breaking news
Medak
-
కొమురవెల్లి.. ప్రణమిల్లి..
కొమురవెల్లి(సిద్దిపేట): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుడి ప్రతి రూపమైన మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. పూనకాలతో ఊగిపోయిన భక్తులు, జయజయధ్వానాల మధ్య ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఒక్క పొద్దులతో జాగరణ చేసేందుకు భక్తులు తరలి వచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి రోజు రాత్రి ఒగ్గుపూజారులు నిర్వహించే పెద్దపట్నం కార్యక్రమాన్ని చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. రాజగోపురం నుంచి ప్రధాన రహదారి, గంగరేణు చెట్టు వద్ద సందడి నెలకొంది. స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. అనంతరం కొండ పైన వెలసిన రేణుకాఎల్లమ్మను దర్శించుకునేందుకు నెత్తిన బోనాలతో వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో మహాశివరాత్రిరోజున ఒగ్గు పూజారులచే నిర్వహించే పెద్ద పట్నంకు ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తిచేశారు. స్వామివారి రాజగోపురం ఎదుట భక్తుల రద్దీ -
హంగ్లో కింగ్ ఎవరు?
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భిన్నమైన తీర్పు వెలువడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు టెన్షన్ మొదలైంది. అధికారానికి అడుగు దూరంలో ఉన్న మ్యాజిక్ ఫిగర్ను చేరేందుకు విపక్ష నేతల మద్దతు అనివార్యమైంది. నిత్యం కత్తులు దూసుకునే నేతలు.. అధికారం కోసం జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారోనన్న ఉత్కంఠభరితంగా మారింది. – మెదక్జోన్ మెదక్లో 32 వార్డులకు గాను, 15 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ 14 వార్డులను కై వసం చేసుకుంది. బీజేపీ 2, బీఎస్పీ 1 చొప్పున గెలిచాయి. కాగా ఫలితాలు వెలువడిన వెంటనే బీఎస్పీ అభ్యర్థి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్కు, బీఆర్ఎస్లకు సరి సమానంగా 15 సీట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే రోహిత్రావు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ సంఖ్య 16కు చేరుకోగా మరో సీటు అవసరం ఉంది. అలాగే బీఆర్ఎస్కు అధికారం దక్కాలంటే 2 సీట్లు కావాల్సి ఉంది. దీంతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్ మెదక్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ వారి ఓట్లు ఈ మున్సిపల్ పరిధిలో లేవు. దీంతో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్కు సైతం బీజేపీ మద్దతు తప్పనిసరి. నర్సాపూర్లో బుజ్జగింపుల పర్వం.. నర్సాపూర్లో 15 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు రాగా బీఆర్ఎస్కు 5 సీట్లు వచ్చాయి. బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ చైర్మన్ పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 9 సీట్లు అవసరం. కాగా స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్గా నమోదు చేసుకోవటంతో బీఆర్ఎస్ బలం సైతం 6కు పెరిగింది. దీంతో పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే ఆ రెండు పార్టీలకూ ఇంకా 3 సీట్లు కావాలి. బీజేపీ మద్దతు తప్పనిసరి కావటంతో మద్దతుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కమలం పార్టీ నేతలను బుజ్జగిస్తున్నారని తెలిసింది.మెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఆదివారం భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ టౌన్ సీఐ మహేష్, జిల్లా సైన్స్అధికారి రాజిరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.కాంగ్రెస్ + కమలం దోస్తీ! మెదక్, నర్సాపూర్ పుర పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, కమలం నేతలతో దోస్తీ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నందుకు గాను, మెదక్లో వైస్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపిపట్లు తెలిసింది. అలాగే నర్సాపూర్లోనూ కాంగ్రెస్కు బీజేపీ మద్దతు ఇవ్వాలంటే చైర్మన్ పీఠం ఇవ్వాలని కమలం నేతలు పట్టుపడుతున్నారు. దీనిపై ఇంకా చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. నేడు ‘పుర’చైర్మన్ల ఎన్నిక మెదక్, నర్సాపూర్లో హంగ్ బీజేపీ మద్దతుపై ఉత్కంఠకట్టుదిట్టంగా భద్రతఅదనపు ఎస్పీ మహేందర్ -
వనదుర్గమ్మకు వందనం
పాపన్నపేట(మెదక్): ఎల్లలు దాటి తరలి వచ్చిన భక్తులతో వనదుర్గమ్మ సన్నిధి జన సంద్రంగా మారింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగే జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన ఏడుపాయల జాతరలో ప్రభుత్వం తరఫున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, శివాని దంపతులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ నగేశ్, ఈఓ వీరేశం, ఏపీ చంద్రశేఖర్ అమ్మవారికి, శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంజీరా నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి పూజలు, గంగమ్మకు హారతినిచ్చి జాతర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర కనులపండువగా నిర్వహిస్తామన్నారు. ఇందు కోసం సుమారు మూడు వేల మంది సిబ్బందితో ఏర్పాట్లు చేశామని చెప్పారు. జాతరకు భారీ ఏర్పాట్లు ఉదయం నుంచి మొదలైన భక్తుల రాక సాయంత్రానికి జోరందుకుంది. ఏడుపాయలకు తరలి వచ్చిన భక్తులు శివాలయంలో శివదీక్షలు చేపట్టి సాయంత్రానికి పండ్లతో ఉపవాసాన్ని విడిచారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పార్కింగ్ స్థలం నుంచి జాతర వరకు ఉచిత బస్సులు నడిపారు. వీటిని కలెక్టర్ రాహుల్రాజ్ ప్రారంభించారు. ట్రాఫిక్ ఇబ్బంది, దర్శన ఇక్కట్లు లేకుండా ఎస్సీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిరంతర తాగునీరు, విద్యుత్ను అధికారులు అందించారు. డాక్టర్ దీక్ష ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సేవలు అందించారు.ఏడుపాయల్లో పోటెత్తిన భక్తజనం శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్ -
మంత్రి మదిలో ఏముందో..?
● నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ● ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు హుస్నాబాద్: స్థానిక రాజకీయాలు మున్సిపల్ చైర్మన్ పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో చైర్మన్ గిరి పదవి అదృష్టం ఎవరిదోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. చైర్మన్ రేసులో 2వ వార్డు కౌన్సిలర్ బూరుగు లత, 10వ వార్డు కౌన్సిలర్ సావుల మంజుల, 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి, 19వ వార్డు కౌన్సిలర్ బత్తుల స్వరూప ఉన్నారు. ఈ నలుగురి కౌన్సిలర్లలో ఎవరో ఒకరు చైర్మన్ పీఠం ఎక్కనున్నారు. సోమవారం ఉదయం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ 16 స్ధానాలు, 4 స్ధానాలు బీఆర్ఎస్ కై వసం చేసుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన మహిళనే చైర్మన్ అవుతారని పలువురు అంటున్నారు. అయితే నలుగురు మహిళల్లో ముగ్గురు మహిళలు మొదటి సారిగా కౌన్సిలర్గా గెలుపొందగా.. ఓ మహిళకు గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది. సర్వత్రా ఉత్కంఠ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన మహిళకే చైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఎస్సీలో మాల సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా? అనేది ఉత్కంఠను తెర లేపుతుంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో అంతుపట్టని ప్రశ్నగా ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్గా అయిలేని అనిత పని చేయగా.. ఈ ఇద్దరి మహిళా ప్రజాప్రతినిధులు తోటి కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పాలనపరంగా ఐదేళ్లు సమర్థవంతంగా పనిచేశారు. వారి హయంలోనే హుస్నాబాద్ మున్సిపల్కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. రెండవ సారి కూడా చైర్ పర్సన్గా మహిళనే వరించనుండగా.. చైర్మన్ పదవి విషయంలో మంత్రి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించి ఓటింగ్ పద్ధతిపై వివరించనున్నారు. ఈ సమావేశంలోనే చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవుల పేర్లను ప్రకటించనున్నారు. వైస్ చైర్మన్ పదవిని పురుషుడికి ఇస్తారా.. గతంలో మాదిరిగా మహిళకే ఇస్తారా? అనేది మరి కొన్ని గంటల్లో స్పష్టత రానుంది. -
మురిపెం ఎవరికో..!
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ చైర్మనన్ పదవిని దక్కించుకునేందుకు ఏ పార్టీకి సరిపడా మెజార్టీ లేనందున తలెత్తిన ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నికకు 8 మంది కౌన్సిలర్ల మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్కు ఆరుగురు, బీజేపీకి నల్గురు కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్కు ఐదుగురు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి క్యాంపులు చేపట్టిన ఆయా పార్టీలు ఇంకా కౌన్సిలర్లు క్యాంపులలోనే ఉన్నారు. కాగా మున్సిపల్ అధికారులు సోమవారం నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఆయా పార్టీల నాయకులు తమ కౌన్సిలర్లను నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఆ పదవి కోసం కాంగ్రెస్ నుంచి 5వ వార్డు కౌన్సిలర్ ఎం.లక్ష్మిరాజు యాదవ్, బీఆర్ఎస్ నుంచి 9వ వార్డు కౌన్సిలర్ వి.సునీతాబాల్రెడ్డి, బీజేపీ నుంచి 4వ వార్డు కౌన్సిలర్ ఏ.రాజమణి మురళీయాదవ్లు ఆశిస్తున్నారు. ఏ పార్టీకి సరిపడా మెజార్టీ రానందున చైర్మన్ పదవి ఆశిస్తున్న నాయకులు ఎవరికి వారు తమ పార్టీలో మద్దతు కూడగట్టుకుని ఇతర పార్టీల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీకి చెందిన కొందరు నాయకులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నారని, చైర్మన్ పదవి కోసం బీజేపీకి మద్దతిస్తే మీకు వైస్ చైర్మన్ పదవికి మద్దతిస్తామని, దీంతో ఇరు పార్టీలం కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకోవచ్చని చర్చలు జరుపుతున్నా ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు సైతం ఎలాగైనా చైర్మన్ పదవిని కై వసం చేసుకోవాలన్న ఉద్దేశంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిసింది. కాగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంటాయో వేచి చూడాలి. మూడు పార్టీల్లోనూ ఆశావహుల యత్నాలు నర్సాపూర్లో ఎడతెగని ఉత్కంఠ -
చైర్మన్ గిరిపై పీటముడి
తూప్రాన్: తూప్రాన్ పురపోరులో బీఆర్ఎస్కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ.. చైర్మన్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. చైర్మన్గిరి విషయంలో విభేదాలు పొడచూపుతున్నట్లు తెలుస్తుంది. ఇది విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని బీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 9 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 3 బీజేపీ కై వసం చేసుకున్నాయి. బీఆర్ఎస్కు స్థానాలు వచ్చినా.. గ్రూపు రాజకీయాలతో మూడు వర్గాలుగా చీలినట్లు తెలిసింది. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లతో హరీశ్రావు మంతనాలు సాగిస్తున్నారు. కాగా హరీశ్ అండదండలతో మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ చక్రం తిప్పుతుండగా.. ప్రతాప్రెడ్డి అండదండల తో చెలిమెల రఘుపతి (ప్రియాంక), సమతారెడ్డి తమకే పీఠం దక్కుతుందని ధీమాతో ఉన్నారు. పైరవీలు మాత్రం ముమ్మరం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు గెలిచి బీజేపీ మూడు స్థానాలు గెలిచిన వారితో జతకట్టి తూప్రాన్ మున్సిపల్ అధికార పార్టీ కై వసం చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎంపీ రఘునందన్రావు ఆధ్వర్యంలో బీజేపీ సైతం తాము మూడు స్థానాలు గెలిచామని, తామే కీలకం కానున్నామని చెబుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలు కొంపముంచుతాయా అనే చర్చ సాగుతోంది.బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలు -
ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని న్యాల్కల్, రుక్మాపూర్, గుంజోటి, ముంగి తదితర తండాల్లో ఆదివారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. న్యాల్కల్ తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయం ఆవరణలో గిరిజనులు యజ్ఞాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆశ్రమం నుంచి ప్రారంభమైన ర్యాలీ ముంగి మీదుగా న్యాల్కల్కు చేరుకుంది. న్యాల్కల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సిద్దిలింగయ్యస్వామి, రుక్మాపూర్ సర్పంచ్ సురేశ్, నాయకులు ప్రవీణ్కుమార్, సక్కులాల్, బస్వరాజ్, యూనూస్ ఖాన్, కాశప్ప, విష్ణు, తదితరులు పాల్గొన్నారు. బడుల మూసివేతను విరమించుకోవాలి ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 దాటగానే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాల పూజ అనంతరం దర్శనాలు ప్రారంభించారు. క్యూలలో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గత 41 రోజులుగా శివమాల ధరించిన భక్తులు ఇరుముడి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. పూజలు నిర్వహించిన మంత్రి దామోదర మహాశివరాత్రిని పురస్కరించుకుని కేతకీలో మంత్రి దామోదర, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతాపాటిల్, మాజీ ఎంపీపీ హన్మంత్రావుపాటిల్, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
క్యాంపుల్లోనే కౌన్సిలర్లు
నర్సాపూర్: అన్ని పార్టీల కౌన్సిలర్లు మూడు రోజులుగా క్యాంపుల్లోనే ఉన్నారు. నర్సాపూర్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్కు ఆరుగురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్కు ఐదుగురు, బీజేపీకి నలుగురు కౌన్సిలర్లు ఉండగా, అన్ని పార్టీల నేతలు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయితే అన్ని పార్టీల కన్న తక్కువ స్థానాల్లో గెలిచినా బీజేపీ సైతం పీఠం కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తమ పార్టీలో చేరితే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని బీజేపీకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చిందని తెలిసింది. ఈ మేరకు ఆపార్టీ నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఎదుటి పార్టీలకు చెందిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల ముఖ్య నాయకులు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. కౌన్సిలర్లు క్యాంపులలో ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తమ పార్టీలో చేరితే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము కన్న ఎక్కువ డబ్బు (గుడ్విల్)తో పాటు సముచిత స్థానం కల్పిస్తామంటూ రక రకాల ఆశలు చూపుతున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆదివారం మహా శివరాత్రి సందర్భరంగా కౌన్సిలర్లను క్యాంపుల నుంచి దేవాలయాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.25 మంది కొత్తవారే.. మెదక్ కలెక్టరేట్: ఇటీవల జరిగిన మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పుర ప్రజలు అత్యధికంగా కొత్తవారికే అవకాశం కల్పించారు. అందులో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 32 వార్డులకు గానూ 25 మంది కొత్తవారు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. మరో ఏడుగురు గతంలో ఒకసారి గెలిచిన వారు ఉన్నారు. అలాగే మొదటిసారి ఏడుగురు ముస్లిం అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం ఏ పార్టీ చైర్మన్ పీఠం చేజిక్కించుకున్నా.. యువ పాలకవర్గంతో అవినీతికి తావులేకుండా అభివృద్ధిలో ముందుకు సాగాలని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
జన జాతరకు రెడీ
విద్యుత్ దీపాల వెలుగుల్లో ఏడుపాయలమూడు రోజుల వైభవం ఏడుపాయల జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు ఆదివారం భక్తులు శివదీక్షలు చేపట్టి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం స్థానిక ఈశ్వరాలయంలో దీక్షలు విరమించి, రాత్రంతా శివరాత్రి జాగరణ చేస్తారు. రెండో రోజు సోమవారం బండ్లు తిరిగే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మూడో రోజు మంగళవారం సాయంత్రం రథోత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఈమేరకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాతి గుహలో వెలసిన అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.నేటి నుంచి ప్రారంభం ముస్తాబైన ఏడుపాయల దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న ఎమ్మెల్యే రోహిత్ విధుల్లో 3 వేల మంది ఉద్యోగులు -
పుర పీఠంపై గురి!
మెదక్జోన్: మెదక్ ‘పుర’ పీఠంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు గురి పెట్టాయి. ఎలాగైనా చైర్పర్సన్ స్థానాన్ని కై వసం చేసుకోవాలని రెండు పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు రెండు సీట్లు కావాల్సి ఉండగా బీజేపీ మద్దతు కూడగడుతున్నారు. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రోహిత్రావు, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. మరో రెండు సీట్లు అవసరం మెదక్ బల్దియాలో మొత్తం 32 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1 గెలుచుకున్నాయి. కాగా మ్యాజిక్ ఫిగర్కు 17 సీట్లు అవసరం కాగా, బీఎస్పీ నుంచి గెలిచిన అభ్యర్థి భుజరంపేట అరుణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఇక ఈ రెండు పార్టీల్లో చైర్మన్ పీఠం ఎవరు దక్కించుకోవాలన్నా, మరో రెండు సీట్లు అవసరం. దీంతో ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానంగా సీట్లు ఉండటంతో బీజేపీ కీలకంగా మారింది. ఆపార్టీలో గెలిచిన ఇద్దరు ఎవరికి మద్దతు ఇస్తే వారే పుర పీఠం కై వసం చేసుకుంటారు. కాగా ఎవరికి వారు బీజేపీ నేతలతో మద్దతు కోసం సంప్రదింపులు చేస్తునట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానికంగా ఓటు ఉంటేనే.. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవాలంటే వారు స్థానిక మున్సిపాలిటీలో ఓటర్గా ఉంటేనే అర్హత ఉంటుందని, హైకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల కమిషన్ నుంచి సర్క్యులర్ వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈలెక్కన బీఆర్ఎస్ తరఫున దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు వేసే అధికారం ఉంటుందా..? లేదా అంశం స్పష్టత కరువైంది. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎక్స్ఆఫీషియో సభ్యులుగా పోటాపోటీగా దరఖాస్తు ఉత్కంఠ భరితంగా మెదక్ బల్దియా ఎన్నిక -
ఎక్స్అఫీషియోలు కీలకం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో సభ్యుల ఓటు ఎంతో కీలకంగా మారింది. ఆయా మున్సిపాలిటీల్లో ఈ ఎక్స్అఫీషియో సభ్యులుగా తమ పేరు నమోదు చేసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయా బల్దియాల చైర్మన్ ఎన్నికలో ఓటు వేసే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఏ మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తే..మాజీ సీఎం కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకున్నారు. ఇదే మున్సిపాలిటీ ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా నమోదు చేసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ తన నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా అందోల్ –జోగిపేట మున్సిపాలిటీలో, మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో, నారాయణఖేడ్ బల్దియాలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి (కాంగ్రెస్)లు ఎక్స్అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు.హంగ్ ఫలితాలు వచ్చిన మెదక్ మున్సిపాలిటీలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్రావుతోపాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, సురేశ్రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే హంగ్ ఫలితాలు వచ్చిన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ రఘునందన్రావుతోపాటు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిలు నమోదు చేసుకున్నారు. దుబ్బాకలో కొత్తా ప్రభాకర్రెడ్డి (బీఆర్ఎస్), నర్సాపూర్లో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డిఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు. ఎక్స్అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉందని బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి.హంగ్ వచ్చిన చోట్ల..ఎవరెవరు ఎక్కడ అంటే.. -
దుబ్బాక ఎవరికో..?
దుబ్బాక: మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను బీఆర్ఎస్ నుంచి 11 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ 4, బీజేపీ నుంచి ఇద్దరు, ఏఐఎఫ్బీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలుపొందారు. బీఆర్ఎస్కు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం చేరడంతో ఆ పార్టీ బలం 12కు చేరుకుంది. మరో ఇద్దరు కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సంగీత చైర్పర్సన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆశీస్సులున్న వారే చైర్పర్సన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గజ్వేల్లో ఎడతెగని ఉత్కంఠ గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ క్యాంపు రాజకీయం రసకందాయంలో పడింది. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్తోపాటు ఇండిపెండెంట్తో కలుపుకొని 12 కౌన్సిలర్ స్థానాలను సాధించిన బీఆర్ఎస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో క్యాంపు నడుపుతోంది. పనిలోపనిగా రెండు ఎక్స్ గ్రేషియో ఓట్లను బీఆర్ఎస్ సిద్ధం చేసుకున్నది. ఇందులో స్థానిక ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కాగా, మరొకరు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఉన్నారు. కాగా చైర్మన్ పీఠం కోసం 17వార్డు కౌన్సిలర్ కళ్యన్కర్ పద్మబాయి, 19వవార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందనలు పోటీపడుతుండగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వైస్ చైర్మన్ ‘బరి’లో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం సైతం పోటాపోటీ ప్రయత్నాలు కూడా తెరమీదికి వచ్చాయి. రెండవ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సతీమణి(బీజేపీ)పై అధిక మెజార్టీతో విజయం సాధించిన గోలీ మమత, 20వ వార్డులో ఇండిపెండెంట్గా గెలుపొందిన అత్తెల్లి శ్రీనివాస్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలోనూ పార్టీ ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక ఏడు కౌన్సిలర్ స్థానాలను సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ సైతం క్యాంపు రాజకీయాలకు నడపటం కూడా ఆసక్తిని రేకేత్తిస్తున్నది. -
900 మంది సిబ్బందితో బందోబస్తు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరకు 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్రావు వెల్లడించారు. శనివారం ఏడుపాయలలో ఆయన మాట్లాడుతూ.. భక్తుల రక్షణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు అనుమానాస్పద వస్తువులను తాక వద్దని, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బారికేడ్లు, క్యూలైన్ల వద్ద సూచనలు పాటించాలన్నారు. ఆపత్కాల పరిస్థితుల్లో 100కు ఫోన్ చేయాలని చెప్పారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. షీ టీమ్స్ నిరంతర నిఘా పెడుతాయన్నారు. రాత్రి వేళల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతుంటారని, అవసరమైతే వారి సహయం తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ జార్జ్, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఉన్నారు.ఎస్పీ శ్రీనివాస్రావు -
చైర్పర్సన్ పీఠం బీఆర్ఎస్దే
నర్సాపూర్: మున్సిపల్ చైర్పర్సన్ పీఠం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గెలిచిన కౌన్సిలర్లతో కలిసి ఆమె మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ధృవీకరణ పత్రాలు తీసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. అధికారులతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేలా చేశారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు సైతం తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. చైర్మన్ పీఠం దక్కించుకుంటామని, తాము నిరంతరం ప్రజ ల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు చంద్రాగౌడ్, గోపి, శేఖర్, బాల్రెడ్డి, సంతోశ్రెడ్డి, షేక్హుస్సేన్, భిక్షపతి, మన్సూర్, ప్రసాద్, జ్ఞానేశ్వర్, నాగరాజుగౌడ్, శ్రవణ్కుమార్, సద్దాం, సుధాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండాలిమాజీ మంత్రి హరీష్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పరమశివుని అనుగ్రహంతో ప్రజలంతా సంతోష ంగా ఉండాలని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మహాఽశివరాత్రిని పురస్కరించుకొని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. దుబ్బాక బీఆర్ఎస్ అడ్డా..ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక 17వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా గెలుపొందిన చాంద్మియా బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మొదటి నుంచి బీఆర్ఎస్కు అండగా ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లుతో పాటు మరో ముగ్గురు సైతం తమ వారే గెలుపొందడం సంతోషకరమన్నారు. దుబ్బాక మున్సిపల్పై మరోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థులు నర్సాపూర్ రూరల్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు నర్సాపూర్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కృష్ణకిషోర్ శనివారం తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి 23 వరకు నల్గొండ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు ఎంపికై న శైలజ, నిఖిత, శ్రావణి, అశ్విని, హిమజ, బాలురు జట్టు వర్షిత్, చరణ్, చేతన్, అరుణ్ను అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బసవరాజు, పీఈటీ లింగగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం పూజలుహుస్నాబాద్/ప్రశాంత్నగర్(సిద్దిపేట): హుస్నాబాద్ పట్టణం, అలాగే జిల్లా కేంద్రంలోనిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడంతో అమ్మవారికి శనివారం మొక్కులు సమర్పించుకున్నారు. ఈసందర్భంగా పొన్నం మాట్లాడు తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారు. -
మున్సిపల్ ఫలితాలు గుడ్డిలో మెల్ల
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే గీటురాయి: తలసానిసిద్దిపేటజోన్: రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు.. అవి వస్తుపోతుంటాయి. ప్రజలే శాశ్వతం. ప్రజలకు చేసిన మంచి పనులు గీటురాయిగా గు ర్తించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు గుడ్డిలో మెల్లగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారం నడిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు, మద్యం, ఏరులై పారిందన్నారు. -
ఈసీ నిబంధనల ప్రకారమే ఎన్నిక
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఈ నెల 16న మెదక్ మున్సిపాలిటీలో నిర్వహించనున్న ఎన్నిక ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమావేశం చెల్లుబాటు కావాలంటే మొత్తం అర్హత గల సభ్యులలో కనీసం 50 శాతం మంది తప్పనిసరిగా హాజరు ఉండాలన్నారు. ప్రత్యక్షంగా ఎన్నికై న కౌన్సిలర్లకు అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్పర్సన్, అనంతరం వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల అధికార గుర్తింపు పత్రాలను ఆదివారం ఉదయం 10 గంటలలోగా సమర్పించాలన్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
శాస్త్రవేత్త డాక్టర్ జగదీశ్సింగ్ నర్సాపూర్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వశాఖ సలహాదారు, శాస్త్రవేత్త డాక్టర్ జగదీశ్సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ బీవీఆర్ఐటీలో రెండు రోజులుగా జరుగుతున్న అడ్వాన్స్ ఇన్ అట్మాస్పియర్, స్పేస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ మెటీరియల్స్ (ఏఈ ఆర్ఐఎస్ 2006) జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం, చేపల వేట, ఇతర వనరుల వినియోగానికి సంబంధించిన సమస్యలు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రధాన ప్రయోగశాలలు, ఆయా సంస్థల నుంచి ఇప్పటివరకు 70 పరిశోధన పత్రాలు అందాయని తెలిపారు. రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ అనువర్తనాలు, మోడలింగ్, ఏఐ, భూమి వాతావరణ, సముద్ర అంతరిక్ష శాస్త్రాలలో డేటా విశ్లేషణ, డైనమిక్స్ హీరో సోల్స్, వాయు నాణ్యత, కాలుష్యం, మానవ ఆరోగ్యం వంటి వాటిపై పరిశోధనలు నిరంతరంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆయా పరిశోధనల సంస్థల శాస్త్రవేత్తలు, బీఆర్ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ దుబే, డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ సలావుద్దీన్, బాపిరాజు పాల్గొన్నారు. -
ప్చ్.. గెలుపు అడ్డం తిరిగింది
చిన్న వయసు.. పెద్ద బాధ్యత మెదక్అర్బన్: పుర ఎన్నికల్లో పోటీ చేసిన పాతికేళ్ల యువతి భారీ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన కౌంటింగ్లో పట్టణంలోని 28వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన బొడికె అఖిల విజయం సాధించారు. కాగా 32 మంది కౌన్సిల్ సభ్యుల్లో అతిపిన్న వయస్కురాలు ఆమె. బీఫార్మసీ పూర్తి చేసిన అఖిల.. భర్త భరత్ ప్రోత్సాహంతో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మోదం.. ఖేదంమెదక్అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. గెలుపుపై ఆశతో ఒకే కు టుంబీకులు.. బంధుమిత్రులు నానా తంటాలు పడి టికెట్లు సాధించుకొని ఎన్నికల బరిలో నిలిచారు. చివరకు ఓటర్లు కొందరికి మోదాన్ని, మరికొంత మందికి ఖేదాన్ని మిగిలిస్తూ తమ తీర్పునిచ్చారు. మచ్చుకు కొన్ని.. ఇద్దరు తోటికోడళ్లు పోటీలో నిలవగా, 7వ వార్డు నుంచి బరిలో నిలిచిన మాయ అనురాధ పరాజయం పాలవగా, 8వ వార్డు నుంచి పోటీ చేసిన మాయ గంగమణి విజయం సాధించారు. మరో కుటుంబానికి చెందిన తల్లీ బట్టి లలిత 17వ వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోగా ఆమె కొడుకు బట్టి ఉదయ్ 29వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 20, 29వ వార్డుల నుంచి బాబాయ్, అబ్బాయిలు బొద్దుల కృష్ణ, నవీన్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అలాగే 3, 4వ వార్డుల్లో బరిలో దిగిన వదిన–మరదలు కొట్టాల లలిత, ధర్మశెట్టి స్వరూప విజయం సాధించారు. హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మున్సిపల్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకులు పరాజయం పాలుకాగా, కొత్తగా రాజకీయ ఆరంగేట్రం చేసిన అభ్యర్థులు అనూహ్య విజయం సాధించారు. బీఆర్ఎస్లో చైర్పర్సన్ పదవిపై ఆశతో బరిలోకి దిగిన ముఖ్య నేతలు ఓటమి చెందగా.. కాంగ్రెస్లో పీఠం ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు విజయం సాధించడంతో బహు ముఖ పోటీ ఏర్పడింది. కాంగ్రెస్లో ఇమడ లేక చైర్మన్ పదవిని ఆశించి ఇటీవలే బీఆర్ఎస్లోకి వచ్చిన ఓ సీనియర్ నాయకుడు తన సతీమణిని బరిలో నిలిపారు. అలాగే ఇద్దరు మాజీ చైర్మన్లు తమ సతీమణులను చైర్మన్ ఆశతో పోటీ చేయించారు. కాగా ఈ ముగ్గురు మహిళలు అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉన్నప్పటికీ చైర్మన్ అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీలో బహుముఖ పోటీ ఇక అధికార కాంగ్రెస్లో ఆశావహులు ఎక్కువ మంది గెలుపొందడంతో చైర్మన్ పదవిపై పోటీ నెలకొంది. బీఆర్ఎస్ రాష్ట్ర నేతకు నమ్మిన బంటుగా ఉన్న ఓ మాజీ కౌన్సిలర్ ఎన్నికల ముందు అనూహ్యంగా పార్టీ మారి కాంగ్రెస్లో చేరాడు. పుర పీఠాన్ని ఆశించి తన కోడలును పోటీలో దించాడు. గతంలో పలుమార్లు కౌన్సిలర్గా పోటీ చేసి ఓటమి పాలైన ఓ నాయకుడు ఈసారి చైర్మన్ పదవిని ఆశిస్తూ తన సతీమణిని రంగంలోకి దించాడు. అలాగే ఇప్పటికే సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్న తల్లీతో పాటు కుమారుడు ఇద్దరు విజయం సాధించారు. మరో ప్రభుత్వ ఉద్యోగి చైర్మన్ పదవిపై ఆశతో తన సతీమణిని పోటీలో దింపి ఒకే ఒక ఓటుతో విజయం సాధించారు. ఇలా అధికార పార్టీలో పీఠం కోసం బహుముఖ పోటీ ఏర్పడింది. -
మెతుకుసీమలో హంగ్ రాజకీయం ఆసక్తికరం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హంగ్ ఫలితాలు వచ్చిన బల్దియాల్లో రాజకీయం రంజుగా మారింది. ఆయా మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అవసరమైన మ్యా జిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండటంతో ఆయా బల్దియాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సాపూర్లో 15 స్థానాల్లో ఐదు స్థానాలను సాధించిన బీఆర్ఎస్ మ్యాజిక్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ చైర్మన్ పీఠాన్ని సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఇక్కడ కీలకంగా మారింది. ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ, ఎక్స్అఫీషియో సభ్యుల బలం లేకపోవడం కాంగ్రెస్ మైనస్గా మారింది. మెదక్లో 32 స్థానాలకు కాంగ్రెస్ 14 గెలుచుకుంది. బీఆర్ఎస్ 15 సాధించింది. బీఎస్పీ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్లో చేర్చుకోవడంతో ఈ రెండు పార్టీల బలం సమానం అయ్యాయి. ఇక్కడ బీజేపీ రెండు స్థానాలతో పాటు, ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర దగ్గర పడుతుంది, పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారంటూ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం జాతర ఏర్పా ట్లను పరిశీలించారు. తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్, దర్శన ఏర్పాట్లు, సాంసృతిక కార్యక్రమాలు టాయిలెట్స్, బారికేడ్లను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరకు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతం చేయాలని ఆదేశించారు. ఆయ న వెంట ఈఓ వీరేశం, సిబ్బంది పోలీసులు ఉన్నారు. పెద్దశంకరంపేట(మెదక్)/హవేళిఘణాపూర్: మండల పరిధిలోని జంబికుంట, రామోజీపల్లి, బూర్గుపల్లి, పెద్దశంకరంపేట సబ్స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ తెలిపారు. అలాగే మెదక్ మండలం మంభోజిపల్లి సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా దాని పరిధిలోని గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మోహన్బాబు తెలిపారు. మెదక్కలెక్టరేట్: విద్యార్థులు చట్టాలపై అవగాహన అవసరమని భరోసా కో ఆర్డినేటర్ సౌమ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాజంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను ఉదాహరణలతో తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయ శ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురుకులం.. కోలాహలంవర్గల్(గజ్వేల్): వార్షికోత్సవ సంరంభంతో వర్గల్ పూలే బాలికల గురుకులం అలరారింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గురుకులంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక జ్యోతిబాపూలే బీసీ బాలికల స్కూల్, జూనియర్ కళాశాలలో గురువారం రాత్రి ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. వార్షికోత్సవ సంరంభానికి బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు, ఐఆర్ఎస్ అధికారి శోభన్బాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మెదక్ ఆర్సీఓ రాజేశం, నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్, ఆతిథ్య గురుకుల ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ‘రామాయణం’ నాటక ప్రదర్శనతో చిన్నారులు ఆకట్టుకున్నారు. అతిథుల ప్రశంసలు చూరగొన్నారు. -
మెదక్లో హంగ్
మెదక్జోన్/మెదక్అర్బన్: మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు హంగ్కు దారితీశా యి. కమలం కీలకమై వికసించగా, బీఎస్పీ మద్దతు ఆపన్నహస్తంగా మారింది. అధికార కాంగ్రెస్ ఆశించిన ఫలితం సాధించకపోగా, కారు దూసుకెళ్లింది. కాగా అధికారం కైవసం చేసుకోవడానికి మద్దతు తప్పనిసరి అయింది. శుక్రవారం పట్టణంలోని వెస్లీ కాలేజీలో జరిగిన ఓట్ల లెక్కింపు అభ్యర్థుల్లో ఉత్కంఠను రేపాయి. అడుగుదూరంలో మ్యాజిక్ ఫిగర్.. మున్సిపాలిటీలో 32 వార్డులుండగా బీఆర్ఎస్ 15 సీట్లు దక్కించుకొని అధికారానికి అడుగు దూరంలో నిలిచింది. కాగా అధికార కాంగ్రెస్కు 14 సీట్లు రాగా, బీజేపీ రెండు, బీఎస్పీ ఒక్క స్థానం దక్కించుకొని నిర్ణయాత్మక శక్తిగా ఎదిగాయి. కనీసం బీజేపీ మద్ద తు పొందితే అధికారాన్ని దక్కించుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. అవసరం అయితే ఎక్స్ అఫీషియో ఓట్లతో అధికారం పొందాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇకబీఎస్పీ, బీజేపీ మద్దతుతో పాటు ఎమ్మెల్యే, ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకొని పీ ఠం కై వసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. కమలంతో దోస్తీకి యత్నాలు ‘రాజకీయంలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేదీ జగమెరిగిన సత్యం. బీజేపీ అభ్యర్థుల మద్దతు కోసం ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బీజేపీ నాయకులతో మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీలో తనతో సంబంధాలున్న నాయకుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అవసరమైతే వైస్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కూడా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీ ఎస్పీ కౌన్సిలర్తో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఈ ముగ్గురి మద్దతు లభిస్తే పుర పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగైనా మున్సిపాలిటీని కై వసం చేసుకోవడానికి కారు పార్టీ జోరుగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్రావు రంగంలోకి దిగినట్లు సమాచారం. వీరు బీజేపీ మద్దతు కూడగడితే మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారు. అంతేకాకుండా ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎక్స్ అఫీషియోల ఓటు హక్కుతో పుర పీఠాన్ని కై వసం చేసుకునే యత్నం చేస్తున్నారు. ప్రత్యర్థుల అవసరాన్ని తమకు అనకూలంగా మలుచుకొని వైస్ చైర్మన్ పదవి పొందేందుకు కమలనాథులు స్కెచ్ వేసినట్లు తెలిసింది. బీజేపీ మద్దతిస్తేనే ఆ రెండు పార్టీలో ఎవరో ఒకరు పీఠాన్ని అధిష్టిస్తారు. అయితే వైస్ చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతిస్తామని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెల్సింది. ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్ కీలకంగా మారిన కమలం బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1 ఉత్కంఠ భ రితంగా సాగిన ఓట్ల లెక్కింపు -
ప్రశాంతంగా కౌంటింగ్
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో శుక్రవారం మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నా రు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. నాలుగు మున్సిపాలిటీల్లో జరిగిన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణ పరిధిలోని వెస్లీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతలను పరిరక్షించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అంతకు ముందు కౌంటింగ్ ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ అధికారులతో కలిసి పరిశీలించారు. -
రేపే కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం
● మహా శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం ● తరలిరానున్న భక్తజనం కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యకేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సంసిద్ధమైంది. పరమశివుడి ప్రతిరూపంగా, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి నిరంతర అభిషేకాలు చేయనున్నారు. యాదవ సంప్రదాయం ప్రకారం తోటబావి ప్రాంగణంలో ఆదివారం పెద్దపట్నం వేసి స్వామి వారికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో పట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి తొక్కుతూ స్వామి వారిని దర్శించుకుంటారు. పట్నాన్ని తిలకించి చిందేస్తే తమ కష్టాలు కడతేరుతాయని భక్తుల నమ్మకం. -
క్యాంపు పాలిట్రిక్స్!
● రహస్య ప్రాంతాలకు అభ్యర్థులు ● హోరాహోరీగా తలపడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మెదక్జోన్/రామాయంపేట(మెదక్)/నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందే జిల్లాలో క్యాంపు రాజకీయాలు షురూవయ్యాయి. ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా, ముందు జాగ్రత్తగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నేతలు తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. పోలింగ్ పూర్తికాగానే మూ డు పార్టీలకు చెందిన వారిని ప్రత్యేక వాహనాల్లో రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. రామాయంపేటలో మున్సిపల్ ఫలితాలకు సంబంధించి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని సమాచారం. దీంతో చైర్మన్ ఎన్నిక కోసం గెలుపొందే ప్రతి కౌన్సిలర్ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ అభ్య ర్థులు బుధవారం రాత్రే క్యాంపునకు తరలగా, కాంగ్రెస్ అభ్యర్థులను గురువారం తరలించారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయానికి వారంతా నేరుగా కార్యాలయానికి రానున్నట్లు సమాచారం. అలాగే మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థు లను క్యాంపునకు తరలించారు. పావులు కదుపుతున్న నేతలు నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియక ముందే తమ అభ్యర్థులు చేజారకుండా క్యాంపు రాజకీయాలను చేపట్టారు. ఆయా పార్టీల నాయకులు తమ, తమ అభ్యర్థులను గురువారం మధ్యాహ్నం నుంచి క్యాంపులకు తరలించే పనులు మొదలు పెట్టారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు బీజేపీ అభ్యర్థులకు హైదరాబాద్లో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యే సునీతారెడ్డి హైదరాబాద్ శివా రులో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థులను నియోజకవర్గ ఇన్చార్జి ఆవు ల రాజిరెడ్డి హైదరాబాద్ శివారులోని క్యాంపులో ఉంచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపు అనంతరం ఓడిన అభ్యర్థులను ఇళ్లకు పంపి, గెలిచిన అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆయా పార్టీల నాయకులు ఏర్పాట్లు చేసి నట్లు సమాచారం. కాగా నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందని అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అభివృద్ధిని చూసి మాకే ఓటేస్తారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తుండగా, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీలు పక్కా వ్యూహాలతో ఈ ఎన్నికల్లో తలపడిన విషయం విదితమే. ఈ రెండు పార్టీలకు రెబెల్స్ కొంత ఇబ్బందులకు గురి చేశారు. ఇటు బీజేపీ కూడా మెరుగైన స్థానాలను దక్కించుకోబోతున్నామనే ధీ మాతో ఉన్నారు. కొన్ని కౌన్సిలర్ స్థానా ల్లో స్వతంత్రులు గెలుపొందే అవకాశాలూ కనిపిస్తున్నాయి. -
కౌంటింగ్లో ఆర్వోల పాత్ర కీలకం
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆర్వోలు, సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అన్నారు. గురువారం వెస్లీ కళాశాలలో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ను సందర్శించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. స్ట్రాంగ్ రూంకు మూడంచెల పోలీస్ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శుక్రవారం ఉదయం 5.45 గంటల వరకు ఆర్వో లు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా, టేబుల్ వారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలోని సెల్ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ -
పాత వాటికే పూత.. రూ.కోట్ల మేత
●ఏడుపాయలలో ఇష్టారాజ్యం ●అటవీ భూముల్లో నుంచి మట్టి తరలింపు ●పట్టించుకోని అటవీశాఖ అధికారులు ●15 నుంచి జాతర ప్రారంభం పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర పేరిట కాంట్రాక్టర్లు అడవి తల్లి గుండెల్లో గుణపాలు దించుతున్నారు. ‘రాజుల పైస రాళ్ల పాలు ’అన్నట్లు అక్రమంగా తరలించే అడవి మట్టికి రూ. లక్షలు రికార్డు చేస్తున్నారు. ఇటాచీ, జేసీబీలతో మట్టిని తీసి.. టిప్పర్లు, ట్రాక్టర్లలో జాతరకు తరలిస్తున్నారు. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన అడవి పెద్ద గోతులతో ఊట బావులను తలపిస్తోంది. తాత్కాలిక టాయిలెట్లకు పాత ఫ్లెక్సీ బోర్డులనే బిగిస్తున్నారు. వాటికి కనీసం లోపలి నుంచి టవర్ బోల్టులు లేక మహిళలకు రక్షణ కరువవుతోంది. తాత్కాలిక పనులకు.. పాత పూతలకు షరా మామూలే అన్నట్లు రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు. మాయమవుతున్న అడవి ఏడుపాయల జాతర వచ్చిందంటే చాలు.. కాంట్రాక్టర్ల కన్ను పచ్చని అడవులపై పడుతుంది. నాగ్సాన్పల్లి కమాన్ దాటగానే కుడి వైపునకు ఉన్న అటవీ భూముల్లో వందలాది టిప్పర్ల మట్టిని రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. గత జాతర సమయంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ. 23 లక్షలు చెల్లించగా, ఇందులో సింహభాగం మట్టి పనులే కావడం గమనార్హం. ఏటా ఈ హరిత హననం కొనసాగుతున్నా, అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. ప్రమాదమని తెలిసినా.. ఘనపురం ఆనకట్ల వద్ద ఇనుప జాలి వేసినా, భక్తులు నదిలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు. స్నానఘాట్ల వద్ద ఇనుపరాడ్లు ఏర్పా టు చేసినా, జాలి వేయ లేదు. ఐదేళ్లలో ఇక్కడ సుమారు 36 మంది భక్తులు చనిపోయారు. ఘనపురం ప్రాజెక్టుపై వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన ఇనుప గ్రిల్, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ విషయమై డీఎఫ్ఓ జోజిని వివరణ కోరగా అటవీ భూముల నుంచి మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురికి నీటిలోనే పుణ్యస్నానాలు ఆవాస ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీరు నేరుగా మంజీరాలో కలుస్తుంది. దిగువనే ఉన్న స్నానఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. పవిత్ర దుర్గమ్మ ఆలయం ఎదుట నుంచి కూడా, ఇదే మురికి నీరు పారుతోంది. అక్కడ భక్తులు స్నానాలు చేస్తుంటారు. మరికొంత మంది తీర్థంలా సేవిస్తుంటారు. ఇక తాత్కాలిక టాయిలెట్లకు ఏళ్ల తరబడి పాత ఫ్లెక్సీ డోర్లనే బిగిస్తున్నారు. గాలి వస్తే, డోర్ తెరుచుకునే పరిస్థితి. ఇది మహిళలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. తాత్కాలిక, సెమీ టాయిలెట్లు, జాతర సమయంలో పలుచోట్ల బ్లాక్ అవుతుంటాయి. పలుచోట్ల తాగు నీటి నల్లాలకు ట్యాప్లు లేవు. నీరంతా వృథాగా పోయి, వీధులు చిత్తడిగా మారుతున్నాయి. తాగునీరు, టాయిలెట్ల కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా గతేడాది సుమారు రూ.29.87 లక్షలు ఖర్చు చేశారు. -
భారీ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెస్లీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కౌంటింగ్ సెంటర్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని కచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం, ఊరేగింపులు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. -
కౌంట్డౌన్
మెదక్జోన్/రామాయంపేట/నర్సాపూర్/తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్స్లను లెక్కిస్తారు. కాగా ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నాలుగు బల్దియాల్లో 74 వార్డులకు ఎన్నికలు జరగగా, కౌంటింగ్ కేంద్రాలను ఆయా మున్సిపాలిటీల్లోనే ఏర్పాటు చేశారు. మెదక్కు సంబంధించి వెస్లీ కాలేజీ, నర్సాపూర్ ఓట్ల లెక్కింపు బీవీఆర్ఐటీ, తూప్రా న్ ఓట్ల లెక్కింపు నోబెల్ డైట్ ఫార్మసీ కాలేజీ, రామాయంపేట లెక్కింపు ప్రక్రియ ఎంపీడీఓ కార్యాలయంలో జరగనుంది. మూడు రౌండ్లు.. 26 టేబుళ్లు మెదక్ మున్సిపాలిటీని 31 వార్డులను 11 టేబుళ్ల ద్వారా లెక్కించనున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులలో 16,876 మంది ఓటర్లు ఉండగా, 13,266 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో 15 వార్డులున్నందున, మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మొదటి రౌండ్లో 1, 4, 7, 10, 13 వార్డుల ఓట్లు లెక్కిస్తారు. రెండో రౌండ్లో 2, 5, 8, 11, 14 వార్డులు, మూడో రౌండ్లో 3, 6, 9, 12,15 వార్డుల ఓట్లు లెక్కించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. రామాయంపేటలో మొత్తం 13,095 ఓటర్లకు గాను 11,110 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 12 వార్డులకు సంబంధించి 4 టేబుళ్లు ఏర్పాటు చేయ గా, మూడు రౌండ్లలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గానూ 6 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కాగా ఒక్కో టేబుల్కు మొత్తం ఐదు గురి అధికారులతో కలిపి మొత్తం 26 టేబుళ్లకు 130 మంది అధికారులను కేటాయించారు. కా గా 25 ఓట్ల చొప్పున బండిల్స్ను కట్టి ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తవుతుందని అధికారు లు అంచనా వేస్తున్నారు. కాగా ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సర్వత్రా అలుముకున్న ఉత్కంఠ -
ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి రాందాస్ చౌరస్తా వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ–రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను రద్దు చేయాలన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసి కేంద్రం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు మేలు చేస్తుందని విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దేవయ్య, యశోద, దుర్గా, యాదగిరి, హమాలీ, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ -
మల్లన్న హుండీ ఆదాయం రూ.90లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ 21 రోజుల హుండీ ఆదాయం రూ.90 లక్షలకు పైగా వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. గురువారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో హుండీలలోని కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో లెక్కించారు. నగదు రూ.90,42,186, మి శ్రమ బంగారం 047 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోలు వచ్చినట్లు అధికారి తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గంగం నర్సింహారెడ్డి, సార్ల లింగం, ఎల్లయ్య, మల్లేశం,వరలక్ష్మి నాగరాజు ఆలయ ఏఈఓలు శ్రీనివాస్, ఆర్. సుదర్శన్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు చంద్రశేఖర్, స్వర్ణకారుడు నర్సింహచారి, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగి చేతివాటంకానుకలను లెక్కిస్తున్న సమయంలో ఓ ఆలయ ఉద్యోగి చేతివాటం చూపించారు. రూ.500 నోట్లను చాటుగా దాచాడు. అది గమనించిన హోంగార్డు తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. ఈఓ వెంకటేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలయంలో ప్లంబర్గా విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి సార్ల విజయ్కుమార్.. కానుకులను లెక్కిస్తున్న ఇద్దరి మహిళలనుంచి అధికారులకు ఇస్తానని చెప్పి రూ.500 నోట్లు 18 తీసుకుని చాటుగా అండర్వేర్లో ఉంచారు. హోంగార్డు శ్రీనివాస్ గమనించి అతనిని బాత్రూంలోకి తీసుకువెళ్లి చెక్చేశారు. దీంతో అతని వద్ద రూ.9 వేలు లభించాయి. వెంటనే ఆలయ అధికారులు సీసీ కెమెరాను పరిశీలించి అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓ తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. గతంలో కూడా ఈ ఉద్యోగి చోరికి పాల్పడగా.. పలు కేసులు నమోదయ్యాయి. -
బోర్లు.. బావులు.. చెరువులు
● పక్కాగా సాగు నీటి వనరుల లెక్క ● మరో రెండు రోజుల్లో పూర్తి కానున్న సర్వే రేగోడ్(మెదక్): ఏ ఏ గ్రామాల్లో ఎన్ని నీటి వనరులు ఉన్నాయి.. వాటి కింద ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయనే పక్కా లెక్క కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సర్వే చేపట్టింది. వ్యవసాయ బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంల సమగ్ర సమాచారం జిల్లాలోని ఆయాశాఖల అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల్లోని 380 రెవెన్యూ గ్రామాల్లో గత నెల మొదటి వారం నుంచి పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, జీపీఓలు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేయడంతో పాటు జియో ట్యాగ్ చేస్తున్నారు. మొత్తం 34 రకాల అంశాలపై సమాచారం సేకరిస్తుండగా, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలకు రెండోసారి, బోర్లు, బావులకు ఏడో సారి సర్వే చేస్తున్నారు. గతంలో చేసిన సర్వే ప్రకా రం జిల్లాలో మొత్తంగా బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు కలిపి 74,217 ఉన్నాయి. వాటిలో 55,258 నీటి వనరులకు సర్వే (74.5%) పూర్తి చేశారు. కాగా సర్వే ఈనెల 10వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఏఎస్ఓ రమేశ్ తెలిపారు. -
కేతకీ బ్రహ్మోత్సవాలు షురూ
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి, తదితర పూజల్ని చేశారు. అదేవిధంగా అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. అనంతరం ఆలయ అర్చకు లు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్రావు పాటిల్, పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈవో శివ రుద్రప్ప, సర్పంచ్ ఫోరం మండల మాజీ అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, పాలకమండలి సభ్యుడు మల్లయ్య స్వామి, నాయకులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమాలను సహించేది లేదు
అల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు జరిగితే సహించేది లేదని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం హెచ్చరించారు. మండలంలోని ముస్లాపూర్లో బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇంటి నిర్మాణాలను త్వరగా చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. జిల్లాలో 9,208 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 1,457 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 4,642 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.100 కోట్ల పైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. బిల్లుల మంజూరు, ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడితే 19005395091, 8712082717 నంబర్లకు పిర్యాదు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఈ ప్రసన్న, ఏఈ ఆక్రమ్, మాజీ ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం -
‘పేట’లో ఇరువర్గాల బాహాబాహీ
రామాయంపేట(మెదక్): చెదురుమదురు ఘటనలు మినహా రామాయంపేటలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. బీసీ కాలనీ ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ ఎదుట బారులు తీరారు. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి, కోమటిపల్లిలో గిరిజనులు ట్రాక్టర్లలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడో వార్డు పరిధిలోని గుల్పర్తిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగగా పోలీసులు సకాలంలో చేరుకొని సముదాయించారు. ఒకటో వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, పోలీసులు వారిని వారించారు. ఉదయం 9 గంటల వరకు కేవలం 15 శాతం, 11 గంటల వరకు 40, మధ్యాహ్నం 1 గంట వరకు 61 శాతం ఓట్లు పోలయ్యాయి. కలెక్టర్ రాహుల్రాజ్ పట్ణణంలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. -
లిఫ్టు పనులు వేగిరం చేయండి
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ, గడ్డిని వెంటనే తొలగించాలని, చంద్లాపూర్ లిఫ్టు పనులు త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో లిఫ్టు ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్దగల ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి మల్లన్న సాగర్ నీటి విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు ఆందోళన చెందుతున్నారని, మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 13న రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. ఇర్కోడ్ లిఫ్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోపులాపూర్, కస్తూరిపల్లి గ్రామాల వద్ద నిర్మించే చెక్డ్యామ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అల్లీపూర్ వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అల్లీపూర్ కర్నాల కుంటకు నీళ్లు వచ్చేలా లిఫ్టు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కెనాల్లోని తుంగ, గడ్డి తొలగించాలి మాజీ మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష -
నర్సాపూర్లో నువ్వా..నేనా!
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికలు నర్సాపూర్లో హోరాహోరీగా సాగాయి. పట్టణంలో 15 వార్డులుండగా 63 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాగా ఎక్కువ చోట్ల త్రిముఖ పోటీ ఉండగా, పలు చోట్ల ద్విముఖ పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ అభ్యర్థులకు నష్టం కల్గిస్తారనే చర్చలు పోలింగ్ పూర్తవగానే మొదలయ్యాయి. కాగా గతంలో చైర్మన్ పదవి బీఆర్ఎస్ దక్కించుకోగా, మళ్లీ ఈసారి దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నాయకులు సైతం పీఠం కోసం ప్రయత్నాలు చేశారు. కాగా గతంలో బీజేపీకి ఆరు స్థానాలు దక్కగా, ఈసారి ఎలాగైనా చైర్మన్ గిరిని దక్కించుకోవాలని గట్టిగానే పోరాడింది. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రచారం చేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేశారు. కాగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాల హామీలు, తాయిలాలు ఇచ్చారు. కాగా పలు చోట్ల ఆయా పా ర్టీల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులున్నాయి. ఏ పార్టీకి ఎన్ని కౌన్సిలర్ స్థానాలు దక్కుతాయనే విషయంపై అన్ని పార్టీల్లో సందిగ్ధం నెలకొంది. -
ఓటెత్తారు
ప్రశాంతంగా ‘పుర’ పోలింగ్ ● జిల్లావ్యాప్తంగా 81.09 శాతం నమోదు ● రామాయంపేటలో అత్యధికం ● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలుమెదక్జోన్: మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 81.9 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ బల్దియాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగగా, క్యూలైన్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో రాత్రి 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 75 వార్డులకు గానూ మెదక్లో ఒక్క వార్డు ఏకగ్రీవం కాగా, మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోగా, పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. మెదక్లోని ఓ పోలింగ్ బూత్లోకి దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ మైనర్ బాలుడిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఎమ్మెల్యే రోహిత్రావు ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని 13వ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకోగా, పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 86,109 మంది ఓటర్లు ఉండగా, 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా రామాయంపేట బల్దియాలో 84.84 శాతం నమోదు కాగా, తూప్రాన్లో 81.30 శాతం మూడో స్థానంలో మెదక్ 80.75, అతితక్కువగా నర్సాపూర్లో 73.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉద్రిక్తత..లాఠీచార్జి నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం అర్థరాత్రి పట్టణంలోని 10, 11 వార్డులకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ మొదలై పెద్దగా కావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కాగా అదే రాత్రి పట్టణంలోని 4, 5 వార్డులలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరగగా, పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా బుధవారం పోలింగ్ ప్రారంభమైన అనంతరం పట్టణంలోని 15వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు ఆంజనేయులుగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు భిక్షపతిలతో పాటు వారి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. అలాగే 8వ వార్డులో ఇరువర్గాల మధ్య గొడవ జరగగా పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఆయా ఘటనలకు సంబంధించి ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని ఎస్ఐ రంజిత్రెడ్డి తెలిపారు.పోలింగ్ సరళి ఇలా..మున్సిపాలిటీ మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు శాతం మెదక్ 35,879 28,975 17,049 18,830 80.75నర్సాపూర్ 16,876 13,257 8,219 8,657 73.61రామాయంపేట 13,095 11,110 6,291 6,804 84.84 తూప్రాన్ 20,259 16,470 9,957 10,302 81.30పోలింగ్ శాతం ఇలా...ఉదయం 9 గంటల వరకు : 13.65 % ఉదయం 11 గంటల వరకు : 35.94% మధ్యాహ్నం 1 గంట వరకు : 57.88% మధ్యాహ్నం 3 గంటల వరకు : 71.65% పోలింగ్ ముగిసే సమయానికి : 81.09% -
మెదక్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత
సాక్షి, మెదక్ జిల్లా: మెదక్ మున్సిపాలిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో అర్ధరాత్రి డబ్బులు పంచుతూ కాంగ్రెస్ కార్యకర్తలు దొరికిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. డబ్బులు పంచుతున్నారంటూ కారుపై బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. అర్ధరాత్రి పూట వార్డుల్లోకి రావాల్సిన అవసరం ఏంటి అని కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవకు దారి తీసింది.కాగా, బల్దియా ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాలకు తెరలేపారు. డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు షురూ చేశారు. ప్రధానంగా మెదక్ మున్ని పాలిటీలో డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులకు వచ్చిన నిధులతో పాటు కొంత వారు కలిపి పంచుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని 5 వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.4 నుంచి రూ. 5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. వాటిలో ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించటమే లక్ష్యంగా ఆయా పార్టీలకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిసింది.ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు.. కానీ ఆ వార్డులో ప్రత్యర్థి ఓడిపోవాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. డబ్బుల పంపిణీలో కేవలం కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులకు ఇచ్చి నేరుగా ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుడా ఫోన్లలో సైతం రహస్య విషయాలు మాట్లాడటం లేదు. ఎందుకంటే ప్రత్యర్థులు రికార్డు చేసి బహిర్గతం చేస్తారనే భయంలో అభ్యర్థులు కనీసం వారి నీడను కూడా నమ్మకుండా జాగ్రత్తలు పడుతున్నారు. జిల్లాలోని 74 వార్డుల్లో ఇదే పరిస్థితి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాహుల్రాజ్ సోమవారం తెలిపారు. ఈనెల 11న జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కు జరుగుతుందన్నారు. అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమాల ను తప్పనిసరిగా పాటించాలన్నారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని వెస్లీ జూనియర్ కళాశాల, నర్సాపూర్ బీవీఆర్ఐటీ, తూప్రాన్ నోబుల్ ఫార్మా కాలేజ్, లింగారెడ్డిపల్లి, రామయంపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచే పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. అంతకుముందు జిల్లాలోని ఎన్నికల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 11న స్థానిక సెలవుగా ప్రకటించారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అసిస్టెంట్ కమిషనర్ మకరందుకు కలెక్టర్ స్వాగతం పలికారు. ఇదిలాఉండగా మెదక్ మున్సిపాలిటీ పరిధి 18వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ రాహుల్రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఓటరు స్లిప్ను బూత్స్థాయి అధికారి కలెక్టర్కు అందజేశారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
‘పుర’ ప్రచారానికి తెర
మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్దిరోజులుగా గల్లీల్లో వినిపించిన మైకుల హోరు, పార్టీల ప్రచార జోరుకు తెరపడింది. పోలింగ్కు కౌంట్డౌన్ షురూ అయింది. ఆఖరి రోజు సోమవారం అన్ని పార్టీల ముఖ్య నేతలు రోడ్షోలు, కార్నర్ మీటింగ్లతో ఓటర్లను ఆకట్టుకున్నారు. జిల్లాలో మెదక్, రామా యంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఇందులో మెదక్ పట్టణంలో ఒక వార్డు ఏకగ్రీవం అయింది. ఇక మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఆరు రోజులుగా అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక పార్టీపై మరో పార్టీ నేతలు విమర్శలు గుప్పించుకున్నారు. జోరుగా డబ్బుల పంపిణీ బల్దియా ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాలకు తెరలేపారు. డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు షురూ చేశారు. ప్రధానంగా మెదక్ మున్ని పాలిటీలో డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులకు వచ్చిన నిధులతో పాటు కొంత వారు కలిపి పంచుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని 5 వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ. 4 నుంచి రూ. 5 వేల చొప్పున పంపి ణీ చేసినట్లు సమాచారం. వాటిలో ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించటమే లక్ష్యంగా ఆయా పార్టీలకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిసింది. ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు.. కానీ ఆ వార్డులో ప్రత్యర్థి ఓడిపోవాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. డబ్బుల పంపిణీలో కేవలం కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులకు ఇచ్చి నేరుగా ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుడా ఫోన్లలో సైతం రహస్య విషయాలు మాట్లాడటం లేదు. ఎందుకంటే ప్రత్యర్థులు రికార్డు చేసి బహిర్గతం చేస్తారనే భయంలో అభ్యర్థులు కనీసం వారి నీడను కూడా నమ్మకుండా జాగ్రత్తలు పడుతున్నారు. జిల్లాలోని 74 వార్డుల్లో ఇదే పరిస్థితి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. పట్టణాల్లో ప్రలోభాల ఎర జిల్లాలో 4 మున్సిపాలిటీలు 74 వార్డు స్థానాలు రేపే పోలింగ్ -
కథ చెప్పి.. స్ఫూర్తి నింపి
కౌడిపల్లి(నర్సాపూర్): అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువులో వెనుకబడిన విద్యార్థి, అమెరికాలో కంపెనీ ప్రారంభించే స్థాయికి ఎదిగిన తీరును కథగా చెప్పి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు డీఈఓ విజయ. సోమవారం కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం పదో తరగతిలో విద్యార్థులతో మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు కుంగిపోవద్దని, ఇష్టంతో శ్రద్ధగా చదివితే సాధించలేనిది ఏది లేదన్నారు. తాను మెదక్ ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు డీఈఓగా వచ్చానని, మీరు సైతం ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. జిల్లాలో 220 పాఠశాలల్లో 11,247 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని, వీరి కోసం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాయిలాపూర్ ఉన్నత, కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు.విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన డీఈఓ విజయ -
దుర్గమ్మ చెంత అవినీతి దందా
చైర్మన్ గిరి.. నేతల గురి సదాశివపేట చైర్పర్సన్ పదవి జనరల్మహిళకు రిజర్వు కావడంతో ఆసక్తిపెరిగింది. వివరాలు 8లో uమంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026నిధుల వరద.. ● మట్టి చల్లు.. నీళ్లు పట్టు.. లక్షలు కొట్టు ● పర్సంటేజీల ఆశలో అధికారులుపాపన్నపేట(మెదక్): ‘పంచాయతీరాజ్ శాఖ ద్వా రా గత ఏడుపాయల జాతరకు సంబంధించి రూ. 22.30 లక్షల పనులు చేస్తే, చెక్ నంబర్ 649125తో రూ. 20 లక్షలు ఎమర్జింగ్ టెక్నో సర్వీసెస్’ అనే ఒక ఫర్మ్కు చెల్లించారు. అది కూడా ఓ స్థానిక నాయకుడికి చెక్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి జాతర పనులు టెండర్లు నిర్వహించకుండా, నాయకులు సూచించిన ఫర్మ్ (సంస్థ)లకే అప్పజెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతర వచ్చిందంటే పండుగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం దారి తప్పుతోంది. లక్షలాది భక్తుల ఆనందం కోసం సంబరంగా నిర్వహించాలనుకున్న మహా జాతర.. కాంట్రాక్టర్లకు.. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2024– 25 శివరాత్రి జాతరకు రూ. 2 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు కాగా, ఏడుపాయల ఈఓ ద్వారా రూ. 93,04,139 ఖర్చయ్యాయి. ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా రూ.1,06,95,861 ఖర్చు చేశారు. జాతరలో సుమారు 33 శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ శాఖ, ఫిషరీస్, పోలీస్, ఆర్అండ్బీ శాఖల ద్వారా రూ. 90.80,254 ఖర్చు చేశారు. ఇందులో కూడా సింహభాగం తాత్కాలిక పనులే. ఏజెన్సీల పేరిట స్థానిక నాయకులే పని చేసి, అధికారులకు, ఏజెన్సీలకు ఎవరి వాటాలు వారికి ముట్ట జెప్పారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా రూ. 5 లక్షలు దాటితే టెండర్ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకే ఏజెన్సీకి రూ. 20 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం.2ఫర్మ్ల పేరు.. నాయకుల జోరు జరిగిన తంతు ఇలా.. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా కేవలం జంక్షన్ల వద్ద సైన్ బోర్డులు, బుష్ కట్టింగ్, మట్టి వేసి చదును చేసేందుకు రూ. 24,14,200 చెల్లించారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. మిషన్ భగీర థ ద్వారా తాత్కాలిక టాయిలెట్ల నిర్వహణ, వాటికి బ్యానర్ డోర్స్, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, తాగు నీటి ట్యాప్ల మరమ్మతులు, స్కావెంజర్ల భృతికి రూ. 22,54,660 ఖర్చు చేశారు. వీటిలో ట్యాంకర్ల చెల్లింపు, ఫ్లెక్సీ బ్యానర్ డోర్లు, షవర్ల ఏర్పాటులో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా రూ.15.25 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో సేఫ్టీ గ్లౌవ్స్, క్యాప్స్, టీషర్ట్లు, బ్లాక్ కవర్స్, బ్లీచింగ్ ఫౌడర్, ఫ్లెక్సీ బోర్డులు కొనుగోలు చేశారు. ఇందులో బిల్లులు ఎక్కువగా చూపినట్లు విమర్శలున్నాయి. కాగా మల్టీ పర్పస్ వర్కర్స్ టీఏలకు రూ. 2,28,500, అకామిడేషన్ హాల్కు రూ.48 వేలు, రోజు వారి సపాయి కార్మికులకు రూ. 5,82 లక్షలు చెల్లించినట్లు చూపారు. ఫిషరీస్ కార్యాలయం నుంచి రూ.10,53,282 ఖర్చు చేశారు. గజ ఈతగాళ్లకు, టీషర్ట్లు, క్యాప్లకు, బోట్ కిరాయిలు, భోజనాలకు చెల్లించారు. అయితే ఆలయం నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు భోజన వసతి కల్పించినప్పటికీ, వీరు భోజన ఖర్చులకు గాను హోటల్ ద్వారా రూ. 2.50 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడం గమనార్హం. ఆర్అండ్బీ శాఖ వారు రూ. 10.25 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. పార్కింగ్, చెక్ డ్యాం, స్నానఘాట్లు, క్యూలైన్ల వద్ద బారికేడ్ల ఏర్పాటుకు ఈ ఖర్చును చూపారు. పోలీస్శాఖకు ఆలయం నుంచి ఆవాస, భోజన సౌకర్యాలు కల్పించినప్పటికీ ఖర్చుల పేరిట రూ.9,92,312 చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి చెల్లింపులు లేక పోయినప్పటికీ, రెండేళ్ల నుంచి ఎస్డీఎఫ్ నుంచి ఖర్చులు చెల్లిస్తున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 10 శాతం కమీషన్ తీసుకొని, జాతర పనులను అడ్డగోలుగా రికార్డు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
నిర్భయంగా ఓటు వేయండి
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. సోమవారం మెదక్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా పట్టణంలోని వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడల్ డే కేర్ సెంటర్ పోలింగ్ కేంద్రాన్ని, అలాగే దయరా, నవాబ్పేట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ మహేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
74 వార్డులు.. 148 కేంద్రాలు
రామాయంపేట(మెదక్): నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్తించిన కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. మెత్తం 75 వార్డులకు గాను మెదక్లో ఒక వార్డు ఏకగ్రీవం కాగా, మిగితా 74 వార్డుల్లో 148 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వసతులు లేని కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. ఒక్కో బూత్లో ఒక సీసీ కెమెరాను బిగించి అవసరమైన చోట ర్యాంపులు నిర్మించారు. పూర్తి స్థాయిలో వసతుల కల్పన మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 62 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. పిట్లంబేస్లో ఉన్న పోలింగ్ కేంద్రం కిటికి పాక్షికంగా శిథిలమవడంతో కొత్తగా ఏర్పాటు చేశారు. పాత ర్యాంపులకు మరమ్మతులు చేయించారు. కొత్తగా మరో పది వరకు నిర్మించారు. వీటితో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయించి లైటింగ్ సదుపాయం కల్పించారు. మెదక్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమరాలు బిగించారు.రామాయంపేటలోని 24 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో లైట్లు ఫ్యాన్లు, సీసీ కెమెరాలు బిగించారు. పట్టణంలో స్నేహ కళాశాలలో ఉన్న మూడు పోలింగ్ కేంద్రాలకు మూడు ర్యాంపులు నిర్మించాల్సి ఉండగా, కేవలం ఒకటి మాత్రమే నిర్మించారు. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెండు కేంద్రాల్లో సైతం ర్యాంపులు నిర్మించాల్సిన అవసరం ఉంది. తూప్రాన్లోని 32 పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలకు మరమ్మతులు చేశారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ర్యాంపు నిర్మాణానికి స్థలం సరిపోకపోవడంతో ఫ్లైవుడ్తో ఏర్పాటు చేశారు. నర్సాపూర్లోని 30 పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం పూర్తయింది. లైటింగ్, ఫ్లాన్లు బిగించారు. మరుగుదొడ్లకు మరమ్మతు చేశారు.కేంద్రాలుజిల్లాలో ఇలా... మున్సిపాలిటీ వార్డులు పోలింగ్మెదక్ 32 64 నర్సాపూర్ 15 30 తూప్రాన్ 16 32 రామాయంపేట 12 24 ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటు ర్యాంపుల నిర్మాణం సైతం పూర్తి -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ కలెక్టరేట్: ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం స్పష్టం చేశారు. సైలెన్స్ పీరియడ్లో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఈ అంశంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ రోజు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. జిల్లా ప్రజలు ఎన్నికల నిబంధనలను గౌరవించి పోలీస్శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం -
12న సార్వత్రిక సమ్మె
చిన్నశంకరంపేట(మెదక్): కార్మికుల హక్కులకు విఘాతం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల 12న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కోరారు. సోమవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సార్వత్రిక ప్రచార యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నూతన లేబర్కోడ్లను అమల్లోకి తెచ్చిందన్నారు. దీంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ సహాయ కార్యదర్శి గౌరీ, అజయ్, దుర్గా, శౌకత్ పాల్గొన్నారు. గజ్వేల్: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను, అబద్దాలు చెప్పే బీజేపీనీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న, 14వవార్డు అభ్యర్థి శీరిషలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై తీరుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు.చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి: మంత్రి పొన్నం హుస్నాబాద్: పాత కాలం వారు మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు సేవలను ఎలా గుర్తు చేసుకుంటున్నారో హుస్నాబాద్లో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేసి తీరుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మున్సిపాలిటీల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్ల చరిత్రలో మొదటి సారి మంత్రి అయ్యే అవకాశం హుస్నాబాద్కు వచ్చిందన్నారు. భవిష్యత్లో నీటి చుక్క దుకాణాల్లోకి రాకుండా రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో పనులు ప్రారంభించామన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా హుస్నాబాద్ను కరీంనగర్ మున్సిపాలిటిలో కలపడం తథ్యమన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. బస్ స్టేషన్ను అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లేలా చేశామన్నారు.‘ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం’ -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
తూప్రాన్: తూప్రాన్ అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. తూప్రాన్ మున్సిపాలిటీని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాలించారని, ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కేసీఆర్ తన సొంత నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మినహా ఇక్కడికి వచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఫౌంహౌస్కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందన్నారు. కార్యక్రమంలో బీ జేపీ నాయకులు దుర్గరాజు, వేణుగోపాల్, తాటి విఠల్, సురేశ్గౌడ్, నాగరాజు, అమర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
కాంగ్రెస్కు ఓటెందుకెయ్యాలి
మెదక్జోన్/రామాయంపేట/నర్సాపూర్ రూరల్: గడిచిన రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్లో పైసా పనిచేయలేదని, వారికి ఓటు ఎందుకు వేయాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. మల్కాజ్గిరి నుంచి దాదాలను తీసుకొచ్చి బెదిరింపులకు దిగుతున్నారని, వారికి భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజుకు 25 గంటల కరెంటు ఇస్తానన్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను గెలిపించకుంటే బిల్లులు రావని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్ కాలేజీ, రైలు, నాలుగు లేన్లరోడ్ల విస్తరణతో పాటు మెదక్లో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నేతలు శేరి సుభాశ్రెడ్డి, తిరుపతిరెడ్డి, బట్టి జగపతి, మల్లికార్జున్గౌడ్, సురేందర్గౌడ్ శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రామాయంపేటలో జరిగిన ప్రచార సభలో హరీశ్రావు మాట్లాడారు. బూతులు మాట్లాడే సీఎంకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పోలీసులు అధికార పార్టీకి మద్దతు పలకడం మానుకోవాలని సూచించారు. అనంతరం నర్సాపూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఢిల్లీ బీజేపీ నాయకులను కలిసి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్నాయుడు అని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్లో పనిచేసిన రేవంత్రెడ్డి సెక్యులర్ కాదన్నారు. మైనార్టీలు బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించాలని కోరారు. బీజేపీ ఓటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు. నర్సాపూర్ను మున్సిపాలిటీ చేసి మొదటిసారి బీఆర్ఎస్ పీఠం కై వసం చేసుకుందని, రెండోసారి కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, నాయకులు పాల్గొన్నారు. జిల్లాను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్సే.. మల్కాజ్గిరి దాదాలకు భయపడేది లేదు మాజీ మంత్రి హరీశ్రావు -
‘ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ హస్తం’
మెదక్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక రేవంత్ హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన హరీష్.. రేవంత్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయం. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్ధం చేసిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండు. ఆ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్లో జరిగిన ప్రమాదం అది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్దం చేసిండు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండు. హైదరాబాద్లో పేదల బతుకులు కూల్చిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేసిండు. రేవంతు డైరెక్షన్ లో పోలీసులు చేసిన దహనకాండ. ఓటుకు నోటు కేసులో రేవంతుకు శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి..కానీ మెదక్కు వచ్చేందుకు ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయంరుణమాఫీ మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదు. తులం బంగారం దిక్కు లేదు. కేసీఆర్ గారు మైనార్టీ గురుకులాలు కట్టారు. షాదీ ఖానా ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు. హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూసింది బీఆర్ఎస్. తెల్లారితే మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ను తిడితే, హరీశ్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా?, ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడు. ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నడు. కనీసం 12 గంటలు కూడా రావడం లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు అని గుండు కొట్టిండు. ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్ బెన్ఫిట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి’ అని ధ్వజమెత్తారు హరీష్రావు. -
లీ‘డర్’..
దుర్గమ్మ సాక్షిగా అవినీతి ఏడుపాయలుగా పారుతోంది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నారు. జాతర కీర్తిని చాటాలని సర్కార్ నిధుల వరద పారిస్తే.. నిబంధనలకుపాతరేస్తున్నారు. పరదా చాటున పర్సంటేజీలు పంచుకుంటున్నారు. తామిచ్చిందేకొటేషన్ అంటూ రూ. కోట్లుకొల్లగొడుతున్నారు. తాత్కాలిక పనులతో మమ అనిపిస్తున్నారు. దుర్గమ్మకే శఠగోపం పెడుతున్న ఈ అక్రమార్కులపై ‘సాక్షి’ వరుస కథనాలు నేటి నుంచి.. పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో నిబంధనలకు పాతరేస్తున్నారు. జాతర కీర్తిని నలుదిశలా చాటాలని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏటా రూ. 2 కోట్లు మంజూరు చేస్తుండగా.. తాత్కాలిక పనులతో హారతి కర్పూరం చేస్తున్నారు. గతేడాది ‘నో టెండర్.. తాము ఇచ్చిందే కొటేషన్’ అంటూ ఈఓను డమ్మీని చేసి, లీడర్లే నిబంధనలకు విరుద్దంగా పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. బిల్లుల చెల్లింపు కొంత ఆలస్యమైనా, దుర్గమ్మ సొమ్మును కాంట్రాక్ట్ పనుల ద్వారా స్థానిక లీడర్లు.. అధికారులు.. ఏజెన్సీలు.. పప్పు బెల్లాల్లా వాటాలేసి పంచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఎస్డీఎఫ్ వ్యయంపై ఆడిట్ లేకపోవడంతో అధికారులు జంకు లేకుండా అవినీతి దందాకు తెగబడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ నాయకులు ఏటా ఈ తంతును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఈనెల 15 నుంచి మహాశివరాత్రి జాతర ప్రారంభం కానుండటంతో మళ్లీ పనుల పాతర మొదలైంది. ఈఓ ద్వారా రూ. 93.04 లక్షలు గత ప్రభుత్వ హయాం నుంచి ఏడుపాయల జాతరకు ఎస్డీఎఫ్ కింద నిధులు విడుదల చేస్తున్నారు. ప్రెస్ నోటిఫికేషన్ వేసి టెండర్ల ద్వారా పనులు చేస్తే దుబార నివారించవచ్చు. కానీ ఎస్డీఎఫ్ నిధులు ఏటా ప్రత్యేక జీఓతో విడుదల అవుతాయి. బిల్లులు వచ్చే సరికి సుమారు 10 నెలల కాలం పడుతుంది. దీనిని సాకుగా తీసుకొని, నిధులు మంజూరు కానిదే, పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ, స్థానిక నాయకులు తమకు అనుకూలమైన ఏజెన్సీలను రంగంలోకి దించుతున్నారు. ఈఓను డమ్మీని చేసి కొటేషన్లు తీసుకొని జిల్లా అధికారులకు పంపుతున్నారు. వారు కొటేషన్లోని అంచనాలను కొంత తగ్గించి, ఫైనల్ చెల్లింపులు ఇస్తున్నారు. ఈ తతంగాన్ని ముందుగానే పసిగట్టిన ఏజెన్సీలు కొంత హెచ్చించి, లాభదాయకమైన రేట్లనే కోడ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కాగా ఏటా చేస్తున్న పనుల్లో అన్నీ తాత్కాలికమైనవే, పర్మనెంట్ పనులు ఒకటి, రెండు మాత్రమే చేస్తున్నారు.వచ్చే జాతరకు పరిశీలిస్తాం తాను ఇటీవలే ఏడుపాయల ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు స్వీకరించాను. సమయం లేనందున ఎస్డీఎఫ్ నిధులకు సంబంధించి టెండర్లు నిర్వహించలేకపోయాను. ప్రస్తుతానికి గతేడాది లాగే కొటేషన్లు తీసుకొని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పనులు అప్పగిస్తాం. కొటేషన్లు స్వీకరించడానికి సమాచార నిమిత్తం ఎలాంటి పేపర్ నోటిఫికేషన్ వేయలేదు. – వీరేశం, ఏడుపాయల ఈఓ -
నిర్వాసితులను ఆదుకుంటాం
● త్వరలోనే పెండింగ్ ప్యాకేజీలు అందజేస్తాం ● కార్మికశాఖ మంత్రి వివేక్ గజ్వేల్: సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్ ప్యాకేజీలను అందజేస్తామని కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. ఆదివారం గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్రావుల నిర్లక్ష్యంతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. వారికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్కు గజ్వేల్ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా చారిత్రక నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పాల్గొన్నారు.దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరితే రెవెవిన్యూ డివిజన్సాధనకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాక పట్టణంలోని డబుల్బెడ్రూం కాలనీ సముదాయంలో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన స్ట్రీట్కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో 20 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే డబుల్బెడ్రూం కాలనీల్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎత్తుకు.. పై ఎత్తు
మెదక్జోన్: మున్నిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రచారానికి నేటితో తెరపడనుండటంతో నేతలు అభ్యర్థుల గెలుపు కో సం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పీఠం ఆశించి బరిలో నిలిచిన ముఖ్య నేతలను ఓడించటమే లక్ష్యంగా ప్రత్యర్థి అభ్యర్థులు వ్యూహా, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో పుర ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్య నేతల ఓటమే లక్ష్యంగా.. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రచారానికి నేటితో తెర పడనుండటంతో హామీలు గుప్పిస్తున్నారు. ఓటర్లు అడిగిన పనులను కాదనకుండా చేస్తామంటున్నారు. దేవుళ్లపై ఒట్లు వేస్తూ ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక అభ్యర్థిపై, మరో అభ్యర్థి కుట్రలు పన్నుతున్నారు. మెదక్ పట్టణంలోని ఓ వార్డులో అభ్యర్థి గతంలో కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో మీరు ఓట్లు వేయ లేదని చెప్పాడంటూ, ఓ వర్గాన్ని సదరు అభ్యర్థికి దూరం చేసేందుకు ప్రత్యర్థి అభ్యర్థి పాచికలు వేసి నట్లు తెలిసింది. ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మరో వార్డులోనూ గతంలో కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తికి మళ్లీ అదేవార్డులో రిజర్వేషన్ కలిసిరావటంతో బరిలో నిలిచాడు. దీంతో ఆ వార్డులో వేరే వార్డుకు చెందిన ఓ వ్యక్తి పోటీ చేశాడు. గతంలో కౌన్సిలర్గా పనిచేసిన ఆయన, అప్పట్లో ఒక వర్గానికి చెందిన వారు డబ్బులు తీసుకొని ఓట్లు వేశారంటూ ప్రచారం చేశాడని, ప్రస్తు తం అతనికి కాకుండా తనకు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేస్తున్నాడు. హాట్ హాట్గా విమర్శలు పార్టీ గుర్తులతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకొని బల్దియాలను సొంతం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు జోరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవటంతో ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఫలానా అభివృద్ధి పనిచేస్తామని హామీలు ఇస్తూ ఓటర్లను మచ్చిక చేసుకోవటం సాధారణమే కానీ, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని పట్టణ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పావులు కదుపుతున్న పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు నేటితో ముగియనున్న ‘పుర’ ప్రచారం -
ఏడుపాయల జన సంద్రం
కొమురవెల్లిలో కోలాహలంకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న చెంతకు ఆదివారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని గంగరేణి చెట్టు, రాజగోపురం, రాతిచక్రాలు, కోడెల స్తంభం, తోట బావి, ఎల్లమ్మ కమాన్, బస్టాండ్ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. పాపన్నపేట(మెదక్): ఏడుపాయలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దుర్గమ్మ తల్లిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. ఆలయ సిబ్బంది, ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. -
వేగంగా జాతర ఏర్పాట్లు
పాపన్నపేట(మెదక్): ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఏడుపాయల జాతర పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగాదాయన మాట్లాడుతూ.. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్త తరలించాలని సూచించారు. తాగు నీటికి సంబంధించి మొదట ట్రయల్ రన్ నిర్వహించాలన్నారు. నల్లాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ వేణు, ఆలయ ఈఓ వీరేశం ఇతర అధికారులు ఉన్నారు. ప్రజావాణి వాయిదా కలెక్టర్ రాహుల్రాజ్ -
పటిష్ట బందోబస్తు: ఎస్పీ
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11న జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. అనవసర గొడవలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లోని 75 వార్డులకు గాను 150 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. అందులో 21 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1206 మందిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు వివరించారు. ఎన్నికల్లో తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు రూ.20,54,660 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనపై 6 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టు ఎంపిక శివ్వంపేట(నర్సాపూర్): తెలంగాణ 8వ అంతర్ జిల్లా వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు అండర్– 21 యువతి, యువకుల జట్టును ఎంపిక చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీందర్చారి అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14న సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాథమిక పాఠశాల మైదానంలో జట్ల ఎంపిక ఉంటుందని, ఆసక్తి గల క్రీడాకారులు హాజరుకావాలని కోరారు. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 9603431003, 9849109338, 8008384850 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తారని, ఈ ఎన్నికల్లో వారికి గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమ లు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, వార్డు ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భద్రపరచండి నర్సాపూర్ రూరల్: పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తయినందున బాక్సులను కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రానికి తరలించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఆదివారం నర్సా పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. అనంతరం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ సెంటర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మద్యం దుకాణాలు బంద్ రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9వ తేదీ సా యంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మున్సిపాటీల పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నా యి. ఈమేరకు ఎకై ్సజ్ ఈఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఐదు వైన్ షాపులు, రెండు బార్లు, నర్సాపూర్లో నాలుగు వైన్స్లు, ఒక బార్, తూప్రాన్లో ఐదు వైన్స్లతో పాటు ఒక బార్, రామాయంపేటలో మూడు వైన్స్లతో పాటు బార్షాపు మూతపడనున్నాయి. తిరిగి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ఓపెన్ అవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
ప్రజలను మోసం చేశారు
రామాయంపేట(మెదక్): పదేళ్ల పాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం పట్టణంలోని ఒకటో వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అన్ని గ్రామాల్లో వందల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, దాసరి వాడలో పూరి గుడిసెల్లో ఉంటున్న 40 కుటుంబాలకు ఇళ్ల మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఒకటో వార్డు అభ్యర్థి లావణ్య, ఏడో వార్డు అభ్యర్థి నాగరాజు, పార్టీ ఎన్నికల ఇన్చార్జి మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘సీపీఎస్ను రద్దు చేయాలి’పాపన్నపేట(మెదక్): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేస్తామన్న ప్రభు త్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం ఏడుపాయలలో జరిగిన జిల్లా కా ర్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ కమిటీ ని వేదికను వెంటనే బహిర్గతం చేయాలని, పెండింగ్ డీఏలు ప్రకటించాలన్నారు. కేంద్రంతో సంప్రదించి టెట్ రద్దు చేయాలని కోరారు. సమస్యలు నెరవేర్చక పోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లం, సిద్దు, రాష్ట్ర బాధ్యులు భాస్కర్, లక్ష్మ ణ్, రంగారెడ్డి, రామారావు, వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి ధీమా వారిదే..
మెదక్జోన్/నర్సాపూర్: ‘పుర’ పోరుకు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. అలాగే చైర్మన్ పీఠాలపై పలువురు దృష్టి సారించారు. నాలుగు బల్దియాలు మహిళలకే కేటాయించడంతో రిజర్వేషన్ కలిసొచ్చిన మహిళలు చైర్మన్గా తానంటే తానంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. 4 బల్దియాలు.. 24 మంది ఆశావహులు జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో 74 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రధాన పార్టీల కు చెందిన 24 మంది చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం కాగా, అది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. మిగితా 31 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఓ వ్యక్తి తన కోడలును కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో దింపారు. కొంతమంది కౌన్సిలర్ అభ్యర్థులకు సైతం ఎన్నికల ఖర్చుకు డబ్బులు సమకూర్చి మద్దతు కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. మరో మహిళా అభ్యర్థి, సిట్టింగ్ కౌన్సిలర్, ప్రస్తుత అభ్యర్థి సైతం తానే చైర్మన్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు, బీజేపీ నుంచి ఒకరు చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. నర్సాపూర్ బల్దియా నుంచి చైర్మన్ పీఠాన్ని నలుగురు ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కాంగ్రెస్కు చెందిన ఒకరు, బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మహిళలు పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి ఒకరు ఆశిస్తున్నారు. కాగా ఇక్కడ బీఆర్ఎస్లోనే చైర్మన్ పదవి కోసం పోటీ నెలకొంది. ఇక తూప్రాన్లో చైర్మన్ పీఠం కోసం 9 మంది ఆశలు పెంచుకున్నారు. కాంగ్రెస్ నుంచి 5 గురు మహిళలు పోటీ పడుతుండగా, బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఒకరు తానేనంటూ చెప్పుకుంటున్నారు. రామాయంపేటలో ఐదుగురు మహిళలు పోటీ పడుతున్నారు. వారిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున పోటీ పడుతున్నట్లు తెలిసింది. కాగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఓ నేత తన కూతురును బరిలో దింపారు. మెజార్టీ వస్తే తానే చైర్మన్ అంటూ చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న మరో మహిళా అభ్యర్థి ఇప్పటికే పలు పదవులు చేపట్టిన సీనియర్ నేతల సైతం చైర్మన్ రేసులో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఒకరు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. 16న ఎన్నిక మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11న ముగియనుండగా, 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా మెజార్టీ వచ్చిన పార్టీలు ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నాలుగు బల్దియాల్లో 24 మంది పోటీ పడుతుండగా, అందులో ఆ నలుగురు అదృష్ట జాతకులు ఎవరో వేచి చూడాల్సిందే.‘పుర’ పీఠాలపై ప్రధాన పార్టీల గురి -
ఫ్రీ బస్సు తప్ప.. అంతా తుస్సే..
తూప్రాన్: కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు మినహా.. అంత తుస్సేనని, ప్రజలకు ఒరిగిందేమి లేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం తూప్రాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఫ్రీ అంటూనే.. భర్తకు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు దఫాలు రైతుబంధు వేసి, మిగితా సీజన్లకు ఎగ్గొట్టారని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రైతులకు యూరియా కష్టాలూ తప్పడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేయడం దండుగ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ జాతిపిత అని ప్రజలు కోరుకుంటే, అది రేవంత్రెడ్డికి నచ్చ డం లేదన్నారు. ఆయన బూతుపితగా మారారని విమర్శించారు. కేసీఆర్ను తిట్టడం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మచ్చ వేణుగోపాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం మాజీ మంత్రి హరీశ్రావు -
ప్రతి ఇంచూ సర్వే చేస్తాం
మనోహరాబాద్(తూప్రాన్): భూ భారతి పథకంలో భాగంగా రీ సర్వే చేపడుతున్నామని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని కోనాయపల్లి(పీటీ)లో నిర్వహించిన రెవెన్యూ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాన్ని జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంచూ రీ సర్వే చేస్తామని, గ్రామస్తులు సహకరించాలన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యలు సైతం పరిష్కారం అవుతాయన్నారు. సమావేశంలో సర్వేయర్ ఏడీ కిషన్, తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచ్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సమయపాలన తప్పనిసరి చిన్నశంకరంపేట(మెదక్): గ్రామీణ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్లో అలసత్వం వహించొద్దని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నార్సింగి మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు ల్యాబ్, మందుల నిల్వ రూం, వార్డులను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య సేవలను మహిళలకు, చిన్నారులకు అవసరమైన సమయంలో అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా మెడికల్ ఆఫీసర్ రేఖకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట వైద్యులు రవికుమార్, రేణుక, పీహెచ్ఓ శ్రీనివాస్ ఉన్నారు. జిల్లాస్థాయి ఖోఖో జట్టుకు ఎంపిక నర్సాపూర్ రూరల్: జిల్లాస్థాయి సీఎం కప్ ఖోఖో జట్టుకు నర్సాపూర్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ బసవరాజు, పీఈటీ లింగం శనివారం తెలిపారు. మండలస్థాయి పోటీల్లో బాలికలు మొదటి స్థానంలో నిలవగా, బాలురు రెండో స్థానంలో నిలిచారు. బాలికల జట్టు నుంచి ఆరుగురు, బాలుర జట్టు నుంచి నలుగురు ఎంపికై నట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి: డీపీఓ కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేసిన పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని డీపీఓ యాదయ్య కార్యదర్శులకు సూచించారు. శనివారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు. మండలానికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. సర్పంచ్ల బ్యాంక్ అకౌంట్ త్వరగా ఓపెన్ చేసి మంజూరైన పెండిండ్ బిల్లులు చెల్లించాన్నారు. దీంతో పాటు యాక్షన్ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, నీటి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్, ఏపీఓ పుణ్యదాస్ పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా జరగాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు కౌంటింగ్ అధికారులు ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ టేబుల్స్, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెంట్లు, అభ్యర్థులతో వ్యవహరించాల్సిన తీరు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు కలిపి 31 కౌంటింగ్ సూపర్వైజర్లు, 62 కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించినట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం
తూప్రాన్: కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం సా ధ్యమని మైనార్టీశాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. శనివారం తూప్రాన్లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకుల అధికార దాహాం తీరక కాంగ్రెస్పై బురద జల్లుతున్నారని విమర్శించారు. వారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. కేసీఆర్ సొంత కూతురే బీఆర్ఎస్లో జరిగిన అవినీతిని బయటపెట్టారని, అయినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి హరీశ్రావు సిద్ధిపేట ఎమ్మెల్యే అని, ఆయనకు గజ్వేల్ నియోజకవర్గంలో ఏం పని అని ప్రశ్నించారు. అనంతరం 1వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్ రవీందర్గుప్త, నాయకులు మామిళ్ల కృష్ణ, భాస్కర్రెడ్డి, ఎలక్షన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ -
హలో.. తమ్మీ
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఓటర్లను కలుసుకుంటూనే ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారికి గాలం వేస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమ ఒలకబోస్తున్నారు. యోగక్షేమాలు అడుగుతూ బంధుత్వాలు, పరిచయాలను గుర్తు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఓటర్లను టచ్లో ఉంచుకోవటానికి మద్దతుదారులు, అనుచరులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ రోజు పట్టణానికి రప్పించటంతో పాటు వారు వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులు చెల్లించేలా పురమాయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగుళూరు, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల సమయం లేదా పండుగలకు వచ్చి వెళ్తుంటారు. మెదక్ పట్టణంలో 32 వార్డులు ఉండగా, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి 151 మంది బరిలో ఉన్నారు. ప్రచారానికి రెండు రోజులే సమయం ఉండటంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.మా ఓట్లు వద్దా? అభ్యర్థులు ప్రచారానికి కొందరినే పిలిస్తే... మరికొందరు మా ఇంట్లో ఓట్లు వద్దా? మమ్ములను ప్రచారానికి పిల్వకుంటే మా ఓట్లు వేయం.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఓట్లు పోతాయన్న భయంతో అభ్యర్థులు అందరిని వెంట తీసుకెళ్తున్నారు. ప్రచారంలో నడవలేని వృద్ధులు సైతం పాల్గొంటున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 కూలి ఇస్తున్నారు.మన వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని.. ● వలస ఓటర్లకు అభ్యర్థుల గాలం ● కచ్చితంగా వచ్చి ఓటు వేయాలని వేడుకోలు ● రవాణా చార్జీలు చెల్లిస్తామని హామీలు‘హలో.. తమ్మీ నేను... ఈసారి మన వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా.. అక్కడ పని బాగా ఉంటుందా..? ఈసారి మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే పడాలి.. ఖర్చులకు పంపుతున్న, పోలింగ్ రోజు తప్పకుండా రావాలి.. నాకు ఓటేసి గెలిపించాలి ప్లీజ్.. మన వార్డును అభివృద్ధి చేసేందుకే పోటీ చేస్తున్నా.. నాకు మద్దతు ఇవ్వాలి.. అవసరమైతే రానుపోను రవాణా చార్జీలు భరిస్తాను’ అంటూ అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండే వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. – మెదక్ కలెక్టరేట్ -
పద్యం చెప్పండి.. రూ.10 పట్టండి
పాపన్నపేట(మెదక్): ‘పద్యం చెప్పండి.. రూ.10 పట్టండి’ అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ఓ రిటైర్డ్ హెచ్ఎం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో పద్యాల పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో మెదక్ మండలం మాచవరానికి చెందిన సాంబశివరావు శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని ముద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలో పద్య పఠన పోటీలు నిర్వహించారు. ఒక్కో పద్యానికి రూ.10 చొప్పున, విద్యార్థులు ఎన్ని పద్యాలు చదివితే అన్ని పదుల నగదు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రకళ, టీచర్లు పాల్గొన్నారు. -
గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాదే
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయని, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. శుక్రవారం రామాయంపేటలోని పలు వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి బాధ్యతలను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ను కాదని ఇతర పార్టీల వారికి ఓటు వేస్తే ప్రగతి ఆగిపోతుందన్నారు. తన కుమారుడు రోహిత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రూ. 200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. తామిచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామన్నారు. మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ ఎన్నికల ఇన్చార్జి మహిపాల్రెడ్డి, నాయకులు నాగరాజు, అమరసేనారెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు చింతల స్వామి ఇతర నాయకులు పాల్గొన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు -
చేర్యాల చైతన్యానికి అడ్డా..
● ఈ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే ● రోడ్ షోలో మంత్రి సీతక్క ● పాల్గొన్న ఎంపీ చామలచేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రాంతం చైతన్యానికి అడ్డా.. పోరాటాలకు పురిటిగడ్డ అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా గాంధీ సెంటర్ నుంచి అంగడిబజార్ వరకు ఎంపీ చామల కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్రెడ్డితో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పావల వడ్డీ పేరుతో మహిళల నుంచి రూ.3వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ సంవత్సరకాలంలో చేర్యాలకు రూ.36 కోట్ల నిధులు ఇచ్చిననట్లు తెలిపారు. మహిళలందరూ మహిళా సంఘాలలో చేరి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే చేర్యాల ప్రాంతం నాలుగు ముక్కలుగా చీలి అస్థిత్వాన్ని కోల్పోయిందన్నారు. చేర్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. అంతకు ముందు భువనగిరి ఎంపీ చామల మట్లాడుతూ 1600 మంది అమరుల త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రం ఎటుపోయిందని, అది దొరల పాలైందని విమర్శించారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని ఉద్యమం మొదలు పెట్టిన కేసీఆర్ తానే గద్గెనెక్కారని గుర్తు చేశారు. దొంగ ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్ నియెజికవర్గంలో డబ్బులతో మాయచేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చేర్యాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెరార్టీతో గెలిపించాలని కోరారు. -
నిర్భయంగా ఓటేయండి
మెదక్ కలెక్టరేట్/తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో ఫ్లాగ్మార్చ్ నిర్వ హించారు. ఎన్నికల సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే తూప్రాన్ పట్టణంలో డీఎస్పీ నరేందర్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ టౌన్ సీఐ మహేష్, రూరల్ సీఐ జార్జ్, మెదక్ డివిజన్లోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఓటమి భయం
నర్సాపూర్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ పార్టీ నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవా రం నర్సాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం పన్నులు పెంచి అభివృద్ధిని మరిచిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కోతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు దశాబ్దాలు గడుస్తున్నా, పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుతి లేని సంసారం వంటిదని ఎద్దేవా చేశారు. నర్సాపూర్ పచ్చని అడవిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకుండా నిలువరించింది గుర్తు చేశారు. కేంద్ర నిధుల ద్వారా జరిగిన అభివృద్ధిని గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్యాదవ్, జిల్లా ఇన్చార్జి నరసింహారెడ్డి, మున్సిపల్ ఎన్నికల ప్రభారి పాపయ్య గౌడ్, రాజమణి, సంఘసాని సురేశ్, బుచ్చెశ్యాదవ్, లత రమేశ్ యాదవ్, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు శని, ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం పట్టణంలోని బా లుర సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని గదులు, వంటలు, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాబోధన, హాస్టల్ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
పదేళ్లు దోచుకున్నారు
మెదక్జోన్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దో చుకొని దాచుకున్నారని ఎమ్మెల్యే రోహిత్రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీశ్రావు మెదక్పై వివక్ష చూపటంతో పూర్తిగా వెనుకబాటుకు గురైందన్నారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కానుగ రాధికను భారీ మెజార్టీతో గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు గంగాధర్, కానుగ భూపతి తదితరులు ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. అధికారులతో కలిసి పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. అనంతరం ఆర్వోలు, బీఎల్వ్లు, ఏఆర్వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులతో పాటు తహసీల్దార్ రజని ఉన్నారు. స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి పాపన్నపేట(మెదక్): స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించగలుగుతారని జిల్లా సంక్షేమాధికారి హేమభార్గవి అన్నారు. శుక్రవారం పాపన్నపేట పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం 34 మంది మహిళలకు శిక్షణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటరమణమ్మ, సర్పంచ్ పావని, నరేందర్గౌడ్ పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించండి: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్లో డీపీఓ యాదయ్యకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఆన్లైన్లో పేర్లు లేని కార్మికులను చేర్చడంతో వారికి రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రతినెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలన్నారు. పాత కార్మికులను తొలగించకుండా కొనసాగించాలని కోరారు. ఏడుపాయలలో విధులు నిర్వర్తించే వారికి రోజుకు రూ.1,000తో పాటు కనీస వసతులు కల్పించాలన్నారు. ఆమె వెంట సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంతోశ్, కార్మికులు అర్జయ్య, శివయ్య ఉన్నారు. ‘నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం’ గజ్వేల్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అ న్నారు. శుక్రవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో మన్నెం విష్ణువర్ధన్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. -
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో పార్టీ అభ్యర్థి మల్లేశంకు మద్దతుగా శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని వాపోయారు. భగీరథ నీటికి బిల్లులు వేయడం అన్యాయమన్నారు. బిల్లుల కోసం ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, బాదె చంద్రం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ‘జీఓ 25ను సవరించండి’వెల్దుర్తి(తూప్రాన్): జీఓ 25ను సవరించిన తర్వాతే రేషనలైజేషన్ ప్రకియ మొదలు పెట్టాలని ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. 1 నుంచి 20 వరకు విద్యార్థులు నమోదైన ప్రతి పాఠశాలకు ఇద్దరు, 20 నుంచి 40 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు, 60కి పైగా విద్యార్థులు నమోదైన ప్రతి పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున ఉపాధ్యాయులను నియమించాలన్నారు. -
లెక్కలు తీస్తూ.. గాలం వేస్తూ
కుల సంఘాలతో అభ్యర్థుల మంతనాలుజిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సా పూర్, తూప్రాన్ మున్సిపాలిటీల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లు అడిగింది లేదనకుండా అప్పగిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ముఖ్యంగా కుల సంఘాలకు వంట సామగ్రి, టెంట్హౌస్లు, కాలనీలో బోర్లు వేయిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. కొన్ని కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉంటే ఎన్నికల అనంతరం బోర్లు తవ్విస్తామంటూ హామీ ఇస్తున్నారు. మెదక్ బల్దియాలోని ఓ వార్డులో ఓ వర్గానికి చెందిన ఓట్లు 350కి పైగా ఉంటాయి. వారు కమ్యూనిటీ హాల్ కావాలని కోరటంతో ఆ కాలనీలో బరిలో ఉన్న ఓ పార్టీ అభ్యర్థి గెలవగానే నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇలా కుల సంఘాల పెద్దలు అడిగిందే తడువుగా అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. అన్నా.. ప్రచారానికి రండి! ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థు లు ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్టీ ఇన్చార్జిలు, రాష్ట్రస్థాయి నేతలను ప్రచారానికి రావాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉండటంతో అన్ని వార్డుల్లోకి వెళ్లి ప్రచారం చేయటం కుదరదంటూ, నేతలు కార్నర్ మీటింగ్లకు హాజరవుతున్నారు. కొందరు అభ్యర్థులు రోడ్షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో పట్టణాలు సందడిగా మారాయి.ప్రచారానికి మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. ఓటర్లకు గాలం వేసేందుకు కార్యాచరణ షురూ చేశారు. కుల సంఘాల వారీగా మచ్చిక చేసుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అడిగినవి సమకూరుస్తూ ముందుకెళ్తున్నారు. – మెదక్జోన్ అడిగినవి సమకూరుస్తామని హామీలు కాలనీల్లో బోర్లు వేస్తామంటూ ఒప్పందాలు రసవత్తరంగా పురపాలక రాజకీయంప్రచారంలో వెంట తిప్పుకున్న వారికి రాత్రి అయిందంటే మద్యం, బిర్యానీ సమకూరుస్తున్నారు. కొందరు అభ్యర్థులు వారి ఇంటి వద్దే నిత్యం వంటా, వార్పు చేసి మాంసహారంతో భోజనం పెడుతున్నారు. అలాగే డబ్బులు ఇస్తున్నారు. ఇవ్వన్నీ పోనూ మళ్లీ వ్యక్తిగతంగా ఓటుకు ముట్ట జెప్పాల్సిందేనని ఓ అభ్యర్థి తెలిపారు. దీంతో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయినా గెలుపే లక్ష్యంగా ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడటం లేదు.ఖర్చు ఎంతైనా సరే.. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు ఎస్పీ మహేందర్ చెప్పారు. శుక్రవారం పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా పోలింగ్ కేంద్రాల నుంచి వంద మీటర్ల దూరంలో ఉండాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన నింబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. డబ్బు, మద్యం, బహు మ తులు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఈసందర్భంగా సీఐ జాన్రెడ్డికి పలు సూచనలు చేశారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టును పరిశీలించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.అదనపు ఎస్పీ మహేందర్ -
బైక్ కోసం తండ్రిని చంపిన కొడుకు
రేగోడ్ (మెదక్): బైక్ కొనివ్వాలని గొడవ పడి.. ఓ కొడుకు తండ్రిని హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ పోలీస్స్టే షన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై పోచయ్య కథనం మేరకు.. రేగోడ్ గ్రామానికి చెందిన షకీర్ (51) కూరగాయలు అమ్ముతూ జీవనం సాగి స్తున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమా రుడు ఉన్నారు. కుమారుడు మహమ్మద్ హుస్సేన్ కొంతకాలం ట్రాక్టర్ డ్రైవర్గా పని చేశాడు.అయితే ఏడాది నుంచి పని చేయకుండా ఇంట్లో నే ఉంటున్నాడు. ఈ క్రమంలో బైక్ కొనివ్వా ల ని, భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించసాగాడు. నెల క్రితం డబ్బుల కోసం తండ్రిపై దాడి చేయగా అతని తలకు గా యమైంది. గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కు దిర్చారు. కాగా, గురువారం రాత్రి ఇంట్లో నిద్ర పోతున్న షకీర్ను, కుమారుడు బయటకు లాక్కొ చ్చి కొట్టడంతో తలకు బలంగా గాయాలై షకీర్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఘటనా స్థలా న్ని అల్గాదుర్గం సీఐ రేణుకారెడ్డి సందర్శించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హరాహోరీ ప్రచార భేరి హరాహోరీ ప్రచార భేరి
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు ●మిగిలింది నాలుగు రోజులే.. ●అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న బల్దియా పోరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారానికి ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండటంతో ర్యాలీలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తిస్తున్నారు. వారి తరఫున ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో ‘పుర’ పోరు రసవత్తరంగా మారింది. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఇందులో మెదక్ పట్టణంలో ఒక వార్డు ఏకగ్రీవం అయింది. ఇక మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన పార్టీల ముఖ్య నాయకులకు పరీక్షగా మారింది. అధిక వార్డులు కై వసం చేసుకొని చైర్మన్ పదవులను దక్కించుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో బల్దియా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రచారంలో అగ్రనేతలు ప్రధాన పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే రోహిత్, మైనంపల్లి హన్మంతరావు మెదక్, రామాయంపేట బల్దియాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఆ పార్టీ అగ్రనేత హరీశ్రావు సైతం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. త్వరలో మెదక్ బల్దియాలో నిర్వహించే రోడ్షోలో మరోమారు పాల్గొననున్నట్లు తెలిసింది. అలాగే బీజేపీ ఎంపీ రఘునందన్రావు సైతం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ప్రచారం నిర్వహించటంతో పాటు ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మె ల్యే పద్మారెడ్డి సైతం వార్డుల్లో విస్తృతంగా ప్రచా రం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ జిల్లాస్థాయి నేతలు సైతం ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహిళా ఓటర్లు కీలకంజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 85,185 మంది ఓటర్లు ఉండగా, వాటిలో మహిళా ఓటర్లు 45,168 మంది ఉన్నారు. పురుషుల ఓటర్లు 43, 592 ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 1,576 మంది అధికంగా ఉన్నారు. దీంతో అన్నిపార్టీల నేతలు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులను మచ్చిక చేసుకుంటూ గంపగుత్త ఓట్ల కోసం పావులు కదుపుతున్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రామాయంపేట(మెదక్): మాజీ సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయమైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం నిర్వహించిన మున్సిపల్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని మాట్లాడారు. కేవలం ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్ అభివృద్ధిని మ రిచారని ఆరోపించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్, ఈరెండున్నర ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలని అభివర్ణించారు. గ్రామ గ్రామాన బెల్ట్షాపులతో పల్లెలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని, కాంగ్రెస్ నాయకులు భూములు అమ్ముకొని రూ. వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. నిరుపేద యువతుల వివాహాలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎంపీ రఘునందన్రావు మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అడుగంటిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ రహదారి నుంచి దామరచెరువు వరకు బైపాస్ రోడ్డులో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో కేన్స్ర్ ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు పట్టణాధ్యక్షుడు అవినాశ్గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నివర్గాలను మోసం చేశారు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మెదక్జోన్: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని 5, 7, 8, 9, 10 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. లేనిచో ప్రజలను మోసం చేసి మళ్లీ ఓట్లు మాకే వేశారని మోసం చేస్తారని అన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 2,500, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు ఏమైందన్నారు. కేసీఆర్ హయాంలో నిరంతరంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేశామని, ప్రస్తుతం 12 గంటలు కూడా సక్రమంగా రావడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు అంజాగౌడ్, కిష్టయ్య, గట్టయ్య, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
బుకింగ్ కాక.. యూరియా అందక!
‘చిన్నశంకరంపేట మండలంలోని ఎస్.కొండాపూర్కు చెందిన నర్సుపల్లి లచ్చయ్య రెండెకరాల చిన్నరైతు. తన వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో యూరియా ఎలా బుక్ చేసుకోవాలనే విషయం తెలియదు. గవ్వలపల్లిలోని ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా అందుబాటులో ఉందని తెలుసుకొని వెళ్లాడు. తీరా నిర్వాహకుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తామని తేల్చిచెప్పాడు. యూరియా బుక్ చేసుకోవడం తనకు తెలియని చెప్పగా, రైతువేదిక వద్దకు వెళ్తే అధికారులు బుక్ చేస్తారని చెప్పడంతో ప్రయాస పడుతూ చేరుకున్నాడు. అక్కడ చాంతాడంత క్యూలైన్ను దాటుకొని అధికారులను కలవడంతో వారు యూరియా బుక్చేశారు’. ఇలా జిల్లాలో అనేక మంది రైతులు ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. చిన్నశంకరంపేట(మెదక్): రైతులకు అగ్రికల్చర్ యాప్పై ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో యూరియా బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు యాప్ వివరాలు నమోదు చేసేందుకు అగ్రికల్చర్ యాప్ను మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఫోన్లో ఎంటర్ చేసిన తర్వాతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే ముందుకు వెళ్లాలి. కాని చాలా వరకు ఓటీపీ కష్టాలు తప్పడం లేదు. ఒక వేళ వచ్చినా, వివరాలు పూర్తిగా నమోదు చేసి యూరియా బుక్ చేసే సమయంలో సెండ్ కాక తిరిగి మొదటికే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2,62,043 మంది రైతులు ఉన్నారు. సాగు విస్తీర్ణం సుమారు 3,01,700 ఎకరాలు ఉంటుందని అధికారుల అంచనా. ఇందుకునుగుణంగా 28,800 టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 17 వేల టన్నులు జిల్లాలో అందుబాటులో ఉంది. అయినప్పటికీ నూతన ఆన్లైన్ యాప్ విధానంతో రైతులు యూరియా బుక్ చేసు కోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాస్తారోకోలు, క్యూలైన్లు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో యూరియా ఉన్నప్పటికీ అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత వరకు ఇబ్బందులు జిల్లాలో అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ యాప్ కొ త్తగా వచ్చింది కాబట్టి సర్వర్ డౌన్తో పాటు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నా యి. రైతులకు సహాయం చేసేందుకు రైతు వేదికల వద్ద అధికారులు అందుబాటులో ఉంటున్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా వ్యవసాయ అధికారులను సంప్రదించి యూరియా బుక్ చేసుకోవాలి. – డీఏఈ దేవ్కుమార్ రైతు వేదికల వద్ద క్యూలైన్లు పట్టించుకోని అధికారులు -
మెదక్ అభివృద్ధికి సహకరించండి
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుమెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మెదక్ అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ల్లో మాట్లాడారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, ఇతర పార్టీలకు ఓటేసి ప్రగతిని దూరం చేసుకోవద్దన్నారు. పట్టణ ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ప్రభుత్వ పథకాలు పేరుకే పరిమితం అయ్యాయని, ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఎన్నికల అనంతరం తాగునీరు, రోడ్లు, మురికి కాల్వల నిర్మాణంలో దృష్టి సారిస్తా మని హామీ ఇచ్చారు. మెదక్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి తెచ్చినట్లు వివరించారు. -
పదేళ్లు ప్రజలకు ఏం చేశారు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అడుగంటిందని, అప్పుడు చేయని వారు ఇప్పుడు చేస్తారా..? అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రశ్నించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, పనిచేసే వారినే ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకుల వద్ద పెద్ద మొత్తంలో నల్లధనం ఉందని, వారి వద్ద డబ్బులు తీసుకొని ఓట్లు మాత్రం హస్తానికే వేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరనేది చూడకుండా.. తనను చూసి కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. ప్రజలు తమ ఓట్లను దుర్వినియోగం చేయొద్దని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అభివృద్ధికి రూ. కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఆయన వెంట పార్టీ ఎన్నికల ఇన్చార్జి మహిపాల్రెడ్డి, పలు వార్డుల్లో పోటీ చేస్తున్న నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చు మాది.. ఓటు మీది
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. ప్రత్యర్థి పార్టీలపై పైచే యి సాధించాలన్న లక్ష్యంతో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మహిళలు, యువ ఓటర్లే టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నారు. సాయంత్రం వేళల్లో మందు పార్టీలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు చికెన్, మటన్తో దావత్లు ఇస్తున్నట్లు తెలిసింది. కాగా ఇంటింటి ప్రచారానికి సైతం భారీగా ఖర్చు చేస్తున్నారు. అభ్యర్థుల వెంటే నేతలు మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి గురువారం ఉదయం నుంచి మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయగా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే రోహిత్రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ర్యాలీలు, కార్నర్ మీటింగ్లకు జనాన్ని భారీగా తరలించేలా అభ్యర్థులు చర్యలు తీసు కుంటున్నారు. ఇదిలాఉండగా పలు వార్డుల్లో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు ఉండగా, ఒక్క 27వ వార్డు అన్ రిజర్వ్డ్ జనరల్ మహిళకు కేటాయించారు. ఈ ఒక్క వార్డులోనే 7 మంది బరిలో ఉన్నారు. అయితే ఈ వార్డులో 90 శాతం ఎస్సీ జనాభా ఉన్నారు. దీంతో ఈ వార్డులో ఆరుగురు ఎస్సీ మహిళలు పోటీలో ఉండగా, ఒక మైనార్టీ మహిళా బరిలో ఉన్నారు. మందు, విందులతో ఓటర్లకు గాలం పోటాపోటీగా అభ్యర్థుల ఖర్చు కళకళలాడుతున్న వార్డులు అందరి చుట్టూ జనాలే.. ఓట్లెవరికో.. మెదక్ బల్దియా పరిధిలో 31 వార్డుల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రతి అభ్యర్థి వెంట భారీ సంఖ్యలో జనాలు పాల్గొంటున్నారు. అన్నివార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం జోరుగా చేస్తున్నారు. అయితే ప్రతి పార్టీ అభ్యర్థి వెంట తిరుగుతున్న ఓటర్లు చివరికి ఓటు ఎవరికి వస్తారో... ఎవరిని అందలం ఎక్కిస్తారోనని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ లెక్క తేలాలంటే ఈనెల 13 వరకు వేచి చూడాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. బుధవారం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించాలని కోరారు. సుమారు 10 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్, రోడ్ల మరమ్మతు, తాగునీరు, 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. 150 మంది గజ ఈతగాళ్లను నియమించాలని, ఐదు ప్రదేశాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాన్నారు. 300 మందితో వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రతి రోజు 140 ఆర్టీసీ బస్సులతో ,ప్రయాణికులకు రవాణ సౌకర్యం కల్పించాలన్నారు. బందోబస్తు నిర్వహణలో భాగంగా 829 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ,ఈఓ వీరేశం, తహసీల్దార్ సతీష్ కుమార్, శ్రీనివాస్ చారి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అసమానతలు లేని తెలంగాణ అసమానతలు లేని తెలంగాణ స్థాపించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపు నిచ్చారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఘనంగా జాతర ఏర్పాట్లు ఉండాలి కలెక్టర్ రాహుల్రాజ్ ఏడుపాయల జాతరపై సమీక్ష -
అర్ధాంగి.. అదిగదిగో అందలం!
మెదక్ కలెక్టరేట్: గతంలో భర్తలు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే వారి భార్యలు ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించేవారు. రిజర్వేషన్ల పుణ్యమా అని ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు కేటాయించారు. దీంతో భార్యలు పోటీ చేస్తుంటే వారి గెలుపు కోసం భర్తలు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అర్థాంగిని అందలం ఎక్కించేందుకు వారి వెంట జెండా పట్టుకొని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. 16 మంది మహిళా అభ్యర్థులు మెదక్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా ఎన్నికల కమిషన్ 50శాతం మహిళలకే కేటాయించింది. దీంతో ఆయా పార్టీలు నుంచి 16 మంది మహిళా అభ్యర్థులు పోటిలో నిలబడ్డారు. కాగా మహిళా అభ్యర్థులు పోటీచేసే చోట్ల సతి గెలుపుకోసం పతులు పాట్లు పడుతున్నారు. ఇందులో కొంతమంది తమ వారిని చైర్ పర్సన్ చేయాలనే తపనతో మరింత విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మెదక్ మున్సిపల్ పరిధిలోని 1, 3, 4, 7, 8, 10, 11, 12, 13, 14, 17, 21, 23, 27, 28, 32 వార్డుల్లో ఆయా పార్టీలు మహిళలకు కేటాయించాయి. మహిళా అభ్యర్థుల కోసం వారి భర్తలు, కొడుకులు అభ్యర్థుల కంటే ఎక్కువగా పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. మాజీ చైర్మన్లు సైతం మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి భార్య బట్టి లలిత 17వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డారు. మెదక్ మున్సిపల్ చైర్మన్గా మూడుసార్లు పనిచేసిన బట్టి జగపతి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య లలిత గెలుపు కోసం కష్ట పడుతున్నారు. అలాగే మరో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ భార్య మాజీ కౌన్సిలర్ గాయత్రి 15వ వార్డు అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. మల్లికార్జున్గౌడ్ సైతం ఎన్నికల్లో పోటీచేయకుండా అతని భార్య గాయత్రిని అందలం ఎక్కించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆమెను గెలిపించి బీఆర్ఎస్ తరపున చైర్మన్ చేయాలనే తపనతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే 14వ వార్డులో దొంతి లక్ష్మిని గెలిపించడం కోసం ఆమె భర్త దొంతి ముత్యంగౌడ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు 27వ వార్డులో ఎమ్మార్పీఎస్ నాయకుడు బాల్రాజ్ తన భార్య రాణి గెలుపుకోసం ప్రచారం చేస్తుండగా, 10వార్డులో చింతల నర్సింలు తన కోడలు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇదే వార్డులో వనం వెంకటేశం తన భార్య లత గెలుపు కోసం పరుగులు పెడుతున్నారు. మొదటి ఏకగ్రీవం మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు కౌన్సిలర్గా గోదల మానస పోటీ చేయగా తన భార్య గెలుపుకోసం భర్త గోదల సాయిరాంవిస్తృతంగా కృషి చేశారు. ఈ క్రమంలో పార్టీ అధినాయకుల సహకారంతో ప్రత్యర్థిగా ఉన్న జ్యోతిని పోటీ నుంచి తప్పించి రెండోసారి ఏకగ్రీవ కౌన్సిలర్గా మానస ఎన్నికయ్యారు. పుర పీఠం కోసం ముమ్మర యత్నాలు సతుల పోరు.. పతుల పాట్లు 32 వార్డుల్లో సగం మహిళా అభ్యర్థులే -
కాంగ్రెస్ను గెలిపిస్తే మరిన్ని నిధులు
రామాయంపేట(మెదక్)/మెదక్జోన్/నర్సాపూర్, నర్సాపూర్ రూరల్: కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మెదక్ జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. బుధవారం ఆయన రామాయంపేటలో మీడియాతో, మెదక్ నర్సాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తామిచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. రెండేళ్లలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏడుపాయల ఆలయ అభివృద్ధికి రూ.35కోట్లు, సీఎస్ఐ చర్చ్కి రూ.29 కోట్లు కేటాయించామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లే ధ్యేయంగా పనిచేసిందని విమర్శించారు. మిషన్ భగీరథ పేరుతో రూ.65కోట్లు స్వాహా చేశారన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిందని విమర్శించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరు చేశామని, మరో రూ.30కోట్లు త్వరలో కేటాయిస్తామన్నారు. మంత్రి వివేక్ సమష్టిగా పనిచేస్తే విజయం మనదే -
వ్యూహాలకు పదును
వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్మెదక్జోన్: మున్సిపల్ ఎన్నిల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులెవరో తేలడంతో పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యత్నిస్తున్నారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75వార్డులున్నాయి. మెదక్ మున్సిపాలిటీలోని ఒక వార్డు ఏకగ్రీవం కాగా 74 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్రావులు ప్రత్యేక దృష్టి సారించారు. ఒకటికి నాలుగుసార్లు సర్వేలు చేయించి అభ్యర్థులకు బీఫాంలు అందజేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్లే తెలుస్తుంది. బీజేపీ సైతం యువతే లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగింది. జిల్లాలో ఆ పార్టీ ఇప్పటి వరకు 70వార్డులో అభ్యర్థులను నిలబెట్టింది. గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధిక సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకోవడంతో ఈ పుర ఎన్నికలను కాంగ్రెస్పార్టీ చాలెంజ్గా తీసుకుంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. రైతు రుణమాఫీ 40శాతం మందికి కూడా కాలేదని, యాసంగి పంటల సాగు సమయం దగ్గరికి వస్తున్నా.. నేటికి రైతు భరోసా ఇవ్వడం లేదని, ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.2500లు ఏవని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్లకు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు. కొత్త పింఛన్లు తదితర అంశాలను ఫోకస్ చేస్తున్నారు.రాబోయే రోజుల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ నేతలు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలు మోసం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చాయని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు.మోదీ జపంతో బీజేపీ పార్టీల ఎత్తుకు పైఎత్తులు రంగంలోకి ముఖ్య నేతలు రసవత్తరంగా ‘పుర’పోరుసంక్షేమ పథకాలపైనే కాంగ్రెస్ నజర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే కాంగ్రెస్ను గెలిపిస్తుందని అఽధికార పార్టీ నేతలు గట్టి ధీమాతో ఉన్నారు. గడిచిన రెండేళ్లలో రుణమాఫీతో మొదలుకొని ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత బస్సు, గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, అభివృద్ధికోసం పెద్ద ఎత్తున నిధుల విడుదలపై ప్రచారం మొదలు పెట్టింది. మరో మూడేళ్లపాటు అధికారంలో ఉంటామని, అభివృద్ధి తమతో సాధ్యమని అధికార పార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
మెదక్జోన్: రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. ఆరు గ్యారంటీలతోపాటు 420 అబద్ధపు హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వృద్ధులకు ఇస్తామన్న రూ.4వేల పెన్షన్, 18యేళ్లు నిండిన ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.2,500లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లకు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. భారీ వర్షాలతో తెగిపోయిన కుంటలకు, చెరువులకు మరమ్మతులు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ను ఓడించినందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి -
కర్రుకాల్చి వాత పెట్టాలి
నర్సాపూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బంద్ చేసి హామీలన్నీ ఎగ్గొట్టారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి 14 రోజుల పాటు అమెరికాకు పోయినప్పుడు టీవీల్లో శబ్ధ కాలుష్యం తగ్గిందన్నారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. రేవంత్రెడ్డివన్నీ తొండి మాటలేనన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే నర్సాపూర్ అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రబడ్జెట్లో ఏపీకి నిధులు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపిందని విమర్శించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్కు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలని, ఎగిరిపడితే ప్రజలు రాళ్లతో కొడుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థులు సంగీత, అనుసూయ అశోక్గౌడ్, నయిమోద్దీన్, సత్యనారాయణగౌడ్, సునీతాబాల్రెడ్డి, కండెల రాజు, సమీన బేగం, షేక్హుస్సేన్, కళ్యాణి, హమీద్, శ్రావ్య, మంజుల, మోహిన్అలీ, వినయ్కుమార్, సరిత, లలితలను పరిచయం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు దేవేందర్రెడ్డి, చంద్రాగౌ డ్, గోపి, మన్సూర్, శేకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలిరైతు బంధు వేసి ఓట్లు అడగాలి మెదక్జోన్: బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్కు వెన్నులో వణుకు పుడుతోందని హరీశ్రావు అన్నారు. బుధవారం మెదక్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతోనే తమ పార్టీ అభ్యర్థులను ఎత్తుకుపోయి ఏకగ్రీవం చేయిస్తున్నారని, రాబోయే రోజుల్లో అమ్ముడుపోయిన వారిని, ఎత్తుకు పోయిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పోలింగ్లోపు రైతుబంధు వేసి ఓట్లు అడగాలని, లేకుంటే మెదక్ జిల్లా ప్రజలు చీరి చింతకు కడతారని హెచ్చరించారు. మెదక్ ప్రత్యేక జిల్లాతోపాటు రైలు, మెడికల్ కళాశాల, ఆస్పత్రి, ఘనపురం ఆనకట్ట కాల్వలు, రోడ్లు, కలెక్టరేట్, ఎస్పీ, జెడ్పీ కార్యాలయాలను బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించినట్లు వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, తిరుపతిరెడ్డి, సురేందర్గౌడ్, మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఇక సమరమే..
మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. టికెట్ వస్తుందనే ఆశతో ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేసిన ఆశావహుల్లో కొంతమందికి నిరాశే మిగిలింది. టికెట్లు రాని వారిని బుజ్జగించి విత్డ్రా చేయించారు. కొందరు ససేమిరా అంటూ ఇతర పార్టీల్లో చేరగా, మరికొందరు రెబల్స్గా బరిలో నిలిచారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఈ నాలుగింటిలో 519 మంది ఆశావహులు 668 నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఆఖరి రోజు మంగళవారం నాలుగు మున్సిపాలిటీల్లో 380 మంది విత్డ్రా చేసుకోవటంతో 288 మంది బరిలో నిలిచారు. కాగా మెదక్ మున్సిపాలిటీలోని 32వ వార్డు మాత్రం ఇప్పటికే ఏకగ్రీవం అయింది. మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. బుజ్జగింపులు జిల్లాలోని నాలుగు బల్దియాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీలో సైతం టికెట్ ఆశించి ఎంతో మంది భంగపడ్డారు. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. అయితే సర్వేలో ప్రజల్లో మంచి ఫలితాలు వచ్చిన వారికి మాత్రమే బీఫాంలు ఇచ్చారు. ఇతరులను బజ్జగించి విత్డ్రా చేయించారు. కాగా మెదక్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ శ్యాంసుందర్ సీనియర్ బీఆర్ఎస్ నేత. పట్టణంలోని 26వ వార్డు నుంచి నామినేషన్ వేశాడు. కాగా ఆయనకు పార్టీ బీఫాం ఇవ్వకపోవడంతో మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వార్డుకు ముగ్గురు చొప్పున పోటీ జిల్లాలో 74 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, వాటిలో అత్యధికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో మాత్రమే ఎక్కువ వార్డుల్లో పోటీ ఉంది. కొన్ని స్థానాలకు మాత్రమే బీఎస్పీ, ఎంఐఎం, రెబల్స్, స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. వార్డుకు ముగ్గురు చొప్పున పోటీ నిలవగా, కొన్ని వార్డులో నలుగురు నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు. కాగా మెదక్లో 31 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, బీజేపీ 27 వార్డుల్లో మాత్రమే పోటీలో నిలిచింది.మున్సిపల్ పోరు.. అభ్యర్థులు ఖరారు 74 వార్డులకు 288 మంది పోటీ 380 మంది నామినేషన్ల ఉపసంహరణ బీఫాంలు రాని వారు కొందరు ఇతర పార్టీల్లోకి.. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
హుస్నాబాద్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆర్యవైశ్య భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 20 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీలో ఎవరూ అసంతృప్తిలో లేరని, నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల, 250 పడకల ఆస్పత్రి, ఇండస్ట్రీయల్ కారీడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో హుస్నాబాద్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో నీటిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లును ఇవ్వలేదన్నారు., హుస్నాబాద్ పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో కోతుల బెడద ఉందని, చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ -
రౌడీ షీటర్లపై నిఘా
మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి డీజీపీ శివధర్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా పోలీస్ అధికారులతో కలిసి హాజరయ్యారు. మున్సి పల్ ఎన్నికల చట్టాలపై రాష్ట్ర పోలీస్ లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు అవగాహన కల్పి ంచారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా చేపడుతున్న భద్రతా చర్యలు, బందోబస్తు ప్రణాళికలు, పోలీస్ బలగాల వినియోగంపై ఎస్పీ డీజీపీకి వివరించారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేలా పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగానాయక్, సీఐలు రాజశేఖర్రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంప్రశాంత్రనగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతికి, అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఖాళీలు ఉన్న సీట్లకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కల్గిన విద్యార్థులు ఈ నెల 28 లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. -
తిరుగుబావుటా..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పిన రెబెల్స్..ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. అయితే ఆశించిన మేర తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. హామీలు ఇచ్చి బుజ్జగింపులు చేసినప్పటికీ విత్డ్రా చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్ ఇబ్బందిగా మారింది. టికెట్ దక్కని వారు కొందరు ఏకంగా ఆ పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో మేమూ చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తుండటం గమనార్హం. విత్డ్రా చేసుకున్నా.. సహకరించేనా? నామినేషన్లు వేసిన వారిలో కొందరు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతల ఒత్తిడికి తలొగ్గి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కానీ, వీరు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపునకు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. నామినేషన్ విత్డ్రా చేసుకున్నప్పటికీ క్రాస్ ఓటింగ్ చేయించేందుకు అంతర్గతంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను కాదని మరొకరికి టికెట్ దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.చివరిరోజు నాటకీయ పరిణామాలుపోటీలో నిలుస్తున్న రెబెల్ అభ్యర్థులు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రులుగా బరిలోకి.. పోటీలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన అధికారులునామినేషన్ల విత్డ్రాకు చివరిరోజు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఫారమ్ల సమర్పణకు గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ప్రధాన పార్టీలు అంతకంటే కేవలం ఒక గంట ముందే అధికారులకు బీఫారంలు అందజేశారు. చివరి నిమిషం వరకు రెబెల్స్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసి ఆశించిన మేర ఫలితాలను మాత్రం రాబట్టలేకపోయారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు ఐదు వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులుండగా, కాంగ్రెస్కు మూడు వార్డుల్లో ఉన్నారు. జోగిపేట మున్సిపాలిటీల్లో రెబెల్స్ సమస్య కొంత తక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి రెండు వార్డుల్లో భార్య,భర్తలు రెబెల్ అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. బీజేపీకి ఒక వార్డులో తిరుగుబాటు అభ్యర్థి పోటీ చేస్తున్నారు. జహీరాబాద్లో కాంగ్రెస్కు నాలుగు వార్డుల్లో, బీఆర్ఎస్కు మూడు వార్డుల్లో రెబెల్స్ పోటీ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్కు మూడు చోట్ల రెబెల్స్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్కు రెండు చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు రెబెల్ ఎక్కువగా ఉన్నారు. పది వార్డుల్లో రెబెల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు ఆరు వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నర్సాపూర్ బల్దియాలో ఈ తిరుగుబాటు తక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలకు ఒక్కో వార్డు చొప్పున తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలోనూ రెండు పార్టీలకు రెండు వేర్వేరు వార్డుల్లో రెబెల్స్ పోటీ పడుతున్నారు. -
సజావుగా ఇంటర్ ప్రాక్టికల్స్
కొల్చారం(నర్సాపూర్): ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో జరుగుతున్న ప్రా క్టికల్స్ పరీక్షలను పరిశీలించారు. ల్యాబ్ గదులు, ల్యాబ్ మెటీరియల్ను పరిశీలించి, ప్రాక్టికల్స్ ఏ విధంగా జరుగుతున్నాయనే విషయమై విద్యార్థులతో ఆరా తీశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల రికార్డులను, పరీక్షల సందర్భంగా గదుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు కళాశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవి, చీఫ్ సూపరింటెండెండ్ నవీన్, కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
నర్సాపూర్: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులతో పాటు అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మున్సిపల్ అభివృద్ధికి నిధులు రాలేదన్నారు. కార్యక్రమంలో సంగీత, అశోక్గౌడ్, మన్సూర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. ‘పది’కి పక్కా ప్రణాళిక పాపన్నపేట(మెదక్): పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని డీఈఓ విజయ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాల రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున ఉపాధ్యాయుల సూచన మేరకు విద్యనభ్యసించాలని సూచించారు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలన్నారు. ఈసారి జిల్లాలో శతశాతం ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్రెడ్డి, టీచర్లు వేణుగోపాల్, శివకుమార్, స్వర్ణ, వసంత, సుహాసిని, ఫణిరాజ్, కళావతి పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి నర్సాపూర్ రూరల్: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని, జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ శ్రీధర్రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం ఆస్పత్రిలో అంతర్జాతీయ కేన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తంబాకు, పాన్ మసాలా, మాదకద్రవ్యాలు వాడడం వల్ల నోటి కేన్సర్తో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయమే శారీరక వ్యాయామం, యోగ, వాకింగ్ వంటి దినచర్య పాటించాలని సూచించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మధుశ్రీ, లీగల్ సర్వీసెస్ న్యాయవాది స్వరూపరాణి, ఆర్ఎంఓ డాక్టర్ రాజేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరళ, కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన అన్నారు. మంగళవారం కౌడిపల్లి పీహెచ్సీలో ఆశవర్కర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకునేలా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రతీ నెల గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నాన్నారు. వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలన్నారు. తప్పనిసరి అయితే పెద్దాస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. నవజాత శిశువుల ఆరోగ్యానికి మెరుగైన వైద్య చికిత్స చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, డాక్టర్ ఫెర్నాజ్, సీహెచ్ఓ ఎలిజబెత్రాణి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ప్రలోభాలకు తావులేదు
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు తావు లేదని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికిరణ్ అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని సూచించారు. అలాగే వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్ -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
రామాయంపేట(మెదక్): మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖా యమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. మంగళవారం పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసి మాట్లాడారు. ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతాయని తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, పార్టీ రాష్ట్ర నాయకుడు హన్మంతరావు, నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జి మహిపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, నాయకులు సరాపు యాద గిరి, బైరం కుమార్, శ్రీధర్రెడ్డి, మధునాల స్వామి, డాకి స్వామి, కమ్మరి రమేశ్ పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
కీలకంగా ఎక్స్ అఫీషియోలు!
రామాయంపేట(మెదక్): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక విషయమై ఎక్స్ అఫీషియో సభ్యులు కీలక పాత్ర పోషించనున్నారు. వీరికి ఓటు వేసే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంపీతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈనెల 16న మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈఎన్నికల్లో వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈమేరకు వీరు ఈనెల 11 నుంచి 14లోగా తాము ఓటు వేయబోయే మున్సిపాలిటీల వివరాలు ఎన్నికల అధికారు లకు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 13లోగా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుండగా, తమ పార్టీలకు సంబంధించి చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక విషయమై మెజార్టీని బట్టి వీరు ఓటు వేసే అవకా శం ఉంది. ప్రధానంగా మెదక్ నియోజకవర్గ పరిధిలో రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలుండగా, చైర్మన్ల ఎంపిక కోసం సందర్భాన్ని బట్టి ఎమ్మెల్యే ఎక్కడైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మెదక్ ఎంపీ తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ బల్దియాలోనైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు సైతం తమ పరిధిలోని ఏ మున్సిపాలిటీలోనైనా ఓటు వేయవచ్చు. కాగా చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. ఈ మేరకు వీరు సంబంధిత మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
పచ్చిమిర్చి.. పనసకాయ
‘పుర’ పోరులో చిత్రమైన గుర్తులుమెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈసారి ఓటర్లను ఆశ్చర్యపర్చేలా గుర్తులను ముందుకు తెచ్చింది. ‘కాదేది గుర్తుకు అనర్హం’ అన్నట్లుగా పచ్చిమిర్చి, పనసకాయ, బెండకాయ, తలుపులకు ఏర్పాటు చేసే గడియ, సాక్స్లు, టూత్ బ్రష్, పెన్డ్రైవ్, విద్యుత్ స్తంభం, లోడోగేమ్, బ్రెడ్ వంటివి ఎన్నికల గుర్తులకు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు గుర్తుల ఫ్లెక్సీని మెదక్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. గతంలో కేవలం కత్తెర, కుండ, స్టవ్, టార్చిలైట్, టేబుల్, క్యారంబోర్డు వంటివే ప్రకటించేవారు. ఇప్పుడు అన్నీ ఎన్నికలకు గుర్తులుగా పనిచేస్తున్నాయంటూ పలువురు చర్చించుకుంటున్నారు.మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ -
జీవాలకు అమ్మతల్లి టీకాలు
చిలప్చెడ్(నర్సాపూర్): గొర్రెలు, మేకల్లో షీప్ పాక్స్ (అమ్మతల్లి) నివారణకు పశువైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో 2.90 లక్షల జీవాలు ఉండగా, ఇప్పటికే 2.14 లక్షల జీవాలకు టీకాలు వేశారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఒక్క షీప్ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ పశు పోషకులు, తమ జీవాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాధి సోకితే జీవాలకు తీవ్ర జ్వరం మొదలై, శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉన్న ప్రదేశాల్లో ఎర్రని బొబ్బలు ఏర్పడతాయి. నోటిలో పుండ్లతో పాటు, కళ్లు, ముక్కు, నోటి నుంచి చీము వంటి ద్రవాలు కారుతాయి. వ్యాధి తీవ్రతరమైతే అంతర్గతంగా ఊపిరితిత్తులో బొబ్బలు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. దీంతో ఆహారం, నీరు తీసుకోలేక జీవాలు నీరసించి మృతి చెందుతాయి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ జీవాలను మంద నుంచి వేరు చేయాలి. పాకలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, క్రిమి సంహారక మందులు వేయించాలి. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే తప్పనిసరిగా పశువైద్య సిబ్బందిని సంప్రదించాలి. అప్రమత్తమైన పశువైద్య సిబ్బంది నివారణకు ముందస్తు చర్యలు జిల్లాలో 2.14 లక్షల జీవాలకు వ్యాక్సినేషన్టీకా వేయించాను నా వద్ద సుమారు 200 పైగా జీవాలు ఉన్నాయి. వాటి పోషణే నాకు జీవనాధారం. పశువైద్యుల సలహాలతో గ్రామంలో నిర్వహించిన శిబిరంలో అన్ని జీవాలకు ముందస్తుగానే టీకాలు వేయించాను. ప్రస్తుతం అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పశు వైద్యులను సంప్రదిస్తా. – పాతూరి యాదయ్య, చండూర్ జిల్లాలో షీప్ పాక్స్ లేదు తమ సిబ్బంది చేపట్టిన ముందస్తు నివారణ చర్యలతో జిల్లాలో ఇప్పటివరకు షీప్ పాక్స్ నమో దు కాలేదు. జిల్లావ్యాప్తంగా టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. త్వరలోనే అనుకున్న లక్ష్యం పూర్తవుతుంది. పశువైద్య శిబిరాలు నిర్వహిస్తాం. – వెంకటయ్య, జిల్లా పశువైద్యాధికారి -
బీఫామ్ ఎవరికో
పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించని పార్టీలుమంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● పలు వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ ● నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువుమున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు ఇబ్బడి ముబ్బడిగా నామినేషన్లు వేశారు. ఇప్పటికే స్క్రూట్నీ సైతం ముగియగా, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రా గడువు ముగియనుంది. కాగా వీరిలో కొందరు స్వచ్ఛందంగా విత్డ్రాకు ముందుకు వస్తుండగా, మరికొందరు లావాదేవీలు చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు నేతల ఒత్తిడితో విత్డ్రాకు సిద్ధమైనట్లు తెలిసింది. – మెదక్జోన్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. వీటిలో 519 మంది ఆశావహులు 668 నామినేషన్లు వేశారు. కొందరు రెండు, మూడు సెట్ల చొప్పున దాఖలు చేశారు. కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బరిలో నిలిచే అభ్యర్థులకు పూర్తిస్తాయిలో బీఫామ్లు ఇవ్వలేదు. మెజార్టీ అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ప్రకటించటంతో వారు ప్రచారం ముమ్మరం చేశారు. మరికొందరి పేర్ల ప్రకటించకపోవడంతో టెన్షన్ నెలకొంది. టికెట్ ఆశించిన కొందరికీ బీఫామ్లు దక్కకుంటే మరో పార్టీలోకి జంప్ అవుతారనే ఉద్దేశంతోనే అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా బీఫామ్లు నేరుగా అధికారులకు ఇవ్వనుననట్లు తెలిసింది. పార్టీల ప్రత్యేక ఫోకస్ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో నిర్వహిస్తుండటంతో అన్ని పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్, రామాయంపేట బల్దియాలపై ప్రత్యేక దృష్టి సారించగా, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలపై దృష్టి పెట్టారు. అలాగేే మాజీ మంత్రి హరీశ్రావు జిల్లాలోని నాలుగు పురపాలికలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హూస్సేన్ను జిల్లాకు ఇన్చార్జిగా నియమించారు. బీజేపీ సైతం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్చార్జిలను నియమించింది.కండువాలు మార్చుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నేతలు కండువాలు మార్చుతున్నారు. మెదక్ మాజీ కౌన్సిలర్ గోదల జ్యోతి, కృష్ణ దంపతులు చాలాకాలంగా కాంగ్రెస్లో ఉన్నారు. గతనెల 22న హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి పట్టణంలోని 32వ వార్డు నుంచి బీఆర్ఎస్ టికెట్ కేటాయించగా, నామినేషన్ సైతం వేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఆ వార్డులో కాంగ్రెస్ నుంచి గొదల మానస, సాయి నామినేషన్ వేశారు. దీంతో ఈ వార్డు ఏకగ్రీవం కానుంది. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ వీరు ఇరువురు ఇదే విధంగా వ్యవహరించటంతో అప్పుడూ మాసన ఏకగ్రీవంగా కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. -
చట్టపరంగా న్యాయం చేస్తాం
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ఫిర్యాదు లు స్వీకరించారు. బాధితులతో వ్యక్తిగతంగా మా ట్లాడి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకున్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కేసుల విషయంలో సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్లో మాట్లాడి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై ప్రజల్లో పోలీస్శాఖపై నమ్మకం మరింత పెరిగిందని వివరించారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
పది టాపర్లకు నగదు పురస్కారం
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి టాపర్ విద్యార్థులకు నగదు పురస్కారం ఇచ్చేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో బాధ్యులతో కలిసి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు శ్రీరామ్లైఫ్ ఇన్సూరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2.2 కోట్ల నగదు ప్రకటించినట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ. 5 లక్షలు, రెండో ర్యాంకుకు రూ.3 లక్షలు, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో టాపర్కు రూ. 2 లక్షలు, మండలాల్లో ప్రథమస్థానం పొందిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పున నగదు పురస్కారం అందించనున్నట్లు వివరించారు. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా సైనన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, మెదక్, శ్రీరామ్ బ్రాంచ్ మేనేజర్ రత్నాకర్, జూనియర్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
రామాయంపేట(మెదక్)/నిజాంపేట: రామాయంపేట పట్టణ అభివృద్ధి విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. సోమవారం రాత్రి పట్టణంలో పాదయాత్ర, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పట్టణంలోని కాలనీల్లో పర్యటించగా, శిథిలమైన రహదారులు, మురుగు కాలువలు కనిపించాయన్నారు. పదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. అన్ని కాలనీలను అద్దంలా మార్చే బాధ్యతగా తనదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నిజాంపేట మండల పరిధిలోని చౌకత్పల్లిలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మడవత్ సునీత, ఉప సర్పంచ్ రాములు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు అమరసేనారెడ్డి, వెంకటేశ్గౌడ్, మధుసూదన్రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
యాప్ ద్వారా విక్రయించాలి
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు జిల్లాలో ఎక్కడైనా యూరియా కొనుగోలు చేయవచ్చని జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి మాట్లాడారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా అమ్మాలని, కొనుగోలు చేయాలని వ్యాపారులు, రైతులకు సూచించారు. యాప్ ద్వారా యూరియా అమ్మకాల వివరాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీఏ సంధ్యారాణి, సిబ్బంది యాదగిరి, దుర్గాప్రసాద్, తేజస్విని తదితరులు ఉన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని మహమ్మద్నగర్ పీఏసీఎస్ను డీఏఓ తనిఖీ చేసి యూరియా బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. సెల్ఫోన్కు దూరంగా ఉండండి: డీఈఓ మెదక్జోన్: పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు సెల్ఫోన్కు దూరంగా ఉండాలని డీఈఓ విజయ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డీఈఓ మెమోంటోలు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా ర్థులు నిరంతరం సెల్ఫోన్లు చూడటం వల్ల చదువు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు, కొండల్రెడ్డి, సోషల్ ఫోరం పూర్వ అధ్యక్షుడు చల్లా లక్ష్మణ్, దేవిసింగ్, సత్యనారాయణ, ప్రసాద్రెడ్డి, వీరేశం తదితరులు పాల్గొన్నారు. అందరూ మెచ్చే బడ్జెట్పై విమర్శలా? దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటరూరల్: దివ్యాంగులకు ఉపకరణాలు అందించనున్నారని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్చైర్, మొబైల్బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్,వీల్చైర్, లాప్టాప్స్, టాబ్స్, వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 10లోపు http://http.tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు
తూప్రాన్: పరిశ్రమల్లో బాల కార్మికులను నియమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ జయచంద్రారెడ్డి హెచ్చరించారు. సోమవారం డివిజన్ పరిధిలోని అధికారులతో ఆపరేషన్ స్మైల్పై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ పరిశ్రమలు, వర్క్షాపులు, ఇతర సంస్థల్లో బాల కార్మికులు పనిచేస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. బాలకార్మికుల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందుకోసం డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో బాలకార్మికులను గుర్తి ంచాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్మిక చట్టాల అమలులో నిర్లక్ష్యం చూపిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో అలసత్వం వహించకూడదని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.ఆర్డీఓ జయచంద్రారెడ్డి -
ఆత్మలకు ఓట్లు.. తొలగని పొరపాట్లు
● ఓటరు జాబితాలో 150 మంది మృతుల పేర్లు ● జారీ కానున్న ఓటర్ స్లిప్లురామాయంపేట(మెదక్): ఓటరు జాబితాలో వందల సంఖ్యలో మృతుల పేర్లు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం మరణించిన వారి పేర్లు సైతం ఫొటోలతో జాబితాలో ప్రచురితమయ్యాయి. వీరందరికీ త్వరలో ఓటర్ స్లిప్లు జారీ కానున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి గ్రామస్తులు రెండో వార్డులో ఉండగా, పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన సుమారు 125 మంది పేర్లు రెండో వార్డులో ఉన్నాయి. ముసాయిదా ఓటరు జాబితా విడుదల సమయంలో వార్డు ప్రజలు ఫిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం కాలేదు. అలాగే హరిజనకాలనీ వాసులు తరలివచ్చి తమను ఏడో వార్డు నుంచి తొలగించి యథావిధిగా ఒకటో వార్డులోనే ఉంచాలని ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పట్టణంలోని 12 వార్డుల్లో మొత్తం 13,095 ఓటర్లు ఉండగా, వీరిలో 6,291 మంది పురుషులు, 6,804 మంది మహిళలు ఉన్నారు. అన్నివార్డుల్లో కలిపి సుమారుగా 150 మందికి పైగా మృతుల పేర్లు ఓటరు జాబితాలో చోటు చేసుకున్నాయి.మచ్చుకు కొన్ని.. నాలుగో వార్డులోని 145 సీరియల్ నంబర్పై నమోదైన ఎండీ గోరేమియా నాలుగేళ్ల క్రితమే మృతిచెందారు. అతని పేరు, ఫొటో జాబితాలో ప్రచురితమైంది. ఇదే వార్డులోని 698 నంబర్పై నమోదైన పోచమ్మల రాజవ్వ రెండేళ్ల క్రితం మృతిచెందారు. నాలుగో వార్డులోని 702 నంబర్పై నమోదైన పోచమ్మల నర్సవ్వ ఏడాదిన్నర క్రితం మృతిచెందారు. ఇదే వార్డులోని 930 నంబర్పై నమోదైన డాకి లక్ష్మి రెండేళ్ల క్రితమే మృతి చెందింది. పదో వార్డులో సీరియల్ నంబర్ 183లో నమోదైన రొయ్యల పోచయ్య రెండేళ్ల క్రితమే మృతి చెందింది. పదో వార్డులోని 858 నంబర్లో ఉన్న బచ్చు భూమయ్య ఏడాది క్రితమే మృతి చెందారు. పదో వార్డులోని 570 నంబర్పై నమోదైన మర్కు సత్యనారాయణ నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. ఐదో వార్డులోని 1006 నంబర్లో ఉన్న పాండురంగనాఽథ్ ఐదేళ్ల క్రితమే మృతి చెందారు. వీరందరూ ప్రస్తుత ఓటరు జాబితాలో నమోదై ఉన్నారు. -
ఎన్నికల నిబంధనలు తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫీషియో ఎంపిక కోసం నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుంచి 14వ తేదీలోపు నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తులు, జాబితా ప్రకటించాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
బుజ్జగింపుల పర్వం
● ప్రధాన పార్టీలకు తలనొప్పిగా రెబల్స్ ● ఒకే పార్టీ నుంచి పోటీలోనలుగురు, ఐదుగురుతూప్రాన్: నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. టికెట్ దక్కని వారితో పాటు, రెబల్స్ బెడద ఇప్పుడు సవాల్గా మారింది. వార్డుల్లో పార్టీలు ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి దిగడంతో సమీకరణాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్కు రెబల్స్ నామినేషన్లు దాఖలు చేయడం, పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మా రింది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కోచోట పార్టీ అభ్యర్థితో పాటు రెబెల్ అభ్యర్థి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఓట్ల విభజన తప్పదన్న ఆందోళన పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. దీంతో బుజ్జగింపులకు తెర లేపారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో తూప్రాన్ మున్సిపాలిటీలో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులను బుజ్జగించేందుకు వారి సన్నిహితులతో పావులు కదుపుతున్నారు. 16 వార్డులకు 141 మంది నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్లు వేసిన రెబల్స్ బరిలో నుంచి తప్పుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా కొన్ని వార్డుల్లో నామినేషన్ వేసిన వారికి రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు ఇస్తూ పోటీ నుంచి తప్పుకునేలా సీనియర్ నాయకులు చర్యలు ముమ్మరం చేశారు. కాగా కొందరు ఎన్నికల ఖర్చు భరించడం ఇబ్బంది అవుతుందని, బరిలో ఉండాలా.. వద్దా..? అనే ఆలోచనలో పడ్డారు. ఎదుటివారు ఇచ్చే ఆఫర్లు తీసుకొని పక్కకు తప్పుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. -
కుస్తీమే సవాల్
మండలంలోని వెల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్త జన సందోహం మధ్య కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చివరి కుస్తీలో కామారెడ్డి జిల్లా అంతాపూర్కు చెందిన గంగాధర్ఇద్దరిపై గెలుపొందారు. విజేతకు సర్పంచ్ నిరూడిదాసు 5 తులాల వెండి కడియం, నగదు అందజేశారు. – టేక్మాల్(మెదక్) -
సమయపాలన తప్పనిసరి
టేక్మాల్(మెదక్): వైద్యులు సమయపాలన పాటించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టేక్మాల్ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు, రోగుల గదులు, వైద్యుల హాజరుతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్బంగా అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. డ్యూటీ డాక్టర్ ఎవరు? రాత్రి వేళలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉంటున్నారని అడిగి తెలుసుకున్నారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వైద్యం అందించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరన్దిబ్బలో మద్య నిషేధం అల్లాదుర్గం(మెదక్): మండలంలోని బహిరన్దిబ్బలో గ్రామస్తులు మద్య నిషేధం విధించారు. బెల్ట్షాపుల్లో మద్యం అమ్మకుండా తీర్మానం చేసి ఎస్ఐ శంకర్కు ప్రతిని అందజేశారు. ఈమేరకు ఆదివారం సర్పంచ్ పాంపాటి వీర న్న గ్రామస్తులతో సమావేశం నిర్వహించి నిర్ణ యం తీసుకున్నారు. బెల్టు షాపుల్లో మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు. ఉల్లంఘించి మద్యం అమ్మి తే రూ. 25 వేలు, కొనుగోలు చేసిన వారికి రూ. 10 వేల జరిమాన విధిస్తామన్నారు. పోలీసుల సహకారం అవసరమని కోరారు. ఎమ్మెల్యే సునీతారెడ్డిపై కేసు నర్సాపూర్ రూరల్: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందున నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్రెడ్డి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ నర్సాపూర్లో ర్యాలీ తీయడంతో పాటు చౌరస్తా వద్ద బైఠాయించి రాస్తారోకో చేశారన్నారు. ఎన్నికల కోడ్, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున డిప్యూటీ తహసీల్దార్ స్వప్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, సింగయ్యపల్లి గోపి, పట్టణ అధ్యక్షుడు పంబల భిక్షపతితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ సత్తా చాటుదాం భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటుదామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక కొమ్మూరి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డు ఒగ్గు వెంకటమ్మ, 2వ వార్డు ముస్త్యాల తేజ, 3వ వార్డు కొమ్ము రా జేశ్వరి, 4వ వార్డు వంగ జయలక్ష్మి, 5వ వార్డు వెలుగల దుర్గయ్య, 6వ వార్డు ముస్త్యాల కృష్ణ, 7వ వార్డు పోతుగంటి ప్రసాద్, 8వ వార్డు సందుల సురేష్, 9వ వార్డు మామిడాల నాగరాజు, 10వ వార్డు తుమ్మలపల్లి లీల, 11వ వార్డు గుస్క వాసంతి, 12వ వార్డు షరీఫాబేగం పేర్లను ప్రకటించారు. ఎంపీ చామల, కొమ్మూ రి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన పల్లా బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. చేర్యాల మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అందుకు ప్రతీకార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి ఓటర్లందరినీ కలిసి ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాలను వివరించాలన్నారు. సమావేశంలో పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. -
మెతుకుసీమను కేంద్ర బడ్జెట్ మరోసారి నిరాశపర్చింది. ఆదివారం పార్లమెంట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. జిల్లా పరిధిలో రైలు, రోడ్డు మార్గాలకు బడ్జెట్లో నూతనంగా ఎలాంటి కేటాయింపులు జరగలేదు. పర్యాటక ప్రగతి ఊసేలేకపోగా, ఆదాయ పన్న
● కొత్త రైలు, రోడ్డు మార్గాలు కరువు ● ఊసేలేని పర్యాటకం, కేంద్రీయ,నవోదయ పాఠశాలలు ● వేతన జీవులకు దక్కని ఊరట జిల్లాలో చారిత్రక కట్టడాలు ఉన్నా, పర్యాటకరంగ అభివృద్ధికి పైసా కేటాయించలేదు. జిల్లా మీదుగా నాలుగు జాతీయ రహదారులు ఉన్నప్పటికీ, మెదక్ నుంచి వయా నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ ఓఆర్ఓర్ పరిధిలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా యి. ముఖ్యంగా నర్సాపూర్ ఫారెస్ట్ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటం, మలుపులు ఉండటంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మించాలి. అలాగే మెదక్ రింగ్రోడ్డు అత్యవసరంగా నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణాలకు బడ్జెట్లో నిధులు మంజూరవుతాయని ప్రజ లు ఎంతో ఆశగా ఎదురు చూసినా, నిరాశే మిగిలింది. ఉన్నత విద్య.. అందని ద్రాక్ష జిల్లాలో ఉన్నత విద్య ద్రాక్షలా మారింది. ఇక్కడి విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాలకు పరుగు పెట్టాల్సి వస్తోంది. ఈ బడ్జెట్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటవుతాయని ఆశించిన మెతుకుసీమ ప్రజల కల నెరవేరలేదు. నేటికీ ఇక్కడ పీజీ కళాశాల లేకపోవటంతో ఈ ప్రాంతం విద్యారంగంలో వెనుకబాటుకు గురైంది. అలాగే జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సేవింగ్స్ గత పుష్కరకాలంగా రూ. 1.50 లక్షలు మాత్రమే ఉంది. ఈ బడ్జెట్లో దాని పరిమితి కనీసం మరో రూ. లక్ష పెంచినా ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో కొంత తప్పేదని ఉద్యోగులు ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. అయితే వారి ఆశలు ఆవిరయ్యాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఊరట బడ్జెట్లో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం రాబోయే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించటం వ్యాధిగ్రస్తులకు కొంత ఊరట కలిగించే అంశం. జిల్లాలో బీపీ వ్యాధిగ్రస్తులకు రూ. 99 వేలు, షుగర్ రూ. 55 వేలు కేన్సర్ బాధితులు 475 మంది చొప్పున మొత్తం 1,54,475 మంది ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గింపు! ఈవీ కార్లు, ద్విచక్రవాహనాల ధరల తగ్గింపు కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యం తగ్గటంతో పాటు వాహనదారులకు ఖర్చు నుంచి విముక్తి లభిస్తోంది. అలాగే సెల్ఫోన్ల ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సైతం ప్రజలకు కొంత లాభం చేకూరుస్తుందనే చెప్పవచ్చు. అలాగే బాలికలకు జిల్లాకో హాస్టల్తో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా షీ మార్ట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. -
జాతీయస్థాయిలో రాణించాలి
తూప్రాన్: ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు గోవాలో జరిగే 22వ దక్షిణ భారత జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు రాణించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి రమేశ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో జరిగిన తెలంగాణ పురుషు లు, మహిళల జట్ల ఎంపిక నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధిస్తున్న క్రీడల్లో సాఫ్ట్బాల్ ముందుంటుందన్నారు అన్నారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్బాబు మాట్లాడుతూ.. జాతీయస్థాయి పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి రాణించాలన్నారు. ఎంపికకు వివిధ జిల్లాల నుంచి 102 మంది పురుషులు, 65 మంది మహిళలు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అభిషేక్గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్గౌడ్, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్ శర్మ, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్వి కక్ష సాధింపు చర్యలు
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ ద్వారా కేసీఆర్కు నోటీసులు ఇప్పించి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలో పార్టీ నాయకులతో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పథకాలు బాగున్నాయని ఎకనామిక్ సర్వే ప్రశంసిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిట్ పేరిట నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే నోటీసులిచ్చారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనలను సైతం సిట్ అధికారులు ఉల్లంఘించారని వాపోయారు. అనంతరం చౌరస్తాలో పార్టీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గోపి, శేఖర్, అశోక్గౌడ్, నయిమోద్దీన్, సత్యంగౌడ్, బాల్రెడ్డి, భిక్షపతి, షేక్ హుస్సేన్, కండెలరాజు, ఆంజనేయులుగౌడ్, వినయ్, మహేందర్గౌడ్, సంతోష్, విఠల్, ప్రసాద్, నాగరాజుగౌడ్, శ్రవణ్కుమార్, సద్దాం, మన్సూర్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి రామాయంపేటలో ఉద్రిక్తత రామాయంపేట(మెదక్): కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆదివారం ఆపార్టీ కార్యకర్తలు రామాయంపేటలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా మెదక్ రోడ్డు వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, పలువురు సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
పన్ను చెల్లింపుదారులకు నిరాశే
కేంద్ర మంత్రి నిర్మ లా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ట్యాక్స్ (పన్ను) చెల్లింపుదారులకు నిరాశే మిగిలింది. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మా ర్పు చేయకపోవటం బాధాకరం. స్లాబులు పెంచి కనీసం రూ. 3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తే బాగుండేది. – మల్లారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఒరిగిందేమిలేదు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో జిల్లాకు ఎలాంటి లాభం చేకూరలేదు. పర్యాటక రంగ ప్రగతికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు మంజూరవుతాయని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. – శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
అదిగో పులి..!
● వాట్సాప్లో వైరల్ ● ఫేక్ అని తేల్చిన అటవీ అధికారులు చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ఎస్. కొండపూర్ అటవీ ప్రాంతంలో మెదక్– చేగుంట రోడ్డు నుంచి టీ.మాందాపూర్ వైపు పులి వెళ్లిందని వాట్సాప్లో వైరల్ అయింది. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు తాము రోడ్డు దాటుతుండగా చూశామని వాయిస్ రికార్డుతో పాటు పులి ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఇదే విషయమై రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ స్పందించారు. ఈ ప్రాంతంలో పులి కదలికలు లేవని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఫొటో నిర్మల్ జిల్లాలో నాలుగు నెలల క్రితం తీసిందన్నారు. కాగా టీ.మాందాపూర్ సమీపంలోని గజగట్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత అడుగులను వన్యప్రాణుల లెక్కింపు సమయంలో అటవీశాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
పుర పోరు.. డిజిటల్ హోరు
● అభ్యర్థుల ‘స్మార్ట్’ ప్రచారం ● తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రచారంరామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రి య ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో దూ సుకెళ్తున్నారు. ప్రధానంగా సామాజిక మాద్య మాలపై దృష్టి సారించారు. సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యే క వ్యూహాలు రూపొందిస్తున్నారు. తమ ను గెలిపిస్తే ఏం చేస్తామో సామాజిక మాద్యమాల్లో వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యూత్ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఈమేరకు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ర్ట్రాగాంను విరి విగా వినియోగించుకుంటున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎక్కువ శాతం అక్షరాస్యులు ఉండటంతో పాటు అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీంతో అభ్యర్థుల ప్రచారం సులువుగా మారింది. కంప్యూటర్ సాయంతో ప్రచార సందేశాలు రూపొందించుకొని మూకుమ్మడిగా ఓటర్లకు చేరవేస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇంకా బీఫాంలు రాకముందే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నాలుగు ము న్సిపాలిటీల్లో ఒక్కో వార్డు నుంచి కనీసం ముగ్గురు నుంచి ఎనిమిది మంది వరకు పోటీలో నిలిచారు. ఉపసంహరణల తర్వా త పోటీలో ఉండే అసలైన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు కుల సంఘాలు, పెద్దలను విడి గా కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. కార్యకర్తల కోసం ప్రత్యేకంగా హోటళ్లలో ఉదయం, సాయంత్రం భోజనాలు చేయిస్తున్నారు. కొన్ని వార్డుల్లో మద్యం పంపిణీ కూ డా ప్రారంభించినట్లు సమాచారం. ఈ మేరకు అభ్యర్థులు వార్డుల వారీగా ఓటర్ల వివ రాలు, ఫోన్ నంబర్లు సే కరించి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. బుజ్జగింపుల పర్వం షురూ పోటీలో ఉన్న అభ్యర్థుల్లో చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే టికెట్ గొడవల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కొందరు ఇతర పార్టీల్లో చేరగా, మళ్లీ అదే పరిస్థితి పురావృతం కాకుండా నేతలు వ్యూ హాలు రచిస్తున్నారు. అభ్యర్థుల పలుకుబడి, ఆర్థిక స్థోమత దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని నాలు గు మున్సిపాలిటీల్లో 75 వార్డుల్లో మొత్తం 519 మంది అభ్యర్థులు 668 నామినేషన్లు దాఖలు చేశారు. -
నేడు బీఆర్ఎస్ నిరసన
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి, దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన చర్యని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధకుడిగా, సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తిని దర్యాప్తునకు పిలవడం సరికాదన్నారు. 65 ఏళ్లు నిండిన కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ జరపాలని చట్టం చెబుతున్నా, రేవంత్రెడ్డికి అనుకూలంగా పనిచేసే కొందరు వ్యక్తులు కేసీఆర్ను అవమానాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
అధికారుల పాత్ర కీలకం
● కలెక్టర్ రాహుల్రాజ్ ● ఎన్నికల విధులపై శిక్షణ మెదక్జోన్: ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఈనెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల విధులకు సంబంధించి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు కలెక్టరేట్లో శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఒక రోజు ముందే చేరుకొని పోలింగ్ సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. జోనల్ అధికారి పోలీస్ ఎస్కార్ట్తో పాటు సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అనంతరం మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షలపై హెచ్ఎంలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులు సెలవులు పెట్టొదన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళలో రెండు సార్లు స్నాక్స్ అందించాలన్నారు. వందశాతం ఉత్తీర్ణత శాతం సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ప్రజావాణి వాయిదా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్తో పాటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉంటారని, ఎన్నికల అనంతరం మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. -
జిల్లాలో యూరియా కొరత లేదు
జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్రామాయంపేట(మెదక్): ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన యూరియా సునాయాసంగా లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ అన్నారు. శనివారం రామాయంపేటలో యాప్ ద్వారా యూరియా పంపిణీని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు పంట విస్తీర్ణాన్ని బట్టి యూరియా సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలి పారు. యాప్తో రైతులు యూరియా కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా రైతులే ఫోన్లో ఇంటి నుంచే యూరియా ముందస్తుగా బుక్ చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన యూరియా సిద్ధంగా ఉందన్నారు. స్థానిక వ్వవసాయ సహాయ సంచాలకులు రాజ్నారాయణ, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. అందుబాటులోకి యాప్ చిన్నశంకరంపేట(మెదక్): ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి వచ్చిందని డీఏఓ దేవ్కుమార్ తెలిపారు. శనివారం నార్సింగిలోని ఆగ్రోస్ కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. రైతులు యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంట్లో నుంచే ముందుగా యూరియా బుక్ చేసుకోని కొనుగోలు చేయవచ్చన్నారు. యాప్లో సమస్య వస్తే ఏఓ, ఏఈఓలను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట నార్సింగి ఏఓ భరత్కుమార్, రైతులు ఉన్నారు. -
పూర్తిస్థాయిలో ప్రకటించని పార్టీలు
● జాగ్రత్త పడుతున్న నేతలు ● ప్రచారం ప్రారంభించిన పలువురు మెదక్జోన్: ‘పుర’పోరులో భాగంగా మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగగా, శనివారం అధికారులు స్క్రూట్నీ నిర్వహించారు. ఇందులో అన్నీ సక్రమంగానే ఉన్నట్లు తేల్చారు. కాగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఇప్పటివరకు ఏ పార్టీ పూర్తిస్థాయిలో ఖరారు చేయలేదు. అయితే నామినేషన్ వేసిన ఆశావహులు మాత్రం ప్రచారం మొదలు పెట్టారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులకు గానూ 519 మంది ఆశావహులు 668 నామినేషన్లు దాఖలు చేశారు. కాగా కొందరు ఒక్కొక్కరు రెండు, మూడు చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈనెల 3వ తేదీ వరకు విత్డ్రాకు సమయం ఉంది. అదేరోజున అభ్యర్థుల జాబితా ఫైనల్ చేసి బీఫాంలు అందించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే సర్వే చేయించారు. దాని ఆధారంగానే టికెట్లు కేటాయిస్తునట్లు సమాచారం. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 28 మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలిసింది. మరో నలుగురి పేర్లు ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ 24 పేర్లు ఖరారు చేయగా, మరో 8 మంది పేర్లు ఫైనల్ చేయాల్సి ఉంది. బీజేపీ నాలుగు మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే వారి పేర్లు ఖరారు చేసింది. బీఫాంలు సైతం రాష్ట్ర పార్టీ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఖరారైన అభ్యర్థుల పేర్లు మాత్రం బయట పెట్టడం లేదు. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేయగా, అధికార కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. తూప్రాన్, రామాయంపేటలో ఇప్పటివరకు ఏ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదు.రెబల్స్ బెడద అభ్యర్థులను ప్రకటించే విషయంలో అన్ని పార్టీలు జాగ్రత్తలు వహిస్తున్నాయి. పేర్లు బయటపెడితే ఇప్పటికే టికెట్ ఆశించిన వారి పేరు జాబితాలో లేకుంటే వారు పార్టీ మారినా..? లేక రెబల్గా బరిలో నిలిచినా పార్టీకి తీరని నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ఈనెల 3లోగా ఫైనల్ అయిన అభ్యర్థులకు బీఫాంలను నేరుగా మున్సిపల్ అధికారులకే అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నామినేషన్ దాఖలు చేసిన చాలా మంది ఆశావహులు ఇంటింటి ప్రచారం చేస్తూ మద్దతు కూడగడుతున్నారు. -
సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి
నర్సాపూర్ రూరల్: విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ శాఖ ఏడీ రమణారెడ్డి ప్రజలకు సూచించారు. శనివారం మండలంలోని అచ్చంపేటలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలను వెంట వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అచ్చంపేటలో వేలాడుతున్న తీగలను సరి చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తుల్చమ్మ, నాయకులు భిక్షపతి, ఉప సర్పంచ్ నవీన్, విద్యుత్ సిబ్బంది ఉస్మాన్, ఆంజనేయులు, కృష్ణ, ప్రవీణ్, రాజకుమార్ పాల్గొన్నారు. రూ. 21 లక్షల పన్నులు వసూలు నర్సాపూర్: మున్సిపాలిటీలో రూ. 21.39 లక్షల పన్నులు వసూలయ్యాయని మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారిని ప్రతిపాదించిన వారు, సాక్ష్యులు తమ ఆస్తి పన్ను బకాయి ఉండరాదన్న నిబంధనల మేరకు పన్నులు చెల్లిస్తున్నారని చెప్పారు. ఈనెల 27 నుంచి 30 వరకు ఆస్తి పన్నులు, నల్లాల బిల్లుల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని కమిషనర్ వివరించారు. పశు సంపద పెంచాలి నర్సాపూర్ రూరల్: పశు సంపదను పెంచి రైతులను అభివృద్ధి చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. శనివారం మండలంలోని గొల్లపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని సందర్శించారు. పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయడంతో పాటు కృతిమ గర్భధారణను పరిశీలించారు. దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పశు సంపదను పెంచేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మండల వైద్యాధికారులు డాక్టర్ సౌమిత్, డాక్టర్ స్వప్న, గొల్లపల్లి సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ రగుల శేఖర్ యాదవ్, గోపాలమిత్రలు రఘువీర్ శ్యామ్, వెంకటేశ్, ఏసుప్రభు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టెట్ మినహాయింపు ఇవ్వాలి: పీఆర్టీయూ మెదక్జోన్: సర్వీస్ టీచర్లకు టెట్ ఉత్తీర్ణత మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీశ్రావు డిమాండ్ చేశారు. టెట్ రద్దు కోరుతూ ఈనెల 5న నిర్వహించనున్న చలో ఢిల్లీ పోస్టర్ను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009లోని సెక్షన్ 23ను సవరించి 2010కి ముందు ఉపాధ్యాయులుగా నియామకమైన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలన్నారు. ధర్నాకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు సబాని శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంకటాపూర్ ఇన్చార్జి హెచ్ఎం సస్పెన్షన్నారాయణఖేడ్: మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కాశీనాథ్పై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటన అనంతరం షోకాజ్ నోటీసు జారీచేసి వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పాఠశాల ఆవరణలో నిర్మించిన వంటగదిని గుత్తేదారు అప్పగించని కారణంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇంటివద్దే వండి పాఠశాలలో వడ్డిస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు. -
2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● 11వ తేదీ వరకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులుమెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు రెండు విడతల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష లకు ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు ఒకేషనల్ కోర్సును అభ్యసిస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. ప్రైవేట్ కళాశాలలో గల పరీక్ష కేంద్రాల్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రయోగ పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. జిల్లాలో మొత్తం 12,323 మంది విద్యార్థులు జిల్లాలో 27 ఇంటర్మీడియెట్ కళాశాలలున్నా యి. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి రెండో సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న వారికి మాత్రమే పరీక్షలుంటాయి. ఆన్లైన్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కొన్ని ప్రైవేట్ కళాశాలలు ముందే లీకేజీ చేస్తున్నాయనే ఆరోపణలు రావడంతో పాటు ప్రాక్టికల్స్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా వుండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలకు అరగంట ముందే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానంలో పరీక్ష కేంద్రం ఎగ్జామినర్కు ఆన్లైన్లో పంపుతారు. ఇందుకోసం ఎగ్జామినర్ సెల్ఫోన్కు మెసేజ్ రాగానే అతడు సంబంధిత వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్విజిలేటర్లకు అందజేస్తారు. హాల్ టికెట్ ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసి ఇవ్వాల్సి వుంటుంది. పరీక్ష ముగించే గంట లోపు వాల్యుయేషన్ చేసి మార్కుల జాబితాను ఎగ్జామినర్ బోర్డుకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. -
వరకట్న రహిత సమాజం రావాలి
సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమాహవేళిఘణాపూర్(మెదక్): వరకట్నం లేని వివాహాలను ప్రోత్సహించాలని, అందుకు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి రుబీనాఫాతిమా అన్నారు. శనివారం మండల పరిధిలోని స్కూల్ తండాలో వరకట్న నిషేధం అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పెళ్లికి ముందు వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నిషేధమని, ఇచ్చినా, తీసుకున్న నేరమన్నారు. వరకట్న వేధింపులతో ఎందరో మహి ళలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను నాశనం చేస్తున్న వరకట్నంను అందరూ నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు తమ తమ పిల్లలను చదివించి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచినప్పుడే వరకట్న రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. నాగరాజు, ఎస్ఐ సత్యనారాయణ, స్కూల్ తండా సర్పంచ్ గోపాల్నాయక్, పంచా యతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ
● బీఆర్ఎస్లోకి పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు ● మున్సిపల్ ఎన్నికల వేళ షాక్ ● జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు రామాయంపేట(మెదక్): జిల్లాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న పీసీసీ కార్యదర్శి, సీనియర్ రాష్ట్ర నాయకుడు సుప్రభాతరావు పార్టీని వీడారు. మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో తన కూతురును చైర్పర్సన్గా చేయాలని భావించారు. ఐదో వార్డు నుంచి టికెట్ కోసం ప్రయత్నించినా పార్టీ అంగీకరించకపోవడంతో వేచి చూశారు. చివరకు తన కూతురుతో నామినేషన్ వేయించగా, బీఫాం విషయమై పార్టీ నాన్చుడు ధోరణి అవలంభించింది. చివరి రోజు వరకు వేచి చూసిన ఆయన శుక్రవారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్ తరలివెళ్లారు. మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ బలోపేతానికి కొన్నేళ్లుగా కృషి చేసిన సుప్రభాతరావు పార్టీని వీడటంతో కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుప్రభాతరావు కాంగ్రెస్ను వీడటం సంచలనంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి రోహిత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. నాలుగైదు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ కోసం, నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ కూడా దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యం చెందారు. మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురును టికెట్ ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావించిన ఆయన పలుమార్లు పార్టీ పెద్దల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. హరీశ్రావు మంత్రాంగం జిల్లాలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై మాజీ మంత్రి హరీశ్రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఏచిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతు న్నారు. ఇందులో భాగంగా మెదక్లో సీనియర్ నాయకుడు సురేందర్గౌడ్ను ఇటీవల బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అసంతృప్తితో ఉన్న సుప్రభాతరావు విషయంలోనూ ఆచితూచి వ్యవహరించి సక్సెస్ అయ్యారు. త్వరలో మరికొందరు కాంగ్రెస్లో చేరనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ రాహుల్రాజ్నిజాంపేట(మెదక్): వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి మాట్లాడారు. వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రత్యేక తరగతులతో మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. గణితం, సై్న్స్, ఇంగ్లీష్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చలిమెటి నరేందర్, ఉప సర్పంచ్ గెరిగంటి బాబు, ఎంపీడీఒ రాజిరెడ్డి, ఎంపీఓ వెంకట నర్సింహారెడ్డి, కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పెండింగ్లో ఉన్న రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేసి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రహదారులు, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలన్నారు. మత్తు పదార్థాలపై నిఘా పెంచి నిరోధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ● 1,200 మంది ముందస్తు బైండోవర్మెదక్ కలెక్టరేట్/రామాయంపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలు సృష్టించే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే గతంలో నేర చరిత్ర కలిగిన సుమారు 1,200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 21 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచారం చేస్తే సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు రూ.50 వేలకు మించి నగదు త రలించొద్దన్నారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్బాబు, పట్టణ సీఐ మహేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. అనంతరం రామాయంపేట మున్సిపాలిటీలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలు సాఫీగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. -
ఎన్నికలప్పుడే సిట్ నోటీసులా?
ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: ఎన్నికలు రాగానే సిట్ నోటీసులు ఇస్తూ తమ పార్టీ అగ్ర నాయకులను ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ను విచారణకు రావాలని పార్టీ నాయకుల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ పార్టీలో టికెట్ దక్కని వారిని కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల్లో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. చైర్మన్ పదవిని బీఆర్ఎస్ రెండోసారి దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. సర్వేల ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. అనంతరం పట్టణంలోని 15 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. -
తిరుగుపోటు
● కాంగ్రెస్, బీఆర్ఎస్కు రెబల్స్ తలనొప్పి ● పోటీలో కొనసాగితే తప్పని నష్టం ● నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా తయారయ్యారు. ఆయా పార్టీల టికెట్లు ఆశించి ముందస్తుగానే నామినేషన్లు వేసిన నాయకులకు అభ్యర్థిత్వాలు దక్కకపోవడంతో స్వతంత్రులుగా కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. రెబల్స్ బరిలో ఉంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో రెబల్స్ను పోటీ నుంచి తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ల కోసం పోటా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రెబల్స్ సమస్య వేధిస్తోంది. కాంగ్రెస్ టికెట్ల కోసం చాలామంది నేతలు పోటీ పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చాలామంది బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఇలా కొత్తగా పార్టీలో చేరిన వారు..చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్నవారు ఈ టికెట్లు ఆశించారు. దీంతో ఈ పార్టీ టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. ఈ టికెట్లు దక్కని నాయకులు స్వతంత్రులుగా పోటీలో కొనసాగేందుకు సై అంటున్నారు. ఇక తక్షణం నామినేషన్లు ఉపసంహరించుకోవాలని రెబల్స్పై ఆయా పార్టీల నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలు రంగంలోకి దిగి రెబల్స్ను బుజ్జగిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే పార్టీ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని, రానున్న రోజుల్లో మరేదైనా పదవి ఇస్తామని.. వెంటనే నామినేషన్ ఉపసంహరించుకుని పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని చెబుతున్నారు. అయినప్పటికీ మాటవినని పక్షంలో పార్టీపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా అందని బీఫారాలు పార్టీలు అభ్యర్థిత్వాలు ప్రకటించినప్పటికీ ఇంకా బీఫారాలు పంపిణీ చేయడం లేదు. బీఫారాలు ఇచ్చేందుకు రెండు రోజులు గడువు ఉండటంతో టికెట్లపై అభ్యర్థుల్లో సస్పెన్స్ వీడటం లేదు. అభ్యర్థిత్వాలు ప్రకటించినప్పటికీ కొన్ని వార్డుల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆఖరి రోజు అట్టహాసంగా
మెదక్ మున్సిపాలిటీ వద్ద అభ్యర్థుల మద్దతుదారులు మెదక్ కలెక్టరేట్: నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు వారి మద్దతుదారులతో పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో మెదక్ మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసి పోయింది. టికెట్ పొందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం అనుచరులతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టణమంతా బ్యాండు మేళాలు, టపాసుల మోతలు, నినాదాలతో హోరెత్తింది. రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్, ము న్సిపల్ కార్యాలయ వద్ద సందడి నెలకొంది. పట్టణ సీఐ మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి మూడోరోజు అభ్యర్థుల నుంచి పలు రకాల పన్నులు స్వీకరించారు. అనంతరం నోడ్యూ సర్టిఫికెట్లు అందజేశారు. చివరి రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వారికి మద్దతుగా అత్యధికంగా అన్ని వార్డుల నుంచి మహిళలే తరలివచ్చారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
తప్పులు దొర్లొద్దు
ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్ మనోహరాబాద్/రామాయంపేట/తూప్రాన్: మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని, సక్రమంగా నిర్వ హించేలా అధికారులు కృషి చేయాలని ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని లింగారెడ్డిపేట శివారులో వాహనాల చెక్ పాయింట్ను పరిశీలించి సూచనలు చేశారు. విధుల్లో అలసత్వం వహించొద్దన్నారు. ఆయన వెంట వెంట తహ సీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ నాగరాజు ఉన్నారు. అలాగే తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, కమిషనర్ గణేశ్రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం రామాయంపేట మున్సిపాలిటీలో నామినేష న్ల ప్రక్రియను కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియలో త ప్పులు దొర్లకుండా పూర్తి చేయా లని సిబ్బందిని ఆదేశించారు. -
ఫోన్ ట్యాపింగ్ పేరుతో నాటకాలు
ఎంపీ రఘునందన్రావు నర్సాపూర్: ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్లు నాటకాలు ఆడుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. సిట్ నోటీసులు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్నారు. ఒకరు కొట్టినట్లు, మరొకరు ఏడ్చినట్లు నటిస్తున్నారని అన్నారు. ఎన్నికల వేళ రోజూ పేపర్లలో రావడానికి నాటకాలు ఆడుతున్నారని, అందులో భాగంగానే కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులతో నర్సాపూర్ అభివృద్ధి చెందిందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, నాయకులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ విజయ అన్నారు. శుక్రవారం కౌడిపల్లి ప్రాథమిక పాఠశాల, భుజిరంపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. చదువులో వెనుక బడిన విద్యార్థులను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి శిక్షణ ఇవ్వాలన్నారు. పీఎంశ్రీ నిధులతో విద్యార్థులకు మౌలిక వసతులు సమకూరుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు లలితాదేవి, ఓం ప్రకాశ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనోహరాబాద్(తూప్రాన్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీడీఓ రవీందర్కు సమ్మె నోటీస్ అందజేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులందరూ ఐక్యంగా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్, కార్మిక నాయకులు స్వామి, అంజయ్య, అర్జున్, భాస్కర్, మహేష్, బాలమణి, అనురాధ, సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు. టేక్మాల్(మెదక్): వినూత్న కార్యక్రమాలతో విద్యా నైపుణ్యాలు ప్రదర్శించిన మోడల్ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ భారతి ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాలలోని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించడం, ప్రాక్టికల్స్, యూనిఫాంలో విభిన్న రీతిని అవలంభించడంలో భారతి ప్రత్యేకత చూపారు. ఈ విషయమై డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నీకోలస్, మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. శుక్రవారం మోడల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సాయిలు, మండల అధికారులు, సిబ్బంది ఆమెను అభినందించారు. -
అభాగ్యులకు భరోసా
మెదక్ కలెక్టరేట్: వేధింపులకు గురైన మహిళలకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని కేంద్రం కో ఆర్డినేటర్ సౌమ్య తెలిపారు. గురువారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినులు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా ఎలాంటి సహాయ సహకారం అయినా అందిస్తామన్నారు. అనంతరం షీటీం కో–ఆర్డినేటర్ ప్రమీల మాట్లాడుతూ.. గృహహింస, పనిచేసే చోట, విద్యా సంస్థలలో లైంగిక వేధింపులు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు యాసిడ్ దాడులు మొదలైన హింసల నుంచి రక్షణ కల్పించడమే షీటీం కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. క్షేత్ర సందర్శనలో అధ్యాపకులు సుధారాణి, హరిత, అరుంధతి, సాయిలీల, ఉదయశ్రీ, శోభారాణి, స్వాతి, విజయ్, ఏఎస్ఐ వెంకటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పతనానికి నాంది
గజ్వేల్: కేసీఆర్కు సిట్ నోటీసులు.. రేవంత్రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటే రు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించమే కాకుండా సీఎంగా పదేళ్లు పాలించి.. రాష్ట్రం దశాదిశాలను మార్చిన కేసీఆర్పై కుట్రలను ప్రజలు సహించరని హెచ్చరించారు. రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకున్న రేవంత్రెడ్డి ఫోన్ట్యాపింగ్ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్సన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్
డీటీఓ వెంకటస్వామిమెదక్ కలెక్టరేట్: ఇక నుంచి నూతన వాహనాలకు షోరూంల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి తెలిపారు. గురువారం పట్టణంలోని ఓ హీరో మోటార్ షోరూంలో వాహనదారులకు టీఆర్ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ఈనెల 24 నుంచి జిల్లాలో అమలులోకి వచ్చినట్లు చెప్పారు. ఇది కేవలం నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనదారులకే వర్తిస్తుందన్నారు. నూతన విధానంతో వాహనాలు కొనుగోలు చేసే వారు డీటీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదన్నారు. ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. ఎలాంటి అదనపు చార్జీలు ఉండవన్నారు. ఇందుకోసం అవసరమైన పత్రాలను డీలర్లే డీటీఓ కార్యాలయానికి చేరుస్తారని వివరించారు. రవాణా శాఖ కార్యాలయంలో పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామని పేర్కొన్నారు. ఆపై గతంలో మాదిరిగానే స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి కార్డు చేరుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో హీరో మోటార్స్ యజమాని బండ నరేందర్, బద్రినాథ్, వాహనదారులు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మోసమే కాంగ్రెస్ నైజం
● కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం ● మాజీ మంత్రి హరీశ్రావుచిన్నకోడూరు(సిద్దిపేట): అనేక హామీలతో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కిష్టాపూర్లోని సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదని, వారికి సకాలంలో యూరియా అందడం లేదని, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవండతో ౖతీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసం రాజిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేక్ పాయింట్ ఏర్పాటు చేయండి సిద్దిపేటజోన్: సిద్దిపేట ప్రాంతంలో రైలు సౌకర్యం ఉందని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక రేక్ పాయింట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులకు సూచించారు. గురువారం పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. -
తెగని టికెట్ల పంచాయితీ
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జిల్లావ్యాప్తంగా నాలుగు ము న్సిపాలిటీల పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఒక్కో కౌన్సిలర్ టికెట్కు నలుగురుకు పైగా పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉంది. మాజీలతో పాటు కొత్తగా పోటీ చేయాలని పలువురు తహతహలాడుతున్నారు. ఖర్చుకు సైతం వెనుకాడబోమని.. టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కాగా కాంగ్రెస్ ఏజెన్సీల ద్వారా వార్డుల వారీగా సర్వే చేయించింది. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు బేరీజు వేస్తున్నారు. గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముందు ప్రకటించకుండా వ్యూహాలు కాంగ్రెస్, బీఆర్ఎస్లు చైర్మన్ అభ్యర్థులను ముందుగా ప్రకటించడం లేదు. అప్పటి పరిస్థితులను బట్టి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. కొంతమంది కే వలం డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుండగా, మరికొంతమంది నిత్యం ప్రజల్లో ఉండేవారమని, తమను గెలిపిస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొంతమంది ఏ పార్టీ టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తం మీద ఈసారి బ్యాలెట్ పేపర్లో 10 మందికి తక్కువ కాకుండా అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉంది. కాగా నామినేషన్ వేసేందుకు నేడు ఆఖరిరోజు కావడంతో పార్టీ టికెట్ ఇస్తుందో లేదో? ఇవ్వకపోతే ఎట్లా అని ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. కొంతమంది చివరి వరకు నామినేషన్ దాఖలు చేయకుండా వేచి చూస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్లో తీవ్ర పోటీ -
కృత్రిమ గర్భధారణతో ఆడదూడలు
పాపన్నపేట(మెదక్)/కౌడిపల్లి(నర్సాపూర్): గేదెల్లో కృత్రిమ గర్భధారణతో 90 శాతం ఆడదూడలు జన్మి స్తాయని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. గురువారం మండల పరిధిలోని పొడిచన్పల్లిలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించి, సకాలంలో పశువులు చూడి కట్టేలా చూసుకోవాలన్నారు. పుట్టిన లేగదూడలకు 15 రోజుల నుంచి ఆరు నెలల వరకు నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోశ్రెడ్డి, పశువైద్యాధికారి ప్రవీణ్, గోపాలమిత్ర సూపర్ వైజర్ శ్రీనివాస్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో పశువైద్య శిబిరాన్ని పరిశీలించి మందుల పంపిణీ చేశా రు. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల పశు పోషకులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుత్బొద్దీన్, ఉపసర్పంచ్ రామాంజనేయులు, మండల పశువైద్యాధికారి ఫర్హిన్ ఫాతిమా, సిబ్బంది కిషన్, వీరారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య -
రెండో రోజు260 నామినేషన్లు
● అత్యధికంగా మెదక్లో 103 దాఖలు ● రెండు రోజులు కలిపి మొత్తం 286 ● నేటితో ముగియనున్న గడువు మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు గురువారం 260 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో అత్యధికంగా మెదక్ బల్దియాలో 103 వచ్చాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధి లో మొదటిరోజు 26 మాత్రమే సమర్పించారు. కాగా రెండు రోజుల్లో కలిపి ఆ సంఖ్య 286కు చేరుకుంది. ఇందులో రెండు రోజుల్లో మెదక్లో 115, రామాయంపేటలో 58, తూప్రాన్లో 61, నర్సాపూర్లో 52 చొప్పున మొత్తం ఇప్పటివరకు 286 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు పే ర్కొన్నారు. కాగా శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. చివరి రోజు భారీగా నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులు ఉండగా, మొత్తం 400 పై చిలుకు నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొందరు పెద్ద ఎత్తున ర్యాలీలతో నామినేషన్లు వేస్తున్నారు. దీంతో జిల్లాలోని బల్దియాల ఎదుట సందడి నెలకొంది. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కేవలం నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తుండగా, అధికారులు కంప్యూటర్లు, రికార్డులు బయట పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. -
ఎన్నికల నియమావళి తప్పనిసరి
అదనపు ఎస్పీ మహేందర్తూప్రాన్: జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలని, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ గణేష్రెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్గౌడ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎస్ఐలు సుభాష్గౌడ్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.శివ్వంపేట(నర్సాపూర్): ఫిర్యాదులను పరిష్కరించడంలో వేగం పెంచాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. గురువారం సాయంత్రం శివ్వంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వివిధ కేసులకు సంబంధించి రికార్డులు, స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సిబ్బందికి సూ చించారు. నిత్యం వాహనాల తనిఖీ చేపట్టాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్ఐ సాయిలు, సిబ్బంది వీరస్వామి, మహేందర్, అనురాధ ఉన్నారు. -
గెలుపు గుర్రాల వడపోత
● ఆచితూచి అడుగులు వేస్తున్న పార్టీలు ● పూర్తిస్థాయిలో ఖరారు అభ్యర్థుల జాబితా ● అన్ని మున్సిపాలిటీల్లో విరివిగా నామినేషన్ల దాఖలు ‘పుర’ పోరుకు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పాత, కొత్త నేతలు అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. ఇందుకోసం అభ్యర్థుల వడపోత ప్రారంభించారు. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. నామినేషన్లకు ఒక రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. కాగా ఇప్పటివరకు పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్ మున్సిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎన్నికల బరిలో నిలిచే కొంతమంది అభ్యర్థులను ఫైనల్ చేశాయి. మిగితా మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. మెదక్ బల్దియాలో 32 వార్డులు ఉండగా, అధికార కాంగ్రెస్ 10 మంది అభ్యర్థులను, బీఆర్ఎస్ 18 మందిని ఫైనల్ చేసింది. కాగా స్క్రూట్నీ గడువు ఫిబ్రవరి 3 వరకు ఉంది. అప్పటివరకు బీఫాంలను నేరుగా అధికారులకే సమర్పించే అ వకాశం ఉండటంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే నామినేషన్లు మాత్రం అన్ని మున్సిపాలిటీల్లో విరివిగా వేస్తున్నారు. నేరుగా అధికారులకే బీఫాంలు గతంలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలపై పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. మెదక్, రామాయంపేట బల్దియాలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి హరీశ్రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రెండు మున్సిపాలిటీలు ప్రత్యేకంగా మారాయి. ఈ రెండింటిలో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆశావహులకు ముందుగా టికెట్లు ఖరారు చేయ కుండా, నామినేషన్ వేయండని చెబుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ లోపు ఖరారు చేసి అధికారులకే నేరుగా బీఫాంలను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. మౌనం వీడని బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు విరివిగా నామినేషన్లు వేస్తున్నారు. బీజేపీ మాత్రం మౌనం ప్రదర్శిస్తోంది. రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎంపీ రఘునందన్రావు, ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ విడుదల అయ్యి నామినేషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉన్నా, ఆ పార్టీలో సందడి కనిపించటం లేదు. -
పటిష్టంగా భూ రికార్డులు
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): ప్రతీ కమతానికి సరైన హద్దులు నిర్ణయించి పటిష్టమైన భూ రికార్డులను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. భూ భారతి చట్టం, భూముల రీసర్వే కోసం పైలెట్ పంచాయతీగా ఎంచుకున్న మెదక్ మండలంలోని పాషాపూర్లో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి, భూముల రీసర్వే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు పక్కాగా భూ హద్దులు, నక్ష, మ్యాప్లను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులను తయారు చేయడమేనని అన్నారు. ప్రతి కమతానికి రీసర్వే చేసి రైతులకు భూ తగాదాలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సర్వేతో భూ హద్దులు చెరిగిపోకుండా ఉంటాయని, భూమి ఆక్రమణకు గురి కాకుండా ఉంటుందన్నా రు. ఈ గ్రామాన్ని నమూనాగా తీసుకొని జిల్లాలోని మరో 23 గ్రామాల్లో భూముల రీసర్వే చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, సర్పంచ్ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాలకు తూట్లు
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మెదక్ కలెక్టరేట్: కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో సీఐటీయూ, ఏఐఏడబ్ల్యుయూ, ఏఐకేఎస్, ఎన్పీఆర్డీ, ఐద్వా, ఎస్ఎఫ్ఐలతోపాటు వృత్తిదారుల సమన్వయ కమిటీ సంఘాల సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బా లమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చుక్కరాములు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందే కార్మికులు వారి హక్కుల కోసం పోరాడి కార్మిక చట్టాలు తెచ్చుకున్నారని తెలిపారు. అనేక త్యాగాలతో ఏర్పడిన చట్టాలు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అదానీ, అంబానీ చాకిరీ చేస్తూ దేశ సంపదను అప్పగిస్తున్నట్లు ఆరోపించారు. కార్మికులను బానిసలుగా మార్చేందుకే 4 లేబర్కోడ్లు తెచ్చారని మండిపడ్డారు. -
ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర
మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ఏడుపాయల వనదుర్గా మాత జాతర ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం రెండు రోజుల్లో ప్రణాళికా సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలో భక్తులకు ఎలా ంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పార్కింగ్, విద్యుత్, తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు, చెత్త సేకరణ, దోమల నివారణకు ఫాగింగ్ వంటివి ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. రవాణా, బస్సులు, వాహనాలు, గజ ఈతగాళ్లు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్, వివిధ స్టాల్స్, క్యూలైన్ల ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో ఏ వస్తువు అయినా ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రకటనల కోసం మీడియో సెంటర్లో తప్పనిసరిగా అను మతి తీసుకోవాలని సూచించారు. అనంతరం రంజాన్ ఏర్పాట్లపై సమీక్షించారు. ముస్లింలు పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
మంచి ముహూర్తం కోసం
ఈ రెండు రోజుల్లో ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అయ్యగార్లను పోటీదారులు సంప్రదిస్తున్నారు. వారు చెప్పిన సమయంలోనే నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ పత్రాలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి వెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆయా వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీలు వేగం పెంచాయి. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో కసరత్తు ముమ్మరం చేశారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న చోట అందరిని నామినేషన్లు వేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి సమయంలో బీఫాంలను నేరుగా ఎన్నికల అధికారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ పెద్దలు సర్వే ఆధారంగానే అభ్యర్థులను గుర్తించి వారికే బీఫాం అందజేయనున్నారు. అశావహులు మాత్రం తమకే కేటాయించాలని పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
బల్దియా ఖజానా గలగల
మెదక్ కలెక్టరేట్/రామాయంపేట(మెదక్): ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతోంది. పోటీ చేసేవారితో పాటు వారిని బలపర్చేవారు ఎలాంటి బకాయిలు ఉండరాదనే నిబంధనలున్నాయి. ఈమేరకు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న వారితో పాటు వారిని బలపర్చేవారు సైతం బకాయిలు చెల్లిస్తున్నారు. రామాయంపేట మున్సిపాలిటీకి బుధవారం రూ. 2 లక్షల మేర ఆదాయం సమకూరింది. వీటిలో ఇంటి పన్నుకు సంబంధించి రూ. 1.30 లక్షలు, మిగితావి సర్టిఫికెట్ ఫీజు కింద వసూలయ్యాయి. అలాగే మెదక్ మున్సిపల్ కార్యా లయం అభ్యర్థులు, మద్దతుదారులతో కిటకిటలాడింది. కార్యాలయం ఎదుట ప్రత్యేక టెంట్ వేసి హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. అక్కడే ఆశావహులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోవైపు ఇంటి, నీటి, ఆస్తి పన్నులు స్వీకరించారు. నోడ్యూ సర్టిఫికెట్లు అందజేశారు. కమిషనర్ను నిలదీసిన ఆశావహులు మిషన్ భగీరథ కనెక్షన్ ఉచితమని చెప్పి, ఇప్పుడు రూ. వేలల్లో బిల్లులు కట్టామంటున్నారు.. ఇదేంటని పలువురు ఆశావహులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డిని నిలదీశారు. నో డ్యూ కోసం రూ. 1,500 తీసుకోవడం సరికాదని వాపోయారు. స్పందించిన కమిషనర్ ఎన్నికల నిబంధనల ప్రకారం తీసుకుంటున్నామన్నారు. నల్లా కనెక్షన్ మాత్రమే ఉచితమని, నీటి పన్నులు కట్టాల్సిందే నని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం బకాయిలన్నీ చెల్లించాలని సూచించారు. పోటీ చేయాలంటే పన్ను కట్టాల్సిందే కిటకిటలాడిన మున్సిపల్కార్యాలయాలు నోడ్యూ సర్టిఫికెట్ల కోసం బారులుబిల్లుల మోత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు అవసరమైన నోడ్యూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు ఒక్కొక్కరి వద్ద రూ. 1,500 వసూలు చేస్తున్నారు. నీటి పన్ను కింద రూ. 3,500 నుంచి రూ. 24 వేల వరకు బకాయిలు వసూలు చేస్తున్నారు. నీటి పన్ను లు రూ. వేలల్లో రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ఉపాధి’ పథకాన్ని ఎత్తివేసే కుట్ర
చిన్నశంకరంపేట(మెదక్): మహాత్మాగాంధీ జాతీ య ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. బుధవారం మండల ంలోని కొర్విపల్లిలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి ఉపాధి కూలీలతో నిర్వహించిన సభలో మాట్లాడారు. పథకం పేరు మార్చి పెద్ద కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు గ్రామ సభ ద్వారా పనులు గుర్తించే అధికారం, ఉండగా కొత్త చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేయాలన్నారు. గ్రామీణ కూలీలకు అన్యాయం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాటం ఆగదన్నారు. ‘ఎఆర్ఈజీఎస్ ముద్దు.. బీజేపీ వద్దు’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. అంతకుముందు మీనాక్షి నటరాజన్ ఉపాధి కూలీలతో నేరుగా మాట్లాడారు. ఎఆర్ఈజీఎస్ పథకం అమలు కాకముందు ఎలాంటి ప నులు చేసేవారు, ఎంత కూలీ వచ్చేదని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అలాగే కొర్విపల్లి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, డీసీసీ అధ్యక్షుడు అంజనేయులుగౌడ్, నర్సాపూర్, దుబ్బాక ఇన్చార్జిలు రాజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డితో పాటు నాయకులు త దితరులు పాల్గొన్నారు.పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ -
జిల్లాలో యూరియా కొరత లేదు
పాపన్నపేట(మెదక్): నిబంధనల మేరకు యూ రియా విక్రయాలు జరపాలని జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ ఆదేశించారు. బుధవారం కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘంలో అధికారులతో మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. ఇప్పటివరకు 1,752 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, మరో 432 మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో వస్తుందని తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావ్దొద్దని సూచించారు. ఈనెల 26 వరకు యాసంగి పంటకు 5,385 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 2.95 లక్షల ఎకరాల వరి పంట వేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. సొసైటీ సిబ్బంది, ఈ–పోస్ మిషన్ ద్వారా విక్రయాలు చేపట్టాలన్నారు. రైతుల అవసరం మేరకు, ఎమ్మార్పీ రేటుకు యూరియా విక్రయించాలని సూచించారు. సమావేశంలో డీసీఓ, సొసైటీ పర్సన్ ఇన్చార్జి శంకర్, ఏడీఓ విజయలక్ష్మి, ఏఓ శ్రీనివాస్రాజు, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, రైతులు పాల్గొన్నారు.డీఏఓ దేవ్కుమార్ -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
రేగోడ్(మెదక్): త్వరలో జరగబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ విజయ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు, తదితర రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో చదివించి వారి ప్రతిభను తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు మూతపడకుండా నడపాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట జీసీడీఓ జగదీశ్వరి, ఎంఈఓ గురునాథ్, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్వయంప్రభ, ఉన్నత పాఠశాల హెచ్ఎం సుశీల, సీఆర్పీ సంతోష్ గుప్తా ఉన్నారు. ప్రశ్నార్థకంగా విద్యారంగం మెదక్జోన్: రాష్ట్రంలో విద్యారంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అశోక్కుమార్, కార్యదర్శి రవిచందర్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్రెడ్డి పా ల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజాబాట నర్సాపూర్ రూరల్: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని విద్యుత్శాఖ డీఈ రామేశ్వర్ తెలిపారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రజాబాటలో పాల్గొని మాట్లాడారు. లో ఓల్టేజీ, వేలాడుతున్న తీగలు, శిథిలావస్థకు చేరిన స్తంభాల గురించి ఆరా తీశారు. ప్రజాబాటలో తెలుసుకున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. రెడ్డిపల్లిలో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీ రమణారెడ్డి, ఏఈ రామ్మూర్తి, సర్పంచ్ పద్మ, అశోక్గౌడ్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు అల్లాదుర్గం(మెదక్): సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ అనీల హెచ్చరించారు. ‘విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ముప్పారం పల్లె దవాఖాన వైద్యురాలు నిర్మల అల్లాదుర్గం కేంద్రంలో ఎందుకు విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశ్నించారు. డాక్టర్ సారిక తమ ఫోన్లు తీసుకొని పరిశీలించినట్లు సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి అలా చేయొద్దని ఆమె హెచ్చరించారు. ముప్పారం పల్లె దవాఖాన డాక్టర్, సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తించాలని అదేశించారు. -
పుర పీఠం కై వసం చేసుకుంటాం
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకుంటామని ఎమ్మెల్యే సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలం అయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని వివరించారు. ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టికెట్ దక్కని వారు నిరాశ చెందవద్దని, పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇచ్చి గుర్తింపు ఇస్తామన్నారు. సమన్వయకర్త ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అగ్రనేతలు అన్ని మున్సిపాలిటీల్లో సర్వే చేయించారని, సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తారని తెలిపారు. రెండోసారి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, నాయకులు గోపి, అశోక్గౌడ్, నయీం, సత్యంగౌడ్, భిక్షపతి, బాల్రెడ్డి, రాకేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒక్కో వార్డుకు చెందిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
కొత్త టెక్నాలజీతో భూముల సర్వే
పటాన్చెరు టౌన్: అధునాతన టెక్నాలజీతో భూములు సర్వే చేపడుతున్నామని అందుకు 5,500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను నియమించామని, భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల కాంప్లెక్స్కు మంత్రి వివేక్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ...స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పారదర్శకంగా, అవినీతిరహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తోందని చెప్పారు. మొదటి విడతగా ఓఆర్ఆర్ పరిధిలోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయించామని తెలిపారు. కర్ధనూర్లో 20వేల చదరపు అడుగుల పరిధిలో నిర్మిస్తోన్న కార్యాలయానికి మూడు ఎకరాల భూమిని కేటాయించినట్లు వివరించారు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 5,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాం మంత్రి వివేక్తో కలిసి సబ్ రిజిస్ట్రార్ కాంప్లెక్స్కు శంకుస్థాపన -
ఇద్దరిని మాత్రమే అనుమతించాలి: అదనపు ఎస్పీ
మెదక్ కలెక్టరేట్: నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలి అదనపు ఎస్పీ మహేందర్ ఆదేశించారు. బుధవారం మెదక్ మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తును పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, పట్టణ సీఐ మహేశ్, ఎస్ఐలు లింగం, విఠల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం
అల్లాదుర్గం(మెదక్): ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో ప్రజలకు ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. పది గంటలు దాటితే తప్ప కేంద్రంలోకి సిబ్బంది అడుగుపెట్టడం లేదు. డాక్టర్తో పాటు సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లె దవాఖాన డాక్టర్లు ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించడంతో అవి మూతపడుతున్నాయి. మంగళవారం అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సాక్షి విజిట్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధుల్లో నిర్లక్ష్యం అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పది మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 10 గంటలకు అటెండర్, హెల్త్ అసిస్టెంట్ మాత్రమే విధులకు హాజరయ్యారు. డాక్టర్ మాత్రం విధులకు హాజరు కాలేదని పలువురు రోగులు చెప్పారు. ముప్పారం పల్లె దవాఖానలో విధులు నిర్వహించవలసిన డాక్టర్ అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ముప్పారం పల్లె దవాఖాన మూతపడింది. ఆశా వర్కరు కొద్దిసేపు విధులు నిర్వహించినట్టు గ్రామస్తులు తెలిపారు. దవాఖాన ఉన్నా అందని వైద్యం డాక్టర్ నిర్మల సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని పంచాయతీ సభలో గ్రామస్తులు అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే తనకు అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించాలని జిల్లా అధికారులు ఆదేశించినట్టు డాక్టర్ చెప్పారని గ్రామస్తులు తెలిపారు. పల్లె దవాఖాన ఉన్నా తమకు వైద్యం అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకుల, అధికారుల అండదండలతో వైద్య సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ వేధిస్తున్నారు.. అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తమను వేధిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ తమ ఫోన్లను తీసుకొని ఎవరికి ఫోన్ చేస్తున్నారు, నాయకులు, విలేకరుల నంబర్లు మీ వద్ద ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నట్లు వాపోయారు. డాక్టర్పై ఆరోపణలు వచ్చినా, ఎవరైనా విమర్శించినా తమనే నిందితులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా ఆరోగ్య కేంద్రాలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, సిబ్బంది మూతపడిన పల్లె దవాఖాన


