breaking news
Prakasam
-
1971 నాటి కేసు మళ్లీ తెరపైకి.. పోలీసుల వేట!
మార్కాపురం: 1971లో నమోదైన ఓ కేసుకు సంబంధించి 55 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు మంగళవారం మార్కాపురం చేరుకోవడం ఆసక్తి రేకెత్తించింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హద్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలో 55 ఏళ్ల క్రితం నేరం చేసిన రామయ్య కుమారుడు నారాయణ మార్కాపురంలో ఉంటున్నాడన్న సమాచారంతో హెడ్కానిస్టేబుల్ యువరాజ్ కీర్తిపాల్ రాథోడ్ ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు నెల రోజుల్లోపు హద్గావ్లోని జేఎంఎఫ్సీ కోర్టు2 న్యాయమూర్తి ఎస్.ఎస్.లోహకరే జాదవ్ ఎదుట లొంగిపోవాలని జారీ చేసిన నోటీసులను ఆయన వెంట తీసుకొచ్చారు. కాగా, కేసు నమోదైన 1971 నాటికి మార్కాపురం కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండటం గమనార్హం. నిందితుడి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
తల్లికి అన్యాయం..తండ్రికి వందనం
ప్రకాశం జిల్లా: తల్లి ఖాతాలో జమ కావాల్సిన తల్లికి వందనం నగదు తండ్రి ఖాతాలో జమయ్యాయి. తల్లికి వందనం డబ్బులు అందరికీ వచ్చినా తన ఖాతాలోకి రాలేదని ఆ తల్లి సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగింది. చివరికి తెలిసిన వారి సహాయంతో సచివాలయ సిబ్బందిని ప్రశ్నిచండంతో అసలు విషయం బయటపడింది.ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన కుంచాల వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు రావడంతో ఇద్దరూ గ్రామంలోనే వేర్వేరుగా జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ఒకరు ఇంటర్మీడియెట్ పూర్తి చేయగా, మరొకరు 7వ తరగతి చదువుతున్నాడు. అయితే గత ఏడాదికి సంబంధించిన తల్లికి వందనం డబ్బులు తల్లి లక్ష్మీ బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. కానీ ఈ ఏడాది ఇద్దరు కుమారులకు సంబంధించిన తల్లికి వందనం డబ్బులు రాలేదు. ఏం జరిగిందని సచివాలయ అధికారులను ప్రశ్నించగా పెద్ద కుమారుడు మదన్కు సంబంధించిన వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. అయితే మదన్కు సంబంధించిన సంరక్షణ అంతా తండ్రి, నాయనమ్మలు చూసుకుంటుండడంతో దాని గురించి తల్లి పట్టించుకోలేదు. కానీ రెండో కుమారుడైన కుంచాల శ్రీనివాసరావు సంరక్షణ మొత్తం తల్లినే చూసుకుంటోంది. కులీనాలి చేసుకొని కుమారుడిని చదివించుకుంటోంది. తల్లికి వందనం డబ్బులు పడలేదని సచివాలయానికి వెళ్లి అధికారులను ప్రశ్నించడంతో పరిశీలించిన అధికారులు తండ్రి కుంచాల వెంకటేశ్వర్లు అకౌంట్కు జమయ్యాయని తెలిపారు. దీంతో ఖంగుతున్న లక్ష్మీ.. భర్తను ప్రశ్నించగా మాకు తెలియదు... మాకు డబ్బులు పడేలేదని నానా మాటలు అని బెదిరించారని లక్ష్మీ తెలిపింది. ప్రతి సారి తన అకౌంట్లో పడుతున్న డబ్బులు ఈ ఏడాది ఎందుకు మారిందని దీనిపై ఫిర్యాదు చేసేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. సబ్ కలెక్టర్ అందుబాటులో లేరు. కావాలనే నా ఖాతాను తీసి వేసి నా భర్త ఖాతాను లింక్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. నేను ఊరిలోనే ఉంటాను..నాకు తెలియకుండా కనీసం నాతో మాట్లాడకుండా ఖాతాను మార్చడం ఏంటని ప్రశ్నిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. -
‘మామూలు’ ఇస్తేనే మస్టర్!
పొదిలి రూరల్: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు అరకొర వేతనాలు.. వీటికి తోడు ఉపాధి హామీ సిబ్బంది లంచాల వేధింపులతో కూలీలు విలవిల్లాడుతున్నారు. ‘అధికారం మాది.. అడిగినంత ఇస్తేనే పని.. లేదంటే దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ పొదిలి మండలంలో కొందరు సిబ్బంది బరితెగిస్తున్నారు. మండలంలోని తుమ్మగుంట పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) వై.మల్లికార్జునరావు తీరుపై ఉపాధి కూలీలు మండిపడుతున్నారు. మంగళవారం ఎంపీడీఓ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. పని కావాలంటే వారానికి రూ.400 లంచం ఇవ్వాలని ఎఫ్ఏ డిమాండ్ చేస్తున్నాడని వాపోయారు. వంద మంది పనికి వెళ్తే.. డబ్బులిచ్చిన 70 మందికే డిమాండ్ పెట్టి, మిగతా వారికి పని ఇవ్వకుండా వివక్ష చూపుతున్నాడని బీరం రంగమ్మ, బీరం వెంకటరత్తమ్మ, చినగోపాల్రెడ్డి, లక్ష్మి, కృష్ణవేణి, తిరుపతమ్మ, నాగార్జునరెడ్డి, చెంచయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినంత ఇవ్వలేదన్న కక్షతో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు చేసిన పనికి సంబంధించిన మస్టర్లను తమ వద్దే ఉంచి అప్లోడ్ చేయలేదని ఎంపీడీఓకు చూపించారు. మే నెలలో రెండు వారాల పాటు చేసిన పనికి కూడా మస్టర్ వేయలేదని, దీనిపై ఏపీఓకు మొరపెట్టుకున్నా ‘ఆ డబ్బులు మర్చిపోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు ఆరోపించారు. కూలీల ఫిర్యాదుపై ఎంపీడీఓ శ్రీనివాసరావు స్పందిస్తూ.. కూలీలతో దురుసుగా వ్యవహరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న సదరు ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని చెప్పారు. పని కావాలంటే వారానికి రూ.400 ఇవ్వాలని ఎఫ్ఏ డిమాండ్ ఎంపీడీఓకు మొరపెట్టుకున్న తుమ్మగుంట ఉపాధి కూలీలు -
గుండ్లకమ్మ నదికి నీళ్లొదిలారు..
మద్దిపాడు: గుండ్లకమ్మ నదిపై మల్లవరం వద్ద ఉన్న రిజర్వాయర్ నుంచి నదిలోకి పూర్తిగా నీరు వదలడం నిలిపేశారు. ఈ క్రమంలో గుండ్లకమ్మ నీటి కోసం ఆధారపడి ఉన్న మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమకు రిజర్వాయర్ నుంచి నదిలోకి నీరు విడుదల చేయించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జునను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం మల్లవరం వద్ద ఉన్న రిజర్వాయర్ను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మార్గమధ్యంలోనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్దకు వచ్చి రిజర్వాయర్లో నీటిమట్టం పరిశీలించారు. గత ప్రభుత్వంలో 19 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్లో నీరు నిలిచినప్పుడు కూడా గుండ్లకమ్మ నదిలోకి నీరు విడుదల చేశారన్నారు. దీంతో నదిపై ఆధారపడి ఉన్న దిగువ గ్రామాల ప్రజలు, పశువులకు నీరు, మేత పెట్టుకునేందుకు సరిపోయాయని, కానీ ప్రస్తుతం ఆ విధంగా నీటిని విడుదల చేయకుండా నిలుపుదల చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అధికారులకు తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ పనైనా తాను సహించబోనని స్పష్టం చేశారు. దీంతో రిజర్వాయర్ జేఈ రామాంజనేయులు ఉన్నతాధికారులకు విషయం తెలిపి వెంటనే ఏడో నంబర్ గేటు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ నదిలోకి విడుదల చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు వాకా కోటిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, పోలిలేని కోటేశ్వరరావు, పాలడుగు రాజీవ్, బొమ్మల రామాంజనేయులు, అన్వేష్, గుడ్డపాతల రవి, కాకర్ల వెంకటేష్, దుడ్డు వినోద్కుమార్, కందుల డానియేలు, నాదెండ్ల మహేష్, మద్దినేని శ్రీకాంత్, రావూరి ప్రసన్నకుమార్రెడ్డి, జగన్నాథ్ కోటిలింగం, వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, పోకూరి శ్రీరాములు, రావూరి అశోక్రెడ్డి, ఎడవల్లి మోహన్రావు, పైనం ప్రసాదరావు, రాయపాటి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
లేని భూమిని చూపి.. రూ.25 లక్షల టోకరా!
కురిచేడులో అనుమతి లేని ఓ లేఔట్ కురిచేడు: తనది కాని భూమిని చూపి, లేఔట్ వేసి వప్లాట్లు విక్రయిస్తున్నట్లు నమ్మించి ఏకంగా రూ.25 లక్షలు దోచుకున్న ఘరానా మోసం కురిచేడులో వెలుగుచూసింది. ఎస్సై జి.కోటయ్య కథనం ప్రకారం.. విజయవాడ భారతి ఇంటర్మీడియట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న పావులూరి నీలిమకు బుల్లా విజయ్కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కురిచేడు మండలం పడమరగంగవరం సర్వే నంబర్ 89/2లోని 6.95 ఎకరాల భూమి తనదేనని నమ్మబలికాడు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్తో ఇక్కడ భూములకు భారీ డిమాండ్ ఉంటుందని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన నీలిమ.. మొదట రూ.3.25 లక్షలతో రెండు ప్లాట్లు (డాక్యుమెంట్ నంబర్ 1681/2025), ఆ తర్వాత రూ.20 లక్షలతో మరో 2 వేల చదరపు గజాల స్థలాన్ని (డాక్యుమెంట్ నంబర్ 13847/2025) రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే డాక్యుమెంట్లలో ఉన్న స్థలానికి, భౌతికంగా చూపించిన భూమికి పొంతన లేకపోవడంతో మోసపోయానని ఆమె గ్రహించారు. దీనిపై నిలదీయగా విజయ్కుమార్ ముఖం చాటేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కన్వర్షన్ లేకుండానే దందా.. వ్యవసాయ భూములను జాయింట్ కలెక్టర్(జేసీ) ద్వారా కన్వర్షన్ చేయకుండానే మండలంలో 10కి పైగా అక్రమ లేఔట్లు వెలిశాయి. వీటికి పంచాయతీ కార్యదర్శులు సైతం అప్రూవల్ ఇస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. జిల్లా అధికారులు మొద్దునిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు మరింత మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. విజయవాడ మహిళ ఫిర్యాదుపై చీటింగ్ కేసు నమోదు కురిచేడు మండలంలో రోజుకో భూదందా వెలుగులోకి.. జేసీ కన్వర్షన్ లేకుండా సాగు భూముల్లో ప్లాట్లు -
31న దివ్యాంగ క్రికెటర్ల ఎంపిక
ఒంగోలు సిటీ: డీసీసీఏపీ, డీఏసీఏల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ‘అమరావతి ఇన్క్లూజివ్ క్రికెట్ కప్–2026’ టోర్నీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి శారీరక దివ్యాంగ క్రికెటర్ల ఎంపిక పోటీలు ఈ నెల 31న నిర్వహించనున్నారు. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఎంపిక పోటీ ఉంటుందని అసోసియేషన్ జిల్లా కన్వీనర్ జి.సుబ్బయ్య తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్తో పాటు ఆధార్, సదరమ్ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డుల జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వివరాలకు 80969 29907, 91335 03822ను సంప్రదించాలని కోరారు. అద్దంకి: పట్టణంలో బైకు చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఎనిమిది నెలల జైలు శిక్ష పడినట్లు సీఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. గత ఏడాది జూలై 19న స్థానిక హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద తన బైకు చోరీకి గురైందని తోటకూర నంది కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా వినుకొండకు చెందిన కె.వెంకటసాయి, కె.సాయి కృష్ణను పోలీసులు నిందితులుగా గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారు నేరం అంగీకరించడంతో కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అఖిల వారికి ఎనిమిది నెలల చొప్పున జైలు శిక్ష విధించారు. అనంతరం నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ వివరించారు. ● పెద్దదోర్నాల మండలం కటకానిపల్లెలో ఘటన పెద్దదోర్నాల: మండల పరిధిలోని కటకానిపల్లెలో 60 వ్యవసాయ బోర్లకు చెందిన విద్యుత్ కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మంగళవారం వేకువజామున విద్యుత్ సరఫరా కాగానే పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు.. బోర్ల వద్ద వైర్లను కత్తిరించి ఉండటాన్ని గమనించారు. వ్యవసాయ బోర్లతో పాటు గ్రామానికి తాగునీరు అందించే బోర్ల వైర్లను సైతం దుండగులు అపహరించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో కేబుల్స్ చోరీ కావడం రైతుల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై బాధిత రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్దదోర్నాల: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఐనముక్కల కొండారెడ్డి కాలనీ సమీపంలో కర్నూలు–గుంటూరు రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకట రమణయ్య కథనం ప్రకారం.. యడవల్లికి చెందిన దూదేకుల మహబూబ్ పీరా(46) ద్విచక్ర వాహనంపై దోర్నాల వైపు వస్తుండగా ఐనముక్కల వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన 108 సిబ్బంది సయ్యద్ భాషా, శ్రీనివాసులు వెంటనే అతడిని పెద్దదోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత హత్య కేసులో నలుగురు అరెస్టు కనిగిరిరూరల్: వివాహిత హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం రాత్రి తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కనిగిరిలోని అర్బన్ కాలనీకి చెందిన ప్రతిభా భారతి (33) మృతికి కారణమైన భర్త గంటా పీటర్ ప్రమోద్ కుమార్, అతని అన్న, మరో ఇద్దరిని మంగళవారం ఉదయం డీఎస్పీ ఎం శ్రీధర్, ఎస్సై జి.సందీప్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 10 వరకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
అడవికి ప్రాణం.. అంతులేని గంభీరం
పులుల రక్షణ ఛత్రంగా నల్లమల అభయారణ్యం పులి గాండ్రిస్తే అడవి దద్దరిల్లుతుంది! జీవవైవిధ్యాన్ని రక్షించడంలో, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవికి రారాజు అయిన పెద్దపులి పాత్ర అత్యంత కీలకమైనది. దేశంలోనే అతిపెద్దదైన నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ చారల అందాల స్వేచ్ఛా విహారానికి సురక్షిత నిలయంగా మారింది. దట్టమైన నల్లమల అరణ్యంలో పులులు రాజసంగా అడుగులేస్తూ తమ సంతతిని గణనీయంగా వృద్ధి చేసుకుంటున్నాయి. ఒకవైపు అక్రమార్కులు, వేటగాళ్ల ముప్పు పొంచి ఉన్నా.. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులు, రెస్క్యూ టీమ్లు, డాగ్ స్క్వాడ్ల వంటి కట్టుదిట్టమైన పరిరక్షణ చర్యల వల్ల నల్లమలలో బెబ్బులి రొమ్ము విరిచి తిరుగుతోంది. 2022 గణాంకాల ప్రకారం నల్లమలలో 63 పెద్దపులులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 87కు చేరి ఉంటుందని అటవీ శాఖ అధికారుల అంచనా. పచ్చని అడవికి ప్రాణమైన మన జాతీయ జంతువును కాపాడుకోవడం, భావితరాలకు అందించడం ఎంతో అవసరం. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – పెద్దదోర్నాల నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ముఖచిత్రం విస్తరించిన జిల్లాలు నంద్యాల, మార్కాపురం, పల్నాడు. పాత విస్తీర్ణం 3,727.82 చ.కి.మీ అదనంగా కలిపిన విస్తీర్ణం 2,149 చదరపు కిలోమీటర్లు. కొత్త హోదా : ఎకో సెన్సిటివ్ జోన్ పులుల ప్రధాన ఆహారం జింకలు, దుప్పులు, అడవి పందులు. -
ధర్నా చేసినప్పుడే వేతనాలు..లేకపోతే ఒట్టిచేతులు
ఒంగోలు టౌన్: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సహనం నశించిన జీజీహెచ్ పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు శానిటేషన్ ఏజన్సీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పెద్ద సంఖ్యలో పారిశుధ్య కార్మికులు నిరసనకు దిగి వేతనాల కోసం నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధర్నాలు చేసినప్పుడు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, లేకపోతే చాకిరి చేయించుకుంటూ ఒట్టి చేతులు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను సకాలంలో ఇప్పించడంలో జీజీహెచ్ ఉన్నతాధికారులు విఫలమవడం దారుణమని పలువురు పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అడిగితే ప్రభుత్వం బడ్జెట్ పెట్టలేదని చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. వేతనాలు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. పారిశుధ్య కాంట్రాక్టర్ను తొలగించాలి: సీఐటీయూ పారిశుధ్య కార్మికుల చేత బండచాకిరి చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న ఏజన్సీని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. జీజీహెచ్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మే, జూన్ నెల వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వేతనాల గురించి ప్రశ్నించినప్పుడల్లా ఇంకా బడ్జెట్ రాలేదని జవాబు చెబుతున్నారని, దీనికి కార్మికులు బాధ్యత వహించాలా అని ప్రశ్నించారు. జీజీహెచ్లో పారిశుధ్య విభాగంలో 240 మంది కార్మికులు పని చేస్తున్నారని, వీరిలో ఎక్కువగా మహిళలు ఉన్నారని తెలిపారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని, కార్మికులు విధులకు హాజరవడానికి రవాణా ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సీఐటీయూ నగర కన్వీనర్ టి.మహేష్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా వేధించడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏజన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రాయబారాలు చేయడం ఏమిటని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు విజయమ్మ, యూనియన్ నాయకులు సుబ్బారావు, జాలమ్మ, సీపీఐ నాయకులు కొత్తకోట వెంకటేశ్వరరావు, ఎంఏ సాలార్ తదితరులు పాల్గొన్నారు. -
దోచుకో.. పంచుకో.. తినుకో..
దీక్షా శిబిరంలో కూర్చున్న మాజీ మంత్రి సురేష్ సంఘీభావం తెలుపుతున్న జంకె వెంకటరెడ్డి మార్కాపురం: రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని మాయమాటలు చెప్పిన కూటమి నేతలు.. గద్దెనెక్కిన తర్వాత ‘డీపీటీ’(దోచుకో.. పంచుకో.. తినుకో) విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండేపి ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. మార్కాపురంలో డాక్యుమెంట్ రైటర్లు తమ సమస్యల పరిష్కారం కోసం తొమ్మిది రోజులుగా చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుస్తున్న డాక్యుమెంట్ రైటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ కార్యాలయాలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే 396 జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. మెడికల్ కళాశాలలు, జీజీహెచ్లను ఇప్పటికే పీపీపీలోకి తెచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను కూడా ఆ దిశగా తీసుకెళ్లడం దారుణమన్నారు. పీపీపీ విధానం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని, ‘మాకింత ఇవ్వు.. మిగిలింది నువ్వు తీసుకో’ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే లేఖరుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెకు జంకె, ఏఐటీయూసీ మద్దతు డాక్యుమెంటు రైటర్ల పెన్డౌన్ సమ్మెకు వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సంఘీభావం ప్రకటించి, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ కూడా సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి.సుబ్బారావు, స్టార్ మస్తాన్, ప్రకాష్, గోవర్ధన్ పాల్గొన్నారు. ఇదే చంద్రబాబు ప్రభుత్వ విధానం.. సంపద సృష్టి బూటకం దస్తావేజు లేఖరుల సమ్మెలో మాజీ మంత్రి సురేష్ ధ్వజం 396 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే జంకె, ఏఐటీయూసీ నేత రవీంద్రనాఽథ్ -
పొన్నలూరు ఎస్సై తలబిరుసు.. బాధితుడిపైనే కేసు!
● అక్రమంగా ఇంటి కూల్చివేతపై బాధితుడి ఫిర్యాదు బేఖాతరు ● గ్రీవెన్స్ అర్జీ మేరకు ఎస్పీ ఆదేశించినా కేసు కట్టని ఎస్సై ● మంత్రి స్వామి కనుసన్నల్లో బాధిత కుటుంబంపైనే ఎదురు కేసు పొన్నలూరు: సామాన్య ప్రజలకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులు దారి తప్పుతున్నారు. న్యాయం, అన్యాయం విచక్షించకుండా అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా సామాన్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బాధితుడి సమస్య పరిష్కరించాలని ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు ఆదేశించినా స్థానిక ఎస్సై బేఖాతరు చేస్తున్న తీరు పొన్నలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలోని చెరుకూరుకు చెందిన కుంచాల మాధవరావు తనకు వారసత్వంగా వచ్చిన పక్కా గృహంలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు గ్రామంలో లేని సమయం చూసి, అదే గ్రామానికి చెందిన కుంచాల మాల్యాద్రి పొక్లెయిన్తో మాధవరావు ఇంటిని కూల్చివేసి ఆనవాళ్లు లేకుండా చదును చేశాడు. తన అర్హత పత్రాలతో న్యాయం చేయాలని శనివారం బాధితుడు పొన్నలూరు పోలీస్స్టేషన్ను ఆశ్రయించగా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎస్సై కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేసి వెనక్కి పంపారు. దీంతో బాధితుడు సోమవారం గ్రీవెన్స్లో ఎస్పీ ఎదుట సమస్యను మొరపెట్టుకున్నాడు. బాధితుని ఫిర్యాదుపై విచారించి కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయం ఆదేశించినా స్థానిక ఎస్సై పట్టించుకోలేదు. పోలీస్ బాస్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి మంత్రి స్వామి కనుసన్నల్లో వింత నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే, ఇంటిని కూల్చిన మాల్యాద్రి వద్దనే సోమవారం ఎస్సై ఫిర్యాదు స్వీకరించారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ స్థలాన్నే వారు ఆక్రమించి, తమపై దౌర్జన్యం చేసినట్లు మాల్యాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాధితుడు మాధవరావు, అతని భార్య లక్ష్మి, బావ నరసింహంపై ఎస్సై అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం. మంత్రి స్వామి ఆదేశాలతోనే పోలీసులు ఈ విధంగా తమపై ఎదురు కేసు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతూ సామాన్యులపై కేసులు బనాయించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎస్సైని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సెంట్రల్ కమిటీ జాయింట్ సెక్రటరీగా ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రేడియాలజీ విభాగం హెచ్ఓడి డా.నరసింహాచారి ఎన్నికకావడంపై జిల్లా ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ) కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం డా.నరసింహాచారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఏడుకొండలరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు డా.నరసింహాచారి కృషి చేయాలని కోరారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ప్రభుత్వ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీడీఏ రాష్ట్ర కార్యదర్శి డా.నటరాజ్, గౌరవాధ్యక్షుడు డా.మస్తాన్ బాషా, గర్నింగ్బాడీ సభ్యులు డా.తిరుపతి రెడ్డి, డా.శ్రీదేవి పాల్గొన్నారు. -
నాకు విలువలున్నాయి.. ఎక్కడికీ పారిపోలేదు: ఉదయ్కృష్ణారెడ్డి
సాక్షి, ప్రకాశం: హైదరాబాద్ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్ల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ట్రైనీ ఐపీఎస్(సస్పెండెడ్) ఉదయ్కృష్ణారెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్న ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.‘‘మా నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వస్థలం ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం వచ్చా. కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల పూర్తి వివరాలు వెల్లడించలేను. త్వరలోనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా’’ అని మంగళవారం ఉదయ్కృష్ణారెడ్డి ఓ మీడియా చానెల్తో మాట్లాడారు. నాకు విలువలున్నాయితాను పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినని, విలువలకు కట్టుబడి జీవిస్తున్నానని ఉదయ్కృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్, న్యాయ వ్యవస్థలపై తనకు నమ్మకం ఉందని, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.నోటీసులు అందలేదుపోలీసులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని తన రెండు చిరునామాలకు వెళ్లారన్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆ రెండు చిరునామాలు తాత్కాలికమైనవని, తన శాశ్వత చిరునామా అయిన ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాను స్వయంగా హైదరాబాద్కు వెళ్తున్నానని, ఎక్కడికీ పారిపోలేదని మరోసారి స్పష్టం చేశారు.తోటి ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. ఆ వెంటనే దర్యాప్తు నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అటుపై ఆరోపణలు తట్టుకోలేక ఉదయ్ ఆస్పత్రి పాలయ్యారు కూడా. అయితే ఈ ఆరోపణలపై ఉదయ్కృష్ణారెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు.తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తానని ఉదయ్కృష్ణారెడ్డి తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, చివరికి నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
ఓట్లు తొలగించేందుకు పన్నాగం
యర్రగొండపాలెం: అధికారులు కింది స్థాయి సిబ్బందికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండా అన్ఫైన్డబుల్ కింద నమోదు చేయించడం చంద్రబాబు ప్రభుత్వం పన్నిన పన్నాగంలో భాగమేనని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో 45 లక్షల ఓటర్లను తొలగింపులో సింహ భాగం ఆచూకీ దొరకటం లేదంటే వీరంతా రాష్ట్రం నుంచి పారిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఆ ఓటర్లను కావాలని తొలగించారన్న ఆరోపణలు వస్తున్నా అందుకు సమాధానం చెప్పగలిగే సత్తా అధికారంలో ఉన్న టీడీపీ పెద్దలకు లేదని అన్నారు. కనిపించకుండా పోయారంటున్న ఓటర్లను కనిపెట్టకపోవడం అంటే ఈ ప్రభుత్వం సక్రమంగా పాలన చేస్తుందా.. లేకుంటే నిద్రపోతుందా అన్న అనుమానం వస్తోందని, ఒక వేళ ఆచూకీ దొరకలేదంటున్న వారు మరో చోట ఎన్రోల్ అయిఉంటే ఆచూకీ దొరకలేదని ఏ విధంగా అంటున్నారని ప్రశ్నించారు. సక్రమంగా ఎన్నికల్లో నెగ్గలేని చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమిదని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేయకూడదన్నారు. లోకేశ్ రాజీనామా చేయాలి నైతిక బాధ్యత తీసుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్పై బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అంతకంటే పెద్ద స్కాం డీఎస్సీ కుంభకోణం సాక్ష్యాధారాలతో సహా బయటపడితే అందుకు మీరు నైతిక బాధ్యత ఎందుకు వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా కాక్రోచ్ జరిపిన ఆందోళనను తలపించేలా రాష్ట్రంలోని యువత, విద్యార్థులు సిద్ధమవుతున్నారని, అంతకంటే ముందుగానే లోకేశ్ రాజీనామా చేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ఒంగోలు సిటీ: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒంగోలులో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ నుంచి శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కు ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
పొగాకు రైతులను మోసగిస్తున్న చంద్రబాబు
ఒంగోలు టౌన్: పొగాకు కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి రైతులను మోసం చేసేలా ఉందని, రైతులు ఆందోళనలు చేసిన ప్రతిసారి ఏదో సమీక్షలు చేస్తున్నట్లు హడావుడి చేయడం పరిపాటిగా మారిందని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు విమర్శించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలోని పొగాకు రైతులను చైతన్యం చేస్తూ నిర్వహించిన మోటారు బైకు యాత్ర సోమవారం ముగిసింది. ఈ నేపథ్యంలో మాదాల నారాయణ స్వామి భవనంలో నిర్వహించిన సమావేశంలో చుండూరి మాట్లాడుతూ పొగాకు రైతులకు ఎలాంటి మేలు చేయకుండా ఏదో చేస్తున్నట్లు మభ్య పెట్టే ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 2020లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థల చేత కొనుగోలు చేయించినట్లు ఇప్పుడు చేయడంలేదని విమర్శించారు. నాటి ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన రైతులు లబ్ధి పొందారని చెప్పారు. అందుకు విరుద్ధంగా నేడు చంద్రబాబు రైతుల పట్ల కపట ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సమీక్ష కాలంలో కేజీ పొగాకు రూ.26 కు తగ్గిందని తెలిపారు. ఈ నెల 29వ తేదీ జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడుతున్నట్లు ప్రకటించారు. త్రోవగుంట సమీపంలోని ముదిగొండి బ్రిడ్జి నుంచి మండవవారిపాలెం రోడ్డు సమీపంలో, టంగుటూరు టోల్ ప్లాజా వరకు రహదారులను దిగ్బంధనం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జజ్జూరి జయంతిబాబు, ఎస్ లలిత కుమారి, తూబాటి శ్రీకాంత్, సాగర్, టి.ప్రబాకర్, బి.పద్మ, ఆర్.లక్ష్మి, వెంకటరావు, వడ్డే హనుమా రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల అనుమతి లేదు– డీఎస్పీ పొగాకు రైతులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. డివిజన్లో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున నేషనల్ హైవేపై ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. -
మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుంచి కాపాడండి
ఒంగోలు టౌన్: మైక్రో ఫైనాన్స్ ఏజంట్లు వేధిస్తున్నారని, మహిళలను అసభ్యంగా దూషిస్తున్నారని, ఇళ్లకు తాళాలు వేస్తున్నారని, ఫ్లెక్సీలు వేసి బజారుకీడుస్తున్నారని, మైక్రో ఫైనాన్స్ ఆగడాలను అరికట్టకపోతే ఆత్మహత్యలే గతి అని రోదిస్తూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రధాన రహదారి వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి మైక్రో ఫైనాన్స్ ఆగడాలను అరికట్టాలని, వేధింపులకు పాల్పడుతున్న ఏజంట్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని నినాదాలు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు యానాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గట్టిగా కేకలు వేసుకుంటూ వాదించుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడకు చేరుకున్న ఒన్టౌన్ సీఐ వీర నాయక్ బాధితులను సముదాయించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న ధర్నా చౌక్ వద్ద కూర్చొని నిరసన తెలపాలని సూచించారు. అయినా ఆందోళనకారులు వినలేదు. మైక్రో ఫైనాన్స్ ఏజంట్లు వచ్చి తమను వేదిస్తున్నప్పుడు పోలీసులు ఎక్కడకు పోయారని, మహిళలను దూషించడమే కాకుండా తమ ఇళ్లకు తాళాలు వేసినవారిని పోలీసులు ఎందుకు శిక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే మీడియాతో మాట్లాడుతామని పట్టుపట్టడంతో చివరికి పోలీసులు అంగీకరించక తప్పలేదు. అమాయక గిరిజనులను మోసగిస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థలు... యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కందుకూరు, మద్దిపాడు మండలాల్లో అమాయక యానాది గిరిజనులను మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు మోసగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన పక్కా గృహాల తాలుకూ పట్టాలు హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాయని, కొంతమంది మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజంట్లు, ఇతర శాఖల అధికారులతో కుమ్మకై ్క తమను అప్పుల ఊబిలో దించుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహాలకు రిజిస్ట్రేషన్ చేయించి వాటి పేరు మీద రుణాలు తీసుకుంటున్నారని వివరించారు. యానాది గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రూ.2 లక్షలు మంజూరు చేసినట్లు పత్రాలు సృష్టించి లబ్ధిదారులకు కొంత ముట్టచెప్పి మిగిలింది కాజేస్తున్నారని వివరించారు. ఇప్పుడు రూ.3.75 లక్షల బాకీ ఉన్నారని, వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. చెల్లింపులు చేయని వారి ఇళ్లకు తాళాలు వేయడం, ఇళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, కుటుంబ సభ్యుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బజారుకీడ్చడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ పి.రాజబాబుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్, యాకసిరి నాగరాజు, తిరువీధి సతీష్ చంద్ర, బాపట్ల వెంకటరావు, తిరుపతమ్మ పాల్గొన్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామంటూ ఘరానా మోసం
దర్శి: ‘‘నాకు ఓఎస్డీతో పరిచయాలున్నాయి... అంతకంటే పెద్దపెద్ద వాళ్లు కూడా బాగా తెలుసు. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు చిటికెలో ఇప్పిస్తాను’’ అంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక ఆర్డర్లు చేతిలో పెట్టిన ఘరానా మోసగాన్ని డీఎస్పీ బాలమురళీకృష్ణ కటకటాల వెనక్కు నెట్టారు. దర్శి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలులోని నీలాయపాలెం మార్కెట్ సెంటర్లో నివాసం ఉంటున్న ముత్తన నాగరాజు ఒక కన్సల్టెన్సీ కార్యాలయం పెట్టి అధికార పార్టీ మంత్రుల ఓఎస్డీలు తెలుసు, కలెక్టర్లు తెలుసు.. అంతకంటే పెద్దవారు తెలుసు అని చెప్పుకుంటూ ఒంగోలులో హోంగార్డుగా పని చేస్తున్న గోపాల కృష్ణ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతని భార్యకు ఔట్సోర్సింగ్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఉద్యోగం కోసం అతని వద్ద రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత తన వద్ద ఉన్న గొంతులు మార్పులు చేసి వినిపించే ఫీచర్ ఉన్న సెల్ఫోన్లో ఇతరులతో మాట్లాడించి ఓఎస్డీగారు మాట్లాడతారని చెప్పి నమ్మించాడు. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెబుతూ బోల్తాకొట్టించాడు. ఆ తరువాత ఒక నకిలీ ఆర్డర్ కాపీ చేయించి హోంగార్డుకు అందజేసి ఉద్యోగ నియామకపత్రం వచ్చిందని, వారు ఫోన్ చేసినప్పుడు మాట్లాడి జాయిన్ అవ్వాలని చెప్పాడు. ఆ తరువాత డిగ్రీ చదివిన అదే హోంగార్డుకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. మళ్లీ వారి వద్ద రూ.9 లక్షలు తీసుకున్నాడు. ఇదే తరహాలో ఫోన్లో మాట్లాడించి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చాడు. ఆ తరువాత హోంగార్డు ఆయా కార్యాలయాల్లో సంప్రదించి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన డీఎస్పీ బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో బల్లికురవ ఎస్సై నాగరాజుకు వచ్చిన సమాచారం మేరకు బల్లికురవ బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఆయన వద్ద ఉన్న రూ.3.50 లక్షల నగదు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే నిందితుడు గతంలో మూడు కేసుల్లో రూ.3 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఇంకా ఇతని బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ జరుగుతోందని తెలిపారు. ఇలా నకిలీ పత్రాలు ఇచ్చి ఇటీవల ఉద్యోగాల పేరుతో డబ్బులు స్వాహా చేసే మోసగాళ్ల వలలో పడిన యువత తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. యువతను ఇలాంటి వారు ఎవరైనా సంప్రదించినా వెంటనే తమకు వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఏడో తరగతి చదువుకున్న వ్యక్తి డిగ్రీలు చేసిన వారిని మోసం చేస్తున్నారని యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్న డీఎస్పీ బాలమురళీకృష్ణ, ఎస్సై నాగరాజులను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ శేషగిరిరావు పాల్గొన్నారు. -
భ్రమరా వెంచర్స్పై దర్యాప్తు చేయించండి
మార్కాపురం: మార్కాపురం పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన భ్రమరా వెంచర్స్లో ఉన్న ఆక్రమణలు, ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయించాలని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులుకు వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్కాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, దేవదాయ భూములు, నీటి చెరువులు, కుంటలు, పంట కాలువలు, చెరువు నుంచి ఆయకట్టు భూములకు నీరు వెళ్లే ప్రధాన కాలువలు, వాటికి ఇరువైపులా ఉండే సర్వీసు రోడ్డు మార్జిన్లు, వాగులు తదితర వాటిని కొందరు దురాక్రమణ చేసి స్వాధీన పరుచుకున్నారన్నారు. వాటి పక్కనే ఉన్న పట్టా భూములను కూడా కలుపుకుని ఆక్రమించిన భూమి అసలైన సర్వేనంబరు కాకుండా తప్పుడు సర్వేనంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో రాసి అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. భ్రమరా వెంచర్స్ వారు ప్రభుత్వ భూములు, చెరువులకు నీరు వచ్చే వాగు, బండ్ల రస్తాలను కలుపుకున్నారనే అభియోగాలు ఉన్నాయని అన్నారు. ఆ వెంచరుకు రహదారి సౌకర్యంలేదని, నీళ్లు వచ్చే వాగుకు అడ్డంగా కల్వర్టులు కట్టి తారురోడ్డు వేశారని అన్నారు. దీనివలన చెరువుకు రావాల్సిన నీరు ఆగిపోయి వ లోతట్టు ప్రాంతం మునిగిపోతుందన్నారు. ఇప్పటికే చెరువులు పూడ్చి రోడ్డు వేసే ప్రాంతానికి పక్కనే చెరువులో అంతర్భాగమైన ప్రాంతాన్ని పట్టా భూములని చెప్పి మట్టితోలారని అన్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చెరువులో ఎఫ్టీఎల్ (చెరువు నిండే పూర్తి సామర్ధ్యం) ఆపైన 50 మీటర్ల వరకూ బఫర్జోన్ ఉంటుందన్నారు. అందులో కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని అన్నారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దేవదాయ శాఖ భూములు చాలా ఉన్నాయని, అందులో కూడా భారీగా ఆక్రమణలు జరిగాయన్నారు. ఆశాఖ అధికారులు వ్యక్తిగత లబ్ధి కోసం కొందరికి మాత్రమే నోటీసులు ఇచ్చి కొన్ని ఆస్తులను స్వాధీన పరుచుకున్నారని, మరికొందరు ఆక్రమణదారులపై ఉదాసీనంగా ఉంటూ ఆస్తులను స్వాధీనపరుచుకోలేదన్నారు. వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. దీనివలన దేవదాయశాఖ ఆస్తులు కోల్పోతోందన్నారు. కొందరు అధికారుల సహకారంతో వాస్తవ సర్వే నంబర్లతో కాకుండా వేరే నంబర్లు వేసి నిషేధిత భూములను సైతం రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. భూ దోపిడీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. చెరువును దురాక్రమణదారుల నుంచి కాపాడాలన్నారు. మార్కింగ్ విషయంలో అపోహలు తొలగించండి.. పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో వివిధ ప్రాంతాల్లో మార్కింగ్ ఇచ్చారని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. మార్కింగ్ ఇచ్చే భవన యజమానులకై నా సమాచారం అందించాలని కోరారు. ఈ మార్కింగ్ ఎవరు వేస్తున్నారో అర్థంకాక అందరూ ఆందోళనకు గురవుతున్నారన్నారు. కలెక్టరేట్ భవనాల విషయంలో ఆలోచించండి.. కలెక్టరేట్ భవనాల విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, ఆలోచించి అందరి అభిప్రాయం తీసుకొని నిర్మించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాలన్నారు. జీవితకాలం ప్రజలకు ఉపయోగపడే అంశం ఇది అన్నారు. ఈ విషయమై జేసీ సానుకూలంగా స్పందించారని, భ్రమరా వెంచర్స్పై అధికారుల కమిటీని నియమించినట్లు చెప్పారన్నారు. పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. తాము చేసిన ఆరోపణలు నిజమైతే వెంచర్స్లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని రాంబాబు కోరారు. ఈయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీమ్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఉన్న బట్టగిరి తిరుపతిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, గౌస్ మొహిద్దీన్, బొగ్గరపు శేషయ్య, నాలి కొండయ్య, మౌలాలీ, గఫూర్, సీయం ఖాశీం, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
కంభం చెరువుపై కోలాహలం
కంభం: తేరాతేజి (గరికతొక్కుడు) పండుగ సందర్భంగా సోమవారం కంభం చెరువుకట్టపై కోలాహలం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా భారీగా కంభం చెరువు కట్టకు చేరుకున్నారు. నూతన దంపతులు కంభం చెరువులో వారి పెళ్లినాటి దండలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో మంది సరదాగా గడిపారు. పిల్లలు, నూతన జంటలు సెల్ఫీలు తీసుకుంటూ చెరువు కట్టపై సందడి చేశారు. ఇంటి వద్ద తయారు చేసి తెచ్చుకున్న వంటకాలను పిల్లాపాపలతో కలిసి కట్టపై కూర్చుని ఆరగించారు. కట్టపై ఉన్న దీనాషావళి దర్గా వద్ద కొబ్బరికాయలు, బూందితో ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు భక్తులు దర్గాపై చాదర్లు కప్పి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కట్టపైకి వచ్చిన ప్రజలకు కూలింగ్ వాటర్ అందజేశారు. కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కట్టపై వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సాయంత్రం సూర్యాస్తమయంలో కంభం చెరువు అందాలు సందర్శకులను ఆహ్లాదపరిచాయి. -
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడండి
మార్కాపురం టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ఈ విభాగంలో సమస్యల పరిష్కారం తక్కువగా ఉందని కలెక్టర్ విజయసునీత అన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుంచైనా నిర్లక్ష్యం వీడి సమస్యల పరిష్కారంపై దృష్టిపెడితే జిల్లాకు మంచిపేరు వస్తుందన్నారు. ఆ దిశగా అధికారులు కృషిచేయాలన్నారు. మొత్తం 286 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూకు సంబంధించి 134, ఇతర సమస్యలపై 152 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు శివరామిరెడ్డి, అజయ్కుమార్, రవాణాశాఖాధికారి ఆర్ రాంబాబు, జిల్లా వ్యవసాయాధికారి బాలాజీనాయక్, లీడ్బ్యాంకు మేనేజర్ షాహీర్, మున్సిపల్ కమిషనరు నారాయణరావు, ఆర్టీసీ డీఎం లావణ్య, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి: మార్కాపురం పట్టణానికి చెందిన రాచమడుగు తిరునారాయణమూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు నరసింహాపురం గ్రామ రెవెన్యూ ఇలాఖాలో ఉన్న తమ పొలాలను తమకు తెలియకుండా తమ సోదరుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, వాటిపై విచారణ జరిపి ఆన్లైన్ రద్దుపరిచి న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. 1989 జూలై 11న తమ తల్లిదండ్రులు సోదరులందరికీ ఆస్తి పంపకాలు రాశారన్నారు. అయితే తమకు తెలియకుండా సోదరుడు తమ పొలాలను కూడా రిజిస్టరు చేయించుకుని అన్యాక్రాంతం చేశారని ఫిర్యాదు చేశారు. నా కొడుకు అన్నం పెట్టడం లేదయ్యా... తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని కుమారుడు తనపేరును రాయించుకుని ఇప్పుడు అన్నంకూడా పెట్టడంలేదని కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన చింతగుంట్ల నాగేంద్రమ్మ కలెక్టరేట్కు వచ్చి అర్జీ ఇచ్చింది. ఇదే విషయమై తాను ఈఏడాది మార్చి 3వ తేదీన అర్జీ ఇవ్వగా, ఆర్డీఓ, తహశీల్దార్ తన కుమారుడిని పిలిపించి మాట్లాడటంతో బాగా చూసుకుంటానని చెప్పాడని, కొద్దిరోజుల తరువాత మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాడని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ను కోరారు. ఇదే విషయమై తాను ఈనెల 18 కంభంలో జరిగిన గ్రీవెన్స్లో కూడా అర్జీ ఇచ్చానని, ఇప్పటికై నా తనకు న్యాయం చేయాలని విన్నవించారు. ఆర్ఆర్ ప్యాకేజీలో నాపేరు చేర్చండి.. వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందని, ఆర్ఆర్ ప్యాకేజీ సర్వే సమయంలో తాము జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండటం వలన తమ పేరు ప్యాకేజీలో చేర్చలేదని పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామానికి చెందిన దర్శనం మేరీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేరు జాబితాలో చేర్చి నష్టపరిహారం అందించాలని కోరారు. ఆన్లైన్లో మా పేర్లు నమోదు చేయండి: వారసత్వంగా వచ్చిన తన పొలాలను తనపేరుపై ఆన్లైన్ చేయాలని గోగులదిన్నె గ్రామానికి చెందిన చిలుకూరి జగన్మోహన్రెడ్డి పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. ఈ సమస్యపై తాను గతంలోనే అర్జీలు ఇచ్చారని తెలిపారు ఒంగోలులో 308 అర్జీలు... ఒంగోలు సబర్బన్: మీ కోసం కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ పి.వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్రెడ్డి, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి మాధురి, డీపీఓ అనుపమ తదితర అధికారులతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 308 అర్జీలు రాగా, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను కలెక్టర్ అందజేశారు. తొలుత దివ్యాంగుల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ విజయసునీత -
సర్కారు స్కూళ్లు.. తాగునీటికి చుక్కలు..!
ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించకుండా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థుల గొంతెండుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాడు–నేడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణను పక్కాగా అమలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పాఠశాలల్లోని ఆర్వో వాటర్ ప్లాంట్ల నిర్వహణకు నిధులు కేటాయించకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. అవన్నీ క్రమంగా మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. విద్యార్థులకు తిప్పలు తెచ్చిపెట్టాయి. పాఠశాలల్లో తాగునీటి వసతి లేకపోవడంతో దాహం తీర్చుకునేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో చిన్నపాటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సొంత ఖర్చులతో అరకొరగా బబుల్ వాటర్ ఏర్పాటు చేస్తున్నారు. అధిక సంఖ్యలో పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సురక్షితం కాని ఏదోక నీటిని విద్యార్థులు తాగుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల గొంతెండుతున్నా పట్టించుకోరా..? అంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సురక్షితం కాని నీరు తాగి విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని, పాఠశాలల్లోని ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లకు మరమ్మతులు చేయించి విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు -
సరిలేరు!
గ్రావెల్ దందాలోసగిలేరు వాగులో పెద్ద పెద్ద గుంతలుగిద్దలూరు రూరల్: మార్కాపురం, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న సగిలేరు వాగును అక్రమార్కులు చెరబట్టారు. గిద్దలూరు పట్టణం మీదుగా కడప జిల్లా కలెశపాడులో ప్రవేశిస్తుంది. గిద్దలూరు పట్టణ శివారులోని కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న సగిలేరు వాగు వర్షాకాలంలో జలకళ సంతరించుకుంటుంది. మిగతా రోజుల్లో నీటి ప్రవాహం ఉండదు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వాగులో అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టీడీపీ మద్దతుదారులుగా ప్రచారంలో ఉన్న కొందరు వ్యక్తులు జేసీబీలతో వాగులో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టి వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించేస్తున్నారు. దీంతో వాగులో భారీ గుంతలు ఏర్పడి పర్యావరణానికి, ప్రజల భద్రతకు ముప్పుగా మారింది. ఇప్పటి వరకు రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిన మట్టి దందా పగటి పూటే సాగుతోంది. కొండలను చదును చేస్తూ జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తరలించే ట్రాక్టర్లు అతివేగంగా వెళుతుండడంతో రహదారులపై రాళ్లు, మట్టి పడిపోతున్నాయి. రోజుకు వందకిపైగా ట్రాక్టర్లలో తరలింపు.. సగిలేరు వాగులో అక్రమ తవ్వకాలు చేస్తున్న మాఫియా రోజుకు సుమారు 100కు పైగా ట్రాక్టర్లలో గ్రావెల్ తరలిస్తోంది. ప్రస్తుతం రూ.1,000– రూ.1,100 వరకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీ అండతో గ్రావెల్ మట్టి వ్యాపారం లాభదాయక దందాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరవ రోడ్డులోని కొండ ప్రాంతాలు, సమీప తిప్పల నుంచి ప్రతిరోజూ వందల ట్రిప్పుల మట్టి గిద్దలూరు పట్టణానికి తరలిస్తున్నప్పటికీ అధికారులు అడ్డుకుని చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనరేజీ పేరిట బహిరంగ వసూళ్లు గ్రావెల్ మట్టి, ఇసుక రవాణాపై ప్రభుత్వం తరఫున సీనరేజీ వసూలు బాధ్యత చేపట్టిన ప్రైవేటు సంస్థ పోరుమామిళ్ల రోడ్డులోని సగిలేరు బ్రిడ్జి, అంబవరం రోడ్డు, ఒంగోలు హైవే వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. పట్టణంలోకి వచ్చే ప్రతి ట్రాక్టర్కు రూ.350 చొప్పున నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లకు ఎలాంటి రసీదులు ఇవ్వడంలేదని, మొత్తం వసూలు చేసే సంస్థ మింగేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండతో మట్టి మాఫియా బరితెగించింది. గిద్దలూరు పట్టణం శివారులో సగిలేరు వాగును చెరబట్టింది. బహిరంగంగా జేసీబీలతో తవ్వకాలు చేస్తోంది. రోజుకు వందలాది ట్రాక్టర్లలో మట్టిని తరలించేస్తోంది. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండడంతో వాగులో భారీ గుంతలు ఏర్పడి వాగు ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తవ్వకాలు ఆపాలి.. గిద్దలూరు సమీపంలోని కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వెనుక సగిలేరు వాగులో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపేయాలి. వాగును భారీ గుంతలుగా మార్చి అక్రమ వ్యాపారం సాగిస్తున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. – మానం బాలిరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ -
నకిలీ డీఎస్పీ లీలలెన్నెన్నో..!
ఒంగోలు టౌన్: అతడి స్వగ్రామం చిలకలూరిపేట మండలం యడవల్లి. తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయ కూలీ. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయో చొరవ అతడి సొంతం. అదే పెట్టుబడిగా నేరాలకు పాల్పడ్డాడు. అతడే కొత్తపల్లి ప్రదీప్. ఒంగోలు మండలం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన ముంగులూరి రఘుపతి ఫిర్యాదుతో అతడి అసలు రంగు బయటపడింది. ఒక సైబర్ నేరంలో 1.23 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న రఘుపతి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసుల నుంచి తగిన స్పందన లభించలేదు. ఈ క్రమంలో అతడికి కొత్తపల్లి ప్రదీప్ పరిచమయ్యాడు. సైబర్ డీఎస్పీగా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న అతగాడు.. రఘుపతి పోగొట్టుకున్న నగదు తిరిగిప్పిస్తానని నమ్మబలికాడు. బదులుగా రఘుపతి నుంచి రూ.5 లక్షల నగదు, ఒక బుల్లెట్ వాహనం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒట్టిచేతులు చూపడంతో అనుమానం వచ్చిన రఘుపతి విచారించగా.. ప్రదీప్ మోసం తెలిసి బిత్తరపోయాడు. పోలీసులతో ఉన్న సాన్నిహిత్యంతో మోసాలకు పాల్పడుతున్నట్లు రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నకిలీ డీఎస్పీగా పలువురిని మోసం చేసిన కొత్తపల్లి ప్రదీప్పై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో ప్రదీప్ మోసాలపై చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తపల్లి ప్రదీప్కు పోలీసుల నుంచి ఎనలేని ప్రోత్సహం లభించింది. ప్రకాశం జిల్లాలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు కొత్తపల్లి ప్రదీప్ను ముఖ్య అతిథిగా పిలిచి పెద్ద పీట వేశారు. దాంతో క్షేత్రస్థాయి పోలీసులలో అతడికి క్రేజ్ ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకుని అతడు బరితెగించాడు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆన్ గవర్నమెంటు డ్యూటీ.. సైబర్ క్రైం అనే నేమ్ బోర్డు ఉన్న ఇన్నోవా వాహనంలోనే ప్రయాణించేవాడు. టోల్ గేట్ల వద్ద పోలీసు హారన్ ఉపయోగించి ఎలాంటి రుసుం చెల్లించకుండానే ప్రయాణించేవాడని తెలుస్తోంది. ప్రముఖ దేవాలయాలలో అత్యంత సులువుగా వీఐపీ దర్శనం చేసుకునేవాడని సమాచారం. తెరవెనుక అతడి నేర చరిత్ర మరోలా ఉంది. క్రికెట్ బెట్టింగులు, సైబర్ నేరాలు చేసేవాడని ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్ శాఖ, స్పెషల్ బ్రాంచి పోలీసులు అతడిని పసిగట్టలేకపోవడంపై పోలీసులలో విస్మయం వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తయితే ఇంకెన్ని నేరాలు బయటపడతాయో వేచిచూడాలి. మార్కాపురం: పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో మూడు బైకుల చోరీ కేసుల్లో నేరం రుజువుకావడంతో నిందితుడైన పిక్కిలి చంటికి ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మార్కాపురం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్టు క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.బాలాజీ సోమవారం తీర్పు చెప్పినట్లు పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి తెలిపారు. గతేడాది జవహర్నగర్ కాలనీలోని కె.రమేష్బాబు, జగదీశ్వరీహాలు వద్ద ఉన్న పఠాన్ఉమర్ఖాన్, విద్యానగర్కు చెందిన టి.రామాంజనేయరెడ్డిల బైకులు దొంగతనానికి గురయ్యాయి. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించిన స్థానిక పోలీసులు.. బండ్లమోటు పొలీసుస్టేషన్లో నమోదైన కేసులో నిందితునిగా ఉన్న దోర్నాల మండలం హసానబాద్కు చెందిన పిక్కిలి చంటిని పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువుకావడంతో నిందితునికి జడ్జి శిక్ష విధించారు. ఈ కేసును అప్పటి ఎస్సై సైదుబాబు, ప్రస్తుత ఎస్సై విశ్వనాథరెడ్డి పర్యవేక్షించారు. -
పోలీసు గ్రీవెన్స్కు 65 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయి. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారితో ఫోన్లో మాట్లాడారు. త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. మీ కోసంలో భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ శ్రీహరి, అద్దంకి టౌన్ సీఐ సుబ్బరాజు, ఎస్సైలు పాల్గొన్నారు. మార్కాపురంలో 34 ఫిర్యాదులు... మార్కాపురం: పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 34 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదుదారుల అర్జీలను ఓఎస్డీ స్వయంగా స్వీకరించి సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం సీఐలు అల్తాఫ్ హుస్సేన్, అజయ్కుమార్ పాల్గొన్నారు. -
పోలీసుల కళ్లుకప్పి నిందితుడి పరార్
ఒంగోలు టౌన్: పోలీసు విచారణలో ఉన్న ఒక రౌడీ షీటర్ పరారయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన వెంకట్ పై తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉంది. రెండు రోజుల క్రితం ఒక కేసులో అతడిని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య భోజనం సమయంలో వెంకట్ తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం. తీరిగ్గా చూసుకున్న పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఇటీవల తాలూకా పోలీసు స్టేషన్ నుంచి గంజాయి కేసు నిందితుడు ఒకరు పారిపోవడం తెల్సిందే. వెనువెంటనే జరిగిన ఘటనలపై ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సీరియస్ అయినట్లు సమాచారం. మార్కాపురం టౌన్: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం విజయసునీత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. అర్జీదారులు 1100 నంబర్కు కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కొండపి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొండపి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పచ్చవ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ పచ్చవ శ్రీను (60) వ్యక్తిగత పనుల నిమిత్తం కొండపి వచ్చారు. సాయంత్రం పనులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరేడు.తిరుగు ప్రయాణంలో కొండపిలోని స్థానిక ఎస్సీ హాస్టల్ మలుపు వద్దకు వచ్చేసరికి వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు జీజీహెచ్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృత ఇచెందారు. కొండపి: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని పాముకాటుకు గురైంది. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులంతా భోజనశాలకు వెళ్లగా భోజనశాలలోనికి పాము వచ్చింది. 9వ తరగతికి చెందిన కడియం మోక్షిత 14 కాళ్ల దగ్గర అలజడి కావడంతో ఒక్కసారిగా కాలును విదిలించడంతో అప్పటికే అక్కడ ఉన్న పాము కాటు వేసింది. సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు మోక్షితను వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించి వైద్యాన్ని అందించారు. విద్యార్థిని సురక్షితంగా ఉన్నట్లు వైద్యశాల సిబ్బంది తెలిపారు. మంత్రి స్వామి విద్యార్థిని పరాపర్శించారు. మోక్షితను ఎంపీడీఓ బి.రామాంజనేయులు, ఎంఈఓ కె.సురేఖ, గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ ఎస్.శైలజ, పాఠశాల ప్రిన్సిపాల్ పి.జయశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ వి.జ్యోతి పరామర్శించారు. విద్యార్థినికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పాములు పట్టే వారిని పిలిపించి హాస్టల్ లోని అన్ని గదుల్లోనూ గాలించినట్లు ఎంపీడీవో తెలిపారు -
జయప్రదం చేయండి
28న విద్యార్థి, యువజన ర్యాలీని ● వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యడు పల్నాటి రవీంద్రారెడ్డి ఒంగోలు సిటీ: ఈ నెల 28వ తేదీ మంగళవారం ఒంగోలులో విద్యార్థి–యువజన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్నాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో వైఫల్యం, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగభృతి అమలు చేయకపోవడం, నీట్ పరీక్షల్లో అవకతవకలు వంటి విధానాలపై ఈ నెల 28వ తేదీ విద్యార్థి, యువజన విభాగంలో ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేవలం అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతూ భయ భ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో టౌన్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ వెంకు, యూత్ ప్రెసిడెంట్ సన్నీ, చందు, ప్రసన్న, సిద్ధ, గోవర్ధన్, చెంచురెడ్డి, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
చెరుకూరులో దారుణం
పొన్నలూరు: రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాము ఏమి చేసిన అడిగేవారు లేరంటూ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం ఉందనే అహంకారంతో చివరికి ఇళ్లను సైతం కూల్చుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన మండలంలోని చెరుకూరులో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చెరుకూరు గామానికి చెందిన కుంచాల నరసింహం 30 ఏళ్ల కిత్రం తన అన్న పెద్దమాలకొండయ్య వద్ద అప్పటి మార్కెట్ ధర ప్రకారం రూ.6 వేలు చెల్లించి నాలుగు సెంట్లు ఇంటి స్థలాన్ని తీసుకున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కావడంతో అప్పటి పద్ధతి ప్రకారం ఎలాంటి రాతలు లేకుండా నోటిమాట మీద స్థలం కొనుగోలు చేశాడు. దీంతో తరువాత ఆ స్థలంలో చిన్నపాటి ఇల్లును నిర్మించుకవని తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రమారమి 1993లో అప్పటి ప్రభుత్వం వారు పక్కా గృహం మంజూరు చేయడంతో నరసింహం వంద గజాల స్థలంలో పక్కా గృహం నిర్మిచుకున్నాడు. కొన్ని రోజుల తరువాత నరసింహం, అతని భార్య రవణమ్మ వృద్ధాప్యంతో మరణించారు. ఈ క్రమంలో వారసత్వంగా అనుభవం కలిగి ఆ ఇంటిలో నరసింహం కుమారుడైన కుంచాల మాధవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్ ప్రాంతానికి వలస వెళ్లి కూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మధ్యలో అప్పుడప్పుడు పండుగలు, శుభకార్యాలకు ఇంటికి వచ్చి తమ పనులు అయిపోయిన తరువాత వెళ్లిపోతుంటారు. అయితే ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటంతో మాధవరావు ఇల్లు, స్థలంపై తన పెద్దనాన్న కుమారుడైన కుంచాల మాల్యాద్రి కన్ను పడింది. మాధవరావు కుటుంబ సభ్యులు కూలీ పనుల కోసం హైదరాబాద్లో ఉండటంతో ఎలాగైనా ఇల్లు, స్థలాన్ని ఆక్రమించుకోవాలని స్థానిక టీడీపీ నాయకుల సహకారం కోరాడు. దీంతో వారి ఏమైనా సరే మేము చూసుకుంటామని హమీ ఇవ్వడంతో ఇల్లు కూల్చి వేయడానికి పూనుకున్నాడు. పొక్లెయిన్తో ఇల్లు కూల్చివేత... అధికారపార్టీ నాయకుల నుంచి కుంచాల మాల్యాద్రికి హామీ రావడంతో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పొక్లెయిన్తో ఈ నెల 20న సోమవారం ఇంటిని పూర్తిగా కూల్చివేశాడు. ఆ తరువాత ట్రాక్టర్ సహాయంతో కూల్చిన ఇటుకలు, ఇంటి లోపల ఉన్న గృహోపకరణాలను తొలగించి ఇంటి ఆనవాళ్లు లేకుండా చదును చేశాడు. దీంతో గ్రామంలోని తన బంధువులు ద్వారా విషయం తెలుసుకున్న బాధితుని కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకోని బోరున విలపించారు. ఇల్లు కూల్చడంపై మాల్యాద్రి కుటుంబ సభ్యులను నిలదీసి ప్రశ్నించడంతో ఈ స్థలం మాది నీ దిక్కున్నచోట చెప్పుకోండంటూ దాడికి ప్రయత్నించారని బాధితులు వాపోయారు. తన ఇంటిని కూల్చివేయడం వలన సుమారుగా 10 లక్షలు నష్టపోయినట్టు బాధితుడు తెలిపాడు. ఫిర్యాదు తీసుకోని పోలీసులు... వాస్తవంగా తాము లేని సమయంలో తన ఇంటిని కూల్చిన విషయాన్ని మాధవరావు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరాడు. అయితే ఇంటిని కూల్చిన మాల్యాద్రి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల మాటను పట్టించుకోకపోవడంతో బాధితుడి పొన్నలూరు పోలీసులను ఆశ్రయించాడు. అయితే అప్పటికే అధికారపార్టీ పెద్దల నుంచి పోలీసులకు ఆదేశాలు రావడంతో ఫిర్యాదును పోలీసులు తీసుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. రెండుసార్లు పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగిన పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. -
సైనికుల త్యాగాలు మరువం
మార్కాపురం: దేశ రక్షణకోసం సైనికుల త్యాగాలను మరువమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. కార్గిల్డేను పురస్కరించుకుని ఆదివారం మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తర్లుపాడు రోడ్డులోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను గుర్తుచేసుకోవాలని, వారి త్యాగాలను మర్చిపోవద్దన్నారు. యువతలో దేశభక్తి ఉండాలన్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కూడా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శీలం హరినారాయణరెడ్డి, చిన్నయ్య, శేషసాయి, సతికల రామకృష్ణ, న్యాయవాదులు భూపని కాశయ్య, చౌడేశ్వరరావు, వెంకటేశ్వర రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టరు నల్లబోతుల కొండయ్య, కాంట్రాక్టరు గాయం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు -
తేరాతేజి వేడుకలకు కంభం చెరువు ముస్తాబు
తేరాతేజి పండుగనాడు కోలాహలంగా ఉన్న కంభం చెరువు (ఫైల్) కంభం చెరువు కంభం: ఏటా చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై జరుపుకునే తేరాతేజి వేడుకలకు కంభం చెరువు ముస్తాబైంది. పండుగ రోజు చెరువుకట్టకు ముస్లింలు సకుటుంబ సమేతంగా వచ్చి అక్కడే భోజనాలు చేసి సాయంత్రం వరకు సరదాగా గడిపి వెళ్తారు. ఇతర కులాలకు చెందిన వారు సైతం పిల్లలతో కలిసి సరదాగా చెరువుకట్టపైకి వచ్చి వెళ్తారు. కర్నూలు, గుంటూరు, నంద్యాల, గిద్దలూరు, దొనకొండ, వినుకొండ, తదితర ప్రాంతాల నుంచి పండుగ రోజున కంభం చెరువుకు అధిక సంఖ్యలో వస్తారు. రైళ్లలో వచ్చే వారు కంభం చెరువు సమీపంలో పండుగరోజున రైళ్లను సైతం ఆపేసి అక్కడే దిగుతుంటారు. కంభం చెరువులో నీళ్లు ఉండటంతో ఈ సారి ప్రజలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. సందర్శకుల తాకిడి.. ప్రస్తుతం కంభం చెరువులో ప్రస్తుతం 13 అడుగుల మేర నీళ్లు ఉండటంతో చెరువుకు ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కంభం బస్టాండ్లో దిగి ఆటోల్లో చెరువుపైకి చేరుకుంటారు. కొందరు కార్లలో నేరుగా చెరువుకట్టపైకి వస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ట్రాక్టర్లలో, పెద్ద ఆటోలలో సకుటుంబ సమేతంగా చెరువుకట్టపైకి వస్తారు. అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నెలపొడుపు కనిపించిన 13వ రోజు తేరాతేజి పండుగను ముస్లింలు జరుపుకుంటారు. తేరాతేజి నెలను చేదు నెలగా చెబుతుంటారు. కొత్తగా పెళ్లయిన వధూవరులు నెల పొడుపు కనిపించినప్పటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా 13వ రోజు తేరాతేజి పండుగ సందర్భంగా కంభం చెరువు కట్టపై కలుసుకుంటారు. అక్కడే వారి పెళ్లి నాటి దండలను నీళ్లలో వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలసి సహపంక్తి భోజనాలు చేస్తారు. పండుగ సందర్భంగా చెరువు కట్ట పైన ఉన్న దీనాషావళి దర్గా వద్ద ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందుకోసం కట్టపైన ఉన్న దర్గాను నిర్వాహకులు ముస్తాబు చేస్తారు. అదే విధంగా చెరువుకట్టపై ఉన్న పచ్చికను తొక్కితే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతుంటారు అందుకనే ఈ పండుగను గరికతొక్కుడు పండుగగా పిలుస్తారు. చుట్టూ అందమైన కొండలు, కనువిందు చేసే ప్రకృతి అందాలు, అలలపై పడే సూర్యకిరణాలతో చారిత్రాత్మక కంభం చెరువు ఎప్పుడూ పర్యాటకలను ఆకట్టుకుంటుంది. అలాంటి కంభం చెరువుకట్టపై జరిగే పండుగకు ఎంత ప్రత్యేకత ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో కంభంలో మాత్రమే జరుపుకునే పండుగ తేరాతేజి. దీనిని గరిక తొక్కుడు పండుగా కూడా పిలుస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా సెలవులు పెట్టుకొని మరీ పండుగ రోజున కంభంలో ఉన్న వారి బంధువుల ఇళ్లకుచేరుకుంటారు. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా..!
● అధికారులను సైతం లెక్కచేయని అక్రమ మట్టి తరలింపు మార్కాపురం రూరల్: అధికార పార్టీ నాయకుల అండతో మండలంలోని పెద్ద యాచవరం గ్రామంలో చెరువులో నుంచి మట్టిని యథేచ్ఛగా బయటకు తరలిస్తున్నారు. అధికారులను సైతం లెక్కచేయకుండా అక్రమ మట్టి తరలింపు కొనసాగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో భారీ యంత్రాలతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా సంబంధిత అధికారులు అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చెరువు పరిరక్షణను పూర్తిగా విస్మరించి మట్టి దోపిడీ సాగుతుండటంతో భవిష్యత్తులో చెరువు స్వరూపం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తరలింపును ప్రశ్నించిన గ్రామస్తులతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ‘‘మా పార్టీ అధికారంలో ఉంది... ఏం చేసుకుంటారో చేసుకోండి...మీకు తోచిన అధికారికి చెప్పుకోండి’’ అంటూ బహిరంగంగానే సవాల్ విసిరినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, అధికారులని సైతం పట్టించుకోకుండా మట్టి తరలింపు కొనసాగుతుండటం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వెంటనే రెవెన్యూ, గనుల శాఖ అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎల్నినో పరిస్థితులపై అప్రమత్తం చేయాలి
● ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు ఒంగోలు సబర్బన్: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని ఏపీఎంఐపీ పీడీ సీహెచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు పాత రిమ్స్లోని డీపీఎంయూ కార్యాలయంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్ ) విధానంలో సీడ్ పెల్లైటెజేషన్ చేసి పప్పుధాన్యాలు, పశుగ్రాస పంటలను విస్తృతంగా సాగు చేయాలని వివరించారు. పీఎండీఎస్ సీడ్ పెల్లైటెజేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. పప్పుధాన్యాలు, పశుగ్రాస పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయంతో పాటు పశువులకు అవసరమైన మేత కూడా లభిస్తుందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొవడానికి ఈ విధానం సమర్థవంతమైన పరిష్కారమని సూచించారు. ప్రకృతి వ్యవసాయం డీపీఎం వి.సుభాషిణి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంపై అవగాహన కల్పించారు. రైతులు పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చేందుకు ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రకాశం జిల్లా ప్రకృతి వ్యవసాయ డీపీఎం సుభాషిణి ఆధ్వర్యంలో డీపీఎంయూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. -
హైవేపై దోపిడీ
● అద్దం పగులగొట్టి మహిళ మెడలోని బంగారం అపహరణ నక్కపల్లి: అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై వేంపాడు టోల్ప్లాజా సమీపంలో కారులో కూర్చున్న ఒక మహిళ మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తి 3 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన పి.రమేష్ బాబు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు కారులో వెళ్తున్నారు. డ్రైవర్కు నిద్రరావడంతో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో టోల్ప్లాజా దాటిన తర్వాత జాస్ హోటల్ సమీపంలో కారును రోడ్డుపక్కన నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఒక దుండగుడు కారు సైడు అద్దాన్ని రాయితో పగులగొట్టి, రమేష్ భార్య కల్యాణి మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు. -
చేనేత కార్మికుల ‘ప్రజాబంధు’ ప్రగడ కోటయ్య
ఒంగోలు సబర్బన్: చేనేత కార్మికుల సంక్షేమానికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ‘ప్రజాబంధు’ ప్రగడ కోటయ్య అని జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకట రమణ కొనియాడారు. ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఆదివారం ప్రసిద్ధ ప్రజా నాయకుడు, ‘ప్రజాబంధు’ ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్ఓ పి.వెంకట రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చేనేత రంగానికి, నిరుపేద చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడంలో, ‘ఆప్కో’ స్థాపనలో ప్రగడ కోటయ్య అత్యంత కీలక పాత్ర పోషించారని డీఆర్ఓ గుర్తు చేశారు. సుమారు 16 వేల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయించడంతో పాటు, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి, బదులు భూ వసతి, విద్యుత్ మగ్గాల నియంత్రణ చట్టం తెచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించిన ధీశాలి అని ప్రశంసించారు. చీరాలలో ఆంధ్ర కేసరి ప్రకాశం జూనియర్ కళాశాల, ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీ బి.రామయ్య, డీఓ ఎ.వెంకటేశ్వర్లు, ఏడీఓ టి.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సిబ్బంది, చేనేత విభాగాధికారులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొని ప్రగడ కోటయ్య సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. -
తాగుతూ.. తూగుతూ!
చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మంత్రి ఇలాకాలో మద్యం పరవళ్లు తొక్కుతోంది. లైసెన్స్ మద్యం దుకాణాలకు నాలుగు రెట్లు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అద్దంకి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో పదికి పైగా మద్యం తాగే ధాబాలు, అనధికారిక రెస్టారెంట్లు నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటికి ప్రత్యక్షంగా, మరి కొన్నింటికి పరోక్షంగా పలువురు పచ్చనేతల భాగస్వామ్యం, మద్దతు ఉన్నాయి. వీటన్నింటికీ అంతిమంగా అమాత్యుని అండ ఉందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026బెల్ట్ షాపులు, అనధికారిక మద్యం సిట్టింగులు బహిరంగ రహస్యాలు. కొన్ని చోట్ల సమయ పాలన కూడా లేదు. అయితే ఇవి సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులకు కనిపించటం లేదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఇదంతా జరుగుతోందని, తాము అడ్డుకున్నా ఆగదని సంబంధిత అధికారులు స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) లిక్కర్ కూడా నడుస్తోంది. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
సింగరాయకొండ: డీఎస్సీ పరీక్షల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని లేని పక్షంలో ఏపీలో కూడా మరో కాక్రోచ్ ఉద్యమం పుట్టుకొస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యాశాఖా మంత్రి లోకేష్ కాదు లీకేష్ అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణలో నిబంధనలను పక్కనబెట్టి గోప్యతను దెబ్బతీస్తూ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రంలో నీట్ వ్యవహారంలో అనుసరించిన తీరుగానే ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేసి డీఎస్సీ స్కాంపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ తో పూర్తిస్థాయి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో పారదర్శకత శూన్యం: వైఎస్ జగన్ హయాంలో విద్యాశాఖకు, నేటి కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ పనితీరుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. డీఎస్సీ పరీక్షల్లో ప్రధానంగా గోప్యత, పారదర్శకత ఎక్కడా లేదన్నారు. ప్రశ్నపత్రం తయారుచేసే వ్యవస్థ, పరీక్షలు నిర్వహించే వ్యవస్థ రెండూ వేర్వేరుగా ఉండాలి. కానీ రెండింటినీ కలపడంతో గోప్యత లేకుండా పోయిందన్నారు. ఎవరైతే ప్రశ్నపత్రాలు అప్లోడ్ చేశారో వారికి ఫస్ట్ ర్యాంకులు రావటం దేనికి సంకేతమని ప్రభుత్వాన్ని నిలదీశారు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపాలి: డీఎస్సీ వంటి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సురేష్ ఆరోపించారు. విద్యాశాఖా మంత్రిగా ఉన్న లోకేష్ ఇంతవరకు డీఎస్సీ పరీక్షల మీద వచ్చిన ఆరోపణలపై ఒక్కసారి కూడా ప్రెస్మీట్ పెట్టలేదని విమర్శించారు. అధికారులచేత ఏదో ఒకటి సమాధానం చెప్పించి ఈ విషయాన్ని ముగించాలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సకల శాఖా మంత్రిగా చలామణి అవుతున్న లోకేష్ తన శాఖలో జరిగిన స్కామ్ పై ఎందుకు నోరు మెదపరని, ఇతను లోకేష్ కాదని ముమ్మాటికీ లీకేష్ అని ఎద్దేవా చేశారు. గవర్నర్ దృష్టికి వందల ఆధారాలు, కేసులు: డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఆధారాలు, సాక్ష్యాలు గల వీడియో టేపులతో సహా పోస్టులను ఏవిధంగా అమ్ముకున్నారో గవర్నర్కు పూర్తి ఆధారాలు అందజేశామన్నారు. ఇప్పటికే కోర్టులో ఈ వ్యవహారంపై సుమారు 400 కేసులు నమోదయ్యాయని సాక్షాత్తు గవర్నర్ స్వయంగా చెప్పారన్నారు. ఇన్ని కేసులు ఉన్నందున ఇది న్యాయపరమైన అంశమని సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల త్యాగాలను కూటమి ప్రభుత్వం నీరు గార్చిందన్నారు. తమకు నచ్చిన అభ్యర్థులు ఎంపిక అయ్యే వరకు గేట్లు ఎత్తి తర్వాత మూసేశారని దుయ్యబట్టారు. జీవోలతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు: జీవో నెంబరు 4, 47 ల ద్వారా డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, ఇది క్షమించరాని నేరమని ఆదిమూలపు సురేష్ దుయ్యబట్టారు. రాజకీయంగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, ఆ సర్టిఫికెట్ల వ్యాలిడిటీ, అథెంటిసిటీ కూడా వెరిఫై చేయకుండా స్పోర్ట్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు కల్పించారని, ఆ తర్వాత ఆ జోవోలు కనబడకుండా చేసి మళ్లీ జీవో నెంబరు 56 ద్వారా నిబంధనలు మార్చారని, ఇలా స్పష్టమైన తప్పు చేయటమే కాకుండా వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. -
కత్తితో దాడి చేసి..కారుతో గుద్ది..
పీసీపల్లి: పాతకక్షలతో ‘మా జోలికి వచ్చేది ఎవడురా’ అంటూ ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేసి, పెద్ద పెద్దగా తిడుతూ అడ్డొచ్చిన వారిని గాయపరిచిన ఘటన ఆదివారం మండల పరిధిలోని పెదఇర్లపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెదఇర్లపాడు ఎస్సీ పాలేనికి చెందిన కొంత మంది ఒక చోట కూర్చుని ఇటీవల గ్రామంలోని వడ్డెపాలెంలో జరిగిన కొలుపులకు సంబంధించి వచ్చిన డబ్బులు పంచుకునే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన అద్దంకి సులేమాన్ వారు తన గురించే మాట్లాడుకుంటున్నారంటూ కత్తి పట్టుకుని పెద్ద పెద్దగా తిడుతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అతనికి అడ్డువచ్చిన అత్యాల శ్యామ్, విలియంకేర్ను శ్ఙ్రీమీరెవరు నాకు చెప్పడానికంటూ’ కత్తితో వారిపై దాడిచేశాడు. దీంతో శ్యామ్కు మూడు చేతివేళ్లు తెగిపోగా, విలియంకేర్ మోచేయికి గాయమైంది. దీంతో గ్రామస్తులు గాయపడిన వారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..మార్గం మధ్యలో వెంగళాయపల్లి గ్రామం వద్ద అద్దంకి సులేమాన్ అన్న అద్దంకి శాంసన్ కారులో వస్తూ ఆటోను ఆపి ‘మా వాడి మీద దాడి చేస్తారా’ అంటూ రెండు పెద్ద రాళ్లను ఆటోకు అడ్డంగా ఉంచి వారిపై దాడిచేయబోయాడు. స్థానికంగా ఉన్న గ్రామస్తులు అడ్డుకుని శ్యాంసన్ను మందలించి ఆటోను పంపించారు. అనంతరం ఆటోను అనుసరిస్తూ వెనుక బైక్పై వస్తున్న అత్యాల ప్రశాంత్, అరిగెల శాంసన్ను కారుతో గుద్దించడంతో ప్రశాంత్కు ఎడమ కాలు విరగగా, అరిగెల శాంసన్కు ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. దీంతో వెంగళాయపల్లి గ్రామస్తులు అద్దంకి శాంసన్ను గట్టిగా మందలించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను పీసీపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని కనిగిరి, ఒంగోలుకు తరలించారు. ఈ విషయంపై పీసీపల్లి ఎస్సై నరసింహారావుకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. క్లూస్ టీం వివరాలు సేకరించారు. అద్దంకి శాంసన్, సులేమాన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో అన్నదమ్ముల దాడి -
వైభవంగా పాలంకేశ్వరుడి తిరునాళ్ల
యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అడవిలో కృష్ణానది ఒడ్డున వెలసిన పాలంక వీరభద్ర స్వామి తిరునాళ్ల శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణం కనుల పండుగగా జరిగింది. స్వామి కరుణ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు వేలాది మంది వివిధ వాహనాల్లో కాలినడకన అక్కడికి బయలు దేరి వెళ్లారు. పాలంకేశ్వరుడితోపాటు అక్కడ వెలసిన వీరభద్రస్వామి, గణపతి, పంచముఖ బ్రహ్మ పోతురాజుల ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ఆ ప్రాంగణంలో ఉన్న బిడ్డలు లేని దంపతులు సంతానగద్దె వద్ద పై నుంచి జాలువారే నీటి బిందువుల కోసం క్యూ కట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అనారోగ్యానికి గురికాకుండా పాలుట్ల పీహెచ్సీ వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అటవీ జంతువులకు హాని జరగకుండా, పాలంకకు చేరిన భక్తులను జంతువుల నుంచి సంరక్షించటానికి ఆ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.దేవకుమార్ తమ సిబ్బందితో శాంతి భద్రతలను కాపాడారు. -
ఆశలకు కోత !
కన్నతండ్రే కాలయముడై.. ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన టుబాకో బోర్డు ఇప్పుడు రైతులపై మరో భారం మోపింది. ధరల కోసం మూడు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని బోర్డు.. 2026–27 సీజన్కు ఒంగోలు రీజియన్లో పొగాకు సాగు పరిమితిని భారీగా కుదించింది. ఈ సీజన్తో పోలిస్తే 39.05 మిలియన్ కేజీల ఉత్పత్తికి కోత విధించి, 51.15 మిలియన్ కేజీలకే అనుమతి ఇవ్వడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు కర్నాటకలో మాత్రం ఉత్పత్తి భారీగా పెరగడం గమనార్హం. ● వచ్చే సీజన్కు 51.15 మిలియన్ కేజీలకే టుబాకో బోర్డు అనుమతి కందుకూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, టుబాకో బోర్డు వ్యాపారులకు మద్దతుగా నిలిచాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా ధరలు మాత్రం పెరగడంలేదు. ఇదిలా ఉండగా 2026–27 పంట సీజన్కు సంబంధించిన పరిమితిని బోర్డు భారీగా తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా 81 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు అనుమతి ఉంటే అదే ఒంగోలు రీజియన్ (ప్రకాశం, నెల్లూరు జిల్లాలు)లోని 11 వేలం కేంద్రాల పరిధిలో 51.15 మిలియన్ కేజీల పొగాకును పండించేందుకు అనుమతిచ్చింది. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాలు దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలుగా (ఎస్బీఎస్) ఉన్నాయి. వీటి పరిధిలో 27.56 మిలియన్ కేజీల పండించవచ్చు. దక్షిణ ప్రాంత తేలిక నేలలు(ఎస్ఎల్ఎస్) ఉన్న పొదిలి, కందుకూరు–1, కందుకూరు–2, కనిగిరి, నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో 23.59 మిలియన్ కేజీలను పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. దీని ప్రకారం రీజియన్ పరిధిలో 2026–27 పంట సీజన్కు సంబంధించి 51.15 మిలియన్ కేజీల పొగాకును పండించవచ్చు. ఈ మేరకు బ్యారన్ పరిధిలో ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేయాలి, ఎన్ని క్వింటాళ్లు పండించాలనే పరిమితులను కూడా నిర్దేశించింది. దీని ప్రకారం ఎస్బీఎస్ పరిధిలో 2.50 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుకు అనుమతి ఉండగా 20 క్వింటాళ్లు పండించవచ్చు. ఎస్ఎల్ఎస్ పరిధిలో 3.50 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేసి 21 క్వింటాళ్లు పొగాకు ఉత్పత్తులను పండించవచ్చని బోర్డు పరిమితి విధించింది. 39.05 మిలియన్ కేజీల కోత 2025–26 పంట సీజన్లో ప్రకాశం రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకును పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. 2026–27 సీజన్కు దాన్ని 51.15 మిలియన్ కేజీలకు తగ్గించింది. అంటే దాదాపు 39.05 మిలియన్ కేజీల పొగాకు పంటకు కోత పెట్టింది. దీనికి ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న సంక్షోభమే ప్రధాన కారణమని బోర్డు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత సీజన్లో 90.20 మిలియన్ కేజీల పొగాకు పండించాల్సి ఉంటే దాదాపు 140 మిలియన్ కేజీల వరకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని వ్యాపారులు సాకుగా చూపి ధరల్లో భారీగా కోత విధిస్తున్నారు. పైగా ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధరలు అమాంతం పడిపోతుండడంతో గత్యంతరం లేని పరిస్థితిలో పొగాకును తెగనమ్ముకుంటున్నారు. వేలం ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నా 33 మిలియన్ కిలోలు మాత్రమే అమ్ముడైంది. వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లలో అధిక శాతం తిరస్కరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాంతం పంట పరిమితి బ్యారన్ ఆమోదిత సాగు విస్తీర్ణం (మిలియన్ కేజీలు) కోటా (కేజీలు)1.ఎస్బీఎస్ 23.59 2000 2.50 ఎకరాలు 2.ఎస్ఎల్ఎస్ 27.56 2100 3.50 ఎకరాలు 3.ఎన్ఎల్ఎస్ 28.27 2000 2.00 ఎకరాలు 4.ఎన్బీఎస్ 1.60 1600 1.75 ఎకరాలు మార్కాపురం: ఈనెల 27న కనిగిరి పోలీసు స్టేషన్లో పోలీసు పీజీఆర్ఎస్ను నిర్వహిస్తున్నట్టు ఇన్చార్జి ఎస్పీ వీ హర్షవర్ధన్రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పీజిఆర్ఎస్ నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా డీపీఆర్ఓగా డీ సందీప్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ విజయసునీతకు మొక్క అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈయన చిత్తూరు జిల్లా నుంచి బదిలీపై మార్కాపురం జిల్లాకు వచ్చారు. కర్ణాటకలో మళ్లీ భారీగా ఉత్పత్తి రాష్ట్రంలో ధరల్లేక పొగాకు సాగుపై టుబాకో బోర్డు పరిమితులు విధిస్తుంటే మన కంటే ముందుగా సీజన్ ప్రారంభమయ్యే కర్ణాటకలో 2026–27 పంట సీజన్కు 56 మిలియన్ కేజీల పొగాకును పండించేందుకు బోర్డు అనుమతి ఉంటే అక్కడి రైతులు దాదాపు 100 మిలియన్ కేజీల ఉత్పత్తులను పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో నెలా, రెండు నెలల్లో అక్కడి ఈ ఏడాది వేలం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రభావం కూడా ఇక్కడి పొగాకు రైతులపై భారీగా పడనున్నట్టు అధికారులు చెప్తున్నారు. -
సమ్మె ఎఫెక్ట్.. రూ.5 కోట్లు లాస్!
మార్కాపురం: రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నంబరు 396ను విడుదలజేసింది. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు సమ్మెబాట పట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 1400 మందికిపైగా డాక్యుమెంటు రైటర్లు ఈనెల 20 నుంచి పెన్ డౌన్ చేశారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రభుత్వం రూ.5 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయింది. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అమ్మనబ్రోలు, సింగరాయకొండ, చీమకుర్తి, అద్దంకి, మార్టూరు, కందుకూరు, దర్శి ప్రాంతాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆరు రోజులుగా డాక్యుమెంట్ రైటర్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దీక్షలు చేపట్టారు. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నెలమొత్తం మీద సగటున మార్కాపురంలో 70, కంభంలో 30, గిద్దలూరులో 30, యర్రగొండపాలెంలో 50, పొదిలిలో 40, కనిగిరిలో 50 వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇలా ప్రతిరోజూ ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లా నుంచి రూ.80 లక్షల దాకా ఆదాయం వస్తోంది. ఇలా ఆరు రోజులకు ఇప్పటి వరకూ సుమారు రూ.5 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. పీపీపీ విధానమంటే ఇదే.. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తామ ని ప్రకటించినట్లుగా కూటమి ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో పీపీపీ విధానంలో రిజిస్ట్రార్ కార్యాలయాలను పాస్పోర్టు కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తా మని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇద్దరూ ప్రభుత్వం ఏర్పా టు చేయబోయే ఆర్ఎస్కే (రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు)కి వెళ్లి వారే డాక్యుమెంట్లు తయారుచేసుకుని సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వెళితే ఆయన పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఈ విధానం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకానున్నాయని డాక్యుమెంటు రైటర్లు అంటున్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారుల్లో ఎవరికై నా రిజిస్ట్రేషన్ విధానంపై సరైన అవగాహన లేకపోయినా చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అంటున్న్రాు. డాక్యుమెంటు రైటర్ల పెన్డౌన్ సమ్మెకు ప్రజా సంఘాలతో పాటు మార్కాపురం, పొదిలిలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు, ఒంగోలులో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు మద్దతు ప్రకటించారు. ఈనెలాఖరు వరకూ డాక్యుమెంటు రైటర్లు సమ్మెలో పాల్గొననున్నారు. అయితే శనివారం ఉదయం నుంచి ప్రభుత్వం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను చేస్తారని ప్రకటించింది. డాక్యు మెంటు రైటర్లు మాత్రం సమ్మెలో పాల్గొంటున్నారు.జీవో నెం 396ను ఉపసంహరించాలి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ విధానంలో ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలి. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల కుటుంబాల వారు ఉపాధి కోల్పోతారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1400 కుటుంబాల వారు ఈ శాఖపై ఆధారపడి ప్రజలకు డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం మాపొట్టకొట్టొద్దు. మా ఆవేదనను గమనించి జీవోను ఉపసంహరించాలి. – టి సుబ్బారావు, డాక్యుమెంట్ రైటర్స్ సంఘం అధ్యక్షుడు -
డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి
ఒంగోలు సిటీ: జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో, రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ లీకేజీలపై విద్యార్థులు చేసిన ఆందోళనకు కేంద్రం దిగి వచ్చిందన్నారు. ప్రధాని మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఎలాగైతే రాజీనామా చేయించారో అలాగే డీఎస్సీ అక్రమాలపై లోకేష్ చేత రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు బయటకు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటి వరకూ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. ‘‘డీఎస్సీలో ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి ప్రతి దానికీ ఆధారం, సాక్ష్యాలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఆధారాలను ప్రజల ముందు ఉంచారు. దీనిపై ఇప్పటి వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అంటూ మండిపడ్డారు. విద్యార్థులతో కలసి భారీ ఉద్యమం డీఎస్సీలో అక్రమాలు నిగ్గుతేల్చే వరకు వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిరుద్యోగ యువత, విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదివిన అభ్యర్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగం, కుటుంబాల ఆశలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఒక వ్యవస్థ వద్ద, పరీక్షల నిర్వహణ బాధ్యత మరో స్వతంత్ర వ్యవస్థ వద్ద ఉండాలి. కానీ రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి పరిధిలో ఎందుకు పెట్టారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, శాంతి భద్రతలు క్షీణించాయని, సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే మానహక్కులు ఏమైపోయాయన్నారు. వీటన్నింటిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు. గిట్టుబాటు ధరలు లభించక రైతులకు జరుగుతున్న అన్యాయం, నిరుద్యోగ యువతకు భృతి కల్పించకపోవడం, యువతులకు రక్షణ లేకపోవడం, తల్లికి వందనం పథకంలో కోత ఇలా అన్ని అంశాలపై జగన్ ఉద్యమిస్తున్నారన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ అవసరమైతే కాక్రోచ్ తరహాలో ఉద్యమం చేస్తామన్నారు. -
భార్యపై కోపంతో పిల్లలకు ఎలుకల మందు తాగించాడు
ఒంగోలు టౌన్: భార్య, భర్తల మధ్య మనస్పర్థలు కన్నబిడ్డల ప్రాణాల మీదకు తెచ్చాయి. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన తండ్రి కన్నబిడ్డలకు కూల్డ్రింక్లో ఎలుకల మందు కలిపి తాగించాడు. పరిస్థితి విషమించి కుమార్తె మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన కొరిశపాటి విజయకుమార్, ప్రవల్లిక 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. కూతురు ఆద్య (10), కుమారుడు సుప్రీత్ (8) ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నారు. కొంతకాలంగా భార్య ప్రవల్లికపై అనుమానం పెంచుకున్న విజయకుమార్ ఆమెను వేధించసాగాడు. విసిగివేసారిన ప్రవల్లిక ఇంటినుంచి వెళ్లిపోయి ఒంగోలు శక్తిసదన్లో ఆశ్రయం పొందింది. నాలుగు నెలలుగా ఆమె అక్కడే ఉంటోంది. భార్య తన వద్దకు రాకపోవడంతో కక్ష పెంచుకున్న విజయకుమార్ ఈ నెల 19వ తేదీ ఆద్య, సుప్రీత్లకు కూల్డ్రింక్లో ఎలుకల మందు కలిపి తాగించాడు. తరువాత ఏమీ తెలియనట్లు పిల్లలను తీసుకెళ్లి తల్లి దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. మరుసటి రోజు పిల్లలు వాంతి చేసుకోవడంతో అనుమానం వచ్చిన ప్రవల్లిక ఏం జరిగిందని ఆరా తీసింది. నాన్న కూల్ డ్రింక్ తాగించినట్లు చెప్పారు. వాంతులు ఆగకపోవడంతో వెంటనే పిల్లలను జీజీహెచ్కు తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాయిజన్ తాగినట్లు నిర్ధారించారు. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యం ప్రారంభించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె ఆద్య శనివారం మృతి చెందింది. కుమారుడు సుప్రీత్ ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే రెండు రోజుల కిత్రం తండ్రి విజయ్ కుమార్ కూడా ఎలుకల మందు తాగి ఆత్యహత్య ప్రయత్నం చేశాడు. అతడిని జీజీహెచ్కు తరలించారు. అప్పుడు ఈ విషయం బయట పడింది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘డీఎస్సీలో అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి’
ప్రకాశం: డీఎస్సీలో అక్రమాలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు డిమాండ్ చేశారు. ఆంధ్రాలో డీఎస్సీలో అవకతవకలకి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన లోకేష్ పదవిలో ఉండటానికి వీల్లేదన్నారు. లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత ఉద్యమించాలన్నారు. ఈ నెల 28వ తేదీన లోకేష్ రాజీనామా కోరుతూ ఆంధోళనలను ప్రారంభిస్తామన్నారు జూపూడి. డిఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించి...లోకేష్ రాజీనామా కూడా చేయాలన్నారు. రాష్టంలోను కాక్రోచ్ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు జూపూడి. -
బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఒంగోలు వన్టౌన్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి కే శైలజ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన సాదు శ్యామ్ అలియాస్ శ్యాంసుందరరావు (49) 2020 జూన్ 8న ఓ బాలిక(10) ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడి చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్ వేశారు. నేర నిరూపణ కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను జడ్జి విధించారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ.2,50,000 ఒంగోలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందజేయాలని ఆదేశించారు. -
విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఒంగోలు సిటీ: దేశవ్యాప్తంగా 155 పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి కారకులైన, ఏడు కోట్ల మంది విద్యార్థుల జీవితాలు ధ్వంసం అయ్యేందుకు, దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకుడైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయకపోతే ఢిల్లీని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీకి కారుకులైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 20వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుత ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన పోలీసు బలగాల చేత ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అత్యంత కిరాతకంగా భాష్ప వాయువు వంటి వాటిని ఉపయోగిస్తూ దారుణంగా లాఠీచార్జి చేశారు. దీన్ని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రెండు రోజుల ముందు నుంచే విద్యార్థి సంఘాల నేతలు ప్రైవేట్ విద్యాసంస్థల వారికి నోటీసులు అందించారు. 90 శాతం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్కు అంగీకరించాయి. 24వ తేదీ శుక్రవారం ఒంగోలు నగరంలో విద్యార్థి సంఘాల నేతలు ముందుగా దామచర్ల సక్కుబాయమ్మ పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఏబీఎం జూనియర్ కళాశాల, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, మిగిలిన ప్రభుత్వ విద్యా సంస్థలను దగ్గరుండి మూయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు, పోలీసుల అత్యుత్సాహం వల్ల బంద్ను జరగకుండా చేయాలని చూసినా జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతం అయింది. అనంతరం విద్యార్థి యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయటం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వలన మొత్తం విద్యా వ్యవస్థ నాశనమైపోయిందన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ నేడు మాట తప్పారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని పార్లమెంట్లో కీలకమైన బిల్లుల్ని ఆమోదించుకుంటున్నారు తప్ప విద్యార్థులు, యువజనుల గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ విద్యార్థులకు మద్దతుగా 23 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఆయనతో చర్చించేందుకు కూడా భారత ప్రభుత్వానికి తీరిక లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఆలోచించి నీట్ ప్రవేశ పరీక్షను రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాలని, జాతీయ స్థాయి ప్రశ్న పత్రాల లీకేజీలపై పార్లమెంట్లో చర్చించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దుచేసి, ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి, అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆర్.కరుణానిధి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఆర్.మరియబాబు, రాకేష్, కిరణ్, నితీష్ కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి కండల రమాదేవి, జిల్లా నాయకులు రాజ్యలక్ష్మి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం రమేష్, శ్రీకాంత్, అభిమన్యు, చారి, సంపత్, పీడీఎస్యూ నాయకులు సోమేశ్, అవినాష్, సచిన్, విద్యార్థి యువజన జేఏసీ నాయకులు రాజీవ్, ఈస్టర్ పాల్గొన్నారు. -
పీటీఎం..ఫెయిల్ !
ఒంగోలు సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్స్ మీట్ (పీటీఎం) 4.0 మొక్కుబడిగా ముగిసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. ప్రభుత్వ ప్రచారానికే పరిమితమైన ఈ కార్యక్రమం నిర్వహణలో అరకొర నిధులు విడుదల కావడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు పరీక్షలు నిర్వహించకుండానే ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేయడం, లీప్ యాప్ డౌన్లోడ్పై ఒత్తిడి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేశాయి. పరీక్షలు నిర్వహించకుండానే ప్రోగ్రెస్ కార్డులా? పాఠశాలలు పునఃప్రారంభమై ఇంకా 50 రోజులు దాటలేదు. విద్యార్థులకు ఇప్పటి వరకూ ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఎలాంటి పరీక్షలు జరపకుండానే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు (సమగ్ర ప్రగతి పత్రాలు) పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. ప్రగతి పత్రాల్లో మార్కుల నమోదు లేకపోవడంతో వాటిని చూసిన తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ విషయంపై కొన్ని చోట్ల పాఠశాల సిబ్బందిని నిలదీశారు. నిధులు సరిపోక హెచ్ఎంలకు భారంగా.. ప్రకాశం జిల్లాలో 1,556, మార్కాపురం జిల్లాలో 1,405 ప్రభుత్వ పాఠశాలలు కలిపి మొత్తం 2,961 పాఠశాలల్లో మెగా పీటీఎం–4.0ను ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే కార్యక్రమ నిర్వహణకు కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో అనేక పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొంటున్నారు. కొన్ని పాఠశాలల ఖాతాలకు కేటాయించిన మొత్తం కూడా పూర్తిగా జమ కాకపోవడంతో, కార్యక్రమ నిర్వహణ కోసం ప్రధానోపాధ్యాయులు సొంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 లోపు విద్యార్థులుంటే రూ.900, 30–200 మంది విద్యార్థులుంటే రూ.2550, 250 మంది ఉంటే రూ.4 వేలు, వెయ్యి మంది ఉంటే రూ.6,750, వెయ్యి మందిపై నుంటే రూ.9 వేలు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రాథమిక పాఠశాలల్లో సాధారణంగా 100 మంది లోపే ఉంటారు. అలాంటి చోట ప్రభుత్వం ఇచ్చిన రూ.2,250లతో కుర్చీలు, టెంట్లు, గెస్ట్లకు శాలువాలు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టి బహుమతులు, భోజనానికి ప్లేట్లు, గ్లాసులకు ఖర్చు హెచ్ఎంలకు తడిసి మోపడైంది. అదనపు ఖర్చును ఉపాధ్యాయులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకులకు చోటు గిద్దలూరు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన మెగా పీటీఎం కార్యక్రమంలో టీడీపీ నాయకులకు చోటు కల్పించారు. బేస్తవారిపేటలోని జెడ్పీ బాలుర హైస్కూల్లో జరిగిన పీటీఎం కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు, కంభం మార్కెట్యార్డ్ చైర్మన్లకు చోటు కల్పించారు. టీడీపీ సభలాగా మార్చేశారు. లీప్ యాప్పై ఒత్తిడిప్రతి తల్లి తండ్రి వద్ద స్మార్ట్ఫోన్ ఉండాలని, అందులో లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడంతో స్మార్ట్ఫోన్ లేని కుటుంబాలు, సాంకేతిక పరిజ్ఞానం తెలియని పెద్దలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. యాప్ వినియోగంపై తగిన అవగాహన లేకపోవడంతో పలుచోట్ల అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. -
స్తంభించిన రిజిస్ట్రేషన్లు
● డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్తో రిజిస్ట్రేషన్ ఆదాయానికి గండి ఒంగోలు సబర్బన్: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి వెళ్లటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలన్నింటినీ నిలిపేశారు. దీంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. పలుచోట్ల డాక్యుమెంట్ల రైటర్లు తమ కార్యాలయాల వద్దే నల్లరిబ్లన్లతో నిరసన తెలిపారు. ఒంగోలులో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసన కార్యక్రమం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోపర్తి హరిబాబు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్స్ వృత్తికి భంగం కలిగించొద్దని నినదించారు. జీవో–396కు వ్యతిరేకంగా ఈ నెల 31 వరకు పెన్డౌన్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అసోసియేషన్ నాయకుడు డి.సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ విధానాల వల్ల జిల్లా వ్యాప్తంగా 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆసరాగా చేసుకొని పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అనుబంధ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పి. నరసింహారావు. ఎం.నాగేశ్వరరావు, గోపిశెట్టి శ్రీనివాసరావు. డి.సురేష్ మోహన్, షేక్ ఖాసిం, బి.నారాయణ, ఏ.శ్రీనివాస రెడ్డి, బత్తుల భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో పాటు జ్ఞాపికను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
నేటి నుంచి పాలంకేశ్వరుడి తిరునాళ్లు
యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అడవిలో వెలసిన పాలంకేశ్వరుడి తిరునాళ్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన పాలంకేశ్వరుడు, భద్రకాళి అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కృష్ణానది ఒడ్డున వెలసిన పాలంక వీరభద్రస్వామి ఏకరాతి పందిరి కింద భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నల్లమల అందాలకు పరవశించిన పరమ శివుడు ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామి పాలంకేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటారు. శ్రీశైలం సమీపంలోని ఈ ఆలయంలో ఆరోగ్య, సౌభాగ్య, సంతాన ప్రదాత వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్లు కొలువై ఉన్నారు. పర్వతాల మల్లయ్య, పాలంక వీరయ్య అంటూ పాడుకునే జానపద గేయాల ద్వారా ఈ క్షేత్రాన్ని శ్రీశైల క్షేత్రంతో పోల్చుతారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినాన వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తుల రాక... పాలంకేశ్వరుడి తిరునాళ్లు సందర్భంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు కర్నూలు, నంద్యాల, మహబూబ్నగర్, గుంటూరు, నల్గొండ జిల్లాలకు చెందిన భక్తులు పాలంక క్షేత్రానికి చేరుకుంటారు. ఆదిశేషుని ఆకారంలో ఉన్న కొండచరియ కింద మూలవిరాట్ పాలంకేశ్వరుడు, వీరభద్రుడు, గణపతి, పంచముఖబ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, పది అడుగుల ఎత్తులో నాగమయ్య పుట్ట ఉండటం ఇక్కడ ప్రత్యేకత. మండలంలోని వెంకటాద్రిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు దాదాపు 40 కిలోమీటర్ల మేర నల్లమల అడవిలో యాత్ర సాగించాల్సి ఉంది. అక్కడికి వెళ్లేందుకు యర్రగొండపాలెం నుంచి జీపులు, ట్రాక్టర్లు, లారీలు అందుబాటులో ఉంటాయి. -
విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం
నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్న దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు ఒంగోలు వన్టౌన్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మార్పీఎస్ నాయకులు ఖండించారు. ఆ మేరకు గురువారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటిమాదిగ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిందన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులపై ఢిల్లీలో జరిగిన పోలీసుల బలప్రయోగాన్ని ఎమ్మార్పీఎస్ అధినేత ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి కోచింగ్లు తీసుకుని సిద్ధమయ్యే నీట్ పరీక్షల విశ్వసనీయత దెబ్బతినడం అత్యంత ఆందోళనకరమన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై పారదర్శకంగా, వేగంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుతం.. నిందితులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనేక సార్లు నీట్ పేపర్ను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, ప్రజాప్రతినిధులపై పోలీసులు బలప్రయోగం చేయడం, టియర్ గ్యాస్ విడుదల చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు ఎమ్మార్పీఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ క్రమశిక్షణ సంఘ చైర్మన్ కొమ్మూరి గరటయ్య మాదిగ, రేణమాల మాధవ్ మాదిగ, గంధం ఇర్మియా మాదిగ, ప్రత్తిపాటి నాగయ్య మాదిగ, గౌడపేరు మహేష్ మాదిగ, బక్కా రాజు మాదిగ, మల్లెల ప్రసాద్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, రావినూతల కొర్నేలు మాదిగ, బెన్నీ మాదిగ తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో... నీట్ పరీక్షల పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై మోదీ ప్రభుత్వం పోలీసులతో దమనకాండకు పాల్పడటం దారుణమని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. ఒంగోలు నీలంపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా, నీట్ పరీక్షల నిర్వహణపై సమాధానం చెప్పకుండా మోదీ ప్రభుత్వం దాటవేస్తోందన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య మాదిగ, పరిరక్షణ సమితి అధ్యక్షుడు పట్టరా బంగారం, దేవరపల్లి గోపి, గడ్డం వెంకటేశ్వర్లు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బ్రహ్మకుండం.. ఉనికికే గండం!
బల్లికురవ: దేవుడి పేరుతో నీచ రాజకీయాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బాబు సర్కారు.. ఆలయాల ఉనికికే ముప్పు వాటిల్లుతున్నా లేశమంతైనా స్పందించకపోవడంపై భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో పాలకుల అండదండలతో క్వారీ మాఫియా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండటంతో 12వ శతాబ్దపు చోళరాజుల కాలం నాటి మహిమాన్విత క్షేత్రాలకు ముప్పు ఏర్పడింది. గ్రానైట్ వ్యర్థాల డంపింగ్తో ఆలయాలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించినా స్పందించే నాథుడే కరువయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బల్లికురవ మండలంలోని కొణిదెన, నక్కబొక్కలపాడు పరిధిలో ఎంతో చరిత్ర కలిగిన బ్రహ్మకుండం, ఈర్లకొండపై స్వయంభువుగా వెలసిన ఈర్ల గంగమ్మ ఆలయాల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కొండపై భాగంలో ఎస్ఆర్ క్వారీ నిర్వాహకులు రెండేళ్లుగా గ్రానైట్ వృథా రాళ్లను ఇష్టారాజ్యంగా కిందికి దొర్లిస్తున్నారు. రాళ్ల దెబ్బకు ఆలయాలు, విగ్రహాలను దుమ్ము కమ్మేస్తోంది. ఏ క్షణాన తమ మీద రాళ్లు పడతాయోనని భక్తులు ప్రాణగుప్పిట్లో పెట్టుకుని పూజలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రశ్నించిన గ్రామస్తుల పట్ల శ్రీఆలయాలు మా లీజు స్థలంలో ఉన్నాయి, ‘అంతా మా ఇష్టం’ అంటూ క్వారీ నిర్వాహకులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇటీవలే బ్రహ్మకుండం వద్ద భక్తుల సహకారంతో లక్ష్మీనారాయణుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయస్వామి, పార్వతీ పరమేశ్వరులు తదితర విగ్రహాలను ప్రతిష్టించి ఆధ్యాత్మిక వనంగా తీర్చిదిద్దారు. దసరా, కార్తీకమాసాల్లో ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తుల భద్రతను సైతం కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. క్వారీ మాఫియాకు వత్తాసు పలుకుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. వృథా రాళ్లు పడకుండా ఆపకపోతే భవిష్యత్తులో ఈ ఆలయాలు పూర్తిగా కనుమరుగవ్వడం ఖాయం. పాలకుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భగవంతుడికి అన్యాయం జరిగితే సహించేది లేదని, వెంటనే క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోతే కరపత్రాల పంపిణీతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర యువమోర్చా నేత కే.శ్రీరామ్ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. -
రాష్ట్ర స్థాయి టీ20 చాంపియన్గా ప్రకాశం
ఒంగోలు సిటీ: విజయనగరంలో ఈ నెల 17 నుంచి నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్–23 జోనల్ టీ20 క్రికెట్ టోర్నీలో ప్రకాశం జిల్లా జట్టు అజేయంగా నిలిచి టైటిల్ కై వసం చేసుకుంది. బరిలోకి దిగిన ఐదు మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థులను చిత్తుచేసి సగర్వంగా విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ నార్త్జోన్పై ప్రకాశం ఘనవిజయం సాధించింది. నార్త్జోన్ 172/7 స్కోరు చేయగా.. ప్రకాశం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆనంద్ (56) హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో మ్యాచ్లో తూర్పుగోదావరిపై ప్రకాశం 32 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి 195/10 పరుగులు సాధించింది. విష్ణుదత్త (20 బంతుల్లో 55) వీరవిహారం చేశాడు. అనంతరం ప్రత్యర్థి జట్టును 163 పరుగులకే కట్టడి చేసింది. మూడో మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్జోన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ప్రకాశం జట్టు 16.2 ఓవర్లలోనే అధిగమించింది. బౌలర్లు ఎన్.వి.పవన్ కుమార్, పార్థసారథి రెండేసి వికెట్లతో సత్తా చాటారు. నాలుగో మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ ఇచ్చిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రకాశం జట్టు కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది. విష్ణుదత్త (35 బంతుల్లో 75) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో మ్యాచ్లో అనంతపురం టీమ్పై ప్రకాశం బ్యాటర్లు ప్రతాపం చూపారు. 196 పరుగుల లక్ష్యాన్ని అభినవ్ (90), సి.పి.వెంకటేష్ (61) అద్భుత బ్యాటింగ్తో 19.2 ఓవర్లలో ఛేదించారు. బౌలర్ పార్థసారథి టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. విజేతగా నిలిచిన జట్టును ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (పీడీసీఏ) అధ్యక్ష, కార్యదర్శులు నవీన్ కుమార్, కారుసాల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ బొచ్చు శ్రీనివాసరావు, ట్రెజరర్ హనుమంతరావు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. అండర్–23 జోనల్ పోటీల్లో అన్ని మ్యాచ్ల్లో విజయ కేతనం -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
రాచర్ల: మండల కేంద్రమైన రాచర్లలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. స్థానిక బస్స్టాండ్ సెంటర్లో నివాసముండే యల్లా రంగస్వామి (48)ఆయన బుధవారం రాత్రి భోజనం చేసి ఇంట్లోని రెండో అంతస్తులోకి వెళ్లాడు. అర్ధరాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు. ఉదయం భార్య నాగమణి గమనించి స్థానికులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.శివ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గిద్దలూరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి తల్లి, భార్య, చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆయన బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కందుకూరు రూరల్: ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ టోర్నమెంట్కు కందుకూరుకు చెందిన పి.అఖిల్ రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే అబ్దుల్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికై న అఖిల్ను కందుకూరు డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా క్రీడారంగానికి ఇది గర్వకారణమని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో చైర్మన్ గోనుగుంట వెంకటేశ్వర్లు (తిమోతి) తదితరులు పాల్గొన్నారు. -
వెలిగొండ నిర్వాసితుల త్యాగాలకు విలువేదీ?
మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను బాబు ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోందని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజల త్యాగాలను ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీనియర్ న్యాయవాది సయ్యద్ జావేద్ అన్వర్, వెలిగొండ నిర్వాసితుల సంఘం కోకన్వీనర్ దగ్గుబాటి సోమయ్య ధ్వజమెత్తారు. కటాఫ్ తేదీని 2019 నుంచి 2026కు పెంచాలని, అర్హులైన వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ దీక్షా శిబిరంలో నేతలు మాట్లాడుతూ.. ఎప్పుడో 2016 సంవత్సరంలో నిర్ణయించిన ప్యాకేజీని పదేళ్ల తర్వాత 2026లో నిర్వాసితుల నెత్తిన రుద్దాలని చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 సెప్టెంబరు నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులందరినీ మేజర్లుగా పరిగణించి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, రాజేశ్వరరెడ్డి, హనుమంతారెడ్డి, ఎల్లయ్య, రామకృష్ణ, శశీంద్ర, ఫకీరయ్య తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం: మండలంలోని బోయలపల్లెలో ఆత్మానంద అవధూత స్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈ నెల 26న రాష్ట్రస్థాయి పాలపండ్ల ఎడ్ల (6 పండ్ల లోపు) పందాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పందాల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల చొప్పున బహుమతులు ప్రదానం చేయనున్నారు. తొలిఏకాదశిని పురస్కరించుకుని 25న స్వామివారికి విశేష పూజలు, రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, 26న ఎడ్ల పందాలు, 27న రాత్రి గురుపూజ కన్నులపండువగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. మార్కాపురం: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక జీజీహెచ్లో 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో 10 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. 100 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలిపి కరోనా కేసులు 32కు చేరడంతో జీజీహెచ్ సిబ్బంది ఇప్పటికే మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్నారని, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూపరింటెండెంట్ సూచించారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. బాబు సర్కారు తీరుపై భగ్గుమన్న ప్రజా సంఘాలు 2016 నాటి ప్యాకేజీని 2026లో అంటగడతారా అంటూ నిలదీత మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్షలు -
గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
సీఎస్పురం(పామూరు): మండలంలోని దర్శి తిమ్మక్కపల్లి (డీటీపల్లి) గ్రామ శివారు కొండ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం వెలుగుచూసినట్లు ఎస్సై పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. పనుల నిమిత్తం గ్రామ సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లిన కొందరు స్థానికులు.. చెట్ల మధ్య ఉన్న మానవ అస్థిపంజరాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ దుర్గాసి వినోద్కుమార్, ఎస్సై పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సిబ్బందితో కలిసి అస్థిపంజరాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ గుర్తు తెలియని మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా 9121102216, 9121102214కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
పీటీఎం 4.0కు ఏర్పాట్లు పూర్తి
● విలేకరుల సమావేశంలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం 4.0)లను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. స్థానిక ప్రకాశం భవన్లోని సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,556 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు అందుబాటులో ఉండగా, వీటిలో 1,07,243 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం రూ.34,72,200 నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశామన్నారు. పాఠశాలల్లో పండుగ వాతావరణం నింపేందుకు తల్లిదండ్రులకు సరదాగా ఆటల పోటీలు నిర్వహించనున్నారని, తల్లిదండ్రులంతా పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుక, సమగ్రశిక్ష జిల్లా కో ఆర్డినేటర్ డి.అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
పొగాకు కొనుగోలుకు వెయ్యి కోట్లు కేటాయించాలి
అమ్మనబ్రోలు సభలో మాట్లాడుతున్న జయంత్బాబుబైక్ ర్యాలీలో పాల్గొన్న రైతు సంఘ నాయకులు, రైతులు నాగులుప్పలపాడు: పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి రైతులను ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు జయంత్బాబు డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఉన్న పొగాకును ప్రభుత్వ రంగ సంస్థలచే వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు మండలంలోని కరవది నుంచి నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు, నాగులుప్పలపాడు, బీ నిడమానూరు గ్రామాల మీదుగా మద్దిపాడు మండలంలోకి బైక్ ర్యాలీ ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు సభలలో నాయకులు చుండూరి రంగారావు, జయంత్బాబు, లలిత కుమారి, సాగర్ మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని 90 రోజులుగా ఉద్యమిస్తున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాలు పొగాకు పంట ద్వారా ఏటా రూ.88 వేల కోట్ల ఆదాయం పొందుతున్నప్పటికీ పొగాకు రైతుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. జూన్ 19న రైతులు చేపట్టిన ట్రాక్టర్, మోటార్ సైకిల్ ర్యాలీ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి కిలో రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ వ్యాపారస్తులు బేఖాతరు చేస్తూ ధరలు తగ్గిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బ్యారన్కు రూ.5 లక్షలకుపైగా రైతులు నష్టపోతున్నారన్నారు. బైకు ర్యాలీ ద్వారా రైతులను చైతన్యపరచడంతో పాటు ఈ ప్రభుత్వం ఇలాగే మొండివైఖరితో ఉంటే ఈ నెల 29న హైవే దిగ్బంధాలకు పిలుపునిచ్చామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే చలో అమరావతికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. -
నేడు విద్యాసంస్థల బంద్
● జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థుల ర్యాలీ ఒంగోలు టౌన్: నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కేంద్ర పోలీసు బలగాలు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించనున్నారు. బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గురువారం ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలను రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్లు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారని, ఆ మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తున్న నీట్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా పరీక్షలు నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి సీహెచ్ వినోద్ మాట్లాడుతూ... పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు కర్కశంగా దాడి చేసి లాఠీలతో కొట్టడం దుర్మార్గమన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.బాబు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న పరీక్షల లీకేజీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. విద్యార్థులు చేస్తున్న న్యాయపోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం బేషరతుగా మద్దతు పలుకుతోందన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ... కన్నబిడ్డల్లాంటి విద్యార్థులపై పోలీసులు అత్యంత క్రూరంగా దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు దేశ పాలకులు క్షమాపణ చెప్పాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి యువజన నాయకులు, నీట్ విద్యార్థులు మోహన్, నవీన్, ఆదిలక్ష్మి, మాలతి, ప్రశాంత్, నితీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయం బారెడు !
ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు (పీటీఎం) విద్యాభివృద్ధికి వేదిక కావాల్సిందిపోయి ప్రచార కార్యక్రమాలుగా మారుతున్నాయి. పాఠశాలల సమస్యలు, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణపై చర్చించాల్సిన సమావేశాలు.. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. అరకొర నిధులతో ఏర్పాట్ల భారం ప్రధానోపాధ్యాయులపై పడుతుండగా, తల్లిదండ్రుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. దీంతో ఈ సమావేశాలతో విద్యా వ్యవస్థకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. నిధులు మూరెడు.. ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ మూడు దఫాలుగా మెగా పేరెంట్–టీచర్ మీటింగ్లు నిర్వహించింది. 2024వ సంవసత్సరం డిసెంబర్ 7వ తేదీ, గతేడాది జూలై 10వ తేదీ, డిసెంబర్ 5వ తేదీ సమావేశాలు జరిపింది. వీటికి అటు విద్యార్థుల నుంచి ఇటు తల్లిదండ్రుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పిల్లల విద్యాభివృద్ధి, అభ్యాస ఫలితాలు, పాఠశాల అవసరాలపై చర్చ జరగాల్సిన సమావేశానికి రాజకీయరంగు పులుముతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరకొరగా నిధులు... ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 2,961 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో 1,556, మార్కాపురం జిల్లాలో 1,405 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మెగా పేరెంట్స్ మీటింగులు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మొత్తం రూ.66,33,450 నిధులు కేటాయించినప్పటికీ, అవి సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సమావేశాల్లో చాలా ప్రాంతాల్లో ప్రధానోపాధ్యాయుల జేబులకు చిల్లులు పడ్డాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దఫా ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ మాత్రం సరిపోవని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వారం రోజులుగా సన్నాహక హడావిడి... మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ కోసం వారం రోజులుగా ఉపాధ్యాయులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమవడంతో సాధారణ తరగతులకు అంతరాయం కలుగుతోంది. విద్యార్థుల బోధన సమయం తగ్గి సమావేశ ఏర్పాట్లకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గతంలో జరిగిన మూడు సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్పందన కరువైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారి హాజరు 30 శాతం కూడా దాటలేదు. గతంలో నిర్వహించిన సమావేశాలతో ఎలాంటి ఉపయోగం లేనప్పుడు శుక్రవారం జరిగే పీటీఎం 4.0 సమావేశాలు ఎందుకుని విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. భోజనం ఖర్చులు ఎలా..? సమావేశాలకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనాలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఒక మూలకు కూడా రావు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలకు పెట్టుబడి ఎక్కువ పెట్టుకోవాల్సి రావడంతో నిర్వాహకులు ఇబ్బందులుపడే అవకాశాలున్నాయి. గత మూడు సమావేశాల్లో జరిగిన తీరును చూసి నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన వ్యయాన్ని ఎలా భరించాలన్న ఆందోళన వారిలో నెలకొంది. విద్యా చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలి... తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు రాజకీయ ప్రచారానికి వేదిక కాకుండా చూడాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల అభ్యాసం, వ్యక్తిత్వ వికాసం, హాజరు, అభ్యాస లోపాలు, భవిష్యత్ లక్ష్యాలు వంటి అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లికి వందనం ప్రచారంపై వెనక్కి... పీటీఎం సమావేశాల్లో తొలుత తల్లికి వందనం పథకాన్ని వివరించాలని భావించారు. విద్యార్థులతో పాటలు పాడించి నృత్యాలు చేయించాలని సూచించినట్టు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదువుకున్న విద్యార్థులందరికీ ఈ పథకం అందడంలేదు. రకరకాల కొర్రీలతో ఎగనామం పెడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చిస్తే విద్యార్థుల తలిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని భావించి చివరి నిమిషంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం -
రైతులపై పగ.. ఆశలకు ‘పొగ’
ఆరుగాలం శ్రమించి పండించిన పొగాకు రైతన్నకు కన్నీళ్లే మిగులుస్తోంది. వేలం కేంద్రాల్లో సిండికేట్ అవుతున్న వ్యాపారుల తీరుతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎంత నాణ్యమైన సరుకు తెచ్చినా సగటు ధర కిలో రూ.200 దాటకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు కొనుగోలుదారులు రకరకాల వంకలు పెడుతూ సరుకును తిరస్కరిస్తుండటంతో వేలం కేంద్రాల్లో రిటర్న్ బేళ్ల సంఖ్య రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతోంది. అటు ఆశించిన మేర గిట్టుబాటు ధర రాక.. ఇటు తెచ్చిన సరుకు అమ్ముడుపోక వేలం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల అవస్థలు వర్ణనాతీతం. పెట్టుబడులు ఎలా రాబట్టాలో, అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దృశ్యాలు త్రోవగుంట వేలం కేంద్రంలోనివి.. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు -
విభిన్న ప్రతిభావంతుల మెరిట్ లిస్టు విడుదల
ఒంగోలు వన్టౌన్: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఉద్యోగాల నియామకాలలో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు సీహెచ్ సువార్త గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–4, తదితర విభాగాలకు చెందిన 42 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. మెరిట్ జాబితాను ప్రకాశం.ఏపీ.జీఓవీ.ఇన్ అనే జిల్లా అధికారిక వైబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేరు, పోస్టు, దివ్యాంగుల కేటగిరి, విద్యార్హతలు, ఉద్యోగ సీనియార్టీ, మెరిట్ స్థానం, ఇతర వివరాలను పరిశీలించుకోవాలన్నారు. అభ్యంతరాలుంటే సంబంధిత ఆధార పత్రాలతో కూడిన తమ అభ్యంతరాలను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఒంగోలు ప్రకాశం భవన్లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో స్వయంగాగానీ, రిజిస్టర్డ్ పోస్టు ద్వారాగానీ సమర్పించాలన్నారు. తగిన ఆధారాలు లేని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం జరగదన్నారు. వ్యక్తిగత దరఖాస్తులను మాత్రమే సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 08592–281310 నంబర్ను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. ● సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా ఒంగోలు సబర్బన్: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ (ఏపీఎస్సీఎస్సీఎల్) ప్రకాశం జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక సంతపేటలోని ఏపీఎస్సీఎస్సీఎల్ డీఎం కార్యాలయం ముందు గురువారం నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ జిల్లాలో చాలామంది ఉద్యోగులు 5 నుంచి 15 సంవత్సరాలకుపైగా కార్పొరేషన్లో సేవలందిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ కొత్తగా చేరిన ఉద్యోగులతో సమాన వేతనం పొందుతున్నారన్నారు. అనుభవం, సేవా కాలానికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. అనుభవం ఆధారంగా ఇంక్రిమెంట్ పాలసీ అమలు చేయాలని, 5 నుంచి 15 సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, సీనియర్ ఉద్యోగులకు ప్రత్యేక వేతన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనుభవాన్ని గుర్తించి వేతనాలు నిర్ణయించాలన్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: ఈ–సర్వీసు ద్వారా వచ్చే నిధులు ఎప్పటికప్పుడు బ్యాంకులో జమచేయాలని డీఎస్జీఎస్డబ్ల్యూ జిల్లా అధికారి ఎం.వెంకటేశ్వరరావు స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు నగరంలోని శారదా బాలకుటీర్ స్వర్ణ వార్డు కార్యాలయాన్ని, మంగమూరు గ్రామంలో స్వర్ణ గ్రామ వార్డులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పథకాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డులకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరణ చేసుకోవాలన్నారు. మంగమూరు ఈ – సర్వీస్ ద్వారా వచ్చిన నగదు ఇంకా రూ.13,326 బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ సేవల ద్వారా ప్రతిరోజూ వసూలయ్యే నగదును ఎటువంటి పెండింగ్ లేకుండా అదే రోజు చలానా ద్వారా సంబంధిత బ్యాంకులో జమ చేయాలని వార్డుల్లో, గ్రామాల్లో డిజిటల్ సహాయకులను, అర్బన్ ప్రాంతాలలో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సహాయకులను ఆదేశించారు. స్వర్ణ గ్రామ కార్యాలయంలో వచ్చిన అర్జీలను వెరిఫికేషన్ చేసి వారికి స్వయంగా ఫోన్ చేసి ఈ సమస్య పరిష్కరించబడిందా అని అడిగారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రతాప్, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. -
లారీని ఢీకొట్టిన బైక్
మేదరమెట్ల: మేదరమెట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బైక్పై వస్తున్న యువకులు ఢీకొట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇరువురిలో వల్లెపు ప్రదీప్(24) అక్కడికక్కడే మృతి చెందగా, మాచర్ల భార్గవ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రుణ్ణి 108 లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేదరమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరులోని ఓ విద్యా సంస్ధలో ప్రదీప్, భార్గవ్లు చుదువుతున్నారు. ప్రదీప్ది విజయవాడ. భార్గవ్ది విజయనగరం. ఇద్దరూ బైక్పై ఒంగోలు వచ్చి తిరిగి గుంటూరు వెళ్లే క్రమంలో మేదరమెట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ముందు వెళుతున్న లారీని ఢీకొట్టి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ప్రదీప్ మృతి చెందాడు. గాయపడిన భార్గవ్ను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, బడి నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు జూలై 24న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 4.0ను నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఏపీసీ దాసరి అనీల్కుమార్ తెలిపారు. బుధవారం ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 38 మండలాల పరిధిలో గల 1,556 ప్రభుత్వ పాఠశాలలు, 1,405 మోడల్ ప్రాథమిక పాఠశాలలు.. వెరసి మొత్తం 2,961 బడుల్లో ఈ మెగా పీటీఎం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్ల కోసం రూ.66.33 లక్షల నిధులను వెచ్చించినట్లు ఏపీసీ వివరించారు. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
రీ సర్వేను వేగవంతం చేయండి
● కలెక్టర్ విజయ సునీత మార్కాపురం టౌన్: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో తహసీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30 తేదీకల్లా సర్వే డేటాను తహసీల్దార్ల లాగిన్లో పూర్తి చేయాలన్నారు. ఇంకా సర్వే పూర్తికాని, గ్రామాల్లో నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చిన గడువులోపు రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియను ముగించాలని తెలిపారు. వీఆర్వో, సర్వేయర్ లాగిన్ లలో పెండింగ్లో ఉంచుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే మరి కొంతమంది సహకారంతో రీ సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని తహసీల్దార్లు చూడాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. అనుకున్న ప్రకారం సెప్టెంబర్ లో రైతులకు నూతన పాస్ పుస్తకాలు అందజేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: మద్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రతి నెలా 5వ తేదీలోపు బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కే.కోటేశ్వరమ్మ డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరమ్మ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వలన వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, ఒక విద్యార్థికి రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత వలన ఎక్కువ ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వమే నేరుగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా నాయకులు మంజుదార్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 10 నెలల వేతనం కాకుండా 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 31వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. నాగులుప్పలపాడు: రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంత్బాబు తెలిపారు. ఈ సందర్భంగా జయంత్బాబు మాట్లాడుతూ ఆగస్టు నెల వస్తున్నా రైతుల వద్ద ఉన్న వర్జీనియా పొగాకు అమ్ముడుపోక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యాపారులు నోబిడ్ పేరుతో చెక్కులు వెనక్కి పంపుతూ కొనుగోలు చేయకపోవడంతో పాటు ధరలు కూడా తగ్గించారన్నారు. దీంతో బ్యారన్కు ఒక్కో రైతుకు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేయాలని రైతు సంఘం తరఫున చేపట్టిన బైక్ ర్యాలీ గురువారం ఉదయం 7 గంటలకు ఒంగోలు మండలం కరవదిలో ప్రారంభమవుతున్నారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చేరుకుంటారని, అనంతరం చీర్వానుప్పలపాడు, నాగులుప్పలపాడు, నిడమానూరు గ్రామాల మీదుగా మద్దిపాడు మండలం బూరేపల్లి, గుండ్లాపల్లి, తెల్లబాడు, దొడ్డవరం గ్రామాల వరకు చేరుకుంటుందని తెలిపారు. ఈ ర్యాలీలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
గిట్టు బాట పట్టక.. వేలాలు కుదురుకోక !
జిల్లా పరిధిలోని పొగాకు రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులతో బుధవారం తాడేపల్లిలో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని ప్రకటించారు. ఇది కష్టాల్లో కూరుకుపోయిన పొగాకు రైతుల పోరాటాలకు కొండంత బలం చేకూరినట్లు అయింది. ఈ పర్యటనలో భాగంగా అవసరమైతే కందుకూరులో పర్యటించి వేలం కేంద్రాలను పరిశీలిస్తానని చెప్పడంతో జిల్లాలో పొగాకు రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పొగాకు రైతుల పోరాటం భవిష్యత్లో మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం కాస్త ఆలస్యంగా మొదటి దశలో గత మార్చి 25వ తేదీన కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభమైంది. పది రోజుల తరువాత ఒంగోలు రీజియన్ పరిధిలోని అన్ని వేలం కేంద్రాల్లోను వేలాన్ని ప్రారంభించారు. వేలం ప్రారంభమై మూడు నెలల పూర్తిగా గడిచిపోయాయి. రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లోను రైతులకు సరైన మద్దతు ధరలు లభించడంలేదు. దీంతో ధరల కోసం రైతులు నిత్యం పోరాట పంథాని ఎంచుకుంటున్నారు. ప్రతి రోజు ఏదో ఒక వేలం కేంద్రంలో వేలాన్ని అడ్డుకుంటూ నినదిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కందుకూరు, కొండపి, పొదిలి, వెల్లంపల్లి, కనిగిరి, ఒంగోలు, డీసీపల్లి వంటి అన్ని ప్రాంతాల్లోను రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో వేలం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న తరహాలో సాగుతోంది. రోజులు గడిచే కొద్దీ మెరుగుపడాల్సిన మార్కెట్ దిగజారుతుండడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనబాట పడుతున్నారు. వేలాన్ని అడ్డుకోవడంతో పాటు, రోడ్లపై ధర్నాలకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైతు పోరాటాలకు అండగా వైఎస్సార్ సీపీ పొగాకు రైతులు చేస్తున్న పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తోంది. వేలం కేంద్రాలను సందర్శించి రైతుల పోరాటాలకు పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని కీలకమైన నాయకులంతా పొగాకు వేలం కేంద్రాలను పరిశీలించి రైతులకు అండగా నిలిచారు. పొదిలి వేలం కేంద్రంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్, కందుకూరులోని వేలం కేంద్రాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితోపాటు, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, కొండపిలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లిలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలులో నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబులతో పాటు పలువురు కీలక నేతలు ఆయా వేలం కేంద్రాల్లో ధర్నాలకు దిగారు. పొగాకు రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకపోవడం, కంపెనీలు సిండికేట్ అయి ధరలు తగ్గించేస్తుండడంతో రైతులు మునిగిపోతున్నారు. నత్తనడకన కొనుగోళ్లు ఒంగోలు రీజియన్ పరిధిలో అధికారిక, అనధికారిక ఉత్పత్తులు కలిపి దాదాపు 140 మిలియన్ కేజీల వరకు ఉండవచ్చని బోర్డు అధికారుల అంచనా. ఇప్పటి వరకు 11 వేలం కేంద్రాల పరిధిలో 31 మిలియన్ కేజీల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే కొనుగోళ్లు ఏవిధంగా నత్తనడకన సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి వేలం కేంద్రం పరిధిలో 35 నుంచి 40 శాతం వరకు తిరస్కరణలు ఉంటున్నాయి. వేలం ఇదే విధంగా కొనసాగితే వచ్చే సీజన్ వరకు కూడా వేలం పూర్తి కాదని రైతులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ధరలు కూడా రోజు రోజుకూ పతనమవుతున్నాయి. ఎస్బీఎస్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో కేజీ సరాసరి ధర రూ.202.51, ఎస్బీఎస్ పరిధిలోని ఆరు వేలం కేంద్రాల పరిధిలో రూ.212.62గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో నమోదవుతున్న ధరలను చూస్తే ఈ సరాసరి ధరలు మరింత పతనం అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే సందర్భంలో ప్రస్తుతం బ్రైట్ గ్రేడ్ పొగాకు ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా ధరలు తగ్గుతుండడం మరింత ఆందోళన కలిగించే అంశం. పొగాకు రైతులకు భరోసా కల్పిస్తాం పొగాకు రైతుల సమస్యలను పార్టీ అధినేత జగన్ మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు అండగా నిలిచేందుకు క్షేత్ర స్థాయి పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం దిగివచ్చి వారికి మద్దతు ధర కల్పించాల్సిందే. అప్పటి వరకు వైఎస్సార్ సీపీ పొగాకు రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. మద్దతు ధరలు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. – బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ పొగాకు మార్కెట్లో మూడు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. వ్యాపారుల సిండికేట్, ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధరల కోసం రైతులు నిరంతరం ఆందోళనలు చేస్తున్నా పాలకులు ఉత్తుత్తి షోలకు పరిమితమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరల్లేక ఆర్థికంగా చితికిపోతున్న రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో రైతుల పోరాటాలకు మద్దతు తెలిపింది. బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులు, పొగాకు రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. -
చోరీ కేసుల ఛేదన
దర్శి: దర్శి సర్కిల్ పరిధిలో పెండింగ్లో ఉన్న దొంగతనం కేసును ఛేదించి నిందితురాలిని అదుపులోనికి తీసుకొని ఆమె వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన 128 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితురాలు చెన్నంశెట్టి సుమలత పట్టణంలోని పుట్టా బజారులో నివాసముంటోంది. గత ఏడాది సెప్టెంబర్ 3న సుమలత ఆమె పుట్టింటి నుంచి త్రిపురాంతకం మీదగా బస్సులో దర్శికి తన కుమార్తెతో ప్రయాణిస్తుండగా ఓ లగేజ్ బ్యాగులో హ్యాండ్ పర్సులో బంగారం ఆభరణాలును ఉంచింది. ఇంటికి వెళ్లి బ్యాగును పరిశీలించడగా బంగారం ఉన్న హ్యాండ్ బ్యాగ్ కనబడలేదు. ఈ మేరకు దర్శి టౌన్ పోలీసు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్శిలోని అద్దంకి రోడ్లో సంస్కృతి స్కూల్ సమీపంలో సాతుపాటి కుమారిని అదుపులోనికి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి 128 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితురాలిపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి. నిందితురాలిని దర్శి న్యాయస్థానం ముందు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీసీఎస్ సీఐ కమలాకర్, దర్శి సీఐ వై రామారావు, దర్శి ఎస్సై ఏడుకొండలు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. బల్లికురవలో.. బల్లికురవ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తుతో బుధవారం సంతమాగులూరు మండలం బల్లికురవ బస్టాండ్ సెంటర్ వద్ద ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితులు సంతమాగులూరు, మార్టూరు, జె.పంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేశారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు మార్టూరులోని జనార్దన్ కాలనీకి చెందిన మెలికా నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా(ప్రస్తుతం మార్టూరులో నివాసం) ఇబ్రహీం పట్నంకు చెందిన పాలపర్తి రాజేష్గా గుర్తింనట్లు వివరించారు. వీరు ఇద్దరు ఆర్థిక ఇబ్బందులతో దుర్వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 5న సంతమాగులూరులో బాలాజీ స్కూల్ సమీపంలోని ఇంటిలో చోరీ చేసి రెండు జతల బంగారు కమ్మలు అపహరించారు. ఇదే నెల 30వ తేదీన జె.పంగులూరు మండలం ముప్పవరంలో, జూలై 13న మార్టూరు మండలం ద్రోణాదులలో చోరీలు చేశారు. ఈ నెల 16 న ఇసుక దర్శి – వలపర్ల గ్రామాల మధ్య పొలాల నుంచి మూడు నీటి మోటార్లు దొంగిలించినట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సంతమాగులూరు కేసులో దొంగిలించిన రెండు జతల బంగారు కమ్మలను నరసరావుపేటలో విక్రయించగా వచ్చిన రూ.60,000/ నగదును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సంతమాగులూరు సీఐ శేషగిరిరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడు అరెస్టు అద్దంకి: పట్టణంలోని కాకానిపాలెంలో ఇటీవల వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ గురువారం విలేకర్లకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని కాకానిపాలెంలో ఈ నెల 5వ తేదీన ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు చైన్, చేతికి ఉన్న బంగారు గాజులు కలిపి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన లావు వంశీకృష్ణ చోరీకి పాల్పడినట్లు గుర్తించి నిందితున్ని మండలంలోని తిమ్మాయపాలెంలో అదుపులోనికి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన సీఐ సుబ్బరాజు బృందాన్ని డీఎస్పీ అభినందించారు. భారీగా బంగారు ఆభరణాలు రికవరీ -
పొలం దారి కోసం..చెరువు కట్ట ధ్వంసం
సింగరాయకొండ: మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీలోని మేళంవాగు చెరువు కట్టను మంగళవారం భార్యా భర్తలైన టీడీపీ సానుభూతిపరుడు, 5వ వార్డు మెంబరు బిళ్లా బాలకోటయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బిళ్లా లతలు తమ పొలానికి దారి కోసం ధ్వంసం చేశారని ఆయకట్టు రైతులు ధన్నాసి ప్రభాకర్, దాసరి శ్రీను, మద్దసాని మౌలాలి, ధన్నాసి పోతురాజు ఆరోపించారు. ఇటీవల బాలకోటయ్య చెరువు కట్టకు ఆనుకుని ఉన్న బొడ్డు చిన ముత్యాలమ్మ, దేవమ్మకు చెందిన 1.30 ఎకరాల అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేసి అందులో మామిడి మొక్కలు పెంచటానికి దారి కోసం కట్టను ధ్వంసం చేశాడని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు బుధవారం ఉదయం చెరువు కట్టను పరిశీలించారు. దృఢంగా ఉన్న చెరువు కట్ట ఇతని చర్యల కారణంగా బలహీనమైందని, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్టను బాగు చేయటంతో పాటు ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
24న విద్యా సంస్థల బంద్
ఒంగోలు టౌన్: దేశ వ్యాప్తంగా నీట్ సహా పలు జాతీయ ప్రవేశ పరీక్షల పేపర్లు వరసగా లీకేజీ అవుతున్నందున లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీ జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో బుధవారం ఎల్బీజీ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కులను దెబ్బతీసే విధానాలు ఎంత మాత్రం మంచివి కావని, రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా పరీక్షలు జరగాలని చెప్పారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువజనులపై కేంద్ర ప్రభుత్వం దమనకాండకు పాల్పడడం దుర్మార్గమన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జికి బాధ్యుడైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో విద్యార్థి నాయకులు సీహెచ్ వినోద్, దేవా, నీట్ విద్యార్థులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు..
గిద్దలూరు రూరల్: దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ప్రయాణిస్తున్న ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో బాబాయ్, మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం గిద్దలూరు పట్టణ శివారులో చోటుచేసుకుంది. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తుండగా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ గ్రామానికి చెందిన సిద్దగోని మహేశ్, మానస దంపతులు, తమ ఇద్దరు కుమారులు, మహేశ్ తమ్ముడు శేఖర్తో కలిసి ఐదుగురు ఆల్టో కారులో దైవదర్శనాలకు బయలుదేరారు. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీరు, అనంతరం మహానందికి చేరుకున్నారు. మహానందిలో దర్శనం అనంతరం బుధవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి బయలుదేరారు. కారును శేఖర్(35) నడుపుతున్నాడు. గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు రోడ్డులో ఉన్న చాణక్య స్కూల్ సమీపంలోకి రాగానే.. ముందు వెళ్తున్న బస్సును కారు ఓవర్టేక్ చేయబోయింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న శేఖర్తో పాటు మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మహేశ్, మానస దంపతులతో పాటు వారి మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం శిరివెళ్ల గ్రామానికి చెందినది కాగా, డ్రైవర్ కేశవకు స్వల్ప గాయాలయ్యాయి. సెల్ఫోన్ నంబర్ల ఆధారంగా గుర్తింపు.. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుల సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా వారు నల్గొండ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి బంధువులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరోను ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం మృతుల్లో మూడేళ్ల బాలుడు, బాబాయి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నల్గొండ జిల్లా మాల్కు చెందిన కుటుంబంలో తీరని శోకం -
చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా పాదయాత్రలు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ ఒంగోలు టౌన్: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకంగా సాగుతున్న చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆగస్టు 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచార యాత్రలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతోందని..సాయికృష్ణ అనే యువకుడిని స్వయంగా పోలీసులే కాల్చి చంపి బూడిద మిగిల్చకుండా చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, విద్యా విధ్వంసం జరిగిందన్నారు. కార్పొరేట్లకు వరాలు, సామాన్యులకు భారాలు అన్నరీతిలో మోదీ పాలన కొనసాగుతోందని చెప్పారు. మోదీ రాక్షస పాలనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంత పాడుతుండడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీచార్జిలు చేసినా చంద్రబాబు నోరు విప్పి మాట్లాడడంలేదని విమర్శించారు. మోదీ రాక్షస పాలన కొనసాగిస్తూ ప్రజల రక్తాన్ని కళ్ల చూస్తూ ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీలను ఝళిపించడమే కాకుండా టియర్ గ్యాస్తో చెల్లాచెదురు చేయడం దారుణమన్నారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 22 రోజులుగా ఆమరణ దీక్ష చేసినా మోదీ ప్రభుత్వం కనీస స్పందించకపోవడం విచారకరమని చెప్పారు. సోనం వాంగ్ చుక్ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి దీక్ష భగ్నం చేయడం దేశమంతా చూసిందన్నారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో చేసుకుంటున్న ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ హర్యానా, పంజాబ్ రైతాంగాన్ని ఢిల్లీలోకి అడుగుపెట్టనీయకుండా ఢిల్లీ సరిహద్దుల్లోనే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్నీ విధాలుగా విఫలమైందని విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు కేవలం ఎస్ఎంఎస్లు, కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. కరెంటు బిల్లులు పెంచమని చెబుతూనే దొడ్డిదారిన పెంచుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల కనుసన్నుల్లో అధికారులు పనిచేస్తున్నారని, ప్రజా పరిపాలన కనిపించడంలేదని చెప్పారు. పొగాకు మద్దతు ధర కోరుతూ నేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే మోటారు బైకు ప్రచార జాత కార్యక్రమాన్ని కార్యకర్తలు, రైతుల విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. -
లైబ్రరీలో చదువులు.. లక్ష్యం వైపు అడుగులు
వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ అండ్ యర్రం చినపోలిరెడ్డి స్టడీ బ్లాక్ భవన సముదాయం మేదరమెట్ల: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సాధన పేద విద్యార్థులకు సవాల్గా మారింది. కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయలేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు మేదరమెట్లలో ఏర్పాటైన శ్రీవైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ అండ్ యర్రం చినపోలిరెడ్డి స్టడీ బ్లాక్శ్రీ ఒక దిక్సూచిలా మారింది. లక్షల రూపాయల విలువైన ఆధునిక కంప్యూటర్లు, పోటీ పరీక్షలకు అవసరమైన అమూల్యమైన పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ.. ఉద్యోగార్థులకు, పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సొంతూరి రుణం తీర్చుకునే దిశగా.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పుట్టిన ఊరు మరువలేనివి.. వాటి రుణం తీర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదే స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, అద్దంకి ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి తమ స్వగ్రామం మేదరమెట్ల అభివృద్ధికి తమ వంతు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను జోడించి విద్యావకాశాలు మెరుగుపరచాలన్న ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈ ఆధునిక డిజిటల్ లైబ్రరీ. రూ.60 లక్షలతో అత్యాధునిక వసతులు సుమారు రూ.60 లక్షల వ్యయంతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ అండ్ యర్రం చినపోలిరెడ్డి స్టడీ బ్లాక్లను సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నుంచి రూ.20 లక్షలు మంజూరు కాగా, నిధుల కొరత రాకుండా మిగిలిన రూ.40 లక్షలను వైవీ భద్రారెడ్డి తన ప్రత్యేక చొరవతో సమీకరించారని మాజీ సర్పంచ్ ఎలీశమ్మ పేర్కొన్నారు. సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ లైబ్రరీ, స్టడీ బ్లాక్లను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పాణెం చిన్న హనిమిరెడ్డి ప్రారంభించారు. నిర్వహణపై శ్రద్ధ అవసరం.. విశాలమైన భవనం, అత్యాధునిక కంప్యూటర్లు, ప్రశాంతమైన స్టడీ హాల్.. ఇలా మౌలిక సదుపాయాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు విద్యార్థులకు నిరంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండాలంటే, దీని నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే, లైబ్రరీలో ఉన్న వనరులు, సదుపాయాలపై చుట్టుపక్కల ప్రాంతాల యువతకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
ఆర్ఆర్ ప్యాకేజీ అందరికీ అమలు చేయాలి
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రఫి మార్కాపురం: వెలిగొండ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో మూడో రోజు బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలు పెద్దమనసుతో వ్యవహరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 18 సంవత్సరాల నిండిన వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో పాల్గొన్న యువకులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం కో కన్వీనర్లు దగ్గుపాటి సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాల నాగయ్య, పి.రూబేను, సీఐటీయూ పట్టణ కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ నాయకులు కే విజయ్ కుమార్, డీ వందన్ కుమార్ నిర్వాసితుల సంఘం కార్యకర్తలు బొల్లవరం మల్లికార్జున, మండ్ల అనిల్, మద్దూరి శశీంద్ర, పానుగంటి రంగ సాయిలు, పసుపులేటి శ్రీనివాసులు, నాలి ప్రసాద్, బుర్రి వెంకటేశ్వర్లు, కుందూరు అంజిరెడ్డి, కొర్రపోలు దేవ సహాయం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ఒంగోలు కాంగ్రెస్ నేతలు
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ (బుధవారం) వైఎస్సార్సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నాయకుడు డి.సతీష్బాబు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్బాబు వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని.. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. -
మేం ఓట్ల సర్వే చేస్తున్నపుడు ప్రశ్నిస్తే తలకాయ పగులుద్ది
ప్రకాశం : ‘మేం ఓట్ల సర్వే చేస్తున్నపుడు వచ్చి ప్రశ్నిస్తే తలకాయ పగులుద్ది’ అంటూ ఓ విలేకరిని దర్శికి చెందిన స్థానిక టీడీపీ మహిళా నాయకురాలు శోభారాణి బహిరంగంగా హెచ్చరించారు. దర్శి నగర పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ దౌర్జన్యకాండ వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎల్ఐసీ బజారులో కొందరు టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి ఓటు వేస్తారనే సమాచారాన్ని సేకరించి ‘మై టీడీపీ’ యాప్లో నమోదు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన విలేకరిపై వారు ఈ విధంగా బెదిరింపులకు దిగారు. అదేవిధంగా 17వ, 12వ వార్డుల్లోనూ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఓటర్ల వివరాలు అప్లోడ్ చేస్తుండగా స్థానిక మహిళలు, వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నిలదీశారు. వారినీ బెదిరించే యత్నం చేసిన టీడీపీ శ్రేణులు.. జనం తిరగబడటంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ఈఆర్ఓ, కమిషనర్లకు తెలియజేస్తున్నా వారు టీడీపీ కార్యాలయం నుంచి వచ్చామని చెప్పగానే చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుండటం గమనార్హం. అధికార బలంతో ఓట్ల తొలగింపు కుట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్రకు టీడీపీ తెరతీసింది. ఇందులో భాగంగానే ఇళ్ల వద్దకు వెళ్లి కులం, ఓటు వేసే పార్టీ తదితర వివరాలను సేకరించి యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ఓటు దొంగలు వచ్చి బహిరంగంగా ఈ తంతు సాగిస్తున్నారు. దీనిపై స్థానికులు ఈఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. సర్వే చేస్తున్నది టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన వారు కావడంతో.. వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటా ఇంటికి వెళ్లి ఓట్ల వివరాలు అడిగేందుకు బీఎల్ఓలకు మాత్రమే అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా వెళ్లి ఓట్లు వివరాలు అడిగితే తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. నియోజకవర్గంలో మాకు తెలిసి ఎవరికీ ఎలాంటి సర్వేలు చేయడానికి అనుమతులు లేవు. విచారించి ఇలాంటి సర్వే చేస్తే చర్యలు తీసుకుంటాం. – శాంతిలక్షి్మ, ఈఆర్ఓ -
నిలిచిన పొగాకు వేలం
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ముందుకు సాగడంలేదు. కనీస ధరల కోసం రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో ధరలు రావడంలేదంటూ రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం క్లస్టర్కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే ధరలను వ్యాపారులు తగ్గించేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ వేలాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు వేలాన్ని పూర్తిగా నిలిపేశారు. ఎఫ్2, ఎఫ్3 వంటి బ్రైట్ గ్రేడ్ రకాలకు కూడా క్వింటాకు రూ.16 వేల నుంచి రూ.17 వేలు మాత్రమే ఇస్తున్నారని, ఈ రకం క్వింటా రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు కొనుగోలు చేయాలని కోరారు. ఇంత తక్కువ ధరలో కనీసం పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరల కోసం రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి, అధికారులకు పట్టడంలేదని మండిపడ్డారు. ఇదిలాగే కొనసాగితే రైతులకు ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదని విచారం వ్యక్తం చేశారు. రైతులు, అధికారుల మధ్య చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం పూర్తిగా వేలం నిలిచిపోయింది. -
ఇన్చార్జి డిప్యూటీ డీఈఓల నియామకం
మార్కాపురం: జిల్లాలోని మార్కాపురం, కనిగిరి డివిజన్లకు ఇన్చార్జి డిప్యూటీ డీఈఓలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం ఇన్చార్జి డిప్యూటీ డీఈఓగా పెద్దారవీడు ఎంఈఓ–1గా పనిచేస్తున్న పీ శ్రీనివాసులును, కనిగిరి ఇన్చార్జి డిప్యూటీ డీఈఓగా పీసీపల్లి ఎంఈఓ–1 జీ సంజీవిలను నియమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు లీప్యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సుబ్బారావు తెలిపారు. స్కూల్ డెవలప్మెంట్ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఒంగోలు టౌన్: నిరుపేద, మధ్య తరగతికి చెందిన రవాణా కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవడం తగదని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు అన్నారు. రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంట వెంటనే డీజిల్, పెట్రోలు ధరలను పెంచి రవాణా కార్మికుల నడ్డి విరిచారని విమర్శించారు. నాలుగు సార్లు ధరలు పెంచడమంటే కార్మికుల మీద దాడి చేయడమేనని స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలో ఆటో కార్మికులకు స్టాండు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ పోలీసుల చొరవతో అద్దంకి బస్టాండు సెంటర్, నెల్లూరు బస్టాండు సెంటర్లలో స్టాండు ఏర్పాటు చేసుకున్నారని, మిగిలిన ప్రాంతాల్లో కూడా స్టాండు ఏర్పాటు చేయాలని కోరారు. రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీ కలెక్టరేట్ వద్ద ఽచేయనున్న ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంకా సుబ్బారావు, తంబి శ్రీనివాసులు, మహేష్ ప్రసాద్, బసవరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఎస్టీయూ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు రూపొందించిన ప్రత్యేక టెట్ మెటీరియల్ను డీఈఓ సీవీ రేణుక మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ మాట్లాడుతూ టెట్ మెటీరియల్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నాణ్యమైన అధ్యయన సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డీఈవో రేణుక మాట్లాడుతూ ఎస్టీయూ రూపొందించిన టెట్ మెటీరియల్ ఎంతో బాగుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ చల్లా శ్రీనివాసులు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు డి.నాగయ్య, ఎస్టీయూ నాయకులు కె. రవికిరణ్ యాదవ్, ఎస్కే ఖాదర్ బాషా, జి.పూర్ణయ్య, కె.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కీచకపాలన
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మహిళలపై దాడులు, పిల్లలపై లైంగికదాడులు అధికమయ్యాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం దుంపా రమణమ్మ అధ్యక్షతన ఒంగోలులోని అంబేడ్కర్ భవనం నుంచి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లారు. అనంతరం వినతిపత్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుంపా రమణమ్మ మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులో మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు న్యాయం చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. హామీల అమలులో విఫలం: హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకపాలన, అక్రమ కేసులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల కోసమే పనిచేస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏ పనిచేయాలన్నా డబ్బులు దోచుకోవడమే పనిపెట్టుకొని ఆరాచకాలు చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ల పరిపాలనలో ఇలాంటి కీచకపర్వాలు జరగలేదన్నారు. రోడ్డు పై ఒక మహిళను వివస్త్రను చేయడం దారుణమన్నారు. గంజాయి బ్యాచ్ ఎక్కువయ్యారని, వీటిని అరికట్టకపోతే త్వరలోనే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఒక మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. పోలీస్ వ్యవస్థల నిద్రపోతుందా.. మాజీ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పులి శాంతి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కీచకపాలన నడుస్తోందని విమర్శించారు. అత్యాచారాలు, హత్యలు, అరాచకం వంటి సంఘటనలు రాష్ట్రంలో పెచ్చరిల్లుపోయాయన్నారు. గుంటూరులో మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తాం అన్న పవన్కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు..? పవన్కళ్యాణ్ మీకు సోషల్ మీడియా లేదా, ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వలేరా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ ఉందా లేక నిద్రపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యురాలు బత్తుల పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో పిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఎక్కడ చూసినా మహిళలు, పిల్లల్లో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. స్కూల్కు వెళ్లిన పిల్లలు తిరిగివస్తారో లేదో అనే భయంలో ఆందోళనలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పట్టపగలే ఒక మహిళను రోడ్డుపై కొట్టి వివస్త్రను చేసి, జాకెట్ చించి ఆమెను అన్ని రకాలుగా అవమానించిన సంఘటనతో రాష్ట్రంలో ఒక కీచకపాలన నడుస్తోందన్నారు. ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్కూల్, కాలేజీ, అసలు మహిళలకు ఎక్కడ భద్రత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు శాంతి భద్రతలు కల్పించలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంలో పిల్లల కోసం రక్షణ కమిటీలు, మహిళల కోసం యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు అవి ఎక్కడ పనిచేస్తున్నాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని సుజాత, ఒంగోలు సిటీ మహిళా అధ్యక్షురాలు షైక్ రషీద, స్టేట్ మహిళ విభాగం జనరల్ సెక్రటరీ సన్నపురెడ్డి రమణమ్మ, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు పసుమర్తి గోవిందమ్మ, సిటీ అంగన్వాడీ అధ్యక్షురాలు శోభలత, సంతనూతలపాడు ఎంపీపీ బుడం గుంట విజయ, కొండపి మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, సంతనూతలపాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నారా విజయలక్ష్మి, రాష్ట్ర కల్చర్ వింగ్ అధ్యక్షురాలు కాకర్లపూడి రజిని, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ సంధ్య, మహిళా నాయకులు బడుగు మాధవిలత, సాధం విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, నాగమణి, సుస్మిత, మహిళలు నాయకులు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారిశంకరరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, చెంచిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల ‘సివిల్ ’వార్
మార్కాపురం: ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ‘సివిల్’ వార్కు దారితీసింది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరవర్గాలు నడి రోడ్డుపైనే ఘర్షణ పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేశారని రైతులతో కలసి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు. మార్కాపురం ఎమ్మెల్యేనే ఇదంతా చేయిస్తున్నాడంటూ తన సొంత మీడియా గ్రూప్లో సోమవారం రాత్రి పోస్ట్ చేయించడం సంచలనాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం వీరి మధ్య వివాదం టీడీపీ అధిష్టానం వద్దకు చేరినట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త భ్రమరా వెంచర్స్ పేరుతో రెండేళ్ల క్రితం 91 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. వెంచర్కు రహదారి కోసం ఉన్న పలువురు స్థల యజమానుల నుంచి స్థలాలను తీసుకుని, రోడ్డు వేశారు. ఇక్కడే వివాదం మొదలైంది. భ్రమరా వెంచర్స్ రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ వేశారు. దీంతో రహదారికి ఇరుపక్కలా ఉన్న స్థలాలకు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో వారం రోజులుగా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. స్థలాల యజమానులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. రైతులు, స్థల యజమానులు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్టీఓ, ఎమ్మార్వో, ఇరిగేషన్ అధికారులు వెంచర్ వద్దకు వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా వేసిన ఫెన్సింగ్ను తీసివేశారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణలో భ్రమరా వెంచర్స్కు చెందిన ఇద్దరు, స్థల యజమాని ఒకరు గాయపడ్డారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి దాడి చేయించారని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఆరోపించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులతో కుమ్మకై ్క భ్రమర వెంచర్ని ధ్వంసం చేశారని ఎమ్మెల్యే మాధవి పేరుతో ఉన్న మీడియా గ్రూపులో ఆమె పీఆర్ఓ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల జేశారు. భ్రమర సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు కూడా తమపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు కమిషనర్గా ఉన్నప్పుడు పులి శ్రీనివాసులు అవినీతిని ఎమ్మెల్యేగా గల్లా మాధవి ప్రశ్నించారని, దానిని దృష్టిలో పెట్టుకొని ఆయన తమ సంస్థపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనాన్ని రేకెత్తించాయి. అధిష్ఠానం దృష్టికి ఎమ్మెల్యేల పంచాయితీ.. రియల్ వెంచర్ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న వివాదం ఆ పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. చిన్న బాస్ దృష్టికి కూడా ఈ విషయాన్ని చేరవేసినట్టు సమాచారం. -
ప్రభుత్వమే చట్టాలు అమలు చేయకపోతే ఎలా!
● ఎన్జీవో మార్కాపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస శాస్త్రి మార్కాపురం: ప్రభుత్వమే చట్టాలను అమలు చేయకపోతే ఎలా అని ఎన్జీవో మార్కాపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస శాస్త్రి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన యువతి యువకులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో పాల్గొన్న యువకులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంలో నిర్వాసితుల పూర్తి విధి విధానాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డీ తిరుపతిరెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జి కొండయ్య, సీఐటీయూ మార్కాపురం పట్టణ కార్యదర్శి పందిటి రూబేను, కార్ స్టాండ్ వర్కర్స్ యూనియన్ ట్రెజరర్ బలుసు పార్టీ కాశయ్య తదితరులు ఈ దీక్షలకు సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడారు. ఈ దీక్ష కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం కో–కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య, నిర్వాసిత గ్రామాల్లోని యువతీ, యువకులు, బొల్లవరం మల్లికార్జున, మద్దూరి శశింద్ర, పవన్, అంజి, రంగ సాయిలు, మండ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకాసురులు
కొత్తపట్నం: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మండలంలో అధికారిక ఇసుక క్వారీ లేకపోయినా ఇసుకను జోరుగా తవ్వి తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యహరిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక వేళ లోడుతో పట్టుకుంటే వారికి ఇష్టమొచ్చిన వారిని వదిలిపెడుతున్నారు. మండలంలో మోటుమాల, కొత్తపట్నం, గమళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, రాజుపాలెం, మడనూరు గ్రామాల్లో ఇసుక రవాణా కొనసాగుతోంది. రోజుకు వందల ట్రాక్టర్లు తవ్వేస్తున్నారు. మోటుమాల గ్రామంలో కస్తూబా గాంధీ వనరుల కేంద్రం పక్కనే ఇసుక తవ్వి తరలిస్తున్నారు. పక్కనే ఉన్న ప్రహరీ అంచునే ఇసుక తీస్తున్నారు. దీంతో ప్రహరీ పడిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్కూల్ బస్సు
సంతనూతలపాడు: స్కూల్ బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన సంఘటన సోమవారం సంతనూతలపాడు మండలంలోని చిలకపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వేములపాడు నుంచి ఒంగోలు వెళ్తున్న సరస్వతీ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలవగా, విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలాన్ని ఎస్సై వేజెండ్ల అజయ్బాబు పరిశీలించారు. వరుస బస్సు ప్రమాదాలతో ఆందోళన... సంతనూతలపాడు మండలంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం మద్దులూరు సమీపంలో అనకళ్లపూడి గ్రామం నుంచి మద్దులూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ బస్సులో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండగా, మొత్తం 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో సింగిల్ లైన్ రహదారుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయాలి
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ చేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసంలో ప్రజల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన 90 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు సావధానంగా విని సానుకూలంగా స్పందిచారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ ఫిర్యాదుదారుల వివరాలను తెలియజేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరంగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, వన్టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, గుడ్లూరు సీఐ రమేష్, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ప్యానెల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, మీకోసం ఎస్సై యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు -
విద్యుత్ చార్జీల మోత..
ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతున్న ఈ పరిశ్రమకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయి. ఎన్నికల ముందు కూటమి పెద్దలు విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ చార్జీల పేరుతో వీరబాదుడు బాదేశారు. అంతేకాకుండా పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీ అరకొరగా ఇచ్చింది. రూ.50 లక్షలు సబ్సిడీ రావాల్సి ఉంటే కేవలం 10 శాతం ఇచ్చారని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. మిగిలిన సబ్సిడీ వస్తుందో రాదోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఏఎంఆర్ కంటైనర్ పాసులతో నష్టం.. బయ్యర్లు ఒక కంటైనర్ లో 4200 అడుగుల గ్రానైట్ ఫినిషింగ్ మెటీరియల్ ఈజిప్టు, వియత్నాం, దుబాయ్, ఆస్ట్రేలియా, తదితర దేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. 4200 అడుగులకు మైనింగ్ బిల్లు 1 అడుగుకు రూ.12 చొప్పున రూ.50,400 అవుతుంది. కానీ బయ్యర్లు ఏఎంఆర్ సంస్థ దగ్గర రూ.35 వేలకు తీసుకుంటున్నారు. దీంతో బయ్యర్లకు ఒక కంటైనర్కు రూ.15,400 మిగులుతుంది. బయ్యర్లు ఏఎంఆర్ ఇస్తున్న పాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివలన గ్రానైట్ పరిశ్రమల యజమానులు ప్రభుత్వానికి చెల్లించిన మైనింగ్ బిల్లు వారి దగ్గర వృథాగా మిగిలిపోతోంది. ఇది గ్రానైట్ పరిశ్రమల యజమానులకు అదనపు భారం పడుతోంది. -
అన్నింటా అధ్వానమే..
అర్ధవీడు: పురుగులు పట్టిన అన్నంతో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంది. విద్యార్థులకు బోధన కూడా అంతంత మాత్రమే. పాఠశాల నిర్వహణ, విద్యాబోధన రెండింటిలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. బాధ్యులపై చర్యలు తప్పవని ఆర్జేడీ బీ లింగేశ్వరరెడ్డి, డీఈఏ ఎస్ సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 18వ తేదీన అర్ధవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పురుగులు పట్టిన అన్నం, మురిగిన కోడిగుడ్లు విద్యార్థులకు పెట్టడంతో వారు అన్నం తినలేక ఇంటికి వెళ్లిపోయిన ఘటనపై ‘మాకొద్దు బాబోయ్ ఈ మధ్యాహ్న భోజనం’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజనం ఆలస్యంగా 2 గంటలకు అందించారు. అప్పటి దాకా విద్యార్థులు ఆకలితో ఉండాల్సి వచ్చింది. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. అన్నంలో పురుగులు కనిపించడం తీవ్ర నిర్లక్ష్యమని, సంబంధిత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ ఇంకొల్లు సుజాతతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. భోజన నాణ్యతపై జిల్లా అధికారులకు ఎందుకు తెలియజేయలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలని మిడ్ డే మీల్స్ పరిశీలకుడు ఎంఈవో 2 ఎం లక్ష్మీనాయక్ ను హెచ్చరించారు. మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేదని, ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య సమ న్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు బోధించే విద్య కూడా అంతంత మాత్రంగానే ఉందని, పనితీరు మెరుగు పరుచుకోవాల ని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఇకపై నెలకొకసారి పాఠశాలను సందర్శిస్తామన్నారు. -
మున్సిపల్ ఫీజుల పేరుతో సైబర్ ట్రాప్
కనిగిరి రూరల్: సైబర్ కేటుగాళ్లు రోజుకో తరహాలో ప్రజలకు టోకరా వేస్తున్నారు. కనిగిరిలో ఇప్పటికే సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పలువురు చిక్కుకుని నష్టపోయి ఉన్నారు. తాజాగా కనిగిరి మున్సిపాలిటీలో ఫీజుల వసూళ్ల పేరుతో పట్టణ వ్యాపారస్తులు, దుకాణదారులు, లాడ్జి యజమానులు, హాస్పిటల్స్ వారిని సైబర్ నేరగాళ్లు ట్రాప్లో వేసేందుకు పన్నాగం పన్నారు. ఒకరిద్దరు ట్రాప్లో చిక్కుకుని వెంటనే అప్రమత్తమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ క్యూ ఆర్ కోడ్లు పంపి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. పట్టణంలోని గార్లపేట రోడ్డులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్కు, ఓ లాడ్జి యజమానికి కూడా సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు. వెంటనే వారికి అనుమానం వచ్చింది. ఇది సైబర్ నేరగాళ్ల మోసంగా భావించి అప్రమత్తమాయ్యరు. ఎలాంటి నగదు చెల్లించకుండా వారి వాయిస్ రికార్డు చేశారు. ఓ రెస్టారెంట్, ఓ హోటల్ యజమాని మాత్రం నమ్మి క్యూర్ కోడ్కు కొంత నగదు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు వ్యక్తులు వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. తాము ఎటువంటి ఫోన్లు చేయలేదని సిబ్బంది, అధికారులు స్పష్టం చేశారు. దీంతో అది సైబర్ నేరగాళ్ల పనిగా భావించి అందరూ అప్రమత్తమయ్యారు. ఫేక్ వసూళ్లపై అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ శ్రీధర్ కనిగిరిలో ట్రైడ్ లైసెన్స్ ఫీజు పేరుతో ఫోన్ చేసి స్కానర్ పెట్టి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల ట్రాప్లో పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ట్రైడ్ లైసెన్స్ ఫీజులు జనవరి, ఫిబ్రవరిలోనే అధికారికంగా వసూలు చేస్తామని, ప్రస్తుతం ఎలాంటి వసూళ్లు లేవని స్పష్టం చేశారు. ఇంటి పన్నులు, వగైరా పన్నుల విషయంలో అనుమానాస్పద కాల్ వచ్చినా.. డబ్బులు అడిగినా.. వారిపై ఎటువంటి అనుమానం కలిగినా.. వెంటనే మున్సిపల్ కార్యాలయం నంబర్ 79939 37001కు కాల్ చేయాలని, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ ప్రజలు, వ్యాపారులకు కమిషనర్ సూచించారు. మార్కాపురం: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మిస్తున్నా ప్రాజెక్టు నిర్వాసితులపై ఖర్చు నామమాత్రమేనన్నారు. వెంటనే నిర్వాసితులందరికీ న్యాయమైన ఆర్అండ్ఆర్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేసే నాటికి 18 ఏళ్ల వయసు నిండిన యువతి, యువకులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని నిర్వాసితుల సంఘం కో కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం దారుణమన్నారు. ఈ సందర్భంగా పరిహారం చెల్లించాలని నిర్వాసితులతో కలిసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె. విజయ్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.వందన్ కుమార్, బొల్లవరం మల్లికార్జున, మండ్ల అనిల్, పెద్ద పాండు, రంగసాయులు, యశ్వంత్, అంజి, భీమవరం ప్రసాద్, దూదేకుల ఖాశీంపీరా, మద్దూరి శశింద్ర పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు వాడిన స్కానర్లు.. కనిగిరిలో వెలుగుచూసిన మోసం -
పంచాయతీరాజ్ డీఈఈ వేధింపులు
ఒంగోలు సబర్బన్: అభివృద్ధి పనులు చేసినా బిల్లులు మంజూరు చేయించకుండా పంచాయతీరాజ్ డీఈఈ కే కృష్ణమోహన్ వేధిస్తున్నాడంటూ సంతనూతలపాడు జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ సోమవారం కలెక్టర్ పి.రాజాబాబుకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండల పరిషత్ వర్క్స్ కమిటీ చైర్మన్ కే రమణతో కలిసి ఒంగోలులోని కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ వర్క్స్ కమిటీ తీర్మానాలిచ్చినా బిల్లులు చేయకుండా డీఈఈ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కలెక్టర్కు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా పరిషత్కు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా పంచాయతీరాజ్ డీఈఈ కృష్ణమోహన్, ఇంజినీరింగ్ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు, పూర్తి కావాల్సిన పనులకు దాదాపు రూ.80 లక్షల వరకు ఎంబీ రికార్డు చేయకుండా పెండింగ్లో పెట్టి ఇబ్బందులు కలిగిస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. గతంలో తాను సంతనూతలపాడు పంచాయతీ సర్పంచ్గా ఉన్న కాలంలో కూడా దాదాపు రూ.60 లక్షల నిధులకు సంబంధించిన పనులు పూర్తి చేసినప్పటికీ రికార్డు చేయకుండా, బిల్లులు రాకుండా నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆ నిధులకు సంబంధించి 2011వ సంవత్సరంలో ఏపీ హైకోర్టులో కేసు వేసినా.. బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించినా నేటికీ పెడచెవినపెట్టి వేధిస్తున్నారన్నారు. హైస్కూలు, మండల కాంప్లెక్స్లోని భవనాల ప్రారంభోత్సవ సమయంలో వివిధ రకాల నిర్మాణాలు, రోడ్ల పనుల బిల్లులు, జగనన్న కాలనీలో కల్వర్టులు, రోడ్ల బిల్లులు చేయాల్సి ఉందన్నారు. ఒక్క సంతనూతలపాడులోనే దాదాపు రూ.80 లక్షల విలువైన పనులు ఇంకా చేయాల్సినవి మిగిలి ఉన్నాయన్నారు. గతంలో ఇతనిపై కేసు వేశామనే అక్కసుతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇబ్బందిపెడుతున్నాడని కలెక్టర్కు వివరించారు. డీఈఈ కృష్ణమోహన్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, మంజూరైన నిధులకు సంబంధించిన పనులకు గ్రామ పంచాయతీ తీర్మానాలు, వర్క్ ఆర్డర్లు ఇప్పించి పూర్తి చేయించాలని కలెక్టర్కు దుంపా రమణమ్మ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులు చేసినా బిల్లులు మంజూరు చేయించకుండా ఇబ్బందులు మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న కలెక్టర్ రాజాబాబు అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు : కలెక్టర్ రాజాబాబు సమస్యల పరిష్కారం కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనంలో ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, డీఆర్ఓ రమణ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్రెడ్డి, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యమన్నారు. బలహీనవర్గాల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని చెప్పారు. రెవెన్యూయేతర సమస్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ద్వారా, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున ప్రజలతో వ్యవహరించే విధానం, సమస్యలను పరిష్కరిస్తున్న పద్ధతి సక్రమంగా ఉండాలన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తెరిగి అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులందరూ ప్రతిరోజూ ముందుగా ఆన్లైన్లో గ్రీవెన్స్ అర్జీల స్టేటస్ గమనించాలని కలెక్టర్ చెప్పారు. సాంకేతిక కారణాల వలన పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్..చంద్రబాబు!
దర్శి: రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావు చంద్రబాబు.. అని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రశ్నించారు. ఆగస్టు 8 నుంచి 9వ తేదీ వరకు జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా 19వ మాహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి మెగా డీఎస్సీ విడుదల చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొనకొండ పారిశ్రామిక క్యారిడార్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, జిల్లాలో డీఎస్సీలో ఖాళీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేయాలని, రామాయపట్నం పోర్టు బీపీసీఎల్ ఇండో సోలార్ కంపెనీల్లో నిర్వాసితులు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం పోరాడే సంఘం ఒక్క డీవైఎఫ్ఐ మాత్రమే అన్నారు. అందరికీ విద్య అందరికీ ఉపాధి లక్ష్యంతో డీవైఎఫ్ఐ సంఘం పనిచేస్తోందని, జిల్లా మహాసభల్లో ఈ సమస్యలన్నింటిపై చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు షేక్ పీరా సాహెబ్, మండల కార్యదర్శి ఆర్.జెస్సిపాల్, మండల ఉపాధ్యక్షుడు కళ్యాణ్ పాల్గొన్నారు. -
పరిశ్రమ నల్లబడి
గ్రానైట్కు గడ్డు రోజులు.. చీమకుర్తి రూరల్: ఒకప్పుడు దేశ, విదేశాలకు గ్రానైట్ ఎగుమతుల్లో అగ్రగామిగా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ నిలిచింది. చీమకుర్తి, రామతీర్థం, బూదవాడ, యల్లయ్యనగర్, మర్రిచెట్లపాలెం, సంతనూతలపాడుల్లో 1200లకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్కు చైనాతో పాటు గల్ఫ్ దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ముడిరాళ్లు ఎక్కువగా చైనాకు, పాలిష్ చేసిన స్లాబులు ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ, కువైట్, దుబాయ్, వియత్నాంలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు ఇక్కడ నుంచి నెలకు సుమారు 5 వేలకు పైగా కంటైనర్లు సముద్రమార్గం ద్వారా ఎగుమతులు జరిగేవి. కరోనా తరువాత ఎగుమతులు భారీగా పడిపోయాయి. యుద్ధానికి ముందు 2500 నుంచి 3 వేల కంటైనర్లు వెళ్తున్నాయి. యుద్ధంతో దాదాపు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధానికి తోడు ఏఎంఆర్ సంస్థ అమలు చేస్తున్న పాస్ల విధానం కూడా పరిశ్రమలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆరోపిస్తున్నారు. క్వారీల నుంచి మైనింగ్ బిల్లుతో ముడి రాయిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ అనంతరం ఫినిషింగ్ మెటీరియల్ను విక్రయించే సమయంలో పరిశ్రమల యజమానులు ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఇతర చెల్లింపులు చేస్తున్నా బయ్యర్లకు ఏఎంఆర్ సంస్థ కేవలం రూ.35 వేలకే పోర్టుకు గ్రానైట్ ఫినిషింగ్ మెటీరియల్ తరలించే పాస్లు జారీ చేస్తుండటంతో పరిశ్రమల వద్ద బిల్లుతో కొనుగోలు చేసే పరిస్థితి తగ్గిపోయిందని అంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ, మైనింగ్ బిల్లుల వ్యయం తిరిగి రాక పరిశ్రమల యజమానులు ఆర్థిక భారీ నష్టాలను చవిచూస్తున్నట్లు వాపోతున్నారు. రెండు కట్టర్లతో పనిచేసే ఒక గ్రానైట్ పరిశ్రమ ప్రతి నెలా సుమారు 44 మీటర్ల రాయికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి వస్తోందని, ఆ వ్యయాన్ని ఫినిషింగ్ మెటీరియల్ అమ్మకాల ద్వారానే భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అయితే బయ్యర్లు ఏఎంఆర్ పాస్లను వినియోగించడంతో పరిశ్రమల ద్వారా జరిగే బిల్లింగ్ తగ్గిపోయి, పరిశ్రమలను కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏఎంఆర్ పాస్ల విధానాన్ని సమీక్షించాలని, పరిశ్రమలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల యజమానులు విజ్ఞప్తి చేశారు. బ్లాక్ లో మైనింగ్ బిల్లు నెలలో 20వ తేదీ వరకు 1 మీటరుకు రూ.1500 నుంచి 1700 వరకు మైనింగ్ బిల్లు అమ్ముతుంటారు. 25వ తేదీ దాటగానే ఒక మీటరుకు రూ.2 వేల నుంచి రూ.2500 వరకు మైనింగ్ బిల్లు విక్రయిస్తారని గ్రానైట్ పరిశ్రమల యజమానులు అంటున్నారు. -
కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం టౌన్: విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవష్యత్ ఉంటుందని కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ –2026 అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ఉత్సాహం, పట్టుదల పెరిగి విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి ఒకశక్తి కేంద్రమని, ధైర్యంతో లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థులు నైపుణ్యాలను నేర్చుకొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్య ద్వారానే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపికై న 134 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి అవార్డు, రూ.20వేల నగదు చెక్కును తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, ఇంటర్మీడియెట్ బోర్డు డీఐఈఓ స్వరూపరాణి, డీఈఓ సుబ్బారావు, డీసీఈబీ కార్యదర్శి సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్రెడ్డి, ఇతర విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులపై కన్నెర్ర ‘జేసీ’
మార్కాపురం: ‘ ఏం తమాషాగా ఉందా.. ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోరా.. ’ అంటూ అధికారులపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం దళితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్కు ఇంతియాజ్, చిన్నా, లింగమయ్య, మరికొంత మంది కలిసి భ్రమర వెంచర్స్లో జరుగుతున్న గొడవలు, దాడులను వివరిస్తూ న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ను కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను తన వద్దకు రావాలని ఆదేశించారు. అయితే ఉన్నత స్థాయి అధికారి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ శివారులోని భ్రమర వెంచర్ సమీపంలో తమకు 3.53 సెంట్ల భూమి ఉందని, ఆ భూమికి వెళ్లే దారిని వెంచర్ యాజమాన్యం అక్రమంగా ఇనుప కంచె, గేటు నిర్మించి మూసివేస్తోందని బాధితులు ఆరోపించారు. గేటు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెళ్లగా వెంచర్ మేనేజర్తో పాటు మరికొందరు తమపై దాడి చేసి కుల, మత దూషణలకు పాల్పడ్డారని, రాడ్లు, కట్టెలతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి తమకు రక్షణ కల్పించాలని జేసీకి వినతిపత్రం అందజేశారు. భూమికి వెళ్లే దారిని మూసివేసేందుకు ఎలాంటి అనుమతులు ఇచ్చారని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనలపై పూర్తి వివరాలతో విచారణ జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను జేసీ ఆదేశించారు. మరోవైపు, దాడి ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయికి వెళితేనే సమస్యల పరిష్కారం మార్కాపురం టౌన్: క్షేత్రస్ధాయిలో అధికారులు పర్యటించినప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 527 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 155, ఇతర సమస్యలపై 372 వచ్చినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిస్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి పని చేయాలన్నారు. పరిష్కరించదగ్గ వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్యపై పదేపదే తిప్పుకోవడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఇప్పటికై నా అన్ని శాఖల అధికారులు పద్ధతి మార్చుకొని పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ మోహన్ రావు, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీలో అన్యాయం: పెద్దారవీడు మండలం సుంకేశుల గ్రామానికి చెందిన గుడ్డెపోగు సుబ్బులు ఆర్ఆర్ ప్యాకేజీలో పేరు లేదని పీజీఆర్ఎస్లో విన్నవించారు. 2006లో విడుదల చేసిన గెజిట్ లిస్టులో తన పేరులేదని, అప్పటికే తనకు 18 సంవత్సరాలు నిండాయని చెప్పారు. తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, ఆర్ఆర్ ప్యాకేజీ గెజిట్ లిస్టులో తన పేరు నమోదు చేసి న్యాయం చేయాలని కోరాడు. గుడ్డెపోగు సుబ్బులు -
ఈవీఎం గోదాముల పరిశీలన
ఒంగోలు సబర్బన్: నగరంలోని భాగ్యనగర్ ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ పి.రాజాబాబు సోమవారం పరిశీలించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సందర్శించి గోదాం షట్టర్లకు వేసిన తాళాలు, సీల్ను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కల్పిస్తున్న భద్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఆర్ఓ పీవీ రమణ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు. మార్కాపురం: ప్రజల నుంచి వచ్చే అర్జీలను గడువు లోగా పరిష్కరించాలని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా అన్నారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్క్రా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా విచారించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. ఫిర్యాదుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి, వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, జాబ్ ఫ్రాడ్, అత్తరింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, త్రిపురాంతకం సీఐ అస్సన్, టీవీ పల్లి ఎస్సై శివ బసవరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: పరీక్ష పేపర్ల లీకేజీలను నిరసిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి లాఠీచార్జి చేయించడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి ఖండించారు. లాఠీచార్జికి నిరసనగా ఎస్ఎఫ్ఐ కార్యాలయం నుంచి సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు చౌరస్తాలో మానవహారం చేపట్టారు. మోదీ ప్రభుత్వం వచ్చాక బిజేపీ పాలిత రాష్ట్రాల్లో పరీక్ష పేపర్లు లీకవడం నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని వెనకేసుకొని రావడం చాలా దారుణమన్నారు. విద్యార్థుల జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం వారి గొంతులు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులను ఉసిగొప్పి లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వినోద్, విద్యార్థులు పాల్గొన్నారు. ఘట్కేసర్: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను మృతుడి కుటుంబీకులు దానం చేసి మానవతను చాటుకున్నారు. ఘట్కేసర్ పోలీసుల వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ గ్రామానికి చెందిన గుంజి శ్రీను (40) యాదాద్రి భువనగరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న వెంకిర్యాలలో పనులు పూర్తి చేసుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా అవుషాపూర్ దీక్ష హోటల్ వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే బీబీగనర్ ఎయిమ్స్ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం విషమించి సోమవారం బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. దు:ఖ సముద్రంలో ఉన్నా సమాజ హితం కోసం మృతుడి భార్య గుంజి శ్రావణి, కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గురుకులం సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఇవ్వాలి
ఒంగోలు టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తుందని, ఇప్పటికై నా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.రమేష్ కోరారు. ఈ మేరకు సోమవారం స్పందనలో కలెక్టర్ పి.రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ గురుకులంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు సేవా సుప్రీం ఏజెన్సీ సకాలంలో వేతనాలు చెల్లించకుండా వేధిస్తోందని తెలిపారు. నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించకుండా కేవలం రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. సెక్యూరిటీ గార్డులుగా తీసుకొని వీరి చేత సంబంధంలేని అదనపు పనులు చేయిస్తున్నారని, స్వీపింగ్, క్లీనింగ్, బాత్రూములు కడిగించడం వంటి పారిశుధ్య పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఇతర పనులు చేసే సిబ్బంది ఎవరైనా సెలవు పెడితే వారి పనులను సెక్యూరిటీ గార్డుల చేత చేయించడం అలవాటైపోయిందన్నారు. అంతేకాకుండా కార్మిక చట్టాల ప్రకారం సెక్యూరిటీ గార్డులకు సెలవులు ఇవ్వడంలేదని, అత్యవసర సమయాల్లో కూడా సెలవులు మంజూరు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్ఐ, సెలవులు వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే ఈ నెల 30వ తేదీ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్.స్వాతి, శ్రావణి, వాణి, రజియా, హైమావతి, ప్రియ పాల్గొన్నారు. -
అటవీ భూములు అమ్మకానికి..
కురిచేడు: ఖాళీ జాగా కనిపిస్తే చాలు పచ్చగద్దలు వాలిపోతున్నాయి. అటవీ, రెవెన్యూ భూములు వేటినీ వదలకుండా ఆక్రమించి, అక్రమంగా విక్రయించి టీడీపీ నాయకులు సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో అటవీ భూములపై వారి కన్ను పడింది. వందల ఎకరాలు ఆక్రమించి అనధికారికంగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. పడమరవీరాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 8 లో 527.5 ఎకరాల విస్తీర్ణం ఉంది. అందులో సుమారు 200 ఎకరాలు అక్రమంగా విక్రయించారు. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న ధనికులు, ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని నమ్మబలికి వారికి కట్టబెడుతున్నారు. ఆ తరువాత దానికి చుట్టూ కంచె ఏర్పాటుచేసి, దున్నించి సాగుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు అటవీశాఖ, అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దొనకొండ మండలం బాదాపురం వద్ద నుంచి కురిచేడు మండలం ముష్ట్ల గంగవరం వద్ద గుండ్లకమ్మ వాగు వరకు అటవీ శాఖకు చెందిన 13 వేల ఎకరాలు భూమి ఉంది. అందులో సర్వే నంబరు 8లో 527.5 ఎకరాల విస్తీర్ణం ఉంది. దానికి హద్దుల కోసం గత 50 ఏళ్లుగా అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదం ఏర్పడింది. అదికాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. మండలంలోని పడమరవీరాయపాలెం గ్రామంలోని ఎస్సీలు, బీసీలు సుమారు 150 మందికి 1988 లో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ అబ్బన్న ఆ భూమిలో పట్టాలు ఇచ్చారు. దానిని అటవీశాఖ అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. దానిపై 2014 లో పడమర వీరాయపాలెం గ్రామ ఎస్సీలు తమ పట్టాలకు హద్దులు చూపాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దాంతో అటవీ అధికారులు తమకు సర్వేనంబరు 8 లో ఉన్న భూమి వ్యవహారం కోర్టులో పెండింగ్లో ఉందని రికార్డులు చూపి ఆ పట్టాలను రద్దు చేయించింది. దాంతో గత్యంతరం లేక రెవెన్యూ అధికారులు సుమారు 70 మంది ఎస్సీలకు అదే గ్రామ సర్వేనంబరు 63, 64, 65 లలో పట్టాలు మంజూరు చేశారు. ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు అటవీ భూములను విక్రయించటం ప్రారంభించారు. దాదాపు 200 ఎకరాలు విక్రయించారు. సర్వేనంబరు 8 లోని భూమి ప్రభుత్వానిదని, దానిని ఆక్రమించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఆక్రమణదారులు ఆ బోర్డులను తొలగించి అధికార పార్టీ అండతో క్రయవిక్రయాలు చేపట్టారు. ఆ భూముల్లో సోలార్ ప్యానల్ లు ఏర్పాటు చేసి బోర్లు వేసి, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. అటవీ భూములకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు గ్రామాల్లో లోవోల్టేజి సమస్య ఉంది ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయమంటే మీన మీషాలు లెక్కించే విద్యుత్ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలోని భూములకు విద్యుత్ లైన్లతోపాటు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా ఇవ్వటం వెనుక ఆంతర్యమేమిటో ఆశాఖ అధికారులకే తెలియాలి. ఇప్పటికై నా కలెక్టర్, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి, అటవీశాఖ ఉన్నతాధికారులు కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అటవీ భూములు విక్రయించిన వారిపై, కొన్న వారిపై, దానిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేసిన వారిపై చర్యలు తీసుకొని అటవీ భూమిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు. సుమారు 200 ఎకరాల ఆక్రమణ వివాదాస్పద అటవీ భూమికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు -
దస్తావేజు లేఖరుల పెన్డౌన్
● మాజీ ఎమ్మెల్యేలు అన్నా, జంకె, కేపీలకు వినతిపత్రం అందజేత మార్కాపురం టౌన్: జీఓ నంబరు 396ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సోమవారం సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు పెన్డౌన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబుకు, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డి, సీపీఐ నాయకుడు అందె నాసరయ్యతో పాటు పలువురు నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ దాదాపు 40 నుంచి 50 మంది దస్తావేజు లేఖరులు ఏళ్ల తరబడి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 396ను ఉపసంహరిచుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా 10 రోజుల పాటు పెన్డౌన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థలకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు రోడ్డున పడనున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నాకు వివరించారు. కార్యక్రమంలో స్టార్ మస్తాన్, వీ శ్రీను, బూదాల బెంజిమెన్, జహీర్ రాజా, జంకె వెంకటేశ్వరరెడ్డి, గొగిరెడ్డి లక్ష్మిరెడ్డి, కుమార్ స్వామిరెడ్డి, ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో.. ఒంగోలు సిటీ: ఒంగోలులో కూడా దస్తావేజు లేఖరులు పెన్డౌన్ చేసి నిరసన తెలిపారు. దస్తావేజు లేఖరుల ఉపాధికి గండికొట్టే జీఓ నంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు వారికి మద్దతు తెలిపారు. -
ఆర్యవైశ్యులపై పెరుగుతున్న దాడులు
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 25 నెలల్లో వ్యాపారులు దెబ్బతిన్నారు..రౌడీయిజం పెరిగిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షతన ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సమ్మేళనం నిర్వహించారు. అంతకు ముందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్సార్ విగ్రహానికి, పొట్టి శ్రీరాములు, గాంధీజీ, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయని, వ్యాపారులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు ఎక్కువయ్యాని ఆయన ధ్వజమెత్తారు. ఆర్యవైశ్యులపై రౌడీషీట్లు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేసిన తప్పులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే అందరిపైనా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే ఆర్యవైశ్యులకు మేలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు ఎంతో మేలు జరిగిందని వెల్లంపల్లి చెప్పారు. మొన్నటి వరకూ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య మహాసభ అండగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ సైతం అవినీతి రాజ్యమేలడం దురదృష్టకరమన్నారు. ఈ మహాసభలో పోస్టు కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫారసు కావాలి, అలాగే రూ.లక్షలు డిమాండ్ చేస్తుండడం దుర్మార్గమన్నారు. నేడు నిర్మితమవుతున్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు వ్యాపారులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్యవైశ్య మహాసభకు నామినేషన్ వేస్తే కేసు, ఈ ప్రభుత్వం కేసులు పెట్టడం తప్ప చేసిన మేలు ఏమీ లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కాణిపాకం నుంచి అరసవిల్లి వరకూ ప్రతి దేవస్థానం కమిటీలో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ, కనక దుర్గమ్మ, ద్వారకా తిరుమల పాలకమండలి కమిటీల్లో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. ప్రముఖ దేవస్థానాల కమిటీ పాలకమండళ్లలో సభ్యులుగా ఆర్యవైశ్యులు పనికిరారా అని ఆయన ప్రశ్నించారు. తమను ఓటు బ్యాంకుగానే కూటమి చూడడం దారుణమన్నారు. అలాగే ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకపోవడం సరికాదని, దీనిపై కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులపై దాడులు, అక్రమ కేసులు: ఇదే జిల్లా పొదిలికి చెందిన అవినాష్ అనే వ్యాపారస్తుడు లారీని రోడ్డుపై పెట్టాడని ఎస్ఐ చితకబాదాడు, అప్పుడు ఆ ఘటన వివాదాస్పదం కావడంతో మూడు రోజులు వీఆర్కు పంపి వెంటనే మార్కాపురంలో పోస్టింగ్ ఇవ్వడం దారుణమన్నారు. పొట్టిశ్రీరాములు ట్రస్ట్లో పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఆర్యవైశ్యులను ప్రభుత్వం చులకన భావంతో చూస్తోందని ధ్వజమెత్తారు. దాడులు చేయడం, హింసించడం, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం చేస్తోందని విమర్శించారు. ఆర్యవైశ్యులు భయపడే రోజులు పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరుతో చాలా మంది వ్యాపారులు వ్యాపారాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అసలే ఆర్థికంగా కష్టాలు పడుతున్న వారిపై వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వంలోని ఆర్యవైశ్య దద్దమ్మలు ఏం చేస్తున్నారని, ఇలా దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులను అధికార పార్టీలో ఉన్న ఆర్యవైశ్య పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నారాంబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్యవైశ్యుల్లో చైతన్యం వచ్చిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆర్యవైశ్య మహాసభ పార్టీలకతీతంగా నడవాలి.. కూటమి ప్రభుత్వ హయాంలో రెండేళ్లుగా ఆర్యవైశ్యులపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ మండిపడ్డారు. కూటమి పార్టీలోని ఆర్యవైశ్య పెద్దల తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకు ఈ సభకు వచ్చిన అనూహ్య స్పందనే నిదర్శనమన్నారు. ఆర్యవైశ్య మహాసభలో పదవులు కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య మహాసభ నడవాలని, లేని పక్షంలో వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్యవైశ్యులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని, వారికి అన్ని సమయాల్లో అండగా నిలుస్తానని వైఎస్సార్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టే కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులను మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మోసపోయారో అదే విధంగా ఆర్యవైశ్యులు దగా పడ్డారని ఆర్టీఐ మాజీ కమిషనర్ రేపాల శ్రీనివాస్ ఆరోపించారు. ఆర్యవైశ్యులను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విమర్శించారు. తనపై ఎలాంటి నేరపూరిత కేసులు లేకపోయినా రౌడీషీట్ పెట్టారని ఆయన ఆరోపించారు. ఆర్యవైశ్యులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు మిట్ట కరుణాకర్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మోటామర్రి సదానందం, కోటప్పకొండ దేవస్థానం మాజీ బోర్డు మెంబరు దివ్వెల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఆర్యవైశ్యులు మాట్లాడుతున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ -
భ్రమరా వెంచర్స్ వద్ద ఘర్షణ
మార్కాపురం: గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మార్కాపురం పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన భ్రమరా వెంచర్స్ వద్ద ఆదివారం సాయంత్రం రైతులకు, వెంచర్స్ ప్రతినిధులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. భ్రమరా వెంచర్స్ ప్రతినిధులు తమను తమ పొలాల్లోకి పోనివ్వకుండా ఫెన్సింగ్తో పాటు ఇనుప గేట్లు పెడుతున్నారని సమాచారం రావడంతో పలువురు పొలాల రైతులు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ గేట్ పెట్టేందుకు జరుగుతున్న సన్నాహాలు చూడటంతో రైతులు వెంచర్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. భ్రమర సంస్థ ప్రతినిధులు డయల్ 100కు కాల్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతు ఇంతియాజ్తోపాటు మరికొందరు తాము గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చామని చెప్పగా.. పోలీసులు తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంతో తనకు సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాలని తహసీల్దార్ సమాధానమిచ్చినట్లు సమాచారం. గేటు ఉంచాలా.. తొలగించాలా అని తహసీల్దార్ను పోలీసులు అడగగా తొలగించాలని సూచించారు. దీంతో ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు.. సోమవారం తహసీల్దార్ను కలిసి మరోమారు మాట్లాడుకోవాలని సూచించి వెళ్లారు. అయితే భ్రమర ప్రతినిధులు తమ ఎండీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం సమయంలో గేట్ల వద్ద కాంక్రీట్ వర్క్ చేయిస్తుండగా ఇంతియాజ్ వర్గీయులు వెళ్లి అడ్డగించారు. గేట్లు తొలగించి పక్కన పడేయడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. తమపై వెంచర్స్ ప్రతినిధులు దాడిచేశారని అంబటిపూడి కిరణ్, ఆనెకరి మల్లిఖార్జున తెలిపారు. తమను కాళ్లతో తొక్కి స్క్రూడ్రైవర్లతో, ఇతర మారణాయుధాలతో దాడులు చేశారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెంచర్స్ నుంచి బయటపడ్డారని తెలిపారు. తాము చట్టప్రకారమే పోతున్నామని వెంచర్స్ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఘర్షణలో అనీల్తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. కిరణ్, మల్లిఖార్జున జీజీహెచ్కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గాయపడిన వెంచర్స్ ప్రతినిధులు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని బాధితుల స్టేట్మెంట్ కోసం జీజీహెచ్కు వెళ్లారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం కూడా తమ పొలాలను ఆక్రమిస్తూ తమకే అమ్మాలని బెదిరిస్తున్నారని పలువురు దళితులు వెంచర్స్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భ్రమరా వెంచర్స్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. నలుగురికి గాయాలు -
పేకాట శిబిరంపై దాడి
● రూ.2 లక్షల పైగా నగదు, 12 మోటార్ సైకిళ్లు, 12 మొబైల్ ఫోన్లు స్వాదీనం ● 13 మంది అరెస్టు కొనకనమిట్ల: మండలంలోని నాగిరెడ్డిపల్లి సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పొదిలి సీఐ రాజేష్ సిబ్బందితో మఫ్టీలో వెళ్లి మెరుపు దాడి చేశారు. భారీ బెట్టింగ్లతో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా నగదు, 12 మొబైల్ ఫోన్లు, 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం 13 మందిని పొదిలి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, పేకాట, జూదం, కోడిపందేలు, అసాంఘిక చర్యలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీఐ తెలిపారు. కాగా పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో కూటమి నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం● రూ.40 వేల నగదు, కమ్మలు, ఉంగరం అపహరణ పామూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం పామూరు సీతారామునితోట 4వ లైన్ మొలకాపురి నారాయణ ఇంట్లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..పామూరు సీతారామునితోట 4వ లైన్లో స్థానిక 108 ఈఎంటీ నారాయణ కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. నారాయణ 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు 108 వాహనానికి నైట్డ్యూటీకి వెళ్లాడు. దీంతో భార్య మల్లీశ్వరి, పిల్లలు రాత్రి 10.30 గంటలకు పడుకునేందుకు వాళ్ల పుట్టింటికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం తీసి ఉండగా అందులోని రూ.40 వేల నగదు, జత బంగారు కమ్మలు, బంగారు ఉంగరం చోరీకి గురయ్యాయి. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్లో పిర్యాదుచేయనున్నట్లు నారాయణ తెలిపారు. ముండ్లమూరు: ట్రాన్స్ఫార్మర్ చోరీలు ఆగడం లేదు. ఓ పక్క పోలీసులు నిందితులను పట్టుకున్నామని ప్రకటిస్తుంటే మరో పక్క చోరీలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. మండలంలోని పసుపుగల్లులో ఆదివారం తెల్లవారుజామున దుండగులు రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులోని రాగితీగను అపహరించారు. గ్రామానికి దక్షిణం వైపు ఉన్న మారం నాగిరెడ్డి, సింగంరెడ్డి రమణారెడ్డిలకు చెందిన రెండు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. రైతులు ఆదివారం ఉదయాన్నే పొలాలకు వెళ్లగా ట్రాన్స్ఫార్మర్లు కనిపించలేదు. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా రెండు ట్రాన్స్ఫారాలను ధ్వంసం చేసి కింద పడేసి అందులోని రాగి తీగను అపహరించారు. లైన్మన్ సోమ్లానాయక్ పరిశీలించి ఏఈ అంకబాబుకు తెలియజేశారు. ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు 14 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు గస్తు కాస్తున్నా దొంగతనాలు ఆగడం లేదు. పొదిలి రూరల్: టమోటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున కుంచేపల్లి సమీపంలో పాల కేంద్రంలో దగ్గర జరిగింది. వివరాల్లోకి వెళితే..గిద్దలూరు వైపు నుంచి పొదిలి మీదుగా టమోటా కాయలతో బొలెరో వాహనం అద్దంకి వైపు వెళ్తుంది. కుంచేపల్లి దగ్గరకు వచ్చే సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపు తప్పి పక్కన ఉన్న చింత చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో వాహనం నడుపుతున్న కడప జిల్లాకు చెందిన డ్రైవర్ అర్షద్వలి వాహనంలో ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన చేరుకున్నారు. వాహనాన్ని పరిశీలించగా డ్రైవర్ లోపల ఇరుక్కున్న ఉండటంతో వెంటనే డోర్ను పగలగొట్టి తీయగా డ్రైవరు అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు టౌన్: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు సీహెచ్ మంజుదార్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యాయంలో ఆదివారం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నాయకురాలు పరిశుద్ధం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంజుదార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వేతనాల పెంపుతో పాటుగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్లంతా విధిగా పాల్గొనాలని కోరారు. తొలుత ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోటేశ్వరమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పెరగనున్న పోలింగ్ స్టేషన్లు
మార్కాపురం టౌన్ వ్యూ మార్కాపురం: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. ఇందుకు అధికారులు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 1,200 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిని సవరిస్తూ కొత్తగా పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపాలని సూ చించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో 42 కొత్త పోలింగ్ కేంద్రాలకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం 1103 కేంద్రాలు ఉండగా 42 పెరగటం ద్వారా మొత్తం 1145 అవ్వనున్నాయి. మార్కాపురంలో 2, కనిగిరిలో 1 పోలింగ్ కేంద్రం లొకేషన్ మార్పు కోసం ప్రతిపాదించారు. గిద్దలూరు నియోజకవర్గంలో 10 మంది ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొక పోలింగ్ కేంద్రానికి మార్చాలని కోరటంతో దానికి కూడా నివేదిక తయారు చేశారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల వివరాలు నియోజకవర్గం ప్రస్తుతం పెరిగేవి మొత్తం మార్కాపురం 257 20 277 గిద్దలూరు 284 3 287 యర్రగొండపాలెం 265 2 267 కనిగిరి 297 17 314 మొత్తం 1103 42 1145 -
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఈ అక్రమ రవాణా ద్వారా ప్రతిరోజూ కనిగిరి నియోజకవర్గం నుంచి 5 నుంచి 8 భారీ లారీలు (సుమారు 320 టన్నుల) గ్రేడ్1 తెల్ల రాయి నిత్యం దేశం దాటి విదేశాలకు తరలిపోతోంది. ఈ లెక్కన రోజూ లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని, ఖజానా ఖాళీ అయిందని ఒకపక్క గగ్గోలు పెడుతుంటే, మరోపక్క ఆ పార్టీ నేతలే ఈ స్థాయిలో సహజ వనరులను దోచుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనిగిరిలో రెచ్చిపోతున్న ఈ వైట్ క్వార్జ్ట్ మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే, రాబోయే తరాలకు మిగిలేది కేవలం రాళ్ల గుట్టలేనని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
OÐðlsŒæ M>ÓÆŠḥtæjË*sîæ
తెల్ల రాయిపై పచ్చ గద్దలు ●పీసీపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చ నేతల కన్ను సహజ సంపదపై పడింది. కనిగిరి నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వైట్ క్వార్ట్జ్ (తెల్ల రాయి) నిక్షేపాలను అధికార టీడీపీ నేతలు బకాసురుల్లా దిగమింగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అటవీ, రెవెన్యూ, బంజరు భూముల్లో నిబంధనలకు పాతరేసి, ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. ’అధికారం మాదే.. అడిగేదెవరు?’ అన్న చందంగా పచ్చ గద్దలు రెచ్చిపోతుంటే, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ చోద్యం చూస్తున్నారు. కనిగిరి ప్రాంతంలో లభించే గ్రేడ్1 తెల్ల రాయికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ టన్ను రాయి రూ.7 వేల నుంచి రూ. 8 వేల వరకు పలుకుతుండగా, విదేశాలకు ఎగుమతి చేస్తే అది ఏకంగా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలుకుతోంది. ఈ భారీ లాభాలపై కన్నేసిన టీడీపీ నేతలు సిండికేట్గా ఏర్పడ్డారు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, గూడూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అక్రమార్కులు కనిగిరిలో వాలిపోయారు. ఈ సిండికేట్ శాసనమే ఇక్కడ వేదంగా మారింది. స్థానికంగా ఎవరు తెల్ల రాయి తరలించాలన్నా టన్నుకు రూ.1500 చొప్పున సిండికేట్కు ‘కప్పం’ కట్టాల్సిందే. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని గూడూరుకు చెందిన ఓ వ్యక్తి ద్వారా జిల్లా స్థాయి అధికారులకు, రాజకీయ నేతలకు వాటాల రూపంలో చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు, మారిటైం బోర్డులో ముఖ్య పాత్ర పోషిస్తున్న నాయకుడే ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘దమ్ముంటే పట్టుకోండి.. పట్టుకున్నా విడిపించుకునే సత్తా మా సిండికేట్కు ఉంది’ అంటూ ఈ తెల్ల రాయి కేటుగాళ్లు బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ రూపంలో చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయం పచ్చ నేతల జేబుల్లోకి వెళుతోంది. ఈ అక్రమ దందాకు మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పరోక్షంగా సహకారం అందిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ’తలా పాపం తిలా పిడికెడు’ అన్నట్లుగా అన్ని శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ముడుతుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజలు, రైతులు అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారాన్ని ముందుగానే మాఫియాకు చేరవేస్తున్నారు. తీరా నామమాత్రంగా తనిఖీలకు వెళ్లి, ఎందుకూ పనికిరాని రాయిని సీజ్ చేసినట్లు నాటకాలు ఆడుతూ పత్రికలకు ఫోజులిస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కనిగిరి నియోజకవర్గం ఇప్పుడు అక్రమ మైనింగ్కు కేరాఫ్ అడ్రస్గా మారింది. కనిగిరి మండలంలోని చీరల దిన్నె, గురువాజీపేట, ఎర్ర ఓబనపల్లె, మాల కొండాపురం, సీఎస్ పురం మండలంలోని రెడ్డిగారి కొత్తపల్లి, హరి వేముల, వెలిగండ్ల మండలంలోని పద్మాపురం, మొగిలిచర్ల, కట్ట కింద పల్లి.. అలాగే హనుమంతునిపాడు, పామూరు, పీసీ పల్లి తదితర మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాల్లో రాత్రికి రాత్రే భారీ జేసీబీలతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. మినరల్స్ పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యార్డుల్లో ఈ ఖనిజాన్ని నిల్వ చేసి, కూలీలతో పగలగొట్టించి గ్రేడింగ్ చేస్తున్నారు. గోనె సంచుల్లో ప్యాక్ చేసి, ఒక్కో లారీలో 30 నుంచి 40 టన్నుల సరుకును ఎక్కించి, రాత్రికి రాత్రే లారీల్లో విశాఖపట్నానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి సముద్ర మార్గంలో చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొండలు సైతం పిండి.. మాఫియా మంత్రాంగం.. మౌనంగా అధికార యంత్రాంగం పచ్చ సిండికేట్కు కప్పం కట్టాల్సిందే.. -
రైతు కష్టం అగ్నికి ఆహుతి
సంతనూతలపాడు (చీమకుర్తి): ఏడాది పొడవునా కష్టపడి పండించిన పొగాకు పంట బుగ్గిపాలైంది. ఇంట్లో దాచుకున్న రూ.1.05 లక్షల నగదు కాలిబూడిదైంది. వాటితో పాటు 5 సవర్ల బంగారం, 5 బస్తాల ధాన్యం మంటల్లో కలిసిపోయాయి. పొలానికి సంబంధించిన పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లన్నీ దహనమయ్యాయి. పక్కపక్క పోర్షన్లలో అన్నదమ్ములు నివాసం ఉంటున్న పెంకుటిళ్లు పూర్తిగా కాలి బొగ్గులే మిగిలాయి. సంతనూతలపాడు మండలం గంగవరం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. ఆదివారం వేకువజామున అందరూ గాఢనిద్రలో ఉండగా, మలసాని శేషయ్యకు చెందిన ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందరూ ఉలిక్కిపడి లేచి చూసే సరికి ఇంటి నిండా మంటలు ఎగసిపడుతున్నాయి. శేషయ్య భార్య రత్తమ్మ ఇంట్లో, శేషయ్య ఇంటి బయట పడుకున్నారు. ఇంట్లో మంటలకు రత్తమ్మకు మెళకువ వచ్చి బయటకు పరిగెత్తింది. తన భర్తతో పాటు అందరినీ పిలుస్తూ కేకలు వేసింది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఫైరింజన్ కోసం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్తో వచ్చిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని అన్నదమ్ముల రెండు పోర్షన్లతో పాటు పొగాకు చెక్కులు, బంగారం, నగదు, ధాన్యం పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వాటి విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, వీఆర్ఓ దాసరి శ్రీనివాసులు ప్రమాదం జరిగిన ఇంటిని, కాలిపోయిన పొగాకు, వస్తువులను పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన విధానాన్ని మండల విద్యుత్ శాఖ ఏఈ పీ గోపీ పరిశీలించారు. తనను పొగాకు బోర్డు ఆదుకోవాలని, ప్రభుత్వం తమ వంతు సాయం చేయాలని అధికారులకు శేషయ్య విన్నవించుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెంకుటిల్లు దగ్ధం 15 పొగాకు బేళ్లు, రూ.1.05 లక్షల నగదు, 5 సవర్ల బంగారం, 5 బస్తాల ధాన్యం బుగ్గిపాలు సుమారు రూ.20 లక్షల వరకు నష్టం -
ఇన్ సర్వీస్ టెట్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్
మార్కాపురం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ (పేపర్–1ఏ) పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ను మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఎస్టీయూ రూపొందించే ప్రతి స్టడీ మెటీరియల్ ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రయ్య మాట్లాడుతూ టెట్ పేపర్–1ఏకు సంబంధించిన తెలుగు, ఇంగ్లిష్, సైకాలజీ, మెథడాలజీలపై సమగ్రంగా స్టడీ మెటీరియల్ రూపొందించామని తెలిపారు. త్వరలో పేపర్–1ఏ అభ్యర్థుల కోసం ఆఫ్లైన్ మోడల్ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కమిషనర్ కొండారెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎం.సుధాకర్, బంగారు బాల్యం కన్వీనర్ గిరిధర్ శర్మ, గిద్దలూరు ఎంఈఓ అశ్విని కుమార్, సీహెచ్ గాలయ్య, యూసఫ్ షరీఫ్, అక్కల నారాయణ, వెంకటరమణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు సిగ్గుచేటు
కందుకూరు: ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన రామాయపట్నం పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ మరోపక్క పోర్టు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ అన్నారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిలతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పోర్టు నిర్మాణ పనులు గత ప్రభుత్వంలో ఎంతమేరకు పూర్తి చేశారు, ప్రస్తుత ప్రభుత్వం ఎంత శాతం పనులు పూర్తి చేశారు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ప్రయత్నం చేశారు. అయితే పోర్టు సందర్శనకు అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులను అడ్డుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు నేతలను నిర్బంధించి ముందుకు కదలకుండా వందల మంది పోలీసులు అడుపడ్డారు. పోర్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్వాహకం ఎక్కడ బయటపడుతుందోనని ఉద్దేశంతో పోర్టు సందర్శనకు నేతలను అనుమతించకుడా జాగ్రత్త పడ్డారు. గత ప్రభుత్వంలో దాదాపు పనులు పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పోర్టును సిద్ధం చేశారు. కానీ రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోగా, ప్రస్తుతం రూ. 5వేల కోట్లు విలువ చేసే పోర్టును కేవలం రూ 1500కోట్లకు తన సొంత మనుషులకు కట్టబెట్టేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ రామాయపట్నం పోర్టు పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వేల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు, పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, స్థానిక నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణం, నిర్వహణ ఉండాలని నినదించారు. ప్రైవేట్ వ్యక్తులకు పోర్టును ఇవ్వడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవర్ని అనుమతించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదు కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిలతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పోర్టు వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి అనుమతి కోరుతూ బుర్రా మధుసూదన్యాదవ్ పేరుతో పది రోజులు ముందుగానే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్వయంగా తన ఈ–మెయిల్ ద్వారా పోర్టు సందర్శనకు అనుమతించాలంటూ పోర్టు సీఈఓకు మెయిల్ చేశారు. ఈ దరఖాస్తులపై ఎటువంటి సమాధానం ఇవ్వని పోలీసులు, శనివారం వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనకు అనుమతి లేదంటూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. చేవూరు గ్రామ వీఆర్వో గల్లా వినోద్కుమార్ నుంచి ఫిర్యాదు తీసుకుని గుడ్లూరు పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 72/2026, 126(2), 189(2), 221, 285ఆర్/డబ్ల్యూ, 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. వీరిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, కందుకూరు, కావలి నియోజకవర్గాల ఇన్చార్జ్లు బుర్రా మధుసూదన్యాదవ్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, గణేశం గంగిరెడ్డి, షేక్రఫి, కాపులూరి మధుసూదన్, బిల్లా రమణయ్య, చేపల బాలాజీ, అప్పబోయిన రాజేష్ తదితరులపై కేసులు నమోదు చేశారు. అక్రమ కేసులు దుర్మార్గం పోర్టు పరిరక్షణ కోసం చేసిన ఆందోళనలపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అక్రమంగా కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ చేతగానితనానికి అక్రమ కేసులు ఒక నిదర్శనమన్నారు. ఇటీవల కాలంలో పొగాకు రైతులకు అండగా పోరాటం చేస్తే రైతులపై అక్రమంగా కేసులు పెట్టడం, తాజాగా పోర్టు కోసం పోరాడితే కేసులు పెట్టడం చూస్తుంటే ప్రజా ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోర్టు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆద్వర్యంలోనే పోర్టు ఉండాలని డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్టు పరిరక్షణ కోసం పోరాడితే కేసులు పెడతారా ప్రభుత్వ చేతగానితనానికి ఇది నిదర్శనం వైఎస్సార్ సీపీ నేతలపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ -
నదీ గర్భాలను చెరబట్టారు
అద్దంకి: నదీ గర్భాలను ఇసుకాసురులు చెరబట్టారు. అధికార పార్టీ అండతో ఇసుకను దోచుకుంటూ నదులకు గర్భ శోకం కలిగిస్తున్నారు. రాత్రి సమయాల్లో, ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాల్లోని నదులు, వాగుల వద్ద పొక్లెయినర్లతో ఇసుకను తవ్వి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల పరిధిలో వాగులు, నదులు ఉన్నాయి. వాటి లో అద్దంకి, బల్లికురవ మండలాల పరిధిలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. అద్దంకి మండలంలోని గోపాలపురం, తిమ్మాయపాలెం, రామాయపాలెం, వేలమూరిపాడు, బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం, సంతమాగులూరులోని గురిజేపల్లి సమీపంలోని వలేరు వాగుల్లో ఇసుకను ఇసుకాసులు పొక్లెయిన్లతో, ట్రక్కులతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ అండ.. పొక్లెయినర్తో ఇసుక తవ్వి తరలించే వారికి అధికార పార్టీ అండ ఉందని స్థానికులు చెబుతున్నారు. లేకుంటే ఇంత విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతాయనే విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలో అధికారులు సైతం మిన్నకున్నారనే ఆరోపణలున్నాయి. ఊట బావుల వద్ద ఇసుక తవ్వకాలు.. అద్దంకి, తిమ్మాయపాలెం, రామాయపాలెం తదితర గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన ఊటబావుల వద్ద సైతం ఇసుక ఎత్తుతుండడంతో ఊట బావుల్లో నీటి ఊట తగ్గిపోయి తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని పలుసార్లు ప్రజలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేదు. దాంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఇసుక రీచ్ లేకుండా తవ్వకాలు.. వాల్టా చట్టం ప్రకారం ఇసుక నిల్వలు సరైన లోతులో లేని చోట ఇసుక రీచ్లు కేటాయించలేదు. అందులో అద్దంకి నియోజకవర్గంలోని గుండ్లకమ్మ నది, ఇతర మండలాల్లో వాగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నదులు, వాగుల వద్ద ఇసుక తోడేయడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పట్టించుకుని ఇసుకాసురుల ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు. -
బలహీనం!
అడవి తల్లి అడవితల్లి ఒడిలో ఉండే గిరిజన మహిళలు పౌష్టికాహారం అందక బలహీనపడుతున్నారు. తగినంత రక్తం లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత అధికంగా కనపడుతోంది. కాన్పుల సమయంలో రక్తం తక్కువై ఇబ్బందులు పడుతున్న సందర్భాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం కూడా సాంకేతిక కారణాలతో గర్భిణులకు అందడం లేదు. అడవిలో ఉండే ప్రాణాలు.. ఏమైనా అడిగేదెవరు..అన్నట్లు అధికారులెవరూ వారి ఊసే పట్టించుకోవడం లేదు. పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనులను రక్తహీనత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా గర్భిణుల పాలిట ఇది పెనుశాపంగా మారుతోంది. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నట్లు సర్కారు చెబుతున్నా పౌష్టికాహారం మాత్రం వారి దరికి చేరడం లేదు. గిరిజన గూడేల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్నా నాడి పట్టే వైద్యులు కరువయ్యారు. అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం కోసం మైళ్ల కొద్దీ దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అరకొర వైద్య సదుపాయాలతో అల్లాడిపోతూ.. తీరా ఆస్పత్రులకు చేరేలోపే జరగరాని అనర్థాలు జరిగిపోతున్నాయి. దశాబ్దాలుగా గిరిజనులను పట్టిపీడిస్తున్న రక్తహీనత, మాతాశిశు మరణాలకు ముగింపు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలు తీస్తున్న రక్తహీనత, విషజ్వరాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 82 గిరిజన గూడేల్లో ఏటా మలేరియా, అతిసారం, టైఫాయిడ్తో పాటు విషజ్వరాలు గిరిజనులను కాటేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు అడుగడుగునా రక్తహీనత వారి ప్రాణాల మీదకు తెస్తోంది. గూడేల్లో చోటుచేసుకుంటున్న అధిక శాతం మాతాశిశు మరణాలకు ప్రధాన కారణం రక్తహీనతే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం.. సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే హిమోగ్లోబిన్ 11 శాతానికి తగ్గకూడదు. గర్భిణుల్లో ఇది 12 శాతం ఉండాలి. కానీ, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని చెంచుల్లో ఇది 9 శాతం కంటే తక్కువే ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గర్భిణుల్లో అయితే మరీ దారుణంగా 8 నుంచి 6 శాతమే ఉంటోంది. చింతల గూడేనికి చెందిన కుడుముల మంతమ్మ అనే మహిళకు కేవలం 3 శాతం హిమోగ్లోబిన్ ఉండటంతో ఇటీవల వైద్యులు రక్తం ఎక్కించి కాన్పు చేయాల్సి వచ్చింది. అలాగే జల్లా గురవమ్మకు 8 శాతం, తుమ్మలబైలుకు చెందిన భూమని లింగేశ్వరికి 7.6 శాతం మాత్రమే రక్తం ఉన్నట్లు నిర్ధారణ కావడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఆధార్ లింక్ లేక.. అందని పౌష్టికాహారం గిరిజన గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వాలు కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు శూన్యంగా మారింది. ‘పోషణ్ ప్లస్’ పథకంలో భాగంగా యాప్లో పేరు నమోదైన గర్భిణులకు నెలకు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు నూనె, 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, కిలో రాగిపిండి, అరకిలో బెల్లం, అరకిలో ఖర్జూరాలు, అర కిలో చిక్కీలు, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు పంపిణీ చేయాలి. కానీ ఆధార్కు ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోవడంతో అంగన్వాడీల ద్వారా అందాల్సిన ఈ ఫలాలు చెంచులకు చేరడం లేదు. ఒక్క పెద్దదోర్నాల మండల పరిధిలోని పలు గిరిజన గూడేల్లో సుమారు 350 మందికి పైగా గిరిజన గర్భిణీలు ఉండగా, వారిలో సగం మందికి ఆధార్కు ఫోన్ నంబర్లు లింక్ కాలేదు. ఫలితంగా వారికి ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారం అందడం లేదు. గూడెం విడిచి బయటకు రాలేని అమాయక చెంచులకు ఆధార్ అనుసంధానంపై అధికారులు కనీస అవగాహన కల్పించడం లేదు. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరిచి, గిరిజన గర్భిణులను మండల కేంద్రాలకు తీసుకొచ్చి ఆధార్కు ఫోన్ నంబర్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని, తద్వారా వారికి పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజనులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. -
కాపుల అభ్యున్నతికి పాటుపడిన ముద్రగడ
ఒంగోలు వన్టౌన్: కాపుల కోసం తన రాజకీయ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి, కాపుల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కాపు నేతలు కొనియాడారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామ్నగర్లోని జిల్లా కాపు సంఘ కార్యాలయంలో ఆదివారం ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ ఎంఎల్ఎగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారని..నీతి, నిజాయతీ అంటే ముద్రగడేనన్నారు. చిన్న మాట కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం, కాపుల ఐక్యత కోసం ముద్రగడ ఉద్యమం చేస్తేనే కాపు కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు. ఈ కార్పొరేషన్ల ద్వారానే పేద కాపులు రుణాలు పొందారని చెప్పారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఏన్నో రకాలుగా ప్రయత్నించారన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు ఐ ఘనశ్యామ్, టి రామస్వామి, వెంకటేశ్వర్లు, మంత్రి శ్రీనివాసరావు, ఎస్ సాయిబాబా పాల్గొన్నారు. -
పొగాకు రైతుల సత్తా చూపిస్తాం
ఒంగోలు టౌన్: గత 90 రోజులుగా రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నా పొగాకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం, పొగాకు బోర్డు, కంపెనీలు తాత్సారం చేస్తుండటంతో విసిగివేసారిన రైతులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 కల్లా పొగాకు కొనుగోలు చేయకపోతే 29న జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 7వ తేదీ చలో అమరావతి కార్యక్రమం చేపడతామన్నారు. తద్వారా రైతుల సత్తా ఏంటో చూపుతామని తేల్చి చెప్పారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో ఆదివారం నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించగా, మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పాల్గొని మాట్లాడారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 28వ తేదీలోపు రూ.1000 కోట్లు కేటాయించకపోతే 29వ తేదీ జిల్లాలోని సింగరాయకొండ నుంచి మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్ వరకు రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పొగాకు అధికంగా పండించే ప్రాంతాల్లో రైతాంగాన్ని చైతన్యపరుస్తూ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు బైకులతో చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పొగాకు రైతులతో పాటుగా మొక్కజొన్న, శనగ రైతులతో రహదారులను దిగ్బంధిస్తామన్నారు. వర్జీనియా పొగాకు వలన దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మాదక ద్రవ్యం వస్తుందని తెలిపారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు బోర్డును ఏర్పాటు చేసి పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు 1975 నాటికే చట్టం చేశాయని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కడం వలన పొగాకు సంక్షోభం వచ్చిందన్నారు. పొగాకు వ్యాపారులు ప్రీ వెరికేటర్లతో చేతులు కలిపి వంచనతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 7వ తేదీ చలో అమరావతి కార్యక్రమం చేపడతామని తేల్చి చెప్పారు. జుజ్జురి జయంతిబాబు, ఎస్.లలిత కుమారి, కోడూరి నాంచార్లు, కొండ్రగుట్ల సుబ్బారావు, పమిడి వెంకటరావు, పి.ప్రభాకర్, చెరుకూరి శ్రీనివాస్, పరిటాల కోటేశ్వరరావు, హనుమంతరావు, జి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకుంటే జాతీయ రహదారులను దిగ్బంధిస్తాం ఈ నెల 23 నుంచి 26 వరకు బైకులతో పొగాకు రైతుల చైతన్య యాత్ర 29న జాతీయ, రాష్ట్రీయ రహదారుల దిగ్బంధం అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 7న చలో అమరావతి -
ఇరుకు దారిలో.. ప్రాణాలు అరచేతిలో..
సంతనూతలపాడు(చీమకుర్తి): ఆర్టీసీ బస్సు తిరగబడిన ఘటనలో గాయాలు మినహాయిస్తే ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారని బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయం 8.30 గంటల సమయలో కొండపి–సంతనూతలపాడు రూట్లో మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు ఆర్తనాదాలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ బయట పడ్డారు. అనకర్లపూడి–మద్దులూరు మధ్య రోడ్డు ఇరుకుగా ఉండటం వలన ఎదురెదురు వాహనాలు ఒక దానికి ఒకటి దారి ఇచ్చే పరిస్థితి లేదు. కొండపి నుంచి సంతనూతలపాడు మీదుగా ఒంగోలు వచ్చే బస్సు మద్దులూరు వద్దకు రాగా.. అదే సమయంలో ఒంగోలు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి నియోజకవర్గం కొండపికి రాకపోకలు సాగించే రోడ్డును కూడా కనీసం రెండు బస్సులు తిరిగేటంత వెడల్పు చేసుకోలేకపోవడం దారుణమని, ప్రభుత్వ విధానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని రొటీన్ డైలాగ్లు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంతనూతలపాడు ఎంఈఓ ఎన్వీఎస్ కుమార్, చిలకపాడు హైస్కూలు హెచ్ఎం స్వప్నరాజు పరామర్శించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమని నిర్ధారించిన సంతనూతలపాడు ఎస్సై అజయ్బాబు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కొండపి సీహెచ్సీకి క్షతగాత్రుల తరలింపు కొండపి: సంతనూతలపాడు మండలం పరిధిలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు ప్రయాణికులను కొండపి సీహెచ్సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీహెచ్సీకి 36 మందిని తరలించగా వారిలో స్వల్పగాయాలైన 18 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసి పంపగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని ఒంగోలు జీజీహెచ్కు తరలించి చికిత్స చేశారు. బస్సులో సుమారు 75 మంది వరకు ఉన్నారని, బస్సు అంతా నిండుగా ఉందని సీట్లు నిండిపోగా సుమారు 20 మందికి పైగా నిల్చుని ఉన్నారని ఓ ప్రయాణికుడు తెలిపారు. బస్సు కూడా నెమ్మదిగానే వెళుతుందని ఆ క్రమంలో మలుపు వద్దకు రాగానే హఠాత్తుగా ఎదురుగా మరో బస్సు వచ్చిందని, దానిని దాటే క్రమంలో బస్సు డ్రైవర్ నెమ్మదిగా బస్సును రోడ్డు మార్జిన్లోకి దించాడన్నారు. కానీ మార్జిన్లు సక్రమంగా లేకపోవటంతో బస్సు ఒక పక్కకు వాలి పోతుండటాన్ని గమనించామని, ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తెలిపారు. చివరకు కొద్దిపాటి దెబ్బలతో బస్సులోంచి బయట పడగలిగామని వివరించారు. చిల్లచెట్లు బాగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఈ సంఘటన జరిగిందని తెలిపారు. -
గాలిలో భవనం..!
● నేలమట్టంలో ఉన్న భవనాన్ని పైకిలేపి ఎత్తు పెంచుతున్న ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ చీమకుర్తి: ఎప్పుడో తాతలు, తండ్రుల కాలంలో కట్టిన ఇళ్లు కాలక్రమంలో నేలమట్టంలో ఉంటుంటాయి. దీని వలన వర్షం నీరు లోనికి చేరడం వంటి సమస్యతో పాటు వాస్తుపరంగా కూడా సమస్యగా భావిస్తుంటారు. చీమకుర్తికి చెందిన గోవిందరెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పల్లంలో ఉన్న తన ఇంటి ఎత్తు పెంచేందుకు హైదరాబాద్కు చెందిన ట్రయాంగిల్ హౌస్ లిఫ్టింగ్ సంస్థ సివిల్ ఇంజినీర్ నాగేంద్రబాబును సంప్రదించారు. వారు కొద్ది రోజుల క్రితం పని ప్రారంభించారు. హైడ్రాలిక్ జాకీలతో ఆ ఇంటిని దాదాపు 5 అడుగులు పైకి లేపారు. పాత పునాది స్థానంలో కొత్త పునాది కూడా నిర్మిస్తున్నారు. తన సంస్థ ద్వారా ఇప్పటికే మొత్తం 300 భవనాలకుపైగా పైకిలేపినట్లు నాగేంద్రబాబు తెలిపారు. సంతమాగులూరు (అద్దంకి): వివాహేతర సంబంధం నేపథ్యంలో సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామంలో ఈ నెల 16వ తేదీ జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శేషగిరిరావు ఆ వివరాలు వెల్లడించారు. పాతమాగులూరు గ్రామానికి చెందిన హతుడు సజ్జల పిచ్చిరెడ్డి నాలుగు సంవత్సరాలుగా నిందితుడు చల్లా విష్ణువర్దన్ తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై పిచ్చిరెడ్డిని, తన తల్లిని అనేకసార్లు విష్ణువర్దన్ మందలించాడు. గతంలో రెండుసార్లు పిచ్చిరెడ్డితో గొడవపడ్డాడు. ఈ నెల 16వ తేదీ 4 గంటల సమయంలో సూళ్లూరుపేట నుంచి వచ్చి ఇంటికివెళ్లిన విష్ణువర్దన్.. తన తల్లితో కలిసి ఉన్న పిచ్చిరెడ్డి పై ఆగ్రహంతో దాడి చేశాడు. ప్రాణభయంతో పారిపోతున్న పిచ్చిరెడ్డిని పాతమాగులూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న రామాంజనేయ సెల్షాప్ వరకు వెంబడించి మరీ అక్కడున్న ఇటుక రాయితో నుదుటిపై విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన పిచ్చిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం అడ్డరోడ్డు ప్రాంతంలో విష్టువర్దన్ను అరెస్టు చేశారు. అతన్ని అద్దంకి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలకు అండగా నిరంతర పోరాటం
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జగన్ 2.ఓ సూపర్ యాప్ వాల్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పోరాటాలపై, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీడియోలు, ఆడియోలు, ఫొటోలు ఈ యాప్లో డౌన్ లోడ్ చేయవచ్చని, తద్వారా విస్తృతంగా ప్రచారం చేసే అస్త్రంగా ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రతి పక్షం అంటే ప్రజల పక్షం నిలిచేదని, అటు వంటి స్థానంలో ఉన్న తమ పార్టీ 25 సమస్యలపై కార్యక్రమాలను చేపట్టిందని, పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి అనేక సమస్యలను పరిష్కరించిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కకు నెట్టేసి దళారులకు నాయకత్వం వహిస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడి భూ కబ్జాలు, అక్రమంగా రేషన్, ఇసుక, మట్టి దందా చేస్తున్నారని అన్నారు. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలపై జగన్ 2.ఓలో పోస్ట్ చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, వివిధ విభాగాల నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, సూరె వెంకట రమేష్, సయ్యద్ జబీవుల్లా, ఐ.వి.సుబ్బారావు, వై.వెంకటేశ్వరరెడ్డి, శేషం రంగబాబు, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సంతోష్ కుమార్, ఎల్.రాములు, గార్లపాటి శార, పి.రాములు నాయక్, ఆర్.అరుబాయి, పల్లె సరళ, వాడాల పద్మ, షేక్ కాశింపీరా, షేక్.ఫయాజ్, జి.కృష్ణారావు, కాకుమాను సురేష్, కొండయ్య, నాగయ్య, మురారి గాలయ్య, కందూరి గురుప్రసాద్, ఎం.రాజశేఖర్, సురేష్ నాయక్, తిరుమలరెడ్డి చిన్న వీరారెడ్డి, వెంకట నారాయణ, గూడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచకాలపై ప్రశ్నిస్తున్న జగనన్న -
ప్రజల ఆస్తులను దోచుకోవడమే అభివృద్ధా..
కందుకూరు: ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ నిత్యం ప్రజలను మభ్యపెడుతూ మరోపక్క ప్రజల ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పనిచేస్తున్నారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. రామాయపట్నం పోర్టు ముట్టడి సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పోర్టు నిర్మాణంలో 95 శాతం పనులు పూర్తయి కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఈ దశలో రూ.5 వేల కోట్లు విలువైన పోర్టుని రూ.1500 కోట్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. దీని వల్ల పోర్టు కోసం భూములిచ్చిన రైతులు, మత్య్సకారుల ప్రయోజనాలు ఏం కావాలని ప్రశ్నించారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. పోర్టు నిర్మాణంతో జీవనోపాధి కోల్పోయిన మత్య్సకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం నెలకు రూ.3 వేల భృతిని మత్య్సకారులకు ప్రకటించింది. జగన్ ప్రభుత్వంలో పక్కాగా అందిన భృతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు ఇవ్వడం లేదని కాకాణి గోవర్ధన్రెడ్డి నిలదీశారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ని బంగాళాఖాతంలో కలి పేందుకు ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ గిఫ్ట్ రామాయపట్నం పోర్టు: బుర్రా కందుకూరు ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ రామాయపట్నం పోర్టు అని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. అటువంటి పోర్టును చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పోర్టులో జరిగే అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆందోళనను అడ్డుకునేందుకు మూడు రోజుల నుంచి పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. పోలీసులు ప్రజల మనోభావాలను, ఆస్తులను కాపాడేలే కాని చంద్రబాబు కోసం పనిచేయడం తగదన్నారు. పేదల పొట్టకొట్టేలా నిర్ణయాలు తీసుకుంటూ కేసులు పెడతామంటూ రైతులు, యువతను బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ నిలిపి వేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పోర్టు నిర్మాణం పూర్తి చేసి నిర్వహించాలని, లేదంటే భవిష్యత్లో మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. తీర ప్రాంత అభివృద్దే లక్ష్యం: రామిరెడ్డి రామాయపట్నం పోర్టు, జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా తీర ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం జగన్మోహన్రెడ్డి కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగానే నాలుగు పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్లు చేపట్టారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం సరైన విధానం కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. -
ఉద్యమమై కదిలి.. ఉవ్వెత్తున రగిలి!
రామాయపట్నం పోర్టు సందర్శన భగ్నానికి అడుగడుగునా కుట్ర కందుకూరు: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక రైతులు చేపట్టిన భారీ ఆందోళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేసింది. పోలీసులను అడ్డుపెట్టుకుని పోర్టు పరిసర ప్రాంతాలకు కూడా ఎవరూ వెళ్లకుండా ముందస్తు కుట్రకు తెరతీసింది. దీనిలో భాగంగానే శనివారం పోర్టువైపు వెళ్లిన వైఎస్సార్ సీపీ శ్రేణులను, స్థానిక రైతులు, యువతను అడ్డుకున్నారు. దీని కోసం వందల సంఖ్యలో పోలీసులను మొహరింప చేశారు. డీఎస్పీలు, సీఐలు, పదుల సంఖ్యలో ఎస్సైలు, వందల మంది కానిస్టేబుళ్లను పోర్టు పరిసర ప్రాంతాల్లో మొహరించి అడ్డుకున్నారు. పైగా పోర్టు నిషిద్ధ ప్రాంతం అన్న తరహాలో దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా భారీ అడ్డంకులు ఏర్పాటు చేశారు. దీని కోసం 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న చేవూరు నుంచి పోర్టులోకి వెళ్లే రహదారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోర్టుకు కిలోమీటరు దూరంలోనే రోడ్డుకు అడ్డంగా ఇనుప రేకులతో భారీ అడ్డుగోడ కట్టి, పోర్టు పనులకు వినియోగించే భారీ టిప్పర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీనిని చూస్తుంటే ప్రభుత్వం ఏవిధంగా భయపడుతుందో అర్థమవుతుందని, పోర్టు నిర్మాణం సక్రమంగా జరిగితే ఎందుకు ప్రభుత్వం అడ్డుకుంటోందని నిలదీశారు. సందర్శనకు అనుమతి లేదని పోర్టు అధికారులు లెటర్ ఇచ్చారని, వారి ఆదేశాల మేరకు ఎవర్నీ అనుమతించడం లేదంటూ పోలీసులు చెప్పడం గమనార్హం. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా.. పోర్టు ప్రైవేటీకరణ నేపథ్యంలో పోర్టు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ బుర్రా మధుసూదన్ యాదవ్ పేరుతో పోలీసులకు పది రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కూడా తన సొంత మెయిల్ ద్వారా పోర్టు సీఈఓకి మెయిల్ చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు అడ్డుకున్న సందర్భంలో కాకాణి బహిర్గతం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోర్టు అధికారులు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. అలాగే పోర్టు అధికారులకు చేసిన విన్నపానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. ముందుగా ప్రకటించినట్టుగా ఆందోళనకు దిగారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను సహకారంతో కుట్రపన్నిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే పోర్టుకు భూములిచ్చిన రైతులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. తాము ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు నిర్మిస్తామంటే భూములు ఇచ్చాం తప్పా, ప్రైవేట్ వ్యక్తులకు కాదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేటీకరించడం వల్ల తమ లక్ష్యంగా నీరుగారిపోతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. జీవనోపాధి కోల్పోయిన మత్య్సకారులకు ఇస్తామన్న భృతిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేట్పరం చేస్తే ఊరుకునేది లేదంటూ, ప్రాణాలైనా అర్పించి పోర్టును కాపాడుకుంటామంటూ నినదించారు. నిరసన ర్యాలీ సందర్భంగా పోలీస్ బందోబస్తు మహిళా నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు రామాయపట్నం పోర్టును కాపాడాలని వైఎస్సార్ సీపీ పిలుపునిస్తే.. ఆందోళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పోర్టు దారులన్నింటినీ దిగ్బంధించి, శాంతియుత నిరసనను భగ్నం చేసేందుకు అడుగడునా కుట్రలు పన్నింది. దాదాపు ఐదుగంటల పాటు సహనంగా ఉన్న పార్టీ నాయకులు, రైతులు, యువకులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యేలను సైతం లాగిపడేసి అరెస్టు చేయడమే కాకుండా కేసులు పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. -
ఉద్రిక్తంగా హైవే దిగ్బంధనం.. పలువురిపై కేసులు
బుర్రా మధుసూదన్ యాదవ్ను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులు పోలీసుల తీరును నిరసిస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి, బుర్రా మధుసూదన్యాదవ్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి కోల్కత్తా–చైన్నె జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మరోసారి రంగ ప్రవేశం చేసిన పోలీసులు నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాకాణిని, బుర్రాలను పోలీసులు బలవంతంగా పక్కకి లాగిపడేశారు. అదేవిధంగా బుర్రాను లాక్కెళ్లే ప్రయత్నంలో పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే రోడ్డుపై బైఠాయించిన మహిళా నేతలను లేడీ పోలీసులు పక్కకి లాగేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసినందుకు వైఎస్సార్సీపీ నేతలపై గుడ్లూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. కాకాణి గోవర్ధన్రెడ్డి, బుర్రా మధుసూదన్యాదవ్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిలతో పాటు కందుకూరు నాయకులు గణేశం గంగిరెడ్డి, షేక్ రఫి, బిళ్లా రమణయ్య, కాపులూరి మధుసూదన్యాదవ్, చేపల బాలాజీ, కాట్రగడ్డ వెంకట్రావ్, కావలి నియోజకవర్గానికి చెందిన కామరాజు తదితరులపై కేసు నమోదు చేశారు. -
కృష్ణలంక ఖాకీల్లా వ్యవహరించొద్దు
సింగరాయకొండ: లాకప్ డెత్లతో రాష్ట్రస్థాయిలో వివాదాస్పదంగా మారిన కృష్ణలంక పోలీసుల్లాగా వ్యవహరించవద్దని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేయాలని సింగరాయకొండ ఎస్సై ఎల్.సుధీర్కుమార్ను మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. మసీదు నిర్మాణ వివాదంలో వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్పై అక్రమంగా కేసు నమోదు చేసి, స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన.. నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సైను నిలదీశారు. ప్రజాస్వామ్యంలో పోలీసుల తీరు పక్షపాతంగా ఉండకూడదన్నారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లు స్టేషన్కు రావద్దు.. కేవలం టీడీపీ వారికే న్యాయం చేస్తాం’ అని చెప్పడం దారుణమని, అలాంటప్పుడు పీఎస్ ముందు బోర్డు పెట్టుకోవాలని మండిపడ్డారు. ఒక సివిల్ వివాదానికి సంబంధించి క్రిమినల్ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. స్టేషన్కు వచ్చేవారి పట్ల అసభ్య పదజాలం వాడటం మానుకోవాలన్నారు. తాను అంత సులువుగా స్టేషన్ వరకు రానని, మళ్లీ రప్పించే ప్రయత్నం చేయవద్దన్నారు. అక్రమ కేసు నమోదుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కుట్రపూరితంగానే కేసు: సుల్తాన్ ఈ ఘటనపై షేక్ సుల్తాన్ మాట్లాడుతూ.. పకీరుపాలెంలో మసీదు నిర్మాణం కోసం 2023లో సాజిద్ అనే వ్యక్తి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చాడన్నారు. తాను కార్యదర్శిగా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో బేస్మెంట్, పిల్లర్లు నిర్మించగా.. ఆ తర్వాత నిధుల లేమితో పనులు ఆగడంతో కమిటీ అధ్యక్షుడు దాదా.. శ్లాబ్ వరకు పూర్తి చేశాడన్నారు. అయితే మినార్ల నిర్మాణ విషయంలో ఇరువురి మధ్య తలెత్తిన చిన్న వాగ్వాదాన్ని సాకుగా చూపి దాదా.. తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని చెప్పారు. అంతేకాకుండా, దాత ఇచ్చిన స్థలంలో శ్లాబు వరకు నిర్మాణం జరిగినా.. అసలు ఎలాంటి కట్టడాలు జరగలేదని సాకు చూపి స్థల రిజిస్ట్రేషన్ను కుట్రపూరితంగా రద్దు చేయించారని సుల్తాన్ ఆరోపించారు. అనంతరం దాదాపై కేసు నమోదు చేయాలని కోరుతూ సుల్తాన్ వర్గీయులు, ముస్లింలు ఎస్సైకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కేసును నిరసిస్తూ మాజీ మంత్రి డాక్టర్ సురేష్తో పాటు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్కు తరలివచ్చారు. ఎస్సైకి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరిక పార్టీలకతీతంగా న్యాయం చేయాలని హితవు -
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం రేపు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మార్కాపురం టౌన్: గురువారం రాత్రి ప్రకటించిన నీట్ యుజీ ఫలితాల్లో మార్కాపురం విద్యార్థి నాదెళ్ల నిహాల్ జాతీయ స్థాయిలో 438వ ర్యాంకు సాధించాడు. ఎన్ఎస్ లా అగ్రికల్చర్, హార్టీకల్చర్ కళాశాలల చైర్మన్ చంద్రమౌళి కుమారుడు నిహాల్. ఈ సందర్భంగా విద్యార్థిని విశ్రాంత ప్రిన్సిపల్ డేవిడ్లివింగ్ స్టన్, వార్డెన్ నజీర్, డాక్టర్ మచ్చ శివశంకర్, ఎస్ వెంకటేశ్వర్లు, గుంటక చెన్నారెడ్డి, ఆడిటర్ తోట సత్యనారాయణ, బద్రీనాథ్ తదితరులు సన్మానించారు. మార్కాపురం టౌన్: జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు–2026కు ఎంపికై నట్లు కలెక్టర్ ఎం. విజయసునీత తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం షైనింగ్ స్టార్స్–2026 అవార్డ్స్ బహుమతి ప్రదానోత్సవంపై జిల్లాలోని ఎంఈఓలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల నగదుతో పాటు సర్టిఫికెట్ ఇస్తారన్నారు. మార్కాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్, రూ.20 వేల నగదు అందజేస్తారన్నారు. అదేవిధంగా మెగా పీటీఎం 3.1 కు సంబంధించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ మొబైల్లో ‘లీప్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ ఎస్.సుబ్బారావు, డీసీఈబీ సెక్రటరీ ఎం.సుధాకర్, జిల్లాలోని అందరు ఎంఈవోలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: రాష్ట్రంలో శరవేగంగా కోవిడ్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణితో కలిసి కోవిడ్ షెడ్లను శుక్రవారం పరిశీలించారు. కోవిడ్ సన్నద్ధతలో భాగంగా అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ అనుమానితులను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఐసోలేటెడ్ కేబిన్ ఏర్పాట్లతోపాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా బెడ్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఈ పరిశీలనలో నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, ఏఆర్ఎంఓ డాక్టర్ సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు. -
ఎంటీఎస్ ఉపాధ్యాయుల బిల్లులు ఎనేబుల్ చేయాలి
● డీఈఓకు ఎస్టీయూ నాయకుల వినతి మార్కాపురం: జిల్లాలో జూన్ నెలలో బదిలీపై వచ్చిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతభత్యాల బిల్లులను ’నిధి’ యాప్లో వెంటనే ఎనేబుల్ చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎర్రయ్య కోరారు. ఈ మేరకు మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సామ సుబ్బారావుకు సంఘం నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రయ్య మాట్లాడుతూ.. బదిలీపై విధుల్లో చేరిన ఉపాధ్యాయుల బిల్లులు నిధి యాప్లో సమర్పించేందుకు వీలుకాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని, వారికి సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంటీఎస్ జిల్లా అధ్యక్షుడు వజ్రం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రామకోటేశ్వరరావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి ఉరి.. బినామీలకు సిరి!
● కూటమి నేతల బినామీల కోసమే రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ● రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు.. రూ.1,500 కోట్లకే ధారాదత్తం వెనుక కుట్ర ● వైఎస్ జగన్ కలకు, స్థానిక నిరుద్యోగుల ఉపాధికి చంద్రబాబు మంగళం ● ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమంటున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు ● పోర్టు పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో మహోద్యమానికి సై ఉలవపాడు: రామాయపట్నం పోర్టు నిర్మాణం వెనుక దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. వైఎస్సార్ సీపీతో సహా ఎన్నో ప్రజా సంఘాలు ఈ పోర్టు కోసం ఉద్యమించాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అడ్డంకులన్నీ అధిగమించి, రికార్డు సమయంలో దాదాపు 95 శాతం పనులు పూర్తి చేయించి ప్రారంభానికి సిద్ధం చేశారు. ప్రభుత్వమే ఈ పోర్టును నిర్వహించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయంతో పాటు, ఈ ప్రాంత వాసులకు వేలాదిగా ఉద్యోగాలు లభిస్తాయని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ అయింది. 2014–2019 మధ్య కాలంలో కేంద్రం నిధులిస్తానన్నా నిర్లక్ష్యం చేసి, తీరా 2019 ఎన్నికల ముందు ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ‘బుల్లి పోర్టు’కు కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకొన్న బాబు.. ఇప్పుడు ఏకంగా పోర్టును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే దుర్మార్గపు కుట్రలకు పదునుపెట్టారు. దోపిడీకి పక్కా స్కెచ్.. టెండర్ల ముసుగులో హైడ్రామా తొలిదశలో 850.79 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సుమారు రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ పోర్టు నిర్మాణం జరిగింది. ఇంతటి భారీ ఆస్తిని కూటమి సర్కారు నిస్సిగ్గుగా తమ అనుకూల కార్పొరేట్ సంస్థలకు, టీడీపీ బినామీలకు కట్టబెట్టేందుకు టెండర్ల ముసుగులో నాటకమాడుతోంది. తొలిదశ పోర్టు నిర్వహణతో పాటు విస్తరణ పనుల పేరుతో 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ.. ఆ తర్వాత దాన్ని మరో 20 ఏళ్లు పొడిగించుకునేలా (మొత్తం 50 ఏళ్లు) ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన ఈ పోర్టును కేవలం రూ.1500 కోట్ల ‘ఆఫ్ ప్రీమియం’ ధరకే కట్టబెడుతుండటం కూటమి ప్రభుత్వ అవినీతికి, బరితెగింపునకు నిదర్శనం. ఆ రూ.1500 కోట్లు కూడా ఒకేసారి కట్టాల్సిన పనిలేదు. ముందుగా రూ. 750 కోట్లు చెల్లించి, మిగతా మొత్తం తీరికగా పది వాయిదాల్లో కట్టుకోవచ్చని టెండర్ డాక్యుమెంట్లో పేర్కొనడం చూస్తుంటే.. దీని వెనుక ఎంతటి భారీ ’క్విడ్ ప్రో కో’ దాగి ఉందో ఇట్టే అర్థమవుతోందని విశ్లేషకులు మండిపడుతున్నారు. పొట్ట చేతబట్టి.. వలస పోవాల్సిందేనా? పోర్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిరుద్యోగ యువతకు వేలాదిగా ఉద్యోగాలు వస్తాయని, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ప్రజలు ఎంతో ఆశపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు ఉంటే రిజర్వేషన్ల ద్వారా స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కేవి. కానీ, ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తుండటంతో స్థానికుల ఉపాధి ఆశలపై చంద్రబాబు సర్కారు నిలువునా నీళ్లు చల్లింది. ప్రైవేటు యాజమాన్యాలు ఏ పొరుగు రాష్ట్రం వారినో తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించుకుంటే, మా పిల్లలు పొట్టచేత పట్టుకుని వలసలు పోవాల్సిందేనా? అని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోర్టు పరిరక్షణకు వైఎస్సార్ సీపీ పోరుబాట రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమ హక్కులను, ఉపాధి అవకాశాలను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్న ప్రభుత్వ తీరుపై దళిత, బహుజన, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. ప్రజాధనంతో నిర్మించిన పోర్టును ప్రభుత్వమే నిర్వహించాలని, స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పచ్చ నేతల దోపిడీ నుంచి రామాయపట్నం పోర్టును కాపాడుకునేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో మహోద్యమానికి ప్రకాశం, నెల్లూరు ప్రాంత ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అస్మదీయుల కోసం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వ మెడలు వంచుతామని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. రామాయపట్నంలో ‘బాబు’ తాబేదార్ల లంగరు హక్కులు కాలరాస్తున్నారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 95 శాతం పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య. ఇది స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల చేతగానితనానికి నిదర్శనం. పోర్టును ప్రభుత్వమే నిర్వహిస్తే పారిశ్రామికాభివృద్ధి జరిగి పేదలకు ఉపాధి లభిస్తుంది. ప్రైవేటీకరణను తక్షణమే ఆపకపోతే కేసులు, జైళ్లకు వెరవకుండా పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం. – బుర్రా మధుసూదన్ యాదవ్, వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్చార్జ్ -
దీక్ష బూని!
రైతుల పక్షానఒంగోలు టౌన్/ఒంగోలు సిటీ: వేలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పొగాకు రైతులను ఆదుకోలేక చంద్రబాబు ప్రభుత్వం తన అసమర్ధతను నిరూపించుకుందని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. పొగాకు రైతుల దీక్షలకు పోలీసులు అనుమతివ్వలేదని, కానీ ప్రజలు, పొగాకు రైతుల అనుమతి ఉందన్నారు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏం చేసుకుంటావో చేసుకోమని భారీ ఎత్తున పొగాకు రైతులు నేరుగా కలెక్టరేట్ వద్దకు వచ్చి దీక్షలో పాల్గొన్నారని, ఇది రైతుల ఆగ్రహానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సోమవారం వస్తే చాలు కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు ప్రజలు, రైతుల నిరసనలతో దద్దరిల్లి పోతున్నాయని తెలిపారు. ప్రభుత్వ అసమర్ధ పాలనపై ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు వివిధ రీతుల్లో ఉద్యమాలు చేస్తున్నారని, ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పొగాకు రైతులు, గ్రామీణ ప్రజలు ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను వేధించిన ఉద్యోగులను రిటైర్డ్ అయినా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి కేసులు పెడతామని హెచ్చరించారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు: కాకాణి రాష్ట్రంలోని రైతులకు యూరియా ఇప్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు అనతికాలంలోనే 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఘనుడని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విరుచుకు పడ్డారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత 45 నెలల పాటు కనిపించకుండా పోయిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో బయటకు వచ్చాడని, కానీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంటనే ప్రజల మధ్యకు వచ్చి పోరాడుతున్నారని కితాబిచ్చారు. రైతులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మట్టి, ఇసుక, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ మార్చడం వంటి దోపిడీ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. 99 పైసలకే ఎకరం భూములిస్తున్న కూటమి ప్రభుత్వం లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ అవసరమైతే ఊరికే ఇస్తానంటున్నాడని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో ప్రజలకు ఉపయోగపడేలా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యా సంస్థలను నిర్మిస్తే జగనన్న సృష్టించిన ఆస్తులను చంద్రబాబు దోచుకుంటున్నాడని, రామాయపట్నం పోర్టు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో సిండికేట్ పాలన: తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నడవడంలేదని, సిండికేట్ల పాలన నడుస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విరుచుకుపడ్డారు. వాళ్లే వ్యాపారాలు చేస్తున్నారని, వాళ్లే లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమన్నారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వమే దళారి అవతారమెత్తి ప్రజల్ని లూఠీ చేస్తోందని మండిపడ్డారు. డీఆర్సీ మీటింగులో మాట్లాడడానికి లేచిన వెంటనే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కెమెరాలను ఆపించి మీడియాను బయటకు పంపించారని ఆరోపించారు. చేసేది తప్పుడు పనులు కనుక తామెక్కడ ప్రశ్నిస్తామోనన్న భయంతో మీడియాను బయటకు పంపించారని తెలిపారు. పరిపాలన చేతకాక పోలీసులను ప్రయోగిస్తున్నారని, బూడిద పార్టీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. చంద్రబాబుకు రైతులను ఆదుకోవాలన్న ఆలోచనలేదు: ఆదిమూలపు చంద్రబాబుకు పొగాకు రైతులను ఆదుకోవాలన్న ఆలోచనలేదని, ఆయన హృదయం పాషాణమని మాజీ మంత్రి, కొండపి ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమమన్నా, ప్రజా సంక్షేమ పథకాలన్నా చంద్రబాబు వ్యతిరేకిస్తారని మండిపడ్డారు. మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేస్తే రైతులు ఇబ్బందుల నుంచి బయటపడతారని తెలిపారు. పొగాకు రైతుల కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. కంపెనీలకు అమ్ముడుపోయిన చంద్రబాబు: మేరుగు నాగార్జున చంద్రబాబు ప్రభుత్వం కంపెనీలకు అమ్ముడుపోయి పొగాకు రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి, సంతనూతలపాడు ఇన్చార్జి మేరుగు నాగార్జున విమర్శించారు. పొగాకును అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేస్తుంటే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ దాచుకున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనలో క్వింటా పొగాకు రూ.36 వేలు ఉంటే నేడు చంద్రబాబు పాలనలో రూ.16 వేలకు పడిపోయిందన్నారు. పొగాకు రైతుల గురించి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలను దొంగలంటూ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. పొగాకు రైతుల గురించి మాట్లాడితే దొంగలంటారా: చుండూరి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల గురించి దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ దొంగమాటలు మాట్లాడుతున్నారని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఖండించారు. పొగాకు రైతులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటానికి ఎమ్మెల్యేలు వెళితే చంద్రబాబు సొరుగులోంచి పుస్తకాలు తీసి వారి చరిత్ర చెబుతున్నారని, చంద్రబాబు జనాల్నే కాదు సొంతపార్టీ ఎమ్మెల్యేలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడితే దొంగలంటున్నారని, ఎవరు దొంగలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఆర్బీకేలతో రైతులకు మేలు చేసిన జగన్ : నాగార్జున రెడ్డి రైతును రాజును చేయాలని మహానేత రాజశేఖర్ రెడ్డి కలలుకన్నారని, ఆయన ఆశయాల మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్బీకేలు తీసుకొచ్చారని గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కె.నాగార్జున రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను కనీసం మనిషిగా కూడా చూడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. పొగాకు రైతులను పట్టించుకోని పాలకులు: దద్దాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. 2025లో బ్యారన్కు 37 క్వింటాళ్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం రూ.16 వేలకు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. రైతుల వద్ద పొలం లేకుండా చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పొగాకు బోర్డుకు బాధ్యత లేదా: బత్తుల పొగాకు రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన పొగాకు బోర్డు ఏం చేస్తోందని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. రైతుల నుంచి వందలాది కోట్ల రూపాయలు సెస్ చేయడమేనా బోర్డుపని అని నిలదీశారు. కేంద్రానికి కోట్లాది రూపాయల విదేశీమారక ద్రవ్యం తీసుకొస్తున్న పొగాకు రైతుల పట్ల నిర్లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పనికిరాదని హితవు పలికారు. ఈ నిరసన దీక్షలో రైతు నాయకులు రాయపాటి అంకయ్య, బొడ్డు కోటేశ్వరరావు, విజయ భాస్కర్రెడ్డి, చింతపల్లి హరి, సుల్తాన్, బి.కోటేశ్వరరావు, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ దీక్షలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవ ప్రసాద్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బంగారు బాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కొత్తపట్నం మండలాధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు పార్టీ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, సంతనూతలపాడు పార్టీ మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహగౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రా రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, వైఎస్సార్ సీపీ నాయకులు సీఎం వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ గోనుగుంట్ల రజనీ, గాయం సావిత్రి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, కిరీటి, దాసరి కరుణాకర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, రాష్ట్ర నాయకులు క్రాంతి కుమార్, ఖాదర్ బాషా, పోలవరపు శ్రీమన్నారాయణ, మలిశెట్టి దేవా, మీరావలి, వెంకటేశ్వర్లు, గున్నా అమర్, గౌతం అశోక్, సన్నీ, శ్రీకాంత్, శోభాలత, షేక్ రషీద, ధర్నాసి హరిబాబు, పమిడి వెంకటేశ్వర్లు, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.మీ తాత సొమ్ము ఇస్తున్నావా చంద్రబాబు: బూచేపల్లి పొగాకు రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లు మంజూరు చేయడం లేదని, రైతులకు మీ తాత సొమ్ము ఇస్తున్నారా అని దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. పొగాకు సాగుకు బ్యారన్కు లక్షలాది రూపాయల ఖర్చు వస్తుందని, క్వింటా రూ.20 వేలకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం అన్యాయమన్నారు. క్వింటా పొగాకు రూ.20 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినా అధికారులు, కంపెనీలు బేఖాతరు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదంటే ఆ పదవికి చంద్రబాబు అనర్హుడని తేల్చి చెప్పారు. జగనన్న పాలనలో క్వింటా రూ.36 వేలకు కొనుగోలు చేశారని, పొగాకు రైతులు ఎంతో ప్రయోజనం పొందారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు మద్దతుగా నిలబడితే రైతులను రెచ్చగొడుతున్నారని కూటమి పాలకులు విమర్శలు చేయడం దారుణమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పొగాకు రైతులకు అండగా నిలబడతానని, అవసరమైతే జిల్లాకు జగన్ను తీసుకొస్తామని చెప్పారు. మా కుటుంబంపై అక్రమ కేసులు: బూచేపల్లి వెంకాయమ్మ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బూచేపల్లి కుటుంబం మీద అక్రమంగా కేసులు బనాయించడం మామూలై పోయిందని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, మహానేత వైఎస్ కుటుంబంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగనన్న దమ్మున్న సీఎంగా పేరు తెచ్చుకున్నారన్నారు. పొగాకు రైతుల కోసం వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. -
పోర్టు ప్రైవేటీకరణను నిలిపేయాలి
కందుకూరు: రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.4,929 కోట్ల ఖర్చుతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు పోర్టు పనులు పూర్తి చేశారన్నారు. పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారని, దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాటు పోర్టు పనులను మూలనపడేసిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి చేసి పోర్టును ప్రారంభించలేకపోయారని ఆరోపించారు రూ.5 వేల కోట్లు విలువ చేసే పోర్టును కేవలం రూ.1500 కోట్లకు కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏపీ మారిటైం బోర్డు బిడ్లు పిలవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని, పోర్టు నిర్మాణానికి తీసుకున్న రూ.2079 కోట్లను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. రూ.1కే లీజు: ప్రైవేట్పరం చేసేందుకు జారీ చేసిన టెండర్లలో పెట్టిన నిబంధనలు దారుణంగా ఉన్నాయని, రెండో దశలో పోర్టు అభివృద్ధికి కేవలం రూ.1కే లీజు అప్పగించడం, పోర్టులో ప్రభుత్వ ఈక్విడిటీ కేవలం 12 శాతం మాత్రమే ఉండడం దారుణమని బుర్రా మండిపడ్డారు. ఇప్పటికే బీపీసీఎల్ కంపెనీ పోర్టులో ఒక బెర్తును రిజర్వ్ చేసుకుందని, మరోపక్క పోర్టు పక్కనే ఇండోసోల్ పరిశ్రమ భారీ సోలార్ ప్యానల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి కీలకమైన పోర్టు పరిధిని తగ్గించి, విస్తరణ, నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వెనుక ఎంత దారుణమైన కుట్ర దాగి ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే గారు.. ప్రజలకు వాస్తవాలు చెప్పండి రామాయపట్నం పోర్టు విషయంలో వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలను వల్లె వేస్తూ నియోజకవర్గ ప్రజలను వంచించే ప్రయత్నం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేస్తున్నారని బుర్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్న రీతిలో మాట్లాడుతున్నారని, పీపీపీ పేరుతో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం సరైనదా అని ప్రశ్నించారు. ఒకపక్క నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన పోర్టును ప్రైవేట్పరం చేస్తుంటే ఎమ్మెల్యే తాడేపల్లిలో ప్రెస్మీట్ పెట్టి ప్రైవేట్కరణను స్వాగతించడం సిగ్గుచేటన్నారు. దీని వల్ల పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలతో పాటు, నిరుద్యోగ యువత ఆశలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేట్పరం చేయడం వల్ల స్థానిక నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇప్పటికై నా నిజాలు తెలుసుకుని ప్రజల పక్షాన నిలబడేందుకు కృషి చేయాలని హితవు పలికారు. పోర్టు ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడుతున్నామని, ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, జిల్లా సెక్రటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ జాయింట్ సెక్రటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, జిల్లా ఇంటెలెక్చువల్ పోరం అధ్యక్షుడు రావులకొల్లు బ్రహ్మానందం, వలేటివారిపాలెం, ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం మండలాల అధ్యక్షులు అనుమోలు లక్ష్మీనరశింహం, నన్నం పోతురాజు, కాపులూరి క్రిష్ణ, నోటి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు నలమోతు చంద్రమౌళి, బద్దిపూడి జయరావు, వెలిచర్ల దనకోటేశ్వరరావు, పాలవల్లి అమర్నాధ్రెడ్డి, గేరా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెడ్బుక్’ రాజ్యాంగంతో చంద్రబాబు అరాచకం
మార్కాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘రెడ్బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. సివిల్ వివాదంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అడ్డగోలుగా హత్యాయత్నం కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గమన్నారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు పోలీసుల అక్రమ కేసుల కారణంగా అరెస్టయి, మార్కాపురం జిల్లా కోర్టుకు గురువారం రాత్రి హాజరైన బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయతీ హనుమాన్ జంక్షన్ కుంట వద్ద 25 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 71 సెంట్ల స్థలంలో వైఎస్సార్సీపీ నేతలు దుద్దేల వెంకటరెడ్డి, భవనం వెంకటరెడ్డి తదితరులు గదులు నిర్మించారని పేర్కొన్నారు. ఇటీవల ఈ స్థలంపై దుగ్గెంపూడి పిచ్చిరెడ్డి అల్లుళ్లు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఖాతరు చేయకుండా ప్రత్యర్థులు నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకోని పోలీసులు.. తమ సొంత స్థలంలోకి వెళ్లిన వెంకటరెడ్డి సహా 9 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ‘డ్రోన్ కెమెరాల విజువల్స్ చూసి హత్యాయత్నం కేసులు ఎలా పెడతారు? రెడ్బుక్ అమలు అంటే రక్తాన్ని పారించడమా? సివిల్ పంచాయతీలను పరిష్కరించేందుకు కోర్టులున్నాయి. కానీ లా అండ్ ఆర్డర్ను అధికార పార్టీ నాయకులు తమ సొంత అవసరాలకు వాడుకుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుంది?’ అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ పోలీసులను నిలదీశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఒక ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడం వారి దమననీతికి నిదర్శనమన్నారు. ఈ వ్యవహారంలో ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని, తప్పుడు కేసులు బనాయించిన అధికారులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్యాయంగా ప్రవర్తించిన అధికారులను న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దారవీడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. సొంత స్థలంలోకి వెళ్తే వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నం కేసులా? పోలీసుల తీరుపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం అక్రమ కేసులపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక -
20లోగా ఎన్పీసీఐ లింకేజ్ తప్పనిసరి
ఒంగోలు వన్టౌన్: పదో తరగతి పాసై ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులు జమకానున్నాయని, ఇందుకు విద్యార్థులు తమ బ్యాంకు లేదా పోస్టల్ ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్, ఎన్పీసీఐ అనుసంధానం చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్.లక్ష్మానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా కాపీని గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అందజేసి ఎన్పీసీఐ పోర్టల్లో మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కానివారు వెంటనే పోస్టాఫీసులో కొత్త ఖాతా తెరిచి.. ఈ నెల 20లోగా ఎన్పీసీఐ అనుసంధానం పూర్తి చేసుకోవాలని సూచించారు. ● ఇన్చార్జి జేడీఏ బాలాజీనాయక్ మార్కాపురం: జిల్లాలో ఎరువుల పంపిణీ, అక్రమాల నియంత్రణకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి జిల్లా వ్యవసాయాధికారి బాలాజీ నాయక్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 21 మండలాలకు చెందిన రైతులు ఎరువుల సమస్యలపై 92810 65282 టోల్ఫ్రీ నంబర్కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జూన్ 8వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే), ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా, డీఏపీ ఎరువులను తప్పనిసరిగా యాప్ ద్వారానే పంపిణీ చేస్తారని స్పష్టం చేశారు. రైతులు సాగు చేసిన పంట ఆధారంగా, శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే ఎరువులు అందజేస్తామన్నారు. వ్యాపారులు ఎరువులు ఇవ్వకపోయినా, అధిక ధరలకు విక్రయించినా, ఇతర మందులు కొనాలని బలవంతపెట్టినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఆర్ఎస్కేలలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. వివరాలకు స్థానిక వ్యవసాయ అధికారి లేదా ఆర్ఎస్కే సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. సింగరాయకొండ: మండలంలోని పాకల రైల్వేగేటు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి(45) దుర్మరణం పాలయ్యాడు. ఒంగోలు జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు వెళ్తున్న షాలిమార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి ఒంటిపై, చేతిపై ’కుసుమ’ అనే పచ్చబొట్లు ఉన్నాయి. గులాబీ, బ్లూ, తెలుపు రంగుల అడ్డపట్టీల కాలర్ టీషర్టు, నిలువు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వివరాలు తెలిసిన వారు 9247575632 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. సీఎస్పురం: మండలంలోని కోవిలంపాడు వద్ద 167బీ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు బోల్తాపడిన ఘటనలో ఓ ప్రధానోపాధ్యాయుడికి గాయాలయ్యాయి. పామూరుకు చెందిన బైరెడ్డి వెంగళరెడ్డి డీజీపేట ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని కారులో తిరిగి వెళ్తుండగా కోవిలంపాడు వద్ద ఒక్కసారిగా పిల్లలు అడ్డువచ్చారు. వారిని తప్పించే క్రమంలో కారును పక్కకు తిప్పగా ఫుట్పాత్ను ఢీకొట్టి, ముందు టైరు పేలి రోడ్డుపై బోల్తా కొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయనకు తల, ఛాతీకి గాయాలు కాగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి పామూరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఒంగోలు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సీఎస్పురం ఎస్సై పి.వెంకటేశ్వరరెడ్డి పరిశీలించి విచారణ చేపట్టారు. ● రూ.1.30 లక్షల నగదు, 7 బైక్లు స్వాధీనం జరుగుమల్లి(సింగరాయకొండ): మండలంలోని నందనవనం గ్రామ పంచాయతీ పరిధిలోని పొలాల్లో గురువారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై భాగ్యరాజ్ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. నిందితుల నుంచి రూ.1,30,200 నగదు, 7 బైక్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. -
మంత్రి గారి ఊరు.. దళితులకివ్వరా నీరు!
టంగుటూరు: రాష్ట్రంలో కూటమి సర్కారు వివక్షాపూరిత పాలనకు ఈ ఘటనే సజీవ సాక్ష్యం. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి స్వామి స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో ఎస్సీ, ఎస్టీలు గుక్కెడు మంచినీటి కోసం అలమటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ కాలనీలపై చిన్నచూపు చూస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దళితులు మండిపడుతున్నారు. మంత్రి స్వామి తన సొంత గృహానికి రామతీర్థం జలాశయం నుంచి ఏకంగా 4 అంగుళాల పైపుతో భారీ పైప్లైన్ వేయించుకుని జలకళ ఉట్టిపడేలా చేసుకున్నారు. కానీ, పక్కనే ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మాత్రం ఆరు నెలల క్రితం కేవలం పైపులు వేసి చేతులు దులుపుకొన్నారు. ఎప్పుడో అడపాదడపా మొక్కుబడిగా నీళ్లు వదులుతూ పక్షపాత బుద్ధిని చాటుకుంటున్నారు. మంత్రిగారి ఇంటికి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? అని కాలనీవాసులు నిలదీస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని తాము, చేతి చమురు వదిలించుకుంటూ ట్యాంకర్లతో నీరు కొనుక్కునే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరిచి తమ దాహార్తి తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
అనుమతిచ్చారు.. కొనడం మరిచారు!
ఒంగోలు టౌన్: మూడు నెలలుగా గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పొగాకు రైతులు చేస్తున్న ఆందోళన.. ధర్మాగ్రహమని వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 మిలియన్ కేజీల పొగాకు సాగుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. అనుమతిచ్చిన మేరకైనా పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పొగాకు రైతు నిరసన దీక్ష జరిగింది. పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అధ్యక్షత వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తదితరులు ప్రసంగిస్తూ, ‘పోలీసులు అనుమతివ్వకపోయినా ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నాకు వేలాది మంది తరలిరావడం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. ఆక్వారంగంసహా రాష్ట్రంలో రైతులందరూ గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమరావతి పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటే..చంద్రబాబు ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు దద్దరిల్లాయి. నిరసన దీక్షలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్లు కె.నాగార్జునరెడ్డి, దద్దాల నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఐదు పంటల పేర్లు చెప్పగలిగితే.. రాజకీయాలకు గుడ్బై: లోకేశ్కు కాకాణి సవాల్ ‘మంత్రి లోకేశ్కు సవాల్ విసురుతున్నా.. నేను ఐదు రకాల పంటలు చూపిస్తా. వాటి పేర్లు లోకేశ్ చెప్పగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. కనీసం పంటల పేర్లు కూడా తెలియని లోకేశ్ లాంటి వారు వ్యవసాయం గురించి మాట్లాడటం సరికాదని ఎద్దేవా చేశారు. రైతులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తే, దీనిని ఎత్తివేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులను కష్టాల కడలిలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
మాకొద్దు బాబోయ్ ఈ మధ్యాహ్న భోజనం
అర్ధవీడు: మార్కాపురం జిల్లా అర్ధవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన మధ్యాహ్న భోజన నాణ్యతను తేటతెల్లం చేసింది. మెనూ ప్రకారం విద్యార్థులకు శుక్రవారం వెజిటబుల్ రైస్, బంగాళాదుంప కుర్మా, కోడిగుడ్డు ఇవ్వాలి. కానీ, పురుగులు పడిన నాసిరకం బియ్యంతో వండిన అన్నం, టమాటా కర్రీ, కుళ్లిన కోడిగుడ్లు వడ్డించారు. ఆ దుర్వాసన భరించలేక, అన్నంలో పురుగులను చూసిన విద్యార్థులు ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు. -
‘లోకేష్ కరెక్ట్గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’
ప్రకాశం: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. లోకేష్కు ఐదు వ్యవసాయం మొక్కలు చూపిస్తానని, ఆ మొక్కల పేర్లు ఆయన కరెక్ట్గా చెప్తే తాను రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని చాలెంజ్ చేశారు. ఇది తాను ఒంగోలు నుండి లోకేష్కి విసురుతున్న సవాల్ అన్నారు కాకాణి.రాష్ట్రానికి ఆదాయవనరులు జగన్ సమకూరిస్తే వాటిని చంద్రబాబు అమ్ముతున్నాడు. చంద్రబాబు రైతులకు అండగా ఉండడు. గ్రావెల్లో అవినీతి, దగా డిఎస్సీలో అవినీతి.. ఇలా ప్రతి దానిలో అవినీతి. అవినీతికి కాదేది అనర్హం అనే విధంగా కూటమి ప్రభుత్వం దోచుకొంటుంది. ప్రజల సొమ్ముని ప్రయివేటు పరం చేస్తూ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు లోకేష్లకు దోచుకోవడమే పరమావధి. ప్రతిష్టాత్మక రామాయపట్నం పోర్ట్ని ప్రయివేట్ పరం చేసేశారు’ అని ధ్వజమెత్తారు కాకాణి. -
వివాహేతర సంబంధం.. ప్రియుడిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య!
ప్రకాశం, సంతమాగులూరు(అద్దంకి): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని మహిళ కుమారుడు రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన సంతమాగులూరు మండలం పాతమాగులూరులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతమాగులూరుకు చెందిన సజ్జల పిచ్చిరెడ్డి (47) వ్యవసాయం చేస్తుంటాడు.ఆయనకు భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పిచ్చిరెడ్డికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ కుమారుడు విష్ణువర్ధన్ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి చైన్నె నుంచి వచ్చిన విష్ణు నేరుగా ఇంటికి వెళ్లాడు. అప్పటికే తన ఇంట్లో ఉన్న పిచ్చిరెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విష్ణును గమనించిన పిచ్చిరెడ్డి భయంతో బయటకు పరుగులు తీశాడు. అయితే, అతన్ని వెంబడించిన విష్ణువర్ధన్ ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టడంతో పిచ్చిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.బుధవారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పిన భర్త తిరిగి రాకపోవడంతో.. ఆ మహిళ ఇంటికే వెళ్లి ఉంటాడని భార్య అనూష భావించింది. గురువారం ఉదయం భర్త హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. తన భర్తను సదరు మహిళ కుమారుడే హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతమాగులూరు సీఐ శేషగిరిరావు సమాచారంతో దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.లొంగిపోయిన నిందితుడుహత్యకు పాల్పడిన విష్ణువర్ధన్ తన తల్లితో కలిసి వెళ్లి అద్దంకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గతంలోనే వీరి సంబంధం గురించి తెలుసుకున్న విష్ణువర్ధన్.. తమ ఇంటికి రావొద్దని పిచ్చిరెడ్డిని తీవ్రంగా హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు.ఉలిక్కిపడ్డ మండల వాసులుఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు ఉన్న పాతమాగులూరులో ఉదయాన్నే హత్య వార్త దావానలంలా వ్యాపించింది. ఏ రాజకీయ హత్య జరిగిందోనని మండల ప్రజలు తొలుత తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, హత్యకు దారితీసిన అసలు కారణం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
నిమ్మ రైతు కంట కన్నీటి చెమ్మ
● ఎల్నినో ప్రభావంతో నిలువునా ఎండుతున్న తోటలు ● చేసేదేమీ లేక చెట్లను నరికేస్తున్న రైతులుకొనకనమిట్ల: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. వానలు లేక, ఎండల తీవ్రతకు కొనకనమిట్ల మండలంలో నిమ్మతోటలు నిలువునా ఎండిపోతున్నాయి. చినారికట్ల తదితర గ్రామాల్లో రైతులు సుమారు 600 ఎకరాల్లో నిమ్మ సాగు చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తోటలకు సరిపడా నీరు అందకపోవడంతో పచ్చని చెట్లు మాడిపోతున్నాయి. కళ్లెదుటే కాయలు కాసే చెట్లు ఎండిపోతుండటంతో కన్నీరు దిగమింగుకుంటూ రైతులు వాటిని గొడ్డలితో నరికేస్తున్నారు. తక్షణమే సకాలంలో వర్షాలు కురవకపోతే మిగిలిన తోటలకూ గొడ్డలివేటు తప్పదని, ఈ ఏడాది పెట్టుబడులు కూడా దక్కవని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.2 కోట్ల గోల్మాల్.. దొడ్డవరం పీఏసీఎస్ కార్యదర్శిపై వేటు
● సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన డీసీఓ శ్రీనివాసరావు మద్దిపాడు: మండలంలోని దొడ్డవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో భారీ కుంభకోణంలో బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. సంఘంలో సుమారు రూ.4 కోట్ల మేర నిధుల అవకతవకలు జరిగాయంటూ ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ (డీసీఓ) శ్రీనివాసరావు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. రూ.2 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆయన నిర్ధారించారు. దీంతో నిధుల గోల్మాల్కు బాధ్యురాలిగా చేస్తూ పీఏసీఎస్ కార్యదర్శి కె. శ్రీవాణిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, ఆమైపె కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పాలకవర్గ కమిటీ సభ్యులకు డీసీఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే పీఏసీఎస్ కమిటీ సభ్యులు సమావేశమై.. సస్పెన్షన్కు గురైన కార్యదర్శిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ● సచివాలయ సేవల వల్లే మేదరమెట్లకు ఐఎస్ఓ గుర్తింపు మేదరమెట్ల: వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తోంది. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించడంలో మెరుగైన పనితీరు కనబరిచిన మేదరమెట్ల పంచాయతీ ప్రతిష్టాత్మక ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ను కై వసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న 23 పంచాయతీల్లో మేదరమెట్ల ఒకటి కావడం విశేషం. పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, అర్జీల పరిష్కారంలో చూపిన ప్రతిభకుగాను బుధవారం గ్రామ కార్యదర్శి లక్ష్మీకాంత్ రాష్ట్ర రాజధానిలో ఈ సర్టిఫికెట్ అందుకున్నారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఈ ఘనత సాధ్యమైందని మాజీ సర్పంచ్ బొనిగల ఎలీశమ్మ పేర్కొన్నారు. ‘జగనన్న నాటిన సచివాలయ వ్యవస్థ అనే విత్తనం నేడు పారదర్శక సేవలనే ఫలాలను ఇస్తోంది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ భద్రారెడ్డి సహకారంతోనే ఈ స్థాయికి చేరాం. ప్రభుత్వం మారినా సచివాలయాల కృషికి ప్రతిష్టాత్మక ఐఎస్ఓ గుర్తింపు రావడం ఎంతో గర్వకారణం’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
చినుకు రాలక.. మొక్క కదలక..
● వన నర్సరీల్లో నిరుపయోగంగా 4 లక్షల మొక్కలు హనుమంతునిపాడు: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు పచ్చదనానికి గొడ్డలిపెట్టుగా మారాయి. వానలు ముఖం చాటేయడంతో హనుమంతునిపాడు, హాజీపురం అటవీ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచిన సుమారు 4 లక్షల మొక్కలు పంపిణీకి నోచుకోక అక్కడే ఉండిపోయాయి. నర్సరీల్లో ఎర్రచందనం, టేకు, నేరేడు, మామిడి తదితర పండ్ల, అటవీ జాతి మొక్కలను లక్షలు వెచ్చించి పెంచారు. వర్షాలు లేకపోవడంతో పొలం గట్లు, కుంటలు, రోడ్లకిరువైపులా నాటాల్సిన ఈ మొక్కలన్నీ నర్సరీలకే పరిమితమయ్యాయి. సమయం మించిపోతుండటంతో మొక్కలు పరిమితికి మించి పెరిగిపోతున్నాయి. వాటిని మరో కవర్లోకి మార్చి పెట్టే క్రమంలో వాడిపోతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. -
కౌలు రైతులకు అవగాహన కల్పించాలి
ఒంగోలు సబర్బన్: కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, హక్కులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులకు సూచించారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్ఎస్) వారు కౌలు రైతుల కోసం రూపొందించిన ప్రచార కరపత్రాలను తన చాంబర్లో గురువారం జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కౌలు రైతులు తమ హక్కులు తెలుసుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు పంట రుణాలు, పంటల బీమా, సాగు ధ్రువీకరణ పత్రాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కో–ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, దర్శి ఏరియా కో–ఆర్డినేటర్ గుంటూరు నాగమణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి బిళ్ల శరత్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: వార్డు సచివాలయాల్లో స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు రికార్డులు పక్కాగా ఉండాలని సంబంధిత విభాగం జిల్లా అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పీర్లమాన్యంలో స్వర్ణ వార్డు కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. పలు అంశాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన ఎస్ఈడీ డేటా వెరిఫికేషన్ను పరిశీలించారు. ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. స్పెషల్ ఆధార్ క్యాంపు పరిశీలన... ఒంగోలు నగరంలోని ఏకేవీకే కాలేజీలో నిర్వహిస్తున్న స్పెషల్ ఆధార్ క్యాంపును కూడా గురువారం వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆధార్ క్యాంపులో ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ ఆధార్ క్యాంపులో ఫేజ్ – 2 కింద జూలై 21 నుంచి 24వ తేదీ వరకు పేర్లలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడం, ఎంబీయూ అప్డేట్, పుట్టిన తేదీ కరెక్షన్స్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రత్యేకంగా స్కూలు, కాలేజీ విద్యార్థులు ఇలాంటి పొరపాట్లు ఉంటే ప్రత్యేక ఆధార్ సెంటర్కు వచ్చి సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒంగోలు సిటీ: రోల్బాల్ జిల్లా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ సింగరాయకొండలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా రోల్బాల్ సెక్రటరీ కె.అనీల్కుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11, అండర్–14, అండర్–17, ఆపై విభాగాల్లో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు అదేరోజు ఉదయం 8.30 గంటలకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు 9100553717 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు వన్టౌన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ స్పెషల్ లోక్ అదాలత్లు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్వీ రామకృష్ణ తెలిపారు. ఒంగోలులోని జిల్లా న్యాయస్థానం ఆవరణలోని బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులతో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్పెషల్ లోక్ అదాలత్లలో ఎక్కువ సంఖ్యలో చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రమేష్బాబు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
4 సవర్ల బంగారం చోరీ
బల్లికురవ: మండలంలో వరుస చోరీలతో ప్రజలు, రైతులు బెంబేలెత్తుతున్నారు. బుధవారం అర్ధరాత్రి అంబడిపూడి గ్రామంలోని వల్లపు వెంకటేశ్వర్లు ఇంటి వెనుక భాగం నుంచి దొంగలు ప్రవేశించి బీరువాలో ఉంచిన సుమారు 4 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. బీరువాలో బట్టలు చెల్లాచెదురుగా పడేశారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు గురువారం ఉదయం తలుపులు తీయగా చోరీ జరిగినట్లు గుర్తించారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లు పరిశీలించి ఆధారాలు సేకరించాయి. వారం రోజుల్లోపు మండలంలోని వల్లాపల్లి, నక్కబొక్కలపాడు, కొణిదెన గ్రామాల పొలాల్లోని వ్యవసాయ బోర్లకు అమర్చిన సుమారు 30 మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే వైర్ల చోరీకి పాల్పడ్డారు. బొర్ల కింద సాగు చేసిన పంటలు కాపాడుకొనేందుకు తిరిగి అమర్చుకుంటున్నా దొంగలు తమ పని తాము చేసుకెళ్తున్నారు. ముండ్లమూరు: ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ముండ్లమూరు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పులిపాడు గ్రామానికి చెందిన గంగవరపు బాలకోటయ్య కుమారుడు కాశింబాబు (21) రెండు నెలలుగా ముండ్లమూరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ పులిపాడు నుంచి వచ్చి వ్యాపారం చూసుకుని రాత్రికి తిరిగి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో షాపు మూసివేసి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అద్దంకి–దర్శి ప్రధాన రహదారిపై ముండ్లమూరు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే, పక్కనే ఉన్న పొలాల్లోంచి మెయిన్ రోడ్డు పైకి వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ (ఏపీ 26 టీటీ 4192) కాశింబాబు బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి తండ్రి బాలకోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జరుగుమల్లి (సింగరాయకొండ): ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన జరుగుమల్లి మండల పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.బిట్రగుంట గ్రామానికి చెందిన తాతపూడి ఏసురత్నం(48) గొర్రెలు మేపుకుంటూ సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. అదే సమయంలో విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న మెము రైలును అతడు గమనించలేదు. రైలు బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఏసురత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏసురత్నం మృతితో స్థానిక ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అక్రమార్కులకే పట్టాభిషేకం!
లోకాయుక్త ఆదేశాలు బేఖాతర్.. కురిచేడు: పేదలకు దక్కాల్సిన సాగుభూమి భూబకాసురుల పాలవుతోంది. అధికార పాలకుల అండదండలు, రెవెన్యూ అధికారుల కాసుల కక్కుర్తి తోడై సర్కారు భూములకు రెక్కలొస్తున్నాయి. కంచే చేను మేసిన చందంగా.. రక్షణ కల్పించాల్సిన అధికారులే అసైన్డ్ (డీకేటీ) భూములను అడ్డగోలుగా ఆన్లైన్ చేస్తూ అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. లోకాయుక్త కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ.. కురిచేడు మండలంలో సాగుతున్న ఈ అవినీతి బాగోతం విస్మయం కలిగిస్తోంది. పర్వతం లాంటి ఈ భూదోపిడీలో కిందిస్థాయి అధికారులను బలిచేసి.. అసలు సూత్రధారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. రికార్డుల మాయాజాలం ఇలా.. మండలంలోని పొట్లపాడు గ్రామంలో పాత సర్వే నంబరు 22ను విభజించి 619 నుంచి 663 వరకు కొత్త నంబర్లు ఇచ్చారు. అలాగే పాత సర్వే నంబరు 99ను విభజించి మరికొన్ని సర్వే నంబర్లుగా సబ్ డివిజన్ చేశారు. వీటితో పాటు సర్వే నంబర్లు 81, 85, 87లో ప్రభుత్వ గయాళు భూమి ఉంది. ఇందులో గతంలో కొందరు పేదలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. చట్టప్రకారం ఈ భూములను అమ్మడానికి వీల్లేదు. కానీ, నిబంధనలకు పాతరేసి ఈ భూమి మొత్తాన్ని అక్రమార్కుల పేరిట ‘కొనుగోలు ద్వారా సంక్రమించినట్లు’ ఆన్లైన్ చేసేశారు. ఖాతా నంబరు 1199తో నీలకంఠన్ ప్రభాకరన్ పేరిట 17 సర్వే నంబర్లలో ఏకంగా 42.70 ఎకరాలు, ఖాతా నంబరు 1200తో చింతా వెంకటేశ్వరరావు పేరిట మరో 17 సర్వే నంబర్లలో 38.69 ఎకరాలను ఆన్లైన్ చేసి అధికారికంగా భూకబ్జాకు తెరతీశారు. తహసీల్దార్పై వేటు.. అసలు దొంగలకు రక్షణ ఈ భారీ కుంభకోణంపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కంటితుడుపు చర్యగా అప్పటి తహసీల్దార్ వరకుమార్ను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ భూమిని ఆన్లైన్ నుంచి తొలగించాలని, అది ప్రభుత్వ భూమి అని, ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూమి వద్ద రెవెన్యూ అధికారులు ఓ హెచ్చరిక బోర్డు కూడా పాతారు. కానీ లోపాయికారీ ఒప్పందాలతో కథ వేరేలా నడిచింది. చింతా వెంకటేశ్వరరావు పేరిట ఉన్న 38.69 ఎకరాల్లో.. సర్వే నంబరు 631–2లో 3.48 ఎకరాలు, 635–1లో 4.82 ఎకరాలు (మొత్తం 8.30 ఎకరాలు) రికార్డుల్లో అలాగే ఉంచి, మిగతాది మాత్రమే ఆన్లైన్లో తొలగించారు. ఇక నీలకంఠన్ ప్రభాకరన్ పేరిట ఉన్న 42.70 ఎకరాల భూమిని నేటికీ ఆన్లైన్ నుంచి తొలగించకపోవడం రెవెన్యూ అధికారుల బరితెగింపునకు నిదర్శనం. కోర్టు ఆదేశాలు ధిక్కరించి.. ఈ భూదోపిడీపై ఆ గ్రామానికి చెందిన ఓ రైతు ఏపీ లోకాయుక్తను ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. జిల్లా రెవెన్యూ అధికారులు వాటిని బుట్టదాఖలు చేశారు. ఆక్రమణదారులు మళ్లీ ఆ భూమిని దున్ని చదును చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు చోద్యం చూడటమే అందుకు నిదర్శనం. పైగా అది సర్వే నంబర్ 87 లోనిదని, పేదలు విక్రయించుకున్నారంటూ కబ్జాదారులకే వత్తాసు పలకడం వారి అనైతికతను స్పష్టం చేస్తోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి.. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాలకుల అండతో పేదల భూములను స్వాహా చేస్తున్న కబ్జాకోరుల నుంచి సర్కారు భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేదల అసైన్డ్ భూములు స్వాహా.. పాలకుల అండతో రెవెన్యూ లీలలు చేతులు మారుతున్న లక్షల రూపాయలు.. అందినకాడికి దండుకుంటున్న అధికారులు కురిచేడు మండలంలో పేట్రేగిపోతున్న భూబకాసురులు -
బావిలో జారిపడి విలేకరి మృతి
సంతనూతలపాడు (చీమకుర్తి): బావి ఒడ్డుపై కూర్చొని ఉన్న ప్రజాశక్తి విలేకరి కందుల వెంకట కృష్ణప్రసాద్ (60) ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన సంతనూతలపాడులో గురువారం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్బాబులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కామేపల్లివారిపాలెంలో నివాసం ఉంటున్న ప్రసాద్ మరణాన్ని కుటుంబ సభ్యులతో పాటు మీడియా మిత్రలు జీర్ణించుకోలేకపోతున్నారు. భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. బైక్ దొంగల ముఠా అరెస్టు ● రూ.15 లక్షల విలువైన 15 మోటార్ సైకిళ్ల స్వాధీనం ● నిందితుల్లో ఇద్దరు యువకులు, ఒక బాలుడు ● వివరాలు వెల్లడించిన చీమకుర్తి సీఐ, ఎస్సై చీమకుర్తి: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను చీమకుర్తి శివారు ప్రాంతంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ డి.ప్రసాద్, ఎస్సై ఎల్.సంపత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఇంకొల్లు పోలిరెడ్డి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన తన టీవీఎస్ రేడాన్ బైక్ను ఇంటి ముందు ఉంచగా చోరీకి గురైంది. దీనిపై ఆయన ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాహనాల చోరీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం అనుమానాస్పదంగా కనిపించిన మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన దేవరకొండ దినేష్ కుమార్, బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన కలుపుకూరి శరత్ బాబుతో పాటు మరో మైనర్ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల గుట్టు రట్టయింది. వీరి నుంచి రికవరీ చేసిన 15 బైకుల్లో.. చీమకుర్తికి చెందిన టీవీఎస్ రేడాన్, స్ప్లెండర్ ప్లస్, గ్లామర్, మార్టూరుకు చెందిన రెండు యూనికార్న్లు, టంగుటూరులో చోరీ చేసిన పల్సర్, శింగరాయకొండకు చెందిన యూనికార్న్, క్లాసిక్ ఉన్నాయి. అలాగే మద్దిపాడు ప్రాంతానికి చెందిన ప్యాషన్ ప్లస్, క్లాసిక్, రెండు సీబీ యూనికార్న్లు, బల్లికురవకు చెందిన గ్లామర్, దర్శికి చెందిన పల్సర్, గుంటూరు జిల్లా కొత్తపేట నుంచి అపహరించిన మరో పల్సర్ ఉన్నట్లు పోలీసులు వివరించారు. -
ప్రయాణికులకు చుక్కలు..!
బాబు సభకు బస్సులు.. ఒంగోలు టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించనున్న రుణమేళా సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులు కేటాయించారు. దీనిపై ప్రయాణికుల నుంచి, ముఖ్యంగా ఉచిత బస్సు లబ్ధిదారులైన మహిళా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల నుంచి మొత్తం 170 ఆర్టీసీ బస్సులను నరసరావుపేట తరలించినట్లు సమాచారం. అందుకోసం గురువారం మధ్యాహ్నం నుంచే బస్సులను డిపోలకు తరలించారు. దాంతో ఎక్కడికక్కడ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పల్లెవెలుగు బస్సులన్నీ నరసరావుపేటకే... ఒంగోలు డిపోలో మొత్తం 85 పల్లెవెలుగు బస్సులున్నాయి. అందులో 35 అద్దె బస్సులు కాగా, మిగిలిన 50 బస్సులు ఆర్టీసీకి చెందినవి. ఈ 50 బస్సుల్లో 40 బస్సులను నరసరావుపేట పర్యటనకు కేటాయించారు. గురువారం సాయంత్రం నరసరావుపేట అర్బన్లో ఒంగోలు ఆర్టీసీ డిపో బస్సులు రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అక్కడి నుంచి రాత్రికి రాత్రి పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాలకు బస్సులు పంపించి భారీగా జన సేకరణ చేయనున్నట్లు సమాచారం. ఒక్క ఒంగోలు నుంచే కాకుండా ప్రకాశం జిల్లాలోని కందుకూరు, అద్దంకి ఆర్టీసీ డిపోల నుంచి కూడా బస్సులు పంపించారు. అద్దంకి డిపో నుంచి 15 బస్సులు, కందుకూరు డిపో నుంచి 20 బస్సులు పంపించారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉండగా, మార్కాపురం డిపో నుంచి 35 బస్సులు, గిద్దలూరు డిపో నుంచి 20 బస్సులు, కనిగిరి డిపో నుంచి 30 బస్సులు, పొదిలి డిపో నుంచి 20 బస్సులను నరసరావుపేట తరలించినట్లు సమాచారం. దీంతో గురువారం సాయంత్రం నుంచి ఆయా డిపోల్లో పల్లెవెలుగు బస్సుల కోసం మహిళా ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. రెండుమూడు గంటలకో బస్సు వస్తుండటంతో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగి వారి మధ్య తోపులాటలు జరిగాయి. శుక్రవారం ప్రయాణం నరకమే... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 డిపోల నుంచి 170 బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో శుక్రవారం ప్రయాణం నరకంగా మారుతుందని ఆర్టీసీ ఉద్యోగులే చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదంటున్నారు. తిరిగి శనివారం ప్రయాణికులకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందిగానీ, దానికి తగినట్లు బస్సులు లేవు. తరచూ ఏదోక కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి సభలకు జనాలను తరలించడానికి పల్లెవెలుగు బస్సులు తరలిస్తుండటంపై ప్రజలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. -
తాళికట్టాకే దహన సంస్కారాలు చేయాలి
టంగుటూరు: ఎనిమిదేళ్ల ప్రేమ అనంతరం పెళ్లికి ప్రేమికుడు నిరాకరించడంతో ప్రేమికురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికుడి కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని, మృతదేహానికి అతడు తాళికట్టిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఘటనలు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సంచలనం కలిగించాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగళ్ల కీర్తి (24) ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఎనిమిదేళ్ల కిందట ఆమెకు సోషల్ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన పాపినేని సాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సాయి ఖతార్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు.సాయి ముంబై వచ్చి, కీర్తి ఖతార్ వెళ్లి తరచు కలుస్తుండేవారు. సాయికి అతడి కుటుంబసభ్యులు వారం కిందట పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తననే పెళ్లి చేసుకోవాలని సాయిని కోరింది. ఈ విషయమై ఇద్దరికి వివాదం జరిగింది. కీర్తి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారం కిందట తల్లిదండ్రుల వద్దకు వచ్చి సాయితో పెళ్లి చేయాలని, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని కోరింది. దీంతో వాళ్లు ఒంగోలులోని సాయి మేనత్త ఇంట్లో చర్చలు జరిపారు. అదే సమయంలో సాయి కూడా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేయడంతో వారు ఇంటికి వెళ్లి కీర్తికి నచ్చజెప్పి ముంబై పంపారు.తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి.. ఈ నెల 14న ముంబై నుంచి తన తల్లిదండ్రులకు కాన్ఫరెన్స్ కాల్ చేసింది. ఆ సమయంలో సాయి కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు. నా చావుకి కారణం సాయి అని చెబుతూ తాను ఉంటున్న హాస్టల్లో ఉరేసుకుని మృతిచెందింది. ఆమె కుటుంబసభ్యులు, సాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ వార్డెన్కు ఫోన్చేశారు. ఆమె గదికి వెళ్లి చూసేసరికి కీర్తి ఉరేసుకుంది. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సాయి ఖతార్కి పరారయ్యాడు. సాయి తల్లి పొందూరు నుంచి వెళ్లిపోయింది. మృతురాలి కుటుంబసభ్యుల ఆందోళన కీర్తి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ముంబై నుంచి నేరుగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. సాయి మోసం చేయడంతోనే కీర్తి ఆత్మహత్య చేసుకుందని, సాయితో తాళికట్టించి అతడితోనే పొందూరులో దహన సంస్కారాలు నిర్వహించాలని కీర్తి చివరి కోరిక అని ఆందోళనకు దిగారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పొందూరు చేరుకుని గ్రామస్తులు, సాయి కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. సాయి ఖతార్ నుంచి వచ్చి కీర్తికి తాళికట్టి అతడే దహన సంస్కారాలు చేయాలని కీర్తి తల్లిదండ్రులు పట్టుబట్టారు. సాయి ఖతార్ నుంచి రావడానికి సమయం పడుతుందని, తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని సాయి మేనమామ వేజెండ్ల గంగాధర్ వారికి నచ్చజెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం అందుకు కీర్తి తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో పొందూరులో అంత్యక్రియలు నిర్వహించారు. -
రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే..
కనిగిరి రూరల్: అన్నివిధాల తీవ్రంగా నష్టపోయిన రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకు రైతులకు మద్దతుగా మార్కాపురం జిల్లా కనిగిరిలో గురువారం పొగాకు రైతు దీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ దీక్షలో పెద్దఎత్తున పొగాకు రైతులు పాల్గొన్నారు. ఈ దీక్షలో కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రెండేళ్ల కూటమి పాలనలో మూడు పంటలు వచ్చాయని, ఒక్క పంటకూ బీమా చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ‘గొంతు విప్పి వాస్తవాలు మాట్లాడితే అక్రమ కేసులు పెడతారా? కుటుంబాలను జైల్లో పెడతారా? ఎన్నాళ్లు సాగుతుంది మీ అరాచక పాలన. మీరు ఏం చేసినా భయపడం.. ప్రజలకు అండగా నిలబడతాం.. వారి తరఫున పోరాటాలు చేస్తాం’ అని చెప్పారు. మీ హామీల గురించి మాట్లాడితే మా గొంతులు నొక్కేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటారని, రైతులకు అండగా నిలబడేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులు నాలుగు నెలలుగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. బడ్జెట్లో రైతుల కోసం రూ.వెయ్యికోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంతవరకు పోరాటాలు చేస్తామని చెప్పారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లివ్వని చంద్రబాబు రైతులకు ఏం మేలు చేస్తాడని విమర్శించారు. చేయిచేయి కలుపుదాం.. పొగాకు రైతు కోసం పోరాడదాం.. అని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున మాట్లాడారు. వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు కసుకుర్తి ఆదెన్న, కుందురు నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీబీ మాజీ చైర్మన్లు వై.ఎం.ప్రసాద్రెడ్డి (బన్నీ), డాక్టర్ వెంకయ్య, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
‘నేను భర్తగా భావించే సాయే నా అంత్యక్రియలు చేయాలి’
సాక్షి, ప్రకాశం: సోషల్ మీడియా పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తాను భర్తగా భావించిన వ్యక్తికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపినేని సాయి సుమంత్, కీర్తి అనే ఇద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సుమంత్ దుబాయ్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా, కీర్తి ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు.అయితే, కీర్తికి తెలియకుండా సుమంత్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయమై కీర్తి అతడిని నిలదీయగా.. సుమంత్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి ఆత్మహత్య చేసుకుంది. తనువు చాలించే ముందు ఆమె ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే సాయి సుమంత్ చేతుల మీదుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలన్నదే తన ఆఖరి కోరికని ఆ లేఖలో పేర్కొంది.కీర్తి మరణానంతరం ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి నివాసానికి తీసుకువచ్చారు. చనిపోయిన కీర్తి మెడలో సాయి తాళి కట్టాలని, ఆమె అంత్యక్రియలను అతడే జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో సాయి సుమంత్ తల్లిదండ్రులు కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించి, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు -
‘కూటిలో రాయి తియ్యలేనోడు.. ఏటిలో రాయి తీస్తాడా?’
ప్రకాశం: కుప్పంకి నీళ్లవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులకు మేలు చేస్తాడని అనుకోవడం మన భ్రమే అవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటిలో రాయి తియ్యలేనోడు.. ఏటిలో రాయి తీస్తాడా? అని ప్రశ్నించారు. అన్నం పెట్టిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు చంద్రశేఖర్. కుప్పానికి నీళ్లు ఇచ్చి రైతులల కళ్లలో ఆనందం నింపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. మత్సకారులు గల్లంతైతే ఆ కుటుంబాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పలకరించలేదని, పేదలంటే వారికి చిన్నచూపని విమర్శించారు. మహా మాయగాడు చంద్రబాబని, భారత దేశంలోనే చెప్పింది చేయకుండా.. మోసం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో మంచి జరగదని చంద్రశేఖర్ విమర్శించారు. -
టీడీపీ కార్యాలయంలో ప్రోటోకాల్ రగడ
యర్రగొండపాలెం: వేదికపై తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుగు తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. ఈ సంఘటన బుధవారం యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగింది. ప్రతి నెలా 3వ బుధవారం మండల స్థాయి సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలని టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఆయా మండలాల్లో తెలుగు తమ్ముళ్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాలకు వేళ్లపై లెక్కించే కార్యకర్తలు పాల్గొంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో అనుకున్న స్థాయిలో కార్యకర్తలు పాల్గొనలేదు. పుల్లలచెరువు మండల సమావేశం ముటుకుల గ్రామంలో శ్రీసర్శ్రీ బ్యానర్ తగిలించుకొని నిర్వహించారు. మండల కేంద్రంలో సమావేశం నిర్వహిస్తే టీడీపీలో ఉన్న వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడ బాహాబాహీకి దిగుతారోనన్న ఉద్దేశంతో ముటుకులలో సమావేశం నిర్వహించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. యర్రగొండపాలెం మండల పార్టీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమైన వెంటనే మండల స్థాయిలో నాయకత్వం వహిస్తున్న ఒక నాయకుడు లేచి సమావేశాల సమయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎవరంటే వారు వేదికలపై కూర్చొని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. వెంటనే మరో తెలుగు తమ్ముడు కలుగ చేసుకోవడంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వెనువెంటనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన గొడవ బయటికి రానీయకుండా నాయకులు జాగ్రత్తపడినా నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీ అధిష్టానానికి చేరిన రచ్చ టీడీపీ కార్యాలయంలో జరిగిన రచ్చ ఆ పార్టీ అధిష్టానానికి చేరింది. ఇక్కడ జరిగిన సంఘటన గురించి అధినాయకులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు సమాచారం. రచ్చ బహిరంగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో స్థానిక బస్టాండ్ సెంటర్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఉదయం పార్టీ కార్యాలయంలో ఇద్దరు తెలుగు తమ్ముళ్ల రగడ సాయంత్రానికి రచ్చకెక్కింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు బస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ రెండు వర్గాలకు నచ్చచెప్పే పనిలో పడ్డారు. సెంటర్లో ఏమాత్రం గొడవలు జరిగితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఎస్సై ఎం.దేవకుమార్ హెచ్చరించారు. ఎస్సై ఇరువర్గాలకు చెందిన నాయకులకు నచ్చచెప్పి వారిని బస్టాండ్ సెంటర్ నుంచి పంపించేశారు. -
నోబిడ్ పేరుతో సగ భాగం రిటన్
కనిగిరి టుబాకో యార్డు పరిధిలో గత వారం రోజులుగా జరుగుతున్న వేలాన్ని పరిశీలిస్తే.. ప్రతి రోజు రైతులు తెచ్చిన సగం బేళ్లు నోబిడ్ పేరుతో తిరస్కరిస్తున్నారు. సోమవారం సీతారాంపురం క్లస్టర్ రైతులు 450 బేళ్లు తెస్తే.. కేవలం 220 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. దాదాపు 230 బేళ్లను వెనక్కి పంపారు. కొనుగోలు చేసిన చెక్కుల్లో కూడా 30 శాతం మాత్రమే గరిష్ట ధర వేయగా.. దాదాపు అన్నింటికీ కనిష్ట ధర రూ.160 ధర ఇచ్చారు. దీంతో పొగాకు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాస్తవానికి పశ్చిమ ప్రకాశంలో పొగాకు ఏ గ్రేడ్ పొగాకు ఉత్పత్తి 50 శాతం కూడా మించదు. మిగిలిన పొగాకు ఇతర గ్రేడ్లు వస్తాయి. గ్రేడ్ 2,3 రకాలకు రూ.160లు మించి ఇవ్వటం లేదు. దీంతో సగటు ధర రూ.200లోపు దిగజారింది. ప్రస్తుతం వస్తున్న ధరలతో బ్యారన్కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పొగాకు రైతు దీక్షకు తరలి రండి
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున మద్దిపాడు: రైతన్నకు అండగా నిలుద్దాం పొగాకు రైతుల కోసం పోరాడదామని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17వ తేదీ శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించే రైతు దీక్షలో రైతు సంఘాల నాయకులు, పొగాకు రైతులు పాల్గొనాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన పొగాకు రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముద్రగడ మృతికి మేరుగు సంతాపం మద్దిపాడు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ముద్రగడ మృతి వార్త విన్న వెంటనే తాను దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఆయన మృతి విచారకరమని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. భార్య రాజీకి రావాలని.. ● పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం మార్కాపురం టౌన్: భార్య, భర్తల మధ్య గొడవల నేపథ్యంలో భార్య రాజీకి రావాలని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మార్కాపురం పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. గతంలో మార్కాపురం టౌన్ ఎస్ఐ వద్ద ప్రైవేటు డ్రైవర్గా పనిచేసిన షేక్ ఆరిఫ్కు తన భార్యతో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం భార్య తరఫు బంధువులు ఎస్కే ఆరిఫ్ ఇంటికి వచ్చి..ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందామన్నారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు తిట్టుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే తన భార్యతో పోలీసులు కేసు రాజీచేస్తారని భావించిన ఆరిఫ్ పోలీస్స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని లోపలికి వచ్చాడు. అది గమనించి పోలీసులు అతని ఒంటిపై దుస్తులు తొలగించారు. అయితే ఈ సంఘటనపై ఎస్సై విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా ఆరిఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ముద్రగడ మృతి తీరని లోటు
● ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేతల నివాళులు ఒంగోలు సిటీ: ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, దర్శి నియోజకవర్గ పరిశీలకుడు మాదాసి వెంకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం తన నిబద్ధత, ముక్కుసూటితనం, రాజీలేని పోరాట స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని స్మరించారు. ముద్రగడ మరణం ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడని, కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీలేని పోరాటం చేశారన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసినా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే సామాజికవర్గ హక్కులకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభమేనన్నారు. కార్యక్రమంలో అరిగా మల్లికార్జునరావు, కొణికి రోశయ్య, పాలడుగు శ్రీనివాసరావు, తోట బాబి (నవీన్), అడుసుమల్లి ప్రసన్న, మల్లిశెట్టి దేవా, హనుమంతరావు, పల్లపోతు వెంకయ్య, బండారు ప్రభాకర్, కాపు నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు !
పొగచూరిన రాష్ట్రంలో పొగాకు రైతుల కష్టాలు తీరడం లేదు. ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. సగటు ధర కిలోకి రూ.200 లోపే పలుకుతోంది. వేలం కేంద్రాల వద్ద తిరస్కరణలు(నోబిడ్) ఎక్కువగా ఉండడంతో రైతులు దిగాలు పడుతున్నారు. వేలం ప్రారంభమై దాదాపు 90 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పురాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. వేలం కేంద్రాల్లో అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నారు. -
నిధులివ్వకుండా..పనులెలా..?
ఒంగోలు సబర్బన్: నిధులివ్వకుండా ఉమ్మడి జిల్లాలో పనులు ఎలా జరుగుతాయని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. నిధుల లేమితో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ప్రకాశం భవన్లో బుధవారం జిల్లా రివ్యూ కమిటీ(డీఆర్సి) సమావేశం నిర్వహించారు. గతేడాది నవంబర్లో జరిగిన డీఆర్సీలో లేవనెత్తిన అనేక సమస్యలకు అధికారుల వద్ద సమాధానాలు లేకుండా పోయాయి. నిధులు విడుదల చేయకుండా పరిష్కారం ఏవిధంగా ఉంటుందన్నది ప్రతిపక్ష సభ్యుల వాదన. దానికి తోడు ఇన్చార్జ్ మంత్రి ఆనం మాత్రం సమావేశంలో కాకి లెక్కలు చెప్పి మ..మ అనిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత వెలిగొండకు రూ.2,900 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఆనం చెప్పటంతో ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా ఒకరిమొఖం ఒకరు చూసుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధికారులను ఇన్చార్జి మంత్రి ఆనం చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఉండవని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా అధికార పార్టీకి చెందిన నాయకులే సాగు నీటి చెరువులు, ప్రాజెక్టుల్లో ఉన్న చేపలు పట్టడానికి నీటిని బయటకు వదులుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆరోపించడం గమనార్హం. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు చేపలు పట్టుకునేందుకు చెరువులో నీళ్లు ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారని సమావేశంలో వాపోయారు. దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైతం గొంతుకలిపారు. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల్లో ఇలాంటి చర్యల వలన ఆయా చెరువుల్లో నీరు వృథా కావడంతో పాటు సమీప గ్రామాల్లోని భూగర్భ నీటిమట్టం కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కాపురం, పొదిలిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తినప్పుడు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేసిన వారికి రెండేళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మార్కాపురం ఎమ్మెల్యే ఆరోపించారు. సొంత డబ్బా కోసమే..: యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి ‘‘రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవటానికే డీఆర్సీ సమావేశం పెట్టారు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలోని సమస్యలను ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే ఆయన పట్టించుకోవడం లేదు’’ అంటూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పాల్సిన సమాధానం టీడీపీ ఎమ్మెల్యే చెప్పటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం గొంతు నొక్కటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి టీ–5 కాలువ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కాలువ నిర్మాణం ద్వారా మార్కాపురం జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అధికారులకు సీసీ రోడ్ల విషయంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. కనీసం మంచినీటి బోర్లకు మరమ్మతుల కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఎయిమ్స్కు బస్సు సౌకర్యం కల్పించాలని, మార్కాపురం జిల్లాలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెలిగొండ నుంచి చిన్న స్పెల్లింగ్ దోషాలతో 1150 మంది పరిహారం పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పక్కేమో వెలిగొండ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. -
ఎంత పనిచేశావయ్యా
● ఒక హత్య.. రైలు పట్టాలపై ముగిసిన నాలుగు ప్రాణాలు● ఏఓ హత్య కేసులో ఏ1 నిందితుడు భార్యా, పిల్లలతో ఆత్మహత్య సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ తోటపల్లిగూడూరు (పొదలకూరు) : బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్యోదంతం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆస్తి కోసం మేనబావను హత్య చేసిన బావమరిది హరికృష్ణ ఉదంతం వెలుగులోకి రావడం, ఉలిక్కి పడిన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ రెండు కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిల్చింది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీస్శాఖ అవినీతి, నిర్లక్ష్యం వెరసీ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు హరికృష్ణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోర కలికి కారణమైంది. ఆ రోజే స్పందించి ఉంటే.. వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్య జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఆ రోజే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలోనే కాదు.. ప్రస్తుతం దర్యాప్తు దశలో కూడా పోలీస్ శాఖ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యాపిల్లలు ఆమె పుట్టింట్లో ఉండగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హరికృష్ణ, అతని కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్, కదలికలపై నిఘా ఉండి ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులతో పాటు జీవితాన్ని పంచుకున్న భార్య బతికుండేది. వారేం తప్పు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే హరికృష్ణ తాను చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చినా.. పోలీస్శాఖ నిర్లిప్తంగా వ్యవహరించిందని జిల్లా ప్రజలు నిందిస్తున్నారు. తెల్లవారుజామున ఇంటికొచ్చి.. హరికృష్ణ మంగళవారం తెల్లవారు జామున ఇంటికొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకుని సింగరాయకొండకు వెళ్లాడు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల భయం పట్టుకొని అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టంగా మారుతుందని తన భార్య, పిల్లలు దిక్కులేని వారవుతారనే ఉద్దేశంతోనే హరికృష్ణ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వెంటాడిన అమావాస్య ఏఓ శ్రీహరి గత నెల 15వ తేదీన అమావాస్య నాడు హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల తిరగకుండానే అదే అమావాస్య అయిన 14వ తేదీ మంగళవారం హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం యాధృచ్ఛికంగానే భావిస్తున్నారు. నిందితుడి కదలికలపై నిఘా లేకపోవడంతోనే ఈ దారుణం పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే.. ఆ కుటుంబం బతికి ఉండేది పోలీస్ శాఖ అవినీతే ఆ కుటుంబంలో పెను విషాదం హత్య కేసులో ఇరుక్కుని.. కుటుంబాన్ని బలి తీసుకొని జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులు బాగా పెట్టేవాడు. అంతే స్థాయిలో అప్పుల పాలయ్యాడు. దీంతో ఆస్తిని కాజేయాలని బావ హత్య కేసులో ఏ–1 నిందితుడిగా మారాడు. చివరకు పోలీసులు గాలిస్తున్నారని అరెస్టుకు భయపడి తనతో పాటు అభం శుభం తెలియని చిన్న పిల్లలు, భార్యతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏఓ శ్రీహరికి రెండో వివాహానికి హరికృష్ణ చెల్లిని ఇచ్చారు. శ్రీహరి మేనమామ కూడా కావడం వల్ల ఇద్దరి మధ్య ఆస్తి వ్యవహారాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీహరిని..హరికృష్ణ అంతమొందించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా ఏ–1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తప్పించుకొని తిరుగుతున్నాడు. హత్య కేసులో ఇరుక్కుని తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హతుని బావమరిది కుడుముల హరికృష్ణ (32) ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్కు వెళ్లి భార్య ప్రణతి (29), కుమార్తె మూగాంబిక (5), కుమారుడు కౌశిక్(3)లతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘోరకలి తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావులవారి కండ్రికలో విషాదం నెలకొంది. -
క్షుద్ర పూజల కలకలం
ఒంగోలు టౌన్: నగరం నడిబొడ్డున గోపాల్ నగర్లో క్షుద్ర పూజల కలకలం సృష్టించింంది. అయితే తమ బిడ్డ అనారోగ్యంతో చనిపోయాడని తల్లిదండ్రులు చెబుతుండగా.. లేదు క్షుద్రపూజల వల్లనే చనిపోయాడని బాలుడి తాత, బాబాయ్తో పాటుగా ఇరుగు పొరుగువారు చెబుతుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..నగరంలోని గోపాల్నగర్ ఒకటో లైన్ ఎక్స్టెన్షన్ తిరుపతమ్మ గుడి సమీపంలో కటారి కిరణ్ కుమార్, నాగలత దంపతులు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు రిత్విక కళ్యాణ్ చక్రవర్తికు ఆరేళ్ల వయసు. పుట్టుకతో పోలియో వ్యాధితో పాటు మానసిక వికలాంగుడు. సరిగా మాటలు కూడా రావు. కిరణ్ దంపతులు చక్రవర్తికి చికిత్స నిమిత్తం అనేక వైద్యశాలలు తిరిగారు. పుట్టుకతో వచ్చిన వ్యాధి కావడంతో తగ్గదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్న ఒక మహిళ నెల్లూరులో సయ్యద్ మొబినా అని ఒక మహిళ ఉందని, ఆమెకు ఒంట్లో దుర్గమ్మ తల్లి వస్తుందని, అక్కడకు వెళితే బాబుకు వ్యాధి నయమవుతుందని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన కిరణ్, నాగలత దంపతులు కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా కొడవలూరులో వున్న మొబినా దగ్గరకు వెళుతున్నారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గోపాల్నగర్లోనే ఒక ఇల్లు అద్దె తీసుకొని మొబీనా ఇక్కడికే వచ్చి ఉంటుంది. చికిత్స పేరుతో బాలుడు చక్రవర్తిని తన వద్దే ఉంచుకొని ప్రతి రోజు మంత్రాలు చదువుతూ పూజలు చేయడం మొదలు పెట్టింది. ఇరుగు పొరుగుకు వినిపించకుండా పాటలు పెట్టి... బాలుడు చక్రవర్తిని తాళ్లతో కిటికీకి కట్టి వేప మండలు, తాళ్లతో కొడుతుండేదని స్థానికులు చెబుతున్నారు. బాలుడి కేకలు ఎవరికీ వినిపించకుండా పెద్ద శబ్దంతో పాటలు పెట్టేదని చెబుతున్నారు. బాలుడి ముఖఃం మీద కుంకుమ చల్లుతూ పెద్ద పెట్టున కేకలు పెడుతూ మొబీనా మంత్రాలు చదివేదని , దాంతో బాలుడి కళ్లల్లో కుంకుమ పడి ఊపిరాడక ఇబ్బంది పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మొబీనా దెబ్బలకు తాళలేక శనివారం ఉదయం బాలుడు చక్రవర్తి చనిపోయాడని, అయితే ఆదివారం మధ్యాహ్నం 3.35 గంటలకు బాలుడిని బతికిస్తానంటూ చెప్పిన మొబినా సమీపంలోని పుట్ట వద్ద పూజలు చేసిందని చెబుతున్నారు. అప్పటికీ బాలుడు చక్రవర్తి బతకలేదన్నారు. బాలుడి తండ్రి కిరణ్ మృతదేహాన్ని స్వయంగా భుజం మీద వేసుకొని తీసుకెళ్లినట్లు ప్రతక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బాలుడు చక్రవర్తి చనిపోయిన విషయం తెలుసుకున్న కిరణ్ సోదరుడు కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లో పూజలు చేస్తున్న మొబీనాను బెల్టుతో కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడని దీంతో అసలు విషయం చుట్టుపక్కల వారికి తెలిసిందని చెబుతున్నారు. కిరణ్ తండ్రి ఏడుకొండలు , బాబాయ్ కిషోర్ తాలుకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అనారోగ్యంతోనే నా కుమారుడు మరణించాడు అనారోగ్యంతోనే మా కుమారుడు చనిపోయాడని మృతుడు చక్రవర్తి తండ్రి కిరణ్, తల్లి నాగలత చెప్పారు. మొబినా సమక్షంలో తాలుకా పోలీసులు వీడియో రికార్డు చేశారు. ఈ సందర్భంగా బాలుడి తలిదండ్రులు కిరణ్, నాగలత మాట్లాడుతూ మొబీనాకు ఈ మరణంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. పక్షవాతంతో పుట్టిన తన కుమారుడికి వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పడంతో తెలిసిన వారి ద్వారా మొబీనా దగ్గరకు వెళ్లామని, ఆమె ఆయిల్ మసాజ్ చికిత్స చేసిన తరువాతే తన కుమారుడు లేచి కూర్చుంటున్నాడని తెలిపారు. ఇదే విషయాన్ని తాలుకా పోలీసులకు రాత పూర్వకంగా రాసిచ్చారు. మంత్రగత్తెను వెంటనే అరెస్టు చేయాలి క్షుద్ర పూజల పేరుతో ఆరేళ్ల బాలుడిని అమానుషంగా చంపివేసిన మంత్రగత్తైపె, ఆమెకు సహకరించిన వారిపై హత్యా నేరం నమోదు చేయాలని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఏపి హేతువాద సంఘ అధ్యక్షుడు ఎంకే బేగ్, నాయకులు నజీర్, పూర్వ అధ్యక్షుడు శిఖా చంద్రశేఖర్బాబు డిమాండ్ చేశారు. పోలియో వ్యాధితో సచ్చు పడిపోయిన కాళ్లలో చలనం తెప్పిస్తానని చెప్పిన మంత్రగత్తె క్షుద్ర పూజలలో భాగంగా బాలుడిని చిత్ర హింసలు పెట్టిందని స్థానికులు చెబుతున్న మాటలను సాక్ష్యంగా తీసుకోవాలని కోరారు. ఆరేళ్ల బాలుడి మృతిపై రకరకాల పుకార్లు క్షుద్ర పూజలు చేశారంటున్న బాలుడి తాత, బాబాయ్, స్థానిక మహిళలు అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్న బాలుడి తల్లిదండ్రులు పరారీలో మంత్రగత్తె సయ్యద్ మొబినా 20 రోజుల నుంచి గోపాల్ నగర్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, ఆరేళ్ల బాలుడిని ఒక గదిలో బంధించి వేప మండలతో చిత్రహింసలు పెడుతుందని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చినా సరైన స్పందన రాలేదని ఆరోపిస్తున్నారు. బాలుడు చనిపోయిన తరువాత, మృతుడి బాబాయ్, తాత పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత మాత్రమే స్పందించారని , సకాలంలో స్పందించి ఉంటే ఈ అమానుషం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్రవర్తికి ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పి మొబీనా రూ.3 లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజనిజాలను తేల్చాలని, హత్య, మోసం కేసులు నమోదు చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయితే దీనిపై తాలు సీఐ విజయకృష్ణను వివరణ కోరగా...గోపాల్ నగర్లో క్షుద్ర పూజల వలన ఆరేళ్ల బాలుడు చక్రవర్తి మరణించాడని చెప్పడం అవాస్తవమన్నారు. చక్రవర్తి అనారోగ్యంతో చనిపోయినట్లు బాలుడి తల్లిదండ్రులే చెబుతున్నారన్నారు. పోలియో వ్యాధితో బాధపడుతున్న చక్రవర్తి ఆరోగ్యం క్షీణించడం వల్లే చనిపోయాడని భావిస్తున్నామని తెలిపారు. -
హడావుడిగా సర్చేసి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో 1649 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 13,99,006 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. వీరిలో 40,737 మంది ఓటర్లు చనిపోయారని, 23,025 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లారని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను 100 శాతం డిజిటైజేషన్ చేశామన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ 90.75 శాతం అయిందన్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ గడువును ఎన్నికల సంఘం పది రోజులు పొడిగించినందున పూర్తిస్థాయిలో అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు కొనసాగిస్తామన్నారు. బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు సహకరిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఓటర్లను కావాలని తొలగించే ప్రక్రియే జరగలేదన్నారు. బీఎల్ఓలకు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు బాగా సహకరించారన్నారు. ఓటర్లకు ఎలాంటి అపోహలకు తావులేకుండా సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. -
పొగాకు రైతు కంట రక్త కన్నీరు
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం పొగాకు రైతులను గాలికొదిలేసిందని, మద్దతు ధర రాక రైతు కంట రక్త కన్నీరు కారుతోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్ని రకాల పంటలు సాగుచేసే లక్షలాది మంది రైతులు మద్దతు ధర లభించక అల్లాడుతున్నారన్నారు. ముఖ్యంగా పొగాకు రైతు మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు. తాము పండించిన పంటను తగలబెట్టుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారులతో, కంపెనీలతో మాట్లాడుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు తప్ప రైతుల పక్షాన నిలబడడం లేదని ఆరోపించారు. కంపెనీలు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పొగాకు రైతుకు మద్దతుగా ఆందోళనలు... పొగాకు రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం ఆదుకోకుండా చోద్యం చూస్తోందని, దున్నపోతుపై వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తోందని బూచేపల్లి ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన నిలబడి పోరాడతామన్నారు. అందులో భాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో నిరసన దీక్షలు చేపడుతున్నామన్నారు. 16వ తేదీన కనిగిరిలో ఆర్టీఓ కార్యాలయం వద్ద, 17వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ దీక్షలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చి మార్క్ఫెడ్తో కొనుగోలు చేసేంత వరకూ ఆందోళనలు చేస్తామన్నారు. గత సంవత్సరం కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి పొదిలికి వచ్చి వెళ్లారని, ఫలితంగా కంపెనీలు పొగాకును కొనుగోలు చేశాయని గుర్తు చేశారు. రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఇటీవల ఒంగోలు కేంద్రంగా పార్టీలకతీతంగా జరిగిన ట్రాక్టర్ల ర్యాలీకి వేలాదిగా రైతులు తరలి వచ్చి నిరసన వ్యక్తం చేయడం మీకు కనబడడం లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే పరిస్థితులు కొనసాగితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే మేలుకొని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యే సమీక్షలు చేస్తున్నారే తప్ప రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయండి.. వేలం కేంద్రాల్లో కంపెనీలు రైతుల వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేయకపోతే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి కొనుగోలు చేయాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా రూ. 300 కోట్ల వరకూ వెచ్చించి పొగాకును కొనుగోలు చేసి మంచి ధర వచ్చాక అమ్మకాలు చేశామన్నారు. ఫలితంగా రైతులకు, ప్రభుత్వానికి మేలు జరిగిందని చెప్పారు. ఈ ఏడాది వేలం ప్రారంభమై 88 రోజులు కావస్తోందన్నారు. గతేడాది ఇదే సమయానికి సుమారుగా 75 మిలియన్ కేజీలు కొనుగోలు చేశారని, ప్రస్తుతం 35 మిలియన్ కేజీలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు రెండు సార్లు సమావేశాలు నిర్వహించి నోబిడ్ ఉండకూడదని చెప్పారని, అయినా ఎలాంటి ఉపయోగం లేదని బూచేపల్లి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించేలా దృష్టి పెడుతున్నారే తప్ప రైతులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. మద్దతు ధరల కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన రైతులు ఉన్నారని, ఇటీవల ఒంగోలులో జరిగిన ర్యాలీలో మీ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యారన్కు రూ.3 లక్షల వరకూ రైతులు నష్టపోతున్నారన్నారు. మా ప్రభుత్వ హయాంలో కేజీ రూ.320కి పైగా కొనుగోలు చేశారని, ప్రస్తుతం రూ.200లకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. రూ.1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని, ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చి ఉద్యమం చేస్తామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందన్నారు. నెలకు రూ.15 వేల కోట్లకు పైగా అప్పు చేస్తున్న ప్రభుత్వం ఒక్క రోజు అప్పు రూ.500 కోట్లు ఇచ్చి మార్కెట్లో పోటీ తెస్తే పొగాకుకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించకుండా, కంపెనీల వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చాం.. కొనకపోతే నీ సంగతి తెలుస్తాం అని మాట్లాడటం తప్ప రైతులకు న్యాయం చేయటం లేదని విమర్శించారు. వార్నింగ్ ఇస్తే ఎవరు రిస్క్ తీసుకుంటారనీ, ప్రైవేటు వ్యక్తులపై ఇతనికి ఏం అధికారం ఉంటుందని విమర్శించారు. అనంతరం పొగాకు రైతు దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కనిగిరి జెడ్పీటీసీ కస్తూరిరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లా మొత్తం ఓటర్లు 13,99,006
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026డిజిటైజ్ చేసింది 12,69,595ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తేల్చేస్తున్నారు. మందగమనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 22 రోజులైనా సరే సగానికి సగం పర్సెంటేజీ కూడా పూర్తి కాలేదు. చివరి వారం రోజుల్లో పరుగులు తీయించినా లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ, వచ్చిన ఫారాలను డిజిటైజ్ చేయడం అనుకున్నంత వేగంగా సాగలేదు. చివరి 4 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 శాతం డిజిటైజ్ చేశామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. అధికారిక గణాంకాలే దీనికి నిదర్శనం.డిజిటైజ్ చేసింది 8,21,481వివిధ కేటగిరీల్లో లేనివారిగా తేల్చినవి 87,291సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో 2752 పోలింగ్ కేంద్రాల పరిధిలో జూన్ 15 నుంచి సర్ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం జూలై 14తో ముగియాల్సి ఉంది. అయితే ఈ నెల 24వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వెలువడ్డాయి. ముందుగా ప్రకటించిన దానికి ప్రకారం 14వ తేదీతో ముగించాల్సి ఉన్నందున అధికారులు రకరకాలుగా కుస్తీ పట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పర్సెంటేజీ చూపించుకోవటానికి ఆబ్సెంట్(లేరు)ను ఎక్కువ చేసి చూపించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 78,422 మందిని ఆబ్సెంట్గా చూపించారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 51460 మంది, మార్కాపురం జిల్లా పరిధిలో 26,962 మందిని ఆబ్సెంట్గా చూపించారు. ఫారాలు ఇచ్చి సంతకాలు పెట్టని వారిని కూడా ఆబ్సెంట్ కింది చూపించినట్లు సమాచారం. చివరి రెండు రోజుల ముందు వరకూ 80 శాతం ఉన్న డిజిటైజేషన్ చివరి రోజుకు 100 శాతం పూర్తయిందని చూపించారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆబ్సెంట్ కింద 51460 మంది ఓటర్లు ఉంటే మిగతా కేటగిరీల కింద 77,951 మంది ఓటర్లను చూపించారు. వారిలో చనిపోయిన వారు 40,737, వలసల కింద 23,025 మంది, వేరొక చోట ఓటు కలిగిన వారు 13,746 మంది, ఇతరులు 443 మందిగా తేల్చారు. ఉన్న ఓటర్లలో 1,29,411 మందిని పాత ఓటర్ల జాబితా నుంచి తీసేసినట్లయింది. అలాగే మార్కాపురం జిల్లా పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో మంగళవారం సాయంత్రానికి మొత్తం 87,291 ఓటర్లు పెండింగులో చూపారు. ఇందులో 22,123 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. 28,998 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్టు అధికారులు తేల్చారు. 8,647 మంది ఓటర్లను డబుల్ ఎంట్రీలుగా గుర్తించారు. ఫారాలు తీసుకొని ఇవ్వని వారు 561 మందిని ఇతర జాబితాలో చేర్చారు. ఇక 26,962 మంది ఓటర్లను ఆబ్సెంట్ కింద గుర్తించారు. సర్ ప్రోగ్రాం గడువు పొడిగించడంతో అధికారులు వీరిపై దృష్టి సారించాల్సి ఉంది. వివిధ కేటగిరీల్లో లేనివారిగా తేల్చినవి 1,29,411 -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ, వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి వసతి, పైపులైన్లు, ఇతర సదుపాయాలను అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని కాలనీలో వసతులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అదేవిధంగా పునరావాస పరిహారం కింద ఇంకా ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి వంటి అంశాలను వారంలో జాబితా తయారు చేసి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, వెలిగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూ తాలిం, ఈఈ శ్రీనివాసరావు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, కంభం ఎస్డీసీ సత్యనారాయణ,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: జిల్లాలో రూ.13.43 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. జిల్లా పారిశ్రామిక విస్తరణ, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని పరిశ్రమలకు సంబంధించిన వివిధ రకాల రాయితీల కోసం వచ్చిన 44 క్లెయిమ్లను పరిశీలించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమల అనుమతుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించారు. పరిశ్రమల స్థాపన, అనుమతులు, ఇతర అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. పెద్దదోర్నాల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి టిఫిన్ హోటల్ దగ్ధమైంది. ఈ సంఘటన యడవల్లి సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో యడవల్లికి చెందిన బత్తుల బాలవెంకటేశ్వర్లుకు చెందిన హోటల్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో తన కుమార్తెకు చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్లతో పాటు, రెండు ఫ్రిజ్లు కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఒంగోలు సిటీ: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత నిర్ణయించిన గడువుకు బదులుగా ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు సెల్ఫ్ నామినేషన్, ఐదుగురు ఫెలో టీచర్ల సిఫార్సు లేదా లీప్ యాప్ ద్వారా పనితీరు ఆధారిత ఎంపిక విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన ఉపాధ్యాయులు గడువు లోగా దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని డీఈఓ వెల్లడించారు. గుడ్లూరు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగిస్తుండగా కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఏలూరుపాడు శాంతినగర్లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన మల్లికార్జున కరెంట్ పనులకు వెళుతుంటాడు. అదే క్రమంలో శాంతినగర్లో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ బిగించే సమయంలో కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కావలి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య ఉన్నారు. పామూరు: సిమెంట్ లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి మండలంలోని మోపాడు గ్రామం వద్ద పామూరు కందుకూరు 167బి జాతీయ రహదారిపై జరిగింది. వలేటివారిపాలెం మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన మితుకుల్ల అచ్యుత్ కుమార్ హీరోహోండా బైక్పై పామూరు వైపుకు వస్తున్నాడు. పామూరు వైపు నుంచి దుకూరు వైపుకు వెళ్తున్న సిమెంట్లారీ బైక్ను ఢీకొట్టగా మోటార్సైక్లిస్ట్ మితుకుల్ల అచ్యుత్కుమార్(37) రోడ్డుపై పడగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కట్టా అనూక్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్ లారీని పామూరు పోలీస్స్టేషన్కు తరలించారు. ఘటనలో ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంచార జాతుల పిల్లల భవిష్యత్తు ముఖ్యం
● పిల్లలను విధిగా బడులకు పంపించండి ● సంచార జాతుల అవగాహన సదస్సులో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: సంచార జాతుల వారు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలను విధిగా బడులకు పంపించాలని కలెక్టర్ పి .రాజాబాబు సంచార జాతుల వారిని కోరారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సంచార జాతుల వారు వారి పిల్లలను ఏ బడిలోనైనా చేర్పించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, సంచార జాతులు వారి సమస్యల సాధనకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, హెల్త్ కార్డులు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు వంటివి విధిగా ఉండాలని అన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతులైన, జంగం, మొండి బండ, పాముల, బుడబుక్కల తదితర కులాల నుండి మౌనిక, లలితమ్మ, వెంకటమ్మ, శ్రీనివాసరావు, లక్ష్మ, చిన్నమ్మ తదితరులు తమ తమ సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముప్పూరి వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు పొగడ్తలచిన్న చెంచయ్య, జంగమ సంఘం అధ్యక్షుడు ముసునూరి కోటేశ్వరరావు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య, సంచారజాతుల జిల్లా సంఘం అధ్యక్షుడు పొగడ్తల వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షుడు చిన్నకత్తుల రాజేష్, పాముల సంఘం అధ్యక్షుడు దాయాది, కార్యదర్శి నాగులూరి సామ్యూల్ పలువు సంచర జాతులు వారు పాల్గొన్నారు. -
గ్రంథాలయ సెస్ చెల్లించాలి
● అధికారులను ఆదేశించిన జేసీ కల్పనా కుమారి ఒంగోలు సబర్బన్: గ్రంథాలయాభివృద్ధికి తోడ్పడాలని, సకాలంలో గ్రంథాలయ సెస్ సంస్థకు అందేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో మంగళవారం గ్రంథాలయ సెస్ అభివృద్ధి కమిటీ సమావేం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రంథాలయానికి రావాల్సిన బకాయిలు త్వరలో జమ చేయాలని కమిటీ సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. సమావేశానికి కన్వీనర్గా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.సుధాకర్ రావు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పార్టీకి తీరనిలోటని పలువురు పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గం ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు వై వెంకటేశ్వర్లు ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రైతులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోం..
అద్దంకి రూరల్: ౖరెతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వకుండా వారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం అని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా వారికి కనెక్షన్లు ఇవ్వకుండా మంత్రి నుంచి రికమండేషన్ లెటర్ తీసుకురావాలని విద్యుత్ శాఖ అధికారులు కోరటంతో రైతులు అశోక్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ అసలే వర్షాలు లేక ఇబ్బందులకు గురవుతున్న రైతులు విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తులు పెడితే మంత్రి అనుమతులు కావాలని అధికారులే చెప్పటం ఏంటని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం కూడా సంతమాగులూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామ రైతులు విద్యుత్ కనెక్షన్లు పెట్టుకుంటే కనెక్షన్లు ఇవ్వకపోవటంతో రైతులు కోర్టులో పిటిషన్ వేశారన్నారు. సంబంధిత అధికారులకు కనెక్షన్లు ఇవ్వండి అని కోర్టు ఆదేశించినా దానిని ధిక్కరించడంతో రైతులు మళ్లీ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టు చీవాట్లు పెడితే అప్పుడు ఆ రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని గుర్తుచేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ మండలంలో రైతులకు 1200 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెబుతున్నారని, ఇవి ఒక్క బల్లికురవ మండలానికేనా లేక అద్దంకి నియోజకవర్గం మొత్తానికా అని ప్రశ్నించారు. రైతులు కనెక్షన్లు పొందాలంటే టీడీపీ కార్యాలయాల చుట్టూ తిరగాలా లేక ఆ పార్టీలో చేరాలా అని ప్రశ్నించారు. గత 45 రోజుల నుంచి అద్దంకి మండలంలోని కలవకూరు రైతులను తిప్పుతూ అధికారుల ఇప్పుడు మంత్రి సిఫార్సు కావాలంటున్నారని, తాను స్వయంగా విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడితే తమకు రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయని అధికారులు తెలిపారన్నారు. సమస్యను మేము అడిగితే అధికారులను, రైతులను బెదిరించి గుండాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. మీరు చేసే గుండాగిరికి బదులుగా తాము గాంధీగిరి చేస్తామన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే వైఎస్సార్సీపీ వారికి ఎలాంటి సహాయం చేయవద్దని చెప్పారన్నారు. అదే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు, మతాలు, కులాలు చూడకండా అర్హతున్న వారికి అన్ని పథకాలు అందాయని చెప్పారు. రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుటే రైతులతో కలిసి గాంధీగిరి చేస్తామన్నారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి రైతులకు మేలు చేయాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఈదా శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్రెడ్డి, రామకోటేశ్వరరావు, జ్యోతి రోశయ్య, మాజీ కౌన్సిలర్ బాలు, రైతులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ -
చేతికొచ్చిన కొడుకు చేజారిపోయాడు
చీమకుర్తి: చేతికి అందొచ్చిన కొడుకు ప్రైవేట్ కంపెనీలో స్థిరపడ్డాడు అనుకునే తరుణంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే..చీమకుర్తి మండలం పల్లామల్లికి చెందిన వేలూరి శివసాయి పవన్(25) హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా 10 నెలలుగా పనిచేస్తున్నాడు. మరో రెండు నెలలు చేస్తే కంపెనీలో పర్మినెంట్ చేస్తామని ఇటీవలే కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు మృతుడి తండ్రి వేలూరు వేణుబాబు తెలిపారు. ఐటీఐ, డిగ్రీ చేసి ఎలక్ట్రీషియన్గా కంపెనీలో ఉన్న వందలాది మంది ఉద్యోగులలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న శివసాయి పవన్ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించటం కంపెనీలోని తోటి ఉద్యోగులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన కడుపులో ఇబ్బందిగా ఉందని, మెడికల్ షాపుకు వెళ్ళి ట్యాబ్లెట్లును తెచ్చుకుందామని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. బైకును నడుపుతున్న శివసాయి పవన్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న కాకినాడకు చెందిన మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. శివసాయి పవన్ మృతదేహాన్ని మంగళవారం పల్లామల్లి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. కొడుకు కుటుంబానికి అండగా ఉండాటనుకుంటున్న తరుణంలో దూరం కావడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చాడం ఎవరి వల్లా కాలేదు. బతుకుదెరువుకు వెళ్లి శవమై తిరిగొచ్చాడు హైదరాబాద్లో డివైడర్ను ఢీకొని పల్లామల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ మృతి -
నేడు డీఆర్సీ సమావేశం
ఒంగోలు సబర్బన్: కలెక్టరేట్లో బుధవారం నిర్వహించే డీఆర్సీ సమావేశానికి సంబంధించి అధికారులందరూ సరైన నివేదికలతో హాజరు కావాలని, సమాధానాలు చెప్పటానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్న డీఆర్సీ మీటింగ్పై సమీక్ష మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నవంబర్– 2025న జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలు, అన్నదాత సుఖీభవ, ఆర్డబ్ల్యూఎస్ తదితర అంశాలను ప్రజా ప్రతినిధులు లేవనెత్తే అవకాశం ఉన్నందున విషయాలను వివరించేలా సంబంధిత అధికారులు ఉండాలన్నారు. సమస్యలను సమగ్రంగా వివరించాలని, అంతేకాకుండా ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


