breaking news
Nalgonda
-
ఇద్దరు స్నేహితుల ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా: ప్రేమ విఫలమైందని ఒకరు.. స్నేహం కోసం మరొకరు.. ఇద్దరు యువకులు కలిసి ఒకేచోట మద్యంలో గడ్డిమందు (గ్లైఫోసెట్) కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన లోడె పవన్, కోనేటి అఖిల్లిద్దరూ క్లాస్మేట్స్తోపాటు ప్రాణ స్నేహితులు కూడా. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. నల్లగొండలో ఐటీఐ కూడా కలిసే చదివారు. ఈ క్రమంలోనే పవన్ కట్టంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పవన్, ఆ బాలిక పది రోజుల కిందట ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కట్టంగూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయాన్ని పవన్ కుటుంబీకులకు తెలియజేయగా.. అడ్రస్ తెలుసుకొని పవన్ను, ఆ బాలికను రప్పించారు. ఆపై బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ప్రేమ విఫలమైందని పవన్ కుమిలిపోతున్నాడు. ఇద్దరూ కలిసి..: పవన్, అఖిల్ రోజు మాదిరిగానే బుధవారం కలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గడ్డిమందు, మద్యం, కూల్డ్రింక్ కొనుగోలు చేసి వాటిని తీసుకొని పవన్ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగారు. ఆ తర్వాత తమ సన్నిహితులకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని చెప్పారు. వారు వచ్చేసరికి ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. -
6న ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం
నల్లగొండ : ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై ఈనెల 6న నల్లగొండలో ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారన్నారని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. అధికారులు వారంలో కనీసం నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలని, నిబద్ధతతో, బాధ్యతగా పనులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించే గ్రామసభలు, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అనంతరం ఆయా అంశాల వారీగా నిర్వహించాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై కార్యాచరణ -
మళ్లీ.. మూడు నెలల రేషన్
నల్లగొండ: మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెల్లరేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఏప్రిల్ నెలలోనే బియ్యం పంపిణీ చేయనుంది. ఈ మేరకు గోదాముల్లో ఉన్న బియ్యాన్ని రేషన్ షాపులకు తరలించాలని ఎఫ్సీఐ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా బియ్యం పంపిణీ చేయాలని సూచించింది. 5,38,650 రేషన్ కార్డుదారులు జిల్లాలో 5,38,650 రేషన్ కార్డుదారులున్నారు. ఒక్కో కార్డులో యూనిట్ ఆరు కిలోల చొప్పున జిల్లాలో ప్రతి నెల 7900 మెట్రిక్టన్నుల బియ్యాన్ని 1051 రేషన్షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఇక మూడు నెలలకు ఒకేసారి బియ్యం ఇస్తుండడంతో 23,700 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కానుంది. ఈ బియ్యాన్ని రేషన్షాపులకు తరలించనున్నారు. అయితే మూడు నెలల బియ్యం దిగుమతికి రేషన్ దుకాణాల్లో స్థలం కొరత ఏర్పడే అవకాశం ఉంది. గోదాములు ఖాళీ చేసేందుకేనా.. దేశ వ్యాప్తంగా అన్ని గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. గత వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ వస్తోంది. ప్రస్తుతం గోదాముల్లో బియ్యం నిల్వలను ఖాళీ చేయకపోవతే సీఎంఆర్ తీసుకునే పరిస్థితి లేనందున ప్రస్తుతం ఉన్న నిల్వలను.. 3 నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ యుద్దం కారణంగా మధ్య ఆసియాలో ఉద్రిక్తత నెలకొంది. యుద్దం అలాగే కొనసాగితే అయిల్ దిగుమతికి ఇబ్బందులు ఏర్పడి.. రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా పేదలకు బియ్యం ఇవ్వడంతో పేదలకు మేలు జరగడంతో పాటు అటు గోదాములు ఖాళీ అయి సీఎంఆర్కు ఇబ్బందులు ఉండవనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఫ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి ఏప్రిల్లో ఇవ్వాలని నిర్ణయం ఫ గోదాముల్లో నిల్వలను తగ్గించేలా చర్యలు ఫ రేషన్ దుకాణాలకు తరలనున్న 23,700 టన్నుల బియ్యం -
బెల్ట్షాపులు ఎత్తివేయాలని తీర్మానం
ఏపూరు గ్రామంలో 18 వరకు బెల్ట్షాపులు ఉన్నాయి. నిరంతరం మద్యం అమ్మకాలతో ఎంతోమంది మద్యానికి బానిసవుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో బెల్ట్షాపుల్లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని నిర్వాహకులకు నోటీసులు అందజేశాం. బెల్ట్షాపులను నిర్వహించమని వ్యాపారులు కూడా అంగీకార పత్రాలు అందజేశారు. గురువారం నుంచి బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు సాగకుండా చూస్తాం. – పాలెం మహేష్గౌడ్, సర్పంచ్, ఏపూరు ఫ నిర్వాహకులకు నోటీసులు అందజేసిన ఏపూరు సర్పంచ్ చిట్యాల : మద్యానికి బానివుతున్న యువతను కాపాడేందుకుగాను చిట్యాల మండలంలోని ఏపూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఆ గ్రామంలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులతో గ్రామంలోని యువతతో పాటు చుట్టుపక్కల పనిచేసే కార్మికులు మత్తులో జోగుతున్నారు. అంతేకాకుండా ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యానికి బానిసలుగా మారి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం ద్వారా సర్పంచ్ నోటీసులు అందజేశారు. బెల్ట్షాపులు నిర్వహిస్తున్న వారందరితో గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపులను మూసివేసేందుకు నిర్వాహకులు అంగీకరించారు. గతంలో బెల్ట్షాపులపై దాడిచేసిన మహిళలు.. గతేడాది ఏపూరు గ్రామానికి చెందిన కూరకుల ధనుంజయ్య అనే యువకుడు బెల్ట్ షాపులో మద్యం తాగి బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పట్లో ఆ గ్రామ మహిళలంతా కలిసి గ్రామంలో బెల్ట్షాపులపై దాడులు చేశారు. గ్రామంలో బెల్ట్షాపులు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించి.. ఎకై ్సజ్ శాఖతో పాటు పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాలను అందజేశారు. దీంతో కొంతకాలం బెల్ట్షాపులను నిలిపివేసిన నిర్వాహకులు రెండు నెలల ఆనంతరం తిరిగి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. అయితే.. మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మాదగాని వంశీ మద్యం మత్తులోనే బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆ గ్రామస్తులు ఊరిలో బెల్ట్షాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన సర్పంచ్ మహేష్గౌడ్ బెల్ట్షాపుల ఎత్తివేయాలని నోటీసులు అందజేశారు. -
6 నుంచి పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్
నల్లగొండ : నల్లగొండలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.నవీన్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అభివృద్ధి సౌలభ్య కార్యాలయం, హైదరాబాద్ ఆధ్వర్యంలో విశ్వకర్మీయ వ్యాపారులకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయాల పెంపునకు, వ్యాపార అవకాశాలను విస్తరించుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు ఉత్తమ అవకాశమని పేర్కొన్నారు. స్టాల్స్ పరిమిత సంఖ్యలో ఉన్నాయని ఆసక్తి గల పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. వివరాలకు 9885832642 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. పోలీస్ కబడ్డీ క్రీడాకారిణికి ఎస్పీ అభినందననల్లగొండ : ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో బంగారు పతకం సాధించిన నల్లగొండ పోలీస్ కబడ్డీ క్రీడాకారిణి షేక్ నౌషీన్ను ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం అభినందించారు. కబడ్డీలో ప్రతిభ చూపి ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్కు నౌషీన్ ఎంపికయ్యారు. జమ్ముకశ్మీర్లో ఈ నెల 7 నుంచి 13 వరకు జరగనున్న జాతీయ కబడ్డీ పోటీల్లో నౌషిన్ తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు. బీఓఎస్ సభ్యుల నియామకంనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నూతన సభ్యులను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో సిలబస్ కూర్పు, పరీక్షల నిర్వహణ విధానం మూల్యాంకనం, వంటి అంశాలను చర్చించి ఆయన ఆమోదించారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) మెంబర్లుగా అలువాల రవి, జక్క సురేష్ రెడ్డి, శ్వేత, వి.అనురాధ, మెంబర్ కన్వీనర్గా లక్ష్మీప్రభ, ఇతర సభ్యులుగా వాస్తవ అపర్ణ, ఏదుళ్ల శ్రీధర్రెడ్డిని నియమించారు. వీరి నియామకం రెండేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. పథకాలపై విద్యార్థులకు అవగాహన నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బుధవారం కామర్స్ విద్యార్థులకు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీంపై అవగాహన కల్పించారు. పథకం ప్రధాన ఉద్దేశాలు, అర్హతలు, బ్యాంకు రుణం, సబ్సిడీ, దరఖాస్తు విధానాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, జక్కా సురేష్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, లార్షవర్ధన్, పి.మల్లేష్, ఉయ్యాల శివ, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. నూతన కోర్సులో చేరేందుకు దరఖాస్తులునల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐలో కేంద్ర ప్రభుత్వ పీఎంకేవీవై 4.0 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో చేరాలనుకునే ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు ఈ నెల 6లోగా కళాశాలలో లేదా, 8919234137 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
‘చలో ఢిల్లీ’ని విజయవంతం చేయాలి : జాజుల
మునుగోడు : బీసీలకు ఉద్యోగ, విద్య, రాజకీయాల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న చేపట్టనున్న చలో ఢిల్లీకి పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. బుధవారం మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీల రిజర్వేషన్లు పెంచాలని పోరాడితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానిని అమోదించకపోవడంతో బీసీలకు రిజర్వేషన్ అందని ద్రాక్షాగా మారిందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన రాహుల్గాంధీని కోరితే అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో బూడిద లింగయ్యయాదవ్, ఆనగంటి క్రిష్ణ, బూడిద మల్లికార్జున్, ఈదులకంటి కై లాస్, వీరమళ్ల కార్తిక్, గుర్జ నర్సింహగౌడ్, కర్నాటి వెంకటేషం, సత్యం, అశోక్, అనిల్ పాల్గొన్నారు. -
పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర.. నిప్పుల గుండంలో పడిన భక్తులు
సాక్షి,నల్లగొండ : వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అగ్నిగుండం దాటే సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే ఈసారి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదానికి దారితీసింది.భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో కొంతమంది భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఇతర భక్తులు వెంటనే స్పందించి వారిని బయటకు లాగారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరికి కాలిన గాయాలు, మరికొందరికి తోపులాటలో గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న భక్తులు, గ్రామస్థులు కలిసి గాయపడిన వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు. నిప్పుల్లో పడిన వారిని బయటకు లాగి, వెంటనే వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న గాయపడిన వారిని పరామర్శించారు. ఉత్సవాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు. -
సీఎం సమావేశంలో కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సదస్సులో నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.మీడియా అకాడమీ చైర్మన్కు సర్పంచ్ల సన్మానంనార్కట్పల్లి: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఆయన స్వగ్రామం నార్కట్పల్లి మండలం పల్లెపహాడ్కు వచ్చారు. ఈసందర్భంగా సర్పంచ్ సంగిశెట్టి రాణమ్మ, అమ్మనబోలు సర్పంచ్ కొంపెల్లి సైదులు, బాజకుంట సర్పంచ్ పల్లగొర్ల రాజు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి శ్రవణ్ కుమార్, మండల కార్యదర్శి పెండ్యాల శంకర్, సీపీఐ నాయకులు వనం వాసుదేవ్, వనం శీను, పులసాని శ్రీనివాస్ రెడ్డి, దుబ్బ నరసింహ, తీగల మల్లారెడ్డి పాల్గొన్నారు. కరాటే అకాడమీ ఏర్పాటు అభినందనీయంమిర్యాలగూడ టౌన్ : కరాటే అకాడమీ ఏర్పాటు అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డులో సుమన్ షోటోఖాన్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అకాడమీని సోమవారం రాత్రి ఆయన ప్రారంభించి మాట్లాడారు. మిర్యాలగూడలో తన పేరుతో కరాటే అకాడమీ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. మహిళలు, బాలికలు, బాలురు కరాటే నేర్చుకుంటే తనను తాను రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సుమన్ షోటోఖాన్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్, మాస్టర్ బూడిద సైదులు, అకాడమీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ, మాస్టర్ బాండావత్ రామకృష్ణానాయక్ తదితరులున్నారు. కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాబుమాదిగకోదాడరూరల్ : మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడకు చెందిన చింత బాబుమాదిగ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్లో టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల సరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తినే అవమానించిన కమిషన్ సూర్యాపేట : తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ ఉపాధ్యాయ వృత్తిని వేతనంతో వెలకట్టడం దురదృష్టకరమని, ఇది ఉపాధ్యాయ వృత్తికి అవమానకరమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తీకుల్ల సాయిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చేది వేతనం కాదని, అది గౌరవభృతి అని తెలిపారు. సమాజంలో వెలకట్టలేని వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోకుండా, విద్యారంగంలో నిష్ణాతులైన విద్యావేత్తలతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. -
ఇన్స్పెక్షన్ కాకుండా అడ్వయిజరీ కమిటీలు వేయాలి
పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీమ్ను ఏర్పా టు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఈ కమిటీల కంటే అడ్వయిజరీ కమిటీలు వేస్తే బాగుండేది. కమిటీలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను తీసుకుంటే బాగుండేది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే లేని పరిస్థితి. అలాంటి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సక్రమంగా లేవు. అలాంటి వాటిలో ఇన్స్పెక్షన్ పేరున పాఠశాలలకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తే బాగుండేది. కానీ కొందరు తోటి ఉపాధ్యాయులను తక్కువ చేసే విధంగా ఇది బాగలేదు అది బాగలేదంటూ చెప్పడం బాధ కలిగిస్తుంది. – నామిరెడ్డి మహేందర్రెడ్డి, పీఆర్టీయూ, తిప్పర్తి మండల శాఖ అధ్యక్షుడు -
క్షణికావేశం.. తీరని శోకం
తెలిసీతెలియక ఆన్లైన్ గేమ్ ఆడిన చౌటుప్పల్లోని మల్లికార్జుననగర్ కాలనీకి చెందిన మహిళ అవిశెట్టి రాజేశ్వరి చివరికి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆటలో పెట్టుబడి పెట్టేందుకుగాను తన డబ్బుతోపాటు ఇతరుల వద్ద అప్పుగా తీసుకువచ్చింది. చివరికి అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఎదురైన తీవ్రమైన ఒత్తిడితో మానసికంగా ఇబ్బందికి గురైంది. గడువు కోరినా సదరు వ్యక్తులు వినకపోగా ఇంటిపైకి వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించింది. దాంతో 2023 జూన్ 27న తన ఇద్దరు కుమారులు అనిరుధ్, హర్షవర్ధన్లను నీటి సంపులో వేసి ఆ తర్వాత తానూ అందులోనే దూకి ఆత్మహత్య చేసుకుంది. ఫ కుటుంబ కలహాలతో మనస్తాపం ఫ తీవ్ర మానసిక ఒత్తిడితో బలవన్మరణాలు ఫ పిల్లలను కూడా బలిగొంటున్న తల్లిదండ్రులు ఫ ట్రైన్కు ఎదురుగా వెళ్లి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య ఘటన మరవక ముందే మరో విషాదం ఫ సోమవారం బీబీనగర్ మండలం గొల్లగూడెంలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యచౌటుప్పల్, భువనగిరి : కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న కారణాలకే చాలా మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్నిమార్లు పెద్ద పెద్ద సమస్యలే ఉన్నా పరిష్కారం వైపు ఆలోచన చేయడంలేదు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న విషయాన్ని మర్చి తమకు ఏదో జరిగిపోయిందనుకొని అర్ధరహితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో తమతోపాటు నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను సైతం చంపుతున్నారు. ఫలితంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నెలరోజుల క్రితం బీబీనగర్ మండలానికి చెందిన ఓ మహిళ ఘట్కేసర్ వద్ద తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే తాజాగా సోమవారం మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బీబీనగర్ మండలం గొల్లగూడెంలో కుటుంబ కలహాల గృహిణి ఐశ్వర్య కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలు ఝాన్సీ, పండును ఊపిరాడకుండా చేసి చంపి ఆ తర్వాత తానూ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 15ఏళ్ల క్రితం భార్యతోపాటు బిడ్డలను చంపిన భర్త చౌటుప్పల్లో 15 ఏళ్ల కిత్రం వార్డు మాజీ సభ్యుడు లింగస్వామి తన భార్యతో పాటు ఇద్దరు కుమారులను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. చికిత్స పొందిన తర్వాత కోలుకున్నాడు. సమాజంలో చక్కటి గుర్తింపు పొందిన ఆ వ్యక్తి భార్య, బిడ్డలను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, కనీసం ఆలోచన ఎందుకు చేయలేదో ఇప్పటికీ అంతుచిక్కడంలేదు. 2021లో ఒకేసారి తల్లి, ఇద్దరు కుమార్తెలు భార్యభర్తల నడుమ నెలకొన్న కలహాల నేపథ్యంలో 2021 జూలై 8న చౌటుప్పల్లోని రాంనగర్కాలనీలో తొర్పునూరి ఉమారాణి తన ఇద్దరు కుమార్తెలు హర్షిణి, లాస్యలను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అదే ఘటనలో తన చిన్న కుమార్తె శైనీని సైతం చంపేందుకు ఉరి బిగించినప్పటికీ తృటిలో తప్పించుకుంది. ప్రాణాలతో బయట పడిన చిన్నారికి తండ్రి ఉన్నప్పటికీ తల్లి ప్రేమకు మాత్రం దూరమైంది. ప్రస్తుతం బంధువుల సంరక్షణలో ఉంది. మద్యపానం ఆ కుటుంబంలో చిచ్చురేపింది. ట్రైన్కు ఎదురుగా వెళ్లి..బీబీనగర్కు చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి, కుమార్తె చేతన, కుమారుడు విశాల్రెడ్డితో కలిసి ఈఏడాది జనవరి 31న మేడ్చల్ జిల్లా చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య రైలు మార్గంలో ట్రెయిన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్రెడ్డి సొంతూరు భువనగిరి మండలం బొల్లేపల్లి కాగా 20 ఏళ్ల కిత్రం బీబీనగర్కు వలస వెళ్లారు. అక్కడ నుంచి బోడుప్పల్కు మకాం మార్చారు. విజయశాంతిరెడ్డి తన పిల్లలతో కలిసి బోడుప్పల్లో ఉంటుండగా సురేందర్ రెడ్డి దుబాయ్లో పనిచేస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలతో కలిసి విజయశాంతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అప్పట్లో అందరిని కలిచివేసింది.కనుపాపలను కాపాడుకోవాల్సిన కనులే కారు చీకటిలో దారిని వెతుక్కుంటున్నాయి. అమ్మ లాలిపాట వినాల్సిన పసిప్రాయాలు చేయని నేరానికి నిస్సహాయంగా మట్టిలో కలిసిపోతున్నాయి. కన్న ప్రేమ కసాయిగా మారిన క్షణం.. తమ పంచ ప్రాణాలను సైతం తోడు తీసుకెళ్తున్నాయి. తాను లేకపోతే తన పిల్లలు ఏమైపోతారోననే అపోహ మాతృత్వానికి మాయని మచ్చను మిగిలిస్తోంది. అభం శుభం తెలియని అమాయక పసిప్రాణాలను చిది మేయటంకాదు.. కారుచీకట్లు కమ్ముకున్నా రేపటి సూర్యోదయం కోసం వేచి చూడడమే జీవితం అన్న సూక్తిని గుర్తించుకోవాలి. మానసిక స్థితిని గమనిస్తూ ఉండాలిపెద్దలు కుటుంబంలోని ఇతర సభ్యుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మానసిక స్థితిలో తేడా కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడి విషయం ఏమిటో కనుక్కోవాలి. వారితో చర్చించి సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అప్పటికి కూడా కాని పక్షంలో మానసిక వైద్యులను సంప్రదించి వారిచే కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేని పక్షంలో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి -
ముదురుతున్న ఎండలు
నల్లగొండ: గత పది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, కనిష్టంగా 20.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 15 తర్వాత 5 రోజులపాటు చల్లటి గాలులు వీచాయి. అనంతరం రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈసారి ఫిబ్రవరి 15 వరకు చలి తీవ్రతతో జనాలు ఇబ్బంది పడగా.. 20వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో పెరగాల్సి న ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారం నుంచే 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి..పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటనన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. నూనె వస్తువుల కంటే చలువ చేసే ఆహార పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలని, పశువులను, మూగజీవాలను నీడ పట్టున ఉంచి, తగినంత నీటిని అందుబాటులో ఉంచాలని తెలియజేస్తున్నారు.తేదీ గరిష్టం 24 30.5 25 30.0 26 31.0 27 32.0 28 31.5 01 32.0 02 32.5 03 33.0ఉష్ణోగ్రత (డిగ్రీల సెల్సియస్లో) గత పది రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత మంగళవారం 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు -
అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారని..
కొండమల్లేపల్లి : తన పేరిట ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్ము వెంకటయ్య(49) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ పరిధిలో పూల్సింగ్తండాకు చెందిన నేనావత్ శ్రీనుకు మూడు గుంటల భూమిని వెంకటయ్య విక్రయించాడు. తన పేరిట ఉన్న మరో 17 గుంటల భూమిని కూడా శ్రీను, మరో నలుగురు కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరితే బెదిరిస్తున్నారని, దీంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని వెంకటయ్య ఓ పేపర్లో రాసి సోమవారం తన ఇంటి సమీపంలో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపంలో బలన్మరణం -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
మిర్యాలగూడ టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తి యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఆది వారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ (36) ఆదివారం రాత్రి బైక్పై గ్రామంలోని కిరాణ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ.. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై యూట ర్న్ తీసుకుంటుండగా త్రిపురారం నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్కు తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య పగడాల సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. చికిత్స పొందుతూ మృతిచందంపేట : ఓ వ్యక్తితో ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ లచ్చు(30) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కూలీ పనితో పాటు ఊళ్లో చిన్న కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన కేతావత్ శ్రీకాంత్తో లచ్చుకు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కర్రతో దాడి చేయగా లచ్చు, అతడి భార్య అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లచ్చును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఈ ఘటనతో జోడుబాయితండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ బీసన్న ఆధ్వర్యంలో చందంపేట ఎస్ఐ లోకేష్, డిండి ఎస్ఐ బాలకృష్ణ, నేరెడుగొమ్ము ఎస్ఐ నాగేంద్రబాబు, నాంపల్లి, మర్రిగూడ ఎస్ఐలు, దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి బందోబస్తు చేపట్టారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో జైలుశిక్ష సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష,, రూ.2300 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4 వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మరణంలోనూ వీడని స్నేహం
సప్లిమెంటరీ పరీక్షల కోసం వచ్చి.. హైదరాబాద్లో ఉంటున్న వంశీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు రెండు రోజుల క్రితం డి. కొత్తపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం వంశీ బైక్పై ఊట్కూరుకు వచ్చి రవిని వెంట తీసుకుని నల్లగొండలో పరీక్ష రాసేందుకు బయల్దేరాడు. మార్గమధ్యలో నల్ల గొండ మండలం చందనపల్లి వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఇద్దరూ మృతిచెందారు. సోమవారం రాత్రి ఊట్కూరులో రవి అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో రవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో ఊట్కూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.శాలిగౌరారం : చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గుడిసె సైదులు, సరోజన దంపతులకు కుమార్తె, కుమారుడు రవి(20) ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. సైదులు నిమ్మ తోటలు కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సైదులు అనారోగ్యానికి గురికావడంతో భార్య సరోజన, కొడుకు రవి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన నిమ్మ తోట కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం కౌలు పూర్తి కావడంతో ఇటీవలే ఊట్కూరు గ్రామానికి వచ్చారు. 7వ తరగతి నుంచి క్లాస్మేట్స్సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల వంశీ(20) అమ్మమ్మ ఊరు ఊట్కూరు పక్కనే ఉన్న బండమీదిగూడెం. దీంతో వంశీ 7వ తరగతి నుంచి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఊట్కూరు జెడ్పీహెచ్ఎస్లో రవితో కలిసి చదివాడు. ఇంటర్మీడియట్ కూడా రవి, వంశీ కలిసే చదివారు. ఇద్దరూ ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. దీంతో రవి తల్లిదండ్రులతో కలిసి నిమ్మ తోటలు కౌలు చేస్తుండగా, వంశీ హైదరాబాద్లో ఉంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం శాలిగౌరారం మండలం ఊట్కూరులో విషాదఛాయలు -
బ్యాంకులో దోపిడీకి యత్నం
చౌటుప్పల్ : మండల పరిధిలోని ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి యత్నించారు. గ్యాస్ కట్టర్తో బ్యాంకు షట్టర్ను కట్ చేస్తుండగా అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంబావి(పాత కొయ్యలగూడెం) గ్రామంలో హైదరాబాద్–విజయవాడ హైవే సర్వీసు రోడ్డులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వైపు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి బైక్పై వచ్చారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు కూడా బ్యాంకు వైపు వచ్చారు. ఈ దృశ్యాలు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేసి..అయితే బ్యాంకు వద్దకు మాత్రం ఒకే వ్యక్తి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేశాడు. మిగతా వారు రెక్కీ నిర్వహిస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం బ్యాంకు ప్రధాన ద్వారం వద్ద ఇనుప గ్రిల్ తాళం పగులగొట్టాడు. అనంతరం షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా.. ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో చుట్టుపక్కల నివాసముండేవారు ఇళ్ల నుంచి బయటకు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బ్యాంకు వద్దకు చేరుకుని.. దుండగులు దోపిడీకి యత్నించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ సందర్శించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అయితే ఈ దోపిడీకి యత్నించింది ఎంత మంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముసుగులు ధరించి బైక్లపై వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్తో షట్టర్ కట్ చేస్తుండగా మోగిన అలారం స్థానికులు అప్రమత్తమవ్వడంతో పారిపోయిన దొంగలు చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఘటన -
వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం
భూదాన్పోచంపల్లి : వినూత్న ఆలోచనలే నూతన ఆవిష్కరణలకు దోహదపడతాయని 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ డాక్టర్ బి. బెనెట్ బోస్కోదాస్ అన్నారు. సోమవారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఎంట్రప్రెన్యూర్షిప్ సెల్(ఈ–సెల్)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ–సెల్ వేదికలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు అద్భుతమైన అవకాశమన్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, సమాజంలోని సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమన్నారు. అలాగే ఈ–సెల్ విద్యార్థులకు సొంతంగా స్టార్టప్లు స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రోత్సహాన్ని అందించే కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పారు. స్టార్టప్ ప్రయాణంలో సమస్యలను ఆధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సమాజానికి దోహదపడేలా ఉండాలన్నారు. ఆ దిశగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. అనంతరం ఈ–సెల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ బెనెట్ బోస్కోదాస్ -
ట్రాక్టర్ చోరీ చేసిన నిందితుల అరెస్టు
పెద్దవూర: ట్రాక్టర్ చోరీ చేసిన నిందితులను పెద్దవూర పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్తో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దున్న శ్రీను గత రెండేళ్ల నుంచి పెద్దవూర మండలం పోతునూరు గ్రామ శివారులో దొడ్డి నర్సింహారావు పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత నెల 12న దున్న శ్రీను ట్రాక్టర్తో పొలం దున్ని దానిని అక్కడే వదిలి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో పెద్దవూర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం పెద్దవూర ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి మండలంలోని పొట్టిచెల్మ వై జంక్షన్ సమ్మక్క–సారలమ్మ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుముల గ్రామానికి చెందిన మంద శంకర్, కావేటి భరత్ ట్రాక్టర్పై హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఆపారు. ట్రాక్టర్కు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోతునూరు సమీపంలో పొలంలో ఉన్న ట్రాక్టర్ను చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి ట్రాక్టర్, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను నిడమనూరు కోర్టులో రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. -
బాల్య వివాహం నిలిపివేత
కేతేపల్లి : కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన బాలికకు తల్లిదండ్రులు బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులు సోమవారం బాలిక ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి పనులు జరుగుతుండటంతో అధికారులు బాలిక తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేయడం చట్ట పరంగా నేరమని వారిని అవగాహన కల్పించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అంగీకరించి రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో తహసీల్దార్ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ కళావతి, అశ్రిత, లక్ష్మణ్, శోభారాణి ఉన్నారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్నకిరేకల్ : పట్టణంలో ఆది వారం రాత్రి సంతకు వచ్చిన వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో స్పృహతప్పి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న నకిరేకల్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ స్థానిక యువకుల సహాయంతో సదరు వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం అతడిని చికిత్సనిమిత్తం ప్రైవేట్ వాహనంలో నకిరేకల్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
హయత్నగర్ : నష్టాల్లో ఉన్న నల్లగొండ–రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం(నార్ముల్– మదర్ డెయిరీ)కి పూర్వ వైభవం తీసుకొస్తామని, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని మదర్ డెయిరీ కార్యాలయంలో ఆయన డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మదర్ డెయిరీలో నెలకొన్న సరిస్థితులను, పదేళ్లుగా వస్తున్న నష్టాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించామని, సమస్యల పరిష్కారానికి తగిన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మదర్ డెయిరీ మాక్స్ చట్టం పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేమని, ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు)తో ఒప్పందం కుదిర్చేందుకు కృషిచేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, నార్ముల్ ప్రతినిధి సామ మహిపాల్రెడ్డితో కూడిన బృందం ఎన్డీడీబీ ప్రతినిధులతో చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు తక్షణ సహాయంగా రూ.10 కోట్లు ఇచ్చేందుకు ఎన్డీడీబీ అంగీకరించిందన్నారు. పాల సేకరణను మదర్ డెయిరీ పాలకవర్గం చూసుకోవాలని, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెటింగ్ ఎన్డీడీబీ చూసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. మదర్ డెయిరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ మధుసూదన్రెడ్డి -
ప్రతిపల్లెకూ ఆర్టీసీ బస్సు నడపాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మునుగోడు : ప్రభుత్వం పత్రి పల్లెకు ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామస్తులు తమకు నల్లగొండ నుంచి మునుగోడు మీదుగా బస్సు నడపాలని ఇటీవల ఎమ్మెల్సీని కలిసి కోరగా.. ఆయన ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఆ గ్రామానికి బస్సు ఏర్పాటు చేయించారు. సోమవారం మునుగోడులో బస్సును ప్రారంభించి అదే బస్సులో లింగవారిగూడెం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం నూటికి నూరుశాతం అమలయ్యేందుకు ప్రతిపల్లెకు బస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంపై లింగవారిగూడెం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కురిమిద్ద శ్రీనివాస్, రామచంద్రం, బొల్గూరి నర్సింహ, వెంకటేశ్వర్లు, గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి, లక్ష్మయ్య, కూసుకుంట్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 123 ఫిర్యాదులురాగా.. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 59, ఇతర పిర్యాదులు 64 వచ్చాయని తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగియనున్నందున ఆయా పద్దుల కింద మంజూరైన నిధులు, చేపట్టిన పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. హాస్టళ్ల తనిఖీపై నిర్దేశించిన ప్రొఫార్మాలో మండలాల ప్రత్యేక అధికారులు నివేదికను సమర్పించాలన్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ప్రత్యేక అధికారులు వెంటనే మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న సందర్భంగా మండలాల ప్రత్యేక అధికారులు భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
కోఆప్షన్ పదవులపై గురి
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్లు, కొత్త వారికి అవకాశం కల్పించడం లాంటి వాటితో తాజా మాజీ కౌన్సిలర్లకు పోటీ చేసే అవకాశం రాలేదు. దాంతో అలాంటి వారికి కో ఆప్షన్ పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డివిజన్లలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా పట్టు ఉండి.. పలు కారణాలతో స్వల్ప ఓట్లతో ఓడిన మాజీ కౌన్సిలర్లు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారు సైతం కో ఆప్షన్ పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాదాపు 20 మంది కో ఆప్షన్ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నగరంలో చర్చ సాగుతోంది. నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కొలువు దీరడంతో కో ఆప్షన్ పదవులపై ఆశావహులు గురిపెట్టారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీచేసే అవకాశం రాని వారు, టికెట్ లభించినా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారు కో ఆప్షన్ పదవులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కో ఆప్షన్ పదవులు ఆశిస్తున్న నాయకులు ఇప్పటికే పైరవీ మొదలు పెట్టారు. కొందరు మంత్రి హామీ తమకు ఇచ్చారని చెబుతుండగా, మరికొందరు వివిధ మార్గాల ద్వారా పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరానికి చెందిన కీలక నాయకులను ప్రసన్నం చేసుకొని మంత్రి దృష్టిలో పడేందుకు ఆశావహులు తంటాలు పడుతున్నారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నాలుగు కో ఆప్షన్ పదవులు ఉండగా, కార్పొరేషన్ అయినందున అదనంగా ఎన్ని పెరుగుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా అయితే ఆరుగురికి కో ఆప్షన్ పదవులు ఇవ్వాలని మంత్రి కూడా సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారే.. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లో 48 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే అధికార పార్టీకి చెందిన వారినే కో ఆప్షన్ పదవుల్లో నియమిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, మైనార్టీ వర్గాలకు చెందిన వివాద రహితులకు కో ఆప్షన్ పదవులు ఇస్తుంటారు. నగరాభివృద్ధిలో సలహాలు, సూచనలు ఇస్తూ పాలకవర్గానికి చేదోడు, వాదోడుగా ఉండేవారిని, రాజకీయాలకు అతీతంగా ఉండే వారికి చోటు కల్పించాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారినే నియమిస్తున్న విషయం తెలిసిందే. ఫ నీలగిరి కార్పొరేషన్లో పైరవీలు మొదలు పెట్టిన నాయకులు ఫ మంత్రి దృష్టిలో పడేందుకు ఆశావహుల తంటాలు -
పెట్రోల్ బాటిల్తో రైతు హల్చల్
కొండమల్లేపల్లి : తన తల్లి పేరున ఉన్న భూమిని మరో వ్యక్తి పేరన చేస్తున్నారని ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని హల్చల్ చేశారు. సోమవారం కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య తల్లి లక్ష్మమ్మ పేరున సర్వే నంబర్ 151లో 24 గుంటల భూమి ఉంది. 2013లో అదే గ్రామానికి చెందిన పిల్లి యాదయ్యకు అందులో నుంచి 12 గుంటల భూమిని వ్రికయించారు. కానీ.. యాదయ్యకు నాలుగు గుంటలు మాత్రమే రికార్డుల్లో ఎక్కింది. లక్ష్మమ్మ పేరుమీద ఇంకా 20 గుంటల భూమి ఉంది. అయితే.. ఆ 8 గుంటల భూమిని తనకు తెలియకుండా రైతు యాదయ్య పేరున చేస్తున్నారని భావించిన రైతుల లింగయ్య తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. గమనించిన సిబ్బంది, అతని భార్య, కూతురు అడ్డుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ నరేందర్ను వివరణ కోరగా.. కొన్నేళ్ల క్రితం జరిగిన భూమి క్రయ, విక్రయంలో భాగంగా యాదయ్యకు 8 గంటల భూమి రావాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా రైతు లింగయ్యకు.. మరో రైతు రాములు నుంచి 8 గుంటలు రావాల్సి ఉండడంతో.. ఆ భూములకు సంబంధించి ఎవరికి వారు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించామని తహసీల్దార్ పేర్కొన్నారు. అవగాహన లోపంతో రైతు లింగయ్య ఇలా చేయడం సరికాదన్నారు. ఫ కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘటన -
వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
నల్లగొండ టౌన్ : వేసవికాలం ప్రారంభమైంది. ఈసారి ఎండలు మండుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దావఖానాల్లో ఇప్పటికే ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. దాంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ సిబ్బంది, ఆశ వర్కర్ల వద్ద కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనుంది. వడదెబ్బ బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, సైలెన్ బాటిళ్లను సిద్ధం చేసింది. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు.. వేసవి నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. అందులో వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బంది, ఇతర టెక్నిషియన్లు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా వేసవిలో వచ్చే జబ్బులు ప్రబలి ప్రజలు ఇబ్బంది పడితే వెంటనే ఆ బృందాలు ఆ గ్రామానికి చేరుకుని అవసరమైన చికిత్స అందించనుంది. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా నుంచి సమాచారం అందిన వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సభ్యులను ఆయా ప్రాంతాలకు పంపనున్నారు. వైద్యులు అందుబాటులో ఉండాల్సిందే.. ఎండలు పెరుగుతున్నందున అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దవాఖానాల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. సమయపాలన పాటించడంతో పాటు పనిచేసే చోటే నివాసం ఉండాలని స్పష్టం చేసింది. ఫ వేసవి నేపథ్యంలో అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫ ఆస్పత్రుల్లో సిద్ధంగా మందులు, సైలెన్ బాటిళ్లు ఫ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ -
హోలి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హోలి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రజ లందరి జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి జరుపుకునే ఈ రంగుల పండుగ మన సంస్క్రతికి, ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రజలు రసాయన రంగులకు దూరంగా ఉండి, ప్రకృతి సహజ రంగులతో పర్యావరణానికి హాని కలగకుండా హోలి పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలినకిరేకల్ : విద్యా ప్రమాణాలు పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విద్యాశాఖ ప్యానల్ ఇన్స్పెక్షన్ నోడల్ టీం ఆఫీసర్ చామల నర్సయ్య, టీం సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్, కే.రవికుమార్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఈ బృందం సోమవారం నకిరేకల్ మండలం నోముల ప్రాథమిక పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ చామల నర్సయ్య పలు సూచనలు చేశారు. నోముల పాఠశాలలో బోధనాభ్యసన ప్రక్రియ, అన్ని విషయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం పాక ప్రసాద్, ఉపాధ్యాయులు ఉదయశ్రీ, సునీత, రవి, సృజన తదితరులు ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు 441 మంది గైర్హాజరునల్లగొండ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మ్యాథ్స్, బోటని, పొలిటికల్ ైసెన్స్ పరీక్షలు సోమవారం జరిగాయి. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 14,722 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 14,281 మంది పరీక్ష రాశారు. 441 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. బీఈడీలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలినల్లగొండ టూటౌన్ : బీఈడీ విద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్తో కలిపి కనీసం 10 మంది అధ్యాపకులను విధిగా నియమించాలన్నారు. ఆధార్లింక్తో అధ్యాపకుల నమోదు జరగాలని, 75 శాతం విద్యార్థి హాజరును కచ్చితంగా పాటించేందుకు ఫేస్ రికగ్నిషన్ మెషిన్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ఆకుల రవి పాల్గొన్నారు. -
విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం
మదర్ డెయిరీకి పూర్వ వైభవం మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి తెలిపారు. - 8లోమంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026కామ దహనంనాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన 3వ బుద్ధ దమ్మ యాత్ర ముగింపు వేడుకలకు కార్మికశాఖ మంత్రి వివేక్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం కల్బుర్గిలోని సిద్ధార్థ విహార్ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర శాంతి సందేశాన్ని చాటుతూ నాగార్జునసాగర్ తీరానికి చేరుకోవడం సంతోషదాయకమని చెప్పారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ నేల మన నాగరికతకు గర్వకారణమని, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి బుద్ధుడి బోధనలే పునాది అని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బౌద్ధవారసత్వ సంపదకు కొత్త జీవం పోస్తోందన్నారు. రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, దూలికట్ట వంటి చారిత్రక బౌద్ధక్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రపంచస్థాయి యాత్రా అనుభవాన్ని కల్పించేలా పర్యాటక సర్క్యూట్ ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. బుద్ధుడి బోధనలు యువతకు చేరువ చేసేందుకు ఇక్కడ ఒక ‘డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బుద్ధుడి బోధనలు మార్గదర్శకం : మంత్రి వివేక్ కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మనిషి సాధారణ జీవితం గడిపేందుకు బుద్ధుడి బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. శాంతియుతంగా, ఆశావాద దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్, పర్యాటక శాఖ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి, గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్, అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హిట్టంబె, లతారాజా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేకే.రాజా, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి బౌద్ధభిక్షువులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.జిల్లాలో ఈ సారి ముందస్తుగానే వరి సాగు చేశారు. దీంతో కోతలు కూడా ముందే రానున్నాయి. దానికి అనుగునంగా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. గత యాసంగిలో ఏప్రిల్ 1న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అప్పటికే ముందస్తు కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని కల్లాలకు తెచ్చారు. కానీ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో రోజుల తరబడి కల్లాల వద్దే పడిగాపులు కాశారు. ఈసారి అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తుగానే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండ : యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఎంత దిగుబడి వస్తుందన్న అంచనాలను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. అయితే దానికి అనుగుణంగా జిల్లాలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. వాటిలో చేయాల్సి ఏర్పాట్లపై ఇప్పటికే రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ సంబంధిత అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఉగాది పండుగ తర్వాత కేంద్రాలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. 4.91 ఎకరాల్లో వరిసాగు యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.91 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాని నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 2 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేస్తారని.. 8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేశారు. అందుకోసం 350 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి కేంద్రాల సంఖ్య పెంచే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఏడు మిల్లులు ప్రస్తుతం బ్లాక్లిస్ట్లో ఆయా మిల్లుల పరిధిలో వచ్చే కేంద్రాల ధాన్యాన్ని ఏఏ మిల్లులకు పంపించాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు కోట్ల గన్నీ బ్యాగులు అవసరం.. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 2 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు లెక్కలు వేశారు. ప్రస్తుతం 50 లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిల్లర్ల వద్ద ఉన్న గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలని ఇప్పటికే పౌర సరఫరాల అధికారులు సూచించారు. రేషన్డీలర్ల వద్ద ఉన్న గన్నీ బ్యాగులను కూడా పౌర సరఫరాల శాఖకే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఫ ఉగాది తర్వాత కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఫ ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ ఫ 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఫ గన్నీ బ్యాగులు సిద్ధం చేస్తున్న పౌరసరఫరాల శాఖఫ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫ సాగర్లో ముగిసిన దమ్మయాత్ర -
3న ఆలయాలు మూసివేత
నార్కట్పల్లి : చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3వ తేదీన నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడాల రామలింగేశ్వర స్వామి దేవాలయం, గోపాలయపల్లి సమీపాన గల వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయాలు మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల ఈఓలు సల్వాది మోహన్బాబు, వెంకట్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ప్రధానాలయం, ఉపాలయాల్లో ప్రాంతఃకాల పూజల అనంతరం ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేసి మరుసటి రోజు 4వ తేదీన సంప్రోక్షణ అనంతరం తెరిచి భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. సంస్కృతికి ప్రతిబింబం ఆమనగల్లు జాతరవేములపల్లి : ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర ఆనాటి సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని డీఎస్పీ రాజశేఖరరాజు అనఆనరు.. ఆదివారం ఆయన జాతరను, క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, సర్పంచ్లు పిల్లల సందీప్, ఎల్లికట్టి భరత్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్లు శాలెం రాజు, స్వాతి, బంటు చొక్కయ్య గౌడ్, రావు ఎల్లారెడ్డి, అర్చకులు రెంటాల సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు బాధ్యతగా మెలగాలి రామగిరి(నల్లగొండ) : న్యాయవాదులు తమ విధులను సమర్థంగా నిర్వహిస్తూ.. బాధ్యతగా మెలగాలని న్యాయవాద పరిషత్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి అన్నారు. ఆది వారం నల్లగొండలో నిర్వహించిన న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువ న్యాయవాదులు నిరంతరం కేసులను చదువుతూ సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలతో ముందుకు సాగాలని తెలిపారు. పేదల విషయంలో సేవా భావం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి సునీల్, కేంద్ర కమిటీ సభ్యుడు మేరెడ్డి నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, కవిత, గౌరీష్, సొమంచి వెంకటేశ్వర్లు, చొక్కా ల నాగరాజు, న్యాయవాదులు నూకల నర్సింహారెడ్డి, నూకల సంధ్యారాణి, పల్లెబోయిన శ్యామ్సుందర్, రాంప్రసాద్, హరేరామకృష్ణ, రమేష్, నరేష్, ఏమిరెడ్డి సుమశ్రీ, వాణి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పేద రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై అందిస్తున్న యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఐదు మండలాకు చెందిన పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైనా కల్టివేటర్, రోటోవేటర్, పవర్ టిల్లర్లలతో తదితర వ్యవసాయ యంత్రాలను ఆదివారం మునుగోడులో వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూలీల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రైతులకు యంత్రాలను అందిస్తోందన్నారు. వాటిని వినియోగించుకొని ఆర్థికా భివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ వేణుగోపాల్, ఏఓ పద్మజ, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తిచేస్తూ సాగిన మూడవ దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి చేరుకుంది. 29 రోజుల పాటు సుమారు 403 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకు బుద్ధవనం వద్ద ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య.. స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. బంజారా నృత్యాలు, కోలాటాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు బౌద్ధాభిమానులు అడుగడునా పూలు చల్లుతూ యాత్రికులను ఆహ్వానించారు. ధర్మచక్రం వద్ద వారి పాదాలను కడిగి గౌరవించారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన బుద్ధధాతువులను మహాస్థూపంలోని ధ్యానమందిరంలో ఉంచారు. బౌద్ధ భిక్షువులంతా జ్యోతులను వెలిగించి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ థాయిలాండ్, భారతదేశంలోని భిక్షువులతో కలిసి 403 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి బుద్ధవనం చేరుకున్నారని తెలిపారు. థాయిలాండ్ రాజ కుటుంబం ఈ దమ్మయాత్రకు సహకరించిందన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్ ముందుండి నడిపించారని తెలిపారు. అక్షయ ఫౌండేషన్ అధ్యక్షుడు కేకే రాజా దమ్మయాత్ర విజయవంత కావడంలో భాగస్వాములయ్యారని చెప్పారు. బీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు పరంధాములు ఆధ్వర్యంలో యాత్రకు సేవలుందించారని తెలిపారు. 29 రోజుల పాటు సాగిన ఈ దమ్మ యాత్రలో ‘సాతి’ అనే శునకం భిక్షువులతో పాటు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనస స్వర్ణ, బుద్ధవనం మేనేజర్ శ్యాంసుందర్రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజాప్రసాద్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ మత్తుయ్య పాల్గొన్నారు.ఫ ఘన స్వాగతం పలికిన సాగర్వాసులు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి వైపు వచ్చేందుకు మహిళలు జంకేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడంతో ప్రసవాల కోసం గర్భిణులు క్యూ కడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో ఆయిదారేళ్లుగా రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఏడేళ్లుగా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో 71,737 ప్రసవాలు జరగ్గా కేవలం.. ఒక్క ఎంసీహెచ్లోనే 49,842 ప్రసవాలు జరిగాయి. జీజీహెచ్లో మెరుగైన వసతులు నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పించడంతో పాటుగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండడంతో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. దాంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను అందించి ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రసవాలకు ఆసుపత్రికి వచ్చే సమయంలో, ప్రసవం తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి ప్రభుత్వ వాహనంలో తీసుకొళ్లి తీసుకొచ్చేవారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. గర్భిణి నమోదు నుంచి పర్యవేక్షణ.. గర్భం దాల్చిన మూడో నెలలోనే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వారి ఇంటి వద్దే గర్భిణుల పేర్లను ప్రత్యేక పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి చెకప్ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వారిని తీసుకెళ్లడంతో పాటు టీకాలు కూడా సరైన సమయంలో వేయిస్తున్నారు. ప్రసవాల కోసం పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులకు తీసుకెళుతున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడి వైద్యుల సూచనల మేరకు జీజీహెచ్కు రెఫర్ చేస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి పరిస్థితి ఆమెకు అందించాల్సిన వైద్యం వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎంసీహెచ్ యాప్లో డాక్టర్లు అప్లోడ్ చేస్తున్నారు. జీజీహెచ్లో ఉండే వైద్యులు గర్భిణులు ఆసుపత్రిలో చేరేలోపు అప్రమత్తమై ఆమెకు అందించాల్సిన చికిత్స కోసం సిద్ధంగా ఉండి ప్రసవాలు చేస్తున్నారు. జీజీహెచ్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితె వెంటనే వారిని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేయడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిని రాష్ట్రస్థాయి ఎంసీహెచ్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో అక్కడ వారికి సరైన వైద్యం అంది సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్సీ స్థాయిలోనే గర్భిణులను నమోదు చేసి వారిని రెగ్యులర్గా చెకప్కు తీసుకుపోతున్నారు. డెలివరీ అయ్యేంత వరకు ఆశ వర్కర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫ మౌలిక సదుపాయాలు పెరగడంతో సర్కార్ దవాఖానాకు వస్తున్న గర్భిణులు ఫ ఎంసీహెచ్లో రికార్డు స్థాయిలో డెలీవరీలు -
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
రామగిరి(నల్లగొండ) : ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. నల్లగొండ మండలంలోని రాములబండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవంలో మంత్రి పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు. అనంతరం ఆయన గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాములబండలో సీతారామచంద్రస్వామి ఆలయ భూములను పరిరక్షించి.. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి అందేలా చూస్తానన్నారు. దోమలపల్లి, రాములబండ, కాకుల కొండారం, దీపకుంట చెరువులను నింపడంతోపాటు కాలువలకు లైనింగ్ పనులు పూర్తి చేస్తానన్నారు. రూ.10 కోట్లతో లిఫ్టు ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.150 కోట్లతో నల్లగొండ నుంచి మునుగోడు వరకు డబుల్ రోడ్డుకు పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, సర్పంచ్ చామకూరి శంకర్గౌడ్, విగ్రహ దాత వంగాల కిరణ్కుమార్గౌడ్, బొబ్బలి ప్రకాష్రెడ్డి, గూడూరి ఉమారెడ్డి, బొంత వెంకన్న, పల్లె వెంకట్రెడ్డి, బొబ్బలి నరసింహారెడ్డి, వరికుప్పల రాజు, కష్ణంరాజు,మహేష్, బొబ్బలి వెంకట్ రెడ్డి,పల్లె కష్ణారెడ్డి, బొబ్బలి గణేష్ రెడ్డి, చామకూరి రామయ్య, చిలకరాజు భిక్షం, బొబ్బలి గణేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
గాదె శ్రీనివాస్రెడ్డి చూపిన మార్గంలో నడవాలి
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ : భూపోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరజీవి గాదె శ్రీనివాస్రెడ్డి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీనివాస్రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రైతు, కార్మిక హక్కుల కోసం సాగిన పోరాటంలో శ్రీనివాస్రెడ్డి పాత్ర నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, గాదె పద్మమ్మ, ప్రభాకర్రెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్: నల్లగొండలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐటీయూ ఏర్పడినప్పటి నుంచి దేశంలో కార్మికవర్గ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలకు వ్యతికంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నది సీఐటీయూ మాత్రమే అన్నారు. సీఐటీయూ జిల్లా సభల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన కార్మికుల సమస్యలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఎండీ.సలీం, బాణాల పరిపూర్ణాచారి, డబ్బి కార్ మల్లేష్, అవుత సైదులు, దండెంపల్లి సత్తయ్య, చింతపల్లి బయన్న, మల్లు గౌతమ్రెడ్డి, నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, పెంజర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకు రూ.17.11 కోట్లు
నల్లగొండ : గ్రామ పంచాయతీకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. కేంద్రం నుంచి రెండు విడతల్లో ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. మొత్తం 32 మండలాలకు మొదటి విడతలో రూ.16.14 కోట్లు విడుదల కాగా.. ఇటీవల రెండో విడతలో రూ.17.11 కోట్లు వచ్చాయి. ఇందులో టైడ్ నిధుల నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిపాటు ‘ప్రత్యేక’ పాలన గ్రామ పంచాయతీ పాలక వర్గాల కాల పరిమితి పూర్తయిన తర్వాత సంవత్సరం పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ సందర్భంలో అత్యవసర పనుల కోసం కార్యదర్శులు సొంతంగా ఖర్చులు పెట్టారు. ఆ బిల్లుల చెల్లింపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకు ముందు కూడా పాత సర్పంచ్ల కాలం నుంచే చాలా వరకు బిల్లులు రాలేదు. అప్పట్లో వచ్చిన ఆర్థిక సంఘం నిధులు వారికి సరిపోలేదు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు రావడంతో కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అయితే తమ బకాయిలు చెల్లించాలని ఇటీవల కార్యదర్శులంతా ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. చెల్లింపునకు సర్క్యులర్ జారీ.. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గతంలో ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. ఆర్థిక సంఘం నిధుల్లో టైడ్, అన్టైడ్ నిధులు వస్తాయి. వాటిల్లో టైడ్ నిధులను పాత బిల్లుల చెల్లింపునకు వాడాలని సర్క్యులర్ జారీ చేశారు. నిబంధనల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేయాలని సర్క్యూలర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పాత బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కార్యదర్శులకు ఊరట లభించింది. ఇప్పటికే కొందరు కార్యదర్శులకు పాత బిల్లులు చెల్లించారు. కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లో టైడ్ నిధుల నుంచి గతంలో చేపట్టిన పనులకు పంచాయతీలు బిల్లులు చెల్లించుకోవచ్చు. ఆ బిల్లుల్లో కూడా సీరియల్ ప్రకారం చెల్లించాలని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసి పంచాయతీలకు పంపాం. – శంకర్నాయక్, డీపీఓఫ 15వ ఆర్థిక సంఘం నుంచి రెండవ విడత నిధులు విడుదల ఫ పాత బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం ఫ హర్షం వ్యక్తం చేస్తున్న కార్యదర్శులు -
చికిత్స పొందుతూ రైతు మృతి
గుర్రంపోడు : అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందా డు. ఆదివారం గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకా రం.. గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన గోవింద్(55) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సరైన దిగుబడి లేక నష్టపోయాడు. గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహానికి అప్పు కావడంతో అప్పులు అంతకుఅంత పెరిగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఈ నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి గోవింద్ను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కాలుష్యం కోరల్లో రంగాపూర్
బొమ్మలరామారం : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కాలుష్య కారక కంపెనీపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు–పీసీబీ) అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్ గ్రామ సమీపంలో ఉన్న టైర్ల రీసైక్లింగ్ కంపెనీ రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తీవ్ర దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని వదులుతోంది. దీంతో కళ్లు మండుతున్నాయని, ఊపిరి పీల్చుకోలేక శ్వాస సంబంధిత సమస్యతోపాటు గుండె, ఊపిరితిత్తులు పాడవడం, జలుబు, ఎలర్జీ లాంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని, కూరగాయల పంటలపై కూడా ప్రభావం చూపుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగాపూర్ గ్రామస్తులు ఈనెల 23న ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతరావును కలిసి తమ సమస్యను వివరించారు. ఈ కంపెనీని మూసేయాలని గతంలో చాలాసార్లు అఖిల పక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రం ఆందోళలు చేసి అధికారులకు వినతులు అందజేశామని, అయినా కాలుష్య నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోగా పోగా అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదని విన్నవించారు. ఇప్పటికై నా సదరు కంపెనీపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు అఖిల పక్షం ఆధ్వర్యంలో గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనలకు నీళ్లు!రంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కాలుష్యాన్ని జనావాసాల్లోకి వదులుతున్నాయనేది బహిరంగ సత్యం. ఈ కంపెనీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన జనావాసాలకు సమీపంలో ఏర్పాటు చేయడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సదరు కంపనీ ఉత్పత్తులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, ప్రజారోగ్యానికి ముప్పులా దాపురించిన ఈ కంపెనీని మూసివేయాలని బాధిత గ్రామ ప్రజల డిమాండ్ చేస్తున్నారు. విషం చిమ్ముతున్న టైర్ల రీసైక్లింగ్ కంపెనీ అనారోగ్యం బారిన గ్రామస్తులు కూరగాలయ పంటలపైనా ప్రభావం పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలిఊపిరి తీసుకోలేకపోతున్నాంరంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ రాత్రి వేళల్లో తీవ్రమైన దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దీంతో రాత్రి సమయంలో ఊపిరి తీసుకోలేక పోతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఈ పొగతో సమీపంలోని కూరగాయల పంటలపై నల్లటి బొగ్గులాంటి పదార్థం పేరుకుపోతోంది. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలి. – జూపల్లి లింగం, బొమ్మలరామారం -
మోత్కూరు వాసికి డాక్టరేట్
మోత్కూరు : మోత్కూరు పట్టణా నికి చెందిన దునుక సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె సరితకు వరంగల్లోని కాకతీయ యూని వర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఫార్మసీ విభాగంలో ‘డెవలప్మెంట్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ నానో కారియర్ బేస్డ్ ట్రాన్స్ థర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఆఫ్ సెలెక్టెడ్ డ్రగ్స్’ అనే అంశంపై ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రకటించారు. త్వరలో గవర్నర్ చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. సరితకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
దప్పిక తీర్చిన సోలార్ బోర్లు
చందంపేట : వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల దప్పిక తీర్చడానికి అటవీ శాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 14,719 హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఎండ వేడిమికి తట్టుకోలేక దాహం తీర్చుకునేందుకు జంతువులు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు గతంలో ట్యాంకర్ల ద్వారా నీటి కుంటలు, సాసర్ పిట్లను నింపేవారు. ప్రస్తుతం సోలార్ విద్యుత్ సహాయంతో ఐదు బోర్ల ద్వారా నీటి కుంటలను నింపుతున్నారు. ఈ చర్యలతో గతంతో పోలిస్తే అటవీ జంతువుల సంఖ్యతో పాటు చిరుత పులులను కూడా గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చందంపేట మండలాన్ని ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, మను బోతులు, చిరుతపులులు, పులులు, అటవీ కుక్కల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నీరు తాగేందుకు కుంటల వద్దకు వచ్చే ఈ జంతువులను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జంతువుల అడుగులను బట్టి వాటిని నిర్ధారిస్తుంటారు. నల్లమల అటవీ ప్రాంతంలో సోలార్ విద్యుత్తో బోర్ల ద్వారా నీటి కుంటలు నింపుతున్న అటవీ అధికారులు వేసవిలో వణ్యప్రాణులకు 24 గంటల పాటు అందుబాటులో నీరు -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజల ద్వారా నిత్యాదాయం రూ.42,96,548 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్ఫెయిర్
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఆదివారం జయ సృష్టి–2026 పేరుతో సైన్స్ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన బొమ్మల కొలువు, డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, పీఎస్ఎల్వీసీ 33, 37 నమూనాలు, సోలార్ ఎనర్జీ, ఫుడ్ కోర్టు, స్పేస్ రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ క్యాంపులో తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సైన్స్ఫెయిర్లో విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత హాజరై సైన్స్ఫెయిర్ను ప్రారంభించి మాట్లాడారు. జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాసీ్త్రయ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలో వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆదివారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఈ నెల 26న మహబూబాద్ జిల్లా వీఎస్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన ధర్మారం శ్రీశైలం కారులో హైదరాబాద్కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న హెడ్కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగా కారును ఆపారు. కారుపై ఉన్న చలానా కట్టాలని శ్రీశైలంపై ఒత్తిడి చేశారు. తాను తర్వాత కట్టుకుంటానని శ్రీశైలం చెప్పడంతో అతడిపై దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగాను ఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒగ్గు కళాకారుడు మృతిఅర్వపల్లి : ఒగ్గు కథ చెప్పడానికి బైక్పై వెళ్తు న్న ఒగ్గు కళాకారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు.. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన ఒగ్గు కళా కారుడు కొల్లు యాదయ్య(53) ఆదివారం ఒగ్గు కథ చెప్పడానికి జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వెళ్తున్నాడు. మార్గమధ్యలో నాగారం మండలం ప్రగతినగర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న వరికోత మిషన్ను పక్క నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదయ్యను స్థానికులు సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కృష్ణానదిలో మునిగి బాలుడు మృతిమేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు వద్ద ఆదివారం కృష్ణానదిలో మునిగి బాలుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కాసాని గోపయ్య తన ఇద్దరు కుమారులను తీసుకొని పాత వెల్ల టూరు గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లాడు. గోపయ్య చిన్న కుమారుడు వరుణ్(7) తన అమ్మమ్మ ఇంటి సమీపంలో కృష్ణానది వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. పెద్ద కుమారుడు వచ్చి తమ్ముడు నదిలో పడిపోయాడని గోపయ్యకు చెప్పడంతో వారు వెళ్లి గంట సేపు వెతికిన తర్వాత కృష్ణానదిలో వరుణ్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు నార్కట్పల్లి : ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై నార్కట్పల్లి పోలీసులు ఆది వారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల పరిధిలోని తొండల్వాయి గ్రామానికి చెందిన బింగి సాయిబాబా ఆరేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు మరో బాలికతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సదరు యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సాయిబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
నకిరేకల్ : హైదరాబాద్–విజయవాడ హైవేపై నకిరేకల్ పట్టణ పరిధిలోని పద్మానగర్ జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ జంక్షన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు సీఐ హరిబాబు తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. -
‘వయ్యారిభామ’తో పంటకు నష్టం
త్రిపురారం : రైతులు పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ(పార్థీనీయం) కలుపు మొక్కకే. ఎందుకంటే ఈ కలుపు మొక్కకు ఎక్కడైనా పెరిగే లక్షణం ఉంటుంది. ఒక్కో వయ్యారిభామ కలుపు మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు దూర ప్రాంతాలకు సైతం త్వరగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క నివారణ చర్యలు కేవీకే కంపాసాగర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు ఆయన మాటల్లోనే.. వయ్యారిభామ కలుపు మొక్క వల్ల పంటలకే కాకుండా మనుషులు, పశువులకు కూడా ప్రమాదమే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు సోకడంతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ మొక్కలు తిన్న పశువులు హైపర్ టెన్షన్కు గురువుతాయి. పశుగ్రాసం పంటకు కూడా నష్టం కలిగిస్తాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కంటే ముందే ఈ మొక్కలు గ్రహించుకుంటాయి. తద్వారా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి సుమారు 40 శాతం మేర తక్కువ దిగుబడులు వస్తాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదం ఎక్కువ. వయ్యారిభామను తొలగించే విధానంపార్థీనీయం మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే రైతులు చేతితోనే తొలగించాలి. మొక్కలు పూత దశకు రాకముందే తొలగించి వాటిని మంటల్లో కాల్చివేయాలి. లేకపోతే ఈ మొక్కలు ముదిరితే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ పూత దశకు చేరుకున్న మొక్కలను తొలగించాలంటే చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్కులు ధరించి తొలగించి కుప్పలుగా వేసి కాల్చివేయాలి. మొక్కజొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకుంటే వయ్యారిభామ కలుపు మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేర్వాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పశుగ్రాసం సాగు చేసుకునే రైతులు పంట వేయక ముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పూతకు రాకముందే తొలగించాలి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలుకంపోస్టుగా కూడా తయారు చేసుకోవచ్చువయ్యారిభామ కలుపు మొక్కలు ఎంతో ప్రమాదకరమైనప్పటికీ వాటిని ఉపయోగించుకొని కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందు కోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేవిదంగా గుంత తవ్వుకోవాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలు వేసి వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి చల్లుకోవాలి. ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో చేసుకొని అన్ని పంటలకు సేంద్రీయ ఎరువుగా వినియోగించుకోవచ్చు. -
రెండో పీఆర్సీ అమలు చేయాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదేళ్లు అవుతున్నా రెండో పీఆర్సీ అమలు చేయకపోవడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సోమయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే నివేదికను తెప్పించుకుని 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, ఐదు విడతల పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆర్. దామోదర్, ఎన్. నాగేశ్వరరావు, బి. ఆడం, వి. రమేష్, ఎస్. సోమయ్య, సీహెచ్. రమేష్, డి. లాలు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమయ్య -
అన్నల్లో.. ఆ ఇద్దరేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఇంకా ఎంత మంది మావోయిస్టులు ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ రికార్డుల ప్రకారం ఇద్దరు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ లోతుగా విచాకరిçస్తున్నారు. గత డిసెంబర్ 25వ తేదీన ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ ఉయికే గణేశ్ అలియస్ రాజేశ్ తివారి, అలియాస్ చమ్రు, అతియాస్ గణేశన్న మరణించిన తరువాత పోలీసులు మావోయిస్టులకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందులో చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన మందుగుల భాస్కర్, గుర్రంపోడు మండలం చామలోనిబాయి గ్రామానికి చెందిన పన్నాల యాదయ్య ఉన్నట్లుగా గుర్తించారు. మావోయిస్టుల ఆచూకీ కోసం ఆరా.. జిల్లా నుంచి మావోయిస్టు పార్టీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించిన ఆ ఇద్దరు లొంగిపోయేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇందులో భాగంగా చాలా మంది ఎన్కౌంటర్లలో చనిపోతుండగా మరికొంత మంది లొంగిపోతున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి మందుగుల భాస్కర్, పన్నాల యాదయ్య మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వారు కూడా లొంగిపోయేలా అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు.దండకారణ్యం డివిజనల్ కమిటీ సెక్రటరీగా భాస్కర్చిట్యాల మండంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన మందుగుల భాస్కర్ ప్రస్తుతం చత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ) డివిజనల్ కమిటీ సెక్రటరీగా (డీసీఎస్) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2012లో ఆయనపై ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. పదో తరగతి వరకు ఉరుమడ్లలోనే చదువుకున్న భాస్కర్ ఇంటరీ్మయట్ కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆయన మెడిసిన్ చేసేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆ తరువాత 1991–92లో హైదరాబాద్లోని నిజాం కాలేజీలో బీఎస్సీలో చేరాడు. మొదటి సంవత్సరమే దానిని వదిలేసి మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిసింది. చదువు మానేసిన సంవత్సరం సంక్రాంతి పండక్కి గ్రామానికి వచ్చిన భాస్కర్ ఆ తరువాత మళ్లీ ఇంటికి రాలేదు. మావోయిస్టు పార్టీలో చేరిన అతను అంచలంచెలుగా దండకారణ్యం డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగాడు. ఆయన తండ్రి దుర్గయ్య 2003లో మరణించారు. ఆ సమయంలోనూ గ్రామానికి రాలేదు. ప్రస్తుతం తల్లి లక్ష్మమ్మ, సోదరుడు నాగభూషణరావు, సోదరి అరుణ ఉన్నారు.23 ఏళ్లుగా అజ్ఞాతంలో పన్నాల యాదయ్యగుర్రంపోడు మండలం చామలోనిబావి గ్రామానికి చెందిన పన్నాల యాదయ్య అలియాస్ గన్మ్యాన్ 23 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. భార్య అంజమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ప్రస్తుతం ఇతనికి 23 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లీ కుమారుడు గత కొంతకాలంగా నల్లగొండలోనే ఉంటూ బతుకుదెరువు కోసం ఏదో ఒకపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2012 పోలీసు రికార్డుల ప్రకారం అప్పట్లో అతను దళ సభ్యుడిగా ఉన్నాడని, అతనిపై రూ.లక్ష రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో పలుమార్లు పోలీసు అధికారులు అతని కుటుంబæ సభ్యులకు నిత్యావసర సరుకులు అందించేశారు. యాదయ్య అందుబాటులోకి వస్తే లొంగిపొయేలా నచ్చజెప్పమని సూచించారు. నలుగురు అన్నదమ్ముల్లో ఇతనే చివరివాడు. బలహీనంగా, వంకర కాళ్లతో గన్ను మోసేంత బలం కూడా లేని యాదయ్య మావోయిస్టుల్లో ఉన్నాడంటే నమ్మశక్యంగా లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.మూడేళ్ల క్రితం అరెస్టయిన గణేష్జిల్లాకు చెందిన వారు ఇంకా ఎవరైనా మావోయిస్టు పార్టీలో ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 2023 ఏప్రిల్లో మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన చెన్నగోని గణేశ్ అరెస్టు అయ్యాడు. హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుకునేందుకు వెళ్లిన గణేశ్ అక్కడ క్యాటరింగ్ బాయ్గా పని చేశాడు. అదే సమయంలో కుల నిర్మూలన వేదికలో కార్యదర్శిగా పనిచేస్తూ, మావోయిస్టుల రిక్రూట్మెంట్కు సహకరిస్తున్న ఆనందరావుతో గణేశ్కు పరిచయం ఏర్పడింది. ఆనందరావు ఇచ్చిన నక్సల్స్ సాహిత్యం చదివి గణేష్ మావోయిస్టుల వైపు ఆకర్షితుడయ్యాడు. వారం పాటు దళంతోనే ఉన్నాడు. ఆ తరువాత జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు తీసుకురావడానికి వెళ్లి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఆగర్గూడ వద్ద ఏప్రిల్ 28వ తేదీన అనందరావుతోపాటు పోలీసులకు దొరికిపోయాడు. -
‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
హుజూర్నగర్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ అన్నారు. శనివారం హుజూర్నగర్లోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని ఆయన, యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెచ్ఓడీ యాదగిరి కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధర్మానాయక్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం త్వరలో నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివి గ్రూప్–1, 2 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రామారావుతో పాటు కోఆర్డినేటర్ బాలరాజు, జాక్టో సైదానాయక్ తదితరులు ఉన్నారు. ఫ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ -
విజ్ఞాన్స్లో ఆకట్టుకున్న ‘జెనెక్స్–2026’
భూదాన్పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘జెనెక్స్–2026’ పేరుతో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది. బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్పోలో విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించిన నమూనా ప్రాజెక్ట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం ‘ది ప్యూచర్ ఆఫ్ హెచ్ఆర్, ఏఐ డ్రివెన్ వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్’పై నిర్వహించిన సెమినార్లో హైదరాబాద్లోని మోస్చిప్ టెక్నాలజీస్ టాలెంట్ ఆక్విజిషన్ మేనేజర్ జె. కోమలి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఏఐ డేటా ఆధారంగా ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మెరుగుపరిచే ఒక శక్తివంతమైన సాధనమని వివరించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంబీఏ డిపార్ట్మెంట్ కోఆర్టినేటర్ ఎస్ఎం సయ్యద్, ఆయా విభాగాల డీన్లు, హెచ్ఓడీలు, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మిల్లుల్లో మళ్లీ తనిఖీలు
కేసులపై ఇప్పటికే మిల్లర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కేసు ఆర్థిక నేరం కింద రాదని, ఆ కేసులను కొట్టివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. దానిపై జిల్లా పోలీసు అధికారులు కౌంటర్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే గురువారం కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఆలోగా కౌంటర్ దాఖలు చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆ ఏడు మిల్లుల్లో ధాన్యం నిల్వలపై అధికారులు మళ్లీ తనిఖీలు చేపట్టారు. వేలం వేసిన ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లపై ఇప్పటికే కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు అరెస్టు కాగా మిగతా వారు పరారీలో ఉన్నారు. 2022–23 యాసంగి సీజన్కు సంబంధించిన వేలం వేసిన ధాన్యం కాకినాడ పోర్టుకు తరలించారంటూ వచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం అప్పట్లో తనిఖీలు చేయించింది. అక్కడ ఉండాల్సి ధాన్యం కంటే రూ.191 కోట్ల విలువైన 5,89,533 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉందని అధికారులు తేల్చారు. ఇప్పుడు ఆ మిల్లుల్లో మిగతా ధాన్యం ఉందా? మిల్లర్లు వాటిని కూడా అమ్మేసుకున్నారా? అన్నది తేల్చేందుకు మళ్లీ తనిఖీలు చేపట్టారు. ఆర్ఆర్ యాక్ట్కు సిద్ధమవుతున్న అధికారులు ఆ ఏడు మిల్లులపై రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ కింద చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సంబంధిత తహసీల్దార్లకు నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఆర్ యాక్ట్కు సంబంధించిన ఉత్తర్వులను కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లకు పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్ఆర్ యాక్టు అమలు చేయబోతున్నందున మిల్లుల్లో ధాన్యం ఎంత ఉంది..? గతంలో తనిఖీలు చేసినప్పుడు అమ్ముకున్నది పోగా అక్కడ మిగిలి ఉన్న ధాన్యం ఇప్పుడు ఉందా? లేదా? అనేది రీచెక్ చేస్తున్నారు. ఫ గత తనిఖీల సమయంలో ఉన్న నిల్వలు ఇప్పుడు ఉన్నాయా లేవా అని పరిశీలన ఫ ఆర్ఆర్ యాక్ట్ కింద కేసుల నమోదుకు రంగం సిద్ధం ఫ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ వేసేందుకు పోలీసుల సన్నద్ధం -
యాదగిరీశుడి సేవలో త్రిపుర గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కుటుంబ సభ్యులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్న గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, కుటుంబ సభ్యులు.. ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చనమూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
గుండెపోటుతో రైతు మృతి
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన రైతు యలమకంటి అంతయ్య(70) శనివా రం తన వ్యవసాయం పొలం వద్ద గుండెపోటుతో మృతిచెందాడు. పొలం వద్ద బోరు మోటారు పైపులు సరిచేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతయ్య భౌతికకాయానికి డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచారి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్గౌడ్, మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్గౌడ్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి తదితరులు నివాళులర్పించారు. చదువులో వెనుకబడ్డానని.. ఫ ఉరేసుకుని బాలిక ఆత్మహత్య తిప్పర్తి : చదువులో వెనుకబడ్డానని మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశరాజుపల్లి గ్రామానికి చెందిన కత్తుల వర్షిణి(16) చదువులో వెనుకబడి రెండు సంవత్సరాల క్రితం చదువు మానేసింది. ఇంటి వద్దనే ఉంటున్న ఆమె తనకు చదువు సరిగా రావడం లేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కత్తుల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. వృద్ధురాలి ఒంటిపై బంగారం చోరీ నడిగూడెం : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో శనివారం జరిగింది. స్థానిక ఎస్ఐ అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాపురం గ్రామానికి చెందిన పందిరి అనసూర్యమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తి శనివారం అనసూర్యమ్మ ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి మెడలో ఉన్న 10 గ్రాముల నల్లపూసల బంగారు తాడు, చెవులకు ఉన్న పావు తులం చెవిదిద్దులను లాక్కోని పారిపోయారు. ఈ ఘటనలో బాధితురాలి చెవికి స్వల్ప గాయమైంది. బాధితురాలి కుమార్తె కట్ల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యభిచార గృహంపై పోలీసుల దాడికోదాడ రూరల్: పట్టణంలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై కోదాడ పట్టణ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పురుషులను, ఒక మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
బౌద్ధ దమ్మయాత్రతో తెలంగాణలో శాంతి
నాగార్జునసాగర్ : ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా సిద్దార్ధ బుద్ధవిహార్ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్రతో తెలంగాణలో శాంతి, క్రాంతి ఆవిర్భవించనుందని హాలివుడ్ నటుడు, గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్ పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మహారాష్ట్రకు చెందిన అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిద్ధార్థ హిట్టెంబరిలతో కలిసి శనివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 403 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్ చేరుకోనుందని తెలిపారు. పాదరక్షలు లేకుండా సుదూర ప్రయాణం చేస్తూ బౌద్ధ ధర్మ సందేశాన్ని ప్రజల్లోకి తీసుక వెళ్తున్న బౌద్ధ భిక్షువులకు ఘనస్వాగతం పలుకాలని పిలుపునిచ్చారు. థాయ్లాండ్ నుంచి తీసుకొస్తున్న బుద్ధ ధాతువులను బుద్ధవనం మహాస్థూపంలో మూడు రోజుల పాటు ప్రజల దర్శనార్ధం ఉంచనున్నట్లు తెలిపారు. మార్చి 2న శ్రీబుద్ధునితో నా ప్రయాణంశ్రీ నాటకం, 3వ తేదీన దమ్మ ధ్యానం కార్యక్రమాలు కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వామితో సహా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నుట్లు తెలిపారు. వందమంది బౌద్ధభిక్షువులు పాల్గొంటారని చెప్పారు. పెద్దవూరకు చేరుకున్న పాదయాత్ర.. పెద్దవూర: బౌద్ధ భిక్షువులు చేపట్టిన దమ్మయాత్ర శనివారం పెద్దవూరకు చేరుకుంది. ఈ పాదయాత్రలో కంబోడియా, వియత్నాం, థాయ్లాండ్, భారతదేశాలకు చెందిన 80 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. గౌతమ బుద్ధుడు నడయాడిన నేల నాగార్జునకొండకు బౌద్ధ భిక్షువులు ఎంతో ప్రయాశపడి 450 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నారని బీఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు తెలిపారు. ఫ గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్ -
రహదారులపై ‘ఇక్కత్’ పరుగులు
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ డిజైన్ పోస్టర్ కల్గిన ఆర్టీసీ బస్సు శనివారం పోచంపల్లిలో సందడి చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే ప్రప్రథమంగా జీఐ గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘జీఐ ఆన్ వీల్స్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం నుంచి దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లికి ప్రత్యేక బస్సు సర్వీస్ను నడిపిస్తోంది. ఇందు కోసం ఆర్టీసీ బస్సుపై పోచంపల్లి ఇక్కత్ డిజైన్కు సంబంధించిన పోస్టర్ను రూపొందించి బస్సు వెనుక ‘పోచంపల్లి నుంచి ప్రపంచానికి’ అనే ట్యాగ్ను రూపొందించింది. తద్వారా పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపును తీసుకరావడంతో పాటు ఉపాఽధి కల్పించడం, అదేవిధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ ప్రత్యేక బస్సు ప్రతిరోజు దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లికి నాలుగు ట్రిప్పుల చొప్పున నడుస్తుందని తెలిపారు. -
ప్రభుత్వ ప్రోత్సాహాలను వినియోగించుకోవాలి
యాదగిరీశుడి శృంగార డోలోత్సవంయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజుస్వామి, అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాలు ఆలపిస్తున్న భక్తులు శనివారం రాత్రి స్వామి, అమ్మవార్ల శృంగార డోలోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్రామగిరి(నల్లగొండ) : నార్కట్పల్లి, చిట్యాల మండలాల్లోని దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. నార్కట్పల్లి మండలంలో నార్కట్పల్లి ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయ స్వామి చిట్యాల మండలం పేరుపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. శాలిగౌరారం : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని వల్లాల గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రూ.92 వేల వ్యయంతో నిర్మించిన పశువుల పాకను శనివారం ఆయన పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీ్త్రశక్తి పథకంలో ఎస్హెచ్జీ నుంచి రూ.లక్ష రుణం పొంది కొనుగోలు చేసిన గేదెను నూతనంగా నిర్మించిన పశువుల పాకలోకి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల పాకను నాణ్యంగా నిర్మించిన యజమానిని, ఉపాధిహామీ టెక్నికల్ సిబ్బందిని అభినందించారు. అనంతరం గ్రామంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ను తనఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో వంటలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, ఏపీఓ జంగమ్మ, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సర్పంచ్ భూపతి తిరుపతమ్మ ఉపేందర్ ఉన్నారు. ఫ డీఆర్డీఓ శేఖర్రెడ్డి -
శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు స్వామి, అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో అర్చకులు శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవాదాయ, ధర్మదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బి. సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 108 కలశాలతో.. చివరి రోజు ఆలయ ముఖ మండపంలో అర్చకులు 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అనంతరం శుద్ధ నీరు, పంచామృతాలు, ఫల రసాలతో గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు శతఘటాభిషేకం జరిపించారు. అంతకుముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచారులు, పారాయణీకులు, అర్చకులు, అధికారులు, సిబ్బందిని సన్మానించారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం రాత్రి స్వామివారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాలు ఆలపించారు. నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభంబ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆదివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభంకానున్నాయి. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు, బ్రహ్మోత్సవం పూజలు తిరిగి ప్రారంభించనున్నారు. యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ముగింపు పలికిన అర్చకులు -
గ్రామాల్లో వైద్య సేవలు అందించాలి
నల్లగొండ టౌన్ : వైద్యులు గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన వైద్య కళాశాల వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతంలో ప్రజలకు 75 శాతం నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గ్రామీణ ప్రాంతంలో కేవలం 35 శాతం వైద్యసేవలే అందుతున్నాయని తెలిపారు. ఎంబీబీఎస్ అంతం లేని చదువని భవిష్యత్లో పీజీ, స్పెషలైజేషన్కు ఉపయోగపడుతుందన్నారు. ఎంచుకున్న సబ్జెక్టుల్లో నిష్ణాతులు కావాలని, అందుకోసం బాగా కష్టపడి విజయాలు సాధించాలన్నారు. అంతకుముందు కాలేజీలో ఏర్పాటు చేసిన నూతన జిమ్ కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ, హెచ్ఓడీలు, మెడికోలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఉపాధ్యాయ వృత్తి మహత్తర సేవ
ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ : ఉపాధ్యాయ వృతి అనేది మహత్తర సేవ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్లో జెడ్పీ హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు యాట మధుసూదన్రెడ్డి పదవీ విరమణ సభ శనివారం రాత్రి జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే హాజరై ముధసూదన్రెడ్డి, మాదవి దంపతులను ఘనంగా సత్కరించి మాట్లాడారు. మధుసూదన్రెడ్డి మూడు దశాబ్ధాలకు పైనే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత భవిష్యత్ ఇచ్చారని కొనియాడారు. హెచ్ఎం కోదాటి రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, ఎంఈఓ మేక నాగయ్య, పీఎసీఎస్ మాజీ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్యశ్రీనివాస్, రిటైర్డ్ ఎంఈఓ గోలి చంద్రశేఖర్రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పశుసంవర్ధక శాఖలో ఫెస్ రికగ్నిషన్ హాజరు
నల్లగొండ అగ్రికల్చర్ : పశు సంవర్ధక శాఖలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం కోసం ప్రత్యేక యాప్ను రూపొందించి వినియోగంలోకి తేనున్నారు. పశు సంవర్ధక శాఖలో ఇప్పటి వరకు రిజిస్టర్లోనే సంతకాలు చేసే విధానం అమల్లో ఉంది. దీంతో కార్యాలయాలకు, ఆసుపత్రులకు అధికారులు, వైద్యులు, సిబ్బంది సరిగ్గా హాజరు కావడం లేదని మూగ జీవాలకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల బినామీలు పని చేస్తున్నారని అర్హత లేని వారు మూగ జీవాలకు వైద్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వెంటనే ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో ఈ విధానం అమలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. మొబైల్లో ఫొటోతో హాజరు.. ఫేస్ రికగ్నిషన్ హాజరు కోసం జిల్లా పశు వైద్య సంవర్ధక శాఖలో పని చేసే వైద్యులు సిబ్బంది, అధికారులు వారు పనిచేసే చోటనే స్మార్ట్ ఫోన్లో ఫొటో దిగి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేసుకోవాలి. ప్రాంతంలో ఉండి ఫొటో అప్లోడ్ చేస్తే యాప్లో నమోదు కాదు. 350 మంది ఉద్యోగులు.. జిల్లా వ్యాప్తంగా ఒక బహుళార్ధక పశు వైద్యశాల, నకిరేకల్, చండూరు, దేవరకొండ, నిడమనూరు, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఏరియా పశు వైద్యశాలలు, 56 ప్రాథమిక పశు వైద్యశాలలు, 59 గ్రామీణ వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 350 మంది వివిధ హోదాల్లో చేస్తున్నారు. వీరు మార్చి మొదటి వారం నుంచి ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
సీఎం రేవంత్రెడ్డిది చేతకాని పాలన
చౌటుప్పల్ : సీఎం రేవంత్రెడ్డి తన చేతకాని పాలనతో పేదల గుండెల్లో గునపం దింపుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు ధ్వజమెత్తారు. శనివారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొన్నటి వరకు హైడ్రా పేరుతో, నిన్న మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ విగ్రహం ప్రతిష్ఠాపనకు, తాజాగా ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో మంత్రుల భూములకు ధరలు పెరగాలన్న ఆలోచనతో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. మైనింగ్ పేరిట శారదా పీఠాన్ని సైతం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఆదివారం ఖమ్మం పర్యటనకు వెళ్తున్నానని, అక్కడి నిర్వాసితులైన నిరుపేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహాల ఏర్పాటుతో యువతలో దేశభక్తి పెరుగుతుందన్నారు. నేటి సంక్షేమ పథకాలను నాడు తన పాలనలోనే శివాజీ మహారాజ్ అమలు చేశారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, స్థానిక సర్పంచ్ కై రంకొండ స్వప్నఅశోక్, బీజేపీ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, ఉప సర్పంచ్ జెల్ల పవన్, నాయకులు దోనూరు వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, శాగ చంద్రశేఖర్రెడ్డి, ఆలె చిరంజీవి, కంచర్ల గోవర్ధన్రెడ్డి, గడ్డం నర్సింహ, పిశికె సంజీవ, నూనె మాధవి, పక్కీరు శ్రీనివాస్రెడ్డి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ విద్యార్థులకు వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సతీష్కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ పిల్లి మహేష్, ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కనెక్ట్ డైరెక్టర్ జక్కా సురేష్రెడ్డి, శ్రీదేవి, సబీనా హెరాల్డ్, విద్యార్థులు పాల్గొన్నారు. 8న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్నల్లగొండ టౌన్ : ఐఎంఏ ఆధ్వర్యంలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఐఎంఏ నల్లగొండ అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఉచిత స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఆయన పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. ఈ క్యాంపునకు సికింద్రాబాద్ లెనోవో సెంచరీ ఆస్పత్రి క్యాన్సర్ వైద్యులు ప్రపుల్కుమార్ హాజరవుతారని తెలిపారు. ఈ క్యాంప్ను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు రమేష్, ప్రవీణ్, విజయ్ కుమార్, మూర్తి, కీర్తి, వసంతకుమారి, ఈట రాజేశ్వరి, జార్జ్ ప్రవీణ్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదుమర్రిగూడ : వైద్యులు, సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని తిరగండ్లపల్లి పల్లె దవాఖానను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను, వ్యాక్సినేషన్తో పాటు వాక్సిన్ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, వైద్యాధికారి డాక్టర్ శాలిని, డాక్టర్ దీపక్ ఉన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షనల్లగొండ : ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష శనివారం ప్రశాంతంగా సాగింది. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 12,934 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 12,653 మంది పరీక్ష రాశారు. 281 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓ దస్రూనాయక్ పరిశీలించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషినల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిల్ల మురళి అన్నారు. శనివారం టీఎన్జీఓ భవనంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాద బీమా, నగదు రహిత వైద్యం, హెచ్ఆర్ఏ కల్పించడం ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి జె. శేఖర్రెడ్డి, నర్సింహాచారి, వంగూరు విజయకృష్ణ, డి.ఐ.రాజు, లక్ష్మయ్య, బి.రణదీవె, డి.సైదులు నాయక్, కె. గోవర్ధన్రెడ్డి, పి.ఆంజనేయులు, కె.సునీత, రామచంద్రయ్య, వెంకటరెడ్డి, బిక్షం, షఫీ, ఖాసీం పాల్గొన్నారు. -
కేసులు నమోదు చేసిన ఏడు మిల్లులపై అమలు
సీఎంఆర్ ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వానికి నష్టం చేసేలా సహకరించిన, ఆ సమయంలో సీఎంఆర్ రాబట్టడంలో విఫలమైన అధికారులపైనా చర్యలు చేపట్టాలని అడ్వకేట్ సోమారపు సత్యనారాయణ రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అప్పటి అధికారులే మిల్లర్లతో కుమ్మకై ్క మామూళ్లు పుచ్చుకొని మిల్లర్ల అక్రమాలకు వంత పాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లుల నుంచి సీఎంఆర్ వసూలు చేయకుండా విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆయా మిల్లులపై కఠిన చర్యలు చేపట్టి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రాబట్టాలని కోరారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్న మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆయా మిల్లులు ఉన్న మండలాలకు చెందిన తహసీల్దార్లకు గురువారం సాయంత్రం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా మిల్లర్లపై ఇప్పటికే జిల్లా పౌరసరఫరాల సంస్థ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత 316 (2), 316(5), 318 (3), ఎషెన్షియల్ కమాడిటీస్ యాక్ట్లోని సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా చిట్యాల మండలంలోని వరలక్ష్మి మిల్, మనుగోడులోని మరళీ మనోహర్ ఆగ్రోఫుడ్స్, నల్లగొండలోని సుమాంజలి మిల్లుల యజమానులు కందుకూరి మహేందర్, కందుకూరి పద్మను పోలీసులు అరెస్ట్ చేశారు. 5.89 లక్షల క్వింటాళ్ల ధాన్యం మింగిన మిల్లర్లు జిల్లాలోని ఏడు మిల్లుల యజమానులు 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్ముకొని రూ.191.93 కోట్లు కొట్టేశారు. దీనిపై.. మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యమే లేదని, ఎప్పుడో కాకినాడ పోర్టుకు మళ్లించారంటూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అడ్వకేట్ సోమారపు సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అసలు ఆ మిల్లుల్లో ధాన్యం ఉందా? లేదా. తేల్చాలంటూ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ అప్పట్లో కమిటీ వేసి మిల్లుల్లో విచారణ జరిపారు. ఆయా మిల్లుల్లో ధాన్యం లేదని అధికారుల కమిటీ తేల్చింది. దానిని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో పోలీస్స్టేషన్లలో ఆయా మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. అయితే జరిగిన నష్టాన్ని రాబట్టుకునేందుకు ఆర్ఆర్ యాక్ట్ అమలుకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఏ మిల్లు నుంచి ఎంత రావాల్సి ఉందన్న వివరాలను తెలియజేశారు. ఆర్ఆర్ యాక్ట్ కింద ఏం చేస్తారంటే.. ● ఆర్ఆర్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం.. కచ్చితమైన గడువులోగా ధాన్యం లేదా దాని విలువైన డబ్బును చెల్లించాలని డిఫాల్టర్కు డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. ఆ గడువులో చెల్లించడం విఫలమైతే అటాచ్మెంట్ ప్రక్రియ వెంటనే చేపడతారు. ● సెక్షన్ 5 –27 ప్రకారం.. వారికి సంబంధించిన వాహనాలు, యంత్రాలు, బియ్యం నిల్వలు, స్థిరాస్తుల (భూమి, భవనాలు) అటాచ్ చేస్తారు. దాంతో ఆ ఆస్తులపై మిల్లర్లు ఎలాంటి క్రయవిక్రయాలు చేయలేరు. ఇతరులుకు బహుమతి లేదా లీజుకు ఇవ్వలేరు. ● సెక్షన్ 36 ప్రకారం.. జరిగిన నష్టాన్ని తిరిగి మిల్లర్లు చెల్లించకపోతే, దాన్ని పొందేందుకు అటాచ్ చేసిన ఆస్తులను విక్రయిస్తారు. ● జరిగిన నష్టంపై 25 శాతం జరిమానాను అదనంగా వసూలు చేస్తారు. ఎవరైనా గ్యారెంటీగా ఉంటే వారినుంచైనా వసూలు చేస్తారు. వారిపై ఏకకాలంలో క్రిమినల్, ఆర్ఆర్ యాక్ట్ ద్వారా చర్యలు ఉంటాయి. ● ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా తరలించినందుకు వారిపై ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. మిల్లర్లతోపాటు వారి భాగస్వాములపైనా క్రిమినల్ చర్యలు ఉంటాయి. ● ఆయా మిల్లులను డిఫాల్ట్ మిల్లుగా పేర్కొంటూ శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెడతారు. వాటికి ప్రభుత్వ ట్యాగింగ్ తొలగిస్తారు. ● ఆయా మిల్లుల బ్యాంకు ఖాతాలనుస్తంభింపజేస్తారు. ఫ సంబంధిత తహసీల్దార్లకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశాలు ఫ 5,89,533 క్వింటాళ్ల వేలం ధాన్యం మాయం చేసిన ఏడుగురు మిల్లర్లు ఫ ఆ ధాన్యం విలువ రూ.191.13 కోట్లు -
భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే..
నల్లగొండ : భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కేంద్ర సాంస్కతిక శాఖ, పీఎం శ్రీ పాఠశాలల జాయింట్ సెక్రెటరీ, నోడల్ అధికారి కమలేష్ కుమార్మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో పీఎంశ్రీ పాఠశాలల ద్వారా అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలలకు ఇస్తున్న కంప్యూటర్లు, టింకరింగ్ ల్యాబ్స్ వంటి అన్ని సదుపాయాలను విద్యార్థులు ప్రత్యక్షంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు, హెచ్ఎంలు అందరూ కంప్యూటర్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పీఎంశ్రీ పాఠశాలల కింద మంజూరైన నిధులతో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, వాననీటి నిలువ కట్టడాలు, సైన్స్ ల్యాబ్లు, టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. జిల్లాకు 98 పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు 20 పూర్తి చేశామని తెలిపారు. అంతకుముందు జాయింట్ సెక్రటరీ కమలేష్ కుమార్ మిశ్రాకు కలెక్టర్ చంద్రశేఖర్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రతినిధి ఉషారాణి, డీఈఓ భిక్షపతి, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పీఎం శ్రీ పాఠశాలల జాయింట్ సెక్రెటరీ కమలేష్ కుమార్మిశ్రా -
ఎంజీయూ రిజిస్ట్రార్గా కొప్పుల అంజిరెడ్డి
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) రిజిస్ట్రార్గా ఆర్థికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ కొప్పుల అంజిరెడ్డి నియమితులయ్యారు. 2007లో ఎంజీ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన అంజిరెడ్డి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పేరుంది. అంజిరెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామం. రిజిస్ట్రార్గా నియమితులైన అంజిరెడ్డిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. అంధ విద్యార్థులకు ప్రత్యేక లైబ్రరీరామగిరి(నల్లగొండ) : అంధ విద్యార్థుల కోసం నల్లగొండ జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీ కార్నర్ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ఖాన్ గురువారం ప్రారంభించారు. ఇందులో బ్రెయిలి పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్లు సదుపాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి బాలమ్మ, అనిల్కుమార్, కృష్ణమోహన్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. 28న జాతీయ సైన్స్ దినోత్సవంనల్లగొండ టూటౌన్ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సంబరాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో సెమినార్లు, పరిశోధనలపై అవగాహన, సైన్స్ ప్రయోగాలు, వ్యాసరచన, క్విజ్ పోటీలు, పుస్తకాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9848578845 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. సెకండియర్ పరీక్షకు 286 మంది గైర్హాజర్నల్లగొండ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలుగు, ఉర్దూ, సంస్క్రతం, హిందీ పేపర్–2కు సంబంధించి జనరల్ ఒకేషనల్ విభాగాల్లో 13,117 మంది పరీక్షలు హాజరు కావాల్సి ఉండగా.. 12831 మంది పరీక్ష రాశారు. 286 మంది గైర్హాజర్ అయ్యారు. జనరల్లో 11,480 మందికి 215 మంది, ఒకేషనల్లో 1637 మందికి గాను 71 మంది గైర్హాజర్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై విచారించాలిగట్టుప్పల్ : గట్టుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో వస్తున్న అవినీతి ఆరోపణపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఆర్డీఓ శ్రీదేవిని ఆదేశించారు. మండలంలోని తేరట్పల్లి గ్రామంలో సర్వేనంబర్ 444లో అక్రమ రిజిస్టేషన్ చేశారని.. భూమి తక్కువగా ఉందని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని.. భూమి లేకున్నా ఆర్ఎస్ఆర్లో పెంచి అక్రమంగా రిజిస్టేషన్ చేశారని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ‘పైసలిస్తేనే.. ఫైల్ కదిలేది’ శీర్షికన గురువారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ శ్రీదేవిని ఆదేశించారు. దీంతో తహసీల్దార్ రాములు తమ కార్యాలయంలో జరిగిన సంఘటనపై వివరాలను ఆర్డీఓకు పంపారు. ఆ వివరాలను ఆర్డీఓ పరిశీలించి శుక్రవారం కలెక్టర్కు నివేదికను పంపనున్నారు. -
బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటాం
నకిరేకల్ : ప్రభుత్వ నిర్లక్షంతో మృతి చెందిన విద్యార్థి బాల ఆకాష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బంధనాథం బాలఆకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాలఆకాష్ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 15న పాఠశాల సమీపంలోని ఫాంపాండ్లో స్నానం చేసేందుకు వెళ్లి ఈత రాక మృతిచెందాడు. విద్యార్థి మృతిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేటీఆర్కు సమాచారం ఇవ్వడంతో.. గురువారం రాత్రి కేటీఆర్ రాయపురం చేరుకుని బాలఆకాష్ చిత్రపటం వద్ద పూలుచల్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. అక్కడ నుంచే సంబంధిత మైనారిటీ గురుకుల పాఠశాల సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడారు. బాలుడి మృతికి బాధ్యులైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని సూచించారు. బాలఆకాష్ తండ్రి అంథోనిరాజుకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బాలుడి సోదరి మధువన్సీతను అక్కున చేర్చుకుని.. ‘నేను నీకు అన్న అనుకో.. లేక బాబాయి అనుకో నువ్వ ఎంత వరకు చదివితే అంత వరకు నీ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తా’ అని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, డాక్టర్ చెరుకు సుదాకర్, ప్రవీణ్కుమార్, నలగాటి ప్రసన్నరాజ్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, కొప్పుల ప్రదీప్రెడ్డి, మారం వెంకట్రెడ్డి, ప్రగడపు నవీన్రావు, రాచకొండ శ్రీనివాస్గౌడ్, బడుగుల శ్రీనివాస్ ఉన్నారు. ఫ మాజీ మంత్రి కేటీఆర్ -
సాగర్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ
నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాంతాన్ని జాతీయస్థాయి ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపట్టిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో టూరిజం, ఆర్కియాలజీ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే సమగ్ర పర్యాటక కేంద్రంగా సాగర్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో బుద్ధవనం, పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వర దేవాలయాలు, దేవరకొండ కోట, ఫణిగిరి బౌద్ధస్థలం, చాకలిగుట్టు ద్వీపం, నక్కలగండి ప్రాజెక్ట్, నందికొండ ద్వీపంలోని ఏలేశ్వర ఆలయం, పొగిళ్ల జలపాతాలు, గాజుబేడ గుహలు పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయన్నారు. జాతరలు, వారాంతపు మార్కెట్లు, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట వంటి జానపద కళారూపాలను పర్యాటక అభివృద్ధికి అనుసంధానం చేయనున్నామని తెలిపారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. సమావేశంలో రాఘవేంద్ర మాస్టర్, బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిజం కన్సలెంట్ ఓం ప్రకాష్, నల్లగొండ ఏఎస్పీ రమేష్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, శ్రీదేవి, రమణారెడ్డి, జిల్లా క్రీడల అధికారి అక్బర్అలీ పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
వైద్యులు మానవత్వంతో పనిచేయాలి
నల్లగొండ టౌన్ : వైద్యులు మానవత్వంతో పనిచేసి పేదలకు సేవలందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన అద్వితి –2026 వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్య కళాశాలలో అన్ని ఆధునిక సదుపాయాలు కల్పించామని, విద్యార్థులు సబ్జెక్టులతో పాటు, మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని సూచించారు. తెల్లకోటు.. బాధ్యతకు సింబల్ అన్నారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైద్య కళాశాల విద్యార్థుల కోసం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యుడు నాగిరెడ్డి.. ఈ వైద్య కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులను పరిశోధన నిమిత్తం ఏటా 45 మంది చొప్పున తన ఆస్పత్రి లోకి తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఎంఓయూ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను రూ.కోట్లతో అభివృద్ధిద్ది చేశామన్నారు. నల్లగొండలో మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతానని చెప్పారు. రానున్న రోజుల్లో నల్లగొండను స్మార్ట్ సిటీగా, చేస్తానన్నారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాల్లో పేదలకు సేవలు అందించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్యులు రోగులను ప్రేమగా పలుకరించి వైద్యం చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అష్రఫ్ అలీ, ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ఉద్యోగులకు రెండో పీఆర్సీని అమలు చేయాలి
నల్లగొండ టూటౌన్ : ఉద్యోగులకు రెండో పీఆర్సీని అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అన్నారు. గురువారం నల్లగొండలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్తో 2023 జూలై 1 నుంచి పీఆర్సీని అమలు చేయాలని కోరారు. రిటైరైన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లీయర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లో ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాస్చారి, ఎడ్ల సైదులు, బడుగు అరుణ, వడిత్యా రాజు, మోర్తాల శ్రీనివాస్రెడ్డి, నలపరాజు వెంకన్న, ఎ.చినవెంకన్న, కొమర్రాజు సైదులు పాల్గొన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి -
మిర్యాలగూడలో నకిలీ కంటి డాక్టర్ల అరెస్ట్
సాక్షి, నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నకిలీ కంటి డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుభవం, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఐదుగురు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు. ధనార్జనే ధ్యేయంగా వైద్యుల ముసుగులో కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.కాగా, ఇటీవల భద్రాచలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఎటువంటి వైద్య విద్యార్హతలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో గత కొంతకాలంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైద్య అధికారులకు ఫిర్యాదు అందడంతో ఆయూషి నర్సింగ్ హోమ్లో తనిఖీలు నిర్వహించిన వైద్యాధికారులు.. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు. తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆయుషి నర్సింగ్ హోమ్ను సీజ్ చేశారు. అర్హత లేని వ్యక్తుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యాధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నకిరేకల్ : ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని మొండివారి కాలనీలో నివాసముంటున్న నాగిళ్ల నాగరాజు(30)కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ఈ నెల 22న నాగరాజు ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి నాగరాజును నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. నాగరాజు సోదరుడి కూమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హరిబాబు తెలిపారు. మాంజా తగిలి నెమలి మృతి మర్రిగూడ : మండలంలోని బట్లపల్లి గ్రామంలో చైనా మాంజా కాళ్లకు చుట్టుకొని నెమలి మృతిచెందింది. మంగళవారం మండల పశువైద్యాధికారి సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం బట్లపల్లి గ్రామ శివారులోని ఓ రైతు పొలం వద్దకు ఆహారం కోసం వచ్చిన నెమలి కాళ్లకు మాంజా చుట్టుకొని ప్రాణాలు కోల్పోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేష్ ఘటనా స్థలానికి చేరుకొని నెమలిని పరిశీలించారు. నెమలికి పోస్టుమార్టం చేసి ఖననం చేసినట్లు పశువైద్యాధికారి తెలిపారు. సెల్ఫోన్ చార్జర్ వైరు విషయమై ఘర్షణ ● అడ్డుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కత్తిపోటుకొండమల్లేపల్లి : సెల్ఫోన్ చార్జర్ వైరు విషయమై జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి కత్తిపోటుకు గురయ్యాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని అమరావతి వైన్స్ వద్దకు సోమవారం రాత్రి బోడ అశోక్, అనిమళ్ల అనిల్ మద్యం తాగేందుకు వచ్చారు. గతంలో వచ్చినప్పుడు తన వద్ద తీసుకున్న సెల్ఫోన్ చార్జర్ వైరును తిరిగి ఇవ్వమని వైన్స్లో పనిచేస్తున్న మల్లికంటి అనిల్ వారిని అడిగాడు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో బోడ అశోక్, అనిమళ్ల అనిల్ సోడా సీసాలతో మల్లికంటి అనిల్పై దాడి చేశారు. దీంతో మల్లికంటి అనిల్ కోపోద్రిక్తుడై కత్తితో తిరిగి ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలో ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన పగిళ్ల సన్నీ మెడకు కత్తి తగిలి గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సన్నీ మెడకు 14 కుట్లు పడినట్లు సమాచారం. ఈ ఘర్షణకు సంబంధించి 9 మందిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
అప్పులు చేసి.. చైన్ స్నాచర్గా మారి
నకిరేకల్ : ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్లు చేస్తున్న వ్యక్తిని నల్ల గొండ జిల్లా కేతేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నకిరేకల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నల్లగొండ ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. గత నెల 24న అర్ధరాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా సమీపంలోని అరిటాకు భోజనం హోటల్ వద్ద భోజనం కోసం ఆగింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కన్మతరెడ్డి విజయలక్ష్మి భోజనం చేసి బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 40 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కోని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సోమవారం రాత్రి కేతేపల్లి మండలం చీకటిగూడెం శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బైక్పై అటుగా వస్తున్న ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన తాడేపల్లి మధు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా చైన్ స్నాచింగ్లు చేస్తున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. మధు ట్రావెల్స్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని, తన స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకుని అప్పుల పాలై, అప్పులు తీర్చేందుకు చోరీలు చేస్తున్నట్లు ఏఎస్పీ రమేష్ తెలిపారు. ఈ క్రమంలోనే కొర్లపహాడ్ టోల్ప్లాజా సమీపంలో అరిటాకు భోజనం హోటల్ వద్ద బస్సు ఎక్కుతున్న విజయలక్ష్మి మెడలోని బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడని, ఆ పుస్తెలతాడును కరిగించి బంగారం ముద్ద చేయించినట్లు వివరించారు. అదేవిధంగా మరోసారి కేతేపల్లి శివారులోని సాయికృష్ణ హోటల్ దగ్గర మరో చైన్ స్నాచింగ్ చేసి హైదరాబాద్కు వెళ్లి బైక్పై వస్తుండగా.. కేతేపల్లి పోలీసులకు చిక్కాడని ఏఎస్పీ రమేష్ వివరించారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసులకు చిక్కిన దొంగ 40 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం -
పూజల పేరిట బంగారు ఆభరణాలు మాయం
మిర్యాలగూడ అర్బన్: దొంగ బాబా అవతారమెత్తి ప్రజలను నమ్మించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న వ్యక్తిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన కోన వినోద్కుమార్ ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను చేసే పనితో డబ్బులు సరిగా రాక.. దొంగ బాబా అవతారమెత్తాడు. అనారోగ్యంతో బాధపడే పిల్లల కాళ్లకు కడియాలు వేసి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో క్షుద్రపూజలు, మంత్రాలు చేసి ప్రజల నుంచి బంగారం, నగదును కాజేయడం ప్రారంభించాడు. మిర్యాలగూడ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన అడావత్ శిరీష, గోవింద్ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న తమ పిల్లల కాళ్లకు కడియాలు వేయించారు. ఓ రోజు గోవింద్ ఇంటికి వచ్చిన వినోద్కుమార్ గోవింద్ వైపు చూసి ‘నీకు ప్రాణహాని ఉంది.. ఆయుష్షు పెరగాలంలే క్షుద్రపూజలు చేసి అమ్మవారికి ముడుపు కట్టాలి’ అని భయపెట్టాడు. ఇది నమ్మిన గోవింద్ దంపతులు తమ వద్ద ఉన్న 5.7 తులాల బంగారు నగలను ముడుపు కట్టేందుకు వినోద్కు అప్పగించారు. ముడుపు గుడ్డలో కట్టిన బంగారాన్ని 41రోజుల వరకు విప్పొద్దని వినోద్కుమార్ వారికి చెప్పాడు. అలా చేస్తే ఆయుష్షు పెరగడమే కాకుండా లక్ష్మీ కటాక్షం వరిస్తుందని నమ్మించి.. ఇంట్లోనే పూజలు మొదలు పెట్టాడు. పూజలు చేసే సమయంలో గోవింద్ దంపతులను కళ్లు మూసుకోవాలని చెప్పి సినీఫక్కీలో గుడ్డలో కట్టిన బంగారాన్ని కాజేసి దాని స్థానంలో ఇతర వస్తువులను అందులో పెట్టాడు. అంతేకాకుండా పూజలు చేసినందుకు రూ.13,200 ఫోన్పే చేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 41 రోజుల తర్వాత గోవిండ్ దంపతులు ముడుపు విప్పి చూస్తే బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించారు. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు మేళ్లచెరువు, నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో, నూతనకల్ మండలంలోని పెద్దనెమలి గ్రామంలో ఇదేవిధంగా బంగారం కాజేసి బ్యాంకులో గోల్డ్లోన్ తీసుకొని జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. దొంగ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలింపు -
న్యాయం చేయాలని ఆందోళన
చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు(శివనేనిగూడెం)కు చెందిన ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ చిట్యాల పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మంగళవారం చిట్యాల పోలీస్స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులు రాస్తారోకో చేస్తూ ఆందోళనకు దిగారు. ఏఎస్ఐ వెంకటయ్య ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో నిరసన తెలుపుతున్న వారు ఆందోళన విరమించారు. ఈ రాస్తారోకోతో కాసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. -
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి శ్రీలక్ష్మీ దేవితో నారసింహుని కల్యాణోత్సవంలో భాగంగా పెళ్లిచూపుల తతంగాన్ని నిర్వహించారు. రాత్రి 8 గంటలకు అశ్వవాహనంపై స్వామిని, ముత్యాల పల్లకీపై అమ్మవారిని అలంకరించి ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పు రాజగోపురం ముందు గల మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టి, అమ్మవారిని తూర్పు ముఖంగా అధిష్ఠించారు. కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు బుధవారం రాత్రి 9.45గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందని.. సరిగ్గా సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారిని పరిణయమాడుతారని వెల్లడించారు. జగన్మోహిని అలంకారంలో స్వామివారు.. మంగళవారం ఉదయం జగన్మోహిని అవతారంలో స్వామివారిని అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు హోమాది పూజలు, పారాయణాలు నిర్వహించారు. ఆలయంలో నేడు.. బుధవారం ఉదయం 10గంటలకు శ్రీరామ అలంకారం, హనుమంత సేవ, అదేవిధంగా రాత్రి గజవాహన సేవ, 9.45గంటలకు తిరుకల్యాణోత్సవం జరిపించనున్నారు. జగన్మోహిని అలంకారంలో యాదగిరీశుడి దర్శనం -
వదిన గొంతు కోసిన మరిది
మోత్కూరు : భూ తగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన బొంత నర్సింహ, అతడి తమ్ముడు అశోక్కు కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. 6 నెలల క్రితం నర్సింహ అనారోగ్యంతో మృతిచెందాడు. నర్సింహ పేరిట ఉన్న భూమిలో తనకు వాటా వస్తుందని అతడి భార్య లక్ష్మి అలియాస్ వెంకటమ్మతో అశోక్ తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో లక్ష్మి ఇంటిపై మరిది అశోక్ దాడి చేసి ఇంట్లోని సామగ్రి అంతా ధ్వంసం చేశాడు. దీంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాగా మంగళవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుండగా.. అశోక్ తన దగ్గరి బంధువులైన ముగ్గురు వ్యక్తుల సహాయంతో కొబ్బరి బోండాల కత్తితో వదిన లక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పారిపోయారు. అతి కష్టం మీద లక్ష్మి మెడకు టవల్ చుట్టుకొని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. ఆమెను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అక్క చంద్రమ్మ ఫిర్యాదు మేరకు అశోక్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. భూతగాదాలతో ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు బాధితురాలి పరిస్థితి విషమం -
నేడు నృసింహుడి కల్యాణం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి జరగనుంది. రాత్రి 9గంటలకు గజ వాహనంపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాడ వీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడ వీధిలోని కల్యాణ వేదికకు చేరుకుంటారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణికులు కల్యాణ వేడుకను ప్రారంభిస్తారు. సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారికి మాంగళ్యధారణ చేస్తారు. ఈ కల్యాణోత్సవానికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర మాడ వీధిలోని కల్యాణ మండపాన్ని పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులు, వీఐపీలు కల్యాణాన్ని తిలకించేలా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో, బస్టాండ్ ఏరియాలో ఎల్ఈడీ స్క్రీన్లతో కల్యాణం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణోత్సవానికి గవర్నర్, మంత్రులు..కల్యాణోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పలువురు ఐఏఎస్ అధికారులు రానున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సైతం స్వామివారి కల్యాణానికి వచ్చే అవకాశాలున్నాయని, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదని ఆలయాధికారులు పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఆత్మకూరు(ఎం) : హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇటీవల నిర్వహించిన 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో భాగంగా జూడో మరియు రెజ్లింగ్ పోటీల్లో ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేటకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు కమ్మంపాటి మహేందర్, బి. రాజశేఖర్, కమ్మంపాటి ప్రశాంత్ పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి మహేందర్ జూడో 66 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్ 67 కేజీల విభాగంలో కాంస్య పతకం, వుషూలో ద్వితీయ బహుమతి సాధించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి. రాజశేఖర్ జూడో 90 కేజీల విభాగంలో బంగారు పతథకం గెలుచుకున్నారు. గుండాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి ప్రశాంత్ జూడో 73 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రశాంత్, రాజశేఖర్, మహేందర్ను కోచ్ కమ్మంపాటి సోమరాజు, గ్రామస్తులు అభినందించారు. -
పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ అధికారులు
స్వామివారికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళవారం రాత్రి టీటీడీ నుంచి ఏఈఓ రత్నం ఆధ్వర్యంలో అధికారులు యాదగిరిగుట్టకు వచ్చారు. స్వయంభూలను దర్శించుకుని ముఖ మండపంలో ఈఓ భవానీ శంకర్కు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారులు గజం నర్మద, నరేంద్ర రెండు ఇక్కత్ కంచిపట్టు చీరలు, పట్టు పంచె, మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన చాట్లా ప్యాట్నీ సెంటర్ నిర్వాహకులు 8 పట్టుచీరలు, 5 పట్టు పంచెలు అందజేశారు. -
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అప్పగింత
నల్లగొండ: నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న 60 మందికి మంగళవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ జి. రమేష్ తిరిగి అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఐఆర్ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలన్నారు. దీనివల్ల ఫోన్ బ్లాక్ చేసి పోలీసులు త్వరగా ఫోన్ను కనిపెట్టే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సీఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేసిన పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు గోపాల్రావు, వెంకటనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వదిన గొంతు కోసిన మరిది
యాదాద్రి భువనగిరి జిల్లా: భూ తగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన బొంత నర్సింహ, అతడి తమ్ముడు అశోక్కు కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. 6 నెలల క్రితం నర్సింహ అనారోగ్యంతో మృతిచెందాడు. నర్సింహ పేరిట ఉన్న భూమిలో తనకు వాటా వస్తుందని అతడి భార్య లక్ష్మి అలియాస్ వెంకటమ్మతో అశోక్ తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో లక్ష్మి ఇంటిపై మరిది అశోక్ దాడి చేసి ఇంట్లోని సామగ్రి అంతా ధ్వంసం చేశాడు. దీంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాగా మంగళవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుండగా.. అశోక్ తన దగ్గరి బంధువులైన ముగ్గురు వ్యక్తుల సహాయంతో కొబ్బరి బోండాల కత్తితో వదిన లక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పారిపోయారు. అతి కష్టం మీద లక్ష్మి మెడకు టవల్ చుట్టుకొని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. ఆమెను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అక్క చంద్రమ్మ ఫిర్యాదు మేరకు అశోక్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఎర్రబెల్లి ఆలయానికి దేవరపెట్టె
నిడమనూరు : ఎర్రబెల్లి లింగమంతులస్వామి జాతరలో ప్రధాన ఘట్టం దేవరపెట్టరాక, దిష్టిపూజ సోమవారం నిర్వహించారు. ఎర్రబెల్లి జాతర వచ్చేనెల 7 నుంచి నాలుగు రోజులపాటు సాగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం దేవరపెట్టను మాడ్గులపల్లి మండలం గోపాలపురం నుంచి యాదవులు(ఎర్రబెల్లి గ్రామ పూర్వికులు) నల్లబోతు, పడాల, బోడే వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివారం రాత్రి ఎర్రబెల్లి గ్రామానికి తీసుకొచ్చారు. దేవరపెట్టతో వస్తున్న యాదవులకు ఎర్రబెల్లి వాసులు ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవరపెట్టను ఎర్రబెల్లి గట్ట వద్ద ఆలయానికి చేర్చారు. గుట్ట చుట్టు దిష్టిపూజ నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు జీవాలను బలిచ్చారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ మన్నెం వెంకన్న, సర్చంచ్ ఐతగోని మధు, బీజేపీ నాయకుడు మన్నెం రంజిత్యాదవ్, పెద్ద సంఖ్యలో యాదవులు, స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఫ గట్టుపైన దిష్టిపూజ నిర్వహించిన యాదవ పూజారులు ఫ మార్చి 7 నుంచి నాలుగు రోజులపాటు జాతర -
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● ఎస్పీ శరత్చంద్ర పవార్ గుర్రంపోడు : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం గుర్రంపోడులో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిచారు. రోడ్డు ప్రమాదాలు.. చాలా వరకు నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెంట్ ధరించడం తప్పనిసరి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్కుమార్, గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న, రిటైర్డ్ సీఐ అంజయ్య, సర్పంచ్ జాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 40 మంది వ్యక్తిగత, భూ వివాదాలు, కుటుంబ, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలపై ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ.. సమస్యలపై తక్షణ విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా ఫాలోఅప్ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బుద్ధవనాన్ని సందర్శించిన వియత్నాం బౌద్ధులునాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన 41మంది బౌద్ధ భిక్షవులు సోమవారం సందర్శించింది. హైదరాబాద్లో బౌద్ధుల సమావేశానికి హాజరైన వారు సాగర్ బుద్ధవనానికి వచ్చారు. బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. బుద్ధచరిత వనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనాలను వీక్షించారు. మహాస్థూపంలో ధ్యానం చేశారు. వారికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర కండువాలు కప్పి, బుద్ధుడి చరత్రను తెలిపే బ్రోచర్లను అందజేశారు. అనంతరం వారు లాంచీల్లో వెళ్లి నాగార్జునకొండలోని పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. వ్యాస రచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభరామగిరి(నల్లగొండ ) : హైదరాబాద్ ఏవీ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల్లో నల్లగొండ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచనట్లు తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల ప్రమాదాలు అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిని ఎంజీ యూనివర్సిటీ విద్యార్థిని పి.హేమలత, సి.శివకుమార్, డిగ్రీ విద్యార్థులు పి.నిశ్చల, వి.సుజాత, నందిని, ఎస్.నాగలక్ష్మికి తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, కుకుడాల గోవర్ధన్, సి.అనిత, ఏబూసి నరసింహ, హసేన, దాసరి శ్రీరాములు పాల్గొన్నారు. -
సంత్ సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలి
నల్లగొండ టౌన్ : నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్యమార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహరాజ్ను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకెళ్లాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్సేవాలాల్ మహరాజ్ 267వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో సంత్సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భోగ్ బండార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్సేవాలాల్ మహరాజ్ లంబాడా, గిరిజన జాతిలోని మూఢనమ్మకాలను పారదోలి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సంత్సేవాలాల్ స్ఫూర్తితో రూపొందించిన రాజ్యాంగం, హక్కులు, ప్రభుత్వ పథకాలు పేదలకు అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ సంత్సేవాలాల్ మహరాజ్ సేవా, ధర్మం, సమభావనలను బోధించిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్నాయక్, చత్రునాయక్, సకృనాయక్, నర్సింహ, అడిషనల్ ఎస్పీ రమేష్, డిప్యూటీ మేయర్ ఆష్రఫ్, పరుశరాం, కార్పొరేటర్లు దీప్లానాయక్, నాగార్జున, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సీఎంఆర్ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు
సీఎంకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేతనార్కట్పల్లి : నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లిలోని వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయ అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్రెడ్డి మనుమరాలు (కొడుకు కుమార్తె) వివాహం ఈ నెల 25న హైదరాబాద్లో జరగనుంది. సోమవారం కోమటిరెడ్డి మోహన్రెడ్డి తన సోదరుడైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. తన మనుమరాలి వివాహానికి రావాలని మోహన్రెడ్డి సీఎంను కోరారు. ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్ లాగ్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ ఉపేందర్రెడ్డి సోమవారం తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఎంజీయూలో నైపుణ్యాభివృద్ధి కోర్సునల్లగొండ టౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వినూత్నంగా వివిధ క్రీడాంశాలపై అవగాహన కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కోర్సును ప్రవేశ పెట్టినట్లు వ్యాయామ అధ్యపకులు మురళి, వై.శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో భాగంగా ప్రధాన క్రీడాంశాలు, వాటి విధివిధానాలు పాఠ్యాంశాలుగా బోధించడంతో పాటు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు వాలీబాల్పై అవగాహన కల్పనతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ను అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ఎట్టకేలకు యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో ఏడు మిల్లులు వేలం వేసిన సీఎంఆర్ బియ్యాన్ని దారి మళ్లించాయని, ఈ విషయం తమ తనిఖీల్లో నిర్ధారణ అయిందని, ఆయా మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ పోలీస్స్టేషన్లలో పౌరసరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. భారతీయ న్యాయ సంహిత 316 (2), 316(5), 318 (3), ఎషెన్షియల్ కమాడిటీస్ యాక్ట్లోని సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయా మిల్లర్లు అంతా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయా మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తామని, జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని పౌరసరఫరాల విభాగం వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. 2022–23 సంవత్సరంలో సీఎంఆర్ కోసం జిల్లాలోని మిల్లులకు జిల్లా పౌరసరఫరాల విభాగం ధాన్యాన్ని కేటాయించింది. అందులో భాగంగా చిట్యాల మండలంలోని వరలక్ష్మి పార్బాయిల్డ్ మిల్లు, కేతేపల్లిలోని చాముండేశ్వరి పార్బాయిల్డ్, మనుగోడులోని మరళీ మనోహర్ ఆగ్రోఫుడ్స్, నల్లగొండలోని రామ్లక్ష్మణ్, కనకమహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ మిల్లులకు కూడా ధాన్యం ఇచ్చింది. అయితే ఆ మిల్లులు ఇంతవరకు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఏడాది కిందట ప్రభుత్వం మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని వేలం వేసింది. దానిని కొనుగోలు చేసిన వారికి ధాన్యం ఇవ్వాల్సి ఉంది. ధాన్యం లేకపోతే దాని విలువ ప్రకారం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ ఏడు మిల్లులకు ఇచ్చిన 5,89,533 క్వింటాళ్ల ధాన్యానికి రూ.191.13 కోట్లు మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. అయినా.. ముడుపుల బాగోతంలో కొందరు అధికారులు అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. 5,89,533 క్వింటాళ్లు మాయం.. నల్లగొండ జిల్లాలోని ఆ ఏడు మిల్లుల్లో 5,89,533 క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లు తేలింది. గత ఏడాదే ఈ అక్రమాలను తేల్చినా ఇంతవరకు చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. చిన్న తప్పు జరిగితే గగ్గోలు పెట్టే అధికారులు ఏకంగా ఏడు మిల్లులు రూ.191.13 కోట్ల విలువైన ధాన్యం అమ్ముకున్నా పట్టించుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసేనా! ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై జిల్లా యంత్రాంగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. మరోవైపు ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తామని జిల్లా పౌర సరఫరాల విభాగం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఆయా మిల్లులపై పోలీసులు నమోదు చేసే క్రిమినల్ కేసులకే పరిమితం అవుతుందా? ఆచరణలో ఆర్ఆర్ యాక్ట్ను అమలు చేస్తుందా? చూడాలి.ఫ మిల్లర్లపై చర్యలకు మూడేళ్లుగా అధికారుల మీనమేషాలు ఫ పలుమార్లు కథనాలను ప్రచురించిన ‘సాక్షి’ ఫ అయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన యంత్రాంగం ఫ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో చలనం ఫ ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తామంటున్న అఽధికారులుజిల్లాలో 2022–23 యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని మాయం చేయడంపై గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అప్పటి పౌరసరఫరాల కమిషనర్ విచారణకు ఆదేశించారు. అప్పట్లో మిల్లుల్లో తనిఖీలు చేపట్టి, అక్రమాలు నిజమేనని అధికారుల తనిఖీ బృందాలు తేల్చాయి. అయినా చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారు. జిల్లాలో మిల్లర్ల అక్రమాలపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు, అక్రమాలను తేల్చిన వైనం, అయినా మిల్లర్ల బుకాయింపుపై ‘సాక్షి’ దిన పత్రిక ప్రత్యేక కథనాలను ప్రచురించింది. తాజాగా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ పెట్టాలని స్పష్టం చేయడంతో జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు సోమవారం వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మిల్లుల్లో కనిపించకుండా పోయిన ధాన్యం, కేసుల వివరాలు.. పోలీస్ స్టేషన్ మిల్లుపేరు ధాన్యం విలువ (క్వింటాళ్లలో) (రూ.కోట్లలో) చిట్యాల వరలక్ష్మి పార్బాయిల్డ్ 59,538 19.33 కేతేపల్లి చాముండేశ్వరి పార్బాయిల్డ్ 1,39,670 45.36 మునుగోడు మరళీ మనోహర్ ఆగ్రోఫుడ్స్ 4,500 1.46 నల్లగొండ టూటౌన్ రామ్లక్ష్మణ్ 78,110 25.36 నల్లగొండ టూటౌన్ కనకమహాలక్ష్మి 80,260 26.06 నల్లగొండ రూరల్ సుమాంజలి 67,662 21.97 నల్లగొండ రూరల్ గౌతమి ఇండస్ట్రీస్ 1,59,803 51.89 -
నీటి వనరులపై నివేదిక ఇవ్వండి
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ –163 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లాలో 45 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. నల్లగొండ : నీటి వనరులపై సమగ్ర సర్వే నిర్వహించి ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, మున్సిపల్, సర్వే, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. చెరువులు, కుంటలు, కాల్వల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ పరిధి లోని ప్రతి వాటర్బాడీకి సంబంధించిన పూర్తి మ్యాప్, సర్వే నంబర్లు, ఎఫ్టీఎల్ పరిమితులు, బఫర్ జోన్ వివరాలు సమగ్రంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీని వాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమి త్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. గడవులోగా పనులు పూర్తిచేయాలి నల్లగొండ : ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న మూత్రశాలలు, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, పాఠశాల ప్రహరి గోడల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలలు, మహాత్మ జ్యోతీరావు ఫూలే పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సారూ.. సమస్యలు తీర్చరూ..
ఫ గ్రీవెన్స్డేలో కలెక్టర్కు సమస్యలు విన్నవించిన ప్రజలు ఫ కలెక్టరేట్కు భారీగా వచ్చిన ఫిర్యాదుదారులు నల్లగొండ : సారూ.. మా సమస్యలు తీర్చండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్ చంద్రశేఖర్కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో గ్రీవెన్స్డే నిర్వహించారు. పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ వాటిని పరిష్కరించాలని ఆయా శాఖలకు పంపారు. గ్రీవెన్స్డేలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదుదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. -
బైక్ను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
మఠంపల్లి: ఇంటి బయట పార్కింగ్ చేసిన బైక్కు గుర్తుతెలియని వ్యక్తుల నిప్పుపెట్టడంతో కాలిబూడిదైంది. ఈ ఘటన మఠంపల్లి మండలం లాలితండాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఆదివారం బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లాలితండాకు చెందిన వార్డు సభ్యుడు భూక్యా కమల్నాయక్ తన బైక్ను శనివారం రాత్రి ఇంటి పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బైక్కు నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆదివారం ఉదయం బైక్ తగలబడినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. బాబు తెలిపారు. లారీ ఢీకొని కారు బోల్తాదేవరకొండ: లారీ ఢీకొని కారు పల్టీ కొట్టిన ఘటన దేవరకొండ పట్టణ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట గ్రామానికి కంభంపాటి ఇందిర, కంభంపాటి కుందన ఆదివారం డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసి తమ బాబాయి కిరణ్ కారులో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో దేవరకొండ పట్టణ శివారులోని ఉప్పువాగు సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. బైక్పై నుంచి పడి యువకుడి మృతికొడకండ్ల : బైక్పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల శివారులో తిరుమలగిరి మండలం వెలిశాల హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం జరిగింది. స్థానిక ఎస్ఐ చింత రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్ నెహ్రూ(38) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని నిమిత్తం శనివారం బైక్పై వెలిశాల గ్రామానికి వెళ్లాడు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన గుగులోత్ శంకర్ బైక్పై వెలిశాల హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద అతడికి అడ్డురావడంతో నెహ్రూ బైక్పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతిదేవరకొండ : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం దేవరకొండ పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మడమడక గ్రామ జీపీఓగా పనిచేస్తున్న ఇరిగి శంకర్ కుమారుడు అన్మోల్(11) పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తండ్రి శంకర్తో కలిసి బాలుడు ముదిగొండ రోడ్డులో వాకింగ్కు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలోని బావిలో పడి అన్మోల్ మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
పీఆర్కే రెడ్డి గ్రీన్ విల్లాస్ ఎన్క్లేవ్ ప్రారంభం
నల్లగొండ టౌన్: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పీఆర్కే రెడ్డి గ్రీన్ విల్లాస్ ఎన్క్లేవ్ వెంచర్ను ఆదివారం సింగర్ మధుప్రియ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీరామకృష్ణ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో పీఆర్కే రెడ్డి గ్రీన్ విల్లాస్ ఎన్క్లేవ్ వెంచర్ రూపుదిద్దుకుందని అన్నారు. ఈ వెంచర్లో ప్లాట్లు, గృహాలు ప్రజలు కొనుగోలు చేసి తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్నారు. అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. వెంచర్ నిర్వాహకుడు బాలాజీనాయక్ మాట్లాడుతూ.. ఈ వెంచర్ డీటీసీపీ, రెరా వంటి అన్నిరకాల అనుమతులు పొందిందన్నారు. విశాలమైన రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఉన్నాయని, ఆహ్లాదకర వాతావరణంలో కొనుగోలుదారులకు నచ్చినట్లుగా ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. సింగర్ మధుప్రియ పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ పి. రామకృష్ణారెడ్డి, బొజ్జ శంకర్, శ్రీధర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రేగట్టె నవీన్కుమార్రెడ్డి, అనంతరెడ్డి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
3,300 ఇళ్లు రదు్ద!
నల్లగొండ : పేదవాడి సొంతింటి కలపై నిబంధనల నీలినీడలు ముసురుకుంటున్నాయి. దీంతో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఒకవైపు పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, మరోవైపు ప్రభుత్వ కఠిన నిబంధనలతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లో పడ్డారు. ఫలితంగా, ఇళ్లు మంజూరైనా పునాది రాయి వేయని (ముగ్గు పోయని) సుమారు 3,300 ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆ స్థానాల్లో అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇళ్ల కేటాయింపు ఇలా.. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజక వర్గాలకు మొత్తం 19,625 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు రెండు విడతల్లో అధికారులు 17,247 ఇళ్లు మంజూరు చేశారు. రెండు విడతల్లో మంజూరైన ఇళ్లలో ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి రెండో విడతలో ఇళ్ల స్థలం కూడా లేనివారికి ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి మంజూరు పత్రాలను అందించారు. అందని ‘బేస్మెంట్’ చేయూత ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నప్పటికీ, ప్రాథమిక స్థాయిలోనే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బేస్మెంట్ నిర్మించుకోవడానికే సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుండగా, చేతిలో చిల్లిగవ్వ లేక పేదలు పనులు మొదలుపెట్టలేకపోతున్నారు. దీనికితోడు 600 చదరపు అడుగులలోపు నిర్మిస్తేనే బిల్లులు వస్తాయనే నిబంధన పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి కుటుంబాల అవసరాల దృష్ట్యా కొంత పెద్దగా నిర్మించుకోవాలని భావిస్తున్న వారికి ఈ నిబంధనలు శాపంగా మారాయి. నిబంధనలు అడ్డురావడంతో మంజూరైన ఇళ్లను చాలా మంది వదిలేసుకున్నారు. నిర్మాణ దశల్లో ఉన్నవి 13 వేలకుపైనే.. జిల్లాకు కేటాయించిన ఇళ్లు 19,625 ఇప్పటి వరకు మంజూరైనవి 17,247ఫ ఆర్థిక భారంతో వెనకడుగు వేస్తున్న పేదలు ఫ కొత్త లబ్ధిదారుల వేటలో యంత్రాంగం ఫ ఇంటి నిర్మాణ వ్యయం పెంచాలని లబ్ధిదారుల వేడుకోలు ప్రస్తుతం సిమెంట్, స్టీలు, ఇసుక ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వ సాయం రూ.5 లక్షలు ఉంటే, ఒక సాధారణ ఇంటి నిర్మాణానికి కనీసం రూ.12 లక్షల వరకు ఖర్చవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. పెరుగుతున్న భారంతో పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇందరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని పెంచి, నిబంధనలు సడలించి పేదల సొంతింటి కలను సాకారం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కొందరు లబ్ధిదారులు తమ పేరు జాబితాలో రాగానే, ఉత్సాహంతో ముందే అప్పులు చేసి బేస్మెంట్లు నిర్మించుకున్నారు. అయితే, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ‘పాత నిర్మాణాలకు నిధులు ఇవ్వలేం’ అని తేల్చి చెబుతుండడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నల్లగొండ మండలం నర్సింగ్బట్లకు చెందిన శేఖర్ అనే లబ్ధిదారుడు లక్ష రూపాయలు వెచ్చించి బేస్మెంట్ నిర్మించుకున్నా, నిబంధనల వల్ల పైసా అందలేదు. దీంతో చేసేదేమీ లేక అప్పులు చేసి సొంతంగానే పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. -
చెట్టు పట్టాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంమర్రిగూడ : మండలంలోని ఖుదాబక్షపల్లిలో పేద రైతులకు సంబంధించిన చెట్టు పట్టాల సమస్య గురించి శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం ఖుదాబాక్షపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖుదాబక్షపల్లిలో 70ఏళ్ల క్రితం గుట్ట ప్రాంతంలో పేద రైతులకు ఇచ్చిన చెట్టు పట్టాలను రద్దుచేయకుండా పోరాడుతానన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం రాంరెడ్డిపల్లి పరిధిలోని తానేదార్పల్లికి చెందిన సీపీఐ కార్యదర్శి కర్నాటి అంజయ్య తల్లి చంద్రమ్మ ఇటీవల మృతిచెందగా ఎమ్మెల్సీ ఆ గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, మేతరి యాదయ్య, పొట్ట అశోక్, గిరి ముత్తయ్య, ఎరుకల నిరంజన్గౌడ్, అబ్బనగోని కృష్ణయ్య, జాల చంద్రయ్య, పాముల రమేష్, అడమయ్య, కొమురయ్య పాల్గొన్నారు. -
బుద్ధవనం సందర్శించిన దక్షిణ కొరియా ప్రతినిధులు
నాగార్జునసాగర్: దక్షిణ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యా సాంస్కృతిక ప్రతినిధుల బృందం సభ్యులు కాంగ్సుంగ్, చోయ్ సేంగహో, మిన్ క్యేయోంగ్వూ, కవన్ జిన్ వోక్, శేషు, చిరాగ్ జలది తదితరులు ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. హైదరాబాద్లో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న వీరు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బుద్ధచరిత వనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనాలను సందర్శించారు. స్థూప వనంలో నిర్మించిన దక్షిణ కొరియా మహాస్థూపాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు వారిని ఘనంగా సత్కరించారు. బుద్ధవనంలో చేపట్టబోయే నూతన నిర్మాణాల గురించి వారికి తెలిపారు. వారి వెంట స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు. -
పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
నల్లగొండ టౌన్: పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్ల గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన లాలిత్య స్కిన్ అండ్ లేజర్ ఆస్పత్రిని ఆదివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదవారికి, మధ్యతరగతి రోగులకు మెరుగైన చికిత్స అందించి అవసరమైనంత మేరకు మందులు అందించినప్పుడే ఆస్పత్రులు ప్రజాదరణ పొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, డిప్యుటీ మేయర్ అష్రాఫ్ అలీ, బుర్రి శ్రీనివాస్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, డాక్టర్లు లాలిత్య శశాంక్, గౌరిశ్రీ, హరినాథ్, సాయిలావణ్య, రవిశంకర్ కన్నా, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మాతా, శిశువుకు భరోసాగా..
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు మాతా శిశువులకు భరోసాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడంతో జిల్లాలో ఎనిమిదేళ్లుగా మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు సరైన వైద్యం, పౌష్టికాహారం అందకపోవడం, రక్తహీనత కారణంగా జిల్లాలో మాతా శిశు మరణాలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహహారం అందించడంతో పాటు సకాలంలో వ్యాధి నిరోదక టీకాలను అందిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రత్యేక వైద్యులతో వైద్యం చేయిస్తుండడంతో ఏటేటా మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులను ప్రభుత్వం నియమించింది. అత్యాధునిక వైద్య పరీక్షల కోసం పరికరాలను సమకూర్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలతో గర్భిణులు, నవ జాత శిశువులకు అవసరమైన విభాగాలను ఏర్పాటు చేసింది. ఐసీయూ, కేఎంసీ వంటి విభాగాలను అందుబాటులో ఉంచడంతో గత కొన్నేళ్లుగా మాతా శిశు మరణాలు తగ్గుతున్నాయి. గర్భిణుల నమోదు నుంచి పర్యవేక్షణ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు వాటికి అనుబంధంగా ఉన్న ఉప కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ఓ మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి తల్లీబిడ్డను ఇంటికి చేర్చే వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గర్భిణులకు సేవలందిస్తున్నారు. నెలలు నిండగానే 102 వాహనాన్ని రప్పించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కాన్పు అయిన తర్వాత తల్లీబిడ్దలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. వాట్సప్ గ్రూప్లో వివరాలు.. జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, మర్రిగూడ ఆసుపత్రులకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అత్యవసర చికిత్సల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్ల్లో గర్భిణుల ఆరోగ్య సమస్య, అందించాల్సిన చికిత్స వివరాలను నమోదు చేస్తారు. ఆ గ్రూప్లో ఉన్న సంబంధిత వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై గర్భిణి వచ్చిన వెంటనే సకాలంలో చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తుండడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి. గర్భిణులు కూడా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వైద్యులు చెప్పే సూచనలు పాటిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకోవడం వల్ల మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సంవత్సరం శిశు మాత 2018–19 335 14 2019–20 395 18 2020–21 329 08 2021–22 310 26 2022–23 317 13 2023–24 216 12 2024–25 169 07 2025–26 జనవరి 72 09 ఫ వైద్యారోగ్య శాఖ వినూత్న కార్యక్రమాలు ఫ ఏటేటా తగ్గుతున్న తల్లిబిడ్డల మరణాల రేటు ఫ గర్భం దాల్చిన మహిళ ప్రసవించే వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఫ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందడమే కారణం -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
గరిడేపల్లి : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పొనుగోడు గ్రామంలో నిర్మించిన సంఘం భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగానే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి నేటికీ పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ వయసులో వారు తిరిగే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని నిర్మించిన సంఘం మండల కమిటీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుందరి నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతారామయ్య, సభ్యులు వెంకటమ్మ, చంద్రయ్య, బొట్ల రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, వేరేపెళ్లి శ్రీనివాసరావు, కోటయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో చెట్ల నరికివేత
పెద్దవూర : ప్రైవేటు భూములు, బహిరంగ ప్రదేశాల్లో ఒక చెట్టును నరకాలంటేనే అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాంటింది ప్రభుత్వ భూ మిలో ఎవరి అనుమతులు తీసుకోకుండా వందల సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఈ ఘటన పెద్దవూర మండలం కోమటికుంటతండాపరిధిలోని కేంద్ర ప్రభుత్వ భూమిలో ఆదివారం వెలుగుచూసింది. తండాలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్(ఏఎండీ)యూరేనియం క్యాంపు భూమిలో పదేళ్ల క్రితం వందల సంఖ్యలో మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం పెద్ద చెట్లుగా ఎదిగాయి. వీటిని అక్రమార్కులు మూడు రోజులుగా నరికివేస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. రఏటా రూ.కోట్లు ఖర్చు చేసి హరితహారం కింద మొక్కలను నాటుతుంటే ఇలా నరకడం ఏంటని స్థానికులు అంటున్నారు. అమలుకు నోచుకోని వాల్టా చట్టం ప్రభుత్వ అటవీ సంపదను కాపాడటానికి తీసుకొచ్చిన వాల్టా చట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. చెట్లను నరికివేయాలంటే కనీసం గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతినైనా తీసుకోవాలి. అలాంటిది.. ఎవరి అనుమతి లేకుండా వందల సంఖ్యలో చెట్లను ఎలా నరికివేస్తారని కోమటికుంటతండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ చెట్లు ఎందుకు నరుకుతున్నారో అర్థంకాని పరిస్థితి. ఈ విషయాన్ని ఎవరికై నా ఫిర్యాదు చేద్దామన్నా ఇక్కడ ఎవరూ ఉండరని స్థానికులు చెబుతున్నారు. ఫ కోమటికుంటతండాలో అక్రమార్కుల నిర్వాకం ఫ కేంద్ర ప్రభుత్వ స్థలంలో అనుమతుల్లేకుండా నరికివేత ఫ ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికుల ఆరోపణ -
మురళీకృష్ణుడిగా నారసింహుడు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం ఆలయంలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని మురళీకృష్ణుడిగా అలంకరించి పల్లకీపై అధిష్టింపజేసి మాడ వీధిలో ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి వేద పారాయణం పఠించారు. అనంతరం మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఆలయాధికారులు, అర్చకులు, పారాయణీకులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. అనంతరం స్వామివారిని పొన్న వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో నేడు..వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ నిర్వహించనున్నారు. పొన్న వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు -
స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఆత్మకూర్(ఎస్)మండలానికి చెందిన విద్యార్థి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన ఎస్. శ్రీనాథ్ గతేడాది ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూల్లో 6వ తరగతి చదివాడు. ఈ విద్యాసంవత్సరం 7వ తరగతిలో హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు బదిలీ అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం స్కూల్లో శ్రీనాథ్ ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పాఠశాల సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి చేరుకొని శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్ దర్గా
మర్రిగూడ (చింతపల్లి) : మత సామరస్యానికి ప్రతీక సయ్యద్ హజరత్ అబ్బాస్ దర్గా అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలోని దర్గాలో వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారిని దర్గా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలిండియా వాలీబాల్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక కనగల్ : కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరిగే ఆలిండియా 74వ పోలీస్ జాతీయ వాలీబాల్ క్లస్టర్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున కనగల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నిమ్మ బేబీశాలిని ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన స్టేట్ ఫోర్త్ సమ్మిట్ సైబరాబాద్ వాలీబాల్ మహిళా విభాగం పోటీల్లో బేబీశాలిని పాల్గొని ఎంపికై ంది. ఈమె స్వగ్రామం చింతపల్లి మండలం వింజమూరు. జాతీయ పోటీలకు ఎంపికై న బేబీ శాలినిని చండూరు సీఐ కె.ఆదిరెడ్డి, కనగల్ ఎస్ఐ రాజీవ్రెడ్డి అభినందించారు. కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలినల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి కార్మికుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులుగా పనిచేస్తున్న వారు నేటికీ శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు జీతభత్యాల అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 28న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వరంగల్లో జరగనున్న సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వనాథులు లెనిన్, యాదగిరి, ిసీహెచ్.నిర్మల, పి.ఎల్లమ్మ, పద్మ, రామేశ్వరమ్మ, అన్నపు లింగస్వామి, సందీప్, మధు, సబిత, నిర్మల, ఉషమ్మ, యాదమ్మ పాల్గొన్నారు. మట్టపల్లిలో విశేష పూజలు మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం గోదాదేవికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని చేపట్టారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. -
రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు
నకిరేకల్: అక్రమంగా మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారని రైతులపై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం గొల్లగూడెం శివారులోని భూపతి కుంటను ఆదివారం చిరుమర్తి లింగయ్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపతి కుంటలో నెల రోజులుగా రోడ్డు పని పేరుతో ఇక్కడి ఎమ్మెల్యే పేరు చెప్పుకుని భారీగా మట్టిని అక్రమంగా తరలించారని ఆరోపించారు. తాజాగా ఇక్కడ రైతులు కుంట సమీపంలో తమ పట్టా భూముల్లో మట్టిని తీస్తుండగా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు సందర్శించి కుంట భూమిలో తవ్వకాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. భూపతి కుంటలో వారు చేస్తున్న మట్టి దందాను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ఒత్తిడితో బీఆర్ఎస్కు చెందిన రైతులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, కట్టంగూర్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తలారి బలరాం, నాయకులు సూదిని జానకీరెడ్డి, యానాల లింగారెడ్డి, జీడిపల్లి శేఖర్రెడ్డి ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఆటోమెుబైల్ షాపులో అగ్నిప్రమాదం
సాక్షి నల్గొండ: నకిరికేల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఆటో మెుబైల్ షాపులో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రీకౌంటింగ్కు హైకోర్టు ఆదేశం
మిర్యాలగూడ టౌన్ : గణేష్పహాడ్ గ్రామ పంచాయతీ ఓట్లకు సంబంధించి త్వరగా రీకౌంటింగ్ జరిపించాలంటూ మిర్యాలగూడ కోర్టును తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలం గణేష్పహాడ్ సర్పంచ్ పదవికి రాత్ర సుక్యనాయక్, రాత్ర రమేష్నాయక్ పోటీ చేయగా గతేడాది డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో రమేష్నాయక్కు 477 ఓట్లు రాగా తన ప్రత్యర్థి అయిన సుక్యనాయక్కు 476 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్కోటు తేడాతో రమేష్ నాయక్ గెలు పొందారు. దీంతో కౌంటింగ్పై తనకు అనుమానంగా ఉందని, రీకౌంటింగ్ జరపాలంటూ రాత్ర సుక్యనాయక్ ఎన్నికల అధికారులను కోరినప్పటికి వారు స్పందించలేదు. దీంతో ఆయన మిర్యాలగూడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్కోర్టులో (ఈఎల్ఈసీవోపీ/02/2025) కేసు వేశాడు. ఈ కోర్టు కూడా త్వరగా తేల్చడం లేదని భావించిన సుక్యనాయక్ 2026 జనవరి 20న హైకోర్టు(సీఆర్పీ/219/2026)ను ఆశ్రయించాడు. దీంతో ిపిటిషనర్ తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది జి.కరుణాకర్రెడ్డి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి త్వరగా గణేష్పహాడ్ పంచాయతీకి సంబంధించిన ఓట్లు రీకౌంటింగ్ చేయాలంటూ మిర్యాలగూడ కోర్టును ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి గుర్రంపోడు : ఉపాధ్యాయులు బోధనాభ్యాస సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యేలా విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) బి.భిక్షపతి అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించాలన్నారు. అనంతరం నడికూడ ప్రాథమిక పాఠశాలలో రూ.5 లక్షల వ్యయంతో తాగునీరు, ఇతర వసతులు కల్పించిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్కు జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్ధార్ కరుణశ్రీ, ఎంఈఓ నోముల యాదగిరి, రిసోర్స్ పర్సన్లు, అన్ని పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విద్యాసదస్సుకు అలీ బేగ్ పరిశోధన పత్రంనల్లగొండ టూటౌన్ : టర్కీలో జూన్ 24 నుంచి 28 వరకు జరగనున్న మూడవ అంతర్జాతీయ ఆరోగ్య, వ్యా యామ విద్యా సదస్సులో మహా త్మాగాంధీ యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ మీర్జా రాజా అలీబేగ్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. డాక్టర్ అలీ ‘ప్లే విత్ ఇన్ సేఫ్ బౌండరీస్ ఎంపవరింగ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ త్రూ స్ట్రాటజిక్ సెక్యూరిటీ ప్లానింగ్’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనను ఇస్టాంబుల్ నగరంలో జరిగే సదస్సులో సమర్పిస్తారు. యూనివర్సిటీల్లో సెక్యూరిటీ పాత్ర, స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన అంశాలపై తాను ఈ పరిశోధన చేసినట్లు అలీ బేగ్ తెలిపారు. పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిరామగిరి (నల్లగొండ) : పోస్టర్ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్కుమార్ నరహరి అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం నర్సింగ్భట్ల పోస్ట్ ఆఫీస్లో జరిగిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ స్కీంలపై గ్రామస్తులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, సర్పంచ్ జాకీరా, ఉప సర్పంచ్ అనసూర్య, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తాజుద్దీన్, బి.నర్సింహ, ఎం.శ్రీనివాస్, జి.దుర్గా భవానీ, వి.మేఘన, బి.లావణ్య, జె.కొండారెడ్డి, ఎండి.ఫయాజ్, హెచ్. విద్యాసాగర్, డి.సింధులహరి, యాదయ్య, యూసఫ్, గణేష్, పర్వీన్, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
నల్లగొండ : జిల్లాలో సహజ, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో టూరిజంపై నిర్వహించిన సమావేశంలో పచ్చల, ఛాయాసోమేశ్వర, పాలెం లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, లతీఫ్ సాహెబ్, కాపురాల గుట్టలపైకి రోప్వే ఏర్పాటు, డిండి ప్రాజెక్టు వద్ద బోటింగ్ సదుపాయాల విస్తరణ, దేవరచర్ల శివాలయం, కాచరాజుపల్లి ఏలేశ్వరం, ఏకేబీఆర్, అజ్జలాపురం జలపాతం, అలాగే నెల్లికల్లు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను అభివృద్ధి చేసే విషయమై సమీక్షించారు. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానిక యువతకు గైడ్స్, హోం స్టేలు, ఫుడ్ కోర్టులు, హస్తకళల విక్రయ కేంద్రాలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీ రమేష్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ, బుద్ధవనం ఇన్చార్జి శ్యాంసుందర్, టూరిజం, అటవీ, ఆర్కియాలజీ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రగతికి సహకరించాలి పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రంగాల్లో మాత్రమే పారిశ్రామిక సంస్థలు, ఇతరులు సీఎస్ఆర్ నిధులు అందజేయడం వల్ల ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందని, అలా కాకుండా జిల్లా మొత్తంగా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. ఈ విషయమై ఇటీవలే సీఎస్ ఆర్ జిలా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహకారం అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, పారిశ్రామిక సంస్థల ప్రతిని ధులు, రైస్ మిల్లర్లు, బ్యాంకర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నిమిషం నిబంధన లేదు
డిండి సేఫ్టీ పనులపై నెలాఖరులోగా నివేదికనల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్ బోర్డు ఎత్తి వేసింది. నిమిషం నిబంధన కారణంగా గతంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయలేక నష్టపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆ నిబంధనను ఎత్తి వేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) దస్రూ తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సాక్షి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు మొత్తం 45 కేంద్రాలు కేటాయించడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన మాటల్లోనే.. 25న పరీక్షలు ప్రారంభం ఈ నెల 25 నుంచి వచ్చే నెల మార్చి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్ధులు జనరల్ కేటగిరీలో 11,802, ఒకేషనల్ 2,117 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 11,733 మంది జనరల్, 2,248 మంది ఒకేషనల్ విభాగాల విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు కమిటీలు, ప్రత్యేక బృందాలు పరీక్షల నిర్వహణకోసం డీఈసీ కమిటీతోపాటు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, డీఐఈఓ కన్వీనర్గా, ఎస్పీ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లతోపాటు మరో ఇద్దరి ప్రిన్సిపాళ్లతో డీఈసీ కమిటీని ఏర్పాటు చేశాం. పరీక్షల పర్యవేక్షణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు.. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాం. తాగునీటితోపాటు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటారు. ఒక్కో సెంటర్లో మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ నిఘాలో పరీక్షలు కొసాగుతాయి. జిల్లాకు వచ్చిన ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచాం. పోలీస్ బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలను పరీక్ష రోజు కేంద్రాలకు తరలిస్తాం. పరీక్ష ముగసిన తరువాత ఎస్కార్ట్ బందోబస్తు నడమ తరలిస్తాం. జిల్లా అంతటా పరీక్ష కేంద్రాల వద్ద 44 సెక్షన్ అమలులో ఉంటుంది. పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. ఈయన రొమ్ముల రాంబాబు. మాడ్గులపల్లి మండలం పూసలపాడుకు చెందిన ఈయన ఫర్టిలైజర్ యాప్తో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. సెల్ఫోన్లో యూరియా బుక్ చేసుకుందామని ఓపెన్ చేసిన ఆరు సెకన్లలోపే స్టాక్ లేదని చూపిస్తోందని అంటున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దెబ్బతిని నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. జిల్లాలో వీరే కాదు.. ఈ యాసంగి సీజన్లో వరిసాగు చేసిన రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మునుగోడుకు చెందిన ఈ రైతు పేరు మధుసూదన్రెడ్డి. తనకు చదువు రాదని, యూరియా ఎలా బుక్ చేసుకోవాలని వాపోతున్నారు. ఎవరితోనైనా చేయిద్దామంటే యాప్లో యూనియా లేనట్లుగా చూపిస్తోందని చెబుతున్నారు. యూరియా కోసం ఆత్మహత్య చేసుకోవాలా? అని ప్రశ్నిస్తూ శుక్రవారం స్థానికంగా ఓ ఫర్టిలైజర్ షాపు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.ఈయన చిలుక ప్రతాప్రెడ్డి. ఈయనది త్రిపురారం మండలం జీఅన్నారం గ్రామం. 20 రోజుల నుంచి యూరియా బుక్ చేస్తున్నా దొరకడం లేదంటున్నారు. అసలు మండలానికి యూరియా వస్తుందో రావడంలేదో కూడా అర్థం కావడం లేదని చెబుతున్నారు. వరిపొలం పొట్ట దళకు వచ్చే సమయంలో యూరియా దొరక్క వేయకపోతే పంట పండుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రైతులకు యూరియాను అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుక్ చేసుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైతుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేక, ఫోన్లు ఉన్నా చదువురాని వారు బుక్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీసేవ కేంద్రాల్లోకి వెళ్లి, లేదా మరెవరితోనైనా బుక్ చేయిద్దామని వెళ్లి యాప్ను ఓపెన్ చేసిచూస్తే యూరియా స్టాక్ లేనట్లే చూపుతోంది. ఎప్పు డు చూసినా యూరియా బుక్ కావడం లేదని, తమ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో జీరో చూపిస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులను అధిగమించాలని.. గత వానాకాలం సీజన్లో తలెత్తిన ఇబ్బందులను అఽధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ను తెచ్చింది. సీజన్ ఆరంభంలో నాన్ ఆయకట్టులో ఎలాగోలా రైతులు ఫర్టిలైజర్ యాప్లో యూరియాను బుక్ చేసుకుంటే ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. ఆ తరువాత 15 రోజులకు మళ్లీ బుక్ చేసుకుందామంటే దొరకడం లేదని వాపోతున్నారు. మరోవైపు ఆయకట్టు ప్రాంతంలోనూ గత నెలలో నాట్లు వేసిన రైతులు యూ రియా కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవసరం మేరకు రాని యూరియా జిల్లాలో యాసంగి సీజన్లో 5.45 లక్షల ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలను రైతులు సాగు చేశారు. ఈ సీజన్లో 74,955 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే జిల్లాలో గత వానాకాలం సీజన్ ముగింపు సమయమైన అక్టోబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాకు 64,797 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం దొరకడం లేదు. ఇష్టానుసారంగా కేటాయింపులు సహకార సంఘాలకు, డీలర్లకు యూరియాను మార్క్ఫెడ్ కేటాయిస్తుంది. అందులో సంఘాలకు 60 శాతం, డీలర్లకు 40 శాతం ఇస్తారు. మార్క్ఫెడ్ అధికారులు ఆ 40 శాతం యూరియాను వారికి అనుకూలంగా ఉన్న డీలర్లకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యారియా అలాట్ కాగానే ఆయా డీలర్లు తమ రెగ్యులర్ రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వడం, మరోవైపు డీలర్లే రైతుల పేరుతో బుక్ చేస్తున్నారు. దీంతో మిగతా రైతులకు యూరియా దొరకడం లేదు.ఫ సీడీఎస్ఈ కమిటీ చెర్మన్ రామరాజు ఫ ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరు అయ్యేందుకు 5 నిమిషాలు సడలింపు ఫ 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ ఫ 45 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఫ జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 27,714 మంది విద్యార్థులు ‘సాక్షి’తో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రూ రైతులు యూరియా కోసం సెల్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకొని యూరియా బుక్ చేద్దామనుకున్న ప్రతిసారి జీరో స్టాక్ చూపిస్తోంది. జిల్లాలో గురువారం 2502 బస్తాలు ఉన్నట్లు చూపినా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ఏ మండలంలో కూడా యూరియా లేదు. శుక్రవారం అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడే మిగితా నియోజవకర్గాల్లోని మండలాల్లో చూసినా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ఫ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్తో రైతుల ఆగచాట్లు ఫ ఎప్పుడు ఓపెన్ చేసినా ఆన్లైన్లో కనిపించని స్టాక్ ఫ స్మార్ట్ఫోన్లు లేక, బుక్ చేసుకోవడం తెలియక చాలామంది తిప్పలు ఫ యూరియా అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలం ఫ యాసంగి సీజన్ వరికి అదును దాటుతోందని కర్షకుల ఆవేదన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. విద్యార్ధులు ఎవరైనా దివ్యాంగులు (బ్లైండ్) ఉంటే వారికి బదులుగా మరొకరు పరీక్ష రాసేందుకు ముందే దరఖాస్తు చేసుకోవాలి. హాల్టికెట్లు ఇప్పటికే కళాశాలలకు చేరాయి. ఎవరైనా ప్రైవేటు కళాశాల వారు హాల్టికెట్లు ఇవ్వకుంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిమీద ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. -
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
గుర్రంపోడు, కొండమల్లేపల్లి : సేంద్రియ, జీవన ఎరువులు వినియోగిస్తూ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం ఆమె.. కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో జీవన ఎరువులతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు కట్టెబోయిన శ్రీనివాస్ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అలాగే జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పాదక సంస్థలపై నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. సేంద్రియ, జీవన పద్ధతుల్లో పంట సాగు వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని, కొందరు రైతులు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేవలం 143 మంది ఉద్యానవన అధికారులు మాత్రమే ఉన్నారని, క్షేత్రస్ధాయిలో రైతులకు మరింతగా సేవలందించేందుకు వలంటీర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందన్నారు. జిల్లాలోని బత్తాయి రైతులు మార్కెటింగ్ సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు తీరుస్తామన్నారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు శిక్షణ ఇప్పించాలి : ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజిరెడ్డి అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ (వీసీ) రాజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2011లో లక్షపైగా ఎకరాల్లో బత్తాయి పంట సాగైతే ఇప్పుడు 41వేల ఎకరాలకు పడిపోయిందని గుర్తు చేశారు. విచక్షణారహితంగా పురుగుల మందు వాడకుండా సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయించి మిగతా వారికి శిక్షణ ఇప్పించాలన్నారు. ఆయా సమావేశాల్లో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు, ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్కుమార్, నాబార్డు సీజీఎం ఆరిఫ్, డీడీఎం వినయ్కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్త రాజాగౌడ్, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, అధికారులు పి.అనంతరెడ్డి, హెచ్ఓ మురళి, ఏఓ కె.మాధవరెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఫ గుర్రంపోడు, కొండమల్లేపల్లిలో బత్తాయి క్షేత్రాల సందర్శన ఫ ఆయా చోట్ల రైతులతో సమావేశాలు -
పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలి
పెద్దఅడిశర్లపల్లి : యారియా యాప్ను రద్దుచేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. యూరియా కొనుగోలు కోసం ప్రవేశపెట్టిన యాప్ వద్దంటూ గురువారం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులు యూరియా కోసం ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు వస్తాయన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఎద్దేవా చేశారు. రైతులకు ఇస్తానన్న రూ.15 వేల రైతు భరోసాను ప్రభుత్వం ఎగవేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లపురెడ్డి, సర్పంచ్లు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, రవికుమార్, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. -
న్యాయవాది ఇంటిపై దాడి అమానుషం
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి న్యాయవాది జి.నరేష్ నివాసంలో ఆయన భార్యపై, చిన్న కూతురిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం అమానుష చర్య అని నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్ అన్నారు. దాడిని ఖండిస్తూ గురువారం నల్లగొండ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి జిల్లా కోర్టు నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేవెళ్లలో మహిళా న్యాయవాదిని హత్య చేయడం, హైదరాబాద్లో మరో న్యాయవాదిపై హత్యాయత్నం, ఇప్పుడు నల్లగొండలో జరిగిన దాడి ఇవన్నీ న్యాయవాదుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, ఎస్ఆర్.ఠాగూర్, జె.భాస్కర్రెడ్డి, ఎం.నాగిరెడ్డి, టి.కిషోర్కుమార్, పి.శేఖర్, జనిగల రాములు, జీఎన్ఎస్ ప్రసాద్, అన్నపూసల ఐలయ్య, బి.అశోక్ కుమార్, మేక యాదగిరిరెడ్డి, ఎం.ప్రమీల, ఎన్.భాగ్యమ్మ, టి.వరుణశ్రీ, ఎ.వెంకట్రెడ్డి, కొండ శ్రీనివాస్, బి.మధు, ముక్కెర శ్రీని వాస్, కామేష్, ఎంవి.రమేష్, సల్లా నరేష్, బి.సైదులు, బి.స్వామినాథ్తదితరులు పాల్గొన్నారు. -
సన్నాల బోనస్ రూ.71.47 కోట్లు
ఫ రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్కు సంబంధించిన సన్నాల బోనస్ రూ.71.47 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం గురువారం జమ చేసింది. ఐదు నెలలుగా రైతులు సన్నాల బోనస్ కోసం నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. వానాకాలం సీజన్కు సబంధించి జిల్లా వ్యాప్తంగా 31,416 మంది రైతుల నుంచి 1.48 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిచింది. ఇందుకుగాను రూ.355.18 కోట్లు చెల్లించింది. అందులో బోనస్ కింద క్వింటాకు రూ.500 చొప్పున రూ.74.33 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 1,42,942 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 30,262 మంది రైతుల ఖాతాల్లో రూ.71.47 కోట్ల బోనస్ను జమ చేసింది. ఇంకా 5,732 మెట్రిక్ టన్నులకు గాను 1,154 మంది రైతులకు రూ.2.86 కోట్ల బోనస్ డబ్బులు జమ చేయాల్సి ఉంది. ఎట్టకేలకు బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలుమునుగోడు : మండలంలోని రత్తిపల్లి, కల్వలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం జిల్లా స్థాయి అకడమిక్ బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఆయా పాఠశాలల పరిసరాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ఉపాధ్యాయులెవరైనా వినూత్నంగా బోధన చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా నోడల్ అధికారి టి.వెంకటరత్నం, బి.జైపాల్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు నర్సిరెడ్డి, గోనె మోహన్రావు, ఉపాధ్యాయులు ఆయేషా, సల్లానా, లక్ష్మీప్రసాద్, సీఆర్పీ నాగరాజు పాల్గొన్నారు. 22న గురుకుల ప్రవేశ పరీక్షనకిరేకల్ : గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి వీటీజీ సెట్–26 పరీక్ష ఈ నెల 22న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జె.శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొత్తం 12,600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్, ధ్రువీకరణ పత్రాలతో ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుకోవాలని సూచించారు. లింగ నిర్ధారణ.. చట్ట విరుద్దంనల్లగొండ టౌన్: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్లగొండలోని తన చాంబర్లో పీసీఅండ్ పీఎన్డీటీ చట్టం–1994, నియమాలు–1996 అమలుపై నిర్వహించిన జిల్లా సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆడపిల్లల జననాల సంఖ్య తగ్గుదల వల్ల లింగ నిర్ధారణ, లింగ వివక్షను అరికట్టే ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. జిల్లాలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు.. చట్టంలోని నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల ఫైళ్లను సమీక్షించి, చట్టబద్ధ అర్హతలు ఉన్న కేంద్రాలకు మాత్రమే ఆమోదం తెలపాలన్నారు. గర్భ నిరోధక మాత్రలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ల్లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ చట్టంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ గైనకాలజిస్ట్ కట్టాజ్యోతి, నల్లగొండ వైద్య నిపుణులు డాక్టర్ సుచరిత, గైనకాలజీస్ట్ దీప, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కృష్ణకుమారి, ఎన్జీఓ గీత పాల్గొన్నారు. . -
నేరస్తుల పనిపడతాయ్..
నల్లగొండ : జిల్లా పోలీసు విభాగానికి రెండు పేలుడు పదార్థాలను గుర్తించే స్నిఫర్ (బిట్టు, చింటూ) శునకాలు, నేరస్తుల జాడను పసిగట్టే ఒక ట్రాకర్ (సోను) శునకం నూతనంగా చేరినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం డాగ్ హ్యాండ్లర్లు (కానిస్టేబుళ్లు) ఫకృద్దీన్, సతీష్, దుర్గాప్రసాద్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శునకాలు హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లో గల పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, (ఐఐటీఏ)లో ఎనిమిది నెలలపాటు ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకున్నాయన్నారు. పేలుడు పదార్థాలు (ఎక్స్ప్లోజివ్స్) గుర్తింపు, అనుమానాస్పద వస్తువుల తనిఖీ, నేరస్తుల అడుగుజాడల గుర్తింపు, గందరగోళ పరిస్థితుల్లో విధి నిర్వహణ వంటి అంశాలలో శునకాలకు శిక్షణ ఇచ్చారన్నారు. దొంగతనాలు, హత్య కేసుల విచారణలో ట్రాకర్ శునకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వీఐపీల పర్యటనలు, భారీ ప్రజాసభలు, ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో ముందస్తుగా తనిఖీలు నిర్వహించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. అనుమానాస్పద బ్యాగులు, వాహనాలు, భవనాల ప్రాంగణాలలో ఎక్స్ప్లోజివ్స్ గుర్తింపులో ఇవి ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాయని వివరించారు. నూతనంగా చేరిన ఈ శునకాలతో జిల్లా పోలీసు విభాగం మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా సేవలు అందిస్తుందన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద విషయాలను వెంటనే సమీప పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. ఫ నూతనంగా మూడు స్నిఫర్, ట్రాకర్ శునకాలు ఫ భద్రతా విభాగానికి మరింత బలం చేకూరిందన్న జిల్లా ఎస్పీ -
ఆరు దాటాకే పర్మీట్ రూమ్కు..
మునుగోడు: మద్యం దుకాణాల్లోని పర్మీట్ రూమ్లలో మద్యం ప్రియులను సాయంత్రం ఆరు గంటల తరువాతే అనుమతించాలని, మధ్యాహ్న సమయంలో అనుమతిస్తే తాను సహించబోనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. ఆయన గురువారం మునుగోడులో మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో కొందరు మద్యం తాగడాన్ని చూసి ఆయన.. షాపుల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను పేద ప్రజల ఆరోగ్యం కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నానన్నారు. దానిని ప్రతి ఒక్కరు గమనించి ఆరోగ్యాలను కాపాడుకోవడంతో కుటుంబాలు అప్పులపాలు కాకుండా చూసుకోవాలన్నారు. ఏ పనీ చేయకుండా ఉదయం నుంచి మద్యం తాగడం సరికాదన్నారు. తన నిర్ణయం ప్రకారం రోజూ మధ్యాహ్నం ఒంటి గంట తరువాతే మద్యం దుకాణాలు తెరవాలని, సాయంత్రం ఆరు గంటల తరువాతే పర్మీట్ రూమ్ల్లో మద్యం తాగేందుకు అనుమతించాలని రాజగోపాల్రెడ్డి ఆదేశించారు. -
శివన్నగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
మర్రిగూడ : శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చొరవతో మంజూరైన 54 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ పీడీ రాజ్కుమార్ బుధవారం శివన్నగూడెంలో పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు ఇప్పటివరకు తమకు ఎలాంటి ఇంటి బిల్లులు అందలేదని ఆయన పీడీ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి బిల్లులు అందేలా చూస్తానని పీడీ వారికి భరోసా కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూన ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట డీఈ అబ్దుల్వాజిద్, ఎంపీడీఓ జి.చినమునయ్య, ఏఈ ఈశ్వర్ తదితరులు ఉన్నారు. -
ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లుగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఇంటర్ కీలకమని ఈ దశలో భవిష్యత్ నిర్ణయమవుతుందని తెలిపారు. భవిష్యత్లో కృత్రిమ మేధ రంగంలో విస్త్రత అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎంసెట్ కోచింగ్ మెటీరియల్ విద్యార్థులకు అందిస్తామన్నారు. కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని ఆదివారంలోగా కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని కమిషనర్కు సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్డీఓ అశోక్రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ పాల్గొన్నారు -
పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి
నల్లగొండ టౌన్ : మొబైల్ యాప్ ద్వారా యూ రియా పంపిణీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని కోరుతూ రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ చంద్రశేఖర్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన యాప్ ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు వివరించారు. అనేక మంది రైతులకు స్మార్ట్ ఫో న్లు లేవని, ఉన్న రైతులకు యాప్పై అవగాహన లేదన్నారు. యాప్ నిబంధనలు తీసి వేసి రైతులకు ఎప్పటిలా పాత పద్ధతిలో యూరియా అందించాలని కోరారు. లేకపోతే పంట దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్పై అవగాహననల్లగొండ టౌన్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోని దీప్తి గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థినులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్పీవీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ జయకుమారి, లెక్చరర్లు పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలినల్లగొండ : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను వారు ప్రారంభించి మాట్లాడారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పైచదువులకు వెళ్లడానికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఖమ్మంపాటి శంకర్, మమత, కిరణ్, అశోక్రెడ్డి, ఆకారపు నరేష్, తారాసింగ్, రమ్య, శ్రీకాంత్, అక్బర్, అజయ్, భరత్, విఘ్నేష్, కుర్ర సైదానాయక్, కుంచం కావ్య, రమేష్, బుడిగ వెంకటేష్, మారుపాక కిరణ్, స్పందన, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష పరిజ్ఞానంతో ఆత్మవిశ్వాసంనల్లగొండ టూటౌన్ : ఆంగ్ల భాష పరిజ్ఞానంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఆయన బుధవారం నల్లగొండలోని ఎంజీయూలో ఇంగ్లిష్ లాంగ్వెజ్ ట్రైనింగ్ సెంటర్కు ఇన్చార్జి డైరెక్టర్గా దండా రవీందర్రెడ్డికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల పరిజ్ఞానంతో విద్యార్థులు మెరుగైన అవకాశాలను అందుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆంగ్ల విభాగ అధిపతి అరుణప్రియ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల అంజిరెడ్డి పాల్గొన్నారు. పాఠశాలల తనిఖీచండూరు : చండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాఽధికారి బొల్లారం భిక్షపతి బుధవారం తనిఖీ చేశారు. చండూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, కేజీబీవీ, చండూరు ప్రాథమిక పాఽఠశాలలను పరిశీలించిన ఆయన విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధిందించాలని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగించి విషయ బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు. కేజీబీవీలో బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఆహార పదార్థాలను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. -
పంటల సర్వేకు వలంటీర్లు
నల్లగొండ అగ్రికల్చర్ : పంటల డిజిటల్ సర్వే కోసం వలంటీర్లను నియమించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి.. జిల్లా వ్యవసాయ శాఖకు ఉత్తర్వులను జారీ చేశారు. వ్యవసాయ డిగ్రీ, డిప్లొమో, సైన్స్ గ్రాడ్యుయేట్ ఇతర డిగ్రీలు ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు లేకుంటే ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని నియమించాలని వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈఓ)లకు ఆదేశాలు ఇచ్చింది. వలంటీర్లు ఆయా గ్రామాలకు చెందిన స్థానికులై ఉండాలని అందులో పేర్కొంది. 45 రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించింది. అయితే రెండేళ్ల క్రితమే ఏఈఓలకు డిజిటల్ సర్వే చేయాలని బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నందున సక్రమంగా సర్వే నిర్వహించలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల నమోదును ప్రైవేట్ వలంటీర్ల ద్వారా చేయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. శిక్షణ అనంతరం సర్వే.. జిల్లా వ్యాప్తంగా 140 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 564 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే కెడస్ట్రల్ మ్యాప్ (భూభారతి మ్యాప్) కలిగి ఉన్న 495 గ్రామాల్లో పంటల సర్వేకు వలంటీర్లను నియమించనున్నారు. మిగతా గ్రామాల్లో ఏఈఓలే పోర్టల్ ద్వారా సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆయా క్లస్టర్ల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వలంటీర్ల నియామక ప్రక్రియ ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతోపాటు డిజిటల్ సర్వేపై అవగాహన కలిగి ఉన్న వారిని ఈ నెల 20వ తేదీ వరకు వలంటీర్లుగా నియమించి అనంతరం వారికి ఒకటి రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి నెలాఖరు వరకు సర్వే ప్రారంభించాలని జిల్లా వ్యవసాయ శాఖ యోచిస్తోంది. 5.66 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగిలో 5.66 లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 5.44 లక్షల ఎకరాలు, వేరుశనగ ఇతర పంటల సాగు మరో 22 వేల ఎకరాల్లో సాగు చేశారు. పంటలను పూర్తి స్థాయిలో వలంటీర్ల డిజిటల్ సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఈ నెల 20 వరకు వలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తికా గానే వారికి శిక్షణ ఇస్తాం. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోనే యాసంగి పంటల సాగుపై డిజిటల్ సర్వేను ప్రారంభించనున్నాం. ఇప్పటికే కొందరు వ్యవసాయ విస్తరణ అధికారులు వలంటీర్ల నియామకంపై ఇప్పటికే దృష్టి సారించారు. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓఫ గ్రామానికి ఒకరి చొప్పున నియామకం ఫ ఏఈఓలకు ఎంపిక బాధ్యతలు ఫ ఉత్తర్వులు జారీచేసిన వ్యవసాయ శాఖ ఫ ఇప్పటికే నియామక ప్రక్రియ షురూ.. ఫ నెలాఖరులో సర్వే ప్రారంభించే అవకాశం వ్యవసాయ క్లస్టర్లు 140 రెవెన్యూ గ్రామాలు 564 భూభారతి మ్యాప్ కలిగిన గ్రామాలు 495 జిల్లాలో 5.66 లక్షల పంటల సాగు ఎకరాలుఒక్కో నమోదుకు ఏడు రూపాయలు.. ఎంపికై న వలంటీర్లకు మొబైల్ యాప్ ద్వారా వారికి పంటల నమోదుపై జిల్లా వ్యవసాయ శాఖ శిక్షణ ఇవ్వనుంది. పంటల డిజిటల్ సర్వే చేసే వలంటీర్లకు ఒక్కో డిజిటల్ నమోదుకు ప్రభుత్వం ఏడు రూపాయల చొప్పున చెల్లించనుంది. డిజిటల్ సర్వేలో భాగంగా రైతు డిజిటల్ ఫొటో, భూమి విస్తీర్ణం, ఏ విస్తీర్ణంలో ఏయే పంటలు సాగు చేశారు, రైతు ఫోన్ నంబర్ను డిజిటల్ సర్వేలో నమోదు చేయనున్నారు. -
పార్కులను మోడల్గా తీర్చిదిద్దుతాం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నగరంలోని పార్కులను మోడల్గా తీర్చిదిద్ది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్న పార్కులకు దీటుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 38, 41 డివిజన్లలో రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన.. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, తాగునీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని.. శానిటేషన్ మెరుగు పరిచేందుకు ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. నగరంలో రౌడీయిజం, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, కమిషనర్ శరత్చంద్ర, ఆర్డీఓ అశోక్రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్రెడ్డి, బోయినపల్లి వేదశ్రీ శ్రీనివాస్, బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పదేళ్లలో నల్లగొండ ఇండస్ట్రియల్ హబ్ పది సంవత్సరాల్లో నల్లగొండ ఇండస్ట్రియల్ హబ్గా తయారు కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పార్కుల అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అమరావతి మీదుగా బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రూ.20 వేల కోట్లతో చేపడుతున్నారని, ఆ హైవే వెంటే బుల్లెట్ ట్రైన్ కూడా వేయబోతున్నారని, దీంతో నల్లగొండ జిల్లా భవిష్యత్లో ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుందన్నారు. రెండేళ్లలోనే నల్లగొండలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నల్లగొండలో కాలుష్యం బారిన పడకుండా పార్కులను అభివృద్ధి చేసి గ్రీనరీని పెంచాలని నిర్ణయించామన్నారు. నల్లగొండ కార్పొరేషన్ను సూపర్ స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీలగిరిలో పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
ఘనంగా కేసీఆర్ జన్మదినం
నల్లగొండ టూటౌన్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కేక్ కట్చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అకుంఠిత దీక్షతో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, మాలె శరణ్యారెడ్డి, చెరుకు సుధాకర్, చీర పంకజ్యాదవ్, నిరంజన్వలి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, కరీంపాషా, కంచనపల్లి రవీందర్రావు, బోనగిరి దేవేందర్, దేప వెంకట్రెడ్డి, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, మారగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ సిటీపై కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండలో స్మార్ట్ సిటీ పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. మరుసటి రోజు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెల్లవారుజాము 4 గంటల నుంచే నగరంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం బజార్లో ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చేందుకు దగ్గరుండి డివైడర్లను తొలగింపజేశారు. గుట్టలు ఎక్కి పరిశీలన మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజాము 4 గంటలకే లతీఫ్సాహెబ్గుట్ట, బ్రహ్మంగారిగుట్ట పైకెక్కి పట్టణ వ్యూను పరిశీలించారు. ఆ తర్వాత మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో పాటు పోలీసులతో ప్రకాశంబజార్ చేరుకున్నారు. ప్రకాశంబజార్లోని డివైడర్ మధ్యలో చిరు వ్యాపారం చేయడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన డివైడర్ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జేసీబీలను రప్పించి అక్కడే ఉండి డివైడర్లను తొలగించడంతో పాటు మట్టిని వెంటనే తొలగించి సాయంత్రంలోగా రోడ్డును వేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ వ్యాపారం చేసుకునే వారికి పక్కనే ఉన్న పాత కలెక్టరేట్ స్థలాన్ని ఇవ్వాలని సూచించారు. దీంతో అధికారులు వెంటనే ప్రకాశంబజార్ ఎక్బాల్ మీనార్ నుంచి మైసయ్య విగ్రహం వరకు ఉన్న డివైడర్లను తొలగించారు. ప్రకాశంబజార్లో తొలగించిన డివైడర్ల స్థానంలో యథావిధిగా రోడ్డు వేస్తున్నారు. రూ.20 కోట్లతో అండర్గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టు ప్రకాశంబజార్ ఎక్బార్ మీనార్ నుంచి డివైడర్ తొలగించిన ప్రాంతం గుండా మైసయ్య విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా గొల్లగూడ అవుట్డోర్ స్టేడియం వరకు రూ.20 కోట్లతో అండర్గ్రౌండ్ కేబుల్ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారి ఖాదర్ వద్ద రూ.30 వేలు పెట్టి పండ్లు కొనుగోలు చేసి అక్కడ పంపిణీ చేశారు. రోడ్డు వెడల్పు వల్ల రద్దీ తగ్గుతుందన్నారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరగనీయమని.. వారిని కాపాడుకునే బాధ్యత తనదేనని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ప్రకాశం బజారులో డివైడర్ను తొలగిస్తున్న జేసీబీ, డివైడర్ తొలగించిన చోట వేస్తున్న రోడ్డుప్రకాశం బజారులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ తాను పేదల మనిషినని, చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా వారు వ్యాపారం చేసుకునేలా పాత కలెక్టరేట్లో స్థలం కేటాయిస్తున్నామని చెప్పారు. చిరు వ్యాపారులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. 70 మంది చిరు వ్యాపారులు డివైడర్పై వ్యాపారం నిర్వహిస్తున్నారని వారికి 50 నుంచి 100 గజాల స్థలం కేటాయిస్తున్నామన్నారు. ప్రకాశంబజార్ నల్లగొండకు గుండెకాయ లాంటిదని, అక్కడ వ్యాపారం పెరగడంతో పాటు రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్నయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పాత కలెక్టరేట్లో ఉన్న డీసీఎం వాహనాల పార్కింగ్ను మునుగోడు రోడ్డులోని హౌసింగ్ బోర్డుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫ నీలగిరిలో తెల్లవారుజామున 4 గంటల నుంచే మంత్రి కోమటిరెడ్డి పర్యటన ఫ ప్రకాశం బజారులో డివైడర్ను దగ్గరుండి కూల్చి వేయించిన మంత్రి ఫ చిరు వ్యాపారులకు పాత కలెక్టరేట్ స్థలం కేటాయించాలని ఆదేశాలు ఫ నగర పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటిరోజే విస్తరణ పనులకు శ్రీకారం -
సౌర విద్యుత్కు రూ. 944 కోట్లు మంజూరు
హాలియా : తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 944 కోట్లను కేటాయించిందని టీజీఎస్పీడీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ వెల్లడించారు. మంగళవారం హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సౌర విద్యుత్ వినియోగంపై అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 81 గ్రామాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని, మొదటగా కొండారెడ్డిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అనుముల గ్రామాన్ని సోలార్ విద్యుదీకరణకు ఎంపిక చేశామని, దానికి గృహ జ్యోతి విద్యుత్ వినియోగదారులకు రెండు కిలో వాట్స్ సోలార్ ప్యానల్ బిగిస్తామని చెప్పారు. అనుముల మండలంలో 605 మంది విద్యుత్ వినియోగదారులకు ఈపథకం వర్తించనుందన్నారు. 7.5 కిలో మీటర్ల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అమర్చనున్నామని చెప్పారు. అనుముల గ్రామానికి పూర్తిస్థాయి సౌర విద్యుత్ను అందించేందుకుగాను రూ.44.94 కోట్లు మంజూరు చేసిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, టీఎస్ రెడ్కో అధికారి అనిలా, మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్లు చంద్రశేఖర్రెడ్డి, అంకతి సత్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌనీ రాజా రమేష్యాదవ్, ఏడీఈ తిరుపతయ్య, ఏఈ ధనుంజయ, పాండురంగ తదితరులు ఉన్నారు. అధికారులతో సమీక్ష నల్లగొండ : నల్లగొండలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో టీజీఎస్పీడీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ సమీక్షించారు. అనుముల, కంగాల్, ముదిగొండ గ్రామాల్లో సుమారు 15 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.97.39 కోట్లు వ్యయం చేయనున్నాన్నారు. మోడల్ సోలార్ గ్రామాలపై మార్గదర్శకాలు వివరించారు. ఫ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ -
ఎంజీయూ విద్యార్థులకు వీసీ అభినందన
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పలువురు విద్యారుథలను అభినందించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్లోని తెలుగు శాఖకు చెందిన విద్యార్థులు లింగరాజు, నవ్య యూజీసీ నిర్వహించిన జాతీయ అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచారు. శ్రీధర్, అంజి, జగన్, ఎస్కె.సనా, ప్రశాంత్, మల్లేపల్లి, మమత పీహెచ్డీలో ప్రవేశం పొందడానికి అర్హత సాధించారు. 21వ శతాబ్దపు సీ్త్రల సాహిత్యం సమాలోచన అనే అంశంపై కర్నూల్లో నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో పత్ర సమర్పణ చేసిన విద్యార్థులు మంద స్నేహిత, ధరంసోత్ లలిత, ఏపీలో నిర్వహించే అంతర్జాతీయ రచయితల మహాసభలకు కాట్రావత్ గణేష్ ఎంపికయ్యారు. వీరిని వీసీ అభినందించి.. సాహిత్య, సృజన రంగాల్లో నిరంతరం కృషి చేస్తూ విశ్వవిద్యాలయానికి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో అరుణ ప్రియ, మ్యాతరి ఆనంద్, మద్దిరాల సత్యనారాయణరెడ్డి, అనితకుమారి, అనిల్కుమార్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలినల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కష్టపడేతత్వం అలవర్చుకోవాలినల్లగొండ టూటౌన్ : విద్యార్థులు మొదటి నుంచే కష్టపడేతత్వం అలవరుచుకోవాలని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలో సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మాట్లాడారు. ఫుట్బాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, నెట్బాల్ క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్ఓ అక్బర్అలీ, బొమ్మపాల గిరిబాబు, పుల్లయ్య, బయన్న, కిరణ్ కుమార్ ఉన్నారు. యూరియా అందుబాటులో ఉందిమిర్యాలగూడ : జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రవణ్కుమార్ అన్నారు. మంగళవారం దామరచర్ల రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సంబందిత 13బీ లేదా వన్ బీ జిరాక్స్ కాపీలను, ఆధార్ లేకుండా సాగుచేసే వాళ్లు గ్రామ పరిపాలన అధికారి, ఏఈఓలను సంప్రదించి ఆన్లైన్ చేసుకుని యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్, ఏఓ రుషేంద్రమణి, ఏఈఓ పార్వతి, సైదులు, సీఈఓ వెంకట్రెడ్డి, రైతులు శ్యాంసుందర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
సాగర్డ్యాం భద్రతపై ఇంటెలిజెన్స్ సమీక్ష
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై మంగళవారం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు.. ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. సాగర్లోని విజయవిహార్ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టు భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు, భవిష్యత్లో తీసుకోవాల్సిన అదనపు భద్రత చర్యలపై చర్చించారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు, సీసీ కెమెరాల నిఘా బలోపేతం, సందర్శకుల నియంత్రణ వంటి అంశాలపై ప్రధానంగా సమీక్ష సాగినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్వహణ, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతరం అధికారులు జెన్కో కార్యాలయంలో విద్యుదుత్పత్తి విభాగానికి సంబంధించిన భద్రత, నిర్వహణలపై కూడా సమీక్షించారు. సమీక్ష సమావేశం అనంతరం పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. డ్యాం సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ హీరాలాల్నాయుడు, సీఐ సునీల్కుమార్, ఈఈ సీతారాం, డీఈ అశోక్, భద్రత అధికారి శ్రీనివాసరావు, ఏఈలు సత్యనారాయణ, విజయ్ ఉన్నారు. -
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా.. ఏకశిఖరవాసుడిగా.. పంచనారసింహుడిగా.. స్తంభోద్భవుడిగా.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీన ఫాల్గుణ శుద్ధ ద్వాదశి శనివారం రోజున శృంగార డోలోత్సవంతో ముగియనున్నాయి. 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారం, సంప్రదాయ రీతిలో ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయానికి తాత్కాలికంగా విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలు, పూలతో ముస్తాబు చేశారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొననున్నారు. విష్వక్సేన ఆరాధనతో.. యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10గంటలకు శ్రీవిశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై, ఈ నెల 28వ తేదీన ఉదయం శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో సమాప్తం అవుతాయి. 24న శ్రీస్వామి ఎదుర్కోలు ఉత్సవం , 25న తిరు కల్యాణోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి అలంకార సేవలు, వాహన సేవలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. 11 రోజులు ఆర్జిత సేవలు రద్దు.. బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆలయంలో భక్తులచే నిర్వహించే వివిధ ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. 24 నుంచి 26 వరకు భక్తులచే సాయంత్రం నిర్వహించే సహస్రనామార్చనలు, భోగములు రద్దు చేశారు. 27న నిర్వహించే లక్ష పుష్పార్చన పూజలను సైతం నిలిపివేస్తారు. 27 నుంచి 28వ తేదీ వరకు భక్తులచే జరిపించే అభిషేకం, అర్చనలు రద్దు చేశారు.నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫ విష్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్న అర్చకులు ఫ 24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం ఫ 28న శృంగార డోలోత్సవంతో ముగింపు -
చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి లక్షపుష్పార్చన నిర్వహించారు. అమావాస్య రాత్రి నిద్ర చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈఓ మోహన్బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ పూజలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎస్ఐ విష్ణుమూర్తి గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. -
పాలనలో దక్షత చూపాలి
నల్లగొండ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదకు అందించేందుకు పాలనలో దక్షతను చూపాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రొబేషనరీ గ్రూప్–1 అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. నల్లగొండ అతిపెద్ద జిల్లా అని, 566 రెవెన్యూ గ్రామాలు, 869 గ్రామపంచాయతీలు ఉన్నాయని వివరించారు. అధికారులు వారి శిక్షణలో భాగంగా గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమైన పారామీటర్స్పై నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేసి భవిష్యత్లో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ శిక్షణ భవిష్యత్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఎంసీహెచ్ఆర్డీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. నల్లగొండ : పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్ ఎస్డీఎస్, ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజిషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టుల, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని విభాగాల వారీగా పరిశీలించి, భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపులు వంటి అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..
హాలియా : పెద్దవూర మండలం బట్టుగూడెంలో శివరాత్రి ఉత్సవాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని వస్తూ రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. ఈ సంఘటన హాలియా పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ సతీష్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల వెంకటయ్య (50), పిట్టల మల్లమ్మ (45) ఇరువురు భార్యభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరి వివాహాలు కావడంతో మూడేళ్ల క్రితం అనుముల మండలం కొట్టాల గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చారు. గ్రామంలో తమ పేర ఉన్న రెండు ఎకరాలకుతోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దవూర మండలం బట్టుగూడెంలో జరిగిన శివరాత్రి ఉత్సవాలను చూసేందుకు మంగళవారం ఉదయం భార్యభర్తలు ఇద్దరు టీవీఎస్ వాహనంపై వెళ్లారు. శివాలయంలో స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం ఈ దంపతులు సాయంత్రం కొట్టాలకు బయలుదేరారు. మార్గమధ్యలో హాలియా సమీపంలోని ఎడమ కాల్వ బ్రిడ్జిపై వీరి ద్విచక్ర వాహనాన్ని పెద్దవూర నుంచి హాలియా వైపు వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. వాహనంపై నుంచి భార్యభర్తలు ఇరువురు రోడ్డుపై పడడంతో లారీ డ్రైవర్ చూసుకోకుండా వారి మీదనుంచి లారీని పోనిచ్చాడు. దీంతో భార్యభర్తల ఇద్దరి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ సతీష్రెడ్డి, పోలీస్ సిబ్బందితో ఘటన స్థలం వద్దకు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సాగర్ కమలానెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కట్టంగూర్ శివారులో జార్ఖండ్ వాసి మృతికట్టంగూర్ : కట్టంగూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లా జార్గో మండలం దానుముండా గ్రామానికి చెందిన బెలాసి సాధికా ముండా(26) తన భార్య బెలాసి కుమారితో కలిసి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు ఈ నెల 16 మధ్యాహ్నం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కట్టంగూర్ గ్రామ శివారులోకి రాగానే సాధికా ముండా బస్సు డ్రైవర్ వద్దకు వెళ్లి మూత్రం పోసివస్తానని చెప్పి కిందికి దిగి బస్సు వెనకవైపునకు వెళ్లి రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎం కంటెనయిర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం టైర్ల కింద పడిన సాధికా ముండా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిడికి అదే గ్రామానికి చెందిన కుమారితో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కాగా మృతుడు ఆరేళ్లుగా చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య బెలాసి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. ఫ శివాలయానికి వెళ్లివస్తున్న భార్యభర్తలను ఢీకొట్టిన లారీ ఫ అక్కడికక్కడే మృతిచెందిన దంపతులు ఫ హాలియా పట్టణంలో ఘటన -
నాటి భక్తోత్సవాలే.. నేటి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతంత్య్రానికి ముందే స్థానికులు మూడ్రోజులుగా భక్త్త్సోవాలు నిర్వహించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. శ్రీస్వామి వారిపై నమ్మకంతో భక్తులు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పూర్వం కాలంలో ఘాట్ రోడ్డు లేక, మెట్లదారి కూడా అంతంతే ఉండటంతో భక్తోత్సవాలకు వచ్చే భక్తులు కొండ ఎక్కేందుకు నానా ఇక్కట్లు పడేవారు. అయితే ఈ ప్రాంత వాసులు శ్రీస్వామిని ఆరాధించేందుకు ఎలాగో కొండెక్కేవారట. ఉత్సవాలు జరిపేందుకు ఉత్సాహాన్ని కనబర్చేవారని పూర్వీకులు చెబుతారు. ఈ క్రమంలో అప్పట్లో తొలుత మూడు రోజులు ఉత్సవాలను నిర్వహించారు. కీకారణ్యం, వసతులు లేని కాలంలో (సుమారు 1895) ప్రాంతంలో ఆ ఉత్సవాలు జరిగాయి. అప్పట్లో భక్తులు నిర్వహించవారు కాబట్టి.. వాటిని భక్తోత్సవాలనేవారు. కొన్నేళ్లు గడిచాక ఐదు రోజులకు పెంచారు. అయితే మార్గశిర మాసంలో ఆ సంబురాలు జరిగేవి. ఆ కాలంలో శ్రీస్వామి ఉత్సవాలు జరపడం సబబుకాదంటూ అప్పట్లోనే పూజారులు కొందరు ఫాల్గుణ మాసంలో 11 రోజుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లోనే హైదరాబాద్, మహబూబ్నగర్, మహారాష్ట్ర, వరంగల్ వంటి ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా ఈ క్షేత్రానికి వచ్చేవారని పాతతరం వారు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక అప్పటి ఆలయ కమిటీ పెద్దలు ఆచార్యులతో సంప్రదించి 1955లో 11 రోజుల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి శ్రీస్వామి బ్రహ్మోత్సవాలు నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి. ఏటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఎందరినో ప్రముఖులను స్వాగతిస్తున్నారు. యాదగిరిగుట్ట : యాదవ మహర్షి ఘోర తపస్సుతో యాదగిరిగుట్టలోని కొండ గుహల్లో వెలసిన పంచనారసింహుడి క్షేత్రం దినాదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు కింకారణ్యం గుట్టలో వెలసిన శ్రీస్వామికి భక్తులు నిత్యం పూజలు చేస్తుండే వారు. హైదరాబాద్ వాస్తవ్యులు రాజామోతీలాల్ 1920లో శ్రీస్వామికి ఆగమశాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి క్షేత్రం అభివృద్ధికి బాటలు వేశారని చరిత్రకారులు చెబుతారు. ఆ తరువాత ప్రభుత్వాల తోడ్పాటుతో క్షేత్రం అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అప్పటి సీఎం కేసీఆర్ చొరవతో యాదాద్రి క్షేత్రాన్ని కనీవిని వెరుగని రీతిలో ఆలయ పునర్నిర్మాణం చేసి 2022 మార్చి 28న ప్రధానాలయాన్ని మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన కార్యక్రమం చేయించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో గతేడాది క్షేత్రంలోని విమాన గోపురానికి 65 కిలోల బంగారంతో తాపడం చేసి శ్రీస్వామి వారికి అంకితమిచ్చారు. ఫ పూర్వ కాలంలో మూడు రోజులే ఉత్సవాల నిర్వహణ ఫ 1955 నుంచి 11 రోజుల ఉత్సవాలకు శ్రీకారం -
క్షతగాత్రులను చూసి.. కాన్వాయ్ ఆపి..
చిట్యాల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను చూసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వారి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి–65పై మంగళవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శాలిగౌరారం మండలం బైరవునిబండకు చెందిన రమేష్ తన వ్యక్తిగత పనిమీద చిట్యాల మండలం గుండ్రాంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలోని హోటల్లో టిఫిన్ చేసిన అనంతరం హైవే దాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట్ అనే యువకుడు బైక్పై హైదరాబాద్ వైపునకు వెళ్తూ ప్రమాదవశాత్తు రమేష్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదంలో క్షతగాత్రులయిన రమేష్, వెంకట్ రహదారిపైనే పడి ఉన్నారు. ఇదే సమయంలో నల్లగొండలో పర్యటన ముగించుకుని తన కాన్వాయ్తో హైదరాబాద్ వెళ్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గమనించి క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి వారిని చికిత్స నిమిత్తం చౌట్టుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రితోపాటు ఆయన గన్మెన్లు రహదారిపై ట్రాఫిక్జామ్ కాకుండా క్లీయర్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిని ఎనిమిది వరుసలుగా విస్తరించేందుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఫ గుండ్రాంపల్లిలో రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి ఫ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించి ఆస్పత్రికి తరలించిన మంత్రి -
జేఈఈ మెయిన్స్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేట టౌన్ : జేఈఈ మెయిన్స్–2026 పరీక్ష ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాలకు చెందిన 23 మంది విద్యార్థులు ఆలిండియా స్థాయిలో 90, ఆపైన పర్సంటైల్స్ సాధించారని కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం జయ జూనియర్ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. కళాశాలకు చెందిన జి.శ్రీనిక 99.39 పర్సంటైల్స్, ఎం.రితిన్శెట్టి 99.23, సీహెచ్.శివకుమార్ 99.09, ఎన్.సాయిరిత్విక్ 98.84, ఎస్కె.నేహ 98.57, ఎస్.అషువర్థన్రెడ్డి 98.42, ఎండి.హాదియ 96.96, జి.వంశీ 96.09, జి.హర్షిత 95.92, వి.గౌతమ్కుమార్ 95.71, డి.సిరి 95.39, బి.నవనీత 94.07, ఎం.హర్షిత 93.95, ఎం.నవ్యశ్రీ 93.91, ఆర్.మేఘరాజ్ 93.61, వై.హరీనశర్మ 92.48, ఎన్.హారిని 91.92, జి.మనోవర్షిత 91.90, బి.జ్ఞానసాయి 91.50, పి.అభివన్రెడ్డి 90.95, ఎ.నాగనక్షత్ర 90.63, కె.శ్లేష్మ 99.01, సీహెచ్.తరుణ్తేజ్ 90.02తో పాటు 23 మంది విద్యార్థులు 90 పైన పర్సంటైల సాధించినట్ట చెప్పారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్తోపాటు డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నారసింహుడికి సమర్పించే పట్టు వస్త్రాల పరిశీలన
భూదాన్పోచంపల్లి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు సమర్పించనున్న పట్టు వస్త్రాలను మంగళవారం యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పట్టు వస్త్రాలను పరిశీలించడానికి వచ్చామని పేర్కొన్నారు. రెండు పట్టుచీరలు, పట్టుపంచెలు.. పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఏటా శ్రీలక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అమ్మవారికి తంగేడుపూల రంగు, ప్యాక బంగారువర్ణం, ముద్దమందారం డిజైన్లో వంకాయ రంగు కలిగిన అంచు, జరీ బార్డర్ పాన్పటోలా కాంబినేషన్ చీర, మరొక చీర గులాబీలో ఎరుపురంగు బాడీలో తీగతో కూడిన మల్లెపూల డిజైన్, వంకాయ అంచు, జరీ బార్డర్లో కొత్త కాంబినేషన్లో రెండు చీరలను తయారు చేశామని అన్నారు. స్వామివారికి సమర్పించేందుకు రెండు పట్టు పంచెలు, రెండు శాలువాలను 15 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో మగ్గంపై తయారు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు భోగ నర్సింహ, అంకం మురళి, ప్రధానకార్యదర్శి భారత బాలరత్నం, సహాయ కార్యదర్శి కడవేరు చంద్రమౌళి, కోశాధికారి సంగెం చంద్రయ్య, సభ్యులు గంజి అంజయ్య, గుండు పాండు, కర్నాటి అంజమ్మ, తడక యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్య
నిడమనూరు : అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరుకు చెందిన పసుపులేటి కొండలు(45) తన భార్యతో కలిసి హాలియాలో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హోటల్ నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హాలియాలోని హోటల్ నుంచి నిడమనూరులోని ఇంటికి వచ్చిన కొండలు రాత్రి ఇంటి లోపల పడుకున్నాడు. తమ్ముడు శ్రీనివాస్ ఇంటి బయట నిద్రించాడు. తెల్లవారుజామున శ్రీనివాస్ తన అన్న కొండలును హోటల్కు వెళ్లవా అన్న అంటూ నిద్ర లేపగా కొంచెం సేపు పడుకుని పోతానని సమాధానం చెప్పాడు. అనంతరం శ్రీనివాస్ తెల్లవారుజామున సుమారు 5గంటల సమయంలో మరోసారి కొండలును లేపడానికి వెళ్లగా అప్పటికే కొండలు ఇంటిలోని ఇనుప పైపుకు ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య రమణ ఫిర్యాదుతో ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, పదేళ్లలోపు వయస్సు గల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి కోదాడ రూరల్ : చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ చెరువులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన వంగవీటి జయకృష్ణ(40) హైదరాబాద్లోని ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట ఇంటికి వచ్చిన అతను మంగళవారం ఉదయం బయటకు వెళ్తున్నాని చెప్పి చెరువులో శవమై తేలాడు. గేదెల కాపారులు గమనించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బటయకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి గొంతుపై కత్తిగాట్లు ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మృతుడు గత కొంతకాలంగా మానసిక ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. పురుగుల మందు తాగిన యువకుడు మృతి డిండి : పరుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం డిండిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం చండూరు మండలం శ్యామలపల్లికి చెందిన ఎన్.శ్రీశైలం(30)కు డిండికి చెందిన గిరమోని సంధ్యారాణితో వివాహమైంది. నాలుగేళ్లుగా శ్రీశైలం డిండిలోని ఓ రైస్ మిల్లులో మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి శ్రీశైలం తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. దీంతో ఈనెల 16న శ్రీశైలం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య సంధ్యారాణి కుటుంబ సభ్యులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి తీసుకపోగా అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీశైలంను హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అతడు మృతి చెందాడు. భార్య సంఽంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పామని ఎస్ఐ.బాలకృష్ణ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
చెట్ల పొదల్లో నవజాత శిశువు
కోదాడ రూరల్ : ఆడబిడ్డ భారం అనుకున్నారో.. లేక మరేదో కారణమో తెలియదు కానీ ఓ నవజాత శిశువును చెట్ల పొదల్లో వదిలి పేగుబంధం తెచ్చుకుంది ఓ తల్లి. ఈ అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుడిబండ గ్రామానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ పొలంలో కూలీలు కలుపు తీసేందుకు వెళ్లగా రోడ్డుకు కొద్దిదూరంలో చెట్ల పొదల్లోనుంచి ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. వారు ఎదురుగా ఉన్న ఇంటి వారితో కలిసి అక్కడకు వెళ్లి చూడగా నుదిటిపై స్వల్పగాయంతో ఓ ఆడశిశువు కనిపించింది. వారు ఆ శిశువును దగ్గరకు తీసుకొని పాలుపట్టించి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. గ్రామ కార్యదర్శికి, ఐసీడీఎస్, వైద్య సిబ్బందికి విషయాన్ని తెలిపి అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ శిశవును చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు శిశువు జన్మించి 24 గంటలు అవుతుందని నుదిటిపై ఉన్న గాయాన్ని బట్టి చూస్తే మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో అక్కడ వదిలి ఉండవచ్చని, శిశువు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. నుదిటిపై గాయం, పొట్టపై చారలు ఉండటంతో రెండు రోజుల వైద్య చికిత్సకోసం సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నల్లగొండలోని శిశుగృహలో అప్పగిస్తామని ఐసీడీఎస్ నిర్వాహకులు తెలిపారు. కుక్కలు తిరిగే ప్రదేశంలో వదిలి.. పసికందును వదిలివెళ్లిన ప్రదేశంలో పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతుంటాయి. గ్రామ శివారు కావడంతో చికెన్ వ్యర్థాలతో పాటు గ్రామంలోని చెత్తాచెదారం కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు వెంటనే పడేస్తుంటారు. వాటిని తీనేందుకు అక్కడ కుక్కలు గుంపులుగా తిరుగుతూ రోడ్డుపై వెళ్లే వారివెంట కూడపడుతుంటాయి. అలాంటి ప్రదేశంలోనే ఆ పసికందును వదిలి వెళ్లారని కుక్కలు చూస్తే దారుణం జరిగేదని గ్రామస్తులు అంటున్నారు. ఫ ఆడ శిశువును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ఫ కోదాడ మండలం గుడిబండ శివారులో ఘటన -
మార్మోగిన శివనామస్మరణ
నార్కట్పల్లి : మహాశివరాత్రి సందర్భంగా ఆది వారం నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహిళలు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. అనుమానాస్పదంగా ఆలయంలో సంచరించే వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలను పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, సర్పంచులు నేతగాని కృష్ణ, ఉప్పల వెంకట్రెడ్డి, యేల్లేందుల లింగస్వామి, నాయకులు వడ్డే భూపాల్రెడ్డి, వరాల రమేష్, రేగట్టే నవీన్రెడ్డి, గడుసు శశిధర్రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, పశుపతి, ప్రజ్ఞాపురం సత్తి, సంపత్, లింగస్వామి, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా చెర్వుగట్టుకు భారీగా తరలివచ్చిన భక్తులు కిటకిటలాడి క్యూలైన్లు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేసిన పోలీసులు -
అభిషేక ప్రియుడికి శత రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహా శివుడికి, ముఖ మండపంలోని స్పటిక లింగానికి, ప్రథమ ప్రాకార మండపంలోని మహా శివుడికి ఉదయం భక్తులచే అభిషేకాలు జరిపించిన పూజారులు.. రాత్రి లింగోద్భవ కాలంలో శత రుద్రాభిషేకం జరిపించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విశేష పూజలు జరిపారు. బ్రాహ్మణోత్తములచే నిత్య హవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, వివిధ పారాయణములు నిర్వహించారు. మహాశివుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేశారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ప్రధానార్చకులు, పారాయణీకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కొండపైన ప్రధాన శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస్య దీక్షలను విరమించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. సాయంత్రం శివాలయం మాడ వీధుల్లో యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి సేవా సమితి, గుండ్లపల్లికి చెందిన వీరప్రతాప మారుతి భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రిచే శివ పురాణ ప్రవచనం జరిపించారు. కుమారి జ్యోతి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఒగ్గు శ్రీను బృందంచే ఒగ్గు కథ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లింది. -
ముగిసిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు
● ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే జట్టుపెద్దవూర: మండలంలోని చింతపల్లిలో దున్న ఇద్దాస్ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ప్లడ్ లైట్ల వెలుతురులో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిశాయి. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 15 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బహుమతులను అందించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.లక్షను సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు, ద్వితీయ బహుమతిని రూ.80వేలను అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ హర్యానా జట్టు, తృతీయ బహుమతి రూ.60వేలు చింతపల్లి మిషన్ ఢిల్లీ జట్టు, నాలుగవ బహుమతి రూ.50వేలు కర్నాటక జట్టు, ఐదవ బహుమతి రూ.40వేలు తెలంగాణ, ఆరో బహుమతి రూ.30వేలు ఉత్తరప్రదేశ్ జట్లు గెల్చుకున్నాయి. వీరికి నగదుతో పాటు షీల్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జటావత్ రవినాయక్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ షేక్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పేరు ఖరారు
నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొణతం చిన వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్కుమార్రెడ్డిలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆది వారం ప్రకటించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ నేరుగా హైదరాబాద్ నుంచి రానున్నారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా నల్లగొండ ఎంపీ.. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్రెడ్డి పేరు నమోదు చేసుకున్నారు. సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చైర్మన్గా కొణతం చినవెంకట్రెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్కుమార్రెడ్డిని ప్రకటించిన మంత్రి ఉత్తమ్ -
ఫాంపాండ్లో మునిగి విద్యార్థి మృతి
● మైనార్టీ గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ ● భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనభువనగిరిటౌన్: మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి వసతి గృహం సమీపంలోని ఫాంపాండ్లో ఈత కొట్టేందుకు వెళ్లి అందులో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన ఆంథోనిరాజు, దీపారాణి దంపతుల కుమారుడు బాలఆకాష్(16), మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం పాఠశాల వసతి గృహం నుంచి వారిద్దరు బయటకు వెళ్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఫాంపాండ్లో స్నానం చేసేందుకు దిగారు. లోతు అంచనా వేయలేక, ఈత రాకపోవడంతో బాలఆకాష్ ఫాంపాండ్లో మునిగిపోయాడు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ వెంటనే పాఠశాలకు వచ్చిన సిబ్బందికి విషయం చెప్పాడు. సిబ్బంది వెళ్లేసరికి అప్పటికే బాలఆకాష్ మృతిచెందాడు. మృతదేహాన్ని ఫాంపాండ్ నుంచి బయటకు తీసి భువనగిరి ఏరియా ఆస్పత్రిక తరలించారు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ అస్వస్థతకు లోనుకావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్ష రాసి వస్తాడనుకున్నాం.. తమ కుమారుడు బాలఆకాష్ మరికొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వస్తాడని అనుకున్నామని.. కానీ ఇలా విగతజీవిగా ఇంటికి తీసుకెళ్తామని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని బాలఆకాష్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు పోస్టుమార్టం చేయకూడదని పట్టుబట్టారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. జీఓ సవరించకుండా రేషనలైజేషన్ సరికాదు సూర్యాపేటటౌన్ : జీఓ నంబర్ 25ను సవరించకుండా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేయడం సరికాదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్రావు అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 60మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటం శాసీ్త్రయం కాదని, ప్రభుత్వం రకరకాల జీఓలతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూస్తోందని అన్నారు. విద్యారంగంలోకి కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడానికి గల కారణాలను శాసీ్త్రయంగా విశ్లేషణ చేయాలని, విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని, ప్రతి గ్రామంలో పాఠశాలలతో పాటు ప్రతి తరగతికి ఒక గది, ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ శాఖను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డేగల జనార్దన్, అధ్యక్షుడిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల వీరన్న, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా యోగానంద చారిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి రవిచంద్ర, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్. వెంకటేశ్వర్లు, టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రామ నరసయ్య, వీరయ్య, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వేణు తదితరులు పాల్గొన్నారు. -
ఓటు వేయలేదని బెదిరింపులు
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డులో కొందరు తమకు ఓట్లు వేయలేదంటూ ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులు, వారి మద్దతుదారులు స్థానిక అర్బన్ కాలనీకి చెందిన ఓటర్ల ఇంటి ముందు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి విజయం సాధించింది. స్వల్ప తేడాతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఓట్ల లెక్కింపు జరిగిన రోజు రాత్రి నుంచి గెలుపొందిన అభ్యర్థి మద్దతుదారులపై కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి తమకు ఓటు వేయని వారి ఇళ్ల ముందు బీరు సీసాలు పగులగొట్టడంతో పాటు తామిచ్చిన చీరలు, నగదు, ఇతర వస్తువులు తిరిగి ఇవ్వాలంటూ హెచ్చరించారు. దీంతో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన చీరలను తీసుకొచ్చి వీధుల్లో కుప్పగా పోశారు. ఈ మేరకు అర్బన్ కాలనీ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మీనరసయ్య తెలిపారు. పద్మశాలీలే లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు, బెదిరింపులను నియంత్రించాలని పద్మశాలీ సంఘం నాయకులు పోలీసులను కోరారు. ఓటర్ల ఇళ్ల ముందు బీరు సీసాలు పగలగొట్టిన ఓడిపోయిన అభ్యర్థుల అనుచరులు వారిచ్చిన చీరలు, ఇతర వస్తువులను రోడ్డుపై పడేసిన ఓటర్లు పోలీసులకు ఫిర్యాదు -
టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టిన స్కూటీ.. ఒకరు మృతి
చౌటుప్పల్ : టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ముస్కు మోహన్రెడ్డి(66) కుటుంబంతో కలిసి పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం ఉదయం టీవీఎస్ ఎక్సెల్పై స్వగ్రామంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి 11.30గంటల ప్రాంతంలో తిరిగి చౌటుప్పల్కు వస్తున్నాడు. ఈ క్రమంలో తంగడపల్లి దాటిన తర్వాత ఎర్ర స్థూపం వద్దకు రాగానే.. లింగారెడ్డిగూడేనికి చెందిన తొర్పునూరి చందు స్కూటీపై వెనుక నుంచి వేగంగా వచ్చి టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టాడు. దీంతో టీవీఎస్ ఎక్సెల్పై నుంచి మోహన్రెడ్డి ఎగిరి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. లైంగిక దాడి కేసులో వ్యక్తి రిమాండ్మర్రిగూడ: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. వివరాలు.. మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన 60 ఏళ్ల పైబడిన వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి దేవరకొండ కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు రిమాండ్కు తరలించినట్లు నాంపలి సీఐ డి. రాజు, ఎస్ఐ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు. -
మేరీమాత పుణ్యక్షేత్రం దైవ సంకల్పం
మఠంపల్లి: మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి మేరీమాత పుణ్యక్షేత్రంగా నామకరణం చేయడం దైవ సంకల్పమని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ ధమన్కుమార్ అన్నారు. ఆదివారం శుభవార్త చర్చికి వచ్చిన ఆయనకు మఠంపల్లిలో స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి, క్రైస్తవులు, చర్చికమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏప్రిల్లో జరిగే చర్చి వార్షికోత్సవాల నుంచి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందని బిషప్ ప్రకటించారు. అనంతరం ఆయన చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. క్రైస్తవులకు సత్ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు రాజారెడ్డి, అశోక్, మర్రెడ్డి, బాలరెడ్డి, బాలశౌరిరెడ్డి, అర్లారెడ్డి, మాజీ సర్పంచ్ స్రవంతికిషోర్రెడ్డి, లూర్థుమారెడ్డి, బ్రదర్ వినోద్రెడ్డి, సిస్టర్ రూబీ, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, చర్చి కమిటీ పెద్దలు ఆంథోనిరెడ్డి, జార్జిరెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, బాలరెడ్డి, కాకుమాను జోసెఫ్, తుమ్మా జోసెఫ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ బిషప్ ధమన్కుమార్ శుభవార్త చర్చిని మేరీమాత పుణ్యక్షేత్రంగా ప్రకటన -
సామిల్లు నిర్వహణ నుంచి చైర్పర్సన్గా..
ఆలేరు: నిన్నమొన్నటి వరకు ఆమె తన భర్తతో కలిసి సామిల్లు(కట్టకోత మిషన్) నిర్వహించేది. పెద్దగా రాజకీయ నేపథ్యం కూడా లేదు. కానీ మున్సిపల్ ఎన్నికల రూపంలో అదృష్టం కలిసొచ్చి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఆమెను వరించింది. ఆలేరు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్గా బీజన బాలమణి పగ్గాలు చేపట్టనున్నారు. 7వ వార్డు నుంచి బాలమణి కౌన్సిలర్గా విజయం సాధించగా.. ఆమెతో పాటు ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ రావడం, చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో బాలమణిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో సోమవారం బాలమణి చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాలమణి కుటుంబ నేపథ్యం ఇదీ..బాలమణి రాజాపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకుంది. ఆలేరుకు చెందిన బీజన భాస్కర్తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్, సాయితేజ ఉన్నారు. భర్త భాస్కర్తో కలిసి ఆమె సామిల్లు వ్యాపారం నిర్వహిస్తుందిది. బాలమణి భర్త భాస్కర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్కు స్వయానా సడ్డకుడు. ఆలేరు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ బాలమణి -
రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తా
సంస్థాన్ నారాయణపురం : రాచకొండకు పూర్వ వైభవం తీసుకొచ్చి ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. రాచకొండలో రాచప్ప సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాచకొండ పర్యాటక ఉత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాచకొండ తవ్వకాల్లో బయల్పడిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే దంపతులు జల, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచకొండ పర్యాటక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల క్రితం రాజధానిగా వెలుగొందిన రాచకొండ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికి సహకారమందిస్తానన్నారు. రాచకొండ అభివృద్ధికి కృషిచేస్తున్న రాచప్ప సమితిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమాదేవిప్రేమ్చందర్రెడ్డి, సర్పంచ్లు కాట్రోతు లక్ష్మీసాగర్, కవితరఘు, జర్పుల జగన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరెంటోతు శ్రీనునాయక్, మందుగుల బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, ఎనుముల శంకర్రెడ్డి, రాచప్ప సమితి ఆధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, కడారి అంజిరెడ్డి పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం
మోటకొండూరు: మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ పరిధిలోని శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. కంపెనీలో నత్రజని శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అయితే ఈ కంపెనీని తమ గ్రామం నుంచి తరలించాలని కాటేపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగించడానికి 2025 డిసెంబర్ 29న తాత్కాలిక అనుమతి లభించింది. కానీ 2025 డిసెంబర్ 18నే కంపెనీ యాజమాన్యం అక్రమంగా ట్రయల్స్ ప్రారంభించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక అనుమతి గడువు కూడా ఫిబ్రవరి 3తో ముగిసిందని, ప్రస్తుతం కంపెనీ నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని, ఒకవేళ ఉంటే బహిరంగంగా చూపించాలని గ్రామస్తులు సవాల్ చేస్తున్నారు. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నల్లగొండ రీజినల్ ఆఫీసర్ పరిశ్రమను సందర్శించి అన్ని నిబంధనలు పాటిస్తున్నారని నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ అక్కడ నత్రజని శుద్ధి వ్యవస్థ పనులు జరుగుతూనే ఉన్నాయి. పీసీబీ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాటేపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ పరిశ్రమపై గ్రామ పంచాయతీ అధికారులు, ఎమ్మార్వో, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఆందోళనలు.. శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ కంపెనీతో పాటు మరో టైర్ల కంపెనీల ద్వారా వెలువడే పొగ, కాలుష్యంతో పరిసర ప్రాంతంలోని రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలోనూ గ్రామస్తులు ఆందోళన చేశారు. కంపెనీ కాటేపల్లి నుంచి తరలించాలని లేదా మూసివేయాలని జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించారు. ఈ అగ్నిప్రమాదం పెద్దగై ఉంటే పక్కనే ఉన్న ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీకి మంటలు నష్టం భారీ ఎత్తున ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్ముకున్న దట్టమైన పొగ పరిశ్రమను తరలించాలని కాటేపల్లి గ్రామస్తుల డిమాండ్ -
హెచ్పీవీ టీకాలు ఎప్పుడో..!
ప్రభుత్వం నుంచి హెచ్పీవీ టీకాలు సరఫరా కాగానే బాలికలకు వాటిని వేసే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించాం. టీకాలు రాగానే వేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్వో, నల్లగొండ నల్లగొండ టౌన్ : మహిళలను వేధిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు యుక్త వయసు అమ్మాయిలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏటా వేలాది మంది యుక్త వయసు అమ్మాయిల నుంచి వృద్ధాప్యంలో ఉన్న మహిళలను క్యాన్సర్ పట్టి పీడిస్తోంది. రొమ్ము, గర్బాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడి చాలా మంది చనిపోతున్నారు. ఈ నేపధ్యంలో క్యాన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోదించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు యుక్త వయసు గల బాలికలకు (14 –15) టీకాలు వేయాలని సంకల్పించాయి. అందులో బాగంగా జిల్లాలో జనవరి మొదటి వారం నుంచి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ టీకాలను వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు హెచ్పీవీ టీకాలను వేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. కానీ ఇప్పటి వరకు జిల్లాకు హెచ్పీవీ టీకాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేదు. 20 వేల మంది అర్హులు.. హెచ్పీవీ టీకాలకు జిల్లాలోని హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న కిషోర బాలికలు (14–15 సంవత్సరాల) 20 వేల మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. టీకాలను ప్రభుత్వం సరఫరా చేసిన వెంటనే వీరందరికి టీకాలను వేయనున్నారు. ఫ యుక్త వయసు అమ్మాయిలకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం ఫ జిల్లాలో 20 వేల మంది అర్హుల గుర్తింపు ఫ టీకాల సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్లో జాప్యం -
నేడు పుర పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్, మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఉదయం 10 గంటలకు గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా మున్సిపాలిటీల ఎన్నికల అబ్జర్వర్తో పాటు ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కార్పొరేషన్తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాంపుల్లో ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతా సోమవారం నేరుగా ఎన్నికల సమావేశాలకు హాజరు కానున్నారు. సోమవారం ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు నిర్వహించనున్నారు. మేయర్గా బుర్రి చైతన్య ఎన్నిక లాంఛనమే నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 27 డివిజన్లలో విజయం సాధించింది. మేయర్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 25 కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఎన్నికలకు ముందుగానే మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి పేరును ప్రకటించడం, పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో సోమవారం మేయర్గా ఆమెను కార్పొరేటర్లంతా ఎన్నుకోనున్నారు. ఎంఐఎంలో చేరిన మొయిన్ 26వ డివిజన్కు చెందిన మాజీ కౌన్సిలర్ మొయిన్ ఈ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి టికెట్ ఆశించారు. ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో అదే డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన తల్లి గౌషియాను పోటీలో నిలిపారు. ఆమె విజయం సాధించారు. కాగా, ఆదివారం మొయిన్ హైదరాబాద్లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో తిరిగి ఆ పార్టీలోనే చేరారు. ఎమ్మెల్యేలు చెప్పిన వారికే.. జిల్లాల్లోని మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారమే చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను ప్రకటించనున్నారు. వారినే ఎన్నుకోవాలని కౌన్సిలర్లకు చెప్పనున్నారు. మున్సిపాలిటీల్లో సస్పెన్స్ ● దేవరకొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక లాంఛనమే కానుంది. చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు నుంచి పోటీ చేసిన గెలిచిన పున్న శైలజ వెంకటేష్ పేరును ఎన్నికలకు ముందుగానే ఎమ్మెల్యే బాలునాయక్ ప్రకటించారు. దీంతో సోమవారం ఆమెను ఛైర్పర్సన్గా కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. వైస్ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారన్నది తేలలేదు. సోమవారం ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే బాలునాయక్ వైస్ చైర్మన్ పేరును ప్రకటించనున్నారు. ● చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్గా 12వ వార్డు కౌన్సిలర్ పందిరి గీత పేరు ఖరారైనట్లు తెలిసింది. చైర్మన్తోపాటు వైస్ చైర్మన్ పేర్లను ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే వీరేశం చెప్పనున్నారు. ● చండూరు మున్సిపల్ చైర్మన్గా ఆరో వార్డు కౌన్సిలర్ కోడి శ్రీనివాసులు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ● మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎవరిని చేయాలన్న విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించారు. అయితే పేర్లను ప్రకటించలేదు. సోమవారం ఎన్నిక సమయంలో వారి పేర్లను ప్రకటించనున్నారు. నల్లగొండలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కమిషనర్ నీలగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో నలుగురు విజయం సాధించారు. అయితే అందులో ముగ్గురు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 30కి చేరింది. 18వ డివిజన్లో విజయం సాఽధించిన ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నంరాజు, 42వ డివిజన్లో విజయం సాధించిన అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్, 11వ డివిజన్లో విజయం సాధించిన పాలకూరి సుమలత సంతోష్ ఆదివారం మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. దీంతో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లే. సోమవారం జరిగే మేయర్ ఎన్నికల్లో వారు కాంగ్రెస్కు మద్దతు తెలుపనున్నారు. ఫ ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఫ 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఫ ఎన్నికల అబ్జర్వర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు ఫ క్యాంపుల నుంచి నేరుగా సమావేశాలకు హాజరు కానున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫ ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు నిర్వహణ -
ముగిసిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు
పెద్దవూర : మండలంలోని చింతపల్లి గ్రామంలో దున్న ఇద్దాస్ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ప్లడ్ లైట్ల వెలుతురులో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిశాయి. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 15 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బహుమతులను అందించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.లక్షను సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు, ద్వితీయ బహుమతిని రూ.80వేలను అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ హర్యానా జట్టు, తృతీయ బహుమతి రూ.60వేలు చింతపల్లి మిషన్ ఢిల్లీ జట్టు, నాలుగవ బహుమతి రూ.50వేలు కర్నాటక జట్టు, ఐదవ బహుమతి రూ.40వేలు తెలంగాణ, ఆరో బహుమతి రూ.30వేలు ఉత్తరప్రదేశ్ జట్లు గెల్చుకున్నాయి. వీరికి నగదుతో పాటు షీల్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జటావత్ రవినాయక్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ షేక్ అబ్బాస్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భూలోకరావు, జి.కర్తయ్య, ది మిషన్ కట్టెబోయిన ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే జట్టు -
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలి
ముగిసిన ఎడ్ల పందేలుచిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర, శివరాత్రి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల ఎడ్ల పందేలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య, ఉప సర్పంచ్ ఏడు కొండలు, బండ్ల ప్రశాంతి కోటయ్య పాల్గొన్నారు. మేళ్లచెరువులో.. మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఆదివారం జాతీయ స్థాయి ఎద్దుల పందేలు నిర్వహించారు. పాలపండ్ల విభాగం ఎద్దుల పందేలను కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఐరా రియాలిటీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి ప్రారంభించారు. -
యాదగిరీశుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నిత్య పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం నిర్వహించి, సహస్త్ర నామార్చన పూజను జరిపించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు. -
ఛాయా సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపునకు కృషి
రామగిరి(నల్లగొండ ): పానగల్లు ఛాయా సోమేశ్వరాలయానికి అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శివరాత్రి సందర్భంగా నల్లగొండ సమీపంలోని పానగల్లు పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలను దర్శించుకున్నారు. ఛాయా సోమేశ్వరాలయంలో శివ పార్వతుల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివుడికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అద్భుత శైలిలో 11వ శతాబ్దంలో నిర్మించిన పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం శివ లింగంపై నిరంతరం పడే ఛాయ ఎంతో విశిష్టత కలిగిందన్నారు. రామప్ప దేవాలయం మాదిరిగా చారిత్రక సంపద అని పేర్కొన్నారు. సంస్కృతిని పెంపొందిస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం యునెస్కో గుర్తింపునకు అర్హత కలిగి ఉందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి, సంబంధిత శాఖ కేంద్ర మంత్రిని కోరుతానన్నారు. నిత్యం భక్తులు దర్శించుకునేలా అన్ని వసతులు కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. అదే విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు ఉండబోవని, బడ్జెట్ తర్వాతే ఉంటాయని స్పష్టం చేశారు. కార్పొరేషన్ విజయం బాధ్యత పెంచింది నీలగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయం మాపై బాధ్యత మరితం పెంచిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నీలగిరి కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయన్నారు. నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. 48 డివిజన్లలో ప్రజల సమస్యలు, డ్రెయినేజీ, మంచి నీటి వసతి, పార్కుల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. మాపై నమ్మకంతో గెలిపించిన పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మొక్కలు నాటిచేందుకు కలెక్టర్.. హార్టికల్చర్ అధికారులతో చర్చిస్తున్నారని చెప్పారు. చందనపల్లి డంపింగ్ యార్డును మరో మూడు నాలుగు నెలల్లో వేరే చోటకి మారుస్తామన్నారు. ఫ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన మంత్రి, కార్పొరేటర్లునల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్లను క్యాంపు కోసం హైదరాబాద్లోని శామీర్పేటలో గల ఓ రిసార్ట్కు తరలించిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం కీసరగుట్టలోని శివాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్లు దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం తిరిగి రిసార్ట్కు వెళ్లారు. సోమవారం అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి రానున్నారు. -
నీలగిరిలో 37 మంది కొత్త వారే..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లకు గాను 37 మంది కొత్త అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన 27 మంది కార్పొరేటర్లలో 17 మంది మంది తొలిసారి గెలిచారు. అదే విధంగా బీఆర్ఎస్ గెలిచిన 9 మందిలో 8 మంది మొదటిసారి విజయం సాధించారు. బీజేపీ నుంచి గెలిచిన నలుగురు కార్పొరేటర్లు సైతం మొదటిసారి గెలిచారు. ఏఐఎఫ్బీ సింహం గుర్తుపై గెలిచిన నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, ఇండిపెండింట్లు ఇద్దరు కూడా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజేతలుగా నిలిచిన వారే. కార్పొరేషన్లోని 48 డివిజన్లలో 37 మంది కొత్త వారు కాగా, గతంలో గెలిచి అనుభవం ఉన్న వారు 11 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కాంగ్రెస్లో 10 మంది, బీఆర్ఎస్ నుంచి ఒకరు ఉన్నారు. మొత్తంగా 37 మంది తొలిసారి ఎన్నికల్లో గెలిచి కార్పొరేషన్లో అడుగు పెడుతున్నారు. -
బాల్య వివాహాల రహిత భారత్గా తీర్చిదిద్దాలి
మిర్యాలగూడ టౌన్ : బాల్య వివాహాల రహిత భారత్గా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణయ్య అన్నారు. ‘బాల్య వివాహ రహిత భారత్’ కార్యక్రమంలో భాగంగా శనివారం మిర్యాలగూడలోని మైనార్టీ గురులకు, మిర్యాలగూడ మండలం అవంతీపురం జంగాల కాలనీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలంతా చదువులపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలంటే చదువే ఆయుధమన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ కుమారీ, గౌరీ శంకర్, వెంకన్న, రమణి, సర్పంచ్ సుజాత సురేష్, నాగమణి, రాధిక, శ్రీదేవి, దారం మల్లేష్యాదవ్, సువర్ణ, వసుమతి, అంజలిదేవి, సుజిత తదితరులున్నారు. -
మున్సిపాలిటీల్లో ఆశావహులు అధికంగానే..
● చండూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా రుషిపాక వాసు, కలిమికొండ పారిజాత, భూతరాజు దశరథ పోటీ పడుతున్నారు. మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి జెల్లా ధనమ్మ కూడా చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. క్యాంపునకు తరలివెళ్లిన కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ● మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎన్నికలకు ముందు చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. ప్రస్తుతం నూకల వేణుగోపాల్రెడ్డి సతీమణి నూకల కవిత, గుడిపాటి నవీన్ సతీమణి శిరీష, చిలుకూరు బాలు సతీమణి సుధ, వెంకటేష్ తల్లి శ్రీదేవి చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు చైర్మన్ కానున్నారు. ● హాలియా మున్సిపాలిటీలో చింతల చంద్రారెడ్డి, కుందూరు వెంకట్రెడ్డి, గౌని రాజా రమేష్యాదవ్ మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే జైవీర్రెడ్డితో మంతనాలు చేస్తున్నారు. వీరిలో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. వైస్ చైర్మన్గా చెరుపల్లి ముత్యాలు పేరును ప్రకటించే అవకాశం ఉంది. ● చిట్యాల మున్సిపాలిటీలో జనరల్ మహిళకు కేటాయించినందున పందిరి గీతా రమేష్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పదవి బీసీ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ సాగుతోంది. ● దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపునకు వెళ్లారు. చైర్మన్ అభ్యర్థిగా పున్న శైలజా వెంకటేష్ను నామినేషన్లకు ముందుగానే ఎమ్మెల్యే బాలునాయక్ ప్రకటించారు. ఆమె ఎంపిక లాంఛనమే కానుంది. వైస్ చైర్మన్ పదవికి మైనార్టీ వర్గం నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చ సాగుతోంది. ● నందికొండ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంతవరకు ప్రకటించలేదు. ఆదివారం మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఎమ్మెల్యే జైవీర్రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
శివపార్వతుల కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం ఆలయంలో నిత్య హవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణం, పంచ సూక్త పఠనం చేశారు. యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో రుద్ర హవనం జరిపించారు. సాయంత్రం స్తోత్ర, వేద, నమక, చమక పారాయణములు, మంత్ర పుష్ప పఠనం నిర్వహించారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణ మండపంలో రాత్రి 8గంటలకు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించనున్నారు. -
బీజేపీ సీనియర్లకు భంగపాటు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులకు భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఆశించే నాయకులు సైతం వారి డివిజన్లను గెలుపించుకోలేకపోయారు. 48 డివిజన్లకు గాను 45 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావుతో సైతం నల్లగొండలోని పెద్ద గడియారం సెంటర్లో సభ పెట్టించారు. కానీ 45 డివిజన్లకు గాను కేవలం నాలుగింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఆరు స్థానాలు ఉండగా, ప్రస్తుతం రెండు తగ్గిపోయాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి సొంత తమ్ముడు హర్షిత్రెడ్డిని 10వ డివిజన్ నుంచి బరిలో నిలిపినా గెలుపించుకోలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎఫ్బీ నుంచి సింహం గుర్తుతో పోటీ చేసి ఓటమి చెందిన పిల్లి రామరాజు యాదవ్ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 8వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన సతీమణి పిల్లి సత్యవతిని గెలుపించుకోలేకపోయారు. మరో సీనియర్ నేత గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, బండారు ప్రసాద్, వీరెళ్లి చంద్రశేఖర్ తదితర ముఖ్య నాయకులు సైతం వారు నివాసం ఉండే సొంత డివిజన్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీసినట్లు చర్చ సాగుతోంది. ఫ నల్లగొండ కార్పొరేషన్లో వికసించని కమలం -
ఫ మా తుఝే సలాం
మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు నల్లగొండ : శివరాత్రి సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శివయ్య అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆ పరమేశ్వరుడు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ పవిత్ర లింగోద్భవ కాలం అందరికీ ప్రశాంతతను చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయాలకు వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. 16న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంనల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 16న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాగర్ను సందర్శించిన కలెక్టర్నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ను శని వారం కలెక్టర్ చంద్రశేఖర్.. కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. బుద్ధవనంలోని మ హాస్తూపం, స్తూపపార్కు తదితర ప్రాంతాలను వీక్షించారు. వీరికి పర్యాటక శాఖ గైడ్ సత్యనారా యణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనం వివరాలను తెలియజేశారు. ఆయన వెంట పెద్దవూర ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. హెచ్పీవీ టీకాపై అవగాహననల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం 150 మంది ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులకు హెచ్పీవీ టీకాలుపై అవగాహన సమావేశం నిర్వహించారు. అదేవిధంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ స్క్రీనింగ్పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వసంతకుమారి, రాజేశ్వరి, రమేష్, రాజిరెడ్డి, రమణారెడ్డి, ప్రిన్సిపాల్ ప్రశాంతి వసంత్, పృథ్వీరాజ్, సరిత, అశ్విని, లావణ్య, శ్రీతి, మౌనిక పాల్గొన్నారు.


