Medak
-
డీఏలు వెంటనే చెల్లించాలి
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్ మెదక్జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏలను తక్షణమే విడుదల చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరల కనుగుణంగా రావాల్సిన డీఏలను ఇవ్వా ల్సిందేనని చెప్పారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసిన కార్యదర్శుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీవో తూప్రాన్ యూనిట్ అధ్యక్షులు శంకర్ గౌడ్, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్, రాకేష్, లింగప్ప, రవి, రజిత, రమేష్, నవీన్, శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, తదితర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఏఐ టెక్నాలజీతో నిఘా నేత్రాలు
తూప్రాన్: ప్రధాన రహదారులపై ఏఐ కెమెరాలు నిఘా వేస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణలో ఆర్టీఫిషల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నారు. సూక్ష్మంగా కనిపించే వాహనాల నంబర్లు సైతం అతి పెద్దగా చూపించడం ఈ కెమెరాల ప్రత్యేకత. అంతేకాకుండ పరిసరాల్లో వ్యక్తులను స్పష్టంగా చూపుతూ అక్కడ ఇతర వాహనాలను సైతం ఈ కెమెరాలు పసిగడుతాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు, వాహనాలపై పారిపోతున్నప్పుడు, నేరచరిత్ర కలిగిన అగంతకుల గుర్తింపులో ఈ కెమెరాలు కీలక భూమిక పోషిస్తాయి. ఒకే నంబరు మీద ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో గుర్తిస్తాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి చలాన్లను ఎగవేస్తున్న వాహనదారులనూ గుర్తిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలు అధిగమిస్తే దానిని సైతం పోలీసులకు చేరవేస్తుంది. వివిధ సందర్భాల్లో నేర సంబంధ అంశాలను సులువుగా గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. వాటి పని తీరును వివరించారు. పోలీస్ స్టేషన్లో ఏఐ కంట్రోల్రూంను ఏర్పాటు చేశామని, వీటికి అనుసంధానంగా తూప్రాన్ ప్రధాన రహదారిపై నాగులపల్లి, నర్సాపూర్ చౌరస్తాలు, పోతరాజుపల్లి కమాన్వద్ధ మూడు కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో కెమెరా రూ.1.50 లక్షల విలువ ఉంటుందన్నారు. ఈ కెమెరాలు సీఎస్ఆర్(కార్పోరేట్ సోషల్ రేస్పాన్సిబిల్టి) కింద వివిధ పరిశ్రమల సహాకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఇవే కాకుండ మరో ఐదు ఏఐ కెమరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగ మరో 110 సాధారణ సీసీ కెమరాలను పట్టణంలో నిఘా కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేర నియంత్రణలో కీలక భూమిక సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్న తూప్రాన్ పోలీసులు -
ప్యారానగర్ డంప్యార్డు అనుమతులు రద్దు చేయాలి
ఎంపీ రఘునందన్ వినతి నర్సాపూర్: ప్యారానగర్డంప్యార్డుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సుశీల్కుమార్ అవస్తిని కలిసి వినతిపత్రం అందచేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మండలం ప్యారానగర్లో నిర్మిస్తున్న డంప్యార్డు అనుమతులను రద్దు చేయాలని ఎంపీ కోరారు. డంప్యార్డుకు సంబంధించిన పలు అంశాలను రఘునందన్ వివరించారు. ఎంపీ వెంట నర్సాపూర్ జేఏసీ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, గుమ్మడిదల్ల మండలానికి చెందిన జేఏసీ నాయకులు గోవర్ధన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, బాల్రెడ్డి, ఉదయ్కుమార్ తదితరులు ఉన్నారు. జమిలి ఎన్నికలతో అనేక లాభాలు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్గౌడ్ నర్సాపూర్: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో అనేక లాభాలు ఉంటాయని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్గౌడ్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విధానంతో డబ్బుతో పాటు సమయం కలిసొస్తుందని చెప్పారు. ఎన్నికలు రాగానే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే కోడ్ ఒకేసారి ఉంటుందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. దేశం బాగు కోసం అందరూ కలిసి రావాలన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు సురేష్, శంకర్, కరుణాకర్, చంద్రయ్య, రాంరెడ్డి తదితరులు ఉన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి నర్సాపూర్: సర్టిఫికేషన్ కోర్సులతో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫార్మాసిస్టులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సాపూర్లోని వైపర్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన రిజిస్టర్డ్ ఫార్మాసిస్టులకు నైపుణ్యాభివృధ్ది శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచే శిక్షణ కార్యక్రమాలు ఫార్మాసిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. శిక్షణ శిబిరం నాల్గు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామాంజనేయులు పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలి డీఈఓ రాధాకిషన్ చిన్నశంకరంపేట(మెదక్): పదవ తరగతి విద్యా ర్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రాధాకిషన్ కోరారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం సూరారం జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాగ్రతతో ప్రశాంతగా పరీక్షలను రాయాలని కోరారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకూడదన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలి తాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ పాఠశాల హెచ్ఎం సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ నీరజపవన్గౌడ్, నాగరాజు, గ్రామ నాయకులు మల్లారెడ్డి, గోవర్ధన్రెడ్డి ఉన్నారు. -
ప్రైవేటు అప్పునకు రుణమివ్వండి
మెదక్జోన్: రాష్ట్రంలోని ప్రతీ రైతుకు పంటరుణం కాకుండా అదనంగా రూ.లక్ష రుణం ఇచ్చేలా అన్ని జిల్లాల న్యాయమూర్తులు చొరవ చూపాలని హైకోర్టు ఆదేశించటంతో రైతుల సమక్షంలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో సమావేశాలు జరగ్గా ఈ నెల 19న మెదక్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పంటరుణాలతో సంబంధం లేకుండా రైతులు ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు ప్రతీరైతుకు అదనంగా రూ.లక్ష చొప్పున బ్యాంకులు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని 2015లో మెదక్కు చెందిన రైతుసంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన కోర్టు 2018లో పంటరుణాలతో సంబంధం లేకుండా ప్రతీరైతుకు ప్రైవేటు అప్పు చెల్లించుకునేందుకు అదనంగా రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది. ఈ తీర్పును గౌరవిస్తూ అప్పట్లో కొన్ని బ్యాంకులు మాత్రమే అతికొద్దిమంది రైతులకు రుణాలు ఇవ్వగా చాలా బ్యాంకులు మాత్రం రిజర్వు బ్యాంకు ఆదేశాలు లేవనే సాకుతో రుణాలివ్వలేదు. దీంతో గతేడాది శ్రీహరిరావు మళ్లీ కోర్టును ఆశ్రయించగా గత ఫిబ్రవరి 25న హైకోర్టు తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయమూర్తులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో న్యాయమూర్తుల సమక్షంలో రైతులు– బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తయిన సమావేశాలు ఇప్పటికే రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్లలో ఆయా జిల్లాల న్యాయమూర్తుల సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. కాగా, మెదక్ జిల్లాలోని హవేళిఘణపూర్ మండల పరిధిలోని రైతు వేదికలో ఈనెల 19న మెదక్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ సీనియర్ జడ్జి జితేందర్ సమక్షంలో రైతులు, లీడ్బ్యాంకు మేనేజర్, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. 2012లో ఇలా... అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వాలు ఇచ్చే పరిహారంలో నిర్లక్ష్య ధోరణిని సవాల్ చేస్తూ శ్రీహరిరావు బాధిత రైతు కుటుంబాల తరఫున కోర్టును ఆశ్రయించాడు. మెదక్ ఉమ్మడి జిల్లాలో 300మంది రైతులకు ఒక్కోకుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారం చొప్పున ప్రభుత్వం అందించాలని 2012లో కోర్టు ఆదేశించింది. రైతుసంరక్షణ సమితి అధ్యక్షుడి పిల్తో హైకోర్టు ఆదేశం జిల్లా న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలి ఇప్పటికే పలుజిల్లాల్లో సమావేశాలు నేడు మెదక్ జిల్లా హవేళిఘణపూర్లో..ఇది రైతు విజయం ప్రైవేట్ అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు ఇది మంచి సదావకాశం. ప్రతీ రైతుకు పంటరుణంతో సంబంధంలేకుండా అదనంగా రూ.లక్ష వరకు బ్యాంకులు అప్పులిస్తున్నాయి. వాటిని తీసుకుని ప్రైవేట్ అప్పులను తీర్చుకోవాలి. ఏళ్లతరబడి కోర్టులో కేసు కొనసాగించగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో యంత్రాంగం రైతుల వద్దకే కదిలింది ఇది రైతు విజయంగా భావిస్తున్నాను. –శ్రీహరిరావు, రైతు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
22 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
● కలెక్టర్ రాహుల్రాజ్ ● ‘పేట’లో నీటి సమస్య లేదని స్పష్టీకరణరామాయంపేట(మెదక్): జిల్లాలో ఎల్ఆర్ఎస్ పథకం కింద 22 వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ఒకటో వార్డులో నీటి ఎద్దడి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లిస్తే 25 శాతం మేర రాయితీ లభిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో తాగు నీటి ఎద్దడి సమస్య లేదని, ఎక్కడైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. రామాయంపేట పరిధిలో ఎక్కడ కూడా పంటలు ఎండిపోవడం లేదని, రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా పరిధిలో 2.61 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, ఇతర జిల్లాలతో పోలిస్తే పంట ఎండిపోయిన ఘటనలు తక్కువ అని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
మెదక్ కలెక్టరేట్: డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి భారీగా తరలివచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రధాన గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి నర్స మ్మ మాట్లాడుతూ ఐసీఐడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని చూస్తుందన్నారు. ఇవి అమలు జరిగితే క్రమంగా ఐసీడీఎస్ బలహీనపడి, శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కు నష్టం కలిగించే ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు. డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా -
నీ ఇష్టం వచ్చింది రాస్కోపో..!
● నా అనుమతి లేకుండా ఆఫీసులోకి ఎలా వచ్చావ్..? ● సాక్షి విలేకరిపై పీఆర్ సీనియర్ అసిస్టెంట్ దురుసు ప్రవర్తన ● కార్యాలయంలో ఒకే ఒక్కడు.. సమయపాలన పాటించని సిబ్బంది అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం సబ్ డివిజన్ కార్యాలయంలో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు కార్యాలయానికి వస్తారో.. ఎవరుంటారో తెలియడం లేదు. అసలే అవినీతి, ఆరోపణలతో అభాసుపాలవుతున్న ఈ కార్యాలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో సంబంధిత అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా తయారైంది. ప్రస్తుతం ఈ కార్యాలయంలో డీఈ, ఏఈ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. డీఈ సెలవుపై వెళ్లడంతో కార్యాలయంలో సిబ్బంది ఉండటం లేదు. మంగళవారం ఉదయం 11 గంటలు దాటినా ఒక్కరే కార్యాలయానికి వచ్చారు. ఈ విషయమై ‘సాక్షి’విలేకరి ఫొటోలు తీస్తుండగా.. సీనియర్ అసిస్టెంట్ అంజయ్య అభ్యంతరం తెలిపారు. ‘‘నా అనుమతి లేకుండా ఫొటోలు ఎలా తీస్తావ్..అసలు నువ్వెవరు..? పర్సంటేజీలు తీసుకుంటున్నారని వార్త రాశావ్ కదా.. నీ ఇష్టం వచ్చింది రాస్కో’’అంటూ దురుసుగా ప్రవర్తించారు. పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణల గురించి ఇటీవల సాక్షి వెలుగులోకి తేవడంతో అధికారులు, సిబ్బంది జీర్ణించుకోలేక పోతున్నారు. సీనియర్ అసిస్టెంట్ దురుసు ప్రవర్తనపై మెదక్ ఈఈ నర్సింలుకు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రగతిలో నర్సాపూర్
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025సకాలంలో సీఎంఆర్ అందించాలి మెదక్జోన్: బ్యాంకు గ్యారంటీలతో పాటు సీఎంఆర్ బియ్యాన్ని గడువులోగా పూర్తి చేసి అందించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం రైస్మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024– 25 సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి ధాన్యం మరాడించేందుకు మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బ్యాంకు గ్యారంటీలు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. జిల్లాలో 94 రైస్ మిల్లులు గడువులోగా సీఎంఆర్ అందించాలని, లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్రెడ్డి, సివిల్ సప్లై డీఎం జగదీష్, ఎల్ఎండీ నరసింహామూర్తి, బ్యాంకర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.పోడు హక్కు పత్రాలు ఇవ్వాలి మెదక్ కలెక్టరేట్: పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అలాగే భూదాన రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్లో భూ సమస్యలే అధికంగా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 7న కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహిళా కన్వీనర్ నాగమణి, నాయకులు నరేందర్, ఐలయ్య, రామస్వామి, వెంకటి తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ వర్తించని వారికి న్యాయం చేస్తాం రామాయంపేట(మెదక్): రుణమాఫీ జరగని రైతులకు న్యాయం చేస్తామని జిల్లా సహకార అధికారి కరుణాకర్ హామీ ఇచ్చారు. రుణమాఫీలో తమకు అన్యాయం జరిగిందని గ్రామానికి చెందిన కొందరు రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన మండలంలోని కోనాపూర్ సంఘం కార్యాలయంలో సోమవారం విచారణ చేపట్టారు. ఈసందర్భంగా డైరెక్టర్లు సీఈఓపై ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో కొందరు డైరెక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సహకార సంఘం సీఈఓ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కరుణాకర్ ఆదేశించారు. సామాజిక తనిఖీ సాక్షిగా తప్పులు పాపన్నపేట(మెదక్): తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు.. అన్నట్లుంది 14వ సామాజిక తనిఖీ అధికారుల వ్యవహారం. ఉపాధి హామీ పథకం కింద ఏడాది పొడవునా జరిగిన పనులకు సంబంధించి ఏటా సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో తనిఖీకి అయిన ఖర్చులను ఫ్లెక్సీపై ముద్రించి వేదికపై ప్రదర్శిస్తారు. అయితే సోమవారం పాపన్నపేటలో ప్రదర్శించిన లెక్కల కూడికల్లో తప్పులు ఉండటాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. సామాజిక తనిఖీలో పాల్గొన్న తనిఖీ బృందం భోజనానికి రూ. 78,235, రవాణా ఖర్చులు రూ. 9,300, వీఆర్పీల గౌరవ వేతనాలు రూ. 49,050, స్టేషనరీ రూ. 2,950, ప్రజావేదిక వీడియో కవరేజి రూ. 6,500, బీఆర్పీల రవాణా ఖర్చులు రూ.1,845, డీఆర్డీఓ కాపీ రూ. 100, వీఆర్పీల ఎంపిక రవాణా ఖర్చులు రూ. 900 ఇవన్నీ కలిపి వాస్తవంగా రూ. 1,48,880 కావాలి, కాని అధికారులు ముద్రించిన ఫ్లెక్సీలో రూ. 14,880 ముద్రించారు. తమ ఖర్చును తామే తప్పుగా చూపిన అధికారులు ఇక ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఇతర ఉద్యోగులు చేసిన తప్పులను ఎలా గుర్తిస్తారని పలువురు చర్చించుకున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో నర్సాపూర్ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైంది. ఆయా విభాగాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పట్టణంలోని పలు వార్డుల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా నెలకొంది. పారిశుద్ధ్యం పడకేసింది. మురికి కాలువల నిర్వహణ ప్రహసనంగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ నినాదంగానే మిగిలిపోయింది. నిధుల లేమితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోగా.. ప్రజలు ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. – నర్సాపూర్ చెత్త సేకరణ అస్తవ్యస్తం పట్టణంలో రోజూ సుమారు పది మెట్రిక్ టన్నుల చెత్తను సిబ్బంది సేకరిస్తున్నారు. ఇందుకోసం 8 ఆటోలు, రెండు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. కాగా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు. కానీ ఆచరలో అమలు కావడం లేదు. డంప్యార్డులో సుమారు రూ. 33 లక్షలతో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ నిర్మించి సుమారు ఏడాది కావొస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. కాగా సిబ్బంది పట్టణంలో సేకరించిన చెత్తను డంప్యార్డు ఆవరణలో వేసి నిప్పు పెడుతున్నారు. అంతేగాక పట్టణం నుంచి హైదరాబాద్ మార్గంలో జాతీయ రహదారి పక్కన, మెదక్ మార్గంలోని దేవాలయ భూములు, రాయరావు చెరువు పక్కన చెత్తను వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. చెరువు, కుంటలు మురికిమయం పట్టణంలో మురికి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో పలు కాలనీల మురికి నీరు చెరువు, కుంటలోకి చేరి మురికిమయం అవుతున్నాయి. పట్టణంలోని పలు పాత, కొత్త కాలనీలలో మురికి కాలువలు నిర్మించకపోవడం గమనార్హం. ఎన్జీఓస్ కాలనీ కింది ఏరియాలోని సుమారు 150 ఇండ్ల నుంచి మురికి నీరు రాయరావు చెరువులోకి వెల్లడంతో చెరువు కలుషితమవుతుంది. కాగా కుమ్మరికుంటలోకి శ్రీరాంనగర్ కాలనీలోని చాలా ఏరియాలోని ఇండ్ల మురికి నీటితో పాటు 11వ వార్డులోని కొంత ఏరియాలోని ఇండ్ల నుంచి వచ్చే మురికి నీరు కోమటి కుంటలోకి వెళ్లి కలువడంతో కుంట కలుషితమవుతోంది. శ్మశానవాటిక అధ్వానం పట్టణంలో పలు చోట్ల శ్మశాన వాటికలు ఉ న్నాయి. వాటిలో కనీసం నీటి సదుపాయం కల్పించకపోవడంతో అంత్యక్రియల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఎవరైనా చనిపోతే ట్యాంకర్ల ద్వారా నీటి సదుపాయం కల్పిస్తున్నారు. మృతుల కుటుంబీకులు, దగ్గరి బంధువులు స్నానాలు చేయడానికి అవస్థలు పడుతున్నారు. స్నానాల గదులు, దహన సంస్కార షెడ్డు నిర్మించడంతో పాటు ప్రహరీ నిర్మించి ఏడాది కావొస్తున్నా వాటిని వినియోగంలోకి తేనందున నిరుపయోగంగా ఉన్నాయి. కోతులు, కుక్కలతో భయం భయం పట్టణ ప్రజలు కోతులు, కుక్కలతో భయం భయంగా జీవిస్తున్నారు. చిన్న పిల్లలు బయట తిరగలేని, ఇంటి బయట ఆడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా సుమారు రెండేళ్ల క్రితం పట్టణంలోని శివాలయం వీధిలో తొమ్మిదేళ్ల బాలుడు ఓ భవనంపై ఆడుకుంటుండగా అక్కడికి కోతుల గుంపు వచ్చింది. వాటి నుంచి తప్పించుకునేందుకు భయంతో కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పట్టణంలో రోజు 15 నుంచి 20 మంది ప్రజలు కోతులు, కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు. ప్రధాన రోడ్లు అధ్వానం పట్టణంలో ప్రధాన రోడ్లు అధ్వానంగా మారాయి. గత పాలక కమిటీ హయాంలో జనరల్ ఫండ్ నుంచి ప్రతి వార్డులో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధాన రోడ్లను పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పడిన పలు కాలనీల్లో ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి. లింకు రోడ్లు సైతం నిరుపయోగంగా మరాయి. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అసంపూర్తిగా ఉండడంతో ప్రతి శుక్రవారం సంత రోజు వ్యాపారులు రోడ్లపై కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే పట్టణం మీదుగా ఉన్న జాతీయ రహదారి పక్కన నిర్మించిన మురికి కాలువ, ఫుట్పాత్లను పక్కనే ఉన్న వ్యాపారులు ఆక్రమించినా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. భగీరథ ఉన్నా దాహం దాహం మిషన్ భగీరథ పథకం అమలులో ఉన్నా పట్టణంలోని పలు కాలనీల్లో నీటికి కటకట తప్పడం లేదు. ఒక మనిషికి రోజుకు 135 లీటర్ల తాగు నీరు ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రజలకు రోజుకు 25 లక్షల 44 వేల లీటర్ల నీరు కావాల్సి ఉంది. అయితే అధికారులు 17 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారులు సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వేసవి సీజన్ వస్తున్నందున ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగం పట్టణంలో మూడు చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. ఎస్బీఐ ఎదురుగా నిర్మించిన టాయిలెట్ సముదాయాన్ని వినియోగంలోకి తెచ్చిన మున్సిపల్ అధికారులు సుమారు రూ. 24 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, స్థానిక చౌరస్తాలో తూప్రాన్ రోడ్డు పక్కన నిర్మించిన రెండు సముదాయాలను వినియోగంలోకి తేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. వాటికి నీటి సదుపాయం లేనందునే వినియోగంలోకి తేవడం లేదని తెలిసింది. హరితహారం రికార్డులకే పరిమితం అధికారులు హరితహారం పథకాన్ని నీరుగారుస్తున్నారు. నర్సరీల నిర్వహణను పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా ఇతర ప్రాంతాల్లోని నర్సరీల నుంచి మొక్కుబడిగా మొక్కలు తెచ్చి పట్టణంలో పంపిణీ చేశారు. గతేడాది ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇచ్చామని అధికారులు చెప్పినా.. పట్టణంలో వెయ్యి ఇళ్లకే మొక్కలు పంపిణీ చేశారు. రికార్డుల్లో మాత్రం ఎక్కువ రాసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జాతీయ రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఎండిముఖం పట్టాయి. పార్కులులేక ఆహ్లాదం దూరం గతంలో మేజర్ పంచాయతీగా కొనసాగిన నర్సాపూర్ 2018లో మున్సిపాలిటీగా మారింది. కాగా పట్టణంలో ఒక్క పార్కు లేకపోవడం విచారకరం. పట్టణ ప్రజలు సాయంత్రం పూట ఆహ్లాదంగా గడపాలంటే పార్కు లేని లోటు కన్పిస్తుంది. గతంలో ఏర్పాటు చేసిన పిల్లల పార్కు నిరాదరణకు గురవుతుంది. అందులో పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు కరువయ్యాయి. ప్రభుత్వ భవనాలు అసంపూర్ణం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయాయి. మున్సిపాలిటీ కార్యాలయం నిధులు లేక నాలుగున్నరేళ్లుగా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అలాగే ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు భవనం పనులు సైతం నిధులు లేక సుమారు పది నెలలుగా పనులు నిలిచిపోయాయి. గౌడ సంఘం భవనం, అధునాతన దోబిఘాట్, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు సైతం నిలిచిపోయాయి.చివరికి ఇలా.. చిన్నశంకరంపేట(మెదక్): వరి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు భగీరథ య త్నం చేస్తున్నాడు. రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని వినియోగించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నా ర్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతండాకు రైతు భాషానాయక్ మూడెకరాల్లో వరి సాగు చేశాడు. మొదట్లో రెండు బోర్లు పుష్కలంగా నీరుపోస్తున్నాయని, వరి సాగుకు మొగ్గు చూపగా పంట ఏపుగా పెరిగింది. పంట చేతికొస్తుందనుకున్న సమ యంలో రెండు బోర్లలో నీరు తగ్గిపోయింది. పచ్చనిపంట కళ్లముందే ఎండిపోయి పశువులమేతకు పెట్టడం ఇష్టం లేక ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొచ్చి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కనీసం పెట్టుబడి అయినా మిగిలించుకోవాలనే తాపత్రయ పడుతున్నాడు.కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు మెదక్ కలెక్టరేట్: జాతీయ నూతన విద్యా విధానంతో ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆపాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నపూర్ణ, నర్సమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీలు పలు డిమాండ్లతో మెదక్ కలెక్టరేట్ వద్ద సోమవారం 48 గంటల ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 50 యేళ్లుగా ఎన్నో సేవలతో అందరి మన్ననలు పొందుతున్న ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని కో రారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంగన్వాడీ వ్యతిరేక విధానాలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం అన్యాయమన్నా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, సంతోష్, అంగన్వాడీ నాయకురాలు రాజ్యలక్ష్మి, స్వప్న విజయ, ఇందిరా, లక్ష్మి, రాణి, కల్పన, జ్యోతి, అరుణ, నాగరాణి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు భారీగా పాల్గొన్నారు.ప్రభుత్వ ప్లీడర్గా శోభన్గౌడ్ మెదక్ కలెక్టరేట్: జిల్లా కోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా మెదక్ పట్టణానికి చెందిన శివనూరి శోభన్గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టులో ప్రభుత్వం తరఫున ఆయన వాదించనున్నారు. ఈసందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు శోభన్ గౌడ్ తెలిపారు.న్యూస్రీల్కలగానే స్టేడియం నిర్మాణం నర్సాపూర్ మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడే ఇండోర్, మిని స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో 2013లో అప్పటి మంత్రులు శ్రీధర్బాబు, సునీతారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో క్రీడాకారులు, వాకర్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అధికారులు మొక్కుబడిగా ఏర్పాటు చేసిన పట్టణ క్రీడా ప్రాంగణాలు కొన్ని నెలలకే కనుమరుగయ్యాయి. మున్సిపాలిటీ వివరాలు ఏర్పడిన సంవత్సరం 2018 ఇళ్లు 6,742 వార్డులు 15 రెవెన్యూ బ్లాకులు 20 జనాభా 18,845 వాటర్ ట్యాంకులు 31 పబ్లిక్ టాయిలెట్స్ 03 వీధి దీపాలు 2,800 బస్తీ దవాఖానాలు 03 -
స్టేడియం ఏర్పాటు చేయాలి
మున్సిపాలిటీలో ఇండోర్, మినీ స్టేడియాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కాలేజీ మైదానంలో చిన్న చిన్న గుంతలున్నా వాకింగ్ చేస్తున్నాం. ఇప్పటికై నా స్టేడియం నిర్మించి క్రీడాకారులు, వాకర్స్ను ప్రోత్సహించాలి. – నర్సింగ్రావు, క్రీడాకారుడు, నర్సాపూర్ మార్కెట్ తరలించాలి జాతీయ రహదారి నుంచి షాదీఖానా వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కూరగాయల దుకాణాలు పెట్టడంతో ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మార్కెట్ యార్డు పూర్తి చేసి కూరగాయల దుకాణాలను తరలించాలి. – బోడ చైతన్య, పట్టణ వాసుడు సరిపడా నీరు రావడం లేదు తమ ఏరియాలో ఒక్కో ఇంటికి ఐదు బిందెల నీరు మాత్రమే రావడంతో సరిపోవడం లేదు. బోర్ల ద్వారా నీరు తెచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం. ఇప్పటికై నా తాగు నీరు సరిపడా సరఫరా చేయాలి. – కళమ్మ, ఎన్జీఓస్ కాలనీ నిధులు రాగానే పూర్తి చేయిస్తాం నిఽదులు లేక కొత్త భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు పూర్తి చేయిస్తాం. మిషన్ భగీరథ నీరు అంతటా వస్తున్నాయి. ఆయా వార్డులలో నీరు తక్కువగా వస్తున్నట్లు తనకు తెలియదు. అంతటా సక్రమంగా నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా. మురికి నీరు చెరువులోకి, కుంటలోకి వెలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. వాటిలోకి మురికి నీరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటా. – రామకృష్ణరావు, కమిషనర్● -
ఒకేదేశం ఒకేఎన్నికతో ఎంతోమేలు
మెదక్జోన్: ఒకే దేశం ఒకే ఎన్నికతో కేంద్ర, రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజాధనం వృథా కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దార్ మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటూ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు వస్తాయని, లోక్సభ, అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజాధనం ఆదా అవుతాయన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పోలింగ్ శాతం సైతం పెరుగుతుందని తెలిపారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల ఆలోచనలను ప్రతిపాదించగా, దీనిపై 2017లో నీతి ఆయోగ్ కసరత్తు చేసిందని వివరించారు. 2022 డిశంబర్లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ వివిధ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపు ణుల, అభిప్రాయాలను ఆహ్వానించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ -
ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. అయితే ప్రజావాణికి అధికంగా భూ సమస్యలపై 19, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1, పెన్షన్ల కోసం 1, ఉద్యోగ ఉపాధిపై 2, ఇతర సమస్యలపై 33 అర్జీలు కలిపి మొత్తం 56 వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ
జహీరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6,7,8,9వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఝరాసంగం, దిగ్వాల్ బాలుర గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీశ్వర్రెడ్డి కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. -
కొమురవెల్లికి పోటెత్తిన భక్తజనం
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చేవారం బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
వృత్తి నైపుణ్యం.. ఉపాధికి మార్గం
ఈనెల 30 వరకు అడ్మిషన్లు ఇప్పటివరకు 11 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం 12వ బ్యాచ్కి శిక్షణ ఇచ్చేందుకు ఈనెల 30వ తేదీ వరకు అడ్మిషన్లకు అవకాశం ఉంది. మొక్కుబడి ఫీజుతో అనుభవజ్ఞులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మనిషా, మెదక్ శిక్షణ కేంద్రం ఇన్చార్జి మెదక్ కలెక్టరేట్: ఎలాంటి ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందడానికి మార్గం కానరాక ఎంతో మంది నిరుద్యోగులు నలిగిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 7 నుంచి 10 తరగతి పూర్తి చేసిన నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో గత మూడేళ్లుగా నిరుద్యోగ యువతీ యువకులకు వయస్సుతో నిమిత్తం లేకుండా వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 11 బ్యాచ్లు పూర్తి నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో ఇప్పటి 11 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో శిక్షణ పొందిన వందలాది మంది యువతీ, యువకులు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరారు. అలాగే మరికొంతమంది స్వయం ఉపాధి పొందుతున్నారు. మహిళలు బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, కంప్యూటర్ శిక్షణ, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్సుకొని ఉపొధి పొందుతున్నారు. కొంతమంది పలు కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. పెళ్లి అయిన మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అలాగే యువకులు సీసీటీవీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రిక్, మోబైల్ సర్వీసింగ్ నేర్చుకొని స్వయం పొందుతున్నారు. అనుభవజ్ఞులతో శిక్షణ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఉంటే ప్రతి ఒక్కరికిపై శ్రద్ధ చూపవచ్చునని, ప్రతి బ్యాచ్కు 30 మందికి మాత్రమే అడ్మిషన్కు అవకాశం కల్పిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, జర్దోషి (మగ్గం వర్క్) కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే సీ్త్ర, పురుషులకు కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్), సీసీ టీవీ ఫిట్టింగ్, రిపేర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రికల్ (హౌస్ వైరింగ్), మోబైల్ సర్వీసింగ్, రిపేర్ కోర్సుల్లో 3 నెలల శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఒక్కో కోర్సుకు రూ. 1,500 ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. లేదా బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి పొందవచ్చు.ఎనిమిది కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
పెద్దశంకరంపేట(మెదక్): అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం పెద్దశంకరంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మండలంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయించానని, వాటిని పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దళితబంధులో పలువురికి మంజూరైన నిధులు సైతం ఇవ్వడం లేదన్నారు. గతంలో ప్రభుత్వ పట్టాలు పొంది గృహలక్ష్మిలో మంజూరైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు మానిక్రెడ్డి, జంగం రాఘవులు, శంకర్గౌడ్, సుభాష్, రవీందర్, యాదుల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ‘పెండింగ్ బిల్లులు, జీతాలు విడుదల చేయాలి’ మెదక్ కలెక్టరేట్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, జీతాలను వెంటనే విడుదల చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలలుగా జీతాలు, బిల్లులను చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అప్పులు తెచ్చి పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పెడుతూ కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, కార్మికులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మి, పద్మ, లావణ్య, నాగమణి, సక్కుబాయి, మౌనిక, నాగమణి తదితరులు పాల్గొన్నారు. నాచగిరి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం ఆలయ ఈఓ పార్నంది విశ్వనాథశర్మ పలువురు.. ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలను వేర్వేరుగా కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. 6,500 కోళ్లు మృత్యువాత చిన్నశంకరంపేట(మెదక్): అంతుచిక్కని వైరస్తో కోళ్లు మృత్యువాతపడిన సంఘటన మండలంలోని గవ్వలపల్లి గెరిల్లాతండాలో ఆదివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ స్వామినాయక్ కోళ్లఫాంలో ఒక్కసారిగా 6,500 కోళ్లు మృతిచెందగా, పంట పొలంలో గోతి తీసి పాతిపెట్టారు. ఒక్కసారిగా లక్షల్లో నష్టం కలిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. కార్మికుల కోసం నిరంతర పోరాటంపటాన్చెరు: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతర పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. పటాన్చెరులోని శాండ్విక్ ఎంప్లాయీస్ యూ నియన్ సీఐటీయూ అనుబంధంగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పోచారంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. -
అంతరాయం ఉండొద్దు
విద్యుత్ సరఫరాలోకలెక్టర్ రాహుల్రాజ్కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హవేళిఘణాపూర్(మెదక్): వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం మంభోజిపల్లి 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్పుట్, అవుట్పుట్, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల గురించి విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశమున్నందున, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే లోపాలుంటే సరిచేసుకోవాలన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని చెప్పారు. జిల్లాలో 33/11 కేవీ ఉప విద్యుత్ కేంద్రాలు 126 ఉన్నాయని, వాటి పరిధిలో ప్రతి రోజు విద్యుత్ వినియోగం నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా, వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. చిన్నశంకరంపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరెంట్ కష్టాలు తెచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ బ్రేక్డౌన్ కాగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు కరెంట్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు సైతం నిర్మించలేని పరిస్థితిలో ఉందన్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి ఆనాటి కరెంట్ కష్టాలను ప్రజలకు చూపిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ నీటిని పంటలకు అందించి రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. అధికారంలో ఉన్నా, లేకున్నా రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబు, నాయకులు భూపతిరాజు, శ్రవన్కుమార్ తదితరులు ఉన్నారు. -
ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం
మెదక్జోన్: ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలను తిరగనివ్వమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగువర్గాలను అవమానించారని, ఇప్పుడు అధికారం కోల్పోయాక అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక కొత్త నిబంధనలు తీసుకురావడమే కాకుండా.. ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోడియం వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్ను టార్గెట్ చేయడం మంచిది కాదని హితవుపలికారు. జగదీశ్రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు మధుసూదన్, రుక్మిణి, ప్రవీణ్గౌడ్, శేఖర్, లింగం, దుర్గాప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
ప్రతి పైసా రికవరీ చేస్తాం
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు నర్సాపూర్ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ప్రతి పైసా రికవరీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. శనివారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి పనులకు సంబంధించి ప్రజావేదిక నిర్వహించారు. అటవీశాఖలో ఉపాధి హామీ పథకం ద్వారా కలిగిన మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. మొక్కల పెంపకానికి బినామీ పేర్లతో నీటి ట్యాంకర్లు పెట్టినట్లు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. రూ. 8,91,610 చెల్లింపులు జరిగాయన్నారు. ఇట్టి డబ్బులను రికవరీ చేస్తామని చెప్పారు. అటవీశాఖ అధికారులు ప్రజాదర్బార్కు రాకుండా నిర్లక్ష్యం చేసినందుకు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మండలంలోని అహ్మద్నగర్, బ్రాహ్మణపల్లి, తిరుమలాపూర్, తుజాల్పూర్ తదితర గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు తెలిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 60,610 రికవరీ చేస్తామని వివరించారు. వారం రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు రూ. 9.18 లక్షల నిధులకు సంబంధించి సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఏపీఓ వైద్య శ్రీనివాస్, ఏపీడీ బాలయ్య, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిణి అరుణ, ఏపీఓ అంజిరెడ్డి, సోషల్ ఆడిట్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
అవాంతరాలు అధిగమిస్తేనే అందలం
● పట్టు వీడని సంకల్పమే అసలైన పరీక్ష ● రోజుకు 12 గంటలు చదివా.. ● గ్రూప్–3 స్టేట్ టాపర్ అర్జున్రెడ్డిపాపన్నపేట(మెదక్): పోటీ పరీక్షల సన్నద్ధత ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.. కాని పట్టు వీడని సంకల్పంతో ముందు కెళ్లడమే అసలైన పరీక్ష అని గ్రూప్– 3 స్టేట్ టాపర్ కుకునూరి అర్జున్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2013 నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించానని చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే 2014లో వీఆర్ఓ పోస్టు సాధించానని.. ఆ పోస్టు తన లక్ష్యం కాకపోయినప్పటికీ ఉద్యోగంలో చేరానని తెలిపారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలపై ఆశతో ఒక వైపు ఉద్యోగం, మరో వైపు ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. ఏళ్ల తరబడి ఎదురు చూపులు తన లక్ష్యాన్ని నీరు గార్చలేదన్నారు. సన్నద్ధతలో భాగంగా ఎంపిక చేసిన మెటీరియల్ చదువుకొని, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. నోట్స్ను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలన్నారు. తాను రోజుకు 12 గంటలు చదివినట్లు చెప్పారు. కుటుంబమే ప్రేరణ నా కుటుంబమే నాకు ప్రేరణ అని అర్జున్రెడ్డి అన్నారు. నాన్న నరేందర్రెడ్డి లైబ్రెరియన్, అమ్మ శోభ గృహిణి, తమ్ముడు అరుణ్రెడ్డి ఆర్అండ్బీ ఏఈ, పెద్ద చెల్లెలు అక్షిత సాఫ్ట్వేర్ ఇంజ నీర్, చిన్న చెల్లెలు హర్షిత మెడిసిన్, బాబాయి శ్రీనివాస్రెడ్డి హెడ్ కానిస్టేబుల్.. వీరంతా నా లక్ష్య సాధనకు ఊపిరిలూదారని తెలిపారు. గ్రూప్– 1 సాధించాలన్నదే నా లక్ష్యమని, ఉన్నతాధికారిగా ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలన్నదే జీవిత ఆశయమన్నారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. ప్రస్తుతం గ్రూప్–3 టాపర్గా నిలిచినా, గ్రూప్– 2లో 18వ ర్యాంకు వచ్చింది కాబట్టి అదే ఉద్యోగంలో జాయిన్ అవుతానని వెల్లడించారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులు అధైర్యపడొద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో ‘సమగ్ర శిక్ష– అలిమ్కో’ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే ఉపకరణాలను వినియోగించుకొని ముందుకు సాగాలన్నారు. అలిమ్కో వైద్యులు విద్యార్థులను పరిశీలించి వారికి అవసరమైన ఉపకరణాలు, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ నీలకంఠం, సమ్మిళిత విద్యా సెక్టోరియల్ అధికారి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్మెదక్ కలెక్టరేట్: కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ ఆరోపించారు. శనివారం కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన ిసీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో అసంఘటిత కార్మికలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఐదు రకాల జీఓలు ఇచ్చిన, గెజిట్ చేయలేదని హైకోర్టులో కేసు నడుస్తుందని గుర్తుచేశారు. ట్రాన్స్పోర్డు, హమాలీ రంగంలో సంక్షేమ బోర్డు లేదని, దీని మూలంగా వేలాది మంది తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. వీటి పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన హైదరాబాద్ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేశం, కడారి నర్సమ్మ, నాగరాజు, నాగేందర్ రెడ్డి, బాలమణి, సంతోష పాల్గొన్నారు. -
ఓవర్లోడ్.. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్
చిన్నశంకరంపేట(మెదక్): తీవ్రమైన ఎండలకు తోడు విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఓవర్ లోడ్తో నార్సింగి సబ్స్టేషన్లోని 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలైంది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ డీడీ సోమేష్, ఏడీఏ యాదయ్య, ఏఈ స్వామి సబ్స్టేషన్ పరిశీలించారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ను తిరిగి ఏర్పాటు చేసేందుకు మూడు రోజుల సమయం పడుతుందని ప్రకటించా రు. అప్పటివరకు మరోలైన్ ద్వారా విద్యుత్ అందించినప్పటికీ కోతలు తప్పవని తెలిపా రు. అవసరమైతే రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా నార్సింగిలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు శనివారం ఉదయం సబ్స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పంట పొలాలకు సాగు నీటి ఇబ్బందులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
అవాంతరాలు అధిగమిస్తేనే అందలం
● పట్టు వీడని సంకల్పమే అసలైన పరీక్ష ● రోజుకు 12 గంటలు చదివా.. ● గ్రూప్–3 స్టేట్ టాపర్ అర్జున్రెడ్డిపాపన్నపేట(మెదక్): పోటీ పరీక్షల సన్నద్ధత ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.. కాని పట్టు వీడని సంకల్పంతో ముందు కెళ్లడమే అసలైన పరీక్ష అని గ్రూప్– 3 స్టేట్ టాపర్ కుకునూరి అర్జున్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2013 నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించానని చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే 2014లో వీఆర్ఓ పోస్టు సాధించానని.. ఆ పోస్టు తన లక్ష్యం కాకపోయినప్పటికీ ఉద్యోగంలో చేరానని తెలిపారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలపై ఆశతో ఒక వైపు ఉద్యోగం, మరో వైపు ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. ఏళ్ల తరబడి ఎదురు చూపులు తన లక్ష్యాన్ని నీరు గార్చలేదన్నారు. సన్నద్ధతలో భాగంగా ఎంపిక చేసిన మెటీరియల్ చదువుకొని, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. నోట్స్ను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలన్నారు. తాను రోజుకు 12 గంటలు చదివినట్లు చెప్పారు. కుటుంబమే ప్రేరణ నా కుటుంబమే నాకు ప్రేరణ అని అర్జున్రెడ్డి అన్నారు. నాన్న నరేందర్రెడ్డి లైబ్రెరియన్, అమ్మ శోభ గృహిణి, తమ్ముడు అరుణ్రెడ్డి ఆర్అండ్బీ ఏఈ, పెద్ద చెల్లెలు అక్షిత సాఫ్ట్వేర్ ఇంజ నీర్, చిన్న చెల్లెలు హర్షిత మెడిసిన్, బాబాయి శ్రీనివాస్రెడ్డి హెడ్ కానిస్టేబుల్.. వీరంతా నా లక్ష్య సాధనకు ఊపిరిలూదారని తెలిపారు. గ్రూప్– 1 సాధించాలన్నదే నా లక్ష్యమని, ఉన్నతాధికారిగా ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలన్నదే జీవిత ఆశయమన్నారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. ప్రస్తుతం గ్రూప్–3 టాపర్గా నిలిచినా, గ్రూప్– 2లో 18వ ర్యాంకు వచ్చింది కాబట్టి అదే ఉద్యోగంలో జాయిన్ అవుతానని వెల్లడించారు. -
ప్రతి పైసా రికవరీ చేస్తాం
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు నర్సాపూర్ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ప్రతి పైసా రికవరీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. శనివారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి పనులకు సంబంధించి ప్రజావేదిక నిర్వహించారు. అటవీశాఖలో ఉపాధి హామీ పథకం ద్వారా కలిగిన మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. మొక్కల పెంపకానికి బినామీ పేర్లతో నీటి ట్యాంకర్లు పెట్టినట్లు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. రూ. 8,91,610 చెల్లింపులు జరిగాయన్నారు. ఇట్టి డబ్బులను రికవరీ చేస్తామని చెప్పారు. అటవీశాఖ అధికారులు ప్రజాదర్బార్కు రాకుండా నిర్లక్ష్యం చేసినందుకు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మండలంలోని అహ్మద్నగర్, బ్రాహ్మణపల్లి, తిరుమలాపూర్, తుజాల్పూర్ తదితర గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు తెలిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 60,610 రికవరీ చేస్తామని వివరించారు. వారం రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు రూ. 9.18 లక్షల నిధులకు సంబంధించి సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఏపీఓ వైద్య శ్రీనివాస్, ఏపీడీ బాలయ్య, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిణి అరుణ, ఏపీఓ అంజిరెడ్డి, సోషల్ ఆడిట్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలోని ఎంజేపీ (మహాత్మ జ్యోతిబాపూలే) బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంజేపీ సొసైటీ డీసీఓ, తునికి ఎంజేపీ ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బాలురు, బాలికల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో 2025– 26 సంవత్సరంలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ప్రవేక్ష పరీక్ష ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
కష్టపడి చదివితే బంగారు భవిష్యత్
డీఈఓ రాధాకిషన్చేగుంట(తూప్రాన్): బంగారు భవిష్యత్ కోసం కష్టపడి చదవాలని డీఈఓ రాధాకిషన్ విద్యార్థులకు సూచించారు. శనివారం చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రణాళికబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. అనంతరం కంప్యూటర్ శిక్షణ గదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూ పించాలని ఆదేశించారు. ఏఐతో మెరుగైన బోధన చిన్నశంకరంపేట(మెదక్): ఏఐతో మెరుగైన బోధన అందుతుందని డీఈఓ అన్నారు. శనివారం నార్సింగి మండలంలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏఐ స్కూల్ ప్రోగ్రాంను ప్రారంభించి మాట్లాడారు. వారంలో రెండు రోజులు విద్యార్థులకు ఏఐ బోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ స్కూల్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓ సుదర్శన మూర్తి, జెడ్పీహెచ్ఎం తిరుపతి, పీఎస్ హెచ్ఎం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
మెదక్జోన్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరై రెండు నెలలు కావొస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. మండలానికో నమూనా ఇంటిని నిర్మించతలపెట్టిన అవి సైతం పూర్తి కావడం లేదు. ఈ విషయంపై శనివారం సాక్షిలో ‘నమూనా.. పూర్తయ్యేనా’ అనే కథనం ప్రచురితం అయింది. దీనికి స్పందించిన కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్మిస్తున్న మోడల్ ఇళ్లు 45 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ మాణిక్యం, పీఆర్ ఈఈ నర్సింలు, డీఈ యాదగిరి ఉన్నారు. దుర్గమ్మ సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి పాపన్నపేట(మెదక్): పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ మ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఈఓ చంద్రశేఖర్ ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ విశిష్టతను వివరించారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి న్యా యమూర్తిని సత్కరించారు. వారి వెంట పాపన్నపేట ఎమ్మార్వో సతీష్, ఎస్సై శ్రీనివాస్గౌడ్, సిబ్బంది ఉన్నారు. ఇంటి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు రామాయంపేట(మెదక్): ఇంటి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేయాలని మెప్మా పీడీ, రాష్ట్ర మున్సిపాలిటీల ప్రత్యేక అధికారి శ్రీపాద రామేశ్వర్ ఆదేశించారు. శనివారం రామాయంపేట మున్సిపాలిటీని ఆకస్మికంగా సందర్శించి పన్నుల వసూళ్ల విషయమై సమీక్షించారు. ఈమేరకు కమిషనర్, మేనేజర్, ఆయా వార్డుల అధికారులు, బిల్ కలెక్టర్లతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో 95 శాతానికి పైగా పన్నులు వసూలు చేయాలని, నిర్లక్ష్యం చూపే అధి కారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పన్నుల వసూళ్లలో అలక్ష్యం వహించే వారి వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. నేడు దిష్టిబొమ్మల దహనం నర్సాపూర్: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆదివారం ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ ప్రసాద్కుమార్ పట్ల జగదీశ్వర్రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదలను అగౌరవపర్చారని ఆరోపించారు. దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని కార్యకర్తలు, అనుబంధ సంస్థల నాయకులు విజయవంతం చేయాలని కోరారు. -
మాటలే తప్ప చేతలేవీ..?
● మైనార్టీలకు అన్యాయం చేసిన సర్కార్ ● కేబినెట్లో వారికి చోటేది..? ● హామీల అమలులో విఫలం ● ముఖ్యమంత్రి రేవంత్పై హరీశ్రావు ధ్వజం రామచంద్రాపురం(పటాన్చెరు): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు శూన్యమని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీల సంక్షేమానికి రూ. 4వేల కోట్లు ఇస్తానని హామీనిచ్చిందన్నారు. అయితే గత బడ్జెట్లో రూ.3వేల కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ.వెయ్యికోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ యువతకు, మహిళలకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, దానితోపాటు సకాలంలో షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు పెచ్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి కేబినెట్లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేరని కనీసం వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని చెప్పుకుంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని వ్యక్త పరిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తెల్లాపూర్ ప్రజల అవసరాల కోసం రూ.500 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో కోట్లాది రూపాయలతో ఫంక్షన్ హాల్ను నిర్మించామని అయితే ఇప్పటికీ అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యకోసం వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం వెల్దుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. మందులు అందుబాటులో ఉన్నాయా..? ఏమైనా కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వార్డులు కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేద ప్రజలే ఎక్కువగా వస్తారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే మెదక్జోన్:విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం పట్టణంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. రాజకీయ ప్రతినిధులతో సమావేశం మెదక్ కలెక్టరేట్: నూతన ఓటరు దరఖాస్తు ఫారాలను పరిశీలించి పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చులకు సంబంధించిన నివేదికలు వెంటనే అందజేయాలని సూచించారు. -
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
మెదక్ కలెక్టరేట్: ఓటరు నమోదు నిరంతర ప్రక్రియగా చేపడుతున్నట్లు ఆర్డీఓ రమాదేవి తెలిపారు. శనివారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఓటరు జాబితా నమోదు, బూత్స్థాయి ప్రతినిధుల నియామకంపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితాకు సంబంధించి ఫారం 6, 7, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. నూతన ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ల వివరాల తొలగింపు తదితర వివరాలను నమోదుకు సహకరించాలని సూచించారు. -
పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యతో గొడవపడి భర్త.. పటాన్చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్లో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం
పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలుపటాన్చెరుటౌన్: తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని శుక్రవారం కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ... తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. ప్రతీ గణేశ్ దేవాలయాల్లో వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుందని కానీ ఈ దేవాలయంలో మాత్రం తొండం కుడి వైపు ఉండటంతోపాటు తొండంలో మూడో కన్ను ఉంటుందన్నారు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఏళ్లుగా తనకు అలవాటని అందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. -
చిరుత దాడిలో దూడలు హతం
రామాయంపేట(మెదక్): మండలంలోని దంతేపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చిరుత దాడిలో రెండు దూడలు హతమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు నక్కిర్తి స్వామి తన పశువులను రోజూ మాదిరిగానే వ్యవసాయ బావి వద్ద ఉంచగా, రాత్రి చిరుత దాడి చేసి హతమార్చింది. అక్కడికి సమీపంలో చిరుత పాద గుర్తులు గమనించిన రైతు శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు మృతిచెందిన దూడల కళేబరాలను పరిశీలించారు. జాతీయ కబడ్డీ క్యాంపునకు ఎంపిక పాపన్నపేట(మెదక్): సబ్ జూనియర్ బాలికల, బాలుర విభాగంలో బాచుపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ కబడ్డీ అకాడమీ క్యాంపునకు జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారని శుక్ర వారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్రెడ్డి, సెక్రటరీ రమేష్ వెల్లడించారు. బాలికల విభాగంలో రాధిక, బాలుర వి భాగంలో నరేందర్ ఎంపికైనట్లు చెప్పారు. ఇటీవల వికారాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొని ప్రతిభ చూపారని తెలిపారు. 108 కిలోల గుండు ఎత్తుకుని ప్రదక్షిణలు నారాయణఖేడ్: ఖేడ్ మండలం తుర్కాపల్లిలో హోలీ పండుగ సందర్భంగా బండరాళ్ల గుండ్లు ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామానికి చెందిన యువకుడు సాతిని జ్ఞానేశ్వర్ 108 కిలోల బరువున్న బండరాయి గుండును అవలీలగా ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ అయిదు ప్రదక్షణలు చేసి ఔరా అనిపించాడు. గ్రామ పెద్దలు కరతాళధ్వనులతో అతడిని ఉత్సాహపరిచారు. అనంతరం రంగులు చల్లుకుంటూ హోలీ పండును నిర్వహించుకున్నారు. గొడవపడి.. గొంతుకోసి కౌడిపల్లి(నర్సాపూర్): కట్టుకున్న భార్యనే గొంతు కోసి కడతేర్చాలని చూశాడు ఓ భర్త. ఈసంఘటన మండల పరిధి తిమ్మాపూర్లో జరిగింది. ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన స్వాతిని బాలానగర్కు చెందిన రమేష్కు ఇచ్చి పదేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే కొన్నేళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేష్ నిత్యం గొడవపడేవాడు. అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దలు కల్పించుకొని నచ్చచెప్పారు. అయినా అతడిలో మార్పురాలేదు. ఈనెల 6వ తేదీన సైతం స్వాతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె తల్లిగారి ఊరు తిమ్మాపూర్కు వెళ్లింది. ఈక్రమంలో గురువారం సాయత్రం తిమ్మాపూర్ చేరుకున్న రమేష్ మాట్లాడేది ఉందని భార్యను గ్రామ శివారులోని హనుమాన్ ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొడవపడి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో చేయి అడ్డుపెట్టడంతో స్వాతి తీవ్రంగా గాయపడింది. అరుపులకు చుట్టుపక్కల ఉన్న వారు రావడంతో రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గాయపడిన స్వాతిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాజగోపాల్రావుమనోహరాబాద్(తూప్రాన్): భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడే పరిశ్రమలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాజగోపాల్రావు అన్నారు. గురువారం మండలంలోని రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో నిర్వహించిన జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లక్ష్మీకుమారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కార్మికులు, పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికుల రక్షణ బాధ్యత పరిశ్రమలపై ఉందన్నారు. భద్రత ముందు ఉత్పత్తి తర్వాత అనేది గుర్తుంచుకోవాలని సూచించారు. పరిశ్రమలతో స్థానికులకు ఉపాధితో పాటు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధి వసంతకుమార్, చక్రవర్తి నర్సింహం పాల్గొన్నారు. -
ఒంటి పూట బడులు
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025● రేపటి నుంచి అమలు ● ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ● యథావిధిగా మధ్యాహ్న భోజనం పాపన్నపేట(మెదక్): వేసవికాలం.. పైగా ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అను గుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లావ్యాప్తంగా 1,067 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 1. 23 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని సూచించారు. న్యూస్రీల్ -
చెక్డ్యాంలతో మేలు
వెల్దుర్తి(తూప్రాన్): చెక్డ్యాంలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. మండలంలోని మానెపల్లి, మంగళపర్తి గ్రామ శివారులో వాగుపై సెహగల్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మించిన చెక్ డ్యాంను గురువారం వారు ప్రారంభించి మా ట్లాడారు. అన్నదాతల సంక్షేమానికి సెహగల్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషిని కొనియా డారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కా ర్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఇరిగేషన్ డీఈ రాజేందర్, మాజీ సర్పంచ్ రామకృష్ణారావు, సెహగల్ ఫౌండేషన్ అడ్మిన్ మేనేజర్ బాలరాజ్, సీనియర్ ఇంజనీర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
వన దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మకు గురువారం పల్లకీ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూలతో అలంకరించి పల్లకీపై ఊరేగించారు. ఈఓ చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. ‘వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి’మెదక్ కలెక్టరేట్: ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ వర్తించేలా ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదన్నా రు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రిలే దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేసి గత అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మురళి, బాల్రాజ్, సంపత్కుమార్, గట్టయ్య, యాదగిరి, దేవేందర్, నాగరాజ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళల్లో అపారమైన శక్తి సంపద
మెదక్ మున్సిపాలిటీ: మహిళల్లో అపారమైన శక్తి సంపద ఉందని, అదే సమయంలో అప్రమత్తత అవసరమని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు మగ, ఆడపిల్లలను సమానంగా చూడాలని సూచించారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమన్నారు. మహిళా సాధికారతకు చదువు చాలా ముఖ్యం అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. మగ పిల్లలకు మహిళలను గౌరవించే విధంగా విలువలు, క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందన్నారు. మహిళలు ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆపద మిత్ర పథకం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తు ప్రమాద తగ్గింపు, విపత్తు నిర్వహణ వ్యవస్థ, విద్యా సామర్థ్యాన్ని బలోపేతం, సాంకేతిక పురోగతి వంటి వాటిపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న యువతీ యువకులు 200 మంది వలంటీర్లను ఎంపిక చేయాలన్నారు. ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు పక్కా ప్రణాళికతో అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి 3 నెలలకోసారి ఓటర్ల జాబితా నవీకరణ పకడ్బందీగా చేపట్టాలని, 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏఐ సమర్థవంతంగా అమలవుతున్నట్లు వివరించారు. -
సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపా రు. బుధవారం మండలంలోని మహమ్మద్నగర్ శివారులో వరి పొలాలను పరిశీలించారు. వరి పంటకు ఇంకా ఎన్ని నీటి తుడులు అవసరం, ఎన్నిరోజులకు కోతకు వస్తుంది. దిగుబడి అంచనా, బోరు బావుల్లో ప్రస్తుత నీటి లభ్యత.. తదితర విషయాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈసంద్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి వనరులకు అనుగుణంగా పంటను సాగు చేయాలని చెప్పారు. వచ్చే యాసంగి సీజన్లో అయిన బోరుబావిలో నీటి లభ్యత ఆధారంగా రైతులు పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశా రు. రిజిస్ట్రేషన్లు సరిగా చేయాలని, రికార్డులు సక్రమంగా భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, సర్వేయర్ మొగులయ్య రైతులు ఉన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
నిమ్జ్ గ్రామసభలో స్వల్ప ఉద్రిక్తత
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని మామిడ్గి గ్రామంలో నిర్వహించిన (నిమ్జ్) గ్రామ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్జ్ భూసేకరణకు సంబంధించి బుధవారం ఉదయం గ్రామ సమీపంలో గల రైతు వేదికలో పోలీస్ బందోబస్తు మధ్య గ్రామసభ నిర్వహించారు. సభకు నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజు, న్యాల్కల్ తహసీల్దార్ భూపాల్ హాజరయ్యారు. భూసేకరణకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్ రాజు మాట్లాడుతూ... నిమ్జ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు కలుగజేసుకుని మావి సారవంతమైన మూడు పంటలు పండే భూములని, ప్రభుత్వం ఇచ్చే పరి హారం ఎంతమాత్రం సరిపోదని, మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఒకరిద్దరు రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిమధ్య మాటా మాటా పెరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ నుంచి బయటకు వచ్చిన కొందరు రైతులు నిమ్జ్కు భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేశారు. -
యువజన ఉత్సవాల్లో విద్యార్థుల ప్రతిభ
నర్సాపూర్ రూరల్: యువజన ఉత్సవాల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేంద్ర యువజన, వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ఉపన్యాస, సైన్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో కళాశాల విద్యార్థి వైష్ణవి బృందం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కులో సీతాకోక చిలుకల సంరక్షణ విధానంపై నిర్వహించిన ప్రాజెక్టు మొదటి బహుమతి సాధించింది. వారు రూ. 7 వేల నగదు బహుమతి అందుకున్నారు. జానపద నృత్య ప్రదర్శనలో విద్యార్థిని సంపూర్ణ బృందం తృతీయ బహుమతి, కవితా రచన పోటీల్లో విద్యార్థి మహేక్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, అధ్యాపకులు డాక్టర్ సురేష్ కుమార్ ఇతరులు విద్యార్థులను అభినందించారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
శివ్వంపేట(నర్సాపూర్): సీసీ రోడ్డు పనుల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండల పరిధి లచ్చిరెడ్డిగూడెంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 15 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి బుధవారం వచ్చారు. అయితే స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి లేకుండా ప్రొటోకాల్ విస్మరించి ఎలా పనులు ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. జై రేవంత్రెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు, జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాజిరెడ్డి పనులు ప్రారంభించి మాట్లాడారు. పార్టీలకతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అ‘విశ్రాంత’ పోరాటం
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025● రిటైర్డ్ ఉద్యోగులకు అందని బెనిఫిట్స్ ● ఏడాదిగా తప్పని ఎదురుచూపులు D ¸÷sZÌZ° Ð]lÅMìS¢ fÒ$ÆŠ‡ çßæÒ$§Šæ. Ð]lÊyýl$ §ýlÔ>-»êªÌS ´ër$ E´ë-«§éÅ-Ķæ¬yìlV> Ñ«§ýl$Ë$ °Æý‡Ó-Ç¢…_ 2024 Ð]l*ÇaÌZ ÇOsñæÆŠḥz AĶæ*ÅÆý‡$. M>V> C™èl-°MìS {糿¶æ$™èlÓ… ¯]l$…_ Æý‡*. 50 ÌS„ýSÌS ÇOsñæÆð‡Ã…sŒæ »ñæ°íœsŒæÞ Æ>ÐéÍÞ E…¨. Ð]l^óla yýlº$¾ÌS™ø CË$Ï MýSr$t-Mø-ÐéÌS° MýSÌSÌS MýS¯é²yýl$. Hyé-O§ðl¯é yýlº$¾Ë$ ^ól†MìS Æ>MýS-´ù-Ð]l-yýl…™ø Cº¾…¨ ç³yýl$™èl$-¯é²Æý‡$. hÌêÏÌZ CÌê…sìæ ÐéÆý‡$ Ð]l$Æø 140 Ð]l$…¨ E§øÅVýS$Ë$ E¯é²Æý‡$. మెదక్జోన్: సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. సర్వీస్లో దాచుకున్న డబ్బులు.. పదవీ విరమణతో అందే ఆర్థిక ప్రయోజనాలతో ఎన్నెన్నో కలలు కన్న వారి ఆశలు ఆడియాశలుగానే మారుతున్నాయి. బిడ్డ పెళ్లికి, సొంత ఇంటికి, పిల్లల చదువులకు ఢోకాలేదనుకుంటే సమయానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాక.. అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 200 మంది ఉద్యోగులు జిల్లాలో 2024 మార్చిలో సుమారు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యారు. కాగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో 60 మందికి అందజేశారు. మరో 140 మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. డబ్బుల కోసం నిత్యం ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే డబ్బులతో కొందరు ఇల్లు కట్టుకుందామని చూస్తుంటే, మరికొంత మంది ప్లాట్లు కొనుగోలు చేయాలని, ఇంకొందరు పిల్లల పెళ్లిళ్లు చేయాలని అనుకున్నామని.. సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఆలోచనలు తలకిందులయ్యాయని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పొడిగిస్తే ప్రస్తుత ప్రభుత్వం రిటైర్డ్ అయి ఏడాది గడుస్తున్నా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలో 2021లో వివిధ శాఖల్లో 200 మంది ఉద్యోగులు రిటైర్డ్ కావాల్సి ఉండగా, గత ప్రభుత్వం మూడేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో 2024 మార్చిలో పదవీ విరమణ పొందారు. న్యూస్రీల్ -
యువికాతో యంగ్ సైంటిస్టులు
శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇస్రో చక్కటి అవకాశం ● 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ● ఫిబ్రవరి 24నుంచి ఈనెల 23వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ● కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మెదక్జోన్: అంతరిక్ష పరిశోధన రంగంలో ఆసక్తి, భావి శాస్త్రవేత్తలు కావాలనుకుంటున్న విద్యార్థులకు భారత ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష పరిశోధన– యువవిజ్ఞాన్ కార్యక్రమం (ఐఎస్ఆర్డీ–యువికా) ద్వారా విద్యార్థులను యువశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువికా కార్యక్రమంలో చేరేందుకు ఇస్రో అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి, అభిరుచి ఉన్న విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 23 తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు http://jigyasa.iirs.gov.in/yuvika ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సమాచారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్ఆర్డీ) పాఠశాల విద్యార్థుల కోసం యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో 2019 నుంచి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్షశాస్త్రంపై వాటిని నిజజీవితంలో ఉపయోగించుకోవడం వంటి ప్రాథమిక జ్ఞానం అందించడమే లక్ష్యంగా అవగాహన కల్పిస్తారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఈ సమాచారాన్ని విద్యాశాఖ అధికారులు చేరవేశారు. ఎంపికై న విద్యార్థులకు అవగాహన ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ఏప్రిల్ 7న జాబితా విడుదల అవుతుంది. మే 19 నుంచి మే 30 వరకు ఇస్రోకు చెందిన 7 కేంద్రాలలో ఏదోఒక సెంటర్ను కేటాయిస్తారు. ఇందులోభాగంగా అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, తిరువనంతపురం, బెంగళూర్, షిల్లాంగ్తోపాటు హైదరాబాద్ తదితర కేంద్రాల్లో ఎంపికై న విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇందులో ప్రధానంగా అంతరిక్షం, సాంకేతికత, అంతరిక్షశాస్త్రం (ఖగోళశాస్త్రం) (అస్ట్రానమీ)పై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా అంతరిక్ష కేంద్రాల్లోని ప్రయోగశాలల సందర్శన అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశం, ముఖాముఖి చర్చలు, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భావిభారత శాస్త్రవేత్తలుగా తయారయ్యేందుకు ఇస్రో కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. –రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మెదక్ ఎంపిక విధానం ఇలా.. 8వ తరగతిలో సదరు విద్యార్థికి వచ్చిన మార్కులను 50 శాతంగా తీసుకుంటారు. ఆన్లైన్లో నిర్వహించే క్విజ్ ప్రతిభకు 10 శాతం, ఇంతకుముందు పాల్గొన్న జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి సైన్స్ఫెయిర్లకు 10, ఒలంపియాడ్లో పాల్గొన్న వాటికి ఐదు, స్పోర్ట్స్లో పాల్గొన్న వారికి 5 , ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో పాల్గొన్న వారికి 5, గ్రామీణప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు 15 శాతం మార్కులను కలిపి ఎంపిక చేస్తారు. -
పాఠశాల నిర్వహణ ఇలాగేనా?
మెదక్జోన్: ‘పాఠశాల నిర్వహణ ఇలానే ఉంటుందా..? బాలికలు ఉపయోగించే మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కనీసం తలుపులు లేకపోవటం బాలల హక్కులను హరించటమే అవుతుంది’ అని సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలను ఎంఈఓ నీలకఠంతో కలిసి తనిఖీ చేశారు. పాఠశాల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడంపై మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే శాఖాపరమై నా చర్యలు తప్పవని ఎంఈఓ హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాలలకు ప్రభు త్వం పంపిణీ చేసిన వంట సామగ్రిని వినియోగించుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట, రాయిలాపూర్, తాళ్లగడ్డతండా పాఠశాలలను ఎంఈఓ బాలరాజుతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనం తయారుచేసేందుకు ఇటీవల సామగ్రిని పంపిణీ చేసిందన్నారు. వాటిని వినియోగించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండిపెట్టాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం, బియ్యం పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రూప్– 2లో మెరిసిన అర్జున్రెడ్డి పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన అర్జున్రెడ్డి గ్రూప్–2 పరీక్షలో స్టేట్ 18వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. హవేళిఘనాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అర్జున్రెడ్డి గ్రూప్–2లో 413.890 మార్కులు సాధించాడు. అతని తండ్రి నరేందర్రెడ్డి మెదక్లో లైబ్రేరియన్గా, తమ్ముడు అరుణ్రెడ్డి ఆర్అండ్బీలో ఏఈగా, బాబాయి శ్రీనివాస్రెడ్డి హెడ్ కానిస్టేబుల్గా పనిచేసున్నారు. కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. గ్రూప్–1 కొలువు కొట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు పాపన్నపేట(మెదక్): రైతులు ఆధునిక సాగుకు సిద్ధం కావాలని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని పాపన్నపేట, చిత్రియాల్ డీసీఎంఎస్ ఎరువుల దుకాణాల్లో రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అవసరానికి అనుగుణంగా వ్యవసాయ అధికారుల సలహా మేరకు ఎరువులు వాడా లని సూచించారు. దుకాణాదారులు నాణ్యమైన ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేయాలన్నారు. రైతులకు ఏ సమస్యలు వచ్చినా అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట పాపన్నపేట మండల వ్యవసాయ అధికారి నాగమాధురి ఉన్నారు. డీసీసీబీ చైర్మన్కు పితృ వియోగం కొండపాక(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తండ్రి రాంరెడ్డి(80) హైదరాబాద్లో మృతి చెందారు. స్వగ్రామమైన కొండపాకలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు డీసీసీబీ చైర్మన్ను పరామర్శించారు. -
డంప్యార్డును ఎత్తి వేయాలి
నర్సాపూర్: ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంప్యార్డును ఎత్తి వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ డిమాండ్ చేశారు. నర్సాపూర్లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. డంప్యార్డుతో నర్సాపూర్ అడవులు, చెరువు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ డంప్ యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. దీక్షల్లో జేఏసీ నాయకులు శ్రీధర్గుప్తా, రాజేందర్, భిక్షపతి, జ్ఞానేశ్వర్, రమణరావు, మార్వాడి సంఘం నాయకులు మేఘరాజ్, రమేశ్, మోహన్ పాల్గొన్నారు. -
త్వరలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు
కార్యాలయాన్ని పరిశీలించిన న్యాయమూర్తి తూప్రాన్: డివిజన్ కేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు కార్యాచరణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు కోసం ఎంపీడీఓ కార్యాలయం భవనాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీశారద మంగళవారం పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, తహసీల్దార్ కార్యాలయం, వృథాగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించారు. కాగా ఎంపీడీఓ కార్యాలయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కాగా, తూప్రాన్లో జూనియర్ సివిల్ కోర్టు భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు దూరభారం తగ్గనుంది. -
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్పీఓ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెల్మకన్నలోని ఎస్సీ బాలుర హాస్టల్ను డీఎల్పీఓ సాయిబాబా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో కిచెన్రూం, హాస్టల్ గదులు, టాయిలెట్స్, ఇతర పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, మెనూ ప్రకారం భోజనం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి పెట్టాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఉదయం, రాత్రి స్టడీ అవర్ నిర్వహించాలని, సమస్యలుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి జయరాజ్, వెల్మకన్న, కొట్టాల పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.చదవడం, రాయడం రావాలిఎఫ్ఎల్ఎన్ జిల్లా కోఆర్డినేటర్ సిరికౌడిపల్లి(నర్సాపూర్): ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రాయాలని ఎఫ్ఎల్ఎన్ (ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ) జిల్లా కోఆర్డినేటర్ సిరి అన్నారు. మంగళవారం కౌడిపల్లి, దేవులపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బాలరాజుతో కలిసి సందర్శించారు. ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి చతుర్విద ప్రక్రియలు చదవడం, రాయడం, కూడికలు, గుణితం కచ్చితంగా రావాలన్నారు. అనంతరం ఎంఈఓ బాలరాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలు, బాత్రూంలు, మరగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. సమస్యలుంటే చెప్పాలని, విధులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి పూజలుపాపన్నపేట(మెదక్): ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి మంగళవారం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చన నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈఓ చంద్రశేఖర్ శాలువాతో సత్కరించారు.విజయసేనారెడ్డికి 259వ ర్యాంకుచేగుంట(తూప్రాన్): మండలంలోని బీకొండాపూర్కు చెందిన విజయసేనారెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 259వ ర్యాంకు సాధించారు. మండలంలోని మక్కరాజీపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంచి ర్యాంకు సాధించిన విజయసేనారెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, స్నేహితులు అభినందించారు. ఐదేళ్ల కఠోర దీక్షకు తగిన ఫలితం వచ్చిందని విజయసేనారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.గ్రూప్ 2లో 103వ ర్యాంక్హుస్నాబాద్: పట్టణానికి చెందిన అయిలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్ 2లో స్టేట్ ర్యాంక్ సాధించారు. గ్రూప్ 2లో 392.5 మార్కులు వచ్చాయి. గతంలో గ్రూప్ 4లో 600 ర్యాంక్ సాధించిన మణికంఠేశ్వర్ రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.ఆదర్శలో ప్రవేశానికి గడువు పెంపుచిన్నకోడూరు(సిద్దిపేట): ఆదర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులతో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలన్నారు. -
ప్రతిభను చాటేందుకు సదావకాశం
మెదక్ కలెక్టరేట్: యువత తమ ప్రతిభను చాటేందుకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వశాఖ, మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రాధాకిషన్, డీవైఎస్ఓ దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యువ ఉత్సవం ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక మంచి వేదిక లభించిందన్నారు. శాస్త్ర సాంకేతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, రచనా పోటీలు వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. యువత ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాస్థాయి విజేతల వివరాలను జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కాగా, విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు గణపతి, తిరుమలరెడ్డి, మురళి, దీపికా, సురేష్, వెంకటేశ్వ ర్లు, అధికం రాజు, యువజన సంఘాల అధ్యక్షులు, యువజన సంఘాల ప్రతినిధులు రాజు, 640 మందిపైగా యువతి యువకులు పాల్గొన్నారు. యువజనులు సద్వినియోగం చేసుకోవాలి డీఈఓ రాధాకిషన్ -
నీటిని తోడేస్తే కఠిన చర్యలు
నీటిపారుదల శాఖ ఏఈ హరీష్కొల్చారం(నర్సాపూర్): వేసవికాలం కావడం, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమంగా నీటిని తోడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఏఈ హరీష్ హెచ్చరించారు. మండలంలోని సంగాయిపేట పెద్ద చెరువులోని నీటిని కొందరు ముందస్తు అనుమతులు లేకుండా మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారని రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన మత్స్యకారులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువును సందర్శించిన ఏఈలు హరీష్, మాధురి చెరువులో ఏర్పాటు చేసిన మోటార్లను వెంటనే తొలగించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే అవసరం మేరకు అనుమతులు తీసుకొని నీటిని వాడుకునేందుకు అనుమతులు మాత్రమే ఉన్నాయన్నారు. అంతకుముందు గ్రామానికి చెందిన మత్స్యకారులు మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో చెరువులో నీటి నిల్వ రోజురోజుకు తగ్గిపోతున్నాయని, ఇప్పుడు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తే నీటిమట్టం తగ్గిపోయి చెరువు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేప పిల్లలు చనిపోయి తాము ఆర్థికంగా దెబ్బ తినే పరిస్థితి వస్తుందని, మోటార్లను వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
దివ్యాంగుల సమస్యలపై కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన లభిస్తుందన్నారు. దివ్యాంగుల నుంచి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వర న్యాయం జరిగే దిశగా చర్యలు చేపడతామన్నారు. వివిధ సమస్యలపై 23 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సత్వరంగా పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు. చివరి ఆయకట్టుకు నీరు పాపన్నపేట(మెదక్): ఫతే నహర్ కెనాల్ కింద చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని శానాయపల్లి, పొడిచన్పల్లి గ్రామాల చివరి ఆయకట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..నీటి లభ్యత, కరెంట్ సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. ఘనపురం ఆనకట్ట నుంచి ఇంకా ఎన్ని తడులు అవసరమవుతాయని, సన్న వరి ఎన్ని ఎకరాలు వేశారని అధికారులను అడిగారు. ఆయన వెంట ఏఇ విజయ్ ఉన్నారు. -
అలసత్వం.. సమన్వయ లోపం..
నరేందర్రెడ్డి ఓటమికి కారణాలివే.. ● ఉమ్మడి మెదక్లోనే అతి తక్కువ ఓట్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సుదీర్ఘ చర్చ ● ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్ బి.మహేష్కుమార్గౌడ్తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. పాత బిల్లులు క్లియర్ చేయండి త్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాకు రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులుమంత్రి కొండా సురేఖ హామీ మెదక్జోన్: జిల్లాకు త్వరలో రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలుఅంశాలపై ఎమ్మెల్యే రోహిత్రావు, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్తో పాటు పలువురు నేతలు మంగళవారం హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహను కలిశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక బిల్లులను పెండింగ్లో పెట్టిందని, వాటిని కూడా క్రమంగా నిధులను విడుదల చేస్తామన్నారు. గూడెం మహిపాల్రెడ్డి గైర్హాజరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరు కాగా., ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పార్టీ నేతలు ఆవుల రాజిరెడ్డి, పూజల హరికృష్ణ, తూంకుంట నర్సారెడ్డి, నీలం మధు, కాటాశ్రీనివాస్గౌడ్, ఏ.చంద్రశేఖర్, ఎన్.గిరిధర్రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. -
ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎప్ఐఆర్ నమోదైంది. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. రఘునందన్ రావు ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
డీఈఓ రాధాకిషన్అల్లాదుర్గం(మెదక్)/పెద్దశంకరంపేట/చేగుంట(తూప్రాన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సోమవారం అల్లాదుర్గం జెడ్పీ, ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించనున్నట్లు వివరించారు. ఆయన వెంట ఎంఈఓ ధనుంజయ్య ఉన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు సులభ రీతిలో బోధన చేయడంతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈసందర్భంగా ఎఫ్ఎల్ఎన్ ద్వారా ఏ విధంగా బోధన చేపడుతున్నారో పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మక్కరాజీపేటలో పనిచేసిన సీఆర్పీల కుటుంబాలకు ఆర్థికసాయం పత్రాలను అందజేశారు. -
చివరి ఆయకట్టుకూ నీరందించాలి
మెదక్ కలెక్టరేట్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం సచివా లయం నుంచి సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమావేశమై తగు సూచనలు సలహాలు చేశారు. ఇరిగేషన్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి వృథా లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నీటి పొదుపు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ నీటి కొరత రాకుండా చూడాలని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఏఓ వినయ్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగ అభివృద్ధికి 30 శాతం నిధులు కేటాయించి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందన్నారు. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏడాదిగా హాస్టల్, మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నాయ కులు ని ఖిల్, విష్ణు సాంసన్, బాలరాజు పాల్గొన్నారు. కరస్పాండెంట్కు షోకాజ్ నోటీస్ వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలం రా మంతాపూర్ గ్రామ శివారులో అనుమతులు రాకు ండానే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన తీరుపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘ప్రైవేట్ ఇష్టారాజ్యం’ కథనానికి అధికారులు స్పందించారు. యూకేజీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్, పాఠశాలకు సంబంధించిన కరపత్రాల పంపిణీపై మూడు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎంఈఓ లీలావతి సోమవారం జాన్స్ అకాడమీ కరస్పాండెంట్కు షోకాజ్ నోటీస్ అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏదైనా ప్రవేశ పరీక్షను నిర్వహించే ముందు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన సొసైటీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుపాపన్నపేట(మెదక్)/చిన్నశంకరంపేట: రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్రావు తెలిపారు. సోమవారం మండలంలోని ముద్దాపూర్లో ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, వైద్యరంగా లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పాపన్నపేట మండలంలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాపూర్ శివారులో రెండు బ్రిడ్జిలు, ఆలయం వరకు సీసీ రోడ్డు, బోరు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చిన్నశంకరంపేట నాయకులు ఆవుల గోపాల్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్, నాయకులు ప్రశాంత్రెడ్డి, ఆకుల శ్రీనివాస్, గౌస్, ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలు తదితరులు ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండలంలోని భగీరథపల్లిలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించి మాట్లాడారు. పదేళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని అన్నారు. గతంలో సొంత జిల్లాలోని ఏడుపాయలను దర్శించుకునే సమయం కూడా అప్పటి సీఎంకు లేకపోయిందని, నేడు సీఎం రేవంత్రెడ్డి దుర్గామాతను దర్శించుకొని అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు నిధులు
● నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ఇప్పటికే 25 ఎకరాలు కేటాయింపురామాయంపేట(మెదక్): ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఉత్వర్తులు అందాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ పాఠశాల భవన సముదాయం నిర్మాణానికి రామాయంపేట పట్టణ శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొదటి విడతలో 14 నియోజకవర్గాకు ఈ స్కూళ్లు మంజూరయ్యాయి. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు సామాజిక అంతరాలు లేని అన్నివర్గాలకు చెందిన 2,500 పైగా విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు.. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్కూల్ భవన నిర్మాణం జరపనున్నారు. ఈ స్కూల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు వసతి కల్పించనున్నారు. హాస్టళ్లు, కంప్యూటర్ల గదులు, ఆడిటోరియం, అవుట్ డోర్, ఇండోర్ జిమ్, క్రీడా మైదానాలు, టెన్నీస్ కోర్టు, వంటశాల, గ్రంథాలయాలు, క్రీడలకు సంబంధించి వేర్వేరుగా భవనాలు నిర్మించనున్నట్లు సమాచారం. క్రీడలతో పాటు కళలకు ఈ స్కూల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
రవాణా శాఖలో అవినీతిని అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ వ్యవస్థను రద్దు చేసి అవినీతిని అరికట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రవాణా శాఖలో అనధికార వ్యక్తులు అన్నింటా పెత్తనం చెలాయిస్తూ చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వాహనదారులు, అధికారులకు మధ్య ఏజెంట్లు మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్నీ తెలిసిన ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంజీవులు, సంపత్కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్, సంజీవులు, కృష్ణ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
పైరవీలకు తావులేదు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సంప్రదించాలని.. పైరవీలకు తావులేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్శాఖ పని చేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయండి మెదక్జోన్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. దుర్గమ్మ సేవలో ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి దర్శి ంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం గాజులమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రంగు రంగుల గాజులతో అలంకరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్రెడ్డి, నాయకులు కృష్ణ, సామ్యానాయక్, వెంకట్రాంరెడ్డి, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 111 మంది గైర్హాజరు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవా రం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 5,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 5,529 హాజరయ్యారు. మరో 111 మంది వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేదని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి మాధవి తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్, సమస్యలు ఉత్పన్నం కాలేదని చెప్పారు. ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించండి మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షురాలు యశోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మెదక్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గడ్ లాంటి రాష్ట్రాలు చట్టాలు చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చట్టంలో సవరణలు చేసి దివ్యాంగులకు రెండు పోస్టులు నామినేట్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. దీని ద్వారా దివ్యాంగులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కవిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
‘పూలే’ అణగారిన వర్గాల ఆశాజ్యోతి
మెదక్ కలెక్టరేట్: అణగారిన వర్గాల అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే కృషి చేశారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్జమరి మల్లేశం అన్నారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్న జాతులు, అణగారిన వర్గాల కోసం భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళ విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలకు చాలా పరిశ్రమల్లో నేటికీ సమాన పనికి– సమాన వేతనం అందడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో అయినా వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, నా యకులు సత్యం, శ్యాంసన్, రాణి పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధునూదనాచారి అన్నారు. ఆదివారం చిన్నకోడూరులో జరుగుతున్న వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో వ్యవహరిస్తే అన్నింటా సత్ఫలితాలు ఉంటాయన్నారు. కాకతీయుల నాటి శివాలయాలు వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు. -
విలీన గ్రామం.. ప్రగతికి దూరం
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శివారు గ్రామాల్లో కనీస వసతులు కరువై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2018లో ఆవిర్భవించిన మున్సిపాలిటీలో గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలతో పాటు రెండు తండాలను విలీనం చేశారు. మున్సిపాలిటీలో విలీనం అనంతరం నిబంధనల మేరకు పన్నులు పెరిగాయి. అయినా ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. రెండు గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు పాక్షికంగా ధ్వంసం కాగా, వాటి మరమ్మతు విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈవిషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎంతమాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు, తండాల గిరిజనులకు ఉపాధి పనులు అత్యవసరం కాగా, మున్సిపాలిటీలో విలీనం అనంతరం ఈ పథకానికి నోచుకోకుండా పోయారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉపాధి పనులకు వెళ్లేవారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ దేవేందర్ను వివరణ కోరగా.. మున్సిపాలిటీలో విలీనమైన గుల్పర్తి, కోమటిపల్లి, రెండు తండాల అబివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి చేపట్టామని, నిధుల మంజూరును బట్టి మరిన్ని పనులు చేస్తామని పేర్కొన్నారు. -
‘ప్రైవేట్’ ఇష్టారాజ్యం!
● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బడులు ● విద్యా హక్కు చట్టానికి తూట్లు ● ఉదాసీన వైఖరిలో విద్యాశాఖాధికారులు మెదక్జోన్: ‘మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామ శివారులో ఇటీవల నూ తనంగా ఓ ప్రైవేట్ పాఠశాలను నిర్మించారు. అందులో సీబీఎస్ఈ విధానంలో బోధన ఉంటుందని.. యూకేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుందని కరపత్రాల ద్వారా ప్రచారం చేపడుతున్నారు. సదరు పాఠశాల నిర్వాహకులు వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థులకు ప్రవేశ టెస్టులు నిర్వహించి ఫీజుల వసూళ్లు చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ పాఠశాలకు అనుమతులు రాకపోవటం గమనార్హం’. నిబంధనలకు తూట్లు జిల్లాలో 220 ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో 45 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే వాటిలో 90 శాతానికి పైగా పాఠశాలల యాజమాన్యా లు విద్యాహక్కు చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలకు అనుమతి కావాలంటే విద్యార్థులకు పక్కా భవన సముదాయం, క్రీడా ప్రాంగణం, ఫిట్నెస్ ఉన్న బస్సులు, ఫైర్సేఫ్టీ అనుమతి పొంది ఉండాలి. కానీ నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి ప్రైవేట్ పాఠశాలలు, వాహనాలకు అనుమతులు ఇస్తున్నారని బాహాంటంగానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అదనుగా యా జమాన్యాలు పాఠశాల భవన నిర్మాణం నుంచి మొదలుకుని ఫీజుల వసూళ్ల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస విద్యార్హత లేని వారితో చదువులు చెప్పిస్తున్నట్లు సమాచారం. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా బోధన అందించాలి. కానీ అలాంటివి జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. నూతన పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నా యి. అయితే ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండ ఉందని, దీంతో చేసేది లేక చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటాం మాసాయిపేట మండలం రామంతాపూర్లో నూతనంగా నిర్మించిన పాఠశాలలో యూకేజీ నుంచి పదో తరగతి వరకు అనుమతులు అడిగారు. అనుమతుల కోసం రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)కి పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఆ పాఠశాలకు రాలేదు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – రాధాకిషన్, డీఈఓ -
మెనూ పక్కాగా అమలు చేయాలి
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనందించి, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ ఎంజేపీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్న విద్యార్థులను ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, వంట సరకులను నిల్వ చేసే గదిని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయోగశాలలు, తరగతి గదులను తనిఖీ చేశారు. నిత్యం పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు..? ఎలా చదువుతున్నారు? ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమయానికి అందిస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను ఎంచుకొని బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట ఏటీసీ సునీత, సిబ్బంది ఉన్నారు. -
సుందరంగా తీర్చిదిద్దుతాం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి క్షేత్రాన్ని అన్ని విధాల సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి మా కుటుంబానికి ఇలవేల్పు అని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి ఉందని, భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్,ఽ దర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, తురాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆరోగ్యశ్రీని రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా నిధుల విడుదల చేశామని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం ఇస్తామని, మహిళను కోటీశ్వరులను చేసేందుకు ప్రభత్వం అనేక పథకాలను తీసుకురానుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొమురవెల్లి క్షేత్రంలో వసతులు కల్పిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్వామి సన్నిధిలో కుటుంబసమేతంగా పూజలు -
తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయండి
మెదక్ కలెక్టరేట్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ కడారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వాలు మారిన మహిళల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించాలన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింస పెరిగిపోయిందన్నారు. మహిళా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు యశోద, కవిత, స్వరూప, కవిత, రేణుక, రాణి, వరలక్ష్మి, వీరమణి, రమాదేవి, మంజుల, లక్ష్మీసుజాత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మూల్యాంకన పారితోషికం ఏది: పీఆర్టీయూ మెదక్ కలెక్టరేట్: గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం బిల్లులు వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, స్వామ్యనాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. గత సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం చేసిన ఉపాధ్యా యులకు ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈసంవత్సరం మళ్లీ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, అయినా ఇప్పటివరకు చెల్లించకపో వడం ఏమిటని ప్రశ్నించాడు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే గత సంవత్సరం మూల్యాంకనం పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం నారాయణఖేడ్: తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్ మండలం సంగం గ్రామానికి చెందిన శ్రీనివాస్రావుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.(60 వేలు మంజూరుకాగా అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఆయన ఖేడ్లోని తననివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వైద్యరంగానికి ప్రాధాన్యతలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు. కాగా, మనూరు మండలం దన్వార్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యా యి. జాతర ఉత్సవాల్లో పాల్గొన్న సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సర్పంచ్ దిగంబర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. సీఐటీయూతోనే కార్మికులకు న్యాయం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్చెరు టౌన్: కార్మికుల కష్ట సుఖాల్లో ఎరజ్రెండా అండగా ఉంటుందని, సీఐటీయూ అంటేనే కార్మికులకు ఒక భరోసా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్చెరు పట్టణంలోని శ్రామిక భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు సీఐటీయూలో చుక్కా రాములు సమక్షంలో పెద్ద ఎత్తున చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. కిర్బీ పరిశ్రమలో కూడా కార్మికులకు అనేక చట్టపరమైన సౌకర్యాలు సీఐటీయూ సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధిస్తామని భరోసానిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజుల కోటలో రత్నాల వేట
గుప్త నిధుల తవ్వకాలతో.. ● ఆనవాళ్లు కోల్పోతున్న రంగంపేట కోట ● పట్టించుకోని ప్రభుత్వాలు ● పరిరక్షించాలంటున్న ప్రజలు కొల్చారం(నర్సాపూర్): రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి చరిత్రను తెలిపే కోటలు మాత్రం ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అందులో వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన రంగంపేట కోట ఒకటి. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న 14 సంస్థానాల్లో ఒకటైన పాపన్నపేట సంస్థానం కింద నిజాం నవాబులచే రాయ్భాగన్ (ఆడ సింహం)గా బిరుదు పొందిన రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి 1,700 సంవత్సర మధ్యకాలంలో ఈ కోటను నిర్మించారు. నిజాం పరిపాలనలో ఈ కోట ఆర్థిక భాండాగారంగా కొనసాగిందని చరిత్ర చెబుతుంది. అయితే ప్రస్తుతం ఆ కోట గుప్తనిధుల వేటగాళ్ల ధ్వంస రచనతో బీటలు వారింది. శిథిలావస్థకు చేరి అధ్వానంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన రంగంపేట కోట గురించి భావితరాలు తెలుసుకునేలా పురావస్తు శాఖ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే నిర్మాణానికి నాంది పాపన్నపేట సంస్థానం, ఆందోల్ సంస్థానాల మధ్య రాణి శంకరమ్మ పరిపాలన సాగిస్తూ తిరుగులేని రాణిగా కొనసాగింది. వృద్ధాప్యం వచ్చే క్రమంలో రాజ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బాలుడైన రాజా సదాశివరెడ్డిని దత్తత తీసుకొని రాజుగా ప్రకటించింది. ఆయన ఆందోల్ నుంచి రంగంపేట మీదుగా ఎడ్ల బండిలో పాపన్నపేటకు మంది మార్బలంతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కోట నిర్మించిన రంగంపేట శివారులోకి రాగానే వేట కుక్కలను తరుముతున్న కుందేలు కనిపించింది. ఈ విషయమై రాజ పురోహితులతో చర్చించారని, ఇక్కడి స్థల ప్రాముఖ్యతను గుర్తించి కోట నిర్మాణానికి నాంది పలికారన్నది చరిత్ర చెబుతోంది. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. చుట్టూ నాలుగు బురుజులు.. రెండు ప్రధా న ద్వారాలతో నిర్మాణమైన కోటలో రాణిమహల్, తాగునీటి అవసరాలకు మెట్లబావి, గుర్రపు శాల, అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, అద్దాలమేడ, గోడలపై నకశిల్పాలు ఇలా.. ఎన్నెన్నో కోటలో కనిపిస్తాయి. కోట బురుజుపై నుంచి చూస్తే మెదక్ ఖిల్లా కనిపించడం విశేషం. కోటలో నుంచి పాపన్నపేట కోట వరకు రహస్య గుహ ఉందని, దానికి నిదర్శనంగా లోపల నిర్మాణం కనిపించడం మరో విశేషం. అద్భుతమైన శైలిలో అనంతపద్మనాభుని మాదిరిగా దర్శనమిచ్చే రంగనాయక స్వామి విగ్రహంతో దర్శనమిచ్చే దేవాలయం, లింగ దారుడైన సంగమేశ్వర స్వామి దేవాలయం సైతం అప్పుడే నిర్మించబడ్డాయి. అయితే కోటను కొంతైనా రక్షించాలన్న లక్ష్యంతో అధికారులు కోట చుట్టూ ఫెన్సింగ్, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. -
ప‘రేషన్’..!
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025నిండుకున్న బియ్యం నిల్వలు ● తెరుచుకోని రేషన్ దుకాణాలు ● జిల్లాలో 2,13,777 కార్డుదారులు ● 6,85,178 మంది లబ్ధిదారులు ● కావాల్సిన బియ్యం 35 వేల క్వింటాళ్లుఇంకెప్పుడిస్తారు? గతంలో ప్రతి నెల 1వ తేదీన బియ్యం వచ్చేవి. రెండు నెలలుగా సకాలంలో ఇస్తలేరు. ఇప్పటికే వారం గడిచిపోయింది. డీలర్ను అడిగితే గోదాం నుంచి బియ్యం రాలేవని చెబుతున్నాడు. ఇంట్లో బియ్యం లేవు. బయట కొందామంటే ధరలు మండిపోతున్నాయి. బతికేదెట్లా? – వెంకయ్య, వై. మాందాపూర్, కొల్చారంరెండు, మూడు రోజుల్లో సరఫరా బియ్యం సరఫరాకు ఆర్డర్ కాపీ వచ్చింది. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తాం. ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సన్నబియ్యం వచ్చాక దొడ్డు బియ్యం వృథా అవుతాయని గోదాముల్లో స్టాక్ ఉంచడం లేదు. దీంతో బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. – జగదీష్, జిల్లా సివిల్ సప్లై మేనేజర్మెదక్ కలెక్టరేట్: ప్రతీ నెల 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంటుంది. అయితే 8 రోజులు గడుస్తున్నా ఇంకా పంపిణీ చేయడం లేదు. పేదలు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతుండగా, డీలర్లు గోదాముల వద్ద పడిగాపులు గాస్తున్నారు. అయితే బియ్యం నిల్వలు లేకపోవడంతో అధికారులు గోదాములు తెరవడం లేదని సమాచారం. ప్రతి నెల 20వ తేదీ నుంచి 30 వరకు మండల స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. వచ్చిన బియ్యాన్ని డీలర్లు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. కాని మూడు నెలలుగా బియ్యం సరఫరాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 522 రేషన్ షాపులు జిల్లాలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేటలో మండలస్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి జిల్లాలోని 21 మండలాల్లో గల రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం వీటిలో ఏ ఒక్కదానిలో బియ్యం నిల్వలు లేనట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 522 రేషన్ దుకాణాలు ఉండగా, 2,13,777 కార్డులు (కొత్తవి కాకుండా), 6,85,178 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెల 35 వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. పట్టణ దుకాణాలకు సరఫరా పట్టణ ప్రజలు ఆందోళనలకు దిగుతారనే ఉద్దేశంతో ఉన్న కొద్దిపాటి నిల్వలు పట్టణంలోని 120 దుకాణాలకు సరఫరా చేసినట్లు సమాచారం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలకు సరఫరా చేసేందుకు గోదాముల్లో బియ్యం నిల్వలు కరువయ్యాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే గాని గోదాములకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. అయితే ఇప్పటికే వారం గడిచిపోయింది. అసలు బియ్యం సరఫరా చేస్తారా? లేదా అని ఇప్పటికే గ్రామాల్లో ఆందోళన మొదలైంది.న్యూస్రీల్ -
మెరుగైన వైద్యం అందించండి
కలెక్టర్ రాహుల్రాజ్ కొల్చారం(నర్సాపూర్): నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బంది హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు అవసరమైన రక్త నమూనా పరీక్షలు సకాలంలో నిర్వహించి అవసరమైన మందులు అందించాలన్నారు. యాంటీబయోటిక్ మందులు, పాము కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యాధికారి శివకుమార్, సిబ్బంది ఉన్నారు. -
సమాజ సేవకు సమయం కేటాయించండి
జహీరాబాద్ టౌన్: ఉన్నతస్థాయిలో ఉన్నా సొంత ఊరిని మర్చిపోకుండా కొంత సమయం సమాజ సేవకు కేటాయించాలని టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసీరామ్ రాథోడ్ అన్నారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని మల్చల్మ, విట్టు నాయక్ తండాలకు చెందిన తుకారాం రాథోడ్, శంకర్ చవాన్లు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగా.. పట్టణంలోని బంజారా భవన్లో శనివారం వారిని సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని కొనియాడారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులను, సొంత ఊరిని మర్చిపోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి పటాన్చెరు: సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని కలిసి అమీన్పూర్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పట్టణంలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... అమీన్పూర్ పరిధిలోని సమస్యలపై తాను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో పీపుల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలరెడ్డి, కొండ లక్ష్మణ్, మహేశ్వర్రెడ్డి, ఉదయ్కుమార్, వెంకట పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఇది పట్టభద్రుల విజయం
నర్సాపూర్: తన విజయం పట్టభద్రులకు అంకితమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ మున్సిపల్ మహిళా ఉద్యోగులకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. చీరల పంపిణీ అభినందనీయమని కొనియాడారు. అనంతరం మురళీయాదవ్తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిని సన్మానించారు. విద్యుత్ సమస్యలుతలెత్తకుండా చర్యలు అల్లాదుర్గం(మెదక్): వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. శనివారం మండలంలోని గడిపెద్దాపూర్ విద్యుత్ సబ్స్టేషన్లో 5 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు, వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మెదక్ విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్, డీఈ చాంద్పాషా, ఏడీ మోహన్బాబు, పాపన్నపేట ఏడీ శ్రీనివాస్, రేగోడ్ ఏఈ యాసిన్అలీ, అల్లాదుర్గం ఇన్చార్జి ఏఈ నవాజ్ పాల్గొన్నారు. రూ. 35 లక్షలతో కొత్త విద్యుత్ లైన్ పాపన్నపేట(మెదక్): మండలంలోని విద్యుత్ సమస్యలు తీర్చేందుకు రూ. 35 లక్షలతో విద్యుత్ లైన్ వేస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. పొడ్చన్పల్లి ఫీడర్లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఉపకేంద్రంలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ సమస్య తీర్చడానికి రూ. 35 లక్షలతో కౌడిపల్లి నుంచి 33 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పారు. ఆదివారం పాపన్నపేట మండలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేకు సన్మానం నర్సాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సునీతారెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నర్సాపూర్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారిద్దరు పాల్గొన్నారు. కార్మికులకు ‘ఎంఆర్ఎఫ్’ షాక్సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘2021 మార్చి 29న ఏడాది పాటు శిక్షణ కోసం మిమ్మల్ని తీసుకున్నాం. ఆ కాలంలో మీరు పని నేర్చుకోలేదు. పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక మాద్యం నేపథ్యంలో మిమ్మల్ని తొలగిస్తున్నాం. దేశంలోని ఇతర ప్లాంట్లలో అవసరమున్న చోట పని చేయడానికి ఆసక్తి ఉంటే వారం రోజుల్లో అభిప్రాయం తెలపండి’ అని మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్ఎఫ్ (ఏపీఎల్) ప్లాంట్లో పనిచేస్తున్న 350 మందికిపైగా కార్మికులకు యాజమాన్యం ఈనెల 7న నోటీసులు అందజేసింది. దీంతో వారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. రిక్రూట్మెంట్ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మనెంట్ చేయాలని కోరిన పాపానికి ఉద్యోగంలో నుంచి తీసేసి పరిశ్రమ యాజమాన్యం నియంతృత్వం ప్రదర్శిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కార్మికులు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
‘కేజీబీవీ’లో జీసీడీఓ విచారణ
కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని కేజీబీవీలో బాలికలను చితకబాదినట్లు తల్లిదండ్రులు చేసిన ఆందోళనతో శనివారం గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధికారి సుప్రియ విచారణ చేపట్టారు. విద్యాలయంలో గణితం టీచర్ సురేఖ బాలికలను పనులు చేయాలని బెదిరిస్తూ చితకబాదుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు విద్యార్థినులను సైతం చితకబాదినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జీసీడీఓ ఎంఈఓ రహీమోద్దీన్తో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ నివేదికను డీఈఓతో పాటు కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్ మాధవి, ఎస్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మహిళ లేనిదే సమాజం లేదు
మెదక్జోన్: మహిళ లేనిదే సమాజం లేదని, ప్రస్తు త పోటీ ప్రపంచలో వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్లో కలం స్నేహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అతివ’ పాటల సీడీని ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలు చదువులో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని, అప్పడే మహిళా సాధికారత సాధ్య మవుతుందన్నారు. ప్రభుత్వం అన్ని పథకాలలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలం స్నేహం వ్యవస్థాపకుడు, సినీ సంగీత దర్శకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గీతాశ్రీ స్వర్గం,కన్వీనర్ రాధిక, సంయుక్త కార్యదర్శి సరళ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నిరంగాల్లో రాణించాలి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మరింతమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. అంతకుముందు క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి దామోదర్రెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారిణి సంతోష తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
1,500 కేసులు పరిష్కారం
షెడ్డులోని కుండలపై వివిధ రకాల పక్షులుఅతడికి పక్షులంటే ప్రాణం.. ఇష్టంతో రూ. వేలు ఖర్చు చేసి పక్షులను కొనుగోలు చేసి ప్రాణంగా పెంచుతున్నాడు. వృత్తివ్యవసాయం, ఉద్యోగం లైన్మెన్.. అయినా ఉదయం, సాయంత్రం పక్షులతోనే గడుపుతాడు. వాటి దాణా కోసం ప్రతి నెలా వేలు ఖర్చు చేస్తూ పక్షి ప్రేమికుడిగా మారాడు కౌడిపల్లి మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన మల్లాగౌడ్.– బొడ్డు పెంటయ్య, కౌడిపల్లి(నర్సాపూర్)మెదక్జోన్/నర్సాపూర్: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం జిల్లా కోర్టులో పలువురు కక్షిదారులు రాజీ అయ్యారు. జిల్లావ్యాప్తంగా పలుకోర్టుల్లో 1,500 కేసులు పరిష్కారం అయ్యాయి. అలాగే పలురకాల కేసులకు సంబంధించి బాధితులకు చెల్లించాల్సిన బీమా కంపెనీలతో పాటు ఇతర జరిమానాలు రూ. 46.32 లక్షలను కోర్టులో చెల్లించారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి లక్ష్మీశారద మాట్లాడుతూ.. ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తే కూర్చొని పరిష్కరించుకోవటం మంచిదన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్ కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు రాజీ పడడమే రాజమార్గమని అన్నారు. లోక్అదాలత్లో 137 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.8లో -
మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
మెదక్జోన్: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నప్పటికీ మెదక్లో మాత్రం వెనుకబడి ఉన్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంజలి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, స్టాఫ్నర్స్లను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సోషల్ సర్వీస్ చేయడంలోనూ ముందున్నారని తెలిపారు. త్వరలోనే జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీలు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేతలు భవాని, అరుణ, బట్టి సులోచన, గోదల జ్యోతి, హరిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
హవేళిఘణాపూర్(మెదక్): వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్శాఖ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కూచన్పల్లి సబ్స్టేషన్లో 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్, నాగాపూర్ సబ్స్టేషన్ సుల్తాన్పూర్ ఫీడర్కు సంబంధించి 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా నూతన ట్రాన్స్ఫార్మర్లు బిగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ ఎస్ఈ శంకర్, డీఈ చాంద్పాషా, ఏడీఈ మోహన్బాబు, ఏఈ వినోద్కుమార్ పాల్గొన్నారు. -
మహిళలకు ప్రత్యేక చట్టాలు
సంగారెడ్డి టౌన్ : సమాజంలో మహిళల పాత్ర గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పేర్కొన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. సమాజంలో లైంగిక దాడులు, హత్యాచారాలు, లైంగిక దోపిడీ, వరకట్నం వంటి సమస్యలు వెంటాడుతుంటాయని, వీటిని పరిష్కరించేందుకు మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహల నిర్మూలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు ఎటువంటి న్యాయం కావాలన్నా కోర్టులో ఉచితంగా న్యాయం పొందవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర -
చిన్న వయసులో.. ‘నిర్మల’మైన మనసు
● కష్టాలు ఓరుస్తూ.. కుటుంబ భారం మోస్తూ ● కూరగాయలు అమ్ముతున్న విద్యార్థిని నారాయణఖేడ్: ఆ కుటుంబానికి కష్టాలు చుట్టముట్టాయి.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు.. ఇంటినిండా ఆడపిల్లలు.. పెద్దల నుంచి వచ్చిన అర ఎకరం పొలం.. తండాలో చిన్నపాటి ఇల్లు.. ఆ దంపతులు పడరాన్ని పాట్లు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపేసరికి రూ.12 లక్షల అప్పు. ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి నెట్టి వేయబడింది. ఈ కష్టాలను చూసిన నాలుగో కూతురు ఓ రాణి రుద్రమలా ధైర్యాన్నిస్తూ తల్ల్లిదండ్రుల వెన్ను తట్టింది.. నారాయణఖేడ్ మండలం చందర్నాయక్ తండాకు చెందిన చందర్, చాందీబాయికి ఆరుగురు సంతానంలో ఐదుగురు కూతుళ్లే. లత, బూలి, బుజ్జి, నిర్మల, వైశాలి తర్వాత పవన్ పుట్టాడు. లత, బూలి, బుజ్జిబాయిల వివాహమైంది. రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అర ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ ఖేడ్ పట్టణంలో విక్రయిస్తున్నారు. నాలుగో కూతురు నిర్మల సిద్దిపేటలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతిలో 9.8 జీపీఓ ఉత్తీర్ణత సాధించింది. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా తండ్రి అనారోగ్యానికి గురవ్వడం కుటుంబ భారం వల్ల వెళ్లలేదు. ఖేడ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ అయ్యింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఓ కానిస్టేబుల్ కొనిచ్చిన నీట్ ప్రిపరేషన్కు సంబంధించిన పుస్తకాలను పఠనం చేస్తుంది. తమ అర ఎకరం పొలంలో నిత్యం పండిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు వచ్చిన నిర్మల బీట్లో కూరగాయలు కొని దుకాణంలో సర్ది 8 గంటల వరకు వ్యాపారం.. అనంతరం తండాకు వెళ్లి 9 గంటలకు కళాశాలకు వెళ్తుంది. ఇలా కష్టపడుతున్న నిర్మల ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తూ తన లక్ష్యం డాక్టర్ కావాలని.. మరో సోదరి, సోదరుణ్ణి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని చెబుతుంది. చదువులో నిర్మల మంచి ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులూ చెబుతున్నారు. -
పేదల పాలిట పెళ్లి పెద్ద
నర్సాపూర్: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి. తన మిత్రుడు హకీం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలో జరిగే ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేయాలని నిర్ణయించారు. సుమారు 12 ఏళ్ల క్రితం అమలులో పెట్టారు. అయితే వాటిని అందజేసే సమయంలో ప్రచారం కోసం ఆరాటపడటం లేదు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది ఆడపిల్లలకు రఘువీరారెడ్డి పుస్తె మెట్టెలు అందజేశారు. శక్తి ఉన్నంత వరకు పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని అన్నారు. గతంలో ఒక ఆడ కూతురుకు పుస్తె మెట్టెలు ఇవ్వడానికి రూ. 8 వేల వరకు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. పది వేలు అవుతున్నాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేద వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. -
ముళ్లబాట దాటి.. పూలదారి చేరి
మెదక్జోన్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన నారాయణ మెదక్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో పట్టణంలో స్థిరపడ్డారు. అంతాబాగానే ఉంది అని అను కుంటున్న సమయంలో అనూహ్య సంఘటనతో జీవితం తలకిందులైంది. 1998లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ మృత్యువాతపడ్డారు. అప్పటికీ ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందులో పెద్దకూతురు గంగామణి 8వ తరగతి చదువుతుంది. ఆమె తల్లి మల్లమ్మకు అధికారులు స్వీపర్ ఉద్యోగం ఇచ్చారు. నిరక్షరాస్యురాలైన మల్ల మ్మ తన పెద్దకూతురు గంగామణికి పదో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం వివిధ కారణాలతో దంపతులు విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలతోపాటు చెల్లెళ్ల భారం ఆమైపె పడింది. చిన్నప్పటినుంచి పోలీస్ కావాలనే కోరిక బలపడింది. ఈక్రమంలో 2007లో హోంగార్డుగా హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించింది. తన చెల్లెళ్లు, పిల్లలను మెదక్లో తల్లి వద్ద ఉంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూనే డిస్టెన్స్లో ఇంటర్ పూర్తి చేసింది. 2013లో రెండో ప్రయత్నంలో కానిస్టేబుల్గా ఎంపికై ంది. తన ఇద్దరు చెల్లెళ్లను బీటెక్ చదివించింది. వారు 2019లో వారిద్దరూ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. అలాగే ఆమె ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. కుమారుడు నవీన్చంద్ర ఎస్సైగా, కూతురు శ్రీజ 2023లో కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం కొడుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రొహిబిషనరీ ఎస్సైగా, కూతురు మెదక్ రూరల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గంగామణి చేగుంట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్నారు. పురుషుల కన్నా తక్కువ అనే భావన మహిళల్లో ఉండొద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించటం కష్టమేమి కాదని గంగామణి అభిప్రాయపడ్డారు.చిన్నతనంలో తండ్రి మరణం, ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం భర్త దూరం.. ఇద్దరు చెల్లెళ్లు.. వృద్ధురాలైన తల్లి.. ఒకానొక దశలో ఆమె కుంగుబాటుకు గురైంది. ఆ ముళ్లబాటనే తొక్కుకుంటూ మణిగా మెరిసింది. ఆమె కాంతులీనుతూ కుటుంబసభ్యులకు పూలబాటను పరిచింది. నారీలోకానికి స్ఫూర్తిమంత్రం వినిపించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘గంగామణి’ విజయగాథపై ప్రత్యేక కథనం.. -
ఆకాశవాణి.. మహిళా కేంద్రం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం రేడియో స్టేషన్లో కార్యక్రమాలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ ప్రతి నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారంచేస్తున్నారు. జహీరాబాద్: గ్రామాలకు వెళ్లి సమాచారం సేకరణ ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో 1998 సంవత్సరంలో సంఘం రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రసారాలు అందుతున్నాయి. 90.4 ఫ్రీక్వెన్సీలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలను అందిస్తున్నారు. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన అల్గోల్ నర్సమ్మ, పస్తాపూర్ గ్రామానికి చెందిన జనరల్ నర్సమ్మ 1999 నుంచి రేడియో స్టేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రసారాలకు కావాల్సిన సమాచారాన్ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటారు. డీడీఎస్కు సంబంధించి పలు కార్యక్రమాలను చూస్తున్న ఏడుగురు మహిళలు రేడియో ప్రసారాలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామాలకు వెళ్లినప్పుడు ఆడియో రికార్డింగ్ చేసుకొని స్టేషన్ నిర్వాహకులకు అందిస్తున్నారు. వాటిని ఎడిట్ చేసుకొని ప్రసారం చేస్తారు. ముఖ్యమైన ప్రసారాలు మన ఊరి పంటలు, ఆరోగ్యం, సంఘాలు, చావిడికట్ట, భాష, మన రుచులు, పండుగలు, పాటలు, పర్యావరణం, బాలానందం, యారండ్ల ముచ్చట్లు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. భాషకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లో పెద్ద మనుషులతో వినిపిస్తారు. పొలంలో పనిచేసే సమయంలో, పెళ్లి సందర్భంలో, పుట్టినరోజు వేడుకలు, యువతులు పుష్పవతి అయిన సమయంలో పాడే పాటలను పరిచయం చేస్తారు. చిన్న పిల్లలకు సంబంధించి బాలానందం కార్యక్రమం నిర్వహించి పాటలు, కథలు వినిపిస్తారు. సీజన్ వ్యాధులు, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ముచ్చటిస్తారు. వ్యవసాయ విషయానికి వస్తే పంట వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఏయే పంటలు వేయాలి, ఎరువులు, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం గురించి సూచనలు చేస్తారు.వారే మిక్సింగ్, కంపోజింగ్.. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ రేడియో స్టేషన్లో మిక్సింగ్, కంపోజింగ్, ట్రాన్స్మిషన్ నిర్వహణ, రికార్డు చేసిన కార్యక్రమాల ఎడిటింగ్ పనులను చూస్తారు. ప్రతీ నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారం చేసేంత వరకు వారే చూసుకుంటారు. ఇద్దరూ డీడీఎస్ డైరెక్టర్ దివంగత పీవీ సతీష్ వద్ద శిక్షణ పొందారు. అప్పటి నుంచి వారు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళల సంఘం రేడియో స్టేషన్ ప్రతీ నిత్యం రెండు గంటలపాటుకార్యక్రమాలు స్థానిక అంశాలే ప్రసారం -
మాదిగలకు రెండు మంత్రి పదవులివ్వాలి
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణను మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీగా వర్గీకరించాలని, అలాగే మంత్రివర్గంలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల డప్పుల ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని పునః సమీక్షించి శాసీ్త్రయంగా రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
విధిగా ఇళ్లు నిర్మించుకోవాలి
రాయికోడ్(అందోల్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్య లబ్ధిదారులను కోరారు. మండలంలోని నాగ్వార్ గ్రామంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్తో కలసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షల బిల్లులను అందించి పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఎం షరీఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, వివిధ శాఖల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం అంజయ్య -
మెరుగైన ఫలితాలు సాధించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: పదో తరగతి పరీక్షలు జీవితానికి టర్నింగ్ పాయింట్ అని.. విద్యార్థులు పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. అనంతరం కళాశాలలో మెనూ అమలు తీరును పరిశీలించి అభినందించారు. ఈసందర్భంగా బాలికలతో కలిసి భోజనం చేసి ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం శ్రమించాలని, భయం వీడి పట్టుదలతో చదవాలని పేర్కొన్నారు. అనంతరం మే 4న జరగనున్న నీట్ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాగునీటి వినియోగంపై సమీక్షించారు. -
మహిళా ఉద్యోగులకు సన్మానం
మెదక్ కలెక్టరేట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ.. సా మాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ల తనిఖీ హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పాతూర్, పాతూర్ తండా అంగన్వాడీ కేంద్రాలను డీడబ్ల్యూఓ హైమావతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం వారికి పెడుతున్న భోజనం గురించి ఆరా తీశారు. ఆమె వెంట సీడీపీఓ వెంకటరమణమ్మ, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. 11న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మెదక్ కలెక్టరేట్: ఈనెల 11న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో విద్యార్థులు వారి ఎగ్జిబిట్స్ను ప్రదర్శించవచ్చని చెప్పారు. ‘ఎల్ఆర్ఎస్’ రాయితీని వినియోగించుకోండి చేగుంట(తూప్రాన్): ఎల్ఆర్ఎస్ రాయితీని వినియోగించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి అన్నారు. శుక్రవారం చేగుంట గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీఓ ఎల్ఆర్ఎస్ రాయితీకి సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులకు మార్కెట్ రేటును అనుసరించి 25 శాతం రాయతీ కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సందర్శించి డీపీఓ ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. చేగుంటతో పాటు అనంతసాగర్ గ్రామాల్లో పారిశుద్య పనులు, డంప్యార్డులను పరిశీలించి, ఇంటిపన్నులు, మంచినీటి సరఫరా గురించి సిబ్బందికిసూచనలు చేశారు. నేడు జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: నేడు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు. తమ ఆధార్ కార్డు తీసుకుని, సంబంధిత కోర్ట్ లేదా నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలన్నారు. కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియను పూర్తి చేసి కేసును పూర్తిగా ముగించుకునే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్తో కేసుల తక్షణ పరిష్కారం సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చికాకుల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. కేసులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మెదక్ మున్సిపాలిటీ: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పిట్లంబేస్కు చెందిన కిరణ్ (25) బైక్పై వెళ్తుండగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అతడిని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ నాగరాజు తెలిపారు. -
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇష్టంతో చదవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గురువారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కిచెన్, స్టోర్రూం, నిత్యావసర సరుకులు, విద్యార్థులకు పె ట్టిన భోజనం పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని వివరించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు భయపడవద్దని, శ్రద్ధగా చదవితే వందశాతం ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పడు గమనించి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబా, ప్రిన్సిపాల్ హరిబాబు, ఏటీపీ సుష్మ, జయరాజ్, డిప్యూటీ వార్డెన్ లక్ష్మణ్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ -
అందుబాటులోని ఉండని వైద్యులు
● అత్యవసర పరిస్థితుల్లోహైదరాబాద్కు రెఫర్ ● నానా అవస్థలు పడుతున్న రోగులు ● పట్టించుకోని అధికారులుమెదక్జోన్: పేద, మధ్య తరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ప్రభుత్వ ధర్మాస్పత్రి వైపే చూ స్తారు. ఇక్కడ ఉచితంగా వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు ఉంటారనే నమ్మకంతో వస్తుంటారు. కానీ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం పేదలకు శాపంగా మారుతోంది. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావటంతో స్పెషలిస్టులతో పాటు వైద్య సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రస్తుతం సుమారు 35 నుంచి 40 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా ఉదయం 11 గంటల వరకు ఆస్పత్రికి రావడం లేదు. మధ్యాహ్నం పన్నెండు గంటలు అయిందంటే ఉండడం లేదని పలువురు రోగులు చెబుతున్నారు. అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు జరిగి గాయపడినా.. అత్యవసర వైద్యంతో ఆస్పత్రికి వచ్చినా.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇంత పెద్దసంఖ్యలో ఉన్న వైద్యులు నిత్యం హైదరాబాద్ నుంచి రోజూ విధులకు హాజరవుతున్నారు. స్థానికంగా ఎవరూ ఉండటం లేదు. ఫలితంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వైద్య పరీక్షలకు బయటకే.. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కనీసం సిటీ స్కాన్ అందుబాటులో లేదు. ఎంఆర్ఐ, గుండెకు సంబంధించిన పరీక్షలు కావాలన్నా సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. ఎక్స్రే తీస్తే ఫిలిం ఉండడం లేదు. అంతేకాకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్లు సరిగా విధులు నిర్వర్తించడం లేదు. కొంతకాలంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ లేకపోవటం.. ఇన్చార్జిగా కొనసాగుతున్న అధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విష యాన్ని పలుమార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు
కలెక్టర్ రాహుల్రాజ్పాపన్నపేట(మెదక్): వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం ఎస్ఈ శంకర్తో కలసి మిన్పూర్ 220/132 కేవీ సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మొదట కుర్తివాడ గ్రామానికి వెళ్లారు. అక్కడ విద్యుత్ సరఫరా అవుతున్న తీరును రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రానున్న వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు, సరఫరా చేయడంలో విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతిని సాధించాయని కొనియాడారు. మిన్పూర్ సబ్స్టేషన్ ద్వారా జిల్లాలో పద్దెనిమిది సబ్స్టేషన్లకు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యుత్ బ్రేకర్లు, రికార్డులు, విద్యుత్ యూనిట్ల వాడకాన్ని పరిశీలించారు. జిల్లాలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడినా టోల్ప్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆయన వెంట డీఈ భాషా, ఏఈ శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తాగునీటిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందస్తుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని, ఉపాధి కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం అనంతరం పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ తదితర కులవృత్తుల లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
చిరుత.. భయం భయం
రైతులు జాగ్రత్తగా ఉండాలి చిరుత దాడుల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. తమ పశువులను సాధ్యమైనంత వరకు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉంచొద్దు. ఇళ్ల వద్దకు తీసుకెళ్లాలి. అలాగే రైతులు ఒంటరిగా వెళ్లవద్దు. కనీసం నలుగురు రైతులు కర్రలు పట్టుకొని వెళ్లాలి. ఎక్కడైనా చిరుత ఆనవాళ్లు ఉంటే వెంటనే తమకు సమాచారం అందజేయాలి. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారిరామాయంపేట(మెదక్): చిరుతల భారీ నుంచి పశువులను రక్షించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల అటవీ ప్రాంతానికి దగ్గరగా, గిరిజన తండాల్లో ఉన్న పశువులపై చిరుతల దాడులు పెరిగాయి. గత నాలుగైదేళ్లుగా వందలాది పశువులను హతమార్చాయి. రేంజీ పరిధిలోని రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల, కాట్రియాల, పర్వతాపూర్, దంతేపల్లి శివారులో దట్టమైన అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు ఆరు చిరుతలు ఉన్నట్లు సమాచారం. ఈవిషయాన్ని ఆశాఖ అధికారులు తెలపకపోయినా, రెండేళ్ల క్రితం చేపట్టిన వన్యప్రాణుల గణనలో ఈ విషయం తేలింది. చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, రేసు కుక్కలు, జింకలు, నీల్గాయిలు ఇతర జంతువులు మనుగడ కొనసాగిస్తున్నాయి. నీటి కోసం పంట చేల వద్దకు.. వేసవిలో అటవీప్రాంతంలో తాగునీరు, అహారం లభించకపోవడంతో చిరుతలతో పాటు ఇతర జంతువులు గ్రామాలు, తండాల్లోకి వస్తున్నాయి. వన్యప్రాణులకు తాగు నీటి కోసం అటవీప్రాంతంలో సాసర్పిట్లతో పాటు చిన్న చిన్న కుంటలు, చెక్డ్యాంలు నిర్మించారు. వాటిలో నీరు నింపకపోవడంతో అవి గ్రామాల్లోకి వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇటీవల నార్సింగి సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అయితే ఈసారి కూడా నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు అటవీప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. దీనికి తోడు అడవిలో భూగర్భజలాలు ఇంకిపోయి తాగు నీరు లభించడం కష్టతరంగా మారింది. అయితే వేసవి వస్తుందంటే చాలు రైతులు భయందోళన చెందుతున్నారు. చిరుతను బంధించడానికి రామాయంపేట పట్టణ శివారులో సర్వయ్యకుంట వద్ద ఆశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. రైతులు తమ పశుసంపదను రక్షించుకోవడానికి పశువుల పాకల చుట్టూ ఇనున జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకునే వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ముందస్తుగా వీటిని ఏర్పాటుచేసుకొని తమ పశువులను అందులో ఉంచుతున్నారు. మరికొందరు రైతులు ముందు జాగ్రత్త చర్యగా తమ పశువులను రాత్రివేళ పంట చేల వద్ద ఉంచకుండా ఇళ్ల వద్దకు తీసుకెళ్తున్నారు. పశువుల రక్షణకు రైతుల తంటాలు పాకల చుట్టూ ఇనుప కంచెల ఏర్పాటు -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్లు తెలుగు, హిందీ, సంస్కృతం తదితర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు 107 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్నోడల్ అధికారి మాధవి తెలిపారు. జనరల్ 4,988 మందికి గానూ 4,889 మంది హాజరుకాగా 99 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు మరో 8 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ లెక్కన 98.02 హాజరు శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వివరించారు. -
వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
మెదక్జోన్/నర్సాపూర్: రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం ఖా యమని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించటంతో గురువారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఇక ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, బెండ వీణ, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, శంకర్, అరవింద్, రాంరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ -
కొనసాగుతున్న రిలే దీక్షలు
నర్సాపూర్: ప్యారానగర్లో డంప్యార్డును ఎత్తి వేయాలన్న డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో నర్సాపూర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా దీక్షలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ పాల్గొని మాట్లాడారు. డంప్యార్డును ఎత్తివేసే వరకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డంప్యార్డు ఏర్పాటుతో నర్సాపూర్ అడవులు, చెరువు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారం తప్పనిసరి మెదక్ కలెక్టరేట్: పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ చూడా లని జిల్లా బాలల పర్యవేక్షణ కమిటీ అధ్యక్షురాలు, డీసీపీఓ కరుణశీల అధికారులకు సూచించారు. గురువారం మెదక్ పట్టణంలోని బాల సదనంతో పాటు శివ్వంపేటలోని ఓరేబి మినిస్ట్రీ సీసీఐని తన బృందంతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పలయ్య, గంగాధర్, దిగంబర, చంద్రశేఖర్, చంద్రకళ, లావణ్య, రూప తదితరులు పాల్గొన్నారు. తైబజార్ డబ్బుల రికవరీలో అవినీతి రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో తైబజార్ వేలం పాటకు సంబంధించి డబ్బుల రికవరీలో అవినీతి చోటు చేసుకుందని సీఐటీయూ, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీధర్రెడ్డి, రమేశ్ గురువారం మన్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నుంచి తాము తైబజార్ వేలానికి సంబంధించి వివరాల కోసం ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తైబజార్ వేలం పాటలో తీర్మాణించిన మేరకే సంబంధిత కాంట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, రికార్డుల్లో మాత్రం తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలిపారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్యారానగర్లో సర్వేయర్ల బృందం పర్యటన జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్ గ్రామంలో డంప్యార్డ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం అక్కడ పర్యటించింది. అటవీ రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్లో డంప్యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి. మహిళలకు ఉచిత న్యాయ సలహాలున్యాయమూర్తి స్వాతిరెడ్డి హుస్నాబాద్: మహిళలకు ఏ సమస్య తలెత్తినా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మహిళ సంఘా ల సభ్యులకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశా రు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయన్నారు. గెలిచేది ఆడ, మగ అని కాదని, నైపు ణ్యం, సమర్థత ఎవరికి ఉంటుందో వారే ఉన్నతమైన హోదాలో ఉంటారన్నారు. ఆలోచనలో మార్పు రావాలని, ఆ మార్పుకు మహిళలే తొలి అడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సీడీపీఓ జయమ్మ, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ రేసులో సీపీఐ
‘చాడా’కు చాన్స్ దక్కేనా? సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అందులో రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు హసన్ మీర్జా, ఎగ్గె మల్లేఽశం, శేరి సుభాష్రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగయనుంది. దీంతో రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ గత నెల 28న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్ ఉండనుంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు దక్కే వాటిలో సీపీఐకి ఒకటి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీపీఐ నేతలు సీఎం రేవంత్రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను కలిశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు చాడా వెంకట్రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సీపీఐ మొదట పట్టుబట్టిన హుస్నాబాద్ సీటు.. అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్, సీపీఐ పార్టీల పొత్తులో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సీటును సీపీఐకి కేటాయించాలని పట్టు పట్టా రు. హుస్నాబాద్, కొత్తగూడెంలలో సీపీఐకి పట్టు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ రెండు స్థానాలను అడిగారు. చివరకు హుస్నాబాద్ కాంగ్రెస్ అ భ్యర్థిగా పొన్నం ప్రభాకర్కు కేటాయించారు. పొత్తులలో కొత్తగూడెం సీటును కూనంనేని సాంబశివరావు కు కేటాయించారు. సీపీఐ అధిష్టానం సూచించిన ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు ప్రచారం. -
రైతులకు సాగునీరు అందించండి
చేర్యాల(సిద్దిపేట): తపాసుపల్లి రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపి చేర్యాల ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి పలువురు కాంగ్రెస్ నాయకులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత రైతన్నలు సాగు నీటి కోసం పడుతున్న కష్టాలను మంత్రికి వివరించామన్నారు. స్పందించిన మంత్రి రంగనాయకసాగర్ డీ10 కెనాల్ద్వారా కమాలాయపల్లి, అర్జునపట్ల, అకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్టకు సాగునీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్–3 మోటార్లు ప్రారంభించి గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాసుపల్లి రిజర్వాయర్లను నింపి రైతులకు సాగు నీరు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. మంత్రిని కలిసిన వారిలో మద్దూరు, చేర్యాల మాజీ జెడ్పీటీసీలు గిరి కొండల్రెడ్డి, కొమ్ము నర్సింగరావు, నాయకులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. మంత్రి ఉత్తమ్ను కలిసిన కాంగ్రెస్ నేతలు -
రేపు జాతీయ లోక్ అదాలత్
సంగారెడ్డి టౌన్: కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా, జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న న్యాయసేవలు క్రమంగా కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. సత్వరం, సమన్యాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇందుకోసం 1987లో జాతీయ లోక్అదాలత్ సేవలు ప్రారంభించారు. ‘రాజీయే రాజమార్గం’ అనే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు లోక్అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నాయి. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా కోర్టు పరిధిలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన కల్పించారు. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జీలు సూచిస్తున్నారు. ఈనెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్ అదాలత్లో విద్యుత్, టెలిఫోన్ రికవరీ తదితర కేసులు కూడా వస్తాయి. సివిల్, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంకుల రికవరీ కేసులు, ఇన్సూరెన్స్, చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ కాంపౌండ్ కేసుల వంటి కేసులను పరిష్కరించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఏఐతో పక్కాగా విద్యాబోధన
● వచ్చే ఏడాది మరిన్ని పాఠశాలల్లో అమలు ● కలెక్టర్ రాహుల్రాజ్ వెల్దుర్తి(తూప్రాన్): జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ)ను వినియోగిస్తూ విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రా జ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం మాసాయిపేటలో విస్తృతంగా పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం, పశువైద్యశాల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం మరిన్ని పాఠశాలల్లో ఏఐ అమలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఙానజ్యోతి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాలమణి, పశువైద్యాధికారిణి కావ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏఐ విద్యాబోధన పరిశీలించేందుకు పాఠశాలకు వచ్చిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి విద్యుత్ రాగా పాఠశాలకు చేరుకొని ఏఐతో విద్యాబోధనల అమలుతీరును పరిశీలించారు. -
శాశ్వత పనులకే ప్రాధాన్యం
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: తాగునీటి పరంగా ఇబ్బందులను తీర్చేందుకు చేపట్టనున్న పనుల్లో శాశ్వత పనులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాగునీటి పథకాల పునరుద్ధరణ, ఇతర పనులకోసం ఇటీవల రూ.6.50కోట్లతో ప్రతిపాదనలు పంపగా స్థానిక అధికారులు అవసరమైన పనులను గుర్తించినట్లు చెప్పారు. మిషన్ భగీథ పథకం ద్వారా నిరంతరం నీటిసరఫరా జరిగేలా గొర్రెకల్ వద్ద డెడికేటెడ్ విద్యుత్ లైన్ పనులు చేయిస్తున్నామన్నారు. బోరంచ, శాపూర్ పథకాలను పునరుద్ధరించి బోరంచ నుంచి మార్గమధ్యలోని గ్రామాలతోపాటు ఖేడ్ మున్సిపాలిటీ అవసరాల మేర నీటిసరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యదర్శులు భగీరథ ద్వారా నీరు సక్రమంగా సరఫరా అయితేనే రిజిస్టర్లో సంతకాలు చేయాలని లేని పక్షంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలకు సమాచారం అందించాలన్నారు. వేసవి ముగిసేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో నాయకులు దారంశంకర్, అశోక్రెడ్డి, సంగన్న, రాజేందర్పాటిల్, రాజు, విఠల్రావు, పరశురాం పాల్గొన్నారు. -
చెక్ డ్యాం నిండుగా.. పైర్లు పచ్చగా
నీటితో కళకళలాడుతున్న చెక్ డ్యాంకొల్చారం(నర్సాపూర్): సింగూరు నీటితో మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతం పచ్చదనం పరుచుకుంది. కష్టకాలంలో సాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు మండలంలోని ఎనగండ్ల, కోనాపూర్, పైతర సమీపంలోని మంజీరా నదిపై చేపట్టిన చెక్ డ్యాంలు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో సమీప ప్రాంతంలోని బోర్లలో భూగర్భజలాలు పెరిగి కనుచూపు మేరలో పచ్చని పొలాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పంటపొలాలను చూస్తూ రైతన్నలు ఆనందంతో మురిసిపోతున్నారు. -
10న మిలియన్ మార్చ్డే
రామాయంపేట(మెదక్): సీమాంధ్ర పాలనపై తెలంగాణ ప్రజల తిరుగుబాటు రోజు మార్చి 10న మిలియన్ మార్చ్డే నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగరి తెలిపారు. బుధవారం రామాయంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 10న హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులు కాగా, గత ప్రభుత్వం వారి గురించి ఎంతమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమకారుల ఆకాంక్షలను విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు నెలకు రూ. 30 వేల గౌరవ వేతనంతో పాటు హైదరాబాద్లో 250 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర నాయకులు దుర్గం, శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 96.41 % హాజరు
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలుమెదక్జోన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు జిల్లావ్యాప్తంగా 6,410 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 6,180 మంది హాజరయ్యారు. 230 మంది గైర్హాజరు కాగా, 96.41 హాజరు శాతం నమోదైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు 144 సెక్షన్ విధించి కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించారు. పరీక్షకు 5 నిమిషాల ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించారు. మాల్ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వొద్దు ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పో లీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ అధికారిణి మాధవి, ఇతర అధికారులు ఉన్నారు. -
ఇబ్బందులు తలెత్తొద్దు
కొల్చారం(నర్సాపూర్)/నిజాంపేట(మెదక్): వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫే ర్, కేజీబీవీ బాలికల పాఠశాలతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధా ్యపకులను ఆదేశించారు. అనంతరం నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోండి రామాయంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 31వ తేదీలోగా ప్రజలు తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలని సూ చించారు. గడువులోగా చేసుకున్న వారికి 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ విడుదల చేసిందని వివరించారు. రాజీయే రాజమార్గం: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గమే రాజమార్గం అనే సూత్రాన్ని అనుసరించి, వివాదాలను చక్కదిద్దుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశమన్నారు. వివాదాలు ఒకసారి ప్రారంభమైతే, జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయని, వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఈనెల 8న కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కిక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం చిన్నశంకరంపేట(మెదక్): రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డు ద్వారా అధికశాతం తెలంగాణ రైతులకు మేలు జరగనుందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఇందుకు నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలేనని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు సత్యపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, నరేష్ తదితరులు గంగారెడ్డిని సత్కరించారు. కనీస వేతనం అమలు చేయాలి మెదక్ కలెక్టరేట్: కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26,000గా నిర్ణయించాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లోని కార్మికశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ అధికారి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలు ప్రతిపాదించిన వాటిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే 74 షెడ్యూల్డ్ విడుదల చేసి కనీస వేతనాల సలహా మండలిలో కార్మిక సంఘాలన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు షౌకత్, రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీ వ్యూహం
పక్కా ప్రణాళిక..● కలిసొచ్చిన బీజేపీ క్యాడర్ ● ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయానికి కారణాలివే.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహం. ఇవి శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేర్చాయి. ఉమ్మడి కరీంనగర్–మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి విజయానికి ఈ రెండు కారణాలని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసన్న కూడా గట్టి పోటీని ఇచ్చారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మండలి పోరు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అండగా నిలిచిన కమలం క్యాడర్ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. ఉమ్మడి మెదక్తో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎంపీలుగా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. అలాగే ఆయా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఎన్నికలను ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రఘునందన్రావు, ధర్మపురి అర్వింద్, బండిసంజయ్, గొడాం నగేష్లకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా ఆయా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి పట్టు అంజిరెడ్డిని గెలుపు తీరాలకు చేర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అనుబంధ సంఘాలు కీలకం.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీనే కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పట్టభద్రుల స్థానాన్ని కూడా కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపులో ఆ పార్టీ క్యాడర్తో పాటు, దాని అనుబంధ సంస్థల కృషి ఎంతగానో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు పకడ్బందీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ నిఫుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్నికల నగారా మోగక ముందు నుంచే అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేయించారు. ఇలా ఓటరు నమోదు చేయించడం ఆయనకు కొంత కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పారిశ్రామిక వేత్త అయిన డా.చిన్నమైల్ అంజిరెడ్డి 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎస్ఆర్.ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంజిరెడ్డి సతీమణి గోదావరి బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం విదితమే. సామాజిక సేవ.. 2002 ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ స్థాపన. పెద్ద ఎత్తున తాగునీరు, మినరల్ వాటర్, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణ.అంజిరెడ్డి బయోడెటా.. పేరు: డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టిన తేదీ: 18.06.1966 తల్లిదండ్రులు : సి.రాజిరెడ్డి, లక్ష్మీనరసమ్మ భార్యపేరు: సి.గోదావరి (బీజేపీ జిల్లా అధ్యక్షురాలు) సంతానం : అనీష్రెడ్డి, ఆశ్విత రెడ్డి స్వస్థలం : రామచంద్రాపురంరాజకీయ ప్రస్థానం ఇలా.. 2009ÌZ {ç³gêÆ>fÅ…ÌZ ^ólÇMýS. OÐðlG-ÝëÞÆŠḥæïÜ-ï³ÌZ ç³°^ól-Ô>Æý‡$. 2014ÌZ fÇ-W¯]l AòÜ…½Ï G°²-MýSÌZÏ ç³sꯌS^ðlÆý‡$ ¯]l$…_ çÜÓ™èl…{™èl A¿ýæÅ-ǦV> ´ùsîæ ^ólíÜ.. KrÑ$ ´ëÌSĶæ*ÅÆý‡$. ™èlÆ>Ó™èl M>…{VðS-‹ÜÌZ ^ólÇ-MýS.. iòßæ-^ŒlG…ïÜ G°²-MýSÌS çÜ…§ýl-Æý‡Â…V> ½gôæï³ÌZ ^ólÆ>Æý‡$. ´ëÆý‡ÏÐðl$…sŒæ G°²-MýSÌZÏ Ððl$§ýlMŠS G…ï³ sìæMðSPsŒæ¯]l$ BÕ…_ ¿ýæ…VýS-ç³-yézÆý‡$. Ð]l$…yýlÍ G°²-MýSÌZÏ GÐðl$Ã-ÎÞV> ÑfĶæ$…. -
ప్రగతి పరుగు
పాలన మెరుగు..నూతన ఒరవడికి శ్రీకారం ‘లెస్ ప్లాస్టిక్, లెస్ పేపర్, పవర్ సేవ్’ నినాదంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముందుగా కలెక్టరేట్ నుంచే ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినా స్టీల్ బాటిళ్లలోనే తాగునీరు అందిస్తున్నారు. పారదర్శకంగా పాలన సాగించాలనే దృఢ సంకల్పంతో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఆఫీసుల్లో అవసరం లేనప్పుడు కరెంట్ను వినియోగించవద్దని, బయటకు వెళ్లే సమయంలో స్విచ్లు ఆఫ్ చేసి పవర్ సేవ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు హెల్మెంట్ ధరించకపోవటంతోనే మరణిస్తున్నారని గుర్తించారు. కలెక్టరేట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. లోనిచో ప్రవేశం లేదని హెచ్చరించారు. దీంతో సిబ్బందితో పాటు కలెక్టరేట్కు వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరిస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక ఫోకస్మెదక్జోన్: కలెక్టర్ రాహుల్రాజ్ ఏడాది పాలనలో తన మార్క్ చూపెట్టారు. ప్లాస్టిక్ నిషేధం, పవర్ సేవ్, ఈ– ఆఫీస్ విధానం పక్కాగా అమలు చేస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టారు. సెలవు రోజుల్లో సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్థానికంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి రావటం కుదరదని ఆదేశాలు జారీ చేశారు. విధులకు ఎగనామం పెట్టే వారిపై వేటు వేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. గురువారానికి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా ప్రత్యేక కథనం.. బడిపాట.. బట్టీ చదువులకు ఊరట బడిబాటపై ‘చిట్టి పొట్టి అడుగులు’ అంటూ కలెక్టర్ స్వయంగా పాట రాశారు. ప్రతీ గ్రామంలో బడీడు పిల్లలుంటే సమీప పాఠశాలల్లో చేర్పించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. నర్సాపూర్ మండలం జక్కంపల్లి అనే మారుమూల గ్రామంలో అధికారులతో కలిసి పల్లె నిద్ర చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు సైతం ప్రణాళికతో ముందుకెళ్లడంతో గతంలో కంటే ఈసారి ప్రవేశాలు పెరిగాయి. అలాగే ఇటీవల నర్సాపూర్ గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి రాత్రి అక్కడే నిద్రించారు. ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచిందని.. వారికి నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బట్టీ చదువులతో విసిగిపోతున్న విద్యార్థులకు ఊరట కల్పించారు. సాధారణ పద్ధతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలని సంకల్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ‘పల్లె వెలుగు’ బస్సులో ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో సరిపడా సీట్లు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని మీడియా కథనాలను చూసిన కలెక్టర్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన విలువైన కారు ఉన్న సాధారణ ప్రయాణికుడిగా కుటుంబంతో కలిసి కిక్కిరిసిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు ఏ మేరకు వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు స్వయంగా మెదక్ నుంచి నర్సాపూర్ వరకు భార్య, పిల్లలలో కలిసి ప్రయాణం చేశారు. మహిళా ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ‘ధరణి’ సమస్యలు పరిష్కారం ధరణి సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపారు. జిల్లాలో 12 వేల ధరణి ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా.. కలెక్టర్ వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే 8,500 సమస్యలను పరిష్కరించగలిగారు. గతంలో ధరణి పెండింగ్ సమస్యల్లో రాష్ట్రంలో మెదక్ 6వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 12 స్థానంలో ఉంది. మెతుకుసీమ.. టూరిజం హబ్ జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, రాజుల ఏలుబడిలో నిర్మించిన ఖిల్లా, పోచారం అభయారణ్యం, నిజాంపాలనలో నిర్మించన పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దేవస్థానాలకు సంబంధించి ఫొటోలు తీయించారు. త్వరలో టూరిస్టులకు అర్థం అయ్యే విధంగా బుక్ విడుదల చేస్తామని ప్రకటించారు.తనిఖీ చేసి.. వేటు వేసి బడిబాట సక్సెస్.. గాడిలో పడిన రెవెన్యూ శాఖ ఆకస్మిక తనిఖీలతో హడల్ కలెక్టర్ రాహుల్రాజ్ ఏడాది మార్క్ పాలన గతేడాది సెప్టెంబర్ 17న కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, రిజస్టర్లో సంతకాలు పెట్టి ముగ్గురు మధ్యాహ్నమే వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ ఆ ముగ్గురిని వెంటనే సస్పెండ్ చేశారు. వైద్య సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారని భావించి అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వాటిని కలెక్టరేట్లోని తన చాంబర్తో పాటు డీఎంహెచ్ఓ కార్యాలయానికి అనుసంధానం చేశారు. వైద్యులు సకాలంలో వస్తున్నారా..? లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
మెదక్ కలెక్టరేట్: రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్ సీవిల్ జడ్జి జితేందర్ తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 8న మెదక్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కక్షిదారుల సౌకర్యార్థం ఈనెల ఒకటో తేదీ నుంచే లోక్ అదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాలలోనే ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ లోక్అదాలత్లో వేగంగా కేసులు పరిష్కారం అవటమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. కక్షిదారులు న్యాయస్థానానికి కట్టిన కోర్టు నుంచి ఫీజు తిరిగి పొందవచ్చునని వివరించారు. అలాగే.. కేసుపై అప్పీలుకు వీలులేకపోవటం వల్ల ఇదే చివరి తీర్పు అవుతుందని చెప్పారు.సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ -
ఇంటర్ పరీక్షలకు వేళాయే
నేటి నుంచి ప్రారంభం ● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ● జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు ● ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ● క్యూ ఆర్ కోడ్తో సెంటర్ల గుర్తింపు ● మొత్తం 12,484 విద్యార్థులు పాపన్నపేట(మెదక్): జిల్లాలో ఇంటర్ మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నిబంధన సడలించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ నున్నారు. జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ,12,484 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 6,066 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,418 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలతో ఇంటర్ బోర్డు అధికారులు డైరెక్ట్గా వీక్షించనున్నారు. హాల్టికెట్పై ఉన్న క్యూ ఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్ తెలుసుకోవచ్చు. భారీగా సిబ్బంది పరీక్షల నిర్వాహణ కోసం హైపర్ కమిటీ సభ్యులు, కన్వీనర్, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఒక్కొక్కరు, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు 30, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 30 మంది, 520 మంది ఇన్విజిలేటర్లను నియామకం చేశారు. ఒక్కో కేంద్రంలో 5 సీసీ కెమెరాలు బిగించారు. వీటి ద్వారా ఇంటర్ బోర్డు అధికారులు డైరెక్ట్గా సెంటర్లోని పరిస్థితులు వీక్షించవచ్చు. ఉదయం 9 గంల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ రాని వారు నేరుగా టీజీబీఐ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రంపై సీరియల్ నంబర్ ముద్రిస్తున్నారు. ప్రశ్నాపత్రం బయటకు వెళ్తే ఎవరి పేపరో తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతీ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు ఎవరైనా ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురైతే వెంటనే 14418 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకెళ్లొద్దు. వాచ్లు కూడా తీసుకురావద్దు. విద్యార్థులకు సమయం తెలిసేలా అర గంటకోసారి బెల్ మోగిస్తారు. పరీక్షలు కట్టు దిట్టంగా నిర్వహించేందుకు పూర్తి చర్యలు తీసుకున్నాం. – జి.మాధవి, డీఐఈఓ -
రూ.2కోట్లతో పవర్ ట్రాన్స్ఫార్మర్లు
మెదక్ కలెక్టరేట్: వేసవిలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందింస్తున్నట్లు విద్యుత్ శాఖ మెదక్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి వెల్లడించారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ శంకర్ ఆధ్వర్యంలో వేసవి ప్రణాళికపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో భాగంగా ఇప్పటికే రూ.2 కోట్ల వ్యయంతో పాతూరు సబ్స్టేషన్లో కొత్తగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను (పీటీఆర్), ర్యాలమడుగు సబ్స్టేషన్లో 3.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే మెదక్ పట్టణంతోపాటు మండలంలోని బాలానగర్లో నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించామని, మున్ముందు ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మెదక్ విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ శంకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈలు) చాంద్పాషా, గరుత్మంతరాజు, శ్రీనివాసరావు, ఏడీఈలు మోహన్బాబు, ఆయా మండలాల ఏఈలు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి -
సాగునీటి నిర్వహణకు పటిష్ట చర్యలు
కొల్చారం(నర్సాపూర్)/చిలప్చెడ్(నర్సాపూర్): వేసవికాలంలో వరి పంటకు అవసరమైన నీటి నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వరిగుంతం గ్రామంలో, అలాగే..చిలప్చెడ్ మండల పరిధిలోని చండూర్ శివారులో ఎండిపోయిన పంటల వివరాలు అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఘనాపురం ఆనకట్ట నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుతం వరి పంటలకు నీటి కొరత లేదన్నారు. రైతులకు సాగునీరు సరఫరాకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని, నీటి నిర్వహణ, మోటార్లకు నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు తీసుకొనేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. అవసరం ఉన్న మేరకు మాత్రమే భూగర్భ జలాలు ఉపయోగించాలని, అందుకు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా, చిలప్చెడ్ మండలం చండూర్ శివారులో ఎండిపోయిన పంటల వివరాలు అడిగారు. సుమారు 250 ఎకరాల వరకు ఎండిపోయినట్లు ఏఓ సమాధానమిచ్చారు. ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పనిచేయడం లేదని, ఏ మరమ్మతులు చేయించాలో, పూర్తి సమాచారం అందించాలని ఏఓను ఆదేశించారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆరుతడి పంటలు వేయాల్సిందని చెప్పారు. ఆయన వెంట ఏఈఓ కృష్ణవేణి ఉన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కొల్చారం కళాశాల సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కళాశాలను తనిఖీ చేసిన ఆయన పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. నిర్దేశించిన సమయంలోగా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. తాగునీటి వసతి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం తప్పనిసరి అన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ చివరి ఆయకట్టు వరకుఘనాపురం నీరు -
రికార్డులు పక్కా ఉండాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మనోహరాబాద్(తూప్రాన్): మండల పరిషత్ కార్యాలయాల్లో ఉండే రికార్డులు పక్కాగా ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం మనోహరాబాద్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి సంబంధించిన పలు అంశాలపై ఎంపీడీఓ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి చేగుంట(తూప్రాన్): గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం చేగుంట ఎంపీడీఓ కార్యాలయంను సందర్శించారు.పాలకవర్గం లేకపోవడంతో గ్రామాల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించేలా పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, విజయ్ తదితరులు ఉన్నారు. -
వేసవిలో కూరగాయల సాగు బాగు
పీజేటీఏయూ శాస్త్రవేత్తలుకౌడిపల్లి(నర్సాపూర్): వేసవిలో కూరగాయల సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని పీజేటీఏయూ (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం) శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌడిపల్లి రైతువేదికలో అధికారులు, రైతులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు వేసవి సందర్భంగా కూరగాయలు సాగు చేయడంవల్ల మంచి లాభాలు వస్తాయని సూచించారు. కాగా నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకుని ఎండా వేడిమిని తట్టుకునేలా షెట్నెట్, నీడపందిరి పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికి దిగుబడి వస్తే డిమాండ్ బాగా ఉంటుందని మంచి లాభాలు వస్తాయన్నారు. రైతులు వ్యవసాయ అనుంబంధంగా పాడిపశువులను పెంచాలని పాడి అభివృద్ధితో ఆర్థిక అభివృద్ది చెందవచ్చని శాస్త్రవేత్తలు సూచించినట్లు ఏఓ స్వప్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సౌజన్య, సాహితి, రైతులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలపై అవగాహన
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని జిల్లా జెండర్ స్పెషలిస్ట్ నాగమణి తెలిపారు. మంగళవారం కౌడిపల్లి పీహెచ్సీలో మహిళా సాధికారత, బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలపై ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలతో అనర్థాలు జరుగుతాయని, పెళ్లీడు వచ్చే వరకు పెళ్లి చేయవద్దని చెప్పారు. లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండల వైద్యాధికారి శ్రీకాంత్ మట్లాడుతూ గర్భిణులు, బాలింతల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనారు. ఈ కార్యక్రమంలో రమేష్ పాల్గొన్నారు.జిల్లా జెండర్ స్పెషలిస్ట్ నాగమణి -
మహిళా సంఘాలకు రుణాలు
డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు చిన్నశంకరంపేట(మెదక్): మహిళా సంఘాల సభ్యులకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం నార్సింగి మండలం బీమ్రావుపల్లి గ్రామంలో మహిళ సంఘాల సభ్యులు నిర్వహించిన నామొక్క–నా బాధ్యత కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే మహిళ సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న వ్యాపారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు సీ్త్రనిధి రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలను పొందవచ్చన్నారు. రుణాలను తీసుకుని వ్యాపారం చేయడం ద్వారా వృద్ధి సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ఆశోక్, సీసీలు సుల్తానా, శంకర్, గ్రామ కార్యదర్శి జగదీష్ ఉన్నారు. -
‘అష్ట’కష్టాలు
మెదక్జోన్: మెతుకు సీమకు మంజూరైన వైద్య కళాశాలకు ‘అష్ట’కష్టాలు చుట్టుముట్టాయి. ఈ కళాశాల భవననిర్మాణానికి ఎనిమిది నెలల క్రితమే నిధులు మంజూరైనా నిర్మించేందుకు ఇంకా స్థల సేకరణ మాత్రం పూర్తికాలేదు. ఈ వైద్య కళాశాల భవన నిర్మాణానికి 20 ఎకరాలు గుర్తించాల్సి ఉండగా ఇప్పటివకు 12 ఎకరాలు మాత్రమే అధికారులు గుర్తించగలిగారు. ఇంకా ఎనిమిదెకరాల స్థలాన్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఓ ప్రైవేటు అద్దె భవనంలోనే అరకొర వసతులతో వైద్య కళాశాలను కొనసాగిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఆగస్టులో నిధులు మంజూరు గతేడాది ఆగస్టులో వైద్య కళాశాలను మంజూరు చేయడంతోపాటు హాస్టల్ భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లను మంజూరు చేసింది. దీంతో తాత్కాలికంగా ఓ ప్రైవేటు అద్దెభవనంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే వైద్య కళాశాల, హాస్టల్ భవనాలకు 20 ఎకరాల స్థలం అవసరం కాగా ప్రస్తుతం పిల్లికొటాల్ శివారులోని మాతాశిశు(ఎంసీహెచ్) ఆస్పత్రి సమీపంలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఇందుకోసం మరో 8 ఎకరాల స్థలాన్ని గుర్తించాల్సింది ఉంది. టీజీఈడబ్ల్యూడీసీకి అప్పగింత మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ.130కోట్లు, హాస్టల్ భవనానికి రూ.50కోట్లతో కలిపి మొత్తం రూ.180కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణ పనులను ముందుగా ఆర్అండ్బీ శాఖకు అప్పగించిన ఉన్నతాధికారులు మళ్లీ దానిని రద్దు చేస్తూ తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. మంత్రి ఆదేశిస్తే తప్పా... మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు ఈ నెల 3న స్థలాన్ని పరిశీలించారు. సరిపడా ల్యాండ్ను గుర్తించి టీజీఈడబ్ల్యూడీసీకి అప్పగిస్తే దాన్ని లేఅవుట్ చేశాక టెండర్ పిలుస్తారు. అనంతరం పనులు మొదలు పెడతారు. అయితే అధికారుల నిర్లిప్తత కారణంగా ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్య కళాశాల భవన నిర్మాణానికి అప్పగించని భూమి 20 ఎకరాలకుగానూ గుర్తించింది 12 ఎకరాలే ఇంకా కావాల్సింది ఎనిమిదెకరాలు 8 నెలల క్రితమే నిధులు మంజూరు కాలేజీ, హాస్టల్ భవన నిర్మాణాలకు రూ.180కోట్లు అరకొర వసతులతో అద్దె భవనాల్లోనే మెడికల్ కాలేజీ కొనసాగింపు వారంలో అప్పగిస్తామన్నారు వైద్య కళాశాల భవనంతో పాటు హాస్టల్ భవన నిర్మాణంకోసం 20 ఎకరాల స్థలం అవసరం ఉంది. పిల్లికొటాల్ శివారులోని ఎంసీహెచ్ ఆస్పత్రి సమీపంలో వైద్యారోగ్య ఉన్నతాధికారులు 12 ఎకరాలను మాకు అప్పగించారు. మరో 8 ఎకరాల భూమి కావాలి. వారం రోజుల్లో అప్పగిస్తాం అని చెబుతున్నారు. స్థలం అప్పగించాక టెండర్ పిలవాల్సి ఉంటుంది. –చారీ, డీఈ, టీజీఈడబ్ల్యూడీసీ, మెదక్ -
కేతకి ఆదాయం రూ.11.10 లక్షలు
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయ ఆదాయాన్ని లెక్కించారు. సోమవారం ఆలయ ఆవరణలో శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, లెక్కింపు ప్రారంభించారు. 13 రోజులలో రూ.11 లక్షల 70 వేల 698 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివరుద్రప్ప, నాయకులు చంద్రశేఖర్, మల్లయ్య స్వామి, సంగారెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిధులకు కిషన్రెడ్డే అడ్డు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్హుస్నాబాద్రూరల్: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఇష్టంలేదని, అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు ఇచ్చి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. వరంగల్ ఎయిర్ పోర్టు తన వల్లనే వచ్చిందని పక్క రాష్ట్రం కేంద్ర మంత్రితో చెప్పించుకోనే దుస్థితి కిషన్రెడ్డికే దక్కిందన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు కోసం ఏనాడైనా కిషన్రెడ్డి ప్రయత్నం చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసీఆర్కు బీనామీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీకు బాధ్యత లేదా? నిధులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తాయని, మన కేంద్ర మంత్రులు అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 70 కులాలను ఓబిసీలో కలిపినట్లు చెప్పారన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకూ నీరందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): ఎంఎన్ కెనాల్ మీదుగా మండలంలోని ఆయా గ్రామాలకు సాగు నీరు అందించే కాలువ గుర్రపు డెక్కతో నిండి ఉండడంతో ‘కాలువ ఇలా.. సాగునీరు ఎలా’ అనే కథనాన్ని ‘సాక్షి’ సోమవారం ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ మండలం మాచవరం, రాంపూర్ ఏరియాలో ఎంఎన్ కెనాల్ను ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. వనదుర్గా ప్రాజెక్టు పరిధిలో ఉన్న పంటలు ఎండిపోకుండా సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఆధారంగా సాగు నీటిని పొదు పుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 21,625 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. పంటలు ఎండిపోకుండా చర్యలు మెదక్జోన్: వేసవిలో పంటలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతకుమారి పంటలకు సాగునీటి వసతి కల్పించటంతో పాటు విద్యుత్ను నిరంతరంగా వ్యవసాయానికి ఇ వ్వాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. పకడ్బందీగా ఏఐ అమలుమెదక్జోన్: విద్యాశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో డీఈఓ రాధాకిషన్ ఆధ్వర్యంలో ఏఐ సాఫ్ట్వేర్ను రూపొందించిన బెంగళూరు బృందంతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్య ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సాఫ్ట్వేర్ బృందానికి సూచించారు. స్పందన -
చికెన్ అమ్మకాలు ఢమాల్!
రామాయంపేట(మెదక్): బర్డ్ ఫ్లూ భయం జిల్లాలోని చికెన్ సెంటర్లను తీవ్రంగా దెబ్బతీసింది. నెల రోజులుగా వ్యాపారం సరిగా సాగకపోవడంతో కొన్ని సెంటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. రామాయంపేట, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ వంటి పెద్ద పట్టణాలతో పాటు గ్రామాల్లో ప్రతిరోజు టన్నుల కొద్ది చికెన్ విక్రయాలు సాగేవని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం అడిగే వారే కరువయ్యారని వాపోతున్నారు. కనీసం తమ వద్ద పనిచేసే వర్కర్లకు వేతనాలు సైతం ఇవ్వలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 60 శాతం తగ్గిన విక్రయాలు జిల్లావ్యాప్తంగా సుమారు 180 నుంచి 210 వరకు చికెన్ సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటిలో గతంలో ప్రతి రోజూ సుమారు 20 నుంచి 25 టన్నుల మేర చికెన్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయంతో విక్రయాలు 60 శాతం తగ్గిపోయాయని విక్రయదారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రమైన మెదక్లో 25 చికెన్ సెంటర్లు ఉండగా, ప్రతిరోజూ కనీసం రెండున్నర టన్నుల మేర చికెన్ అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం విక్రయాలు టన్నుకు పడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో ఎల్లవేళలా రద్దీగా ఉండే చికెన్ మార్కెట్ ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. అయితే జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని అధికారులు ప్రకటిస్తున్నా, ప్రజలు భయాన్ని వీడటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చికెన్ సెంటర్లు పూర్తిగా మూతపడే అవకాశం ఉందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ పిల్లలకు నో చికెన్ ! ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంతమేర విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని జిల్లా పరిధిలోని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు పరోక్ష ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్ పెట్టడం మానేశారు. కొన్ని హాస్టళ్లలో మాత్రం వార్డెన్లు చికెన్ వండి పెడుతున్నారని పలు హాస్టళ్ల సంక్షేమాధికారులు పే ర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు. ‘బర్డ్ ఫ్లూ’ భయంతో జనం విముఖత జిల్లాలో మూతపడిన పలు చికెన్ సెంటర్లు నష్టాల బాటలో నిర్వాహకులు ప్రజలను చైతన్యపర్చాలి బర్డ్ ఫ్లూపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన, అపోహను తొలగించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. వైరస్ పుకార్లతో పౌల్ట్రీకి అనుబంధంగా ఉన్న పలుశాఖలు ఇబ్బందుల పాలవుతున్నాయి. చికెన్ అమ్మకాలు 60 శాతం మేర తగ్గాయి. ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలను చైతన్యపర్చాలి. – ఇంతియాజ్ (బిలాల్), జిల్లా చికెన్ సెంటర్ల సంఘం ప్రతినిధి -
‘ఏఐ’ అమలు తీరుపై ఆరా
నర్సాపూర్/తూప్రాన్: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) కింద ఎంపికై న మండల ప్రజా పరిషత్ పాఠశాలను సోమవారం బెంగుళూరు ఈకే ఫౌండేషన్ సంస్థకు చెందిన టెక్నికల్ టీం సందర్శించింది. డీఈఓ రాధాకిషన్ వారికి పాఠశాలలో ప్రోగ్రాం అమలు తీరును వివరించారు. వారి వెంట ఎంఈఓ తారాసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్సూద్ అలీ, సిబ్బంది తదితరులు ఉన్నారు. అనంతరం బృందం సభ్యులు తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం పాపన్నపేట(మెదక్): ఇటీవల గుండెపోటుతో మరణించిన పాపన్నపేట హెడ్ కానిస్టేబుల్ వీరప్ప కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం వీరప్ప భార్య నాగప్ప గారి బుజ్జమ్మకు రూ. 8 లక్షల చెక్కును ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. వీటితో పాటు విడో ఫండ్ రూ. 10 వేలు, కార్పస్ ఫండ్ రూ. 50 వేలను చెక్కుల రూపంలో ఇచ్చారు. మిగితా బెనిఫిట్స్ సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ కుటుంబాల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఓ మణి, సూపరింటెండెంట్ అనురాధ, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. గోదాంలతో ఎంతోమందికి ఉపాధి మెదక్జోన్: సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) 69వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం మెదక్లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మేనేజర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలో వరుసగా మూడేళ్లుగా ఆదాయం అర్జిస్తూ ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. గోదాంలతో ఎందరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. అంతకుముందు హమాలీలతో పాటు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్ టేక్మాల్(మెదక్): ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని తంప్లూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల శ్రీరామ్యాదవ్ను నియమించారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2023లో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ తరఫున జనరల్ సెక్రటరీ పోటీ చేసి విద్యార్థుల మద్దతు పొందినట్లు చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి జీ, జాతీయ ఇన్చార్జి కన్హయ్య కుమార్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల నాయకులు శ్రీరామ్ యాదవ్ను అభినందించారు. ప్రజావాణికి 24 వినతులు మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణికి 24 వినతులు వచ్చాయి. గత మూడు వారాలుగా హెల్ప్డెస్క్ ద్వారా అర్జీలు స్వీకరించారు. ఈ వారం అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
డీఎంహెచ్ఓ శ్రీరామ్ మెదక్జోన్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ శ్రీరామ్ హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో జిల్లాలోని వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రత్యేక అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు తగ్గించడమే స్పెషల్ డ్రైవ్ లక్ష్యమన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైద్యులు సునీతాదేవి, సృజన, జ్ఞానేశ్వర్, మాధవి, వినయ్ సుశీల్, శివదయాల్, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. -
రంజాన్కు పక్కాగా ఏర్పాట్లు
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ కలెక్టరేట్: రంజాన్కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్లో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. తాగునీరు అవసరమైన చోట అదనంగా నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేయాలన్నారు. మసీదుల వద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అలాగే దుకాణాల వద్ద ఆహార భద్రత నిబంధనలు తప్పకుండా అనుసరించాలన్నారు. వివిధ పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. మతపెద్దలు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేయ నున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎల్ఆర్ఎస్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఆర్ఓ భుజంగరావు, డీపీఓ యాదయ్య, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మూగజీవాలకు భరోసా..
●సంచార వైద్య సేవలతో సత్ఫలితాలు ●‘1962’కు కాల్తో అత్యవసర వైద్యంతూప్రాన్: మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు 2017లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. టోల్ఫ్రీ నంబర్ 1962కు ఒక్క ఫోన్ చేస్తే చాలు రైతులు కోరిన చోటుకు అంబులెన్స్లో సిబ్బంది వచ్చి పశువులకు చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పశువులు, జీవాల మరణాలు గణనీయంగా తగ్గాయి. జిల్లావ్యాప్తంగా రెండు పశుసంచార వాహనాల ద్వారా నెలకు సుమారు 1,800కు పైగా మూగజీవాలకు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ మారుమూల గ్రామాల్లో అత్యవసర వైద్యం కింద మూగజీవాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వైద్యసేవలు అందుతున్నాయి. పశుసంచార వాహనంలో మూగజీవాలకు సంబంధించిన అన్ని రకాల మందులతో పాటు చికిత్సకు అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 2 సంచార వాహనాల్లో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10 వాహనాలతో పాటు 40 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. పశువులకు అందించిన చికిత్స వివరాలు సంవత్సరం పశువులు 2021 3,986 2022 3,794 2023 4,123 2024 3,964 2025 ఫిబ్రవరి వరకు 648జిల్లాలో ఇలా.. పశువైద్య కేంద్రాలు: 67 ఉప కేంద్రాలు: 35 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు: 29 మంది ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు: మెదక్, నర్సాపూర్, రామాయంపేట సరైన వైద్య సేవలు ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఉన్న రెండు పశు సంచార వాహనాల ద్వారా 35 వేల మూగజీవాలను కాపాడగలిగాం. ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్నా తమకు ఫోన్్ వచ్చిన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సరైన చికిత్స అందిస్తున్నాం. సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటంతో పాటు వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని పరికరాలు వాహనాల్లో అందుబాటులో ఉంచాం. – అప్రోజ్, పశుసంచార వాహనాల జిల్లా కో మేనేజర్ గేదెను కాపాడారు నా గేదె అనారోగ్యంతో రెండు, మూడు రోజులుగా మేత మేయలేదు. దీంతో 1962 నంబర్కు ఫోన్ చేశా. గంట వ్యవధిలో సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి గేదెకు చికిత్స అందించారు. మూడు రోజుల అనంతరం గేదె ఆరోగ్యం మంచిగా అయింది. – నర్సింలు, చిన్నగొట్టిముక్ల, శివ్వంపేట -
పక్కాగా పంటల నమోదు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పంటల నమోదు పక్కాగా జరుగుతోంది. ప్రతి రైతుకు ప్రయో జనం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి జిల్లా లో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా సాగు వివరాలు, పంటల ఫొటోలు యాప్లో పొందుపరుస్తున్నారు. ఒక్కో అధికారికి 2 వేల ఎకరాలు జిల్లాలో మొత్తం 21 మండలాలు, 493 గ్రామా లు ఉండగా.. వీటిని వ్యవసాయ అధికారులు 76 క్లస్టర్లుగా విభజించి డిజిటల్ సర్వే ప్రారంభించారు. ఇందులో మొత్తం 1,49,593 ఎకరాల్లో సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముమ్మరంగా సర్వే కొనసాగిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు ఒక్కొక్కరికి 2 వేల ఎకరాలు సర్వే చేయాలని ఆదేశించారు. అయితే మహిళా అధికారులకు మాత్రం 1,800 ఎకరాల టార్గెట్ ఇచ్చారు. ఎవరైనా పంట వేయకుంటే నో క్రాప్ అని నమోదు చేస్తున్నారు. అయితే వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని గ్రామాల శివారులో సిగ్నల్స్ సమస్య తలెత్తుతోంది. దీంతో డిజిటల్ సర్వే ఆలస్యం అవుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు 63,890 ఎకరాల్లో 40 శాతం సర్వే పూర్తయింది. ఇంకా జిల్లాలో 85,703 ఎకరాల విస్తీర్ణంలో పంటల నమోదు చేయాల్సి ఉంది. సిగ్నల్స్ సమస్యతో సర్వే జాప్యం అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రయోజనాలు జిల్లాలో జరుగుతున్న పంటల సాగు డిజిటల్ సర్వేతో రైతులకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. సర్వే ఆధారంగా ఎక్కడ, ఏ రైతులు ఏ పంట వేస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రభు త్వం మార్కెట్ సౌకర్యం కల్పి స్తుంది. అలాగే రైతులు ప్రకృతి విపత్తుల నుంచి నష్టపోకుండా పంటల బీమా వసతి కల్పించనుంది. పంట నష్టం అంచనా పక్కాగా ఉంటుంది.కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే20 రోజుల్లో పూర్తి చేస్తాం జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే 40 శాతం పూర్తయింది. మిగితాది మరో 15, 20 రోజుల్లో పూర్తి చేస్తాం. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వే ద్వారా రైతులకు సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనొత్పత్తి , రైతుబీమా, భరోసా వంటి పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సర్వే త్వరగా పూర్తయ్యేందుకు రైతులు అధికారులకు సహకరించాలి. – వినయ్కుమార్, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి -
ఏడుపాయలలో భక్తుల సందడి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆదివారం జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు రాలేని వారు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ధర్మసత్రాలు దొరకక ఇబ్బంది పడ్డారు. చెట్ల కింద టెంట్లు వేసుకొని విందు చేసుకున్నారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈఓ చంద్రశేఖర్, ఎస్ఐ శ్రీనివాస్గౌడ్, ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరా మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి(అందోల్): ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరాను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరా శివారులో గల హనుమాన్ దేవాలయం వద్ద వైదిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్ధిపూర్ దత్తాత్రేయ పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం బుదేరా శివారులో వైదిక పాఠశాలను ఏర్పాటు చేసి కులమతాలకతీతంగా పిల్లలకు వేదాలు నేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్దేశ్వర్ మహరాజ్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్ యాదవ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి తారా అధ్యాపకుడుసంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ ఒడిశాలో జరిగే ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె ఎస్ రత్నప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఒడిశా ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి రాష్ట్రం నుంచి ఆరుగురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలిగిన బృందం బయలుదేరుతుందని, ఈ బృందానికి కాంటినెంట్ లీడర్గా తమ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ వ్యవహారించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు జరుగుతుందనిన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడం పట్ల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసింది. క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుంద ని తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు టి.రాజు అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు ఢీల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆర్చరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేయలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలలో రాణించే వారికి విద్య, ఉపాధి, ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. ఈ పోటీలలో సుమారు 500 మంది పాల్గొన్నారన్నారు. అందులో ఎంపికై న వారు ఈనెల 22న విజయవాడలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ క్రీడాల్లో పాల్గొంటారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం అస్సత్రిలోని ఆయా విభాగాలను సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అస్పత్రి రికార్డులు, హాజరుపట్టికను తనిఖీ చేశారు. శ్రీపాదరావుకు నివాళి మెదక్ కలెక్టరేట్: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ప్రజల కోసం శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్రెడ్డి, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
కాలువ ఇలా.. సాగు ఎలా!
గుర్రపు డెక్కతో నిండిన ఎంఎన్ కెనాల్ కాలువఘనపూర్ ఆనకట్ట నుంచి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు సరఫరా అయ్యే కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. మండల పరిధిలోని ఎంఎన్ కెనాల్ ద్వారా ముత్తాయికోట, కూచన్పల్లి, ముత్తాయిపల్లి, సర్దన, ఫరీద్పూర్, పోచమ్మరాల్ గ్రామ శివారులోని పొలాలకు సాగునీరు సరఫరా అవుతుంది. దీంతో కూచన్పల్లి వద్ద కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందక ఇబ్బంది పడుతున్నారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి సాఫీగా సాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. – హవేళిఘణాపూర్(మెదక్) -
వందలాది కోళ్ల మృత్యువాత
కొల్చారం(నర్సాపూర్): గంటల వ్యవధిలోనే వందలాది కోళ్లు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని నాయిని జలాల్పూర్లో జరిగింది. గ్రామానికి చెందిన సతీష్గౌడ్ ఉపాధి కోసం కొన్నినెలల క్రితం పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆదివారం ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా ఫాంలోని కోళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడసాగాయి. దీంతో అప్రమత్తమైన యజమాని మిగితా కోళ్లకు ప్రమాదం జరగకుండా వాటిని వెంట వెంటనే తొలగించారు. సుమారు 1,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని, సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఒక్కసారిగా వందలాది కోళ్లు మృత్యువాత పడటంతో బర్డ్ ఫ్లూ వచ్చిందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందారు. ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం పౌల్ట్రీ ఫాంను సందర్శించి నిర్ధారణ చేస్తామని తెలిపారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఐఐటీ హైదరాబాద్లో ఉప రాష్ట్రపతి పర్యటనసంగారెడ్డి జోన్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖఢ్ కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో పర్యటించారు. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో కలిసి క్యాంపస్ను సందర్శించారు. మధ్యా హ్నం సుమారు 3:15 నిమిషాలకు మూడు ప్రత్యేక హెలిక్యాప్టర్ల ద్వారా క్యాంపస్కు చేరుకున్నారు. క్యాంపస్కు వచ్చిన వారికి గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీఆర్ మొహన్రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్, ఎంపీ రఘునందన్రావు, ఐఐటీ హెచ్ డైరెక్టరు బీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పుష్ఫగుచ్ఛాలు అందించి, మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. క్యాంపస్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి ప్రోత్సహించే సంకేతంగా ఉప రాష్ట్రపతి భార్య డా.సుదేశ్ ధన్ఖఢ్తో కలిసి ఏక్ పేడ్ మా కె నామ్ పేరుతో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం క్యాంపస్ సభాస్థలి వెళ్లారు. జాతీయ గీతాలాపన చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటీ డైరెక్టరు బీఎస్.మూర్తి ఉప రాష్ట్రపతితో పాటు గవర్నర్కు శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. ఐఐటీ డైరెక్టరు ఐఐటీ సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించారు. ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్లలో సుమారు 4:30 నిమిషాలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు నాకు అతిథులు ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, పార్లమెంట్ను సందర్శించాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత దేశం వివిధ భాషల నిలయమని చెప్పారు. -
సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంట చేతికి వస్తున్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయలేదన్నారు. సన్ ఫ్లవర్ క్వింటాలుకు రూ.6వేలు మద్దతు ధర నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో దళారులు క్వింటాలుకు రూ. 5 వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం చొరవ తీసుకొని వెంటనే కొనుగొలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
‘రిజర్వేషన్ల ప్రాతిపదికనే నామినేటెడ్ పదవులు’
వర్గల్(గజ్వేల్): వివిధ నామినేటెడ్ పదవులను రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం గౌరారం ఎస్సీవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడి సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, సీఎం రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యకర్తలు ప్రతిఒక్కరూ పార్టీకి విధేయులై పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
ఇళ్ల నిర్మాణం.. ఇక వేగవంతం
రామాయంపేట(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. ఈమేరకు జిల్లాలోని మండల కేంద్రాల్లో రూ. ఐదు లక్షలతో ఇందిరమ్మ మోడల్ హౌస్లు నిర్మించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు, వాటిని నిర్మించే మేసీ్త్రలకు అవగాహన కల్పించడానికి వీలుగా వీటిని నిర్మించనున్నారు. జిల్లాలో మొదటి విడతలో పది మండలాల్లో మోడల్ హౌస్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం రామాయంపేట, మెదక్, టేక్మాల్, పాపన్నపేట, రేగోడ్లో ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గృహా నిర్మాణ శాఖ అధికారులు దగ్గరుండి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న మోడల్ హౌస్లను లబ్ధిదారులు చూసి వెళ్తున్నారు. రూ. 5 లక్షలతో ఎలా ఇళ్లు నిర్మించాలన్న విషయమై అవగాహన కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై గృహా నిర్మాణశాఖ డీప్యూటీ ఈఈ యాదగిరి మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో మోడల్ హౌస్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఐదు మండల కేంద్రాల్లో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. మిగితా మండలాల్లో సైతం త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.మండలానికో ఇందిరమ్మ మోడల్ హౌస్ -
మొక్క.. ఏది లెక్క?
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో హరితహారం నిధులు రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. పట్టణంలో అధికారులు రెండు నర్సరీలను ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయం వెనుక భాగంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో ఒకటి ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో మొక్కల సంరక్షణ పేరిట రూ. లక్షలు ఖర్చు చేశారు. నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ వేసి గేటు, ఆర్చ్ నిర్మించారు. ెమొక్కలకు నీరు పారించడానికి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి బోరు తవ్వించారు. ఇందులో వేల సంఖ్యలో మొక్కలు నాటినట్లు ప్రకటించారు. నాటిన మొక్కలను పట్టణ వాసులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నామమాత్రంగా వార్డుకు ఒకరిద్దరికి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈనర్సరీలో నాటిన మొక్కలు కొన్ని ఎండిపోయాయి. ఏమైందో తెలియదు కాని కేవలం నీటి వసతి లేదనే కారణంతో ఈ నర్సరీని వదిలేసి దీని స్థానంలో వెంకటేశ్వర కాలనీలో మరో నర్సరీ ఏర్పాటు చేశారు. దీనిలో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు చెప్పారు. అక్కడ ప్రస్తుతం పదుల సంఖ్యలో మాత్రమే మొక్కలున్నాయి. ఈ నర్సరీ చుట్టూ ఫెన్సింగ్, బోరు తవ్వకం, ఆర్చ్ నిర్మాణం కోసం బడ్జెట్లో మళ్లీ రూ. ఐదు లక్షల వరకు కేటాయించారు. కాగా మొదటి నర్సరీ కోసం ఖర్చు చేసిన నిధులు రూ. లక్షలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. రహదారి పక్కనే ఉన్న నర్సీరీని వదిలివేయడంతో సామగ్రి దొంగలపాలవుతోంది. వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో కేవలం పదుల సంఖ్యలో మొక్కలు ఉండగా, గతంలో బోరు తవ్వించారు. ఈ నర్సరీ చుట్టూ ఫెన్సింగ్, ఆర్చ్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో మంజూరు చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన నర్సరీ నిరుపయోగంగా వదిలేయడంతో పాటు రెండో నర్సరీలో తక్కువ సంఖ్యలో మొక్కలు ఉండగా, వీటి నిర్వహణ పేరిట ఖర్చు చేసిన రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఈవిషయమై పట్టణ వాసులు మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నర్సరీల పేరిట రూ. లక్షలు దుర్వినియోగంపాత నర్సరీని పునరుద్ధరిస్తాం మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి పక్కనే గతంలో ఏర్పాటు చేసిన నర్సరీలో నీటి వసతి లేకపోవడంతో తాత్కాలికంగా పక్కన పెట్టాం. గతేడాది వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇంకా అవసరమైన మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షిస్తాం. నిధుల దుర్వినియోగం విషయమై తన దృష్టికి రాలేదు. తన హయాంలో నిధుల దుర్వినియోగం జరగలేదు. దీనిపై విచారణ జరిపిస్తాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
రోడ్లపై చెత్త కనిపించొద్దు
మెదక్ మున్సిపాలిటీ: అధికారులు ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా ఆయా ప్రాంతాల్లో త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి స్థల పరిశీలన చేశారు.ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ప్రజలతో మమేకమై వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపైన చెత్త కనిపించకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మా.. వెళ్లొస్తాం
ముగిసిన ఏడుపాయల జాతరజాతర ఆదాయం రూ. 61.50 లక్షలు ఏడుపాయల జాతర హుండీ ఆదాయం రూ. 61,50,237 వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం గోకుల్ షెడ్లో హుండీ లెక్కింపు చేపట్టారు. నగదుతో పాటు మిశ్రమ బంగారు వెండి కానుకలు వచ్చినట్లు వివరించారు. గతేడాది జాతరకు రూ. 61,18,186 ఆదాయం వచ్చింది. అప్పటితో పోలిస్తే రూ. 32,051 అధికంగా వచ్చినట్లు తెలిపారు. కాగా గతేడాది 14 రోజుల అనంతరం హుండీ లెక్కించగా, ఈసారి 16 రోజుల అనంతరం లెక్కించారు. కార్యక్రమంలో రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు, చీఫ్ ఫెస్టివెల్ అధికారి కృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.పాపన్నపేట(మెదక్): మూడు రోజులుగా కొనసాగిన ఏడుపాయల జాతర శనివారం ముగిసింది. దుర్గమ్మా.. వెళ్లొస్తాం.. అంటూ భక్తులు తమ ఇళ్లకు మళ్లారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రారంభమైన ఏడుపాయల జాతరకు ఈ ఏడాది భక్తులు తక్కువగా వచ్చారు. కుంభమేళా ప్రభావం కొంతమేర కనిపించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో రెండుసార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తాగు నీటి కోసం భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు లేక కొన్ని చోట్ల టాయిలెట్లు సైతం మూతబడ్డాయి. వివిధ శాఖల అధికారులకు ఏర్పాటు చేసిన షెడ్లలో తాగు నీటి సమస్యలు తప్పలేదు. రోజుకు కేవలం 120 లీటర్ల నీరు ఇచ్చి సరిపెట్టు కొమ్మన్నారని వైద్యారోగ్య శాఖ సిబ్బంది వాపోయారు. జాతర లో సిగ్నల్స్ పనిచేయకపోవడంతో పలువురు భక్తులు తప్పిపోయారు. చేతిలో సెల్ఫోన్లు ఉన్నా, తప్పిపోయిన వారు ఎక్కడ ఉన్నారో తెలియక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఏడుపాయల జాతరకు వచ్చిన గంగాపూర్కు చెందిన యువకుడు శివరాత్రి రోజు ఘనపురం ఆనకట్టలో శవమై తేలాడు. శనివారం హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు మంజీరా పాయల్లో మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చారు. పోలీస్ అధికారులు ట్రాఫిక్ సమస్య అరికట్టగలిగారు. అయితే ఏడుపాయల పాలక వర్గం లేని లోటు స్పష్టంగా కనిపించింది.జాతర నుంచి ఇంటి దారి పడుతున్న భక్తులు -
చదువులో పోటీ పడాలి
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు పోటీ పడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శనివారం మండల స్థాయిలో నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం,తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పఠనం తదితర వాటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. భవిష్యత్లో విద్యార్థుల ఉన్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. మండల స్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ మధుమోహన్, ఏఎంఓ సుదర్శనమూర్తి, కరుణాకర్, నాగుల్ మీరా మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు -
ఐక్యతకు చిరునామాగా ఉమ్మడి కుటుంబాలు
● అరమరికలు లేకుండా..అంతా కలిసికట్టుగా ● ఒకే ఇంట్లో ఆప్యాయత, అనురాగాల మధ్య ● ఏళ్ల నాటి నుంచి ఉమ్మడిగానే జీవనం ● కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ● ఆదర్శంగా నిలుస్తున్న పలు కుటుంబాలువివరాలు 8లోనేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలుమెదక్జోన్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెలలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. మసీదుల్లో ఐదువేళలా ప్రార్థనలతో పాటు పవిత్ర తరావీహ్ నమాజు, ఖురాన్ను పఠిస్తారు. నెలవంక తిరిగి దర్శనమిచ్చేంత వరకూ ఈ ఉపవాస దీక్షలను పాటిస్తారు. -
ఊరిస్తున్న మార్కెట్ కమిటీలు!
మెదక్జోన్: మెదక్ మార్కెట్ కమిటీ పదవీ కాలం 2023 సెప్టెంబర్ 13న ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం బీసీకి రిజర్వుడ్ కావటంతో చైర్మన్ పదవి కోసం సీనియర్ నేత ముత్యంగౌడ్, గూడూరి ఆంజనేయులు, జీవన్రావు, శంకర్గౌడ్, మంగ మోహన్గౌడ్, జీవన్రావు, బట్టి సులోచన పోటీ పడుతున్నారు. అయితే వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. రామాయంపేట మార్కెట్ కమిటీ చెర్మన్ పదవి ముగిసి రెండేళ్లు గడిచిపోయింది. ఇది ఎస్టీకి రిజర్వు కావటంతో నలుగురు గిరిజన నేతలు పోటీ పడుతున్నారు.చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన మోహన్నాయక్, ఇదే మండలం టీ మాందాపూర్ తండాకు చెందిన సురేందర్ నాయక్, అశోక్నాయక్తో పాటు నార్సింగి మండలంలోని ఓ తండాకు చెందిన రాజాసింగ్, నిజాంపేట మండలానికి చెందిన మరో ఇద్దరు పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ పోటీదారులు ఎక్కువ కావటంతో డ్రా పద్దతిన చైర్మన్ను ఎన్నుకుంటామని కీలక నేత ఒకరు తెలిపారు. పాపన్నపేట మార్కెట్ కమిటీ పాలకవర్గం 2024 జనవరి 12వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఇది ఎస్సీకి రిజర్వుడ్ కావటంతో చైర్మన్ పదవి కోసం వినోద, అమృతరావు, మధు, శ్రీనివాస్, అల్లారం రత్నయ్య, క్రీస్తుదాసు, సూర్య పోటీ పడుతున్నారు. చేగుంట మార్కెట్ కమిటీ పాలకవర్గం 2022 మే 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని నియమించలేదు.ఇది ఓసీకి రిజర్వుడ్ కావడంతో చైర్మన్ పదవి కోసం చేగుంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, వెంగళరావు, భాస్కర్ పోటీ పడుతున్నారు. నర్సాపూర్ మార్కెట్ కమిటీ 2022 సెప్టెంబర్ 25తో ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని ఎన్నుకోలేదు. ఇది బీసీకి రిజర్వుడ్ కావటంతో నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్ పోటీ పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మార్కెట్ కమిటీని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్కు రిజర్వుడు అయింది. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉమ్మన్నగారి భాస్కర్రెడ్డి, కాళ్లకల్కు చెందిన మరో సీనియర్ నేత మల్లారెడ్డి పోటీ పడుతున్నారు.మార్కెట్ పాలకవర్గాలను ఏర్పాటుచేయకపోవడంతో రైతులు పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారు కరువయ్యారు. రామాయంపేట మార్కెట్ కమిటీ పరిధిలో వరి తర్వాత మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. పాలకమండలి లేకపోవటంతో పంటను కొనుగోలు చేసేవారు ఎవరూ లేరు. దీంతో అన్నదాతలు తక్కువ ధరకు బయటి వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మెదక్ మార్కెట్ కమిటీ జిల్లా కేంద్రంలో ఉండటంతో ఇతర మండలాల నుంచి రైతులు మొక్కలు, కందులు, పొద్దుతిరుగుడు లాంటి ఉత్పత్తులు తీసుకొస్తారు. పాలకవర్గం లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జిల్లాలోని మిగితా మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. -
విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు
చేగుంట(తూప్రాన్): గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు రాకుండా ఈ ఏడాది 800 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలను ఏర్పాటు చేసినట్లు విద్యుత్శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి తెలిపారు. మండలంలోని కర్నాల్పల్లిలో విద్యుత్ సమస్యపై శుక్రవారం గ్రామస్తులు ధర్నా చేసిన విషయం తెలుసుకున్న ఆయన అధికారులతో కలిసి శనివారం సబ్స్టేషన్ను సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం బాలస్వామి మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో గతేడాది కంటే ఈసారి పదిశాతం ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో మరో 82 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గొల్లపల్లిలో ఇటీవలే సబ్స్టేషన్ ప్రారంభించడంతో లోడ్ సైతం తగ్గిపోయిందని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు వస్తే స్థానిక ఏఈలకు వివరించాలని, వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, డీఈ గరత్మంత్రాజు, ఏడీఈ ఆదయ్య, ఏఈ భరత్ గ్రామస్తులు పాల్గొన్నారు.విద్యుత్ శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి -
కృత్రిమ మేధతో ఉత్తమ భవిత
నర్సాపూర్: కృత్రిమ మేధతో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, రాయడం సామర్థ్యాల పెంపుపై నిర్వాహకులకు ఆయన అవగాహన కల్పించారు. కృత్రిమ మేధతో విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలిగితే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంను నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలో ఆరు పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ తారాసింగ్, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 23 వరకు జరగనున్న పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలన్నారు. ప్రతి సెంటర్కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని, ఆశావర్కర్లను నియమించాలని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థుల గదుల్లో ఎలాంటి మెటీరియల్ లేకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని.. ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏవీఎస్గా విధులు నిర్వర్తించిన కిశోర్బాబు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా ఆయనను కలెక్టర్ సత్కరించి, పూలమాలతో సన్మానించారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమని తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రామచంద్రరాజు, ఏపీఆర్ఓ బా బురావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
రథోత్సవం.. రమణీయం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర చివరి రోజైన శుక్రవారం వనదుర్గమ్మ రథంపై ఊరేగారు. ఆచారం ప్రకారం దేవాలయ అధికారులు నాగ్సాన్పల్లిలోని సాయిరెడ్డి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఉత్సవానికి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన 18 కులాలు, పనిబాటల వారు రథం ముందు పట్టు పరిచి, ముగ్గులు వేసి, మంత్రాలు చదివి, గుమ్మడి కాయ బలి ఇచ్చారు. అనంతరం వేద బ్రాహ్మణులు పూజలు చేశారు. ఆచారం ప్రకారం హక్కు బాపతుల వారిని, పూలమాలలు, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయం నుంచి పల్లకిపై దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ఉంచారు. దుర్గమ్మకు జై అంటు తాళ్లతో రథాన్ని లాగుతూ ఊరేగింపు ప్రారంభించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆలయ ఈఓ చంద్రశేఖర్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ధూంధాంగా బోనాలు జాతర చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. జోగిని శ్యామల శుక్రవారం తెల్లవారుజామున బోనం తీసి భక్తులను ఉర్రూతలూగించారు. పోతరాజులు చెర్న కోలలు చేతబట్టి బోనం ఎత్తి చిందులు వేశారు. జాతరలో ప్రధానంగా భక్తులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. ధర్మ సత్రాలలో నీరు లేక నానా ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు, ఆలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సాయంత్రం మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయల్లో జన సందోహం బోనాలు, నృత్యాలతో మురిపెం -
కృత్రిమ మేధతో ఉత్తమ భవిత
నర్సాపూర్: కృత్రిమ మేధతో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, రాయడం సామర్థ్యాల పెంపుపై నిర్వాహకులకు ఆయన అవగాహన కల్పించారు. కృత్రిమ మేధతో విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలిగితే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంను నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలో ఆరు పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ తారాసింగ్, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 23 వరకు జరగనున్న పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలన్నారు. ప్రతి సెంటర్కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని, ఆశావర్కర్లను నియమించాలని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థుల గదుల్లో ఎలాంటి మెటీరియల్ లేకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని.. ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏవీఎస్గా విధులు నిర్వర్తించిన కిశోర్బాబు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా ఆయనను కలెక్టర్ సత్కరించి, పూలమాలతో సన్మానించారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమని తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రామచంద్రరాజు, ఏపీఆర్ఓ బా బురావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
చికెన్ కర్రీ.. నో వర్రీ
చికెన్, ఎగ్ మేళాకు ఎగబడిన జనంనర్సాపూర్: వెన్కాబ్ చికెన్ కంపెనీ, స్థానిక గోల్డెన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడి ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్లో చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. మేళాను ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో అపోహలు, భయాన్ని తొలగించేందుకే చికెన్ మేళా ఏర్పాటు చేశారని అన్నారు. బర్డ్ఫ్లూ మన ప్రాంతంలో లేదని, 70 డిగ్రీల వరకు చికెన్ను ఉడికించి తినవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని తెలిపారు. కోళ్ల పరిశ్రమపై చాలా మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వెన్కాబ్ కంపెనీ మేనేజర్లు దీరేందర్రెడ్డి, మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా మేళా లో చికెన్ తో పాటు కోడిగుడ్లు పంపిణీ చేశారు. -
యూరియా కొరత లేదు: ఏడీ ఏ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఏడీఏ పుణ్యవతి అన్నారు. శుక్రవారం కౌడిపల్లిలోని ఆగ్రో స్, డీసీఎంఎస్, మన గ్రోమోర్, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టాక్ రికార్డులు, ధరల పట్టికను పరిశీలించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మించి యూరియా వాడొద్దని తెలిపారు. యూరియా ఎక్కువగా వాడటం వల్ల పంటకు తెగులు, చీడపీడలు సోకుతాయని చెప్పారు. పంటలో సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఎరువులు అమ్మాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
మంచి దిగుబడులతోనే మనుగడ
ప్రతి రైతు శాస్త్రవేత్తే పంటలు పండించే ప్రతి రైతు కూడ ఒక శాస్త్రవేత్తేనని షేక్ ఎన్ మీరా అన్నారు. సొంత విత్తనాలు సాగు చేయడం అనేది రైతు హక్కు అని, దీన్ని సంరక్షించుకునేందుకు సాధక బాధకాలు చాలా ఉన్నాయన్నారు. విత్తనాలను సంస్థ పరంగా, లేదా వ్యక్తిగతంగా కాని హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా విత్తనాలపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన రైతులు తాము రూపొందించిన రకాల విత్తనాలను ప్రదర్శనకు పెట్టారు. సమావేశంలో ప్రిన్సిపాల్ సైటింస్ట్ ఎఆర్రెడ్డి, పీపీవీఎఫ్ఆర్ రిజిస్ట్రార్ డీకే అగర్వాల్, ఎక్స్పర్ట్స్ అరవింద్కుమార్, హరిప్రసన్న, డీడీఎస్ ఈడీ దివ్య, సభ్యుడు రామాంజనేయులు, కేవీకే ప్రతినిధులు వరప్రసాద్, రమేష్, స్నేహలత, వరలక్ష్మి పాల్గొన్నారు.జహీరాబాద్: కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) రైతులకు అవగాహన కల్పించాలని, అన్ని విధాలుగా సహకారం అందించాలని ఐటీఏఆర్–అటారి డైరెక్టర్ షేక్ ఎన్ మీరా సూచించారు. శుక్రవారం జహీరాబాద్లోని డీడీఎస్–కేవీకేలో రాష్ట్రంలోని కేవీకే శాస్త్రవేత్తలు, ముఖ్య రైతులతో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వైరెటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (పీపీవీఎఫ్ఆర్) చైర్పర్సన్ త్రిలోచన్ మహాపాత్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ ఎన్ మీరా మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ రైతులకు సలహాలు, సూచనలిస్తూ వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించేలా సూచనలు ఇవ్వాలని కోరారు. అప్పుడే రైతులు లబ్ధి పొందగలుగుతారని పేర్కొన్నారు. ఆదాయం వస్తుందని కాకుండా రాబోయే తరానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పీపీవీఎఫ్ఆర్ దరఖాస్తులు చేపట్టడం అభినందనీయమని చెప్పారు. విత్తనాలపై రైతులకు హక్కులు కల్పిస్తామని, రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రాబోయే కాలంలో బయో పైరసీని కూడా అరికట్టగలిగే స్థాయిలో ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్తోనే హక్కుదారులు నాలుగు దశాబ్ధాల నుంచి చిరుధాన్యాలు, ఇతర ధాన్యాల పరిరక్షణపై చేస్తున్న కృషికి.. రిజిస్ట్రేషన్ చేయడం ద్వారానే హక్కు వస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాత పంటల విషయంలో జహీరాబాద్ ప్రాంతం పేరు తెచ్చుకున్నా.. చిన్న రిజిస్ట్రేషన్ చేయకపోవడం బాధాకరమైన విషయమన్నారు. మొదటగా పాత పంటలు, రైతుల రకాలు 100 నుంచి 120 రకాల వరకు ఉన్నాయన్నారు. వీటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను రైతులు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో కేవీకేలదే కీలకపాత్ర ఐటీఏఆర్–అటారి డైరెక్టర్ షేక్ ఎన్ మీరా -
విద్యకు 15 శాతం కేటాయించాలి
నిజాంపేట(మెదక్): రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 15శాతం నిధులు కేటాయించాలని దళిత బహుజన ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని నార్లాపూర్ నుంచి నిజాంపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. బడ్జెట్లో కేవలం 7 శాతం నిధులు కేటాయించిందని మండిపడ్డారు. రానున్న బడ్జెట్లోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల కోటేశ్వర్, స్వామి, జగన్, మద్దికుంట నర్సింలు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలపై దృష్టి సారించండిచిన్నశంకరంపేట(మెదక్): పదో తరగతి విద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పాఠ్యంశాలను రివ్యూ చేస్తూ పదికి పది గ్రేడ్ సాధించాలన్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ గీతా, తహసీల్దార్ మన్నన్, ఆర్ఐ రాజు ఉన్నారు. షీటీమ్స్తో భరోసా: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: షీటీమ్స్ విద్యార్థినులు, బాలికలు, మహిళలకు ఆపద సమయంలో భరోసా ఇస్తాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గత నెలలో షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. జిల్లావ్యాప్తంగా 9 మంది ఈవ్టీజర్లపై కేసు నమోదు చేశామని, మరో 44 మందిని పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలన్నారు. షీటీం వాట్సాప్ నంబర్ 8712657963, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712657888 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. నేటి నుంచి పోలీస్యాక్ట్మెదక్ మున్సిపాలిటీ: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని శనివారం నుంచి ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నా, రాస్తారోకో, నిరసన, ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. అలాగే ప్రజాధనానికి నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. మదన్రెడ్డికి పరామర్శ నర్సాపూర్: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు మదన్రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి శుక్రవారం పరామర్శించారు. మదన్రెడ్డికి ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగడంతో హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
అంగన్వాడీల బలోపేతం!
పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ తీరనున్న సిబ్బంది కొరతమెదక్జోన్: అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ జారీ కానుంది. జిల్లావ్యాప్తంగా 392 ఖాళీలు.. జిల్లావ్యాప్తంగా 1,076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 3 నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారులు 19,937 మంది, గర్భిణులు 5,007, బాలింతలు 4,873 మంది ఉన్నారు. కాగా జిల్లాలో 191 మినీ, 885 మెయిన్ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మెయిన్ సెంటర్లలో టీచర్తో పాటు ఆయా ఇద్దరు ఉంటారు. మినీ అంగన్వాడీలో కేవలం టీచర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తోంది. దీంతో పిల్లలకు ఆటపాటలతో చదువు చెప్పటం, పిల్లలతో పాటు సెంటర్ పరిధిలోని గర్భిణులు, బాలింతలకు వంటచేసి పెట్టడం ఇబ్బందిగా మారింది. ఈక్రమంలో మినీ సెంటర్లకు తల్లిదండ్రులు పిల్లలను పంపడం కూడా మానేశారు. విషయాన్ని సిబ్బంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మినీ సెంటర్లను 2024 ఏప్రిల్లో మెయిన్ సెంటర్లుగా మార్చారు. దీంతో జిల్లాలో 191 మినీ సెంటర్లు మెయిన్గా మారాయి. అయితే అందులో ఆయాలను మాత్రం నేటికీ నియమించలేదు. జిల్లాలో పదవీ విరమణ, మరణించిన వారితో కలిపి మొత్తం 340 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటితో పాటు రిటైర్ట్ అయిన టీచర్ల స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్య అందనుంది. మహిళల్లో చిగురించిన ఆశలు అంగన్వాడీ కేంద్రాల్లో నియామకాలకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గతంలో ఉన్న నిబంధనలు మార్చి విద్యార్హతలో మార్పులు చేశారు. దీంతో నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురించాయి.జిల్లాలో ఇలా.. అంగన్వాడీ కేంద్రాలు 1,076టీచర్ల ఖాళీలు 52 ఆయాలు 340 -
కల్యాణం.. కమనీయం
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విఘ్నేశ్వరుని పూజతో ప్రా రంభించి.. జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, కన్యాదాన తంతు, తలంబ్రాలు, మహామంగళ హారతితో ముగించారు. ఉదయం సమయంలో అగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివ రుద్రప్ప, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా పాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దపట్నం.. నేత్రపర్వం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివ రాత్రి పర్వదినం పురస్కరించుకుని తోటబావి వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పెద్ద ప ట్నం వేడుకలు కనులపండువగా జరిగాయి. అదే సమయంలో గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తలు, అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. పెద్ద పట్నం నిర్వహించే తోట బావి ప్రాంగణానికి చేర్చారు. వేడుకలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. 41 వరుసలతో పెద్దపట్నం బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన పెద్ద పట్నాన్ని 41 వరుసలతో వేశారు. ఇందుకు సుమారు 150 మంది ఒగ్గుపూజారులు పొల్గొన్నారు. ఊరేగింపుగా బోనాలు తీసుకువచ్చి పట్నంపై పెట్టి స్వామికి నైవేద్యం సమర్పించారు. అర్చకులు యాదవ సంప్రదాయం స్వామివారి ప్రకారం కల్యాణం నిర్వహించారు. వెంటనే ఉత్సవ విగ్రహాలతో పట్నం దాటారు. స్వామి వారి పట్నాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తోటబావి ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. బండారిమయమైన కొమురవెల్లి శిమనామస్మరణతో మారుమోగిన తోటబావి ప్రాంగణం -
బండ్ల జోరు.. జాతర హోరు
పాపన్నపేట(మెదక్): జోడెడ్ల బండ్ల జోరు.. బోనాల హోరు.. శివసత్తుల శిగాలు.. పోతరాజుల గావు కేకలు.. డప్పు చప్పుళ్లు.. యువకుల నృత్యాలతో ఏడుపా యల్లోని కొండా కోన ప్రతి ధ్వనించాయి. జాతర రెండో రోజు గురువారం ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు కనుల పండువగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా.. ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండికి నాగ్సాన్పల్లి వద్ద పనిబాటల వారు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. యువకుల నృత్యాల మధ్య బండ్ల ఊరేగింపు కొనసాగింది. రాజగోపురం వద్దకు చేరుకోగానే.. ఆలయ అధికారులు ప్రతి బండి ఎదుట కొబ్బరికాయ కొట్టి దుర్గమ్మ చిత్రపటాలను బహూకరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు గురువారం తెల్లవారుజాము నుంచే ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. మంజీర నదిలో స్నానాలు చేసి, బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. సాయంత్రం బండ్ల ఊరేగింపును తిలకించారు. జాతరలో సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో చాలా మంది తప్పిపోయి, తమ వారిని చేరడానికి పోలీస్ కంట్రోల్ రూంకు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, ఈఓ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.బోనంతో తరలివస్తున్న భ క్తులుఏడుపాయల్లో భక్తుల సందడి