Prakasam
-
పోక్సో కేసులో మహిళా అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒంగోలు: పోక్సో కేసులో ఓ మహిళా ప్రత్యేక అధికారికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. 2018 జూన్ 26న ఓ విద్యార్థిని పట్ల అదే విద్యాలయంలో మహిళా ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళ అసభ్యకరంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై అప్పటి మర్రిపూడి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం మహిళా ప్రత్యేక అధికారికి 5 సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించారు. బాధిత విద్యార్థినికి రూ.22 వేలు పరిహారం అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 ఆన్లైన్ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) పరీక్ష ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో, మార్కాపురంలోని 2 పరీక్ష కేంద్రాల్లో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు పూటలా జరుగుతాయి. ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 929 మంది విద్యార్థులకు గాను 888 మంది హాజరుకాగా, 41 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 929 మంది విద్యార్థులకు గాను 888 మంది హాజరు కాగా, 41 మంది గైర్హాజరయ్యారు. అలాగే మార్కాపురంలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 285 మంది విద్యార్థులకు గాను 272 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 285 మందికి గాను, 271 మంది హాజరుకాగా, 14 మంది గైర్హాజరయ్యారు. -
ఇనుప కొట్టులో బంగారం చోరీ!
చీమకుర్తి: దుకాణంలో దాచి ఉంచిన బంగారం, వెండి, నగదు పోయిందంటూ చీమకుర్తికి చెందిన అద్దేపల్లి నగేష్ మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అందిన సమాచారం మేరకు వివరాలు.. పట్టణంలోని ఇసుకవాగు సెంటర్ సమీపంలో నగేష్ ఇనుప వస్తువులు, ఇతర సామగ్రి విక్రయించే హార్డ్వేర్ దుకాణం నిర్వహి స్తున్నాడు. రోజూ లాగే సోమవారం రాత్రి 10 గంటలకు దుకా ణం మూసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి చూడగా అల్మరా తెరిచి ఉంది. తాను దాచి ఉంచిన 33.5 సవర్ల బంగారం, 2.5 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు కనిపించకపోవడంతో నగేష్ హుటాహుటిన వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ ప్రసాద్, ఎస్సై సంపత్కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్తోపాటు పోలీసు జాగిలాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. దుకాణం వెనుక వైపు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పోలీసుల తర్జనభర్జన! ఇళ్లకు సంబంధించిన ఇనుప వస్తువులు, ఇతర సామగ్రిని విక్రయించే దుకాణంలో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు ఎలా ఉంచాడని అనుమానాలు వ్యక్తమవడంతో ఫిర్యాదుదారుడిని పోలీసులు లోతుగా విచారించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. 33.5 సవర్ల బంగారం, 2.5 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు పోయిందని బాధితుడి ఫిర్యాదు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, పోలీసులు క్లూస్ టీమ్, స్నిఫర్ డాగ్తో ఆధారాల సేకరణ -
తాగునీటి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
● అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కొండపి నియోజకవర్గంలో తాగునీటి సంబంధిత నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పనుల గురించి కలెక్టర్కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ.. ఆశించిన స్థాయిలో పురోగతి కచ్చితంగా సాధించాలని స్పష్టం చేశారు. పెండింగ్ పనులను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగా పనులను జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మహేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అద్దంకి: మోటారు సైకిల్ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలో అద్దంకి–నార్కెట్పల్లి రహదారిపై ద్వారకానగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. అద్దంకి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన పల్లెపు పుల్లయ్య(60) అద్దంకిలో ఉన్న తన భార్య చెంచమ్మను తీసుకుని వెళ్లేందుకు బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో బైకు ద్వారకా నగర్ సమీపంలో యూటర్స్ తీసుకుంటుండగా కారు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన పుల్లయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. హనుమంతునిపాడు: ఆకతాయి నిప్పు వేయడంతో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగి చెట్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన హనుమంతునిపాడు మండలంలోని కొండారెడ్డిపల్లి, రశీదుపురం పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కనిగిరి రేంజ్ ఫారెస్టు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే అటవీ ప్రాంతం కొంత మేర కాలి బూడిదైంది. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న జాయాయిల్ తోటలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ ఆరిఫ్ ఖాన్ తెలిపారు. సాక్షి టాస్క్ఫోర్స్: మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో పేకాట శిబిరంపై మంగళవారం టాస్క్ఫోర్స్ సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య, సిబ్బంది దాడి చేశారు. 10 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.65,500 నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్కు చెందిన మామిడి తోటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన జూదరుల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారని, నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, కోడిపందేలు, బెట్టింగు కార్యకలాపాలు సాగుతుంటే 112కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. -
టోల్ ప్లాజా!
స్థానికంవసూల్ రాజా.. టంగుటూరు: జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకెళ్లే వాహనదారులకు టంగుటూరు టోల్ ప్లాజాలో చుక్కలు చూపిస్తున్నారు. హైవేపై ప్రయాణం సాఫీగా సాగుతోంది అని భావించేవారంతా అక్కడికి వెళ్లగానే అధిక సమయం నిరీక్షించి సహనం కోల్పోతున్న పరిస్థితి. సింహపురి ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టంగుటూరు టోల్ ప్లాజాలో టోల్ ఫీజు, ఓవర్ లోడ్ పేరుతో భారీ జరిమానా వసూలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ వాహదారులకు అందించాల్సిన సౌకర్యాల విషయంలో మాత్రం లేశమంతైనా చూపడం లేదు. దీంతో టోల్ ప్లాజా వద్ద రోజూ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి వాహదారులు, అత్యసర పనుల నిమిత్తం వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ సిబ్బంది తీరుతో అంబులెన్సులకు సైతం బ్రేకులు పడుతున్నాయి. ఎమ్మెల్యేల వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతున్న పరిస్థితి. అంబులెన్సు వస్తున్న సమయంలో కూడా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించకుండా టోల్ ప్లాజా అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారు. ఓవర్ లోడ్ పేరుతో భారీగా వసూళ్లు టంగుటూరు టోల్ ప్లాజాలో ఓవర్ లోడ్ పేరుతో దందాకు తెరలేపడం వివాదాస్పదంగా మారింది. ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి మరీ లారీల నుంచి రోజూ రూ.2 లక్షలకు పైనే ఓవర్ లోడ్ ఫీజు పేరుతో గుంజుతున్నారు. వాస్తవానికి రవాణా శాఖ అధికారులు విధించించాల్సిన ఓవర్ లోడ్ ఫీజును టోల్ ప్లాజాలో వసూలు చేస్తూ వాహనదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వంగానీ, ఇటు రవాణా శాఖ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. వాహనదారులపై పోలీసులతో దాడి టోల్ ప్లాజాలో వాహనదారులను కట్టడి చేయడం కోసం సింహపురి ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ యాజమాన్యం ఆరుగురు కానిస్టేబుళ్లను నియమించుకుంది. ఒక్కో కానిస్టేబుల్కు నెలకు రూ.లక్ష వేతనం చెల్లిస్తోంది. ముగ్గురు పగలు, మరో ముగ్గురు రాత్రి వేళ విధులు నిర్వహించేలా బాధ్యతలు అప్పగించింది. టోల్ ప్లాజాలో అడ్డగోలు విధానాలను ఎవరైనా ప్రశ్నించినా, లారీలకు జరిమానా విధించిన సమయంలో డ్రైవర్లు ఎదిరించినా కానిస్టేబుళ్లు క్షణాల్లో ప్రత్యక్షమై చేయిచేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి టోల్ ప్లాజాలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. టోల్ ప్లాజాలో వాహనాల రద్దీని తగ్గించి, సమయాన్ని ఆదా చేయడం కోసం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఫాస్ట్ ట్యాగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. టోల్ ప్లాజాలో నిర్దేశిత ఎల్లో లైన్ కంటే ముందు 10 సెకన్ల కంటే వాహనాలు నిలిచి ఉంటే టోల్ ఫీజు చెల్లించనక్కర్లేదని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది. అయితే టంగుటూరు టోల్ప్లాజాలో ఆ నిబంధన అమలు కావడం లేదు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నా వాహనదారుల ముక్కు పిండి మరీ టోల్ వసూలు చేస్తున్నారు. పలువురు వాహదారులు ఎల్లో లైన్ నిబంధనను గుర్తు చేస్తూ టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే సిబ్బంది వాగ్వివాదానికి దిగుతుండటం గమనార్హం. టంగుటూరు టోల్ ప్లాజాలో వాహనదారులకు నిత్య నరకం ఓవర్ లోడ్ పేరుతో లారీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అంబులెన్స్ల్లో రోగులు, అత్యవసరంగా వెళ్లే వారికి తప్పని తిప్పలు పోలీసులకు ఫిర్యాదు చేసినా మారని పరిస్థితి రోజూ ట్రాఫిక్ జామ్ఝాటం టోల్ ప్లాజా యాజమాన్యం ఓవర్ లోడ్ పేరుతో లారీలను భారీ సంఖ్యలో నిలిపేస్తుండటంతో రోజూ గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నిత్యం ఇదే తీరు కొనసాగుతుండటంతో ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కాదు. ఈ నేపథ్యంలో పలువురు వాహనదారులు సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో కాసేపు మాత్రం ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి మొదటికొస్తోంది. -
స్వాహా..!
స్థానికంశోత్రియం భూములు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి ● అధికారులకు కలెక్టర్ విజయసునీత ఆదేశం మార్కాపురం: మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఎం.విజయసునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు సంతృప్తికరంగా పనిచేయాలని, పారిశుధ్యం, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను సీజన్ నాటికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నెలలో నాలుగు శుక్రవారాలు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ పులి శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ మోహన్రావు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హైవేపై కారు దగ్ధం ● జేసీబీని ఢీకొనడంతో పేలిన పెట్రోల్ ట్యాంక్ ● త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద సంఘటన త్రిపురాంతకం: వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టడంతో పెట్రోల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన రామచంద్రరావుతోపాటు మరో నలుగురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టారు. జేసీబీ తొట్టి కారు వెనుక భాగంలోని పెట్రోల్ ట్యాంక్కు బలంగా తగలడంతో ఒక్కసారిగా పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు హుటాహుటిన కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. అందరూ చూస్తుండగానే కారు మంటల్లో కాలిపోయింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు. టీడీపీ నాయకుడి జోక్యంతోనే భూకబ్జాకు దిగారు నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుని జోక్యంతోనే తమ గ్రామానికి చెందిన కొంతమంది భూ కబ్జాకు పాల్పడుతున్నారు. పోలీసులను పురమాయించి మమ్మల్ని హెచ్చరించారు. భూమిపై ఎటువంటి అధికారంలేని వారు గతంలో మాకు పట్టాలు ఇచ్చిన భూమిలో దిగి జేసీబీలతో శుభ్రం చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన వారికి అధికారులు మద్దతు ఇస్తే పేదల పరిస్థితి ఏం కావాలి. – ఎనిబెర ప్రసాద్, బాధితుడు, నడిగడ్డ పట్టాలు ఎలా రద్దు చేస్తారు మాకు 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు ఏ విధంగా రద్దు చేస్తారు. అందుకు సంబంధించిన నోటీసు కూడా మాకు అందలేదు. మా పట్టా భూమిలో ఇతరులు దిగి శుభ్రం చేసుకుంటుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. తాము వ్యవసాయం చేసుకుంటామంటే బెదిరిస్తున్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలి. – నూనె ఏలియా, బాధితుడు, నడిగడ్డ నా భూమికి హద్దులు చూపించాలి నాకు 20 సంవత్సరాల క్రితం పొలం పట్టా ఇచ్చారు. అప్పట్లో నేను వ్యవసాయం చేసుకునేదానిని. కొంతమంది బెదిరించి భూమిలో దిగకుండా చేశారు. అప్పటి నుంచి వ్యవసాయం చేయకపోవడం వలన చిల్లచెట్లు ఏపుగా పెరిగాయి. భూమి ఎక్కడ ఉందో గుర్తించలేకపోతున్నాం. గతంలో మాకు పట్టా ఇచ్చిన ప్రకారం 50 సెంట్ల భూమికి హద్దులు చూపించాలి. – నూనె ఎలిశమ్మ, బాధితురాలు యర్రగొండపాలెం: ఖరీదైన శోత్రియం భూములు కాజేసేందుకు పచ్చ నేతలు బరి తెగించారు. అధికారం చేతిలో మదంతో.. ఏం చేసినా అడిగేవారు లేరన్న అహంకారంతో టీడీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. శోత్రియం భూములపై ఎటువంటి హక్కు లేకపోయినప్పటికీ దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి చదును చేయిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం భూమిలేని పేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు అంటూ ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయించడం టీడీపీ నేతల భూదాహానికి నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాంతకం మండలంలోని ముక్తింపురం(నడిగడ్డ)లో 1 నుంచి 35 వరకు ఉన్న సర్వే నంబర్లలో దాదాపు 380 ఎకరాల పొలం ఉంది. దీనిని శోత్రియం భూమిగా గతంలోనే ప్రభుత్వం గుర్తించింది. 2006లో 3వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నడిగడ్డలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ రైతులతోపాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి 50 సెంట్ల ప్రకారం అప్పటి కలెక్టర్ ఉదయలక్ష్మి 120 ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు పొందిన రైతులు 2008 వరకు ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నడిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు కోర్టుకు వెళ్లి స్టేటస్కో తీసుకొచ్చారు. దీంతో అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్ పొలంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, అప్పటి వరకు పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న అర్హత కలిగిన రైతులపై కేసులు పెట్టారు. ఈ వివాదం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లింది. ఒక వర్గంవారిపైనే ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చిందని అధికారులను మందలించి, తప్పుడు కేసులను ఎత్తివేయించారు. ఆ తరువాత రెండో వర్గం వారు తరచూ బెదిరిస్తుండటంతో పట్టాలు పొందిన రైతులు తమ పొలంలోకి అడుగుపెట్టలేకపోయారు. అప్పట్లోనే టీడీపీ వర్గీయులు లాయర్ ద్వారా కోర్టు నోటీసులు ఇప్పించారు. గత్యంతరం లేని స్థితిలో రైతులు కూడా లాయర్ ద్వారా కోర్టులో తమ వాదన వినిపించారు. ఈ కేసును రిజర్వులో పెట్టిన కోర్టు, సమగ్రంగా విచారణ జరపాలని అప్పటి జేసీకి ఆదేశాలు జారీచేసింది. రెండు వర్గాలను జేసీ పిలింపించి విచారించారు. ఈ సమయంలో తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని ఆయన కోరారు. రైతులు తమ వద్ద ఉన్న 3వ విడత కింద కలెక్టర్ పంపిణీ చేసిన పొలం పాస్పుస్తకాలు, పట్టాలు చూపించారు. రెండో వర్గం వారు మాత్రం ఆ భూమిపై హక్కు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు కూడా 380 ఎకరాల్లో పూర్తిగా పట్టాలు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వివాదాన్ని జేసీ పెండింగ్లో పెట్టారు. తమకు అనుకూలంగా జేసీ నడుచుకోలేదన్న దుగ్ధతో రెండో వర్గం మరోమారు కోర్టును ఆశ్రయించింది. జేసీ ఈ కేసును సమగ్రంగా విచారించలేదని ఆరోపిస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకుడి జోక్యంతో ఆర్డీఓ ద్వారా ఆ భూమిపై ప్రొసీడింగ్స్ ఇప్పించారు. టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతోనే త్రిపురాంతకం సీఐ, ఎస్సై నడిగడ్డకు వచ్చి శోత్రియం భూముల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించి, తమ భయభ్రాంతులకు గురిచేశారని పట్టాలు పొందిన రైతులు ఆరోపిస్తున్నారు. తమకు పట్టాలు ఇచ్చిన భూమి కాకుండా అక్కడ మరో 260 ఎకరాల వరకు భూమి ఉందని, పేదలకు దక్కాల్సిన భూమిని అధికార టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అధికారులంతా సిద్ధమయ్యారని మండిపడుతున్నారు. భూమిపై హక్కుఉన్నట్లు పట్టాలు చూపిస్తున్న బాధితులు భూ హక్కున్న వారిని హెచ్చరిస్తున్న పోలీసులు 2006లో పట్టాలు పంపిణీ చేస్తున్న అధికారులు ఘనంగా బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి 20 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టాలు రద్దు అంటూ తప్పుడు ప్రచారం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు అనుమతి లేకున్నా జేసీబీలతో భూములు చదును చేస్తున్న వైనం అయినా అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు తమకు ఇచ్చిన పట్టాలకు భూమి చూపాలని అడుగుతున్న బాధితులు -
రన్వేపై స్పిరిట్ ట్యాంకర్ బీభత్సం
సింగరాయకొండ: మద్యం మత్తులో స్పిరిట్ ట్యాంకర్ డ్రైవర్ సృష్టించిన బీభత్సం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జాతీయ రహదారిపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వేపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పామూరు నుంచి మామిడికాయల లోడ్తో విజయవాడ వెళ్తున్న ఆటోను హైవే పక్కన గోల్డెన్ కేఫ్ రెస్టారెంట్ సమీపంలో నిలిపి డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు జి.బాపనరెడ్డి, జి.వేణుప్రకాష్రెడ్డి కరేడు నుంచి రూ.9 లక్షల నగదు తీసుకొని వస్తూ ఆ మామిడికాయల ఆటో సమీపంలో తమ బైక్ ఆపి ఫోన్లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో చైన్నె నుంచి కాకినాడకు స్పిరిట్ తీసుకురావడానికి వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో మామిడికాయల ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఆటో బోల్తా కొట్టగా, అందులో ఉన్న మామిడికాయల ట్రేలు ఫోన్ మాట్లాడుకుంటున్న ఇద్దరిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. బాపనరెడ్డి పరిస్థితి విషమించి మృతి చెందారు. కాగా, సంఘటన స్థలంలో పడి ఉన్న రూ.9 లక్షల నగదును 108 సిబ్బంది వేణు, సౌజన్య ఆస్పత్రిలో క్షతగాత్రుడు వేణుప్రకాష్రెడ్డికి అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జరుగుమల్లి ఇన్చార్జి ఎస్సై మహేంద్ర తెలిపారు. -
ప్రతి ఫిర్యాదును విచారించండి
● ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు మార్కాపురం: ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. సోమవారం మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 32 ప్రజలు అర్జీలు అందజేశారు. వాటిపై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిలో వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. ఫిర్యాదుల్లో సివిల్, భూమి, ఆర్థిక తగాదాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, గిద్దలూరు, పొదిలి, కంభం సీఐలు సురేష్, రాజేష్కుమార్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 74 ఫిర్యాదులు... ఒంగోలు సిటీ: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, పోలీస్ అధికారులు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను వివరంగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, వేధింపులు, తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, సింగరాయకొండ సీఐ శ్రీహరి, అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీసింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు పెంచాలి
ఒంగోలు సబర్బన్: ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. జలధార – జలహారతి – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జలవనరులు, డ్వామా, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న జలధార – జలహారతి – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, సాగునీటి సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా నీటి సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 14వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణతో జలధార పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఒక చెరువును పునరుద్ధరించాలని సూచించారు. ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, గ్రౌండ్ వాటర్ డీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దుప్రజలకు తాగునీటి సరఫరా, నాణ్యత విషయంలో లోపాలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా తీరుపై సోమవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. క్లోరినేషన్, ట్యాంకుల క్లీనింగ్లకు జిల్లావ్యాప్తంగా ఉమ్మడిగా ఒక తేదీని నిర్ణయించాలని ఆదేశించారు. గ్రామాల్లో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటినే ప్రజలు తాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా నీటి వనరుల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్ పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
● ప్రసన్నాంజనేయునికి 108 రకాల నైవేద్యాల సమర్పణ
అద్దంకి: మండలంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి హనుమత్ జయంతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం హనుమత్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. సోమవారం నిత్య పూజలతోపాటు, స్వామివారికి 108 రకాల మధుర ఫలాలతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించారు. స్వామి వారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం, పంచామృత దశ విధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ మన్యుసూక్త వారాభిషేకం, నాగవల్లీ దళార్చన, తమలపాకులతో అర్చన, యధావిధి హోమ, మంటపారాధన కార్యక్రమాలు, చండీ హోమం, చతుర్విధ స్వస్తి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయ దాతలుగా కనుమళ్ల గ్రామానికి చెందిన గుంజి కృష్ణారావు, రామాదేవి దంపతులు, కాట్రగడ్డ అనీల్కుమార్, శ్రీవిద్య దంపతులు, కాట్రగడ్డ వెంకట సాయిరామ్, ప్రియాంక దంపతులు వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని ఏసీ తిమ్మానాయుడు, ఆలయ పాలక మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్రావు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. -
60 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
గుడ్లూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుడ్లూరు పోలీసులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. రాజుపాలెం రోడ్డులోని రామాలయం వద్ద ఆగి ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా తెల్ల గోతాల్లో ఉన్న బియ్యం మూటలు కనిపించాయి. దీంతో వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి పరిశీలించారు. వాటిలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ను అదుపులోనికి తీసుకొని విచారించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఐవీ వెంకట్రావు తెలిపారు. కేసులో డ్రైవర్ మల్లికార్జునతో పాటు ఎస్.మురళిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. -
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి
ఒంగోలు సిటీ: రాజకీయ లబ్ధికోసం కాకుండా మహిళలను గౌరవించేలా చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఎం.విజయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ నాయకురాలు వీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల పట్ల కపట కన్నీరు కారుస్తూ చట్ట సభల్లో రిజర్వేషన్ బిల్లులు ఆమోదించకుండా కొర్రీలు వేస్తున్నారని తెలిపారు. నిజంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ఒక్క బిల్లునే ప్రవేశపెట్టి ఆమోదించవచ్చు కదా అని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలను వివరించారు. ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అయినా మహిళా బిల్లును ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం విజయ మాట్లాడుతూ రాజ్యసభలో పాటు రాష్ట్ర శాసనసభమండలిలో కూడా 33 శాతం రిజర్వేషన్ కోసం వచ్చే వర్షాకాల సమావేశంలో కొత్త రాజ్యాంగ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా హక్కులను రాజకీయ కవచంలా వాడుకోవడం మానుకొని ఎటువంటి జాప్యం లేకుండా బిల్లును ఆమోదించాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సీహెచ్ పద్మ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును జతచేసి పార్లమెంట్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎస్ రావమ్మ, జిల్లా కార్యదర్శి అనంతలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ లక్ష్మి, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ కవిత, మహిళా అభ్యుదయ సంఘం నాయకురాలు నాగేంద్రమ్మతో పాటు వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
గ్లాసు పార్టీలో నేతల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో జనసేన రెండు, మూడు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ ముఖ్యనేతలుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఒంగోలులో జరిగిన స్థానిక సంస్థల డీ లిమిటేషన్ ప్రక్రియ సమావేశం ఆగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ సమావేశానికి రియాజ్ డుమ్మా కొట్టడం, రియాజ్పై బాలినేని పరోక్ష విమర్శలు చేయడంతో వారి మధ్య వివాదం మరింత ముదిరి పాకానపడనుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వర్గాలు రగిలి..సీఐలు, ఎస్సైలకు సూచనలిస్తున్న ఎస్పీ హర్షవర్ధనరాజు సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి బాలాజీ ఒంగోలు సమావేశంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసైనికులు కొందరు తమ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సహకరించడంలేదని ఆరోపణలు చేశారు. డీ లిమిటేషన్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మరల్చుకుంటున్నారని, ఉద్దేశపూర్వకంగానే జనసేనకు నష్టం కలిగేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌతంరాజుని వేదిక మీదకు పిలవగానే కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఇన్చార్జికు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అందరూ ఒక్కసారిగా వాదన పెట్టుకోవడంతో వేదిక వద్ద ఉద్రిక్తంగా మారింది. అలాగే నెల్లూరు జిల్లా నాయకుడు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ను వేదిక మీదకు పిలవగానే అదే జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. జిల్లా జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పేరుకు జనసేన పార్టే కానీ ఇందులో జనసైనికులు ఎవరూలేరన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరుడిగా వ్యవహరిస్తుండడాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యే దామచర్ల నేరుగా పవన్ కల్యాణ్ను విమర్శించినప్పటికీ రియాజ్ స్పందించకపోవడం, ఆ తరువాత కూడా జనసేన కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపకుండా ఎమ్మెల్యే దామచర్ల అనుచరుడిగా, పక్కా టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని జనసైనికులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. -
పొగాకు రైతు పోరుబాట
మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నోబిడ్ల వంకతో 70 శాతం పొగాకు బేళ్లను వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహంతో సోమవారం వేలం నిలిపేశారు. చండ్రపాడు, గాడిపర్తివారిపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 350 మందికి పై గా రైతులు పొగాకును వేలం కేంద్రానికి తీసుకురా గా అధిక శాతం బేళ్లను తిరస్కరించారు. విషయం తెలిసి రైతు సంఘం నాయకులు కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు.జిల్లా రైతు సంఘం ప్రధాన కా ర్యదర్శి జజ్జర జయంత్ బాబు మాట్లాడుతూ చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పొగాకు రైతులకు తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు బ్యారెన్కు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఈనెల 18వ తేదీన పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
పీఆర్సీ కమిషన్ను నియమించాలి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, పెండింగ్ డీఏలను ప్రకటించి, ఆర్థిక బకాయిలపై ఒక రూట్మ్యాప్ ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై డిమాండ్ చేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపకుడు దివంగత దాచూరి రామిరెడ్డి పదో వర్ధంతి సందర్భంగా సామ్రాజ్యవాదం– యుద్ధం– భారతదేశంలో దాని ప్రభావం అనే అంశంపై స్థానిక యూటీఎఫ్ భవనంలో ఉపన్యాసం నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మూరి శ్రీనివాసరావుతో పాటు యూటీఎఫ్ సీనియర్ నాయకుడు డీ వీరాంజనేయులు, సీనియర్ జర్నలిస్టు వీ రాంభూపాల్, రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి మాట్లాడారు. పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో అత్యున్నతమైన ఫలితాలు సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ యూటీఎఫ్ కార్యకర్తలు స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొని విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను కాపాడాలన్నారు. ప్రపంచ ప్రజానీకం యుద్ధం వద్దు శాంతి కావాలని ముందుకొస్తున్నారని చెప్పారు. యుద్ధానికి మూలం సామ్రాజ్యవాదం, గ్లోబలైజేషన్ అని ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుందన్నారు. దాని పర్యవసానంగా వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని, పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చైతన్యంతో కూడిన కార్యకర్తలు సంఘానికి అవసరమన్నారు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేతత్వం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నేర్పించినప్పుడు భవిష్యత్తులో మంచి పౌరసమాజం నిర్మితమవుతుందని చెప్పారు. దాచూరి రామిరెడ్డి లాంటి నాయకులు సంఘంలో తయారవ్వాలని పరిస్థితులకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఉపాధ్యాయులు సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావు, ఎన్ చిన్నస్వామి, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ శేషయ్య, జిల్లా కార్యదర్శులు ఎం సంధ్యారాణి, వై ఎస్ ఎన్ జ్యోతి, యం మాల కొండయ్య, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, స్వర్ణ దుర్గ, వెంకట ప్రసాద్, ఎం శ్రీను, యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు
మార్కాపురం: తర్లుపాడు మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 13వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు 6 పాలపండ్ల విభాగం పోటీలు నిర్వహిస్తామని, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు అందజేస్తామన్నారు. 14వ తేదీ గురువారం 7 గంటల నుంచి కేటగిరి విభాగంలో పోటీలు నిర్వహిస్తామని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు అందజేస్తామన్నారు. ● మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసుల గుర్తింపు గిద్దలూరు రూరల్: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నివాసం ఉంటున్న జడ్జి కె.భరత్ చంద్ర నివాసంలోకి గుర్తుతెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. ఆగంతకుడు జడ్జి ఇంట్లోకి ప్రవేశించడంతోనే పెంపుడు కుక్కలు అతడిని చూసి అరవడంతో కోర్టు సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు విచారించగా..అతడి మానసిక పరిస్థితి సక్రమంగా లేదని పేరు సైతం చెప్పలేకపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి పేరు పూర్తి వివరాలను ఎవరైన తెలిస్తే చెప్పాలని పోలీసులు అతడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వివాహ వేడుకలో ఉప్పు వివాదం ● ముగ్గురికి గాయాలు గిద్దలూరు రూరల్: వివాహ వేడుకల్లో భోజనం వద్ద తలెత్తిన వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని బురుజుపల్లె గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన విశ్వనాఽథ్, రేణుకల వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తె బంధువులు రంగనాయకులు, గాజ వెంకటేశ్వర్లు, సావిత్రిలు భోజనం వద్ద కూర్చున్నారు. భోజనంలో ఉప్పు తక్కువైందని చెప్పడంతో పెళ్లికుమారుడి తరపు బంధువులు లక్ష్మయ్య, పీరయ్యలు ఉప్పును చేతితో వేస్తుండగా స్పూన్తో వేయాలని గాజ వెంకటేశ్వర్లుకు చెందిన వారు చెప్పారు. దీంతో ఈ విషయమై మాట మాట పెరిగి ఘర్షణ పెరిగి లక్ష్మయ్య, పీరయ్యలు మరో నలుగురు కలిసి వారిపై రాళ్లతో దాడి చేశారు. గాయపడిన సావిత్రి, వెంకటేశ్వర్లు, రంగనాయకులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు లక్ష్మయ్య, పీరయ్యలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వార్డుల విభజనకు సర్వం సిద్ధం..!
మార్కాపురం మున్సిపల్ కార్యాలయం మార్కాపురం పట్టణ వ్యూ మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగనుంది. ఇప్పుడున్న 35 వార్డుల స్థానంలో మరో 5 వార్డులు పెరగనున్నాయి. దీంతో మొత్తం 40 వార్డులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 17న 40 వార్డులకు సంబంధించి డ్రాఫ్ట్ పబ్లిష్ చేయనున్నారు. 18 నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రస్తుతం మార్కాపురం మున్సిపాలిటీలో 35 వార్డులు ఉన్నాయి. మొత్తం 85,292 మంది ప్రజలు ఉండగా 58,400 మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన జరుగుతోంది. 1400 నుంచి 1500 ఓట్ల మధ్య వార్డులు ఉండేలా అధికారులు విభజన చేస్తున్నారు. పెరగనున్న పట్టణ పరిధి.. గత ఏడాది డిసెంబర్ 30న మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పాటైంది. నూతనంగా ఏర్పడిన మార్కాపురంలో పట్టణ పరిధి కూడా పెరుగుతోంది. కలెక్టరేట్ నుంచి కళాశాల రోడ్డులోని వై జంక్షన్ వరకూ సుమారు 6 కిలోమీటర్ల పొడవునా పట్టణం విస్తరించి ఉంది. సమీప గ్రామాల నుంచి ప్రజలు ఉపాధి కోసం మార్కాపురం పట్టణానికి వలస వస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధికారులు కూడా వార్డులను విభజిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం జనాభా ఎక్కువ ఉన్న వార్డులను గుర్తించి ఆ ప్రాంతాలను విభజించి నూతన వార్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 17, 18, 19 తదితర వార్డుల నుంచి వార్డుల పెంపుదల ఉన్నట్లు తెలుస్తుంది. నూతన వార్డులతో మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. షెడ్యూల్ ఇలా.. త్వరలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ వార్డు విభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 17న వార్డుల డ్రాఫ్టును సిద్ధం చేయడం, 18 నుంచి 24 వరకూ ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మే 25 నుంచి జూన్ 5 వరకూ అభ్యంతరాలను పరిశీలించి కలెక్టర్కు ప్రతిపాదనలు పంపుతారు. వచ్చిన ప్రతిపాదనలను కలెక్టర్ జూన్ 6 నుంచి జూన్ 11 వరకూ పరిశీలించి నివేదికను కమిషనర్ అండ్ డైరెక్టరేట్కు పంపుతారు. అక్కడ తుది ఆమోదం తరువాత జూన్ 12 నుంచి 23 మధ్య పరిశీలన అనంతరం జూన్ 24 నుంచి 26 మధ్య తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది. దీంతో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు నేతృత్వంలో సిబ్బంది వార్డుల విభజన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో పెరగనున్న వార్డులు 35 నుంచి 40కి పెరగనున్న వార్డులు ఈ నెల 17న ప్రకటన 18 నుంచి అభ్యంతరాల స్వీకరణ -
గంగమ్మకు ఎమ్మెల్యే తాటిపర్తి నివాళి
పెద్దదోర్నాల: అనారోగ్యంతో మృతి చెందిన పెద్దదోర్నాల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ నానమ్మ మృతికి యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఘన నివాళులర్పించారు. ఎంపీపీ పద్మజా యల్లేష్ నానమ్మ ఒంటేరు గంగమ్మ అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హుటాహుటిన మండల కేంద్రంలోని ఎంపీపీ ఇంటికి చేరుకుని గంగమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఒంటేరు రమణయ్య, ఎంపీపీ గుమ్మా పద్మజ, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్లను ఆయన పరామర్శించి వారికి ప్రగాడ సానుభూతిని ప్రకటించారు. నివాళులర్పించిన వారిలో మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దర్శనం నాగయ్య, మార్కెట్ యార్డు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఒంటేరు నాగేఽశ్వరరావు, జేసీబీ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలలతో ఆటవిడుపు
క్వాడ్ బైక్పై తీరాన్ని చుట్టేస్తూ..వేసవి సెలవులు..ఆదివారం కలిసి రావడంతో కొత్తపట్నం సముద్ర తీరం పర్యాటకులతో నిండిపోయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ సముద్ర తీరంలో అలలతో ఆటవిడుపుగా సేదతీరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కేరింతలు కొట్టారు. గుర్రంపై, క్వాడ్ బైక్లో షికార్లు చేశారు. చిన్నారులు ఇసుకలో గూళ్లు కట్టుకుని ఆడుకున్నారు. కొత్తపట్నం సముద్రతీరంలో పర్యాటకుల సందడితీరంలో చిన్నారుల కేరింత– సాక్షి, ఒంగోలు -
జలవనరులా..వ్యర్థాల నిలయాలా..?
సింగరాయకొండ: రక్షిత మంచినీటి చెరువులను కొందరు అక్రమార్కులు కలుషితం చేస్తున్నారు. చెరువుల్లో ఫ్యాక్టరీ వ్యర్థాలు, రోడ్డు వ్యర్థాలతో పాటు యాసిడ్ వ్యర్థాలు సైతం వేస్తున్నారు. దీంతో దాహం తీర్చే నీరు కలుషితంగా మారి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. మండలంలోని కలికవాయ ఎర్రకుంట చెరువు, మూలగుంటపాడు జువ్వలగుంట చెరువులు రక్షిత మంచినీటి పధకాలకు ఉపయోగపడుతుండగా కొందరు అక్రమార్కులు ఈ చెరువుల్లో ఫ్యాక్టరీ వ్యర్థాలు వేస్తూ కలుషితం చేస్తున్నారని దీంతో చెరువులు కలుషితమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కలికవాయ చెరువులో ఫ్య్క్టారీ యాసిడ్ వ్యర్థాలు కలికవాయ ఎర్రగుంట చెరువులోని నీటిని గ్రామస్తులు రక్షిత మంచినీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ చెరువులో 5 బోర్లు వేసి రక్షిత మంచినీటి పథకం నిర్వహిస్తున్నారు. కానీ ఇటీవల అక్రమార్కులు ఫ్యాక్టరీలోని యాసిడ్ వ్యర్థాలను తీసుకుని వచ్చి చెరువులోని గుంతలో పోయగా శనివారం దాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా అధికారులు పట్టించుకోవడంతో స్థానికులు జేసీబీతో యాసిడ్ వ్యర్థాలు ఉన్న గుంతను పూడ్చి చెరువులో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు భాద్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మరమ్మతు చేసిన వ్యర్థాలను కూడా చెరువులో పోస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జువ్వలగుంట చెరువులో ఫ్యాక్టరీ వ్యర్థాలు మండలంలోని మూలగుంటపాడు పంచాయతీలోని జువ్వలగుంట చెరువులో ఆదివారం సమీపంలోని ఫ్యాక్టరీకి చెందిన వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తీసుకుని వచ్చి పోసి మరీ తగలబెడుతున్నారు. ఈ వ్యర్థాలను ఫ్యాక్టరీ నుంచి తరలించే కాంట్రాక్టును తీసుకున్న వ్యక్తి ఈ విధంగా చెరువులో వ్యర్థాలను పోసి తగలబెడుతున్నారని, అంతేకాక సమీపంలో రక్షిత మంచినీటి పథకం సంపు కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను డంపింగ్ యార్డులుగా భావిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని రక్షిత మంచినీటి పథకాలను, చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కలికవాయ ఎర్రకుంట చెరువులో నీటి పక్కన పోసిన యాసిడ్ వ్యర్థాలు జువ్వలగుంట చెరువులో వేసిన ఫ్యాక్టరీ వ్యర్థాలు కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన యాసిడ్ వ్యర్థాలు కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన రోడ్డు వ్యర్థాలు కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన యాసిడ్ వ్యర్థాలు మంచినీటి చెరువులను కలుషితం చేస్తున్న అక్రమార్కులు కలికవాయ ఎర్రకుంట చెరువులో యాసిడ్ వ్యర్థాలు, రోడ్డు వ్యర్థాలు జువ్వలగుంట చెరువులో ఫ్యాక్టరీల వ్యర్థాలు రక్షిత మంచినీటి పథకాలకు ఇబ్బంది చెరువులు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు
అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మండపారాధన, విశేష అభిషేకాలు నిర్వహించారు. సీతారాముల స్వామివారికి స్నపన, ఉత్సవ మూర్తులకు తిరుమంజనం సేవ నిర్వహించారు. అర్చన, మండప దేవతా పూజలు, హోమాలు, బలిహరణ, సూర్య నమస్కారాలు మహానివేదన, పంచహారతులు నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా స్వామివార్లకు మల్లికాపుష్ప అర్చన నిర్వహించారు. ప్రదోషకాలార్చన, చతుర్వేద స్వస్తి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉభయ దాతలుగా బంధుకవి ప్రవీణ్, మధుమాలతి దంపతులు వ్యవహరించారు. రాత్రికి గజవాహన సేవ నిర్వహించారు. విశేషంగా ఉత్సవ మూర్తులకు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పాలకమండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్రావు, ఏసీ తిమ్మానాయడు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. -
చేపల కోసం చెరువు ఖాళీ
కందుకూరు: సాగునీటి చెరువుల్లో చేపల పెంపకందార్లు చేపలు పట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చేపలు పట్టుకునే పేరుతో చెరువులోనీ నీటిని బయటకు వెళ్లగొడుతున్నారు. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామంలోని గోకులచెరువు ఇందుకు ఉదాహరణ. గోకులచెరువులో ప్రస్తుతం రెండు అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. చెరువులో ఉన్న నీటిని వేసవి సీజన్ కావడంతో గ్రామంలోని పశువులకు, గొర్రెలకు ఉపయోగించుకుంటున్నారు. వేసవిలో మూగజీవాలకు చెరువు నీరు ప్రస్తుతం దాహార్తిని తీరుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ చెరువులో చేపలు పెంచుకున్న వారు చెరువుని నీటిని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. చేపలు పట్టుకోవాలనే ఉద్దేశంతో చెరువు నీటిని ట్రాక్టర్ మోటార్ పెట్టి బయటకు వెళ్లగొడుతున్నారు. చెరువులోని నీటిని ఇలా వృథాగా బయటకు వెళ్లగొట్టడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అవసరం లేకుండా నీటిని తోడేస్తున్నారని, దీని వల్ల భవిష్యత్లో వర్షాలు పడకపోతే చెరువు పూర్తిగా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పశువుల నీటి అవసరాలకు కూడా నీరు దొరికే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. నీటిని అక్రమంగా బయటకు పంపుతున్న వ్యక్తులను ప్రశ్నిస్తే ఇరిగేషన్ అధికారుల అనుమతితోనే నీరు వెళ్లగొడుతున్నామని సమాధానం చెప్తున్నారని, అధికారులు అడ్డగోలుగా ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు నీటిని బయటకు పంపేందుకు అధికారికంగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అదే సందర్భంలో ఇరిగేషన్ అధికారులకు ఈ విషయం తెలిసినా చూసీచూడనట్లు వదిలేసి సదరు వ్యక్తులకు సహకరిస్తున్నట్లు సమాచారం. -
లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం
ఒంగోలు టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు స్పష్టం చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్ నోటిఫికేషన్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ...స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని రావడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం మొండిగా లేబర్ కోడ్లను అమలు చేయాలను కోవడం సమర్ధనీయం కాదన్నారు. ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలు ఏమయ్యాయో ప్రధానమంత్రి మోడీ ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయానికి తావు లేదనుకోవడం ప్రజా స్వామ్యానికి సిగ్గుచేటన్నారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ లేబర్ కోడ్లను అమలు చేస్తూ ఇచ్చిన గజిట్ నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులను బలి చేయాలనుకోవడం అవివేకమన్నారు. దేశంలో సంపద సృష్టించేది కార్మికులు, ఉద్యోగులేనని, కార్పొరేట్లు కాదన్న విషయం గ్రహించాలన్నారు. కార్మికులు, ఉద్యోగులు హక్కులు కాలరాస్తున్న మోడీ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తంబి శ్రీనివాసులు, సయ్యద్ బాషా, ఆర్ మాలకొండయ్య, జి.రమేష్, దాసరి మల్లికార్జున రావు, డి.రమేష్ పాల్గొన్నారు. -
ఒంగోలులో బాలల తెలుగు మహాసభలు
ఒంగోలు మెట్రో: వచ్చే డిసెంబర్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం ఒంగోలు మండలం కొప్పోలులోని నెక్ట్స్జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నెక్ట్స్జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆదివారం నిర్వహించిన ‘ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 14 సంవత్సరాల్లోపు తెలుగు బాలబాలికలు ఈ మహాసభల్లో పాల్గొంటారని అన్నారు. బాలబాలికలచే అష్టావధానం, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట, తప్పెట గుండ్లు, పద్యధారణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కెన్యా దేశాధ్యక్షుడు, మన రాష్ట్రపతిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామని తెలిపారు. తమ సంగీత సాహిత్యాలతో తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చిన ప్రముఖులు ప్రకాశం జిల్లాలో ప్రభవించారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు భాషోద్యమం గృహోద్యమంగా రావాలనే ఉద్దేశంతో బాలలకు తెలుగు మహాసభలు నిర్వహించడం భాషా వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సభలకు ప్రకాశం జిల్లా రచయితల సంఘంతో పాటు జిల్లాలోని అన్ని సాహిత్య, కళాసంఘాల సహకారం ఉంటుందని చెప్పారు. మహాసభల జాతీయ సంచాలకురాలు కొల్లి రామావతి మాట్లాడుతూ ఇప్పటికే పలు జిల్లాల్లో సన్నాహక సదస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంచాలకులు, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామచంద్రుని రమేష్ కృష్ణ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పాలూరి శివప్రసాద్, కప్పగంతుల మధుసూదనశాస్త్రి, అన్ను విజయ కుమారి, అరుణ, పి.రాజ్యలక్ష్మి, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, ఎస్ఎండీ రఫీ, గాడేపల్లికి దివాకరదత్తు, నల్లూరి కాంతి, అంగలకుర్తి ప్రసాదు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, పిన్ని వెంకటేశ్వర్లు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, బీనీడి కృష్ణయ్య, నెమ్మాని సీతారామమూర్తి, ఐ.మురళీకృష్ణ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, సయ్యద్ ఇస్మాయిల్, ఎంవీఎస్ శాస్త్రి, గణపతిరాజు వెంకట మల్యాద్రి పాల్గొని జిల్లాలోని సంగీత, సాహిత్య, కళా, నాటక రంగ ప్రముఖుల గురించి ప్రసంగించారు. అనంతరం గజల్ శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. -
మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): సంతనూతలపాడు మండల పరిధిలోని ఎండ్లూరు డొంక సమీపంలో జిల్లా మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9963005209 నంబర్ను సంప్రదించాలన్నారు. గిద్దలూరు రూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో లారీ బోల్తాపడి నాలుగు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిన ఘటన మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో ఆదివారం జరిగింది. గిద్దలూరు నుంచి నంద్యాల వైపుగా వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డుకు అడ్డంగా బోల్తాకొట్టింది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరుకు వచ్చి వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని పక్కకు తొలగించారు. ఒంగోలు టౌన్: వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న కారణంగా మార్కాపురం, ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, సాధ్యమైనంత త్వరగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. మార్కాపురం టౌన్: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం జరగనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమం వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని వేళల్లో మార్పు చేసినట్లు కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ పీజిఆర్ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని, అదేవిధంగా 1100 నంబర్కు ప్రజలు ఎవరైనా కాల్చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. -
రేషన్కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాలి
మార్కాపురం టౌన్: రేషన్కార్డుల్లో ఉన్న సభ్యులంతా తప్పనిసరిగా ఈకైవెసీ చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్య అన్నారు. ఆదివారం నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 10,15,212 కార్డులు ఉన్నాయని, అందులో 9,48,003 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్లు కార్డుదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే భవిష్యత్లో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, ఎన్ఫోర్సుమెంట్ డీటీ ఆర్ సాలమ్మ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం జాస్తి.. వసతి నాస్తి..!
చీమకుర్తి: నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన భవనాల నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో అరకొర వసతులతో అవస్థపడుతూ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ అలసత్వంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న హాస్టల్ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో విద్యార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఒక్క పైసా విదల్చకపోవడంతో.. జిల్లా మినరల్ ఫండ్ అయిన డీఎంఎఫ్ నిధులతో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి కలెక్టర్ చర్యలు చేపట్టారు. వాటిలో చీమకుర్తి ఎస్సీ బాలికల హాస్టల్కు రూ.2 కోట్లు, సంతనూతలపాడు ఎస్సీ బాలుర హాస్టల్కు రూ.2 కోట్లు, ఒంగోలులోని సంతపేటలో డీఆర్ఆర్ఎం హైస్కూలు దగ్గరున్న బాలికలకు చెందిన రెండు హాస్టళ్లకు రూ.6.15 కోట్లు, సక్కుబాయమ్మ కాలేజీ బాలికల హాస్టల్కు రూ.4.50 కోట్లు, ఒంగోలులోని అంజయ్యరోడ్డులో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్కు రూ.3.70 కోట్లు మంజూరు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ భవనానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం మీద 7 హాస్టళ్ల భవనాలకు కేంద్రంతో పాటు జిల్లా డీఎంఎఫ్ నిధులు మొత్తం కలిపి రూ.19.70 కోట్లు మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి రెండు సంవత్సరాల నాడు టెండర్లు పిలిచారు. కానీ, నిధుల విడుదలతో పాటు వేగవంతంగా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్ భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నారు. హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించే క్రమంలో విద్యార్థులను అద్దె భవనాల్లోకి తరలించారు. కానీ, అద్దె భవనాల యజమానులు అడిగినంత అద్దెలను ప్రభుత్వం చెల్లించకపోవడం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తున్న అద్దెలు సరిపోకపోవడంతో అద్దె భవనాల యజమానులు అసంతృప్తితో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అద్దె భవనాలలో కనీసం మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ హాలు, తాగునీటి సదుపాయలు కూడా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొంత మంది తమ పిల్లలను హాస్టళ్ల నుంచి తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నూతన విద్యా సంవత్సరానికై నా హాస్టళ్ల భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా, ఆ దిశగా కూడా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. హాస్టళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే.. ఆ విషయం అర్థమవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించాల్సిన నిధులతో పనిలేనందున కేవలం కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న డీఎంఎఫ్ నిధులను త్వరితగతిన విడుదల చేసి హాస్టళ్ల భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, వచ్చే నెలలో పాఠశాలలు తెరిచే సమయానికి అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అలసత్వంతో రెండేళ్లుగానత్తనడకన వసతి గృహాల నిర్మాణం రూ.19.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న 7 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు ఒక పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 కోట్లు జిల్లా డీఎంఎఫ్ నుంచి మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేకపోయినా.. ఉన్న నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కూడా పూర్తయ్యేలా లేని హాస్టళ్లు అద్దె భవనాల్లో అరకొర వసతులతో కునారిల్లుతున్న విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు హాస్టళ్ల భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి : హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హాస్టళ్ల భవనాలను రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి త్వరగా పూర్తి చేయాలి. వచ్చే జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించే సమయానికి విద్యార్థులు అద్దె భవనాల్లోని హాస్టళ్లలో చేరేందుకు సుముఖంగా లేరు. అందువలన విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేసి నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనాలను వెంటనే పూర్తి చేయాలి. తొట్టెంపూడి రామారావు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు -
ఆటోను ఢీకొట్టిన బైక్
● బీటెక్ విద్యార్థి మృతి జరుగుమల్లి(సింగరాయకొండ): రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ఆటోను మోటారు సైకిల్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరుగుమల్లి మండల పరిధిలోని పాలేరు బ్రిడ్జిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు నగరం కొరిటిపాడులోని సాకేతనగర్ వీధికి చెందిన కారసాని రేవంత్ మణి చినకోటిరెడ్డి(21) తిరుపతిలోని మోహన్బాబు యూనివర్శిటీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు కావడంతో మోటారు సైకిల్పై గుంటూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పాలేరు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా రాంగ్రూట్లో వస్తున్న ఆటోను తప్పించబోయి బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో తిరగబడగా, రేవంత్ మణి చినకోటిరెడ్డికి కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. మృతుని తండ్రి శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. ఒంగోలు టౌన్: జిల్లా కోర్టులోని కార్యాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి తెగబడటం సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని రెండో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు, స్పెషల్ మొబైల్ కోర్టుల్లోని కార్యాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీకి యత్నించారు. రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టిన దుండగులు ప్రాపర్టీ గదిలో ప్రవేశించారు. అలాగే స్పెషల్ మొబైల్ కోర్టు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించిన వ్యక్తులు రెండు బీరువా తాళాలను కోశారు. మిగిలిన బీరువాల హ్యాండిల్స్ను తిప్పి వదిలేశారు. శుక్రవారం ఉదయం కోర్టుకు వచ్చిన సిబ్బంది చూసి సమాచారం ఇవ్వడంతో జ్యుడిషియల్ అధికారులు ఒన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోర్టు వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీంను రప్పించి సాక్ష్యాధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఒన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ముఖ్యమైన పత్రాలేవీ పోలేదని కోర్టు సిబ్బంది పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రాపర్టీ గదిలో ఏముంటాయి? కోర్టు ప్రాపర్టీ గదిలో చోరీకి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ప్రాపర్టీ గదిలో విలువైన చెక్కులు, ఆస్తి కేసులకు సంబంధించి ఒరిజినల్ దస్తావేజులు, క్రిమినల్ కేసులకు సంబంధించి పోలీసులు సేకరించిన కీలక సాక్ష్యాధారాలను ప్రాపర్టీ గదిలో భద్రపరుస్తారని సమాచారం. ఇక్కడ ఏఆర్ పోలీసులతో పాటుగా కోర్టు గార్డు కూడా నిత్యం కాపలా ఉంటారని తెలుస్తోంది. అయినా చోరీకి తెగబడటంపై న్యాయశాఖ వర్గాలతోపాటు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి కోరారు. శుక్రవారం ప్రకాశం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్ను జిల్లా నాయకులు కలిసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మే 25వ తేదీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 24 ప్రకారం ఎయిడెడ్ పాఠశాలల్లో సర్ ప్లస్ ఉపాధ్యాయులను ప్రతినెలా ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. కానీ, ప్రకాశం జిల్లాలో 12 ఎయిడెడ్ పాఠశాలల్లో గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు లేక 37 మంది ఉపాధ్యాయ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. జీవో నంబర్ వన్ ప్రకారం సర్ ప్లస్గా ఉన్న 165 మంది ఉపాధ్యాయులకుగానూ మొత్తం 202 మంది ఎయిడెడ్ మిగులు ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా సీనియార్టీ జాబితా రూపొందించి వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. -
చెమట చుక్కల కష్టం బుగ్గిపాలు
● రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం ముండ్లమూరు: వ్యవసాయ భూమిలో వ్యర్థాలను ఓ రైతు తగలబెడుతుండగా.. పక్కనే ఉన్న మరో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఒకరు తన పొలంలో చెత్తకు నిప్పు అంటించాడు. ఈ సమయంలో గాలులకు నిప్పు రవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పోలేరు అనే రైతుకు చెందిన మొక్కజొన్న తోటకు అంటుకున్నాయి. మారెళ్ల నుంచి వేంపాడు వస్తున్న కొందరు రైతులు పరిస్థితిని గమనించి వేంపాడు గ్రామస్తులకు విషయం తెలియజేశారు. వారు పొలాల వద్దకు వెళ్లే లోపే కోత దశలో ఉన్న 4 ఎకరాల మొక్కజొన్న పంట, డ్రిప్ పైపులు, డీప్బోర్ స్టార్టర్ పెట్టె, నీళ్ల పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు చుట్టుపక్కల ఉన్న పంటలకు వ్యాపించే అవకాశం ఉండటంతో ట్రాక్టర్ రోటావేటర్ సాయంతో పొలం చుట్టూ దున్నారు. మంటలు అదుపులోకి రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అగ్ని ప్రమాదం కారణంగా రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. -
సంబరాలు ముగిశాయి సమస్యలు మిగిలాయి
మార్కాపురం: కొత్త జిల్లాగా మార్కాపురం ఆవిర్భవించి ఐదు నెలలైనా ఇంకా పాలనాపరమైన బాలారిష్టాలను దాటలేదు. కీలకమైన జిల్లా స్థాయి అధికారులతో పాటు వివిధ శాఖల్లోని సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను మాత్రమే నియమించారు. కీలకమైన పోలీసు బాస్, వ్యవసాయశాఖ, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, డీఈఓ, విద్యాశాఖ, ఆర్టీఓ, ఆర్టీసీ, వెటర్నరీ, డీపీఓ తదితర శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించలేదు. మార్కాపురంలో ఉండే డివిజన్ స్థాయి అధికారులనే మార్కాపురం జిల్లాకు ఇన్చార్జిలుగా నియమించారు. ఆయా కార్యాలయాల్లో ఒక గదిని జిల్లా అధికారులకు కేటాయిస్తున్నట్లుగా జిల్లా ప్రారంభ కొత్తలో ఫొటోలు తీసి మమ అనిపించారు. అంతకుమించి ఒక్క నూతన కార్యాలయం కానీ, జిల్లా స్థాయి రెగ్యులర్ అధికారిని కానీ ప్రభుత్వం నియమించకపోవడంతో పాలన నత్తనడకతో పోటీపడుతోంది. దీంతో ముఖ్యమైన ఫైల్స్, పాలనా వ్యవహారాల కోసం స్థానిక అధికారులు జిల్లా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. జిల్లా ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా ఇంత వరకూ పూర్తిస్థాయిలో అధికారులను నియమించలేదు. దీంతో ప్రధానమైన శాఖల్లో స్థానికంగా ఉండే అధికారులు నిర్ణయం తీసుకోలేక ఒంగోలులో ఉండే ప్రకాశం జిల్లా అధికారుల నిర్ణయాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రూ.50 కోట్లు ప్రకటించారు. అయితే ఆ నిధులు ఇంతవరకూ వచ్చాయో లేదో కూడా తెలీదు. మరో వైపు తాత్కాలిక కలెక్టరేట్ నిర్మాణం కోసం ఖర్చుచేసిన అధికారులు, కూటమి కాంట్రాక్టర్లు బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులను పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో ఆయా శాఖలకు ఆఫీసుల నిర్మాణం కూడా ఇప్పట్లో లేనట్టు తెలుస్తోంది. కేవలం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలు మాత్రమే సుంకేశుల పునరావాస కాలనీలో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో పలు సెక్షన్లలో సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఇంకా వ్యవసాయ, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, నీటి పారుదల, తాగునీటి విభాగం తదితర శాఖల్లో కూడా సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సబ్ స్టాఫ్లను కూడా నియమించలేదు. కేవలం జిల్లా మాత్రమే ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఒంగోలు నుంచి అధికారుల రాక.. పోక.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్కు స్థానిక అధికారులతో పాటు కొంతమంది జిల్లా స్థాయి అధికారులు ఒంగోలు నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను నియమించినా మిగిలిన శాఖల అధికారుల నియామకం జరగకపోవడంతో ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వ్యవసాయ శాఖ డీఏఓ కార్యాలయాలు మాత్రం తాత్కాలికంగా భూసార పరీక్షల కేంద్రం కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు కానీ ప్రారంభించలేదు. జిల్లా ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా కీలకమైన ఎస్పీని నియమించకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ మార్కాపురం జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. కొత్త జిల్లాకు జిల్లా స్థాయి అధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. కొన్ని ఫైల్స్ ఆమోదం కోసం ఒంగోలుకు తీసుకెళ్లి సంతకాలు చేయిస్తున్నారు. దీంతో జిల్లా ఏర్పాటుకు ముందున్న పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం జిల్లాలో అధికారుల కొరత మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఇన్చార్జిలే దిక్కు -
‘రామ్ జీ..’ పనికి రాలేం!
బేస్తవారిపేట: ఎండలు తీవ్రరూపం దాల్చాయి. వ్యవసాయ పనులు కూడా మందగించాయి. అయినప్పటికీ వీబీజీరామ్జీ పథకం కింద పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. నెలల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పనులు చేసినా ఫలితం లేదని కూలీలు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కారు కొత్తగా ఫేస్ యాప్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడంతో హాజరు నమోదు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూలీలు చెబుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ రోజువారీ కూలీల లక్ష్యంలో నాలుగో వంతు కూడా పనులకు హాజరు కావడం లేదని వీబీజీరామ్జీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో 2,05,111 జాబ్కార్డుల్లో 3,71,879 మంది యాక్టివ్ కూలీలు ఉన్నారు. వీరిలో 46,791 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మౌలిక వసతులు దూరం శ్రీఉపాధిశ్రీ పనులు నిర్వహించే ప్రదేశంలో వేతనదారుల కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పనికి వెళ్లే వారికి నిలువ నీడ కరువైంది. కనీసం మంచినీరు కూడా అందుబాటులో ఉంచడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. పనిలో ఉండగా ఏదైనా జరిగితే ఊళ్లోకి రావాల్సిందే. ప్రాథమిక వైద్యం కోసం మెడికల్ కిట్లు కూడా ఉంచడం లేదు. పని ప్రదేశంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వేతన జీవులకు అదనపు భత్యం జమ చేయాల్సి ఉంది. సౌకర్యాలు లేక.. ఎండ వేడిమికి తాళలేక చెట్ల కింద సేద తీరాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మునుముందు ఎండల తీవ్రతను ఊహించుకుంటేనే భయమేస్తోందని అంటున్నారు. వేసవి అలవెన్స్ ఎక్కడ? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలు చేసిన పనికి 30 శాతం అదనపు భత్యం చెల్లించారు. ప్రయాణ, కరువు భత్యం ఖర్చు కింద గడ్డపారకు రూ.10, తట్టకు రూ.5, మంచినీటికి రూ.5, ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే వారికి రూ.20 చొప్పున ఇవ్వాల్సి ఉంది. వీటితో పాటు పని ప్రదేశాల్లో కూలీలకు నీడ కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చిన్నచూపు చూడటంతో రెండేళ్లుగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా పెరిగిన ఎండలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. వేతనం మంజూరులో నెలల తరబడి జాప్యం పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కరువు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి వేసవి అలవెన్స్ ప్రకటించడంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం మండే ఎండలో అవస్థలు పడలేక పనులకు కూలీల వెనుకడుగు మార్కాపురం జిల్లాలో 3,71,879 మంది యాక్టివ్ కూలీలు రోజూ పని చేస్తోంది 46,791 మందే.. -
మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాల సరఫరా
● డీఈఓ రేణుక ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్య పుస్తకాలు ఈనెల 8వ తేదీ నుంచి మండల విద్యా వనరుల కేంద్రాలకు మొదటి దశలో సరఫరా చేసినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా మండల విద్యా వనరుల కేంద్రాలకు పుస్తకాల సరఫరాకు జెండా ఊపి డీఈఓ రేణుక, ఏటీఎం సయ్యద్ మెహబూబి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని తెలిపారు. ఒంగోలులోని పాఠ్యపుస్తకాల గోడౌన్కు 11 లక్షల పాఠ్యపుస్తకాలు వచ్చాయని, వాటిని మొదటి విడతగా మండల కేంద్రాలకు పంపించినట్లు చెప్పారు.జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2.34 లక్షల మంది ఉన్నారన్నారు. జూన్ మొదటి వారంలోగా పుస్తకాలను బడులకు అందించే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి.కిషోర్ బాబు, మేనేజర్ పేరయ్య, సీనియర్ అసిస్టెంట్ జిందా బాషా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా ఎడ్ల సత్తా
కంభం: రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని మండలంలోని రావిపాడు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పాలపండ్లసైజు బండలాగుడు పోటీలను గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 17 జతల ఎడ్లు పాల్గొనగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బీఎల్ఎన్ బుల్స్ శశాంక్ శ్రేయ ఎడ్లు 4500 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గిద్దలూరు మండలం మోడంపల్లికి చెందిన దేమ శ్రీరాములు ఎడ్లు 4200 అడుగులు లాగి ద్వితీయ స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మి ఎడ్లు, పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన వినోద్ కుమార్ ఎడ్లు 4200 అడుగుల దూరం లాగి మూడవ, నాల్గవ స్థానాల్లో దర్శి మండలం రాజంపల్లికి చెందిన శివన్నారాయణ ఎడ్లు 4087 అడుగులు లాగి 5వ స్థానం, రావిపాడుకు చెందిన పిదప శరభారెడ్డి ఎడ్లు 3916.9 అడుగులు లాగి ఆరో స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన సూరా చైత్రా రెడ్డి, పూజితారెడ్డి ఎడ్లు 3830.5 అడుగులు లాగి 7వ స్థానం, మండలంలోని సైదాపురానికి చెందిన సబ్బసాని శశిధర్ రెడ్డి, నెమలిదిన్నె చెన్నారెడ్డి ఎడ్లు 3706.2 అడుగులు లాగి ఎనిమిదో స్థానంలో నిలిచాయి. -
దళారులకే
కోతకు వచ్చి పడిపోయిన మొక్కజొన్న పంట అద్దంకి: కూటమి ప్రభుత్వంలో రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేసే వారే లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు తాము చెప్పిందే మద్దతు ధర అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వం కొనుగోలు చేయక.. పండించిన పంటను నిల్వ చేసుకునే శక్తి లేక దళారులు అడిగిన కాడికి అమ్ముకుని రైతులు నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్లూరులో అధికంగా సాగు చేస్తారు. అలాగే కనిగిరి, అద్దంకి నియోజకవర్గాల్లో సైతం మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలో 20 వేలకుపైగా సాగవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించడంతో ఇన్నిరోజులు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశపడ్డారు. గతేడాదికి మించిన లాభాలు ఉంటాయని మురిసిపోయారు. తీరా విక్రయించే సమయానికి వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. కనీస మద్దతు ధర, వ్యాపారులు కొనుగోలు చేసే ధరకు భారీ వ్యత్యాసం ఏర్పడింది. మొక్కజొన్నలు క్వింటాకు మద్దతు ధర రూ.2400 ఉండగా రూ.1600లకు కొనుగోలు చేస్తున్నారు. ధర ఆశాజనకంగా లేకపోవడంతో కొందరు రైతులు ఇంటికి చేర్చుకుని గోతాల్లో పట్టి మండెలు కట్టారు. ఇంకొందరు కోతలు కోస్తున్నారు. ఇంకొందరు ధర వచ్చిన సమయంలో విక్రయించుకోవచ్చనే ఉద్దశంతో కోల్డ్ స్టోరేజీల్లో భద్రపర్చుకుంటున్నారు. పసుపుదీ అదే దారి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 900 నుంచి 1100 ఎకరాల్లో పసుపు సాగులో ఉంది. ఎక్కువగా గిద్దలూరు, కంభం, రాచర్ల, బేస్తవారిపేట, కొమరోలు, సంతమాగులూరు, తాళ్లూరు, పామూరు, అర్ధవీడు, సీఎస్పురం, దర్శి తదితర మండలాల్లో సాగు చేస్తున్నారు. వీటిలో అత్యధిక శాతం గిద్దలూరు నియోజకవర్గంలోనే ఉంది. తెగుళ్ల కారణంగా దిగుబడి సగానికి సగం పడిపోయింది. బాగా పండితే ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. తెగుళ్లు సోకడంతో చాలా మందికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దాంతో పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన ధరలు మూడు నెలల కిందట క్వింటా పసుపు ధర రూ.14 వేలు పలకగా, ప్రస్తుతం రూ.9 వేల మధ్య పలుకుతోంది. గుంటూరు, కడప మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దోచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ ధరలు భారీగా తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని శాంగ్లీ మార్కెట్లో మాత్రం క్వింటా రూ.12 వేలకు కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పంట కళ్లాల్లో ఆరబోసి కొమ్ములను వండే ప్రక్రియ ప్రారంభమైంది. శింగరకొండపాలెంలో పసుపు కొమ్ములను వండుతున్న రైతుదోచేస్తున్న దళారులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలకు అడుగడుగునా గండాలే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎన్నో కష్టాలకోర్చి సాగుచేసి పంటలను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లు, రవాణా, మద్దతు ధర, దళారులు ఇలా అన్నిచోట్లా ఆటంకాలే. కనీస మద్దతు ధర లభించకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వచ్చిన ధరలకే తెగనమ్ముకుంటున్నామని రైతన్న వాపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న, పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి, మద్దతు ధర అంటూ రైతులను మోసం చేసింది. మద్దతు ధరను ప్రకటించడంతోనే సరి పెట్టింది. మొక్కజొన్న, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా దళారులు రైతులను దగా చేస్తున్నారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసి ముంచేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు మండలానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. దీంతో దళారులు సైతం మద్దతు ధర కంటే అధిక ధరలకు కొనుగోలు చేయడంతో రైతులు లాభపడ్డారు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో సచివాలయ ఉద్యోగికి చోటు
కంభం: స్థానిక కందులాపురం కాలనీకి చెందిన యామర్తి సంతోష్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాదులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2 వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొనగా అందులో ప్రతిభ కనబరిచిన 777 మందిని ఎంపిక చేశారు. విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్ గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డును అందుకున్నారు. సంతోష్ బేస్తవారిపేట మండలం పెద్దఓబినేనిపల్లి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు. ఒంగోలు టౌన్: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సర్పంచ్లను కుత్సిత రాజకీయ ప్రయోజనాల కోసం వేధించడం సరికాదని సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో దాదాపుగా రూ.20 కోట్లకు పైగా చేసిన పనులకు సంబంధించి నిధులు ఉన్నప్పటికీ చెల్లింపులు చేయకుండా మహిళా సర్పంచులను ఇబ్బందులు పెడుతున్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల బిల్లులను చెల్లించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సర్పంచులను మాత్రమే టార్గెట్ చేశారని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, బాపట్లకు చెందిన సర్పంచుల బకాయిలపై ఆదివారం ఒంగోలులో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. -
గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి విఫలం
టంగుటూరు: రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద శుక్రవారం ఆదిమూలపు సురేష్ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేలం కేంద్రాన్ని సందర్శించి స్వయంగా వేలం పూర్తయ్యే వరకు ప్రతి పొగాకు బేలును పరిశీలించారు. ఫలితంగా రోజుటికన్నా తిరస్కరణ బేళ్లు తగ్గడంతో పాటు, ప్రతి రోజు కంటే రూ.10 అధికంగా వచ్చాయని రైతులు తెలిపారు. శుక్రవారం టంగుటూరు వేలం కేంద్రంలో 320 బేళ్లు వస్తే అందులో కేవలం 201 బేళ్లు కొన్నారు. 119 బేళ్లు తిరస్కరించారు. వీటిలో అత్యధికంగా 108 బేళ్లను ఐటీసీ కంపెనీ కొనుగోలు చేసిందని, దీనిని బట్టి ఈ కంపెనీ ఆధిపత్యం ఏవిధంగా కొనసాగుతుందో అర్థమవుతుందని సురేష్ అన్నారు. అనంతం వేలం నిర్వహణ అధికారి సత్య శ్రీనివాస్, పొగాకు బయ్యర్లతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు, తిరస్కరణ బేళ్లు లేకుండా చూడాలన్నారు. కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోతే రైతులు అప్పుల పాలుకాక ఏమవుతారన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కొండంత ఆశలు చూపి అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం దారుణమని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది 148 మిలియన్ల పొగాకు పంట ఉత్పత్తి అవ్వగా వేలం ప్రారంభమై 45 రోజులైనా ఇప్పటి వరకు కేవలం 2.5 మిలియన్ల కేజీలు కొనుగోలు చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ధరలకు రైతు ఎకరాకు రూ.50 వేలు నుంచి రూ.70 వేలకు పైగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వేలం కేంద్రాలకు వచ్చే పొగాకు బేళ్లలో 55 శాతం బేళ్లు వెనక్కి తిప్పి పంపుతున్నారని, వెల్లంపల్లి వేలం కేంద్రంలో అయితే 62 శాతం బేళ్లు వెనక్కి పంపారని దీంతో రైతుపై అదనపు భారం పడటంతో పాటు ఒక్కో బేలుకు 2 కేజీలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. సంక్షోభం దిశగా పొగాకు మార్కెట్ పొగాకు మార్కెట్ సంక్షోభం దిశగా పయనిస్తోందని ఆదిమూలపు సురేష్ అన్నారు. రైతు ఆశించిన స్థాయిలో ధరలు పెరగడం లేదు, మార్కెట్ మరింత పతనమై తిరస్కరణ బేళ్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఈ రీజియన్లో 53.67 శాతం బేళ్లు వెనక్కిపోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ ఉచిత సలహాలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టిపెట్టాలంటుంటే రైతుల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. మార్కెట్ పరిస్థితిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై రైతు కమిటీల ప్రతినిధులు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతపల్లి హరిబాబు, మసనం వెంకట్రావు, బచ్చల కోటేశ్వరరావు, పిన్నిక శ్రీనివాసులు, దూదిగుంట మల్లికార్జున, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు పూసపాటి నర్సారెడ్డి, టంగుటూరు టౌన్ అధ్యక్షుడు కొమ్ము సురేంద్ర, జిల్లా రైతు విభాగం కార్యదర్శి వల్లంరెడ్డి రమణారెడ్డి, జోగి నరసింహారావు, శ్రీపతి విజయ్, పులిచర్ల కోటయ్య, మేదరమెట్ల భరత్రెడ్డి, గవదకట్ల వెంకీ, మండల రైతు విభాగం అధ్యక్షుడు తక్కెలపాటి సుధాకర్, రాయిండ్ల వెంకటనారాయణ, సింగమనేని బ్రహ్మయ్య, మన్నం వెంకయ్య, ఉప్పలపాటి రామరాజు, ఉప్పలపాటి శివరామరాజు, వలివర్తి శ్రీనివాసరాజు, పేరూరి కమలాకర్, అక్కుల శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి సురేంద్ర రెడ్డి, సనగర కోటి, దావులూరి సునీల్, మేడికొండ రాములు, బత్తిన మనోహర్, కొమ్మాలపాటి మధు, నరసారెడ్డి, అనీల్రెడ్డి, వేణురెడ్డి, భాస్కరరెడ్డి, భాస్కర్, తానికొండ రామచంద్ర, పోకూరి వెంకటేశ్వర్లు, పచ్చవ వంశీకృష్ణ, పల్నాటి వెంకటేశ్వర్లు, ఆల్ల శ్రీనివాసరెడ్డి, మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ వేము ప్రసాదు, గొట్టిపాటి మురళి, మాలపాటి మాలకొండయ్య, బూదా రమణారెడ్డి, బొలినేని నాగేశ్వరరావు, కముజుల బ్రహ్మారెడ్డి, కొమ్ము ప్రభుదాస్, షేక్ సుల్తాన్, షేక్ కరీం, సయ్యద్ ఆబీద్ ఆలీ, కేసవరపు కృష్ణారెడ్డి, జి.అశోక్రెడ్డి, ప్రభాకరరెడ్డి, బుజ్జమ్మ, రాపూరి ప్రభావతి, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, కే వెంకారెడ్డి, మాదాల శంకర్, దాసరి శేషయ్య, సుదర్శి వెంకట్రావు, సోమిశెట్టి సురేషు, పమిడి హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు. వేలం ప్రక్రియ పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
హనుమజ్జయంతి వేడుకలకు శింగరకొండ ముస్తాబు
అద్దంకి రూరల్: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న హనుమజ్జయంతి వేడుకలకు శింగరకొండ ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దేవస్థానం ఎదుట చలువ పందిళ్లు వేసి విద్యుద్దీపాలంకరణ చేశారు. 12వ తేదీ స్వామి వారికి కదలీ ఫలార్చన, సాయంత్రం 4 గంటలకు 3 వేల మందితో కోటి తలంబ్రాల శోభాయాత్ర, సాయంత్రం 7 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి తిమ్మనాయుడు తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మార్కాపురం: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో చోటుచేసుకుంది. గొట్టిపడియ గ్రామానికి చెందిన తంగిరాల శ్రీనివాసరెడ్డి(23) మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో గల శివాజీనగర్లో నివాసముంటూ టెంట్ హౌస్లో పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం కంభం రోడ్డులోని ఎల్ఐసీ ఆఫీసు పక్క వీధిలో గల ఇంటి వద్ద లైటింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ వైర్లు మెయిన్ లైనుకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. మార్కాపురం: బెంగళూరు నుంచి మార్కాపురానికి అతివేగంతో ప్రయాణిస్తున్న ఆర్వీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మార్కాపురం వద్ద గురువారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. విజయవాడ రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలోని కంట్రోల్ రూము అధికారుల పర్యవేక్షణలో భాగంగా బెంగళూరు నుంచి మార్కాపురం వస్తున్న బస్సు 80 కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించి స్థానిక రవాణాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మార్కాపురం ఎంవీఐలు మాధవరావు, భాస్కరరావులు బస్సును సీజ్ చేశారు. ఇటీవలే అన్నీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో వీఎల్టీడీ (వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైజ్)ను ఏర్పాటుచేసి 80 కిలోమీటర్ల వేగం దాటిన బస్సులను గుర్తించి సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అతి వేగంగా నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సును సీజ్ చేసి డిపోకు తరలించినట్లు తెలిపారు. టంగుటూరు: కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన మండలంలోని కొణిజేడు–పొందూరు గ్రామాల మధ్య గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..మండలంలోని కొణిజేడు–పొందూరు గ్రామాల మధ్య ఉన్న ఇలగలేరు సమీపంలో జామాయిల్ కర్ర కొడుతున్న కూలీలకు కుళ్లిపోయిన వావన రావడంతో చుట్టుపక్కన పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అక్కడ ఆధార్కార్డు కనిపించింది. అందులో మృతుని పేరు బీహార్కు చెందిన సాకి సహానిగా గుర్తించారు. మృతుడు చనిపోయి 20 రోజులు దాటిందని, మృతదేహం బాగా కుళ్లిపోయిందని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026
‘లైట్’గా తీసుకుంటే ముప్పే! వాహనాలకు విచ్చలవిడిగా అధిక సామర్థ్యంతో కూడిన ఎల్ఈడీ లైట్ల వినియోగంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. పేరుకే ఫ్యామిలీ దాబాలు.. బార్లలోలా మద్యం సర్వీస్ జరుగుతోంది. కేవలం ఆహార పదార్థాలు మాత్రమే అందించాల్సిన దాబాల్లో మూడు విస్కీలు, ఆరు బీర్లు అన్న విధంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున కోడి కూసేదాకా దాబాలు తెరిచే ఉంచడంతో మందు, విందులకు కేరాఫ్గా మారాయి. ఊరిబయట హాయిగా సిట్టింగ్ సౌకర్యం కూడా ఉండటంతో బార్ కంటే నయమని మందుబాబులు దాబాల బాట పడుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అబ్కారీ శాఖాధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
10న తెలుగు వెలుగులు సాహిత్య సదస్సు
ఒంగోలు మెట్రో: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగు వెలుగుల సాహిత్య సదస్సును ఈ నెల 10వ తేదీ ఒంగోలులోని నెక్ట్స్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించనున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రఖ్యాత కవులు, సాహితీ మూర్తులు పాల్గొని ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులపై ప్రసంగిస్తారని వెల్లడించారు. జిల్లాలోని కవులు, రచయితలు, భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశిష్ట సాహిత్య సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు ఆర్డీఓగా టి.చంద్రశేఖరనాయుడు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్డీఓగా పనిచేసిన లక్ష్మీప్రసన్న అమరావతి బదిలీ కావడంతో నూతన ఆర్డీఓగా చంద్రశేఖరనాయుడు బాధ్యతలు తీసుకున్నారు. చీరాల ఆర్డీఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు చంద్రశేఖరనాయుడు వచ్చారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం జేసీ కల్పనా కుమారిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. ఒంగోలు సబర్బన్: స్కూల్, కాలేజీ బస్సులకు నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్కూల్, కాలేజీ బస్సులను రవాణా శాఖ అధికారులచే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ జిల్లాలోని 744 స్కూలు, కాలేజీల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏఐఎస్ 63 నిబంధనలు పాటించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. యాజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇతర అవసరమైన పత్రాలను నవీకరించుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెవీ లైసెన్స్ కలిగి ఐదేళ్ల అనుభవం ఉన్న 60 సంవత్సరాల్లోపు వారిని డ్రైవర్లుగా నియమించుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను సీజ్ చేస్తామని చెప్పారు. దొనకొండ: దొనకొండలోని విమానాశ్రయాన్ని మంగళగిరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి బృందం గురువారం పరిశీలించింది. విమానాశ్రయం చుట్టూ భూమి హద్దులు, హెలీప్యాడ్, రన్ వేలను పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన భవనం పైకి ఎక్కి పూర్తి సమాచారం సేకరించారు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది.. అదనంగా ఎంత కేటాయించారు.. ఆ భూముల పరిస్థితి ఏమిటి.? నీటి వనరులు, తదితర మౌలిక సదుపాయాల గురించి రెవెన్యూ సిబ్బందితో చర్చించారు. విమానాశ్రయానికి సంబంధించిన అనేక విషయాల గురించి విమానాశ్రయ కేర్ టేకర్ రామకృష్ణతో చర్చించారు. దొనకొండ విమానాశ్రయంలో విమాన శిక్షణ కేంద్రం (ఎఫ్టీఏ) ఏర్పాటు దిశగా చర్యలు జరుగుతున్నాయని గీతాంజలి తెలిపారు. త్వరలో ఎయిర్పోర్ట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ విమానాశ్రయాన్ని సందర్శిస్తారని, ఈ నేపథ్యంలో పరిశీలనకు వచ్చామని ఆమె వివరించారు. డిప్యూటీ కలెక్టర్ వెంట తహసీల్దార్ రమాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పంచాయతీల్లో..స్పెషల్ సమస్యలు..!
● సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం ● మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలకుగానూ 176 మందే స్పెషల్ ఆఫీసర్లు ● కొన్ని మండలాల్లో ఒక అధికారికి 5 పంచాయతీల బాధ్యతలు ● అదనపు బాధ్యతలు చూడలేకపోతున్న స్పెషల్ ఆఫీసర్లు ● సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల గగ్గోలు మార్కాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల వ్యవస్థకు ప్రాధాన్యత తగ్గించడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు సతమతమవుతున్నారు. చిన్నచిన్న పనులకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీల్లో కనీస వసతులు కరువై ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 2వ తేదీతో సర్పంచ్ల పదవీకాలం కూడా ముగియడంతో 3వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సర్పంచ్ల స్థానంలో మండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, ఎంఈఓ, ఈఓఆర్డీ, వ్యవసాయ, హార్టీకల్చర్, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఏఈ, డీఈ, వెటర్నరీ అసిస్టెంట్లను గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. అదనపు భారంతో అరకొరగా విధులు... మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ఉన్న 21 మండలాల్లో 406 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటన్నింటికి కలిపి 176 మంది అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. సాధారణంగా ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలి. కానీ, పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఒక్కొక్క అధికారికి 5 నుంచి 6 పంచాయతీలు కేటాయించారు. దీంతో వీరు సొంత శాఖ బాధ్యతలు చూడటంతో పాటు తమకు కేటాయించిన గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు చూడాల్సి ఉంది. అదనపు భారం కారణంగా అవన్నీ వారు చూడలేకపోతుండటంతో పంచాయతీల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో అస్తవ్యస్తంగా పాలన... మార్కాపురం జిల్లాలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం గందరగోళంగా మారింది. ఒక్కొక్క అధికారికి 5 నుంచి 6 పంచాయతీలు అప్పగించారు. త్రిపురాంతకం మండలంలో 24 పంచాయతీలకు ఏడుగురు అధికారులను మాత్రమే కేటాయించారు. దోర్నాల మండలంలో 14 పంచాయతీలకు ఐదుగురు, హనుమంతునిపాడు మండలంలో 23 పంచాయతీలకు 8 మంది, కొనకనమిట్ల మండలంలో 26 పంచాయతీలకు 8 మంది, సీఎస్ పురం మండలంలో 23 పంచాయతీలకు 8 మంది, కనిగిరిలో 25 పంచాయతీలకు 8 మంది అధికారులను నియమించారు. వారంతా తాము నిర్వర్తిస్తున్న బాధ్యతలతో పాటు అదనంగా స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ వారికి రొటీన్ కార్యక్రమాలే సరిపోతున్నాయి. స్పెషల్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారై ప్రజలు అవస్థపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించేలా చూడాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆందోళనే ఆయుధంగా!
ధరలు దారుణంగా..కొండపి వేలం కేంద్రంలో పొగాకు బేళ్లను పరిశీలిస్తున్న కంపెనీల ప్రతినిధులుసింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వ తీరుతో తమకు తీవ్రంగా నష్టం జరుగుతోందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రాల్లో పొగాకు బేళ్ల కొనుగోళ్లలో కంపెనీల ప్రతినిధులు మాయాజాలం ప్రదర్శించి ధరలు దిగ్గోయడంపై మండిపడుతున్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. మద్దతు ధరల కోసం ఆందోళన దిశగా అడుగులు వేస్తుండగా.. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా పొగాకు రైతులకు మద్దతు ధర లభించి లాభాల వర్షం కురిసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో రెండో సంవత్సరం కూడా పొగాకు రైతుకు నష్టం తప్పేలా లేకపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది. అదనపు ఖర్చు కారణంగా ఎకరాకు రూ.7 వేల వరకు ఖర్చు పెరిగింది. కానీ, ఈ సంవత్సరం వేలం ప్రారంభంలో కేజీ ధర రూ.250 ఉండగా, తర్వాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. ధరలు పెరగకపోగా క్రమేనా తగ్గుతూ కేజీ రూ.232కు పడిపోయింది. ప్రస్తుతం అది కాస్తా రూ.200 మాత్రమే ఉండటంతో రైతులు పోరుబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత ధరలతో పొగాకు రైతుకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి తమను ఆదుకునేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. 82,475 హెక్టార్లలో పొగాకు సాగు... పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రీజియన్ పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026–27లో పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు పండించటానికి బోర్డు అనుమతి ఉండగా, సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. తగ్గిన ధరలతో దిగాలు... ఈ సంవత్సరం జిల్లాలోని 11 వేలం కేంద్రాల్లో మొదటి విడతగా మార్చి 25వ తేదీ కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. రెండో విడతగా ఏప్రిల్ 9వ తేదీ కొండపి, ఒంగోలు, కనిగిరి, డీసీ పల్లి, కలిగిరి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేలం ప్రారంభం నుంచి బ్రైట్ గ్రేడ్ పొగాకు కేజీ ధర రూ.250 పలకగా, మిగిలిన గ్రేడ్లు రూ.240 నుంచి రూ.220 వరకు పలికాయి. ప్రస్తుతం కేవలం రూ.200 మాత్రమే ఉండగా సరాసరి ధర రూ.225 మాత్రమే లభిస్తోంది. దీంతో ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో పొగాకుకు కేజీ సరాసరి ధర రూ.230 వచ్చిందని, ఇక్కడ కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతం కేజీ సరాసరి ధర రూ.225 మాత్రమే పలకటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటూ పోరుబాట పడుతున్నారు. గిట్టుబాటు ధర లభించేనా... ప్రస్తుతం వేలం కేంద్రాల్లో లభిస్తున్న ధరలు చూస్తే రైతులకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. కొండపి నియోజకవర్గంలోని కొండపి వేలం కేంద్రంలో కేజీ సరాసరి ధర రూ.227 ఉండగా, టంగుటూరులో కేజీ ధర రూ.233 మాత్రమే ఉంది. దీంతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ప్రకారం రైతుకు ఒక్కో బ్యారన్కు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత ధరలతో ఆత్మహత్యలే శరణ్యం... ఈ సంవత్సరం ధరలు తగ్గటంతో పాటు ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా కొనుగోలు దారులు లేక ధరలు మరింత దిగజారే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్రానికి బేళ్లు తీసుకెళ్తే వాటికి నానా పరీక్షలు చేసి కొనుగోలు చేయటంతో పాటు భారీగా వెనక్కి పంపుతున్నారు. ఒక రోజు 30 శాతం, మరో రోజు 40 శాతం, గురువారం అయితే 55 శాతం బేళ్లు వెనక్కి పంపారని కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఆత్మహత్యలే శరణ్యమని, ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పటానికి వీలులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ పోరుబాట... పొగాకుకు మద్దతు ధర లభించకపోవటంతో రైతులు వేలం కేంద్రాల వారీగా పోరుబాట పడుతున్నారు. గురువారం పొదిలి వేలం కేంద్రం పరిధిలో రైతులు పోరుబాట పట్టగా శుక్రవారం వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో పొగాకు రైతులు టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద మద్దతు ధర కోసం ఽనిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి నిరసన కార్యక్రమం జరుగుతుందని, పొగాకు రైతులతో పాటు వైఎస్సార్ సీపీలోని వివిధ విభాగాల రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఆదుకోవాలని డిమాండ్... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధరలు కల్పించి ఆదుకున్న విషయాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. గతంలో వ్యాపారులు సిండికేట్ అయి పొగాకు ధరలు పడిపోతుంటే.. ఆనాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకుంది. కానీ, నేడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, పొగాకు బోర్డు అధికారులు పొగాకు సాగు తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటలు పండించండని చెప్పడమే తప్ప, ఆ ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఆలోచన చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు కష్టాలే తప్ప లాభాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ధరల పెంపు నిర్ణయాన్ని విరమించాలి
ఒంగోలు సబర్బన్: రొయ్య మేత ధరల పెంపుదల ప్రతిపాదన విరమించుకోవాలని రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్ డిమాండ్ చేశారు. నగరంలోని కర్నూలురోడ్డులోని రొయ్య రైతుల సంఘ కార్యాలయంలో గురువారం రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం గోపీనాఽథ్ అధ్యక్షతన నిర్వహిచంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరలు పెంచాలని యాజమాన్యాలు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించి రొయ్యల రైతులపై ఖర్చులు భారం పడకుండా ఆదుకోవాలన్నారు. రొయ్యల మేత తయారు చేసే కంపెనీలు సిండికేట్గా మారి ప్రస్తుతం మేత తయారీ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే సాకును చూపి ఫీడ్ ధరలను పెంపుదల చేయాలని నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరాయని గుర్తు చేశారు. దీన్ని ముఖ్యమంత్రి వెంటనే అనుమతి నిరాకరించి ధరల పెంపుదల ప్రయత్నాలను అడ్డుకొని రొయ్య రైతులపై పెట్టుబడి ఉత్పత్తి ఖర్చులు భారం పడకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం రొయ్యల రైతులకు ఉత్పత్తి ఖర్చులు పెరిగి సాగు గిట్టుబాటు కావడం లేదన్నారు. మరో వైపు రొయ్యలకు సంక్రమిస్తున్న వివిధ రకాల వైరస్ వల్ల చెరువుల్లో వేసిన రొయ్యలు చనిపోతూ తీవ్రంగా నష్టపోతున్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల్లో వచ్చిన వ్యత్యాసాన్ని సాకుగా చూయించి రొయ్యల మేత ధరలను పెంచాలని చూడటం దారుణమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒకసారి ధరలు పెంచారని, మళ్లీ ధరలు పెంచితే రొయ్య రైతులకు పెనభారంగా మారుతుందన్నారు. వాస్తవానికి ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు కంపెనీలు చెబుతున్నట్లుగా భారీ స్థాయిలో ఏం పెరగలేదన్నారు. పెరిగిన ధరలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని, మళ్లీ ఫీడ్ ధరలు పెరిగితే రొయ్యల సాగుకు రైతులు దూరం కావాల్సి వస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోంచాలని కోరారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, సహాయ కార్యదర్శి బత్తుల రమేష్ రెడ్డి ఉపాధ్యక్షుడు జిల్లా నాయకులు సీహెచ్ రమణయ్య, వి.వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు రాము పాల్గొన్నారు. రొయ్య రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ -
దళితులపై దాడులు సహించం
వూర్కాపురం టౌన్: దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని జైభీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడా శ్రావణ్కుమార్ హెచ్చరించారు. సోమవారం మార్కాపురం వచ్చిన ఆయన మార్కాపురం జిల్లా మాల జేఏసీ నాయకులు, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉంటానని చెప్పారు. రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు మాట్లాడుతూ.. దళితుల మధ్య చిచ్చుపెట్టి రిజర్వేషన్లను పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే వర్గీకరణ చేశారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ 20 శాతం పెంచాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట మార్కాపురం జిల్లా జేఏసీ అధ్యక్షుడు శాంత కుమార్, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శామ్యుల్, యోహన్, రాజశేఖర్, ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, కృష్ణారావు తదితరులు ఉన్నారు. న్యాయవాది జడా శ్రావణ్కుమార్ -
వృద్ధులకు చట్టాలపై అవగాహన అవసరం
ఒంగోలు వన్టౌన్: వృద్ధులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఒంగోలు నగరంలోని సమతా మహిళా వృద్ధాశ్రమాన్ని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల చట్టాలు, రక్షణ అంశంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల లీగల్ సర్వీసెస్ కమిటీల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సమతా వృద్ధాశ్రమం నిర్వాహకులు అంకబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కజొక్క పంట దగ్ధం
● రూ.2.5 లక్షలు సష్టం తాళ్లూరు: కోతకు వచ్చిన మొక్కజొక్క పంట ఆగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన మండలంలోని రామభద్రాపురం గ్రామ పొలాల్లో గురువారం జరిగింది. ప్రమాదంలో రైతులు కై పు వెంకటేశ్వరరెడ్డి, కై పు రమణారెడ్డి చెందిన పంట కాలి బూడిడైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పొలాల్లో మోటర్ వద్ద ఉంటే విద్యుత్ తీగలు ట్రిప్ అవ్వడంతో నిప్పు రవ్వలు వ్యాపించి మూడున్నర ఎకరాలు మొక్కజొన్న పంట అగ్గిపాలైనట్లు తెలిపారు. పంట దిగుబడి బాగా వచ్చిందని, దాదాపు రూ.2.5 లక్షలు సష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత దశలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకం
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: దేశాన్ని కొల్లగొట్టిన బ్రిటీష్ ముష్కరులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిటీష్ ముష్కరులను దేశం నుంచి తరిమి కొట్టేందుకు మన్యంలోని ప్రజలను చైతన్యం అలుపెరుగని పోరాటాలు చేశాడని గుర్తు చేశారు. ఆయన ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నేటి యువత అల్లూరి జీవితాన్ని అధ్యయనం చేయాలని, కులమతాలకతీతంగా దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ సీతారామి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో మొక్కజొక్క పంట దగ్ధం
● సుమారు రూ.3 లక్షల సష్టం తాళ్లూరు: కోతకు వచ్చిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రమణాలవారి పాలెం పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కై పు రమణారెడ్డి 1.5 ఎకరాలు, కై పు వెంకట రామిరెడ్డి 3.5 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో పంట కోయాల్సి ఉంది. పొలం గట్టు వెంట ఉన్న విద్యుత్ తీగలు ట్రిప్ అవ్వడంతో నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న తోటకు మంటలు వ్యాప్తించాయి. ఐదు ఎకరాల్లో పంట కాలి బూడిదైంది. పంట దిగుబడి బాగా వచ్చిందని, రూ.3 లక్షల మేర సష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
విమర్శల విస్తరణ..!
చీమకుర్తి: ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తొలి నుంచి తీవ్ర విమర్శల పాలవుతోంది. తాజాగా నాలుగు లైన్ల విస్తరణ పొడవును కుదించడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లా రూపురేఖలు మార్చేస్తామంటూ సీఎంతో పాటు స్థానిక పాలకులు ప్రగల్భాలు పలికారు. అందులో భాగంగా ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున ఫోర్లైన్గా పీపీపీ పద్ధతిలో రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టీడీపీ స్థానిక నాయకులు సైతం ఊహల్లో తేలారు. అదిగో ఫోర్లైన్, ఇదిగో టెండర్లు, ఇక టోల్గేట్లు పెట్టుకోవడమే తరువాయి అంటూ రెండు సంవత్సరాల నుంచి అధికార పార్టీ నాయకులు, అధికారులు ఊదరగొడుతున్నారు. దాని కోసం ఏడాది నుంచి మూడు సార్లు సర్వేలు చేయించారు. సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి ప్రాంతాలలో అదనంగా బైపాస్లు నిర్మించడం, అవసరమైన భూమి సేకరించటం పూర్తయితే ఫోర్లైన్ నిర్మాణం చేపట్టడమే అని ఆర్అండ్బీ అధికారులు కూడా స్థానిక నాయకులు తానా అంటే తందానా అన్నట్లు బాకాలు ఊదారు. తీరా.. తాజాగా తెలిసిన సమాచారంతో అందరూ అవాక్కయ్యారు. ఒంగోలు సమీపంలోని ట్రిపుల్ ఐటీ కాలేజీ నుంచి పొదిలి వరకు మాత్రమే ఫోర్లైన్ను పరిమితం చేస్తూ ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించారు. గతంలో ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున ఫోర్లైన్ నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. దానిని కేవలం పొదిలి వరకు.. అంటే దాదాపు 42 కి.మీ మాత్రమే నిర్మిస్తే సరిపోతుందని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పొదిలి నుంచి పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉండదంటూ అక్కడి నుంచి డబుల్లైన్ నిర్మాణానికి డీపీఆర్ పంపారు. రెండేళ్లుగా ఊరిస్తూ.. చివరకు ఉసూరుమనిపించడంపై విమర్శలు... ఫోర్లైన్ విస్తరణతో ఒంగోలు నుంచి మార్కాపురం జిల్లా వరకు రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రజలు, వాహనదారులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. తీరా ఇప్పుడు లేదనడంతో ఉసూరుమంటూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు నుంచి సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ (8.2 కి.మీ) వరకు ఫోర్లైన్ ఉంది. ఒంగోలు నుంచి పొదిలికి మొత్తం 50 కి.మీ ఉండగా, దానిలో ఇప్పుడున్ను 8.2 కి.మీ ఫోర్లైన్ తీసేస్తే.. మిగిలిన 42 కి.మీ మాత్రమే నిర్మించనున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు రూ.3.50 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. జిల్లాలోని ఒకేఒక ఫోర్లైన్కు నిధులు కేటాయించలేకపోవడం శోచనీయమని ప్రభుత్వ వైఖరిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చివరకు సగానికి కుదించడం ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీమకుర్తి బైపాస్పై రాజకీయ ఒత్తిళ్లు... ఫోర్లైన్ నిర్మాణంలో భాగంగా సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి పట్టణాలకు వెలుపల బైపాస్లు నిర్మించాల్సి ఉంది. అయితే, చీమకుర్తిలో ఇప్పటికే సాగర్ కాలువ ఉత్తరం వైపు కట్టపై డబుల్ లైన్తో బైపాస్ ఉంది. దాన్నే ఫోర్లైన్గా మార్చేలా ఆర్అండ్బీ అధికారులు డీపీఆర్లో పొందుపరిచారు. ఇప్పుడున్న బైపాస్ను ఆనుకునే ఫోర్లైన్ నిర్మిస్తే పీపీపీ పద్ధతిలో కాంట్రాక్టర్కు, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని అధికారుల అంచనా కాగా, సాగర్ కాలువకు దక్షిణంవైపున్న రెండో కట్ట మీద నిర్మిస్తే ఆ కట్టవైపున్న పొలాలకు మంచి గిరాకీ వస్తుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అధికార పార్టీ నాయకులంతా స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న బైపాస్ను ఆనుకుని నిర్మిస్తే రోడ్డుకు ఆనుకుని ఉన్న పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు ఫోర్లైన్ విస్తరణలో పోయే ప్రమాదం ఉందని, వాటిని రక్షించినట్లు అవుతుందనే ఉద్దేశంతో పాటు రెండోవైపు నిర్మిస్తే.. రియల్ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని ఎవరికి నచ్చిన డ్రామాలు వారు ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు మాత్రం ఇప్పుడున్న బైపాస్ను ఆనుకుని మాత్రమే ఫోర్లైన్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం డీపీఆర్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. వేలాది వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు... చీమకుర్తిలోని గ్రానైట్ లారీలు, కంకర టిప్పర్లతో పాటు ఇతర వాహనాలు వేలాదిగా చీమకుర్తి నుంచి ఒంగోలు వైపు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. 50 టన్నుల నుంచి దాదాపు 100 టన్నుల సామర్థ్యంతో గ్రానైట్ రాళ్ల ట్రాలీలు రాకపోకల కారణంగా రోడ్లు, కల్వర్టులు ఛిద్రమవుతున్నాయి. వాహనాల సామర్థ్యానికి తగినట్లుగా రోడ్లు, కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా ఆర్అండ్బీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొదిలి వరకే ఫోర్లైన్ నిర్మాణం గతంలో ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు ఫోర్లైన్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కానీ, ఇప్పుడు తయారు చేసిన డీపీఆర్ ప్రకారం ఒంగోలు నుంచి 8.2 కి.మీ.. అంటే సంతనూతలపాడు ట్రిపుల్ ఐటీ కాలేజీ నుంచి పొదిలి వరకు మాత్రమే ఫోర్లైన్ నిర్మాణం చేపట్టేందుకు డీపీఆర్ తయారు చేశారు. ప్రభుత్వానికి డీపీఆర్ పంపించాం. చీమకుర్తి బైపాస్లో ఇప్పుడున్న రోడ్డును ఆనుకునే ఫోర్లైన్ విస్తరణ ఉంటుంది. – రాంనాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ సాగర్ కాలువ రెండో కట్టపై ఫోర్లైన్ నిర్మిస్తేనే చీమకుర్తి అభివృద్ధి చీమకుర్తి బైపాస్ను ఆనుకుని పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. వాటికి ఇబ్బంది లేకుండా సాగర్ కాలువ రెండో కట్టవైపు ఫోర్లైన్ నిర్మిస్తే అటువైపు కూడా చీమకుర్తి పట్టణం అభివృద్ధి చెందుతుంది. – కుంచాల రాంబాబు, చీమకుర్తి ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్ రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కర్నూలు రోడ్డుపై రామతీర్థం వద్ద రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి దారుణంగా మరణించాడు. చీమకుర్తి–సంతనూతలపాడు సరిహద్దులో ఎర్రగుడిపాడు, మర్రిచెట్లపాలెం వంటి పలు ప్రధాన ప్రాంతాల్లో వారానికి రెండు మూడు ప్రమాదాలు జరుగుతూ నెలకు ఐదారుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రం శివారులోని కర్నూలు రోడ్డులో కల్వర్టుకు పెద్ద రంధ్రం పడి వాహనాల రాకపోకలకు రాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టుపై ట్రాఫిక్ నియంత్రణ బోర్డును బోర్లించి ఆర్అండ్బీ అధికారులు చేతుల దులుపుకున్నారు. కల్వర్టుకు పడిన రంధ్రాన్ని పూడ్చలేదు. కల్వర్టుకు పక్కగా రోడ్డు వేయలేదు. అదే విధంగా సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద రోడ్డు సగం తెగిపోవడంతో మొదట సిమెంట్ పైపులతో మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి మరమ్మతులు చేశారు. ప్రమాదకరంగా మారిన సంతనూతలపాడు కల్వర్టు (రెడ్ సర్కిల్లో నెలల తరబడి రంధ్రం పడిన ప్రాంతం)సంతనూతలపాడు ట్రిపుల్ ఐటీ వద్ద ఇప్పటికే రెండు సార్లు మరమ్మతులు చేసిన ప్రాంతం (రెడ్ సర్కిల్లో) నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పొడవును కుదించడంపై తీవ్ర విమర్శలు తొలుత ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున విస్తరించేందుకు చర్యలు ప్రస్తుతం ఒంగోలు నుంచి పొదిలి వరకు 42 కి.మీ మాత్రమే విస్తరించేందుకు ఏర్పాట్లు పొదిలి నుంచి రెండు లైన్లకే పరిమితం చేస్తూ ప్రభుత్వానికి అధికారుల డీపీఆర్ చీమకుర్తి బైపాస్ను ఆనుకునే ఫోర్లైన్ విస్తరణ సాగర్ కాలువ రెండో కట్ట వైపునకు మార్చేందుకు స్థానిక నాయకుల రాజకీయ ఒత్తిళ్లు -
హోంగార్డు ఇంట్లో చోరీ
గిద్దలూరు రూరల్: పట్టణంలోని నంద్యాల రోడ్డులో టిడ్కో గృహాల సమీపంలో గల జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న హోంగార్డు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అందిన వివరాల ప్రకారం.. ఆవుల కాశయ్య అనే హోంగార్డు కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం కలసపాడులో బంధువుల వివాహానికి వెళ్లాడు. ఇంటికి తాళాలు వేసి వెళ్లగా, దుండగులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా బద్దలుగొట్టి అందులోని రెండు జతలు బంగారు కమ్మలు, రెండు ఉంగరాలు, వెండి వస్తువులు చోరీ చేశారు. సుమారు రూ.2 లక్షల విలువ గల ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చీమకుర్తి రూరల్: మండలంలోని కూనంనేనివారిపాలెం పరిధిలోని బావిలో ప్రమాదవశాత్తూ పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. చీమకుర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాసరావు (65) అటువైపుగా వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందినట్లు తెలిసింది. ఒంగోలు వన్టౌన్: జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్–డీ పరీక్షలతో పాటు ఏపీ హైకోర్టులో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ఎస్.నిర్మలాజ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అర్హులైన కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఏపీ బీసీ స్టడీ సర్కిల్, ఒంగోలు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 100 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పాటు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలన్నారు. ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అక్నాలడ్జెమెంట్ ఫొటోస్టాట్ కాపీలను జతపరచాలన్నారు. వాటితో పాటు 2 పాస్పోర్టు సైజ్ ఫొటోలను కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయం నంబర్లు 08592–231232, 9989285530ను సంప్రదించాలని సూచించారు. -
రైతుల గోడు పట్టదా చంద్రబాబు?
యర్రగొండపాలెం: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు బుధవారం మోటారు బైక్లపై ర్యాలీగా స్థానిక మార్కాపురం రోడ్లోని బొప్పాయి తోట వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో కనీస ధర లభించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల బీభత్సానికి బొప్పాయి, అరటి, బత్తాయి, నిమ్మ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పు తీరే మార్గం కానరాక సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడికి రైతుల బాధలు ఏమీ పట్టవని, కేవలం ఆయనకు కావలసింది ఎలక్షన్లు, కలెక్షన్లేనని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధరలు, అకాల వర్షాలతో పంట నష్టం గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం కలెక్షన్ బాబు నైజానికి నిదర్శనమన్నారు. అధికారులు సైతం కలెక్షన్ బాబుకు కొమ్ముకాస్తూ ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు, ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. బాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం వ్యవసాయాధారిత రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా దిశగా తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతోపాటు రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసి కష్టాలపాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.24 వేల ధర పలకగా.. బాబు గద్దెనెక్కిన తర్వాత రూ.9 వేలకు పడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్యాస్ కొరత వల్ల డ్రయ్యర్లు పనిచేయక ఎక్కడిక్కడ పంట ఉత్పత్తులను రోడ్లపై ఆరబోసుకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కమర్షియల్ డీజిల్ ధర పెరగడం వల్ల రైతులపై పెట్టుబడి భారం పెరిగిపోయిందన్నారు. పల్లెల్లో తాగునీటి కష్టాలను తీర్చలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉండటం ప్రజల ధౌర్భాగ్యమన్నారు. వైఎస్ జగన్ పాలనలో మాదిరిగా రైతులకు మద్దతు ధర, పరిహారం అందించకుంటే కలెక్టరేట్తోపాటు వ్యవసాయ, అనుబంధ విభాగాల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముందుగా ఉద్యాన శాఖాధికారి పి.ఆదిరెడ్డికి అకాల వర్షాలతో బొప్పాయి రైతులకు కలిగిన నష్టం గురించి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వై.వెంకటేశ్వరరెడ్డి, కె.ఓబులరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, పి.కృష్ణారెడ్డి, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సయ్యద్ జబీవుల్లా, షేక్.మహమ్మద్ కాశిం, ఒంగోలు సుబ్బారెడ్డి, చిట్టె వెంకటేశ్వరెడ్డి, వెన్నా రమణారెడ్డి, వాగ్యా నాయక్, ఎల్.రాములు, సింగా ప్రసాద్, ఆవుల వీర కోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, పి.రాములు నాయక్, తిరుమలరెడ్డి చిన్న వీరారెడ్డి, రాగాల వెంకటయ్య, సురేష్ నాయక్, సరళ, శార, అరుణాబాయి, జి.బాలకోటిరెడ్డి, షేక్.మునాఫ్ పాల్గొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. నష్ట పరిహారం ఊసు అసలే లేదు దెబ్బతిన్న బొప్పాయి తోట వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి పొలాల బాట పట్టిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు -
కోనేరులో పడి వృద్ధుడు మృతి
ఉలవపాడు: కోనేరులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. ఉలవపాడులోని వేణుగోపాల స్వామి ఆలయం కోనేరులో మృతదేహం తేలుతుండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గమనించి, ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతుడిని సన్నెబోయిన రమణయ్య(70)గా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బంధువులంతా కలిసి మృతదేహాన్ని బయటకు తీసి ఆయన స్వగృహానికి తరలించారు. మంగళవారం రాత్రి కోనేరులో పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. -
ఆలయంలో చోరీకి విఫలయత్నం
పెద్దారవీడు: మండల కేంద్రమైన పెద్దారవీడులో ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన ఔకు నాగేశ్వరరావు మద్యం మత్తులో ఆంజనేయస్వామి ఆలయం తలుపు పగలగొట్టాడు. హుండీ పగలగొట్టేందుకు వీలుపడకపోవడంతో గర్భగుడిలోని బీరువా తెరిచేందుకు పూనుకున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన వ్యక్తి మంచి నీటి సరఫరా మోటారు ఆపేందుకు వెళ్తూ.. ఆలయంలో శబ్దాలు రావడాన్ని గమనించాడు. గ్రామస్తులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో అందరూ చుట్టుముట్టి దొంగను పట్టుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన జేబులో ఉన్న రూ.1600 చూపించాడని స్థానికులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై సైదుబాబు చెప్పారు. ● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: వేసవి వడగాల్పులను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో తరచూ మంచినీరు తాగాలని, డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. బుధవారం ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్, నిమ్మ రసం, మజ్జిగ లాంటి ద్రవాలు తాగాలని చెప్పారు. సమ్మర్ కిట్లో ఎండ తీవ్రత నుంచి కాపాడే టోపీలు, సన్ గ్లాసెస్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గేంత వరకు సమ్మర్ కిట్లను క్రమం తప్పకుండా వినియోగించాలని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శివ ప్రసాద్, మాల్యాద్రి పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
కరువు నేలకు వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. గోరంత నిధులు విదిల్చి కొండంత ప్రచారాన్ని చేస్తోంది. వెలిగొండకు అన్యాయం చేసే ఊరుకోమని, ఉద్యమం చేస్తామని వైఎస్సార్ సీపీ ప్రకటించిన నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు మంగళవారం ప్రాజెక్టును సందర్శించి నానా హంగామా చేశారు. రాత్రంతా టన్నెల్లో తిరిగి హడావుడి చేశారు. ఇంతవరకూ పునరావాస ప్యాకేజీని ఇవ్వకుండా పదే పదే ప్రాజెక్టు ప్రారంభంపై ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.పారని నిధులు..మార్కాపురం: జూలై కల్లా వెలిగొండ నీటిని పారిస్తాం.. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం.. మేమే శంకుస్థాపన చేశాం.. మేమే ప్రారంభిస్తాం.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరులశాఖామంత్రి నిమ్మల రామానాయుడు తరచుగా చెప్పే మాటలు ఇవి. చెప్పే మాటలకు, చేతలకు అసలు పొంతన ఉండదని మరోసారి నిరూపించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం ప్రాజెక్టును తరుచూ సందర్శిస్తూ చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాకు వచ్చారు. రూ.456 కోట్ల వ్యయంతో దోర్నాల మండలంలోని గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్ లైనింగు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా నిర్వహించిన సభలో ఈ ఏడాది జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తిచేసి నీరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఫీడర్ కెనాల్ పనులు మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయి. మంత్రి హడావుడి ఇలా.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు హంగామా చేస్తున్నారు. గత ఏడాది నవంబరు నుంచి మంగళవారం వరకూ ఎనిమిది సార్లు పర్యటించారు. గతేడాది నవంబరు 7న, నవంబరు 12న, డిసెంబరు 12, ఈ ఏడాది జనవరి 23న, ఫిబ్రవరి 25న, ఏప్రిల్ 7న, మే 5,6 తేదీల్లో మంత్రి రామానాయుడు వెలిగొండ టన్నెల్ పనులను పరిశీలించారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. జూలైనాటికి వెలిగొండ నీళ్లు ఇస్తారా అంటే.. ఇస్తామంటారు.. ఎలా అంటే చెప్పరు.. ఇదిలా ఉండగా సోమవారం మార్కాపురం పట్టణంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించింది. సభకు హాజరైన వారంతా వెలిగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, ప్రభుత్వ తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు. దీంతో మంత్రి రామానాయుడు హడావుడిగా మంగళవారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. పనుల పురోగతిని సమీక్షించారు. పనులు వేగంగా జరగడం లేదంటూనే రాత్రంగా టన్నెల్లో తిరుగుతూ హడావుడి చేశారు. పరిహారం ఊసే లేదు... వెలిగొండ నీరు టన్నెల్స్ నుంచి సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల డ్యామ్కు చేరాలంటే 11 ముంపు గ్రామాల్లోని 7270 కుటుంబాలకు సుమారు రూ.950 కోట్ల పరిహారాన్ని చెల్లించాలి. ఇదే సమయంలో నిర్వాసితుల కోసం కడుతున్న ఆర్అండ్ఆర్ కాలనీల్లో పక్కా గృహాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. ఇవేమీ లేకుండా జూన్ నాటికి టన్నెల్ పనులు పూర్తిచేసి నీటిని విడుదల చేస్తామనే హామీ ఎలా అమలవుతుందో అర్థంకాక అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజలు, ముంపు గ్రామాల నిర్వాసితులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించినా ఇవన్నీ పూర్తికావాలంటే కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. మంత్రి చెబుతున్న హామీ ప్రకారం వచ్చే నెలాఖరుకు టన్నెల్స్ పనులు పూర్తయి జూలైకి నీరు రావాలి. టన్నెల్–1లో సుమారు 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. టన్నెల్–2 లో 12వ కిలోమీటరు వద్ద టీబీఎం మిషన్ ఇరుక్కుపోయి ఉంది. దాన్ని తొలగించాలన్నా చాలా సమయం పడుతుంది. కావాల్సింది రూ.2540 కోట్లు.. ఇచ్చింది రూ.412 కోట్లుమొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.9081 కోట్ల నిధులు కావాలి. ఇప్పటి వరకూ రూ.5451 కోట్లు ఖర్చుచేశారు. భూ సేకరణకు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.2540 కోట్లు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది బడ్జెట్లో రూ.412 కోట్లు మాత్రమే కేటాయించారు. హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్, వింగ్స్కు సంబంధించిన పనులు టన్నెల్ 2లో సుమారు 2400 మీటర్ల లైనింగు పనులు పూర్తి కావాల్సి ఉంది. ఫీడర్ కెనాల్లో 5.3 కిలో మీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ నిర్మాణం చేశారు. 20 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ లైనింగులో 5 శాతం మాత్రమే పూర్తయింది. రెండు రోజుల క్రితమే టీబీఎం మిషన్ను తొలగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. టీబీఎం తొలగిస్తేనే నీళ్లు బయటకు వస్తాయి. టన్నెల్–2లో కొన్నిచోట్ల బండరాళ్లు ఊడిపడుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు ఆర్అండ్ఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టక, ఇటు పరిహారం ఇవ్వక, మరో వైపు పనులు పూర్తికాక ఇలా.. సమస్యల నడుమ జూలై నాటికి వెలిగొండ నీళ్లు ఇస్తామంటున్నారు. అది ఎలా సాధ్యమో దేవుడికే తెలియాలి. -
ఓర్వలేక..వికృత చేష్టలు
టంగుటూరు: టీడీపీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో విర్రవీగుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నా ఓర్వలేకపోతున్నారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరునిగా ఉన్న కంకణాల శ్రీను ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. దాన్ని కూడా ఓర్వలేని గ్రామ టీడీపీ నాయకులు తమ అక్కసు ప్రదర్శించారు. గ్రామ సచివాలయ అధికారులైన సెక్రటరీ, మహిళా పోలీసులను పంపించి కంకణాల శ్రీను కుటుంబానికి చెందిన సొంత స్థలంలోకి ప్రవేశించి ఇంటి గేటు ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కాలువ తీసే నెపంతో మూడు సార్లు అక్రమంగా తవ్వకాలు జరిపారు. గృహప్రవేశ కార్యక్రమం నేపథ్యంలో గేటు ముందు రోడ్డును తవ్వేసి వికృతానందం పొందారు. టీడీపీకే చెందిన వేజండ్ల శ్రీను అనే వ్యక్తిని పంపించి ఈ స్థలం నాదేనంటూ పనులకు అడుగడుగునా ఆటంకం కల్పించారు. ఇది మా సొంత స్థలమని ఇంటి డాక్యుమెంట్లు చూపించినా అధికారులు పట్టించుకోకుండా గ్రామ సెక్రటరీ తవ్వకాలు చేయించి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారు. టీడీపీ సానుభూతిపరుడు వేజండ్ల శ్రీనుకు ఈ స్థలంతో ఏమాత్రం సంబంధం లేదని ఆయన వద్దనున్న ఇంటి డాక్యుమెంట్లు రుజువు చేస్తున్నా, సెక్రటరీ మాత్రం అతడికే వత్తాసు పలుకుతున్నాడు. గ్రామ సెక్రటరీ టీడీపీ కార్యకర్తలా మితిమీరి జోక్యం చేసుకుంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్నేహపూర్వక వాతావరణంతోనే కేసుల పరిష్కారం
సింగరాయకొండ: లాయర్కు, జడ్జికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పుడే కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కర్ణాటక హైకోర్టు జడ్జి కే మన్మథరావు అన్నారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మొదటి వార్షికోత్సవంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్జి మన్మథరావు మాట్లాడుతూ న్యాయవాదిగా పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తిగా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నానని, తాను కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2 నెలల్లో 234 కేసులు పరిష్కరించానన్నారు. నేడు న్యాయవాది ఆలోచనలో మార్పులు రావాలని, అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 31 సంవత్సరాలు న్యాయవాదిగా ఉన్నప్పుడు స్థానికంగా కోర్టు ఉండాలని కలలు కన్నానని, తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అయ్యాక ఆ కలను సాకారం చేసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కందుకూరుకు రెండు అదనపు కోర్టులు మంజూరయ్యాయని, వాటిలో ఒక కోర్టు సింగరాయకొండకు తీసుకుని రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వీ లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ తాను పనిచేసిన కోర్టుల్లో అత్యధిక కేసులు ఈ కోర్టులోనే ఉన్నాయన్నారు. తాను మూడు లోక్అదాలత్లలో సుమారు 1,350 కేసులు పరిష్కరించానని, సాధారణ కేసులు దాదాపు 1,500లకు పైగా పరిష్కరించానని వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మన్మథరావును, జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వీ లీలా శ్యాంసుందరిని ప్రత్యేకంగా అడ్వకేట్లు సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసులు, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, చావలి రమేష్బాబు, లాయర్లు రాయి రమేష్, కె నరశింహారావు, బక్కముంతల వెంకటేశ్వర్లు, సీఐ పీ శ్రీహరి, ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, బీ మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు అండగా నిలిచిన జగనన్న
ముండ్లమూరు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి అండగా నిలిచారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కొనియాడారు. మండలంలోని ఈదర గ్రామంలో కొలువై ఉన్న అంకాలమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా భీమవరం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆమె మాట్లాడారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి అండగా నిలిచారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు ప్రతి విద్యార్థి ఖాతాలో నేరుగా జమ చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడ్డారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నవరత్న పథకాలతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా పేదలను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు, నాయకులకు బూచేపల్లి కుటుంబం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిదేవర అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ ప్రధాన కార్యదర్శి మేకల వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు. -
‘రెవెన్యూ’చింతలు తీరేనా..!
మార్కాపురం టౌన్: కలెక్టరేట్ అయినా, గ్రామ స్థాయి అయినా ఎక్కడ సమావేశం పెట్టినా వచ్చే అర్జీలు రెవెన్యూవే. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థంకాక రైతులు ప్రతి సోమవారం తమ రెవెన్యూ సమస్యలపై అర్జీలు ఇస్తున్నా అతి తక్కువ సంఖ్యలోనే పరిష్కారమవుతున్నాయి. దీంతో వీటి పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి వన్ మంత్ వన్ విలేజ్–4 విజిట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో వరుసగా నాలుగు వారాలపాటు నాలుగు విడతలుగా ప్రత్యేక గ్రామ సదస్సులు నిర్వహిస్తారు. గ్రామస్థుల భూ, రెవెన్యూ సమస్యలపై అర్జీలను గ్రామంలోనే స్వీకరించి, పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించడం ముఖ్య ఉద్దేశం. ప్రత్యేకంగా రీసర్వే గ్రామాలు, ఎక్కువ సంఖ్యలో పెండింగ్, రెవెన్యూ ఫిర్యాదులు ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ సదస్సుల్లో తహశీల్దార్, ఎంపీడీఓ, మండల సర్వేయరు, రెవెన్యూ ఇన్స్పెక్టరు తదితర అధికారులు హాజరవుతారు. వీటిలోనైనా ఏమేరకు సమస్యలు పరిష్కారం అవుతాయో వేచి చూడాల్సిందే. గతంలో రెవెన్యూ సమస్యలు మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారానికి నోచుకోకపోతే ఒంగోలులోని కలెక్టరేట్కు వెళ్లి అర్జీలు ఇచ్చేవారు. అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఇక్కడి కలెక్టరేట్లోనే అర్జీలు ఇస్తున్నారు. జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ రెవెన్యూ సమస్యలపై వేలల్లో అర్జీలు వచ్చాయి. దీంతో రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ ఎం విజయసునీత మొదటి ప్రాధాన్యతగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రతి సోమవారం ఒకే సమస్యపై అర్జీలను ఇస్తుండటంతో వీటికి పరిష్కారమార్గం ఎక్కడ దొరుకుతుందో అర్థంకాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మ్యుటేషన్, ఆన్లైన్, భూ ఆక్రమణలు, పొలం తగాదా సమస్యలు వస్తున్నాయి. జనవరి నుంచి మే మొదటి వారం వరకూ మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో మొత్తం సుమారు 2308 అర్జీలు రాగా అందులో రెవెన్యూ సమస్యల అర్జీలే సుమారు 1108 ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం చూస్తాం.. చేస్తాం.. అంటున్నారు. రైతులు, ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రతినెలా ఒక గ్రామం.. నాలుగు రెవెన్యూ సదస్సులు మార్కాపురం టౌన్: జిల్లాలో రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలో పరిష్కరించేందుకు వన్ మంత్.. వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం విజయసునీత బుధవారం తెలిపారు. ఆమేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు వారాల పాటు నాలుగు విడతలుగా రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఆ గ్రామానికి సంబంధించిన భూములు, రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. ఎక్కువ రెవెన్యూ ఫిర్యాదులు వస్తున్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తహశీల్దార్, ఎంపీడీఓ, మండల సర్వేయరు, ఆర్ఐ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. భూ సరిహద్దు వివాదాలు, మ్యూటేషన్, కుటుంబ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రీసర్వే సమస్యలు, 22ఏ నిషేధిత ఆస్తుల వివరాలు, దారుల వివాదాలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని, గురువారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తామని తెలిపారు. -
తీగలేరు కాలువకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు
యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలో తాగు, సాగునీరు అందించే తీగలేరు(టీ–5) కాలువకు చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు పలికిందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుదఫాలుగా వెలిగొండ ప్రాజెక్ట్ను సందర్శించడమే పనిగా పెట్టుకున్నారని, టీ–5 కాలువ ఆ ప్రాజెక్ట్లో అంతర్ భాగమేనన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మంత్రి చూపు ఆ కాలువ వైపు వెళ్లనట్లుందని, నేటికీ భూ సేకరణ, టెండర్ ప్రక్రియ మొదలు కాలేదన్నారు. దశాబ్దాల తరబడి పుల్లలచెరువు మండల ప్రజలు తాగునీటి కోసం అలమటించి పోతున్నారని, సాగు నీటి సమస్యతో రైతులు వ్యవసాయం చేయలేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, టీ–5 కాలువతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చన్న విషయాన్ని పక్కకు పెట్టినట్లుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో మండలంలో నెలకొన్న నీటి సమస్యను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆ కాలువకు రూ.83 కోట్లు బడ్జెట్లో కేటాయించారని ఆయన గుర్తుచేశారు. మండల ప్రజల తాగునీటితోపాటు దాదాపు 11 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, యర్రగొండపాలెం ప్రాంతంలో భూగర్భ జలాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం టీ–5పై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల సమస్యలు అర్థం చేసుకొని తక్షణమే కాలువ పనులు ప్రారంభించాలని తాటిపర్తి డిమాండ్ చేశారు. లేకుంటే కాలువ కోసం ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
మంత్రి చెప్పారు.. బోరు పీకారు!
పొన్నలూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచీ తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తాము ఏమి చేసిన అడిగేవారు లేరంటూ అధికార మదంతో సామాన్య ప్రజలు, రైతులపైనా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. రైతులు వినియోగించుకుంటున్న డీప్బోర్ ప్రభుత్వం వేసిందని సాకుగా చూపి రెండేళ్లుగా వేధిస్తున్న పచ్చ నేతలు.. మంత్రి అండతో నిర్ధాక్షిణ్యంగా మోటారు పీకేయించడం కొండపి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పొన్నలూరు మండలంలోని చెరుకూరు గ్రామంలో వ్యవసాయ రైతు నేలపాటి మాలకొండయ్యకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సుమారుగా 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం రోడ్డు పక్కన బోరు బావి తవ్వించి చేతిపంపు ఏర్పాటు చేసింది. కాలక్రమంలో చేతిపంపు మరమ్మతులకు గురికావడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు హెడ్ను తొలగించి తీసుకెళ్లారు. మట్టితో పూడిపోయిన డీప్బోర్ను మాలకొండయ్యతోపాటు మరికొందరు రైతులు కలిసి సొంత డబ్బు వెచ్చించి రీబోర్ చేయించారు. విద్యుత్ మోటారు బిగించి, విద్యుత్ శాఖకు రూ.1.50 లక్షలు చెల్లించి ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయించుకున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఆ డీప్బోరును మాలకొండయ్యతోపాటు చుట్టుపక్కల పొలాల రైతులు వినియోగించుకుంటున్నారు. మంత్రి ఆదేశాలతో తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన క్షణం నుంచే మాలకొండయ్యతోపాటు మిగిలిన రైతులను గ్రామ టీడీపీ నాయకులు వేధించడం ప్రారంభించారు. డీప్ రహదారిలో ఉందని, అది గతంలో టీడీపీ జమానాలో వేసిందని చెబుతూ బెదిరింపులకు దిగారు. దీనిని మాలకొండయ్యతోపాటు మిగిలిన రైతులంతా వ్యతిరేకించడంతో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. డీప్బోర్ తొలగించాల్సిందేనంటూ మంత్రి డీబీవీ స్వామి వద్ద పంచాయితీ పెట్టి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలిచ్చేలా ఒత్తిడి చేశారు. ఈ నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో పాల్గొనేందుకు మంత్రి స్వామి చెరుకూరు వస్తుండగా.. ఓ గంట ముందుగానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వ్యవసాయ మోటార్లు తొలగించే యంత్రం ఉపయోగించి ఆగమేఘాలపై డీప్బోర్లో ఉన్న మోటారు తొలగించి పక్కన పడేశారు. కొందరు టీడీపీ నాయకులు చేసిన పని, మంత్రి స్వామి వ్యవహరించిన తీరు గ్రామంలోని టీడీపీ సానుభూతిపరులకు కూడా నచ్చలేదు. మోటారు తొలగింపు విషయమై పింఛన్ల పంపిణీ సమయంలో మంత్రి స్వామిని నిలదీయాలని గ్రామస్తులు సిద్ధం కాగా టీడీపీకి చెందిన కొందరు నేతలు కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పడం గమనార్హం. దీంతో బాధిత రైతులు కూడా మిన్నుకుండిపోయారు. చెరుకూరులో రైతులపై రాజకీయ కక్ష సాధింపులు మంత్రి స్వామి ఆదేశంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అత్యుత్సాహం డీప్బోర్ నుంచి మోటారు తొలగించిన వైనం మంత్రి స్వామి, తెలుగు తమ్ముళ్ల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం -
మాస్టర్ ప్లాన్ అనుమతికి అభ్యంతరాల స్వీకరణ
● జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చీమకుర్తి: చీమకుర్తి మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ను అమలు చేసేందుకు రూపొందించిన వివరాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కమిషనర్ వై.రామకృష్ణయ్య మంగళవారం మీడియా ద్వారా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు చీమకుర్తి మున్సిపల్ కార్యాలయం లేదా మెయిల్ ద్వారా అభ్యంతరాలను తెలియజేయాలని తెలిపారు. చీమకుర్తి పట్టణాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్, ఇండస్ట్రీ కేటగిరీలుగా విభజించినట్లు కమిషనర్ తెలిపారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుబంధంగా మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్కు హద్దులుగా ఉత్తరం వైపు నాయుడుపాలెం, బండ్లమూడి, పల్లామల్లి, తూర్పు వైపు గురవారెడ్డిపాలెం, పేర్నమిట్ట, దక్షిణం గోనుగుంట, ఆర్ఎల్ పురం, పడమర ఆర్ఎల్ పురం, బూదవాడ గ్రామాల సరిహద్దులుగా నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తే రోడ్ల ప్రాధాన్యతను బట్టి 100 అడుగుల వెడల్పు నుంచి విస్తరణ చేపట్టే అవకాశం ఉంటుదని చెప్పారు. ఇక మీదట ఎక్కడంటే అక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి వీలు కాదని, అనుమతినిచ్చిన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రోడ్లు, కాలువలు, తాగునీటి వ్యవస్థలో అభివృద్ధి మెరుగుగా మారుతుందని కమిషనర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఇసుకాసురుల విధ్వంసకాండ
● పాలేరు నదిని తొలిచేస్తున్న టీడీపీ నేతలు ● జోరుగా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా ● ధ్వంసమవుతున్న రోడ్లు ● అవస్థలు పడుతున్న ప్రజలు సాక్షి టాస్క్ఫోర్స్: అధికార పార్టీ నేతలు పాలేరు నదిని కుళ్లబొడిచేస్తున్నారు. రేయింబవళ్లు భారీ వాహనాలతో తవ్వకాలు చేస్తూ నదీ గర్భాన్ని తొలిచేస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు నది పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లో ప్రవహిస్తోంది. పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో జేసీబీల ద్వారా ఇసుకను టిప్పర్లకు తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా రెండు, మూడు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వాహనాలను చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి, పొదిలి వైపు ఇసుక టిప్పర్లను తరలిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఇసుకను టిప్పర్ల ద్వారా బహిరంగంగానే రవాణా చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక వ్యాపారుల దందాకు అడ్డేలేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సమీక్షిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుపడడం లేదు. ధ్వంసమవుతున్న రోడ్లు: అధిక లోడుతో లారీలు కామేపల్లి నుంచి కొండపి వైపు వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కామేపల్లి– నేతివారిపాలెం మధ్య రోడ్డు ధ్వంసమైంది. కొండపి–అనకర్లపూడి మధ్య రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొండపి, పెరిదేపి గ్రామాల మధ్య కూడా రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి.. టన్ను ఇసుకను రూ.900 నుంచి రూ.1100 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని లారీలు ఆరు టన్నుల నుంచి 12 టన్నులు వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాయి. కొండపి మీదగా దాదాపు రోజుకు సుమారుగా 50 లారీల ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది.ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు బొక్కేస్తున్నారు. పట్టపగలు ఇసుక తరలిస్తున్న టిప్పర్ -
పోలీసు కుటుంబాల చిన్నారులకు వేసవి శిక్షణ
ఒంగోలు టౌన్: పోలీసు కుటుంబాల చిన్నారులకు మానసిక ఉల్లాసం, వారిలోని నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్–2026ను మంగళవారం ఎస్పీ ప్రారంభించారు. పరుగు పందెం, ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్ క్రీడలను ప్రారంభించిన ఎస్పీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలను మాత్రమే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవన్నారు. క్రమశిక్షణ అలవడుతుందని, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించే వ్యక్తిత్వం వృద్ధి చెందుతుందని వివరించారు. నెల రోజుల క్యాంపు చిన్నారుల జీవితంలో ఒక మధురానుభూతిని మిగుల్చుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని పోలీసు కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ శిబిరంలో చిన్నారులకు పోలీస్ చిల్డ్రన్స్ కమిటీ ప్రసిడెంట్, హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామి రెడ్డి, ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, బాషా, సురేష్, తిరుపతి స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు. క్యాంపును ప్రారంభించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు -
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన ఎకై ్సజ్ అధికారులు తన జేబులు నింపుకుంటూ విక్రయదారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతైనా అమ్ముకోండి ప్రతి వారం మామూళ్లు పక్కాగా ఇచ్చుకోండి అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉన్నతాధికారి తన చేతికి మట్టి అంటకుండా కిందిస్థాయి సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ పే వసూళ్ల దందా జరుగుతోందంటూ ఆబ్కారీ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవోదయ కార్యక్రమానికి సంబంధించిన బిల్లుల్లో కూడా చేతివాటం ప్రదర్శించినట్టు ప్రచారం జరుగుతోంది. పర్మిట్ రూములకు సంబంధించి సాక్షిలో కథనం రావడంతో పాత తేదీలతో హడావుడిగా లైసెన్స్లు జారీ చేసినట్టు తెలిసింది.కిక్కు అధరహో!సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ అధికార పార్టీ కీలక నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. అధికారం చేతిలో ఉండడంతో మద్యం దుకాణాల్లో బహిరంగంగానే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల పక్కా ప్లాన్ ప్రకారం మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కేవలం అధికార పార్టీ కీలక నాయకులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లలో మాత్రమే అవి అందుబాటులో ఉండేలా చేస్తున్నారని తెలుస్తోంది. బ్రాండెడ్ మద్యం కోసం దుకాణాలకు వెళ్లిన మద్యం ప్రియుల సరుకు దొరకడంలేదు. ఫలానా బార్కు వెళ్లండి అక్కడ దొరుకుతుందని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందే సలహా ఇస్తున్నారని తెలిసింది. అక్కడకు వెళితే రూ.50 నుంచి రూ.300 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీ ప్రకారం మద్యం విక్రయించేలా చూడాల్సిన ఎకై ్సజ్ శాఖ కీలక అధికారి మామూళ్ల మత్తులో ఇటువైపు తొంగిచూడడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి కీలక అధికారి పర్యవేక్షణలో ఒక టాస్క్ఫోర్స్ టీం పనిచేస్తుంది. ఇందులో ఒక ఏఈఎస్, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 10 నుంచి 15 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తుంటారు. ఈ టీం జిల్లాలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయించకుండా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎమ్మార్పీకి మించి మద్యాన్ని విక్రయిస్తుంటే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే ఈఎస్ టీం ఇప్పటి వరకు కనీసం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలను గాలికి వదిలేసి కేవలం లంచాలు వసూలు చేసేందుకే ఆ బృందం పనిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా విజయవాడ నుంచి వచ్చిన స్టేట్ టాస్క్ఫోర్స్ టీం మాత్రం 4 కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర బృందం గుర్తించిన అక్రమాలను జిల్లా బృందం గుర్తించకపోవడంపై పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.నవోదయం’ బిల్లులు కై ంకర్యం...నిన్నా మొన్నటి వరకు మద్యం దుకాణాలకు పర్మిట్ లైసెన్స్ మంజూరు చేయకుండా ముడుపుల కోసం ఫైళ్లను పెండింగ్ పెట్టిన కీలక అధికారి మంగళవారం సీఐలతో సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. పర్మిట్ రూములకు సబంధించి సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో సదరు అధికారి హడావుడిగా అధికారులతో సమావేశమైనట్టు తెలిసింది. గత అక్టోబర్ నెలలో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో లైసెన్సు మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ మార్చిలో లైసెన్సులు మంజూరు చేసి వుంటే గత 5 నెలలుగా పర్మిట్ రూంలు అనధికారికంగా నిర్వహించినట్లు కీలక అధికారి ఒప్పుకున్నట్లే కదాని క్షేత్రస్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. పైసల కోసం పర్మిట్ రూంలకు లైసెన్సులను జారీ చేయకుండా పెండింగ్ పెట్టడం ఒక తప్పయితే మార్చిలో లైసెన్స్ జారీ చేసినట్లు తప్పుడు తేదీలతో లైసెన్సులు జారీ చేయడం మరో తప్పన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో ఎమ్మార్పీకన్నా అధికంగా మద్యం విక్రయాలు కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్న ఈఎస్ టీం 4 కేసులు నమోదు చేసిన స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు సాక్షి కథనంతో పాత తేదీలతో హడావుడిగా పర్మిట్ రూమ్లకు లైసెన్స్ల జారీ నవోదయ 2.0 నిధులు మింగేసినట్టు ఆరోపణలు కానిస్టేబుల్తో ఫోన్పే ద్వారా వసూళ్లునాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన జిల్లా కేంద్రమైన ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ‘నవోదయం 2.0’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 9 ఎకై ్సజ్ సర్కిల్ స్టేషన్లలో భారీ ఎత్తున నాటుసారా వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. నాటు సారా ప్రభావిత ప్రాంతాలైన యర్రగొండపాలెం, మార్కాపురం, దోర్నాల, పుల్లల చెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు తదితర మండలాల్లో విస్తృతంగా నాటుసారా వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రచార రథాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎకై ్సజ్, ఫారెస్ట్, పోలీసు, పంచాయతీ, వైద్యారోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకొని ప్రచారం చేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఎకై ్సజ్ సీఐలకు రూ.17 లక్షలు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్కు రూ.4 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల నుంచి పోలీసు స్టేషన్ స్థాయిని బట్టి, వారు నిర్వహించిన కార్యక్రమాల ఆధారంగా నిధులను కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా సీఐలకు నిధులు కేటాయించిన కీలక అధికారి వారి నుంచి 50 శాతం ముడుపులను బలవంతంగా వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముడుపులను తన టీంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మొబైల్ ఫోన్కు ఫోన్ పే చేయించుకున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని విచారిస్తే అసలు గుట్టు రట్టవుతుందని క్షేత్రస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. 50 శాతం కమీషన్ వసూలుపై కొందరు సీఐలు భగ్గుమంటున్నారని తెలిసింది. అంతటితో ఆగకుండా గత ఈఎస్ కోసం మంజూరైన రూ.4 లక్షలను నిబంధనల ప్రకారం ఆయనకు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా కీలక అధికారి నొక్కేసినట్లు విశ్వసనీయ సమాచారం. కీలక అధికారి వసూళ్లపై కొందరు ఉద్యోగులు మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
చాకిరేవు కుంటనుతవ్వేస్తున్న రియల్టర్లు
● చాకిరేవు కుంటను కాపాడాలని సీపీఎం డిమాండ్ ఒంగోలు టౌన్: నగరంలోని 10వ డివిజన్ పరిధిలోని కొప్పోలులో ఉన్న చాకిరేవు కుంటలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం చాకిరేవు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 రోజులుగా కొందరు రియల్టర్లు చాకిరేవు కుంటను తవ్వి తమ వెంచర్లకు మట్టిని తోలుకుపోతున్నా అఽధికారులకు పట్టకపోవడం దారుణమన్నారు. మైనింగ్ శాఖ అఽధికారుల అనుమతి లేకుండా మట్టిని ఎలా తవ్వుకుంటారని, అయినా చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుంటే మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలా మిన్నకుంటారని ప్రశ్నించారు. ప్రకృతి సిద్ధమైన చెరువులు, కుంటలు, వాగులను కాపాడాల్సిన బాధ్యత అఽధికారులపై ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేనికి సంకేతమని నిలదీశారు. కుంటను 20 అడుగుల లోతుకు తవ్వడం వల్ల భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎక్స్లేటర్ల ద్వారా తవ్వకాలు చేపట్టి వందలాది ట్రాక్టర్ల మట్టిని తోలుకుంటున్నారని తెలిపారు. మట్టిని తవ్వుకొని టిప్పుల లెక్కన అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చాకిరేవు వద్ద పెద్ద సంఖ్యలో నిలిచి ఉన్న ట్రాక్టర్లు చీమలదండులా కనిపిస్తున్నా అధికారుల కంటికి కనిపించకపోవడం వింతగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి చాకిరేవు కుంటను కాపాడాలని, కుంటను గ్రామాభివృద్ధి కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆంజనేయులు, కోటయ్య, రాఘవరావు, వెంకటరావు, జి.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
ఒంగోలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అల్లు సత్యానంద్ను కలెక్టర్ పి.రాజాబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో కలెక్టర్ కలుసుకున్నారు. లింగసముద్రం: కుటుంబ కలహాలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లింగసముద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం జరిగింది. ఎస్సై రాంబాబు అందించిన వివరాల ప్రకారం..ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇండ్ల వెంగళరావు (32) కుటుంబ కలహాలతో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు సమాచారం ఇవ్వడంతో అక్కడి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ● తప్పిన పెనుప్రమాదం యర్రగొండపాలెం: కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో ఆ చెట్టు కాలిపోయింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పిందని త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వెల్లంపల్లిలోని ఒక ఇంటి ఆవరణలో ఉన్న భారీ కొబ్బరి చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దాని తాకిడికి చెట్టు పూర్తిగా కాలిపోయింది. చెట్టుపై నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు భయంతో పరుగులు తీశారు. పిడుగుపాటు సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిడుగు కొబ్బరి చెట్టుపై కాకుండా ఇళ్ల మధ్యలో పడిఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకు కూడా ఎటువంటి హాని జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. -
వైభవంగా పాలేటి గంగమ్మతల్లి తిరునాళ్ల
పీసీపల్లి: మండల పరిధిలోని వెంగళాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం వైభవంగా సాగాయి. మంగళవారం గంగమ్మతల్లిని బొల్లావులతో అలవలపాడు, గుదేవారిపాలెం, రామాపురం గ్రామాల మీదుగా ఊరేగించారు. అనంతరం అమ్మవారిని నిధిలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. యాదవుల కులదైవమైన గంగమ్మతల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం పొంగళ్లతో తిరునాళ్ల ముగుస్తుంది. తిరునాళ్లను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొక్కుబడులు ఉన్న వారు తిరునాళ్లకు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. తిరునాళ్లను పురస్కరించుకొని గంగమ్మ తల్లికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న కాటంరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవుల అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ నాయకులు వెంగళాపురానికి చెందిన పాతకొట్టు పిచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, బాలయ్య చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి. తిరునాళ్లను పురస్కరించుకొని జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరునాళ్లను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
● రైతు సంఘం డిమాండ్ మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రైతు సమితి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని, క్వింటాకు రూ.2400 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మార్కాపురం జాయింట్ కలెక్టర్, డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా కన్వీనర్ దేవండ్ల శ్రీనివాసులు, నియోజకవర్గ కార్యదర్శి పీ కొండయ్య, సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఏఐటీయూసీ కార్యదర్శి కాసీం, నాయకులు శంకరరావు, నాగయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేవండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 13 జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. మార్చి చివరి నుంచే పంట దిగుబడులు మార్కెట్లోకి వస్తున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు విషయంలో ఆలస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారని, వ్యాపారులకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మొక్కజొన్నకు పూర్తి మద్దతు ధర చెల్లించాలన్నారు. ఇప్పటికే తక్కువ ధరలకు అమ్ముకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు వ్యాపారులు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మద్యం మత్తులో తమ్ముడిని కడతేర్చిన అన్న
దొనకొండ: మద్యం మత్తులో తమ్ముడిపై రాళ్ల దాడి చేసి అన్న హతమార్చిన ఘటన ఘటన మండలంలోని రుద్రసముద్రం ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగింది. హతుడి భార్య కోటేశ్వరి కథనం ప్రకారం..కందుల చిన్న కాశయ్యపై అతని సోదరుడు పెద్ద కాశయ్య మద్యం తాగి వెంటపడి రాళ్ల దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం నెపంతో తన భర్తను హతమార్చాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కందుల పెద్ద కాశయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని దర్శి సీఐ రామారావు పరిశీలించారు. బెల్టుషాపుతోనే గొడవలు గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్టుషాపులో రేయింబవళ్లు మద్యం అందుబాటులో ఉంటుంది. దీంతో గ్రామస్తులు మద్యానికి బానిసై గొడవలకు దిగుతున్నారు. గ్రామంలోని బెల్టుషాపును తొలగించాలని గ్రామస్తులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశామని, అయినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
ఐపీఎల్ వీఐపీ టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు
కందుకూరు: హైదరాబాద్లో ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం స్థానికంగా సంచలనం కలిగించింది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఘట్టమనేని అశోక్చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.పలుకూరుకు చెందిన అశోక్చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావుడి అంతా అశోక్చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండడంతో వీరు సంపాదనకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లు క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతోపాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీన్లో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్లో మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.దీనికిగాను గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు నకిలీ లెటర్హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందేవారు. అలా పొందిన టికెట్లను బ్లాక్మార్కెట్లో ఒక్కొక్కటి రూ.22 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వీఐపీ లెటర్హెడ్లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తుండగా అశోక్చౌదరి, దినేష్, వేణుమాధవ్లను రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. వీరంతా పలుకూరుకు చెందినవారు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్లతో హంగామా చేయడం పరిపాటి అని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, వీఐపీలతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటుంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్ జైషాతో దిగిన ఫొటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలతో తననుతాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్మార్కెట్ ముఠా నడిపిస్తున్నాడు. -
వైఎస్సార్ విగ్రహం కూల్చివేత
సంతమాగులూరు (అద్దంకి): సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. సిమెంటు పిల్లరుపై స్లాబు వేసి దానిపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ట్రాక్టర్లతో లాగించి పడేశారని ఆ గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలు దారుణమని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి డాక్డర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. -
మామిడి రైతు కుదేలు
గాలివానకు సింగరాయకొండ: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు మామిడి చెట్లకు ఉన్న కాయల్లో సుమారు 70 శాతం రాలిపోయాయి. 300 టన్నుల వరకూ కాయ రాలిందని, ప్రస్తుతం టన్ను ధర రూ.70 వేలు ఉందని, మొత్తం రూ.2 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో శానంపూడి, కనుమళ్ల, సోమరాజుపల్లి, పాతసింగరాయకొండ ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి సాగు చేశారు. ఈ సంవత్సరం చెట్లకు పూత సరిగా రాక, ఒకవేళ పూత వచ్చినా తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా రాలిపోయి దాదాపు 70 శాతం చెట్లకు సక్రమంగా కాపు లేదు. అరకొరగా కాసిన కాయలు కాపాడుకుంటున్నామని, ప్రస్తుతం ధర కూడా బాగానే ఉందని, ఈ తరుణంలో ఆదివారం రాత్రి హఠాత్తుగా వీచిన ఈదురుగాలులు, వర్షానికి కాయ మొత్తం రాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెట్టుపై మామిడికాయలు లేత దశలో ఉన్నాయి. వేడిగాలులు వీస్తుండటంతోమరో 10 రోజులు దాటితే పక్వానికి వచ్చి మంచి ధర వచ్చేది. కానీ, గాలులకు కాయ రాలిపోవడంతో కేజీ రూ.10కి మాత్రమే అడుగుతున్నారు. టన్ను ధర రూ.10000 మాత్రమే పలుకుతుండటంతో నష్టాలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం ప్రకృతి కారణంగా భారీగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు మాత్రం ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి తోట పూర్తిగా ధ్వంసమైతే తప్ప రైతుకు నష్టపరిహారం రాదంటున్నారు. ఈదురుగాలుల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయటంగానీ, నష్టపరిహారం వచ్చే అవకాశంగానీ లేదని చెప్పడంపై రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం టన్ను ధర రూ.70 వేలు నష్టపరిహారం రాదంటున్న ఉద్యానవన శాఖాధికారులు -
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
కంభం: వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు ఎస్సై శివక్రిష్ణారెడ్డితో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన భూపని సాయి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతేడాది ఆగస్టు 24న అర్ధరాత్రి పట్టణంలోని షిరిడిసాయినగర్లో ఓఇంట్లో బంగారు నగలు, నగదును అపహరించాడు. అదే ఏడాది నవంబర్ 28న పట్టణంలోని ఆర్టీిసీ బస్టాండ్ సమీపంలో గల దుర్గా వైన్షాపులో నగదు, ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన మండలంలోని నడింపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బీరువా పగులగొట్టి బంగారు కమ్మలు, వెండి పట్టీలు దోచుకెళ్లాడు. 17వ తేదీన మండలం రావిపాడు గ్రామంలో భీమేశ్వరస్వామి ఆలయంలో గుడి తలుపులు పగులగొట్టి బంగారు తాళిబొట్టు, చిన్న ఉంగరం, వెండి పట్టీలు, 18వ తేదీన అర్ధవీడు మండలంలోని మాగుటూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం గుడి తలుపులు పగులగొట్టి హుండీలోని సుమారు రూ.10 వేల నగదును అపహరించుకు వెళ్లాడు. పైచోరీలకు సంబంధించి కేసులు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో సోమవారం కంభం చెరువుకట్టకు వెళ్లే దారిలోని అంకాళమ్మ గుడి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. 20 గ్రాముల బంగారు నగల రికవరీ.. నిందితుడి భూపని సాయి వద్ద నుంచి రూ. 2.50 లక్షలు విలువ కలిగిన 20 గ్రాముల బంగారు నగలు, 25 తులాల వెండి పట్టీలు, రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు పట్టణంలోని గణేష్నగర్లో జరిగిన ఓ చోరీలో అచ్చి చిన్నసైదారావు అనే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 20 గ్రాముల బంగారు నగలు రికవరీ చేసినట్లు తెలిపారు. పై కేసులను త్వరగా ఛేదించడంలో, నిందతుడిని చాకచక్యంగా అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ కే మల్లికార్జున, ఎస్సై శివక్రిష్ణారెడ్డిని, సిబ్బంది కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, రంగస్వామిలను డీఎస్పీ అభినందించారు. -
తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
పీసీపల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన మండల పరిధిలోని వెంగళాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన భగీరథ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్లకు అన్నీ ఏర్పాట్లు చేశారు. సోమవారం గంగమ్మ తల్లిని రామాపురం, గుదేవారిపాలెం, అలవలపాడులో గ్రామోత్సవం నిర్వహించి మంగళవారం సాయంత్రానికి ఆలయం వద్దకు ఉత్సవ విగ్రహాన్ని తీసుకువస్తారు. ఈసందర్భంగా తిరునాళ్ల ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించి మాట్లాడారు. 250 మందితో తిరునాళ్లకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, కనిగిరి సీఐ శ్రీనివాసులు, పీసీపల్లి ఎస్సై నరసింహారావు, కనిగిరి ఎస్సై సందీప్, హెచ్ఎంపాడు ఎస్సై రాజకుమార్ ఉన్నారు. ఎంపీడీవో కృష్ణారావు, తహసీల్దార్ ఉషా, డాక్టర్ యశ్విత వైద్యశిబిరానికి ఏర్పాట్లను పరిశీలించారు. బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన సోమవారం రాత్రి మండలంలోని పెంచికలపాడు సమీపంలో జరిగింది. పెద్దారవీడు మండలం బద్వీడుకు చెందిన యోగయ్య, మార్కాపురానికి చెందిన పీ శ్రీనులు మోటార్ సైకిల్పై కంభం వైపు వెళ్తున్నారు. పెంచికలపాడు సమీపంలోకి రాగానే గేదెలు అడ్డురావడంతో రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో యోగయ్య, శ్రీనులు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో వైద్యశాలకు తరలించారు. -
కలెక్టర్ మీ కోసంకు 186 వినతులు
ఒంగోలు సబర్బన్: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మొత్తం 186 వినతులు వచ్చాయి. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి, డీపీఓ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఏదైనా కారణంతో ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే దానికి గల కారణాలను అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంటు ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ విజయసునీత మార్కాపురం టౌన్: ప్రజల నుంచి సమస్యలపై అందిన అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయసునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొత్తం 169 అర్జీలు వచ్చాయని, వాటిలో రెవెన్యూకు సంబంధించి 108, ఇతర సమస్యలపై 61 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ హర్షవర్థన్రాజును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాఽధితులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేయడానికి పోలీసు స్టేషన్కు వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని వ్యక్తులు స్థానికంగా పోలీసు స్టేషన్లోగానీ, సబ్ డివిజన్ కార్యాలయంలోగానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒంగోలు వన్టౌన్ పోలీస్స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావు, కొండపి సీఐ రవనయ్య, దర్శి సీఐ రామారావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు. -
మార్కాపురం పోలీ్స్ గ్రీవెన్స్కు 33 వినతులు
మార్కాపురం: పట్టణంలోని ఇన్చార్జి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీ్స్ గ్రీవెన్స్కు 33 అర్జీలు అందాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి అర్జీదారులు వచ్చి వారి సమస్యలపై వినతిపత్రాలు అందించినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. వాటిని ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించి చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సివిల్, చీటింగ్ సమస్యలపై అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మార్కాపురం, త్రిపురాంతకం, పామూరు సీఐలు అల్తాఫ్ హుస్సేన్, హస్సన్, వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఊరుకోం..
వెలిగొండకు అన్యాయం చేస్తే మార్కాపురం/మార్కాపురం టౌన్/మార్కాపురం రూరల్: తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్కు అసలు ఇంజన్ ఉందా..లేదా.? అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కన్వీనర్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటికై పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై సోమవారం మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షత వహించారు. శైలజానాఽథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టూర్ నుంచి వచ్చిన తరువాత చంద్రబాబు ఏమైనా మాట్లాడతాడా అని ఎదురుచూస్తుంటే.. ఏమీ లేకపోగా వైఎస్సార్ సీపీ నాయకులపై వారి మంత్రులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. ఈ ప్రాంత వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుకు బాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుకు చేస్తున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతి పేరుతో దోపిడీ మానుకుని వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంటలు పండుతాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను అవకాశం వచ్చిన చోటల్లా చెబుతూనే, మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. వెలిగొండకోసం పోరాటం : బూచేపల్లి వెలిగొండ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పోరాటం చేస్తామని దర్శి ఎమ్మెల్యే, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. ఆ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులు బాగుండాలంటే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. బాబు పోవాలి–జగన్ రావాలి అనే నినాదంతో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు, వెన్నా హనుమారెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, పిడతల ప్రవీణ్కుమార్, బి.అశోక్కుమార్రెడ్డి, బి.రామారావు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపి, ఒంగోలు నియోజకవర్గాలకు చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
ముందస్తు పన్నుతో రాయితీ
● మెగా ట్యాక్స్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కలెక్టర్ పి.రాజాబాబు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల మెగా ట్యాక్స్ మేళా’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ప్రత్యేక రాయితీలు ఉన్నాయని తెలిపారు. మే 31వ తేదీలోపు 2026–27 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ (రిబేటు) లభిస్తుందన్నారు. జిల్లాలోని గృహ యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ వంటి పనులు పంచాయతీల ఆదాయంపైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి గ్రామ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. మే నెలాఖరు వరకు నిర్వహించే ఈ మేళాపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కల్పన కుమారి, డీపీఓ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
దిగజారుతున్న టీడీపీ నాయకులు
● వై.పాలెం ఎమెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకుల వరకూ దిగజారుడు పరిస్థితుల్లో ఉన్నారని, ప్రతిపక్షానికి చెందిన వారిని ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని వై.పాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వారు గుర్తుంచుకోవాలన్నారు. ఈ నెల 1వ తేదీ ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నుంచి యర్రగొండపాలెం వస్తుండగా, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్చార్జి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి కేక్ కట్ చేయించారు. పిన్నెల్లి ఆధ్వర్యంలో అక్కడికి చేరిన ప్రజలను చూసి ఓర్వలేక మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన వర్గీయులతో సోషల్ మీడియాలో చేయిస్తున్న తప్పుడు ప్రచారాన్ని తాటిపర్తి ఖండిచారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రజల మన్ననలతో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి.. పక్క నియోజకవర్గంలోని దళిత ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు చేయడాన్ని కూటమి నాయకులు జీర్ణించుకోలేక విమర్శించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేను సన్మానించడాన్ని సహించలేకపోవడం ఏంటో అర్థం కావడంలేదన్నారు. పిన్నెల్లి చరిష్మా, ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేక టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి విచక్షణ కోల్పోయి సోషల్ మీడియా వ్యక్తుల వెనకుండి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నాడని తాటిపర్తి విమర్శించారు. ఈ పరిస్థితులను చూస్తుంటే.. దళిత వర్గాల పట్ల జూలకంటి ఆలోచన ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని అన్నారు. మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓబులరెడ్డి, నాయకులు ఆవుల వీరకోటిరెడ్డి, పప్పర్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు తీరు.. అందని నీరు!
దొనకొండ: వేసవిలో మంచి నీటి సమస్య ఉత్పన్నం కాకూడదన్న అధికారుల మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. సాగర్ జలాలు సరఫరా చేసేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో సైతం పాలకుల నిర్లక్ష్యం మూలంగా మంచినీటి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకుండా కొర్రీలు పెట్టడంతో చందవరం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పరిధిలోని వేలాది మంది తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంపిన ప్రతిపాదనలను సైతం చంద్రబాబు సర్కారు బుట్టదాఖలు చేయడంతో గ్రామాల్లో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. మరమ్మతుల్లో జాప్యం వేసవి కాలం ప్రారంభమై రెండు నెలలైంది. అంతకంటే ముందే నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉండగా క్షేత్ర స్థాయిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. దీంతో ప్రభుత్వంతోపాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గృహాల్లో బోర్లు లేని వారు తాగేందుకు, వాడుకునేందుకు నీరు లేక దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చందవరం రిజర్వాయర్ వద్ద మోటార్లు, పైప్లైన్ లీకేజీ మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం దొనకొండ మండల ప్రజలకు శాపంగా మారింది. చందవరం సాగర్ నీటి రిజర్వాయర్, పంప్ హౌస్, మినరల్ ఫిల్టర్లు, కొత్త మోటార్లు, పైపులైన్లు, ఇతరత్రా నిర్వహణ పనులకు రూ.2.5 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ పనులకుగాను టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం, బిల్లుల మంజూరులో జాప్యం వెరసి కాంట్రాక్టర్లు సగం పనులు కూడా పూర్తి చేయలేదు. దీంతో ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందు నుంచే దొనకొండ ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. దొనకొండలోని ముస్లిం బజార్, వీవీపురం, బేతేలుపురం, అరబస్తాన్, ఓబ్బాపురంలోని ప్రజలకు రెండు నెలలుగా గుక్కెడు మంచినీటి సరఫరా చేయలేదు. ప్రత్యామ్నాయం శూన్యం చందవరం వద్ద 855 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మొదటి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద పంపింగ్ మోటార్ల మరమ్మతులు జాప్యమయ్యే సూచనలున్నాయని అధికారులు గ్రహించినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. అవసరమైన ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, కొన్ని గ్రామాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తూ అధికంగా బిల్లులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చందవరం వద్ద పనులు ఎప్పటికి పూర్తవుతాయో, మంచి నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జ్ డీఈ నారాయణస్వామిని వివరణ కోరగా.. ‘సమ్మర్ స్టోరేజీ వద్ద పనులు పూర్తయ్యాయి. మెయిన్ పైపులైన్ ద్వారా త్వరలో నీరు సరఫరా చేస్తాం. గ్రామాల్లో నీరు సరఫరా చేసే బాధ్యత పంచాయతీ అధికారులదే’ అని చెప్పారు. దొనకొండ మండలంలో తాగునీటి అగచాట్లు రెండు నెలలుగా సరఫరా కాని సాగర్ జలాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలం మండు వేసవిలో విలవిల్లాడుతున్న ప్రజలు రెండు నెలలుగా తాగు నీటి కష్టాలు సాగర్ జలాల సరఫరా గురించి అధికారులను అడిగితే పనులు చేస్తున్నామని మాట దాటేస్తున్నారు. ప్రభుత్వం రూ.2.5 కోట్లు నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు మందకొడిగా సాగాయి. నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో చెప్పకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా నెలల సమయం కాలయాపన చేయడం సరికాదు. – షేక్.రసూల్, దొనకొండ ముస్లిం బజారుఅధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు దొనకొండకు సాగర్ జలాలు సరఫరా కాక సుమారు రెండు నెలలు కావస్తోంది. ఏ అధికారిని అడిగినా రాజకీయ నాయకుల్లా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఏప్రిల్ నెల పూర్తయింది. ఎండ ప్రతాపం ఎక్కువైంది. ఇళ్లలో వేసుకున్న డీప్బోర్లలో కూడా నీరు అడుగంటాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి నీరు ఎప్పుడిస్తారో అధికారులు ప్రకటించాలి. మంచి నీటి కోసం అధికారులకు ఫోన్ చేస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. – బి.జయరావు, ఓబ్బాపురం -
పెద్దదోర్నాలలో గడ్డి లారీ బీభత్సం
పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలో గడ్డి లోడ్తో వెళ్తున్న ఓ లారీ ప్రజలను కాసేపు గడగడలాడించింది. చెలరేగుతున్న మంటలతో ప్రయాణిస్తున్న లారీ దెబ్బకు శ్రీశైలం రహదారిలోని దుకాణాదారులు వణికిపోయారు. వివరాలు.. నంద్యాల జిల్లా మైదుకూరు నుంచి గడ్డి లోడుతో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని గోశాలకు బయలుదేరిన లారీ ఆదివారం మధ్యాహ్నం పెద్దదోర్నాల చేరుకుంది. శ్రీశైల ముఖద్వారం ఆర్చి వద్ద గడ్డి రోళ్లకు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో క్షణాల వ్యవధిలోనే లారీలోని గడ్డికి పూర్తిగా మంటలు వ్యాపించాయి. దీంతో లారీ డ్రైవర్ దిక్కుతోచని స్థితిలో రహదారి పొడవునా గడ్డి రోళ్లను పడేసుకుంటూ వెళ్లాడు. రహదారిపై ఒకటిన్నర కిలోమీటర్ల మేర గడ్డి రోళ్లు పడటంతో దట్టమైన పొగ, మంటలతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు తమ వద్ద ఉన్న నీటితో మండుతున్న గడ్డి రోళ్లను ఆర్పే ప్రయత్నం చేశారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి లారీని శ్రీశైల రహదారిలోని నిర్మాణుష్య ప్రాంతానికి తరలించాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు స్థానిక యువకులు సహకారం అందించారు. తగలబడుతున్న గడ్డి రోళ్లను లారీ నుంచి కింద పడేశారు. మంటలు అర్పటంలో సహకరించిన యవకులకు అగ్నిమాపక కేంద్ర అధికారి మాల్యాద్రి, ఏఎస్సై పోలురాజు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ప్రమాదంలో రూ.40 వేల విలువ చేసే గడ్డి కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి లారీలో చెలరేగిన మంటలు శ్రీశైలం రహదారి పొడవునా పడిపోయిన గడ్డి రోళ్లు మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నేడు మార్కాపురంలో భారీ సదస్సు
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టుపై జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఉన్న సౌజన్య ఫంక్షన్ హాలులో సోమవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఈ సదస్సుకు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పి.చంద్రశేఖర్రెడ్డి, టి.మాధవరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి, పార్లమెంటు కన్వీనరు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మాజీ మంత్రి ఎస్.శైలజానాథ్, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గాల ఇన్చార్జిలు, పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు సంఘ మండల అధ్యక్షులు, సాగునీటి సంఘ నిపుణులు, మాజీ సర్పంచ్లు హాజరుకావాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీరు, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలనే డిమాండ్లపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అన్నా రాంబాబు తెలిపారు.అన్నా రాంబాబు -
మంత్రి కోసం దేవుడైనా ఆగాల్సిందే..!
ఉలవపాడు: సూర్యాస్తమయానికి ముందే కన్నుల పండువగా జరగాల్సిన రథోత్సవం మంత్రి, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడం వలన ఏకంగా రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆలస్యంగా రావడంతో చివరకు చీకట్లో రథోత్సవం జరిగింది. మండల కేంద్రమైన ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవం నిర్వహించారు. ఉదయం రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలుని కళ్యాణం నిర్వహించారు. ఈ ఏడాది రూ.80 లక్షలతో నూతన రథం తయారు చేశారు. ట్రయల్ రన్ కూడా ఈ నెల 1న పూర్తయింది. ఈ రథం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయి సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభం కావాలి. కానీ 6.30 గంటలకు మంత్రి, ఎమ్మెల్యే వచ్చారు. శిలాఫలకం ఆవిష్కరించి రథోత్సవం ప్రారంభమయ్యేసరికి 7 గంటలు దాటి చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత రథోత్సవం ప్రారంభం కావడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రతి ఏడాది చీకటి పడేలోపు రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. కానీ, ఈ ఏడాది 7 గంటలకు ప్రారంభమైంది. భక్తులు దాదాపు రెండు గంటల పాటు రథం కదులుతుందని ఎదురుచూస్తూ నిలబడాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు ఏకంగా వేణుగోపాల స్వామినే కదలకుండా ఆపివేసిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు రథోత్సవానికి హాజరయ్యారు. కానీ, ఎప్పుడూ రథోత్సవాన్ని ఆలస్యం చేయలేదు. రథం తిరుగుతున్న సమయంలోనే వారు వచ్చి దర్శించుకుని వెళ్లిపోయేవారు. కానీ, ఇలా దేవుడిని ఆపడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భారీగా భక్తులు హాజరైనప్పటికీ దేవుడికి సమయానికి జరగాల్సిన ఉత్సవాన్ని ఇలా ఆలస్యం చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
దంచికొట్టిన గాలివాన
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో బీభత్సం ● మధ్యాహ్నం వరకు మండిపోయిన ఎండఒంగోలు సిటీ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ మండిపోయింది. 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురంలో 43 డిగ్రీలు, కనిగిరిలో 42, ఒంగోలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి గాలి వీచడం ప్రారంభమైంది. క్రమంగా పెనుగాలులు వీచాయి. రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో గాలివాన దంచికొట్టింది. జనజీవనం స్తంభించేంతగా సుమారు గంటకుపైగా గాలివాన అతలాకుతలం చేసింది. సాయంత్రం వాతావరణం చల్లబడిందని ప్రజలు ఊపిరి పీల్చుకునేలోపే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం అసౌకర్యానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మార్కాపురం జిల్లాలోని కంభంలో అరటి తోటలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభం కుప్పకూలడంతో పాటు ఇళ్లపై రేకులు లేచి కిందపడ్డాయి. కనిగిరి నియోజకవర్గంలోనూ గాలివాన కారణంగా రేకులు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగానూ గాలివాన భయానకం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఒంగోలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గాలివానకు జనం అవస్థపడ్డారు. మెరుపులతో కూడిన ఉరుముల శబ్దాలకు నగరం దద్దరిల్లింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి అసౌకర్యం తలెత్తింది. విద్యుత్ సరఫరా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది. -
ఆనందం ఆవిరి.. ఆందోళన ముసిరి..
● భీకర గాలులకు ఎగ్జిబిషన్లు అతలాకుతలం ● ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు ఒంగోలు టౌన్: పెనుగాలులు సృష్టించిన బీభత్సానికి ఒంగోలు నగరం చిగురుటాకులా వణికింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం పడటంతో నగరంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని ఊర చెరువు, గుంటూరు రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదురు, నార్త్ బైపాస్లోని ఎగ్జిబిషన్లలో దుకాణాల రేకులు గాలులకు ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. నార్త్ బైపాస్లోని ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ పడిపోయినట్లు పుకార్లు వచ్చాయి. దీంతో డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డ్రాగన్ లైట్ల వెలుగులో రేకులను తొలగించారు. మిగిలిన ఎగ్జిబిషన్లను డ్రాగన్ లైట్ల వెలుగులో పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నార్త్ బైపాస్లోని పల్నాడు ఫర్నిచర్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సైన్ బోర్డు గాలుల ధాటికి విరిగి రోడ్డుపై పడింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సైన్ బోర్డు తొలిగించారు. ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదుట ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మోకాలి లోతు నీరు నిలిచాయి. భీకర గాలుల ధాటికి ఒంగోలు నగరంలో పలుచోట్ల దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. -
మెటీరియల్ అమోఘం.. మార్కులే ‘సాక్షి’
విద్యార్థి దశలో భవితకు పదో తరగతి పునాది. టెన్త్లో సాధించే మార్కులు పైచదువుల అడ్మిషన్కు, ఉద్యోగాల సాధనకు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల విజయానికి తోడుగా నిలవాలని భావించిన ‘సాక్షి’ యాజమాన్యం.. ప్రత్యేక స్టడీ మెటీరియల్ రూపొందించింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేసింది. అంతేకాకుండా ‘సాక్షి భవిత’లో టెన్త్ విద్యార్థుల కోసం మాక్ టెస్టులు, సబ్జెక్టుల వారీ విశ్లేషణలు ప్రచురించింది. ఇటీవల టెన్త్ ఫలితాలు విడుదల కాగా, ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పలువురు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. అత్యధిక మార్కుల సాధనకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ దోహదపడిన తీరును వివరిస్తూ సంతోషం వెలిబుచ్చారు. – చీమకుర్తి రూరల్/ బల్లికురవ/పుల్లలచెరువు సులభంగా సాధన సరైన సమయంలో ‘సాక్షి’ యాజమాన్యం స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. టెక్స్ట్ బుక్లు, నోట్స్తో కుస్తీ పట్టే పని లేకుండా సులభంగా, సమగ్ర సమాచారంతో అన్ని విభాగాలను కవర్ చేస్తూ ప్రచురించిన స్టడీ మెటీరియల్ చదివి 585 మార్కులు తెచ్చుకున్నా. మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. – టి.పవన్కుమార్, పుల్లలచెరువు జెడ్పీ పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత ‘సాక్షి’ అందజేసిన మెటీరియల్ చదివాం. మోడల్ పేపర్లను ఉపాధ్యాయులు ప్రాక్టీస్ చేయించారు. దాంతో మా పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణత సాఽధించాం. నేను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో సత్తా చాటడం సంతోషంగా ఉంది. – కె.లోహిత్దత్త, కూకట్లపల్లి (బల్లికురవ) మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశా.. పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ‘సాక్షి’ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశా. 515 మార్కులు సాధించా. మా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనతోపాటు ‘సాక్షి’ మెటీరియల్ కూడా మెరుగైన పలితాలు సాధించడానికి దోహదపడింది. – యద్దనపూడి లోకేష్, బండ్లమూడి జెడ్పీహెచ్ (చీమకుర్తి) ● ‘సాక్షి’ స్టడీ మెటీరియల్పై టెన్త్ విద్యార్థుల మనోగతం ● మార్కుల సాధనలో కీలకంగా భవిత పాఠాలు, మాక్ టెస్టులు పుల్లలచెరువు జెడ్పీ హైస్కూల్లో ‘సాక్షి’ స్టడీ మెటీరియల్తో విద్యార్థులు (ఫైల్) ‘సాక్షి’ స్టడీ మెటీరియల్తో గాడిపర్తివారిపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు (ఫైల్) ‘సాక్షి’ ప్రోత్సాహం అద్భుతం ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ను అందజేయడం విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చింది. మా ప్రాక్టిస్కు మోడల్ పేపర్లు బాగా ఉపయోగపడ్డాయి. దాంతోపాటు ఉపాధ్యాయులు బోధనతో 575 మార్కులు సాధించా. ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – ఎస్కే షర్మిల, రావినూతల(మేదరమెట్ల) సాక్షి అందజేసిన మెటీరియల్ బాగా ఉపయోగపడింది. నేను అందులో మోడల్ పేపర్లను క్షుణ్ణంగా చదివా. ఉపాధ్యాయులు ఇచ్చిన గైడెన్స్తో 550 మార్కులు సాధించాను. మంచి మార్కులు రావడానికి దోహదపడిన ‘సాక్షి’కి అభినందనలు. – ఎ.సాయి, తిమ్మాయపాలెం(అద్దంకి) పోటీ పరీక్షలకూ పనికొస్తుంది ‘సాక్షి’ మీడియా పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు బాగా సహకరించింది. ఈ మెటీరియల్ను భద్రపరచుకుంటే అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. టీచర్ల సహకారం, ‘సాక్షి’ ప్రోత్సాహంతో 563 మార్కులు సాధించగలిగా. – కె.చిన్న మరియమ్మ, కేజీబీవీ, పుల్లలచెరువు -
కుటుంబ కలహాలతో యువకుని ఆత్మహత్య
కనిగిరి రూరల్: కుటుంబ సమస్యల కారణంగా ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై టి.సందీప్ కుమార్ కథనం మేరకు.. పీసీపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగులూరి శ్రీనివాసులు(30) భార్యతో గొడవపడి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం కనిగిరి పట్టణ సమీపంలోని చింతలపాలెం మోడల్ స్కూల్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వీఆర్వోకు సమాచారం అందించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
వెలుగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా పోతోంది. ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా పరిస్థితి తయారవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లలో అరకొరగా నిధులు కేటాయించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్టు పరిస్థితి నెలకొంది. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ త్యాగాలకు విలువ లేకుండా పోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మార్కాపురంలో నేడు సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం...బాబు బురిడీ..వెలుగొండ గారడీ..!మార్కాపురం: నాడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచినప్పుడల్లా ఊదరగొడుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరోవైపు వచ్చే జూన్, జూలైలో వెలుగొండ ప్రాజెక్టుకు నీరిస్తామని ఇటీవల ప్రకటించారు. కాగా, పునరావాస కాలనీల్లో పనులు పూర్తి కాకుండా వెలిగొండ నీటిని విడుదల చేస్తే తమ భవిష్యత్తు ఏమిటంటూ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, వెలుగొండ ప్రాజెక్టు పనులపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నేడు మార్కాపురంలో సదస్సు నిర్వహించనుంది. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం కక్ష... మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించే పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆయా కాలనీల్లో గుడి, బడి, అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటర్ ట్యాంకులు, పంచాయతీ భవనాలు, సిమెంటు రోడ్లు నిర్మించారు. పలు కాలనీల్లో గృహ నిర్మాణాలకు పూనుకున్నప్పటికీ 2024లో ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనుల కోసం ముంపు గ్రామాల ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కానీ, అవేమీ జరగలేదు. దీంతో తమ త్యాగానికి గుర్తింపు లేకుండా పోతోందని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో నిరాశ, నిస్తేజం అలముకున్నాయి. అయితే తరచూ రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షకు వస్తున్నప్పటికీ పునరావాస పనుల్లో మాత్రం పురోగతిలేదు. పునరావాస కాలనీల్లో పనులు చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకూ ప్రారంభం కాలేదు. గతేడాది మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజు, ఈ ఏడాది ఫిబ్రవరి 25న మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగొండపై మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పట్ల ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటే చెబుతూ.. జూన్, జూలైలో నీళ్లిస్తామనడంతో సర్వత్రా ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాతలనాటి ఊర్లను వదిలి ఇళ్లు, పొలాలను త్యాగంచేసి బయటకు వచ్చేందుకు ప్రజలు సిద్ధమవగా, వారి పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ఇళ్లు కట్టించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం... పశ్చిమ ప్రాంతంలో శాశ్వతంగా కరువు నివారించడంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించే వెలుగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా మార్కాపురం వచ్చిన చంద్రబాబు.. తాను అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టుకు అత్యధిక నిధులు కేటాయించి త్వరగా పూర్తిచేస్తానని చెప్పారు. కానీ, గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.309.13 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్లో రూ.412 కోట్లు మాత్రమే కేటాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇలా అయితే పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తిచేస్తారో అర్థం కావడం లేదని, అదే సమయంలో నీళ్లు వదిలితే తాము ఊర్లను వదిలి ఎక్కడుండాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందనే భావన ముంపు గ్రామాల ప్రజల్లో ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి సారించకపోవడంతో పునరావాస కాలనీల్లో పిచ్చిచెట్లు, చిల్లచెట్లు మొలిచి పెద్దవై అరణ్యాన్ని తలపిస్తున్నాయి. విషసర్పాలు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల పునరావాస కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయి. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంటవద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద కలనూతలలో, కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలు ఏర్పాటు చేశారు. వాటిలో సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాలు, పాఠశాలలు నిర్మించారు.పునరావాస పనులు వెంటనే ప్రారంభించాలి : ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలి. వెలుగొండ నిర్వాసితులకు వెంటనే ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. నాటి ఒప్పందం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.14 లక్షలతో పాటు పునరావాస కాలనీల్లో పక్కా గృహం కట్టించి ఇవ్వాలి. కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. – తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ, మార్కాపురం మండలంకాలనీల్లో అభివృద్ధి ఎప్పుడు : పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు నత్తనడకతో పోటీపడుతున్నాయి. సుంకేశుల పునరావాసకాలనీ చిల్లచెట్లతో నిండిపోయింది. బడి, గుడి, కమ్యూనిటీ హాలు మాత్రమే కట్టగా, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు నీళ్లు వదిలితే మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పునరావాస కాలనీల్లో త్వరగా పనులు పూర్తిచేయాలి. – జి.రమేష్, మాజీ సర్పంచ్, సుంకేశుల -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు అద్దంకి: స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలోని రేణింగవరం రహదారిలో నల్లవాగు సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. ప్రమాదంలో కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలంలోని కెల్లంపల్లికి చెందిన జి.ప్రవీణ్కుమార్(24) అక్కడిక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి శివప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు పడుతుండగా తెప్ప బోల్తా పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు అనకాపల్లి జిల్లా నుంచి కొందరు వ్యక్తులు నెల రోజుల క్రితం రాళ్లపాడు వచ్చారు. రోజూలాగే తెప్పలో వెళ్లి చేపలు పడుతుండగా ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పెనుగాలులు వీయడంతో తెప్ప బోల్తా పడింది. అందులో ఉన్న వ్యక్తి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపేశారు. గల్లంతైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అద్దంకి: గుండ్లకమ్మ వంతెనపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అద్దంకి–దర్శి రహదారిలో ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. అద్దంకి పట్టణంలోని ఇందిరా నగర్కు చెందిన ఎం.అనిల్(35) హైదరాబాద్లో బేల్దారి పని చేస్తున్నాడు. అంకమ్మ కొలుపులు నిర్వహిస్తుండటంతో అద్దంకి వచ్చాడు. శనివారం రాత్రి కొలుపుల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి ఫోన్ చేసి శ్రీనేను శ్మశానంలో పడుకుని ఉన్నాశ్రీ అని చెప్పాడు. ఆ తర్వాత కొంత సేపటికే గుండ్లకమ్మ వంతెన పైనుంచి ఎవరో వ్యక్తి దూకాడని తెలియడంతో భార్య, బంధువులు అక్కడికి చేరుకున్నారు. వంతెనపై విడిచిపెట్టిన చెప్పులు, సెల్ఫోన్ ఆధారంగా నదిలో దూకింది అనిల్ అని నిర్ధారించుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సుబ్బరాజు గజ ఈతగాళ్లను తీసుకొచ్చి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో కంపకళ్లి ఉత్సవం
హనుమంతునిపాడు: చెన్నకేశవ నామ స్మరణతో హనుమంతునిపాడు మండలం నల్లగండ్ల పంచాయతీలోని చిన్నగొల్లపల్లి గ్రామం మారుమోగింది. ఐదు రోజులుగా సాగుతున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు కంపకళ్లి కార్యక్రమంతో ఆదివారం ముగిశాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం చెన్నకేశవస్వామి భక్తులు కంపకళ్లిలో పాల్గొని మొక్కులు చెల్లించారు. పోలీసు బందోబస్తు మధ్య సాగిన ఈ ఉత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగింది. ముందుగా చెక్కా వంశస్తులు కంపకళ్లిపై దొర్లిన తర్వాత భక్తులు సైతం అదే రీతిలో మొక్కులు చెల్లించారు. గజవాహనంపై కొలువైన చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తితో కంపకళ్లి ప్రదక్షిణల అనంతరం పోతురాజుల వీర కేకల నడుమ భక్తులు గోవింద నామాన్ని స్మరిస్తూ కంపకళ్లి దొర్లి మొక్కులు చెల్లించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎస్సై రాజ్కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ గిరిరాజ నరిసింహబాబు, కమిటీ సభ్యులు జగన్మోహన్రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఫిట్నెస్లేని విద్యా సంస్థల బస్సులపై చర్యలు
ఆదివారంసత్యమేవ జయతే3-5-2026మార్కాపురం: ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లే బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి ట్రాన్స్పోర్టు ఆఫీసర్ చండ్రా రాంబాబు హెచ్చరించారు. శనివారం మార్కాపురం డీటీఓ కార్యాలయంలో జిల్లాలోని వివిధ విద్యాసంస్థల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి పాఠశాల బస్సు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్కు వెళ్లి తనిఖీలు చేయించుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. బస్సుల్లో స్పీడ్ కంట్రోల్ పరికరాన్ని బిగించుకోవాలని, ఫస్టు ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిమిత వేగంలోనే బస్సులు నడపాలన్నారు. మరో ఎంవీఐ భాస్కర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. www.sakshi.com‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’ -
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే గిట్టుబాటు ధరలు
● పొగాకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు ఒంగోలు టౌన్: ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే పొగాకు రైతులకు న్యాయం జరుగుతుందని, లేకపోతే గిట్టుబాటు ధరలు లభించడం కష్టమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో శనివారం పొగాకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పమిడి వెంకటరావు మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఏర్పడిన పొగాకు బోర్డు కంపెనీలతో మిలాఖత్ అయి రైతులను దగా చేస్తోందని విమర్శించారు. ఆరుగాలం కష్టించి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తేగానీ పొగాకుకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంతిబాబు మాట్లాడుతూ గతేడాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వేలం కేంద్రాల చుట్టూ తిరిగారని, ఈ ఏడాది ఒక్కరు కూడా వేలం కేంద్రం వైపునకు రాలేదని తెలిపారు. గతేడాది క్వింటా రూ.28 వేలు ప్రకటించి కొనుగోలు చేస్తేనే కొద్దిపాటి నష్టంతో రైతులు బయటపడ్డారని, ఈ ఏడాది గతం కంటే తగ్గించి రూ.25 వేలకు కొనుగోలు చేస్తే బ్యారన్కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోందని వివరించారు. గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా ఈ ఏడాది 49 శాతానికి పెంచి రైతులను నిండా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పొగాకు బోర్డు, మరోవైపు కంపెనీలు రైతులను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, రైతు సంఘ జిల్లా నాయకుడు పరిటాల కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు నాయకులు టి.శ్రీకాంత్, బెజవాడ శ్రీను, కనపర్తి సుబ్బారావు, వేజండ్ల సింగయ్య, ముప్పరాజు బ్రహ్మయ్య, వాసు, మల్లికార్జునరావు, తుళ్లూరి వెంకటరావు పాల్గొన్నారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 18వ తేదీ పొగాకు సదస్సు నిర్వహించాలని సమావేశం తీర్మానం చేసింది. -
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఉదయం 11 గంటలు దాటితే బయటకు రాకుండా ఉండటం మంచిది. వడదెబ్బకు గురైతే ప్రాణాంతకం కావచ్చు. వీలైనంత వరకూ మంచినీరు, కొబ్బరినీరు, పండ్ల రసాలు తరచూ తీసుకోవాలి. రోడ్డుమీద అమ్మే వివిధ రకాల రంగుపానీయాలు తీసుకోవద్దు. కలుషిత ఆహారం, రోడ్డుపై అమ్మే జంక్ ఫుడ్స్ తినవద్దు. కూలి పనులు చేసేవారు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే గొడుగు, టోపీతో పాటు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. వడగాడ్పులు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – మనష్యే, డిప్యూటీ డీఎంహెచ్ఓ, మార్కాపురం -
కొత్త పింఛన్లు ఎందుకివ్వరు.?
సమావేశంలో మాట్లాడుతున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, పక్కన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పాల్గొన్న సభ్యులు జెడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పక్కన జేసీలు ఒంగోలు సిటీ: కొత్త పింఛన్లు ఇవ్వకుండా అభాగ్యులను చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తోందని, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సకాలంలో పింఛన్లు ఇచ్చామని ఆయన తెలిపారు. ఒంగోలు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో బూచేపల్లి మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి పింఛన్ల విషయంలో అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. వేసవి కాలంలో ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలని కోరారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా విషయంలో అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించాలి : ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వ్యవసాయశాఖ అధికారులను కోరారు. ఎనిమిది నెలలుగా తుఫాన్ నష్టపరిహారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు లోన్ల కోసం బ్యాంకులకు వెళితే ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బీమా కంపీనీలతో మాట్లాడి వెంటనే పంట నష్టపరిహారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు సైతం సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందని విమర్శించారు. గత సంవత్సరం దళారులు సిండికేటై మామిడి రైతులను నట్టేట ముంచేశారన్నారు. ఈసారైనా అధికారులు మేల్కొని మామిడి రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మేలు జరిగేంత వరకూ తాము పోరాటం చేస్తామన్నారు. వచ్చే జెడ్పీ సమావేశం నాటికి జిల్లాలో రైతులకు అందాల్సిన పరిహారం మొత్తం అందించాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కనీస గౌరవ వేతనం ఇవ్వడం లేదని తూమాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ కార్యకలాపాలపై సమీక్షించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్ శాఖల కార్యకలాపాలు, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల) కార్యకలాపాలకు సంబంధించి గత సమావేశంలో చేసిన తీర్మానాలపై సమీక్షించి ఆమోదించారు. అలాగే జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల తీర్మానాలను ఆమోదించారు. కలెక్టర్ల గైర్హాజరుపై సభ్యుల ఆందోళన... కనీసం సభ్యుల సమస్యలు తీర్చడానికి కూడా రెండు జిల్లాల కలెక్టర్లు హాజరుకాకపోవడం బాధాకరమని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగండ్ల మండలంలో 2016–17 సంవత్సరంలో అప్పటి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 18 ఆర్వో ప్లాంట్లు మంజూరు చేశారని, అవి ప్రస్తుతం మెయింటెనెన్స్ లేకపోవడంతో మూలనపడ్డాయని, వాటిని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో కనీసం తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పంటలు కొనేవారు లేరని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎంతో కీలకమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. జెడ్పీ సమావేశానికి రాకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రైతులు అవస్థపడుతున్నారు. ప్రస్తుత వేసవిలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్యలున్నాయి. వాటి గురించి కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
108 ఆలస్యం... పోయిన నిండు ప్రాణం
టంగుటూరు: 108 వాహనం గంటన్నర ఆలస్యంగా రావడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు పంచాయతీ పరిధిలోని రాయివారిపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కట్టా శంకరమ్మ శనివారం సాయంత్రం ఇంటి వద్ద స్పృహ కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో ఒక సాకు చెబుతూ వచ్చారు. చివరకు గంటన్నర ఆలస్యంగా 108 గ్రామానికి చేరుకోగా అప్పటికే ఆమె మృతి చెందింది.108 వాహనం సకాలంలో వచ్చి ఉంటే తన తల్లి బతికేదని మృతురాలి కుమారుడు బాబూరావు కన్నీరు మున్నీరుగా విలపించాడు. కాగా రెండు రోజుల క్రితం కందుకూరుకు ఒక రోగిని దింపడానికి వెళ్తుండగా 108 వాహనం మార్గమధ్యంలోనే ఆగిపోయింది. వాస్తవానికి ఒంగోలు నుంచి వెళ్తూ సూరారెడ్డిపాలెంలోని ఐఓసీ పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకోవాల్సి ఉండగా 108 సిబ్బంది నిర్లక్ష్యంతో సింగరాయకొండలో నింపుకుందామని బయలుదేరారు. తీరా కందుకూరు కొంత దూరం ఉందనగా డీజిల్ ఆయిపోయి ఆగిపోవడంతో మరో వాహనంలో రోగిని తరలించాల్సి వచ్చింది. -
ఘనంగా వైవీ జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, సన్నపురెడ్డి రమణమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సుబ్బారెడ్డి నివాసంలో... సింగరాయకొండ: హైదరాబాద్లోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్, నాయకులు కుప్పం ప్రసాద్, కాకుమాను రాజశేఖర్, సింగరాయకొండ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, తదితర నాయకులంతా వైవీ సుబ్బారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైవీతో కేక్ కట్ చేయించారు. -
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026
జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గత నెల 27వ తేదీ కంభంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.7 డిగ్రీలు నమోదు కావడం తెలిసిందే. అదేరోజు మార్కాపురం జిల్లాలోని 15 మండలాల్లోని 9 మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు రికార్డులు చెబతున్నాయి. అంతకుముందు రోజు, ఆ తరువాత రోజు కూడా మార్కాపురం జిల్లా తీవ్రమైన ఎండలతో నిప్పుల కొలిమిలా మారింది. శుక్రవారం మార్కాపురం జిల్లాలోని మండలాలన్నింట్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. మార్కాపురంలో 43 డిగ్రీలు నమోదు కాగా కనిగిరి 43, గిద్దలూరు 43, కంభం 43 డిగ్రీలు నమోదయ్యాయి. పామూరు 42, దోర్నాల 42 డిగ్రీలు నమోదైంది. ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక్క దర్శిలో మాత్రమే 43 డిగ్రీలు నమోదు కాగా ఒంగోలు 42.1, కందుకూరు 42, అద్దంకి 41, సింగరాయకొండ 41, చీమకుర్తిలో 42, సముద్రతీర ప్రాంతమైన కొత్తపట్నంలో 41 డిగ్రీలు నమోదైంది. ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. పశ్చిమ ప్రాంతంలో హీట్వేవ్స్ భయపెడుతున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కంభంలో రికార్డు స్థాయిలో 45.7 డిగ్రీలు నమోదైంది. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో 43 నుంచి 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రతలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు, మరోవైపు గాలివానతో అకాల వర్షాలు, వడగండ్ల వానతో పంట నష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఒంగోలు: విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సురేష్, రాష్ట్ర కరాటే అసోసియేషన్ కార్యదర్శి ఎన్.మోహన్రావు, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: జిల్లా నూతన జడ్జి ఏ.సత్యానంద్ను ఎస్పీ హర్షవర్థన్ రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయశాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై ఇరువురు చర్చించారు. న్యాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తే దోషులకు త్వరితగతిన శిక్షలు పడి నేరాలు తగ్గుముఖం పడతాయని, పోలీసు శాఖ తరుపున బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు. ఒంగోలు సిటీ: స్థానిక వీఐపీ రోడ్డులోని ప్రధానోపాధ్యాయుల సంఘ భవనంలో శనివారం ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం, ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్లు అందరూ సమావేశంలో పాల్గొనాలని కోరారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలో పాల్గొని తదుపరి జరిగే ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు సీఈఓ బి.చిరంజీవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.ఉమ్మడి జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు మండిపోయే వర్షాలు, మరోవైపు గాలివానతో వర్షాలు కురుస్తుండటంతో భిన్నవాతారణం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చల్లబడింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లో వడగండ్ల వాన పడింది. గాలివాన దెబ్బకు పంటలు దెబ్బతిని రైతులకు తీరని నష్టం జరిగింది. చేతికి అందివచ్చిన అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. తీవ్రంగా వీచిన గాలులకు ఒక్క దోర్నాల మండలంలోని బొమ్మలాపురం గ్రామంలోనే 100 ఎకరాలకుపైగా అరటి, బొప్పాయి పంటలకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. పట్టణాల్లో ఈదురు గాలులకు దుకాణాల మీద కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఒంగోలు టౌన్: రోహిణి కార్తెకు ముందే ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. గత ఏడాది కంటే 6 డిగ్రీలు అధికంగా ఎండ... జిల్లా కేంద్రమైన ఒంగోలు నాలుగు రోజులుగా నిప్పుల కొలిమిలా మారింది. నింగిలోని సూర్యుడు నేలమీదకు దిగివచ్చి నగర వీధుల్లో సంచరిస్తున్నట్లు చండప్రచండంగా ఎండలు భగభగలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చినుకులు పడ్డాయి. ఉదయం 8 గంటల తర్వాత నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం నాటికి 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 36.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది ఒక్కసారిగా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడమంటే మామూలు విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత తాకింది. దీంతో వీధులన్నీ నిర్యానుష్యంగా మారుతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాావడానికి జంకుతున్నారు. కంభంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు... మార్కాపురం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడు చూసినా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెల 27వ తేదీ కంభంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత వందేళ్లలో కంభంలో ఎప్పుడూ ఇంతటి ఎండలు లేవని, ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని తెలిసింది. అదేరోజు ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోని 22, మార్కాపురంలోని 15 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఉక్కరిబిక్కిరి!ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా డీఆర్ఓగా చంద్రశేఖర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారుల బదిలీల్లో భాగంగా చీరాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ప్రకాశం జిల్లాకు డీఆర్వోగా బదిలీ చేశారు. ఇక్కడ డీఆర్ఓగా పనిచేస్తున్న బీసీహెచ్ ఓబులేసును కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లాలో ల్యాండ్ ఎక్విజిషన్లో పనిచేస్తున్న టి.అజయ్కుమార్ను కనిగిరి ఆర్డీఓగా నియమించారు. రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్లో పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణను కొత్తపేట ఆర్డీఓగా బదిలీ చేశారు. ఒంగోలు ఆర్డీఓ కే లక్ష్మీ ప్రసన్నను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో చీరాల ఆర్డీఓగా పనిచేస్తున్న తూమాటి చంద్రశేఖర నాయుడును నియమించారు. -
జగనన్న హయాంలోనే కార్మికుల సంక్షేమం
ఒంగోలు సిటీ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న హయాంలోనే కార్మికుల సంక్షేమం కొనసాగిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు హాజరై మే డే జెండా ఆవిష్కరించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. వెట్టి చాకిరి కొనసాగుతున్న రోజుల్లో కార్మికులకు కచ్చితంగా నిర్ణీత పనిగంటలు ఉండాలనే డిమాండ్తో 8 గంటలు మాత్రమే పనిదినాలు కావాలని పోరాటం చేసి కొందరు కార్మికులు ప్రాణాలు అర్పించారన్నారు. 1890 మే 1వ తేదీ నుంచి 8 గంటల పనిదినాలు కల్పించి ప్రారంభించారన్నారు. ఆ రోజు నుంచి మే 1వ తేదీ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. కార్మికులందరూ సంతోషంగా ఉండాలని, జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, మహిళా నాయకులు మేరికుమారి, వైఎస్సార్ సీపీ నాయకులు యలమందారెడ్డి, మీరావలి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పిగిలి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నల్లమల ఘాట్లో మొరాయించిన లారీ
గిద్దలూరు రూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో గ్రానైట్ లారీ ప్రమాదానికి గురై మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కనిగిరి నుంచి తాడిపత్రికి గ్రానైట్ బ్లాకులు తరలిస్తున్న ట్రాలీ లారీ ప్రమాదవశాత్తు రోడ్డుపై నిలిచిపోవడంతో సుమారు 4 గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నంద్యాల నుంచి గిద్దలూరుకు వచ్చే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై ఆగిన లారీ -
మైనింగ్ అధికారుల విస్తృత తనిఖీలు
మార్కాపురం రూరల్: మార్కాపురం మండలంలోని ఇడుపూరు, తదితర గ్రామాల్లో మైనింగ్, రెవెన్యూ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలపై సాక్షి దినపత్రిక 8వ పేజీలో ఏప్రిల్ 30వ తేదీ ‘కొండలు తొలిచి.. కోట్లు దోచి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కొంతకాలంగా రాత్రింబవళ్లు మట్టి అక్రమ రవాణా జరుగుతూనే ఉన్నప్పటికీ అఽధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురించడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించడం చర్చనీయాంశమైంది. అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు హెచ్చరించారు. ఇకపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు మాత్రం ఈ చర్యలన్నీ తాత్కాలికం కాకుండా శాశ్వతంగా కొనసాగాలని, మట్టి మాఫియాపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాలికల ఉన్నతికి కిశోరీ వికాసం
మార్కాపురం టౌన్: విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, నైతిక విలువలు, మంచి అలవాట్లు నేర్చుకోవాలని కలెక్టర్ విజయ సునీత సూచించారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం కిశోరీ వికాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 11 వరకు నిర్వహించే కిశోరీ వికాసం కార్యక్రమాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, విద్య, సోషల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, మెప్మా శాఖల అధికారులు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పోషకాహారాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్చార్జి పద్మావతి, డీఎల్డీఓ బాలూ నాయక్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాహుల్, నైపుణ్యాభివృద్ధి అధికారి కంచిబాబు, సీఐ అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో పోస్టర్ ఆవిష్కరణ ఒంగోలు సబర్బన్: కిశోరీ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ను శుక్రవారం కలెక్టర్ పి.రాజాబాబు స్థానిక ప్రకాశం భవన్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. కిశోరీ వికాసం కార్యక్రమంలో భాగంగా 11 నుంచి 18 ఏళ్ల పిల్లలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, రుతు పరిశుభ్రత, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్య వివాహాల నిషేధ చట్టం, టీనేజ్ ప్రెగ్నెన్సీ చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ నాగమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, అర్బన్ సీడీపీఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్లు విజయ సునీత, రాజాబాబు -
మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
యర్రగొండపాలెం: స్నేహితులకంటే మార్కులు తక్కువగా వచ్చాయని మనోవేదనకు గురైన టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైపాలెం మండలంలోని అమానిగుడిపాడులో గురువారం చోటుచేసుకుంది. నరసరావుపేటలోని ఒక పబ్లిక్ స్కూల్లో నంబూరి చంద్రశేఖర్ 10వ తరగతి చదివాడు. పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులతోపాటు పొలం వద్దకు వెళ్తున్నాడు. టెన్త్లో పాసైనట్లు తల్లిదండ్రులకు చెప్పి పొలం నుంచి ఇంటికి వెళ్లాడు. స్నేహితులతో ఫోన్లో మాట్లాడి వారికి వచ్చిన మార్కులు తెలుసుకున్న చంద్రశేఖర్ తనకు తక్కువ మార్కులు వచ్చాయని మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో తాడుతో ఉరివేసుకోగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్నేహితులు గమనించారు. స్థానికుల సహాయంతో ఉరిని తప్పించి యర్రగొండపాలెంలోని ఓ ప్రవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలుడిని ఎంఈవో ఆంజనేయులు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఒంగోలు సబర్బన్: ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించే రైతులను ప్రోత్సాహిస్తూ ప్రతి రైతు బజారులో స్టాల్స్ కేటాయించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. రైతు బజార్ల బలోపేతంలో భాగంగా ఉద్యానవన, పౌర సరఫరాలు, మున్సిపాలిటీ, తూనికలు, కొలతలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో శుక్రవారం ఆమె చాంబర్లో సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ అగ్రి ట్రేడ్ – మార్కెటింగ్ అధికారి వరలక్ష్మి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. రైతులు వారి కూరగాయలను రైతు బజార్లలో ప్రత్యక్షంగాగానీ, ఆసక్తి కలిగిన వారు పరోక్ష పద్ధతిలో మంచి ధరకుగానీ అమ్ముకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక గ్రూపులకు రైతు బజార్లలో డీఆర్డీఏ ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయాలని చెప్పారు. రైతు బజార్లలో మంచినీటి సౌకర్యం కల్పించి మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ సుభాషిణి, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి పద్మశ్రీ, రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
చెలరేగిన అగ్గి.. చేలు, ఇల్లు బుగ్గి
బల్లికురవ/అద్దంకి/దొనకొండ: ప్రకాశం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన అగ్ని ప్రమాదాల్లో పంట పొలాలు, ఓ ఇల్లు దగ్ధమయ్యాయి. కాల్చిన సిగరెట్ పీకను ఆర్పకుండా పొలంలోకి విసరడంతో ఎనిమిది ఎకరాల్లో సుబాబుల్ తోట అగ్నికి ఆహుతైన ఘటన బల్లికురవ మండలంలోని ఉపమాగులూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాంబశివరావు, నాగేశ్వరరావు, వీరయ్య ఎనిమిది ఎకరాల్లో సుబాబుల్ సాగు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ఆర్పకుండా విసరడంతో ఒకరి తోటలో నుంచి మరొకరి తోటలోకి మంటలు వ్యాపించాయి. సుమారు రూ.8 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. గృహోపకరణాలు దగ్ధం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న మోటుపల్లి శ్రీనివాసరావు గృహంలో విద్యుత్ మోటారు షార్ట్సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోగా ఒక వాషింగ్ మెషిన్, విద్యుత్ మోటారు కాలిపోయాయి. రూ.50 వేల నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. బూడిదైన మొక్కజొన్న పంట అద్దంకి మండలంలోని చిన్నకొత్తపల్లిలో విద్యుత్ లైన్ జంపర్ తెగి నిప్పు రవ్వలు పడటంతో మొక్కజొన్న తోటలో మంటలు చెలరేగాయి. గ్రామానికి చెందిన చెన్నుపాటి స్వాములు రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పొలంలోని విద్యుత్ తీగ జంపర్ తెగి నిప్పు రాజుకోవడంతో పంట పూర్తిగా కాలిపోయింది. రూ.1.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు చెప్పారు. రుద్రసముద్రంలో.. దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు చెలరేగి మొక్కజొన్న పంట కాలిపోయింది. రైతు చెన్నుబోయిన శ్రీను రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా పంట కోతకు వచ్చింది. పొలం గట్టుపైన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొక్కజొన్న తోటకు అంటుకున్నాయి. రూ.1.20 లక్షల విలువైన పంట, రూ.35 విలువ గల డ్రిప్ పైపులు మంటల్లో బూదిదయ్యాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పు తీరుతుందనుకుంటున్న తరుణంలో కళ్ల ముందే పూర్తిగా దగ్ధమైందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
మార్కాపురం టౌన్: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులోగల నానాజాతుల కాలనీలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన షేక్ బాషా(43) తన ఇంటిలో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి హుటాహుటిన మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాషాకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో మద్యం తాగినప్పుడు ఘర్షణ పడుతుండేవాడని, వేధింపులు భరించలేక పెద్ద కుమార్తెతో కలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం. -
అనధికారం.. అధికార దర్పం!
తాళ్లూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన దరిమిలా టీడీపీ నేతలు అధికార దర్పం ప్రదర్శిస్తుండగా.. అధికారులు కూడా అందుకు వంతపాడుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి ఆహ్వానం పంపకపోగా శిలాఫలకాలపై సైతం నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేత జి.లక్ష్మి ఫొటోలు పెట్టడం గమనార్హం. తాళ్లూరు మండంలంలోని తురకపాలెంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ, చిన్నపాటి చప్టా నిర్మించారు. వీటి ప్రారంభోత్సవ శిలాఫలకాలపై ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే బూచేపల్లి ఫొటో ముద్రించాల్సి ఉంది. అధికారులు అత్యుత్సాహంతో టీడీపీ నేత జి.లక్ష్మి ఫొటో పెట్టి స్వామిభక్తిని చాటుకున్నారు. చీమకుర్తి రూరల్: బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన చీమకుర్తి మండలంలోని రామతీర్థం సెంటర్లో ఒంగోలు–కర్నూలు రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన రాతికింది గోపి(33) ఒంగోలు జీజీహెచ్కు వెళ్లి తన బైక్పై చీమకుర్తి వస్తున్నాడు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో గోపి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చీమకుర్తి సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్లో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు జీజీహెచ్లో మార్చురీ వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. వలేటివారిపాలెం: ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో పాస్టర్ మృతి చెందిన సంఘటన వలేటివారిపాలెం మండలంలోని రోళ్లపాడు అడ్డ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. వలేటివారిపాలేనికి చెందిన సీహెచ్ సేనాపుత్ర పాస్టర్గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె బిలారాణి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేస్తోంది. శుక్రవారం కందుకూరు చేరుకున్న ఆమెను తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో రోళ్లపాడు అడ్డ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. దీంతో రోడ్డుపై పడిపోయిన సేనాపుత్ర, బిలారాణికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి 108లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సేనాపుత్ర (45) మృతి చెందారు. బిలారాణి స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వేసవి సెలవులకు ఇంటికి వస్తున్న కుమార్తెను తీసుకొస్తూ తండ్రి మృతి చెందంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల ముందే తండ్రి మృతి చెందడాన్ని చూసి బిలారాణి గుండెలవిసేలా రోదిస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కనిగిరి రూరల్: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద మార్చి 26న టూరిస్ట్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ఆరుగురు, తీవ్ర గాయాలపాలైన 14 మంది కుటుంబ సభ్యులకు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ సహాయ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో క్షతగాత్రుడికి రూ.2 లక్షలు, మృతుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి రూ 5 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించని అధికారులు శిలాఫలకాలపై దర్శి ఎమ్యెల్యేకు బదులు టీడీపీ నేత ఫొటో -
హిజ్రాతో సహజీవనం.. ఆపై హత్య
ప్రకాశం జిల్లా: హిజ్రాతో రెండేళ్లపాటు సహజీవనం చేసిన వ్యక్తి అనుమానంతో కడతేర్చిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపిన ప్రకారం... ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పెదలాటరపికి చెందిన పొట్లూరి అంకయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతనికి కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డికాలనీకి చెందిన రాపూరి పేరయ్య అలియాస్ పేరమ్మ అలియాస్ ప్రియ (26)తో పరిచయమై, ఇద్దరూ సహజీవనం చేశారు. ఇటీవల ప్రియ మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందంటూ అంకయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మాట్లాడాలంటూ ప్రియని గతనెల 27న కందుకూరుకు రప్పించాడు. పట్టణంలోని పోతురాజుమిట్ట వద్ద నివాసం ఉంటున్న అంకయ్య పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుందాం అంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రియ గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లాడు. డాక్టర్లు చనిపోయిందని చెప్పడంతో మరో అంబులెన్స్ మాట్లాడుకుని ప్రియ తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించి ఉడాయించాడు. అయితే ప్రియ మెడపై గాయాలు ఉండటంతో అనుమానించిన ఆమె తండ్రి అంజయ్య కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు అంకయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. -
కక్ష సాధింపులు పరాకాష్టకు..
కొండపి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడితప్పిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా డైవర్షన్ పాలిటిక్స్తో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వాటి గురించి ప్రశ్నిస్తున్న గొంతుకలు నొక్కే ప్రయత్నం మాత్రమే చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే ప్రతిపక్షాలపై కక్ష సాధించే ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పోలీస్ వ్యవస్థ పనితీరు ఎప్పుడో గాడితప్పిందని విమర్శించారు. చట్టపరంగా వేధింపులు, అంతకుమించి బహిరంగంగా బెదిరింపులతో పోలీసు వ్యవస్థ నవ్వుల పాలయ్యే పరిస్థితికి చేరిందన్నారు. వైఎస్సార్ సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఉదంతమే అందుకు నిదర్శనమని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 15 రోజుల క్రితం అతన్ని ఎందుకు అరెస్టు చేశారో ఎవరికీ తెలియదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని విమర్శించారు. అరెస్టు చేసిన తర్వాత కుప్పం కోర్టుకు రిమాండ్కు తీసుకెళ్తే.. చివరికి కోర్టే రిమాండ్ను తిరస్కరించిందని, వెంటనే పోలీసులు హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. పోలీసులే టీడీపీ కార్యకర్తల్లా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేయగా, మళ్లీ వెంటపడి బెంగళూరులో అతన్ని అరెస్టు చేశారన్నారు. గురువారం కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసినా కక్షపూరితంగా పేరు మార్చి అదే కేసుతో అతన్ని వేధింపులకు గురిచేయడం వంటివి చూస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీహరిని బయటకు రానివ్వకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఉద్దేశమని అర్థమవుతోందన్నారు. విజయవాడలో సోషల్ మీడియా కార్యకర్త కరీముల్లా తన షాప్నకు ఎదురుగా టీడీపీ ఫ్లెక్సీలు కట్టవద్దన్నందుకు అక్రమ కేసులు బనాయించారని, సాక్షి టీవీ రిపోర్టర్పై అన్యాయంగా దాడి చేసి గాయపరిచారని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చట్టాలను చేతిలోకి తీసుకుని వ్యవస్థను మేనేజ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో డీజిల్ సమస్య పెరిగి కూరగాయల ధరలు అమాంతం పెరిగాయన్నారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులకు సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ప్రజలను పాలకులు డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, తప్పక విజయం సాధిస్తామఽఽని ధీమా వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి బెదిరేది లేదని, తమ నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ అక్రమ కేసులు విత్ డ్రా చేసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
గిరిజన గురుకుల పాఠశాలలో ప్రవేశాలు
మార్కాపురం: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్కాపురంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 3 నుంచి 8వ తరగతి వరకూ బ్యాక్లాగ్ ఖాళీల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ నాగమల్లీశ్వరి బుధవారం తెలిపారు. మూడో తరగతిలో ఎస్టీలకు 10, ఎస్సీలకు 5, బీసీలకు 2, ఓసి 1, పీహెచ్సి 1 సీట్లు ఉన్నాయన్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్లు కేవలం ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తామన్నారు. అప్లికేషన్లను స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో తీసుకొని భర్తీ చేసి వచ్చేనెల 20వ తేదీలోపు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు 83339 25183, 77025 32468 నంబర్లను సంప్రదించాలన్నారు. ఐనముక్కల గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో.. పెద్దదోర్నాల: మండల పరిధిలోని ఐనముక్కలలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నూర్జహాన్ తెలిపారు. వివిధ తరగతులకు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్లను రిజర్వేషన్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారన్నారు. పూర్తి వివరాలకు 75694 30300 నంబర్కు సంప్రదించాలని ఆమె కోరారు. ఒంగోలు: ఒంగోలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వి.పల్లవిని నియమిస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె గాజువాక 3వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తూ ఒంగోలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈస్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.హేమలతను హిందూపూర్కు బదిలీ చేశారు. ఒంగోలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీం షరీఫ్ను శ్రీకాకుళానికి, శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్న బి.బేబీరాణిని చీరాలకు, ఏలూరులో బాధ్యతలు నిర్వహిస్తున్న కేకేవి బులికృష్ణను కందుకూరు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలోని గ్రామాల రూపురేఖలను మార్చుతూ పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంచాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ పథం కార్యక్రమం అమలు పోస్టరును పంచాయతీరాజ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. గ్రామాల్లో రహదారుల వెంట ఉన్న చెత్తకుప్పలను తొలగించి రోడ్లను ఆకర్షణీయంగా ఉంచాలన్నారు. ఇప్పటి నుంచి ప్రతి బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని తెలిపారు. పీఆర్–1 యాప్లో కార్యక్రమ వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. ఎంపీడీఓలు పర్యవేక్షణ చేసి ఉన్నతాధికారులకు పురోగతి నివేదికలు పంపాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, డీఎల్పీఓ బాలూనాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కప్పం కట్టాల్సిందే..
గ్రావెల్ మాఫియా అరాచకాలను అధికారులు చూసీ చూడనట్టు వదిలేయడం వెనుక తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం మేరకు గ్రావెల్ మాఫియా సిండికేట్ మార్కాపురం టీడీపీ ముఖ్యనేతకు టిప్పర్కు రూ.1000, ట్రాక్టర్కు రూ.300 చొప్పున కప్పం కడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నాలుగు నెలల క్రితం మార్కాపురం జిల్లాను ప్రకటించిన తర్వాత వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆయా వెంచర్లకు హంగులు దిద్దేందుకు అవసరమైన మట్టిని మార్కాపురం చుట్టుపక్కల గ్రామాల్లోని కొండ ప్రాంతాలు, చెరువుల నుంచే భారీగా తరలిస్తున్నారు. కప్పం కట్టని టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాఫియా నియంత్రణతో మట్టి ధరలు అమాంతం పెరిగాయి. దూరాన్ని బట్టి ఒక టిప్పర్ మట్టికి రూ.5000కు పైగా, ట్రాక్టర్కు రూ.1300కు పైగా వసూలు చేస్తున్నారు. సాఽమాన్య ప్రజలు చిన్నచిన్న అవసరాలుకు కూడా మట్టి తోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. -
అధికార పార్టీకి జీహుజూర్..
టంగుటూరు: డీజిల్, పెట్రోల్ దొరక్క సామాన్యులు అవస్థలు పడుతుంటే అధికార పార్టీ నాయకులకు, అధికార పార్టీకి చెందిన అనుకూల వ్యక్తులకు కావాల్సినంత లభ్యమవుతోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు వీరికి పట్టవు అన్నరీతిలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తోంది బుధవారం సూరారెడ్డిపాలెం సమీపంలోని బీపీసీఎస్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన సంఘటన. ఒంగోలు మండలం సమీపంలోని భగీరథ కెమికల్స్కు 500 లీటర్ల డ్రమ్ములకు ఆర్డీఓ అనుమతినిచ్చారు. అయితే డీజిల్ కొట్టించుకునేందుకు 150 నుంచి 200 లీటర్లు పట్టే 15 డ్రమ్ములతో ఆ కంపెనీకి చెందిన ట్రాక్టర్ వచ్చింది. అయితే అక్కడే ఉన్న కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని డ్రమ్ములకు డీజిల్ ఎలా కొడుతున్నారంటూ బంకు నిర్వాహకులను నిలదీశారు. అయితే ఆర్డీఓ అనుమతినిచ్చారని, అందుకే డీజిల్ కొడుతున్నామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. 500 లీటర్లకే అనుమతినిస్తే ఇన్ని డ్రమ్ములు వాహనంలో ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30 వేల లీటర్లకు పైగా కొట్టి ఉంటారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికి ఇలా నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ ఎలా కొడతారని స్థానికులు నిలదీస్తున్నారు. పెట్రోల్ బంకుల యజమానులు అధికార పార్టీకి చెందిన వారితో కుమ్మకై ్క సామాన్య ప్రజలకు ఒక విధంగా, వారికి మరో విధంగా డీజిల్ పోస్తు్ాన్నరని ఆరోపిస్తున్నారు. ఇంతకూ ఎన్ని లీటర్ల డీజిల్ కొట్టారో నిగ్గు తేల్చాలని అధికారపార్టీకి చెందిన ఒక నాయకుడు డిమాండ్ చేయడం కొసమెరుపు. ఈ విషయంపై తహశీల్దారును వివరణ కోరగా 500 లీటర్ల డీజిల్ అనుమతి మేరకు మాత్రమే కొట్టారని చెబుతున్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలపై డీఈవో రేణుకను బుధవారం యూటీఎఫ్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల స్పెషల్ ఎడ్యుకేషన్ ఎన్ఓసీలు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బీఈడీ కోర్సులు చేసిన ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీఈఓ రేణుక సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ సూరె వేణుగోపాల్, పోతంశెట్టి రమాదేవి ప్రమోషన్ డేటును నోషనల్ సీనియార్టీ కింద లెక్కించేందుకు త్వరలోనే ప్రొసీడింగ్ ఇస్తామని తెలిపారన్నారు. ఉపాధ్యాయుల పాస్పోర్ట్, వీసా ఎన్ఓసీల గురించి అడిగినప్పుడు వెంటనే క్లియర్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల జెడ్పీ పీఎఫ్ సమస్యల మీద జెడ్పీ డిప్యూటీ సీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి, జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్హై, సహాధ్యక్షుడు వై.వెంకట్రావు, జిల్లా కోశాధికారి చిన్న స్వామి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు కొప్పోలు హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. -
మహాధర్నాకు మద్దతు ఇవ్వండి
● వైఎస్సార్ టీఏ పిలుపు ఒంగోలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ మే 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయ సంఘా లు సహకరించాలని వైఎస్సార్ టీచర్స్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి కోరారు. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర బాధ్యులు, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్రెడ్డిని కలసి మహాధర్నాలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30 శాతం ఐఆర్ ప్రకటన, 4 డీఏ మంజూరు, పెండింగ్ బకాయిలు చెల్లింపు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు హెల్త్ కార్డు మంజూరు,మరణించిన ఉపాధ్యా యుల పిల్లలకు కారుణ్య నియామకాలు సమస్యలపై స్పందించే ప్రతి సంఘ కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. మే 6 వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ చేపట్టే మహా ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
అకాల వర్షం..అపార నష్టం
కంభంలో నేలకొరిగిన మామిడి చెట్టు కంభం మండలం పోరుమామిళ్లపల్లి ఇలాకాలో నేలకొరిగిన అరటి తోటలు కంభం: మంగళవారం సాయంత్రం వీచిన పెనుగాలులు, భారీ వర్షానికి కంభం చెరువు ఆయకట్టు కింద సాగులో ఉన్న సుమారు 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని పోరుమామిళ్లపల్లి గ్రామ ఇలాకాలో సాగు చేస్తున్న అరటి చెట్లు ప్రస్తుతం పూత, కాపు దశలో ఉన్నాయి. పెనుగాలుల వీచడంతో కొందరి రైతుల తోటలు పూర్తి స్థాయిలో నేలకొరిగి పోగా మరి కొందరు రైతులకు చెందిన తోటల్లో సగానికి పైగా చెట్లు నేలకొరిగిపోయాయి, చెరువుకట్ట సమీపంలో సాగులో ఉన్న పలు తోటల్లో సైతం అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశామని, మరో మూడు నాలుగు నెలల్లో కోతకు వస్తే పెట్టుబడులు పోనూ లాభాలు వస్తాయన్న గంపెడాశతో ఉన్న రైతులు ఒక్కసారిగా వీచిన పెనుగాలులకు చెట్లన్నీ ఇలా నేలకొరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. గతంలో మోంథా తుఫాన్ దాటికి పలు తోటలు దెబ్బతినగా మిగిలిన తోటలను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు ఇలా మరో నష్టం వాటిల్లింది. మోంథా తుఫాను పరిహారమే నేటికి అందలేదని రైతులు వాపోతున్నారు. నేలరాలిన మామిడి పెనుగాలులకు చెట్లకు ఉన్న మామిడి కాయ లు సగానికి పైగా రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పోరుమామిళ్ల ఇలాకాలోని పంటపొలాల్లో ఓ పెద్ద మామిడి చెట్టు నేలకొరిగిపోయింది. ఇంకా పలు చోట్ల మామిడి, ఇతర చెట్లు నేలకొరిగాయి. గిద్దలూరు రూరల్: బలమైన ఈదురుగాలుల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు అపారనష్టం మిగిల్చింది. గడికోట గ్రామ పంచాయతీ దేవనగరం గ్రామంలో నెమిలయ్యకు చెందిన కోళ్లఫాం ఈదురు గాలుల కారణంగా పూర్తిగా నేలమట్టమైంది. దీంతో నెమిలయ్యకు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కోళ్లఫామ్లోని ఫ్యాన్లు, వెంటిలేషన్ మిషన్లు, ఇతర సామాన్లు, కొట్టం షెడ్డు మొత్తం ధ్వంసమయ్యాయి. ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్నాడు. బురుజుపల్లె గ్రామంలో తంగెళ్ల నారాయణరాజుకు చెందిన నాలుగు ఎకరాల అరటి తోట పూర్తిగా ధ్వంసమైంది. రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. పెనుగాలులకు కంభంలో నేలకొరిగిన అరటి తోటలు సుమారు 50 ఎకరాల్లో పంటనష్టం -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
రాచర్ల: గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు చేశారు. ఈ సంఘటన మండలంలోని యడవల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పురాతన ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి గాలివాన కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆలయంలోని ధ్వజస్తంభంతో పాటు నందీశ్వరుడి విగ్రహం చుట్టు దాదాపు మూడు అడుగుల లోతు వరకు గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు చేశారు. రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావుకు సమాచారం ఇవ్వగా గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలోని ధ్వజస్తంభంతో పాటు నందీశ్వరుడి విగ్రహం చుట్టు ఉన్న తవ్వకాలను బుధవారం పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవనగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు నగలు, నగదు అపహరించిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు వివరాలు.. చెన్నకేశవనగర్లో నివాసం ఉంటున్న తిప్పిరెడ్డి వెలుగొండారెడ్డి ఈ నెల 22న బెంగళూరులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన బంధువు ఒకరు వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్లగా ఇంటి తలుపు పగలగొట్టి ఉంది. దీంతో వెలుగొండారెడ్డికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఇంటి యజమాని సూచన మేరకు లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో దాచి ఉంచిన బంగారు నగలు, రూ.25 వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ చోరీకి విఫలయత్నం మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో ఉన్న ఓ వైద్యశాల సమీపంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటారు సైకిల్ను మంగళవారం రాత్రి చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. తమ పాచిక పారకపోవడంతో వెనుదిరిగారు. కంభం: మండలంలోని చిన్నకంభం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ట్రావెల్స్ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. పోరుమామిళ్లపల్లి గ్రామానికి చెందిన మారాబత్తుని శ్రీనివాసరావు(23) నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● 20 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు అపహరణ పెద్దారవీడు: వైద్య చికిత్స కోసం ఓ కుటుంబం గుంటూరు వెళ్లగా.. దొంగలు చేతివాటం చూపి భారీగా నగలు, నగదు కొల్లగొట్టారు. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆనెకాళ్ల వెంకటేశ్వరెడ్డి వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం గుంటూరు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దొంగలు లోపలికి చొరబడి బీరువాను బద్ధలుకొట్టారు. అందులో ఉన్న 20 తులాల బంగారు నగలు, రూ.2 లక్షలు నగదును అపహరించారు. వెంకటేశ్వరరెడ్డి ఇంటి తలుపులు బుధవారం ఉదయం తెరిచి ఉండటాన్ని పక్కింటి వారు గమనించారు. ఆస్పత్రికని వెళ్లిన వారు అప్పుడే తిరిగొచ్చారా అని పక్కింటి వారు లోపలికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించకపోవడంతోపాటు బీరువా తలుపులు తీసి ఉన్నాయి. చోరీ జరిగిందని అనుమానం రావడంతో వెంటనే వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. వారు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉన్న బంగారు నగలు, డబ్బు కనిపించలేదు. బాధితుల సమాచారంతో సంఘటన స్థలాన్ని త్రిపురాంతకం సీఐ హసన్, ఎస్సై సైదుబాబు పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరు కుమార్తెల వివాహం కోసం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దొంగలు కాజేయడంపై వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
డీజిల్ లేదండీ..
కదలని బండి..డీజిల్ కష్టాలు జిల్లా ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని పెట్రోలు బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టి మూసేశారు. డీజిల్ కొరతతో గ్రానైట్ పరిశ్రమ స్తంభించిపోయింది. క్వారీయింగ్కు ఉపయోగించే భారీ యంత్రాలు, పొక్లెయిన్లు, టిప్పర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో క్వారీల్లో పనులు ఆగిపోయాయి. కంకర క్రషర్ యూనిట్లూ మూతపడ్డాయి. ఇక ఒంగోలు నగరంలో డీజిల్ కొరతతో మంచినీటి సరఫరా ట్యాంకర్లు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు సరుకులు రవాణా చేసే లారీలు ఆయిల్ లేక ఒంగోలు లారీ యూనియన్ ఆఫీసు వద్దే ఆగిపోయాయి.– సాక్షి, ఒంగోలు -
తోటి వారిని అభివృద్ధి చేయాలి
ఒంగోలు వన్టౌన్: సమాజంలో ఆర్ధికంగా ఉన్న వారు తోటి వారిని అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఆధునికీకరించిన రెడ్డి హాస్టల్ను వైవీ సుబ్బారెడ్డి బుధవారం రాత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి రెడ్డి జనాభ్యుదయ సంఘ అధ్యక్షుడు కేవీ రమణా రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా విద్య పూర్తయిన విద్యార్థులకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ నిర్వహణకు నిధులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా ఆడిటోరియం, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అనేక సార్లు హాస్టల్ను పరిశీలించానన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. తన సొంత కళాశాల కంటే, రెడ్డి హాస్టల్పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం హాస్టల్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులకు అనేక విధాలుగా సహాయ, సహకారాలు అందించినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతోనే రెడ్డి హాస్టల్ అభివృద్ధి చెందినట్లు తెలిపారు. విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక కాన్ఫరెన్స్ హాలు, సోలార్ విద్యుత్, స్టీమ్ కుకింగ్ వంటి వసతులు చేసినట్లు చెప్పారు. జిల్లాకు చెందిన ఐఏఎస్ తాటిపర్తి వెంకారెడ్డి కుమారుడు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. అతిథి గృహాన్ని కూడా నిర్మించినట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి ఒక్కరే ఏకగ్రీవంగా ఎన్నికై న రాష్ట్రపతి అని అన్నారు. రామ రాజ్యాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరిపించారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా రూ.2 కోట్లకు పైగా నిధులతో సోలార్ విద్యుత్, ప్రధాన ద్వారం, గదులకు అటాచ్డ్ బాత్రూంలు, వంటగది, డిజిటల్ లైబ్రరీ, మినరల్ వాటర్ ప్లాంట్, కాన్ఫరెన్సు హాలు, ప్రాంగణం మొత్తం గ్రానైట్ రాళ్ల ఏర్పాటు, అతిథి గృహం తదితర నూతనంగా ఏర్పాటు చేసిన, ఆధునికీకరించిన వివిధ విభాగాలను ప్రారంభించారు. వైవీ సుబ్బారెడ్డి జన్మదినోత్సవం మే 1వ తేదీ సందర్భంగా ముందస్తుగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డి జనాభ్యుదయ సంఘ కార్యదర్శి అన్నపురెడ్డి చిన ఆదిరెడ్డి, వైవీ భద్రారెడ్డి, వైవీ హనుమారెడ్డి, శిరిపురం విజయభాస్కరరెడ్డి, ఢాకా కృష్ణారెడ్డి, వాకా సంజీవరెడ్డి, భవనం నాగిరెడ్డి, నరహరి రామలింగారెడ్డి, పాలవెల్లి వెంకటేశ్వరరెడ్డి, గోపవరపు నారాయణ రెడ్డి, లింగా రెడ్డి, స్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్, నీలంసంజీవరెడ్డి విగ్రహావిష్కరణలో వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్రెడ్డి, బత్తుల -
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది ఎక్కువగా పేదలే..ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది..తమ ప్రాణాలు నిలబడుతాయి అన్న ఆశగా వచ్చిన రోగులకు నిరాశే ఎదురవుతోంది. పశ్చిమ ప్రకాశానికి పెద్దదిక్కుగా ఉండే మార్కాపురం సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు అందని ద్రాక్షగా మారిపోయాయి. నిపుణుల కొరత..పనిచేయని పరికరాలతో కునారిల్లుతోంది. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే ఐసీయూ కేంద్రం కోమాలోకి వెళ్లిపోయింది. ఏడాదిగా ఆక్సిజన్ ప్లాంట్లు మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. అత్యవసర వైద్యం కోసం ఇక్కడకు వచ్చేవారికి ప్రాథమిక వైద్యం అందించి పక్క జిల్లాలకు పంపుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య రంగం పడకేసిందన్న దానికి ఈ ఆస్పత్రి ఉదాహణగా నిలుస్తోంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు జీజీహెచ్ రోగుల జీవితాలకు ధైర్యమిచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇక్కడ వైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. ఒక్కసారి జీజీహెచ్ వెళ్లి చూస్తే రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గతంలో 75 మంది డాక్టర్లున్న జీజీహెచ్లో ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. జీజీహెచ్లో పనిచేసే వైద్యులందరినీ ఒంగోలు, గుంటూరు, ఏలూరు, కర్నూలు ఇలా పలు ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో డాక్టర్ల గదులు చాలా వరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఓపీ కూడా 150 నుంచి 170కి పడిపోయింది. పలు అత్యాధునిక వైద్య పరికరాలు, ఇతర మెడికల్ కాలేజీలు, వైద్యశాలలకు పంపారు. దీనితో అత్యవసర వైద్యసేవలకు ఎవరైనా ఒంగోలు, గుంటూరులకు రెఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న డాక్టర్లలో కూడా కొంత మంది త్వరలో బదిలీపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.ఏడాది నుంచి ఆక్సిజన్ ప్లాంటు మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి ఈ ప్లాంటు నుంచి సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించాలంటే ఒక ప్లాంటుపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆస్పత్రి వర్గాలు వాపోతున్నాయి. మార్కాపురం: ఒకప్పుడు పశ్చిమ ప్రకాశంవాసులకు మెరుగైన వైద్యం గగనంగా ఉండేది. చిన్నపాటి రోగమొచ్చినా పొరుగు జిల్లాలకు పరుగులు తీయాల్సిందే. ఈ ప్రాంత వాసుల కష్టాలు గుర్తించిన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురానికి మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. రాయవరం వద్ద కళాశాల ఏర్పాటు కోసం రూ.450 కోట్లు కేటాయించారు. దాదాపు 75 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. దీనికి అనుబంధంగా మార్కాపురం వైద్యశాలను జీజీహెచ్గా మార్పు చేశారు. 450 బెడ్లను సిద్ధం చేశారు. ఇందులో జనరల్ సర్జరీ కోసం 100, జనరల్ మెడిసిన్ కోసం 100, ఆర్ధోపెడిక్ విభాగానికి 40, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రిక్ విభాగానికి 10, ఈఎన్టీకి 20, ఐసీయూ 20, పీడియాట్రిక్స్ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇలా మార్కాపురం జీజీహెచ్ రూపురేఖలు మార్చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 72 మంది వైద్యులను నియమించారు. రెండు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలతో పాటుగా శ్రీశైలం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 8 లక్షల మంది ప్రజలు జీజీహెచ్కు వచ్చి అవసరమైన అత్యాధునిక వైద్య చికిత్సను ఉచితంగా చేయించుకునేవారు. వైద్య కష్టాలు తీరినట్టేనని ఈ ప్రాంతవాసులు సంబరపడ్డారు. వైద్యులపై ఒత్తిడి.. తక్కువ మంది డాక్టర్లు ఉండడంతో జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. క్యాజువాలిటీ, ఐసీయూ, జనరల్ మెడిసిన్ చూడాల్సి రావడం, ఉన్న వైద్యుల్లో కొంతమంది నైట్డ్యూటీలకు వెళ్లాల్సిరావడంతో ఉదయం పూట ఉన్న డాక్టర్లపై భారం పడుతోంది. క్యాజువాలిటీ చూసే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఇటీవల ఒకే డాక్టరుకు వరుసగా డ్యూటీలు వేయడంతో తీవ్రమైన ఒత్తిడితో సెలవుపై వెళ్లినట్టు తెలిసింది. కోమాలో ఐసీయూ జీజీహెచ్లోని ఐసీయూ కేంద్రం కోమాలోకి వెళ్లింది. ఈ విభాగంలో 4 డాక్టర్లు ఉండాలి. ఇందులో ఎండీతో పాటు పలువురు వైద్యనిపుణులు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఇక్కడ వైద్యసేవలు అంతంత మాత్రంగా మారిపోయాయి. ప్రస్తుతం క్యాజువాలిటీలో ఒకరు, జనరల్ సర్జన్లు ముగ్గురు, గైనకాలజీ, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, ఈఎన్టీ, పీడియాట్రిక్ విభాగాల్లో మాత్రమే సేవలు అందుతున్నాయి. -
మార్కాపురం మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ముఖ్య నేత అండతో అడ్డగోలుగా గ్రావెల్ దందా?
అర్ధరాత్రి వేళ.. పదుల సంఖ్యలో టిప్పర్లు రోడ్డుపై రొదపెడుతూ దూసుకెళ్తున్న దృశ్యాలు మార్కాపురం పరిసరాల్లో నిత్యకృత్యంగా మారాయి. చెరువు గర్భాల్లో.. కొండ అంచుల వెంట జేసీబీలు, పొక్లెయిన్లు చేస్తున్న చప్పుడు అంతా ఇంతా కాదు. ఇదంతా అభివృద్ధిలో భాగం అసలే కాదు. సంపద సృష్టి కోసం మట్టి మాఫియా చేస్తున్న ధ్వంస రచన. ఈ సొమ్మంతా జిల్లా ఖాజానాకో, రాష్ట్ర ఖజానాకో చేరుతుందనుకుంటే పొరపాటే. అక్రమ గ్రావెల్ మైనింగ్తో ఆర్జించిన డబ్బంతా టీడీపీ చోటా నేతల గల్లా పెట్టెలు, ముఖ్య నేతల భోషాణాల్లోకి వెళ్తోంది. చెరువులను చెరబట్టి, కొండలను పిండి చేస్తున్నా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ ముఖ్యనేత అండతో గడిచిన రెండేళ్లుగా రోజుకు సరాసరిన 150 నుంచి 200 టిప్పర్ల గ్రావెల్, వందలాది ట్రాక్టర్ల మట్టిని ఆ పార్టీ నాయకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది. కొండలు తొలిచి.. రూ.కోట్లు దోచి! మార్కాపురం రూరల్: టీడీపీ నేతల ధన దాహార్తికి మార్కాపురం మండలంలోని చెరువులు, గుట్టలు, కొండలు గుల్లవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా టీడీపీ చోటా నాయకుల నుంచి బడా నేతల వరకు ధనార్జనే ధ్యేయంగా సాగిస్తున్న గ్రావెల్ దందా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మట్టి దందాను కట్టడి చేయాల్సిన అధికారుల్లో కొందరు మామూళ్లకు లొంగి, మరికొందరు బెదిరింపులకు తలొగ్గి మౌనం దాల్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలు, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి పగలు, రాత్రి తేడా లేకుండా టీడీపీ నేతలు గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంపై పలు గ్రామాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం మార్కాపురం పట్టణ శివారు ప్రాంతమైన శివరాంపురం సమీపంలో ఓ వెంచర్కు మట్టి తరలిస్తున్న టిప్పర్ 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి దగ్ధమైంది. టిప్పర్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేపట్టిన దాఖలాల్లేవు. టీడీపీ నేతల మట్టి దందా మాత్రం యథావిధిగా సాగుతోంది. కొండలు మైదానాలుగా..! మార్కాపురం మండలంలోని చింతకుంట్ల, ఇడూపూరు, పెద్దనాగులవరం కొండ ప్రాంతాలే లక్ష్యంగా టీడీపీ గ్రావెల్ మాఫియా దందా సాగిస్తోంది. భారీ యంత్రాలతో కొండ అంచులను క్రమంగా తొలిచేస్తుండటంతో అవి రూపు కోల్పోతున్నాయి. వాలుగా ఉన్న కొండ ప్రాంతాలన్నీ నిరంతర మట్టి తవ్వకాలతో మైదానాలను తలపిస్తున్నాయి. ప్రకృతి సంపదను దోచేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా సంబంధిత శాఖలు నోరు మెదపకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇడుపూరు, నికరంపల్లి, భూపతిపల్లె, పెద్దనాగువరం, చింతకుంట్ల గ్రామాల పరిసరాలు మట్టి మాఫియాకు అడ్డాగా మారాయి. ట్రాక్టర్లు, టిప్పర్లు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నా నియంత్రణ చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదు. భూపతిపల్లె చెరువులో ఆ గ్రామ టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఇటీవల అడ్డగోలుగా మట్టి తవ్వేశారు. రైల్వే ట్రాక్ కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుని మొత్తం 1000 ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని తరలించారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.1500 చొప్పున దండుకున్నారు. ఇందులో ముఖ్యనేతకూ వాటా చెల్లించినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజాలు బయటపెడితే బెదిరింపులే.. గ్రావెల్ మాఫియా దందాను ప్రశ్నించినా, వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన వారిపై టీడీపీ నేతలు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారు. సామాన్యులైతే నేరుగా బెదిరించడం.. అధికారులు అడ్డు తగిలితే బదిలీల పేరుతో వేధించడం పరిపాటిగా మారింది. నిప్పుతో తలగోక్కోవడం ఎందుకుని భావించిన కొందరు అధికారులు.. మట్టి మాఫియా ఆగడాలపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. జిల్లా ఉన్నతాఽధికారులు స్పందించి మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
‘కూటమి అసమర్థత వల్లే ఏపీలో ఇంధన కొరత’
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణాకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందని మండిపడ్డారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన సమస్య లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత వల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
డీజిల్ సంక్షోభానికి బాబే కారణం
కనిగిరి రూరల్: రాష్ట్రంలో ఇంధన కొరతకు చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద పెట్రోల్ బంక్ను మంగళవారం పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రత్యక్ష పరిశీలన చేసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్నారు. ఈ సంక్షోభం ఏర్పడేందుకు కారణం సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమేనని తీవ్రంగా ఎండగట్టారు. సర్కార్కు కనీస ముందుచూపు లేక పోవడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలకు క్యూ లైన్ కష్టాలు నెలకొన్నాయన్నారు. విత్తనాలు, ఎరువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇలా అన్నింటికి రోడ్లపై బారులు తీరాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీలకు కట్టబెట్టేందుకే.. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు సర్కార్ విఫలం చెందిందని, ప్రచార ఆర్భాటం తప్పా.. ఆచరణ అమలు కరువైందని ఎద్దేవా చేశారు. సంపద సృష్టి పేరుతో చంద్రబాబు తన అనుయాయులు, బినామీలకు లబ్ధి చేసేలా పాలన చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సర్కార్ దుర్మార్గపు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డిదేనన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు మడతల కస్తూరిరెడ్డి, గంగసాని హుస్సేన్రెడ్డి, ఎంపీపీ గాయం సావిత్రి, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, సూరసాని మోహన్రెడ్డి, ఆవుల భాస్కర్రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, ఆయిమల్ల నాగమణి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, మూలే గోపాల్రెడ్డి, ఒకే రెడ్డి, యక్కంటి శ్రీను, జి.బొర్రారెడ్డి, ఆర్.మాణిక్యరావు, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, రామనబోయిన శ్రీను, డాక్టర్ రసూల్, డాక్టర్ కృష్ణారెడ్డి, జి.అబ్రహం లింకన్, వై.దేవరాజ్, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, సానికొమ్ము మధుసూదన్రెడ్డి, చింతం శ్రీనివాసుల యాదవ్, మూలే రాజశేఖరరెడ్డి, కంటు గురవయ్య, ఎస్కే ఫయాజ్, పోలిచర్ల రహీంబాషా, ఎస్కే ఖాశింవలి, ఎస్కే కరీముల్లా, ఎస్కే నాగూర్ వలి, కోఆప్షన్ నాయబ్ రసూల్, ఎస్కే సన్నీ, గట్లా విజయభాస్కర్రెడ్డి, దరిశి సుబ్రహ్మణ్యం, దరిశి ఫణికుమార్, పైడిమర్రి ఫణి, పలుకూరి భాస్కర్, రుద్రపాటి సాల్మన్, దమ్మువెంకటయ్య, సుస్మిత, దద్దాల రాములు, పెరికల వెంకటేశ్వర్లు, వంకదారి రాజ, రమేష్, ముత్యాల ప్రతాప్, కె.రవి, ఎం.బాలకృష్ణ, అచ్చయ్య, పి.చెన్నకేశవులు, సంగు కృష్ణారెడ్డి, మడతల నాగిరెడ్డి, మిట్టా రమేష్రెడ్డి, బత్తుల మాలీ యాదవ్, డి.రవి యాదవ్, డి.మాల్యాద్రి యాదవ్ పాల్గొన్నారు. సంపద సృష్టి పేరుతో రాష్టం సర్వనాశనం ఎన్నికల హామీలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ ధ్వజం -
వ్యక్తిత్వ విలువలు చాటిన నాటికలు
● ఆకట్టుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి శంకరశెట్టి రంగరామానుజయ్య కళావేదికపై గుంటూరు అభియన ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ నాటికను ప్రదర్శించారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవిత చరమాంకం వరకు వ్యక్తిత్వ విలువలను కాపాడుకున్న ఓ ఆదర్శ వ్యక్తి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. నాటికకు రచన స్నిగ్ద, దర్శకత్వం ఎస్.రవీంద్రారెడ్డి వ్యవహరించారు. అనంతరం చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారి ‘అ’సత్యం నాటికను ప్రదర్శించారు. కంటికి కనిపించేదంతా సత్యం కాదని, చెడుకు దోహదపడితే అది అసత్యమని, మంచి పనికి ఉపయోగపడితే అసత్యమైనా దానిని సత్యంగా భావించాలనే సందేశంతో నాటిక సాగింది. నాటికకు కథ మోదుగు శ్రీసుధ, దర్శకత్వం బాలాజీ నాయక్ వ్యవహరించారు. నాటికలోని పాత్రధారులు ఆ పాత్రలకు నటనతో జీవం పోశారు. అనంతరం నాటికల్లోని నటీనటులను, రచయిత, దర్శకత్వం వహించిన వారికి వైద్యులు శంకరశెట్టి కొండలరావు, డాక్టర్ పేట శ్రీకాంత్లు ప్రదర్శనా పారితోషకాన్ని అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉగాది పురస్కార గ్రహీత, చిత్రకారులు, కవి కోన రమణారావును కళాంజలి తరఫున సత్కరించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో చెంచు గిరిజనుడు మృతి
పెద్దదోర్నాల: మండల పరిధిలోని సుందరయ్య కాలనీలో ఓ చెంచు గిరిజనుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మర్రిపాలెం గిరిజన గూడేనికి చెందిన పోలయ్య(35) సుందరయ్య కాలనీలోని బంధువుల ఇంటికి సోమవారం వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి అక్కడే పడుకున్న పోలయ్య మంగళవారం ఉదయానికి మృతి చెంది ఉన్నాడు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, నలుగురు సంతానం. ఈ మేరకు కేసు నమాదు చేసి దర్యాప్తు చేపట్టనునన్నట్లు ఏఎస్సై పోల్రాజు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించనున్నారు. ఒంగోలు టౌన్: నీరు, భూమి,చెట్టు సంరక్షణ కోసం రూపొందించిన వాల్టా చట్టం అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి.వీరభద్రాచారి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో యథేచ్ఛగా చెట్లు నరికివేత, భూగర్భ జలాల దుర్వినియోగం, చెరువులు కుంటల ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. వాల్టా చట్టం అమలు అధికారులుగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లు అసలు పట్టించుకోవడంలేదన్నారు. ఒంగోలు నగరంలోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో 10 చెట్లను నరికివేసినా అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
పేదింటికి పెద్ద కష్టం
మర్రిపూడి: ప్రాణాంతక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని దాతల సాయం కోసం ఓ పేద బాలిక ఎదురు చూస్తోంది. పదో తరగతి వరకు విద్యా సాఫీగా సాగినా ఇంటర్ కోసం ఇతర ప్రాంతాల్లో చేరడంతో విద్యను అభ్యసించే క్రమంలో రెండు మూత్రపిండాలూ ఒక్కసారిగా పాడయ్యాయి. అనారోగ్యంతో అల్లాడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు మొక్కని దేవుడంటూ లేడు. తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేందుకు దాతలు ముందుకు రావాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరుతున్నారు. ఒంగోలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ అక్కడికి వెళ్లి బాలికను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి అమూల్య ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చారు. తనలా మరికొందరు ముందుకొచ్చి ఆ చిన్నారి ప్రాణాలు నిలపాలని ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం కోసం వేడుకోలు మర్రిపూడి మండలం గుండ్లసముద్రం పంచాయతీ కోష్టాలపల్లికి చెందిన చిరుపల్లి రామయ్య, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆ కుటుంబం కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వ్యవసాయం చేసినా అప్పులే మిగిలాయి.పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. రెండో కుమార్తె అమూల్య 10వ తరగతి ఉతీర్ణురాలయ్యాక పొదిలికి సమీపంలోని జువ్వలేరు ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో అమూల్య అనారోగ్యం పాలైంది. 5 నెలల క్రితం ఒంగోలు వైద్యశాలలో పరీక్షలు చేశారు. రెండు కిడ్నీలూ చెడిపోయాయని వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు సూచన మేరకు ప్రస్తుతం ఒంగోలు వైద్యశాలలో డయాలసిస్ చేయించుకుంటోంది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, కూలి పనులకు వెళ్తున్న తల్లి.. బిడ్డకు ఇప్పటి వరకు రూ.3 లక్షలు వరకు ఖర్చు చేశారు. భూమి కౌలుకు తీసుకుని చేసిన వ్యవసాయం రూ.7 లక్షల అప్పు మిగిల్చింది. తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న విద్యార్థిని డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బాలిక అమూల్యను పరామర్శించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
విద్యుత్ బస్సులు ఆర్టీసీనే నిర్వహించాలి
● యాజమాన్య కుయుక్తులను తిప్పి కొట్టాలి ● ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీరావలి మార్కాపురం టౌన్: ఆర్టీసీలో విద్యుత్ బస్సుల నిర్వహణకు పినాకెల్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీరావలి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీనే నిర్వహించాలని, ఈ కారణంగా మూత పడుతున్న డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర డిపోలకు బదిలీ చేయటాన్ని వెంటనే ఆపాలని కోరారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలు ఈ విధానాల వలన దూరమవుతాయన్నారు. పొదిలి డిపో కార్యదర్శి వేణు మాట్లాడుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి 2031 కల్లా బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలన్న కుయుక్తులను తిప్పికొట్టాలని కోరారు. జిల్లా సహాయ కార్యదర్శులు జీ విజయలక్ష్మి, చిరంజీవి, మస్తాన్, సాయి కుమార్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో గాడి తప్పిన కూటమి పాలన
కొండపి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన గాడితప్పిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసి మీ చావు మీరు చావండి అన్నట్లు ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తూ అన్ని పరిశ్రమలు తానే తీసుకొచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నాడని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎక్కడుండి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదని, ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. వారం రోజులుగా రాష్ట్రంలో గ్యాస్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి రాష్ట్ర ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్ కొరతతో నిత్యవసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత పూర్తిగా చంద్రబాబు పాలన వైఫల్యం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని పెట్రోల్, డీజిల్ కొరత కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఉందని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రేషన్ విధానంలో ద్విచక్ర వాహనాలకు రెండు లీటర్లు, కార్లకు 15 లీటర్లు, పెద్ద వాహనాలకు 50 లీటర్లు విధానంలో పంపిణీ చేస్తున్నారని ఇతర ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూరగాయల ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయని, హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు అమాంతం పెంచేశారన్నారు. సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువులు కొనే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వారం రోజులుగా చోద్యం చూస్తూ ప్రజలను పట్టించుకోకుండా ఉందని విమర్శించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ బీపీసీఎల్ పెట్రోల్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఆయిల్ ట్యాంకర్లు వచ్చేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిన తర్వాత పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టి మేము ఏదో చేసేశామన్న రీతిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. రెండు రోజుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తీసుకు రాకపోతే అన్ని పెట్రోల్ బంకుల వద్ద ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం క్రెడిట్ చోరీని వదిలేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారిస్తే మంచిదని అన్నారు. -
మేడే స్ఫూర్తితో పోరాటాలు చేయాలి
ఒంగోలు టౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మికులు విశ్రమించకుండా పోరాటాలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తంబి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పరిసరాల్లోని నోయిడాలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు నిరంతర పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారన్నారు. జిల్లాలోని 28 మండలాల్లో మేడే సందర్భంగా ఎర్రజెండాలు ఎగరేసి కార్మికుల సత్తా చాటాలని చెప్పారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు సయ్యద్ మున్వర్ బాషా, ముహమ్మద్ బేగ్, చిట్టిబాబు పాల్గొన్నారు. ఒంగోలు: ఏపీ కుడో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక మే 4న నిర్వహిస్తున్నట్లు ఏపీ కుడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి శశిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక స్థానిక శ్రీనగర్ 1వ లైనులోని జూపిటర్ హైస్కూలులో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చెందిన అన్ని కుడో క్లబ్లు, కోచ్లు, రిఫరీలు, క్రీడాకారులు, అర్హులైన సభ్యులు సకాలంలో హాజరై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరి శశిధర్ విజ్ఞప్తి చేశారు. -
కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ
సంతమాగులూరు (అద్దంకి): మిరపకాయల కోత కూలీల ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొమ్మాలపాడు సమీపం అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం..కొమ్మాలపాడుకు చెందిన ఎనమిది మంది కూలీలు ఏల్చూరు గ్రామంలోని మిరపకాయల కోత కూలికి ఆటోలో బయల్దేరారు. ఆటోను కొమ్మాలపాడు నుంచి ఏల్చూరు మధ్యలోని ఓ డెయిరీ సమీపంలో వెనుకగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్బీ, ఎస్కే ఖాశింబీ, రుక్సేనాకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నామ్ హైవే అంబులెన్సులో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ఎస్సై పట్టాభిరామరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూలీల ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అందులో ఎనిమిది మంది కూలీలు మాత్రమే ఉండటం, వారిలో ముగ్గురు గాయపడగా మిగిలిన వారు క్షేమంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మార్టూరు: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సెల్ టవర్ పైకి ఎక్కి హడావుడి చేసిన సంఘటన మార్టూరులో మంగళవారం రాత్రి కలకల రేకెత్తించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇతర రాష్ట్రానికి చెందిన మతి స్థిమితం లేని ఓ వ్యక్తి వ్యక్తి గత కొంతకాలంగా మార్టూరులో సంచరిస్తున్నాడు. స్థానిక కొణిదెన రోడ్డులోని వైన్స్ షాపుల సమీపంలో ఉన్న సెల్ టవర్ పైకి ఆ వ్యక్తి ఎవరు చూడకుండా టవర్ చివరి భాగం వరకు వెళ్లి అరుస్తున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించి అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. వాహనం వచ్చేలోగా ఎస్ఐ సుబ్బారావు గంటసేపు శ్రమించి సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిని టవర్పై నుంచి జాగ్రత్తగా కిందికి దించారు. కిందికి దిగి వచ్చాక ఆ వ్యక్తి అతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు స్థానికులు గుర్తించారు. ముగ్గురికి గాయాలు తప్పిన పెను ప్రమాదం -
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అధికార పార్టీ నాయకుల ప్రాపకం కోసం ట్రాన్స్కో అధికారులు హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాట్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కందుకూరు నుంచి కరేడు వరకూ నిర్మించతలపెట్టిన 220 కేవీ హై టెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణంలో అధికార పార్టీ నేతలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాముల మెలికల్లా నిర్మిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తీగల బంధం..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కందుకూరు నుంచి కరేడు వరకు 220 కేవీ హై టెన్షన్ విద్యుత్ లైను నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ లైను వెళ్లే రూటులో అధికార పార్టీకి చెందిన పొలాలు, మామిడి తోటలు, సపోటా తోటలు తగలకుండా పాము మెలికల్లా తిప్పుతూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు 10 మందికి పైగా అధికార టీడీపీకి చెందిన వాళ్ల పొలాల్లో కాకుండా ఇతరుల పొలాల్లోకి వంపులు తిప్పుతున్నారు. దాంతో సంబంధం లేని వాళ్ల మామిడి తోటలు, సపోటా తోటలు మాయం కానున్నాయని రైతులు వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా మార్పులు.. అధికార పార్టీ నేతల ఒత్తిడో..పచ్చనోట్ల ప్రభావమో తెలియదని, ట్రాన్స్ కో అధికారుల అలైన్మెంట్ తప్పుగా మార్చడంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ లైన్ నిర్మాణానికి కొద్ది నెలల కిందట సర్వే జరిగింది. సాధారణంగా ఒక వంతెన, రోడ్డు, కరెంట్ లైన్, టెలిఫోన్ లైన్ గానీ నిర్మించేటప్పుడు వ్యయ, ప్రయాసలను తగ్గించే తక్కువ దూరాన్ని ఎంపిక చేస్తుంటారు. అయితే విద్యుత్ లైను అలైన్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా దిశను మార్చుకుంది. మన్నేటికోట శివాలయం వద్ద మన్నేరు దాటి తూర్పునకు వచ్చింది. ఇక్కడి నుంచి ఈ లైన్ తూర్పుగా వెళ్లి, చిల్లా కాలువ సమీపంలో జాతీయ రహదారిని దాటి కరేడు పంచాయతీలోకి ప్రవేశిస్తోంది. శివాలయం సమీపంలో మన్నేరు నదిని దాటిన విద్యుత్ లైన్ మార్గాన్ని గ్రామానికి దక్షిణ దిశలో ప్రతిపాదించారు. అయితే ఈ విద్యుత్ లైను కోసం సర్వేయర్లు ప్రతిపాదించిన మార్గం 33 వ పోల్ దగ్గరికి వచ్చేసరికి దిశను మార్చుకుంది. ఉలవపాడు జాతీయ రహదారి, రైల్వే లైన్ చిల్లా కాలువ బ్రిడ్జికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో రైతు పొలం నుంచి నేరుగా అంటే తూర్పుగా చిల్లా కాలువ వైపు వెళ్లాల్సిన విద్యుత్ లైన్ను సర్వేయర్లు 90 డిగ్రీల కోణంలో ఉత్తర దిశకు మళ్లిస్తూ అలైన్మెంట్ మార్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ అలైన్మెంట్ మార్చడంతో పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇవన్నీ కూడా బీసీ కులాలకు చెందిన చిన్న, సన్నకారు రైతుల భూములు. అధికారుల అక్రమాలతో భూములు ఈ లైను కింద పోతున్నాయి. పడమర నుంచి వచ్చే లైను నేరుగా తూర్పునకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, 33 వ పోల్ నుంచి ఉత్తర దిశ తీసుకొని మామిడి తోటలతో పాటు మరికొంతమందికి చెందిన మాగాణి మీదుగా కొంచెం దూరం వెళ్లి, అక్కడ ఇంకో వంకర తిరిగి దక్షిణ దిశగా కొంత దూరం వచ్చాక, అక్కడ ఇంకో వంకర తిరిగి తూర్పు వైపునకు వెళ్లేలా ప్రతిపాదించారు. 33 వ పోల్ నుంచి చిల్లా కాలువ వరకూ తక్కువ ఖర్చుతో, రైతులకు తక్కువ నష్టంతో విద్యుత్ లైన్ నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ, సర్వేయర్లు నిబంధనలు పాటించలేదు. 33వ పోల్ నుంచి హై టెన్షన్ విద్యుత్ లైన్ నేరుగా తీసుకెళ్తే లైను మూడు వంకర్లు తిరగాల్సిన పనిలేదని, పండ్ల తోటలకు నష్టం జరిగే అవకాశం ఉండదని రైతులు చెబుతున్నారు. ఈ లైన్ నిర్మాణం విషయంలో ఏపీసీపీడీసీఎల్కు చెందిన ఒక ఏఈ అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన పొలాలు పోకుండా చేసేలా కార్యాచరణను భుజానకెత్తుకున్నట్లు తెలిసింది. ట్రాన్స్ కో అధికారుల వ్యవహారంలో సంబంధం లేకపోయినా సదరు ఏఈ అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.చీకటి ఒప్పందం!రైతుల సమస్యలను పరిశీలిస్తున్నాం హై టెన్షన్ విద్యుత్ లైనులో రైతులు కొంతమంది అభ్యంతరాలు చెప్పారు. సర్వే తిరిగి చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ లైను నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. అయినా రైతుల అభ్యర్థన మేరకు లైనును పరిశీలిస్తాం. తమ సిబ్బందిని పంపించి మళ్లీ ఒకసారి పరిశీలన చేయిస్తా. – కృష్ణారెడ్డి, ఈఈ, ట్రాన్స్కో, ఒంగోలు పరిహారం పేరుతో బొక్కుడుఅధికార పార్టీ నాయకులు, డిస్కం అధికారులు కలిసి ట్రాన్స్ కో అధికారులతో కుమ్మకై ్క పంటలు లేకపోయినా ఉన్నట్లు చూపించి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హై టెన్షన్ విద్యుత్ లైన్ వెళ్లే రూటులో ఉన్న పొలాల్లో ఉన్న రైతులతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని లేని పంటలను ఉన్నట్లు చూపించి పరిహారం పేరుతో తిలా పాపం...తలా పిడికెడు అన్న చందంగా దోచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10.50 కిలో మీటర్లలో కొంతమంది రైతులతో, పంటలు లేని వారిని గుర్తించి వారితో డిస్కం అధికారులు, అధికార పార్టీ నాయకులు వాటాలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
వణికించిన గాలివాన
కడపరాజుపల్లెలో నేల కూలిన భారీ వేపచెట్టు బొమ్మలాపురంలో నేల కూలిన అరటి చెట్లు బొమ్మలాపురంలో గాలి తీవ్రతకు నేల కూలిన బొప్పాయి చెట్లు మార్కాపురం: మంగళవారం సాయంత్రం వరకు భానుడి ఉగ్రరూపం దాల్చగా..సాయంత్రం తరువాత ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్ద దోర్నాల తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచిన గాలులకు పట్టణంలోని ఏకలవ్య కాలనీలో చర్చి వద్ద విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో మార్కాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గాలీవాన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎకలవ్య కాలనీలోనే పెద్ద వేప చెట్టు విరిగిపడింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షంనీరు రోడ్లపైకి చేరింది. విజయా టాకీస్ ఏరియా, 10వ వార్డు, మీనా మసీద్ తదితర ప్రాంతాల్లో సాగర్ పైపు లైన్ల కోసం ఏర్పాటు చేసిన గుంతలలోకి నీరు చేరి రోడ్డుపైన పారాయి. పెద్దదోర్నాల: మండలంలో అకాల వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ గాలీవాన తీవ్రతకు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లతో పాటు, పలు దుకాణాల పైకప్పు రేకులు నేలకూలాయి. గాలీవాన తీవ్రతకు మండల కేంద్రంలోని శ్రీశైలం రహదారిలో ఉన్న ఒంటేరు రమణయ్య ఇంటి వద్ద ఉన్న వెలగచెట్టు నేలకూలింది. దీంతో పాటు శ్రీశైలం రహదారిలోని పలు దుకాణాల పైకప్పు రేకులు నేలకూలాయి. మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురంలో మంగళవారం వీచిన భారీ గాలుల తీవ్రతకు పలువురు రైతులకు చెందిన అరటి, బొప్పాయి చెట్లు నేలకూలడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు వంద ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం. మండల పరిధిలోని కడపరాజుపల్లెలో గాలీవాన బీభత్సానికి రామాలయం వద్ద నున్న భారీ వేప చెట్టు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభం పడిపోయింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బొమ్మలాపురంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది. అయితే కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిన ప్రజలు మంగళవారం భారీగా కురిసిన వర్షంతో కాస్త సేద తీరారు. మండు వేసవిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు గంటన్నర పాటు ఈదురుగాలుల బీభత్సం నేలకొరిగిన అరటి, బొప్పాయి చెట్లు వంద ఎకరాల్లో పంట నష్టం కూలిన విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం -
నేడు వైఎస్సార్, సంజీవరెడ్డిల విగ్రహావిష్కరణ
ఒంగోలు వన్టౌన్: ఒంగోలులోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఉన్న రెడ్డి హాస్టల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డా.నీలం సంజీవరెడ్డి, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణను బుధవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు రెడ్డి హాస్టల్ కమిటీ అధ్యక్షుడు, రెడ్డి జనాభ్యుదయ సంఘ అధ్యక్షుడు వై రమణారెడ్డి తెలిపారు. విగ్రహాలను రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, హాస్టల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని వాకా సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని సిరిపురపు విజయభాస్కర్ రెడ్డిలు సహకారం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా హాస్టల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్, కాన్ఫరెన్స్ హాలు, హాస్టల్ గదులకు అటాచ్డ్ బాత్రూంలు, వంట గది ఆధునికీకరణ, డిజిటల్ లైబ్రరీ, మినరల్ ప్లాంట్లను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి అన్నపురెడ్డి చిన ఆదిరెడ్డి, ట్రెజరర్ భవనం నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు నరహరి రామలింగారెడ్డి, మెంబర్ పాలవెల్లి వెంకటేశ్వర రెడ్డి, ఈసీ మెంబర్ గోపవరపు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారులకు నిత్య నరకం
టంగుటూరు: టంగుటూరు టోల్ప్లాజాలో ఓవర్ లోడు ఫీజు వసూలుతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. రేయింబవళ్లు ఇరువైపులా కిలోమీటర్లకు మేర వాహనాలు నిలిచిపోతుండటంతో అత్యవసర పనులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులకు వెళ్లే వారు వాహనాలు నిలిచిపోయిన సమయంలో పడే ఇక్కట్లు చెప్పేవీ కావు. గతంలో ట్రాఫిక్లో అంబులెన్సు ఇరుక్కొని 30 నిముషాలు పాటు రోగి, బంధువులు అల్లాడిపోయారు. ఆ సమయంలో అంబులెన్సులోని వ్యక్తి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు అధికారులను నిలదీశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మారని టోల్ ప్లాజా యాజమాన్యం తీరు.. ఓవర్ లోడ్ పేరుతో వసూలు చేస్తుండడంతో ప్రతిరోజు గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిత్యం ఇదే తీరు. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు కష్టాలు చెప్పేవి కావు. ఇంత జరుగుతున్న టోల్ ప్లాజా యాజమాన్యం తీరు మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓవర్ లోడు వసూలు పేరుతో టోల్ప్లాజా వద్ద వాహనాల నిలిపివేత కిలోమీటర్ మేర నిలిచిపోతున్న వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు -
చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
బేస్తవారిపేట: మోటార్ సైకిల్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన చిన్న కంభం రోడ్డులో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కంభం మండలం యర్రబాలెంకు చెందిన పూసలపాటి బాలఅంకయ్య(40) మోటార్సైకిల్పై బేస్తవారిపేటకు వెళుతూ చిన్నకంభం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలఅంకయ్యను 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బాలఅంకయ్య బతుకుదెరువు నిమిత్తం గుంటూరులో ఉంటున్నాడు. బంధువుల వివాహం ఉండటంతో రెండు రోజుల క్రితం బేస్తవారిపేట వచ్చాడు. యర్రబాలెంలో ఉన్న తల్లి రంగమ్మ వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మర్రిపూడి: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అయ్యవారిపాలెం– జువ్విగుంట సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తంగెళ్ల పంచాయతీ అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన కర్నాటి కొండపనాయుడు(40) తన భార్యను ఒంగోలు పంపించేందుకు టంగుటూరు– పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద వదిలి ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు క్షతగాత్రున్ని 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్సై రమేష్బాబు తెలిపారు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బల్లికురవ: మండలంలోని ముక్తేశ్వరం గ్రామానికి చెందిన కొనిదెన రజనీ (35) 12 రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఆమె సోదరుడు రామకోటేశ్వరరావు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మండలంలోని రామాంజనేయపురం గ్రామ సమీపంలోని అట్టపెట్టెల ఫ్యాక్టరీ వెనుక మహిళ మృతదేహన్ని గుర్తించి పశువుల కాపరులు వీఆర్ఓ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్సై వై నాగరాజు పరిశీలించి ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహం రజినీదిగా గుర్తించారు. ఈ మేరకు అదృశ్యం కేసును అనుమానాస్పద మృతిగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సంతమాగులూరు సీఐ శేషగిరిరావు పరిశీలించారు. ● రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి ఒంగోలు టౌన్: కుమారుడి పుట్టెంట్రుకలు తీయించడానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు చేరాడో తండ్రి. జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం...కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన సంజు కుమార్ హైదరాబాద్లోని టీ స్టాల్లో మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడి పుట్టెంట్రుకలు తీయించడానికి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్లో తిరుపతి బయలుదేరాడు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మంచినీళ్ల కోసం ఒంగోలులోని మూడో నంబర్ ప్లాట్ఫారంలో రైలు దిగాడు. నీళ్ల బాటిల్ కొనుక్కొని తిరిగి రైలు ఎక్కే సమయానికి పొరపాటున జారి పడిపోయాడు. రైలు పట్టాల మధ్య పడడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో భార్య పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల భూములపై డేగల పంజా...!
కందుకూరు రూరల్: ఉలవపాడు మండలం బద్ధిపూడి గ్రామ రెవెన్యూ, పొలిమేర పరిధిలో మన్నేరు ఒడ్డును 1988లో బద్ధిపూడి గ్రామానికి చెందిన ఎస్సీలకు 72 మందికి ఒక్కొక్కరికి అర ఎకరా చొప్పున ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఈ పొలాల్లో తొలుత వారు మామిడి మొక్కలు సాగు చేశారు. అయితే 1996లో రాళ్లపాడు ప్రాజెక్టు తెగినప్పుడు మామిడి తోటలన్నీ కోట్టుకుపోయాయి. దీంతో రైతులు మామిడి సాగు చేయకుండా వేరుశనగ, జామాయిల్ సాగు చేశారు. అయితే ఏ పంట సాగు చేసినా మన్నేరుకు నీరు వచ్చినప్పుడు నష్టం వాటిల్లుతుంది. దీంతో కొందరు జామాయిల్ సాగు చేస్తుండగా..మరికొందరు ఇతర పనులకు వెళుతూ భూములను పట్టించుకోవడం లేదు. గతంలో ఇసుక తవ్వకాలు చేసుకుంటామని ఎస్పీ రైతులు అధికారులను సంప్రదించినా అనుమతి ఇవ్వలేదు. నాణ్యత..డిమాండ్ ఎస్సీలకు ఇచ్చిన 54.31 ఎకరాల్లోని నాణ్యమైన ఇసుక ఉంది. ఈ ఇసుకకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల కన్ను ఈ భూములపై పడింది. నాణ్యమైన ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు వెనకేసుకోవాలని పథక రచన చేశారు. ఈ ఎస్సీల పొలాల పక్కనే మాచవరం రెవెన్యూ పరిధిలో శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన రైతుల పాలాలు ఉన్నాయి. 334/1లో 6.76 ఎకరాలు భూమి ఉంది. ఇందులో కె.బుజ్జమ్మకు సుమారు 2.27 ఎకరాలు ఉన్నట్లు చెబుతున్నారు. మన్నేరు కరకట్ట వెలుపలు మాచవరం రెవెన్యూలోనే 6.76 ఎకరాలు ఉంది. కానీ కె.బుజ్జకు మాత్రం మన్నేరు కరకట్ట లోపలకి 2.27 ఎకరాలు మాత్రమే రికార్డులు ఉన్నాయి. అయితే బుజ్జమ్మ పొలంలో ఇసుక తవ్వకాల పేరుతో ఈ 54 ఎకరాల్లో ఇసుకను తవ్వేలా ప్లాన్ వేశారు. బుజ్జమ్మ పొలంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు అక్రమార్కులు రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎదురుతిరుగుతున్నారు. ఎస్సీల భూములకు ఎదురుగా మాత్రమే కె.బుజ్జమ్మ, వారి బంధువులకు పొలం ఉందని, కానీ వారు మన్నేరులోకి వచ్చి ఎలా ఇసుక తవ్వకాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని, కానీ చూపించమంటే చూపించడం లేదని రైతులు వాదిస్తున్నారు. రూ.3 కోట్లకు వ్యాపారితో డీల్.. అయితే ఎస్సీలకు ఇచ్చిన పొలాల్లో తవ్వకాలకు శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలతో ఒప్పందం కుదుర్చొకున్నారు. ఒంగోలుకు చెందిన ఓ ఇసుక వ్యాపారితో మూడు కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అక్కడ ఉంది 2.27 ఎకరాలే కదా మూడు కోట్లు ఎలా డీల్ కుదిరిందంనుకుంటే పప్పులో కాలేసినట్లే. పేరుకు మాత్రం 2.27 ఎకరాలే, కానీ దాన్ని అనుకొని ఉన్న ఎస్సీల భూములైన 54.31 ఎకరాల్లోని ఇసుకను తవ్వకునేలా ప్లాన్ కుదుర్చుకున్నారట. మొత్తం మా ఆధీనంలోనే ఉందని మూడు కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలు బుజ్జమ్మ పొలంలో ఇసుకనే లేదు. ఆ పేరు చెప్పుకొని ఆ పక్కనే ఎస్సీల భూముల్లోని ఇసుకను కాజేసేందుకు స్కేచ్ వేశారు. రెండు రోజుల నుంచి జేసీబీతో సుమారు పది అడుగుల మేరకు ఇసుక తవ్వకాలు చేశారు. ఇసుకను తీసుకొచ్చి గోపాలపురం సమీపంలో డంప్ చేసి టిప్పర్లకు, లారీలతో తరలిస్తున్నారు. జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఈ ఇసుకను తరలించి కోట్లు సంపాదించుకుందనేకు ప్లాన్ చేశారు. ఈ ప్రాంత మన్నేరులోని ఇసుక నాణ్యమైనది కావడంతో మంచి డిమాండ్ ఉంది. శ్రీరంగరాజపురం, గోపాలపురం గ్రామాల కూటమిలోని కొందర నాయకులతో ఒప్పందం కుదుర్చుకొని తవ్వకాలు చేస్తున్నారు. ఆ డబ్బులు పంపకాల్లో కూడా గ్రామంలోని కొందరి మధ్య విబేధాలు కూడా వచ్చినట్లు సమాచారం. పేదల భూములపై పెద్దల కన్ను పడింది. ఏం చేసినా ఎవరు అడ్డుకుంటారని బెరితెగించారు. ఒంగోలుకు చెందిన వ్యాపారితో డీల్ కుదిరింది. కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. అధికారం అండగా ఇసుక ఇవ్వకాలకు ఏకంగా కిలోమీటర్ పైనే రోడ్డు సైతం వేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అధికార పార్టీ నేతల దోపిడీకి అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మన్నేరు 54.31 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్లాన్ ఒంగోలుకు చెందిన వ్యాపారికి రూ.3 కోట్ల డీల్ శ్రీరంగరాజపురానికి చెందిన కొందరితో ఒప్పందం కిలో మీటరు మేర రోడ్డు ఏర్పాటు జేసీబీలతో తవ్వకాలు చేసి టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు నాణ్యమైన ఇసుక కావడంతో మంచి డిమాండ్ తవ్వకాలను అడ్డుకున్న బద్ధిపూడి గ్రామస్తులు -
డీజిల్ ఏడిపిస్తూ!
డీజిల్ దొరక్క ఒంగోలు నగరంలో ఆటోవాలాలు, కార్మికుల కష్టాలుఒంగోలు సబర్బన్: జిల్లాలో 40 శాతం పెట్రోలు బంకులు రెండో రోజు సోమవారం కూడా మూతపడ్డాయి. ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్, పెట్రోలు సరఫరా లేకపోవటంతో బంకులు మూసేశారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న రెండు బంకులు మూసేశారు. ఉన్న పెట్రోలు బంకుల్లో కొన్నింటిలో డీజిల్ లేకపోతే మరికొన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు లేదు. దీంతో వాహనదారులు ప్రతి పెట్రోలు బంకు వద్ద బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఆయిల్ సప్లై ఉన్న బంకుల్లో కారుకు రూ.1000, ఆటోకు ఒక్కో బంకులో ఉన్న స్టాకును బట్టి ఒక్కో చోట ఒక్కో ఆటోకు రూ.400 నుంచి రూ.500 చొప్పున కొడుతున్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు రూ.200లకు మాత్రమే పడుతున్నారు. హైవేపైన అయితే సుదూర ప్రాంతాలకు భారీ లోడులతో వెళుతున్న లారీల పరిస్థితి దారుణంగా మారింది. రూ.1000 కంటే ఎక్కువ కొట్టకపోవటంతో ఎక్కడ ఆగిపోతాయోనని లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నగరంలో దాదాపు 2 వేలకు పైగా ఆటోలు డీజిల్ కొరత ఉండటంతో పాటు క్యూలైన్లలో నిలబడలేక ఇళ్ల వద్దే ఆపుకున్నారు. గతంలో ఒంగోలు నగరంలో ఎక్కడ నుంచి ఎక్కడికై నా సింగిల్ రన్కు రూ.20 ప్రయాణికుల నుంచి వసూలు చేసేవారు. ఇదే అదునుగా చేసుకొని కొందరు ఆటోవాలాలు రూ.30 వసూలు చేస్తున్నారు. దాంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమస్య రాకముందు ఒకరిని ఎక్కించుకొని ఆటోలు పోతూ ఉండేవి. అలాంటిది ప్రస్తుతం ఒక్కరు ఆగి ఉంటే ఒక్కరికి ఏమి వస్తాం రూ.50 ఇస్తావా, రూ.75 ఇస్తావా, లేకుండా కొంచెం దూరాభారం అయితే రూ.100 ఇస్తావా అని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ప్రయాణికులు కాళ్లకు పని చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బల్క్గా ఆయిల్ పోయవద్దని, డబ్బాల్లో కూడా వద్దని కలెక్టర్ రాజాబాబు పలు బంకులను తనిఖీ చేసిన సందర్భంగా నిర్వాహకులను ఆదేశించారు. పోలీస్ పహారా మధ్య మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో పోలీసు పహారా మధ్య పెట్రోల్, డీజిల్ను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో 8 పెట్రోల్ బంకులు ఉండగా రెండు మూడు చోట్ల మాత్రమే పరిమితంగా పెట్రోల్, డీజిల్ పంపిణీ జరుగుతోంది. పోలీసులు పెట్రోల్ బంకుల్లో డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిమితంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇవ్వడంతో డ్రైవర్లు, కార్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల్లో వెయ్యికి పైగా ఆటోలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలందరూ ప్రతిరోజూ ఆటోల ద్వారానే మార్కాపురానికి వచ్చి పనులు చూసుకుని వెళ్తుంటారు. డీజిల్ కొరత కారణంగా పలు చోట్ల ఆటోలను డ్రైవర్లు ఇళ్లకే పరిమితం చేసుకున్నారు. దీంతో పట్టణానికి వచ్చేందుకు కూడా అవస్థలు పడుతున్నారు. సోమవారం సాయంత్రం ఏబీఎం స్కూల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు వద్ద సుమారు అర కిలోమీటరు మేర వాహనాలు డీజిల్ కోసం బారులు తీరాయి. బ్లాక్లో అమ్మకాలు సింగరాయకొండ: మండలంలోని ఊళ్లపాలెం గ్రామంలో బ్లాక్ మార్కెట్లో డీజిల్ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. డీజిల్ లీటరు రూ.96 ఉండగా ఇక్కడ మాత్రం బ్లాక్ మార్కెట్లో రూ.150 కు అమ్ముతున్నారని, దీంతో అంతరేటు పెట్టి డీజిల్ కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. అధిక ధరకు డీజిల్ కొనలేక ఇంటివద్దే ఆటోలు ఆపామని అంటున్నారు. గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం డీజిల్ కొరత గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చీమకుర్తి కేంద్రంగా దాదాపు 50కి పైగా గ్రానైట్ క్వారీలు, 60–70కి పైగా ఉన్న కంకర మిల్లులు, 600కు పైగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలపై డీజిల్ కొరత పెను భారంగా మారిందని ఆయా క్వారీలు, కంపెనీల యజమానులు వాపోతున్నారు. రోజుకు 1000 లీటర్లు కూడా దొరక్కపోవడంతో క్వారీలో రాయిని తీసే పనిని తగ్గించుకున్నారు. పైగా రిటెయిల్ అవసరాలకు లీటరు రూ.98 ఉంటే ఇండస్ట్రీ అవసరాలకు ఉపయోగించే డీజిల్పై అదనంగా రూ.55 పెంచి రూ.152 లెక్కన లీటరుకు వసూలు చేస్తున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలులో పోలీసు శాఖ నడుపుతున్న పెట్రోలు బంకు వద్ద బారులుతీరిన వాహనాలు -
ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు కంభం: ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన అనంతపురం– అమరావతి హైవే రోడ్డుపై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలో జంగంగుంట్ల గ్రామం వద్ద ఓ ట్రావెల్స్ బస్సు ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో పోరుమామిళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న బస్సును దాటుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వాహనంపైకి ఎక్కింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న మల్లెల శ్రీనివాసరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందగా, అలీ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. -
‘మీ కోసం’కు 263 వినతులు
● ఒంగోలులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్–మీ కోసం) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 263 వినతులు వచ్చాయి. కలెక్టర్ పి.రాజాబాబు ఆధ్వర్యంలో ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ భవన్లో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు తమ వంతుగా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి, డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్రెడ్డి, మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మార్కాపురం: మార్కాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్సెల్ (పీజీఆర్ఎస్)కు 27 అర్జీలు అందాయి. డీఎస్పీ నాగరాజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. అర్జీదారులతో పోలీసులు మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కనిగిరి, వై.పాలెం, గిద్దలూరు సీఐలు శ్రీనివాసరావు, అజయ్కుమార్, రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ● సుమారు రూ.6 లక్షల నష్టం తాళ్లూరు: కంటైనర్ ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని లక్కవరం ఎస్సీకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు కూకట్ల వీరబ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న సమయంలో కంటైనర్ ఇంట్లో మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి వెంటనే దర్శి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పేలోపే ఇంట్లోని కంప్యూటర్, ఫోన్లు, ఫ్యాన్ల్, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వీరబ్రహ్మం తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొనకనమిట్ల: పాల లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై పెదారికట్ల–చినారికట్ల మధ్యలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..చినారికట్ల గ్రామానికి చెందిన కాకునూరి కోటిరెడ్డి(35) తన మోటార్ సైకిల్పై పెదారికట్ల వెళ్లి తిరిగి చినారికట్ల వస్తున్నాడు. ఆ క్రమంలో పొదిలి నుంచి కనిగిరి వైపు వెళుతున్న పాల లారీ ఎదురుగా మోటార్ సైకిల్పై వస్తున్న కోటిరెడ్డిని ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన కోటిరెడ్డి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ సంఘటనా స్థలానికి కొద్దిదూరం వెళ్లి ఆగింది. కాగా మృతుడు కోటిరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కొనకనమిట్ల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. కోటిరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పుటూరు (చినగంజాం): మద్యానికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని ఉప్పుటూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. ఉప్పుటూరు గ్రామానికి చెందిన షేక్ నాజర్వలి (20) తల్లిదండ్రులు విడిపోయి తల్లి వేరొక వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ వెల్డింగ్ పనులు చేసుకుంటున్నాడు. మూడు నెలల క్రితం అతని తండ్రి మృతిచెందాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన నాజర్వలి సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక వీఆర్వో, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
జిల్లాలో పెట్రోల్, డీజిల్ అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 195 పెట్రోలు బంకులు ఉండగా దాదాపు 40 శాతం బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరి కనిపించాయి. హైవేపై ఉన్న బంకుల వద్ద పెద్ద వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల తిరిగే దాదాపు 2 వేల ఆటోలు మూతపడ్డాయి. ఇదే అదునుగా ఆటో చార్జీలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్ ప్రభావం గ్రానైట్ పరిశ్రమపై కూడా పడుతోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి కొరత లేదంటూ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. పెట్రోల్ వెక్కిరిస్తూ.. -
అక్రమ కేసులకు భయపడం
దర్శి: ‘ఎవ్వరూ అధైర్యపడొద్దు..మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని బొట్లపాలెంలో వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రైతులకు తీవ్ర నష్టంవాటిల్లినా రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా బాబు ప్రభుత్వం విదిల్చిన పాపాన పోలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం ఎరువులు, యూరియా కూడా అందించకపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రైతులంతా కలిసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వ అసమర్ధతతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆటోవాలాలు, చిన్న చిన్న లారీల యజమానులు, వాహనాలకు డీజల్ లేకపోతే బాడుగలకు ఎలా వెళ్తారని, వాహనాలకు ఫైనాన్స్ కిస్తీలు ఎలా కట్టాలని...తమ కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వానికి, అధికారులకు చిమకుట్టినట్లయినా లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం ప్రభుత్వ అసమర్థతతోనే పెట్రోలు, డీజిల్ కొరత దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
అడ్డుకున్న రైతులు...
భూముల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బద్ధిపూడి గ్రామానికి చెందిన ఎస్సీలు తవ్వకాలను అడ్డుకొని నిలిపివేశారు. అయితే రెండు రోజుల నుంచి వారు తవ్వకాలను నిలిపివేయడం వారు వెళ్లగానే తవ్వకాలు చేపట్టడం పరిపాటిగా మారింది. దీంతో సోమవారం భూములకు సంబందించిన వారంతా భూముల వద్దకు వచ్చి వారి భూముల్లో వేసి రోడ్డును జేసీబీతో తొలగించారు. మా భూములను ఆక్రమించుకొని శ్రీరంగరాజపురంకు చెందిన ఓ రైతు జామాయిల్ మొక్కలు కూడా వేశారు. ఆ మొక్కలను కూడా తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. తవ్వకాలు చేపడితే ఊరుకునేది లేదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ మురళిని వివరణ కోరగా..ఇసుక తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని, దీనిపై విచారిస్తున్నట్లు తెలిపారు. దీనిపై గ్రామాల సరిహద్దుల వద్ద కూడా సమస్య ఉందని, పూర్విగా సర్వే చేయించి హద్దు వేయిస్తామని చెప్పారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోరా..!
మార్కాపురం: మహిళలను కించపరుస్తూ తన మీడియాలో వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 9న ఫిర్యాదు చేస్తే ఇంత వరకూ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికై నా కేసు నమోదు చేయాలని కోరుతూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జిలు అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్ సోమవారం మార్కాపురం డీఎస్పీ డాక్టర్ నాగరాజుకు వినతిపత్రం ఇచ్చారు. వైఎస్సార్ సీపీ మహిళలను కించపరుస్తూ టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకుండా తమ పార్టీ వారిపై ఎదురు కేసులు నమోదు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద కాపలా కాస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎర్రబుక్కు పాలనతోపాటు ఎర్రిబుక్కు పాలన సాగుతుందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శించారు. మద్యం ఫుల్గా దొరుకుతుండగా పెట్రోల్, డీజిల్ నిల్ అని, తప్పుచేసిన వారిపై కేసులు లేకపోగా, తప్పు చేయనివారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ మహిళలను కించపరిచేలా వార్త ప్రచురించిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల తల్లులు, భార్యలు, చెల్లెళ్లపై దుర్మార్గంగా ఆయన తన ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాస్తే తాము ఫిర్యాదు చేసినా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని అన్నారు. ఇలాంటివాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా తమ ఫిర్యాదుపై కేసులు నమోదు చేయకపోతే పోలీసు స్టేషన్ల వద్ద ధర్నా చేస్తామని చంద్రశేఖర్ హెచ్చరించారు. వారిపై కేసులు నమోదు చేయండి: అన్నా రాంబాబు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతోపాటు వైఎస్సార్ సీపీ మహిళలను కించపరిచిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. ఈనెల 9న తాము పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దుర్మార్గమైన వార్తలు రాయడం మంచిది కాదన్నారు. సమాజంలో రుగ్మతలను వెలికితీయాల్సిన బాధ్యతను విస్మరించి మహిళలను కించపరిచేలా రాయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే విలువలు పోతాయన్నారు. జర్నలిజానికి విలువలు అవసరమని అన్నారు. దిగజారి వార్తలు రాయవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో అన్నా కృష్ణచైతన్య, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, తర్లుపాడు మండల కన్వీనరు మురారి వెంకటేశ్వర్లు, కనిగిరి మాజీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్, జెడ్పీటీసీ ఎం కస్తూరిరెడ్డి, అధికార ప్రతినిధి జీ ఆదినారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె వెంకటరత్నం, జిల్లా వాలంటీర్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కే నాయబ్రసూల్, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎం శ్రీహరిరెడ్డి, రమేష్రెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆంజనేయరెడ్డి, యర్రగొండపాలెం మండల ప్రెసిడెంట్ వై ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఓబుల్రెడ్డి, మైనార్టీ సెల్ ప్రతినిధి నూర్ అహ్మద్, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఒంగోలు సబర్బన్: ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పరిధిలోని ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలపై ఒంగోలు నగరంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రకాశం భవన్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బీసీహెచ్.ఓబులేసుకు పార్టీ నాయకులతో కలిసివచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సన్నెబోయిన రవి కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనుల్లో కూలీలకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ పి.రాజాబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2025 డిసెంబర్ నెల నుంచి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాల విడుదలకు, జిల్లాలో ఉపాధి హామీలో జరిగిన అవినీతిపై విచారించి, పథకం సక్రమంగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, పనుల వద్ద నీరు, నీడ, మందుల సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా కూలీలు అడిగిన వెంటనే పని కల్పించి వలసలు ఆపాలన్నారు. నకిలీ మస్టర్లు అరికట్టి, నిజాయితీగా పనులు జరిగేట్టు చూడాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో బయటపడిన అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులు లేక అల్లాడుతున్న జిల్లా కూలీలకు సమృద్ధిగా పనులు కల్పించి, వలసలను ఆపి జిల్లాను ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటైనప్పటి నుంచి ఉపాధి పనుల్లో అవినీతి పెరిగిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవి కుమార్తో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్ర రెడ్డి, ప్రకాశం జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ బండ్లమూడి వెంకట రాజయ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ దేవరపల్లి అంజిరెడ్డి, ఘట్టమనేని అశోక్, ఒంగోలు పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు కోటేశ్వరరావు, సన్నపు రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మీరావళి, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, తాత నర్సింహా గౌడ్, యరజర్ల రమేష్ బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి వెంకయ్య నాయుడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేటు కంటి ఆస్పత్రులు రిజిస్టర్ చేసుకోవాలిఒంగోలు టౌన్: ఈ నెల 30వ తేదీ లోపల జిల్లాలోని అన్నీ కంటి ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలోని చాంబర్లో సోమవారం జిల్లాలోని కంటి ఆస్పత్రుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ శుక్లం ఆపరేషన్ చేయించుకున్న వారి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. అనంతరం ఆస్పత్రి రిజిస్టర్, శుక్లం ఆపరేషన్లను నమోదు చేసే విధానం గురించి ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. పోర్టల్ వినియోగం, ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంఘ సెక్రటరీ డాక్టర్ నళిని, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, పీఎంఓఓలు శ్రీనివాసరావు, ఎన్.వెంకటేశ్వర్లు, పెద్దకాకాని శంకర కంటి ఆస్పత్రి ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు -
మే 9న జాతీయ లోక్ అదాలత్
ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్ మే 9న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రకాల సివిల్ కేసులు, రాజీకి అర్హత కలిగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, మోటారు వాహన ప్రమాద సంబంధ కేసులు, చెక్బౌన్స్ కేసులు, ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రీలిటిగేషన్ స్థాయిలో కూడా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీపడిన అన్ని సివిల్ కేసుల్లో కోర్టు ఫీజును తిరిగి కక్షిదారులకు అందిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఆధ్వర్యంలో బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి తెలిపారు. ● కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా ఒంగోలు టౌన్: నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్నెపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని, కార్మికులను ఆప్కాస్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ...గత పదేళ్లుగా కోవిడ్ కార్మికులు పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, లేకపోతే కోవిడ్ కార్మికులను ఆప్కాస్లో కలపాలని కోరారు. కార్మికులకు పీఎఫ్, ఈహెచ్ఎస్ కార్డులు ఇవ్వాలని, మహిళా కార్మికులకు సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు సెలవులు అడిగితే ఇష్టముంటే పనిచేయండి లేకపోతే వెళ్లిపోండని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. కలెక్టర్ జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో టి.మహేష్, బి.దివ్య, వి.భారతి, జేమ్స్, వంశీ, మోహన్ రావు, ఆర్.రాములు ,రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. వచ్చేనెల 3వ తేదీ జరిగే ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంపై సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఒంగోలులో కేంద్రియ విద్యాలయం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, నవోదయ విద్యాలయం, డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు 1728 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, పరీక్షల కోఆర్డినేటర్ రాజేష్, పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాళ్లు, ఈ కేంద్రాలకు నోడల్ అధికారులుగా ఉన్న తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పెట్రోలు బంకుల్లో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు
ఒంగోలు సబర్బన్/ఒంగోలు టౌన్: జిల్లాలోని పలు పెట్రోలు బంకులను సోమవారం కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు అధికారులతో కలిసి విడివిడిగా తనిఖీ చేశారు. పెట్రోలు, డీజిల్ కొరత కారణంగా రెండు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. బంకుల నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వాహనాలకు మాత్రమే ఆయిల్ నింపాలని, బాటిళ్లు, క్యాన్లతో వచ్చే వారికి, పెద్ద మొత్తంలో అడిగే వారికి ఆయిల్ పోయవద్దని ఆదేశింశారు. బ్లాక్ మార్కెట్కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్లను పరిశీలించి వాహనదారులకు ఆయిల్ పోస్తున్న తీరుపై ఆరా తీశారు. ఒంగోలు – టంగుటూరు మధ్యలో హైవే పక్కనున్న పెట్రోలు బంకులను కలెక్టర్ తనిఖీ చేయగా, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు, చీమకుర్తి పెట్రోలు బంకులను తనిఖీ చేయగా, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, చీమకుర్తి ఎస్సై సంపత్ పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పొన్నలూరు: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ సోమవారం నిందితుడి వివరాలను వెల్లడించారు. కనిగిరి మండలం బోయపాలెం గ్రామానికి చెందిన కామినేని మనోహర్ మద్యానికి బానిసై చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తన ఆటోలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇళ్లల్లో చొరబడి వస్తువులను దొంగలించి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 24న పరుచూరివారిపాలెం గ్రామంలోని జగనన్న కాలనీలో పట్ట పగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వస్తువులను దొంగలించాడు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిఘా ఉంచిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి రూ.30 వేల విలువైన మైక్సెట్, పిండి మిషన్, కారు బ్యాటరీలు, హోమ్ థియటర్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
నో స్టాక్..
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఒంగోలు రత్నమహల్ థియేటర్ సెంటర్లోని పెట్రోలు బంక్ వద్ద పెట్రోలు కోసం ద్విచక్ర వాహనాల రద్దీ జిల్లాలో డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి... డీజిల్ కోసం ట్రాక్టర్లు, వాహనాలు తీసుకొచ్చే పరిస్థితులు లేక డ్రమ్ములు, డబ్బాలు తీసుకొని ప్రజలు, వాహనదారులు పెట్రోలు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు పెట్రోలు బంకులు డీజిల్ లేక మూతపడగా, మరికొన్ని బంకులు మూత వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్నిచోట్ల పెట్రోలు కూడా నిండుకుంది. అరకొరగా తెరచిన చోటా గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిస్థితి చక్కదిద్దాల్సిన సివిల్ సప్లై అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు.ఆయిల్ నిల్సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత నానాటికీ తీవ్రమవుతోంది. ఉన్న స్టాకు అయిపోవడంతో ఒక్కొక్కటిగా పెట్రోలు బంకులు మూతపడుతున్నాయి. చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో మూడు రోజులకు ఒక లోడు డీజిల్.. పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. తీరా కొరత ఏర్పడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పెట్రోలు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అధికారులు స్పందించారు. డబ్బులు కట్టిన మూడు రోజులకు ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. గతంలో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు కూడా పైనుంచి సరఫరా సక్రమంగా రాకపోవటంతో పెట్రోలు బంకులకు సరఫరా కట్టడి చేశాయి. దాంతో డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూత పడే పరిస్థితి నెలకొంది. ఒక పక్క రబీలో వరి కోతలు ఊపందుకున్నాయని, దాంతో ఇంధన కొరతతో వరికోత మిషన్లు జిల్లాలో కనపడటం లేదు. ఎక్కడి వరికోత మిషన్లు అక్కడే ఆగిపోయాయి. డీజిల్ కొరతతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపలసాగుపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. నిద్ర మత్తులో సివిల్ సప్లయ్ విభాగం అధికారులు... పూర్తిగా ఆయిల్ కంపెనీలు పెట్రోలు బంకులకు డీజిల్ సరఫరా కట్టడి చేసేవరకూ జిల్లా సివిల్ సప్లయి విభాగం అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితులను, కనీసం రెవెన్యూ అధికారులు గమనించకపోవటం వల్లనే జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడి పెట్రోలు బంకులు మూసివేసే స్థితికి చేరుకున్నాయి. చివరకు సూరారెడ్డిపాలెంలోని ఐఓసీ, బీపీసీఎల్ అవుట్లెట్లలోనే డీజిల్ ఆపేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అలాంటిదేమీ లేదని అధికార యంత్రాంగం బుకాయిస్తోంది. ఆయిల్ కంపెనీలు..జిల్లా యంత్రాంగం మధ్య కొరవడిన సఖ్యత: జిల్లాలో ఉన్న ఆయిల్ కంపెనీల అధికారులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య సఖ్యత కొరవడింది. ఆయిల్ కంపెనీల అధికారులు పెట్రోలు బంకుల నిర్వాహకులను కట్టడి చేస్తున్నారు. ఇటు అధికారులకు మాత్రం ఆయిల్ నిల్వలు సక్రమంగా ఉన్నాయని అధికారులను పక్కదారి పట్టిస్తున్నారు. మూడు రోజులకు ఇవ్వాల్సిన లోడు ఇవ్వకుండా డీజిల్ సరఫరా పూర్తిగా కొన్ని ప్రాంతాలకు నిలిపేశారు. దాంతో మార్కాపురం జిల్లాలో 58 బంకుల్లో నోసా్ట్క్ బోర్డులు పెట్టగా, ప్రకాశం జిల్లాలో 40కి పైగా పెట్రోలు బంకులు మూతపడ్డాయి. అధికారులు మాత్రం నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి, ప్రజలు అధైర్యపడవద్దని చెబుతున్నారు. -
పాలుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించండి
● ఎస్టీ కమిషన్ ఎదుట సమస్యలు మొరపెట్టుకున్న గిరిజనులు యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న మాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్టీ కమీషన్ టీం ముందు పాలుట్ల గిరిజనులు తమ సమస్యలు వివరించారు. శనివారం రాత్రి ఎస్టీ కమీషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి, కమిషన్ టీం సభ్యులు మండలంలోని పాలుట్ల గిరిజనగూడేన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. గూడెంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని, ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. గూడెంలో పక్కా గృహాలు నిర్మించుకునేందుకు, బావులు తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వాలని, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హౌసింగ్ మ్యాప్లో తమ గూడెం లేకపోవడం వల్ల తాము ఎటువంటి పథకాలు పొందలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించేదుకు చర్యలు తీసుకుంటామని, చైర్మన్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మి, కె.పరమేశ్వర్లు ఉన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రామయ్య మార్కాపురం టౌన్: ఉద్యోగుల నిరవధిక సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకట రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఒప్పందాల అమలు కోసం భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా నూతన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా డీకేఎం రఫీ, జిల్లా అధ్యక్షుడిగా పీఎల్ రంగయ్య, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్రెడ్డి, కోశాధికారిగా ఎర్రారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, రమణయ్య, సహాయ కార్యదర్శిగా మల్లికార్జునరెడ్డి, కన్వీనరుగా శ్రీకాంత్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఏ సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతారావు, మనోజ్, రామాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం ర్యాలీ
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు నన్నెబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధిహామీ పథకంలో కూటమి ప్రభుత్వ అవినీతి, పెండింగ్ వేతనాలపై సోమవారం ఉదయం 11 గంటలకు ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తారన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. యర్రగొండపాలెం: ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ల ఎంపిక స్థానిక మాచర్ల రోడ్డులోని గురుకుల పాఠశాలలో ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రరావు, వెంకట్రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ పోటీల్లో 20 ఏళ్లు దాటిన యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికై న క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్క్లిస్ట్, ఆధార్ కార్డు జిరాక్స్లతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో మంగళవారం ఉదయం 8గంటలలోపు హాజరుకావాలని వారు కోరారు. వివరాలకు సెల్: 76750 26220 నంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు. ఒంగోలు టౌన్: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతోపాటుగా నగరవాసులు 11 గంటలలోపే దరఖాస్తులు అందజేయాలని, మార్చిన సమయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని కోరారు. మార్కాపురం టౌన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరత లేదని ఏజెన్సీలు సరఫరాదారులు కృత్రిమ సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం విజయసునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవసరపడే పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, వీటి కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అపోహలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంకులపై బల్క్ కొనుగోలు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలోని ఇంధన రిటైల్ ఔట్లెట్ తనిఖీలు నిర్వహించి ఎవరి వద్దైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
టీడీపీలో విగ్రహ చిచ్చు
నాగులుప్పలపాడు: అమ్మనబ్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. గ్రామంలో టీడీపీలో చాలా ఏళ్ల నుంచి ఉప్పు, నిప్పుగా ఉన్న అంతర్గత పోరు గత ఏడాది ఏప్రిల్ 22న నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, అదే గ్రామానికి చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యతో తార స్థాయికి చేరింది. ఈ హత్యలో అమ్మనబ్రోలు గ్రామానికే చెందిన టీడీపీ నాయకులే ప్రధాన పాత్రధారులని, గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరుకే హత్యలు జరిగాయని పోలీసులు తేల్చేశారు. అయితే వీరయ్య హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలో నిత్యం పోలీసుల పహారా కొనసాగుతున్నా అక్కడక్కడా ఘర్షణలు తెలెత్తుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు అణగదొక్కుతూ వస్తున్నా వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా 4 రోజుల కిందట గ్రామంలోని కనపర్తి కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పక్కనే వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆయన అనుచరులు పూనుకున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీలోని మరో వర్గం నాయకులు ఎన్టీఆర్ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటును అనుమతించేది లేదని అడ్డుకోవడంతో పాటు హైకోర్టుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22వ తేదీ రాత్రి వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా అర్ధరాత్రి సమయంలో విగ్రహం ఏర్పాటు చేయదలిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణ వాతావరణంలో వీరయ్య చౌదరి వర్గంలోని ఓ వ్యక్తి ఒంగోలు రూరల్ సీఐ మీద దూకుడుగా ప్రవర్తించడంతో పాటు పోలీసులను తీవ్రంగా దూషించారు. ఈ అంశాన్ని సీరియర్గా తీసుకున్న పోలీసులు అదే రోజు రాత్రి సుమారు 200 మంది వరకు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసుల ఆదేశాలను కూడా లెక్కచేయకుండా అనుమతి లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు శాంతి భద్రతలకు వెళ్లిన తమపై దాడికి యత్నించడంతో ఎలాగైనా ఆ విగ్రహాన్ని కిందకు దించాలని పోలీసులు కూడా అంతే స్థాయిలో సిద్ధమయ్యారు. అయితే అర్ధరాత్రి 2 గంటల వరకు అదే ప్రయత్నంలో ఉన్న పోలీసులకు చివరి నిమిషంలో ఏం ఆదేశాలు వచ్చేయో తెలియదు కానీ ఒంగోలు నుంచి వచ్చిన 4 బెటాలియన్ పోలీసులు 3 గంటల తరువాత వెనుతిరిగి వెళ్లిపోయారు. అయినా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఎలాంటి పనులు చేపట్టకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో గ్రామంలో మరో మారు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వీరయ్య వర్ధంతిని అమ్మనబ్రోలు గ్రామంలో నిర్వహించిన ఆయన వర్గీయులు పరుష పదజాలంతో మాట్లాడటంతో పాటు విగ్రహ ఏర్పాటును ప్రతిపక్ష పార్టీలపై నెట్టేలా వీరయ్య అనుచరుడు మాట్లాడటంతో దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు దీటుగా జవాబిచ్చింది. వీరయ్య చౌదరి హత్య జరిగినప్పుడు కూడా దాన్ని వైఎస్సార్ సీపీ మీదకు నెట్టేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. తీరా పోలీసుల విచారణలో టీడీపీలోని వారే ఈ హత్య చేశారని తేలడంతో దాన్ని కప్పిపుచుకునేందుకు నానా తంటాలు పడ్డారు. వీరయ్య విగ్రహ ఏర్పాటును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీలోని మరో వర్గం బహిరంగంగా బయటపడి శనివారం ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ఘాటుగానే స్పందించారు. పేదల పెన్నిధి, మద్యపానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన మహా నాయకుడు ఎన్టీఆర్ పక్కన ఓ లిక్కర్ డాన్ విగ్రహం ఏర్పాటు చేయడం తాము ఏ మాత్రం అంగీకరించేది లేదని మీడియాకు తెలియజేయడంతో పాటు ఇప్పటికే విగ్రహం ఏర్పాటును అడ్డుకుంటూ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ ఘటనలతో గ్రామ టీడీపీతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. పార్టీలో, గ్రామంలో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం కేడర్లో నెలకొంది. గ్రామంలో ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా టీడీపీ నాయకత్వం కానీ ఈ అంశాన్ని చూసీచూడనట్లు వదిలేసింది.


