Medak
-
అతివేగం.. అజాగ్రత్త వద్దు
కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్జోన్ : జీరో యాక్సిడెంట్ జోన్గా జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్స్లో అరైవ్–అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, రవాణాశాఖ సమన్వయంతో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే ప్రాణనష్టాల గురించి వివరించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త వల్ల తరచు మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడమే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యంగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఈసందర్భంగా వాహన డ్రైవర్ల వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎంహెచ్ఓ శ్రీరామ్, జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి, డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘మీ సేవ’లు.. భారమే!
● జిల్లాలో 65 సెంటర్లు ● ప్రజలపై అదనపు వ్యయంప్రస్తుతం ఏ ధ్రువపత్రం కావాలన్నా మీ సేవ కేంద్రమే ఆధారం. ఇదే తరుణంలో సర్వీస్ చార్జీలను ప్రభుత్వం ఒక్కసారిగా 50 శాతం పెంచింది. ఇప్పటికే జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – మెదక్ కలెక్టరేట్ జిల్లావ్యాప్తంగా మొత్తం 65 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ ఈ–సేవ సెంటర్ ఉంది. మొత్తం సుమారు 200 మంది ఆపరేటర్లు నిత్యం వేలాది మందికి ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సర్వీస్ చార్జీలను పెంచింది. ఈ నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారగా, కాగా నిర్వాహకుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు సులభంగా, వేగంగా అందించే లక్ష్యంతో 2011లో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా 36 డిపార్ట్మెంట్లు, 314 సర్వీస్లను ప్రజలకు అందిస్తున్నారు. రోడ్డు రవాణాశాఖ, పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, టీవాలెట్, విద్యుత్శాఖ, దేవాదాయశాఖ, వ్యవసాయశాఖ, సీడీఎంఏ వంటి ఇతర సర్వీసులు అందజేస్తున్నారు. రెండింతలు పెరిగిన సర్వీస్ చార్జీలు పేద ప్రజలపైనే భారం పేద విద్యార్థులు పై చదువులు, హాస్టళ్లలో చేరడానికి, సంక్షేమ పథకాలు పొందడానికి అత్యధికంగా రేషన్ కార్డులు, కులం, ఆదాయం, స్థానిక, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం పెంచిన చార్జీలతో వీరిపై అదనపు భారం పడుతుంది. పెంచిన చార్జీలను ప్రభుత్వం సవరించాలి. – బాల్రాజ్, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు పెంచిన చార్జీలు ఇలా.. మీ సేవల ద్వారా కులం, ఆదాయం, స్థానిక పత్రాలు పొందాలంటే ఒక్కో సర్టిఫికెట్కు గతంలో రూ.45 ఉండగా 50 శాతం చార్జీలతో పాటు 18 శాతం జీఎస్టీ కలుపుకొని రూ. 80 రౌండ్ ఫిగర్ చేశారు. అలాగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు గతంలో రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.130కు పెంచారు. -
నో హెల్మెట్.. నో ఎంట్రీ
శివాయపల్లిలో వినూత్న కార్యక్రమంరామాయంపేట(మెదక్): హెల్మెట్ పెట్టుకోనిదే గ్రామంలోకి రావొద్దని మండలంలోని శివాయపల్లి గ్రామస్తులు నినదించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగిన అలైవ్– అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ లేనిదే ఎవరూ ద్వి చక్రవాహనాలు నడపొద్దని సూచించారు. తాము గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. సీఐ వెంకట్రాజాగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో వందశాతం హెల్మెట్లు ధరించడంతో పాటు వంద శాతం డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించామని, బెల్ట్షాపులు మూసి వేయిస్తామని గ్రామస్తులు తెలిపారు. అంతకుముందు పోలీస్ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంవీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజని, ఎస్ఐ బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే ‘ప్రజాపాలన’
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎల్పీఓ సాయిబాబ అన్నారు. గురువారం కౌడిపల్లి రైతువేదికలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు సమస్యలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని, వాటిని మినిట్స్బుక్లో నమోదు చేసి కలెక్టర్కు తెలియజేస్తామన్నారు. ఈసందర్భంగా పలు గ్రామాల సర్పంచ్లు సమస్యలను ప్రస్తావించారు. ఎస్ఐ అమరేందర్రెడ్డి భద్రతపై వివరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఏఓ స్వప్న, పీఆర్ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్, ఎంఈఓ బాలరాజు, విద్యుత్శాఖ ఏఈ సాయికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
అదనపు కలెక్టర్ నగేశ్రామాయంపేట(మెదక్): ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం స్థానిక రైతు వేదికలో మండలస్థాయి సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి సురేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, పలు గ్రామల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్లు ముందుకెళ్లాలని సూచించా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయమై చిత్తశుద్ధితో పని చేయాల్సి అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సజీలుద్దీన్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తనివ్వొద్దు
● త్వరలో అందుబాటులోకి అర్బన్ పార్క్ ● ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ పట్టణ శివారులోని కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉన్న పథకాలను పునరుద్ధరించడం, బోర్ల మరమ్మతులు, అవసరం ఉన్న ప్రాంతాల్లో నూతన బోర్ల డ్రి ల్లింగ్, హైరింగ్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ నిధులతోపాటు, ఎంపీ సురేశ్ షెట్కార్, తన నిధులు సైతం తాగునీటి ఎద్దడి నివారణకు కేటాయించనున్నట్లు తెలిపారు. మంజీరా మరమ్మతు పనులు జరుగుతున్నందున నీటిని వదిలేశారని దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పా రు. సర్పంచ్లకు తెలియకుండా కార్యదర్శులు పలు ప్రాంతాల్లో నిధులు డ్రా చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, సర్పంచ్లకు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి పథకాలకు విద్యుత్ పరంగా అవసరాలకు విద్యుత్ అధికారులు తీర్చాలని సూచించారు. సమీక్షలో నాయకులు వినోద్పాటిల్, రమేష్ చౌహన్, పండరీరెడ్డి, తహశీల్దార్ హసీనాబేగం, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుబాటులోకి అర్బన్ పార్కు పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న అర్బన్ పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని సంజీవరెడ్డి తెలిపారు. ఉదయం పార్కులో ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించి పనులను, ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
తూప్రాన్: ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఐజీ చంద్రశేఖర్రెడ్డి, కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాస్రావు పిలుపునిచ్చారు. ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం తూప్రాన్, నర్సాపూర్ చౌరస్తాతో పాటు మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని పలు సలహాలు సూచనలు అందజేశారు. వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి రోడ్డు నిబంధనల గురించి వివరించారు. ఈసందర్భంగా మానవహారం చేపట్టి రోడ్డు నియమాలు పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 7000 ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐలు రంగాకృష్ణ, జాన్రెడ్డి, వెంకటరాజుగౌడ్తో పాటు ఎస్ఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయంలో పదో తరగతి విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. -
రేపు ఉద్యోగుల సమస్యలపై నిరసన
మాట్లాడుతున్న జగదీష్సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయనున్నట్లు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ తెలిపారు. జిల్లా టీఎన్జీవోస్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్, కోశాధికారి ఉమాదేవికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ.. పీఆర్సీ, సీపీఎస్, డీఏ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. ఈ నెల 17న టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర హెచ్డబ్ల్యూఓ సంఘం అధ్యక్షుడు భాస్కర్, పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు బలరాం, జిల్లా ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు నాయకులకు అభినందనలు తెలిపారు.టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
నర్సాపూర్: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థుల గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకురావాలని పిలుపునిచ్చా రు. మూడు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ఎంపీ లాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. తాను సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలకు కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించామన్నారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్, సీడీపీఓ హేమభార్గవి, కౌన్సిలర్లు నర్సమ్మ, రాజు, సరళ, ప్రాజెక్టు సూపర్వైజర్లు శివకుమారి, సంతోషిమాత, మెహతాబేగం, సరళకుమారి, కవిత, వసుమతి, లక్ష్మి, నర్సమ్మ, సంతోష, కుమర్సుల్తానా, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
నిర్వాసితుల్లో సంబురం
● ఎట్టకేలకు ఫలించిన న్యాయపోరాటం ● రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీ గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళల న్యాయపోరాటం ఫలించింది. ప్యాకేజీ కోసం 2019 నుంచి పోరాటం సాగించారు. వేములఘాట్ గ్రామానికి చెందిన 24 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన 21 మంది ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీని వారి ఖాతాల్లో జమచేసినట్లు బుధవారం తెలిపారు. ఏడేళ్ల తర్వాత తమ న్యాయ పోరాటం ఫలించడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టులో సమర్ధవంతంగా వాదించి గెలిపించిన హైకోర్టు న్యాయవాది సీహెచ్. రవికుమార్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా సంబురాలు చేసుకున్నారు. -
పోక్సో చట్టం.. రక్షణ కవచం
మెదక్జోన్: పోక్సో చట్టం చిన్నారులకు రక్షణ కవచంలా నిలుస్తోంది. కేవలం రెండు నెలల వ్యవధిలో 8 మంది దోషులకు జైలు శిక్ష వేయగా, వారిలో ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. మరో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు పోక్సో 2012లో ఆవిర్భవించగా జిల్లాలో 2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది వరకు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కొనసాగించగా, 2025 జూన్లో పోక్సో కోర్టుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించారు. కాగా గడిచిన 2 నెలల్లో 8 మంది నిందితులకు శిక్ష పడగా, అందులో ఆరుగురికి 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి మూడేళ్లజైలు శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఎప్పుడూ లేని విధంగా పోక్సో కోర్టు ఇటీవల రెండు నెలల వ్యవధిలో 8 మంది దో షులకు శిక్షలు విధించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పరువు ముసుగులో రాజీ ఏడాది కాలంగా జిల్లాలో 500 పైచిలుకు కేసులు నమోదు కాగా, గడిచిన పది నెలల్లో 350 పైచిలుకు పోక్సో కేసులు ట్రయల్కు వచ్చాయి. వాటిలో కేవలం 8 మందికి శిక్షలు పడగా, మిగితా వారు బాధితులతో రాజీపడి కేసుల నుంచి తప్పించుకోగలిగారు. ఇందులో ప్రధానంగా పరువు పోతుందనే భావనతో నింధితులు కోర్టుల్లో సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావటం లేదని తెలిసింది. మరికొంత మంది బాధితులకు డబ్బు ఎరవేసి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. 2 నెలల వ్యవధిలో 8 మందికి శిక్ష హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు చట్టంపై అవగాహన అవసరం : న్యాయ నిపుణులుఅవగాహన అవసరం మైనర్లపై అఘాయిత్యాల నేపథ్యంలో పోక్సో చట్టం ఏర్పాటు అయింది. ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పరువు అంటూ కొందరు రాజీపడి కోర్టుల్లో సాక్ష్యాలు చెప్పకపోవడంతో దోషులు శిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం చట్టంపై అవగాహన లేకపోవటమే. – బాలయ్య, పోక్సోకోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్నిర్భయంగా చెప్పాలి బాలికలపై అఘాయిత్యాలు తగ్గాలంటే బాధితులు కోర్టులో నిర్భయంగా సాక్ష్యం చెప్పి దోషులకు శిక్షలు పడేలా చేయాలి. అప్పుడే బాలికలపై అఘాయిత్యాలు తగ్గే అవకాశం ఉంటుంది. – శ్రీనివాసరావు, ఎస్పీ -
అగ్నిమాపక నిబంధనలు పాటించాలి
మెదక్ కలెక్టరేట్: 14 నుంచి ఏప్రిల్ 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్లో అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇళ్లు, కార్యాలయాల్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా అగ్నిమాపక అధికారి వేణు మాట్లాడుతూ.. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్, భద్రతా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఫైర్ ఆఫీసర్ శ్రీశైలం అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో సర్పంచ్ జంగం రేణుకతో కలిసి అగ్నిమాపక వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాలని చెప్పారు. ప్రజలు వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఫైర్సిబ్బంది రాజేందర్, రాజశేఖర్, నర్సింహారెడ్డి, గోపాల్ తదితరులున్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం రామాయంపేట(మెదక్): అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంతో గొప్పవని స్థానిక మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరించి మాట్లాడారు. వేసవిలో అగ్ని ప్రమాదాల ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే సంబంధిత కేంద్రానికి సమాచారం అందజేయాలని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రవినాయక్, బైరం స్వప్న, డాకి శ్యామల, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆలయ వార్షికోత్సవం
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని అంబాజిపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకామాత ఆలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హోమంలో పాల్గొని ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అంత సుభిక్షంగా ఉండాలని కోరారు. నర్సాపూర్: ప్రభుత్వం అందజేసే లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ఓసీ)తో మెరుగైన వైద్యం పొందే వీలుంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చండూర్, కొన్యాల, వెల్దుర్తి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎనిమిది లక్షల 25వేల రూపాయల విలువ చేసే ఎల్ఓసీలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు నిమ్స్లో వైద్యం పొందాల్సి వచ్చినప్పుడు ఎల్ఓసీలు ఉపయోగపడతాయని, వారిపై ఆర్థిక భారం పడదని వివరించారు. అవసరమైన పేదలకు ఎల్ఓసీలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి అందచేస్తున్నట్లు చెప్పారు. తూప్రాన్: మండల కేంద్రం మనోహరబాద్లో నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సత్తిరెడ్డి తెలిపారు. మంగళవారం హిందూ సమ్మేళన ప్రచార వాహనానికి కాళ్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేష్గౌడ్, గోపాల్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్): మండల పరిధి జెడ్ చెరువు తండాకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం గుంతలను గుర్తించి ఎస్ఐ, సర్పంచ్ బాబు వాటిని మట్టితో నింపారు. అలాగే, ఇతర గ్రామాలకు వేళ్లే రహదారిలో ఉన్న రోడ్లపై కూడా గుంతలను పూడ్చారు. కౌడిపల్లి(నర్సాపూర్): సెంట్రింగ్ కార్మికులకు కంపెనీ తరఫున గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని జైరాజ్ స్టీల్ తెలంగాణ డీజీఎం రవిశంకర్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిలో సెంట్రింగ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల భద్రత కోసం కంపెనీ యజమాన్యం కృషి చేస్తుందని కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీలర్ పోల నవీన్కుమార్, కార్మికులు పాల్గొన్నారు. ములుగు(గజ్వేల్): వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ యార్డు పనులకు సంబంధించిన పనుల పునరుద్ధరణ, అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ములుగు మాజీ వైస్ ఎంపీపీ వి.దేవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్ యార్డు కోసం భూ ములు కోల్పోయిన రైతులకిచ్చిన హామీ మేర కు 250 గజాల ఇళ్ల స్థలాలు అందజేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలసి వివరించనున్నట్లు చెప్పారు. అలాగే ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ పథకం ద్వారా నిధులు మంజూరు చే యించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
బలవంతంగా భూములు లాక్కున్నారు..
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి విలువైన తమ భూములను బలవంతంగా లాక్కున్నారని బాధిత రైతులు వాపోయారు. ఈ మేరకు మంగళవారం బాధితులు స్థానిక మున్సిపల్ పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 1421 సర్వే నంబర్లో 30 ఏళ్ల క్రితమే తమకు పట్టాలు ఇచ్చారని, ప్రస్తుతం సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సముదాయం నిర్మాణం పేరిట అధికారులు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూములను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో స్కూల్ భవనాల నిర్మాణం కోసం అక్కడి అధికారులు రైతుల వద్ద భూములు సేకరించి, నష్టపరిహారం ఇప్పించారని, తమకు కూడా ఇప్పించాలని బాధి తులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మెదక్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని వైస్ చైర్మన్ నవనీత భరోసా ఇచ్చారు. నవనీతకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు -
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని మూలమలుపుల వద్ద మంగళవారం ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఈ మూలమలుపు వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరిగేవని, వాహనదారులకు కనిపించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
18న జాబ్మేళా
రామాయంపేట(మెదక్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 18న జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఎస్ఎన్ కెమికల్ పరిశ్రమలో ఉద్యోగాల కోసం జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఉదయం పది నుంచి మధ్నాహం మూడు వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయని, హాజరమ్యే విద్యార్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో రావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల లోపు వయస్సు గల విద్యార్థులు ఇందుకు అర్హులని స్పష్టం చేశారు. నంగునూరు(సిద్దిపేట): పాలమాకుల వేంకటేశ్వరాలయం 14వ వార్షికోత్సం మంగళవారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం విశ్వక్సేనారాధన, అభిషేకం, గరుడపూజ, ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం పద్మావతీ సమేత వేంకటేశ్వర కల్యాణం కనులపండువగా నిర్వహించారు. గరుడపూజ నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి అన్న సంతర్పణ నిర్వహించారు. -
స్ఫూర్తి ప్రదాతకు నివాళి
నర్సాపూర్: ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో.. చేగుంట: అంబేడ్కర్కు నివాళులర్పిస్తున్న నాయకులు పాపన్నపేట: అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హన్మంత్ రావు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ.. ప్రపంచానికే దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. యువత ఆయన చూపిన బాటలో నడిచి, దేశ ఔన్నత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. పలు చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు. కౌడిపల్లిః సలాబత్పూర్లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ అల్లాదుర్గం: బహిరన్దిబ్బలో రేగోడ్: నివాళులర్పిస్తున్న పీసీసీ సభ్యుడు కిషన్ తదితరులు కొల్చారంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మెదక్ కలెక్టరేట్: దళిత సంఘాల ఆధ్వర్యంలో మెదక్లో భారీ ర్యాలీ మెదక్ కలెక్టరేట్: బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. మెదక్ కలెక్టరేట్: బీజేపీ జిల్లా కార్యాలయంలో.. -
అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
వెల్దుర్తి(తూప్రాన్): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధి శేరీల గ్రామంలో పర్యటించిన శ్రీఅలైవ్..అరైవ్శ్రీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటిస్తామంటూ గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వొద్దని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ రాజు, పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి కౌడిపల్లి(నర్సాపూర్): వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ అమరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని సలాబత్పూర్లో గ్రామస్తులకు అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని.. మైనర్లు డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి జాతీయ రహదారిపై ప్రమాద బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. మంగళవారం నార్సింగి ఎస్ఐ సృజన, జీఎంఆర్, ఎన్హెచ్ఏఐ సంస్థ ప్రతినిధులతో కలిసి జాతీయ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నార్సింగి 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రధానంగా వల్లూర్ యూటర్న్, కామారం యూటర్న్, వల్లాభాపూర్ యూటర్న్, ఖాస్లాపూర్ యూటర్న్లను గుర్తించారు. ఈ ప్రదేశంలో జీబ్రాక్రాసింగ్లు, సోలార్ బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్లు, సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రదేశాల్లో సర్వీస్ రోడ్డు నిర్మాణం గురించి ఎన్హెచ్ఏఐ, జీఎంఆర్ సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. డీఎస్పీ నరేందర్గౌడ్ -
మందుబాబులకు అడ్డాగా ఓపెన్ జిమ్
● పగిలిన మద్యం బాటిళ్లు ● గాజు పెంకులు గుచ్చుకుని గాయపడిన చిన్నారి చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని పెద్దచెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మందుబాబులకు అడ్డా మారింది. స్థానికులు ప్రతిరోజు వాకింగ్ అనంతరం జిమ్ చేసేందుకు వీలుగా అధికారులు కట్టపై ఈ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ అది కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. జిమ్ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మద్యం తాగి ఆ బాటిళ్లను పగులగొట్టి పోయారు. ఇది గమనించని ఓ చిన్నారికి గుచ్చుకోవడంతో కాలికి గాయమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఇప్పటికై నా దీనిపై మున్సిపల్ అధికారులు, పోలీసులు స్పందించి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వాకర్స్ కోరుతున్నారు.. -
ఆ ఇద్దరు మావోలు ఎక్కడ?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమం.. మావోయిస్టు ఉద్యమాల్లో మెతుకుసీమది కీలకపాత్ర. నక్సల్స్, పీపుల్స్వార్, జనశక్తి, మావోయిస్టు ఉద్యమాలతో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. దుబ్బాక, నర్సాపూర్, గిరాయిపల్లి, ఇందుప్రియాల్, భూపతి, పద్మక్క దళాలుగా ఇక్కడ పీపుల్స్వార్ పనిచేసింది. అదే విధంగా కూడవెల్లి, మంజీర దళాలతో జనశక్తి సైతం కొనసాగింది. డీజీపీ ఇటీవల ప్రకటించిన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని ప్రకటించారు. అందులో ప్రకటించిన రూపీ ఎన్కౌంటర్లో మృతిచెందారు. డీజీపీ ప్రకటించని మరో ఇద్దరు ఎక్కడ ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.కానరాని అరుణ, స్వరూపజిల్లా నుంచి ముగ్గురు మావోయిస్టులు ఉండగా అందులో ఒకరు మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన భాగ్య అలియాస్ రూపీ ఛత్తీస్గఢ్ మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు అజ్ఞాతంలో లేనట్లే. అరుణ, స్వరూపలు అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లు దాటిపోయింది. అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప 25ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యం సభ్యురాలిగా ఉన్న ఆమైపె రూ.3లక్షల వరకు రివార్డు ఉన్నట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు. తన చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ, తాత వద్ద పెరిగారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. ఆమె నానమ్మ, తాత చనిపోగా గ్రామస్తులే చందాలు వేసి అంత్యక్రియలు చేశారు. ప్రస్తుతం తనకు చెల్లె మాత్రమే ఉంది. ఇక నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క 20 ఏళ్లుగా మావోయిస్టుల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో యాక్షన్ టీం మెంబర్గా ఉన్న పద్మక్కపై రూ.3లక్షల రివార్డు ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.లొంగిపోయారా..? లేదా? అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప, నంగునూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియరావడం లేదు. పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పడం లేదు. వీరు అజ్ఞాతంలోనే ఉన్నారా? ఉంటే ఎక్కడ? లేక లొంగిపోయారా?.. లొంగిపోతే ఎక్కడ జీవనం గడుపుతున్నారు? లేకపోతే ఎప్పుడైనా ఎన్కౌంటర్లో తమ ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారా?.. లేదా? అనే ఆవేదనతో ఉన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
డీటీఓ వెంకటస్వామి మెదక్ కలెక్టరేట్: ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించడంతోనే ప్రమాదాలను నివారించవచ్చునని డీటీఓ వెంకటస్వామి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో బస్సు డిపో నుంచి పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వరకు రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా డీటీఓ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. బస్సు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం చేయకూడదని హెచ్చరించారు. అలాగే ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకొని సంస్థను ఆదరించా లని కోరారు. అనంతరం రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ, ఎంఆర్కేరావు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వీరబాబు, మెకానికల్ ఫోర్మెన్ సుగు ణాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
కలెక్టర్ ప్రతిమాసింగ్ నిజాంపేట(మెదక్): ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమేరకు సోమవారం మండల పరిధిలోని నందగోకుల్లో నిర్వహించిన గ్రామసభలో ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ నందగోకుల్ గ్రామా న్ని ఆదర్శంగా తీసుకొని, నో హెల్మెట్– నో ఎంట్రీ కార్యక్రమన్ని చేపట్టాలని సూచించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో హత్యలు, అత్యాచారాలు 30 జరిగితే.. రోడ్డు ప్రమాదాల ద్వారా 350 మరణాలు జరిగాయని అందోళన వ్యక్తం చేశాడు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది మృత్యువాత పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాతూరు భానుప్రసాద్రెడ్డి, ఎంపీడీఓ రాజిరెడ్డి, సీఐ వెంకటరాజాగౌడ్, పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
● మంత్రి దామోదర రాజనర్సింహ ● సింగూరు మరమ్మతు పనుల పరిశీలన పుల్కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఇంజనీర్లను ఆదేశించారు. మండలంలోని సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనులను సోమవారం నేషనల్ డ్యామ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. డ్యాం కట్ట రివిట్మెంట్ను, కాలువ సిమెంట్ లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అతిథిగృహంలో అధికారులతో ఇంజనీర్లతో జరుగుతున్న పనులపై సమీక్షించారు. ప్రస్తుతం డ్యామ్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉండటంతో పనుల్లో ఆలస్యమవుతుందని అధికారులు, ఇసుక సమస్య ఉందని, కేటాయించిన క్వారీల్లో ఇసుక తక్కువగా ఉందని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. డ్యామ్లో నీళ్లు తగ్గుతున్న కొద్దీ పనుల్లో వేగం పెంచుతామని అధికారులు మంత్రికి వివరించారు. ఇసుక సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ పాండుకు మంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ ఎస్సీ కలిసి సింగూర్ ప్రాజెక్టు కట్ట పనులను, కాల్వ పనులను, సిమెంట్ లైనింగ్ను పరిశీలించారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి సాగు,తాగు నీటికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాగు, తాగుకు బసపూరం శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి పీఏ హనుమంతుతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక వ్యవసాయం
బ్యాటరీ/మ్యాన్వల్ స్పైయర్లు 14, బుష్ కట్టర్ 31, కేజ్వీల్స్ 2, కల్టివేటర్స్ 112, డ్రోన్స్ 6, ఎంబీ ప్లవ్స్ 3, పవర్ స్పైయర్స్ 133, పవర్ టిల్లర్స్ 8, పవర్ వీడర్స్ 8, రోటోపుడ్లర్ 1, రోటోవేటర్స్ 50, స్ట్రా బెలర్ 54 కలిపి మొత్తం 422 యంత్రాలను రైతులకు అందజేశారు.మెదక్ కలెక్టరేట్: రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత, సాంకేతికత నేపథ్యంలో జిల్లాలోని రైతులు యాంత్రీకరణ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తూ సబ్సిడీ యంత్రాలు అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని 422 మంది రైతులకు రూ.1.80 కోట్ల విలువైన యంత్రాలను అందజేసింది. ప్రస్తుతం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రైతులను యాంత్రీకరణ వైపు మళ్లించేందుకు చైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. నర్సాపూర్లో అత్యధికంగా.. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా, నర్సాపూర్ మండలం నుంచి అత్యధికంగా 103 మంది రైతులు యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ మండలం మొత్తం మీద ఒకే ఒక్క దరఖాస్తు రావడం గమనార్హం. కాగా రైతులను యాంత్రీకరణ వైపు ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం అన్నివర్గాల రైతులకు సబ్సిడీ అందజేస్తుంది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఓసీ, పెద్ద రైతులకు 40 శాతం రాయితీపై యంత్రాలు అందజేస్తుంది. జిల్లాలోని 21 మండలాల నుంచి 422 మంది రైతులు వివిధ రకాల యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి రూ.1.80 కోట్ల విలువైన యంత్రాలను అందజేసింది. యాంత్రీకరణ వైపు రైతులు అవగాహన కల్పిస్తున్నాం పెరుగుతున్న సాంకేతికతతో పాటు రైతులంతా యాంత్రీకరణ ద్వారా అత్యధికంగా పంటలు పండించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మండల వ్యవసాయ, ఇతర అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాం. యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ సబ్సిడీపై అందజేస్తాం. – దేవ్కుమార్, డీఏఓ -
19న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష
నర్సాపూర్ రూరల్: ఈనెల 19వ తేదీన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ ఫర్హాన సోమవారం తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో చేరే విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7, 8, 9, 10వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్టికెట్లతో పాటు బాల్పెన్, పరీక్ష ప్యాడ్లతో 30 నిమిషాల ముందు పరీక్షకు హాజరుకావాలని సూచించారు. 26 నుంచి జనగణన మెదక్ కలెక్టరేట్: ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న జనగణన కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి కులగణన అధికారికి భారతి హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి చేపట్టనున్న జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. జనగణన కోసం 1,406 మంది ఎన్యుమరేటర్లు, 248 మంది సూపర్ వైజర్లను నియమించామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు రామాయంపేట(మెదక్): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ శ్రీరామ్ హెచ్చరించారు. సోమ వారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. ఈసందర్భంగా రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బంది రోగుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యురాలు వైష్ణవి, ఇతర సిబ్బంది వెంట ఉన్నారు. ముగిసిన ‘పది’ పరీక్షలుమెదక్ కలెక్టరేట్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారంతో ముగిశాయి. జిల్లాలో మొత్తం 11,247 మంది విద్యార్థులకు గానూ 11,227 మంది హాజరు కాగా, మరో 20 మంది గైర్హాజరయ్యారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం 99.82 శాతం నమోదైంది. జిల్లాలోని నర్సాపూ ర్, శివ్వంపేట మండలాల్లోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ విజయ సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించినట్లు చెప్పారు. ఈనెల 15వ ఒకేషనల్కు సంబంధించి పరీక్ష ఉంటుందని తెలిపారు. సింగూరు నీటితో రైతులకు ఊరట నర్సాపూర్: సింగూరు నుంచి నీరు విడుదల చేయడంతో నియోజకవర్గంలోని రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి సింగూరు నుంచి నీరు విడుదల చేసేందుకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఘనపూర్ ఆనకట్టకు నీరు విడుదల చేయడానికి సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా సింగూరు నుంచి నీటి విడుదల ప్రక్రియను రైతులు సాధించిన గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు. కాగా భవిష్యత్తులో రైతుల సంక్షేమం, వారి అవసరాలను తీర్చేందుకు తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. కొనసాగుతున్న ఆర్టిజన్ల సమ్మె మెదక్ కలెక్టరేట్: సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె సోమవారం 6వ రోజుకు చేరుకుంది. శిబిరాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి సందర్శించి కార్మికులకు సంఘీభా వం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఆర్టిజెన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. -
మహిళలు రాజకీయాల్లోకి రావాలి
● మెదక్ ఎంపీ రఘునందన్రావు ● నారీ శక్తి వందన్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ సిద్దిపేటకమాన్: మహిళలు రాజకీయాల్లోకి రావాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మహిళ అంటే ఒక శక్తి అని మీ నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలన్నారు. సిద్దిపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ ర్యాలీలో ఎంపీ పాల్గొన్నారు. పట్టణంలోని హైస్కూల్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోడ్రన్ బస్టాండ్ చౌరస్తాలో ఎంపీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా ఉన్నప్పటికీ మహిళా బిల్లు పాస్ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డిని సినిమా వాళ్లు కూడా గుర్తుపట్టడం లేదన్నారు. దేశంలో మహిళా ఎంపీల శాతం 15కంటే తక్కువగా ఉండటం బాధాకరమని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఆపరేషన్ సింధూరు విజయవంతంగా నిర్వహించింది కూడా ఒక మహిళేనని అన్నారు. 75సంవత్సరాల నుంచి మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని మహిళలకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. సునీతావిలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లివచ్చారన్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ను గెలిచింది కూడా నిజామాబాద్ ఆడబిడ్డనే అన్నారు. దేశ ప్రథమ పౌరురాలు కూడా గిరిజన బిడ్డ అయిన ద్రౌపదిముర్ము అని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో 32మంది న్యాయమూర్తులు ఉంటే ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ కార్తీకరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. -
సమస్యలతో సహవాసం
● నర్సింగ్ హాస్టల్లో సౌకర్యాలు నిల్ ● పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో విద్యార్థినులు మెదక్జోన్: నర్సింగ్ విద్యార్థినులు ఏడాదిన్నరగా సమస్యలతో సతమతం అవుతున్నారు. 120 మంది ఉన్న ఆ వసతి గృహంలో కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. దీంతో విద్యార్థినుల బాధ వర్ణణాతీతం. మెయింటెనెన్స్ పేరుతో ప్రిన్సిపాల్ నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నారని, అయినా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. 120 మందికి ఒకే టాయిలెట్ జిల్లాకు ఏడాదిన్నర క్రితం మెడికల్తో పాటు నర్సింగ్ కళాశాల మంజూరు చేశారు. 120 మంది నర్సింగ్ విద్యార్థినుల కోసం పట్టణ పరిధిలోని పిల్లికొటాల్ సమీపంలో ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకొని హాస్టల్ కొనసాగిస్తున్నారు. అయితే అందులో ఒకే ఒక్క టాయిలెట్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని, మిగితావి పనిచేయటం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటికి.. రెంటికి వస్తే ఆ బాధ నరకమంటున్నారు. బెడ్లు సైతం సరిపడా లేకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరు, ముగ్గరు నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజన ఫీజుతో పాటు మెయింటెనెన్స్ పేరుతో నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నారని, భోజనం సైతం సరిగా ఉండటం లేదని, పురుగులు పట్టిన కూరగాయలు, దొడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రిన్సిపాల్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.మురికి కూపం.. వసతి గృహంలో డ్రైనేజీ పైపులైన్లు బ్లాక్ అయ్యాయి. వసతిగృహం ముందు నుంచే నీరంతా ప్రవహిస్తుండటంతో ఆ హాస్టల్ మురికి కూపంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. లోని కి వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు భారిన పడాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా కనీస సౌకర్యాలు లేవని, ప్రిన్సిపాల్తో పాటు జిల్లాస్థాయి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఇటీవల కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు. -
నిర్లక్ష్యం వీడితే.. ప్రాణాలు పదిలం
అదనపు కలెక్టర్ నగేశ్ టేక్మాల్(మెదక్): వాహనదారులు నిర్లక్ష్యం వీడితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సోమవారం మండలంలోని బొడ్మట్పల్లిలో ‘అలైవ్– అరైవ్’ కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీటుబెల్టు పెట్టుకోవాలని పలు ఉదాహరణలతో వివరించారు. అతివేగం ప్రమాదకరమని, మద్యం సేవించే ఏ వాహనాన్ని నడపరాదన్నారు. వాహనదారులు చేసే అశ్రద్ధతో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి తెచ్చుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశం అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసీరాం, సర్పంచ్ అవినాశ్కుమార్, ఉపసర్పంచ్ మాధవి, ఆర్ఐ సాయిశ్రీకాంత్, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి వివేక్ పటాన్చెరు: పటాన్చెరులో రోడ్ల అభివృద్దికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వివేక్ తెలిపారు. పటాన్చెరులో ఆదివారం జరిగిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు.రైతులను ఆదుకోండి ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలలో తలెత్తిన అనిశ్చితిని తొలగించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. సింగూరు నుంచి నీరు విడుదల చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మంజీరా డ్యాం అధికారులకు సరైన ఆదేశాలు లేనందున క్షేత్రస్థాయిలో నీటి విడుదల జరగలేదన్నారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో సైతం ప్రస్తావించానని గుర్తు చేశారు. మంత్రి మౌఖిక ఆదేశాల ఇచ్చినా, అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులకు సాగు నీరు అందక నష్టం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేయకపోతే సుమారు 60 వేల ఎకరాల్లోని వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని కోరారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు నర్సాపూర్: బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన పట్టణంలోని రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. రేషన్కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. పీడీఎస్ బియ్యంలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ చేస్తారని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం మెదక్ కలెక్టరేట్: సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ‘రాజ్యాంగ పరిరక్షణ– సవాళ్లు’ అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి నర్సమ్మ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడివయ్య హాజరై మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలంతా రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంపదను సంపన్నులకు కట్టబెట్టుతున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోశ్ కుమార్, నాయకులు యశోద, కవిత, యాదగిరి, దుర్గ, స్వరూప, చంద్రం, కిష్టయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు -
ప్రథమ ఇంటర్లో 28, ద్వితీయంలో 26వ స్థానం
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● ఒకేషనల్ ఫస్ట్ ఇయర్లో రాష్ట్రంలోనే టాప్ ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే జిల్లా 26వ స్థానానికే పరిమితమైంది. ఈసారి సెకండ్ ఇయర్లో 68.59 శాతం ఫలితాలు సాధించింది. బాలికలు 75.34 శాతం ఉత్తీర్ణత సాధించి ముందుండగా, బాలురు 58.9 శాతంతో వెనుకబడ్డారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మాత్రం 55.27 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. కాగా ఒకేషనల్ ఫస్ట్ ఇయర్లో 73.46 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. 70 శాతం సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం గమనార్హం. కాగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన డి.శివసాయి 984 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. – మెదక్ అర్బన్ జిల్లావ్యాప్తంగా 58 ఇంటర్ కళాశాలలు ఉండగా, వాటిలో 16 ప్రభుత్వ, మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది సెకండ్ ఇయర్ జనరల్ విభాగంలో 4,826 మంది పరీక్షలు రాయగా, 3,310 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 1,983 మందికి గాను 1,168 మంది పాసయ్యారు. బాలికలు 2,843 మందికి 2,142 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 539 గాను 460 మంది పాస్ అయ్యారు. ఇక ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ విభాగంలో 2,460 బాలురకు 1,156 మంది, 3,250 మంది బాలికలకు 2 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్ట్ ఇయర్ ఒకేషనల్లో 599 మందికి 440 మంది ఉత్తీర్ణులై 73.46 శాతం సాధించడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 70 శాతం సింగిల్ సబ్జెక్ట్ వారే..70 శాతం మంది సింగిల్ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారు. మే 13 నుంచి జరుగబోయే అడాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రతి కాలేజీలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. రాలేని వారికి జూమ్ క్లాసులు కొనసాగిస్తాం. ఈ ఏడాది విద్యార్థుల అటెండెన్స్ పెంచడానికి ఇంటింటికీ తిరిగాం. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాం. తల్లిదండ్రులతో ఫోన్ మానిట రింగ్ చేశాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. అందువల్ల కొంతమేర ఉత్తీర్ణతా శాతం పెరిగింది. – మాధవి, డీఐఈఓ -
మౌలిక వసతులు కల్పించాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు తక్షణం మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ నర్సింగ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదన్నారు. ఆమె వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్రావు తదితరులు ఉన్నారు. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
● కలెక్టర్ ప్రతిమాసింగ్ ● నేటి నుంచి గ్రామాల్లో ‘అరైవ్– అలైవ్’మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలోని 492 పంచాయతీల్లో ‘అరైవ్– అలైవ్’ గ్రామ సభలు పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి, ప్రజలకు ప్రాణ రక్షణ కల్పించాలి అనే నినాదంతో అన్ని పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని అంశాల మీద గ్రామసభలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ఊరట
జిల్లాకు రూ.6.48 కోట్ల పంట నష్ట పరిహారం ● ఎట్టకేలకు మంజూరు చేసిన ప్రభుత్వం ● ఎకరానికి 10,000 చొప్పున అందజేతరామాయంపేట(మెదక్): గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. జిల్లాకు రూ.6.48 కోట్ల పంట నష్టం పరిహారం మంజూరు చేసింది. గత ఎనిమిది నెలలుగా రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారికి త్వరలో ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందనుంది. 6,500 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు జిల్లావ్యాప్తంగా 8,089 మంది రైతులకు సంబంధించి మొత్తం 6,480 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 1,060 ఎకరాల మేర పంట చేలల్లో ఇసుక మేటలు వేసింది. నెలల తరబడి పంట చేన్లు నీటిలోనే ఉండి రంగు మారి దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటల వివరాలను రెండు విడతలుగా సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా వరి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. దీనికి తోడు పత్తి పంట కూడా దెబ్బతిని రైతులు పెట్టుబడులు సైతం నష్టపోయారు. మొక్కజొన్న చేతికి రాకుండా పోయింది. కోసి గూడు పెట్టిన కంకులు మొలకెత్తాయి. పంట రంగు మారి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా అప్పట్లో సీఎంతో పాటు మంత్రులు జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం పరిహారం అందజేస్తామని ప్రకటించారు. కాగా ఇసుక మేటలను ఈ సీజన్లో తొలగించుకోవడం సాధ్యం కాదని భావించిన రైతులు వాయిదా వేసుకున్నారు. ఎనిమిది నెలలు గడిచినా ఇంకా ఇసుక మేటలు తొలగిపోలేదు. రామాయంపేట, నార్సింగి, హవేళిఘణాపూర్ మండలాల్లో మొదటి విడతగా 11 ఎకరాల్లో మాత్రమే ఇసుక మేటలు తొలగించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలు ఇలా.. పంట ఎకరాలు వరి 5,850 పత్తి 475 పెసర 69 మొక్కజొన్న 25 కూరగాయలు, ఇతర పంటలు 90 త్వరలో అందజేస్తాం గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. నష్ట పరిహారానికి సంబంధించి ప్రభు త్వం నిధులు విడుదల చేసినట్లు తెలిసింది. ఇంకా జిల్లాకు అందలేదు. రాగానే బాధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
భూ పట్టా.. అక్రమాల చిట్టా!
● ఇంత జరిగినా ముందుకు సాగని దర్యాప్తు ● రెవెన్యూలో సూత్రధారులు ఎవరు? ● విచారణ వేగవంతం చేయాలని బాధితుల డిమాండ్ అల్లాదుర్గం(మెదక్): భూభారతి చట్టం అపహాస్యం అయింది. అధికారులు రాసిందే చట్టం, చేసిందే పట్టాగా మారింది. అధికారులు, సిబ్బంది చేయి తడిపితే చాలు చట్టం ఉండదు, నిబంధనలు అడ్డురావు. రూ. కోట్ల విలువ గల భూములు అక్రమార్కుల సొంతం అవుతున్నాయి. అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయం అక్రమ పట్టా, పౌతిలకు నిలయంగా మారింది. ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఆశిస్తున్నారు. అయితే జిల్లా అధికారుల అండదండలు అక్రమార్కులకు ఉండటంతో విచారణను తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగాఇప్పటికీ పలువురు పౌతి కోసం, తప్పుల రికార్డులు సరి చేసుకునేందుకు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భారీగా చేతులు మారిన డబ్బు గడిపెద్దాపూర్లో నాలుగెకరాల భూమిని ఎలాంటి రికార్డులు, అధారాలు లేకున్నా రెవెన్యూ అధికారులు మరొకరి పేరున అక్రమంగా పట్టా చేశారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, అల్లాదుర్గం రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున డబ్బులకు ఆశ పడి భూములను ఇతరులకు అంటగట్టారు. ఇందులో జిల్లాస్థాయి అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే అల్లాదుర్గం, కాయిదంపల్లి, అప్పాజీపల్లి గ్రామాల్లో అక్రమంగా ఇతరుల పేరిట పౌతి చేయడం కలకలం రేపింది. అల్లాదుర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు అధికారులతో మిలాఖత్ అయి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బతికున్న వ్యక్తి మర ణించినట్లు రికార్డులు సృష్టించి భూములను మాయం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సాదాబైనామా, పౌతి మార్పిడిలో పెద్దఎత్తున అక్ర మాలు జరిగాయి. రూ. లక్షలు చేతులు మారడంతో భూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాలు వెలుగులోకి వస్తాయని బాధితులు చెబుతున్నారు. -
వన్యప్రాణుల దాహం కేక
ఎండలు మండుతుండటంతో తాగు నీటి కోసం వన్యప్రాణులు అలమటిస్తున్నాయి. అడవిలో గతంలో నిర్మించిన సాసర్పిట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాహంతో జంతువులు గ్రామాల శివారులో ఉన్న పంట చేల వద్దకు వస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. అరణ్యంలో కొత్తగా బోర్లు తవ్వించి సోలార్ మోటార్లు బిగిస్తే కొంతమేర ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. – రామాయంపేట(మెదక్)కుంటలో అడుగంటిన నీరు● ఖాళీగా దర్శనమిస్తున్న సాసర్పిట్లు ● ఇప్పటివరకు విడుదల కాని నిధులు ● జిల్లాలో 58 వేలకుపైగా హెక్టార్లలో అటవీజిల్లా పరిధిలో 58 వేలకు పైగా హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. జంతువులకు తాగునీటి సదుపాయం కల్పించడానికి అడవిలో 520కి పైగా సాసర్పిట్లు, చెక్డ్యాంలు, కుంటలు ఉన్నాయి. ఏటా వేసవి ప్రారంభంలోనే ఆశాఖ అధికారులు సాసర్పిట్లు, కుంటల్లో నీరు నింపేవారు. దీంతో వన్యప్రాణులు అడవి దాటి బయటకు రాకుండానే దాహార్తి తీర్చుకునేవి. కాగా ఐదేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అధికారులు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. దీంతో కొందరు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సొంత డబ్బులతో అక్కడక్కడ సాసర్పిట్లలో నీరు పోయిస్తున్నా, పెద్దగా ఫలితం ఉండటం లేదు. పనిచేయని సోలార్ మోటార్లు సాసర్పిట్లు నిరుపయోగంగా మారి చెత్తాచెదారంతో నిండిపోయాయి. ప్రస్తుతం వీటిని నీటితో నింపితే జంతువులకు తాగునీటి సదుపాయం కలుగుతుందని, దీంతో అవి గ్రామాల్లోకి రావని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో 12 సోలార్ మోటార్లు ఉండగా, వాటిలో 10 మాత్రమే పనిచేస్తున్నాయి. దంతేపల్లి అటవీప్రాంతంలో ఉన్న సోలార్ మోటార్ నడిస్తే ఆప్రాంతంలో చాలా వరకు నీటి ఎద్దడి తీరుతుంది. ఈప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్న వన్య ప్రాణులకు తాగు నీటి సదుపాయం కలుగుతుంది. కాగా మూడేళ్లుగా అది పనిచేయడం లేదు. అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా, తరచూ బోరు పూడుకుపోతుండటంతో ఈసమస్య తలెత్తింది. కొత్తగా బోర్లు తవ్వించి సోలార్ మోటార్లు బిగిస్తే చాలా వరకు జంతువులకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. ఇదిలా ఉండగా గతంలో జంతువులు నీటి కోసం గ్రామాల శివారులోకి వచ్చి మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. -
నిప్పుల కుంపటి
మెదక్జోన్: మెతుకుసీమపై నిప్పుల వాన కురుస్తోంది. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. సా యంత్రం వరకు ప్రజలు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతున్నారు. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఎండ నుంచి వేడిమికి తాళలేక తాత్కాలిక ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు, కూల్డ్రింక్లు, కొబ్బరినీళ్లు సేవిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట కు వస్తే గొడుగులు, చేతిరుమాలు తలపై కప్పుకోవాలని సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. కాగా మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఐదు రోజుల ఉష్ణోగ్రతలు ఇలా.. తేదీ కనిష్ట గరిష్ట 7 22.3 39.9 8 18.4 39.8 9 19.9 39.3 10 20.1 40.6 11 20.9 41.4 జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఉదయం 9 గంటల నుంచే భానుడి విశ్వరూపం ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి -
మార్కెట్కు వస్తే కదా బాధ తెలిసేది
● మీరు రారు.. ప్రభుత్వం పట్టించుకోదు ● అధికారులపై హరీశ్రావు ఆగ్రహం ● రెండు రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలిసిద్దిపేటజోన్: అధికారులు కొనుగోలు కేంద్రాలకు రారు.. ప్రభుత్వమూ పట్టించుకోదు.. మరి రైతుల బాధ తీర్చేదెవరు అంటూ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం.. రైతుల పడిగాపులు, పేరుకుపోయిన పొద్దుతిరుగుడు రాశులపై ఈనెల10న సాక్షిలో ‘కొంటారా... కొనరా’అనే శీర్షికపై ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డును పరిశీలించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంచులు, కోటా, లారీలు, హమాలీ సమస్యల పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు హరీశ్రావు దృషికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా మార్క్ఫెడ్ డీఎం సునీత, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటయ్యలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. యార్డులో రైతులు బాధ పడుతుంటే మీరేమి చేస్తున్నట్టు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు మార్కెట్ యార్డుకు వస్తే కదా రైతుల బాధలు తెలిసేది అంటూ మండిపడ్డారు. కోటా పూర్తి అయిందని, లారీలు, హమాలీ సమస్య ఉందన్నారు. సోమవారం నాటికి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రైతుల సమస్యలను పరిష్కరించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. యార్డులో ఐదు మిషన్లు ఉండగా.. రెండు మాత్రమే పని చేస్తున్నాయని, అవసరమైతే మరో రెండు మి షన్లు కొనుగోలు చేయాలన్నా రు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్, నాయకులు వరాల సురేష్, రెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలను అరికడదాం
మెదక్ కలెక్టరేట్: ‘హెల్త్ వీక్’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్– రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుంచి టీఎన్జీఓ భవన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించగా, డీఎంహెచ్ఓ శ్రీరామ్ ప్రారంభించారు. అనంతరం టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని మూకుమ్మడిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. మెడికల్ షాపుల్లో అమ్మే మందులకు డాక్టర్ పిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు. ఈగల్ ఫోర్స్ ఏసీపీ శివనాయుడు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు విక్రయిస్తే చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, ఇతర అధికారులు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. కనీస వసతులు కల్పించాలి మెదక్ కలెక్టరేట్: నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేసి, విద్యార్థులకు కనీస వసతులు, మంచి భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెయింటెనెన్స్ పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణం అన్నారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనంలో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని వాపోయారు. కలెక్టర్ తక్షణం స్పందించి విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గణేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి నర్సాపూర్ రూరల్: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వంటలు చేయాలని మెదక్ ఆర్సీఓ బలరాంనాయక్ వంట సిబ్బందికి సూచించా రు. శనివారం మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో వంట సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మెనూ ఆధారంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. వంట పాత్రలు, గదులు సై తం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వర్క్షాప్లో ఆయా రకాల వంటలు వండటంతో పాటు విద్యార్థులకు వడ్డించే విధానంపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలితాదేవి, కౌడిపల్లి ప్రిన్సిపాల్ కల్యాణి, ఆయా పాఠశాలల వంట మనుషులు పాల్గొన్నారు. 18 మంది క్రీడాకారుల ఎంపికసంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–25 క్రికెట్ సెలక్షన్స్లో 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి క్రికెట్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డివిజన్ లీగ్ క్రికెట్ పోటీల విభాగంలో సెలక్షన్ చేయగా సంబంధిత క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు. -
మిల్లింగ్కు ససేమిరా!
మిల్లర్లకు ఇచ్చే ధాన్యంలో మొత్తంగా 90 శాతం రారైస్, 10 శాతం బాయిల్డ్ రైస్ ఇవ్వాలంటూ కేంద్రం ఈసారి కొత్త నిబంధన పెట్టింది. దీంతో ధాన్యం మిల్లింగ్కు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. యాసంగిలో నూకల శాతం అధికంగా ఉంటుందని, రారైస్ ఇవ్వటం సాధ్యం కాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో ధాన్యం సేకరణలో సందిగ్ధం నెలకొంది. – మెదక్జోన్ జిల్లాలో మొత్తం 102 రైస్మిల్లులు ఉండగా, అందులో 38 బాయిల్డ్, 64 రారైస్ మిల్లులు ఉన్నాయి. ఏటా వానాకాలంలో సుమారు 6 లక్షల పైచిలుకు, యాసంగిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తోంది. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి ఎఫ్సీఐకి అప్పగిస్తున్నారు. కాగా ఈ సంవత్సరం మిల్లులకు అప్పగించే ధాన్యంలో 90 శాతం రారైస్, 10 శాతం బాయిల్డ్ రైస్ ఇవ్వాలని కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 50 శాతానికి పైగా నూకలు వస్తాయని, రారైస్ ఇవ్వటం సాధ్యం కాదని, బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తామంటూ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ధాన్యం తీసుకోం..! గతంలో మాదిరిగానే బాయిల్డ్ కొంత, రారైస్ కొంత చొప్పున ఇస్తామని పలువురు మిల్లర్లు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 కిలోల ధాన్యం మిల్లింగ్ చేస్తే రారైస్ 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్సీఐకి అప్పగించాలి. ఇది వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని మరాడిస్తే మాత్రమే వస్తోంది. యాసంగిలో సాధ్యం కాదని మిల్లర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే ధాన్యం తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా ధాన్యాన్ని నేరుగా మిల్లింగ్ చేస్తే వచ్చేది రారైస్ (బియ్యం) కాస్త సన్నగా ఉంటుంది. అదే బాయిల్డ్ రైస్ అంటే వేడి నీటిలో ధాన్యాన్ని ఉడకబెడతారు. నూకలు రాకుండా అధికశాతం బియ్యం వస్తాయి. కానీ ఆ బియ్యం దొడ్డుగా ఉంటాయి. వాటిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు.23 రకాల కొత్త నిబంధనలు ఎప్పుడూ లేని విధంగా ఈఏడాది 66 పేజీలలో 23 రకాల కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు సమాచారం. గతంలో మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ముందు మరో ఇద్దరు మిల్లర్ల జామీన్గా తీసుకుని ధాన్యం కేటాయించే వారు. కానీ ఈసారి సదరు మిల్లర్లు అధికారులకు అఫిడవిట్ సమర్పించాలి. అగ్రిమెంట్పై సివిల్ సప్లై అధికారితో పాటు జాయింట్ కలెక్టర్ సంతకాలు సైతం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నూతన నిబంధనతో ఇప్పటి వరకు మిల్లర్లు ముందుకు రావడం లేదు.90 శాతం రారైస్ ఇవ్వాలని కేంద్రం నిబంధన యాసంగిలో సాధ్యం కాదంటున్న మిల్లర్లు ధాన్యం కొనుగోలులో వీడని సందిగ్ధం -
ఘనపూర్కు సింగూరు నీరు
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక గేట్ను ఎత్తి దిగువన ఘనపూర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతుల దృష్ట్యా ఘనపూర్ ఆయకట్టుకు పంట విరామం ప్రకటించినా, కొందరు రైతులు యాసంగి సాగు వేశారు. దీంతో ఘనపూర్ ఆనకట్టకు నీటి కొరత ఏర్పడింది. పంట చివరి దశలో ఉండటంతో నీటి కొరత ఏర్పడింది. అధికారుల సూచన మేరకు శనివారం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. 5వ నంబర్ గేట్ను మీటరున్నర ఎత్తి మంజీరాలోకి నీటిని వదిలారు. అక్కడి నుంచి ఘనపూర్కు నీరు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. -
పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి
మెదక్ కలెక్టరేట్: మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూ ర్తితో ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని బోధన్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చేశాడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పూలే ఆశయమని గుర్తుచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, డీఎస్పీ ప్రసన్నకుమార్,మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి రాజ్కుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుబాసి సంజీవ్, బీసీ సంఘం నాయ కులు మెట్టు గంగారాం, నోముల శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
మల్లయ్య తిన్న ముక్క.. మల్లయ్యనే ఇబ్బంది పెట్టింది!
మెదక్ జిల్లా: ఓ శుభకార్యానికి వెళ్లిన వ్యక్తికి భోజనం చేస్తున్న క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన తూప్రాన్ పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీహెచ్సీ సూపరింటెండెంట్ అమర్సింగ్ వివరాల ప్రకారం... మాసాయి పేట మండలం హాకీంపేట గ్రామానికి చెందిన పి.మల్లయ్య తూప్రాన్లో బంధువుల శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ భోజన సమ యంలో చికెన్, చపాతి తింటున్న క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ స భ్యులు, బంధువులు వెంటనే పట్టణంలోని సీహెచ్సీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సూపరింటెండెంట్ అమర్సింగ్ వైద్య సిబ్బందితో కలిసి రెండు గంటలు శ్రమించి ‘హెంబ్లిక్ పద్ధతి’తో చికెన్ ముక్కను గొంతులో నుంచి బయటకు తీశారు. దీంతో మల్లయ్యకు ప్రాణాపాయం తప్పింది. వైద్యుల చేసిన కృషిని కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు. -
పోషకాహారంపై అవగాహన అవసరం
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్ రూరల్: పౌష్టికాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని ఆవంచలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బంది వివరించాలని సూచించారు. ప్రతి మంగళవారం మహిళలు, పిల్లలలో పోషణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లలో ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకునేలా చైతన్య పరచాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు చేపట్టారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి హేమాభార్గవి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, సర్పంచ్ స్రవంతి, కరుణాకర్, మెడికల్ ఆఫీసర్ రఘువరన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సరళ కుమారి, కవిత, శివకుమారి, కార్యదర్శి మల్లేశ్, కవిత తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మెదక్జోన్: క్రమం తప్పకుండా యోగా చేయ డం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ‘హెల్త్వీక్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో హోమియోపతి, ఆయుష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వయో, లింగ భేదం లేకుండా అందరూ యోగాను సాధన చేయాలన్నారు. పురాతన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనంగా గుర్తించారన్నారు. యోగా సాధన ద్వారా జీవనశైలిలో మార్పు వస్తుందని, అనేక వ్యాధులను నివారించుకోవచ్చని వివరి ంచారు. అంతకుముందు కలెక్టర్ పలు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, డీఎంహెచ్ఓ శ్రీరాం, డీఈఓ విజయ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, యోగా గురువులు రవి, మనోరంజని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
రోడ్డెక్కిన నర్సింగ్ విద్యార్థినులు
మెదక్ కలెక్టరేట్: ‘హాస్టల్లో కనీస వసతులు లేవు.. కడుపునిండా తిండిలేక అల్లాడిపోతున్నామని’ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు మండుటెండలో నిరసన ర్యాలీ చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు విద్యార్థులను సముదాయించారు. కలెక్టర్కు మొర పెట్టుకుంటామని చెప్పడంతో బస్సు ఏర్పాటు చేసి కలెక్టరేట్కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఆందోళన చేపట్టారు. హాస్టల్లో 120 మందికి కేవలం ఒకటే టాయిలెట్ ఉందని, రెండు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీనెల ప్రిన్సిపాల్ మెయింటనెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నా రని ఆరోపించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ను కలిసి సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరం కలెక్టర్, డీఐఈఓ మాధవి నర్సింగ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు కనీస వసతులు లేని మాట వాస్తవమేనని, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొడగు సైనిక్ స్కూల్కు మెదక్ విద్యార్థి
మెదక్ కలెక్టరేట్: దేశంలోని టాప్ 5 సైనిక్ స్కూల్స్లో ఒకటిగా గుర్తింపు పొందిన కొడగు సైనిక్ స్కూల్కు మెదక్కు చెందిన విద్యార్థి రిహాన్శౌర్య ఎంపికయ్యాడు. జనవరి 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రిహాన్ అద్భుత ప్రతిభ కనబర్చాడు. దేశ నలుమూలల నుంచి సుమారు 1,80,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కఠిన పోటీలో విద్యార్థి 300కు 275 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 982 సాధించాడు. ఈ విషయమై విద్యార్థి తండ్రి, అగ్రికల్చర్ ఏఈఓ రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. నర్సాపూర్: విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం పట్టణంలో పర్యటించా రు. నర్సాపూర్లోని ఎంఎల్ఎస్ గోదాంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. బియ్యం స్టాక్, రికార్డులు తనిఖీలు చూశారు. -
మిల్లర్లతో మిలాఖత్
● కేంద్రాల నిర్వాహకులు, స్టేజ్ 1 కాంట్రాక్టర్ల మాయాజాలం ● జిల్లాలో 7 మిల్లులకే 2.69 లక్షల క్వింటాళ్ల సన్నధాన్యం కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)లో నిబంధనలకు పాతరేస్తున్నారు. లాభదాయకంగా ఉండటంతో మిల్లర్లంతా సన్న వడ్ల కోసం ఎగబడుతున్నారు. ఇందులో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేజ్ 1 కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టు డ్రైవర్లు చక్రం తిప్పుతున్నారు. మ్లిలర్లతో కుమ్మకై , కమీషన్లు ఇచ్చే వారికే సన్న వడ్లు పంపుతున్నారు. గత వానాకాలంలో జిల్లాలో 14,28,712 క్వింటాళ్ల సన్న వడ్లు సీఎంఆర్ కింద సేకరించగా, ఇందులో కేవలం 7 మిల్లులకే 2,68,839 క్వింటాళ్లు ఇచ్చారు. మిగితా 94 మిల్లులకు 11,59,873 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా న్యాయంగా సన్నాల కేటాయింపులు జరపాలని మిల్లర్లు కోరుతున్నారు. – మెదక్ అర్బన్ గత వానాకాలం సీజన్లో జిల్లాలో మొత్తం 37,57,896 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. అందులో 14,28,712 క్వింటాళ్ల సన్నాలు ఉన్నాయి. సీఎంఆర్ కోసం జిల్లాలోని 101 మిల్లులకు ధాన్యం కేటాయించారు. అయితే సన్న వడ్లు మ్లిలర్లకు లాభదాయకంగా ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, స్టేజ్ 1 కాంట్రాక్ట్ ట్రాన్స్పోర్టర్లకు ప్రలోభాల ఆశ చూపారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కమీషన్లకు ఆశపడి, తమకు అనుకూలమైన మిల్లర్లకు సన్న వడ్లు పంపిణీ చేశారు. అలాగే ట్రాన్స్పోర్టు డ్రైవర్లు, స్టేజ్ 1 కాంట్రాక్టర్లు సైతం తమతో అంటకాగిన మిల్లర్ల పంచన చేరారన్న విమర్శలున్నాయి. జిల్లాలో పెద్దశంకరంపేట, పాపన్నపేట, మెదక్, నర్సాపూర్ మండలాల్లోని ఏడు మిల్లులకు 2,68,839 క్వింటాళ్ల సన్న వడ్లు కేటాయించారు. కొంతమంది మిల్లర్లు సన్నాల కోసం రైతులకు క్వింటాల్కు రూ.50తో పాటు, హమాలీ చార్జీలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది మిల్లర్లు మరో అడుగు ముందుకేసి, తమ లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపి సన్న వడ్లు తెప్పించుకున్నారు. అయితే స్టేజ్ 1 కాంట్రాక్టర్లు వీరికి, ట్రాన్స్పోర్టు చార్జీలు చెల్లించే అవకాశం లేకపోయినప్పటికీ, ఇరువర్గాలకు ఈ దందా లాభదాయకంగా మారింది. సిరులు కురిపిస్తున్న సన్నాలు సన్న వడ్ల ద్వారా క్వింటాల్కు నూకలతో కలిపి సుమారు 67 కిలోల బియ్యం వస్తున్నట్లు తెలుస్తుంది. దొడ్డు వడ్ల ద్వారా తక్కువ బియ్యం వస్తున్నాయి. అలాగే సన్నాలు మెదక్లోని సివిల్ సప్లై ద్వారా మామూళ్లు మాటున సులభంగా పాస్ అవుతాయన్న ఆరోపణలున్నాయి. ఇక దొడ్డు బియ్యం ఎఫ్సీఐ ద్వారా పాస్ కావాలి. అక్కడ మామూళ్లు తప్పకున్నా, క్వాలిటీ చూస్తారని, అందువల్ల మిల్లర్లు ఎక్కువగా సన్న వడ్ల కోసం ఎగబడుతున్నారు. గతేడాది సన్నాలు తీసుకున్న మిల్లర్లు క్వింటాల్కు రూ.25 చొప్పున అసోసియేషన్కు చెల్లించాలని, అన్ని మిల్లులకు సమానం వడ్లు కేటాయించాలని యూనియన్ తీర్మానించింది. ఈ విషయమై సివిల్ సప్లై డీఎం జగదీశ్ను వివరణ కోరగా.. సన్న, దొడ్డు వడ్లు అన్న వివరాలు తమ వద్ద ఉండవని, అవి మిల్లర్ అసోసియేషన్ చూసుకోవాలన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ‘అరైవ్– అలైవ్ వీక్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సర్పంచ్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండల పరిధిలోని రామోజీపల్లి, బూర్గుపల్లి సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివా రం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. నర్సాపూర్ రూరల్: మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు వాయిదాల పద్ధతిలో నిర్ణీత గడువులోగా చెల్లించాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఆవంచలో నిర్మిస్తున్న మహిళా సంఘం నూ తన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశమై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రభు త్వం మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. గర్భిణులు, బా లింత లు, చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకునే విధంగా మహిళా సంఘాల సభ్యులు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్, సీసీ రవీందర్, వీఓ మల్లేశ్వరి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. తూప్రాన్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. 8వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా 4 నెలలు పైబడిన పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పశువుల్లో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం తగ్గుతుందన్నారు. పాడి రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. అందుకే ఏడాదికి రెండు సార్లు పశువులకు వ్యాధి నిరోధక టీకాలు కచ్చితంగా ఇప్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి లక్ష్మి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ రమేశ్, రామకృష్ణ, కృష్ణ, శ్రీనివాస్, గోపాలమిత్ర, పశు పోషకులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు: పటాన్చెరులోని పాఠశాల కూల్చివేతపై ఎంపీ రఘునందన్రావు స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాల తరగతి గదుల నిర్మాణాలను కూల్చివేశారు. అదేరాత్రి ఎంపీ రఘునందన్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్కు, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కూల్చివేతను ఆపాలని ఆదేశించగా... అప్పటికే బడిని నేలమట్టం చేసేశారు. -
వ్యర్థాలతో ఇంధనం!
సాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కోసం వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ఈ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా దిగుమతులను తగ్గించడానికి భారత ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది. వ్యవసాయ, పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడ నుంచి ఇంధనం తయారు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో టీజీఐఐసీ సేకరించిన 20 ఎకరాల స్థలాన్ని బయోగ్యాస్ ప్లాంట్ కోసం కేటాయించారు.. అభివృద్ధి చెందుతున్న బయో ఎనర్జీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జూనో జౌల్ బయో ప్యూయల్స్ కంపెనీ వారు ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న నర్మెటలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో గ్యాస్ రాష్ట్రంలో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తున్నారు. వరి కోతలు ముగిసిన తర్వాత గడ్డి, వివిధ పంటల మొదళ్లను తగులబెడుతుంటారు. దీంతో భూమి సారం కోల్పోవడంతో పాటు గ్రీన్హౌస్ వా యువు విడుదలవుతోంది. అదే వ్యవసాయ వ్యర్థాలు, వడ్లపొట్టు, పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలతో స్వచ్ఛమైన ఇంధనంగా తయారు చేయనున్నారు. సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు అందించనుంది. రాష్ట్రంలోనే తొలి ప్లాంట్ సిద్దిపేటలో రూ 250కోట్ల వ్యయంతో 10 సీబీజీ (కంప్రెషడ్ బయో గ్యాస్) ప్లాంట్లతో రాష్ట్రంలో ఇదే తొలి ప్రాజెక్టు. ఒక్కో ప్లాంట్ రోజుకు 10 టన్నుల టీపీడీ (టెన్స్ పర్ డే) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా మొత్తం వంద టీపీడీ ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది. ఇది రాష్ట్రంలో బయో–ఎనర్జీ ఉత్పత్తికి కీలక కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి, రెండో దశల్లో మూడు ప్లాంట్లు చొప్పున, మూడో దశలో నాలుగు ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఈ మొత్తం క్లస్టర్ 2029– 2030 నాటికి పూర్తి కానుంది. ఇది భారతదేశం తక్కు వ కార్బన్ ఉద్గారాల ఇంధన వ్యవస్థల వైపు సాగించే ప్రయాణానికి తోడ్పడుతుంది. అలాగే దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ.250 కోట్లతో నర్మేటలో బయోగ్యాస్ ప్లాంట్ 12న మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడతో ప్లాంట్ నిర్మాణం 10 ప్లాంట్లు.. ఒక్కో ప్లాంట్ 10 టన్నుల టీపీడీ సామర్థ్యం -
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి
అదనపు కలెక్టర్ నగేశ్ చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని జంగరాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో చాలా వరకు బేస్మెంట్ వరకు మాత్రమే పనులు జరిగాయని, వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యంను ఆదేశించారు. ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వద్దని సూచించారు. లబ్ధిదారుల ఇబ్బందులు తెలుసుకొని పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. బడికి వచ్చిన తర్వాత మొబైల్ పక్కనపెట్టాలని, విద్యార్థులను తీర్చిదిద్దడంపైనే దృష్టి సారించాలన్నారు. అలాగే పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించడంతో పాటు గవ్వలపల్లి ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఆర్ఐ రాజు, గ్రామ కార్యదర్శి శైలజ ఉన్నారు. -
రైతులు ఇబ్బంది పడొద్దు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చిన్నశంకరంపేట(మెదక్): కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గో దాంలు నిర్మిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క గోదాం కూడా నిర్మించలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సుజాతగౌడ్, తహసీల్దార్ గ్రేసిబాయి, ఐకేపీ సీసీ సృజన్కుమార్రెడ్డి, సీసీలు శ్రీనివాస్గౌడ్, శోభ, పీఏసీఎస్ సీఈఓ నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు. -
భరోసా సొమ్ము జమ చేసుకోవద్దు
బ్యాంకర్లను కోరిన ప్రభుత్వంజహీరాబాద్: బ్యాంకులకు బాకీ పడిన వ్యవసాయ రుణాలను రైతు భరోసా సొమ్ము నుంచి మినహాయించుకోవద్దని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి లిఖిత పూర్వకంగా సూచించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన జీవోను సైతం అందులో పొందుపరిచింది. ఈ విషయమై రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు తగిన సూచనలు జారీ చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరింది. రైతు భరోసా డ బ్బుల్ని సాగుకు అవసరమైన ముడి సరుకుల కొనుగోలు కోసమే ఉద్దేశించినందున ఈ పథకం కింద ఇచ్చిన వ్యవసాయ పెట్టుబడి మొత్తాన్ని వారి రుణా బకాయిలకింద జమచేసుకోకుండా వారికి అందజేయాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. ఖాతాలను హోల్డ్లో పెట్టిన బ్యాంకులు పలువురు రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడం, రుణమాఫీ కోసం ప్రభుత్వం కటాఫ్ తేదీ పెట్టడంతో కొందరు రైతులు ఈ పథకం కిందకు రాలేదు. దీంతో వారిని డిఫాల్టర్ కింద చేర్చారు. వారి కరెంట్ లావాదేవీ ఖాతాలను బ్యాంకర్లు హోల్డ్లో పెట్టారు. దీంతో రైతు భరోసా సొమ్మును పొందలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. పలు కారణాల చేత కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇలాంటి రైతులకు సంబంధించిన రైతు భరోసా సొమ్మును బ్యాంకర్లు రైతులకు చెల్లించడం లేదనే విమర్శలున్నాయి. పలువురు రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను వివిధ కారణాలతో బ్యాంకర్లు మూసివేశారు. అలాంటి రైతులు కొత్త ఖాతాలు తెరిచినా వారి అకౌంట్లను వ్యవసాయ శాఖ సకాలంలో నమోదు చేయకపోవడం, ఖాతాలు అందించేందుకు ఇచ్చిన గడువు ముగియక ముందే ఆన్లైన్లో మార్పులకు అవకాశం లేకుండా మూసివేయడం కారణంగా రైతు భరోసా సొమ్మును పొందలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు ఖాతాలను మార్చుకునేందుకు రైతులకు ఇచ్చిన గడువు కంటే ముందే ట్రెజరీలకు రైతుల పాత అకౌంట్లను వ్యవసాయ శాఖ అందజేయడంతో రైతు భరోసా పొందే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి సమస్యలను పరిష్కారం అయ్యేందుకు వీలుగా ఖాతాలను మార్చుకునే అవకాశం కల్పించాలనే విన్నపం రైతుల వైపు నుంచి వస్తోంది. -
అవినీతి రహితంగా పనిచేయండి
నారాయణఖేడ్: పార్టీలకతీతంగా, అవినీతి రహితంగా ప్రజలకు సేవలు అందించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు సూచించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్తుశాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి అధికారులు రైతుల వద్ద డబ్బులు తీసుకుని డీడీలు చెల్లించడం ఏమిటని, రైతులే నేరుగా బ్యాంకుల్లో చెల్లిస్తారు కదా అని ప్రశ్నించారు. విద్యుత్ కాంట్రాక్టర్ల ఇళ్ల వద్ద విద్యుత్ సామగ్రి డంప్లు ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయంలోనే సామగ్రి ఉంచి ఏడీఈ బాధ్యతగా రైతులకు అందించాలని ఆదేశించారు. డీడీలు కట్టిన రైతులకు కొన్ని స్తంభాలు వైర్లు ఇచ్చి ట్రాక్టర్లు మిగితావి అమ్ముకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇకనుంచి అలాంటివి జరగకుండా చూడాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు తాగునీరు, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సమీక్షలో విద్యుత్శాఖ ఎస్ఈ సుధీర్ కుమార్, డీఈ శ్రీనివాసులు, ఏడీఈ నాగిరెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ ఫణివర్మ, ఆయాశాఖల ఏఈలు పాల్గొన్నారు.ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
13 నుంచి ‘అరైవ్– అలైవ్’
మెదక్ కలెక్టరేట్: 13 నుంచి ‘అరైవ్– అలైవ్’ వీక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ శివధర్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ శ్రీనివాసరావు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 13న గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు విభిన్న పంటలను సాగుచేసి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. రైతులను పామాయిల్ పంటల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం మెదక్ పట్టణంలో రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం అన్నా రు. ఎయిడ్స్ ఒక నివారించలేని వ్యాధి అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టవచ్చని తెలిపారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
అంగన్వాడీ టీచర్పై దాడి ఘటనలో విచారణ
● తీవ్రంగా పరిగణించిన అధికారులు ● టీచర్ ప్రమేయం లేకపోయినా అన్యాయంగా దాడి చేసినట్లు నిర్ధారణ కంగ్టి(నారాయణఖేడ్): ఖేడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కంగ్టి సెక్టార్ రాసోల్ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ వసంతకుమారిపై గ్రామస్తుల దాడి ఘటనపై జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి ఆదేశాల మేరకు గురువారం సీడీపీఓ సుజాత, సూపర్వైజర్ సుజాత ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనతో టీచర్కు ప్రత్యక్ష సంబంధంలేదని తేలింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు దాడికి పాల్పడిన వారిపై కంగ్టి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అన్యాయంగా టీచర్పై దాడి చేసినట్లు అధికారులు నిర్ధారించి ఉన్నతాధికారులకు విచారణ నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులపై, మహిళలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి మండలంలోని రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్పై దాడిచేసిన ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖేడ్ నియోజక వర్గం అధ్యక్షుడు బొజ్జి రమేశ్, కోశాధికారి చంద్రకాంత్, కంగ్టి అధ్యక్షులు వెంకట్రావు, పీఆర్ఓ సుదర్శన్రావు, సభ్యులు రాఘవేందర్రావు సీఐ వెంకట్రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. -
నడక.. నరకమే!
● యథేచ్ఛగా ఫుట్పాత్ల ఆక్రమణ ● పాదచారులకు తప్పని తిప్పలు ● పట్టించుకోని పాలకవర్గం, అధికారులుమెదక్ కలెక్టరేట్: అసలే ఇరుకు రోడ్లు.. ఆపై ఉన్న కొద్దిపాటి ఫుట్పాత్లు యథేచ్ఛగా ఆక్రమణకు గురికావడంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నా, అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. కొందరు తాత్కాలికంగా వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరికొందరు పర్మనెంట్గా నిర్మాణాలు చేసుకొని వినియోగించుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా, ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం మెదక్ పట్టణంలో రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ఒకవైపు నుంచే వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది. ఫలితంగా పాదచారులు రోడ్డు వెంట నడవాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా ఆక్రమణల నుంచి ఫుట్పాత్లను రక్షించి పాదచారులకు దారి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
కేసీఆర్ చొరవ.. రైతులకు ఊరట
ములుగు(గజ్వేల్): ఎండిపోతున్న పంట పొలాల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్న రైతుల విజ్ఞప్తిపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కొండపోచమ్మ కాలువ ద్వారా కర్కపట్ల, కొట్యాల, అల్లీనగర్, అడవిమజీద్, నర్సంపల్లి, క్షీరసాగర్, జప్తిసింగాయిపల్లి గ్రామాలకు నీటిని విడుదల చేసి సంరక్షించాలని ఇరిగేషన్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి గురువారం రైతుల వేదనను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే ఆయన చొరవ తీసుకుని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఈ అంజలి, ఎఈ లు మాజీ డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డితో కలిసి సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువను పరిశీలించారు. శుక్రవారం ఆయా గ్రామాల పంట పొలాలకు సాగునీరందేలా నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నట్లు అంజిరెడ్డి తెలిపారు. సాగు నీటి విడుదలకు కేసీఆర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించడంపై ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎండుతున్న పంటల సంరక్షణకు ఆదేశం -
రైతులకు నాణ్యమైన విద్యుత్
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి, ఏఈ సాయికుమార్ మండలంలోని వెంకట్రావుపేట, రాజిపేట సబ్స్టేషన్లను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద లో ఓల్టేజీ కారణాలను పరిశీలించి ఎంఆర్టీంను పిలిపించి సరిచేశామన్నారు. రైతులు సమస్యలు ఏర్పడితే చెప్పాలన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లైన్మెన్లు మహేశ్, పోచయ్య, ఎంఆర్టీ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు వారి పబ్లిక్ స్కూల్
సర్కారు బడుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) పేరుతో నియోజకవర్గానికో పాఠశాలను ఎంపిక చేయనుంది. నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఒకే చోట బోధన అందిస్తూ కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తేనుంది. – మెదక్జోన్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గానికొకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఇందులో భాగంగా మెదక్కు సంబంధించి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. అలాగే నర్సాపూర్కు సంబంధించి మూడు పాఠశాలల పేర్లను విద్యాశాఖ డైరెక్టర్కు పంపినట్లు సమాచారం. వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయనున్నారు. ఎంపికై న స్కూల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కొనసాగనుంది. సుమారు 1,500 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అంతే కాకుండా దాని పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అయితే వాటిని రద్దు చేసి అందులోని విద్యార్థులను ఈ టీపీఎస్లోకి పంపిచనున్నట్లు తెలిసింది. మెదక్, నర్సాపూర్లో ఏర్పాటు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకేచోట వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కార్పొరేట్కు దీటుగా..టీపీఎస్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అణుగుణంగా తీర్చిదిద్దనున్నారు. ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా ప్రభుత్వం బస్సులను ఆయా గ్రామాలకు పంపించి ఉదయం పిల్లలను బడికి తీసుకొస్తుంది. పాఠశాల ముగిశాక మళ్లీ వారి ఇంటి వద్ద వదిలిపెట్టనున్నారు. అలాగే ఈ పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉంటారు. తరగతి గదులు సరిపోకపోతే, అదనపు గదులను నిర్మించనున్నారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్, పాలు, లేదా రాగిజావ, మధ్యాహ్నం భోజనం, స్పోర్ట్స్ కోసం పీఈటీ, పీడీల నియామకం, పారిశుద్ధ్యం, తాగునీరు, అన్ని రకాల వసతులు కల్పించనున్నారు. ప్రైవేట్ బడులకు ధీటుగా బోధన ఉంటుందని, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ బడుల్లోకి పిల్లలను పంపే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టీపీఎస్ పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను భట్టి భవిష్యత్తులో ప్రతి మండలానికి ఒకటి, రెండు టీపీఎస్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కార్పొరేట్ పాఠశాలలు తలదన్నే విధంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిసింది. -
విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యమని ఎస్టీ గురుకులాల ఆర్సీఓ గంగారామ్నాయక్ అన్నారు. బుధవారం కౌడిపల్లిలోని ఎస్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. గత కొన్నిరోజులుగా గురు కులంలో చోటుచేసుకున్న సంఘటనలపై రీజనల్ లెవల్ సీనియర్ ప్రిన్సిపాల్స్ సుమతి, అమర్సింగ్, లలితాదేవితో కమిటీ వేయగా, విచారణ జరిపినట్లు చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకగా విద్యార్థులను రెచ్చగొడుతున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది విద్యార్థుల్లో సైతం క్రమశిక్షణ లోపించిందని, వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి గాడిలో పెడతామన్నారు. విద్యార్థులు చేసిన నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఎవరూ గురుకులంలోనికి ప్రవేశించవద్దని, ఆలా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ధాన్యం కొనుగోలుకు
యాసంగి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందుకు గాను 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతుల అవసరాలు, విత్తన కంపెనీలకు పోనూ 4 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. – మెదక్జోన్ టార్పాలిన్లు, యంత్రాలు సిద్ధం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాలు వస్తువులు రైతులకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీల వద్ద 13,307 టార్పాలిన్లు అందుబాటులో ఉండగా, మరో 2 వేలు తెప్పించనున్నారు. ప్రస్తుతం 319 మ్యాచర్ మిషన్లు అందుబాటులో ఉండగా, మరో 325, కాంటాలు 403 ఉండగా, మరో 265 తెప్పించనున్నారు. అలాగే ప్యాడీ క్లీనర్లతో పాటు ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సరిపడా టార్పాలిన్లతో పాటు అన్నిరకాల వస్తువులను అందుబాటులో ఉంచుతాం. కాగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలి. – జగదీశ్వర్, జిల్లా సివిల్ సప్లై అధికారి జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 3,03,253 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 2,52,777 ఎకరాలు దొడ్డు రకం కాగా, 50,476 సన్న రకం పంట వేశారు. ఈ లెక్కన సన్న ధాన్యం 1.11 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 6.31 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 7.42 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, ఇందులో రైతుల అవసరాలు, విత్తన కంపెనీలకు 2.97 లక్షల మెట్రిక్ టన్నులు పోనూ 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా. ఇందుకోసం 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 418 సెంటర్ల ద్వారా దొడ్డురకం, 100 కేంద్రాల ద్వారా సన్నాలు సేకరించనున్నారు. ఇందులో 328 కేంద్రాలను సహకార సంఘాలు, 190 ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. ఇందుకు కోటి గన్నీ బస్తాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 60 లక్షలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరో 40 లక్షల బస్తాలను తెప్పిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా సీఎంఆర్ కోసం పేర్లు ఇవ్వాలని అధికారులు ఇప్పటికే మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను అడిగినట్లు తెలిసింది. మరాడించే మిల్లులకు సంబంధించి పేర్లు ఇప్పటికీ ఇవ్వలేదని తెలిసింది.రేపటి నుంచి కేంద్రాలు ప్రారంభం జిల్లాలో 3.3 లక్షల ఎకరాల్లో వరి సాగు 4.45 లక్షల మెట్రిక్ టన్నులదిగుబడి అంచనా -
నిధుల బదలాయింపు జరిగేనా!
దేవుడు వరమిచ్చినా గుడిలో పూజారి కరుణించని చందంగా తయారైంది గ్రామాల్లో సీసీ రోడ్ల పరిస్థితి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సకాలంలో సంబంధింత అధికారులు వినియోగించుకోలేకపోవడంతో మంజూరైన నిధులను వచ్చే ఆర్థిక ఏడాదికి బదలాయిస్తారా? లేక వెనక్కి వెళ్లిపోతాయా అనే అంశంపై అయోమయం నెలకొంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు గత ఆర్థిక ఏడాది 2025–26లో ఉపాధి హామీ పథకం కింద రూ.34.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో 509 సీసీ రోడ్లను నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ నిర్ణయించింది. కానీ వివిధ కారణాలతో ఇందులో 68 సీసీ రోడ్లు మాత్రమే నిర్ణీత గడువులోగా పూర్తి చేయగలిగారు. పూర్తి చేసిన ఈ సీసీ రోడ్ల అంచనా వ్యయం రూ.2.90 కోట్లు మాత్రమే. మిగిలిన 441 సీసీ రోడ్లకు సంబంధించిన రూ.31.20 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లా అభివృద్ధి కోసం మంజూరైన నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు.. ఈ సీసీ రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. మంత్రి దామోదర రాజనర్సింహ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో రూ.8.68 కోట్ల అంచనా వ్యయంతో 115 సీసీ రోడ్లను ప్రతిపాదించారు. ఎంపీ సురేశ్షెట్కార్ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 35 సీసీ రోడ్లకు రూ.1.75 కోట్లు, జహీరాబాద్లో 83 సీసీ రోడ్లకు రూ.6.22 కోట్లు ప్రతిపాదించారు. ఎంపీ రఘునందన్రావు సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో 21 సీసీ రోడ్లకు రూ.2.10 కోట్లు ప్రతిపాదించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 29 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి రూ.32 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రూ.2 కోట్లు, సెట్విన్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గిరిధర్రెడ్డి జహీరాబాద్లో రూ.2 కోట్లు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి రూ.71 సీసీ రోడ్లకు రూ.4.కోట్ల మేరకు ప్రతిపాదనలు ఇచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హత్నూర మండలంలో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి రూ.40 లక్షలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, మదన్రెడ్డి 24 సీసీ రోడ్లకు రూ.1.25 కోట్ల పనులను ప్రతిపాదించారు. అయితే మొత్తం రూ.34.10 కోట్ల పనులకు గాను ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి రూ.2.90 కోట్లకు మాత్రమే పనులు పూర్తి చేయగలిగారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనుల్లో రూ.31.20 కోట్ల నిధులను సకాలంలో వినియోగించుకోలేకపోవడం గమనార్హం. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరైన రూ.34.10 కోట్లు ఇప్పట్లో అవకాశం లేదు సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి గత ఆర్థిక ఏడాదిలో మంజూరై..పనులు ప్రారంభించని సీసీ రోడ్ల నిధుల విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అయితే మార్చ్ 31 లోపు వినియోగించుకోకపోవడంతో ఇప్పట్లో ఈ సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రారంభమై పూర్తయిన సీసీ రోడ్లకు మాత్రం బిల్లులు చెల్లింపు ఉంటుంది. – జగదీశ్వర్, పర్యవేక్షక ఇంజనీర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ -
సమస్యలుపరిష్కరించే వరకు సమ్మె
నర్సాపూర్: ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు స్వామి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నర్సాపూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఆర్టిజన్లతో కలిసి మాట్లాడారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట నాయకులు షాదుల్లా, సురేశ్, జనార్దన్, నర్సింగ్రావు, నాగరాజు, సందీప్రెడ్డి, మణికంఠరెడ్డి, సుజిత్, వినోద్, వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి చిలప్చెడ్(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం గ్రామంలో పలు ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికై న చిలప్చెడ్కు 56 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 5 నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని తెలిపారు. సరైన నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మిస్తేనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. ఆయన వెంట సర్పంచ్ జూల అనిల్, ఎంపీడీఓ ప్రశాంత్, ఎంపీఓ తిరుపతి ఉన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పాపన్నపేట(మెదక్): సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నార్సింగి సబ్స్టేషన్ పరిధిలో పను లు జరుగుతున్నాయని, గురువారం వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నర్సింలు తెలిపారు. నార్సింగి ఎక్స్ప్రెస్ ఫీడర్, అగ్రికల్చర్ ఫీడర్లకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. భూముల రీ సర్వేకు సహకరించండి నర్సాపూర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వేకు సహకరించాలని ఆర్డీఓ రామకృష్ణ కోరారు. ఈ విషయమై బుధవారం మండలంలోని ఎల్లాపూర్లో రైతులకు అవగాహన కల్పించారు. భూ సరిహద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు తదితర సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రీ భూ సర్వే చేపట్టిందన్నారు. సర్వే పూర్తయితే భూ వివాదాలు పూర్తిగా లేకుండా పోతాయని వివరించారు. కార్యక్రమంలో ఏడీ సర్వేయర్ రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, డీఐ రామ్రెడ్డి, డీటీ హేమలత, ఆర్ఐలు ప్రభాకర్రెడ్డి, సిద్దిరామిరెడ్డి, సర్వేయర్ అభిలాష్, ఉపసర్పంచ్ నరసింహగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక నంగునూరు(సిద్దిపేట): జాతీయ స్థాయి అండర్ 14 సాఫ్ట్బాల్ పోటీలకు గట్లమల్యాల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి బానోత్ అర్చన ఎంపికయ్యారు. మహబూబాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు తరుపున ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు హెచ్ఎం రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. జాతీయ జట్టుకు ఎంపికై న విద్యార్థిని సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, హస్టల్ వార్డెన్ మాధవి, ఉపాధ్యాయులు అభినందించారు. -
సరిపడా బస్సులు నడపండి
మెదక్ కలెక్టరేట్: మెదక్ నుంచి బొడ్మట్పల్లికి రాత్రి 7:15 గంటల బస్సును పునరుద్ధరించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. బుధవారం డిపోలో డీఎం సురేఖ ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రయాణికులు ఫోన్ ద్వారా వారి సమస్యలను డీఎంకు వివరించారు. బొడ్మట్పల్లి నుంచి తిరిగివచ్చే సమయంలో ప్రయాణికులు ఏ మాత్రం ఉండటం లేదని, అందుకే ఆ సర్వీస్ను రద్దు చేసినట్లు డీఎం చెప్పారు. అదేవిధంగా జేబీఎస్ నుంచి రామాయపేటకు బస్సు నడిపించాలని, మెదక్ నుంచి కొడపాకకు అదనపు ట్రిప్పు వేయాలని పలువురు కోరారు. ప్రయాణికుల విజ్ఞప్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డీఎం సురేఖ తెలిపారు. -
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్రామాయంపేట(మెదక్): హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె రామాయంపేటలో కేజీబీవీ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. హాస్టల్లో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పెట్టే అహారం నాణ్యతగా ఉండాలని, వంటగది పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సోషల్ పాఠం బోధించి, వారి అనుమానాలు నివృత్తి చేశారు. పరీక్షల సమయంతో సమయానికి భోజనం చేయడంతో పాటు కంటి నిండా నిద్రపోవాలని సూచించారు. పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం దామరచెరువులో రేషన్ దుకాణాన్ని సందర్శించారు. ఆమె వెంట తహసీల్దార్ రజని, ఇతర అధికారులున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం మెదక్ కలెక్టరేట్: గర్భిణులు, బాలింతలకు అవసరమైన వైద్య పరీక్షలపై అవగాహన కల్పించడమే ‘సేఫ్ మదర్ డే’ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ప్రతి మాసింగ్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కలెక్టరేట్లో సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెల్త్ వీక్ ద్వారా ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రా మీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పి ంచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎంహెచ్ఓ శ్రీరాం, డీఎంఏ సూపరింటెండెంట్ సునీత, డీసీహెచ్ఎస్ శివదయాల్, గైకాలజిస్ట్ రాజేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
నేడు డయల్ యువర్ డీఎం
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం సురేఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 7842651592 నంబరుకు ఫోన్ చేసి ఆర్టీసీకి సంబంధించిన ఏమైనా సమస్యలు తెలియజేయాలని డీఎం తెలిపారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అసంపూర్తి పనులకు నిధులు మంజూరు ఎమ్మెల్యే సునీతారెడ్డి శివ్వంపేట(నర్సాపూర్): అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. మంగళవారం మండల నాయకులు హైదరాబాద్లో ఆమెను కలిశారు. ఈ సందర్భంగా చండీ గ్రామం వద్ద రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన విషయం ఎమ్మెల్యే దృష్టికి బీఆర్ఎస్ నాయకులు తెచ్చారు. అందుకు ఆమె స్పందిస్తూ తూప్రాన్ హైవే చండీ బస్టాండ్ నుంచి 1500 మీటర్ల అసంపూర్తి రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు అయినట్లు, అందుకు సంబంధించి పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట సర్పంచ్ అశోక్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, అంజిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు. పేదలకు మెరుగైన వైద్యంజెడ్పీ సీఈఓ ఎల్లయ్య అల్లాదుర్గం(మెదక్): పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని సందర్శించారు. జెడ్పీ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి, అనంతరం ఎంపీపీ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రోగులకు వైద్యంతో పాటు, మందులను అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ మల్లయ్య, ఎంపీఓ ప్రభకర్ , డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మస్తుగా నిధులు ప్రణాళికబద్ధంగా పనులు చేయండి డీపీఓ యాదయ్య యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): నిరుద్యోగ మైనారిటీ యువత విదేశీ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అఽధికారి నాగరాజమ్మ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ, శిక్షణ, ఉపాధి కార్యక్రమంలో భాగంగా మైనారిటీ నిరుద్యోగ యువతకు విదేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతర్, గ్రీస్లలో పురుషులకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జిల్లా మైనార్టీ సంక్షేమఽశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
భూభారతి.. పట్టా హారతి
నకిలీ పత్రాలు సృష్టించి నాలుగెకరాలు స్వాహాపట్టాదారు చనిపోయిన రెండేళ్లకు వెలుగులోకి.. ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ తప్పుదారి పట్టించారన్న తహసీల్దార్ ముగ్గురిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదుఅల్లాదుర్గం(మెదక్): మండల పరిధిలోని గడిపెద్దాపూర్కు చెందిన దిమ్మయ్యగారి మాణేమ్మకు గ్రామ శివారులో సర్వే నంబర్ 957/ఆ3లో 4.12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో బిజిలీపూర్కు చెందిన వ్యక్తులు కబ్జాలో ఉన్నారు. అయితే మాణెమ్మ 2023 అక్టోబర్లో చనిపోయారు. ఈమెకు భూమయ్య, ప్రభాకర్, సుధాకర్ కొడుకులు. వీరు ఫౌతికి దరఖాస్తు చేసుకోక పోవడంతో తల్లి పేరుపైనే పట్టా ఉంది. ఈ భూమిలో కబ్జా ఉన్న బిజిలీపూర్కు చెందిన కిష్టయ్య పేరుపై సాదాబైనామా ఉంది. తనకు సాదాబైనామా కింద పట్టా చేయాలని 2025లో కిష్టయ్య దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే.. సాదాబైనామాకు ఆధారాలు లేవని ఆర్ఐ సందీప్ అదే సంవత్సరం సెప్టెంబర్ 23న తిరస్కరించారు. తదనంతరం కిష్టయ్య సైతం మరణించాడు. ఇదే ఆర్ఐ 2026లో భూ భారతి కింద పంచానామా చేసి ‘వీరు పట్టాకు అర్హులు’అని మరో పంచనామాను ఆర్డీఓ కార్యాలయానికి పంపించి, సాదాబైనామా కింద పట్టా చేసేందుకు అనుమతి తీసుకున్నారు. సాదాబైనామా కిష్టయ్య పేరుంటే.. అదే గ్రామానికి చెందిన విఠల్ పేరిట నాలుగెకరాలను పట్టా చేశారు. ఈ విషయంలో ఆర్డీఓ కార్యాలయంలో సైతం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పినట్లు తెలిసింది. కాగా, విఠల్ తన పేరిట పట్టా కాగానే అదే గ్రామానికి చెందిన భూమమ్మ పేరుపై 12 గుంటలు, కోడళ్లు అమనిక, స్వప్న పేరిట చెరో 20 గుంటలు, కిరణ్ పేరిట ఎకరా భూమిని పట్టా మార్పిడి చేశారు. విఠల్ తన పేరిట రెండెకరాలు భూమి ఉంచుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో మాణెమ్మ కుటుంబ సభ్యులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తప్పుదారి పట్టించారు: తహసీల్దార్ ఆర్ఐ సందీప్, కంప్యూటర్ ఆపరేటర్ మల్లేశం, మరో వ్యక్తి కలిసి తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి తనను తప్పుదారి పట్టించి అక్రమంగా 4.12 ఎకరాలను పట్టా చేయించారని తహసీల్దార్ మల్లయ్య అల్లాదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ముగ్గురు వ్యక్తులు కలిసి రూ: 5లక్షలు తీసుకుని అక్రమ పట్టాకు సహకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్ఐ శంకర్ను వివరణ కోరగా.. తహసీల్దార్ ఫిర్యాదు చేసింది వాస్తవమేనని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.చేతులు మారిన రూ: 40 లక్షలు! అక్రమంగా పట్టా చేసిన 4.12 ఎకరాల భూమి విలువ సుమారు రూ: 2 కోట్లపైనే ఉంటుందని మార్కెట్ విలువను బట్టి తెలుస్తుంది. పట్టా మార్పిడిలో సుమారు రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమికి సంబంధించిన ఫైలును మాయం చేసినట్లు చెబుతున్నారు. కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, అవినీతికి పాల్పడిన వారి అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.భూభారతి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో జరిగిన అన్యాయాన్ని భూభారతితో సరిదిద్దుతామని, ఇది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఆచరణలో విఫలమవుతోంది. ఓ భూ యజమాని చనిపోయాక కుటుంబ సభ్యులకు ఫౌతి చేయకుండా.. ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వేరొకరికి నాలుగెకరాల భూమిని పట్టా చేశారు. ఈ సంఘటన అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
కలెక్టర్ ప్రతిమాసింగ్ హవేళిఘణాపూర్(మెదక్): ప్రతీ ఒక్కరు తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయమం చేయడంతో పాటు ప్రజలు శాసీ్త్రయ దృక్పథంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్ధన పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, రికార్డులు, వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యం అనేది కేవలం వ్యాధుల లేమి మాత్రమే కాకుండా శారీరక, మానసిక, సామాజిక సంక్షేమం కలిపిన సమగ్ర స్థితి అని తెలిపారు. అలాగే మానసిక ఆరోగ్యాన్ని సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా వంటి పద్ధతులను అనుసరించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వినోద, మండల వైద్యాధికారి వినయ్సుశీల్, సిబ్బంది కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఘనపూర్ ఆయకట్టుకు సింగూరు జలాలు
పాపన్నపేట(మెదక్): ఎండుతున్న పంటలను పరిరక్షించేందుకు సింగూరు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు వెంటనే 0.03 టీఎంసిల సాగు నీరు విడుదల చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడే నాటికే ఘనపూర్ ఆయకట్టు రైతులు, మంజీరా నదిపై ఆధార పడి సేద్యం చేసే రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం ఇవన్నీ పొట్ట దశలో ఉన్నాయి. సాగు నీరు విడుదల చేయక పోవడంతో పంటలు ఎండు ముఖం పట్టాయి, రైతులు చేసిన విజ్ఞప్తులు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, సర్పంచ్లు కాశినాథ్, బద్రి మల్లేశం, కొడుపాక, ఎంకెపల్లి, నాగ్సాన్పల్లి, గాజుల గూడెం, చిత్రియాల్ రైతులు మంగళవారం నాంపల్లిలోని మానవ హక్కుల సంఘం కార్యాలయానికి వెళ్లి సింగూరు నుంచి నీరు విడుదల చేసి పంటలను రక్షించాలని కోరారు. ఘనపురం ఆయకట్టుకు సింగూరు నుంచి వెంటనే 0.03 టీఎంసీల నీరు విడుదల చేయాలని హెచ్ఆర్సీ చైర్మన్ షమీం అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం -
ఇందిరమ్మ ఇళ్లకు ఇక్కట్లు
మెదక్జోన్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే వంటనూనెలు, పప్పుదినుసుల ధరలు మండుతుంటే.. తాజాగా స్టీలు, సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధిక భారం పడుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.27వేల పైచిలుకు భారం పడుతుంందని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా, వాటిలో 6 వేల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండు వేల ఇళ్లు పూర్తి కావస్తుండగా, మిగతా నాలుగు వేల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండున్నర టన్నుల స్టీలు, 200 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. పక్షం రోజుల క్రితం టన్ను స్టీలు ధర రూ.63 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.70 వేలకు చేరుకుంది. ఈ లెక్కన టన్నుకు రూ.7 వేలు పెరిగింది. దీంతో రెండున్నర టన్నులకు గానూ రూ.17,500 అదనపు భారం పడుతోంది. అలాగే సిమెంట్ బస్తా ధర 15 రోజుల క్రితం రూ.280 ఉండగా.. ప్రస్తుతం రూ.330కి చేరుకుంది. ఒక్కో బస్తాకు రూ.50 పెరిగింది. దీంతో పెరిగిన ధరతో సిమెంట్కు రూ.10 వేలు అదనపు భారం పడుతోంది. బిల్డర్లు, కాంట్రాక్టులు సైతం స్టీలు, సిమెంట్ ధరలు పెరగటంతో ప్రభుత్వ పనులను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు చేసే బిల్డర్లు, సైతం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో తాము, నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలవటం ఖాయమని ఆవేదన చెందుతున్నారు. కొందరైతే ధరలు తగ్గేంత వరకు పనులు చేయలేమని వాటిని నిలిపి వేస్తున్నారు.నాలుగు వేల ఇళ్లకు రూ.11.20 కోట్ల అదనం ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తుండగా.. లబ్ధిదారులు మరికొంత డబ్బులు కలిపి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. కానీ పెరిగిన స్టీలు, సిమెంట్ ధరలతో ఒక్కో ఇంటిపై రూ. 27,500 అదనపు భారం పడుతోంది. నాలుగువేల ఇళ్లకు ఏకంగా రూ.11.20 కోట్ల భారం అదనంగా పడనుంది. దీంతో పెరిగిన ధరలతో ఇళ్లు నిర్మించటం సాధ్యం కాదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. భారీగా పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలు టన్ను స్టీలుకు రూ.7వేలు, బస్తా సిమెంట్పై రూ.50 పెరుగుదల ఒక్కో ఇంటిపై రూ.27వేల పైచిలుకు అదనపు భారం లబోదిబోమంటున్న లబ్ధిదారులుపనులు చేయలేం స్టీలు, సిమెంట్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పనులు చేయలేం. ఇప్పటికే కుదుర్చుకున్న నిర్మాణాల్లో సైతం నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఇక కొత్తగా పనులు చేయలేం. – కిశోర్, బిల్డర్, మెదక్ -
తెలంగాణ చైతన్యానికి స్ఫూర్తి సిద్దిపేట
నందిని సిధారెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఎంతోమంది గొప్ప వ్యక్తులను, ఉద్యమ నాయకులను, గాయకులను, కళాకారులను అందించిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు కాపురాజయ్య, వేముగంటి నరసింహాచార్యులు రెండు కళ్లలాంటి వారిని అందించి తెలంగాణ చైతన్యానికి సిద్దిపేట మూలకందంగా నిలిచి నేటి యువతకు ప్రేరణగా నిలిచిందన్నారు. యవతరం పరిశోధానసక్తిని పెంపొందించుకుని జిల్లా కళలు, సంస్కృతి, చరిత్రను పరిరక్షించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డు పొంది సిధారెడ్డి సిద్దిపేటకు వన్నె తెచ్చారని కొనియాడారు. -
దూషించిన టీచర్ను దండించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులను కొట్టి, దూషించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, అతన్ని సస్పెండ్ చేసేవరకు పరీక్ష రాయమని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్టీ గురుకుల పాఠశాల జాతీయ రహదారి పక్కన ఉంది. గత వారం గురుకుల పాఠశాలలో డౌట్లు అడిగిన విద్యార్థులను ఉపాధ్యాయుడు ఉదయ్ కొట్టడంతోపాటు దూషించారు. ఈ విషయం అధికారులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విద్యార్థులు ఆరోపించారు. భోజనం సైతం నాణ్యతగా లేదన్నారు. గురుకులంలో వసతులు సరిగా లేవన్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాయమన్నారు. విద్యార్థులను ఇన్చార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నచ్చజెప్పినా వినలేదు. ఏఎస్ఐ మల్లేశం అక్కడికి చేరుకుని విద్యార్థులను సర్దిచెప్పారు. సమస్య పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. దీంతో విద్యార్థులు ధర్నా విరమించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళ్లారు. అనంతరం పాఠశాలలో డీఈఓ విజయ గురుకులంలో విచారణ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అప్పటి వరకు పరీక్ష రాయం ఎస్టీ గురుకుల విద్యార్థుల ధర్నా -
మెరుగైన వైద్య సేవలు
చేగుంట(తూప్రాన్): ప్రభుత్వ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం పేర్కొన్నారు. మంగళవారం చేగుంట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. బీపీ, షుగర్తో పాటు రక్త పరీక్షలు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. టీబీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులను అందజేస్తున్నట్లు డాక్టర్ శ్రీరాం తెలిపారు. వైద్య శిబిరంలో 90 మందికి వైద్య పరీక్షలు, 40 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ అనీల్కుమార్, డాక్టర్ మృదుల, నాయకులు సతీష్, ఉపసర్పంచ్ రఫీ పాల్గొన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి: డీసీఎస్ఓ కౌడిపల్లి(నర్సాపూర్): ప్రజలు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని డీసీఎస్ఓ నిత్యానందగౌడ్ తెలిపారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కౌడిపల్లిలో పీహెచ్సీలో ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావు, డాక్టర్ ఫెర్నాజ్, సీహెచ్ఓ ఎలిజబెత్రాణి పాల్గొన్నారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం -
రేషన్ పంపిణీపై ఆరా
రామాయంపేట(మెదక్): ‘ఊరూరా ప‘రేషన్’’ శీర్షికన ఈనెల ఆరున సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ నగేశ్ మంగళవారం స్థానిక పౌరసరఫరాల గోదాంను సందర్శించారు. స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన అన్ని రేషన్ షాపులకు బియ్యం స్టాక్ పంపించాలని ఆదేశించారు. రికార్డులు పరిశీలించిన ఆయన.. ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని రేషన్ దుకాణాలకు స్టాక్ పంపారని తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వరల్డ్ హెల్త్ డే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మనకు డబ్బు ముఖ్యం కాదని, సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యమన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలునిజాంపేట(మెదక్): ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన రెవెన్యూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, మూడు నెలల రేషన్ సరుకుల పంపిణీ, జనగణనపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన వార్డు సభ్యుల హెల్త్ క్యాంప్ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ వెంకట నర్సింహారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఆర్ఐ ప్రీతి, స్థానిక సర్పంచ్ నరేందర్ పాల్గొన్నారు.గోదాంను సందర్శించిన అదనపు కలెక్టర్ -
పంటలెండుతున్నా పట్టించుకోరా?
మెదక్ కలెక్టరేట్: పొట్టదశలో ఉన్న వరి పంటలు నీటి తడులు లేక ఎండిపోతున్నాయని, సింగూరు నుంచి నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టర్ ప్రతిమాసింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరి పొట్టదశలో ఉందని, నీరందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు అత్యవసరంగా 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. క్రాప్ హాలిడే ప్రకటించకముందే రైతులు పంటలు వేసుకున్నారని తెలిపారు. ఆలస్యంగా ప్రకటించడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతుల పంటలు ఎండిపోతున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లావణ్యరెడ్డి, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్): మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సూచించారు. సోమవారం రామాయంపేట మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏకై క కొనుగోలు కేంద్రం రామాయంపేటలోనే ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, నిజాంపేటలో కూడా కేంద్రం ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కౌన్సిలర్లు నాగరాజు, రవి, రంజిత్, సందీప్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాపు యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చింతల స్వామి, డీసీసీ ఉపాధ్యక్షుడు దేమె యాదగిరి, జిల్లా కార్యదర్శి పోచమ్మల గణేశ్, తహసీల్దార్ రజని, సహకార సంఘం సీఈఓ నర్సింలు, పలు గ్రామల సర్పంచ్లు పాల్గొన్నారు. -
‘పేట’ మాజీ మున్సిపల్ కమిషనర్ మృతి
రామాయంపేట(మెదక్): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామాయంపేట మాజీ మున్సిపల్ కమిషనర్ మామిడి దేవేందర్ ఆదివారం రాత్రి మృతి చెందారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు వరకు రామాయంపేట కమిషనర్గా పనిచేసిన ఆయన, అనారోగ్యంతో సెలవుపై వెళ్లిపోయారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ సంతాపం వ్యక్తం చేశారు. నర్సాపూర్: రెండు రోజుల పాటు మిషన్ భగీరథ తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ ప్రవీణ్కుమార్, ఏఈ సురేశ్ తెలిపారు. చెక్రియాల్ నుంచి వచ్చే మెయిన్ పైపులైన్కు లీకేజీ ఏర్పడిందని, మరమ్మతులు చేయించాల్సి ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం నుంచి నీటి పంపింగ్ నిలిచిపోతుందని వివరించారు. కాగా మంగళ, బుధవారం వరకు నీటి సరఫరా ఉండదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్థానికంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సకాలంలో లబ్ధిదారులకు అందించాలని మెదక్ ఆర్టీఓ రమాదేవి సూచించారు. సోమవారం పట్టణంలోని పలు రేషన్ దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని సకాలంలో అందించాలని డీలర్లకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డీలర్లపై, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు తదితరులు ఉన్నారు. మెదక్జోన్: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్రెడ్డి, సీనియర్ నేతలు సుభాశ్గౌడ్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, యువ మోర్చా అధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి హత్నూర(సంగారెడ్డి): దేశ అభివృద్ధి బీజేపీ పాలనలోనే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హత్నూర మండలం దేవులపల్లిలో పార్టీ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తున్నాయని చెప్పారు. బీజేపీ పాలనలోనే దేశం పురోగతి సాధించిందన్నారు. గ్రామాలకు కూడా పార్టీ విస్తరిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్, నాయకులు మల్లారెడ్డి, మహేష్, మల్లేశం, నాగరాజుగౌడ్, పాండు, ఇంద్రసేనారెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నా రు. సోమవారం సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోక్సో, మహి ళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామన్నారు. లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వారి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. -
10 నుంచి ధాన్యం కొనుగోళ్లు
● జిల్లావ్యాప్తంగా 518 కేంద్రాల ఏర్పాటు ● అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: ఈనెల 10 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 518 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, తూకం, టార్పాలిన్ కవర్లు, మొదలైన సామగ్రి అందుబాటులో ఉండాలన్నారు. రైస్ మిల్లుల యజమానులు హమాలీలను, రవాణా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్లోడింగ్ ప్రక్రియ త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైస్మిల్లర్లకు సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ను త్వరగా పూర్తి చేయాలన్నారు. తూనికలు, కొలతల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో ధాన్యం తూకం కొలతలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి నిత్యానంద్, డీఎం జగదీష్, జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారం చూపండి
● కలెక్టర్ ప్రతిమాసింగ్ ● ప్రజావాణికి 98 వినతులు మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చిన వినతులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్లో ఉంచకూడదన్నారు. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలను అర్జీదారుడికి లిఖితపూర్వక వివ రణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి 98 వినతులు స్వీకరించారు. అనంతరం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 99 రోజుల కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ యూ నస్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
● నేను చేసిన పనులఆధారాలు చూపుతా.. ● మీరేం చేశారో ఎమ్మెల్యే చెప్పాలి ● మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్: రెండున్నరేళ్లలో ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, ఏ ఒక్క రోడ్డు పనులు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన పనులకు ఆధారాలు ను చూపుతామని, దమ్ముంటే ఎమ్మెల్యే చూపాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా ఏడేళ్లలో రూ.350 కోట్లతో మండల కేంద్రాలకు, గ్రామాలకు రోడ్లు వేయించానని గుర్తు చేశారు. రెండు జాతీయ రహదారుల విస్తరణకు రూ.900 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. తాను మంజూరు చేసిన ఇతర పలు పనులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రద్దు చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపాదనలే తప్ప పనులు లేవన్నారు. హ్యామ్ కింద చేపట్టే రోడ్లకు ముందుగానే కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇవ్వడం కమీషన్ల కోసమేనని ఆరోపించారు. రూ.800 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా తాము ఇంటింటికీ తాగునీటిని అందిస్తే నిర్వహణ చేతగాక పథకం ఫెయిల్యూర్ అంటున్నారని విమర్శించారు. ఖేడ్, మనూరు మండలాల పార్టీ అధ్యక్షులు పరమేష్, విఠల్రావు, పట్టణ అధ్యక్షులు నగేష్, సర్పంచ్లు వెంకటేశం సిద్దు, నాయకులు సంగప్ప, మల్గొండ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బంద్.. గజ్వేల్లో ఉద్రిక్తత..
గజ్వేల్ బంద్ అప్డేట్స్..గజ్వేల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.కాగా, గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నేడు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఇక, రెండ్రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాము సీఎం ఫోటో పెట్టడానికే వెళ్ళాం.. దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకుల వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి సహా 42 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
జగ్జీవన్రామ్ సేవలు మరువలేనివి
కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్: దేశం కోసం బాబు జగ్జీవన్రామ్ చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో నిర్వహించిన జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మహానేత అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగా లు, సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, ఉత్సవ కమిటీ చైర్మన్ సంజీవ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పారదర్శకంగా బియ్యం పంపిణీ మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ నిర్వాహకులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని పలు రేషన్ దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. బియ్యం లబ్ధిదారులకు చేరేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. -
మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆల యం ఆదివారం భక్తులరాకతో సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మా ర్మోగాయి. శనివారమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు వేకువజామున నిద్ర లేచి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించుకున్న సైబరాబాద్ ఏసీపీ కొమురవెల్లి మల్లన్నను సైబరాబాద్ ఏసీపీ శ్రీనివాస్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాన్ని అందించారు. -
శాంతిభద్రతలు క్షీణించాయి
ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రదే శాలపై దాడులు జరగడం సరికాదన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికే రక్షణ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. -
ఊరూరా పరేషన్!
● ఇబ్బంది పడుతున్న డీలర్లు, వినియోగదారులు ● ఇంకా 90 షాపులకు చేరని స్టాక్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యంకేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. దీంతో వినియోగదారులతో పాటు డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లో వేలిముద్ర పెట్టి బియ్యం తీసుకునే ప్రక్రియ గతంలో రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే పూర్తికాగా, ప్రస్తుతం మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. అలాగే మూడు సార్లు బియ్యం తూకం వేయడం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పలు దుకాణాలకు మొదటి విడతగా పంపిణీ చేసిన బియ్యం స్టాక్ పూర్తి కావొచ్చింది. ఇదిలా ఉండగా ఇంకా 90 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాకపోవడం గమనార్హం. – రామాయంపేట(మెదక్) జిల్లావ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచే సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ దుకాణాల్లో మూడు నెలల కోటా బియ్యం స్టాక్ చేయడానికి తగినంతగా స్థలం లేకపోడంతో ఒకేసారి బియ్యం పంపిణీ చేయకుండా విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. మొదటి విడతగా 430 దుకాణాలకు 50 శాతం స్టాక్ 7,600 మెట్రిక్ టన్నుల మేర బియ్యం సరఫరా చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో రేషన్ షాపుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఈనెల 15లోగా అన్ని రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీ పూర్తవుతుందని, నెలాఖరువరకు డీలర్లు వినియోగదారులకు మూడు కోటాల బియ్యం పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాతో మండలస్థాయిలో ఉన్న గోదాముల్లో బియ్యం స్టాక్ నిండుకుంది. ఈ– పాస్ మొరాయింపు గంటల తరబడి నిరీక్షించే ఓపికలేక లబ్ధిదారులు డీలర్లతో గొడవకు దిగుతున్నారు. కొందరి వేలిముద్రలు సరిగా పడకపోవడం సమస్యగా మారుతోంది. రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునే వారిలో 70 శాతానికి పైగా వృద్ధులు, కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వారు ఉండటంతో వారి వేలిముద్రలను ఈ–పాస్ యంత్రం సరిపోల్చడం లేదు. దీనికి తోడు మారుమూల గ్రామాలు, కొన్ని గిరిజన తండాల్లో నెట్వర్క్ సమస్యతో ఈ–పాస్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదు. జిల్లాలో ఇలా ..రేషన్ దుకాణాలు 520 రేషన్ కార్డులు 2,16,716 బియ్యం కోటా 15 వేల ఎం.టీ నెలాఖరు వరకు పంపిణీ ఈనెల 15లోగా జిల్లా పరిధిలోని అన్ని రేషన్ దుకాణాలకు రేషన్ పంపిణీ పూర్తవుతుంది. ఇప్పటికే 430 దుకాణాలకు 50 శాతం మేర బియ్యం పంపిణీ చేశాం. ఈనెలాఖరులోగా వినియోగదారులకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. – జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
పనులు త్వరగా పూర్తి చేయండి
పీసీసీఎఫ్ రత్నాకర్ రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్నపేట అటవీప్రాంతంలో నిర్మిస్తున్న నగర వన యోజన పార్కు నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) రత్నాకర్, చీఫ్ కన్జర్వేటర్ అధికారిణి అపర్ణ పరిశీలించారు. పార్క్లో కొనసాగుతున్న వాచ్టవర్, పగోడ, వన మూలికల మొక్కలు, ఇతర నిర్మాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నెలలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సఫారి నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి మ్యాపును చూశారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి జోజితో కలిసి వాచ్టవర్ పైకి ఎక్కి అటవీ అందాలను వీక్షించారు. వారి వెంట రేంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారులు శ్రీనివాస్, గీత, బీట్ అధికారి లక్ష్మణ్ ఉన్నారు. -
కేసీఆర్తో రేవంత్కు పోలికా!
దుబ్బాక: కేసీఆర్ లేకుంటే రాష్ట్రం వచ్చేదా.. రేవంత్రెడ్డి సీఎం అయ్యేవారా .. అసలు కేసీఆర్తో రేవంత్కు పోలికే లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు అరాచకాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. గజ్వేల్లో క్యాంపు కార్యాలయంపై దాడిచేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులను సుందరంగా తీర్చిదిద్దాలి చెరువులను సందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చెరువుల సందరీకరణపై ఐఓసీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను వీక్షించారు. అమృత్ పథకంలో దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు, రామసముద్రం, ఏదుల్ల చెరువుల సుందరీకరణకు రూ.5 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. నిధులతో చెరువులను సుందరంగా తీర్చి దిద్ది, పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
చిల్లర చేష్టలు సహించం
● చర్యకు ప్రతి చర్యకు తప్పదు ● మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి గజ్వేల్: స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైనే కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం సహించరానిదని, ఇప్పటికై నా చిల్లర చేష్టలను మానుకోకపోతే చర్యకు ప్రతి చర్య తప్పదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను తిరిగి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇది మింగుడు పడక కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా గుండాయిజం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు చేతనైతే..అభివృద్ధిలో పోటీ పడాలని డిమాండ్ చేశారు. వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా రాహుల్గాంధీ తన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను పెట్టుకోగలరా? అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో సీఎం ఫొటో పెట్టుకోవాలని జీఓ ఉందా? అని అన్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా గజ్వేల్లో సోమవారం తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, నాయకులు ఊడెం కృష్ణారెడ్డి, నూనె కుమార్, రాంచంద్రం, పాండుగౌడ్, ఆహ్మద్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. -
‘రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి’
మెదక్జోన్: శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో రాత్రి 11 గంటలలోపు డివిజన్ పరిధిలోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేయాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాత్రి 11 గంటల అనంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్మేళా నర్సాపూర్: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, అందులో భాగంగానే జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన జాబ్మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుందన్నారు. 200 మందికి ఉద్యోగ అవకాశం లభించిందని, మరో 150 మందికి త్వరలో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ప్యాక్స్ మాజీ చైర్మన్ రాజుయాదవ్, నవీన్గుప్తా, తరుణ్, సందీప్, మణిదీప్, హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయండి మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పాపన్నపేట(మెదక్): విశ్వ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఖాళీలు భర్తీ చేయకుండా కేవలం అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకురావడం శోచనీయమన్నా రు. మేనిఫెస్టోలో విద్య, వైద్యానికి ప్రాఽ దాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, తీరా బడ్జెట్ కేటాయింపుల్లో అది కనిపించడం లేదన్నారు. యూనివర్సిటీల్లో 72 శాతం ఖాళీ లు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం నర్సాపూర్రూరల్: ‘నీట్’ శిక్షణ కోసం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చిప్పల్తుర్తి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్వేత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏడాది ఇంటర్మీడియెట్ నీట్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మే 3న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. పేట నియోజకవర్గ పునరుద్ధరణకు కృషి చేయండి రామాయంపేట(మెదక్): రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం పునరుద్ధరించేలా కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య ఎంపీ రఘునందన్రావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె పలువురు కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ఎంపీని హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రామాయంపేట నియోజవర్గ కేంద్రంగా ఏర్పాటైతేనే అభివృద్ది సాధ్యపడుతుందని, ఈదిశగా కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన వంతు ప్రయత్నం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఆమె వెంట కౌ న్సిలర్లు నాగరాజు, రవి, రంజిత్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చింతల స్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యాదగిరి, నాయకులు దేమె యాదగిరి, గణేశ్, డాకి స్వామి, బైరం కుమార్, సాయితేజ, సుధీర్గౌడ్ ఉన్నారు. -
ఎట్టకేలకు..
ఈజీఎస్ మెటీరియల్నిధులు సద్వినియోగం ● 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.45 కోట్లు మంజూరు ● కొనసాగుతున్న నిర్మాణ పనులుమెదక్జోన్: ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా ఏటా ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు మంజూరైన మెటీరియల్ పనులను సంవత్సరం ముగిసే ముందు హడావుడిగా ప్రారంభించి నిధులను సద్వినియోగం చేస్తున్నారు. కానీ ఏడాది పాటు సమయం ఉన్నా, వాటిని ఏ రకమైన అభివృద్ధికి ఉపయోగించాలని ఆలోచించకుండా, గడువు ముంచుకు రాగానే పనులను ప్రారంభించి నిధులు నిలిచినట్టే అన్న విధంగా చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి ఏటా కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ కింద మెటీరియల్ పనుల కోసం కొన్ని నిధులు ఇస్తోంది. వాటిని మార్చి 31 వరకు పనులు ప్రారంభించాలి. లేనిచో అవి రద్దవుతాయి. అందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా అభివృద్ధి కోసం రూ. 45 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది మాసాల్లో కేవలం రూ.11 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే ప్రారంభించారు. గడువు ముంచుకు రాగానే జనవరి నుంచి మార్చి వరకు మూడు మాసాల్లో మిగిలిన రూ. 33 కోట్లకు సంబంధించిన పనులను ప్రారంభించారు. రూ.45 కోట్లు.. 496 పనులు ఉపాధి పథకంలో ఈ ఏడాది 496 మెటీరియల్ పనులకు గానూ రూ. 45 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 106 పనులు పాఠశాలల ప్రహరీలు, 130 మహిళా భవనాలు, 17 అంగన్వాడీ, 41 పంచాయతీ, 202 సీసీ రోడ్ల నిర్మాణాలతో మొత్తం 496 పనుల కోసం రూ.45 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో పంచాయతీ భవనాల్లో ఇప్పటివరకు 17 పూర్తి కాగా, ఇంకా 24 వివిధ దశల నిర్మాణాల్లో ఉన్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక గ్రూపులు 13,257 ఉండగా, వాటిలో 1.37 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరికి అనేక గ్రామాల్లో కనీసం సమావేశాలు నిర్వహించుకునేందుకు సొంత భవనాలు లేవు. కాగా 130 గ్రామాల్లో మహిళా భవనాలు మంజూరు కాగా, నిర్మాణాలు సాగుతున్నాయి. అలాగే జిల్లాలో 2014కు ముందు 420 గ్రామాలు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 500 గిరిజన తండాలు, మధిర గ్రామాలను కలిపి కొత్తగా 72 పంచాయతీలు ఏర్పాటు చేసింది. కాగా ఈజీఎస్లో 41 జీపీ భవనాలకు నిధులు మంజూరు కాగా, నిర్మాణ పనులు సాగుతున్నాయి. ముమ్మరంగా పనులు ఈజీఎస్ పథకంలో జిల్లాకు రూ.45 కోట్లు మంజూరు కాగా, వివిధ శాఖల పరిధిలో పనులను గుర్తించి ప్రారంభించాం. మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేశాం. సకాలంలో పనులు పూర్తి చేసి ఆయాశాఖల అధికారులకు అప్పగిస్తాం. – నర్సింలు, మెదక్ ఈఈ పీఆర్ -
7న ఇసుక వేలం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని గాంధారిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను ఈనెల 7న నిర్వహించే బహిరంగా వేలం ద్వారా విక్రయించనున్నట్లు తహసీల్దార్ సతీశ్ తెలిపారు. గ్రామ శివారులో 34 ట్రిప్పుల ఇసుక, సుమారు 102 క్యూబిక్ మీటర్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఏడీ మైనింగ్ సూచనల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు రూ.10 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఒక వేల 34 ట్రిప్పుల కన్నా ఎక్కువ ఇసుక ఉంటే దానికి సంబంధించి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. గిరి ప్రదక్షిణం.. ఆధ్యాత్మిక పరిమళంవర్గల్(గజ్వేల్): నాచగిరి భక్తులతో పోటెత్తింది. శ్రీలక్ష్మీనృసింహుని జన్మనక్షత్రం ‘స్వాతి’ నక్షత్ర మహోత్సవ వేళ శనివారం అశేష భక్తజన ‘గిరి’ ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గిరి ప్రదక్షిణ సంరంభం ఆద్యంతం ‘గోవింద’ నామంతో మార్మోగింది. హరి నామస్మరణతో మునిగితేలుతూ భక్తజనులు ప్రదక్షిణ పూర్తిచేశారు. -
నెలాఖరు వరకు రేషన్ పంపిణీ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం తీరును డీఎస్ఓ నిత్యానంద్ శనివారం పరిశీలించారు. మొత్తం 520 రేషన్ దుకాణాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఈనెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారులు ఆందోళన లేకుండా సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకోవాలని సూచించారు. డీలర్లు అక్రమాలకు పాల్ప డకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పట్టణంలోని పలు పెట్రోల్ బంక్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లను సీజ్ చేశామన్నారు. 83 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గ్యాస్ విషయంలో సమస్యలు ఎదురైతే 9391942254 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బ్యాంకులు, 16 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.డీఎస్ఓ నిత్యానంద్ -
బ్లాక్ బూట్లు
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ట్రాక్ సూట్లు..గురుకుల విద్యార్థులకు ‘ఎడ్యుకేషన్ కిట్లు’జిల్లాలో 84 వేలమందికి ప్రయోజనం ఈవీఎంల భద్రత కీలకం కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటానికి ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీలలో భాగంగా శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎంల గోదాంను సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, డబుల్ లాక్ సిస్టమ్ వంటి అంశాలను పరిశీలించారు. గోదాం వద్ద నియమించిన భద్రతా సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 6 నుంచి హెల్త్ వీక్ కార్యక్రమం ఈనెల 6 నుంచి 11 వరకు నిర్వహించే హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వారితో సమావేశం నిర్వహించారు. ఎయిడ్స్, కేన్సర్, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, ఎనీమియా, మత్తు పదార్థాల నిర్మూలన లాంటి అనేక వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా కనీసం 50 శాతం మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందజేత -
రహదారులు అనుసంధానిస్తాం
రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేనారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత రోడ్ల అనుసంధానంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ మండలం మూడుగుంటల్ జాతీయ రహదారి నుంచి సంజీవన్రావుపేట, కడ్పల్, సిర్గాపూర్ మీదుగా గౌడ్గాం వద్ద ఖేడ్–కంగి రోడ్డును అనుసంధానిస్తూ రూ.21 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ నుంచి సిర్గాపూర్, కంగ్టిలకు వెళ్లడానికి దగ్గరి రోడ్డుగా ఉండి వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఖేడ్ పట్టణం ఏఎస్ నగర్ కాలనీలోని రాజరాజేశ్వరి శివాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. -
కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణలోపాలపై..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జహీరాబాద్లోని నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) భూసేకరణ కోసం హడ్కో నుంచి తీసుకున్న రూ.725 కోట్ల రుణంలో రూ.317 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. ఈ భూసేకరణ విషయంలో అధికారుల తీరుపై అక్షింతలు వేసింది. మొత్తం 12,635 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరుగుతోందని తన నివేదికలో పేర్కొంది. సిద్దిపేట పార్కుల నిర్వహణపై ప్రశంసలు సిద్దిపేటలోని రాజీవ్పార్కు, మైత్రివనం, కోమటిచెరువు, పార్కుల నిర్వహణ బాగుందని కాగ్ తన నివేదికలో ప్రశంసలు కురిపించింది. ఇదే సిద్దిపేటలో మురుగునీటి శుద్ధీకరణ ప్రాజెక్టు భాగంగా రూ.158.34 కోట్లతో నిర్మించిన మూడు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నీటిశుద్ధి చేయడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన రిపోర్టులకు కాగ్ వంతపాడింది. తాగునీటి పథకానికి సంబంధించి మిషన్ భగీరథ నిధులు వినియోగించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ పథకం నిధుల నుంచి రూ.1.50 కోట్లను మళ్లింపుపై కాగ్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జరిగిన లోపాలను తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల లోపాలను కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణలో సంగారెడ్డి రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టింది. లబ్ధిదారులకు సంబంధించిన హార్డు కాపీలను అందుబాటులో ఉంచలేదని తన నివేదికలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ రికార్డుల నిర్వహణ ఉందని మొట్టికాయలు వేసింది. నారాయణఖేడ్లోని మినీస్టేడియం నిర్మాణం తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రూ.2.65 కోట్లతో చేపట్టిన ఈ మినీస్టేడియం డిజైన్ ఖరారులో ఆలస్యం, పనుల్లో జాప్యం, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో రూ.కోట్లలో నిధులు వృథా అయ్యాయని తన నివేదికలో పేర్కొంది. -
ఇదేం చెత్త పని ?
నర్సాపూర్: నర్సాపూర్– హైదరాబాద్ మార్గంలోని జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టుకు ఇరువైపులా చెత్తను అడ్డగోలుగా వేయడంతో కుప్పలుగా పేరుకుపోయింది. దుర్వాసన వెదజల్లుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు వాటి కోసం గుంపులుగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని గిరిజన సంక్షేమ అధికారి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్సు వ్యవధి ఆరు నెలలు ఉంటుందని తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు కోసం http:// dsapponine.com /sdr/form/register.php వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు నర్సాపూర్: పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. గురువారం సంఘం మండల శాఖ అధ్యక్షుడు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకులు చంద్రశేఖర్, గంగాధర్ రావు, రమేశ్, అప్పలనాయుడు, సత్యనారాయణ, కళారాము లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పిల్లుట్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంతో పాటు మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో అంతర్గత మురికికాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మురళిగౌడ్, కాంగ్రెస్ నాయకులు నవీన్గుప్తా, వెంకట్రామిరెడ్డి, రాఘవరెడ్డి, సతీశ్ తదితరులు ఉన్నారు. -
ఇతర అవసరాలకు నిర్ధారిత ఫీజు
మెతుకుసీమలో రాజకీయ అండతో పేట్రేగిపోయిన ఇసుక మాఫియా పీచమణిచి.. అక్రమార్కులకు చుక్కలు చూపుతున్నారు కలెక్టర్ ప్రతిమాసింగ్. నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా వందలాది అక్రమ ఇసుక డంపులను సీజ్ చేయించారు. ‘ఇందిరమ్మ ఇళ్లకు మన ఇసుక వాహనం’ పేరిట ప్రారంభించిన వినూత్న పథకంతో లబ్ధిదారులకు ఉచిత ఇసుక ఇస్తూ అండగా నిలుస్తున్నారు. జిల్లాలో మెదక్, హవేళిఘణాపూర్, కొల్చారం మండలాల్లోని వాగుల్లో మూడు ఇసుక పాయింట్లను గుర్తించి, ఆన్లైన్ బుకింగ్తో సరఫరా చేసేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేశారు. – మెదక్ అర్బన్ ఇందిరమ్మ, సొంత ఇళ్లు, ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేందుకు ‘మన ఇసుక వాహనం’ అనే పథకానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. అవసరమైన వారు ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా టీజీఎంఐవీ యాప్లోకి వెళ్లాలి. మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఓటీపీ వస్తుంది. అనంతరం వ్యక్తి గత వివరాలు, ఆధార్ నంబర్ అప్లోడ్ చేయాలి. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైతే వాటి వివరాలు ఎంట్రీ చేయాలి. అవసరమైన ఇసుకకు సంబంధించి నిబంధనలకనుగుణంగా ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించాలి. ఇది సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్లోకి వెళ్తుంది. అక్కడ వివరాలు, నిర్ధారిత పత్రాలు సరి చూసుకొని అతడు తహసీల్దార్ లాగిన్లోకి ప్రతిపాదనలు పంపుతారు. అక్కడ ఎమ్మార్వో అన్ని ఆధారాలు సరి చూసుకొని, ఫైనల్ అప్రూవల్ ఇస్తాడు. అప్పుడు డిజిటల్ కూపన్ జనరేట్ అవుతుంది. దానిని తీసుకొని అలాట్ అయిన రీచ్కు వెళ్తే, అక్కడ ఉన్న సాండ్ రీచ్ ఆఫీసర్ సిటిజన్ డిజిటల్ కూపన్, టీపీల ను నిర్ధారించుకొని ఇసుక రవాణకు అనుమతి ఇస్తారు. ఇంటి నిర్మాణానికి అనుగుణంగా అవసరమైనంత ఇసుక సరఫరా చేస్తారు. ఇందిరమ్మకు మన ఇసుక వాహనం ఫోన్ ద్వారా ఉచితంగా బుకింగ్ జిల్లాలో మూడు చోట్ల పాయింట్లు అక్రమార్కుల పీచమణిచిన కలెక్టర్ ఇసుక రీచ్లలో ఇందిరమ్మ, సొంత ఇళ్లు, ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తారు. అయితే ట్రాక్టర్ల లెక్కన ఇసుక విక్రయిస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు దాదాపు ఉచిత ఇసుక పంపిణీ చేసే అవకాశం ఉందని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సాధారణంగా ఇందిరమ్మ ఇళ్లకు ఆన్లైన్ చార్జి రూ.12, ఇసుక లోడింగ్ చార్జి రూ.400, సంబంధిత గ్రాామానికి విలేజ్ ఫండ్ రూ.200గా నిర్ధారించే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారు సొంతగా ట్రాక్టర్, లేబర్ను తీసుకెళ్తే దాదాపు ఉచితంగా ఇసుక సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై రెండు, మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పాపన్నపేట తహసీల్దార్ సతీష్ తెలిపారు. ఇక వ్యక్తిగత ఇళ్లు, ప్రభుత్వ పనులకై తే ట్రాక్టర్ ఇసుకకు రూ.1173 చెల్లించే అవకాశం ఉందన్నారు. -
లెక్కలు చెప్పరేం!
● మున్సిపల్ ఎన్నికల ఖర్చులు చెప్పని 22 మంది అభ్యర్థులు ● ఇప్పటికే ముగిసిన గడువు మెదక్ కలెక్టరేట్: ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో వ్యయానికి సంబంధించిన ఖర్చుల వివరాలు అధికారులకు అందజేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిక రద్దు చేస్తామని ప్రకటించింది. ఇందుకు మార్చి 29 డెడ్లైన్ విధించింది. అయితే గడువు ముగిసి వారం రోజులవుతున్నా, మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 22 మంది అభ్యర్థులు వివరాలు సమర్పించలేదు. బల్దియా పరిధిలో మొత్తం 32 వార్డుల్లో 113 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 91 మంది తమ ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలు అధికారులకు అందించారు. మిగితా వారు ఇవ్వమంటూ తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ‘ఏ లెక్కలు చెప్పాలి.. చెప్పకుంటే ఏమవుతుంది. మూడేళ్ల ఎన్నికల బహిష్కరణ ఉంటుందంటే.. ఇక ముందు మేం ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయం’. అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రూ. 50 వేల లోపే..! ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు, ఓడిన వారు కొంతమంది ఎన్నికల ప్రచార లెక్కలు అధికారులకు సమర్పించారు. వీరు కేవలం రూ. 20 వేల నుంచి 50 వేల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపించారు. మరి ఎన్నికల సమయంలో వార్డుల్లో ఏరులై పారిన మద్యం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ప్రతిరోజు ఇంటింటి ప్రచారంలో కనీసం 50 మందికి తగ్గకుండా వెంట తిప్పుకున్నారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.300లతో పాటు మధ్యాహ్న భోజనం, పురుషులకు సాయంత్రం మందు, బిర్యాని అందించారు. ఇలా ఒక అభ్యర్థి రోజుకు కనీసం రూ.50 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. -
పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య
మెదక్ కలెక్టరేట్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి అదనపు కలెక్టర్ నగేశ్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహానుభావుడని కొనియాడారు. అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం చేసిన త్యా గాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
జనగణన శిక్షణ వాయిదా వేయండి
మెదక్జోన్: జనగణన శిక్షణ వాయిదా వే యాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధు అన్నారు. ఈమేరకు సంఘం నాయకులతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనంలో ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈనెల 10 నుంచి 18 వరకు ఎస్ఏ–2 పరీక్షలు ఉండడం, ఈనెలలోనే ఓపెన్ టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈఅంశాలను దృష్టిలో ఉంచుకొని జనగణనకు సంబంధించి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం ఇబ్బ ందికరంగా మారుతుందన్నారు. బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకొని జనగణనకు సంబంధించి ఈనెల 23 తర్వాత శిక్షణ ఇవ్వాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా కోశాధికారి మంగ నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షుడు గడిల మాధవరెడ్డి, శ్రీధర్రెడ్డి ఉన్నారు. -
రాయితీ ఇచ్చినారు
ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా పూర్తి సబ్సిడీతో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా కూరగాయల విత్తనాలతో పాటు నారుమళ్లను అందిస్తుంది. దీంతో జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. – మెదక్జోన్ జిల్లావ్యాప్తంగా ఏటా 1,500 ఎకరాల నుంచి 2 వేల ఎకరాలు మాత్రమే కూరగాయల సాగు చేస్తారు. ఇందులో పండించిన పంట ఉత్పత్తులు జిల్లాకు సరిపడక ఇతర జిల్లాల నుంచి కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారులు ఇష్టారీతిగా ధరలను పెంచుతున్నారు. నాణ్యమైన కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది. కాగా ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో విత్తనాలతో పాటు నారును అందించి కూరగాయల సాగుకు పెద్దపీట వేస్తోంది. గత కొనేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గింది. కాగా ఈ ఏడాది జిల్లాలో 400 ఎకరాల్లో సాగు చేసేందుకు విత్తన కిట్లను రైతులకు అందిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్లో 6 నుంచి 8 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ విత్తనాలతో అర ఎకరంలో సాగు చేయవచ్చు. ఈ కిట్టులో టమాట, బీర, చిక్కుడు, పాలకూర, బెండ, కాకరకాయ లాంటి విత్తనాలు ఉన్నాయి. వీటిని గత పది రోజులుగా జిల్లాలో పంపిణీ చేస్తున్నారు. అ లాగే ములుగు విత్తన కేంద్రం ద్వారా జిల్లాకు 250 ఎకరాలకు సరిపడా కూరగాయల నారుమళ్లను సైతం పూర్తి సబ్సిడీపై అందిస్తున్నారు. 8 రకాల విత్తనాలకు సంబంధించిన కిట్లు పంపిణీ జిల్లాలో 650 ఎకరాల్లో సాగుకు యోగ్యం భారీగా పెరగనున్న సాగు! వందశాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాలతో పాటు నారుమళ్లను అందిస్తుండటంతో కూరగాయల సాగు జిల్లాలో భారీగా పెరగనుంది. ఇప్పటికే జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేయగా, విత్తనాల రూపంలో 400 ఎకరాలకు సడిపడా కిట్లను అందిస్తున్నారు. నారుమళ్లు మరో 250 ఎకరాల వరకు ఇస్తుండగా జిల్లాకు మొత్తం సబ్సిడీ రూపంలో 650 ఎకరాల్లో కూరగాయల సాగుకానుంది. కాగా జిల్లాలో ఈఏడాది 2,650 ఎకరాల్లో కూరగాయల సాగు కానుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఎమ్మెల్యే రోహిత్రావుమెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్రావు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 16, 17వ వార్డులో జరిగిన వార్డు సభలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్, రూ. 500 సిలిండర్, సన్న బియ్యం వంటి ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. కొత్త పథకాల్లో భాగంగా విద్యార్థులకు అల్పాహారం, అన్నివర్గాల ప్రజలకు జీవిత బీమా, దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, రైతులకు మేలైన వంగడాలు అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పథకాల అమలు
కలెక్టర్ ప్రతిమాసింగ్చేగుంట(తూప్రాన్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మండలంలోని వడియారంలో గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలకు పలు అంశాల్లో శిక్షణ కల్పించి ఉపాధి పొందడానికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే ఉద్దేశంతోనే ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి హేమాభార్గవి, సర్పంచ్ సాయికుమార్గౌడ్, మెడికల్ ఆఫీసర్ అనిల్కుమార్రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, ఎంపీఓ విజయ్పాల్రెడ్డి ఆయా శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
నర్సాపూర్ రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని రెడ్డిపల్లిలో జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, బీమా, ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, విద్యార్థులకు అల్పాహారంతో పాటు అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో 15 రోజుల స్వల్పకాలిక వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ లేదా ఫెయిల్ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్తో పాటు పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. రామాయంపేట(మెదక్): బల్దియా పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య హామీ ఇచ్చారు. గురువారం జరిగిన వార్డు సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆయా వార్డుల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు, అఽ దికారుల సహకారంతో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులు పలు సమస్యలపై వినతులు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామిని దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రాదాన్ని , శేష వస్త్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మాజీమంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: ఉత్పత్తులను దళారులకు అమ్మి నష్టపోవద్దని మాజీ మంత్రి హరీష్రావు రైతులకు సూచించారు. ఈ విషయమై గురువారం ఆయన పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు. సిద్దిపేట మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతుండటంతో అసెంబ్లీలో కొట్లాడితే వెంటనే ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారన్నారు. తక్కువ ధరకు ప్రైవేట్ కు అమ్ముకోని రైతులు నష్ట పోవద్దన్నారు.అసెంబ్లీలో మీ గురించి కొట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా చూశామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలరె సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
పేదలందరికీ విద్య, వైద్యం
అదనపు కలెక్టర్ నగేశ్అల్లాదుర్గం(మెదక్): అర్హులైన పేదలకు విద్య, వైద్యం, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం మండలంలోని చిల్వెరలో నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి విద్య అందినప్పుడే దేశం, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం యువత ఉండటంతో గ్రామాభివృద్ధి సాధించి, ఉత్తమ పంచాయతీకి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర శశిధర్రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ పోరాటం చిరస్మరణీయం మెదక్ కలెక్టరేట్: కులం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు మంగ రమేశ్గౌడ్, రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ విద్యాధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె వెలుగులే.. ఎక్స్ప్రెస్లు!
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి మహిళల తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే వారి సంఖ్యకు అనుగుణంగా సర్వీసులు పెంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెదక్ డిపో నుంచి ప్రధాన పట్టణాలకు వెళ్లే బస్సుల్లో అధికంగా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రయాణికులకు సరిపోవడం లేదు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో పల్లెవెలుగు బస్సులను నడిపిస్తున్నారు. వీటికి ముందు భాగంలో బ్లూ కలర్ రంగు వేసి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం లభించినప్పటికీ, తమకు చార్జీల భారం పడుతుందని పురుషులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 39 రూట్లలో బస్సులు అసలే సీట్లు లభించక అవస్థలు పడుతూ ప్రయాణం చేస్తుంటే చార్జీల మోత మోగిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ డిపో నుంచి సుమారు 39 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 40 వేల పైచిలుకు మహాలక్ష్మి (ఉచిత) టిక్కెట్లు వస్తున్నట్లు సమాచారం. మెదక్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్చారం మండల కేంద్రానికి ఆర్డీనరీ బస్సులో రూ. 20 ఉండగా, ఎక్స్ప్రెస్కు రూ. 40 వసూలు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులకు రంగులేసి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ సురేఖను వివరణ కోరగా.. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో వారి సౌకర్యం కోసమే అలా నడిపించాల్సి వస్తుందని తెలిపారు. ఏదైనా వివరాలు కావాలంటే ఆర్టీసీ సీఐని సంప్రదించాలని సూచించారు. ఆయనను వివరణ కోరగా.. ఇతర డిపోలలో ఎక్కువగా ఉన్నాయని, మా డిపోలో మాత్రం కేవలం ఐదారు మాత్రమే ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందా? అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని చెప్పడం గమనార్హం. బస్సులకు రంగులు వేసి చార్టీల వసూలు వీరికి ఉచితం.. వారికి భారం -
ధార లేని మంజీర!
● పొట్టదశలో వరిని కాపాడుకునేందుకు పాట్లు ● ఇసుక తిన్నెలను తవ్వి కిలోమీటర్ల మేర పైపులైన్లు కొల్చారం(నర్సాపూర్): ఎప్పటిలాగే యాసంగి సీజన్లో మంజీర పరివాహక గ్రామాల రైతులు పంటలు సాగు చేశారు. నీళ్లు వస్తాయన్న గంపెడాశతో నాట్లు వేశారు. తీరా సింగూరు మరమ్మతుల కారణంగా ఘనపురం ఆనకట్టకు నీటిని విడుదల చేయడం లేదంటూ అధికారులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. అయితే గతంలో లాగే సాగు నీరు విడుదల చేస్తారని భావించిన రైతులు ఉన్న నీటితో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండగా, నీటి గండం ఏర్పడింది. ఈక్రమంలో ఒక్క తడికి అయినా సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. జీఓ సైతం విడుదల చేయించారు. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జీఓ కాస్త బుట్టదాఖలు అయింది. దీంతో చేసేది లేక రైతులు పొట్టదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు బోర్లు వేసి నీటిని పంటకు అందిస్తున్నారు. మరికొందరు ఎడారిగా మారిన మంజీర నదిలో ఇసుక తిన్నెల కింద ఉన్న నీటిని వెతికే పనిలో పడ్డారు. జేసీబీల ద్వారా గుంతలు తీసి, సిమెంటు రింగులు వేసి మోటార్లను ఏర్పాటు చేసి పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా పంట చేతికొస్తుందా..? అన్న దిగులు రైతుల్లో కనిపిస్తుంది. ఇదే పరిస్థితుల్లో నీరు విడుదల చేయకపోరా..? అన్న చిన్నపాటి ఆశ ఇంకా కొట్టుమిట్టాడుతోంది. పొట్ట దశలో ఉన్న వరి పంట -
మీసేవ చార్జీల పెంపు
అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: తమ కనీస చార్జీల పెంపు కోసం మీసేవ నిర్వాహకులు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న వేళ వారి కల నెరవేరింది. మీసేవ నిర్వాహకుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరల పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఈ విషయమై బుధవారం రాత్రి అదనపు కలెక్టర్ నగేశ్వెల్లడించారు. ఇప్పటివరకు రూ. 35 ఉన్న కనీస చార్జీని రూ. 62కు పెంచినట్లు తెలిపారు. కేటగిరీల వారీగా చార్జీల పెంపు జరిగినట్లు చెప్పారు. మెయింటెనెన్స్ డేలో భాగంగా ఈనెల 3న మీ సేవ కేంద్రాలు పనిచేయవని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
మార్జిన్ తగ్గింపుతో నష్టపోతున్నాం
మెదక్ కలెక్టరేట్: పౌల్ట్రీ యాజమాన్యాల సిండికెట్ పెత్తనం తగ్గించాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈమేరకు దుకాణాలు మూసి వేసి పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గతంలో ఆయా కంపెనీలు మార్జిన్ ఇచ్చేవని, ప్రస్తుతం సిండికేట్గా ఏర్పడి రిటైల్ వ్యాపారులకు ఎలాంటి మార్జిన్ ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికే పలుమార్లు కంపెనీలతో చర్చలు జరిపినా.. ఫలితం లేకుండా పోయిందన్నారు. పేపర్ రేట్ ఇవ్వడంతో తాము రోజంతా కష్టపడి కంపెనీలకు లాభాలు అందించాల్సి వస్తుందన్నారు. కంపెనీల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల పాటు చికెన్ షాపులను బంద్ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సాగౌడ్, ఇంత్యాజ్అలీ, వేణు, సన్ను, షపీ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
స్పోర్ట్స్ స్కూల్ జిల్లాస్థాయి ఎంపికలు
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేశ్ మెదక్జోన్: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మూడవ తరగతి చదువుతున్న 31 మంది విద్యార్థులు సెలక్షన్కు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేశ్ మీడియాకు వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయిక్రీడలకు ఎంపిక చేస్తారని, వారు ఏప్రిల్ 27 నుంచి హకీంపేటలో కొనసాగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్రావు, మాధవరెడ్డి, మధుసూదన్, శ్యాం, దేవేందర్రెడ్డి, రవి, ప్రదీప్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్జోన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఏప్రిల్ నెలంతా పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుస్తుగా పోలీసుల అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పటిష్ట బందోబస్తు హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలో తైబజార్ వేలం పాట మరోసారి వాయిదా పడింది. మంగళవారం నార్సింగి గ్రామపంచాయతీ వద్ద ఈ వేలం పాట నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా, పాటలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తైబజార్ వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు ఈఓ నాగభూషణం తెలిపారు. కాగా నార్సింగి తైబజార్ వేలం పాట వాయిదా పడటంతో ఇది నాలుగోసారి కావడం విశేషం. నార్సింగిలో అంగడి (వారంతపు సంత) డిమాండ్ తగ్గినప్పటికి అధికారులు ప్రకటించిన కనీస ధరతో తమకు నష్టం జరుగుతుందని వేలం పాటకు ఎవరూ ముందుకు రావడం లేదని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిణిత నర్సాపూర్: జిల్లాలో ప్రశిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిణిత సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం జిల్లాలో పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రశిక్షణ నిర్వహించని మండలాల్లో త్వరలో నిర్వహించాలని మండల శాఖల అధ్యక్షులు, ఇన్చార్జ్లకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, ప్రధానకార్యదర్శి సురేశ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్ పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా హజ్ సొసైటీ సహకారంతో హజ్ యాత్రకు జిల్లా నుంచి ఎంపికై న 33 మందికి వైద్యాధికారులు టీకా వేశారు. మంగళవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీతాదేవి, జిల్లా వ్యాక్సిన్ అధికారి మాధురి పర్యవేక్షణలో టీకా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు జిల్లా హజ్ కో ఆర్డినేటర్ మహమ్మద్ ఎజాజుద్దీన్, మెదక్ జిల్లా హజ్ సొసైటీ సభ్యులు, ఎండీ రియాజుద్దీన్, సాబీర్, జైన్ ఉల్ అబేదీన్ పాలొని టీకా శిబిరాన్ని విజయవంతం చేశారు. -
గ్రామ సభలకు ఏర్పాట్లు చేయండి
● ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ● కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, మైనింగ్ కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతుబీమా వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహణకు ముందస్తుగానే షెడ్యూల్ తయారు చేసి పంచాయతి కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ సభలకు వ్యవసాయ, విద్య, హౌసింగ్, నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులతోపాటు తహసీల్దార్, ఎంపీడీఓలు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరు కావాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం గ్రామ సభలో ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. సమీక్షలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతమైన పథకం
● మహాలక్ష్మి పథకంతో మహిళలకు మేలు ● ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బీవీ రావు మెదక్ కలెక్టరేట్: మహాలక్ష్మి పథకంతో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్లు ఆదా చేయడం హర్షణీయమని ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బీవీ రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ బస్ స్టేషన్లో సాయంత్రం మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీవీరావు, జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి హేమభార్గవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు పుష్పలత (టీచర్), యశోద(ఏఎన్ఎం), సిద్దేశ్వరి (టైలరింగ్ బిజినెస్), రమ్య (స్టూడెంట్)లను సన్మానించారు. అనంతరం బీవీరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా ఉంటుందన్నారు. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని కోరారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినిలు ఉపన్యాసం, పాటలు అలరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ, ఆర్టీసీ సీఐ, అధికారులు రాధకృష్ణ పాల్గొన్నారు. -
సాగునీటిని విడుదల చేయాలి
● ఎమ్మెల్యే సునీతారెడ్డి ● తుక్కాపూర్ మంజీరా నదిలో నిరసన కొల్చారం(నర్సాపూర్)/నర్సాపూర్/హత్నూర (సంగారెడ్డి): నియోజకవర్గంలో ఘణపురం ఆనకట్టకు సింగూర్ నుంచి ఒక్క తడికి సాగు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి మంగళవారం వచ్చిన ఎమ్మెల్యే పక్కనే ఉన్న మంజీరా నదిని సందర్శించారు. నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి నదిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...యాసంగిలో సింగూర్ నుంచి మంజీరా పరీవాహక ప్రాంతంలోని రైతులు పంటలు వేసిన తర్వాత ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందని, అయితే రైతులు సాగు చేసిన ఆ పంటలు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయని ఈ దశలో నీటి తడులు లేకపోతే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 0.3 టీఎంసీల నీటి విడుదలకు జీఓ జారీ చేసినా ప్రభుత్వ ఆదేశాలను నీటిపారుదల శాఖ అధికారులు పక్కన పెట్టడం సరికాదన్నారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించేందుకు ఓ సెట్ స్వచ్ఛంద సంస్థ రూ.కోటి విరాళం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి ఉపాధి హామీ పని కల్పించకుండా, ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులోనే పని కల్పించినట్లు చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే నర్సాపూర్లోని శ్రీ ఎల్లమ్మ దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు ఘనంగా పూజలు చేశారు. పూజలలో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, కౌన్సిలర్లు సుధీర్గౌడ్, రాజు, మోహిజోద్దీన్లతోపాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. పూజల అనంతరం షేక్ హుస్సేన్ ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు నాయకులను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంఈఓ వెంకట్ నరసింహగౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు. -
స్వాధీనం బాట
డబుల్ బెడ్రూం ఇళ్లలోకి ప్రవేశించిన నిరుపేదలు ● జిల్లా కేంద్రంలో 60 మందికిపైగా ఇళ్లలోకి చేరిక ● అదేబాటలో మరికొంతమంది! మెదక్జోన్: నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సకాలంలో అందజేయడంలో జాప్యం జరగ్గా...కనీసం కాంగ్రెస్ సర్కారైనా తమకు ఇళ్లు అందజేస్తుందోమోనని ఆశగా ఎదురుచూసిన వారికి ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది. దీంతో ఓపిక నశించిన సదరు నిరుపేదలు ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఎవరికి వారే స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా వాటిని పంపిణీ చేయకుండా అలాగే వదిలేశారు. ఇప్పట్లో పంపిణీ చేస్తారనే నమ్మకం, ఓపిక నశించిన కొందరు నేరుగా వాటిని స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4వేలకుపైగా ఇళ్లు మంజూరు జిల్లావ్యాప్తంగా గత బీఆర్ఎస్ హాయాంలో నాలుగు వేల పైచిలుకు డబుల్డ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,500 పైచిలుకు ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు 15 వందల ఇళ్లు అలాగే మిగిలిపోయాయి. వాటిలో చాలావరకు నిర్మాణాలు పూర్తికాక అర్ధాంతరంగా ఆగిపోగా, మిగతావి పూర్తయినా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వృథాగా వదిలేశారు. మెదక్ జిల్లాకేంద్రంలో...! జిల్లావ్యాప్తంగా 2,500 ఇళ్లు మంజూరు కాగా మెదక్ మున్సిపాలిటీకి 1,055 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 575 నిర్మాణాలు పూర్తి చేసి అప్పట్లోనే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 480 ఇళ్లలో 247 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 233 ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవల్లో కొన్ని ఆగిపోగా, మరికొన్ని శ్లాబులు పూర్తయ్యి గోడలు నిర్మించకుండా వదిలేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిర్మాణాలు పూర్తి చేసుకున్న 247 ఇళ్లనైనా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో ఇళ్లు లేని నిరుపేదలు 60 మందికి పైగా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణకు సిద్ధంగా మరికొందరు! ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయకపోగా ఇప్పటికే 60 మందికి పైగా నేరుగా ఇళ్లలోకి ప్రవేశించి నివాసం ఉంటుండగా, వారి బాటలోనే మరికొందరు ఇళ్లను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా నేతలు, అధికారులు స్పందించి ఇళ్లులేని వారికి కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి 1,055 ఇళ్ల మంజూరు కాగా వాటిలో 575 ఇళ్లు అప్పటి బీఆర్ఎస్ నేతలు పంపిణీ చేశారు. వాటిలో రాజకీయ నేతల జోక్యంతో 80 మందికిపైగా ఇళ్లను కార్లు వారికి, రాజకీయనాయకుల అనుచరులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా వారు ఆ ఇళ్లను పేదలకు అద్దెకిచ్చి నెలనెలా అద్దె వసూలు చేస్తున్నారు. ఇక అర్హులైన నిరుపేదలు మాత్రం అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికై నా తమకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేస్తుందని ఎదురుచూస్తూ వచ్చిన నిరుపేదలు తమకిక ఆ ఇళ్లు వచ్చే అవకాశం లేదని భావించి నేరుగా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
అటకెక్కిన అటల్ టింకరింగ్
మెదక్ అర్బన్: విద్యార్థుల్లో ఉత్సుకత.. సృజనాత్మకత.. ఊహశక్తి ద్వారా ఆవిష్కరణలు సృష్టించడానికి ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ కార్యక్రమం నీరుగారి పోతుంది. జిల్లాలో ఒక్కో పాఠశాలకు పంపిణీ చేసిన రూ.10 లక్షల సామగ్రి నిరుపయోగంగా మారింది. పాపన్నపేట మండలంలోని ఓ పీఎంశ్రీ పాఠశాలలో డ్రోన్ మాయం కాగా, విద్యార్థులకు ఉపయోగపడాల్సిన ట్యాబ్లు పక్కదారి పడుతున్నాయి. ఓ ట్యాబ్ సైతం కనిపించకుండా పోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏటీఎల్ సామగ్రి పంపిణీ చేసి ఏడాది కావొస్తున్నా, కొన్ని పాఠశాలల్లో ఇప్పటివరకు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడం గమనార్హం. ఆవిష్కరణలతో అద్భుతం విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచన, లెర్నింగ్ బై డూయింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటు చేసిందే ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ కార్యక్రమం. జిల్లాలో 31 పీఎంశ్రీ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 28 పాఠశాలల్లో ఏటీఎల్ ల్యాబ్లు ఉండగా, ఏడాది క్రితం సుమారు రూ. 10 లక్షల విలువ గల సామగ్రి పంపిణీ చేశారు. ఇందులో రోబోటిక్స్ కిట్, ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రాపిడ్ ప్రోటో టైపింగ్ టూల్స్, మెకానికల్ అండ్ మెజర్మెంట్ టూల్స్, పవర్ సప్లై, ఆక్ససరీస్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కాంపోనెంట్ కింద 150 రకాల వస్తువులు పంపిణీ చేశారు. అయితే వీటిని వినియోగించేందుకు సంబంధిత టీచర్లకు రెండు రోజుల శిక్షణ సైతం ఏర్పాటు చేశారు. ఈ వస్తువులలో చాలా మట్టుకు ఇంజనీరింగ్ సిలబస్కు సంబంధించినవి ఉన్నట్లు టీచర్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల శిక్షణలో వాటిపై అవగాహన వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఇక ఇంతటి విలువైన వస్తువులను కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు కనీసం ఇన్చార్జిలకు బాధ్యత అప్పజెప్పకపోవడంతో స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీకి నోచకోలేక నిరుపయోగంగా మారాయి. కాగా వాటిపై ఎవరి అజమాయిషి లేకపోవడంతో ఎవరికి వారు విలువైవ వస్తువులను ఇంటికి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ట్యాబ్లు, డ్రోన్లు మాయమవుతున్నట్లు తెలుస్తోంది.మాయమవుతున్న డ్రోన్లు.. పక్కదారి పడుతున్న ట్యాబ్లు రూ.10 లక్షల ల్యాబ్ సామగ్రి వృథా జిల్లాలో 33 పాఠశాలలకు పంపిణీపార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అవసరం ఏటీఎల్ ల్యాబ్ కింద పంపిణీ చేసిన ల్యాబ్ సామగ్రి వినియోగంలోకి రావాలంటే నిరుద్యోగ ఇంజనీరింగ్ విద్యార్థులను పాఠశాలల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా నియమించాలని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు. తమకు వాటిపై పూర్తి అవగాహన లేనందున ప్రోగ్రామింగ్ లాంటివి తయారు చేయడం కష్టమని అంటున్నారు. -
మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
నర్సాపూర్ రూరల్: మండలంలోని పెద్దచింతకుంటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా మల్లేశ్గౌడ్ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచమంతా ఇంధన సంక్షోభంతో అల్లాడుతుంటే మోదీ సామాన్య ప్రజలపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్పై ఎకై ్సజ్ సుంకాన్ని భారీగా తగ్గించారని కొనియాడారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేశ్గౌడ్, మండల అధ్యక్షుడు నీలి నాగేశ్, నాయకులు నారాయణరెడ్డి, బాలు, యాదగిరి, నగేశ్గౌడ్, సంజీవులు సాయిచారి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉల్లాస్’ పరీక్షలు
చిన్నశంకరంపేట(మెదక్): ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న అమ్మకు అక్షరమాల మూ ల్యంకన పరీక్షలను కేంద్ర ప్రభుత్వ అక్షరాస్యత మంత్రిత్వశాఖ అధికారి భాను బోరా పరిశీలించారు. ఆదివారం విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రెడ్డి, వయోజన విద్య జిల్లా అధికారి మురళీమోహన్తో కలిసి మండలంలోని అవబాజిపేటలో పర్యటించారు. మహిళా సంఘం సభ్యులను గుర్తించి వలంటీర్ల ద్వారా అక్షరాభ్యాసం చే యించినట్లు అధికారులు తెలిపారు. మహిళల అక్షరాభ్యాసన శక్తిని పరిశీలించేందుకే మూల్యంకన పరీక్షలు నిర్వహించామన్నారు. -
కూతురు పెళ్లికి అప్పు పుట్టక..
పాపన్నపేట (మెదక్): కూతురు పెళ్లి కోసం అప్పు పుట్టక ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. వారం క్రితం ఆయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఇంట్లో పెళ్లి పత్రిక పెట్టుకొని, సాయంత్రం పెద్దల పండుగ చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు చుట్టాలకు కబురందించారు. అయితే త్వరలో బిడ్డ పెళ్లి చేయాల్సి ఉండగా, డబ్బులు లేక, అప్పులు పుట్టక ఆందోళన చెందాడు. దిక్కుతోచని స్థితిలో శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు గ్రామ శివారులో వెతికారు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మూతబడిన రైస్ మిల్లులో ఉరివేసుకున్నాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. పెళ్లి పత్రిక కోసం రావాల్సిన బంధువులు, అంత్య క్రి యలకు రావాల్సి రావడంతో, ఊరంతా శోక సంద్రమైంది. కాగా, పెళ్లి కుమారుని తరపు వారు కట్నం ఆశించకుండానే పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
నర్సాపూర్: నర్సాపూర్లోని విష్ణు ఉన్నత పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు సాధించిన విజయాలు, నైపుణ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు సంబరాలు నిర్వహిహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి చెప్పారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్దూబె, డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, వైపర్ ప్రిన్సిపాల్ రమేష్, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందచేశారు. -
ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండ
పెద్దశంకరంపేట(మెదక్): ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ముసాపేట, జూకల్, వీరోజిపల్లి, బద్దారం గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోనికి వచ్చిందని, రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్పార్టీ అధికారంలోనికి వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రోషన్రెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మండల రైతుబంధు మాజీ అధ్యక్షుడు సురేష్గౌడ్, బోండ్ల దత్తు, సర్పంచ్ విఠల్నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కోదండ రామస్వామి ఉత్సవాలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రం శివ్వంపేట లో కొలువైన పురాతన కోదండరామస్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున సీతారామచంద్రస్వామి కల్యాణం అనంతరం వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అనంతరం కోదండరామస్వామికి ప్రత్యేక పూజలు చేశా రు. సాయత్రం స్వామివారి పల్లకీ సేవ గ్రామంలోని ప్రధాన వీధులు గుండా చేపట్టారు. ఏప్రిల్ 2న గరుడసేవ నిర్వహించనున్నట్లు వేద పండితుడు శా స్త్రుల వామనశర్మ, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి చందు తెలిపారు. -
నర్సాపూర్ బడ్జెట్ 19.36 కోట్లు
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మి అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ మేరకు 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీకి సాధారణ నిధులు, గ్రాంట్లు కలిపి రాబోయే ఆర్థిక సంవత్సరానికి 19కోట్ల 36లక్షల 95వేల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు మున్సిపాలిటీ గణాంక అధికారి సంతోషిరాణి వివరించారు. అదే సంవత్సరానికి 19కోట్ల 31లక్షల 75వేల రూపాయల వ్యయం ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. 2026– 27 సంవత్సరానికి 10శాతం గ్రీన్ బడ్జెట్ కోసం 1కోటి 42లక్షల 90వేల రూపాయలు కేటాయించామని, మిగులు బడ్జెట్ 26లక్షల 51వేల రూపాయలని తెలపగా సభ్యులు ఆమోదించారు. పట్టణంలోని పలు సమస్యలపై సమావేశంలో చర్చించి వాటిని పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారుల సమన్వయంలో కృషి చేయాలని సూచించారు. సమావేశంలో వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్, కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మిగులు బడ్జెట్ 26.51 లక్షలు సాధారణ నిధులు, గ్రాంట్లతో అభివృద్ధి -
ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో ఐదు రోజు లుగా కొనసాగుతున్న వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. గ్రామపాలనలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు, పారదర్శకత, ప్రజ లతో సమన్వయం, పంచాయతీ రాజ్ చట్టాలపై అవగాహన పెంచుకొని, గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీఓ జాకీర్హుస్సేన్, మాస్టర్ ట్రైనర్లు తస్లీమ్ పాషా, లింగప్ప, ప్రవీణ్, సోమేశ్వర్ తదితరులున్నారు. వార్డు మెంబర్లకు సర్టిఫికెట్స్ అందజేత నిజాంపేట(మెదక్): మండలంలోని గ్రామ పంచాయతీలో నూతనంగా ఎంపికై న వార్డు సభ్యులకు నిజాంపేట మండల కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లను ఎంపీడీఓ రాజిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలంలో మొదటి బ్యాచ్ వార్డు సభ్యులకు వార్డు అభివృద్ధి చేయాలంటే వార్డు సభ్యుల ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. గ్రామసభకు ప్రతి ఒక్కరు హాజరై వార్డుల్లోని సమస్యలపై చర్చించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం వార్డు సభ్యులదేనని అన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింహారెడ్డి, ట్రైనర్లు కుమార్, శ్రీకాంత్, అశోక్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు తప్పనిసరి
పెద్దశంకరంపేట(మెదక్): వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో ప్రజలకు రోడ్డు రవాణా నిబంధనలు వివరించారు. ప్రభుత్వం ప్రజలు క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు అరైవ్– అలైవ్ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ప్రయాణికులు హెల్మెట్ ధరించడంతో పాటు మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడపరాదని, జాతీయ రహదారిపై రాంగ్రూట్లో ప్రయాణించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ. సంగమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చిన్నశంక్రంపేట(మెదక్): మండల పరిధి గవ్వలపల్లి గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. మహిళలు పార్వతీపరమేశ్వరులకు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. రాజీయే రాజమార్గం నర్సాపూర్ రూరల్: రాజీపడటం రాజమార్గమని న్యాయమూర్తి హేమలత కక్షిదారులకు సూచించారు. శనివారం నర్సాపూర్ మున్సిఫ్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసుల్లో ఇరువర్గాల కక్షిదారులతో రాజీ కుదిర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దూషించుకొని, కొన్ని సందర్భాల్లో దాడులు చేసుకొని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నారని అన్నారు. చాలా మంది ఇగోలతో కొట్లాడుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పొందుతూ శాంతియుత వాతావరణంలో ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది రాఘవేందర్, సీనియర్ న్యాయవాది అంజిరెడ్డి, ఏజీపీ శ్రీధర్రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్, మధుశ్రీ, స్వరూపరాణి, శ్రీనివాస్, సత్యనారాయణ, సుధాకర్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. కొండగట్టుకు పాదయాత్ర చేగుంట(తూప్రాన్): మండలంలోని గోపాల్పురం నుంచి హనుమాన్ మాలధారణ భక్తులు కొండగట్టుకు శనివారం పాదయాత్రగా బయలుదేరారు. మాజీ వైస్ఎంపీపీ రాంచంద్రం ఆధ్వర్యంలో 12 మంది హనుమాన్ మాల ధరించి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు పాదయాత్రగా వెళ్లి మంగళ వారం కొండగట్టుకు చేరుకుంటారని చెప్పారు. ఆలయానికి విరాళం అందజేత అల్లాదుర్గం(మెదక్): తల్లికి గుండెపోటు రావడంతో పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నారు. అమ్మ వారి దయతో క్షేమంగా కోలుకోవడంతో విరా ళం అందజేశారు. బీరంగూడకు చెందిన అనిల్రాజ్ తన తల్లికి గుండెపోటు రావడంతో అనారోగ్యం నుంచి కాపాడాలని, క్షేమంగా ఉంటే రూ.లక్ష ఆలయానికి విరాళం ఇస్తానని రాంపూ ర్ పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాడు. అనిల్ రాజ్ తల్లి కోలుకోవడంతో శనివారం రాంపూర్ పెద్ద మ్మ తల్లికి స్థానిక సర్పంచ్ గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, బల్రాంరెడ్డి, వెంకటేశ్ సమక్షంలో రూ.లక్ష విరాళం అందజేశారు. -
గీతా స్కూల్కు విద్యా పురస్కారం
తూప్రాన్: విద్యా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న పట్టణంలోని గీతా స్కూల్ యాజమాన్యానికి హన్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో విద్యా పురస్కారం లభించిందని పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, విలువలతో కూడిన విద్య, వ్యక్తిగత వికాసం, క్రమశిక్షణ, సృజనాత్మకత లాంటి అంశాల్లో వేలాది విద్యార్థులను తీర్చిద్దినందునకు గీతా హైస్కూల్కు అవార్డు లభించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పాఠశాల కరెస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ పి.ఉష, డైరెక్టర్ భరత్లు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు రాఘవేందర్గౌడ్, నారాయణగుప్తా, మౌనిక, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రత్యేక వైద్య శిబిరంతో లబ్ధి
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో 193 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ సాయిసింధు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎముకలు, నేత్రవైద్యం, మహిళలు, చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని సేవలు అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు, పల్లె దవాఖాన డాక్టర్లు హృదయ్, హరిక, నందిని, కుమారి, సూపర్వైజర్లు నిర్మల, బుజ్జి, సిబ్బంది వనిత, అనిత, నర్సింహులు, యాదగిరావు, ఉపసర్పంచ్ భానుప్రసాద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
చేగుంట తైబజార్ వేలం
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం చేగుంట మార్కెట్కు సంబంధించిన వేలంపాట సర్పంచ్ స్రవంతి, ఎంపీఓ విజయ్పాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. వేలంలో 24 లక్షల 5వేలకు చింతల భూపాల్ తైబజార్ను దక్కించుకున్నారు. నిబంధలన ప్రకారం గ్రామ పంచాయతీకి వేలం డబ్బు లు చెల్లించి ఒప్పంద పత్రం అందించి ఏప్రిల్ 1 నుంచి తైబజార్ డబ్బులను వసూలు చేయాలని ఎంపీఓ తెలిపారు. కార్యక్రమంలో ఈఓ వెంకటేశ్, ఉపసర్పంచ్ రఫీ, వార్డు మెంబర్లు రవి, ఆరీఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత చిలప్చెడ్(నర్సాపూర్): నీరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని అజ్జమర్రి మాజీ ఎంపీటీసీ మల్లయ్య అన్నారు. శనివారం ఆయన చిలప్చెడ్ మండల పరిధి అజ్జమర్రి గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఆత్మకమిటీ డైరెక్టర్ సత్యం, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వీరాస్వామి పాల్గొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం కెమిస్ట్రీ విభాగం, ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ ఫార్మా సంస్థకు సంబంధించి ప్లేస్ మెంట్డ్రైవ్ నిర్వహించారు. ప్లేస్ మెంట్ డ్రైవ్ లో ఔషధ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, కెరీర్ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. కళాశాలకు చెందిన సుమారు పదిమందికి పైగా విద్యార్థులు ప్లేస్మెంట్ పొందారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సమీరా నజ్మీన్, అధ్యాపకులు డాక్టర్ అదెప్ప, డాక్టర్ కే రమేష్, ఎండీ ఖాజా ఆరిఫ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీయూ అధ్యక్షుడుగా ఆదిత్యగౌడ్
రేగోడ్(మెదక్): ఎస్టీయూ మండల శాఖ అధ్యక్షుడుగా ఆదిత్యగౌడ్ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రిషికాంత్, మహిళా ఉపాధ్యక్షురాలిగా అనూష, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, కార్యదర్శులుగా మహేందర్, పుష్పలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆదిత్యగౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఉన్నతమైన బాధ్యతలను అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరాహార దీక్షను విజయవంతం చేయండి నర్సాపూర్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కుమార్ కోరారు. ఈ నెల 30న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే నిరాహార దీక్ష కరపత్రాలను కుమార్ తదితరులు ఆవిష్కరించి మాట్లాడారు. దళితులకు పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అమలు చేయకుండా జాప్యం చేస్తూ మోసం చేస్తుందని ఆరోపించారు. హామీల అమలుకు డిమాండ్తో చేపట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కుమార్ కోరారు. ఆయన వెంట నాయకులు నాగరాజు, విద్యాసాగర్, నరేష్ తదితరులు ఉన్నారు. ఇసుక కుప్పలు సీజ్ పాపన్నపేట(మెదక్): కొడుపాక గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన 15 ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం రాత్రి సీజ్ చేసినట్లు తహసీల్దార్ సతీష్ తెలిపారు. మంజీరా నది నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తీస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. అక్రమంగా ఇసుక తీస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. నేడు విద్యుత్ సరఫరా బంద్ పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట, బూర్గుపల్లి 33 కేవీ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యార్థులపై తేనెటీగల దాడి నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం తేనెటీగలు ఒక్కసారిగా విద్యార్థులపై దాడి చేశాయి. ఈ మేరకు పాఠశాలకు పక్కనే ఉన్న చెట్లు మీద ఉన్న తేనేటీగల గుంపు ఒక్కసారి లేచి విద్యార్థి సాత్విక్పై దాడి చేయడంతో వెంటనే పాఠశాలలోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యా యులు విద్యార్థులను గదుల్లోకి పంపి తలు పులు వేసి ప్రమాదం నుంచి తప్పించారు. ఈగలకు మంట పెట్టి దూరంగా పంపించారు. విద్యార్థికి స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పాఠశాల కొనసాగింది. ఆశావర్కర్ల ముందస్తు అరెస్ట్ నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని స్థానిక పోలీసులు శనివారం ఆశావర్కర్లను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చలో అసెంబీకి బయలుదేరిన ఆశావర్కర్లను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు కంటి వైద్యశిబిరం పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమ వారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డు ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు ఎస్.నర్సింలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో ఉద్యోగులతో పాటు రిటైర్డు ఉద్యోగులు, ఆరోగ్యశ్రీకార్డు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. -
ఘనంగా బండ్ల ఊరేగింపు
కౌడిపల్లి(నర్సాపల్లి): మండల కేంద్రం కౌడిపల్లిలోని శ్రీఅభయ సీతారామాలయం 33వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం బండ్లను ఊరేగించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్, దేవులపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి, దేవతామూర్తులతో పాటు బండ్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కౌడిపల్లి, దేవులపల్లిలోని వివిధ కులాల సంఘాల ఆధ్వర్యంలో ఎడ్లబండ్లను ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణాగౌడ్, ఉపసర్పంచ్లు శ్వేత మల్లికార్జున్గౌడ్, శ్రీకాంత్, నాయకులు శ్రీనివాస్గుప్తా, దుర్గాగౌడ్, రాజు, మగ్బుల్, ప్రశాంత్, శాఖయ్య, పుండరీకంగౌడ్, లక్ష్మన్యాదవ్, భుమయ్య పాల్గొన్నారు. దుర్గమ్మకు బండ్ల ప్రదక్షిణలు అల్లాదుర్గం(మెదక్): మండల పరిధి ముస్లాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో భాగంగా బండ్ల ప్రదక్షిణలు చేశారు. గ్రామ స్తులు, చుట్టు పక్క గ్రామాలకు చెందిన భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు బండ్లను కట్టి ఉరేగింపుతో ప్రదక్షిణలు చేశారు. బండ్ల ఎదుట శివసత్తుల నృత్యాలు, భక్తులు సందడి చేశారు. వందలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బందోబస్తుతో పర్యవేక్షించారు. ఇందులో అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ , పెద్దశంకరంపేట ఎస్ఐ ప్రవీణ్రెడ్డిలు పాల్గొన్నారు. -
చాకరిమెట్లలో భక్తజన సందడి
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి మన్య సూక్త పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులు అభిషేకం, సత్యనారాయణస్వామి మండపంలో సమూహిక వ్రతాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయశర్మ, సర్పంచ్ నారాయణరావు, ప్రధాన అర్చకుడు దేవదాత్తశర్మ, దేవిశ్రీ, ప్రభుశర్మ, సిబ్బంది ఉన్నారు. -
పట్టపగలే దోపిడీ పాడైన గ్యాస్పొయ్యిలు బాగుచేస్తామని నమ్మించి వృద్ధ మహిళ నుంచి బంగారం లాక్కొని పరారయ్యారు. వివరాలు 9లో u
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026ఇందిరమ్మ బిల్లులు వెంటనే చెల్లించాలిఅసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో వారు నిర్మాణ పనులు చేపట్టారని, పలువురు బేస్మెంట్స్థాయి వరకు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని వివరించారు.దరఖాస్తు గడువు పొడిగింపు మెదక్ కలెక్టరేట్: షెడ్యూల్ట్ కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 249 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసి హార్డ్ కాపీలను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. నేడు అఖిలపక్ష సమావేశంరామాయంపేట(మెదక్): గతంలో రద్దయిన రామాయంపేట నియోజవర్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దశలవారీగా ఆందోళనకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు నియోజకవర్గ సాధన సమితి పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గురువారం సాధన సమితి ప్రత్యేక సమావేశం ప్రగతి రిసార్ట్లో నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. రామాయంపేట నియోజవర్గ పునరుద్ధరణ విషయమై సమావేశంలో చర్చిస్తామని, అన్ని పార్టీల నాయకులు హాజరుకావాలని కోరారు. ఈమేరకు సమితి సభ్యులు తహసీల్దార్ రజనికి వినతిపత్రం అందజేశారు. పనుల పురోగతిపై ఆరాహవేళిఘణాపూర్(మెదక్): మండలంలోని అవుసులపల్లి శివారులో పోలీస్శాఖ నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ పనులను ఏఎస్పీ మహేందర్ పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఆర్ఎస్ఐ మహిపాల్, సిబ్బంది ఉన్నారు. -
సక్రమంగా సన్న బియ్యం సరఫరా
తీపెక్కిన చెరుకు సీజన్ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో uకలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్/కౌడిపల్లి(నర్సాపూర్)/వెల్దుర్తి(తూప్రాన్): పేదలకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం సరఫరాను సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో గల ఎంఎల్ఎస్ పాయింట్ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా మూడు నెలల బియ్యం సరఫరా గురించి ఆరా తీశారు. అలాగే రికార్డులతో పాటు బియ్యం నిల్వలను పరిశీలించారు. పెండింగ్ ఉన్న రేషన్న్షాపులకు త్వరగా బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులు సక్రమంగా ప్రజలకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ జగదీష్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు. అంతకుముందు కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న, కొట్టాల గ్రామాల్లో రేషన్షాపులను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలించారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే వెల్దుర్తి కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. మెస్ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. -
జాబ్ మేళాలో 21 మంది ఎంపిక
ఇన్చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి మెదక్జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్కేసీ, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ ఫార్మసీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు మంగళవారం నిర్వహించిన జాబ్మేళా 21మంది ఎంపికయ్యారు. ఈ మేరకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాబ్మేళాకు మొత్తం 42 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఆరుగురు ఎంఎస్ఎన్ కంపెనీకి, 15 మంది అమెజాన్కు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వేణుగోపాల్రావు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వడగండ్ల బీభత్సం
నేల రాలిన పంటలునందిగామ గ్రామంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటనిజాంపేట(మెదక్): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లతో చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమైంది. సాయంత్రం కాగానే గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఈదురు గాలులు వీస్తూ రాళ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అలాగే ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే వరి పంటలో గింజలు రాలిపోయాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
భూభారతిపై కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని భూభారతి దరఖాస్తులను తహసీల్దార్లు చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లో భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటరు జాబితా తయారీపై రెవెన్యూ అధికారులతో మంగళవారం కలెక్టర్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...రెవెన్యూ శాఖలో పారదర్శకత పాలన కోసం అధికారులంతా పాటు పడాలన్నారు. ప్రజావాణి, భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలకు వెనకాడబోమని తహసీల్దార్లను హెచ్చరించారు. ఓటర్ జాబితా తయారీ అన్ని శాఖల సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సొంత నిర్ణయాలకు తావు లేదన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మర్ యాక్షన్ ప్లాన్పై కలెక్టర్ సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం అధికారులంతా సమన్వయంతో వేసవి కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కమిషనర్ సమిష్టిగా పని చేయాలన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వన్య ప్రాణులకు దప్పిక తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎఫ్ఓ జోజి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, మిషన్ భగీరథ ఇంట్రాగ్రిడ్ ఈఈ సంపత్ కుమార్, గ్రిడ్ నాగభూషణం, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజనకు ముందడుగు
● కొత్తగా రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు! ● అసెంబ్లీ, లోక్సభ స్థానాలను 50 శాతం పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం ● దీంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశం! మారనున్న నియోజకవర్గాల రూపురేఖలురాష్ట్రంలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మెదక్ లోక్సభ స్థానం స్వరూపం కూడా సమూలంగా మారనున్నాయని రాజకీయవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాగా ఏయే అసెంబ్లీ స్థానాలు ఏ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయనే దానిపై పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పష్టత రానుంది.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధి, స్వరూపంలో కూడా మార్పులు రానున్నాయి. వాటి పరిధిలో మండలాల్లోను మార్పుచేర్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో ప్రస్తుతం మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే అందోల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలున్నాయి. పెద్దశంకరం పేట మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో వీటి సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో కనీసం రెండు నుంచి మూడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభాను బట్టి.. 2011 జనాభా లెక్కల ప్రకారం మెదక్ జిల్లా జనాభా 7.67 లక్షల జనాభా ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం మేలో జనగణన చేపట్టనుంది. 2027 మార్చి వరకు దేశవ్యాప్తంగా జనగణన పూర్తవుతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 2027 జనాభా లెక్కల ప్రకారం ఎంత జనాభా పెరుగుతుంది? ఎంతమంది ఓటర్లుండే అవకాశాలున్నాయి? వీటి సంఖ్యను ఆధారంగా కొత్త నియోజకవర్గాలను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మహిళా రిజర్వుడు స్థానాలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమర్థవంతంగా జనగణన
అదనపు కలెక్టర్ నగేశ్మెదక్ కలెక్టరేట్: జనగణన–2027 తొలివిడతలో ప్రక్రియలో భాగంగా ఇళ్లలెక్కింపును ఎన్యూమరేటర్లు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ స్పష్టం చేశారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో జనగణన అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...జనగణన విధులను అధికారులు సక్రమంగా నిర్వహించాలన్నారు. జనగణనలో సాంకేతిక వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన చేయాలని తెలిపారు. తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో చేస్తున్నట్లు వెల్లడించారు. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్లగణన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు పెంచాలి
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా మెదక్ కలెక్టరేట్: జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో నిధుల కోటా పెంచాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేసి కలెక్టరేట్లో ఏఓ యూనస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ...ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తుందని విమర్శించారు. భూ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, ఉపాధి హమీ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకు పోయాయని ఆరోపించారు. భూ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారన్నారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పేరుతో పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి శివారులోని రైతుల భూమి బ్లాక్ లిస్టులో పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, ఏ.మల్లేశం, కే.మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సింగూరు ప్రాజెక్టు వద్ద ఆక్టోపస్ దళాలు
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు వద్ద మంళవారం ఆక్టోపస్ దళాలు మార్చ్ ఫాస్టు నిర్వహించాయి. ఆపదకాలంలో ప్రాజెక్టును ఎలా సంరక్షించుకోవాలో సూచించారు. మూడేళ్ల క్రితం కూడా ప్రాజెక్టు వద్ద ఆక్టోపస్ దళాలు మార్చ్పాస్టు నిర్వహించారు. పాలిసెట్కు తుదిగడువు ఏప్రిల్ 20 జోగిపేట(అందోల్): పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు హాజరుకావాలనుకుంటున్న విద్యార్థుల ఏప్రిల్ 20వ తేదీ చివరి తేదీ అని జోగిపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎం.వీణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మే13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే మూడు బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. ఈ పాలిటెక్నిక్ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమేనని, ఇటీవల మా సంస్థకు చెందిన అధ్యాపకులు పాలిటెక్నిక్ చదువు గురించి అవగాహన పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. -
ఏప్రిల్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతి మాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ కు ఏప్రిల్ 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది యాసంగిలో 4,45,466 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే వన మహోత్సవంలో జిల్లావ్యాప్తంగా 31.7 లక్షల మొ క్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. అందుకనుగుణంగా అధికారులు పటిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 73 అర్జీలు అందజేశారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ -
రైతులకు పరిహారం చెల్లించండి: ఎమ్మెల్యే
నర్సాపూర్: సింగూర్ ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించినందున ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు రెండేళ్ల పాటు క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. ప్రాజెక్టు కింద చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి పరిహారం అందచేసి ఆదుకోవాలన్నారు. కాగా చిన్నఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, ఇప్పటివరకు పనులు చేపట్టలేదన్నారు. ఇప్పటికై నా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులకు నేడు ఆఖరు మెదక్ కలెక్టరేట్: స్వయం ఉపాధి సబ్సిడీ పథకాలను జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు నేడే ఆఖరి రోజు అని తెలిపారు. జిల్లాలో 2025–26 వార్షిక ప్రణాళిక అమలు చేసేందుకు రూ.236.60 లక్షలతో 249 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. 119 ఈవీ ద్విచక్ర వాహ నాలు, 59 ఈవీ ఆటోలు, రైతులకు సోలార్ పంపులు అందజేయడం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026
రైతు భరోసా నిధులు విడుదల● మొదటి విడతలో రూ.110.45 కోట్లు విడుదల మెదక్జోన్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో సా నిధులు విడుదల చేసింది. తొలుత ఎకరం వరకు ఉన్న రైతులకు నేటి నుంచి ఖాతాల్లో జమ కానుంది. జిల్లాలో 3.65 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 10,694 ఎకరాల పార్ట్(బీ) భూములకు పట్టాలు అందజేశారు. దీంతో మొత్తం 3,75,694 ఎకరాలకు చేరుకుంది. ఎకరాకు రూ.6000 చొప్పున, మొత్తం 225.41 కోట్లు అవసరం కానున్నాయి. మూడు విడతల్లో ఈ నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలో 1,84,084 ఎకరాలకు గానూ రూ.110.45 కోట్లు విడుదలయ్యాయి. మిగితా 1,91,610 ఎకరాలకు మరో రెండు విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. కాగా యాసంగి పనులు జనవరి నుంచి ప్రారంభం కాగా, ప్రభుత్వం మూడు నెలల అనంతరం పెట్టుబడి సాయం విడుదల చేసింది. మిగితా రెండు విడతలు ఏప్రిల్లో అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇదిలా ఉండగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, అదే ఏడాది వానాకాలంలో ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఇచ్చింది. 2024 వానాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ప్రస్తుతం నిధులు విడుదల చేసింది. ముక్క తగ్గనంటోంది.. ముద్ద దిగనంటోంది ● రూ.360కి చేరిన కిలో చికెన్పార్టీ బలోపేతానికి కృషి చేయాలి రామాయంపేట(మెదక్): బీజేపీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయా లని పార్టీ మూడు జిల్లాల ఇన్చార్జి రంజిత్ మోహన్ పిలుపునిచ్చారు. రామాయంపేటలో కొనసాగుతున్న పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లకు వివరించి వారిని చైతన్యపర్చాలన్నారు. పదేళ్లలో మోదీ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని, యువతను పార్టీలోకి ఆహ్వానించాలని రంజిత్ మోహన్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెల్ముల సిద్దరాంలు, నవాత్ రాజేంద్రప్రసాద్, ఆకుల రమేశ్, పోలీస్ దేవెందర్, పార్టీ మండలాధ్యక్షుడు నవీన్గౌడ్, పట్టణాద్యక్షుడు అవినాశ్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అద్యక్షుడు సత్యం, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి పాల్గొన్నారు. -
మంత్రి పొన్నం కృతజ్ఞతలు
నంగునూరు(సిద్దిపేట): సీఎం రేవంత్రెడ్డి పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీ యూనిట్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సీఎంకు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. పటాన్చెరుటౌన్: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...భగత్సింగ్ తన 23 సంవత్స రాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుడని గుర్తు చేశారు. 1907 లో జన్మి ంచి, 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు -
మాయ‘దారి’ మృత్యుపాశం
కొల్చారం(నర్సాపూర్): మెదక్– నర్సాపూర్– హైదరాబాద్(బాలానగర్) 765డీ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మండల పరిధిలో ఒకేలేన్గా ఉన్న ఈరోడ్డును విస్తరణలో భాగంగా 2021లో రెండు వరసల్లో జాతీయ రహదారిగా విస్తరించారు. మండల శివారులోని లోతు వాగు నుంచి రాంపూర్ వరకు మలుపులతో కూడి ఉన్న ఈ జాతీయ రహదారి ప్రస్తుతం వాహనదారుల పాలిట మృతిదారిగా తయారైంది. గడిచిన వారం రోజుల్లో ఆరుగురు ఈ రహదారిపై వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈనెల 14న రంగంపేటకు ఓ శుభకార్యానికి వచ్చిన హవేళిఘణాపూర్ వాసులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈనెల 18న పోతంశెట్టిపల్లి వద్ద మెదక్ వైపు నుంచి వస్తున్న ఆటోను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణికుడు దుర్మరణం చెందారు. తాజాగా శనివారం బైక్పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐఎంఎల్ డిపోకు చెందిన నగేశ్ మృత్యువాతపడ్డాడు.అతివేగమే ప్రమాదాలకు కారణం! అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు చోట చేసుకుంటున్నాయని పోలీసుల విచారణలో తేలింది. దీనికి తోడు జాతీయ రహదారి మధ్యలో డివైడర్ లేకపోవడం, మలుపులు కూడా ఉండడం మరో కారణంగా తెలుస్తోంది. ఇదే విషయమై కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ను ఆరా తీయగా.. రోడ్డుపైకి వచ్చే ముందు వాహనాలు నడిపే వ్యక్తులు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహ నాల వేగాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలై చనిపోతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు వహిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రమాదాలకు నిలయంగాఎన్హెచ్– 765డీ వారంలో ఆరుగురు మృత్యువాత -
పోరాటాల ఫలితమే..
సిద్దిపేటజోన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా వత్తిడి చేయడం వల్లే సర్కారు దిగివచ్చిందని, మా పోరాటాల ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400 మద్దతు ధర ఉండగా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700 అమ్మి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 25శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికై నా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్ఫ్లవర్ క్వింటాల్ రూ.7,721 మద్దతు ధర ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో యాసంగికి సాగు ఉండేదని, కాళేశ్వరం పుణ్యమా అని పదింతలు పెరిగి 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. కాళేశ్వరం వచ్చాక కరువు అనే పదం లేదన్నారు. జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చిన ఘనత కాళేశ్వరానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కొనుగోలుకేంద్రాల ఏర్పాటు సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికేదిగుబడులు దళారుల చేతుల్లోకి మాజీ మంత్రి హరీశ్రావు -
హత్యాయత్నం చేసిన వారికి బెయిలా?
మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్రావుపాపన్నపేట(మెదక్): పోలీసులపై కాల్పులు జరిపిన డ్రగ్స్ ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించాలని ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని లక్ష్మీనగర్లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులపై తుపాకులతో కాల్పులు జరిపిన డ్రగ్స్ ముఠాకు స్టేషన్ బెయిల్ ఇచ్చింది తెలంగాణ పోలీసులే అన్నారు. డీజీపీ ఫాంహౌస్ సీసీ ఫుటేజీ చూసి నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. దోషులు ఎంతటి వారైన కఠిన శిక్ష పడేలా కేసులు నమోదు చేయాలని కోరారు. పైలెట్ రోహిత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయమై మాట్లాడవద్దని తనకు బీజేపీ పెద్దలెవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే, భారత ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ప్రజలందరూ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్గౌడ్, జగిత్యాల జిల్లా ఇన్చార్జి గడ్డం శ్రీనివాస్, ప్రశిక్షణ జిల్లా కన్వీనర్ రంజిత్రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, జనగామ జిల్లా ప్రచారి నందారెడ్డి, నాయకులు సు భాష్గౌడ్, సుధాకర్, ఎంఎల్ఎన్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు సంతోష్చారి తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
చేయూతనివ్వరూ!
బడ్జెట్లో కొత్త పింఛన్ల ప్రకటనపై వృద్ధుల్లో నిరాశ ‘పాపన్నపేట మండలం గాంధారిపల్లికిచెందిన అంకిడి మరియమ్మ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. మరుసటి ఏడాది ఒక్కగానొక్క కొడుకు ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిల్లు అయ్యాయి. ప్రస్తుతం ఉపాధిహామీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. నాలుగేళ్లుగా వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూస్తోంది. అయినా అతీగతి లేదు’ ఇలా జిల్లాలో వేలాది మంది పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా వారి వేదన అరణ్య రోదనే అవుతుంది. మెదక్ అర్బన్: పండుటాకుల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లింది. సామాజిక పింఛన్లకు గతేడాది బడ్జెట్నే ప్రతిపాదించారు. అయితే అర్హులైన వారికి రెండు లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే 2023 డిసెంబర్ చివరి నుంచి గత నెల చివరి వరకు వివిధ కేటగిరిల కింద పింఛన్ పొందుతున్న వారిలో మరణించిన వారు, అనర్హులు, ఇతర కారణాలతో పింఛన్లు కోల్పోయిన వారి స్థానంలో అర్హులైన కొత్తవారికి ఇచ్చే అవకాశం. ఈలెక్కన చూస్తే మండలానికి 10 పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగా వివిధ రకాల పింఛన్లు రూ. 2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లు రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచే అవకాశం కూడా కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో 1,09,116 పింఛన్ పొందుతున్న వారు ఉన్నారు. వీరికి నెల నెలా రూ.24,92,56,832 పంపిణీ చేస్తున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 35,846, వితంతు 43,515, దివ్యాంగ 7,997, గీత కార్మికులు 838, చేనేత 447, ఫైలే రియా 455, డయాలిసిస్ 160, బీడీ కార్మికులు 15,656, ఒంటరి మహి ళలు 4,102 మంది ఉన్నారు.నాలుగేళ్లుగా దరఖాస్తుల పెండింగ్ గతంలో 61 ఏళ్లు ఉన్న వృద్ధాప్య పింఛన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు. ఆగస్టు 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు డీఆర్డీఓ కార్యాలయంలో 1,287 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో తీసుకున్న దరఖాస్తులు పంచాయతీ కార్యదర్శుల వద్ద, మండల పరిషత్ కార్యాలయాల్లో కుప్పలు, తెప్పలుగా పడి ఉన్నాయి. మొత్తం మీద జిల్లాలో సుమారు 10 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మండలానికి 10 మందికి మాత్రమే వచ్చే అవకాశం! జిల్లాలో వేలాది మంది ఎదురుచూపు -
నేడు సిద్దిపేటకు సీఎం రాక
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. గంటకు 120 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేసి నూనె తీయనుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈనెల 19న రైతు మహోత్సవ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలలో భాగంగా ఐజీ చంద్రశశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను గుర్తించి ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పటిష్ట బందోబస్తు నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఐజీ చంద్రశేఖర్రెడ్డి తోపాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరిమాళ్ తోపాటు భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులతో సమాలోచన చేశారు. సీఎం రేవంత్ హెలికాప్టర్లో వచ్చి.. తిరిగి రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం ఉండటంతో సిద్దిపేట నుంచి ఫ్యాక్టరీ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.ఏర్పాట్లపై మంత్రుల ఆరా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐజీ, కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు పోలీసుల పటిష్ట బందోబస్తు


