breaking news
Medak
-
అన్నా పండుగొచ్చిందే..!
● ఆశావహులకు సంక్రాంతి భారం ● ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దావత్లు ● తడిసి మోపడవుతున్న ఖర్చు మెదక్కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న ఆశావహులకు సంక్రాంతి పండుగ ఖర్చు తడిసి మోపెడవుతోంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇప్పటికే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆశావహు లు పండుగ వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మీ మద్దతు తనకే ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. ఇదే సమయంలో సంక్రాంతి రావడంతో అన్నా పండగొచ్చింది.. దావత్ లేదా? అంటూ యువకులు, పెద్దలు అడగటంతో చేసేది లేక ఖర్చు పెడుతున్నారు. నోటిఫికేషన్ రాకముందే ఖర్చు ఇలా ఉంటే తర్వాత ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. పండుగ ఖర్చు కాదంటే.. ఓట్లు పోతాయన్న భయంతో భరిస్తున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా గెలవాలన్న తపనలో ఉన్న కొంతమంది పండుగను ఆసరా చేసుకొని ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లను ప్రకటించడంతో ఇక ఏ క్షణ మైన షెడ్యుల్ విడుదల చేసే అవకాశ ం ఉంది. జిల్లాలో నాలుగు బల్దియాలు జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్లో 32, నర్సాపూర్ 15, తూప్రాన్ 16, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. వార్డులకు సంబంధించిన ఓటరు తుది జాబితాను ఇప్పటికే ప్రకటించారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 87,185 మంది ఓటర్లు ఉన్నారు. -
పల్లె లోగిళ్లు.. భోగిభాగ్యాలు
●అంబరాన్నంటిన వేడుకలు ●ఎక్కడ చూసినా పండుగ సందడే ●నేడే రంగుల సంక్రాంతి.. సర్వం సిద్ధంమెదక్అర్బన్ : మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకలు జిల్లాలో అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. బుధవారం భోగిని జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే మహిళలు వాకిట్లో రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. ముగ్గు లో గొబ్బెమ్మలు పెట్టి మధ్యలో నవధాన్యాలు పోశారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులపై భోగిపండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. పాత వస్తువులతో భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకోగా, చిన్నారులు, పెద్దలు పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు. కాగా గురువారం మకర సంక్రాంతి, రేపు కనుమను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో లోగిళ్లన్నీ సందడిగా మారాయి. -
రామలింగేశ్వరాలయం ముస్తాబు
నేటి నుంచి 17 వరకు ఉత్సవాలుముస్తాబైన రామలింగేశ్వరాలయం, (ఇన్సెట్) గర్భగుడిలోని స్వయంభు రామలింగేశ్వరుడుతూప్రాన్: మండలంలోని ఇస్లాంపూర్ శివారు రామలింగేశ్వరాలయం విశిష్ట ప్రాచుర్యం పొందింది. ఇక్కడ పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఏటా మకర సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకలకు ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఏళ్ల క్రితం భూమి నుంచి 300 అడుగుల ఎత్తులో ఇక్కడ రామలింగేశ్వరాలయాన్ని నిర్మించారు. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో తిరుగుతున్నప్పుడు ఈ ఆలయంలో పూజలు చేసినట్లు చెబుతారు. ఈనెల 15 నుంచి 17 వరకు జాతర ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారి శలాక ఆత్రేయశర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. -
మౌలిక వసతులు కల్పించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి సూచించారు. తాగునీటి సౌకర్యం, ర్యాంపులు ఉండేలా చూసుకోవాలన్నారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి కౌడిపల్లి(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని పీహె చ్సీ, సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీహెచ్సీ భవనాన్ని పరిశీలించారు. మిగిలిపోయిన పనుల గురించి కాంట్రాక్టర్తో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేస్తుందన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందించాలని, అనుమతి లేనిదే సెలవులో వెళ్లవద్దని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ ఎలిజిబెత్రాణి, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
కొండెక్కిన కోడి
మెదక్కలెక్టరేట్: సంక్రాంతికి మాంసం ధరలు చుక్కలనంటుతున్నాయి. కొనక ముందే కుత కుత ఉడుకుతున్నాయి. పండుగ సందర్భంగా చాలా మంది ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటారు. అతిథులకు కూడా రకరకాల నాన్వెజ్ వంటకాలను వడ్డిస్తారు. అయితే చికెన్ ధరలు ఇప్పటికే ట్రిపుల్ సెంచరీ దాటి పరుగులు పెడుతుండటం మాంసం ప్రియులను ఆందోళనకు గురిచేస్తుంది. పండుగ నాటికి డిమాండ్ పెరిగితే ధరలు రూ. 350 దాటే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చికెన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామా న్యులు, పేదలు చికెన్ కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ నెల రోజులుగా రూ. 300 పలుకుతోంది. గతంలో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ. 200 ఉండేది. కానీ ఇప్పుడు అదే చికెన్ ధర రూ. 300 నుంచి రూ. 320 వరకు ఉంది. మార్కెట్లో కోళ్ల లభ్యత ఆధారంగా ధరలను వ్యాపారులు నిర్ణయించనున్నారు. పండుగకు అందరూ మాంసం వంటలు ఘుమఘుమ లాడించడంతో ధరలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. కేజీ మటన్ రూ. 800 నుంచి రూ. 100 వరకు పలుకుతోంది. నాటు కోళ్ల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. మటన్ ధరలతో సమానంగా ఉన్నాయి. గతంలో నాటుకోడి రూ.400 నుంచి రూ. 500 లోపు పలికేది. పండుగ సీజన్ కావడంతో వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కిలో రూ. 300 నుంచి రూ. 320 గతంలో ఎన్నడూ లేని విధంగా ధర నాటుకోళ్ల ధరలూ పెరిగాయి పండుగపూట మాంసం ప్రియుల జేబులకు చిల్లు -
జాతీయ యోగాసన పోటీలకు ఎంపిక
శిరీషమనోజచేగుంట(తూప్రాన్): జాతీయ యోగాసన పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గణేశ్ రవికుమార్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్లో స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో సౌత్జోన్ యోగాసన చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన శైనీ శిరీష, చిక్కుల మనోజ రిథమిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరిద్దరు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి యోగాసన పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మెదక్ ట్రైబల్ డిగ్రీ కళాశాల పీడీ రంగీలాతో పాటు యోగాసన అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
క్రీడలతో మానసికోల్లాసం
కొల్చారం(నర్సాపూర్): క్రీడలతో మానసికోల్లా సం కలుగుతుందని, గ్రామీణ యువత ప్రతిభ చాటేందుకు దోహదం చేస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పైతరలో జరిగిన పీపీఎల్ సీజన్– 3 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన జట్లకు మెడల్స్, ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాబన్నగారి రవితేజరెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్రెడ్డి, ఆదాం, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్గుప్తా, యువత అధ్యక్షుడు సంతోశ్రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్: మండలంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మండలంలోని ఇస్లాంపూర్, వెంకట రత్నాపూర్, మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపన్పల్లికి చెందిన నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, మహేందర్రెడ్డి, రమేశ్, మహేశ్, శ్రీశైలం, నగేష్, నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేగోడ్(మెదక్): వాహనదారులు నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ మహేందర్ సూ చించారు. మండలంలోని చౌదర్పల్లిలో బుధవారం సర్పంచ్ సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ పండగలను ప్రతీ ఒక్కరూ జరుపుకోవాలని కోరారు. మద్య సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా రేగోడ్లో కొనసాగుతున్న టోర్నమెంట్కు హాజరై క్రీడాకారులకు సూచనలు ఇచ్చా రు. కార్యక్రమంలో ఎస్ఐ పోచయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 19న కార్మిక, కర్షక ఐక్యత సభను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. బుధవారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందన్నారు. 2019లో తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందన్నారు. వీటి రద్దు కోసం ఈనెల 19న సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షిక ఐక్యత సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని కార్మికులు, కర్షకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏ.మల్లేశం, కే.మల్లేశం, నర్స మ్మ, మహేందర్రెడ్డి, బస్వరాజు, గౌరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు ఊరట
మెదక్జోన్: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు తీపి కబురు అందించింది. జిల్లాకు రూ. 6.70 కోట్లు విడుదల చేసింది. వీటిని అభివృద్ధికి కేటాయించాలని సూచించింది. అయితే గడిచిన రెండేళ్లకు సంబంధించి రావాల్సిన నిధులు కొండంత కాగా, వచ్చింది మాత్రం గోరంతేనని పలువురు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో 21 మండలాలు, 492 గ్రామాలు ఉండగా, 7.24 లక్షల మంది జనాభా ఉన్నారు. జనాభా ప్రాతిపదికన జిల్లాకు ప్రతీ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 6.70 కోట్లు రావాలి. ఆ నిధులను పారిశుద్ధ్య కార్మికుల వేతనాలతో పాటు పంచాయతీ అభివృద్ధికి వెచ్చిస్తుంటారు. కాగా 2024 జనవరి నుంచి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో ఆ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. గడిచిన కాలానికి సంబంధించి మొత్తం జిల్లాకు రూ. 160.80 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమే వచ్చినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన కేవలం 4.16 శాతం మాత్రమేనని పలువురు వాపోతున్నారు. కార్యదర్శులు వెచ్చించింది ఎక్కువే.. పాలకవర్గాల గడువు ముగియగానే జిల్లా అధికారులు పల్లెలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే వారు ఏనాడు పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. అవసరాలకు అప్పులు చేసి రెండేళ్లుగా గ్రామాలను నెట్టుకొచ్చారు. దీంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. మొత్తంగా కార్యదర్శులు తెచ్చిన అప్పులే రూ. 8 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. కాగా జిల్లా కు కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమే రావటంతో పెదవి విరుస్తున్నారు. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాకు రూ. 6.70 కోట్లు కేటాయింపు రెండేళ్లుగా రావాల్సింది రూ. 160.80 కోట్లు -
చార్మినార్ జోన్లో కలపండి
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని కలెక్టరేట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాహుల్రాజ్కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల జోన్లో కలపడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లాను వెంటనే చార్మినార్ జోన్లో కలపాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఆయాశాఖల అధికారులు సందీప్, నవీన్కుమార్, నవీన్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో రూ. రెండు వందల కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సముదాయం నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. త్వరితగతిన నిర్మాణం పనులు ప్రారంభించాలన్నారు. మారుమూల గ్రామాల విద్యార్థుల ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ స్కూలు దోహదపడుతుందని చెప్పారు. స్కూలు నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్థలసేకరణ, పనుల పురోగతికి సంబంధించి వివరాలు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక తహసీల్దార్ రజని, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అత్యుత్తమ సేవలందించాలి మెదక్ కలెక్టరేట్: అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్కు చెందిన టేబుల్ క్యాలెండర్, వాల్ క్యాలెండర్లను అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె సీమలు, పశుసంవద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి నాగభూషణం, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్, ఎల్లయ్య, మహేష్, సౌజన్య, మధులత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సంరక్షణ కిట్ల పంపిణీ హర్షణీయం అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు పురుగు మందులు పిచికారీ చేసే క్రమంలో వారి ఆరోగ్య పరిరక్షణకై సంరక్షణ కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. రైతులకు ఇలాంటి పరికరాలు అందజేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
బాల్యవివాహాలకు చెక్
ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాలు, తండాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐసీడీఎస్ రాయిలాపూర్ సెక్టార్ సూపర్వైజర్ లక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని పాంపల్లిలో ఏఎల్ఎంఎస్ (అంగన్వాడీ లేవల్ మానిటరింగ్ అండ్ సపోట్) కమిటీ, లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచ్ యశోదను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాణి, లబ్ధిదారులు పాల్గొన్నారు. తేల్చి చెప్పినప మిర్జాపల్లి వాసులు చిన్నశంకరంపేట(మెదక్): రైల్వే అండర్పాస్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తేనే డబుల్లైన్కు అవసరమైన భూములు ఇస్తామని చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు రైల్వే అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గ్రామానికి వెళ్లే రైల్వే బ్రిడ్జిని రైల్వే ఇంజనీర్ రాకేశ్, భూసేకరణ అధికారి రమేశ్ తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు, సర్వేయర్ దుర్గాభవాని పరిశీలించారు. అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలోకి చెరువు బ్యాక్ వాటర్ చేరి గ్రామానికి దారి లేకుండా పోతుందని గ్రామస్తులు అధికారుల వద్ద వాపోయారు. బ్రిడ్జిని మరో చోటుకు మార్చడమా లేదా తమకు ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు దారి విషయంలో స్పష్టత ఇచ్చిన తరువాతనే తమ భూములు సర్వే చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రమణ, మాజీ ఉపసర్పంచ్ మనోజ్, గ్రామ నాయకులు గంగాదర్గౌడ్, యాదగిరి ఉన్నారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్చంద్రబోస్హవేళిఘణాపూర్(మెదక్): వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని మెదక్ సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్చంద్రబోస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముత్తాయికోటలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ శ్వేత, సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గుండారం కిరణ్గౌడ్ పాల్గొన్నారు. తూప్రాన్లో ‘అరైవ్ అలైవ్’పై అవగాహన తూప్రాన్: రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రంగకృష్ణ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపకూడదని, అధిక వేగం నివారించాల్సిన అవసరం వంటి ముఖ్య అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జ్యోతి, యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. బతుకులు ఛిద్రం
● అతివేగంతోనే ప్రమాదాలు: ఎస్పీ శ్రీనివాసరావుకొల్చారం(నర్సాపూర్): అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ హాజరై మాట్లాడారు. చిన్న పార్టీ నిర్లక్ష్యం ప్రాణాలనే హరిస్తుందన్నారు. అలాగే.. కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 13 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం గ్రామంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనతరం రోడ్డు భద్రత పోస్టర్ను ఆవిష్కరించి, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఎస్పీ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డీపో మేనేజర్ సురేఖ, మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఏఎంవీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్, సర్పంచ్ దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని గెలవాలి: అడిషనల్ ఎస్పీ మహేందర్ పాపన్నపేట(మెదక్): ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో జీవితాన్ని గెలవాలని మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. మండల పరిధి మిన్పూర్లో మంగళవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. కబడ్డీ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థి జీవితంలో ఆటలు భాగస్వామ్యం కావాలని సూచించారు. మిన్పూర్ లాంటి చిన్న గ్రామం నుంచి పలువురు యువకులు, విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సృజన, యేసురత్నం, ఉపసర్పంచ్ కిరణ్, ప్రభాకర్రెడ్డి, ఐజేయూ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రూ2.50 కోట్లు స్వాహా
● మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్ ఆరోపణ ● నకిలీ బిల్లులతో నిధులు కాజేశారని ధ్వజం రామాయంపేట (మెదక్): స్థానిక మున్సిపాలిటీ పరిధిలో భారీస్థాయిలో రూ.2.50 కోట్ల మేర అవినీతి జరిగిందని మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బుట్టల కొనుగోలు, బ్లీచింగ్, మొక్కల పెంపకం, చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోల్లో డీజిల్ వినియోగం వంటి వాటిలో అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. తన హయాంలో కొనుగోలు చేసిన బుట్టలు కార్యాలయంలో నిలువ ఉండగా ఇటీవల రూ.32 లక్షలు ఖర్చుతో 12,600 చెత్త సేకరణ బుట్టలు, రూ.15లక్షలతో బ్లీచింగ్ కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేశారన్నారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహకారంతో నిధులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, అధికారులు వీరిపై చర్యలు తీసుకోకపోతే రామాయంపేట పట్టణం బంద్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సహకార సంఘం మాజీ చైర్మన్ బాదెచంద్రం, సీనియర్ నాయకులు అహ్మద్, హస్నొద్దీన్, పార్టీ యూత్ విభాగం మండలశాఖ అధ్యక్షుడు ఉమ, నాయకులు నాగార్జున, చింతల రాములు, రమేశ్, బాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నారీమణులే నిర్ణేతలు
● మున్సిపల్ ఎన్నికల్లో వీరే కీలకం ● గెలుపోటములపై తీవ్ర ప్రభావం ● మహిళా ఓటర్లపైనే పార్టీల దృష్టి మున్సిపాలిటీల్లో ఓటర్ల వివరాలు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు మెదక్ 17,548 19,406 1 36,954 రామాయంపేట 6,291 6,804 - 13,095నర్సాపూర్ 8,219 8,656 1 16,876తూప్రాన్ 9,957 10,302 - 20,259 నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ నాయకులందరూ ఐక్యంగా పని చేసి చైర్మన్ పదవిని దక్కించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పార్టీ నాయకులు హైదరాబాద్లో మంగళవారం హరీశ్రావును కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నర్సాపూర్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు చెప్పి ఓటు అడగాలన్నారు. బీఆర్ఎస్లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సహించేదిలేదని హెచ్చరించారు. పార్టీ చేయించే సర్వేలో ప్రజల్లో పట్టున్న వారికే టికెట్లు ఇస్తామని, పోటీచేయాలనుకుని అవకాశం దక్కని నాయకులు నిరుత్సాహపడవద్దని సూచించారు. పార్టీ కోసం పని చేయాలని అటువంటివారికి భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. హరీశ్రావును కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయిమోద్దీన్తోపాటు పలువురు నాయకులు ఉన్నారు. రామాయంపేట (మెదక్): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయకులు మహిళా ఓటర్లపై దృష్టి సారించారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 87,185 ఓట్లకు గాను, పురుషులు 42,015 కాగా, మహిళలు 45,168, ఇతరులు ఇద్దరు ఉన్నారు. మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,153 మంది అధికంగా ఉన్నారు. కౌన్సిలర్లుగా పోటీ చేసేవారు ముందుగా మహిళా ఓటర్లనే ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఆశావహులు ఇప్పటి నుంచే మహిళా సంఘాల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మహిళల శ్రేయస్సుకు అఽధిక ప్రాధాన్యత ఇస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మెదక్ మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళలు 18,48 మంది, తూప్రాన్లో 345 మంది, నర్సాపూర్లో 437 మంది, రామాయంపేటలో 513 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో మున్సిపాలిటీల్లో మహిళల ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మెప్మా గ్రూపు సభ్యులపై నమ్మకం పెట్టుకున్నారు. ఇటీవల ఈ గ్రూపులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడంతో వారి మద్దతు తమకే ఉంటుందని అంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న మహిళా గ్రూపుల సభ్యులు అధికార పార్టీని ఆదరిస్తారని వారు భావిస్తున్నారు. మెదక్లో 7,975 మంది, తూప్రాన్లో 4,199, నర్సాపూర్లో 2,967, రామాయంపేటలో 3,339 మంది మెప్మా గ్రూపులో మహిళా సభ్యులున్నారు. హరీశ్రావును కలిసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ నాయకులు -
జిల్లాల పునర్విభజనపై రేకెత్తిస్తున్న ఆశలు
‘నాగిరెడ్డిపేట మండలాన్ని 20 కి.మీ దూరంలో ఉన్న మెదక్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ 2016 అక్టోబర్లో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని చనిపోయాడు మాల్తుమ్మెదకు చెందిన ఉడావాటి రాజు. అయినా ఇంత వరకు అతని కోరిక నెరవేరలేదు. నెలల తరబడి మండలవాసులు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు కామారెడ్డి జిల్లాలోనే కలసి పోయింది.’ మెదక్ అర్బన్ జిల్లాల పునర్విభజనలో రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయాన్ని గాలికొదిలాశారు. అశాసీ్త్రయ విభజనతో అంతులేని ఆవేదన మిగిల్చారని విమర్శలున్నాయి. పలు గ్రామాల ప్రజలు ఒక జిల్లాలో ఉంటూ.. మరో నియోజక వర్గం ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. దీంతో ఒకే రాజకీయ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇద్దరు నాయకుల మధ్య స్థానిక క్యాడర్ సతమతమవుతోంది. ఈ జిల్లా మాకు అనుకూలంగా లేదు. అనుకూలమైన జిల్లాలో కలపాలంటూ పలు మండలాల ప్రజలు యేళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా అశాసీ్త్రయ విభజన.. జనాల్లో అంతులేని ఆవేదన మిగిల్చింది. తిరిగి జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పునర్విభజనపై మళ్లీ చర్చ మొదలైంది. అశాసీ్త్రయ విభజన జిల్లా పేరును తనలో ఇముడ్చుకున్న మెదక్ 2016లో సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ పేర్లతో మూడు ప్రత్యేక జిల్లాలుగా అవతరించాయి. ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్ధాల డిమాండ్ నెరవేరినప్పటికీ, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలతో పోలిస్తే.. మెదక్ అతి చిన్న జిల్లాగా అవతరించింది. ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ డివిజన్గా ఉన్న మెదక్లో 18 మండలాలు ఉండగా.. కొత్త జిల్లా కేవలం 15 మండలాలతో ఏర్పడింది. అనంతరం మరో 6 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. సిద్ధిపేటలో మూడు రెవెన్యూ డివిజన్లు, 508 పంచాయతీలు, సంగారెడ్డిలో నాలుగు రెవెన్యూ డివిజన్లు 633 పంచాయతీలు, మెదక్లో నాలుగు రెవెన్యూ డివిజన్లు 492 పంచాయతీలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాబా 5,65,741. అయితే అభివృద్ధి చెందిన ప్రదేశాలు, అననుకూల ప్రదేశాలు పొరుగు జిల్లాల్లో కలిశాయని, అప్పట్లో ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఒకటి.. నియోజకవర్గం మరొకటి.. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాలు మెదక్ జిల్లాలో ఉండగా, సంగారెడ్డి జిల్లాలోని అందోల్ అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్లుగా తమ ఎమ్మెల్యేను ఎన్నుకుంటున్నారు. అలాగే చేగుంట, నార్సింగ్ మెదక్ జిల్లాలో, దుబ్బాక నియోజక వర్గంలో, తూప్రాన్, మనోహరాబాద్ మెదక్ జిల్లాలో, గజ్వేల్ నియోజక వర్గంలో, శంకరంపేట(ఏ) మెదక్ జిల్లాలో, నారాయణఖేడ్ నియోజక వర్గంలో, హత్నూర సంగారెడ్డి జిల్లాలో నర్సాపూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఒకే రాజకీయ పార్టీ అఽధ్యక్షుల మధ్య గ్రూపు తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన డీసీసీ ఎన్నికలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నామినేటెడ్ విషయంలో ఒకే పార్టీకి చెందిన అందోల్, గజ్వేల్, మెదక్ నియోజక వర్గాల కాంగ్రెస్ బాస్ల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. ఆధిపత్య పోరుకు తెర లేపాయి. అలాగే మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్కు మార్చాలని జిల్లా ఉద్యోగులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ● జిల్లా ఒకచోట.. మండలం, నియోజకవర్గం మరోచోట.. అనుకూల జిల్లాలో కలపాలంటున్న మండలవాసులు రాజకీయ పార్టీల్లోనూ గ్రూపు తగాదాలు చార్మినార్ జోన్ కావాలంటున్న నిరుద్యోగులు, ఉద్యోగులు పునర్విభజనతో మెతుకు సీమ మెరిసేనా.. ! ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లాల పునర్విభజనపై మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. అశాసీ్త్రయ విభజనతో ఉమ్మడి మెదక్ జిల్లావాసులు అనేక అవస్థలు పడుతున్నారు. మండలం ఒకజిల్లాలో ఉంటే.., నియోజకవర్గం మరో జిల్లాలో.. రెవెన్యూ డివిజన్ ఇంకో చోట ఉంటుంది. ఇలా మూడు ముక్కలాటగా మారిన విభజనతో జిల్లావాసులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. పెద్ద శంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలి.భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మాకు మెదక్ కన్నా, సంగారెడ్డి అనుకూలం. అల్లాదుర్గం, రేగోడ్ మండలాల ప్రజలకు కూడా సంగారెడ్డి దగ్గర. మేము మెదక్ వెళ్లాలంటే, ఇతర జిల్లాకు వెళ్లినట్లు ఉంటుంది. మాకున్న కుటుంబ సంబంధాలు, ఉద్యోగ స్థలాలు సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. –జోడు రవీందర్. శంకరంపేట అసెంబ్లీ నియోజక వర్గాల తర్వాతే జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలి. అప్పుడే ప్రస్తుతమున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జిల్లాలు, మండలాలను తగ్గింపు, పెంచే ఆలోచన తగదు. ఉన్న వాటిలో సమస్యలను గుర్తంచి సర్దుబాటు చేయాలి. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు మెదక్ను చార్మినార్ జోన్లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలి. –బి.కొండల్ రెడ్డి, మాజీ టీపిటిఎఫ్, రాష్ట్ర అధ్యక్షులు -
రైతులకు పరిహారం ఇవ్వండి
మెదక్ కలెక్టరేట్: యాసంగి పంటలకు సింగూరు నీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను ఆగమాగం చేస్తుందని మండిపడ్డారు. రెండేళ్ల క్రితం సింగూరు మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు రైతులకు ఈ గోస తప్పేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి సింగూరు, కృష్ణ జలాలను ఏపీకి అప్పగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఘనపూర్ ఆనకట్ట కింద 40 వేల ఎకరాలకు నీళ్లు అందక రైతు కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడకపోవటం విచారకరమన్నారు. రైతుల గోస సీఎంకు తెలిసేలా పోస్ట్కార్డు ఉద్యమం చేపడతామన్నారు. కఅనంతరం ర్యాలీగా వెళ్లి అదనపు కలెక్టర్ నగేశ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే శశిధర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జెడ్పీ మాజీ వైస్చైర్మన్ లావణ్యరెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. -
షాపును బట్టి వసూలు
మెదక్ అర్బన్ వందల కొద్ది దరఖాస్తులు.. ఫీజు లకు లక్షలాది రూపాయలు.. ఒకటో, రెండో వైన్షాపులు దక్కించుకున్న యజమానులకు ‘గుడ్ విల్ దందా.. గోటి చుట్టుపై రోకటి పోటు’లా మారింది. షాపులను బట్టి సాగుతున్న కాసుల వేటలో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి బాస్ల వరకు వాటాలున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరో వైపు నెల నెలా స్టేషన్ మామూళ్లు.. ఆరునెలల కోసారి స్పెషల్ పార్టీ వసూళ్లు, పండగలు.. పబ్బాలకు లిక్కర్ బాటిళ్ల పంపకాలు.. వెరసి రెండేళ్లలో రూ. 10 లక్షలు మామూళ్ల పాలవుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 49 వైన్ షాపులు.. 5 బార్లు జిల్లాలో 49 వైన్షాపులు.. 5 బార్లు ఉన్నాయి. ఈఏడాది కొత్త ఎకై ్సజ్ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి ప్రారంభం అయ్యింది. వైన్షాపుల మీద ఉన్న మోజులో కొంతమంది కలిసి సిండికేట్లుగా ఏర్పడ్డారు. సుమారు 50 నుంచి 160 వరకు దరఖాస్తులు చేశారు. రూ. 3 లక్షల చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి, చివరకు ఒక్కటో.. రెండో షాపులు దక్కించుకున్నారు. అయితే లైసెన్స్ల మంజూరు ప్రక్రియలో నిబంధనలను సాకుగా తీసుకొని ఎక్సైజ్ అధికారులు ‘గుడ్ విల్’ దందాకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి. ఇది చాలా ఏళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గుడ్ విల్ పేరిట షాపును బట్టి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ డబ్బులో జిల్లా అధికారుల నుంచి రాష్ట్రస్థాయి బాస్ల వరకు వాటాలున్నాయన్న ప్రచారం ఉంది. ఈ లెక్కన చూస్తే జిల్లా నుంచి సుమారు 1.5 కోట్లు వసూలు అవుతున్నట్లు సమాచారం. ఇవిగాక షాపును బట్టి, నెల మామూలు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఠంచన్గా వసూలు చేస్తుంటారని తెలిసింది. ఇక డీటీఎఫ్, ఎస్టీఎఫ్ పార్టీలకు 6 నెలలకోసారి ఒక్కోషాపు నుంచి రూ. 40 నుంచి రూ. 50 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఏసీ, డీసీ స్థాయిలో ఆరు నెలలకోసారి జాయింట్గా రూ. 40 ను ంచి రూ. 50 వేలు ఇస్తుంటారు. మామూళ్లు వసూలు చేయడానికి కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు రంగంలోకి దిగుతుంటారు. ఇక దసరాకు ఒక్కో వైన్షాపు నుంచి 3 నుంచి 4 కాటన్ల మద్యం ఫుల్బాటిళ్లు తీసుకెళ్తుంటారు. వైన్షాపు తనిఖీలకు వస్తే డీజిల్ డబ్బులు అదనం. ఇవన్నీ కలిపితే రెండేళ్లలో ఒక్కో షాపు నుంచి సుమారు రూ. 10 లక్షల వరకు మామూళ్ల రూపంలో వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇన్చార్జి ఈఎస్ శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.ఎకై ్సజ్వారి పాట రూ. 3 లక్షలు -
పుర ఓటర్లు 87,375
రామాయంపేట(మెదక్)/మెదక్మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జా బితా సోమవారం విడుదలైంది. ఈమేరకు సాయంత్రం ఆయా మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు కొత్త ఓటర్ జాబితాను విడుదల చేశారు. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డుల్లో 87,375 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 1న విడుదల చేసిన ముసాయిదా జాబితాల్లో వందల సంఖ్యలో మృతుల పేర్లతో పాటు ఇతర గ్రామాలకు చెందిన ఓటర్ల వివరాలు చోటు చేసుకున్నా యి. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఈనెల 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అదే రోజు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేశారు. మంగళవారం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. 16న ఫొటోలతో కూడిన లిస్ట్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్హత ఉన్న కొత్త ఓటర్లను చేర్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. పట్టణాల్లో యువ ఓటర్లను ఆశావహులు నమోదు చేయించినా, ఓటు హక్కు లభించలేదు. రిజర్వేషన్ల మార్పు తఽథ్యం గత ప్రభుత్వం 2019లో నూతన పురపాలిక చట్టం రూపొందించి రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ కొనసాగే విధంగా చట్టం చేసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనలు తొలగించేలా సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో రెండు పర్యాయాల రిజర్వేషన్లు రద్దయినట్లే. ముందుగా ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేసిన తర్వాత 50 శాతానికి మించకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మహిళలకు ఆయా సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లలో విధిగా 50 శాతం కేటాయించనున్నారు. మహిళా ఓటర్లే కీలకం ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. కౌన్సిలర్గా పోటీపడే అభ్యర్థులు ఇక మహిళలను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో గత అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే కీలకమయ్యారు. ఇక మున్సిపోల్స్ వంతు వచ్చింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయపజయాలను వారే నిర్ణయించనున్నారు. వారిని మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తున్నారు. మెదక్ పట్టణంలో మొత్తం 32 వా ర్డులు ఉండగా, మొత్తం ఓటర్లు 36,955 ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళా ఓటర్లు 19,406, పురుషులు 17,548 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. -
క్యూఆర్టీ సిబ్బంది పనితీరు భేష్
మెదక్ మున్సిపాలిటీ: క్యూఆర్టీ సిబ్బంది పనితీరు భేష్గా ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో క్యూఆర్టీ బృందాన్ని అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాపన్నపేట మండలం ఏడుపాయల్లో ఆదివారం కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్య అనే వ్యక్తి మంజీరాలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న క్యూఆర్టీ–1 సిబ్బంది వెంటనే స్పందించారని తెలిపారు. ప్రమాదకరమైన నది ప్రవాహాన్ని లెక్కచేయకుండా చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారని కొనియాడారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆదనపు ఎస్పీ మహేందర్, ఆర్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పేటను సంగారెడ్డి జిల్లాలో కలపండి
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని కోరుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన నాయకులు కలెక్టర్ రాహుల్రాజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సోమవారం మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 86 వినతులు వచ్చి నట్లు తెలిపారు. అనంతరం వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యు వత ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్అలీ, ఎంఈఓ వెంకటేశం, ఏఓ కృష్ణ, ఏఈ రమేశ్ తదితరులు పాల్లొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి మెదక్ కలెక్టరేట్: త్వరలో నిర్వహించబోయే మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా, మున్సిపల్ అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీల కమిషనర్లతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. -
గ్రూపుల లొల్లి
కాంగ్రెస్లో గందరగోళం ● అయోమయంలో నాయకులు ● బల నిరూపణలకు విందులు, వినోదాలు ● తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరం తూప్రాన్: మున్సి‘పోల్స్’ అధికార పార్టీ నాయకుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, గ్రూపుల లొల్లి గందరగోళంలో పడేసింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు వర్గాలుగా చిలిపోయారు. ఎటు మొగ్గు చూపుతే ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే టికెట్ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేస్థాయిలో బీఫాం ఎవరు ఇస్తారనేది తెలియక ఆయోమయంలో పడ్డారు. ఎవరికి వారే.. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మున్సిపాలిటీని కై వసం చేసుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అధిష్టానం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే స్థానిక కాంగ్రెస్ నాయకులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అర్హులకు బీఫాంలు ఇవ్వాలని అంతర్గతంగా చర్చించారు. కాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం గజ్వేల్ నియోజకవర్గంలో తన ఉనికిని చాటుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పుట్టినరోజు వేడుకలు, వివాహాలు, జాతరలకు తన అనుచరగణంతో హాజరవుతున్నారు. ఇక్కడి నాయకులు కొందరు ఆయనతో జతకడుతున్నారు. తనకున్న పలుకుబడితో బీఫాం ఇప్పిస్తారని భావిస్తున్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అయోమయంలో పడ్డారు. చైర్మన్ పీఠంపై గురి మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు కొందరు ఇప్పటికే బల నిరూపణకు తెరలేపారు. విందులు వినోదాలతో ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఫాం ఇస్తే ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసేందుకు వెనకాడమని బాహాటంగా చెబుతున్నారు. చైర్మన్ రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. కాగా రిజర్వేషన్లు తేలకపోవడంతో డైలామాలో పడ్డారు. -
సకాలంలో వైద్యం అందించాలి
రామాయంపేట(మెదక్): మండలంలోని ప్ర గతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ శ్రీరాం సందర్శించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించా రు. అనంతరం ఆస్పత్రి ఆవరణతో పాటు రికార్డులను పరిశీలించారు. డీఎంహెచ్ఓ వెంట ఏఓ హరిప్రసాద్, పీఓ నవ్య, డీడీఓ రేఖ, ఇతర అధికారులు ఉన్నారు. నాలుగు లేబర్కోడ్లు రద్దు చేయాలి: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలనే డి మాండ్తో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో సీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలు రద్దు చేసిందని మండిపడ్డారు. లేబర్కోడ్లు అమలు కాకుండా రాష్ట్ర ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జి ల్లా కోశా ధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్య క్షుడు మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: నగేశ్ మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 44 వినతులు అందజే శారు. ఇందులో భూభారతి 32, పెన్షన్ల కోసం 2, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలపై 9 వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఆర్ఓ భు జంగరావుతో పాటు ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో స్వామి వివేకానంద వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి చిన్నశంకరంపేట(మెదక్): స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకులు ముందుకు సాగాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని చందంపేటలో సర్పంచ్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామ గ్రంథాలయం, నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ప్రజల కోసం ప్రతి ఆరు నెలలకోసారి స్థానిక పరిశ్రమ సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయంలో తన వంతుగా రూ. 2 వేల పుస్తకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ నారాయణగౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ రమేశ్, బలరామ్, శ్రీనివాస్, దత్తుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. -
బల్దియాలపై ఎగిరేది గులాబీ జెండానే
● కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ● ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో మాజీ మంత్రి హరీశ్రావుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో ము న్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్యరావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీల ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్రావు మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, పల్లెల నుంచి పట్టణాల వరకు పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మున్సిపాలిటీలు, నేడు నిర్వహణ లేక కళ తప్పాయని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలి కొదిలేసిందని విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించామని.. నేడు కనీసం ఆ తాగునీటి సరఫరాను నిర్వహించడం కూడా చేతకావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని హరీశ్రావు చెప్పారు. -
జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
చేగుంట(తూప్రాన్): జాతీయస్థాయి రగ్బీ పోటీలకు జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ కరణం గణేశ్రవికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో అండర్ 15 రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. జిల్లా బాలికల టీం రెండోస్థానంలో నిలువగా, బాలుర టీం మూడో స్థానంలో నిలిచిందన్నారు. బాలికల విభాగంలో హరిణి, కీర్తన, నందిని, అర్చన, వర్షశ్రీ, లావణ్య, రక్షిత, బాలుర విభాగంలో విష్ణు, రఘునందన్, వేణుగోపాల్ ఎంపికయ్యారని వివరించారు. వీరంతా ఈనెల 15 నుంచి 21 వరకు భువనేశ్వర్లో జరిగే రగ్బీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
పేకాట, కోడి పందేలకు తావు లేదు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పరిధిలో పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూ ర్తిగా నియంత్రించేందుకు పోలీస్శాఖ కఠిన చర్యలు చేపడుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నిరంతర వాహన తనిఖీలు, గస్తీ ముమ్మరం చేశామన్నారు. పేకాట, కోడి పందేలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమో దు చేస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సమాచారమిస్తే వెంటనే చర్యలు చేపడతామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
పోరాట యోధుడు వడ్డే ఓబన్న
మెదక్ కలెక్టరేట్: పీడిత వర్గాల పోరాట యోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టర్ రాహుల్రాజ్ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్లో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచి మాట్లాడారు. తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు ఓబన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గ సాయిలు, జిల్లా గౌరవ అధ్యక్షుడు పెంటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, ఉపాధ్యక్షులు ఎల్లయ్య, సంపంగి, శ్రీను, భిక్షపతి, నర్సింలు, మధు, ఎల్లం, శ్రీశైలం, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
రిజర్వేషన్ కలిసొచ్చేనా..?
మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. సోమవారం వార్డుల వా రీగా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఏ క్షణమైన షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టిసారించాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి బల్దియాలపై జెండా ఎగరవేయాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. కాగా రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా..? లేదా..? ఒకవేళ ఆశించిన స్థానంలో రిజర్వేషన్ మహిళలకు వస్తే ఆశావహులు వారి భార్యలు, తల్లులను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన సీనియర్ నేతలు ఏకంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవిపై కన్నేశారు. అంతేకాకుండా పోటీలో నిలిచే తమ పార్టీ కౌన్సిలర్లకు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చేందుకు సైతం వెనకాడటం లేదు. గెలుపొందిన తర్వాత తనకు మద్దతు ఇవ్వాలని మచ్చిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆశించిన వార్డులో రిజర్వేషన్ కలిసి రాకపోతే మరోవార్డు నుంచి అయినా బీఫాం ఇవ్వాలని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. ఓటరు జాబితానే ప్రామాణికం! ఈనెల 16న తుది ఫొటో గుర్తింపు ఓటరు జా బితా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా 2020 ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం 10 ఏళ్ల పాటు ఇవే రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. కానీ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వా టిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల మార్పు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.ఏ క్షణమైనా నోటిఫికేషన్మెదక్ మున్సిపాలిటీ: ఏ క్షణమైనా మున్సిపల్ ఎ న్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఆదివారం మెదక్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితాను పరిశీలించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా విడుదల కావొచ్చని, విధుల నిర్వహణకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యలకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. తుది ఓటరు జాబితా తయారీలో ఎన్నికల నిబంధనలు పాటించినట్లు వివరించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి భూపతి, మేనేజర్ భవాని, ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.పేరున్న నేతలకు గాలం మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే చైర్మన్గా అవకాశం ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అలాగే మరికొంత మంది పేరున్న నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో అధికార కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు అవకాశం ఇవ్వాలంటూ ముఖ్య నేతలకు విన్నపాలు నేడు ఓటర్ల తుది జాబితా విడుదల -
పక్కాగా.. వన్యప్రాణుల లెక్క
19 నుంచి జంతు గణనకు సన్నద్ధం జిల్లాలోని 98 బీట్లలో సర్వేకు సన్నాహాలు అటవీశాఖ సిబ్బందితో పాటు పాల్గొననున్న విద్యార్థులు ● జంతువుల లెక్క తేల్చేందుకు అటవీశాఖసిద్ధమైంది. ఈనెల 19 నుంచి 25 వరకు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాల్లో గణన కోసం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం జిల్లాలోని 98 బీట్లలో బీట్కు ఇద్దరు చొప్పున 196మంది అవసరం కాగా, ప్రస్తుతం 74 మంది ఉన్నారు. దీంతో ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను గణనలో భాగస్వామ్యులనుచేయనున్నారు. – రామాయంపేట(మెదక్) జిల్లా పరిధిలో 57,627 హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన ఈ అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి. చిరుతలు, ఎలుగుబంటి, తోడేళ్లు, జింకలు, నక్కలు, రేసు కుక్కలు, కొండ గొర్రెలు, దుప్పులు, నీల్గాయిలు, చుక్కల దుప్పులు, సాంబారు, కృష్ణ జింకలు, అడవి పందులు మనుగడ సాగిస్తున్నాయి. కాగా వీటి లెక్కింపులో పాల్గొననున్న ఆశాఖ సిబ్బందితో పాటు విద్యార్థులకు మొదటి విడత శిక్షణ ఇప్పటికే పూర్తయింది. సోమవారం నుంచి నర్సాపూర్లో రెండో విడత శిక్షణ ప్రారంభం కానుంది. 98 బీట్లు.. 196 మంది సిబ్బంది జిల్లాలోని 98 బీట్లలో జంతుగణన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఒక్కో బీట్లో ఇద్దరు చొప్పున 196 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం ఈశాఖలో కేవలం 44 మంది బీట్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు కామారెడ్డి అగ్రికల్చర్ బీఎస్సీ, మెదక్ జిల్లాలోని ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను లెక్కింపు కోసం వినియోగించుకుంటున్నారు. సాధారణంగా అటవీప్రాంతం, అందులో జంతువుల గురించి ఆశాఖ సిబ్బందికే పూర్తి అవగాహన ఉంటుంది. ప్రతి టీంలో అటవీశాఖ సిబ్బంది ఒకరితో పాటు ప్రైవేట్ వ్యక్తిని నియమిస్తున్నారు. రోజూ నాలుగు కిలోమీటర్లు.. ఎంపిక చేసిన టీంలలో ఇద్దరు చొప్పున సభ్యులు ప్రతి రోజూ నాలుగు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో పర్యటించి జంతు గణన చేపడతారు. ఇందుకు గాను అడవిలో మార్కింగ్, డైరెక్షన్స్, మ్యాపులను అధికారులు ప్రకటించారు. గణన నిర్వహించే బయటి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. కాగా మొదటి విడతగా 19 నుంచి మూడు రోజుల పాటు మాంసాహార జంతువుల గణన కొనసాగనుంది. ఇందులో కేవలం జంతువుల వివరాలు, పాదముద్రలు సేకరిస్తారు. 23 నుంచి మూడు రోజుల శాఖాహార జంతువుల గణన కొనసాగుతుంది. ఈమేరకు గుర్తించిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.పర్వతాపూర్ అటవీ ప్రాంతంజిల్లాలో ఇలా.. అటవీ విస్తీర్ణం 57,627 హెక్టార్లు రేంజ్లు 6 డిప్యూటీ రేంజ్లు 8సెక్షన్లు 21 బీట్లు 126 పకడ్బందీగా నిర్వహిస్తాం ఈనెల 19 నుంచి జిల్లాలోని 98 బీట్లలో పకడ్బందీగా జంతు గణన చేస్తాం. ఇందుకు గాను తమ సిబ్బందితో పాటు వలంటీర్ల ను నియమించాం. మొదటి మూడు రోజులు మాంసాహార, తర్వాత మూడు రోజులు శాఖాహార జంతువుల గణన కొనసాగుతుంది. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున ప్రక్రియలో పాల్గొంటారు. – జోజి, జిల్లా అటవీ అధికారి -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
చిన్నశంకరంపేట(మెదక్): ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయా లని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లా డుతూ.. నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సిన డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. మరో వైపు ఆరోగ్య భద్రత కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికే బకాయిపడిన 5 డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం కౌడిపల్లి(నర్సాపూర్): కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం అని, వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మా ట్లాడారు. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కల్లబొల్లిమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ప్రభుత్వ భూమలు అమ్మడం, దోచుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు రామాగౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షు డు శ్రీనివాస్, నాయకులు నవీన్కుమార్, మహిపాల్రెడ్డి, కాంతారావు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మెదక్జోన్: రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈనెల 25 వరకు బూత్ స్థాయిలో లోటు పాట్లు సరిచేసు కోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు గడ్డం శ్రీనివాస్, రంజిత్రెడ్డి, పంజా విజయ్, నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంగారమ్మకు మొక్కులు మనోహరాబాద్(తూప్రాన్): వారాంతపు సెలవు దినం కావడంతో కాళ్లకల్ బంగారమ్మ దేవాలయంలోని వనదుర్గా అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. ఒడిబియ్యం సమర్పి ంచి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన పూజారి వేణుగోపాల్శర్మ తీర్థ ప్రసాదాలను అందించారు. ఉపాధి రద్దుకు కేంద్రం కుట్ర రామాయంపేట(మెదక్): కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి కుట్ర పన్నుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరుయాత్ర ఆదివారం రామాయంపేట చేరుకోగా ఆమె మాట్లాడారు. కేంద్ర వైఖరిపై కార్మికులను చైతన్యపర్చేందుకు ఈనెల 8న మెదక్లో పోరుయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. వందలాది మంది కార్మికులతో కలిసి ఈనెల 12న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఏకం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచన అదిరె.. విద్యార్థులు మురిసె
మెదక్జోన్: మనసుంటే మార్గం ఉంటుందని, అది పది మందికి ఉపయోగపడుతుందని నిరూపించా రు జిల్లా పాలనాధికారి రాహుల్రాజ్. నూతన సంవత్సర వేళ అధికారులు, యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తనను కలిసేందుకు వచ్చే వారు శాలువాలు, పుష్పగుచ్ఛాలకు బదులు దుప్పట్లు తీసుకురావాలని సూచించారు. ఆయన నోటి నుంచి మాట రావటమే ఆలస్యం వేలాదిగా దుప్పట్లు వచ్చి చేరాయి. వాటిని వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థులకు అందిస్తున్నారు. జిల్లాలోని సుమారు 56 శాఖల అధికారులతో పాటు టీచర్స్ యూనియన్ నేతలు, రాజకీయ నాయకులు భారీ గా దుప్పట్లు తీసుకొచ్చారు. ఇప్పటివరకు సుమారు 1,900 పైచిలుకు దుప్పట్లు రాగా, వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. మెదక్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. గతంలోనూ అధికారుల నుంచి ఇదే మాదిరిగా నోట్ బుక్కులు, పెన్నులు స్వీకరించి వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. తన పిలుపు మేరకు అధికారులు స్పందించటం గర్వంగా ఉందని, ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో పలువురు అందించే దుప్పట్లు వసతిగృహ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నా యని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. -
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
సంక్రాంతికి ప్రత్యేక బస్సులుఈ రూట్లలో.. ● దుప్పట్లు పంచి.. చలి నుంచి రక్షించి ● కలెక్టర్ వినూత్న కార్యక్రమం నీటి విడుదలకు కలెక్టర్ అనుమతి! ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్ల (8.1 టీఎంసీ)కు తగ్గిస్తే ఈ సీజనులో కొంత మేరకు కట్ట బలోపేతం పనులు చేసేందుకు వీలుంటుంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేయాలని నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 8.1 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆది లేదా సోమవారం గానీ ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఐదు వేల క్యూసెక్కు నీటి విడుదల ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని వదిలేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి రాగా, కలెక్టర్ పి.ప్రావీణ్య అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నల్లపోచమ్మ హుండీ ఆదాయం రూ.5.45 లక్షలు సమయం వృథా చేయొద్దు ప్రత్యేక జీపీగా ప్రకటించాలి రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం రిలే దీక్షలు ప్రారంభించారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలో చేర్చడం వల్ల తాము అన్ని విధాలుగా నష్టపోతున్నామని వాపోయారు. ఉపాధి పనులకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు తమ ఇంటి పన్నులు సైతం విపరీతంగా పెరిగాయన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీ ను ంచి తొలగించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని లంబాడి ఐక్య వేదిక కోఆర్డినేటర్ సురేశ్నాయక్ హెచ్చరించారు. ‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’ టేక్మాల్(మెదక్): కార్మికుల పొట్టకొట్టే విధంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం టేక్మాల్కు జీపు జాత రా గా, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నీరుగార్చే చర్యలు సరికాదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
సీఎం కప్ ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం(నర్సాపూర్): గ్రా మీణ యువత క్రీడల్లో రాణించాలని కలెక్టర్ రాహు ల్రాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో సీఎం కప్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రో త్సహించడమే సీఎం కప్ లక్ష్యమన్నా రు. ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. యువత, చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. ర్యా లీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొల్చారం కేజీబీవీని తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రత, భోజనంపై ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రత లోపించడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను పర్యవేక్షించాలని సూచించారు. సంక్రాంతి సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి వచ్చేసరికి వసతి గృహ ఆవరణ పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలన్నారు. కలెక్టర్ వెం డీఈఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్చారి, సిబ్బంది ఉన్నారు. -
పుర పోరులో మీ పాత్ర కీలకం
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో కమిషనర్ల పాత్ర కీలకమని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులు విధుల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలన్నారు. నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి విధులు కేటాయించిన నోడల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. గత పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమర్థ విధుల నిర్వహణకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 17 నుంచి సీఎం కప్ ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే సీఎం కప్ క్రీడల విజయవంతానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సీఎం కప్ క్రీడలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. -
సేంద్రియ సాగుతో ప్రయోజనం
తూప్రాన్: సేంద్రియ కూరగాయల పంటల సా గుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ప్రతాప్సింగ్, కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవి, శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సంపల్లిలో రైతులకు ఉద్యాన పంటల సాగు, రాయితీలపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తూప్రాన్ మండలంలో 500 ఎకరాల్లో కూరగాయ పంటలు సాగులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో పురుగుమందుల వాడకం వల్ల కలుషితమైన కూరగాయల ఉ త్పత్తి జరుగుతుందన్నారు. రైతులందరూ ఉద్యాన శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటించి నాణ్యమైన కూరగాయలను పండించాలని సూ చించారు. అనంతరం ఆయిల్పామ్ సాగు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు, ఉద్యాన అధికారి రచన, లీవ్ పామ్ మేనేజింగ్ డైరెక్టర్ రంగనాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్సింగ్ -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ఎస్ శివదయాల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కౌడిప ల్లి సీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా జనరల్ ఓపీ, ల్యాబ్, మందుల రూం, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించి సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సీహెచ్సీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు సీహెచ్సీలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతనంగా నిర్మించిన సీహెచ్సీలో చిన్న చిన్న పనులు ఉన్నాయని తెలిపారు. సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.డీసీహెచ్ఎస్ శివదయాల్ -
జిల్లాకు 6 బహుమతులు మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాకు ఆరు బహుమతులు లభించాయని, రెండు ప్రాజెక్ట్లు దక్షిణభారతస్థాయికి ఎంపికై నట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు కామారెడ్డిలో న
నేడు, రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం మెదక్ కలెక్టరేట్: మెదక్లో రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్బాబు, టౌన్ ఏఈ నవీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు, ఎర్తింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు మరమ్మతులు చేపడుతున్నామని, తమకు సహకరించాలని కోరారు. -
ముందస్తు సంక్రాంతి సంబరాలు
కౌడిపల్లి: తునికి ప్రభుత్వ పాఠశాలలో ముగ్గులు వేస్తున్న చిన్నారులుతూప్రాన్: గీతా స్కూల్లో విద్యార్థుల సందడిజిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రంగు రంగుల ముగ్గులు, హరిదాసు వేషధారణతో విద్యార్థులు అలరించారు. భోగి మంటలు వేసి పతంగులు ఎగురవేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ముగ్గులు వేసిన విద్యార్థినులు -
పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు
కలెక్టర్ రాహుల్రాజ్ రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్రూంను పరిశీలించి మాట్లా డారు. ఎన్నికల సంఘం ఆదేశాలను విధిగా పాటించాలని, బ్యాలెట్ పేపర్ల భద్రతకు మూడంచెల భద్రత వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు, కంట్రోల్ రూం ఏర్పాటు విషయమై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ రఘువరన్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్నారాయణ ఉన్నారు. -
క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు, అవుట్ డోర్ స్టేడియంలో ఫుట్బాల్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఓటమి లేకుంటే గెలుపు అనేదే లేదన్నారు. ఓడిన జట్టు మరింత శిక్షణ పొంది గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. అనంతరం డీఈఓ విజయ మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలోని 29 పాఠశాలల నుంచి 700 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి పట్టణ సీఐ మహేశ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు, పీడీలు మాధవరెడ్డి, వినోద్, శ్యా మయ్య, విజయ్, శేఖర్, దేవేందర్రెడ్డి, రవి, కిరణ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జలం.. సాగుకు బలం
జిల్లాలో సమృద్ధిగా భూగర్భజలాలుమెదక్జోన్: జిల్లాలో వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వెరసి జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా సాధారణ వర్షపాతం కంటే 80 శాతం అధికంగా నమోదు అయింది. దీంతో ఈ యాసంగి సాగుకు ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు. పాపన్నపేటలో ౖపైపెనే.. జిల్లాలో వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 7.79 మీటర్లలోతులో నీటిమట్టం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందులో పాపన్నపేట మండలంలో 4.58 మీటర్లలోతులోనే జలాలు ఉండగా, తూప్రాన్లో 10.84 మీటర్లలో ఉన్నాయి. అల్లాదుర్గం 9.89, చేగుంట, 7.20, చిలప్చెడ్ 9.13, హవేళిఘణాపూర్ 5.59, కౌడిపల్లి 9.10, కొల్చారం 9.61, మనోహరాబాద్ 5.08, మాసాయిపేట 10.40, మెదక్ 7.15, నర్సాపూర్ 8.83, నార్సింగి 14.40, నిజాంపేట 7.85, పాపన్నపేట 4.58, రామాయంపేట 9.47, రేగోడ్ 11.52, పెద్దశంకరంపేట 8.22, చిన్నశంకరంపేట 10.05, శివ్వంపేట 6.26, టేక్మాల్ 5.06, తూప్రాన్ 10.85, వెల్దుర్తి 5.15 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. కాగా గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇంత పైన నీరు ఎప్పుడూ లేదని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో 9.95 మీటర్లలోతులో జలాలు ఉండగా, ఈ ఏడాది 2.16 మీటర్ల జలం పైన ఉండటం రైతాంగానికి ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. వర్షాకాలం ప్రారంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం జిల్లావ్యాప్తంగా 772 మిల్లీ మీటర్లు కాగా, సగటున 1,390.30 మి.మీ కురిసింది. ఈ లెక్కన 668.30 మి.మీ వర్షం అదనంగా నమోదైంది. కురవాల్సిన దాని కంటే 80 శాతం ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో భూమిలోకి పుష్కలంగా నీరు చేరి భూగర్భజలాలు ౖపైపెనే ఉన్నాయని అంటున్నారు. యాసంగి సాగు 3.17 లక్షల ఎకరాలు జిల్లావ్యాప్తంగా యాసంగిలో 3.17 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది యాసంగిలో 2.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది మరో 21 వేల ఎకరాలు అదనంగా సాగవుతోంది. ఇందుకు భూగర్భజలాల పెంపే ప్రధాన కారణమని తెలిసింది. కాగా సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో దానిపై ఆధారపడిన ఘనపూర్ ప్రాజెక్టుకు సైతం నీటి తడులు వచ్చే అవకాశం లేదు. ఆ ప్రాజెక్టు పరిధిలోని 21 వేల ఎకరాల ఆయకట్టు తగ్గే అవకాశం ఉంది. దీంతో అధికారులు వేసిన సాధారణ సాగు అంచనాలో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఎప్పటిలాగే రైతులు వరిసాగుకు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యాసంగిలో అధికారిక లెక్కల ప్రకారం 3.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, అందులో సింహభాగం 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిగితా 22 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయలు ఇతర పంటలు సాగు కానున్నాయి. -
బల్దియాలకు నిధులు
తూప్రాన్ మినహా.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. మెదక్ మున్సిపాలిటీకి ఏడాది కాలంలో ఏకంగా రూ. 160 కోట్లు ఇచ్చింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కేటాయించినట్లుతెలిసింది. – రామాయంపేట(మెదక్) టీయూఎఫ్ఐడీసీ పథకం కింద జిల్లాలోని తూప్రాన్ మినహాయించి, మిగితా మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. మూడు మున్సిపాలిటీలకు రూ. 92.5 కోట్లు కేటాయించారు. గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్ మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ కింద నయా పైసా మంజూరు కాలేదనే ఆరోపణలున్నాయి. ఇతర శాఖల నుంచి కూడా తూప్రాన్కు నామమాత్రంగానే నిధులు మంజూరైనట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మెదక్ పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, దుకాణ సముదాయం, అమృత్ పథకం కింద వాటర్ ట్యాంకులు, మూత్రశాలల నిర్మాణం, ట్రీ ప్లాంటేషన్ తదితర పనులకు పెద్దఎత్తున నిధులు మంజూరయ్యాయి. తెలంగాణ అర్బన్ మౌలిక వసతులు, యూఎఫ్ఐడీసీ, అమృత్ పథకం, హడ్కో తదితర శాఖల నుంచి నిధులు కేటాయించారు. వీటిని మున్సిపాలిటీల పరిధిలో సిమెంటు రోడ్లు, మురుగు కాలువలు, తారు రోడ్లు, పార్కుల అభివృద్ధి, ఇతరత్ర పనులకు కేటాయించనున్నారు. ఇటీవల మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సీఎం రేవంత్రెడ్డి కలిసి నిధుల కోసం విన్నవించగా, ప్రత్యేకంగా మెదక్ మున్సిపాలిటీకి రూ. 85 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం నాలు గు మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పార్టీకి లబ్ధి చేకూరుతుందని, తద్వారా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రూ. 25 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఇతరత్ర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నట్లు సమాచారం.ఎన్నికల నేపథ్యంలో కేటాయింపు -
అవంచను సందర్శించిన యూపీ బృందం
నర్సాపూర్రూరల్: మండలంలోని అవంచ గ్రామాన్ని యూపీకి చెందిన జిల్లా, గ్రామస్థాయి అ ధికారులు, ప్రజాప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. గ్రామస్థాయిలో అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. అందులో భాగంగా గ్రామంలోని వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్తో పాటు శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్రస్థాయి చేస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామ పాలకవర్గం వారిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, కార్యదర్శి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
నర్సాపూర్ రూరల్: వరిలో అంతర పంటగా ఆయిల్పామ్ సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్సింగ్ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని కాగజ్మద్దూర్కు చెందిన రైతు వెంకటరమణ వరిపొలంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లీవ్ఫామ్ అధికారి డాక్టర్ రంగనాయకులు, ఏడీ సంధ్యారాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి దీపిక, ఏఈఓలు మోహన్, తేజస్విని, రుతు, కాగజ్ మద్దూర్ ఉపసర్పంచ్ భాస్కర్, లీవ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ మేనేజర్ కృష్ణారావు, టెక్నికల్ పర్సన్ అజయ్, శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ -
ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి
మెదక్ ఎంపీ రఘునందన్రావుమెదక్జోన్/నర్సాపూర్/రామాయంపేట(మెదక్): పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికి వదిలేశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపుతానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ కింద కేంద్రం నుంచి ప్రతి జిల్లాకు నిధులు మంజూరైతే కేవలం సిద్దిపేట, గజ్వేల్కు మాత్రమే వినియోగించారన్నారు. మెదక్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్రోడ్డు నిర్మాణం కోసం డీపీఆర్ తయారు చేశామని, అనుమతులు రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. మార్చి 31 వరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ. 950 కోట్లు వాపస్ పోతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆరాట పడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు రంజిత్రెడ్డి, నందారెడ్డి, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నర్సాపూర్ మేజర్ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మా రినా అభివృద్ధి అంతంతే జరిగిందన్నారు. నాయకులు సమష్టిగా ముందుకు సాగితే మున్సిపాలిటీని బీజేపీ కై వసం చేసుకుంటుందన్నారు. గెలిచే వ్యక్తులను మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేస్తారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేటలో పర్యటించారు. సంక్రాంతి పండుగను సద్వినియోగం చేసుకొని పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటు అడగాలని సూ చించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి నర్సింహారెడ్డి, నాయకులు నందారెడ్డి, శ్రీనివాస్, అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, శంకర్గౌడ్, మండలశాఖ అధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణాధ్యక్షుడు అవినాశ్రెడ్డి పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులకు అల్పాహారం
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ఉపశమనం లభించింది. ఫిబ్రవరి 16 నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందించ లేకపోయింది. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 19 రోజులు మాత్రమే అల్పాహారం అందించాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు 9,640 మందికి లబ్ధి చేకూరనుంది. ఈసారి అక్టోబర్ 7 నుంచే టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా దూర ప్రాంతాల నుంచి ఉదయం వచ్చే విద్యార్థు లు ఆకలితో ప్రత్యేక తరగతులకు హాజరవుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అధ్యాపకులు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో అరకొరగా స్నాక్స్ సదుపాయాలు కల్పించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 చొప్పున రూ. 285 అందించనుంది. ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకు ఒక్కోరకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం ప్రత్యేక తరగతుల్లో అందజేత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
మేడారం జాతరకు కేసీఆర్కు ఆహ్వానం.. ఎర్రవల్లికి సురేఖ, సీతక్క
సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.బాగున్నరా.. అమ్మ !కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపుఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారంగురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది… pic.twitter.com/8NPsnWB5jX— Telugu Scribe (@TeluguScribe) January 8, 2026అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు. -
స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
రామాయంపేట(మెదక్): రామాయంపేటను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. బుధవారం పట్టణంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్పీఎల్ క్రికెట్ పోటీలను, మున్సిపాలిటీకి కొత్తగా మంజూరైన రెండు చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ వాసులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండిలోనే వేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకు ంటే వ్యాధులు ధరి చేరవని సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హితవుపలికారు. కొద్దిసేపు క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే సిక్స్ కొట్టి ఆలరించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతల స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రామాయంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం మంజూరు చేయాలని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ ఎమ్మెల్యేక వినతిపత్రం అందజేశారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
అట్టహాసంగా పీఎంశ్రీ క్రీడా పోటీలు
మెదక్జోన్: జిల్లా కేంద్రంలో బుధవారం పీఎంశ్రీ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్ర భుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు జరగగా, అవుట్ డోర్ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 29 పాఠశాలలకు చెందిన 680 మంది బాల, బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి డీఈఓ విజయ హాజరై విజేతలకు బహుమతులతో పాటు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడిన ప్రతీ ఒక్కరూ విజేతలే అన్నారు. అనంతరం క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18 నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు మాధవరెడ్డి, వినోద్, శ్రీధర్రెడ్డి, దేవేందర్రెడ్డి, రవి, మధు, రాజేందర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న అధికారులు -
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ‘మహిళల రక్షణ– పిల్లల సంరక్షణ’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. డేటింగ్ యాప్లు, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని నమ్మకం పొంది, అనంతరం మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు. అపరిచితులను నమ్మవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. క్విజ్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ సు భాశ్ చంద్రబోస్, కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, అధ్యాపకులు, సైబర్ క్రైం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
ఆటలకు టాటా..
నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు తూప్రాన్: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పా టు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఆటలకు అనువుగా లేని చోట, చెరువులు, శిఖం భూములు, అడవులు, వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో క్రీడా మైదానానికి ఎకరం నుంచి మూడెకరాల వరకు కేటాయించారు. అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కో మైదానానికి రూ. 1.65 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేసేలా అనుమతించారు. అయితే క్రీడా ప్రాంగణాలకు కేవలం బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు. కొన్నిచోట్ల వాలీబాల్, కోకో ఆటలకు అవసరమైన స్తంభాలు ఏర్పాటు చేశారు. మండలంలోని వెంకటాయపల్లి సమీపంలోని చెరువులో, కిష్టాపూర్లోని వ్యవసాయ పొలాల్లో క్రీడా మై దానాలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా తూప్రాన్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు గతంలో పట్టణ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకోసం నిధులు సైతం కేటాయించినట్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు క్రీడా మైదానం ఊసే ఎత్తకపోవటంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈఓ
టీచర్లకు టెట్ నిబంధన తొలగించాలి: ఎస్టీయూ సమయపాలన తప్పనిసరి చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ ఆదేశించారు. బుధవారం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పి ంచాలని సూచించారు. అస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన పరీక్షలు, మందులు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. ఈసందర్భంగా వైద్యాధికారులు రవికుమార్, రేణుక, శ్రీనివాస్కు పలు సూచనలు చేశారు. దరఖాస్తుల ఆహ్వానం నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం -
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026పుర పోరులో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీలపై పార్టీ జెండాలను ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా, మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండటంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. – మెదక్జోన్ పుర పీఠంపై గురి!సత్తా చాటాలని కమలం ఆరాటం ‘హస్త’గతం దిశగా సన్నద్ధం గెలుపే లక్ష్యంగా కారు పయనం గెలుపు గుర్రాల వేటలో నేతలు మెజార్టీ స్థానాల్లో గెలుపునకు వ్యూహాలు -
గ్రామాల అభివృద్ధిలో మీరే కీలకం
మెదక్ కలెక్టరేట్: గ్రామాల అభివృద్ధిలో మీ పాత్ర కీలకం, ఆర్థిక క్రమశిక్షణతో వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, కార్యదర్శలతో సమీక్ష నిర్వ హించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. నేటి నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మహిళా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు మున్సిపల్ కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చలి నేపథ్యంలో పేద పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దుప్పట్ల అందజేయాలని సూచించారు.పంచాయతీ కార్యదర్శులతోకలెక్టర్ రాహుల్రాజ్ -
ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ.30.60 లక్షలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో మంగళవారం జరిగిన టెండర్ల ద్వారా రూ.30.60 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానం వద్ద పూజా సామగ్రి విక్రయించుకునే హక్కుకు రూ.25.10 లక్షలు, ఎంటర్టైన్మెంట్, ఎగ్జిబిషన్కు రూ.5.50లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కాగా జాతరలో విద్యుత్ దీపాల అలంకరణ కోసం రూ.3.84 లక్షలు, టెంట్లు వంట సామగ్రి సరఫరా రూ.3.80 లక్షలు, తడకల పందిళ్లు ఏర్పాటు చేసేందుకు రూ.2.44 లక్షలు, అద్దె గదులకు పేయింట్ వేసేందుకు రూ.2.30 లక్షలకు టెండర్లు పాడారని తెలిపారు. ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయిలుపాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన సుంకరి సాయిలు ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శంషాబాద్లో మూడు రోజులుగా ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన కార్యక్రమంలో టేక్మాల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సాయిలును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యులుగా అవకాశం కల్పించినందుకు సాయిలు రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. -
బోగస్ ఓట్లు ఉండొద్దు
మెదక్ కలెక్టరేట్: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా సూచనలు ఇవ్వాలని కలెక్టర్ రాహుల్రాజ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై గుర్తింపు ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్ ఓటర్లు ఉండరాదన్నారు. అదే సమయంలో అర్హులకు అన్యాయం జరగొద్దన్నారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, డీపీఓ యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
నా ఓటు ఎటు..?
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026ఓటరు జాబితా తప్పుల తడక నాలుగు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ● ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువమెదక్ పట్టణంలోని ఆజంపుర వార్డుకు చెందిన పిల్లి ఆంజనేయులు, ఉమాదేవీ భార్యాభర్తలు. ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా.. అందులో ఈ దంపతుల పేర్లు లేవు. ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తే ఫ్రీజింగ్లో పెట్టినట్లు తెలిసింది. ఈ సమస్య ఒక్క ఆంజనేయులు దంపతులదే కాదు.. వందలాది మంది ఓటర్ల పరిస్థితి. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే.. చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా జాబితాలో ప్రదర్శించడం, ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటం, గ్రామ ప్రజల ఓట్లు మున్సిపాలిటీల్లో ఉండడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.మెదక్జోన్: జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో 75 వార్డులు ఉండగా.. సుమారు 86 వేల మంది ఓటర్లు ఉన్నారు. 2025 అక్టోబర్ ఒకటిన ఫైనల్ చేసిన ఓటరు జాబితాను ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు విడుదల చేశారు. బల్దియా ఓటర్లను విభజించి వార్డుల వారీగా జాబితాను ప్రదర్శించారు. అయితే.. వాటిలో అనేక తప్పులు దొర్లాయి. సోమవారం అన్ని మున్సిపాలిటీలలో కమిషనర్లు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా, ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను వెంటనే సరిచేశాకనే ఎన్నికలను నిర్వహించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. తూప్రాన్ పరిధిలో ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లను మున్సిపాలిటీలో చేర్చటంతో అంతా విస్మయం చెందుతున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న వారి పేర్లు మున్సిపాలిటీల్లో దర్శనమిస్తున్నాయి. తూప్రాన్లో గతంలో 17 వేల పైచిలుకు ఓటర్లు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 19 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన అదనంగా 2 వేల ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. వీటిని వెంటనే సరిచేయాలని పార్టీలకు అతీతంగా నేతలు డిమాండ్ చేస్తున్నారు. నర్సాపూర్లోని పలు వార్డుల్లో సైతం ఆయా గ్రామాలకు చెందిన వారి ఓటర్లు బల్దియాల్లో ఉన్నాయి. రామాయంపేటలో చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. మెదక్లోనూ ఒక కుటుంబానికి చెందిన వారి ఓట్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా వివిధ వార్డుల్లో ఉండటం, మరి కొంత మంది ఓట్లు ఫ్రీజింగ్లో పెట్టడంతో అంతా గందరగోళంగా ఉంది.10న తుది జాబితా విడుదల చేస్తాం కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఒకే వార్డులోకి వచ్చే విధంగా జాబితాను సరి చేసి ఈనెల 10న తుది జాబితాను విడుదల చేస్తాం. ప్రస్తుత జాబితాలో ఎవరైనా చనిపోయిన వారి పేరుంటే వాటిని తొలగించటం కుదరదు, అలాగే కొత్తవారిని చేర్చటం సాధ్యంకాదు. ప్రస్తుతం విడుదలైన జాబితాలో 2025 నవంబర్ ఒకటిన తాజాగా తయారు చేసింది. – బల్దియాల ప్రత్యేక అధికారి, నగేష్ -
మైనార్టీలకు సహారా
మెదక్ కలెక్టరేట్: గత ఏడాది సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్నకా సహారా పథకాలు ప్రభుత్వం తిరిగి తెరపైకి తీసుకొచ్చింది. నిరుపేద ముస్లిం మైనార్టీ ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 19న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఈ పథకాలను ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికలు రావడంతో పథకాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో తిరిగి వాటిని అమలు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన జిల్లాలోని ఆర్థికంగా వెనకబడిన నిరుపేదలైన మైనార్టీ (ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన) మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ద్వారా రూ.50వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ముఖ్యంగా ఫకీర్, దూదెకుల, వితంతువులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీరంతా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేయూత అందిస్తారు. రుణం పొందిన మహిళలు చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. వంద శాతం సబ్సిడీ రాష్ట్రంలోని నిరుపేద ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ముస్లిం మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలైన ఫకీర్, దూదెకుల, ఇతర అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి మోపెడ్లు, బైక్లు, ఈ–బైక్లు వందశాతం సబ్సిడీపై అందించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.1లక్ష వరకు గ్రాంట్ మంజూరు చేయనున్నారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈనెల 10 వరకు గడువు మొత్తం రూ.30 కోట్లతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలను ప్రవేశ పెట్టింది. జిల్లాలోని అర్హులైన ముస్లిం మైనార్టీలు ఈనెల 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించడం ఉండదు.ఎవరు అర్హులు రెండు పథకాలకు శ్రీకారం సబ్సిడీ రుణాలు, ఉచిత వాహనాలు ఈనెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణమైనార్టీ వర్గాలకు చెంది తెలంగాణలో స్థిర నివాసులై ఉండాలి. కనీసం పదో తరగతి చదివి 21 నుంచి 55 యేళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి. ఐదేళ్లలో మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి ఎలాంటి సాయం పొందలేదని డిక్లరేషన్ ఇవ్వాలి. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఒక పథకం అందించనున్నారు. -
గజ్వేల్లో వార్డుల విభజన అశాసీ్త్రయం
తూప్రాన్: గజ్వేల్ మున్సిపల్ వార్డుల విభజన శాసీ్త్రయంగా జరగలేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. తూప్రాన్లో మంగళవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్లో 20 వార్డులు ఉండగా.. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల ఓటర్లు సుమారు 14 వేల మందిని అశాసీ్త్రయంగా ఓటరు జాబితాలో చేర్చారని విమర్శించారు. 20 వార్డులున్న గజ్వేల్ మున్సిపాలిటీలో మరో 10 వార్డులు పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తూప్రాన్లో బీజేపీకి మంచి పట్టు ఉందన్నారు. తూప్రాన్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. తూప్రాన్లో పదేళ్లు బీఆర్ఎస్, రెండేళ్లు కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, జానకిరాంగౌడ్, మధుసూదన్రెడ్డి, దుర్గరాజ్యాదవ్, మహేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. సరి చేయండి.. లేకుంటే కోర్టుకెళుతాం ఎంపీ రఘునందన్రావు -
రసవత్తరం.. ఆసక్తికరం
ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్ పార్లమెంట్’ ● వాడీవేడి చర్చలు.. వాదోపవాదాలు ● పోటీపడిన సభ్యులతో అట్టుడికిన సభ ● మోడల్ పార్లమెంట్ సెషన్ అబ్బురం ● కొల్లాం, వల్సాడ్ విద్యార్థుల విశేష ప్రతిభ వర్గల్(గజ్వేల్): వాడీవేడి చర్చ.. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు.. సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్ష సభ్యులు.. ప్రధాని, మంత్రుల సమాధానాలు.. సంతృప్తి చెందని సభ్యుల నిరసనలు.. సభ వాయిదా.. ఇలా.. మంగళవారం వర్గల్ నవోదయ వేదికగా జాతీయ స్థాయి ‘యూత్ పార్లమెంట్’ ఆద్యంతం రసవత్తరంగా.. ఆసక్తికరంగా సాగింది. యూత్ పార్లమెంట్ పోటీలలో భాగంగా కేరళ రాష్ట్రంలోని కొల్లాం, గుజరాత్ రాష్ట్రం వల్సాడ్ నవోదయ విద్యార్థులు 55 మంది చొప్పున వేర్వేరుగా గంట పాటు వాడీవేడి ప్రసంగాలతో అదరగొట్టారు. పార్లమెంటేరియన్ల మాదిరి చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్పీకర్, ప్రధానమంత్రి, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యులుగా పాత్రలు పోషిస్తూ 55 మంది సభ్యులతో కూడిన ఒక్కో విద్యాలయ జట్టు సభను కొనసాగించారు. వల్సాడ్ విద్యార్థులు ఇలా.. మొదట వల్సాడ్ నవోదయ బృందం సెషన్ జరిగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సభలో యూత్ పార్లమెంటేరియన్లుగా విద్యా విధానంపై, రైల్వే దుర్ఘటనలపై, లోక్సభ, అసెంబ్లీకి జరిగే జమిలి ఎన్నికలపై క్వశ్చన్ అవర్లో ప్రస్తావించారు. జీరో అవర్లో పర్యావరణ సమస్య, నీటి కాలుష్యంపై సభ్యులు చర్చించారు. విద్యా బిల్లుపై సమగ్ర చర్చ జరిపారు. అనంతరం బిల్లును సభలో ఆమోదింపజేశారు. సభ వాయిదా వేసి ప్రదర్శన ముగించారు. కొల్లాం విద్యార్థుల ప్రదర్శన.. కొల్లాం నవోదయ విద్యార్థుల యూత్పార్లమెంట్ సెషన్లో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్పై సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. క్వశ్చన్ అవర్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష విధానం, భారత విదేశాంగ విధానం, రైతుల సమస్యపై ప్రశ్నలతో ప్రస్తావించారు. జీరోఅవర్లో విదేశాల్లో భారతీ య విద్యార్థుల వెతలను సభ్యులు ప్రస్తావించారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చ అనంతరం సభలో ఆమోదింపజేశారు. రెండు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ చాటిన 16 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. -
క్రీడలకు అత్యంత ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: క్రీడాకారులు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీఈఓ విజయ సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి పీఎంశ్రీ వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 29 పాఠశాలల నుంచి 580 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు. డీఈవో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడా పరికరాల కొనుగోలుకై ఇప్పటికే పీఎంశ్రీ పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్నకుమార్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో చిన్నశంకరంపేట, గోమారం, శివ్వంపేట మండలాల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నిలిచారు. అలాగే బాలికల విభాగంలో గోమారం, అక్కన్నపేట, శివ్వంపేట జెడ్పీహెచ్ఎస్ల విద్యార్థులు నిలిచారు. వీరికి మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ బహుమతులు అందజేశారు. జిల్లా విద్యాధికారి విజయ పీఎంశ్రీ వాలీబాల్ పోటీలు ప్రారంభం -
వానర సైన్యం బందీ!
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆలోచించకుండా ఆ గ్రామ యువకులు నడుంబిగించారు. నిత్యం తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడదను తొలగించేందుకు ముందుకు వచ్చారు. తలా ఇంత పోగేశారు.. కోతులను తరిమేసేందుకు కార్యచరణ చేపట్టారు. ఫలితంగా చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో నెలకొన్న కోతుల బెడదకు పరిష్కారం చూపారు. గ్రామానికి చెందిన 27 మంది యువకులు ఏకమై మొత్తం రూ.2.25లక్షలు జమ చేశారు. కోతులను పట్టేవారితో మాట్లాడి మూడు రోజులుగా సుమారు 500 కోతుల వరకు పట్టారు. వానర సైన్యం ఉపశమనం పొందారు. – చిన్నశంకరంపేట(మెదక్): -
కేసీఆర్ను కలిసిన పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మంగళవారం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావును ఆయన వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం ప్రజాబాటలో ఏడీ రమణారెడ్డి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిఏఐటీయూసీ కార్యదర్శి లక్ష్మణ్ నిజాంపేట(మెదక్): బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎ.లక్ష్మణ్ కోరారు. మంగళవారం నిజాంపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు దేశ వ్యాప్తంగా ఒకే వేతనం, వెయ్యి బీడీలకు రూ.300 అమలు చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పదవీ విరమణ అనంతరం గ్రాట్యూవిటీ డబ్బులు ఇవ్వాలన్నారు. కార్మికులకు 26 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. పీఎఫ్ ద్వారా పదవీ విరమణ చేసిన కార్మికులకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ. 5000లకు పెంచి అమలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, రాష్ట్ర ఉపాద్యాక్షులు శాంత, వి.అనసూయ, కార్యవర్గ సభ్యులు కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులతో పనిచేయిస్తే చర్యలు ఆర్డీఓ జయచంద్రారెడ్డి తూప్రాన్: పరిశ్రమల్లో చిన్నపిల్లలతో పని చేయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆర్డీఓ జయచంద్రారెడ్డి హెచ్చరించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధమని చెప్పారు. బాలల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని నిర్మూలించాలని తెలిపారు. గ్రామాల పరిధిలో ఉన్న పరిశ్రమలు, వర్క్షాప్లు, దుకాణాలు, ఇటుక బట్టీలు, చిన్న తయారీ కేంద్రాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విముక్తి పొందిన బాలలకు విద్య, పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్: డీఐఈఓ మాధవిమెదక్ కలెక్టరేట్: వచ్చేనెల 2వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు, 25 నుంచి థియరీ పరీక్షలు ఉంటాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 28 ప్రాక్టికల్ సెంటర్లు, 28 థియరీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆరు ఒకేషనల్ సెంటర్లు కూడా ఉంటాయని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,306, రెండో సంవత్సరంలో 6,017 మంది మొత్తం 12,323 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. -
ఇళ్లు నిర్మించకుంటే రద్దు చేస్తాం
హౌసింగ్ పీడీ మాణిక్యంకౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. సోమవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి మాట్లాడారు. జిల్లాకు 9,209 ఇళ్లు మంజూరు కాగా, 57 పూర్తయ్యాయని తెలిపారు. 2,109 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 1,042 రూప్ లెవల్, 1,432 స్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 2,922 మంది పనులు ప్రారంభించలేదన్నారు. జి ల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు ఇళ్లు ప్రారంభించని వారు లిస్టు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రద్దు అయిన వాటి స్థానంలో అర్హులైన కొత్తవారికి మంజూరు చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 90 కోట్లకు పైగా ఇందిరమ్మ ఇళ్లకు వివిధ దశలలో బిల్లులు చెల్లించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈలు సుష్మ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
ఇసుకంతైనాసంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగులో ఇసుక తీస్తున్న ఇటాచీ (ఫైల్)భయమేదీ?హల్దీ నుంచి వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపుమెదక్ అర్బన్: ‘హల్దీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పట్టుకుంటే.. తెల్లారి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఇది ఓ ప్రధాన శాఖకు చెందిన అధికారి ఆందోళన’ జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు కొలువు దీరినప్పటికీ.. ఓ ప్రధాన అధికారి రెక్కలు కట్టుకొని కలియ దిరుగుతున్నప్పటికీ.. అక్కడ ఇసుక దోపిడీ ఆగడం లేదు. కూత వేటు దూరంలో ఉన్న సంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగు నుంచి రెండు నెలలుగా వందలాది టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పెద్దల అండతో సాగుతు న్న దోపిడీని ఆపేందుకు ఏ అధికారి సాహసించడం లేదన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులు ఇస్తున్న మామూళ్లు కూడా, వారిని నోరు మెదపకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లతో పెరిగిన డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇసుక మాఫియా కన్ను హల్దీ వాగుపై పడింది. మెదక్ మండలం జానకంపల్లి సమీపంలోని సంగాయిగు ట్ట తండా వద్ద హల్దీ వాగులో రెండు నెలల క్రితం ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. మొదట మెదక్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన అభివృద్ధి పనుల కోసం 1,000 టన్నుల ఇసుక అవసరమని, మున్సిపల్ కమిషనర్ మెదక్ ఎమ్మార్వోకు లేఖ రాశారు. అయితే ఆ టెండర్లకు అప్పటికే లీడ్ ఇచ్చినందున, ఇసుక తీయొద్దని రెవెన్యూ అధికారులు బదులిచ్చారు. అయినా ఈ అవకాశాన్ని సాకుగా మలుచుకొన్న ఇసుక మాఫియా గత రెండు నెలలుగా సంగాయిగుట్ట వద్ద నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తీయడం ప్రారంభించారు. వందల కొద్ది టిప్పర్లలో మెదక్, పాపన్నపేట, జహీరాబాద్, కొల్చారం, కౌడిపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్కు రూ. 20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది కొనుగోలు చేస్తున్న దళారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో ఇసుక వ్యాపారులకు రూ. 1,300లకు టన్ను చొప్పున విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ. కోట్లలో వ్యాపారం జరిగిందన్న ఆరోపణలున్నాయి. కాగా ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం ఆందోళన నిర్వహించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల ఇసుక రవాణా ఆగింది. తెల్లారి మళ్లీ మొదలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయి అధికారుల వరకు వెళ్లడంతో ఆదివారం మైనింగ్ విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, పలు వాహనాలు సీజ్ చేశారు. ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు హె చ్చరించారు. -
గ్రామాల్లో ఐదేళ్లు పనిచేయాలి
● ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ● అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఐదారేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధనలు విధించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...పిల్లల చదువుల కోసం పట్టణాలు, నగరాల్లో, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుండటం, గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్నా డిప్యూటేషన్పై వెళ్తుండటంతో గ్రామీణప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడంలేదన్నారు. విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతానికే పరిమితమవుతున్నాయన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు. నిజాంసాగర్ సమీపంలోని ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ను పునరుద్ధరిస్తే ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాలకు మేలు చేకూరుతుందని వివరించారు. హాస్టల్ బెడ్స్ అమ్మకం సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్కు సరఫరా అయిన బెడ్స్, మంచాలను అమ్ముకున్నట్లు సంజీవరెడ్డి అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకొవచ్చారు. ఈ హాస్టల్ వార్డెన్ 8 ఏళ్లుగా లాంగ్స్టాండింగ్గా ఉండటం, పిల్లలకు సక్రమంగా భోజనం పెట్టడంలేదని పిల్లలు చెప్పారన్నారు. -
గ్రామాభివృద్ధికి కృషి చేయండి
మెదక్జోన్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నూతన సర్పంచ్ల సమక్షంలో జిల్లా సర్పంచ్ల ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా ఆవుల గోపాల్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్యాదవ్ నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ప్రజలు పదవులు కట్టబెట్టారని, ప్రభుత్వం మంజూరు చేసే సంక్షమ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, నాయకులు మహిపాల్రెడ్డి, సుప్రభాతరావు, రమేశ్రెడ్డి ,శ్రీనివాస్రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు -
ఆర్వోబీ నిర్మాణానికి సహకరించాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి చేగుంట(తూప్రాన్): రేల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు దారి మళ్లింపు కోసం ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు సహకరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం వడియారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడియారం శివారులోని అండర్ బ్రిడ్జి నుంచి మె దక్ రోడ్డు పోలీస్స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర భారీ వాహనాలకు నార్సింగి మీదుగా శంకరంపేటకు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద కంటైనర్లు నర్సాపూర్ మీదుగా మెదక్ వైపునకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరి సహకారం ఉంటేనే ఆర్వోబీ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం వడియారం శివారులోని అండర్ బ్రిడ్జిని అధికారులు పరిశీలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ వేణు, రైల్వే ఇంజినీర్లు సమీర్కుమార్, జగదీశ్బాబు, సర్పంచ్లు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. డీఆర్ఓ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీసీఓ ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈమేరకు భూ సంబంధిత సమస్యలపై 32, పెన్షన్ 10, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలు 18 కలిపి మొత్తం 64 వినతులు వచ్చాయి. కాగా గతంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొని అర్జీలు స్వీకరించేవారు. దీంతో జిల్లాస్థాయి అధికారులంతా పాల్గొనేవారు. సోమవారం రేగోడ్ మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు కనిపించక పోవడం గమనార్హం. రోడ్డు నిబంధనలు తప్పనిసరి మెదక్జోన్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని, అలాగే కార్లు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని ఎంవీఐ విజయలక్ష్మి సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టే నిబంధనలు వాహనదారుల రక్షణ కోసమనే విషయాలు ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హె చ్చరించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు శ్రీలేఖ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా: ఏడీఏ కౌడిపల్లి(నర్సాపూర్): యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు అందోళన చెందవద్దని ఏడీఏ పుణ్యవతి అన్నారు. సోమవారం మండలంలోని మహమ్మద్నగర్ గేట్ వద్ద గల పీఏసీఎస్, కౌడిపల్లిలోని డీసీఎంఎస్ ఎరువుల దుకాణంలో యూరియా స్టాక్ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగి పంటల అంచనా మేరకు ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తుందన్నారు. రైతులు అనవసరంగా ఆందోళన చెందుతూ ముందుగానే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ–పాస్ మిషన్ ద్వారా యూరియా విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, పీఏసీఎస్ సీఈఓ దుర్గాగౌడ్, రైతులు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి డీఎంహెచ్ఓ శ్రీరాం నర్సాపూర్: పీహెచ్సీలలో పని చేసే వైద్యులతో పాటు ఇతర సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ శ్రీరాం ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఏరియా ఆస్పత్రిలో నర్సాపూర్ వైద్యశాఖ సబ్ డివిజన్ పరిధిలోని రెడ్డిపల్లి, కౌడిపల్లి, శివ్వంపేట, రంగంపేట, కొల్చారం పీహెచ్సీల వైద్యులు, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అందరూ సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. చలికాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన, డీఐఓ డాక్టర్ మాధురి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు రఘువరన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ కార్యాలయం సందర్శన రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ కార్యాలయంలో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఈమేరకు ఆయన మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసీల్దార్ రజనితో కలిసి ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించారు. కౌంటింగ్కు సంబంధించి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజు, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ ఇతర అధికారులు ఉన్నారు. -
పుర పోరు.. కసరత్తు జోరు
ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదలరిజర్వేషన్లపై ఉత్కంఠ..! తప్పుల తడకగా జాబితామున్సిపాలిటీల్లో ఇటీవల అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, వాటిలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని వెంటనే సరి చేసి ఫైనల్ ఓటర్ లిస్టును వార్డుల్లో ప్రదర్శించాలని బీఆర్ఎస్ నేతలు ఇటీవల మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఓటు హక్కు ఉండాల్సి ఉండగా, కొన్ని వార్డుల్లో ఒకే కుటుంబీకుల ఓట్లు రెండు, మూడు వార్డుల్లో ఉన్నాయని ఆరోపించారు. -
ప్రజావాణి మరింత బలోపేతం
కలెక్టర్ రాహుల్రాజ్ రేగోడ్(మెదక్): మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి నోడల్ అధికారులను నియమించి మరింత బలోపేతం చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలపై మొత్తం 111 అర్జీలు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు దూరభారం, సమయాన్ని తగ్గించడం కోసమే మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దర ఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తామని, ఆయా దరఖాస్తులు ఏ అధికారి స్థాయిలో ఉన్నాయో తెలి పే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు, పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సీతారావమ్మ, తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్ఐలు శరణప్ప, విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ భవాని, ఏఓ రాంప్రసాద్, సర్పంచ్ పర్వీన్ సుల్తాన తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫొటోతో మాత్రమే ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం, సీఎం, మంత్రుల ఫొటోలు లేకపోవటంతో ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. -
నేటి నుంచి పీఎంశ్రీ క్రీడలు
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు పీఎంశ్రీ క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ తెలిపారు. సోమవారం పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. క్రీడలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూళ్ల నుంచి సుమారు 92 మంది వ్యాయామ ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని మొత్తం 29 పీఎం శ్రీ పాఠశాలల నుంచి ప్రతిరోజూ సుమారు 520 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పించడంతో పాటు, గెలుపొందిన విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పీడీలు నాగరాజు, ప్రతాప్సింగ్, మాధవరెడ్డి, దాసరి మధు, రవి, అశోక్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.డీఈఓ విజయ -
నేరుగా సంప్రదించాలి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాసరావు హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వివాదాలను, పోలీస్ సంబంధిత ఇబ్బందులను ఎస్పీకి నేరుగా వివరించారు. పరిష్కరించాలని వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రజావాణి ద్వారా పరిష్కారమైన అనేక కేసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని తెలిపారు. మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కృషి మెదక్కలెక్టరేట్: మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించిందని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష న్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అర్హులు ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. -
జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఏడాది నుంచి డాక్టర్లు లావణ్య, ప్రణయ్ తేజ్ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కానీ, పెళ్లికి కులం వేరే ఉందని ప్రణయ్ సాకు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే మనస్తాపంతో పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని లావణ్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు.ఇదిలా ఉండగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ లావణ్య.. నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ రూంలో డ్యూటీలో ఉండగా అనారోగ్యంగా ఉండటంతో క్యాజువల్ డిపార్ట్మెంట్లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్కు వెళ్లారు.శనివారం ఉదయం ప్రభుత్వ కళాశాల హాస్టల్లో గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు జీజీహెచ్కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
అందుబాటులో ఉల్లి నారు
నూతన కార్యవర్గం మెదక్ కలెక్టరేట్: జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఖాజామొహినొద్దీన్, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, ఉపాధ్యక్షులుగా సునీతా, రాజేశ్, కిరణ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్యాంకుమార్, జాయింట్ సెక్రటరీగా భవాని, వినయ్కుమార్, వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సమీయొద్దీన్, రాజు, మహిళా ప్రతినిధిగా స్వాతి ఎన్నికయ్యారు. మెదక్ కలెక్టరేట్: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన నవయుగ వైతాళికుడు లూయిస్ బ్రెయి లీ అని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక యూనియన్ జిల్లా కార్యదర్శి యశోద అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రెయిలీ లిపి అందుబాటులోనికి వచ్చాకే అంధులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. సమాజంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, కార్యదర్శి యశోద, గౌరవ అధ్యక్షులు మల్లేశం, ఉపాధ్యక్షులు యాదగిరి, రాష్ట్ర మహిళా సభ్యులు కవిత, సహాయ కార్యదర్శి దుర్గ, శ్రీదేవి, వినోద్, దుర్గమ్మ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్రావు పటాన్చెరు టౌన్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు విజన్ లేదని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఐబీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డితో కలసి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదీ జలాల అంశంపై తె లంగాణకు ఎన్ని టీఎంసీల నీరు సరిపోతాయో అంగీకరించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పెట్టిన సంతకం తాలూకూ పత్రాలు ప్రజలముందు ఉంచామని చెప్పారు. తెలంగాణకు నష్టం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు దొందూ దొందేనని విమర్శించారు. -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్రాజ్రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వి ద్య అందుతుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని ప్రగతి ధర్మారంలో బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేదలకు సరైన వైద్యసేవలు అందేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆస్పత్రుల తనిఖీ చేపట్టామన్నారు. కలెక్టరేట్ నుంచే సీసీ కెమెరాల ద్వారా అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.అనంతరం నార్సింగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు 65 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు క ష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. -
కరాటేతో ఆత్మస్థైర్యం పెంపు
మనోహరాబాద్(తూప్రాన్): కరాటేతో ఆత్మస్థైర్యం పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో సన్షైన్ షాటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర కరాటే పోటీలను నిర్వహించారు. కాగా పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో కరాటే నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పోటీలు నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ మల్లేశ్, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ను మైనంపల్లి హన్మంతరావు సన్మాని ంచారు. అనంతరం విజేలతకు సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన గ్రాండ్ మాస్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కుమ్ములాటలు
చిచ్చురేపిన సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక● హన్మంతరావు వర్సెస్ రాజిరెడ్డి ● పోటాపోటీగా నియామకాలు కాంగ్రెస్ పార్టీలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎంపిక విషయం మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి మధ్య చిచ్చురేపింది. ఇరువురు చెరో వ్యక్తికి మద్దతు పలకగా, చివరకు రాజిరెడ్డి మద్దతుదారుడు కల్యాణ్కు రాష్ట ఫోరం అధ్యక్షుడు ఆశాదీప్ నియామకపత్రం అందజేశారు. – మెదక్జోన్ జిల్లాలో గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగగా, ఆయా మండలాల పరిధిలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి అవుల రాజిరెడ్డి మధ్య విభేదాలు తలె త్తాయి. మైనంపల్లి తన అనుచరుడు చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఆవుల గోపాల్రెడ్డిని ఎంపిక చేసేందుకు సర్వం సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశం ఏర్పాటు చేసి గోపాల్రెడ్డి పేరును ప్రకటించాలని నిర్ణయించాడు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆవుల రాజిరెడ్డి ఆదివారం జిల్లాలోని సుమారు 15 మందికి పైగా సర్పంచ్లతో మాసాయిపేట మండలం హకింపేటలోని ఓ రిసార్టులో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్రెడ్డి, సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యాయి. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 15 మండలాల ఫోరం అధ్యక్షుల మద్దతు కూడగట్టి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడి చేతుల మీదుగా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) సర్పంచ్ మన్నె కల్యాణ్కు సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా అధికారంగా నియామకపత్రం అందించారు.పంతం నెగ్గించుకున్న రాజిరెడ్డిఅక్టోబర్లో జరిగిన డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతిరౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వరరావు, నాసిక్ మహ్మద్, వరలక్ష్మి మెదక్ వచ్చారు. కాగా అధ్యక్ష పీఠం కోసం ఆవుల రాజిరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన అంజనేయులుగౌడ్, రాంచందర్గౌడ్ పోటీపడగా రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా అంజనేయులుగౌడ్ అప్పటికే డీసీసీగా కొనసాగాడని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని రాజిరెడ్డి గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావుకు సన్నిహితంగా ఉండే అంజనేయులుగౌడ్కే రెండోసారి డీసీసీ పీఠం దక్కింది. దీంతో రాజిరెడ్డి, హన్మంతరావుల మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలోనే జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా తన వర్గానికి చెందిన కల్యాణ్ను ఎంపిక చేసి రాజిరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. -
కలిసికట్టుగా ముందుకెళ్దాం
సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్రెడ్డి వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్రంలో సర్పంచ్లు ఎదుర్కొనే సమస్యలపై పార్టీలకతీతంగా పోరాటం చేసి కలిసికట్టుగా పరిష్కరించుకుందామని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్రెడ్డి అన్నారు. ఆదివారం మాసాయిపేట మండలం హకింపేట శివారులోని ఓ రిసార్ట్లో జిల్లా కార్యవర్గాన్ని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్నయాదవ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ సర్పంచ్ కల్యాణ్ను జిల్లా అధ్యక్షుడిగా, మాసాయిపేట స ర్పంచ్ కిష్టారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, మంగళపర్తి సర్పంచ్ సంధ్యను ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నిక పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆశాదీప్రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో సర్పంచ్లుగా ఎన్నికై న వారిపై బరువు, బాధ్యతలు పెరిగాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన ప్రత్యేక నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను గ్రామాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ముఖ్య సలహాదారులు వీరభద్ర ఆచార్య, పాండుగౌడ్తో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పాల్గొన్నారు. -
వారికి ఓటు అడిగే అర్హత లేదు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ నర్సాపూర్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులకు ఓటు అడిగే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో నర్సాపూర్ పట్టణ పార్టీ ముఖ్య నాయకులతో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారని, కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలం చెంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం ఉంటుందని మురళీయాదవ్ చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించేందుకు సమష్టిగా పని చేయాలని పార్టీ సన్నాహాక సమావేశంలో నిర్ణయించామని మురళీయాదవ్ తెలిపారు. మురళీయాదవ్తోపాటు పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సురేశ్, పార్టీ నాయకులు రాజేందర్, నగేష్గౌడ్, ప్రేమ్కుమార్, ఆంజనేయులు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తొలితరం ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే
● కలెక్టర్ రాహుల్రాజ్ ● కలెక్టరేట్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి మెదక్ కలెక్టరేట్: సమాజంలో మహిళలకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీర వనిత, సీ్త్రల విద్యకు కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అలాగే కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కలెక్టర్ రాహుల్రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..మహిళలకు, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలకు గాను ప్రతి యేటా జనవరి 3న వారి సేవలు స్మరించుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. సమాజ చైతన్యంలో మహిళల భాగస్వామ్యాన్ని కలెక్టర్ వివరించారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ,జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, జిల్లా సైన్స్అధికారి రాజిరెడ్డి, మహిళా ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పూలే దంపతులు ఆదర్శప్రాయులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మెదక్జోన్: సావిత్రి బాయి, మహాత్మా జ్యోతి బాపూలే దంపతులే ఆదర్శ ప్రాయులని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ పేర్కొన్నారు. సావిత్రి బాయిపూలే జయంతి సందర్భంగా పట్టణంలోని టీఎన్జీవో భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీటీచర్లు, ఆశావర్కర్లను ఘనంగా సన్మానించారు. -
బకాయిలివ్వండి సారూ!
‘మన ఊరు మన బడి’పనులు చేసి రెండేళ్లుమెదక్జోన్: ప్రభుత్వం మారిన ప్రతిసారీ పథకాల పేరుమార్చి కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ వారికి అనుకూలమైన పేర్లు పెట్టుకోవటం సహజమే. అయితే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా నిలిపివేయటంతోపాటు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులను నిలిపివేయటంతో ‘మన ఊరు మన బడి’పథకంలో పనులు చేసి రెండేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో 2021–2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు పాఠశాలల అభివృద్ధికి ‘మన ఊరు మన బడి’పథకంలో భాగంగా 313 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. వీటి కోసం ఆయాశాఖల ఇంజనీర్లు వాటి మరమ్మతులకు రూ.74.99 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. వీటిలో రూ.30 లక్షలకుపైగా నిధులు మంజూరైన పాఠశాలలను టెండర్ ద్వారా పనులు చేపట్టగా అంతకు తక్కువగా మంజూరైన స్కూళ్లకు నేరుగా అదే పాఠశాలకు చెందిన చైర్మన్లకు లేదా, గ్రామస్తులకు పనులు అప్పగించారు. వీటిలో రూ.10 లక్షల లోపు నిధులు మంజూరైన పాఠశాలల పనులు చాలావరకు పూర్తి కాగా అంతకు మించి నిధులు మంజూరైన పాఠశాలల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా, ఆ ప్రభుత్వంలో ఆగిన పనులను పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మన ఊరు మన బడి’పథకం పేరు మార్చి ‘అమ్మ ఆదర్శ పథకం’పేరుతో 500 పైచిలుకు పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, గత ప్రభుత్వం చేసిన పనులు అర్ధాంతరంగా వదిలేయటంతో సదరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, రాష్ట్ర మాజీ శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో శనివారం సాయంత్రం జరిగిన డైమండ్జూబ్లీ వేడుకల్లో వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తున్నారన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో చదివి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని కోరారు. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బి.పుష్ప, వి.సింధురెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీ.పీ.రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్ల ఆవిష్కరణ
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులోభాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు లేదా సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఆర్ఎస్సై నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్పర్యవేక్షించిన అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో శనివారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. కాగా, ఈ పరేడ్ను అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించి, నిర్ణీత వేగ పరిమితుల్లో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, రంగా నాయక్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పద్యాలను భవిష్యత్ తరాలకు అందించాలిపద్యాల పోటీలు నిర్వహిస్తున్న రిటైర్డ్ టీచర్ పాపన్నపేట(మెదక్): పద్యాలను తర్వాత తరాలకు అందించి తెలుగు భాషను కాపాడుకోవాలని రిటైర్డ్ టీచర్ సాంబశివరావు అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పద్యాల పోటీని నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మాచవరంకు చెందిన ఈయన విద్యార్థుల చేత పద్యాలు చదివించారు. పద్యానికి రూ.10 ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. కార్యక్రమంలో అత్యధికంగా 4వ తరగతి విద్యార్థిని గొల్ల అక్షిత 62 పద్యాలు, ఏడో తరగతి విద్యార్థిని ఏముడాల సహస్ర 60 పద్యాలను చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో తిరుగుతూ పద్యాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి కృషిఎంపీ సురేశ్ షెట్కార్ నారాయణఖేడ్: మైనార్టీల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని జహీరాబాదు ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. ఖేడ్ ఎడ్లబజార్లోని ఖాజాబందేనవాజ్ దర్గాకు ప్రహారీకోసం తనకోటా నుంచి రూ.5 లక్షలను మంజూరు చేసి శనివారం పనులకు శంకుస్థాపన చేశారు. మైనార్టీ సంక్షేమ సంఘం బాధ్యులు తాహెర్అలీ, మొయినుద్దీన్, మజీద్, రషీద్, అయూష్, వహీద్, మొయిజ్ తదితరులు ఎంపీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
వీబీజీరాంజీతో 125 రోజుల పనులు
కేవీకే సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్కౌడిపల్లి(నర్సాపూర్): వీబీజీరాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ)2025తో గ్రామాలలో ఉపాధిహామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం 125రోజులు పనిదినాలు కల్పించినట్లు కేవీకే సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ తెలిపారు. మండలంలోని తునికి కేవీకేలో వీబీజీరాంజీపై కౌడిపల్లి, నర్సాపూర్ మండల పంచాయతీ కార్యదర్శులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని చట్టసవరణ చేసి 100రోజుల పనిదినాలను 125రోజులకు పెంచిందన్నారు. గ్రామసభల్లో ఎంపిక చేసిన పనులను మాత్రమే చేయాలని చెప్పారు. అనంతరం నర్సాపూర్ ఏపీఓ అంజిరెడ్డి మట్లాడుతూ.. కొత్తచట్టం ద్వారా గ్రామాలలో జలసంరక్షణ, మౌలిక సదుపాయాలు, జీవనోపాదులు, తీవ్ర వాతవరణ సంఘటనలకు సంబంధించిన పనులు చేపట్టవచ్చన్నారు. గ్రామస్థాయిలోనే సామాజిక తనిఖీలు నిర్వహించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు శ్రీకాంత్, శ్రీనివాస్, రవికుమార్, ఉదయ్కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా మున్సిపోల్స్ నిర్వహించాలి
● జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ● తూప్రాన్లో ఎన్నికల కౌంటింగ్ హాల్ పరిశీలన తూప్రాన్: మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డితో కలిసి శనివారం పట్టణ సమీపంలోని నోబుల్ కళాశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఇప్పటికే ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూంలో భద్రపరచడంతోపాటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో కౌంటింగ్ హాల్ను పరిశీలించారు. నోబుల్ కళాశాల అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ. 11.19 కోట్ల బకాయిలు...!
ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదు! చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలతోపాటు ఇదే మండలం చందంపేట ఉన్నత పాఠశాలలను రూ.25 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాం. కానీ, రూ.18.30 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.6.70 లక్షలు రావాల్సి ఉంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. –మాణిక్యం, కాంట్రాక్టరు జిల్లా వ్యాప్తంగా 2021–2022లో 313 పాఠశాలల పనులను ప్రారంభించిన పలువురు కాంట్రాక్టర్లు రూ.31.59 కోట్లు వెచ్చించి పాఠశాలలను మరమ్మతులు చేశారు. కాగా వారికి రూ.20.40 కోట్లు విడుదల కాగా ఇంకా రూ.11.19 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా మరికొందరు ఏకంగా పాఠశాలలకు తాళాలు వేశారు. అయినప్పటికీ ఆ బకాయి నిధులు విడుదల కాలేదు. ఇటీవల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సైతం పలువురు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు పాల్గొని అరెస్టు అయ్యారు. -
హాల్టికెట్ చెకిట్!
నారాయణఖేడ్: పరీక్షా సమయాల్లో విద్యార్థులు ఆందోళనలకు గురికాకుండా ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటు ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల ప్రివ్యూను ఇంటర్ బోర్డు విద్యార్థులకు తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు పంపించనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్ మొబైల్ నంబర్లలో వాట్సాప్ ఉన్న నంబర్లకు వారి పిల్లలకు సంబంధించిన హాల్టికెట్ల ప్రివ్యూను పంపించనున్నారు. ఈ ప్రివ్యూను శనివారం నుంచే అమలులోకి తీసుకువచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిన హాల్ టికెట్స్ ప్రివ్యూలో విద్యార్థికి సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవచ్చు. వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ప్రిన్సిపాల్ను సంప్రదించి సరిచేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల హాల్టికెట్స్ ప్రివ్యూ రావాలంటే ఆ విద్యార్థి ఎస్ఎస్సీ రోల్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా హాల్టికెట్ ప్రివ్యూను చూసుకోవచ్చు. అలాగే రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థి మొదటి సంవత్సరం హాల్టికెట్, పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే రెండో సంవత్సరం హాల్టికెట్ ప్రివ్యూ చూసుకోవచ్చు. రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థి మొదటి సంవత్సరంలో పాసైన సబ్జెక్టులు, ఫెయిల్ అయిన సబ్జెక్టులతోపాటు ఆయా పరీక్షల టైం టేబుల్ వివరాలు ఉండనున్నాయి. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉండటంతో హాల్టికెట్లను సకాలంలో పొందడం, లోపాలను ముందుగానే గుర్తించడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలలు, జిల్లా అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగు పర్చడం కోసం ఈ వాట్సాప్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఉపయుక్తం పరీక్షల సమయంలో హాల్టికెట్లు జారీ కావడంతో దొర్లిన తప్పులను సరిచేసుకోలేకపోవడం, కేంద్రం, పేరు ఇతర వివరాలు తప్పులుగా రావడంతో చాలామంది విద్యార్థులు గతంలో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు ఈసారి తీరనున్నాయి. ఈ విధానం ద్వారా జిల్లాలో ఇంటర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మేలు చేకూరనుంది. వచ్చేనెల 2 నుంచి ప్రాక్టికల్స్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రభుత్వ సెక్టార్లో 70, ప్రైవేట్ కళాశాలలు 47 కొనసాగుతున్నాయి. వీటిల్లో మొదటి సంవత్సరంలో 18,249మంది విద్యార్థులు, సెకండ్ ఇంటర్ 17,983 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షలకు సంసిద్ధులవుతున్నారు. కాగా, ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష, 22న రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష ఉండనుంది. ఫిబ్రవరి 2 నుంచి 21వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. -
తప్పులు సరిచేయండి
ఓటరు జాబితాపై మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ వినతి మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు జాబితాలో అనేక తప్పులున్నాయని వాటిని సవరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని శనివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ న్యాయవాది జీవన్రావు, మాజీ కౌన్సిలర్లు అకిరెడ్డి కృష్ణారెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, గడ్డమీది కృష్ణగౌడ్, సులోచన ప్రభురెడ్డి, ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం, శ్రీనివాస్, ఏనుగుల రాజు, నాయకులు మెడిశెట్టి శంకర్, గోపాల్ తదితరులు ఉన్నారు. -
ఎంత పనిచేశావ్ మౌనిక..!
మెదక్ జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన ఘటనలో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్సై మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుల్లెబోయిన స్వామి అరవింద పరిశ్రమలో ఫైర్ ఇంజిన్ డ్రెవర్గా పని చేస్తున్నాడు. గత నెల 23న గ్రామ శివారులోని నేరళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్య మౌనికపై అనుమానంతో విచారించగా ఇదే గ్రామానికి చెందిన సంపత్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారిందని చెప్పింది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్తను హతమార్చాలని పథకం రంచించి... గత నెల 22న రాత్రి స్వామి మద్యం తాగి ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా మౌనిక ఆమె ప్రియుడు సంపత్ అతడి గొంతు నులిమి హత్యచేశారు. మృతదేహన్ని బైక్పై తీసుకెళ్లి గ్రామ శివారులోని నేరళ్లకుంటలో పడేశారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
కరాటే కోచ్ల ఎంపిక ప్రక్రియ వాయిదా
● జిల్లా వ్యాప్తంగా 162 పాఠశాలలు ● 250 దరఖాస్తులు మెదక్ కలెక్టరేట్: సమీకృత కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కరాటే మాస్టర్ల ఎంపిక ఈనెల 6వ తేదికి వాయిదా పడింది. రాణి లక్ష్మిబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయ రక్షణ పథకం కింద జిల్లాలోని 162 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జిల్లాలోని అర్హులైన మాస్టర్లు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లాలోని 133 సెకండరీస్కూల్స్, 29 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించే బాలికలకు మూడు నెలలపాటు కరాటే శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనిపై స్పందించిన జిల్లాలోని కరాటే మాస్టర్లు 162 పాఠశాలలకు 250 దరఖాస్తులు సమర్పించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో మాస్టర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కరాటే మాస్టర్లు తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడింది. అయితే చాలావరకు ఇంకా అనుభవం లేని అభ్యర్థులు రాగా, ఒక్కొక్కరు రెండు, మూడు పాఠశాలలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇదే సమయంలో కరాటే మాస్టర్లతోపాటు తమను ఎంపిక చేయాలంటూ కుంగ్ఫూ మాస్టర్లు రావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. అధికారులు అభ్యర్థులతో మాట్లాడి వారి నైపుణ్యత ఆధారంగా ఎంపిక చేపట్టారు. దీంతో సాయంత్రం వరకు కేవలం 10 మండలాలకు మాత్రమే కోచ్ల ఎంపిక జరిగింది. మిగతా మండలాల అభ్యర్థుల ఎంపిక ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ అధికారులు జ్యోతి, రాజేశ్వరీ, శ్రీకాంత్లు పాల్గొన్నారు. -
రూ.11.14కోట్లతో ఎక్సలెన్స్ భవనం
● నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి ● ఎంపీ రఘునందన్ హవేళిఘణాపూర్(మెదక్): జిల్లాకు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం మంజూరు కావడం అభినందనీయమని ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో రూ.11.14కోట్ల భవన నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ రాహుల్రాజ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ భవనానికి రెండు జిల్లాలు ఎంపికవ్వగా.. మెదక్ ప్రాంతంలోని డైట్ కళాశాలలో ఈ పనులను ప్రారంభించడం హర్షణీయమన్నారు. విద్యార్థులకు కళాశాలతో పాటు వసతి గృహం, డైనింగ్ వంటి పనులు నిర్మాణం చేపట్టడంతో వసతులు మెరుగుపడుతాయన్నారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కళాశాలలో అన్ని వసతులను కల్పించేలా అధికారులు సైతం సమన్వయంతో త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్, సర్పంచ్ మేకల సాయిలు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్వేతాకిరణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, ఆయా గ్రామా ల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. డిప్లొమా ప్రైమరీ ఫ్రీ ఎడ్యూకేషన్ (డీపీఎస్ఈ) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి ఈ కోర్సులో చేరే విధంగా చూడాలని ఎంపీ రఘునందన్రావు అన్నారు. శుక్రవారం హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్తో మాట్లాడారు. కళాశాలలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో విద్యాబోధన చేస్తున్నామని, ప్రభుత్వం డీపీఎస్ఈ కోర్సు ప్రవేశపెట్టినా ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అందుకు ఎంపీ బదులిస్తూ డీపీఎస్ఈ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచి కోర్సులో చేరే విధంగా చూడాలని సూచించారు. -
బొకేలకు బదులు బ్లాంకెట్స్
మెదక్ కలెక్టరేట్: తన పిలుపు మేరకు సేవా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ రాహుల్రాజ్ ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు చలి నుంచి రక్షణ పొందే బ్లాంకెట్స్ అందించాలని ఆయన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. గురు, శుక్రవారాల్లో ఆయా శాఖల అధికారులు కలెక్టర్ను కలిసి బ్లాంకేట్స్ అందజేశారు. వివిధ సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,500 బ్లాంకెట్స్ అవసరం ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు వెయ్యికి పైగా బ్లాంకెట్స్ వచ్చాయని, వీటిని వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
విద్యావంతులే సైబర్ బాధితులు
● సైబర్ నేరాలపై అవగాహన ● రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో సైబర్ మోసాలకు గురవుతుంది అధిక శాతం విద్యావంతులేనని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అవగాహన లోపం, అత్యాశ, తొందరపాటు నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. విద్యావంతులు, యువత అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగిన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనధికారిక లోన్ యాప్స్ ద్వారా తక్కువ సమయంలో రుణం ఇస్తామని ఆకర్షించి అధిక వడ్డీలు వసూలు చేయడం, మొబైల్లోని కాంటాక్ట్లు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, రుణం చెల్లించలేని పరిస్థితుల్లో బెదిరింపులు, అశ్లీల సందేశాలు పంపడం, పరువు నష్టం కలిగించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఎస్పీ వివరించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్లైన్ నెంబర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనంతరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెలంతా రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐ శైలేందర్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, ఎస్సై శివానందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన
డీఈఓ విజయనర్సాపూర్ రూరల్: కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈఓ విజయ అన్నారు. శుక్రవారం మండలంలోని చిప్పల్తుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. విద్యా బోధన, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం బడి మానేసిన ఆడ పిల్లల కోసం కస్తూర్బా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్న సమయం వృథా చేయకుండా కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని ఆమె సూచించారు. -
మొక్క.. ఏదీ నీ లెక్క!
● మొక్కలు నాటి సంరక్షణ మరిచారు ● ఎండిపోయిన వైనం ● నెరవేరని వనమహోత్సవ లక్ష్యం నర్సాపూర్: వన మహోత్సవంలో నాటిన మొక్కల సంరక్షణను అధికారులు గాలికొదిలేశారు. దీంతో అవి కర్రలుగా మారి దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా స్థానిక అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వనమహోత్సవంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి, ఇతర అధికారులతో పాటు లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. దాదాపు ఐదు వందల మొక్కలు నాటా మని అధికారులు ప్రకటించారు. కాగా అధికారులు వాటి సంరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో చాలా మొక్కలు ఎండిపోయి గోతులు మిగిలాయి. కాగా కొన్ని మొక్కలు ఎండిపోయి ఆకులు లేకపోవడంతో కర్రలుగా మారాయి. మరి కొన్ని మొక్కలు నాటకపోవడంతో పాలిథిన్ కవర్లలోనే ఎండిపోయాయి. ఈ విషయమై ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శేషాచారిని వివరణ కోరగా... తాము మొక్కలు నాటిన ప్రాంతంలో మట్టి బాగా లేదని చెప్పారు. మొక్కలు కర్రలుగా మారిన మాట వాస్తవమని, వాటికి నీరు పెట్టి కాపా డేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు మొక్కలను దత్తతకు ఇస్తామని చెప్పారు. -
రాయితీ ఇచ్చినారు
మెదక్జోన్: కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. టమాటా నుంచి మొదలుకుని పచ్చి మిర్చి వరకు కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జిల్లాకు సరిపడా కూరగాయల పంటలు సాగు చేయక పోవటమే. ఫలితంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కూరగాయల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాయగూరల పంటలపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఇక నుంచి కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు పూర్తి సబ్సిడీపై ఐదు రకాల నారుమళ్లను రైతులకు అందించాలని నిర్ణయించింది. జిల్లాకు 250 ఎకరాలకు నారుమడి కూరగాయల సాగును పెంచేందుకు మూడేళ్లు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ములుగులో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ యూనివర్సిటీలో పలురకాల కూరగాయల నారుమళ్లు పెంచుతూ రైతులకు సబ్సిడీపై అందిస్తున్నప్పనటికీ జిల్లాకు ఏటా కేవలం 25 ఎకరాలకు సరిపడా నారుమళ్లను అందించేవారు. అయితే 2025–2026 నుంచి జిల్లాకు 250 ఎకరాలకు సరిపడా టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నారుమళ్లను పూర్తి సబ్సిడీపై రైతులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాకు 100 ఎకరాలకు పైగా నారుమడిని తెచ్చుకున్న రైతులు వాటిని సాగు చేశారు. మరో 150 ఎకరాల్లో సాగుచేసేందుకు నారును సిద్ధంగా ఉందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ‘సెడ్నెట్’ నిర్మాణానికి భారీ సబ్సిడీ జిల్లాకు 20 సెడ్నెట్హౌజ్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది ఒక్కో యూనిట్ను 12 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకునే వీలు ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చు అవుతుండగా అందులో రూ.3.75 లక్షల సబ్సిడీని ప్రభుత్వం సదరు రైతుకు ఇస్తుంది. రైతు వాటా కింద రూ.1.75 లక్షల వెచ్చించాల్సి ఉంటుంది. కాగా పూర్తి నిర్మాణం తర్వాతనే సదరు రైతుకు సబ్సిడీ వాటా అందుతుంది. ఈ సెట్నెట్ హౌజ్లో ఏడాదికి రూ.10 లక్షల కూరగాయల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ములుగు హార్టికల్చర్ వర్సిటీ నుంచి సరఫరా జిల్లాకు 250 ఎకరాలకు అవకాశం తగ్గనున్న కూరగాయల ధరలు! మెదక్ జిల్లాలో కొన్నేళ్లుగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదివరకు కూరగాయల సాగు పెంచేందుకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలను అందించేవారు. దీంతో విస్తృతంగా సాగు అయ్యేది. ఫలితంగా జిల్లాలో నాణ్యమైన కూరగాయలు లభించటంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు లభించేవి. 10 సంవత్సరాల నుంచి విత్తనాలపై సబ్సిడీ తొలగించటంతో చాలామంది రైతులు కూరగాయల పంటలను పండించటం మానేశారు. -
తక్కువ ధరకే ఇసుక
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్జోన్: ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే ఇసుకను అందించాలనే ఉద్దేశంతో శాండ్బజార్ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిల్వ ఉంచిన శాండ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ శాండ్ బజార్ ద్వారా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇక నుంచి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు 155242 నంబర్కు ఫోన్చేసి ఇసుకను బుక్ చేసుకునే వెసులు బాటును కల్పించామన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ, త్వరలో వాణిజ్య, ప్రైవేట్, ప్రభుత్వ అభివృద్ధి పనులకు సైతం ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం టన్నుకు రూ.1,200 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, మైన్స్ ఏడీ సంజయ్ కుమార్, పీడీ హౌసింగ్ మాణిక్యం, తహసీల్దార్ లక్ష్మణబాబు, తదితరులు పాల్గొన్నారు. -
పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఏడుపాయల్లో వన దుర్గమ్మకు పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్ధీవశర్మ దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని పల్లకిపై ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మంగళహారతులు పట్టారు. భక్తులు పల్లకిని భుజాలపై ఎత్తుకొని ఆలయం నుంచి ప్రధాన వీధి గుండా ఊరేగించారు. సర్పంచ్లకు డీఈఓ విజయ సూచన కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్లు కృషి చేయాలని డీఈఓ విజయ సూచించారు. శుక్రవారం కౌడిపల్లికి వచ్చిన సందర్భంగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ డీఈఓను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు విద్య, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధిలో అక్కడక్కడా ఎదురవుతున్న సమస్యలపై సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బడీడు పిల్లలందరు బడిలో ఉండేలా చూడాలన్నారు. వందశాతం విద్యార్థులు పాఠశాలకు హాజరు అయ్యేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఓంప్రకాశ్, నాయకులు దుర్గాగౌడ్, బోయిని వీరయ్య, భూమయ్య, శ్రీనివాస్గుప్తా, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ మెదక్ కలెక్టరేట్: విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది కొత్త సంవత్సరంలో మరింత ఉత్సా హంతో వినియోగదారులకు సేవలందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ సూచించారు. శుక్రవారం విద్యుత్ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేసి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈతోపాటు ఏఈలు, కా ర్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్బీఐ మేనేజర్ హరినాథ్ నర్సాపూర్: అర్హత ఉన్న గ్రామైఖ్య సంఘాల స భ్యులకు రుణాలు అందెలా చూడాలని ఎస్బీఐ మేనేజర్ హరినాథ్ కోరారు. శుక్రవారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో జరిగిన కమ్యూనిటీ బేస్డ్ రికవరీ మెకానిజం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ శాఖ పరిధిలోని గ్రామాల్లోని అర్హత ఉన్న సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నా మని చెప్పారు. రుణాలు పొందిన సభ్యుల నుంచి రికవరీ సరిగా అయ్యే విధంగా తమకు సహకరించాలని కోరారు. ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ మాట్లాడుతూ.. వాయిదాలు చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన సంఘాలకు వన్టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాలని కోరారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలలో రాయితీలు పొందేందుకు ప్రతి రైతు తమ ఐడీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి సూచించారు. రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి, మీసేవ కేంద్రాలలో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అఽధికారి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. -
రెండున్నర ఎకరాల్లో సాగు
హార్టికల్చర్ వర్సిటీ ములుగు నుంచి రెండున్నర ఎకరాలకు అవసరమయ్యే నారును తెచ్చాను. అందులో ఎకరంన్నర టమాట, ఎకరం మిరప నారు తెచ్చి సాగు చేశాను. టమాట పంట చేతికందింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం సంతోషంగా ఉంది. –బీంరెడ్డి, రైతు, మర్పల్లి, రేగోడు మండలం రైతులు వినియోగించుకోవాలి పూర్తి సబ్సిడీతో జిల్లాకు 250 ఎకరాలకు ఐదురకాల నారుమళ్లను ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని రైతులు వినియోగించుకోవాలి. అలాగే 20 యూనిట్ల సెడ్నెట్హౌజ్ మంజూరయ్యాయి. అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. –ప్రతాప్సింగ్, హార్టికల్చర్ అధికారి మెదక్ -
బాలికల అథ్లెటిక్స్లో చాంపియన్షిప్
మెదక్జోన్: రాష్ట్రస్థాయి 11వ క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ అథ్లెటిక్స్ పోటీలను శుక్రవారం హైదరాబాద్లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించారు. ఇందులోభాగంగా అండర్ 20 బాలికల విభాగంలో ఎనిమిది కిలోమీటర్ల పరుగుపందెంలో మెదక్ జిల్లాకు చెందిన బానోత్ అనిత ద్వితీయ స్థానంలో గెలుపొందింది. దీంతో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి చేతులమీదుగా అనితకు ట్రోఫీని అందజేశారు. కాగా, ఈ నెల 24న, ఝార్ఖండ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మెదక్ జిల్లా తరఫున అనిత పాల్గొంటారని మెదక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్, కోచ్ అర్జున్ వెల్లడించారు. -
మున్సిపోల్స్కు సమాయత్తం!
● ముసాయిదా ఓటరు జాబితా విడుదల ● అభ్యంతరాలు, ఫిర్యాదులకురెండు రోజులు అవకాశం రామాయంపేట(మెదక్): జిల్లాలోని నాలుగు ము న్సిపాలిటీల్లో గురువారం అధికారులు వార్డుల వారీ గా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ఈ మేరకు జాబితాను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు కోసం రెండు రోజులు అవకాశం కల్పించారు. ఈనెల 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా కేంద్రంలో రాజకీయ పార్టీలతో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్స్టేషన్ల పునర్వ్యవస్ధీకరణ కార్యక్రమం పూర్తయింది. స్టేషన్ల సంఖ్య పెరుగకపోయినా కొన్ని మార్పులు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను 24 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 11, 12 పోలింగ్ స్టేషన్లు గతంలో మార్కెట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగగా, ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలమవటంతో దానిని ఉజ్వల విద్యాలయంలోకి మార్చారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2025 ఓటరు లిస్ట్ను ప్రామాణికంగా తీసుకొని ముసాయిదా బాబితా రూపొందించారు. కాగా అక్టోబర్ తర్వాత కొత్తగా ఒటర్గా నమోదైన యువకులకు ఈఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈసారి ఫొటో ఆధారిత ఓటర్ లిస్టు ప్రవేశపెడుతున్నారు. పోలింగ్స్టేషన్లలో సదుపాయాల పరిశీలన నాలుగు మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన పో లింగ్ స్టేషన్లలో సదుపాయాలు, సమస్యలను అధికారులు పరిశీలించారు. మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ర్యాంపులు లేకపోతే వెంటనే నిర్మించా ల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులోకి మార్చుకునే అవకాశం ఉంటుందే తప్ప కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఉండదని స్పష్టం చేశారు. కాగా ఓటర్ లిస్టులో మృతిచెందిన వారి పేర్లు ఉంటే వాటిని తొలగించే అవకాశాలు లేవని తెలిసింది. -
నూతనోత్సాహంతో పనిచేద్దాం
మెదక్ కలెక్టరేట్: కొత్త సంవత్సరంలో జిల్లా అధికారులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన గతేడాది జిల్లాలో సాధించిన అభివృద్ధి, పురోగతి, విజయాలను స్మరించుకున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడప వరకు చేరేలా చూడాలన్నారు. అనంతరం తహసీల్దార్ అసోసియేషన్కు సంబంధించిన నూతన డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, టీజీటీఏ నాయకులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం సివిల్ సప్లై అధికారులు నిత్యానంద్, జగదీశ్ తన సిబ్బందితో కలెక్టర్ను కలిసి దుప్పట్లు అందజేశారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ శ్రీనివాసరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులతో కలెక్టర్కు రాహుల్రాజ్ -
ఆలయాలకు కొత్త శోభ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో కలెక్టర్ రాహుల్రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండ రామాలయం, సాయిబాబ ఆలయం, శివాలయాలు, పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. – మెదక్జోన్/పాపన్నపేట(మెదక్) -
అప్రమత్తతే శ్రీరామ రక్ష
మెదక్జోన్: చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని డీఎంహెచ్ఓ శ్రీరాం అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల జాగ్రత్తలు అవసరం అన్నారు. గురువారం ‘సాక్షి’ ఫోన్ ఇన్లో భాగంగా ప్రజల సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రశ్న: మా ఇంట్లో రెండేళ్ల బాబు ఉన్నాడు. చలి తీవ్రతతో జలుబు అధికంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – కుమార్, తునికి డీఎంహెచ్ఓ: వెంటనే దగ్గరలోని పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యం చేయించండి. చలిలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్లొద్దు. ఉన్ని దుస్తులు ధరించాలి. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వారికి దగ్గు, జలుబు, జ్వరం ఉంది. మా గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించినా తగ్గలేదు. ఎలాంటి చర్యలు తీసుకోమంటారు? – శ్రీనివాస్, పాపన్నపేట, జయపాల్, కొల్చారం, రంగంపేట డీఎంహెచ్ఓ: మీ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లండి. వారికి వెంటనే యాంటీబయాటిక్ సిరప్లు వాడాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. ప్రశ్న: మా గ్రామ పాఠశాలలో చాలా మంది విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు మందులు ఇవ్వండి? – శంకర్, పాఠశాల చైర్మన్, చిన్నఘణాపూర్, కొల్చారం డీఎంహెచ్ఓ: ఏఎన్ఎంను పంపి వెంటనే పాఠశాలలో విద్యార్థులను పరిశీలించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాం. ఒకటి, రెండు రోజుల్లో క్యాంపు ఏర్పాటు చేస్తాం. ఆశవర్కర్ ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున ఉంటారు. మీ గ్రామంలో జనాభా ఆధారంగా తగు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మా మండలంలో పీహెచ్సీ లేదు. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆర్ఎంపీ, పీఎంపీల వద్దకు పరుగు పెట్టాల్సి వస్తుంది. – శ్రీనివాస్, చండూరు సర్పంచ్ డీఎంహెచ్ఓ: చిలప్చెడ్ మండల కేంద్రానికి అర్బన్ ఆరోగ్య కేంద్రం మంజూరైంది. ఇందుకోసం నిధులు సైతం విడుదలయ్యాయి. త్వరలోనే భవన నిర్మాణం చేపడుతాం. ప్రస్తుతం మండల ప్రజలు కౌడిపల్లి పీహెచ్సీకి వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ఆర్ఎంపీలు, పీఎంపీలకు చూపించొద్దు. ఎందుకంటే వారు అధికంగా యాంటీబయాటిక్ ఇస్తారు. అది ఆరోగ్యంపై భవిష్యత్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రశ్న: మా బాబు వయస్సు 19 సంవత్సరాలు. మెదక్లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వారం రోజులుగా చలికి చేతులు వంకర పోతున్నాయని అంటున్నాడు. – శ్రీనివాస్, గాజిరెడ్డిపల్లిడీఎంహెచ్ఓ: మీబాబు హాస్టల్లో చలి నీటిలో స్నా నం చేయటం, చలిలో బయటకు వెళ్లటం జరిగి ఉంటుంది. అందుకే చేతులు వంకరపోతున్నాయనిపిస్తోంది. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి చిన్నపిల్లల వైద్యుడికి చూపించి తగు మందులు వాడండి. ప్రశ్న: నా వయస్సు 48 సంవత్సరాలు. 15 రోజులుగా తరుచూ జ్వరం, దగ్గు, జలుబు వస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? – రాజేశ్వర్, చిన్నశంకరంపేట డీఎంహెచ్ఓ: తరుచుగా జలుబు, దగ్గు, జ్వరం వస్తుందంటున్నారు కాబట్టి మీ మండల కేంద్రంలోని పీహెచ్సీకి వెళ్లి బీపీ, షుగర్తో పాటు (సీబీపీ) రక్త పరీక్షలు చేసుకోవాలి. ప్రశ్న: నాకు కుక్క కరిచింది. మా మండల కేంద్రంలోని పల్లె దవాఖానకు వెళ్తే అక్కడ పనిచేసే వారు కనీసం పట్టించుకోలేదు. దీంతో సిద్దిపేట వెళ్లి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. – శ్రీనివాస్, నిజాంపేట డీఎంహెచ్ఓ: డీఎంహెచ్ఓ: విచారణ జరిపించి చర్యలు తీసుకుంటా. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. మీరు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి ప్రశ్న: ఆరేళ్ల క్రితం స్టంట్ వేశారు. చలితో దగ్గు, జలుబు అయింది. ఎలాంటి జాగ్రతలు పాటించాలి? – సాయిరాం, చేగుంట డీఎంహెచ్ఓ: చలికి స్టంట్ పడిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చలికి ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదు. ఉన్ని దుస్తులు ధరించాలి. వేడి పదార్థాలు మాత్రమే తినాలి. వెంటనే మీ మండల కేంద్రంలోని పీహెచ్సీకి వెళ్లి సీబీపీ రక్త పరీక్షలు చేయించుకొండి. దానిని బట్టి మందులు వాడితే తగ్గుతుంది. చలితో జలుబు, జ్వరం బారిన పడే ప్రమాదం వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు అవసరం డీఎంహెచ్ఓ శ్రీరాం సాక్షి ఫోన్ ఇన్కు విశేష స్పందన -
యూరియా.. ఏదయా!
● జిల్లాలో 3.17 లక్షల ఎకరాల్లో సాగు ● 27 వేల పైచిలుకు మెట్రిక్ టన్నులు అవసరం యాసంగి సాగు ప్రారంభంలోనే అన్నదాతకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎరువుల దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. పోలీస్ పహారాలో పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్లో 3.17 లక్షల ఎకరాలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 13 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 3,17,380 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం వరి 2,95,200 ఎకరాలు సాగవుతుండగా, మిగితా 22,180 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడుతో పాటు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకోసం డీఏపీ, ఎంఓపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్తో పాటు అన్నిరకాల రసాయన ఎరువులు 56,523 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా యూరియా 27,064 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని అధికారుల అంచనా. కాగా ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలతో పాటు ఇతర ప్రైవేట్ షాపుల్లో సుమారు 13 వేల మెట్రిక్ టన్నుల మేర యూరియా ఉందని సమాచారం. యూరియా కోసం రైతులు ఇప్పటికే రోడ్ల మీదకు వచ్చి దుకాణాల ఎదుట క్యూలైన్లు కడుతున్నారు. ఎలాంటి గొడవులు జరగకుండా ముందస్తుగా పోలీసుల పహారాలో యూరియా బస్తాలను రైతులకు మితంగా అందిస్తున్నారు. బుకింగ్ యాప్పై అవగాహన ఇక నుంచి రైతులకు ఎరువులు కావాలంటే తప్పని సరిగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో బుక్ చేసుకుంటేనే ఎరువులు అందుతాయని రైతులు అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు సెల్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ పేరు, పట్టా పాస్పుస్తకం నంబర్, ఇతర వివరాలు అందిస్తే అప్పటికే యాప్ ద్వారా రైతులు తమకు కావాల్సిన యూరియాను ఏ డీలర్వద్ద ఉంటే అక్కడ కొనుగోలు చేయొచ్చు. అయితే ప్రతి రైతు వద్ద స్మార్ట్ఫోన్ ఉండాలి. పాస్బుక్ నంబర్ కొడితే రైతు పేరు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఉన్న భూమిలో ఎంత సాగు చేస్తున్నారు, ఏరకమైనా పంట వేశారు అనే అంశాలు వస్తాయి. పంటరకం, అందుకు అవసరమైన యూరియా బస్తాలను ఎంటర్ చేస్తే ఆన్లైన్ ద్వారా యూరియా బుక్ అవుతుందని చెబుతున్నారు. కాగా జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది రైతులు ఉండగా, 40 శాతం మంది రైతులు స్మార్ట్ఫోన్లు వాడటం లేదు. వరి నాటుకు ఎకరానికి కేవలం రెండున్నర బస్తాల యూరియా మాత్రమే వాడాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సగం బస్తా ఇవ్వడం కుదరకపోవటంతో ఎకరం ఉంటే 3 బస్తాలు ఇస్తామని, 2 ఎకరాల్లో నాటు వేసే 5 బస్తాలు ఇస్తామని చెబుతున్నారు. అంతకుమించి యూరియా ఇవ్వబోమని, అంతకంటే ఎక్కువ ఉపయోగిస్తే భూసారం తగ్గి భవిష్యత్తులో పొలాలు దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. -
న్యూ ఇయర్ కిక్కు
రూ. 21.32 కోట్ల మద్యం తాగేశారు కొల్చారం(నర్సాపూర్): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యం ప్రియులు ఫుల్గా తాగేశారు. డిసెంబర్ చివరి రెండు రోజుల్లో మండలంలోని చిన్నఘనాపూర్ ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) డిపో ద్వారా రూ. 21.32 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 30, 31 తే దీల్లో ఐఎంఎల్ కేసులు 24,004 అమ్ముడు పోగా, బీరు 14,391 కేసులు అమ్ముడు పోయాయి. 31 నాడు రూ. 8.11 కోట్ల మద్యం అమ్మకాలను జిల్లాలోని మద్యం దుకాణదారులు డిపో ద్వారా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఐఎంఎల్ డిపోలో బీరు, విస్కీ కలిపి 461 రకాలు అందుబాటులో ఉన్నాయి. నూతన మద్యం పాలసీ ప్రారంభమైన 2025 డిసెంబర్ 1 నుంచి 31 వరకు డిపో నుంచి ఐఎంఎల్, బీరు కలిపి సుమారు రూ. 209.50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నెల మొత్తంగా 3,96,427 కేసులు విక్రయించారు. విస్కీలో అత్యధికంగా ఆఫీసర్స్ ఛాయిస్ రిజర్వ్ విస్కీ అమ్ముడు కాగా, దీని విలువ రూ. 12,69,44,132లుగా నమోదైంది. తర్వాత స్థానంలో సిగ్నేచర్ ఇంపీరియల్ బ్లూ క్లా సిక్ గ్రీన్ విస్కీ రూ. 11,80,00,204 అమ్ముడైంది. చివరిస్థానంలో రూ. 4,259లతో హై రైస్ విస్కీ నిలిచింది. -
కష్టపడి చదివితే మంచి భవిష్యత్: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారికి నోట్బుక్స్ పంపిణీ చేసి ముచ్చటించారు. క్రమశిక్షణ, కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. పిల్లల భవిష్యత్తే సమాజ భవిష్యత్తు అని, వారు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని తెలిపారు. నూతన సంవత్సరంలో పిల్లలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్గౌడ్, రంగా నాయక్, సీఐలు మహేశ్, కృష్ణమూర్తి, శైలే ందర్, బాల సదనం అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర, ముత్తాయికోటలోని సిద్దేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా పో లీస్ కార్యాలయంలో వేడుకల్లో పాల్గొన్నారు. -
ఉపాధిలో అవినీతిని ఉపేక్షించం
డీఆర్డీఓ శ్రీనివాస్ రామాయంపేట(మెదక్): మండలంలోని ఓ గ్రామంలో ఉద్యోగి కుటుంబం ఉపాధి పనుల్లో పాల్గొంటున్నట్లు వస్తున్న ఆరోపణల విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఉపాధి పథకం సోషల్ ఆడిట్లో పాల్గొని మాట్లాడారు. ఏడాది కాలంగా మండలంలో రూ. ఆరుకోట్ల మేర ఉపాధి పనులు నిర్వహించగా, పది రోజులుగా గ్రామాల్లో ఆడిట్ జరిగిందన్నారు. ఒకరి పేరిట మరొకరు పనుల్లో పాల్గొంటున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయని, పలు గ్రామాల్లో ఇలా జరిగినట్లు తమ దృష్టికి సైతం వచ్చిందన్నారు. ఇష్టం వచ్చినట్లు చేయడం తగదని, నిబంధనల మేరకే పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈమేరకు పలు అవకతవకలకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 11 వేలు రికవరీ చేయడంతో పాటు రూ. 18 వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, పలు గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ అధికారులకు సేవా పతకాలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాకు చెందిన ము గ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించడం గర్వకారణంగా ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సేవా పతకాలను ప్రకటించినట్లు చెప్పారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేసిన అధికారులను ఈ పతకాల ద్వారా గౌరవిస్తామన్నారు. పతకాలలో భాగంగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్సై విఠల్, మెదక్ టౌన్ ఏఎస్సై రుక్సానా బేగం పతకాలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు. -
కొంగొత్త ఆశలతో..కొత్త ఏడాదిలోకి
● 2025కి వీడ్కోలు.. 2026కు స్వాగతం ● జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు కొంగొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో జిల్లా వాసులు 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను సాక్షితో పంచుకున్నారు. వెల్లడించిన అంశాలు.. వారి మాటల్లోనే.. – మెదక్జోన్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి కొత్త సంవత్సరంలో అన్నిరంగాల్లో మరింతగా పురోగతి సాధించేందుకు ప్రాణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. ప్రధానంగా విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. పది పాసైన ప్రతి విద్యార్థి ఇంటర్లో చేరేలా ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలో పలు టూరింజం స్పాట్లు ఉండటంతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తా. – రాహుల్రాజ్, కలెక్టర్ గౌరవెల్లితో సాగు నీటిని అందిస్తా.. గౌరవెల్లి రిజర్వాయర్కు అనుబంధంగా కాలువలు నిర్మించి సాగు నీటిని అందించి మూడు పంటలు పండేలా కృషి చేస్తా. హుస్నాబాద్లో ప్రారంభమైన అభివృద్ధి పనులు త్వ రగా పూర్తి చేయిస్తా. సర్వాయి పాపన్న నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గానికి ట్రీపుల్ఐటీ బ్రాంచ్ను, నవోదయ వచ్చేందుకు నా వంతు కృషి చేస్తా. కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. – పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి -
నూతనోత్సాహం
అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలుమెదక్మున్సిపాలిటీ: కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. జిల్లావ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికారు. హాటళ్లు, బేకరీ దుకాణాలన్నీ కిటకిటలాడాయి. కొన్ని పాఠశాలల్లో ముందస్తుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బుధవారం రాత్రి 12 గంటల తరువాత ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ న్యూఇయర్ విషెస్ చెప్పుకొన్నారు. గురువారం జిల్లాలోని ఆలయాలకు, చర్చికి భక్తు లు భారీగా తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
గ్రామాలకు బస్సులు నడపండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి నిజాంపేట(మెదక్): మండలంలోని పలు గ్రామాలకు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సరిపడా బస్సులు నడపాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల శశిధర్రెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలంలోని నస్కల్, నందగోకుల్, రాంపూర్ మీదుగా గతంలో బస్సులు నడిచేవన్నారు. రోడ్డు దుస్థితి కారణంగా డిపో మేనేజర్లు వాటిని నిలిపివేశారు. అలాగే మండలంలోని రాయిలాపూర్, బచ్చురాజ్పల్లి, తిప్పన్నగుల్ల, కల్వకుంట, నార్లాపూర్ మీదుగా మరో బస్సు నడిచేదని తెలిపారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పై చదువుల కోసం సుమారు వందకు పైగా విద్యార్థులు రా మాయంపేట, సిద్దిపేటకు తరలివెళ్తుంటారు. కావున మండలంలోని పలు గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు. . -
సాగు నీరు విడుదల చేయలేం
మెదక్ కలెక్టరేట్: సింగూర్ ప్రాజెక్ట్ మరమ్మతుల కారణంగా వనదుర్గా ప్రాజెక్ట్కు నీటి విడుదల ఉండదని, 500 ఎకరాల ఆయకట్టు ఉన్న పొలాలకు నీరిచ్చేందుకు జిల్లావ్యాప్తంగా 9 చెరువులను గుర్తించినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశంలో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు మండలాల్లో గల ఆయకట్టుకు ఈ రబీకి నీటి విడుదల చేయలేకపోతున్నామన్నారు. జిల్లాలో 500 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నీరు అందించేందుకు 9 చెరువులను గుర్తించినట్లు చెప్పారు. ఆ చెరువుల ద్వారా వాటి పరిధిలోని ఆయకట్టు పొలాలకు నీరందిస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసే దిశగా చర్యలు జరుగుతున్నట్లు వివరించారు. భవిష్యత్తులో జిల్లాలోని రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈమేరకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా సింగూరు నుంచి ఘనపూర్ అనకట్టకు 4.05 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడ్వైజరీ మీటింగ్ను బహిష్కరించి రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నీటి విడుదల చేయని పక్షంలో సాగు చేయలేక నష్టపోయే రైతులకు ఎకరాకు రూ. 25,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
పుర పోరుకు కసరత్తు
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు మెదక్ 32 37,045 నర్సాపూర్ 15 16,531 తూప్రాన్ 16 19,222 రామాయంపేట 12 13,112 రామాయంపేట(మెదక్): పుర పోరుకు ప్రభుత్వం సమాయత్తమైంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి గాను ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో అధికారులు సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎపుడొచ్చినా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఒటరు జాబితా తయారీ ప్రక్రియ చేపట్టాలని ఉత్వర్వులు జారీ అయ్యాయి. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 75 వార్డులకు గాను మొత్తం 85,910 ఓటర్లు ఉన్నారు. ఈమేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దృష్టి సారించిన పార్టీలు ఫిబ్రవరిలో పుర ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున పోటీ చేయడానికి గాను చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి చాలా మంది ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో ఈసారి ఎలాగైనా పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన వారు అధిక సంఖ్యలో గెలుపొందడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. 11 నెలలుగా ప్రత్యేక పాలన మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు జనవరి 25తో ముగిసింది. దీంతో గత 11 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 2020 జనవరి 22న మన్సిపల్ ఎన్నికలు జరగగా, 25న ఫలితాలు వెల్లడయ్యాయి. 28న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 27న ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. డిసెంబర్ 30న పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్ధీకరణ 31న వార్డుల వారీగా విభజన జనవరి 1న వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితా తయారీ అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం నోటీస్ బోర్డులో ప్రదర్శన 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. 6న జిల్లా స్థాయిలో సమావేశం 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటన జనవరి 10న తుది జాబితా ప్రకటన ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు! -
సాగుకు సింగూరు నీళ్లు రావు..
రైతులు పంటలు సాగు చేయవద్దు కొల్చారం(నర్సాపూర్): సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా ప్రాజెక్ట్ దిగువన ఉన్న ఘణపురం ఆనకట్టకు ఈ యాసంగి సీజన్ పంటల సాగుకు అవసరమైన నీరు విడుదల కాదని కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి పేర్కొన్నారు. మంగళవారం రంగంపేటలో, పరిసర గ్రామాల రైతులకు యాసంగి పంట సాగుపై అవగాహన కల్పించారు. ఎగువ నుంచి నీరు విడుదల కాకపోవడంతో మండలంలో మంజీరాపై నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలకు నీరు అందే పరిస్థితి లేదన్నారు. ఈ యాసంగి సీజన్లో లిఫ్ట్ ఇరిగేషన్పై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజశేఖర్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): నూతన సాంకేతికతకు విద్యార్థులు పదునుపెట్టి వారిలో ఉన్న ఆలోచన శక్తిని బయటకు తీయడం అభినందనీయమని డీఈఓ విజయ అన్నారు. నేషనల్ గ్రీన్ కాంపిటీషన్ ఫర్ ఇకో క్లబ్ స్టూడెంట్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం హవేళిఘణాపూర్ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిర్వహించగా ఆమె ప్రాజెక్టు నమూనాలను పరిశీలించారు. వినూత్న ఆలోచనలతో ఉపయోగం లేనటువంటి వస్తువులను ఉపయోగపడేలా చేసిన చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆడెపు కరుణాకర్, మండల విద్యాధికారి మధుమోహన్, జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, రాజశేఖర్, సిద్ధిరాములు, రాజేశం, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి తిమ్మాపూర్ లో బంగారమ్మ జాతర మహోత్సవం కనుల పండువగా ముగిశాయి. ప్రతిఏటా మూడు రోజుల పాటు గ్రామస్తులు జాతర నిర్వహించడం ఆనవాయితీ. చివరి రోజు మంగళవారం తూప్రాన్– నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఎలమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. -
ముగిసిన ధాన్యం సేకరణ
● 3.78 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ● రూ. 901. 66 కోట్ల చెల్లింపులు మెదక్జోన్: వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయ్యింది. సెప్టెంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొదట్లో వర్షాల వల్ల కొంత ఆటంకం జరిగింది. అనంతరం జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాలు ప్రారంభించారు. ఖరీఫ్ లో 3.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 1.20 లక్షల ఎకరాల్లో సన్నరకం, 2.75 లక్షల ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశారు. వాటిలో ఆహార అవసరాలు, విత్తనాలకు పోను 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు పీఏసీఎస్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా సన్నధాన్యం కోసం 100, దొడ్డు ధాన్యం సేకరణకు 418 సెంటర్లు కేటాయించారు. రెండు నెలల పాటు.. జిల్లావ్యాప్తంగా రెండునెలల పాటు 3.78 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అధికారుల అంచనా ప్రకారం కేవలం 2 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తక్కువగా వచ్చింది. ఇందులో సన్నరకం 1.43 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2.35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం సేకరించారు. ఇందుకు సంబంధించి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,389 లెక్కన రూ. 903.14 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, మంగళవారం వరకు రూ. 901.66 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.1.48 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ చెల్లింపులు సైతం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. బోనస్ రూ. 45.85 కోట్లు సన్నాలకు ప్రభుత్వం అదనంగా క్వింటాల్కు రూ. 500 చెల్లిస్తుండటంతో ఈ ఏడాది 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకు సంబంధించి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం విక్రయించారు. క్వింటాల్కు రూ. 500 చొప్పున రూ. 71.6 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.45.85 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా రూ. 25.75 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరో వారం రోజుల్లో పూర్తి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాదివి పెండింగ్.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణతో పాటు డబ్బుల చెల్లింపులు సైతం చకచకా జరిగినప్పటికీ, గత రబీ సీజన్కు సంబంధించిన బోనస్ రూ.31.37 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పటం లేదు. అప్పటి చెల్లింపులు సక్రమంగా జరిగి ఉంటే మరింత మంది రైతులు సన్నాలు సాగు చేసే వారని పలువురు పేర్కొంటున్నారు. -
యూరియాపై ఆందోళన వద్దు
● సాగుకు సరిపడా నిల్వలు ● కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన పడవద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆగ్రో సేవా కేంద్రం, పీఏసీఎస్ను తనిఖీ చేశారు. సంబంధిత కేంద్రాల్లో ఎరువుల నిల్వలపై ఆరా తీయడంతో పాటు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ... అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటికే 12,673 యూరియా జిల్లాకు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అక్టోబర్ నెల నుంచి 28 డిసెంబర్ వరకు 7,343 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జరగగా, ఇంకా జిల్లాలో 5,146 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఫర్టిలైజర్ యాప్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్ ద్వారా రైతులు ఎన్ని బస్తాలు కావాలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్ చారి, కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, ఏఈఓలు, రైతులు ఉన్నారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావొద్దు మెదక్ కలెక్టరేట్: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నా కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా చలి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దుప్పట్లు అందించడం వల్ల వారి ఆరోగ్య రక్షణకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. -
గణితంపై ఆసక్తి పెంచుకోవాలి
మెదక్ కలెక్టరేట్: విద్యార్థి దశలోనే గణితం పట్ల అభిరుచిని పెంచుకోవాలని, ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్రాజ్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. చిన్నప్పుడు టాలెంట్ టెస్ట్లో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతిభా వంతులైన విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులకు సహకరించాలని కోరారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొండల్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
న్యూ జోష్కు రెడీ
తుప్రాన్: 2025కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్ద సిద్ధమయ్యారు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా యువత పార్టీలు, దావత్లు అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొంతమంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ వంటివి చేయొద్దని, హద్దు మీరితే అవస్థలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొంగొత్త ఆశలతో.. కాలగర్భంలో మరో ఏడాది నేటితో గడిచిపోనుండగా కొంగొత్త ఆశలతో నూతన ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్కు కావాల్సిన కేకులు, స్వీట్లు, బిర్యానీలకు గిరాకీ ఉండడంతో మార్కెట్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇళ్ల ముంగిటలో వేసే రంగవల్లులు అబ్బుర పర్చనున్నాయి. ఇప్పటికే కొంతమంది వీటికి కావాల్సిన రంగులను కొనుగోలు చేశారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువర్గంతో సంబురాలు జరుపుకొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు. భలే ఆఫర్లు.. న్యూ ఇయర్ను పురస్కరించుకుని ముందస్తుగానే ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశారు. చికెన్, మటన్, ఫిష్ బిర్యానీలతో పాటు జంబో, ఫ్యామిలీ ప్యాక్లతో ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బుకింగ్ నడుస్తున్నాయి. కేక్లు, స్వీట్ల కొనుగోలుకు గిరాకీ పెరిగింది. మద్యం దుకాణాలు సైతం అదే స్థాయిలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా యువత సంబురాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉండటం విశేషం. 2025కు వీడ్కోలుపలికేందుకు అంతా సిద్ధం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు జాగ్రత్తలు సూచిస్తున్న పోలీసులు -
సాఫ్ట్బాల్ పోటీల్లో మెదక్ జట్టుకు సిల్వర్ మెడల్
మనోహరాబాద్(తూప్రాన్): మూడు రోజులుగా మండల కేంద్రంలో జరుగుతున్న 10వ తెలంగాణ అంతర్ జిల్లా సాఫ్ట్బాల్ అండర్–14 పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. సోమవారం నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. మొత్తం 21 జట్లు క్రీడల్లో పాల్గొనగా నిజామాబాద్ జట్టు గోల్డ్మెడల్, మెదక్ జట్టు సిల్వర్ మెడల్ సాధించాయని, ఉత్తమ ఆటగాడిగా మెదక్ టీంకు చెందిన శ్రీరామ్ ఎంపికై నట్లు తెలిపారు. విజేతలకు గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనూష, జాతీయ సాఫ్ట్బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి శోభన్బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్గౌడ్, నారాయణగుప్తా, ప్రధాన కార్యదర్శి నవీన్కుమార్, మెదక్ జిల్లా యువజన, క్రీడల అధికారి రమేశ్, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, కోశాధికారి గోవర్ధన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాలు పెరిగాయి
● వివిధ కేసుల్లో 8 మందికి జీవిత ఖైదు ● వార్షిక నివేదికను వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు, హత్యలు, అత్యాచారాలతో గతేడాది కంటే ఈఏడాది జిల్లాలో 9.6 శాతం క్రైం రేట్ అధికంగా పెరిగింది. గత సంవత్సరం జిల్లావ్యాప్తంగా 4,871 కేసులు నమోదు కాగా, ఈసారి ఆసంఖ్య 5,388కు పెరిగింది. సోమవారం వార్షిక నివేదికను ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్థిక దోపిడీలు, ఆస్తి హత్యలు, దొంగతనాలు, చైన్స్నాచింగ్, మోసాలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు 29 శాతం తగ్గుదల నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ , ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలతో రోడ్డు ప్రమాద మ రణాలు గణ నీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. గతేడాది డీడీ (ఈఈ) కేసులు 6,500 నమోదు కాగా, ఈ సంవత్సరంలో 11,800 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 2024లో గేమింగ్ యాక్ట్ కింద 38 కేసులు నమోదు కాగా, 265 మంది అరెస్టు చేసి రూ. 9.70 లక్షలు సీజ్ చేశారు. ఈ ఏడాది 73 కేసులు నమోదు చేసి 472 మందిని అరెస్టు చేశారు. రూ. 18 లక్షల 18 వేల నగదు సీజ్ చేశారు. మిస్సింగ్ కేసులు సైతం గతేడాది 397 నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 454కు పెరిగింది. వివిధ కేసుల్లో 8 మందికి జీవిత ఖైదు విధించారు. సంచలనం సృష్టించిన కేసులు కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలోని పైతరకు చెందిన అనిల్ పాత కక్షల నేపథ్యంలో తుపాకి తూటా కు బలయ్యాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి శివా రు ఏడుపాయల దారిలో గిరిజన మహిళా కూలీపై జరిగిన హత్యాచారం సంచలన కేసుగా నమోదైంది. ఈ కేసును పోలీసులు వారం రోజుల్లో చేధించారు. జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలో గల ఐటీసీ కంపెనీలో రూ. 15 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసు సైతం జిల్లాలో సంచలనంగా మారింది. రెండేళ్లలో జరిగిన నేర వివరాలివి.. నేరాలు 2024 2025 హత్యలు 28 30 ఆస్తి హత్యలు 13 04 కిడ్నాప్లు 41 44 అత్యాచారాలు 48 56 రోడ్డు ప్రమాదాలు 636 598 మృతులు 350 247 క్షతగాత్రులు 625 598 సైబర్ నేరాలు 809 762 కోల్పోయిన డబ్బులు 4,28,67,672 3,73,16,252 రికవరీ 2,95,19,044 60,04,588 కట్టడి చేశాం జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పటిష్టమైన బందోబస్తుతో నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాం. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేశాం. జిల్లాలో ఐదు విడతలుగా లోక్ అదాలత్లు నిర్వహించి 1,827 కేసులు పరిష్కరించాం. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడంలో ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాం. ప్రజలు పోలీస్శాఖతో కలిసి పనిచేసినప్పుడే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుంది. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ -
కలిసిరాని కాలం
రైతులకు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు ఎదురయ్యాయి. భారీ వర్షాలు ఆగమాగం చేయగా, చెరువులు, కుంటలు తెగి పంటలు నీటి పాలయ్యాయి. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. సకాలంలో యూరియా దొరకక రైతులు పడరాని పాట్లు పడ్డారు. తీరా పంటలు చేతికొచ్చే సమయంలోనూ వర్షాలు పడటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందజేస్తుండటంతో కొంత ఊరట కలిగింది. – మెదక్జోన్ జిల్లాలో 2025 సంవత్సరం వ్యవసాయానికి కలిసి రాలేదు. యాసంగిలో 2.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా మార్చి, ఏప్రిల్, మేలో కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు సుమారు 1,507 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతి న్నాయి. ఇందులో సింహభాగం వరి కాగా, రెండో స్థానంలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వేలాది కాయలు నేలరాలాయి. నష్టాన్ని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించినా పైసా పరిహారం రాలేదు. ఆగస్టులో ముంచేసింది ఇక వానాకాలంలో 3.26 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన అతిభారీ వర్షాలకు నీటి వనరులు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు తెగిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 10,769 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ధ్వంసం అయినట్లు ఆశాఖ అధికారులు తేల్చి చెప్పారు. వీటిలో 2 వేల ఎకరాలకుపైగా పొలాల్లో ఇసుక మేటలు కప్పేశాయి. ప్రభుత్వం పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ పేరిట ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన బాధిత రైతులకు రూ. 12.27 కోట్లకు పైగా అందాల్సి ఉండగా, ఇప్పటివరకు పైసా మంజూరు చేయలేదు. పంట పొలాల్లో ఇసుక మేటలు భారీగా వచ్చిన వరదలతో 1,200 ఎకరాలకు పైగా పంటపొలాల్లో ఇసుక మేటలు కప్పేశాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోరుబావుల్లో మోటార్లు పడిపోవటంతో మరింత నష్టం జరిగింది. ఇసుక మేటలను తొలగించేందుకు రైతులు ఎకరాకు రూ. 50 నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు చేశారు. ఇది ఎక్కువగా మంజీరా, హల్దీవాగు పరివాహాక ప్రాంతంతో పాటు కామారెడ్డి–మెదక్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు దిగువన గల పోచమ్మరాల్, జక్కన్నపేట, సర్దన, హవేళిఘణాపూర్ తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చెరువులకు మరమ్మతులు కరువు భారీ వరదల కారణంగా తెగిన చెరువులకు మరమ్మతులు చేసేందుకు నేటికీ పైసా విడుదల కాలేదు. దీంతో రాయినిపల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద 3 వేల ఎకరాలు, మెదక్ మండల పరిధి అవుసులపల్లి చెరువు కింద 100 ఎకరాలు, హవేళిఘణాపూర్ పెద్ద చెరువు కింద 220 ఎకరాలు, ఇదే మండలం అనంతసాగర్ ఊర చెరువు వెనకాల 50 ఎకరాల చొప్పున 3,320 ఎకరాలు బీళ్లుగా మారాయి. ఘనపూర్ కింద క్రాప్ హాలిడే! సింగూరు ప్రాజెక్టు పరిధిలో గల పాపన్నపేట మండలం ఘనపూర్ ప్రాజెక్టు కింద 25 వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టు ఉంది. ఏటా రెండు పంటలు సాగవుతుండగా, ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేసి మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు క్రాప్ హాలిడేను ప్రకటించారు. దీంతో అన్నదాతల పరిస్థితి ఈ ఏడాది గోటిచుట్టపై రోకలి పోటులా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది యూ రియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆగస్టులో వరి పంటకు యూరియా వేయాలి. ఆ సమయంలో జిల్లాకు సరిపడా యూరియా రాకపోవటంతో రైతులు రోజులు తరబడి పడిగాపులు కాశారు. యూరియాను సరైన సమయంలో చల్లకపోవడంతో వరి దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో రైతులు నష్టాలు చవిచూశారు. ఆగమైన ఎవుసం రైతులను వెంటాడినప్రకృతి వైపరీత్యాలు జిల్లాలో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు ఇంకా చేతికందని పరిహారం -
యూరియా సరిపడా ఉంది
● రైతులకు అవసరానికి అందిస్తాం ● కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యల్లో భాగంగా ఈనెల 28 నాటికి 12,673 మెట్రిక్ టన్నుల జిల్లాకు చేరుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 7,343 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జరగగా, ఇంకా జిల్లాలో 5,330 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్లో కలెక్టర్ గన్మెన్ ప్రభాకర్గౌడ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రజిత పతకం సాధించగా, కలెక్టర్ అభినందించారు.ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజావాణి కి 64 అర్జీలు అంతకు ముందు జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 64 అర్జీలు సమర్పించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక కొనుగోలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను సాండ్ బజార్లో నిల్వ చేస్తామని తెలిపారు. త్వరలోనే మెదక్లో సైతం సాండ్ బజార్ ప్రారంభిస్తామన్నారు. ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సింగూరు ఖాళీ చేయొద్దు
అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయకుండానే మరమ్మతులకు అవకాశం ఉ న్నందున, మొత్తం ఖాళీ చేయకుండా మరమ్మతుల విషయాన్ని పరిశీలించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అసెంబ్లీలో కోరారు. ప్రాజెక్టు ద్వారా జంట నగరాలతో పాటు ఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాకు తాగునీరు అందుతోందన్నారు. వర్షాకాలంలో పుష్కలంగా నీళ్లు చేరినా దిగువకు వదిలారని పేర్కొన్నారు. మరమ్మతుల కోసం పూర్తిగా ఖాళీ చేస్తే సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నారు. 1.60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఖేడ్ నియోజకవర్గంలో రోడ్లకు నిధులు మంజూరైనా, అటవీశాఖ అనుమతులు రాని కారణంగా చేపట్టని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు పంచాయతీలతో కొత్త మండలాలు ఏర్పాటు చేయగా, 14 పంచాయతీలు ఉన్న తడ్కల్ను మండల కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. -
నీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మెదక్ కలెక్టరేట్: సింగూరు నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని, లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారని తెలిపారు. ప్రతి పంటకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వానాకాలం నష్ట పరిహారం ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్రెడ్డిని పరామర్శించారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లతో పాటు నాయకులు ఉన్నారు. సాగు నీరు విడుదల చేయలేం జిల్లాలో యాసంగికి సింగూరు నీరు విడుదల చేయలేమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగూరు పాజెక్టు మరమ్మత్తుల దృష్ట్యా ఘనపూర్ ఆనకట్టకు సాగునీరు విడుదల చేయ లే మని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు గమనించి సహకరించాలని కోరారు. మరింత సమాచారం కోసం 7093604017, 8977750785 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ముక్కోటికి నాచగిరి ముస్తాబు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం, వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలోని వేంకటేశ్వరాలయాలు ‘ముక్కోటి’ ఏకాదశి పర్వదిన వేడుకలకు ముస్తాబయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ముక్కోటి మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని నాచగిరి చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ విజయరామారావు పేర్కొన్నారు. వర్గల్ కోవెలలో.. వర్గల్ వేంకటేశ్వరాలయంలో తెల్లవారుజాము 3.00 గంటలకు అభిషేకం, 5.30 గంటల వరకు అలంకార సేవ, 5.45 గంటల వరకు ఉత్తర ద్వార పూజ, 6.00 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి తులసి అర్చన, పంచసూక్త పారాయణాలు జరుగుతాయని ఆలయ మేనేజర్ రఘుపవన్రావు తెలిపారు.వర్గల్లోని వేంకటేశ్వరాలయం -
పల్లెల్లో జీవనోపాధి కేంద్రాలు
● ఉపాధి నిధులతో వర్క్షెడ్ల నిర్మాణం ● భవనానికి రూ. 10 లక్షల కేటాయింపు ● ఉత్తర్వులు, మార్గదర్శకాలుజారీ చేసిన ప్రభుత్వంపెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. గ్రామీణ మహిళల కోసం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఉపాధి హామీ పథకం (వీజీ– జీరాంజీ) ద్వారా ప్రతీ గ్రామంలో రూ.10 లక్షలతో వర్క్షెడ్ల నిర్మాణానికి అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 13,256 ఎస్హెచ్జీ గ్రూపులు ఉండగా, 1,37,256 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికి జిల్లాలోని 902 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు కుట్టే పనితో పాటు పలు పథకాల కింద మహిళలకు స్వయం ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తోంది. మహిళా సంఘాలు టెస్కో ద్వారా వచ్చిన వస్త్రాలను సంఘం సభ్యుల ద్వారా కుట్టి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ విధానంలో పలు సమస్యలు రావడంతో మహిళా సమాఖ్యలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో పాటు పలు అంశాలపై ప్రభుత్వం కసరత్తు నిర్వహించి దుస్తులు కుట్టడంతో పాటు ఆహార శుద్ధి, ఇతర జీవనోపాధి అవకాశాలను అందించేందుకు వర్క్షెడ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ప్రతీ గ్రామంలో ఏర్పాటు జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామంలో మహిళా సమాఖ్య సభ్యులకు వర్క్షెడ్లు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. 200 చదరపు గజాల స్థలంలో భవనం నిర్మించనున్నారు. ఇందులో విశాలమైన హాల్తో పాటు టాయిలెట్లు, రెండు తలపులు, 6 కిటికీలు, ఆరు సీలి ంగ్ ఫ్యాన్లు, 8 ట్యూబ్లైట్లు, 7 ఫ్లోర్సెంట్ లైట్లు ఉండాలని సూచించింది. ఈ భవన నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధులను వినియోగించనున్నారు. గ్రామసభల తీర్మానం తప్పనిసరి ప్రతీ గ్రామంలో వర్క్షెడ్ల నిర్మాణానికి గ్రామసభల తీర్మానం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్షెడ్ల నిర్మాణం కోరుతూ మహిళా సమాఖ్యలు పంచాయతీకి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తీర్మానాలను ఎంపీడీఓకు అందజేయాలి. వారు స్థల పరిశీలన అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల ద్వారా కలెక్టర్కు సమర్పిస్తారు. కలెక్టర్ ఆదేశానుసారం ఉపాధి హామీ సామగ్రి వాటా నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్క్షెడ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ భవనాలు నిర్మితమైతే మహిళా సమాఖ్య సభ్యులకు గ్రామాల్లోనే ఉపాధి దొరుకుతుంది. -
వృథాగా జలం..
పట్టించుకోరేం.. మండలంలోని నారాయణపూర్లో తాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామ ప్రధాన రహదారి వద్ద ఉన్న బోరు మోటార్ నుంచి సమీప ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మిగితా సమయంలో బోరు మోటార్ను ఆఫ్ చేసేవారు లేకపోవడంతో రోజంతా తాగునీరు మురికి కాలువ పాలవుతోంది. అధికారులు, పంచాయతీ పాలకవర్గం సైతం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్టార్టర్ బోర్డు ఏర్పాటు చేసి నీరు వృథా అవ్వకుండా అరికట్టాలని కోరుతున్నారు. – నర్సాపూర్ రూరల్ -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
పెద్దశంకరంపేట(మెదక్): నూతన సర్పంచ్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలో ఇటీవల నూతనంగా గెలిచిన పలువురు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అధ్వర్యంలో హరీశ్రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా ఆయన నూతన ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు సురేశ్గౌడ్, సత్యనారాయణ, అంజయ్య, రవీందర్, కృష్ణ, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా మారుతిరెడ్డి నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది మారుతిరెడ్డిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖతో పాటు తన నియామకానికి కృషి చేసిన వారికి మారుతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి సంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొ ని మాట్లాడారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. న్యాయబద్ధమైన ఉద్యమానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జిల్లా అవుట్ సో ర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు ప్రకాశ్నాయక్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయా ల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఐక్యంగా పోరాటం చేద్దామన్నా రు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం జిల్లా జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మనోహరాబాద్(తూప్రాన్): వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన పలు పార్టీల నాయకులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు వెంకటేశ్గౌడ్, పాలాట సర్పంచ్ సా యిగౌడ్, సీనియర్ నాయకులు పురం మహేశ్, అర్జున్, భిక్షపతి, కుమార్గౌడ్, నాగభూషణం, పర్శరాంగౌడ్, కృష్ణగౌడ్, సాయి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు
మెదక్జోన్: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాందాస్ చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ తల్లి లాంటిదన్నారు. స్వాతంత్య్ర పోరాటం, దేశ నిర్మాణంలో ఎనలేని పాత్ర ఉందని కొనియాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీపీసీసీ పరిశీలకులు శ్రవణ్కుమార్, వ రప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కాగా జిల్లా కమిటీ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చంద్రపాల్, సుప్రభాత్ రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అధికార దాహం ఎక్కువ నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి పదవి ఆకాంక్ష, అధికార దాహం ఎక్కువని డీసీసీ అద్యక్షుడు ఆంజనేయులుగౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన తల్లిలాంటి కాంగ్రెస్కు మోసం చేసి బీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆ పార్టీ నాయకులు ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొందరు నాయకులు ఇతర పార్టీ నాయకులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని పార్టీకి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
‘హక్కుల కోసం పోరాటం’
పటాన్చెరు టౌన్: ఐక్య పోరాటాల సారధి సీఐటీయూ అని సంఘం జిల్లా కోశాధికారి రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగిన సీఐటీయూ కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో నాయకులు శేషగిరి, త్రిమూర్తులు, జయకుమార్, చంద్రకిరణ్ సింగ్, శ్రీనివాస్, నారాయణ, రాజు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న సాఫ్ట్బాల్ పోటీలు మనోహరాబాద్(తూప్రాన్): మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, హన్మకొండ, హైదరాబాద్, మంచిర్యాల, ని ర్మల్ జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. -
వరినాట్లపై చలి పంజా
మెదక్జోన్: అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజు లుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లావ్యాప్తంగా రబీలో 3,17,380 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,95,200 ఎకరాల్లో వరి, 22,180 ఎకరాల్లో కూరగాయలతో పా టు ఆరుతడి పంటలు సాగు కానున్నట్లు పేర్కొన్నారు. కాగా జిల్లాలో చెప్పుకోదగిన సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో బోరుబావుల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కాగా ముందుగా నాట్లు వేస్తే బోరుబావుల్లో నీటి ఊటలు తగ్గక ముందే మార్చిలో పంటలు చేతికందుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే 40 వేల ఎకరాల్లో వరిసాగు చేసినట్లు సమాచారం. అయితే వేసిన నాట్లు ఏ మాత్రం ఎదగకపోగా, చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేస్తే చనిపోతున్నాయని వాపోయారు. మళ్లీ దున్ని నాట్లు వేద్దామంటే నారు లేదని, మళ్లీ తుకాలు పోద్దామంటే పుణ్యకాలం గడిచిపోతుందని ఆవేదన చెందుతున్నారు. ఎదుగుదల లేక దెబ్బతింటున్నపంటలు యాజమాన్య పద్ధతులుపాటించాలంటున్న అధికారులు -
ఎమర్జెన్సీ తర్వాత కష్టకాలంలో ఇందిరాగాంధీని అక్కున చేర్చుకొని అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించి.. దేశానికి ప్రధానిని అందించిన ఘనత మెతుకుసీమది. చల్లబడ్డ తెలంగాణ వాదాన్ని రగిలించి.. రాష్ట్ర సిద్ధి కోసం సోపానాలు పరిచిన పోరాట పటిమ ఇక్కడి ప్రజల సొంతం. అందుకే
● కాంగ్రెస్కు కలిసొచ్చినపంచాయతీ ఎన్నికలు ● సమరోత్సాహంలో బీఆర్ఎస్ ● ఉనికి చాటుకున్న బీజేపీ పల్లెల్లో కాంగి‘రేసు’ 2025 ఆరంభంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. 25 డిసెంబర్ 2024న సీఎం రేవంత్రెడ్డి మెదక్ పర్యటనలో భాగంగా చర్చి, ఏడుపాయలను సందర్శించి సుమారు రూ. 58 కోట్ల నిధులను మంజూరు చేయడంతో కేడర్లో ఉత్సాహం పెరిగింది. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాజయం ఎదురైంది. పార్టీ బలపరిచిన నరేందర్రెడ్డి పరాజయం పాలయ్యారు. రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, జీవన్రావు, ఎమ్మెల్యే సొంత గ్రామానికి చెందిన రంగారావు తదితరులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. మెదక్ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్లో కలపడంతో వీహెచ్పీ, బీజేపీ, బీఆర్ ఎస్లు ఆందోళనకు దిగాయి. జిల్లాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఎన్నిక సమయాన, కాంగ్రెస్లో లుకలుకలు బయటపడ్డాయి. మెదక్ మండలం జానకంపల్లి శివారులోని హల్దీ వాగు నుంచి కాంగ్రెస్ నాయకుల అండతో పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. అక్రమ వ్యాపారులు ఇటాచీలు, టిప్పర్లు సర్దుకొని తోక ముడిచారు. ఖరీఫ్లో బోనస్ చెల్లింపు, పార్టీ ప్రతిష్టను పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం 2025 ఇచ్చిన గిఫ్ట్గా భావించవచ్చు. మొత్తం 492 పంచాయతీల్లో 248 సర్పంచ్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవటంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నాయకులు కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. కారులో వర్గపోరు బీఆర్ఎస్కు కంచుకోటగా విరాజిల్లిన మెదక్ ఖిల్లాలో హస్తం హవా వీస్తుంది. 2025 పార్టీకి మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. పార్టీలో ఇరువురు నాయకుల మధ్య ఉన్న వర్గపోరు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తుంది. ఆ ఇద్దరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా విడివిడిగానే ఉంటున్నారు. ఒక వేళ కలిసినా, ఎడముఖం, పెడముఖంగానే వ్వవహరిస్తున్నారు. బహిరంగా సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యేనంటూ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్వరం పెంచడం అయోమయానికి దారి తీస్తుంది. యూరియా ఆందోళనలో బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంది. రుణమాఫీ, బోనస్ చెల్లింపుపై మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, పద్మారెడ్డి, శశిధర్రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జరిపిన ఆందోళన ప్రజల్లో చైతన్యం రగిలించింది. గత నెలలో జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించి పార్టీని ఇరకాటంలో పెట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్రావుపై చేసిన విమర్శలు గందరగోళం సృష్టించాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 172 పంచాయతీలు గెలుచుకొని కాంగ్రెస్కు గట్టి పోటీనిచ్చింది. మూడో విడత ఎన్నికల్లో 84 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది. హల్దీ నుంచి ఇసుక అక్రమ రవాణాను ఆందోళన ద్వారా అడ్డుకోగలిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆందోళన నిర్వహించింది. కాగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి స్వగ్రామం కోనాపూర్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోవడం కొసమెరుపు. మెతుకుసీమలో కమలం వాడింది. 2025లో పార్టీ ఉనికి చాటుకోవడానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మల్క కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించడం పార్టీకి పెద్ద ఊరటగా భావించవచ్చు. ఫిబ్రవరిలో వాల్దాస్ మల్లేశ్గౌడ్ను జిల్లా పార్టీ అధ్య క్షుడిగా నియమించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరించలేకపోతున్నారు. కొంతమేర ఆందోళనలు నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందనే ప్రచారం ఉంది. కాగా పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల కనీసం పోటీకి దిగే సాహసం చేయక పోవడం, పార్టీ కేడర్ బ లహీనతను తెలియజేసింది. జిల్లాలో కేవలం 17 చోట్ల మాత్రమే విజయం సాధించింది. రెండు, మూడో విడత ఎన్నికల్లో మాత్రమే ఉనికి చాటుకుంది. కమలం.. కకావికలం -
జీవాలకు టీకాలు తప్పనిసరి
మనోహరాబాద్(తూప్రాన్): జీవాలకు సీజనల్ వ్యాధులు రాకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య సంచాలకుడు వెంకటయ్య అన్నారు. శనివారం మ ండలంలోని కాళ్లకల్లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జీవాలకు మందుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు సర్పంచ్ నవ్య నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తూప్రాన్ ఉమ్మడి మండల పశు వైద్యాధికారి లక్ష్మి, ఉప సర్పంచ్ ప్రవీణ్, సిబ్బంది రవి, మల్లేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): ‘మన నాయకుడిని తెలుసుకోండి ’కార్యక్రమం పేరిట ఎంపికై న చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి శివ చైతన్య శనివారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో పదో తరగతి చదవుతున్న శివ చైతన్య ఎన్సీఈఆర్టీ ద్వారా ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, జిల్లా నుంచి ఒకే విద్యార్థి ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు పార్లమెంట్ ప్రతినిధి శివచైతన్యకు బహుమతి అందజేశారు. గైడ్ టీచర్గా కిషన్ ప్రసాద్ వ్యవహరించారు. -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అభివృద్ధిలో వెనకబడిన మెతుకుసీమ వడివడిగా పురోగతి దిశగా సాగుతోంది. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు సుమారు రూ. 1,400 కోట్ల పైచిలుకు నిధులు విడుదల అయ్యాయి. వీటితో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. – మెదక్జోన్కొనసాగుతున్న మెదక్ – సిద్దిపేట రహదారి పనులు మెదక్ నుంచి సిద్దిపేట వరకు 67 కిలోమీటర్ల 765 (డీజీ) రెండు లేన్ల రోడ్డు నిర్మాణం కోసం రూ. 800 కోట్లు మంజూరు కాగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్, పాతూర్, అక్కన్నపేటలో పనులు చేయాల్సి ఉంది. అలాగే రామాయంపేట అటవీ ప్రాంతంలో కొంతమేర పనులు నిలిచిపోయాయి. అలాగే రామాయంపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రూ. 205 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ చర్చి అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు కాగా, పనులు కొనసాగుతున్నాయి. ఏడుపాయల కమాన్ నుంచి ఆలయం వరకు 7 కిలో మీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరయ్యాయి. అలాగే మెడికల్ కాలేజీ భవనం, వసతి గృహ నిర్మాణాలకు రూ. 180 కోట్లు, నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు కాగా, ఇటీవల టెండర్ ప్రక్రి య సైతం పూర్తి అయింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు పనులు ప్రారంభించారు.రూ. 1,400 కోట్లు మంజూరు మెడికల్, నర్సింగ్ కాలేజీలనిర్మాణ పనులు ప్రారంభం నాలుగు లేన్ల రోడ్లతోతీరనున్న ఇబ్బందులుఆర్వోబీకి అడుగులు చేగుంట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి రూ. 47 కోట్లు మంజూరు కాగా, ఇటీవల విద్యుత్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, అటవీ, పీఆర్, పోలీస్శాఖల అధికారులతో కలిసి ఎంపీ రఘునందన్రావు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనాల రూటు మళ్లించి పనులకు ఎలాంటి ఆటంకం కాకుండా చర్యలు చేపడుతున్నారు. చేగుంట వద్ద రైల్వేగేట్ పడిన ప్రతీసారి వాహ నాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. అలాగే నేషనల్ హైవే (44) వడియారం బైపాస్ రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 30 కోట్లు మంజూరయ్యా యి. కాగా టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఏడాదిలో మెతుకుసీమకు నిధుల వరద -
విద్యార్థులు ఇష్టంగా చదవాలి
చిలప్చెడ్(నర్సాపూర్): విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని డీఈఓ వి జయ అన్నారు. శనివారం మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల కేజీబీవీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్నిరంగాల్లో ముందుకు సాగాలన్నారు. ఎంఈఓ విఠల్ మాట్లాడుతూ.. కేజీబీవీలో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ అఖిల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.పనుల్లో వేగం పెంచండి చిలప్చెడ్(నర్సాపూర్): సబ్స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విద్యుత్శాఖ ఈఈ (సివిల్) సుకుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చండూర్ శివారులో నిర్మి స్తున్న సబ్స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చేనెల 15 వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఎలాంటి లోపం జరగకూడదని ఆదేశించారు. ఆయన వెంట చిలప్చెడ్ విద్యుత్శాఖ ఏఈ రాకేశ్, కాంట్రాక్టర్ విష్ణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ. 2.01 కోట్లు పాపన్నపేట(మెదక్): ఏడుపాయలలో శనివారం సీల్డ్, బహిరంగ టెండర్లు నిర్వహించగా రూ. 2.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానం వద్ద కొబ్బరికాయలు విక్రయించేందుకు రూ. 1,10,30,000 కోట్ల పాట పాడి ధరంకర్ లింగాజి, అమ్మవారి ఒడి బియ్యం రూ. 91 లక్షలకు జనార్దన్రెడ్డి టెండర్ కై వసం చేసుకున్నా రు. కాగా దేవస్థానం వద్ద పూజా సామగ్రి, జాతరలో ఎగ్జిబిషన్ నిర్వహణకు వేలంలో ఎవ రూ పాల్గొనకపోవటంతో వాయిదా వేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుధాకర్రెడ్డి, ప్రధాన అర్చకులు శంకరశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. కోతుల బెడదకు.. చింపాంజీ వేషం కౌడిపల్లి(నర్సాపూర్): మండల పరిధిలోని తిమ్మాపూర్లో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్పంచ్ వెంకటమ్మ వినూత్నంగా ఆలోచించింది. శనివారం ఓ వ్యక్తికి చింపాంజీ వేషం వేయించి గ్రామంలో కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిప్పింది. దీంతో కోతులు భయంతో పారిపోయాయి. కోతులు గ్రామంలోకి తిరిగి వస్తే ఇదే ప్రణాళికను అమలు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మెదక్ మున్సిపాలిటీ: నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రజలంతా పోలీసుశాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈనెల 31 రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
ఎస్పీ శ్రీనివాసరావురామాయంపేట(మెదక్): అసాంఘిక కార్యకలాపా లు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం సాయంత్రం రామాయంపేట పోలీస్స్టేషన్ ను సందర్శించి మాట్లాడారు. ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, మహిళల భద్రత, షీటీం సేవలు, మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల నుంచి పూర్తిస్థాయి సమాచారం సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకట్రాజాగౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, ఎస్ఐ బాల్రాజ్ ఉన్నారు. -
అర్హులకు డబుల్ ఇళ్లు పంపిణీ చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్ రూరల్: నెల రోజుల్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం నర్సాపూర్ చౌరస్తా వద్ద రాస్తారోకోకు దిగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పట్టణానికి 500 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 252 ఇళ్లు పూర్తి కాగా, మరో 248 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని పలుమార్లు కలెక్టర్, మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. ఫలితం లేకపోవడంతో ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూంలను అర్హులైన పేదలకు పంపిణీ చేయకుంటే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయీమోద్దీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, నాయకులు సత్యంగౌడ్, ప్రసాద్, ఆంజనేయులుగౌడ్, ఆనంద్, రాంచందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
‘కొండ’ంత సమస్యలు
కొండపోచమ్మ జాతర సమీస్తున్నా ఏర్పాట్లు ఏవీ?గజ్వేల్: తెలంగాణలోనే ప్రసిద్ది చెందిన కొండపోచమ్మ ఆలయం వద్ధ భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. జనవరి 15నుంచి మార్చి 19వ తేదీ వరకు ఆలయంలో జాతర జరగనుండగా లక్షలమందికి అమ్మవారికి చెంతకు వస్తారు. ఇంతటి ప్రాఽ దాన్యత కలిగిన ఆలయానికి ఇప్పటివరకు కమిటీ వేయకపోగా, ఏర్పాట్లపై సన్నాహాలు మొదలుకాలేదు. వాహనాల పార్కింగ్కు మొదలుకొని అన్నీ సమస్యలే. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పిన పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. కొమురవెల్లి మల్లన్న, జగదేవ్పూర్ మండలం తీగుల్–నర్సాపూర్లో కొలువుదీరిన కొండపోచమ్మలు అన్నాచెల్లెళ్లని పూర్వకాలం నుంచి చరిత్ర చెబుతోంది. అన్నపై అలిగి... కొండపోచమ్మ తీగుల్నర్సాపూర్ గుట్టల్లో దాక్కోగా.. వెతుక్కొని వచ్చి సోదరిని బుజ్జగించిన మల్లన్న.. ఆమె కోరిక మేరకు వరమిస్తాడు. తనను దర్శించుకునే ప్రతి భక్తుడు నీ వద్దకు కూడా వస్తాడని అభయమిస్తాడు. అదే తరహాలో నేడు కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయా లు వెలుగొందుతున్నాయి. కొమురవెల్లిని దర్శించే ప్రతి భక్తుడు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కమిటీ ఏదీ..? ఈ ఆలయానికి ఇటీవల కాలం వరకు ఉన్న రెనోవేషన్ కమిటీ గడువు అక్టోబర్ 19నాటికి ముగిసింది. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటు ఊసే లేదు. జాతర సమీపిస్తున్న వేళ ఏర్పాట్లపై కనీసం సన్నాహాలు కూ డా మొదలుకాకపోవడం ఆలయంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఆలయానికి దాతలు సమకూర్చిన కొన్ని గదుల్లో తప్పా మిగితా చోట్ల ఎక్కడా తాత్కాలికంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఖాళీ స్థలాల్లో ఉండే భక్తులకు మల విసర్జనకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్గా కూడా సౌకర్యం లేకపోవడంతో భక్తులు వాహనాలు తీసుకుని కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. -
అదనపు డబ్బులు చెల్లించాల్సిందే
మెదక్ కలెక్టరేట్: లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆశవర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ అధికారులు ఆశవర్కర్లతో అదనపు పనులు చేయించుకుంటున్నారని, డబ్బులు విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అదనపు పనికి, అదనపు డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం ఆశవర్కర్లను మోసం చేయాలని చూస్తుందన్నారు. నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న పల్స్పోలియో, స్థానిక ఎన్నికల డ్యూటీ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి ఆదివారం, పండగలకు సెలవులు ఇవ్వాలన్నారు. ఫిక్స్డ్ వేతనం రూ.18,000తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంతోశ్, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
మనోహరాబాద్(తూప్రాన్): క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో 10వ అంతర్జిల్లా అండర్ 14 సాఫ్ట్బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడల్లో పాల్గొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్బాల్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ శోభన్బాబు, రాష్ట్ర సెక్రటరీ నవీన్కుమార్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, ఒలింపిక్ అబ్జర్వర్ కరణం గణేశ్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, శ్యాంసుందర్శర్మ, వెంకటేశం, రేణుక, వాసు, అభిషేక్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలను నియంత్రించాలి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు, యువత భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి మానసిక వైద్య నిపుణులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గంజాయి, మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్లబ్ ఏర్పాట్లు ఇతర వివిధ రకాల పద్ధతుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్రగ్స్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పా టు చేశామన్నారు. ఇన్పేషెంట్ సేవలకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గురుకులాలు, వసతిగృహాలు, అన్ని విద్యాసంస్థల్లో ప్రహరీ, కారిడార్లు, పరిసరాలు స్పష్టంగా కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బెల్ట్ షాపులు, గుడుంబా స్థావరాలపై పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం గొల్లపల్లి–ఉదయపూర్ ఉపసర్పంచ్ భూపాల్, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు కనకయ్య, వార్డు మెంబర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలతో బీజేపీ గ్రామస్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అ ధ్వానంగా తయారయ్యాయని వాపోయారు. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కంచుకోట బద్దలు కొట్టాం
● హరీశ్ను ఓడించేందుకు తానే బరిలోకి దిగుతా.. ● మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజాంపేట(మెదక్): పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టామని, త్వరలో హరీశ్రావును ఓడించేందుకు తానే స్వయంగా బరిలోకి దిగుతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు సర్పంచ్లు కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో కాంగ్రెస్ను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. హరీశ్రావు సీఎం కావాలని ఆశలు పెట్టుకున్నాడన్నారు. గత ప్రభుత్వంలో 90 శాతం సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కులాలతో రాజకీయం చేయొద్దన్నారు. నిజాంపేట మండలంలో మంచి మెజార్టీ సాధించినట్లు పేర్కొన్నారు. నూ తన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు జన జాతరే
భక్తులతో కిటకిటలాడుతున్న చర్చి ప్రాంగణం మెదక్ కలెక్టరేట్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు రెండో రోజు ఘనంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మందితో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యువతీ, యువకులు సెల్ఫీలతో సందడి చేశారు. మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులు -
రైతులు ఇబ్బంది పడొద్దు
● వచ్చే యాసంగి నాటికిపంట కాల్వల నిర్మాణం చేపట్టాలి ● అధికారులతో మాజీమంత్రి హరీశ్రావుసిద్దిపేటజోన్/చిన్నకోడూరు: వచ్చే యాసంగి నాటికి శాశ్వత పంట కాల్వల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారితో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళికలను చేపట్టకపోవడంతో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తన సొంత డబ్బులతో తాత్కాలిక కాల్వలు తీసి సాగు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి అవసరమైన భూసేకరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. ఇర్కోడ్, చందలాపూర్లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలన్నారు. నియోజకవర్గ పరి ధిలోని పెండింగ్ చెక్ డ్యాం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈలు గోపాల్కృష్ణ, శంకర్, డీఈ చంద్రశేఖర్, అధికారులు శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నకోడూరు రైల్వేస్టేషన్ నిర్మాణంతో పాటు విఠలాపూర్ వరకు రైల్వేలైన్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. -
కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం తప్ప, సంక్షేమ పథకాలపై ధ్యాస లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసి 37 వేల ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, ఈ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. గ్రామస్థాయిలో కొత్త సర్పంచ్లు రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సింగూరు మరమ్మతుల పేరుతో 30 నుంచి 40 వేల ఎకరాలకు సాగు నీరు వదులుతారో..? లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. కొత్తగా యూరియా యాప్ తెచ్చి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారి పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర మాజీ అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్రావు, నాయకులు రవి, రమేశ్, వీరేందర్, అర్జున్తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దాం
చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవా రం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సభ్యులు మల్లేశం, బాలమణి, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్రావు జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్ కాలనీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రమాకాంత్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ నాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యా యం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాండురంగారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత చట్టాలనే పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దేశవ్యాప్త నిరసనలో భాగంగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంపదను దోచి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


