కృష్ణ, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
క్రీడలతో ఓర్పు
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : క్రీడలు శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఓర్పును ఇస్తాయని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో ఐదు రోజులపాటు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్–2025 ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు.. ఒక ఉద్యోగం కాదని, బాధ్యత అని చెప్పారు. దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొని విధులు నిర్వహించే పోలీసులకు స్పోర్ట్స్ మీట్ నూతన ఉత్తేజాన్ని కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతర్గత దారులు అస్తవ్యస్తం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణంలోని సాయినగర్ కాలనీ, వీబీ నగర్ కాలనీ, శాంతినగర్, గంగారెడ్డినగర్, అనుముల వారిగూడెం ప్రాంతాల్లో సీసీ రోడ్లు లేక ఆయా కాలనీలో నేటికి మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితేచాలు.. మట్టి రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా నడవలేని స్ధితికి చేరుతుండడంతో ప్రజలకు బాధలు తప్పడం లేదు. వర్షాకాలంలో వర్షపునీరంతా మట్టి రోడ్డు గుంతల్లోకి చేరడం వల్ల రోడ్లన్నీ చిత్తడిచిత్తడిగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చండూరు : మున్సిపాలిటీలో రోడ్లు మురుగుకాల్వలను తలపిస్తున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇళ్లలోని నీరు వీధుల్లో పారుతోంది. దీంతో అంతర్గత రహదారులన్నీ కంపుకొడుతున్నాయి. మున్సిపాలిటీలో మెత్తం 15 కిలో మీటర్ల మేర అంతర్గత రోడ్లు ఉండగా అందులో 8 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. 7 కిలోమీటర్లు మట్టి రోడ్లే ఉన్నాయి. ఈ మట్టి రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం, ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది అప్పుడప్పుడు తవ్వి వదిలేయడంతో ఆ రోడ్లపై ప్రయాణం ప్రజలకు నరకప్రాయంగా మారింది. మెయిన్ రోడ్డు పనులు త్వరగా చేయకపోవడం, పాత డ్రెయినేజీ మూసి వేయడంతో మురుగు అంతా రోడ్లపై ప్రవహిస్తోంది. మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు అస్తవ్యస్థంగా మారాయి. ప్రధానంగా తాళ్లగడ్డలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం తీసిన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో సరిగా సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాలకు రోడ్లు బురద మయంగా మారుతున్నాయి. సీతారాంపురం–బంగారుగడ్డకు వెళ్లేందుకు బిడ్జి నిర్మాణం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు వేయలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేసిన మిల్లర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆరుగురు మిల్లర్లు రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేశారు. తమవద్ద ధాన్యం ఉందని, అధికారులే సీఎంఆర్ తీసుకోవడం లేదని బుకాయించిన మిల్లర్ల బండారం బయట పడింది. అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేలిపోయింది. వారిపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్)యాక్ట్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా మిల్లర్లకు సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టేందుకు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2016 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లను గుర్తించడం, వారు ఎగ్గొట్టిన ధాన్యం పరిమాణం, దాని విలువ తేల్చడంతోపాటు వెంటనే ఆయా మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసేందుకు పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ అండ్ టాస్క్ఫోర్స్ విభాగం చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ డీఎస్ఓ వెంకటేశ్వర్లును స్పెషల్ ఆఫీసర్గా, రిటైర్డ్ తహసీల్దార్ ఎస్.ప్రభాకర్, డీపీఓ ఎస్.రాజ్కుమార్, ఇన్స్పెక్టర్ సైదులుతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లులకు సంబంధించిన వ్యవహారాలను, చేపట్టాల్సిన తదుపరి చర్యలను పర్యవేక్షించనున్నారు. నల్లగొండలో 57 వేల మెట్రిక్ టన్నులు పక్కదారి ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఇవ్వాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం కాకినాడ పోర్టుకు తరలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు జిల్లాలోని ఆరు మిల్లులపై విచారణకు ఆదేశించారు. దీనిపై ఏర్పాటు చేసిన అధికారులు కమిటీ రంగంలోకి దిగింది. 2022–23 యాసంగి సీజనన్కు సంబంధించి చిట్యాలలోని వరలక్ష్మి మిల్ 59,538 క్వింటాళ్లు, నల్లగొండలోని రామ్లక్ష్మణ్ 78,110 క్వింటాళ్లు, మునుగోడులోని మురళీమనోహర్ ఆగ్రోఫుడ్ 4500 క్వింటాళ్లు, నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని సుమాంజలి 67,662 క్వింటాళ్లు, గౌతమి ఇండస్ట్రీస్ 1,59,803 క్వింటాళ్లు, నల్లగొండలోని కనకమహాలకి్ష్మ్ పార్బాయిల్డ్ మిల్లు 80,260 క్వింటాళ్లు మొత్తంగా 44,987 మెట్రిక్ టన్నుల వేలం ధాన్యం లేనట్లు తేలింది. దానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యం కూడా లేవని తేలింది. పైగా అది ప్రభుత్వం వేలం వేసిన ధాన్యం. ఆ ధాన్యం లేకపోగా, కనీసం బియ్యం కూడా మిల్లుల్లో లేదని కమిటీ తేల్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు నివేదించింది. మరోవైపు మరికొన్ని మిల్లుల్లోనూ మరో 12 వేల మెట్రిక్ టన్నులు, మొత్తంగా 57 వేల మెట్రిక్ ధాన్యం లేదని దీంతో తదుపరి చర్యలపై యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ధాన్యం మాయం చేసిన మిల్లర్ల విషయంలో తదుపరి కార్యాచరణపై త్వరలోనే పౌర సరఫరాల శాఖ సబ్ కమటీ భేటీ కానుంది. ఈ నెలాఖరులో నిర్వహించే ఆ సమావేశంలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లనుంచి రికవరీ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీంతో జిల్లాలోనూ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు చేపడతారు. ఫ అధికారులే సీఎంఆర్ తీసుకోవడం లేదంటూ వాదనఫ కానీ.. ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేల్చిన అధికారుల కమిటీఫ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారిపై చర్యలకు సన్నద్ధం ఫ ఆయా మిల్లర్ల ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపివేత ఫ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయనున్న పౌరసరఫరాల శాఖ ఫ సబ్కమిటీ భేటీ అనంతరం మిల్లర్లపై చర్యలకు సిఫారసు -
సంక్రాంతి ఎఫెక్ట్.. పంతంగి, కూకట్పల్లిలో ఫుల్ ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రేపటి నుంచే విద్యా సంస్థలకు సెలవులు కావడంతో సిటీ జనం.. పల్లెబాట పట్టారు. సొంతూరికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో.. బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు.దీంతో, కూకట్పల్లి-మియాపూర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్, కార్లతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడింది. #Nalgonda In view of the Sankranti festival rush, traffic congestion has increased significantly on the Hyderabad-Vijayawada National Highway (NH-65). Specifically, there is a heavy influx of vehicles at the Pantangi Toll Plaza.@NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE pic.twitter.com/lFCYHMMhDD— Akalankam Seshu (@ienalgonda) January 9, 2026 -
మేయర్.. ఏ కేటగిరీకి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్లో మేయర్ రిజర్వేషన్పై ఉత్కంఠ నెలకొంది. ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ దక్కుతుంది.. ఎవరు మేయర్ అవుతారనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణాయక విధానాలపై రాజకీయ పార్టీల్లోనూ సర్వత్రా చర్చ జరుగుతోంది. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అవతరించిన నేపథ్యంలో తొలి మేయర్గా ఎవరు కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతారనే చర్చ జరుగుతుంది. ఈలోగా వారం పది రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. దీంతో రిజర్వేషన్లు మారుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో నల్లగొండ కార్పొరేషన్కు తొలి మేయర్ పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గతంలో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా.. నల్లగొండ మున్సిపాలిటీకి 1995లో చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వు కావడంతో బీజేపీ నుంచి బోయినపల్లి కృష్ణారెడ్డి చైర్మన్ అయ్యారు. ఆ తరువాత 2000లో బీసీ జనరల్ అయింది. అప్పుడు పుల్లెంల వెంకట్నారాయణగౌడ్ కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 32 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2005లో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ తిరిగి జనరల్ అయింది. అప్పుడు కూడా పుల్లెంల వెంకట నారాయణ గౌడ్కే చైర్మన్ పదవి దక్కింది. ఆ సమయంలో 36 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2014లో రిజర్వేషన్ జనరల్ మహిళకు అయింది. అయితే బీసీ మహిళ అయిన బొడ్డుపల్లి లక్ష్మి కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 40 వార్డులు ఉండేవి. ఆ తరువాత 2020లో ఓసీ జనరల్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మందడి సైదిరెడ్డి చైర్మన్ అయ్యారు. అప్పుడు 48 వార్డులు అయ్యాయి. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బుర్రి శ్రీనివాస్రెడ్డి చైర్మన్ అయ్యారు. రాజకీయ పార్టీల్లో చర్చ మొదటిసారి కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రిజర్వేషన్ల మార్పు తప్పనిసరి అనే సంకేతాలు రావడంతో మొదట ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చ సాగుతోంది. మొన్నటి వరకు పాత రిజర్వేషన్లు ఉంటాయని అంతా భావించారు. తాజాగా రిజర్వేషన్లు మారుతాయనే అంశం స్పష్టం కావడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మొదటిసారి మేయర్ రిజర్వేషన్ ఎవర్ని వరించనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నల్లగొండ కార్పొరేషన్ రిజర్వేషన్పై ఉత్కంఠ ఫ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే విధానంపైనే సర్వత్రా చర్చ ఫ రాష్ట్ర స్థాయిలోనే ఖరారు చేయనున్న సర్కారు ఫ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఆసక్తి ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీ కాాకుండా 9 కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనే కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. డివిజన్లు, వార్డులు మాత్రం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పరిధిలోనే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అయితే నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది. దీంతో రాష్ట్ర యూనిట్ రిజర్వేషన్లు ఖరారు చేయనుండటంతో ఈ రిజర్వేషన్ మారనుంది. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయంపైనే నల్లగొండ మేయర్ రిజర్వేషన్ జరగనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ జోరుగా సాగుతుంది. మేయర్గా మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నందున మొదట జనరల్కు అవకాశం ఇస్తారా.. లేక బీసీలకా, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం దక్కుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది. -
పేరుకుపోతున్న మురుగు
చండూరు : చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో 7వ వార్డులోని ఒకేఒక్క కాలనీ తప్ప అంతటా 8.29 కిలోమీటర్ల ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్ధ ఉంది. డ్రెయినేజీలు శ్రుభం చేసేందుకు వార్డుకు ఇద్దరు చొప్పున 20 మందిని నియమించారు. వీరికితోడు ఐదుగురు వాహన డ్రైవర్లు ఉన్నారు. అయితే సరిపడా సిబ్బంది లేక వారానికోసారి మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. అంతటా ఓపెన్ డ్రెయినేజీలు కావడంతో అందులో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాఽలు పడేస్తున్నారు. వర్షాకాలంలో డ్రెయినేజీలు నిండి మురుగునీరు రోడ్లు, వీధుల్లో పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
ప్రమాదకరంగా ఓపెన్ డ్రెయినేజీలు
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులో ఓపెన్ డ్రెయినేజీలపై పైకప్పులు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. వ్యవసాయ మార్కెట్ ప్రహరీకి అనుకుని భువనగిరి రోడ్డు నుంచి హైవే వరకు ఇటీవల పైకప్పు లేకుండా వెడల్పుగా ఓపెన్ డ్రెయినేజీని నిర్మించారు. ఈ రోడ్డులో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. ఏడాది కాలంలో 10వ వార్డులో ఎల్లమ్మగుడి సమీపం, వేణుగోపాల స్వామి వెంచర్లోని ఓపెన్ డ్రెయినేజీల్లో ప్రమాదవశాత్తు పడి ఎండి.జావీద్, మేకల భిక్షం మృతిచెందారు. ఓపెన్ డ్రెయినేజీలపై స్లాబ్ వేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎనిమిది వార్డుల్లోనే డ్రెయినేజీలు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు అంతర్గత రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా కేవలం 8 వార్డుల్లోనే అంతర్గత డ్రెయినేజీ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని చోట్ల ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నాయి. ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నచోట వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదనీటితో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం పట్టణంలోని పలు చోట్ల నూతనంగా చేపట్టిన డ్రెయినేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. -
మ్యాన్హోల్ నిర్మాణం అస్తవ్యస్తం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలోని కాలనీలు డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్ల వెంట వేసిన డ్రెయినేజీ పైపులు.. ఇళ్ల నుంచి వచ్చే మురుగు పైపుల కంటే మ్యాన్హోల్స్ ఎత్తులో నిర్మించారు. దీంతో మురుగునీరు వాటిలోకి పోలేని పరిస్థితి. మూడున్నరేళ్ల క్రితం హిల్కాలనీ, పైలాన్ కాలనీలో 70శాతం సీసీ రోడ్లు వేయడంతో చాలా వరకు డ్రెయినేజీలు పూడిపోయినా వాటిని పునరుద్ధరించలేదు. సాగర్ డ్యాం కాలనీలు ఎత్తులో ఉండడంతో డ్రెయినేజీల నిర్మాణం సాధ్యపడడం లేదు. దీంతో ఆయా కాలనీల్లోని వీధుల్లో మురుగు ప్రవహిస్తోంది. -
మురుగుమయం.. దోమలకు నిలయం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఓపెన్ డ్రెయినేజీలు నిండిపోయి వరదంతా కాలనీలను ముంచెత్తుతోంది. పట్టణంలోని పలు వార్డులో డ్రెయియినేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది 15 రోజలకోసారి తొలగిస్తుండడంతో దుర్గంధంగా మారి దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. శాంతినగర్లో డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వీధుల్లోనే పారుతోందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. -
నీలగిరిని స్మార్ట్ సిటీగా మారుస్తా..
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని కాంగ్రెస్ కై వసం చేసుకునేలా అధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని అన్నేశ్వరమ్మ గుట్ట వద్ద అమృత్–2 పథకం కింద రూ.1.45కోట్లతో నిర్మించిన తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అనంతరం రూ.3.14కోట్లతో చేపట్టిన వల్లభరావు చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన, లెప్రసీ కాలనీలో రూ.3కోట్లతో సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. లతీఫ్సాబ్గుట్ట వద్ద రూ.50లక్షలతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ ఎస్ఈ–2 యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి నల్లగొండ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, అబ్బగోని రమేష్, వంగూరి లక్ష్మయ్య, నారగోని నవీన్కుమార్గౌడ్, కమిషన్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం రామగిరి(నల్లగొండ): రైతులకు నాణ్యమైన విద్యు త్ అందించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం దోనకల్లులో నిర్మించిన 33 కేవీ సబ్స్టేషన్ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కోమటిరెడ్డి పృథ్వీధర్రెడ్డి, దోనకల్, పాతూరు సర్పంచ్లు కొత్తపల్లి సునితమధు, దోటి పద్మపరమేశ్ పాల్గొన్నారు. ఫ తొలి మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను సుమారు 500పైగా ఉన్న ఓపెన్ డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా మారాయి. బంగారుగడ్డ, హనుమాన్పేటలో ప్రధాన నాలాలు కొన్నిచోట్ల ఆక్రమణకు గురై రెండు ఫీట్ల మేరకే ఉన్నాయి. బంగారుగడ్డ నుంచి వచ్చే ప్రధాన నాలాలోకి సమీప గృహాల వారు మరుగుదొడ్ల పైపులు వదిలివేయడంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలాలు చాలాచోట్ల ధ్వంసం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలు లేక ప్రమాదకరంగా మారాయి. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. -
వేధిస్తున్న సిబ్బంది కొరత
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీలో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పట్టణంలో మొత్తం 20 వార్డుల్లో మెయిన్ రోడ్డులో బాబాసాహెబ్గూడెం నుంచి పటేల్నగర్ వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినీజీ నిర్మించారు. మిగతా అన్ని వార్డుల్లో ఓపెన్ డ్రెయినేజీలే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది 71 మంది ఉన్నారు. జనాభా పరంగా మరో 20 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. సిబ్బంది కొరతతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీల్లో ముగురు పేరుకుపోయి దుర్వాసనమయంగా మారాయి. -
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
నల్లగొండ : రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఏ.సురేంద్రమోహన్ అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రభుత్వ స్థలం ఉంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో యాసంగి పంటలకు యూరియా కొరత లేదని, ఫర్టిలైజర్ యాప్ ద్వారా అందరికీ అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, డీసీఓ పత్య నాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, హార్టికల్చర్ అధికారి సుభాషిని తదితరులు పాల్గొన్నారు. పారదర్శకతకోసమే యూరియా బుకింగ్ యాప్ నకిరేకల్ : రైతులకు యూరియా సరఫరాలో పారదర్శకత కోసమే యూరియా బుకింగ్ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ చెప్పారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టాకాని రైతులు కూడా యూరియా పొందవచ్చన్నారు. రెండు దఫాలుగా ఇచ్చే విధంగా చూడాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
సూర్యాపేటటౌన్ : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని జాకీర్హుస్సేన్ నగర్కు చెందిన ధరావత్ చాంప్లా(50) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. బుధవారం సాయంత్రం కొత్త వ్యవసాయ మార్కెట్లో చెట్టుకు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మృతుడి కుమారుడు రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. చెట్టుపై నుంచి పడి మృతిపెన్పహాడ్ : చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండల కేంద్రానికి చెందిన దాసరి కోటయ్య(50) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో చెట్టు కొమ్మలను మిషన్తో తొలగిస్తుండగా.. ప్రమాదశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాదాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతిభువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలం పడమటిసోమారం మంలోని లింగ బసవేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ నెల 6న గుర్తుతెలియని మహిళ నవజాత ఆడ శివువును వదిలి వెళ్లగా.. గ్రామస్తులు గుర్తించి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శిశువు మృతి చెందింది. శిశువు చలిలో ఉండటం వల్ల హార్ట్బీట్ తగ్గిందని, సీపీఆర్ చేసినప్పటికీ శిశువు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హాకీ పోటీలకు ఎంపికై న రామన్నపేట విద్యార్థిరామన్నపేట : తమిళనాడులో ఈనెల 12 నుంచి జరిగే విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి హాకీ పోటీల్లో రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థి నోముల సాయికుమార్ పాల్గొననున్నాడు. గురువారం ఎంపిక ప్రక్రియలో సాయికుమార్ పాల్గొని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యాడు. ఆ జట్టు తరఫున ఆడనున్నాడు. -
మద్యం షాపు ఎదుట విద్యార్థుల ధర్నా
పెద్దఅడిశర్లపల్లి : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్యం షాపు ఎదుట ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను వెంటనే మరో చోటుకు తరలించాలన్నారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఫ పాఠశాల సమీపంలో నుంచి తొలగించాలని డిమాండ్ -
హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు : మంత్రి
చిట్యాల: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను గురువారం కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, హైవే పీడీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న పనులను నిలిపివేసి, జాతీయ రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేసి వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఎన్హెచ్–65ను 8 లైన్లుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధం చేశామని, మార్చిలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ప్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్ట్ హైవే రహదారిని నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట డీటీసీ వాణి, చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు
త్రిపురారం : పంటల పెరుగుదలకు సూక్ష్మపోషకాల అవసరం ఎంతగానో ఉంటుంది. సూక్ష్మపోషకాల లోపం వలన నేలలు చౌడుగా మారి పంటల దిగుబడులపై ప్రభావం చూపుతుంది. రైతులు సాధ్యమైనంత మేర ఎరువులు వేసుకొని పంటలపై సూక్ష్మపోషకాల ప్రభావం లేకుండా చూసుకోవాలి. సరైన సమయంలో చర్యలు చేపడితే సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమించవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఫ జింకు లోపం : జింకు లోపం ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అపరాల్లో అధికంగా కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం భాస్వరం ఎక్కువగా వేసిన పొలాలు, చౌడు నేలలు, మాగకుండా సేంద్రీయ పదార్థాలు అధికంగా వినియోగించిన పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపం వలన వరి నాటిన 2 నుంచి 4 వారాల్లో మొక్కపై నుంచి 3 లేదా 4 ఆకుల నడుమ ఈను తెల్లగా పాలిపోతుంది. ఆ తర్తా ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిపార్లు ఏవిధమైన లోపాలు కనిపించకున్నా.. నత్రజని, భాస్వరం, తగినంత మోతాదులో వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. మొక్కజొన్నలో జింకు లోపం వల్ల లేత ఆకుల నడుమ ఈనెకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్కలు గిడసబారిపోతాయి. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి మచ్చలు ఏర్పడతాయి. పప్పుధాన్యాల్లో జింకు లోపం వల్ల మొక్కలు గిడసబారిపోతాయి. లేత ఆకుపచ్చ మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కనువులు దగ్గరగా ఉండి మొక్కల పెరుగుదల ఆలస్యంగా పెరుగుతుంది. ఫ నివారణ చర్యలు సాధారణ నేల్లో మూడు పంటలకు ఒకసారి.. కొత్తగా ఆయకట్టు కింద సాగుచేసే నేలల్లో, చౌడు, ఉప్ప నేలల్లో రెండు పంటలకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి. పంటలో జింకు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ను కలిపి ఆకులు మొత్తం తడిసేలా ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని 2 నుంచి 3 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వరి పండించే నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి పంటకు ముందు వేస్తే జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. ఫ ఇనుము లోపం : ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో లేదా సాగు నీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో కనిపిస్తుంది. ఇనుము లోపం వరిలో మెట్ట నారు మడుల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆకుల ఈనెల మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోయి పసుపుగా మారుతాయి. లోపం తీవ్రమయ్యే కొద్ది ఆకు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోతాయి. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు లేత ఆకుల్లో కనిపించి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. నివారణ చర్యలు పంటల్లో ఇనుము లోపం గుర్తించినప్పుడు లీటరు నీటికి 10 గ్రాముల అన్నబేదిని ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిసేలా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ఫ బోరాన్ లోపం : వరిలో బోరాన్ లోపం వల్ల లేత ఆకులు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. నేలల్లో బోరాన్ ఎక్కువైనప్పుడు ఆకులపై చివరన మచ్చలు వచ్చి ఎండిపోతాయి. బోరాన్ లోప స్థాయి లేదా విషమ స్థాయి మధ్య వ్యత్యాసం తక్కువ కావున బోరాన్ లోపం నిర్ధారించిన తర్వాత మాత్రమే నేలలకు లేదా పంటలకు బోరాన్ను అందించాలి. పత్తి పండించే నేలల్లో కూడా బోరాన్ లోపం కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వ సాధారణంగా ఉంటుంది. ఫ నివారణ చర్యలుబోరాన్ లోపం నివారణకు ఎకరాకు రెండు కిలోల బోరాక్స్ను ఆఖరి దుక్కిలో వేయడంతో పాటు రెండుసార్లు 0.15 శాతం బోరాక్స్ను 60 లేదా 90 రోజులకు పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు పూవ్వులల్లో మధ్యభాగం గింజ కట్టదు. వేరుశనగలో గింజ మధ్యభాగం తోడుకోదు. ఈ లోపాన్ని నివారించడానికి 0.1 శాతం బోరిక్ ఆమ్లాన్ని ఒక లీటరు నీటికి కలిపి పంట వేసిన 30 నుంచి 45 రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగించడం పెంచడం వల్ల భూమిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. నేలలోనే కాకుండా పంటపై కూడా లోపాలను సరిచేసుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి ఉపఝెగించడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుందని రైతులు గమనించాలి. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు


