-
వెల్లివెరిసిన ఓటరు చైతన్యం
రాష్ట్రంలోనే అత్యధికంగా జహీరాబాద్ సెగ్మెంట్లో పోలింగ్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఓటర్ల చైతన్యం వెల్లువిరిసింది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, ఓటర్లు అప్పటికే కేంద్రాలకు తరలివచ్చారు. క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించినప్పటికీ.. ఈ సౌకర్యం కోసం నమోదు చేసుకోని వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటేశారు. వాతావరణం కూడా అనుకూలించడం, ఎండల తీవ్రత కాస్త తగ్గడం కూడా ఓటింగ్శాతం పెరగడానికి కారణమైంది. జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించింది. పలు కేంద్రాల వద్ద వెబ్క్యాస్టింగ్ నిర్వహించారు. కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎన్నికల బందోబస్తును ఎస్పీ చెన్నూరి రూపేష్ పర్యవేక్షించారు. మొత్తం మీద జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి చేరువలో.. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50 శాతం దాటింది. సాయంత్రం 5 గంటల వరకు 71.91 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే వరకు సుమారు 80 శాతానికి చేరువలో పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి పోలింగ్ శాతం మంగళవారం ప్రకటిస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. -
No Headline
మెదక్జోన్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 5 గంటలకే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన సిబ్బంది 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు. ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట గంటకు ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారందరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి 7 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ సాగింది. జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ సతీసమేతంగా హవేళిఘనాపూర్ మండలం ఔరంగాబాద్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్పీ బాలస్వామి మెదక్ బాయ్స్ కళాశాలతో పాటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా 2019లో మెదక్ పార్లమెంట్ పరిధిలో 71.77 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 73.63 శాతం నమోదు అయింది. అయితే మొత్తంగా ఎంతశాతం అన్నది అధికారులు ధృవీకరించాల్సి ఉంది. చెదురు మదురు ఘటనలు ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. నర్సాపూర్ మండలం బ్రహ్మణపల్లిలోని 164 పోలింగ్స్టేషన్లో అదే గ్రామానికి చెందిన మంగళి గణేష్ ఓటు వేసి అధికారుల కళ్లు గప్పి తన సెల్ఫోన్లో చిత్రీకరించి పలు వాట్సాప్ గ్రూపుల్లో వీడియో షేర్ చేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. అలాగే శివ్వంపేట మండలం మల్లుపల్లి గిరిజన తండాలో ప్రత్యేకంగా పోలింగ్స్టేషన్ ఏర్పాటు చేయాలని, అప్పటివరకు ఓటు వేయమని తండా వాసులు తేల్చిచెప్పారు. రెండు కిలోమీటర్ల దూరంలో గల మల్లుపల్లికి వచ్చి ఓటు వేయాల్సి వస్తుందని వాపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈసారి ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయడం కుదరదని, వచ్చే ఎన్నికల్లో ఏర్పాటుచేస్తామని నచ్చచెప్పడంతో శాంతించి ఓటు వేశారు. మెదక్ పట్టణంలోని పిట్లంబేస్ పరిధిలో గల 581, 161 పోలింగ్ కేంద్రాల సమీపంలో బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని, పలువురిని పట్టణ పోలీసులు స్టేషన్కు తరలించారు. కొంత సేపటి తర్వాత సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. పట్టణానికి చెందిన మరో బీఆర్ఎస్ కార్యకర్త ఓ పోలింగ్ బూత్ దగ్గర కండువా కప్పుకుని ప్రచారం చేస్తున్నాడనే ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఓటేసిన ప్రముఖులు ప్రముఖులు వారి వారి స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తన స్వగ్రామమైన చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కౌడిపల్లి మండల కేంద్రంలో, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి శివ్వంపేట మండలం గోమారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మ రామాయంపేట మండలం కోనాపూర్లో ఓటు వేశారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దంపతులు పట్టణంలోని పెద్దబజార్లో గల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలోని పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. శివ్వంపేట మండలం 260 పోలింగ్స్టేషన్లో ఉదయం అరగంట పాటు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. టెక్నిషియన్స్ మరమ్మతులు చేసిన తర్వాత పోలింగ్ కొనసాగింది. అలాగే నర్సాపూర్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో అరగంట పాటు, చేగుంట మండలం కర్నాన్పల్లిలోని పోలింగ్ కేంద్రం, నార్సింగి మండల కేంద్రంతో పాటు నార్సింగి మండలం వల్లూరులో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. -
ఓటింగ్ సరళిపై అభ్యర్థుల ఆరా
నర్సాపూర్: పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును అభ్యర్థులు తమ పార్టీ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అధికారులతో మాట్లాడి పోలింగ్ శాతం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే బయట ఓటు వేసేందుకు నిరీక్షిస్తున్న ఓటర్లను కలిసి తనను పరిచయం చేసుకున్నారు. పట్టణంలోని రెండు బూత్లలో ఈవీఎంలు మొరాయించాయని నాయకులు చెప్పగా అధికారులతో మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సైతం నాయకులతో కలిసి పోలింగ్ శాతం తెలుసుకున్నారు. ఎన్నికల అధికారులతో మాట్లాడి ఈవీఎంలు త్వరగా మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, బాల్రెడ్డి, రాజేశ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు నర్సాపూర్లోని పలు పోలింగ్ బూత్ల వద్ద తమ పార్టీ నాయకులతో పోలింగ్ సరళిపై చర్చించారు. పోలింగ్ సరళిని, పట్టణంలో పార్టీ పరిస్థితులను ఆ యనకు నాయకులు వివరించారు. అయితే పోలింగ్ కేంద్రాల్లోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల వెంట ఎక్కువ సంఖ్యలో రాజకీయ నాయకులు వెళ్లిన విషయాన్ని స్థానిక ఎస్ఐ పుష్పరాజ్ వద్ద ప్రస్తావించగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ బూత్ లోనికి పాస్ లేని వారిని అనుమతించలే దని తెలిపారు. -
12 స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపు
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట(అందోల్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్లోని 196 పోలింగ్ కేంద్రంలో తన కూతురు త్రిషతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ప్రజలు దేశంలో కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరుగ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య తదితరులు ఉన్నారు. అంతా ఓకేనా.. టేక్మాల్(మెదక్): ఎన్నికల సందర్భంగా సోమ వారం టేక్మాల్కు వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ కార్యకర్తలతో మాట్లాడి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, నాయకులు మాన్కిషన్, సుధాకర్, కిషోర్, మజహర్, సాగర్, పాపయ్య, భిక్షపతి, కిష్టయ్య, రాజు, శివాగౌడ్, దు ర్గయ్య, అంజయ్య, అనిల్ తదితరులు ఉన్నారు. -
అంతా సజావుగానే: ఎస్పీ
వెల్దుర్తి(తూప్రాన్): పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని ఎస్పీ బాలస్వామి తెలిపారు. సోమవారం వెల్దుర్తిలో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఎస్సై నవతగౌడ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుమారు 1600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర పారా మిలిటరీ బలగాలను మోహరించామన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పెద్దశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, డీఎస్ఓ బ్రహ్మంరావు, జిల్లా సహకార అధికారి కరుణ తెలిపారు. సోమ వారం మండలంలోని రామోజీపల్లి, వీరోజిపల్లి, కొత్తపేట, పెద్దశంకరంపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుకు గురై మృత్యువాత పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అకాల వర్షాలకు రైతు లు ఆందోళన చెందవద్దని, చివరి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు పీఏసీఎస్ సీఈఓ రవీందర్ తదితరులు ఉన్నారు. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ మెదక్ కలెక్టరేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం జిల్లాలో జరిగిన పోలింగ్ పరిశీలనకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన ఓటర్లకు, ప్రజలకు, భాగస్వాములైన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులను అభినందించారు. రైతన్నకు అకాల కష్టం కౌడిపల్లి(నర్సాపూర్): అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో మండలంలోని వివిధ గ్రామాల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. పంటపొలాల్లో ఉన్న ధాన్యం కుప్పల చుట్టూ వర్షం నీరు చేరింది. దీంతో రైతులు పాదులు తీసి నీటిని తొలగించారు. తడిసిన ధాన్యం బస్తాలను రైతులు ఆరబెట్టారు. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. -
సభ హైలెట్స్
● 7.30 గంటలకు కేసీఆర్ నర్సాపూర్ చౌరస్తాకు చేరుకున్నారు. ● కేసీఆర్ బస్సుపైకి చేరుకోగానే కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ● 7.35 గంటల నుంచి 7.55 గంటల వరకు మాట్లాడారు. ● M>Æý‡²ÆŠḥ Ò$sìæ…-VŠæÌZ MóSïÜBÆŠ‡ JMýSPÆó‡ {ç³çÜ…W…^éÆý‡$. ● పక్కన ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ● మాజీ మంత్రి హరీశ్రావు కళాకారుల వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ● సాయత్రం 5:30 గంటల నుంచే జనాలు తరలివచ్చారు. ● చౌరస్తా వద్ద ఉన్న పలు బిల్డింగ్ల పైనుంచి కార్యకర్తలు, ప్రజలు కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. – నర్సాపూర్ రూరల్/శివ్వంపేట -
మల్లన్న జలాలతో సిరులే..
నర్సాపూర్/నర్సాపూర్రూరల్: మల్లన్నసాగర్ కాలువల ద్వారా సాగు నీరు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ను లింకు చేయడానికి శంకరంపేట నుంచి కాలువల తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పా రు. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీరు రావడం మొదలైతే నర్సాపూర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. కాలువల నిర్మాణం పూర్తయి నీళ్లు రావాలంటే మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. మనమంతా కలిసి యుద్ధం చేస్తేనే ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలిచినప్పటి నుంచి కాలువల నిర్మాణంలో స్పీడ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. నర్సాపూర్ పొలాలు గోదావరి జలాలతో పారాలన్నదే నా కల అన్నారు. నర్సాపూర్ను ఎంతో అభివృద్ధి చేశామని, మున్సిపాలిటీకి రూ. 25 కోట్ల నిధులు ఇచ్చామని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సైతం నిధులు ఇవ్వగా ఈ ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ వెనక్కి తీసుకుపోయిందని ఆరోపించారు. కొల్చారంలో మల్లినాథసూరి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తాను నిర్ణయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ హయాంలో హల్దీ వాగు, మంజీరాపై 10 చెక్ డ్యాంలు నిర్మించామని, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించారని చెప్పారు. సస్యశ్యామలం చేయడమే నా కల అందుకు ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: అర్హులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ పోలింగ్ కేంద్రం 211లో ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 13వ తేదీన తన ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాముఖ్యత ఉందని, అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీ విజిల్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.అప్రమత్తంగా ఉండాలి: సమీర్ మాధవ్ కుర్కోటి ఎంసీఎంసీలోని అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి సీసీటీవీ, పెయిడ్ ప్రకటనలను పరిశీలించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని మీడియా సెంటర్ను ఆయన సందర్శించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఏం చేద్దామని కాంగ్రెస్లోకి వెళ్లిండు
కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగు నీరు రాదు, సాగు నీరు రాదు, కరెంట్ రాదు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఏం పథకాల అందనప్పుడు మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకుపోయారని ప్రశ్నించారు. నా చరిత్ర, మదన్రెడ్డి చరిత్ర మీకు తెలుసు, ఆయన టీడీపీ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా తాను బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించానని గుర్తు చేశారు. 70 ఏళ్ల వయసులో ముసలితనానికి కుసుమ గుడాలు అన్నట్లు ఏం చేద్దామని కాంగ్రెస్లోకి పోయారని మండిపడ్డారు. మనందరిని వదిలిపెట్టిన మదన్రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఇందిరా హయాంలోనే ప్రగతి
నర్సాపూర్ రూరల్: ఇందిరాగాంధీ వల్లే మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 9న నర్సాపూర్కు రాహుల్గాంధీ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెదక్ ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించిందని కొనియాడారు. అలాగే వైఎస్సార్ హయాంలో అభివృద్ధి జరిగిందన్నారు. సొంత జిల్లా ప్రగతికి కేసీఆర్, హరీశ్రావు ఏ మాత్రం కృషి చేయలేదని విమర్శించారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్న కాలంలో కేసీఆర్కు దోచిపెట్టి రూ. కోట్లు సంపాదించారని ఆరోపించారు. రఘునందన్రావు జిల్లా అభివృద్ధికి నయా పైసా తీసుకురాలేదన్నారు. రాహుల్గాంధీ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి 50 వేలకు పైగా ప్రజలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, చెంగనూర్ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు శ్రీనివాస్గుప్తా, మల్లేశ్, నగేశ్, మణిదీప్, నాయకులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ రాహుల్గాంధీ సభకు భారీ ఏర్పాట్లు -
రాజీయే రాజమార్గం
మెదక్జోన్: వచ్చేనెల 8వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్లో కక్షిదారులను ఒప్పించి వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి లక్ష్మీశారద పేర్కొన్నారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో న్యాయ మూర్తులు జితేందర్, రిటా లాల్చంద్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలపై ఆరా కొల్చారం(నర్సాపూర్): మండలంలోని చిన్నఘనాపూర్ శివారు ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) డిపోను ఎన్నికల అబ్జర్వర్ సునీల్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన లిక్కర్ అమ్మకాల వివరాలు, ఎన్నికల దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గతేడాది మేలో మద్యం అమ్మకాల ఆధారంగా లిక్కర్ పంపిణీ చేపడుతున్నామని డిపో మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. నెలరోజుల అమ్మకాలు మొత్తం కలిపి దానికి అదనంగా 40 శాతం మాత్రమే డిపో నుంచి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఎకై ్సజ్ సీఐ నాగేశ్వరరావు, డిపో ఎకై ్సజ్ సీఐ రామిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ నరేందర్ ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దు: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ బాలస్వామి సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవని తేల్చిచెప్పారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఈసీఐ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు రాజేశ్వర్, వెంకట్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, డీసీఆర్బీసీఐ మధుసూదన్గౌడ్ పాల్గొన్నారు. 10 వరకు పోస్టల్ బ్యాలెట్కు అవకాశం నర్సాపూర్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే గడువును ఈనెల 10 వరకు ఎన్నికల కమిషన్ పెంచిందని అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గడువు పెంచినందున ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
తండాలను పంచాయతీలు చేశాం..
దశాబ్దాల పాటు పరిపాలించిన ఏ ప్రభుత్వం తండాలను పట్టించుకోలేదని, తాము తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేశామని కేసీఆర్ అన్నారు. మన రిజర్వేషన్లు మనకు ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని పిలుపునిచ్చారు. కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, కార్మిక బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మన్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జెడ్పీటీసీ బబియానాయక్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, చంద్రాగౌడ్, గోపి, వెంకట్రెడ్డి, నయిమోద్దీన్, సత్యంగౌడ్, పంబాల భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల్లా పనిచేయండి
రేగోడ్(మెదక్)/టేక్మాల్(మెదక్): కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సురేశ్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. రేగోడ్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్ పథకాలను వివరించాలని సూచించారు. త్వరలో రైతు లకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.7 కోట్లతో బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా రేగోడ్ తదితర చెరువులను నింపుతామన్నారు. ఇటీవల రేగోడ్కు చెందిన సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి రాజశేఖర్ కుమారుడు ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకుని సొంత డబ్బులతో వైద్యం చేయించినందుకు గాను వారి కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపా రు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్, మండల పార్టీ అధ్యక్షుడు దిగంబర్రావు, గ్రామ అధ్యక్షుడు శంకరప్ప, మాజీ జెడ్పీటీసీ రాజేందర్ పాటిల్, కో ఆప్షన్ సభ్యుడు చోటుమియా, మాజీ సర్పంచ్ విజయభాస్కర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంరావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర -
భద్రత కట్టుదిట్టం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భత్రత ఏర్పాటు చేశామని ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. ఈసీ నిబంధనలు ధిక్కరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 1500 మంది సిబ్బందితో పాటు మూడు పారా మిలటరీ బలగాలను రప్పించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా బుధవారం ‘సాక్షి’తో పలు అంశాలను వెల్లడించారు. –మెదక్జోన్1500 మంది సిబ్బందితో బందోబస్తు ● మూడు కంపెనీల కేంద్ర బలగాలు ● జిల్లాలో 45 సమస్యాత్మక పోలింగ్స్టేషన్ల గుర్తింపు ● ‘సాక్షి’తో ఎస్పీ డాక్టర్ బాలస్వామి ● పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రతీ పోలింగ్స్టేషన్కు ఒక ఎస్ఐతో పాటు నలుగురు సిబ్బందిని నియమించాం. జిల్లావ్యాప్తంగా 15 వందల మంది సిబ్బందిని కేటాయించాం. అలాగే మూడు కంపెనీల కేంద్ర బలగాలను దించాం. ● జిల్లాలో మొత్తం ఎన్ని పోలింగ్స్టేషన్లు ఉన్నా యి? వాటిలో సమస్యాత్మకమైనవి ఎన్ని? జిల్లాలో మొత్తం 770 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 45 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. వాటిని 78 రూట్లుగా గుర్తించి ఒక్కో రూట్కు ఒక్కో ఆర్మ్డ్ ఎస్కార్డ్లను కేటాయించాం. ఈవీఎం పంపిణీ సెంటర్ నుంచి పోలింగ్స్టేషన్ వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. రూట్ మొబైల్లో వైర్లెస్ సెట్ పోలీస్ కంట్రోల్ రూంకు కనెక్ట్ చేశాం. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే అప్రమత్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేశాం. ● జిల్లా సరిహద్దులో ఎన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేశారు? జిల్లా చుట్టూ ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి సరిహద్దులో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. పోలీస్ సిబ్బందితో పాటు జిల్లాకు చెందిన ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది సైతం 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా 9 ఎస్ఎస్టీ టీమ్స్, 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 24 గంటల పాటు నిఘా పెట్టారు. ● తనిఖీల్లో ఇప్పటివరకు ఎంత డబ్బు సీజ్ చేశారు? ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.88 లక్షల 57 వేల 678 నగదు సీజ్ చేశాం. అలాగే నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న బెల్టుషాపుల నుంచి 3,300 లీటర్ల మద్యం సీజ్ చేశాం. ఇది రూ.15 లక్షల విలువ ఉంటుంది. రామాయంపేటలోని ఓ లాడ్జిలో అక్రమంగా నిల్వ ఉంచిన 202 చీరలను సైతం పట్టుకున్నాం. వీటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అలాగే 2 వేల క్వింటాళ్ల బియ్యం సైతం పట్టుకున్నాం. దీని విలువ రూ. 40 లక్షలుగా గుర్తించాం. రూ.1 కోటి 45 లక్షల 91 వేల విలువ చేసే వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేశాం. నగదుకు సంబంధించి తగు ఆధారాలు చూపిన వారికి తిరిగి ఇచ్చేశాం. ● సీజ్ చేసిన డబ్బులో రాజకీయ నాయకులది ఉందా? పట్టుకున్న నగదులో ప్రత్యేకంగా రాజకీయ నాయకులదని గుర్తించలేదు. కానీ ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తల నుంచి మాత్రం స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బును డీజీసీకి నివేదించాం. నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ● ఎన్నికల ఉల్లంఘన కేసులు ఎన్ని నమోదయ్యాయి? జిల్లావ్యాప్తంగా 6 ఎంసీసీ వాయిలెన్స్ కేసులు నమోదయ్యాయి. అందులో విచారణ పూర్తయింది. త్వరలోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ● ఇప్పటివరకు ఎంత మందిని బైండోవర్ చేశారు? గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పాత నేరస్తులు 800 మందిని గుర్తించి బైండోవర్ చేశాం. ఒక్కసారి బైండోవర్ చేసిన వ్యక్తులు ఏడాది వరకు ఏదైనా వాయిలెన్స్లో పాల్గొంటే మరోసారి బైండోవర్ చేయాల్సి ఉంటుంది. పాత నేరస్తుల్లో అలాంటి వారు లేరు. కొత్తగా 173 కేసుల్లో 241 మందిని పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేశాం. ● సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వైరల్ చేశారా? సోషల్ మీడియాలో రెండు అభ్యంతరకర పోస్టులు వైరల్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ● ఈసీ నిబంధనలకు విరుద్దంగా రాజకీయ నేతలు వ్యవహరించినట్లు గుర్తించారా? ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు అనుమతి తీసుకొనే సభలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. వారిపై మా సిబ్బంది అనుక్షణం నిఘా పెట్టారు. ఈసీ నిబంధనలను పాటించకుంటే చర్యలుంటాయి. -
పాపన్నపేటలో ప్రచారం ఊసేది?
పాపన్నపేట(మెదక్): మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పాపన్నపేట అతిపెద్ద మండలం. 41,987ఓట్లతో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితంచేసే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువ. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం నాలుగు రోజులే మిగిలి ఉన్నా ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం ప్రారంభించలేదు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మండలంలో అడుగు పెట్టకపోగా, క్యాడర్ కూడా అయోమయంలో కొట్టుమిట్టాడుతోందని, స్థానిక నాయ కులు గ్రామాల్లో ఓటర్లను కలిసిన ఆనవాళ్లు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థానాధీశుల కోటగా పేరొందిన పాపన్నపేట అనాది నుంచి కాంగ్రెస్కు కంచుకోట. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ టీఆర్ఎస్ మెజార్టీ సాధించింది. తిరిగి ఇటీవల నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్కు మండలంలో 3387ఓట్ల ఆధిక్యత లభించింది. అయినా ఈ పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అసలు ప్రచారమే ప్రారంభించకపోవడంపై అంతా ఆశ్యర్యానికి లోనవుతున్నారు. పోలింగ్కు ముందు.. ప్రచారానికి ఇక నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సోమవారం రాత్రి ఏడుపాయల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు రోడ్షో నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. పోలింగ్కు ముందు ప్రారంభించే ప్రచార యత్నం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. ఇంకా ప్రారంభించని కాంగ్రెస్ ప్రభావం చూపే మండలం అయోమయంలో క్యాడర్ దూసుకుపోతున్న ఇతర పార్టీలు దూసుకుపోతున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఆయన ఇప్పటికే మండలంలో ఒకసారి కార్యకర్తల సమావేశం, మరోసారి రోడ్ షో నిర్వహించి ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, స్థానిక నాయకులు కలసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపి అభ్యర్థి రఘునందన్రావు కూడా ఇప్పటికే రెండుసార్లు పాపన్నపేట మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక నాయకులు సైతం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. -
12న ఎన్నికల సామగ్రి పంపిణీ
● మౌలిక వసతులు కల్పించాలి ● జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మెదక్ కలెక్టరేట్: లోక్సభ ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి 12వ తేదీన ఎన్నికల సామగ్రి అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలోని ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక్కరోజు ముందుగా సిబ్బందికి సామగ్రి పంపిణీ చేయనున్నామన్నారు. అందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ ప్రకారం ఈవీఎం యంత్రాలను సరిచూసి అందజేయాలని, పోలింగ్ సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులు రిజర్వ్ ఈవీఎం యంత్రాలతో భర్తీ చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ రోజు మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్ను ఆదేశించారు. సమావేశంలో సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిద్దిపేట అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఏఆర్ఓలు, డీఎస్పీ డాక్టర్ రాజేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
నా ఊపిరి
మెదక్ప్రాణం ఉన్నంత వరకు మరువనుమెదక్జోన్: ‘మెదక్ను నా ప్రాణం ఉన్నంత వరకు మరువను. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. రూ.వందల కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను తీసివేస్తానంటోంది. మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాల్సిన అవసరం మీపైన ఉంది’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని 16 నిమిషాలపాటు ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం నీటితో హల్దివాగును నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. మెదక్ మెడికల్ కళాశాలను మంజూరు చేశామని, ఏడుపాయలకు వందకోట్లతోపాటు మెదక్ నియోజకవర్గానికి కోట్లాది నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి రూ.50కోట్లు, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.25కోట్ల చొప్పున అలాగే ప్రతీ గ్రామానికి రూ.15లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసిపోతున్నా పట్టించుకునేవారేలేరన్నారు. రూ.కోట్లాది నిధులతో సస్యశ్యామలం చేశా మెడికల్ కళాశాల సైతం మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను తొలగిస్తుందట కొత్త జిల్లా ఉండాలంటే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి కార్నర్ మీటింగ్లోబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ -
బీఆర్ఎస్ కౌన్సిలర్కు చెందిన బ్యాంకెట్ హాలులో తనిఖీలు
తనిఖీల్లో పట్టుపడ్డ దుస్తులురామాయంపేట(మెదక్): మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజుకు చెందిన శారద బ్యాంకెట్ హాలులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్కాడ్ టీంతోపాటు స్థానిక సీఐ వెంకటేశ్, ఎస్ఐ రంజిత్ మంగళవారం ఓ గదిలో దాచి ఉంచిన చీరలు, షర్ట్ పీసులు, డ్రెస్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇవి గతంలోనే తెచ్చినవని, ఎన్నికలకు వీటికి ఏ సంబంధంలేదని నాగరాజు పేర్కొన్నారు. ఎఫ్ఎస్టీ సభ్యులు వాటిని స్వాధీనం చేకున్నారు. -
ఖేడ్ అభివృద్ధికి జోడెద్దుల్లా పనిచేస్తాం
పొలిటికల్ హీట్నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపుకోసం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థి సురేష్ షెట్కార్ కామారెడ్డిలో ప్రచారం కోసం బయలుదేరారు. ప్రచారం నిర్వహిస్తున్న ప్రాంతం మీదుగా వెళు తూ ఆగి తనను ఎంపీగా గెలిపిస్తే ఎమ్మెల్యే, తాను ఐక్యంగా జోడెద్దుల్లా పనిచేస్తూ ఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తామన్నారు. ఇరువురం కలవడం అభివృద్ధికి సంకేతమన్నారు, దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఖేడ్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ను త్యాగం చేసిన షెట్కార్ గెలుపుకోసం శక్తివంచనలేకుండా కృషిచేస్తామని ఎమ్మెల్యే మరింత ఉత్సాహపర్చారు. -
మూడు రోజులు భారీ వర్షాలు
● రైతులు అప్రమత్తంగా ఉండాలి ● అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్ కలెక్టరేట్: వాతావరణశాఖ సూచన మేరకు రానున్న మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు ధాన్యం రాశులు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో మాట్లాడుతూ పీపీసీ కేంద్రాల ఇన్చార్జిలకు, రైతులకు ధాన్యం తడవకుండా చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తూకం పూర్తిచేసిన ధాన్యపు బస్తాలను రవాణా చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లో అడిషనల్ డీసీపీ ఓటు రామాయంపేట(మెదక్): రాచకొండ టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ డాక్టర్ నంద్యాల నర్సింహారెడ్డి మెదక్లోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో మంగళవారం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు న్యాయం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రంగాయపల్లి నుంచి దండుపల్లి, కాళ్లకల్, మనోహరాబాద్ గ్రామాలలో బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఉచిత వైద్యం, విద్య అందిందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అలాగే బీజేపీతో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, రాష్ట్ర నాయకులు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, నాయకులు మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగ్రహించిన అన్నదాతలు కొల్చారం(నర్సాపూర్): తూకం వేసిన ధాన్యాన్ని రోజుల తరబడి రవాణా చేయకుండా నిలిపేయడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ ఘటన మండలంలోని సంగాయిపేట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామంలో మంజీరా రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేపడుతున్నారు. మూడు రోజుల నుంచి తూకం వేసిన 5500 బస్తాల ధాన్యం లారీలు రాకపోవడంతో రైస్ మిల్లకు రవాణా కాలేదు. జిల్లా సివిల్ సప్లై అధికారికి సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో రైతులు ధాన్యం బస్తాలతో మెదక్–జోగిపేట రహదారిపై బైఠాటాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహమ్మద్ గౌస్ అక్కడికి చేరుకొని డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడి లారీలను పంపిస్తానన్న హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. మాజీ ఎమ్మెల్సీ వాహనం తనిఖీ చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ కారును ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. ఆయన అధికారులకు సహకరించారు. అధికారులు వేణుమాధవ్, ఏఎస్ఐ జైపాల్రెడ్డి, పీసీ శంకర్ ఉన్నారు. -
మోదీలాగే రఘునందన్ గ్యాస్..
ప్రధానమంత్రి మోదీలాగే రఘునందర్రావు సైతం ఉత్త గ్యాస్ కొడుతాడని, దుబ్బాకలో చెల్లని వ్యక్తిని మెదక్లో కూడా చిత్తుగా ఓడించాలన్నారు. విద్యావంతుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి సుపరిచితుడైన వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. తన సొంత నిధులైన రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత కోచింగ్తో పాటు నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని హామీఇచ్చిన వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్రివర్స్ గేర్లో కాంగ్రెస్ సర్కార్.. మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేశారన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలయ్యే విధంగా చూస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి కరెంటు సమస్య ఏర్పడి మోటార్లు కాలిపోతున్నాయన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే నీళ్లు లేని బావిలో వేసినట్లేనన్నారు. పది సంవత్సరాల బీజేపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. ఇంటింటికి క్యాలెండర్ను పంచి బీజేపీ ఓట్లు అడుగడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఫారూక్హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఆందోళనలో అన్నదాతలుమెదక్జోన్/చిలప్చెడ్(నర్సాపూర్)/టేక్మాల్(మెదక్): ఈదురుగాలులతో కురిసిన వర్షం ధాన్యం ఆరబోసుకున్న రైతులను అతలాకుతలం చేసింది. అకాల వర్షంతోపాటు జోరుగా వడగండ్లు పడడంతో రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉంచిన ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. మెదక్లో మంగళవారం సాయంత్రం 5గంటలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అరగంట పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. అలాగే చిలప్చెడ్ మండలంలోని పలు గ్రామాలలో వర్షం ఎక్కువగా కురవడంతో కల్లాలలో వరదనీరు చేరింది. ధాన్యం కుప్పల కిందకు నీరు రాకుండా రైతులు నానా తంటాలు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు లేక ఇబ్బందులు పడ్డారు. -
లక్ష మందితో రాహుల్ గాంధీ సభ
నర్సాపూర్: నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించనున్న జన జాతర సభలో ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ పాల్గొంటారని కేరళలోని చెంగనూర్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు పరిశీలకుడు సురేశ్ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ 9వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుందని, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లక్ష మందితో జన జాతర సభ తమ పార్టీ అధినేత రాహుల్గాంధీ పాల్గొనే జన జాతర సభను సుమారు లక్ష మందితో నిర్వహించనున్నట్టు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం రైతబంధు పథకం నిధులు రైతులకు అందుతున్నాయని, ఓట్లు దండుకోవాలనే ఆశతో మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోడ్ అమలులో ఉన్నప్పుడు కొత్త పథకాలు చేపట్టరనే విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. తమ అభ్యర్థి నీలం మధును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సిద్దిపేటలో సైతం తమకు భారీగా ఓట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి నియోజకవర్గ అభి వృద్ధి పట్టదని, ఆమె తన వ్యక్తిగత సంపాదనపైనే దృష్టి పెడతారని ఆరోపించారు. అవినీతి నేర్పిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజలకు అవినీతి నేర్పుతున్నారని మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులలో అక్రమాలు, అవినీతిపై ఎన్నికల అనంతరం విచారణ జరుగుతుందని, బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. నిజామాబాద్ మాజీ మేయర్ శ్రీనివాస్, రిజ్వాన్, సుహాసిని, హంసీబాయి, మ్యాడం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 9న జరిగే సభను విజయవంతం చేయాలి కాంగ్రెస్ పార్లమెంటు పరిశీలకుడు సురేశ్ -
ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి
సంగారెడ్డి టౌన్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ను మంగళవారం మెదక్ లోక్సభ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్వాన్షి, జహీరాబాద్ వ్యయ పరిశీలకులు మోతీలాల్, కలెక్టర్ క్రాంతి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ప్రచార ప్రకటనలకు సంబంధించిన ఖర్చు అభ్యర్థి లెక్కలోకే వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంసీఎంసీ కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మీడియాలో వచ్చే ప్రతీ ప్రకటనను మానిటరింగ్ చేయాలన్నారు. అలాగే ఐసీసీలో నెలకొల్పిన కంట్రోల్ రూంను వారు సందర్శించారు. -
పాత నేరస్తుడికి రిమాండ్
పోలీసుల పేరిట అక్రమ వసూళ్లు మెదక్ మున్సిపాలిటీ: పోలీసు అవతారమెత్తి వ్యాపారు ల వద్ద అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం పట్టణ సీఐ దిలీప్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఇందిరాపూరీ కాలనీ చెంది న ఆముదా రఘు తండ్రి శ్రీనివాస్ ఎమ్మెల్యే తన వెనుకే ఉన్నాడంటూ.. పోలీసుల పేరు చెబుతూ వ్యాపారస్తులను,వాహనదారులను బెదిరిస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. సీఎం రేవంత్రెడ్డి, ఆయన తమ్ముడితో దగ్గర సంబంధాలు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడ్తున్నాడు. ఉన్నతాధికారుల నెంబర్స్ సేకరించి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి వారి పేర్లు చెబుతూ డబ్బులు దోపిడీ చేస్తున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారిపై ఆజమాయిషీ చలాయించే వాడని చెప్పారు. నిందితుడిపై గతంలో నగరంలోని అఫ్జల్గంజ్ ఠాణా పరిధిలో రేప్ కేసు, హవేలి ఘనాపూర్ పీఎస్ పరధిలో దోపిడీ కేసు, మెదక్ టౌన్ పీఎస్లో ఏడు కేసులున్నట్లు వివరించారు. జిల్లా కోర్టు శిక్షలు విధించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement