breaking news
Prakasam
-
యాదవుల ఇలవేల్పు.. కాటమరాజుస్వామి
వేనూతల కాటమరాజుస్వామి మూలవిరాట్ తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు ● తిరునాళ్లకు ముస్తాబైన దేవాలయం పెద్దారవీడు: మండలంలోని గుండంచర్ల పంచాయతీ సమీపంలో నల్లమల అడవిలో వెలసిన పురాతనమైన పుణ్యక్షేత్రం వేనూతల కాటమరాజుస్వామి, గంగాభవానీ ఆలయ తిరునాళ్లను ఈ నెల 18వ తేదీ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు భారీగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉగాది పండుగకు ముందు రోజు యాదవులు గ్రామాల్లో బొల్లావులను ఊరేగించుకుంటూ కాటమరాజుస్వామి దేవాలయం వద్దకు చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. బొల్లావు నిర్మాణం... బొల్లావును యాదవుల ఇలవేల్పుగా ఆరాధించి పూజిస్తారు. రెండున్నర అడుగుల ఎత్తులో తేలికై న కలపతో దీనిని తయారు చేస్తారు. ఎరుపు రంగుతో అందంగా తీర్చిదిద్దుతారు. రెండు తొడలపై ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, డొక్కకు సింహ తలాటం, వీపున నాగబంధం, మూపురం (చెండు)కు ఇరువైపుల శంకు, చక్రాలు, నొసటన గాంభీర్యాన్ని, అందాన్ని చేకూరుస్తాయి. కొమ్ముకు వెండి గొడుగులు, చెవులు, మెడకు ఆభరణాలు వీరతాళ్లు అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు... 18వ తేదీ జరిగే కాటమరాజుస్వామి తిరునాళ్లకు మార్కాపురం డిపో వారు మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి, గిద్దలూరు డిపో నుంచి వయా మాగుటూరు మీదుగా దేవాలయం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
బాబుకు లోకేషే వెన్నుపోటుదారుడు
యర్రగొండపాలెం: మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు వెన్నులో వణకుపుడుతుందని, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెన్నుపోటు పొడిచే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన గ్రామ పంచాయతీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి నాయకులు మోడీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ ఒక వర్గం అయితే, లోకేష్ మరో వర్గంగా యువ నాయకత్వం నడుపుతున్నాడని, ఆయన కళ్లు సీఎం కుర్చీపై పడిందన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చంద్రబాబును గద్దె దించి లోకేష్ ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాట మొదలైందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అరాచక కూటమి ప్రభుత్వం కాలకూటమి లాంటిదని, ఇది పతనం కావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీకి 11 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు పోలైనా ఓకే అజెండాతో ముందుకు వెళుతుందని, ఒంటరిగానే పోటీ చేసే సత్తా ఉన్న పార్టీ పేర్కొన్నారు. అటువంటి ధమ్ము, ధైర్యం కూటమి నాయకులకు లేదని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజల అభిష్టం మేరకు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రజల హర్షధ్వనుల మధ్య తాటిపర్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంటే కూటమి నాయకుల దృష్టిలో మనుషులు కాదని, వారు అధికారంలో ఉన్న సమయంలోనే వారిపై దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కారంచేడు, చుండూరు, నీరుకొండ, పిన్నెల్లి ఘటనలే అందుకు ఉదాహరణలన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే దళితులు ఊచకోతలకు గురవుతారన్న సత్యాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలే రుజువు చేస్తున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ జగనన్న పరితపిస్తుంటారని, ఆ మాటలు చంద్రబాబు నోటితో ఎప్పుడూ వినలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ మూడమంచు బాలగురవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, వివిధ విభాగాల నాయకులు యండ్రపల్లి సుబ్బారావు, ఆర్.అరుణాబాయి, పి.రాములు నాయక్, ఆవుల వీరకోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాట ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం లేని కూటమి నాయకులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
అక్రమంగా నిల్వ ఉంచిన 96 సిలిండర్ల స్వాధీనం
● విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మెరుపుదాడి, కేసు నమోదు పొదిలి రూరల్: మండలంలోని ఏలూరు పంచాయతీలో ఏలూరు, నల్లారెడ్డివారిపాలెంలో శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక ప్రైవేటు గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన పలు గ్యాస్ కంపెనీలకు సంబంధించిన కమర్షియల్ సిలిండర్లు, గృహావసర సిలిండర్లను రెండు మోటార్లతో రీఫిల్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 55 డొమెస్టిక్ సిలిండర్లు, 41 కమర్షియల్ సిలిండర్లు కలిపి మొత్తం 96 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాఘవరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ప్రజల నుంచి సేకరించి కమర్షియల్కు షిఫ్టు చేిసే రెండు మోటార్లు, మిషన్, అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను స్థానిక మహిళలు అడ్డుకోగా, అధికారులు జరిగిన విషయాన్ని వారికి వివరించారు. దీంతో సమస్య సులభంగా పరిష్కారమైంది. దాడుల్లో డీటీ డేవిడ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
తౌషిక్ను హత్య చేసినట్లు ఆధారాలు లేవు
ఒంగోలు టౌన్: సింగరాయకొండ చైతన్య కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఒంగోలు సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తౌషిక్ మృతిపై విచారణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఉరివేసుకోవడం వలనే తౌషిక్ మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందని తెలిపారు. పోస్టుమార్టం చేసి శరీరంలోని ప్రధాన అవయవాలను రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఆర్ఎఫ్ఎస్ఎల్)కి పంపించినట్లు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన సందేహాల మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే స్థానిక అధికారుల పట్ల తౌషిక్ తల్లిదండ్రులు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎస్పీ హర్షవర్థన్రాజు కందుకూరు సీఐ షేక్ అన్వర్బాషాను విచారణాఽధికారిగా నియమించినట్లు తెలిపారు. స్థానిక అధికారుల ప్రమేయం లేకుండా కందుకూరు సీఐ అన్వర్ బాషా విచారణ చేశారని, 70 మంది సాక్షులను, 47 మంది విద్యార్థులను విచారించినట్లు తెలిపారు. అయితే మృతి చెందిన తౌషిక్ ఒకరోజు ముందు తల్లితో మాట్లాడినప్పుడు, చనిపోవడానికి కొద్దిసేపు ముందు తల్లితో మాట్లాడినప్పుడు విచారంగా ఉన్నట్లు సాటి విద్యార్థులు గమనించినట్లు విచారణలో తెలిసిందన్నారు. తల్లిదండ్రులు అనుమానించిన కోణంలోనే మొదట్నుంచి విచారణ జరిపామని, ఇప్పటి వరకు హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ తల్లిదండ్రులు తౌషిక్ మరణాన్ని హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నందున విచారణ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. విలేకరుల సమావేశంలో కేసు విచారణాధికారిగా వ్యవహరించిన కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య పాల్గొన్నారు. -
రెండు బ్యారెన్లు దగ్ధం
● రూ.14 లక్షల ఆస్తి నష్టం వలేటివారిపాలెం: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు బ్యారెన్ను దగ్ధమయ్యాయి. ఈ సంఘటన వలేటివారిపాలెంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..వలేటివారిపాలెం గ్రామానికి చెందిన వలేటివారిపాలెం శ్రీధర్నాయుడు, వలేటి మధుసుదన్రావుకు సంబంధించిన రెండు బ్యారన్లో పొగాకు క్యూరింగ్ చేస్తుండగా శ్రీధర్నాయుడుకు బ్యారన్లో అల్లుడు కర్ర జారీ మొద్దు గొట్టంపై పడటంతో మంటలు చెలరేగాయి. పంటలు పక్కనున్న బ్యారన్కు కూడా వ్యాపించడంతో రెండు బ్యారెన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు కందుకూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటాన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు బ్యారెన్లలోని టైర్లు, క్రరలు, మొద్దు గొట్టాలు, పొగాకు మొత్తం కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.14 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని యజమానులు వాపోయారు. ఒంగోలు టౌన్: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను తీసుకొస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని, ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ సర్పంచ్లనే ఇన్చార్జిలుగా నియమించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లకోసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించడం కుదరనప్పుడు ప్రజల తరఫున సర్పంచ్లను కొనసాగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. 2000లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు ఆదేశాల మేరకు సర్పంచ్లను ఇన్చార్జిలుగా కొనసాగించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేక పాలన కొనసాగించారని, తద్వారా గ్రామ పంచాయతీలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారులున్నా ప్రజల తరఫున సర్పంచ్లను ఇన్ చార్జిలుగా కొనసాగించాలని కోరారు. -
చిరుతపులి కలకలం
గిద్దలూరు రూరల్: మండలంలోని తిమ్మాపురం గ్రామశివారులోని పంట పొలాల్లో ఆదివారం చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందారు. గుండ్లకమ్మరేంజి రాచర్ల బీటు పరిధిలోని తిమ్మాపురం సమీపంలోని అటవీప్రాంతంలో నుంచి ఓ చిరుతపులి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లోకి రావడంతో రైతులు భయాందోళన చెందారు. రైతుల సమాచారం మేరకు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి, రేంజ్ ఆఫీసర్ పీవీ నరసింహారావు, డీఆర్ఓ వంశీక్రిష్ణ వారి సిబ్బందితో సహా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అప్రమత్తం చేశారు. చిరుత పులికి సుమారు రెండు నుంచి మూడేళ్ల వయసు ఉంటుందని రైతులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీశాఖ అధికారులు అటు వైపు ఎవ్వరిని వెళ్లనివ్వకుండా డ్రోన్ కెమెరాల సహాయంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. -
అల్లాహ్ స్మరణ.. అన్నివేళలా రక్షణ
కనిగిరి రూరల్: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం చివరి దశకు చేరుకుంది. రంజాన్ నెలలో 26 రోజుల కఠోర ఉపవాస దీక్షలు పూర్తయిన తర్వాత ఆఖరి మూడు రోజులకు ముందు వచ్చే షబ్–ఏ ఖదర్ (లైలతుల్ ఖదర్)ను సోమవారం ముస్లింలు అత్యంత నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. రాత్రి మసీదుల్లో ప్రత్యేక నమాజులు, ఆరాధనలు, ప్రార్థనలు చేసి అల్లాహ్ అనుగ్రహం కోసం వేడుకుంటారు. షబ్ –ఏ–ఖదర్ తర్వాత ఆఖరి మూడు రోజుల ఉపవాస దీక్షలు (సతామీ) ప్రారంభమవుతాయి. రంజాన్ నెల ప్రారంభం నుంచి ఉపవాస దీక్షలు ఉండలేని వారు ఆఖరి మూడు రోజులు మాత్రం తప్పకుండా ఆచరిస్తారు. ఎతికాఫ్ ఇలా... ఎతికాఫ్ (తపోనిష్ట)తో అల్లాహ్ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ఇతరులకు సమస్యగా ఉండకూడదని మసీదులోని ఓ మూలలో డేరా (పర్దా) ఏర్పరుచుకుంటారు. మల, మూత్ర విసర్జన (శుద్ధి, స్నానం) వజూ సమయాల్లోనే ‘పర్దా’లో నుంచి బయటకువస్తారు. మిగతా సమయం అంతా దైవస్మరణలో ఖురాన్ చదువుతూ, సున్నత్ నమాజులు చదువుతూ గడపుతారు. సీ్త్రలు ఇంట్లోనే ఓ ప్రత్యేక గది ఏర్పరుచుకుని ఎతికాఫ్ చేస్తారు. ఇఫ్తార్ సమయం కంటే ముందు 12 రకాతులు తహజూద్ నమాజ్ చదవాలి. ఆ సమయంలో ‘సజ్దా’ పద్ధతిలో దువా చేస్తే అల్లాహ్ అత్యంత సమీపం నుంచి వారి మొర వింటారు. కుటుంబం యోగక్షేమాలతో పాటు బంధుమిత్రులు, సర్వమానవాళి సంక్షేమం కోరుతూ దువా చేయడం ఉత్తమం. అలా చేస్తే అల్లాహ్ అనుగ్రహం లభిస్తోందని మౌలీలు, ముఫ్తిలు తెలిపారు. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో కనీసం ఒకరోజైనా సున్నతే మౌఖిదా ఎతికాఫ్ పాటించాలి. ఎతీకాఫ్ నియ్యత్ ఇలా... నవాయితు అన్ బిస్మిల్లాహి, తవక్కల్తు వలైహీ దఖల్తూ వనవాయితూ బిసున్నతిల్ ఎతికాఫ్ (ఎతికాఫ్కి నియ్యత్) చదివి ముస్లింలు ఎతికాఫ్ ఆచరిస్తారు. అల్లాహ్ కోసం అన్నింటిని త్యజించి, దైవ సన్నిధికి వెళ్లి ఆధ్యాత్మికతలో విలీనమై కష్టాలు, బాధలు, సమస్యలు చెప్పుకుంటే అల్లాహ్ వారిపై అత్యంత కరుణ చూపి వారి మొరను దగ్గర నుంచి అల్లాహ్ ఆలకిస్తారని ముస్లింల విశ్వాసం. నేడు షబ్–ఏ–ఖదర్ రంజాన్ నెల చివరి మూడు రోజుల దీక్షలు (సతామీ) షురూ నియమ నిష్టలతో తాఖ్రాత్లు మసీదుల్లో కొనసాగుతున్న ఎతీకాఫ్ దీక్షలుఇస్లాంకు ఉన్న ఐదు మూల స్తంభాలలో జకాత్ ఒకటి, ఇది ఆరాధనలో రెండో విధి. ఇస్లాం పవిత్ర గ్రంథంలో జకాత్ గురించి ప్రస్తావన కనీసం 32 సార్లు ఉంది. దీని బట్టి జకాత్కు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతోంది. ఇది పేదల హక్కు. అవసరార్థులకు జకాత్ చెల్లించే సదాచారుల కోసం దేవుని వద్ద ప్రతిఫలం సిద్ధంగా ఉంటుంది. ప్రతి ముస్లిం తన సంపాదనలో రెండున్నర శాతం పేదలకివ్వాలన్నది జకాత్ ఉద్దేశం. నమాజ్ వలే ఇది కూడా తప్పనిసరి నియమం. ఇస్లాంను ఆచరించే వారు దీనిని విస్మరించరాదు. -
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
పేద రోగుల ప్రాణాలకు అండగా ఉండాల్సిన జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో నాడిపట్టే నాథుడు లేక రోగులు అల్లాడుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో సీనియర్ వైద్యులు, హెచ్ఓడీలు హాజరుకే పరిమితమై..రోగులను జూనియర్లకు అప్పగిస్తుండగా.. మార్కాపురం జిల్లా వైద్యశాలలో అసలు వైద్యులే లేకుండా పోయారు. మౌలిక వసతుల కొరతా వేధిస్తోంది. మందులు కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. జిల్లా వైద్యశాలలపై సాక్షి విజిట్...రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ వైద్యశాలకు ఎంతో నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యసేవలు కోసం దూరప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే గతంలో ఉన్న స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతోపాటు ఉన్న వైద్యులను, వైద్య సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వైద్యశాలకు రోగులు అంతంతమాత్రంగా వస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలపై నమ్మకం కలిగించి వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. సరైన వైద్యం అందక నగదు చెల్లించి ప్రైవేటు వైద్యశాలను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. – గొలమారి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీపట్టణ ప్రధాన కార్యదర్శి -
మహిళలకు బూచేపల్లి పెద్దపీట
● దర్శి నియోజకవర్గంలో మహిళల కోసం రూ.1.25 కోట్లు మంజూరు ● ఈ నిధులతో ప్రతి మండలంలో మహిళా భవన్ల నిర్మాణం దర్శి: జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మహిళలకు పెద్ద పీట వేశారు. దర్శి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న వెంకాయమ్మ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానికి మహిళలపై ఉన్న తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఉమెన్ అండ్ వెల్ఫేర్ పథకం ద్వారా జిల్లా పరిషత్ నిధులతో ఒక్కో మండలానికి రూ.25 లక్షల చొప్పున దర్శి నియోజకవర్గానికి రూ.1.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రతి మండల కేంద్రంలో మహిళా భవన్లు నిర్మించనున్నారు. ఈ భవనాల ద్వారా మహిళలకు శిక్షణ తరగతులు, చేతి వృత్తులు, వంటి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉపయోగించనున్నాయి. మండల కేంద్రాల్లో నిర్మించే ఈ భవనాల వలన మహిళలకు ఎంతో మేలు చేకూరనుంది. ఒంగోలు టౌన్: దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ భావజాలంలో పరిపాలిస్తున్న మోదీ పాలనలో హిట్లర్ను గుర్తుకు తెస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కృష్ణకాంత్ విమర్శించారు. నగరంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ మనోహర్ అధ్యక్షత వహించిన ఈ సభలో కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ సామ్రాజ్యవాద దేశాల ముందు జీ హుజూర్ అంటూ తలొగ్గుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక ఉద్యమాలను అణచివేసేందుకే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారని చెప్పారు. లేబర్ కోడ్స్ అమలుకు ముందే కార్మిక ఉద్యమాలను బలహీనపరిచే చర్యలు చేపట్టారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పీపీపీ పద్ధతి అమలు చేయడం వలన అవినీతి పెచ్చుమీరిపోతుందని, నిరుపేదలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టాన్ని పునరుద్ధరించాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో డా.ఏ.శ్రీనివాసరావు, రవికుమార్, ఐ.కృష్ణ మోహన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
దైవాధీనం
పేదల ప్రాణం..మార్కాపురం జీజీహెచ్లో రోగులు లేక ఖాళీగా ఉన్న బెడ్లు ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఉండగా, మార్కాపురంలో జిల్లా ఆస్పత్రి ఉంది. జిల్లా వైద్యశాలను సాక్షి బృందం పరిశీలించింది. రెండు చోట్లా రోగులకు అరకొర వైద్యమే అందుతోంది. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు, హెచ్ఓడీలు కనిపించడం గగనమైపోయింది. ఈ ఆస్పత్రికి ప్రతి రోజూ వివిధ రకాల వైద్య సేవల కోసం సుమారు 1000 నుంచి 1500 మంది వరకు వస్తుంటారు. పెద్దాస్పత్రికి వెళితే అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారని, వైద్యం బాగుంటుందన్న ఆశతో వచ్చే రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సీనియర్లు ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహించుకుంటూ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులతో పనికానిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంగోలు జీజీహెచ్లో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలతో పాటు పల్నాడు జిల్లాలోని వినుకొండ, శావల్యాపురం, నూజండ్ల, బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం మండలాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. చిన్న చిన్న వ్యాధులకు స్థానికంగా ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేయించుకునే గ్రామీణ నిరుపేదలు దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు జీజీహెచ్కు వస్తుంటారు. అయితే క్యాజువాలిటీలో ఎప్పుడు చూసినా జూనియర్ వైద్యులే కనిపిస్తున్నారని, సీనియర్ వైద్యులు ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఓపీలో ఒకరిద్దరు సీనియర్లు డ్యూటీలు చేస్తే గొప్ప అన్నట్లు తయారైంది. ఇక్కడ పేరుకు ఎంఐసీయూ, ఎన్ఐసీయూ, ఆర్ఐసీయూ, పీఐసీయూ, ఎస్ఐసీయులు ఉన్నాయి. ఇక్కడ స్పెషలిస్ట్ వైద్యులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని, పీజీ విద్యార్థులే దిక్కయ్యారని రోగులు చెబుతున్నారు. ఖాళీగా ట్రామా కేర్... ఒంగోలు చుట్టు పక్కల ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా క్షతగాత్రులను జీజీహెచ్కు తీసుకొస్తుంటారు. క్యాజువాలిటీలో ఒక చిన్నగదిలో రెండు పడకలు వేసి ట్రామా కేసుల కోసం కేటాయించారు. ట్రామా కేర్లో ఒక న్యూరాలజిస్ట్, ఒక మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లతో కలిపి మొత్తం 30 మంది వరకు ఉండాలి. కానీ వారిని ఇతర విభాగాల్లో డ్యూటీలు వేస్తున్నట్లు సమాచారం. ట్రామా కేసుల కోసం ప్రత్యేక సిబ్బంది ఉన్నారోలేదో, అసలు ట్రామా విభాగం ఉందో లేదో తెలియని పరిస్థితి. ట్రామా కేర్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సింగ్ సేవలు అంతంత మాత్రమే... జీజీహెచ్లో కనీసం 300 మంది వరకు ఇన్ పేషంట్లు ఉంటారు. జనరల్ వార్డులు, అత్యవసర వార్డుల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని రోగులు, వారి సహాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. వార్డుల్లో విధులు నిర్వహించాల్సిన స్టాఫ్ నర్సులు సెల్ఫోన్లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, నర్సింగ్ విద్యార్థినులకు పనులు అప్పచెప్పి టైం పాస్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా కొందరు నర్సింగ్ స్టాఫ్ తరచుగా రోగులతో ఘర్షణ పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నర్సింగ్ స్టాఫ్ కు డ్యూటీలు వేసేందుకు లంచాలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నడవలేని స్థితిలో రోగులు జీజీహెచ్కు వస్తే వారికి వీల్చైర్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. ఒక వేళ వీల్చైర్ దక్కించుకున్నా రోగుల కుటుంబ సభ్యులే తోసుకెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో డాక్టర్ల కొరత మార్కాపురం టౌన్: మార్కాపురం జీజీహెచ్లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందేది. కరోనా సమయంలో కూడా ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించి ఎప్పటికప్పుడు వైద్యశాల సిబ్బంది రోగులను పర్యవేక్షిస్తూ వారికి వైద్యం అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వైద్యానికి పెద్దపీట వేసింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ వైద్యశాలలో సరైన మందులు, స్పెషలిస్టు వైద్యులు, వైద్య సిబ్బంది నియమించకపోగా ఉన్న సిబ్బందిని, వైద్యశాలలో ఉన్న పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లినా తమకు వచ్చిన రోగాలు నయమవుతాయో లేదో అన్న అనుమానంలో ప్రజలు వైద్యశాలకు వెళ్లడం తగ్గించారు. గత ప్రభుత్వంలో 100 పడకలు ఉన్న వైద్యశాలను 330 పడకల వైద్యశాలగా మార్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు, నాన్ క్లినికల్ వైద్యులతో కలిపి సుమారు 70 మంది వైద్యసేవలను అందించారు. రోజుకు 600 నుంచి 700 ఓపీ సేవలతో కిటకిటలాడేది. అయితే అప్పుడున్న వైద్యుల సంఖ్యను తగ్గించడంతోపాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వైద్యుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వైద్యశాలలో అందుతున్న సేవలు తగ్గిపోవడంతో రోగుల సంఖ్య ప్రస్తుతం 100 నుంచి 150కి ఓపీలకు పడిపోయింది. గతంలో 330 బెడ్లకు గానూ ఇన్ పేషంట్లు 200 మంది ఉండగా ప్రస్తుతం 20 నుంచి 30 మంది రోగులు మాత్రమే ఇన్పేషంట్లుగా కనిపిస్తున్నారు. వైద్యశాల నుంచి బ్లడ్బ్యాంకు వైపు వెళ్లే ప్రాంతాల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం సుమారు 15 మంది వైద్యులు ఉండగా 55 మందిపైగా రోగులకు సేవలు అందిస్తున్నారు. వైద్యశాలకు వెళ్లే కొద్దిమందికి కూడా కనీస అవసరమైన జలుబు, దగ్గు మందులు కూడా లేవని ఫార్మాసిస్టు తెలపడంతో బయటకు వెళ్లి కొనుగోలు చేసి వాడుకోవాల్సి వస్తోంది. ఇన్పేషంటు వార్డుల్లో రోగులు లేక అన్నీ బ్లాకుల్లో ఏర్పాటు చేసిన బెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పరికరాలను కూడా గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించారు. రోగులు లేక వైద్యశాలలో నూతన బెడ్లు మూలనపడి పాడైపోతున్నాయి. బాలింతలకు స్కానింగ్ చేసే రేడియాలజిస్టు పోస్టు లేకపోవడంతో గైనకాలజిస్టుతోనే బిడ్డ ఆరోగ్య పరిస్థితి చెబుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే బయటి స్కానింగ్ సెంటర్లను బాలింతలు ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో పేషంట్లతో కిటకిటలాడిన జీజీహెచ్ ప్రస్తుతం పేషంట్లు లేక వెలవెలబోతోంది. జీజీహెచ్లో స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ ప్రజలకు వైద్యం అందడం లేదు. సోమ, గురువారం న్యూరాలజీ రోగులకు ఓపీ ఉంటుంది. గుండె జబ్బుల ఓపీ మంగళ, గురువారం ఉంటుంది. యూరాలజీ ఓపీ బుధ, శనివారం చూస్తారు. ఒకసారి చూపించుకోవడానికి ఒకపూట పడుతుంది. ఆ తరువాత అవసరమైనా ఆ వైద్యులు కనిపించరు. డాక్టర్ కోసం ఆరా తీస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని చెబుతుంటారు. అక్కడకు వెళ్లి అడిగితే ఓపీలో ఉన్నట్లు సమాధానం వస్తుంది. తీరా చూస్తే సొంత ఆస్పత్రిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో విసుగెత్తిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు మాత్రం జీజీహెచ్లో జీతాలు తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. -
అటెన్ షన్ !
మార్కాపురం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 165 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచే ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటైన తరువాత మొదటిసారి జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్రాజు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 28,632 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో ఈ దఫా 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా 14,596 మంది హాజరు కానున్నారు. ఇందులో ఏ గ్రేడ్ సెంటర్లు 42, బీ గ్రేడ్ సెంటర్లు 26, సీ గ్రేడ్ సెంటర్లు 49గా అధికారులు గుర్తించారు. ఉదయం 9.30 నుంచి గం.12.40 వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఏ గ్రేడ్ సెంటరు అంటే పోలీసు స్టేషన్కు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాలు, బీ గ్రేడ్ సెంటరు అంటే పోలీసు స్టేషన్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రాలు, సీ గ్రేడ్ సెంటరు అంటే అంతకంటే దూరంలో ఉన్న కేంద్రాలుగా విభజించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలు ఇవే... మార్కాపురం జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్ల జెడ్పీహెచ్ఎస్, పెద్దారవీడు మండలంలోని వైడిపాడు జెడ్పీహెచ్ఎస్, సీఎస్పురం మండలంలోని సీఎస్పురం జెడ్పీహెచ్ఎస్, మండల కేంద్రమైన కొమరోలు జెడ్పీహెచ్ఎస్, అర్ధవీడు మండలంలోని యాచవరం జెడ్పీహెచ్ఎస్, మండల కేంద్రమైన రాచర్ల జెడ్పీహెచ్ఎస్, యర్రగొండపాలెం పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్, హెచ్ఎంపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేకమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకూ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు కూడా జరగనున్నాయి. మొత్తం 1144 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు హాజరుకానున్నారు. ఇందుకోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించింది. -
అన్నీ ఏర్పాట్లు పూర్తి
సోమవారం నుంచి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 87 పరీక్ష కేంద్రాల్లో 14,596 మంది పరీక్షలు రాస్తున్నారు. గదుల్లో వారికి అన్నీ ఏర్పాట్లు చేశాం. తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయిస్తున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా పరీక్షలు రాయాలి. కాపీయింగ్కు పాల్పడితే చర్యలు చేపడతాం. – మామిళ్లపల్లి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ డీఈఓ మార్కాపురం జిల్లా 144 సెక్షన్ అమలు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. అన్నీ జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, సిబ్బంది తప్ప బయట వ్యక్తులెవరూ ఉండకూడదు. సమస్యాత్మక కేంద్రాలపై కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత కల్పిస్తున్నాం. ఎటువంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలి. మొబైల్, పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశాం. ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా కేంద్రాలను తనిఖీ చేస్తారు. – హర్షవర్ధనరాజు, ఇన్చార్జి ఎస్పీ మార్కాపురం జిల్లా -
ఔను..వాళ్లిద్దరూ రాజీ పడ్డారు !
ఒంగోలు టౌన్: మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నట్లు అన్నదమ్ముల మధ్య 40 ఏళ్లుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ కేసును శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గంలో పరిష్కరించారు. ఒంగోలు రూరల్ మండలం కొప్పోలు గ్రామానికి చెందిన అన్నాదమ్ములు, వారి వారసుల మధ్య 1986వ సంవత్సరం నుంచి ఆస్తులకు సంబంధించి బాడుగ పంపిణీ వివాదం కొనసాగుతోంది. ఇరు వర్గాలు పట్టుదలకుపోవడంతో ఏ ఒక్కరూ ఒక మెట్టు దిగడానికి ససేమిరా అనడంతో కేసు పీఠముడి పడింది. 40 ఏళ్లుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్న అన్నాదమ్ములు, వారి వారసులను పిలిపించి మాట్లాడిన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్.హేమలత సమస్యకు ఒక పరిష్కారమార్గం కనుగొన్నారు. ఇరు వర్గాలు దాన్ని ఆమోదించడమే కాకుండా జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడేందుకు అంగీకరించారు. ఎట్టకేలకు 40 ఏళ్ల కేసును రాజీ మార్గంలో పరిష్కరించడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇరువర్గాలు రాజీపడినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి ప్రకటించారు. లోక్అదాలత్లో 16,860 కేసుల పరిష్కారం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 16,615 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి లోక్ అదాలత్ కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ న్యాయస్థానాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 231 సివిల్ కేసులు, 16,615 క్రిమినల్ కేసులు, 14 పీఎల్సీ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులకు సుమారుగా రూ.5 కోట్ల పరిహారం ఇప్పించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 27 బెంచీల్లో వ్యాజ్యాల పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించినట్లు తెలిపారు. -
పునరావాస కాలనీలో పనులు వేగవంతం చేయండి
మార్కాపురం టౌన్: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు కేటాయించిన పునరావాస కాలనీల్లో పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, మార్కాపురం, అర్ధవీడు, పెద్దారవీడు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇంత వరకూ ఎంత నగదు చెల్లించారు. ఇంకా చెల్లించాల్సిన నగదు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది జూలై నాటికి ప్రాజెక్టు ద్వారా నీరొస్తే గ్రామాల పరిస్థితి, రోడ్ల అనుసంధానం, ఇతర మార్గాలపై చర్చించారు. పునరావాస కాలనీల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించాలని, రెండు రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని, నివేదికను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. పెద్దారవీడు మండలంలోని వీఆర్ఓలు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూత్ అలీం, మార్కాపురం ఎస్డీసీ సత్యనారాయణ, కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ల అభివృద్ధే ముఖ్యమా ?
ఒంగోలు టౌన్: పాలకులు ప్రజల ఆరోగ్యం కంటే కార్పొరేట్ల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి ఽవిమర్శించారు. నూతన ఆర్ధిక విధానాల అమలు తరువాత విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరమైందని, నిరుపేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారిపోయాయని చెప్పారు. నగరంలోని అంబేడ్కర్ భవనంలో శనివారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నానా హంగామా చేసిందని, అంతటి బూటకం మరొకటి లేదని చెప్పారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మందులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి ఔషధాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలను పునరుద్ధరించాలని, ప్రజారోగ్యానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రజారోగ్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ జపం చేస్తోందని, మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నేరుగా నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రమణయ్య మాట్లాడుతూ.. పేదలకు మందులు ఉచితంగా అందజేయాలని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఎఫ్ఎంఆర్ఏఐ జాతీయ అధ్యక్షుడు కృష్ణానంద్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్లు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా వివరించారు. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై యూనియన్ పోరాటాలు చేస్తుందని తెలిపారు. సభలో కె.సీతారామయ్య, సీహెచ్ వెంకటరావు, సీహెచ్ కుమార్, జి.శ్రీనివాస్, ఎం.అయ్యపురెడ్డి, ఈదర అన్నపూర్ణ, ఎం.రమేష్, కాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా కొండారెడ్డి
పామూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన అంబటి కొండారెడ్డిని నియమించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ తనకు పదవి రావడానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, మండలపార్టీ అధ్యక్షుడు గంగసాని హుసేన్రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంబటికి పలువురు అభినందనలు తెలిపారు. మార్కాపురం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలానికి వెళ్లే భక్తుల కోసం మార్కాపురం డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డిపో మేనేజరు లావణ్య తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం నుంచే శ్రీశైలానికి మార్కాపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించామని, ప్రతి రోజూ 5 నుంచి 6 బస్సులను ప్రయాణికుల కోసం నడుపుతున్నామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు నుంచి ఈ బస్సులు వెళ్తాయన్నారు. ఈనెల 19 నుంచి 25 బస్సులు శ్రీశైలానికి మాత్రమే వెళ్తాయని, అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని ఆమె చెప్పారు. ఈనెల 18వ తేదీ పెద్దారవీడు మండలంలో జరిగే కాటంరాజు తిరునాళ్లకు మార్కాపురం డిపో నుంచి 13 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులు వెళ్లాలని చెప్పారు. అవసరమైతే కాటంరాజు గుడి వద్దకు ఇంకా బస్సుల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం, శనివారాల్లో శ్రీశైలానికి వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నల్లమల ఘాట్ రోడ్డు మొత్తం కర్నాటక నుంచి వచ్చే భక్తులతో, శివన్నామస్మరణతో మార్మోగుతోంది. ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని గ్యాస్ వినయోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూంను ఒంగోలు ప్రకాశం భవన్లోని కలెక్టర్ కాన్ఫరెన్సు హాలులో నం:1077ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్ పద్మ శ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జిల్లా యంత్రాంగం గ్యాస్ సరఫరా పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గృహ అవసరాలకు, అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరా నిరంతరం జరుగుతుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల కారణంగా రీఫిల్ బుకింగ్లు పెరిగినా మొదట బుక్ చేసిన వారికి మొదట అందిస్తారన్నారు. వినియోగదారులు ఒకే సారి ఎక్కువగా గ్యాస్ బుకింగ్లను చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. గ్యాస్ను వాట్సాప్, మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. -
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
చిల్లకర్ర కొట్టడానికి కూలీలు వెళ్తున్న ఆటోను కారు ఢీకొనడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చల్లని గాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది.జిల్లా అభివృద్ధికే కాదు, రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2024 చివరి నాటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సాగిన పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా పడకేశాయి. ఈ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. కీలకమైన బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్, బ్రేక్వాటర్ ఫీడర్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి కీలక పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు. దీంతో పోర్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని ప్రశ్నగా మిగిలింది. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం పోర్టు ప్రారంభంపై నెలకో తేదీ చెప్తూ కాలయాపన చేస్తున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే తేదీలపై అటు మారిటైంబోర్డు అధికారులు, ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన మారిటైంబోర్డు అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పోర్టు అందుబాటులోకి వస్తుందని ప్రకటిస్తే, ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో పోర్టు పనుల పూర్తిపై ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి చూస్తే మరో రెండు, మూడేళ్లకు కూడా పోర్టు నిర్మాణ పనులు పూర్తికావనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా కీలకమైన బెర్తుల నిర్మాణం (ఫైల్) పోర్టుకు సర్కారు పోటు -
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. శనివారం విద్యాశాఖ అదనపు సంచాలకుడు, జిల్లా పరిశీలకుడు ఏ.సుబ్బారెడ్డి, పరీక్షల నిర్వహణ విభాగ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావులతో కలిసి ఆమె ఒంగోలు సంతపేటలోని డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఇవి విద్యాపరమైన పరీక్షలు కాబట్టి 30 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఉందన్నారు. హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని గుర్తించవచ్చని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్ లను మూసివేయిస్తామని, పోలీసుల ద్వారా అవసరమైన బందోబస్తు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షల నిర్వహణ ఇలా... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈఓ తెలిపారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, 10 బాలికలు ఉన్నారన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన వారు 1144 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లను, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. పబ్లిక్ పరీక్షలు ముగిశాక ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందన్నారు. -
ఏకేయూలో కెమిస్ట్రీ, ఆక్వా కల్చర్ ల్యాబ్లు
ఒంగోలు సిటీ: ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజీలో కొత్త రసాయన శాస్త్రం, ఆక్వాకల్చర్ విభాగాల కోసం ఏర్పాటు చేసిన వైస్ చాన్సలర్ డీవీఆర్.మూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఈ ఆధునిక ప్రయోగశాల విద్యార్థులకు పరిశోధన కార్యకలాపాలు, నాణ్యమైన శాసీ్త్రయ శిక్షణ అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త ప్రయోగశాలల ఏర్పాటుకు సహకరించిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, హెడ్ అఫ్ ది డిపార్టుమెంట్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోగిక శిక్షణను మెరుగుపరచడం, శాసీ్త్రయ పరిశోధనలను ప్రోత్సహించడం, నైపుణ్యాధారిత విద్యను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి మాట్లాడుతూ యూనివర్సిటీ కాలేజీలో నూతన ప్రయోగ శాల ఏర్పాటు చేయడం సంతోషకరమని, అలాగే మరికొన్ని ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొననున్నారు. -
అన్నదాతకు వంచన
అన్నదాత సుఖీభవ రావడం లేదు మాకు గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద డబ్బులు వచ్చాయి. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. పొలం నాపేరున ఉన్నా ఈ ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవ రెండో విడతలో రాలేదు. ఇప్పుడు కూడా రాలేదని చెబుతున్నారు. నా వయసు 65 సంవత్సరాలు. పిల్లలు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఈ పథకం నాకు వర్తిస్తే బాగుండేది. కానీ నాకు ఈ పథకంలో పేరు లేకుండా పోయింది. దీనిపై సచివాలయంలో అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – నలమలపు ఈశ్వరమ్మ, గురవారెడ్డిపాలెం, మద్దిపాడు మండలం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. 2024 ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ప్రతి రైతుకు రూ.20 వేలు అక్షరాలా ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రైతులకు వ్యవసాయ పెట్టుబడి ఎగనామం పెట్టాడు. చివరకు రెండో ఏడాదిలో అయినా సకాలంలో ఇచ్చాడా అంటే అదికూడా లేదు. మే నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఆగస్టులో రెండో విడత ఇవ్వాల్సిన సాయం రూ.5 వేలు రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ చేశాడు. అంటే మొదటి విడతతో కలిపి రూ.10 వేలు ఇవ్వాల్సి ఉంటే ఒక విడత మాత్రమే ఇచ్చి మ..మ..అనిపించాడు. 2026 ఆగస్టు రెండో తేదీన మొదటి విడత పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభించారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఎర్రటి ఎండలో రైతులను మంచాల మీద కూర్చోబెట్టి నానా అవస్థల పాలు చేశాడు. అయితే ఆ రోజు చంద్రబాబు మనస్సులోని మాటను బయట పెట్టకనే పెట్టాడు. ‘‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు...ఉండబోదు...ఇది నా ప్రామిస్’’ అని స్వయానా చంద్రబాబు పలికాడు. ఒక్కోసారి ఎంత దాచుకుందామన్నా మనస్సులోని మాటలు అస్సలు దాగవు కదా.. మూడో విడతలో 72,081 మంది రైతులు పెరిగారట... అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారులైన రైతులు మూడో విడతలో 72,081 మంది రైతులు పెరిగారని అధికారులు లెక్కలు కట్టారు. ఒక పక్క రైతులు పథకం డబ్బులు పడలేదని, అనేకరకాల కొర్రీలు పెట్టి అర్హులైన రైతులను కూడా జాబితాల నుంచి తొలగించారని మొత్తుకుంటుంటే అధికారులు మాత్రం కాకి లెక్కలు చూపించి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పీఎం కిసాన్ పథకంలో మొత్తం 2,31,383 మంది రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. కానీ అన్నదాత సుఖీభవ పథకం కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులను వెరిఫై చేసి 4,38,251 రైతుల జాబితాను సిద్ధం చేశారు వ్యవసాయ అధికారులు. ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. అందులో ఆర్ఐజీఎస్ పరిధిలో ఆ జాబితాను పరిశీలించి 2,72,824 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి ఈకేవైసీ పూర్తి చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు. చివరకు అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 2,68,168గా తేల్చారు. ప్రస్తుతం మూడో విడతకు వచ్చే సరికి ప్రకాశం జిల్లాలో 1,88,056 మంది, మార్కాపురం జిల్లాలో 1,52,190 మంది మొత్తం కలిపి 3,40,246 మంది రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. చివరకు ఇవన్నీ కాకిలెక్కలేనని తేలిపోయింది. కౌలు రైతుల ఊసే ఎత్తకుండా, లబ్ధిదారుడైన భర్త చనిపోయినా భార్య పేరు జాబితాలో చేర్చకుండా, కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించకుండా లబ్ధిదారుల జాబితాను పెంచి చూపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా అంత మందికి అకౌంట్లలో నగదు జమకావడం లేదని తెలుస్తోంది. రెండు విడతల్లో 90 వేల మందికి పైగా ఎగనామం... అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో గతంలో ఇచ్చిన రెండు విడతల్లో దాదాపు 90 వేల మందికి పైగా బ్యాంకుల్లో జమ కాలేదు. రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సాంకేతికపరమైన సమస్యల వల్ల పడలేదు. తరువాత జమవుతాయని నమ్మబలికారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఆ రెండు విడతల్లో రావాల్సిన పెట్టుబడి సాయం రానేలేదు. మూడో విడతలో కూడా అనేక రకాలుగా కోతలు విధించారు. కానీ లబ్ధిదారులు పెరిగారని అధికారులు అంకెల గారడీ చేసి చూపిస్తున్నారు. మోంథా తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. గతంలో ఎన్నడూ పడనంతగా ఒక్కరోజులోనే 26 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పొలాలు, రోడ్లు చెరువులను తలపించాయి. దాదాపు 60 వేల ఎకరాలకు పైగా నష్టం సంభవిస్తే కేవలం 30 వేల ఎకరాల లోపే నష్టం జరిగిందని అంచనాలు పంపించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మోంథా తుపాను నష్టం ఒక్క రూపాయి కూడా జిల్లా రైతాంగానికి రానేలేదు. ఆ తుపానుతో పంటలు పూర్తిగా పాడైపోయి రైతులు మళ్లీ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇంత వరకు అప్పటి పంట నష్టం రాకపోవటంతో రైతన్నలు అప్పుల పాలై అల్లాడిపోతున్నారు. -
ఫార్మా రంగంలో కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి
● మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డిమాండ్ ఒంగోలు టౌన్: ఫార్మా రంగంలో కార్పొరేట్ దోపిడీని అరికట్టాలని, మెడికల్ రెప్రజెంటేటివ్స్కు నష్టం కలిగించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కుమార్ డిమాండ్ చేశారు. శని, ఆదివారాలలో ఒంగోలులో జరిగే యూనియన్ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో శుక్రవారం అంబేడ్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని ఐడీపీఎల్ వంటి ఫార్మా కంపెనీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపి వేయాలని, నిత్యావసర, అత్యవసర మందుల ధరలను తగ్గించాలని కోరారు. నకిలీ, నాసిరకం మందుల తయారీ, విక్రయాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకటరావు మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీలకు, కార్మికులకు నష్టం కలగజేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పోరాడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్–1976ను పునరుద్ధరించాలని కోరారు. కచ్చితమైన పని విధానాలకు రూపొందించాలన్నారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీని వెంటనే సమావేశ పరిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమస్యల సాధన కోసం రిప్రజెంటేటివ్లు ఐక్యతగా పోరాడాలన్నారు. సమావేశంలో యూనియన్ జాతీయ, రాష్ట్ర నాయకులు జి.మనోహర్, యుఎస్ రవికుమార్, ఐకే కృష్ణ మోహన్, సీహెచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
సిలిండర్
మార్కాపురం: ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం వంటింట్లో గ్యాస్ కష్టాలు తెచ్చింది. గ్యాస్ కొరత ఏర్పడనుందన్న సమాచారంతో ఒక్కసారిగా అందరూ ఆన్లైన్లో గ్యాస్ను బుక్ చేయడంతో సర్వర్లు పనిచేయక తిప్పలు పడుతున్నారు. ఓటీపీ వస్తేనే గ్యాస్ సిలిండర్ డెలవరీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరఫరా తగ్గిపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ల డెలివరీ టెన్షన్ భరించలేక తల పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కొరత ప్రారంభమైంది. బుకింగ్ సమయాన్ని 21 రోజుల నుంచి 40 రోజులకు పెంచారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్ బుకింగ్కు కాల్ సెంటరుకు ఫోన్ చేయడంతో సర్వర్ మొరాయిస్తోంది. దీంతో గ్యాస్ బుక్ అవ్వక, సిలిండర్ రాదేమోనన్న ఆందోళన మహిళల్లో ఏర్పడింది. తాత్కాలికంగా విద్యుత్ పొయ్యిలను, ఇండెక్షన్ స్టవ్లను బయటకు తీస్తున్నారు. హోటల్ నిర్వాహకులు కూడా అతి పొదుపుగా వాడుతున్నారు. మార్కాపురంలో ఒక్కొక్క గ్యాస్ ఏజెన్సీకి రోజుకు 2 లారీల లోడ్ వస్తోంది. అయితే మూడు రోజుల నుంచి రెండు రోజులకు ఒక లోడ్మాత్రమే రావడంతో డెలివరీ ఆలస్యమవుతోంది. ప్రధానంగా హోటల్స్, చిరువ్యాపారులకు, టిఫిన్ బండ్ల నిర్వాహకులకు కమర్షియల్ సిలిండర్ అవసరం ఎక్కువగా ఉంది. గ్యాస్ ధర పెంచినప్పటికీ సిలిండర్ సకాలంలో అందితే చాలనే భావన ఏర్పడింది. ప్రతి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ బుక్ చేసుకునేవారి సంఖ్య రోజుకు 400 నుంచి 500 మధ్య ఉంటోందని ఒక ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. సిలండర్ల డెలివరీ తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువ కావడంతో సకాలంలో డెలివరీ చేయలేక నిర్వాహకులు ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకుంటున్నారు. మార్కాపురం పట్టణంలో గత రెండు రోజుల నుంచి బండ్లపై టిఫిన్ తయారు చేసే వాటిని మూసేశారు. కేవలం సిలిండర్ల కొరత కారణంగానే వీటిని మూసివేస్తున్నారు. గత వారం వరకూ బుక్చేసుకున్న 2 నుంచి 3 రోజులకే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేది. ఇప్పుడు నెల వరకూ పట్టవచ్చనే వార్తలు అటు వ్యాపారుల్లో ఇటు గృహ యజమానుల్లో టెన్షన్కు దారితీస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ సంతమాగులూరు(అద్దంకి): యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడిందన్న ప్రచారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూకట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో శుక్రవారం గ్యాస్ వాహనం రాగానే బుక్ చేసుకున్న వినియోగదారులు క్యూ కట్టారు. గతంలో రెండు రోజులకు ఒక సారి వచ్చే గ్యాస్ వాహనం ఇప్పుడు 15 రోజులకు ఒక సారి వస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మండలంలో మొత్తం 15 వేల కనెక్షన్లు ఉండగా, 10 వేల మంది సిలిడర్లు కావాలని బుక్ చేసుకున్నారని, వారికి వెంటనే సిలిండర్లు ఇచ్చేందుకు వీలు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.ఇలా అయితే వ్యాపారాలు చేయలేము మార్కాపురం పట్టణంలో గత ఎనిమిదేళ్లుగా టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. ఇప్పటి వరకూ గ్యాస్ కొరత లేకపోవడంతో ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ వేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వారం రోజుల నుంచి గ్యాస్ కొరత వేధిస్తోంది. దీంతో సాయంత్రం పూట స్నాక్స్ బండిని ఆపేశాను. పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు ఉగాది పండుగ, రంజాన్ వస్తోంది. వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయని ఆశతో ఉంటే గ్యాస్ కొరత భయపెడుతోంది. – సుబ్బారావు, టిఫిన్ బండి నిర్వాహకుడు ఒంగోలులో గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారుల పడిగాపులుఒంగోలులోని ఓ హోటల్లో కట్టెల పొయ్యిపై వంట -
ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ఫలితం లేదు
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026ఇతని పేరు జూటూరి సిద్ధయ్య. అర్థవీడు మండలం చెర్లో దొనకొండ గ్రామం. ఇతనికి ఒకటిన్నర ఎకరా పొలం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం పలుమార్లు వ్యవసాయశాఖ అధికారులకు అర్జీ ఇచ్చాడు. కొత్తవి పెట్టుకునేందుకు అవకాశం లేదంటున్నారు. గతంలో హైదరాబాద్లో ప్త్రెవేట్ కంపెనీల్లో పనిచేసుకుంటూ జీవించాడు. ఆరోగ్య సమస్యలతో కొన్నేళ్ల క్రితం స్వగ్రామం వచ్చాడు. ఉన్న పొలంలో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటున్నాడు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్నదాత సుఖీభవ పథకం ఇస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని సిద్ధయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: విద్యుత్ రంగంలో కేంద్ర, రాష్ట్ర పథకాలు సక్రమంగా అమలు చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. శుక్రవారం ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పురోగతి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వేసవిలో విద్యుత్ కోతల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని, ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వీడాలని సూచించారు. పీఎం కుసుమ్ పథకం అమలు కోసం భూ సేకరణ పూర్తి చేయాలని అదేశించారు. అనంతరం ఏపీ ట్రాన్స్ కో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొత్త ఈహెచ్టీ సబ్ స్టేషన్ ప్రతిపాదనలు, నిర్మాణ పనుల పురోగతి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్ఈ రాజగోపాల్, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ సుబ్బారావు, ఈఈలు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: మద్దిపాడులో హత్య కేసు చేధించినందుకు అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ అవార్డు)కు జిల్లా పోలీసులు ఎంపికయ్యారు. ఈ అవార్డును ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి జిల్లా పోలీసులకు ఈ అవార్డు లభించింది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ హర్షవర్థన్రాజు అవార్డు అందుకున్నారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, రాష్ట్ర సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు పాల్గొన్నారు. ద్వితీయ స్థానంలో జీఆర్పీ పోలీసులు... ఏబీసీడీ అవార్డుల్లో ఒంగోలు జీఆర్పీ పోలీసులు ద్వితీయ స్థానంలో నిలిచారు. గతేడాది నవంబర్ 25వ తేదీ హైదరాబాద్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిన కేకే రామిరెడ్డికి చెందిన 341 గ్రాముల బంగారు నగల బ్యాగ్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన ఒంగోలు జీఆర్పీ పోలీసులు.. కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నెల్లూరు డీఎస్ఆర్పీ జి.మురళీధర్, ఒంగోలు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం సినిమా ఫక్కీలో కేసు ఛేదించి చోరీ సొత్తు రికవరీ చేసింది. ఈ కేసులో జీఆర్పీ పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. డీజీపీ చేతుల మీదుగా మంగళగిరిలో అవార్డు అందుకున్నారు. విద్యుత్ అధికారులతో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి -
పోలీస్, డాక్టర్ ఇంట్లో చోరీ
సింగరాయకొండ: మండల కేంద్రంలోని బాలయోగినగర్లో నివసిస్తూ కనిగిరిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పోట్లూరి హరిబాబు నివాసంలో, కందుకూరు రోడ్డులోని దేవరపల్లి రాఘవయ్య కాలనీ 3వ లైనులో నివసిస్తూ ఒంగోలు జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సివిల్ సర్జన్ దువ్వూరి అనిల్కుమార్ నివాసంలో దొంగలు పడ్డారు. సుమారు రూ.14 లక్షల విలువైన 91 గ్రాముల బంగారు నగలు, రూ.2.50 లక్షల విలువైన కేజీ వెండి వస్తువులు, రూ.1.40 లక్షల నగదు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దేవరపల్లి రాఘవయ్య కాలనీలో నివసిస్తున్న డాక్టర్ అనిల్కుమార్ ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బెంగళూరులోని చెల్లెలు వద్దకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపునకు ఉన్న తాళం కోసి ఉంది. దొంగలు లోపలికి ప్రవేశించి ప్రొఫెషనల్ దొంగల్లా బీరువాను ఇనుప రాడ్డుతో తెరిచి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.18 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీ జరిగిందని బాధితుడి బంధువులు తెలిపారు. అంతేగాకుండా అతను ఎప్పటి నుంచో దాచుకున్న సుమారు రూ.50 వేల విలువైన 7 విదేశీ మద్యం బాటిళ్లను కూడా చోరీ చేసినట్లు తెలిపారు. మరో చోరీ ఘటనలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హరిబాబు ఉద్యోగరీత్యా కనిగిరిలో నివాసం ఉంటున్నాడు. సింగరాయకొండలోని బాలయోగినగర్లోని ఇంటిలో సామగ్రి మినహా విలువైన వస్తువులేమీ లేవు. దీంతో విలువైన వస్తువులు పోనప్పటికీ.. దొంగ ఇంటి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోని బీరువా తలుపులు ధ్వంసం చేయడంతో పాటు బీరువాలోని సీక్రెట్ లాకర్లు కూడా ధ్వంసం చేశాడు. వారం క్రితం ఈ ప్రాంతంలో ఒక కుర్రాడు రెక్కీ నిర్వహించాడని, అతడిని అనుమానించి ప్రశ్నించగా.. నేను దొంగను అని చెప్పడంతో పట్టుకునే ప్రయత్నం చేశామని, కానీ, పారిపోయాడని స్థానికులు తెలిపారు. అతని వద్ద పదునైన ఇనుప వస్తువు ఉందని తెలిపారు. ఒకే రోజు రెండు దొంగతనాలు జరగడంతో పాటు భారీగా బంగారం, వెండి, నగదు చోరీ కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంఘటన స్థలాలను సీఐ హజరత్తయ్య పరిశీలించారు. రూ.18 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరణ డాక్టర్ ఇంట్లో బంగారం, వెండి, నగదు చోరీ పోలీసు ఇంట్లో డోర్లు, బీరువా, లాకర్లు ధ్వంసం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
సంతమాగులూరు(అద్దంకి): బైక్పై వెళ్తున్న యువకుడు లారీని దాటవేసే క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి పడటంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద నార్కెట్పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏల్చూరుకు చెందిన కొండి వెంకట ఆంజనేయులు(19) బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. హిందూ శ్మశానవాటిక వద్ద ముందు వెళ్తున్న లారీని దాటవేసే క్రమంలో అదుపుతప్పి లారీ ముందు టైరు కింద పడిపోయాడు. చేయి నుజ్జునుజ్జు కాగా తల, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కేకలు వేయడంతో డ్రైవర్ లారీని నిలిపివేశాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుని తండ్రి వెంకట్రావు ఏడు నెలల క్రితం కన్నుమూశారు. ఇంతలోనే కొడుకు చనిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒంగోలు సిటీ: జాతీయ స్థాయిలో నిర్వహించిన పారఖ్ సర్వేక్షణ ఫలితాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలు మెరుగుపరచాలని డీఈఓ రేణుక సూచించారు. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పారఖ్ జాతీయ సర్వేక్షణ–2024 ఫలితాలపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని క్విస్ కళాశాలలో శుక్రవారం ప్రారంభించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. డీసీఈబీ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, ఏఎంఓ నాగేంద్ర నాయక్, మార్కాపురం డీవైఈఓ మావిళ్లపల్లి శ్రీను పాల్గొని ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లుగా డైట్ సీనియర్ లెక్చరర్లు విజయకృష్ణ, సర్దార్ పాపారాయుడు శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు రిసోర్స్ పర్సన్లుగా సోమశేఖర్, యామిని, పద్మశ్రీ పాల్గొని వివిధ అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి మాండలిక విద్యాధికారులు, క్లస్టర్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పాల్గొన్నారు. పారఖ్ జాతీయ సర్వేక్షణలో గుర్తించిన విద్యార్థుల అభ్యాస స్థాయిలు, లోపాల ఆధారంగా పాఠశాలల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణలో చర్చించారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులంతా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను విశ్లేషించి బోధన విధానాలను మెరుగుపరచడానికి అవసరమైన అవగాహన పొందుతారని నిర్వాహకులు తెలిపారు. -
పుల్లలచెరువులో ఇల్లు లూటీ
పుల్లలచెరువు: మండల కేంద్రమైన పుల్లలచెరువులో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీ మొత్తంలో నగలు, నగదు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పుల్లలచెరువు జెడ్పీ పాఠశాల సమీపంలో మేడికొండ వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటోంది. వెంకటేశ్వర్లు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా, ఆయన భార్య అడిగొప్పలలో అమ్మవారి ఆలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు మధ్యాహ్న సమయంలో చోరీకి తెగబడ్డారు. ఇంటి యజమాని భోజనానికి రాగా తాళం పగలగొట్టి ఉండటంతో కంగుతిన్నాడు. ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు రూ.1.50 లక్షల నగదు చోరీ అయ్యాయని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ అజయికుమార్, ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. వెంకటేశ్వర్లు భార్య ఆలయం నుంచి తిరిగి వస్తే చోరీ అయిన సొత్తు పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. -
హోరాహోరీగా ఎడ్ల పందేలు
కొనకనమిట్ల: వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు శుక్రవారం జాతీయ స్థాయి సీనియర్ విభాగం ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. మేకలవారిపల్లి రెడ్ల సంఘం, బొమ్మన బ్రదర్స్ పర్యవేక్షణలో నిర్వహించిన ఎడ్ల పోటీలను ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడి్డ్ ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన 14 జతల ఎడ్లు హోరాహోరీగా తలపడ్డాయి. సేద్యపు ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన పశుపోషకులు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. రిఫరీగా వల్లెల వెంకటరామిరెడ్డి, నారాయణస్వామి వ్యవహరించారు. న్యూ కేటగిరీ విజేతలు ఇవే.. గురువారం రాత్రి వరకు కొనసాగిన న్యూ కేటగిరీ విభాగంలో ఆర్కే బుల్స్ అత్తోటి శిరీషచౌదరి, శివకృష్ణచౌదరి సంయుక్త ఎడ్ల జత నిర్ణీత సమయంలో 6,420 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.75 వేలు, గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఎడ్ల జత 6,252 లడుగులు లాగి రెందో బహుమతి రూ.60 వేలు, నాగార్ కర్నూలుకు చెందిన అక్షరరెడ్డి ఎడ్ల జత 6,236 అడుగులు లాగి మూడో బహుమతి రూ.40 వేలు, గుంటూరు జిల్లా ఎడ్లపాడుకు చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 6 వేల అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.30 వేలు, గుంంటూరు జిల్లాకు చెందిన గుదిడండ మాధవరెడ్డి, పెద్దపరిమి శ్రీనివాస్ సంయుక్త ఎడ్ల జత 5,464 అడుగులు లాగి ఐదో బహుమతి రూ.20 వేలు, యర్రగొండపాలేనికి చెందిన సుబ్రహ్మణ్యం ఎడ్ల జత 5,400 అడుగులు లాగి ఆరో బహుమతి రూ.15 వేలు, పుల్లలచెరువుకు చెందిన ఎడ్ల జత 4,724 అడుగులు లాగి ఏడో బహుమతి రూ.8 వేలు గెలుపొందాయి. దాతల సహకారంతో విజేతలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, ఆలయ ఈఓ ఈఓ చెన్నకేశవరెడ్డి చేతులమీదుగా నగదు అందజేశారు. సీనియర్ విభాగంలో కృష్ణా జిల్లా ఎడ్ల సత్తా సీనియర్ విభాగం ఎడ్ల పోటీల్లో కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన రాజా చౌదరి, మోహన్రావు సంయుక్త ఎడ్ల జత 4,200 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.90 వేలు. నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి కేశవరెడ్డి, సాంబశివారెడ్డి, వీరనరసింహరెడ్డి ఎడ్ల జత 4,022 అడుగులు లాగి రెండో బహుమతి రూ.70 వేలు, వైఎస్సార్ కడప జిల్లా చౌటపల్లికి చెందిన మార్తాల చంద్ర ఓబులరెడ్డి ఎడ్ల జత 3,874 అడుగులు లాగి మూడో బహుమతి రూ.50 వేలు, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష, శివకృష్ణచౌదరి ఎడ్ల జత 3,694 అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.40 వేలు, వీరికే చెందిన మరో జత ఎడ్లు 3634 లాగి ఐదో బహుమతి రూ.30 వేలు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఎడ్ల జత 3,602 అడుగులు లాగి ఆరో బహుమతి రూ.20 వేలు, బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి చౌదరి ఎడ్ల జత 3,451 అడుగులు లాగి ఏడో బహుమతి రూ.10 వేలు అందుకున్నాయి. మూడు రోజులపాటు ఎడ్ల పందేల్లో పాల్గొని బహుమతి దక్కని ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేశారు. -
సాహిత్య రంగంలో మొల్లమాంబది ప్రత్యేక స్థానం
ఒంగోలు సబర్బన్: సాహిత్యరంగంపై మొల్లమాంబ తనదైన ముద్ర వేశారని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు కొనియాడారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని శుక్రవారం ప్రకాశం భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నిర్మలజ్యోతి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముప్పూరి వెంకటేశ్వరరావు, పలువురు కవయిత్రులు, శాలివాహన సంఘ ప్రతినిధులు పాల్గొని మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ మొల్లమాంబ విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో ప్రత్యేక చలివేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘ గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, జిల్లా అధ్యక్షురాలు పరాంకుశం కృష్ణవేణి, గాయని చల్లా నాగేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు. శాలివాహన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులైన ఐలాపురం వెంకయ్య, శ్రీవిక్కీశ్రీ నాగేశ్వరరావు మృతికి సంతాపంగా ఈ కార్యక్రమంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వర్ణ దురంహకారంపై సంధించిన బాణం మొల్ల ఒంగోలు టౌన్: వర్ణ దురంహాకారాన్ని ఎదుర్కొన్న కవయిత్రి మొల్ల నేటి తరానికి ఆదర్శనీయమని ఆర్ఐ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ తీవ్రమైన వివక్షను తిప్పికొడుతూ రామాయణ మహాగ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి మొల్లను తెలుగుజాతి ఎన్నటికీ మరచిపోదన్నారు. సీ్త్రలు వంటింటికే పరిమితం కావాలని ఆంక్షలు విధించిన రోజుల్లో సీ్త్రలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై పోరాటం చేసి చరిత్రలో వీరవనితగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ఏఆర్, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. మొల్లమాంబ జీవితం ఆదర్శం మార్కాపురం: రామాయనాన్ని సరళమైన శైలిలో రాసి ప్రజలకు అందించిన తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శమని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా స్ధానిక తర్లుపాడు రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ.. కడప జిల్లా గోపవరంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల తన సహజ పాండిత్యంతో రామాయణాన్ని తెలుగులో రచించి తొలి తెలుగు మహిళా కవిగా నిలిచారని కొనియాడారు. తాను రాసిన రామాయణాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారని, తెలుగు సాహిత్యంలో ఆమె స్థానం అమూల్యమైనదన్నారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురలీకృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం శాలివాహన సత్రం అధ్యక్షుడు సీహెచ్ మోహన్, పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బొగ్గరపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు జేసీ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి
మార్కాపురం: వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో నీటి సమస్యపై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో ముందుగానే గుర్తించాలని, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలని చెప్పారు. అవసరమైన చోట, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్బాబు, డీపీహెచ్ఈఓ శ్రీనివాసరావు, గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణ, పలువురు ఏఈలు పాల్గొన్నారు. -
నోట్లోకి దూరిన చేప
ఒంగోలు టౌన్: ఊహించని రీతిలో వలలోని చేప జాలరీ నోట్లోకి దూరింది. ఊపిరాడక గిలగిలలాడుతున్న సదరు జాలరీని ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసిన జీజీహెచ్ వైద్యులు జాలరీ ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలుకు చెందిన సుబ్రమణ్యం గురువారం చేపలవేటకు వెళ్లారు. చేపలు పట్టుకొని ఇంటికి వచ్చిన ఆయన నోట్లో వలను పట్టుకొని చేపలను బయటకు తీస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఒక చేప సుబ్రమణ్యం నోట్లోకి వెళ్లింది. గొంతుకు అడ్డంపడి గిలగిలా కొట్టుకోసాగింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ ప్రభాకర్ గొంతులో చేప ఉన్నట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి చెప్పారు. ట్రాకియాక్టమి పద్ధతిలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు. సుమారు గంటకు పైగా ఆపరేషన్ చేసి సకాలంలో చేపను బయటకు తీయడంతో సుబ్రహ్మణ్యం ప్రాణాలతో బయట పడ్డారు. ఆపరేషన్ బృందంలో డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, డాక్టర్ అర్జున్, డాక్టర లాలస పాల్గొన్నారు. క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు ప్రశంసించారు. -
పేదల మది నిండా.. వైఎస్సార్ సీపీ జెండా
వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చేసిన మేలును గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ జెండాలు ఆవిష్కరించడంతోపాటు దివంగత వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సందడి చేశారు. – సాక్షి నెట్వర్క్దర్శిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తున్న నాయకులుకంభంలో వైఎస్సార్ విగ్రహానికి కే పీ నాగార్జునరెడ్డి నివాళికందుకూరులో కే క్ కట్ చేసి సంబరాలు..వైపాలెంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు -
ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నయం చేయొచ్చు
ఒంగోలు టౌన్: క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం అంత సాధ్యమవుతుందని జీజీహెచ్ సూపరెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా స్క్రీనింగ్ క్యాంపును నగర మేయర్ సుజాత, కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జీజీహెచ్లో పారిశుధ్య కార్మికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ...ముందుగా లక్షణాలు గుర్తించడం అవసరమన్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చన్నారు. జీజీహెచ్లో ప్రివెంటివ్ అంకాలజీలో నిరంతరం ఓపీ సేవలు అందిస్తుందన్నారు. సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ అంకాలజీ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు. పరీక్షల కోసమే కాకుండా కౌన్సెలింగ్ కోసం కూడా జీజీహెచ్కు రావచ్చన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అధిపతి డా.శ్రీదేవి, గైనకాలజీ అధిపతి డాక్టర్ సంధ్యా రాణి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఆర్టీఓగా చండ్రా రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎంవీఐగా పనిచేస్తున్న ఆయనను మార్కాపురం ఇన్చార్జి ఆర్టీఓగా నియమించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన శ్రీచందన సెలవుపై వెళ్లారు. మార్కాపురం ఎంవీఐగా కేఎల్రావును నియమించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాల డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. -
ఆక్రమించేద్దాం.. అక్రమ కట్టడాలు కట్టేద్దాం!
పొన్నలూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు భూ ఆక్రమణలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఏ భూమైనా పర్వాలేదు ఆక్రమించేద్దాం.. అక్రమ కట్టడాలు నిర్మిద్దాం, అవసరమైతే అమ్ముకుందాం అనే పద్ధతిని పాటిస్తూ యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు కబ్జాదారులుగా మారి జెండా పాతేస్తున్నారు. స్థానికులు అడ్డు తగులుతూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా అవేవి మాకు వర్తించవంటూ నియోజకవర్గ ముఖ్య నేతల అండదండలతో అధికారులను, స్థానికులను బెదిరిస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన వారంతా ప్రేక్షకపాత్ర వహించడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. మండలంలోని చెరుకూరు రెవెన్యూ పరిధి తిమ్మపాలెం గ్రామంలో సర్వే నంబర్ 737/1 లో 1.14 ఎకరాల ప్రభుత్వ బండి బాట స్థలం ఉంది. ఈ స్థలం గ్రామానికి సమీపంలో ఉండి కట్టడాలకు అనువుగా ఉండటంతో స్థానిక టీడీపీ సానుభూతిపరుల కన్ను బండిబాట స్థలంపై పడింది. వాస్తవంగా 2018 గత టీడీపీ ప్రభుత్వ నుంచే తమ్ముళ్లు విడతల వారీగా స్థలాన్ని ఆక్రమిస్తూ బ్యారన్ల నిర్మాణాలకు పూనుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు 2022లో హైకోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆక్రమితదారులకు నోటీసులు ఇచ్చారు. అయితే పంచాయతీ అధికారులు బండి బాట స్థలాన్ని పొరపాటున వాగుపోరంబోకు భూమి అని కోర్టుకు తెల్పడంతో కొంత సందిగ్ధత ఏర్పండి. దీంతో మరోసారి రికార్డులు పరిశీలించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేసి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. అయితే పంచాయతీ అధికారులకు నేటి వరకు ఆక్రమితదారులకు నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. స్థలం విలువ రూ.కోట్లలోనే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు బండిబాట స్థలంలో అక్రమంగా బ్యారన్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. ప్రభుత్వ బండిబాట స్థలం గ్రామానికి సమీపంలో ఉండటంతో సెంటు స్థలం రూ.2 లక్షల ధర పలుకుతోంది. ఈ చొప్పున 1.14 ఎకరాల స్థలం ధర సుమారుగా రూ.2.28 కోట్లు వరకు ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. విడతల వారీ గా తెలుగు తమ్ముళ్లు బండిబాట స్థలాన్ని ఆక్రమించి సుమారుగా 10 బ్యారన్లు వరకు నిర్మించారు. దొంగ పత్రంతో బ్యారన్ లెక్క... ప్రభుత్వ బండి బాట స్థలం ఆక్రమించి తమ్ముళ్లు పొగాకు బ్యారన్లు నిర్మించడమే కాకుండా అక్రమ నిర్మాణాలకు దొంగ పత్రాలు సృష్టించారు. అక్రమ పొగాకు బ్యారన్ నిర్మాణానికి స్థానిక వీఆర్వో అధికారకంగా అనుమతి పత్రం ఇచ్చినట్లు దొంగ పత్రం సృష్టించి పొగాకు బోర్డు అధికారులకు అందజేశారు. దీంతో దొంగ పత్రం ఆధారంగా పొగాకు బోర్డు వారు సంబంధిత ఆక్రమితదారులకు పొగాకును విక్రయించడానికి బ్యారన్ లెక్క కూడా కల్పించారు. అయితే దీనిపై సంబంధిత వీఆర్వోని గ్రామస్తులు ప్రశ్నించగా తనకు తెలియదని, అనుమతి పత్రం నేను మంజూరు చేయలేదని తెలియజేయడం గమనార్హం. అలాగే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన బ్యారన్లకు ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడం కొసమెరుపు. బ్యారన్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని కూడా గ్రామస్తులు రాకపోకలు సాగించే రోడ్డులో నిర్మించడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయి. ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం... వాస్తవంగా తిమ్మపాలెం గ్రామంలో విలువ కలిగి ప్రభుత్వ బండిబాట స్థలం ఆక్రమణపై రెవెన్యూ, పంచాయతీ అధికారులకు గ్రామస్తులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం. తమకు ఇవేమి పట్టవంటూ పట్టీపట్టనట్లు వ్యవహిస్తున్నారు. ఆక్రమితదారుల దగ్గర ముడుపులు తీసుకోవడం వలనే రెవెన్యూ, పంచాయతీ అధికారులు అటువైపు కూడా చూడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. అయితే మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు కందుకూరు సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ బండిబాట స్థలంలోని ఆక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. తిమ్మపాలెంలో తెలుగు తమ్ముళ్ల ఆక్రమణల పర్వం 1.14 ఎకరాల ప్రభుత్వ బండిబాట స్థలం ఆక్రమణ మార్కెట్లో బండిబాట స్థలం విలువ సుమారుగా రూ.2.28 కోట్లు ఆక్రమించిన స్థలంలో 10 పొగాకు బ్యారన్ల నిర్మాణం దొంగ పత్రాలతో పొగాకు బ్యారన్ లెక్క సైతం తెచ్చుకున్న వైనం బ్యారన్లకు అక్రమ విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన ఆ శాఖ సిబ్బంది పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ, పంచాయతీ అధికారులు -
విచిత్రం… జాలరి నోట్లోకి దూకిన చేప!
ఒంగోలు టౌన్: ఊహించని రీతిలో వలలోని చేప జాలరీ నోట్లోకి దూరింది. ఊపిరాడక గిలగిలలాడుతున్న సదరు జాలరీని ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసిన జీజీహెచ్ వైద్యులు జాలరీ ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలుకు చెందిన సుబ్రమణ్యం గురువారం చేపలవేటకు వెళ్లారు. చేపలు పట్టుకొని ఇంటికి వచ్చిన ఆయన నోట్లో వలను పట్టుకొని చేపలను బయటకు తీస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఒక చేప సుబ్రమణ్యం నోట్లోకి వెళ్లింది. గొంతుకు అడ్డంపడి గిలగిలా కొట్టుకోసాగింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ ప్రభాకర్ గొంతులో చేప ఉన్నట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి చెప్పారు. ట్రాకియాక్టమి పద్ధతిలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.సుమారు గంటకు పైగా ఆపరేషన్ చేసి సకాలంలో చేపను బయటకు తీయడంతో సుబ్రహ్మణ్యం ప్రాణాలతో బయట పడ్డారు. ఆపరేషన్ బృందంలో డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, డాక్టర్ అర్జున్, డాక్టర లాలస పాల్గొన్నారు. క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు ప్రశంసించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్ ముఠాకు భారీ దెబ్బ తగిలింది. దర్శిలో తీగలాగితే నరసరావుపేట, హైదరాబాద్లో డొంక కదిలింది. ఫిబ్రవరి 26వ తేదీన ‘బెట్టింగ్ మామూళ్లే’ అనే శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఎస్పీ హర్షవర్థన రాజు సీరియస్గా తీసుకున్నారు. అప్పుడే జిల్లా పోలీసు అధికారులకు క్లాస్ పీకారు. బెట్టింగ్ ముఠా అంతు చూడాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిల్లా వ్యాప్తంగా హడావుడి చేసిన పోలీసు యంత్రాంగం నామ మాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. అయినా ఎస్పీ ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. ఈ క్రమంలో టీ 20 ఫైనల్ జరుగుతున్న రోజు దర్శిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక పోస్టల్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని మూడు రోజుల పాటు విచారణ చేసి కూపీ లాగారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు దర్శి పోలీసులు నామ మాత్రంగా కేసు పెట్టి పోస్టల్ ఉద్యోగిని వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ కేసును టాస్క్ఫోర్స్కు అప్పగించినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్పోర్స్ పోలీసులు నరసరావుపేటకు చెందిన ప్రధాన బుకీని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. అతడి వద్ద బెట్టింగుకు సంబంధించిన బోర్డు, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు లభించినట్లు సమాచారం. అతడి వద్ద నుంచి బెట్టింగుకు సంబంధించిన రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట బుకీని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా హైదరాబాద్లో మరో ప్రధాన బుకీ ఉన్నట్లు సమాచారం వచ్చింది. దాంతో అతడిపై నిఘా పెట్టిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ బుకీ నుంచి రాబట్టిన సమాచారం మేరకు కడప, గుంటూరులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ బుకీలను ఏర్పాటు చేసుకొని కోట్లాది రూపాయల బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు బిత్తరపోయారు. సినిమా తరహాలో ఏర్పాటు చేసుకున్న సెట్టింగులు చూసి విస్మయానికి గురయ్యారు. లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు నేడో రేపో హైదరాబాద్ బుకీని అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బుకీ అరెస్టుతో రాష్ట్రంలో ఒక పెద్ద బెట్టింగ్ ముఠా ఆటకట్టయినట్లేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
వచ్చేది జగనన్న పాలనే..
ఒంగోలు టౌన్: రెండేళ్ల చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు మళ్లీ జగనన్న పాలన రావాలని కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్లు, నాయకులు వేడుకల్లో పాల్గొని కేక్లు కట్ చేసి, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సభకు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది కార్యకర్తల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎత్తిన జెండా దించకుండా జగనన్నకు వెన్నుదన్నుగా నిలబడి కలబడిన కార్యకర్తల రుణం తీర్చుకోలేమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధించిందని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా అదరక, బెదరక పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. కూటమి పదవులకు, ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవంతో ముందుకు సాగిన కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి అకాల మరణం తరువాత ప్రజలను పట్టించుకునేవారే లేకుండా పోయిన పరిస్థితుల్లో జననేత జగనన్న వైఎస్సార్ సీపీ పెట్టారని గుర్తు చేశారు. గత 16 ఏళ్లుగా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగనన్నదన్నారు. నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా వెన్ను చూపకుండా ముందుకు సాగిన దమ్ము, ధైర్యం కలిగిన నాయకుడు జగనన్న అని కొనియాడారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం, రైతు భరోసా, సచివాలయాలు వంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేసిందని తెలిపారు. నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆరోగ్య శ్రీ అమలు చేసిందని నేడు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వాటిని అటకెక్కించారని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పాలకులు ఎన్ని కేసులు పెట్టినా, 16 నెలలు జైలుకు పంపించినా భయపడకుండా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడిన దమ్మున్న నాయకుడు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని, ఎల్లకాలం ఇదే పరిపాలన కొనసాగదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుందామని, అప్పటి వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. -
రూర్బన్ పంచాయతీల పేరుతో పేదల పొట్ట కొట్టొద్దు
మార్కాపురం టౌన్: రూర్బన్ పంచాయతీల పేరుతో పేదల పొట్ట కొట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి సుస్థిరత సమావేశం కే మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూర్బన్ పంచాయతీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానం చేయడంతో ఉపాధి పథకం ఆ గ్రామాల్లో రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 10 వేల జనాభా ఉన్న గ్రామాలను రూర్బన్ (రూరల్ అర్బన్) పేరుతో పంచాయతీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గ్రామాలకు పట్టణ సౌకర్యాలు కల్పించడం మంచిదే అయినా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టం ఆ గ్రామాల్లో అమలు చేస్తారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రాంతాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేసిన సందర్భాల్లో నగర పంచాయతీలుగా మార్చిన సందర్భంలోనూ పేదలు ఉపాధి హామీ చట్టాన్ని కోల్పోయారని అన్నారు. రూర్బన్ పద్ధతిలో అటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కారణాలు చూపి గృహ వినియోగదారుల వంట గ్యాస్ సిలిండరుకు రూ.60, వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ రూ.11 పెంచడం అన్యాయమని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని గ్యాస్ సిలిండర్ల సరఫరా సంస్థలు సిలిండర్లను బ్లాక్చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ప్రకటించిన పథకాలు అమలులోకి రాలేదని, ప్రభుత్వం పథకాలపై స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం మార్కాపురం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కే మాల్యాద్రి, కార్యదర్శిగా గుమ్మా బాలనాగయ్య, ఉపాధ్యక్షులుగా కే వెంకటమ్మ, సహాయ కార్యదర్శులుగా ఏడుకొండలు, బీ రత్నంతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు డీకేఎం రఫీ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు, కార్మికులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి రానివ్వాలని చిరు వ్యాపారుల ఆందోళన
పెద్దదోర్నాల: తమను శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ కర్నాటక, రాజస్థాన్కు చెందిన చిరు వ్యాపారులు శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్పోస్టు వద్ద రోడ్లపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గణపతి చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్కు గంట పాటు అంతరాయం ఏర్పడింది. శ్రీశైల దేవస్థానం అధికారుల ఆదేశాల మేరకు కొద్ది రోజులుగా చిరు వ్యాపారులను గణపతి చెక్పోస్టు వద్ద నిలిపేస్తున్నారు. దీంతో వారు మండల కేంద్రంలోని రహదారుల వెంట వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వారికి అనుకున్నంతగా వ్యాపారాలు జరగకపోవటంతో వారు తొలుత అటవీశాఖ కార్యాలయం వద్ద చేరుకుని, అనంతరం గణపతి చెక్పోస్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు రాస్తారోకో నిర్వహించి తమను శ్రీశైలానికి అనుమతించాలని ఆందోళన నిర్వహించారు. దీంతో పాటు శ్రీశైలానికి ప్రయాణాలు సాగిస్తున్న కన్నడ భక్తులు కూడా వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో అటవీశాఖ అధికారులు దేవస్థానం అధికారులతో మాట్లాడి ఆందోళన చేస్తున్న వారిని శ్రీశైలానికి అనుమతించటంతో గొడవ సద్దుమణిగింది. ఈ ధర్నాతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవటంతో 2 గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.గణపతి చెక్పోస్టు వద్ద ఆందోళన చేస్తున్న చిరు వ్యాపారులు ఆందోళనతో నిలిచిన వాహనాల రాకపోకలు -
కూటమిలో కుంపటి
ఒంగోలు సబర్బన్: అధికార కూటమి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికార టీడీపీ, జనసేన సభ్యుల మధ్య మాటల తూటాలు రచ్చకు దారితీశాయి. చివరకు జనసేన సభ్యులు మైకులు విరగ్గొట్టే స్థాయికి చేరుకున్నారు. కొంతసేపు కౌన్సిల్ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ సుజాత లేకపోవటంతో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన బుధవారం కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కౌన్సిల్కు ఈ నెల 16వ తేదీతో పాలక మండలి గడువు ముగుస్తుండటంతో చివరగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 41 అంశాలతో కూడిన అజెండాతో కౌన్సిల్ను ప్రారంభించిన వేమూరి 38వ అంశం వచ్చేసరికి కౌన్సిల్ ఒక్కసారిగా వేడెక్కింది. 38వ డివిజన్కు చెందిన జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ తన డివిజన్లో ఉన్న పార్కుకు శ్రీకృష్ణ దేవరాయ పార్కుగా నామకరణం చేయాలనే అంశాన్ని కౌన్సిల్లో ఆమోదం కోసం పెట్టారు. అయితే ఆ అంశం ప్రస్తావనకు రాగానే టీడీపీ సభ్యుడు తేజ లేచి ఆ అంశాన్ని వాయిదా వేయాలని చెప్పాడు. దాంతో రచ్చ ప్రారంభమైంది. స్థానికంగా ప్రజల అభిప్రాయాలతో సంతకాల సేకరణ చేపట్టామని, మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పటానికి నువ్వెవరంటూ టీడీపీ సభ్యుడు తేజను జనసేన సభ్యుడు మలగా రమేష్ నిలదీశాడు. దాంతో అటు టీడీపీ సభ్యులు, ఇటు జనసేన సభ్యులు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. కౌన్సిల్లో జనసేనకు 21 మంది సభ్యుల బలం ఉంది. దాంతో కౌన్సిల్ ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు జనసేన సభ్యుడు మలగా రమేష్ మైక్ ఎత్తి నేలకేసి కొట్టాడు. దాంతో కౌన్సిల్లో ఇంకా రెండు గ్రూపుల మధ్య వాడి వేడి మాటల యుద్దం జరిగింది. చివరకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలుగజేసుకొని ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నామే కానీ రద్దు చేయటం లేదని చెప్పటంతో కొంత శాంతించారు. చివరకు జనసేన సభ్యులు టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా బాయ్ కాట్ చేస్తున్నామంటూ కౌన్సిల్ హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. రెండేళ్లలో జీరో అవర్ ప్రవేశపెట్టలేదు...వైఎస్సార్ సీపీ ధ్వజం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుందని, అయితే ఈ రెండేళ్లలో ఒంగోలు నగర ప్రజల సమస్యలను చర్చించటానికి అవకాశం కల్పించే ‘‘జీరో’’ అవర్ను ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు పాలక పార్టీలపై ధ్వజమెత్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్ తీరును తూర్పారబట్టారు. పాలక మండలి కాలపరిమితి పూర్తి కావస్తున్నా కనీసం చివరి సమావేశంలోనైనా జీరో అవర్ను ప్రవేశ పెట్టక పోవటాన్ని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా పరిగణించారు. అజెండాలోని అంశాలను ఆమోదింపజేసుకునే ఆలోచనలోనే పాలక పార్టీ సభ్యులు ఉన్నారే తప్ప ప్రజల సమస్యలను ప్రస్తావిద్దామన్న ఆలోచనే లేదన్నారు. ఒంగోలు నగరంలో విపరీతమైన దోమలతో ప్రజలు అల్లాడుతుంటే అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. నాలుగైదు దఫాలుగా మంచినీరు సక్రమంగా రావటంలేదన్నారు. వేసవి రాకముందే మంచినీటి కొరత ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహకు అందటం లేదని ఇమ్రాన్ ఖాన్ ధ్వజమెత్తారు. ఒంగోలు నగర పాలక సంస్థ దివాలా తీసిందన్నారు. ‘‘ట్రేడ్స్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టం’’ (ట్రెడ్స్) ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటమేంటని ప్రశ్నించారు. అసలు నగర పాలక సంస్థలో ఎన్ని కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు ఉన్నాయో చెప్పాలన్నారు. దాంతో టీడీపీ సభ్యులు వైఎస్సార్ సీపీ సభ్యులను అడ్డుకున్నారు. మాట్లాడనీయకుండా గొడవకు దిగారు. ఒంగోలు నగరంలోని ఎస్ఎస్ ట్యాంకుకు పడమర వైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని స్ట్రీట్ వెండార్స్ కోసం తలపెట్టిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు సక్రమ పద్ధతిలో చేపట్టటం లేదని జనసేన నాయకుడు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నిలదీశారు. రూ.50 లక్షలకు పైగా ఖర్చుచేయాలని చూడటం అనాలోచిత చర్య అని అధికారులపై మండిపడ్డారు. -
వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఒంగోలు టౌన్: వైద్య విద్యలో పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించాలని డాక్టర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం సందర్శించిన ఆయన అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. కీలకమైన అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యత ఉందని, దీని కోసం ప్రతి సంవత్సరం రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ప్రజారోగ్యం, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రజారంగంలో పరిశోధనలను విస్తరించేందుకు సింగపూర్ యూనివర్శిటీ, గేట్స్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కళాశాల విద్యతోపాటుగా క్రీడలు, ఇతర సామాజిక అంశాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థులపై ఒత్తిడి, నిరాశ లేకుండా సైకాలజీ విభాగం సరైన కౌన్సిలింగ్ అందించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏసుపాదం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.మాణిక్యరావు, డా.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు పథకాన్ని అందించాలి
అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండానే రూ.20 వేలు ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మాటమార్చారు. అకాల వర్షాలు, తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నేటికీ నష్ట పరిహారం విడుదల చేయలేదు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. – యూ జోసఫ్, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, అన్నదాత సుఖీభవ పథకం ఒక ఏడాది ఇవ్వలేదు. ప్రస్తుతం ఇచ్చే పథకంలో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను భారీగా తగ్గిస్తున్నారు. ప్రతి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం పథకానికి దూరం చేయడం సమంజసం కాదు. – ఆవుల శ్రీధర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఇవ్వాలి
హామీలన్నీ అమలు చేసిన ఏకై క సీఎం జగన్దర్శి: దేశ చరిత్రలో వంద శాతం హామీలు అమలు చేసి చరిత్ర తిరగరాసిన ఒకే ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. దర్శి పట్టణంలో సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా కోలాట ప్రదర్శన వద్ద అందరితో కలసి కోలాటంలో సందడి చేశారు. అనంతరం కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్దకు వచ్చిన బూచేపల్లిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయని చరిత్రహీనుడుగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని అడిగితే చంద్రబాబు కల్తీ లడ్డు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే మీ పొట్టలు నింపుకోవడం కాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కపింఛన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడటం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన పట్టిన జెండా విడవకుండా మా నాయకుడు జగనన్నే అని సగర్వంగా చెప్పుకుంటున్నారని స్పష్ట చేశారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడేళ్ల నుంచి విద్యార్థులు లేక వివిధ పాఠశాలల్లో వారానికి, నెలకు రకరకాలుగా ఎయిడెడ్ ఉపాధ్యాయులను రోజువారి కూలీలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కోర్టుకు వెళ్లిన యాజమాన్యాల పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపుతున్నారు కానీ ఆ పాఠశాల యాజమాన్యాలు వారిని విధుల్లో చేర్చుకోవడం లేదన్నారు. జిల్లాలో మండలాల వారీగా జీవో నంబర్ వన్ ప్రకారం 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సబ్జెక్టు వారీగా సెకండ్ గ్రేడ్ టీచర్లు 108 మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం 8, సోషల్ 6, సైన్స్ 4, తెలుగు పండిట్ 6, హిందీ పండిట్ 5, క్రాఫ్ట్ డ్రాయింగ్ 3, పీఈటీ 5, నాన్ టీచింగ్ స్టాఫ్ 20 మంది చొప్పున ఉన్నారని తెలిపారు. జిల్లాలో 42 ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే టీచర్ తో బోధన జరుగుతోందన్నారు. కొన్ని పాఠశాలల్లో 40 మంది పైన విద్యార్థులు ఉన్నారని, వారికి రెండవ టీచర్ను కేటాయించి యాజమాన్యం విల్లింగ్ ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను ఇచ్చి మిగిలిన ఎయిడెడ్ ఉపాధ్యాయులను శాశ్వతంగా కౌన్సిలింగ్ నిర్వహించి జీవో నంబర్ 24 ప్రకారం ప్రభుత్వ పాఠశాలలోకి సర్దుబాటు చేయాలని కోరారు. -
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించాలి
● డీఈఓ సీవీ రేణుక ఒంగోలు సిటీ: విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ సీవీ రేణుక అన్నారు. ప్రకాశం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రాం జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం హైస్కూల్ టీచర్లకు బుధవారం ప్రకాశం భవన్లోని పీజీ ఆర్ఎస్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల నుంచి 150 మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ సీవీ రేణుక మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి పాఠశాల ఉపాధ్యాయుడు కీలకమన్నారు. వివిధ రకాల పోస్టర్స్ను, శిక్షణ దీపికను విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి చంద్రమౌలేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి టీ రమేష్, మాస్టర్ ట్రైనీలుగా పిచ్చిరెడ్డి, నివేదిత, అల్లూరయ్య, సంజీవరాజు, భాస్కర్ రెడ్డి, రాజగోపాల్ వ్యవహరించారు. -
గాలికుంటు వ్యాక్సినేషన్ పక్కాగా చేపట్టాలి
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సూచించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆరు లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి
దర్శి: పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సూచించారు. స్థానిక నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, గ్రామాల నాయకులతో మంగళవారం విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ డిజిటలైజేషన్ దాదాపుగా పూర్తి కావచ్చిందని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా అందరూ నాయకులు తమ ఫొటోలను తీసుకుని డిజిటల్ చేసేందుకు త్వరితగతిన ముందుకు రావాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన
మార్కాపురం: ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల్లో ఈనెల 16తో ముగియనున్న పాలక మండళ్ల పదవీ కాలం నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్కు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మంగళవారం జీఓ ఆర్టీ నం 284ను విడుదల చేశారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని, కొత్తగా ఎన్నికయ్యే పాలకమండళ్లు బాధ్యతలు స్వీకరించే వరకూ లేదా గరిష్టంగా ఆరు నెలల పాటు మున్సిపాలిటీల్లో పరిపాలన నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, మార్కాపురం జిల్లాలో జిల్లా కేంద్రమైన మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, అద్దంకి మున్సిపాలిటీకి అద్దంకి ఆర్డీఓ జాన్సన్, చీమకుర్తి మున్సిపాలిటీకి ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్నను, మార్కాపురం మున్సిపాలిటీకి మార్కాపురం ఆర్డీఓ పీ ప్రభాకర్ను, గిద్దలూరు మున్సిపాలిటీకి వెలుగొండ ప్రాజెక్టు భూ సేకరణ, ఆర్అండ్ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరును, కనిగిరి మున్సిపాలిటీకి కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2021 మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2021 మార్చి 14న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఎన్నికై న సభ్యులు చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 16తో మున్సిపల్ పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో పట్టణాల్లో, నగరాల్లో పాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. అప్పటి నుంచి ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఐదేళ్లుగా మున్సిపల్ కౌన్సిల్లు ఉండటంతో ఆయా పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోదం పొందిన తరువాత పనులు చేపట్టేవారు. పట్టణాల్లో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సమస్య, వీధిలైట్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులన్నీ మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిల్ పర్యవేక్షించేవారు. ఇకపై ఈ బాధ్యతలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జరగనున్నాయి. -
తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలేవీ?
ఒంగోలు టౌన్: వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో నగరంలోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా నగర పాలక సంస్థ ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నా పాలకులు మొద్దునిద్ర వీడడంలేదని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. నగరంలోని నీటి ఎద్దడి ఇబ్బంది పెడుతుండడంతో సీపీఎం నాయకుల బృందం మంగళవారం సమ్మర్ స్టోరేజీ ట్యాంకునుల పరిశీలించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వాస్తవానికి ట్యాంకుల్లో 5800 మిలియన్ లీటర్ల నీరు నిల్వలు ఉండాలని, ప్రస్తుతం 3700 మిలియన్ లీటర్లు మాత్రమే ఉందని వివరించారు. వేసవి తీవ్రత వలన నీటి నిలువలు వేగంగా తగ్గిపోతున్నాయని, అయినా నగర పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే సాగర్ నుంచి నీరు తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. నగర శివారు ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారని, నగరంలోని 25 శాతం జనాభాకు ట్యాంకర్ల ద్వారా వారానికి ఒక్కసారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారని చెప్పారు. మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ 2 ను పరిశీలించినప్పుడు భవనంపైన హై టెన్షన్ విద్యుత్ లైన్లు కేవలం 10 అడుగుల ఎత్తులోనే ఉన్నాయని, దీనివలన సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలకు నీటిని సరఫరా చేసే మోటార్లు ఉన్న ప్రాంతానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కార్మికులు చెత్త, గడ్డి మధ్య వెళ్లాల్సి వస్తోందన్నారు. చెరువులోని నీరు పచ్చగా మారిందని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశీలించిన బృందంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, ఎస్డీ హుసేన్ తదితరులు ఉన్నారు. -
కూటమి పగ
శనగ రైతుపైవిదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు సుంకం పెంచాలి. సుంకంతో పాటు సెస్ తగ్గించడం వల్ల దిగుమతులు 2023–24లో 1.64 లక్షల టన్నుల నుంచి 2024–25లో 15.06 లక్షల టన్నులకు తీవ్రంగా పెరిగాయి. దిగుమతి సుంకం తగ్గించడంతో తక్కువ ధరకు విదేశీ శనగలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తద్వారా దేశీయంగా మన రైతులు పండించిన శనగ ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పడిపోయాయి. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్చార్జ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో శనగ రైతు కుదేలవుతున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలపై సుంకాలను తగ్గించి కేంద్ర ప్రభుత్వం దేశీయ రైతుల నడ్డి విరిచింది. సరైన ధరలు లేక ఇప్పటికే లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మగ్గిపోతుండగా, ఈ ఏడాది రబీ సీజన్లో శనగ పంట మరికొద్ది రోజుల్లో చేతికి రానుంది. దాంతో వైఎస్సార్ సీపీ శనగ రైతులను ఆదుకోవాలంటూ పోరుబాట పట్టింది. ఒంగోలు సబర్బన్: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు దాటినా రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్నిరకాల రైతులు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వేడుకున్నా ప్రయోజనం శూన్యం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఏటా 1.50 లక్షల ఎకరాలకు పైగా శనగ సాగు చేస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అయితే దాదాపు 2 లక్షల ఎకరాల వరకూ శనగ సాగు చేశారు. అలాంటిది చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత శనగ సాగు ఏడాదికేడాదికి తగ్గిపోతోంది. గత సంవత్సరం లక్ష ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరం కేవలం 70 వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు సాగు చేశారు. ఈ ఏడాది రబీ సీజన్లో శనగ పంట మరో నెల రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముందుగా వేసిన పంటను వారం, పది రోజుల్లో కోత కోసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దాంతో వైఎస్సార్ సీపీ శనగ రైతులను ఆదుకోవాలంటూ పోరుబాట పట్టింది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి బాబులు ఈనెల 7వ తేదీన కలెక్టర్ పి.రాజాబాబును కలిసి శనగ రైతులను ఆదుకోవాలంటూ కోరారు. 10 లక్షల క్వింటాళ్లు కోల్డ్ స్టోరేజీల్లో... రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రెండేళ్ల నుంచి శనగ నిల్వలు 10 లక్షల క్వింటాళ్లు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతున్నాయి. 50 వేల మందికి పైగా రైతులు తమ శనగ నిల్వలను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. కనీసం మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవటంతో నష్టాలకు అమ్ముకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక శనగ రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఒంగోలుతో పాటు సంతనూతలపాడు, కొండపి, అద్దంకి, దర్శి, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలలో పాత శనగలు మగ్గుతున్నాయి. మద్దతు ధర కూడా లేక అవస్థలు... శనగ పంటకు మద్దతు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5650 కూడా లేకపోవటంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ప్రస్తుతం క్వింటా రూ.5 వేల లోపే కొనుగోలు చేయటంతో కనీసం ఖర్చులు కూడా రావని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చివరకు కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలకు అద్దెలు కూడా కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూలీలకు, పెట్టిన పెట్టుబడులు చెల్లించేందుకు కొందరు రైతులు ఇచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విదేశాల నుంచి వచ్చే శనగకు దిగుమతి సుంకం తగ్గించి మోసం... విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దిగుమతి సుంకం 60 శాతం ఉండగా దాన్ని పది శాతానికి తగ్గించింది. దాంతో విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా శనగలు దేశంలోని మార్కెట్లకు చేరనున్నాయి. ఫలితంగా దేశీయంగా పండించిన శనగలకు ధర ఇంకా దారుణంగా పడిపోయే పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కల్పిస్తున్నాయి. ఇక్కడి శనగలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు దిగుమతి సుంకాన్ని తగ్గించకుండా చూడటంలో ఎలాంటి శ్రద్ధ చూపలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దిగుమతి సుంకం పెంచేందుకు పోరాటం... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలపై సుంకాన్ని పెంచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రుల చుట్టూ తిరిగి, లేఖల మీద లేఖలు రాసి దిగుమతి సుంకం 30 శాతం ఉన్నదానికి 60 శాతానికి తీసుకెళ్లారు. దాంతో మన రాష్ట్రంలోని శనగ రైతులతో పాటు దేశంలో శనగ పండించిన రైతులందరికీ ప్రయోజనం చేకూరింది. శనగ రైతుకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్... వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత శనగ రైతుల కష్టాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. 2014 నుంచి 2019 మే నెల వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు శనగ రైతులను పట్టించుకోకపోవటంతో రైతులు పండించిన శనగలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసుకొన్నారు. దాంతో నష్టాలతో ఉన్న శనగ రైతులకు ఆదుకోవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి ఆదుకున్నారు. ఆ విధంగా జిల్లాలోని దాదాపు 35 వేల మంది శనగ రైతులకు ప్రయోజనం చేకూరింది. దానికితోడు 2020 నుంచి బహిరంగ మార్కెట్లో జేజే రకం శనగలకు దాదాపు క్వింటా రూ.8 వేలకు పైగా ధర పలికింది. కాగ్–2 రకానికి రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు ధర రావటంతో రైతులు ఎంతో సంతోషంగా పంట సాగు చేశారు.రాష్ట్రంలోని శనగ రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు తగ్గించిన సుంకాన్ని పెంచాలని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా 50 నుంచి 60 శాతం వరకు సుంకాన్ని పెంచాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తిలు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్కు, పీయూష్ గోయల్కు లేఖలు రాశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏవిధంగానైనా శనగ రైతులను ఆదుకోవాలన్నదే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పోరాడుతోంది. జిల్లాలో ప్రధాన పంట శనగ..రెండేళ్ల నుంచి పండించిన శనగలకు మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయి. ఈ సంవత్సరం కూడా శనగ పంట చేతికి వచ్చే స్థితిలో విదేశాల నుంచి సుంకాలు లేకుండా దిగుమతి అవుతున్న శనగల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శనగ రైతులు నష్టపోతుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్వింటాకు రూ.1500 చొప్పున ఒక్కో రైతుకు 35 క్వింటాళ్లకు ఇచ్చి ఆదుకున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.1000 బోనస్ ప్రకటించాలి. – చుండూరు రవిబాబు, వైఎస్సార్సీపీ ఒంగోలు ఇన్చార్జ్ -
నగర కార్పొరేషన్లో ఏసీబీ తనిఖీలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఒంగోలు కార్యాలయ ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ రికార్డులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవటానికి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)ను ప్రవేశపెట్టింది. ఆ స్కీంలో ఏమైనా అక్రమాలు చోటుచేసుకున్నాయా అన్న అంశంపై రికార్డులు పరిశీలించేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఒంగోలు ఏసీబీ సీఐలు బి.రమేష్ బాబు, సీహెచ్.శేషుల ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. అధికారులు మధ్యాహ్నం 12.30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్షన్లోకి ప్రత్యేక ఏసీబీ బృందం ప్రవేశించింది. అప్పటి వరకు లోపల ఉన్న అధికారులను, సిబ్బందిని ఎవరినీ బయటకు పోనీయకుండా వాళ్ల వద్ద ఉన్న సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) పోస్టు ఖాళీగా ఉంది. ఏసీపీగా ఉన్న జెడ్.సుధాకర్ ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఏసీపీ అదనపు బాధ్యతలు టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) బాబూరావు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలోకి ప్రవేశించిన సమయంలో బాబూరావు తన చాంబర్లోనే ఉన్నారు. అధికారులు చేసిన సోదాల్లో ఇరువురు సిబ్బంది వద్ద ఒకరి వద్ద రూ.3 వేలు, మరొకరి వద్ద రూ.2 వేలు నగదు ఉంది. అవి సొంత ఖర్చుల కోసం దగ్గర పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి అడుగుపెట్టే సమయానికి నగర కమిషనర్ కే.వెంకటేశ్వరరావు ఎస్ఎస్ ట్యాంకులను పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలోనే ప్రత్యేక చాంబర్ ఉండే మున్సిపల్ సర్వేయర్ ఆవుల శ్రీనివాసరావు కూడా కార్యాలయంలో లేరు. బీపీఎస్ రికార్డుల పరిశీలన లోతుగా... ఏసీబీ అధికారులు బీపీఎస్ స్కీమ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రెగ్యులరైజ్ చేశారు.. ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి.. నగరంలో మొత్తం ఎన్ని అక్రమ భవనాలు ఉన్నాయి.. వాటిలో బీపీఎస్ కోసం చేసుకున్న దరఖాస్తులు ఎన్ని.. కమర్షియల్ కాంప్లెక్స్ల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా అన్న అన్ని కోణాల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. బుధవారం ఆయా రికార్డుల ఆధారంగా క్షేత్ర స్థాయి పరిశీలించనున్నారు. దాడుల్లో ఏసీబీ ఎస్సైలు షరీఫ్, ప్రసాదుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎందరు పిల్లల్ని కనాలో బాబే చెబుతారా
● హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య ఒంగోలు టౌన్: ఎంత మంది పిల్లలను కనాలో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం మహిళల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే అత్యధిక జనాభాతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న మనదేశంలో ప్రజలకు సరైన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో పాలకులు వెనకబడ్డారని తెలిపారు. ఒకరిద్దరినే పోషించలేక ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. చేయడానికి పనులు లేవని, చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో అధికంగా పిల్లలను కనాల్సిందిగా చంద్రబాబు చెప్పడం తగదన్నారు. ఆర్ధిక వనరులను బట్టి భార్యాభర్తలు ఎంతమందిని కనాలో నిర్ణయించుకుంటారని, ముఖ్యమంత్రి ఇచ్చే రూ.25 వేల కోసం పిల్లలను కనమని చెప్పడం దారుణమన్నారు. దళిత పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం మాట్లాడుతూ ఉత్తర భారతంలో ఎక్కువ జనాభా ఉండడం వలన ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉన్నాయని, దక్షిణ భారతంలో తక్కువగా జనాభా ఉండడం వలన తక్కువ పార్లమెంటు సీట్లు ఉన్నాయని, ఈ కారణంతోనే చంద్రబాబు అధికంగా పిల్లలను కనమని చెబుతున్నారని వివరించారు. కేవలం పార్లమెంటు సీట్ల కోసమే పిల్లలను కనమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో హేతువాద నాయకులు ఎంకే బేగ్, షేక్ నజీర్ బాషా, గోరంట్ల పిచ్చయ్య, సుబానీ, ఎస్వీ రంగారెడ్డి, గుమ్మళ్ల నరసింహారావు పాల్గొన్నారు. -
ఎస్టీలను బహిష్కరించిన గ్రామస్తులు
● ఆలయం వద్ద అసభ్యకరంగా ప్రవర్తించడంతో బహిష్కరించామంటున్న గ్రామస్తులు మార్కాపురం రూరల్: మండలంలోని మిట్టమీదపల్లె గ్రామంలో నివసిస్తున్న ఎస్టీ కులానికి చెందిన కుటుంబాలను గ్రామస్తులు బహిష్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లె గ్రామంలో కొందరు ఎస్టీలు గ్రామంలోని ఆలయాల వద్ద మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. అయితే గ్రామస్తుల మాటలు వారు వినకపోవడంతో గ్రామంలోని మిగతా కులాలకు చెందిన వారు వారిని గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామ శివారులో ఎస్టీలు నివసిస్తున్నారు. గ్రామ బహిష్కరణతో ఎస్టీలు గ్రామంలోకి నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలుకు వచ్చినప్పుడు వారికి ఎటువంటి వస్తువులు అమ్మరాదని మైకుల ద్వారా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. వారికి అవసరమైన వస్తువులను అమ్మితే షాపు యజమానులకు ఫైన్ వేస్తామని హెచ్చరించారు. దీనిపై పోలీసులను వివరణ అడగ్గా ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన ఎస్టీలు తహశీల్దార్కు వినతి పత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీంతో తహశీల్దారుతో పాటు రూరల్ ఎస్సై మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని ఇరువురి మధ్య సమస్యను పరిష్కరించి రాజీ చేశారు. -
వడగాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: వడగాలులకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లాలోని పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధిక ఉష్ణోగ్రతలతో చిన్నారులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలన్నారు. రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మిట్ట మధ్యాహ్నం వేళల్లో ఎండలో పనిచేయకుండా చూడాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాగునీటికి, పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి కొరత లేకుండా దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీ ప్రదేశాల్లో వాహనదారులు నిలిచి ఉండే చోట నీడ కోసం షెడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి బోర్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర హోం మంత్రి వి.అనిత జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్సు నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్తో పాటు డీఆర్వో బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ డీపీఎం మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఈఓ రేణుక, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ. నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్, భూగర్భ జల వనరులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
అదృశ్యమైన విద్యార్థి శవమై తేలాడు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రెండు వారాల కిందట కాలేజీ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి కృష్ణానదిలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గొలమారి శివారెడ్డి, లక్ష్మీ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సాయికృష్ణారెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసి చైన్నెలో ఉంటుండగా చిన్న కుమారుడు సాయి నిహార్రెడ్డి(16) నిడమానూరులోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 19వ తేదీన నిహార్రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తాను పీఎన్బీఎస్ బస్టాండ్కు వెళ్లి వస్తాను, మీరు కాలేజీకి వెళ్లండి అని నిహార్రెడ్డి తన స్నేహితులకు చెప్పగా వారు కాలేజీకి వెళ్లారు. 20వ తేదీకి కూడా కాలేజీకి చేరుకోకపోవడంతో కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. వెంటనే కాలేజీ వద్దకు చేరుకుని సిబ్బందితో కలిసి పటమట పోలీస్స్టేషన్కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కృష్ణానదిలో భవానీద్వీపంలో ఒక బాలుడు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిహార్రెడ్డి తల్లిదండ్రులకు చూపించారు. గుర్తులు ఆధారంగా తన కుమారుడు నిహార్రెడ్డిగా నిర్ధారించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో వారం రోజుల కిత్రం చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. -
హత్య కేసులో పోలీసుల అదుపులో భర్త
బల్లికురవ: పథకం ప్రకారం భార్యను పొలంలోకి తీసుకెళ్లి సాగర్ కాలువలోని నెట్టేసిన భర్తను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సంతమాగులూరు సీఐ కె. వెంకటరావు, బల్లికురవ ఎస్సై వై. నాగరాజు తెలిపారు. మండలంలోని వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి వీరాంజనేయులు భార్య గంగాభవాని (28) గత మంగళవారం సాయంత్రం సాగర్ అద్దంకి బ్రాంచ్ కాల్వ 33/0 కి ఎగువన హత్యతో కాల్వలోకి నెట్టిన విషయం విదితమే. భవాని సోదరుడు కొనిదెన శ్రీను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ,ఎస్సైలు వివరించారు. -
లారీ ఢీకొని 30 గొర్రెలు మృతి
కొమరోలు: లారీ వేగంగా గొర్రెల మందను ఢీకొనడంతో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే..స్థానిక నయారా పెట్రోలు బంకు సమీపంలో గొర్రెల మంద వెళుతుండగా పోరుమామిళ్ల నుంచి బేస్తవారపేట వైపుగా వెళుతున్న ఓ లారీ మంగళవారం తెల్లవారుజామున వేగంగా వెళుతూ గొర్రెల మందును ఢీకొంది. ప్రమాదంలో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. గొర్రెల మందను కమ్మనేటి క్రిష్ణయ్య, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రాయపాటి ప్రవీన్లు గిద్దలూరు మండలం పొదలకొండపల్లె నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా నాగులకుంట్ల గ్రామానికి తోలుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెలు మృతి చెందడంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. గిద్దలూరు రూరల్: పట్టణంలోని నల్లబండ బజారులోని పాములపల్లె రైల్వే గేటు వద్ద సోమవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి పట్టణంలోని కొన్ని రేషన్షాపు డీలర్ల వద్ద 20కి పైగా బియ్యం బస్తాలను కొనుగోలు చేసి ట్రాక్టర్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ట్రాక్టర్తో సహా పోలీస్స్టేషన్కు తరలించారు. పట్టుబడిన రేషన్ బియ్యం బస్తాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించి 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉలవపాడు: మండల పరిధిలోని చాకిచర్ల పంచాయతీ చినపట్టపుపాలెం తీరానికి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడు గళ్ల చొక్కా, నల్ల షార్ట్ ధరించి ఉన్నాడు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి వస్తున్న సమయంలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల లోపు ఉంటుందని ఎస్సై సుబ్బారావు తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు
గిద్దలూరు రూరల్: గంజాయి విక్రయం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. గిద్దలూరు మండలం కేఎస్పల్లె గ్రామానికి చెందిన అలమూరి చంద్రయ్య, డిగపాటి వెంకటేష్, వెంగళ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన బిజ్జం శ్రీరాంరెడ్డి ముగ్గురు ఉప్పలపాడు గ్రామ సమీపంలో 3 కిలోల గంజాయి కలిగి ఉండటంతో అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.30 వేలు ఉంటుందని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలైన చంద్రయ్య విజయనగరం నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అతడి స్నేహితులైన వెంకటేష్, శ్రీరాం రెడ్డిల సహాయంతో విక్రయిస్తున్నారు. యువతను గంజాయికి బానిసలు చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచి చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు కె.సురేష్, రామకోటయ్య, ఏఎస్సై జిలానీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దర్శి: అద్దంకి రోడ్డులోని వీరాయపాలెం మేజర్ వద్ద కాలువ పక్కగా నడిచి వస్తుండగా ఫిట్స్ వచ్చి కాలువలో పడి పద్మ(40) అనే మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..బందువులంతా ఫంక్షన్లో ఉండగా ఆమె కాలువ పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంది. అకస్మాతుగా ఫిట్స్ వచ్చి కాలువలో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ చూడక పోవడంతో ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. -
తవ్వేసుకుందాం..!
మీకింత..మాకింత పెద్దారవీడు: మండలంలో గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. అధికారం మాది, అక్రమాలు చేస్తాం..అడిగేదెవరు, అధికారులూ మ్మల్ని ఏం చేయలేరనే రీతిలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. కూ బొంకూ లేకుండా యథేచ్చగా రేయింబవళ్లు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. పొక్లెయిన్లతో కొండను పిండి చేసి నిత్యం వందలాది ట్రిప్పుల మట్టిని తరలించి జేబులు నింపుకుంటున్నారు. టిప్పర్ రూ.5 వేల చొప్పున.. మండలంలో ఎస్ కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో కొండకు పైభాగాన రస్తాను ఏర్పాటు చేసి వందల సంఖ్యలో టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. 10 రోజుల నుంచి టిప్పర్ల ద్వారా నిత్యం వందలాది ట్రిప్పులు దేవరాజుగట్టు గ్రామం సమీపంలో వేసిన వెంచర్ల ప్లాట్లకు మట్టిని తరలిస్తున్నారు. ఒక టిప్పర్ మట్టి రూ 5 వేలకు విక్రయిస్తున్నారు. అందులో టీడీపీ నియోజకవర్గ నాయకులకు రూ.2 వేలు ముట్టచెప్పి చెబుతున్నారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం బెస్మట్టం కోసం ట్రాక్టర్తో మట్టి తోలుకుంటే వెంటనే మైనింగ్ అధికారులు ట్రాక్టర్ను సీజ్ చేస్తారు. అదే అధికార పార్టీ నాయకుల మద్దతుతో రేయింబవళ్లు అక్రమంగా వెంచర్లకు మట్టి తరలిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునేదెవరు..? కళ్ల ముందే ఇష్టం వచ్చినట్లు మట్టిని తరలిస్తుంటే గ్రామ్తులు ఇటీవల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత దేవరాజుగట్టు గ్రామం సమీపంలో వెంచర్లు ఎక్కువగా వేయడంతో కొండ మట్టికి మంచి డిమాండ్ పెరిగింది. దీంతో ఎటువంటి అనుమతులు లేకుండా టన్నుల కొద్ది గ్రావెల్ మట్టిని యథేచ్చగా టీడీపీ నాయకులు ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన లక్షల్లో ఆదాయానికి గండి పడుతోంది. భారీ స్థాయిలో కొండల తవ్వకాలు జరుగుతున్నా అడ్డుకునే నాథుడే కనిపించడం లేదు. యథేచ్చగా అక్రమంగా మట్టి తవ్వకాాలు జరుపుతున్నా సంబంధించిన అధికారులు నోరుమెదపకపోవడంలో మర్మమేంటో అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పంధించి గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు చేపట్టాలని, పచ్చని కొండలను రక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కొండ తవ్వి అక్రమంగా మట్టి తరలింపు టీడీపీ నాయకుల అండతోఆక్రమంగా మట్టి తోలకం టిప్పర్ రూ.5 వేల చొప్పున రియల్ వెంచర్ల యజమానులకు విక్రయం వచ్చిన దాంట్లో టీడీపీ నియోజకవర్గ నాయకునికి సగం వాటా గ్రామస్తులు ఫిర్యాదుచేసినా పట్టించుకోని అధికారులు -
ప్రయాణికుల భద్రత కోసమే డిజిటల్ స్టిక్కర్లు
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసులు వినూత్న చర్యలను చేపట్టింది. జిల్లా నలుమూలల నుంచి నగరానికి వచ్చి పోయే ప్రజలు, నగర ప్రజలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. నగరంలోని ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో డిజిటల్ స్టిక్కర్లను అమర్చే ప్రక్రియను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆటోలన్నింటికీ ఏ4 సైజు డిస్ప్లే బోర్డు, క్యూ ఆర్ కోడ్తో కూడిన రెండు స్టిక్కర్లను అందజేసినట్లు తెలిపారు. డిజిటలైజేషన్ నంబర్ స్టిక్కర్ల ద్వారా ప్రతి ఆటోకు ఒక గుర్తింపు ఉంటుందని, ప్రయాణికుల ఆటోను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఆటోల డిజిటలైజేషన్ ద్వారా చట్టవిరుద్ధకార్య కలాపాలను నియంత్రించడం సులువవుతుందని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత ఆప్షన్స్ వస్తాయని తెలిపారు. ఆటో డ్రైవర్, ఓనర్ గురించి పూర్తి వివరాలు ప్రింట్ తీసుకోవచ్చని చెప్పారు. షేర్ ఆన్ వాట్సప్ యాప్ ద్వారా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తాను ఏ ఆటోలో ప్రయాణిస్తున్నామో కుటుంబ సభ్యులకు తెలియజేసే అవకాశం ఉందన్నారు. లోకేషన్ ట్రాక్ చేసే సౌకర్యం ఉందన్నారు. ఆటో డ్రైవర్ ప్రవర్తన తీరును రేటింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పెడితే పోలీసు కంట్రోలు రూంకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అత్యవసరమైతే 112 కాల్ చేయవచ్చన్నారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆటో డ్రైవర్లకు గంజాయి వినియోగం, విక్రయాలు, కష్టనష్టాల గురించి అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అభినందనలు... ఆటోలో దొరికిన బ్యాగులను తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్లను ఎస్పీ హర్షవర్థన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల కోర్టు సెంటర్ వద్ద ఆటో ఎక్కిన ప్రయాణికులు దిగే సమయంలో బ్యాగు మరిచిపోయారు. ఆటో డ్రైవర్ గద్దె నాగేశ్వరరావు ఆ బ్యాగును వన్టౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆ బ్యాగులో రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, నగదు ఉన్నాయి. అలాగే బిలాల్ నగర్కు చెందిన షేక్ ఖలీల్ అనే ఆటో డ్రైవర్ వెంకటేశ్వరనగర్ కాలనీ వద్ద ప్రయాణికులను ఎక్కించుకొని జీజీహెచ్ వద్ద దించారు. ఆటోలో బ్యాగు మరిచి దిగారు. దాన్ని గమనించిన ఖలీల్ బ్యాగును వన్టౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆ బ్యాగులో 6 సవర్ల బంగారం, వెండి ఉన్నాయి. అత్యంత ఖరీదైన నగలు, నగదు దొరికిననా ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించి ఔన్యత్యం చాటుకున్నారని అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, ఆర్ఐ రమణా రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
కారు – ఐషర్ లారీ ఢీ
● ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు త్రిపురాంతకం: కారు – ఐషర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడుకు చెందిన పోతుల బాలరంగయ్య, శ్రీను, చెన్నయ్య, సుబ్బయ్య కారులో పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొపకొప్పలలోని అమ్మవారి గుడికి వెళ్లి తిరిగి అమానిగుడిపాడు వస్తున్నారు. ఆ సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ఐషర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతుల బాలరంగయ్య మృతిచెందగా, మిగిలిన ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ శివరామయ్య తెలిపారు. ● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన ఫిర్యాదుల విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసంలో ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వృద్దులు, నడవలేనిస్థితిలో ఉన్న వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణకుమార్, వన్టౌన్ సీఐ నాగరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై జనార్దన్రావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్ పాల్గొన్నారు. -
కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అండ
● సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున చీమకుర్తి రూరల్: వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున భరోసా ఇచ్చారు. చీమకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. సోమవారం మండలంలోని తొర్రగుడిపాడు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ సంస్థాగత కమిటీలపై సమావేశం నిర్వహించారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న పిలుపు మేరకు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పేలా చూడాలన్నారు. మనమంతా సమిష్టిగా కృషి చేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ చీమకుర్తి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు యన్నం శేషురెడ్డి, నాయకుడు చీదర్ల శేషు, వైస్ ఎంపీపీ రావి లక్ష్మయ్య, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓబులరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటరావు, రైతు విభాగం మండల అధ్యక్షుడు నల్లూరి రామచంద్ర, యూత్ అధ్యక్షుడు సుడిదెల వెంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నపల్లి నాగేశ్వరరావు, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు మక్కెన రాజేంద్ర, నాయకులు బొంతా సంతోష్, కూడలి మాలకొండయ్య శ్రీను, కొణికి సుబ్రహ్మణ్యం, నాగార్జున, వెంకటేశ్వర్లు, సుంకర హరికృష్ణ, ఆంద్రియ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలన దోపిడీమయం
త్రిపురాంతకం: సీఎం చంద్రబాబు పాలన మొత్తం దోపిడీమయమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని జి.ఉమ్మడివరం ఉగ్రనరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ఆయన మాట్లాడారు. సంపద సృష్టించామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాకా ఊది చెబుతుంటే ఆ సంపద తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి చేరడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి నేతలు ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పార్టీలకతీతంగా అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, కష్ట కాలంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2029లో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పార్టీ కోసం మీరు చేసిన త్యాగాలు వృథా కావని, ప్రతి ఒక్కరినీ గుర్తు రెండేళ్ల కూటమి పాలన మొత్తం అవినీతిమయమేనని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు, లోకేష్ సభలకు జనం నుంచి స్పందన ఉండటం లేదన్నారు. కానీ జగన్మోహన్రెడ్డి ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది ప్రజలు ఆయన వెంట వస్తున్నారని, ప్రజల్లో ఆయనుకున్న అభిమానం అలాంటిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, యూత్ కన్వీనర్ ఏ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఎస్ రంగబాబు, ఎం గాలెయ్య, సుబ్రహ్మణ్యం, బాలకోటిరెడ్డి, ఆర్ పిచ్చయ్య, అంజయ్య, పెద్దిరాజు, వీరయ్య, ఆదిరాములు, నాసరయ్య, హనుమంతు తదితరులు ఉన్నారు. తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి చేరుతున్న సంపద యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
ఆరుగురు పిల్లలను దత్తత తీసుకున్న దంపతులు
ఒంగోలు సబర్బన్: ఆరుగురు చిన్నారులకు దత్తత స్వీకార ప్రక్రియను కలెక్టర్ పి.రాజాబాబు సోమవారం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ చాంబర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు అనాథ బాలలుగా ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆరుగురు చిన్నారులకు పలువురు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రాంనగర్లోని శిశు గృహలో ఇప్పటి వరకు ఆ చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. వారిని కలెక్టర్ అధ్యక్షతన దత్తత ఇచ్చారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దంపతులు కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలను స్వీకరించారు. వారంతా పోలీసు శాఖ, బ్యాంకు, సాఫ్ట్వేర్, బిజినెస్ రంగాల్లో స్థిరపడినవారు కాగా, వారితో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పిల్లలు మీకు దేవుడిచ్చిన వరమని, మీ కడుపున పుట్టిన బిడ్డలుగా భావించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులకు దత్తత ఆర్డర్స్ను కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత జిల్లా అధికారిణి ఎం.నాగమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు నీలిమ వంశీలత, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు. -
మోసానికి బాబు బ్రాండ్ అంబాసిడర్
కురిచేడు: అబద్ధపు హామీలతో ప్రజలను వంచించండం చంద్రబాబు నైజమని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. మండలంలోని పడమర నాయుడుపాలెం, ఆవులమంద గ్రామాల మధ్య కొండపై వెలసిన ప్రసన్నాంజనేయ సమేత బొల్లి కొండ్రాయి స్వామి వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా యాదవులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పంటలకు సరైన మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజా పాలన లేదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, కేసులకు భయపడే రోజులు పోయావని, అవినీతిని ప్రశ్నించే రోజులు వచ్చాయన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని, మాట ఇస్తే తప్పడని, మడమ తిప్పని నాయకుడి వెంట మేమున్నామని బడుగు, బలహీన వర్గాల వారి కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఎన్నికల ముందు మాట ఇచ్చి వంద శాతం హామీలను నెరవేర్చిన ఏకై క ముఖ్యమంత్రి జగనన్న అని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం, భూ కబ్జా చేసి దోచుకుంటున్నారని, బినామీ పేర్లకు తక్కువ ధరకు భూములు అప్పగించి కొత్త రకం భూ దందాకు పాల్పడుతున్నారన్నారు. 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా, దర్శి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని హర్షధ్వానాల మధ్య కోరారు. అనంతరం యాదవలు బూచేపల్లిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యన్నాబత్తుల సుబ్బయ్య, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కండె గంగయ్య యాదవ్, సర్పంచ్ మహేష్, నాయకులు బొమ్మనబోయిన చిన్న ఆంజనేయులు, బొమ్మినీడు చెంచయ్య, చిన్న ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు బూటకపు హామీలతో బాబు నిలువునా మోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు పార్టీకి కార్యకర్తలకే కొండంత బలం దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
పంచేసుకుందాం...!
నువ్వు కొంచెం..నేను కొంచెంఅధికారం మనది.. మనల్ని అడిగేదెవరు..అడ్డగించేదెవరు... ఖాళీగా ఉందిగా నువ్వు కొంచెం..నేను కొంచెం పంచేసుకుందాం. అన్నట్లు టీడీపీ నేతల తీరు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఆక్రమణల జోలికి ఎవ్వరూ వెళ్లడం లేదు. చెరువు భూమిని చెరబట్టినా అధికారులు పట్టించుకోకుండా మిన్నకుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉలవపాడు: మండల పరిధిలోని ఎల్ రాజుపాలెంగ్రామంలోని రాజుల చెరువు లోని కొంత భూమి పై పచ్చనేతల కన్ను పడింది. రెండు నెలల నుంచి భూమిని చదును చేస్తున్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు బీసీ నేతలు ఈ భూమిని ఆక్రమించారు. ఇద్దరు నేతలు చెరో ఎకరాను చదును చేశారు. ఒక నేత జామాయిల్ మొక్కలు వేశాడు. మరో నేత చదును చేసి మొక్కలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాజుల చెరువు సుమారు 50 ఎకరాలు ఉంటుంది. వర్షం పడిన సమయంలో చెరువు నిండినా కూడా కొంత భాగం నీరు లేకుండా ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకున్న సదరు నాయకులు ఆ భూమిని కబ్జా చేయడానికి పూనుకున్నారు. గతంలో ఎల్.రాజుపాలెంలోని ఎస్సీ, బీసీలు ఎవరైనా మరణిస్తే ఇక్కడే కూడా పూడ్చిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. అంటే మరుభూమిగా కూడా ఈచెరువు భూమి గతంలో వాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వర్షాలు లేని సమయంలో ఇక్కడ శవాలను పూడ్చిపెడుతుంటామని గ్రామస్తులు అంటున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ చెరువు భూమిని ప్రస్తుతం ఇద్దరు టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఒక్కసారి మొక్కలు వేస్తే ఇక ఎవరిని పూడ్చిపెట్టడానికి రారు అనే ఆలోచన తో సదరు నాయకులు ఆక్రమించినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ఉపయోగంలేదని గ్రామస్థులు అంటున్నారు. ఫిర్యాదు చేసినా ఫలితం ఏది..? స్థానిక టీడీపీ నాయకులు చెరువు భూమిని ఆక్రమించి మొక్కలు నాటారని గ్రామస్తులు కలెక్టర్కు, స్థానిక తహసీల్దార్, నీటి పారుదల శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు భూమిని నేతలు ఆక్రమించారని అధికారులు నెల రోజుల క్రితమే గుర్తించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని ఆక్రమణలను తొలగిస్తామని తెలియచేశారు. కానీ టీడీపీకి చెందిన నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కూడా ఆక్రమణదారుల వైపు ఉండి వారికి అండగా నిలుస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రమైన ఉలవపాడులోని టీడీపీ నేత కుమారుడు అధికారులతో మాట్లాడి ఆక్రమణదారుల జోలికి వెళ్లవద్దని చెప్పడంతో అధికారులు కూడా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఆక్రమణలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్ఓ పీరయ్య వివరణ కోరగా ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, నీటిపారుదలశాఖ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో పరిశీలించినట్లు తెలిపారు. భూమి ఆక్రమణపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించామని, వారి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజుపాలెంలో రాజులచెరువు ఆక్రమణ రెండు ఎకరాల్లో జామాయిల్ సాగు ఇద్దరు టీడీపీ నేతల భూ కబ్జా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం -
గ్రీవెన్స్కు పోటెత్తిన అర్జీదారులు
ఒంగోలు సబర్బన్: స్థానిక ప్రకాశం భవన్లోని గ్రీవెన్స్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో మొత్తం 277 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ పి.రాజా బాబు నిర్వహించిన కార్యక్రమంలో అర్జీదారులు పోటెత్తారు. ఈ సందర్భంగా మీకోసం అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో వివరించాలన్నారు. కమ్యూనిటీ హాలును కబ్జా చెర నుంచి విడిపించాలి: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్లోని చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో కబ్జాకు గురైన డాక్టర్ బాబూ జగజ్జీవన రామ్ కమ్యూనిటీ హాలును కబ్జా చెర నుంచి విడిపించాలని తాటిపర్తి రాగయ్యతో స్థానికులు కలెక్టర్ పి.రాజా బాబుకు ఫిర్యాదు చేశారు. చెరువుకొమ్ముపాలెలో 20 ఏళ్ల క్రితం ఊరిలోని సమస్యలను ప్రజలందరూ కూర్చొని మాట్లాడుకోవటానికి, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనేది చర్చించుకోవటానికి, లైబ్రరీగా కూడా ఉపయోగించుకోవటానికి డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ కమ్యూనిటీ హాల్ను ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ప్రస్తుతం కమ్యూనిటీ భవనాన్ని గ్రామానికి చెందిన అధికార టీడీపీకి చెందిన జడా సుధాకర్ స్వలాభం కోసం వాడుకుంటూ ఆ భవనాన్ని కబ్జా చేశాడు. ఆ భవనంలో వారికి సంబంధించిన వస్తువులన్నింటినీ వారి అవసరాల కోసం తమ స్వంత ఇంటిలా ఉపయోగించుకొంటున్నాడు. ఆ భవనానికి తాళం వేసి తమ వద్దనే ఉంచుకొంటున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు గతంలో వీఆర్ఓకు, సచివాలయ సిబ్బందికి, కలెక్టర్ గ్రీవెన్స్లో కూడా అర్జీ ఇచ్చామన్నారు. మున్సిపల్ కమిషనర్కు అనేక సార్టు అర్జీ ఇచ్చామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కమ్యూనిటీ హాలును ఖాళీ చేయమని చెప్పటానికి వచ్చిన అధికారులను తన రాజకీయ బలంతో బెదిరింపులకు గురి చేస్తున్నాడన్నారు. ప్రజా అవసరాల కోసం ఉపయోగపడాల్సిన సదరు కమ్యూనిటీ హాలును స్వాధీనం చేసి గ్రామ కమిటీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులను బెదిరిస్తున్న జడ సుధాకర్పై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ డి. హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, కళావతి, డీపీఓ వెంకటేశ్వరరావులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్మిక నగర్ పేదలకు న్యాయం చేయాలి ఒంగోలు టౌన్: నగరంలోని కార్మిక నగర్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల గుడిసెలు కూల్చివేయడం దారుణమని, పేదలు నివసిస్తున్న భూమిని సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు కలెక్టర్ పి.రాజాబాబుకు కోరారు. సోమవారం స్పందనలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 186లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో పెరిగిపోయిన అద్దెలను చెల్లించే స్థోమత లేని 70 కుటుంబాలు 15 ఏళ్ల క్రితం కార్మిక నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని తెలిపారు. అక్కడ నివసిస్తున్న వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ కొందరు ప్రైవేటు వ్యక్తులు మూడు జేసీబీలు, 150 మంది వ్యక్తులతో కలిసి కార్మిక నగర్లోకి చొరబడి గుడిసెలను కూల్చివేశారని చెప్పారు. ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు కూడా అనుమతించకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని, భౌతిక దాడులు చేశారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు విధ్వంసం సృష్టించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దాంతో రెచ్చిపోయిన ప్రైవేటు వ్యక్తులు ఈ నెల 4వ తేదీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకున్నారని, బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలు అక్కడే డేరాలు వేసుకొని నివసిస్తున్నారని, అధికారులు భూమి సర్వే చేసి బాధితులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సీపీఎం నాయకులు జి.రమేష్, తంబి శ్రీనివాసరావు, సయ్యద్హుసేన్, దామా శ్రీనివాసరావు కలెక్టర్ను కలిసిన వారిలో వున్నారు. -
ఎస్సీ సెల్ సమావేశానికి తరలిరావాలి
మార్కాపురం: కాకినాడలో ఈనెల 11న నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మురారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు టీజేఆర్ సుధాకర్బాబు ఆధ్వర్యంలో కాకినాడలో ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, నియోజకవర్గాల నాయకులు హాజరుకావాలని కోరారు.కేసులను మిస్సింగ్ చేయొద్దు ఒంగోలు టౌన్: మిస్సింగ్ కేసులను అలక్ష్యం చేస్తే సహించేది లేదని, వీలైనంత త్వరగా విచారణ మొదలు పెట్టి ట్రేస్ చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్ నుంచి ఉమ్మడి జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా తప్పిపోయారని, కనిపించడం లేదని ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని చెప్పారు. తప్పిపోయిన వ్యక్తి ఫొటోలను అన్నీ పోలీసు స్టేషన్లకు పంపించి మెరుపు వేగంతో ట్రేస్ చేయడానికి ప్రయత్నించాలని చెప్పారు. మిస్సింగ్ కేసులను విభజించాలని, మతిస్థిమితంలేనివారు, చిన్నారులు, వృద్ధులు, బాలికలు, యువతులు, మహిళలు, పురుషులు తదితర కేటగిరీలుగా విభజించి విచారణ ప్రారంభించాలన్నారు. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, అన్నీ కోణాల్లోనూ కేసును అధ్యయనం చేయాలని చెప్పారు. మిస్సింగ్ కేసుల్లో ఎంత త్వరగా స్పందించామన్నదే ముఖ్యమని, అప్పుడే కేసును ట్రేస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నారు. అలాగే నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, సంబంధిత వ్యక్తులకు సకాలంలో సమన్స్ అందజేయాలని, మహిళలకు సంబంధించిన కేసుల్లో త్వరగా స్పందించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పారా మెడికల్ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలి
22ఏ భూ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టండిపంచాయతీ కార్మికులకు రూ.21 వేలు ఇవ్వాలి ఒంగోలు టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న పారా మెడికల్ ఉద్యోగుల వేతన వ్యత్యాస బకాయిలను వెంటనే చెల్లించాలని యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో డీఎంహెచ్ఓను కలిశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగులకు పే, డీఏ, హెచ్ఆర్ఏ వేతనాలు చెల్లించడానికి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇందుకుగాను రూ.21.51 కోట్లు కూడా విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 2003 సెప్టంబర్ 14 నుంచి 2024 ఏప్రిల్లో రెగ్యులర్ అయిన హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మాసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా వర్తిస్తుందని వివరించారు. జిల్లాలో సుమారు 100కి పైగా వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారని, ఒక్కొక్కరికి సుమారు రూ.76 వేల వ్యత్యాస వేతన బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు పీహెచ్సీల నుంచి ఎరియర్ బిల్లులను ట్రెజరీలకు పంపించలేదని, దీనివలన ఆర్ధిక సంవత్సరం ముగిసి నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా ట్రెజరీ అధికారులు జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.శ్రీధర్ బాబు, వై.సురేష్, కాలం సుబ్బారావు, సీహెచ్ పుల్లయ్య, మాచిరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: పంచాయతీ కార్మికులు, ఎన్ఎంఆర్లు, గ్రీన్ అంబాసిడర్లకు మున్సిపల్ కార్మికుల మాదిరిగా నెలకు రూ.21 వేల జీతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం సంఘ గౌరవాధ్యక్షుడు ఎం.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల గ్రామ పంచాయతీ కార్మికులు, 20 వేల గ్రీన్ అంబాసిడర్లు, 700 మంది ఎన్ఎంఆర్లు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నారు. ఏడేళ్లుగా జీతాలు పెంచలేదని తెలిపారు. ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.12 వేల లోపు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని, కొన్ని చోట్ల మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర కొర జీతాలు కూడా నెల నెలా చెల్లించకపోవడంతో 4 నుంచి 24 నెలల వరకు బకాయిలు పేరుకుపోయాయని, గ్రీన్ అంబాసిడర్లకు కొన్ని చోట్ల మూడేళ్లుగా జీతాలు ఇవ్వకుండా పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడం, పెట్రోల్, గ్యాస్, కరెంట్ చార్జీల భారంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు రూ.21 వేల జీతం అమలు చేయడం, బకాయిలు చెల్లించడం, హైకోర్టు తీర్పులు అమలు చేయడం, గుర్తింపు కార్డులు, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం, చట్టబద్ధ సెలవులు కల్పించడం, ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్ రత్న కుమార్, మేకల మగ్గారావు, ఇండ్ల వినాయకమ్మ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఉమ్మడి జిల్లా డీఆర్వో ఓబులేసు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా 22ఏ భూసమస్యలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ సమస్యలపై వచ్చే అర్జీలను పాత పద్ధతిన తహశీల్దార్ నుంచి ఆర్డీవోకు మళ్లీ ఆర్డీవో నుంచి కలెక్టర్కు పంపిస్తే తగు చర్యలు తీసుకుంటారన్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన జీవో రానందున సమస్యలు పరిష్కారం కావడం లేదని వివరించారు. దాదాపు 476 ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారిని పిలిపించి వాటిని పరిశీలించి తగిన నివేదిక పంపాలని ఆదేశించారు. కారణం లేకుండా 22ఏలో చేర్చిన భూములపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా భూ వివాదాలను పరిష్కరించాలన్నారు. మిగిలిన సమస్యలపై కూడా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలపై 86, ఇతర సమస్యలపై 51 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్, శివరామిరెడ్డి, డీఎంహెచ్వో వాణీశ్రీ, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నమ్మ, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయాధికారి బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
వరిసాగుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో తూర్పు ప్రాంతంలో విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19,144 హెక్టార్లు లక్ష్యం కాగా 24,647 హెక్టార్లలో సాగైంది. పశ్చిమాన సాధారణ విస్తీర్ణం కంటే సుమారు 600 హెక్టార్లు తక్కువగా సాగైంది. ఫలితంగా మార్కాపురం జిల్లాలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండగా ప్రకాశం జిల్లాలో ధాన్యం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41,467 మంది వరిసాగు చేస్తున్నారు. ఖరీఫ్లో 12,826 హెక్టార్లలో వరిసాగు లక్ష్యం కాగా 16,704 హెక్టార్లలో, రబీలో 19,144 హెక్టార్లు లక్ష్యం కాగా 24,647 హెక్టార్లలో వరిసాగు జరిగింది. మార్కాపురం జిల్లాలో 4219 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 3623 హెక్టార్లలో సాగైంది. సాగు తగ్గడంతో మార్కాపురం జిల్లాలో బియ్యం ధరలు క్వింటాకు రూ.400 పెరిగింది. ప్రకాశం జిల్లాలో మాత్రం ధాన్యం ధరలు క్వింటాకు రూ.200 తగ్గాయి. ఎటుచూసినా అన్నదాత నష్టపోతున్నాడు. దళారులు, వ్యాపారులు పశ్చిమాన బియ్యం ధరలు అమాంతం పెంచేసి జనాన్ని దోచేస్తున్నారు. తూర్పున ధాన్యం ధరలు తగ్గించేసి రైతులు నిండా ముంచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని ప్రభుత్వ పెద్దలు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా..క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులపై రైతులు మండిపడుతున్నారు. ధాన్యం ధరల పతనం ఇలా.. ప్రకాశం జిల్లాలో ధాన్యం ధరలు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. నిన్నటి వరకు బీపీటీ రకం రూ.1,670 లు ఉండగా ప్రస్తుతం రూ.1,600 లకు దిగువన ధర పలుకుతోంది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న దళారులు ధాన్యం కోతలు జరగనంతసేపు మంచి రేటు ఇస్తానని నమ్మబలికి తీరా ధాన్యం కోతలు జరిగిన తరువాత మాట మార్చేశారు. 76 కేజీల ధాన్యం బస్తాధర రూ.1,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 76 కేజీల ధాన్యం ధర రూ.2,400 నుంచి రూ.2,600 వరకు ధర పలికింది. నేడు పరిస్థితి విరుద్దంగా ఉంది. నిన్నటి వరకు కేఎన్ఎం రకం 76 కేజీలు ధాన్యం బస్తా పాతవి రూ.1,800 లు ఉండగా నేడు రూ.1,700లు, బీపీటీ రకం కొత్తవి రూ.1,600లు ఉండగా నేడు రూ.1,500 లు మాత్రమే ధర పలుకుతోంది. పెరిగిన బియ్యం ధరలు మార్కాపురం జిల్లాలో వరిసాగు తగ్గటంతో ధాన్యానికి డిమాండ్ ఏర్పడింది. పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలువురు వ్యాపారులు లారీల్లో బియ్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. కొరతను ఆసరా చేసుకుని వ్యాపారులు బస్తాకు రూ.100 నుంచి రూ.200 పెంచి విక్రయిస్తున్నారు. గత నెలాఖరులో బీపీటీ రకం రూ.6 వేలు ఉండగా పదిరోజుల వ్యవధిలోనే బస్తా ధర రూ.200 పెరిగింది. గత 15 రోజుల నుంచి మరో రూ.100 పెంచి విక్రయిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో సుమారు 25 మందికిపైగా బియ్యం హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు. వీరు కర్నూల్ సోనా, బీిపీటీ, నెంబర్లు తదితర రకాల బియ్యాన్ని అమ్ముతుండటంతోపాటు స్థానికంగా బియ్యాన్ని సేకరించి ఏదో బ్రాండ్ నేమ్ బస్తాలపై వేసి సూపర్ క్వాలిటీ అంటూ పాతిక కిలోల టిక్కీ రూ.1400 నుంచి రూ.1600కు విక్రయిస్తున్నారు. అంటే బస్తాకు రూ.5600 నుంచి రూ.6400 వరకూ విక్రయిస్తున్నారు. కొంటే మంట..అమ్మితే చింత..!బియ్యం ధరలు పెరిగాయి గత నెల కంటే ఈనెలలో బియ్యం ధరలు పెరిగాయి. టిక్కీ (25 కిలోలు) 1350 నుంచి 1500 కు పెరిగింది. రాబోయే నాలుగైదు నెలల వరకూ కొత్త బియ్యం వచ్చే పరిస్థితి లేదు. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో బియ్యం కొనిపెట్టుకుంటే మేలన్న అభిప్రాయం ఏర్పడింది. ధరలు పెరగకుండా అధికారులు చూడాలి. – సీఎం ఖాసీం, 17వ బ్లాకు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మార్కాపురం ఈ మండలాల్లో వరిసాగు నిల్... మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, తర్లుపాడు, దోర్నాల, అర్ధవీడు, యర్రగొండపాలెం, గిద్దలూరు మండలాల్లో వరిసాగు పూర్తిగా మర్చిపోయారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు బియ్యాన్ని ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని మండలాల్లో నామమాత్రంగా వరిసాగు చేపట్టారు. వర్షాలు లేకపోవడంతో రైతులు వరిపంట సాగు చేపట్టలేదు. -
వేదపాఠశాలను సందర్శించిన విజయేంద్ర సరస్వతి
పొదిలి రూరల్: పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి గ్రామంలో ఉన్న శంకర విద్యాలయాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి సోమవారం సందర్శించారు. ముందుగా దర్శి నుంచి పొదిలికి వచ్చిన స్వామికి స్థానికులు పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓబులక్కపల్లి వేదపాఠశాలను సందర్శించారు. కొంతమంది భక్తులు స్వామి వారికి తమ ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ బాధితులు ఉన్నారని, ఫ్లోరైడ్ ప్రాంతం కావడంతో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్వామి వారు ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. కిడ్నీ బాధితుల కోసం మంచి ఆస్పత్రి ఏర్పాటు చేయాలని విన్నవించారు. -
రెండుమూడు నెలల్లోనే పూర్తి చేస్తాం
● యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన కలెక్టర్ మేదరమెట్ల: కొరిశపాడు మండలంలో నిర్మాణంలో ఉన్న యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను రెండుమూడు నెలల్లోనే పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని కలెక్టర్ పీ రాజాబాబు తెలిపారు. పథకానికి సంబంధించిన రిజర్వాయర్ను అధికారులతో కలిసి కొరిశపాడులో ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం చాలా వరకు పూర్తయిందని, కొద్దిమేర పనులే మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా మూడు నెలల్లోపే పూర్తి చేసి పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు, ముంపునకు గురైన గ్రామానికి నష్టపరిహారాన్ని అందజేసేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. కలెక్టర్ వెంట ప్రాజెక్టు ఎస్ఈ అబూత్అలీం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి, త హసీల్దార్, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మద్దిపాడు: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై మద్దిపాడు ఫ్లై ఓవర్ వద్ద చోటుచేసుకుంది. మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన కొణిజేటి శివప్రసాద్ (38) ఒంగోలులో కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. శనివారం రాత్రి షాపు మూసివేసి తిరిగి వెల్లంపల్లికి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్నాడు. మద్దిపాడు ఫ్లై ఓవర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ జగన్తోనే మహిళల సంక్షేమం
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో మహిళల సంక్షేమం అనేది కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అధ్యక్షత వహించగా, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళల సాధికారతకు సమిష్టి కృషి అవసరమన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా కుటుంబాలు, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళల హక్కులు, గౌరవం కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశాలతోనే సమాజం అభివృద్ధి : బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున మాట్లాడుతూ మహిళల సాధికారతకు రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న విశేషంగా కృషి చేశారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. ముందు పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, చుండూరి రవిబాబు గజమాలతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీబీ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు సీఎం వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కొండపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణకుమారి, మర్రిపూడి జెడ్పీటీసీ మాకినేని సుధారాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు పోలు వరలక్ష్మి, నాగులుప్పలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ, టంగుటూరు జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి, కౌన్సిలర్ తమ్మినేని సుజాత, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత, కోఆప్షన్ మెంబర్ షేక్ రషీదా, కౌన్సిలర్ వెన్నపూస కుమారి, మహిళా నాయకులు పేరం ప్రసన్న, వడ్లమూడి వాణి, బడుగు ఇందిర, మేరికుమారి, సయ్యద్ అప్సర్, బత్తుల ప్రమీల, బడుగు శోభలత, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
ఒంగోలు సబర్బన్: మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి స్వామి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు నగరంలోని బృందావనం కల్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ పథకాల కింద మెప్మా మహిళలకు రూ.18.60 కోట్లు, డీఆర్డీఏ మహిళలకు రూ.314.61 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.67.28 కోట్ల విలువైన బ్యాంకు చెక్కులను ఆర్థిక రుణాలుగా అందించారు. ఆ ప్రాంగణంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్ పి.రాజాబాబు ప్రారంభించి అర్హులైన బాలికకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించారు. మెప్మా, ఐసీడీఎస్, పోలీస్, డీఆర్డీఏ, ఏపీఎంఐపీ, బ్యాంకింగ్, పరిశ్రమలు, ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి, కలెక్టర్తో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర అతిథులు వీక్షించారు. రాయితీ ద్వారా మంజూరైన ఒక ట్రాక్టర్, మూడు ఆటోలను లబ్ధిదారులకు అందించారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, డీఆర్వో చిన ఓబులేసు, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఎస్డీసీ కళావతి, ఎల్డీఎం రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఐసీడీఎస్ పీడీ నాగమణి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
8 సమస్యాత్మక కేంద్రాలు...
పది పరీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 165 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 8 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్లు జరగకుండా ఉండేందుకు 9 ఫ్లయింగ్, 10 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షల నిర్వహణకు 1718 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అలాగే చీఫ్ సూపరింటెండెంట్లు 165 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 165 మందిని నియమించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం సెట్–1, 11వ తేదీ సాయంత్రం సెట్–2 ప్రశ్నపత్రాలు జిల్లాకు వస్తాయని అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా 38 స్టోరేజ్ పాయింట్లలో రెండు సెట్ల ప్రశ్నపత్రాలను భద్రపరచనున్నారు. -
యువకుడిని కాపాడిన పోలీసులు
కంభం: ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సకాలంలో స్పందించిన పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఎల్.గౌతం మూడు నెలలుగా కంభంలో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తాను చనిపోతున్నానని తన స్నేహితుడికి ‘ఐ మిస్ యూ’ అని మెసేజ్ పంపించాడు. అనుమానం వచ్చిన స్నేహితుడు 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకృష్ణారెడ్డి ఐటీ కోర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైల్వేస్టేషన్ సమీపంలో గౌతం ఉన్నట్లు గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడినందుకు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరిచిన ఎస్సై, కంట్రోల్ రూమ్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గౌతం లండన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. తనతో పాటు చదువుకున్న ఓ అమ్మాయిని ప్రేమించగా ఆ అమ్మాయి వివాహం మరొకరితో జరగడం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. -
కూటమి నేతల అజెండా
అబద్ధాలు, మోసాలే కురిచేడు: చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలే అజెండాగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసన సభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. మండలంలోని బోధనంపాడులో వేంచేసి ఉన్న శ్రీవీరాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన స్వామి వారిని దర్శించుకుని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ప్రసంగించారు. ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ ఎండలు మండుతున్న నేపథ్యంలో గ్రామాలు తాగునీరు లేక గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఓట్ల తొలగింపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పనులకు ఆటంకాలు కలిగించటం, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, జగనన్న పాలనలో మంజూరై పూర్తయిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అంగన్వాడీలు జీతాలు పెంచమంటే వారిని నిర్ధాక్షిణంగా పోలీసులతో కొట్టించి స్టేషన్లకు తరలించటం మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. పింఛన్లు రద్దు చేసి ఎందరో వృద్ధులను అనాథలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపులో కుట్ర రాబోవు ఎన్నికల్లో గెలవలేమని గ్రహించిన తెలుగుదేశం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఓట్లను అన్యాయంగా తొలగించేందుకు కుట్రపన్నుతున్నారని బూచేపల్లి మండిపడ్డారు. ఇసుక, మట్టి అమ్ముకోవడమే కాకుండా కమీషన్ల పర్వం కొనసాగిస్తున్న వారు ప్రజల యోగక్షేమాలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకుని జనరంజక పరిపాలన కొనసాగించుకుందామని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు పోతిరెడ్డి నాగిరెడ్డి, గ్రామ నాయకులు వేమా వెంకటేశ్వర్లు, పవన్కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించలేదు జగనన్నదే జనరంజక పాలన ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి -
శింగరకొండలో వైవీ ప్రత్యేక పూజలు
అద్దంకి: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం రాజ్యసభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ, సోదరులు ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాన్ని బహూకరించి పూలమాలతో సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు -
రెండు బైకులు ఢీకొని.. ఒకరు దుర్మరణం
మర్రిపూడి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిలంకూరు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిలంకూరు గ్రామానికి చెందిన డాలు ఏడుకొండలు తన చిన్నాన్న డాలు నరసయ్య(62)లు కలిసి ద్విచక్ర వాహనంపై బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఎదురుగా గురునాథం, యోహోషువాలు వస్తున్నారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో నలుగురూ చెల్లాచెదరుగా పడిపోయారు. పచ్చాకు మేసీ్త్రగా పనిచేసే నరసయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుకొండలు, యెహోషువాలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రగాయాలైన ఏడుకొండలు, యెహోషువాలను వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం కోసం నరసయ్య మృతదేహాన్ని కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. -
కోడిపందేల శిబిరంపై దాడి
పొన్నలూరు: మండలంలోని మాలపాడు శివారు అటవీ ప్రాంతంలో కోడిపందేల శిబిరంపై శనివారం పోలీసులు దాడి చేసి 23 మందిని అరెస్టు చేశారు. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కొండపి సీఐ సోమశేఖర్, మర్రిపూడి, కొండపి ఎస్సైలు రమేష్, ప్రేమ్కుమార్లు తమ సిబ్బందితో కలిసి శిబిరంపై దాడి చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.42,860 నగదుతో పాటు మూడు కోళ్లు, 18 బైకులు, 23 సెల్ఫోన్లు స్వాధినం చేసుకుని పొన్నలూరు పోలీసుస్టేషన్కు తరలించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బల్లికురవ: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకు నుంచి కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మేదరమెట్ల–నార్కేట్పల్లి నామ్ రహదారి మండలంలోని కొప్పరపాడు సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద జరిగింది. అందిన సమాచారం ప్రకారం..కొప్పరపాడు గ్రామానికి చెందిన పందిరి ఇజ్రాయేల్ (27) బైకుపై అత్తగారి ఊరైన వైదన పంచాయతీ చవిటి మాదిగపల్లెకు వెళ్తున్నాడు. ప్రమాదంలో బైకు నుంచి కిందపడి చెవుల నుంచి రక్తం రావడంతో వైద్యం అందేలోపు చనిపోయాడు. మృతుని తండ్రి అంకారావు ఫిర్యాదు మేరకు శనివారం ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఓట్ల తొలగింపునకు కుట్ర
కురిచేడు: గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు ఎలాగైనా తొలగించాలని కుయుక్తులు పన్నుతున్నారు. విచారణ పేరుతో ఓటర్ల నుంచి తాము గ్రామంలో లేమని చెప్పించే యత్నాలు చేస్తున్నారు. ఓటర్లు తమకు స్వగ్రామంలో ఓట్లు ఉండాలని, కేవలం బతుకుదెరువు కోసమే వలసలు వెళ్తున్నామని చెబుతున్నా వినకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రస్తుతం ఉంటున్న చోట్లకు వెళ్లి ఓట్లు తొలగించినట్లు రసీదులు తేవాలని టీడీపీ నాయకుల ఎదుట ఓటర్లకు హుకుం జారీ చేస్తున్నారు. మండలంలోని నమశ్శివాయపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఓట్లు తొలగించాలని, వారంతా గ్రామంలో లేరని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి, వీఆర్వో హనుమంతురావు, బీఎల్వోలు శేషగిరిరావు, కృష్ణతో కలిసి పంచాయతీ కార్యాలయంలో శనివారం విచారణ చేపట్టారు. విచారణలో ఓటర్లు తాము బతుకుదెరువు కోసం వెళ్లామని, ఇళ్లు, పొలాలు ఇక్కడే ఉన్నాయని, ఓటు ఇక్కడే కావాలని కోరుతున్నా వారి మాటలు పెడచెవిన పెట్టి.. మీరు ప్రతి నెలా ఇక్కడే రేషన్ తీసుకుంటున్నారా? విద్యుత్ బిల్లులు ఇక్కడే కడుతున్నారా? ప్రతి రోజు ఇక్కడే ఉంటున్నారా? అంటూ ప్రశ్నలు వేసి వారితో చివరకు తమకు ఇక్కడ ఓటు వద్దు అని చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన వారు అక్కడే రేషన్ తీసుకోవచ్చని అవకాశంశ ఇచ్చింది. ఓట్లు రెండు చోట్ల నమోదైతే దానిని ఫారం–7 ద్వారా వారికి ఇష్టం వచ్చిన చోట ఓటు ఉంచేకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చింది. కానీ విచారణ అధికారులు అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉంటున్న చోటుకు వెళ్లి ఓటు రద్దు చేయించుకున్నట్లు రశీదు తీసుకురావాలని, గ్రామంలోనే రేషన్ తీసుకోవాలని అధికారులు చెప్పడం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గారని స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాకుండా తాము ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా రోజూ తమ స్వగ్రామంలోని ఇంటికి వెళ్లి వస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా నిర్ధారించారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఉండి ప్రజలకు సేవ చేయాల్సి ఉందన్న నిబంధనను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, ఎన్నికల కమిషన్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తే గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆలోచించి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఓట్ల తొలగింపు కార్యక్రమం నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరగాలని, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యం అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు గ్రామాల్లో టీడీపీ నాయకుల సమక్షంలో ఓటర్ల విచారణ -
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
ఒంగోలు టౌన్: విధి ఆమెను చిన్నచూపు చూసినా నిరాశ చెందలేదు. సమస్యలు చుట్టుముట్టినా వెన్ను చూపలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఆమె పేరు బత్తల హిమబిందు. ఒంగోలులోని గోపాల్నగర్. 2017లో కృష్ణ సుమంత్తో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. భార్యభర్తలిద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న జీవితంలో కరోనా మహమ్మారి కాటు వేసింది. కరోనా బారిన పడి భర్త సుమంత్ మరణించారు. దాంతో ఒక్కసారిగా చీకటి ఆవరించింది. ఒంటరితనం చుట్టుముట్టింది. ఇంకేముందని ఆవేదనకు గురైతే కోలుకోవడం కష్టం. ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూడాలి. వారికి బంగారు భవిష్యత్తు చూపాలి. గుండెల్లోంచి తన్నుకొస్తున్న బాధను తమాయించుకుని బతుకు బరిలోకి దిగింది. ఇంటి నుంచి బయటకు అడుగు వేయకుండానే హాట్ ఎన్ క్రిప్సీ పేరుతో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసింది. నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణంతో నాణ్యమైన ఫ్రైడ్ చికెన్, వెజ్ స్నాక్స్, అమెరికన్, కాంటినెంటల్, ఇటాలియన్ పిజ్జాలు తయారు చేసి స్విగ్గి, జొమాటో ఆర్డర్ల ద్వారా విక్రయించడం మొదలు పెట్టింది. ఆమె బతకడమే కాకుండా మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తోంది.ఆత్మస్థైర్యమే బలంగా..మొక్కవోని దీక్షతో తమ కలలను సాకారం చేసుకున్నారీ మహిళలు. వీరి సంకల్పానికి కుటుంబ సభ్యుల సహకారం తోడైంది. తాము అనుకున్నది సాధించి సగర్వంగా ముందుకు సాగుతున్నారు. రాళ్లు రప్పలున్న భూమినే ఎంచుకుని ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ముందుకెళ్తున్నవారు ఒకరైతే.. గ్రామీణ ప్రాంతాల్లో దురాచారాలు, దేవదాసి వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనల నేపథ్యంలో సినిమా తీసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు మరొకరు. మాయదారి కరోనా భర్తను కబళించినా కుంగిపోకుండా స్వశక్తితో చిన్నపాటి ఫుడ్ బిజినెస్ ప్రారంభించి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇంకొకరు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మణిరత్నాలపై ప్రత్యేక కథనం... -
శనగ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో శనగ పంట పండిస్తున్న రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం కలెక్టర్ పి.రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు తదితర నాయకులు కలెక్టర్ను కలిసి శనగ రైతుల కష్టాలు వివరించారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో ప్రధాన పంట అయిన శనగ రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో తెలియజేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ భారతదేశంలో 2019–20 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం సుమారు 11 నుంచి 12 మిలియన్ టన్నుల శనగ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 70 శాతం కంటే ఎక్కువని తెలిపారు. దేశంలో వినియోగ అవసరం సంవత్సరానికి 10 నుంచి 10.50 మిలియన్ టన్నులు కాగా, ప్రతి సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ నిల్వలు సుమారు 1 నుంచి 2 మిలియన్ టన్నులు ఉంటున్నాయన్నారు. అయితే, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 2024 మే నెల సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ (ఎస్డబ్ల్యూఎస్) మినహాయించిందని, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు సుంకం, సెస్ రద్దు చేయడం వల్ల దిగుమతులు 2023–24లో 1.64 లక్షల టన్నుల నుంచి 2024–25లో 15.06 లక్షల టన్నులకు తీవ్రంగా పెరిగాయని తెలిపారు. దిగుమతి సుంకం ఎత్తేయడంతో తక్కువ ధరకు విదేశీ శనగలు మార్కెట్లో లభ్యమవుతున్నాయన్నారు. తద్వారా దేశీయంగా మన రైతులు పండించిన శనగల ధర కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బెంగాల్ గ్రామ్ రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారన్నారు. గత సంవత్సరం ఉత్పత్తిలో లక్షల టన్నులు ఇప్పటికీ శీతల గిడ్డంగులలో మూలుగుతున్నాయని తెలిపారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్లు కలెక్టర్కు మేరుగు నాగార్జున వివరించారు. మిర్చి రైతుల కష్టాలు కూడా వర్ణణాతీతంగా ఉన్నాయని, శనగ, మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. రెండేళ్ల నుంచి మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో శనగలు : చుండూరి రవిబాబు వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంట శనగ అని, కానీ.. రెండేళ్ల నుంచి పండించిన శనగలకు మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని తెలిపారు. మరి ఈ సంవత్సరం కూడా శనగ పంట చేతికొచ్చే స్థితిలో విదేశాల నుంచి సుంకాలు లేకుండా దిగుమతవుతున్న శనగల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శనగ రైతులు నష్టపోతుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్వింటాకు రూ.1500 చొప్పున ఒక్కో రైతుకు 35 క్వింటాళ్లకు ఇచ్చి ఆదుకున్నారన్నారు. మిర్చి రైతు పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. ఇక పొగాకు రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు. నేటికీ వేలం ప్రారంభం కాకపోవటంతో పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. సిగరెట్లపై సుంకం పెంచటంతో పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేయాలని కంపెనీలు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగపై 2021 నుంచి 2023 సంవత్సరాల్లో ఉన్నట్లుగా వ్యవసాయ మౌలిక సదుపాయాల–అభివృద్ధి సెస్ (ఏఐడీసీ), సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ (ఎస్డబ్ల్యూఎస్) విధించాలని, లేదా ఏఐడీసీ, ఎస్డబ్ల్యూఎస్ పరిహారంగా ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్ ఉత్పత్తికి క్వింటాకు రూ.1000 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు భరోసా లేదన్నారు. అన్ని పంటల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
మహిళలంతా మహారాణులే..
చీమకుర్తి: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ మహారాణుల్లా జీవిస్తున్నారని, ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం రావడం, విద్యాసంస్థలకు సెలవు దినం కావడంతో చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం ముందస్తుగా మహిళా దినోత్సవం నిర్వహించారు. కాలేజీ అధ్యాపకులు, విద్యార్థినులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ, సాంకేతిక, సామాజిక, వ్యాపార, ఇతర అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మహిళలంతా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. తొలుత కాలేజీ విద్యార్థినులతో కలిసి కోలాటం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. -
కాపుల అభ్యున్నతికి జగన్ కృషి
ఒంగోలు సిటీ: కాపు కులస్తుల అభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేషంగా కృషి చేశారని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. ఒంగోలులోని ఆయన నివాసంలో శనివారం కాపు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబును సన్మానించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బలోపేతానికి కాపు నాయకులంతా సమష్టిగా, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాపుల అభివృద్ధి కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కాపునేస్తం పథకాన్ని ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, 38, 32, 34 డివిజన్ల అధ్యక్షులు పాలడుగు శ్రీనివాసరావు, పసుపులేటి నవీన్కుమార్, బండారు ప్రభాకరరావు, ఒంగోలు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ మల్లిశెట్టి దేవా, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్న, జిల్లా డిసిప్లినరీ కమిటీ మెంబర్ రాయిని వెంకట్రావు, 36వ డివిజన్ యూత్ నాయకుడు హరీష్ కుమార్, 25వ డివిజన్ యూత్ నాయకుడు బండారు రాఘవేంద్ర, యూత్ సిటీ జనరల్ సెక్రటరీ అమెజాన్ ప్రశాంత్, 25వ డివిజన్ నాయకులు మల్లికార్జునరావు, కోవూరు కృష్ణ, అయినాబత్తిని సాయిబాబు, పడే దుర్గా, 37వ డివిజన్ యూత్ జనరల్ సెక్రటరీ కొండాదాసు, కిరణ్ కుమార్, సాయి తేజ, 37వ డివిజన్ నాయకుడు తోట బాబీ, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పోర్టు ఫోలియో జడ్జిని కలిసిన కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు: జిల్లా న్యాయమూర్తుల సమావేశానికి శనివారం ఒంగోలు వచ్చిన జిల్లా పోర్టు ఫోలియో జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. వారితో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తదితరులు పోర్టు ఫోలియో జడ్జిని కలిశారు. ఒంగోలు సబర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ వి.హర్షవర్థన్రాజుతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు, ఈ నెల 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. సంబంధిత అధికారులు ఒక వారం ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఈఓ సి.వి.రేణుక, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీటీసీ సుశీల, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆత్మస్థైర్యంతో కల నెరవేర్చుకుని...
కొనకనమిట్ల: కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామానికి చెందిన చెన్నెబోయిన వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు దంపతులది వ్యవసాయ కుటుంబం. నరసమ్మకు సినిమాలు అంటే ఇష్టం. ఎలాగైనా సినిమా తీయాలని అనుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే దురాచారాలు, దేవదాసి వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనలు ఆమెకు భాద కలిగించేవి. తన మనసులో మాటను భర్త వెంకటేశ్వర్లుకు తెలిపింది. ఛా ఊరుకో.. మనకు పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు.. వేలిముద్రగాల్లం.. అసలు సినిమా తీయాలంటే కోట్లు కావాలి.. నువ్వేమైన కలలు కంటున్నావా అని అనేవాడు. దీంతో కుమారుడు వెంకటరవీంద్రనాథ్తో తన కోరికను తెలియజేసింది వెంకట నరసమ్మ. అతను కూడా పెద్ద ఆసక్తి చూపించలేదు. ఎలాగైనా సినిమా తీయాలన్న దృఢ నిశ్చయంతో తనకున్న కొద్దిపాటి పొలాన్ని, మేకలను, గేదెలను అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు పెదారికట్లలో చిన్న హోటల్ పెట్టి కష్టపడి వచ్చిన ఆదాయం, కుమారుడి సహకారంతో సినిమా తీసింది. గ్రామీణ నేపథ్యంలో జరిగే కొన్ని సంఘటనలపై మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామని ఆమె అంటోంది. తెలంగాణ దేవదాసి వ్యవస్థలానే కోస్తాంధ్రలో మాతంగులు ఉండేవారు. గ్రామాల్లో జరిగే జాతరలు, ఉత్సవాల్లో మాతంగులు నృత్యాలు చేసేవాళ్లు. మాతంగుల దుర్భర జీవితాలను, కష్టాలను కళ్లారా చూశాం. వారి పిల్లలు మాతంగుల వృత్తిలోకి రాకుండా ఉండాలని, చదువుకుని మంచిగా రాణించాలనే ఉద్దేశంతో ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమా తీశామంటోంది. ఈ చిత్రంలో నటించేందుకు సినీనటులు చిత్రం శ్రీను, రవిబాబు, సత్య ప్రకాష్, చిట్టిబాబు, రమ్య, ప్రియాంక, పింకితో పాటు నటులు రాజశేఖర్, సైదులు, నాగతేజ ముందుకు వచ్చారు. సినిమాకు తన కుమారుడు వెంకటరవీంద్రనాథ్ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎయిర్ వండర్ సినిమా పతాకంపై తను నిర్మించిన ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమాను త్వరలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామంటూ నిర్మాతగా మారిన వెంకట నరసమ్మ సంతోషం వ్యక్తం చేసింది. త్వరలో సినిమా విడుదలకు సన్నహాలు చేస్తున్నామని తెలిపింది. గతంలో గ్రామంలోని వాళ్లు, బంధువులు, స్నేహితులు మీరేంటి సినిమా తీసేది అంటూ కొంత హేళనగా మాట్లాడి ఎగతాళి చేశారు. ఇప్పుడు సినిమా పూర్తయిందని తెలుసుకుని ఆనాడు ఎగతాళి చేసిన వాళ్లే నేడు గౌరవంగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నారని గర్వంగా చెబుతోంది. సినిమాలో తాను, తన చిన్న కుమారుడు కూడా నటించామని, సినిమా తీస్తున్న సమయంలో పాము కాటుకు గురై తన చిన్న కుమారుడు మృతి చెందటం కలచివేసిందని నరసమ్మ భర్త వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు. ఆ విషాదం నుంచి కోలుకుని మళ్లీ సినిమా తీశామని తెలిపారు. హోటల్ నిర్వహిస్తున్న వెంకట నరసమ్మస్పిరిట్ (ఈజ్ నాట్ వన్) సినిమాను ఆదరిస్తాం... తమ గ్రామానికి చెందిన ఓ సాధారణ కుటుంబం సినిమా తీయడం సంతోషంగా ఉందని, ఆ సినిమాను ఆదరిస్తామని పెదారికట్ల గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇటీవల నిర్మాతలైన వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు, దర్శకుడు వెంకట రవీంద్రనాథ్ను కళావేదిక తరఫున సన్మానించారు. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటులు శ్రీకాంత్, సుమన్, ఆలీ, బాబుమోహన్తో పాటు పలువురు దర్శకులు అభినందించారు. -
లెప్రసీ నివారణలో భాగస్వాములు కండి
ఒంగోలు టౌన్: లెప్రసీని నివారించడంలో పీహెచ్సీ వైద్యులు భాగస్వాములు కావాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ అధికారి డాక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. పీహెచ్సీ వైద్యులందరూ లెప్రసీ వ్యాధిపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా పీహెచ్సీ వైద్యులకు స్థానిక జీజీహెచ్లోని సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యులు, ఫార్మసిస్ట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ జిల్లా నుంచి లెప్రసీని పారదోలేందుకు సహకరించాలని కోరారు. లెప్రసీని గుర్తించిన వెంటనే తగిన వైద్యం అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకునేలా రోగికి అవగాహన కల్పించాలని చెప్పారు. జీజీహెచ్ చర్మవ్యాధుల విభాగం హెచ్ఓడీ డాక్టర్ రాజశేఖర్, డీఎఫ్ఐటీ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.సతీష్, ఫిజియోథెరపిస్ట్ పీటర్, పీఎంఓ టి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సన్.. ధనాధన్..!
మార్కాపురం: మార్చి నెల ఇలా వచ్చిందో లేదో.. అప్పుడే వేసవి కాలం మొదలైపోయింది. ఒక్కసారిగా సూర్య ప్రతాపం పెరిగిపోయింది. గడిచిన వారం రోజులుగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్కాపురం ప్రాంతంలో గత నాలుగు రోజుల నుంచి ఎండ వేడమి అధికంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ 2వ వారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంటుంది. ఈ ఏడాది అనూహ్యంగా మార్చి మొదటివారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. గత మూడు రోజుల నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు విపరీతంగా కాస్తుండటంతో మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈసారి నెల రోజులు ముందుగానే వేసవి వచ్చి ప్రజలను కలవరపరుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు అధికంగా ఉండటంతో ప్రజలు బిత్తరపోతున్నారు. ఇప్పుడే ఇవేం ఎండలు బాబోయ్ అనుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేసవి కాలంలో ప్రత్యేకంగా వ్యాపారాలు చేసేవారు సైతం అప్పుడే రంగంలోకి దిగారు. పుచ్చకాయలు, శీతల పానియాలు, కొబ్బరిబోండాల వంటి వ్యాపారాలు పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు అసలు వేసవి ఎండలు మే నుంచా.. లేకుంటే మార్చి నుంచా అని చర్చించుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఒంటి పూట బడులు ప్రారంభం కాకపోవడం, అప్పుడే ఎండ తీవ్రత పెరగడంతో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మార్కాపురంలోని పాత బస్టాండు, కోర్టు సెంటర్, కంభం సెంటర్, దోర్నాల సెంటర్, తదితర ప్రాంతాలన్నీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి నిర్మానుష్యంగా కనిపించాయి. -
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
● అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8వ తేదీ ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులతో శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో 3000 మందితో, నియోజకవర్గ స్థాయిలో 500 మందితో ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినందున నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడంతో పాటు వారి విజయాలను వీడియో రూపంలో చిత్రీకరించి ఆయా కార్యక్రమా ల్లో ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పది పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం
ఒంగోలు సిటీ: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు/ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 165 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, 14 కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచనలు, నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు వెల్లడించారు. పరీక్షల సమయంలో మాల్ ప్రాక్టీస్ను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందుగా హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్, అవసరమైన స్టేషనరీ తెచ్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధించబడినట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగానే హాలులో విద్యార్థులను కూర్చోబెట్టాలని, హాల్ టికెట్లు సరిచూసి మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతించాలని అధికారులు, సిబ్బందికి ఆర్జేడీ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, ఒంగోలు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారులు ఏ చంద్రమౌలీశ్వర్, శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ ఎం.శ్రీనివాసరావు, ఒంగోలు మండల విద్యాశాఖాధికారి టి.కిషోర్బాబు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
అబద్ధాలకు కేరాఫ్.. చంద్రబాబు సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని మరిచి అబద్ధాలతో పరిపాలన సాగిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఉదయం పొగమంచు ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం వేడిగా ఉంటుంది. పోషకాలు అందించే పాలు కాలకూట విషంగా మారుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం తాగే పాలు కల్తీ జరుగుతుండటంతో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారిన దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. కొందరు స్వార్థపరులు కల్తీ పాలు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలో ఎక్కువగా కల్తీ పాలను కుటీర పరిశ్రమలా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతున్నాయి. గేదెల ఫారాలు ఉన్న ప్రాంతంలో కల్తీ పాల తయారీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంగా పంపిణీ చేసే సెంట్రలైజ్డ్ కార్పొరేట్ డెయిరీలకు ఈ కల్తీ పాలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏవి కల్తీ పాలు? ఏవి నిజమైన పాలు? కనిపెట్టలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. సేకరణ కేంద్రాల వారు కూడా తమ కమీషన్ తమకు వస్తుంది కదా అని కళ్లు మూసుకుని అలాగే ఆ పాలను సెంట్రలైజ్డ్ డెయిరీలకు తరలించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో కుటీర పరిశ్రమలా కల్తీ పాలు తయారయ్యేవి. దీనికితోడు అప్పట్లో తక్కువ ధరకు వస్తుందని బీరు పొట్టు వేసి పాడి పశువులను మేపే వారు. బీరు పొట్టు మేసిన గేదెలు నాణ్యత లేని పాలు ఇవ్వడమే కాకుండా వాటి జీవిత కాలం కూడా తగ్గిపోయేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం కల్తీ పాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కల్తీ పాల జాడ కూడా కనిపించకుండా పూర్తిగా కట్టడి చేసింది. బీరు పొట్టు కూడా గేదెలకు వేయకుండా పూర్తి స్థాయిలో నియంత్రించింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ పాల తయారీకి అడ్డే లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. క్షీర సాగరళందర్శి: రాష్ట్రంలో పాల సేకరణలో ఉమ్మడి జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో ప్రముఖ డెయిరీలతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 72 బల్క్ మిల్క్ యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు 147 డైయిరీలు, 760 వరకు పాల కేంద్రాలు ఉన్నాయి. అనధికారికంగా పాలకేంద్రాలు పదివేలకుపైగా ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు 6.5 లక్షల పశువులు ఉన్నాయి. అందులో గేదెలు ఆరు లక్షలు, 50 వేలకుపైగా ఆవులు ఉన్నాయి. పాడి రైతులు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు. రోజుకు సరాసరి 23 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. కుటీర పరిశ్రమలా.. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు దర్శి, ముండ్లమూరు, సంతమాగులూరు, అద్దంకి తదితర మండలాల్లో కల్తీ పాలను కుటీర పరిశ్రమలా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో సుమారు 1200కుపైగా చిన్నాపెద్దా డెయిరీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాలకు పాలు విక్రయించేవి సుమారు 80కిపైగా ఉంటాయి. ఇక్కడ తరచూ కల్తీ పాల తయారీ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అధికారులు వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. మొక్కుబడి దాడులతో సరిపెడుతూ తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మేల్చూరులోని పాలకేంద్రంపై అధికారులు దాడులు చేశారు. ఇంట్లోనే కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వారిపై కేసులు పెట్టినా ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. రాజమండ్రి కల్తీ పాల ఉదంతాన్ని చూసి కూడా అధికారుల్లో చలనం కనిపించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల కల్తీ ఇలా... యూరియా, పాలపొడి, సన్ ఫ్లవర్ ఆయిల్ను బాగా మిక్స్ చేస్తారు. వాటిలో నీళ్లు కలిపి కొన్ని మంచి పాలు కలిపి కల్తీ పాలు తయారు చేస్తారు. అనుకున్న ఫ్యాట్ వచ్చే మోతాదులో పాలు తయారు చేస్తారు. పాల కేంద్రాల్లో ఉండే సాధారణ మిల్క్టెస్టర్లో టెస్ట్ చేసినా తేడా కనిపించకుండా ఉండేందుకు పాల పొడి కలిపి ఎస్ఎన్ఎఫ్, వెన్నశాతం సమానంగా కనిపించేలా చేస్తారు. అయితే ప్రస్తుతం నూతన టెక్నాలజీతో వచ్చిన మిషన్లు యూరియా, పాల పొడి కల్తీ ఉన్నట్లు గుర్తిస్తున్నాయి. దీంతో కేవలం సన్ఫ్లవర్ ఆయిల్తోనే పాలు తయారు చేస్తున్నారు. దీంతో ఇక్కడ మిషన్లు ఆ కల్తీ పాలను పూర్తిస్థాయిలో కనిపెట్టలేకపోతున్నాయి. అవి కనిపెట్టే పరికరాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని, అవి హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ప్రతిరోజూ ఒక్కో పాల డెయిరీకి రెండు మూడు వందల క్యాన్లలో పాలు వస్తాయి. అయితే వాటన్నింటినీ పరిశీలించాలంటే సాధ్యం కాదు. దీంతో డెయిరీ యజమానులు కూడా చేతులెత్తేయాల్సి వస్తోంది. మొక్కుబడిగా తనిఖీలు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్తీ పాలపై అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే టీడీపీకి చెందిన కీలక నేతల కనుసన్నల్లో పలు డెయిరీలు నడుస్తున్నాయి. దీంతో సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా ప్రభుత్వం కల్తీ పాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్యం కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
రేషన్.. టెన్షన్..!
మార్కాపురం: మార్చి నెల ప్రారంభమై ఆరు రోజులు దాటినా మార్కాపురం జిల్లాలో కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల రేషన్ ఇస్తారో..ఇవ్వరోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్టేజీ 1 నుంచి గోడౌన్లకు, అక్కడి నుంచి డీలర్ల వద్దకు నేటికీ రేషన్ సరఫరా పూర్తి కాలేదు. మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. దానిపై ఎవరికీ స్పష్టత లేదు. దీంతో కూటమి ప్రభుత్వం, పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందంటూ విమర్శిస్తున్నారు. స్టేజీ 1లోనే బియ్యం పంపిణీ జరగడం లేదని అధికారులు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదు. 1వ తేదీ నుంచి రోజూ రేషన్ షాపులకు ప్రజలు వెళ్తుండగా, ఇంకా బియ్యం రాలేదని డీలర్లు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా 1వ తేదీనే ఇంటివద్దకు వెళ్లి రేషన్ సరుకులైన బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమపిండి సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్ షాపుల వద్దకు సుదూరం వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బియ్యం సరఫరా చేయకుండా చేతులెత్తేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మార్కాపురం జిల్లాలో సుమారు 170 షాపులకు రేషన్ పంపిణీ జరగాల్సి ఉంది. ముఖ్యంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు ఇంకా రేషన్ చేరలేదు. దీంతో కార్డుదారులకు అందాల్సిన సరుకులు అందలేదు. స్టేజీ 1లో ప్రతి నెలా మచిలీపట్నం, గుండ్లాపల్లి తదితర ప్రాంతాల నుంచి లారీల ద్వారా ఎంఎల్ఓ పాయింట్లకు బియ్యం వస్తాయి. అక్కడి నుంచి రేషన్ షాపులకు లారీల ద్వారా సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ ప్రతి నెలా 20 నుంచి 25 తేదీల మధ్య పూర్తవుతుంది. ఆ తర్వాత రేషన్ షాపులకు చేరితే ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ చేస్తారు. అయితే కూటమి నేతల జోక్యంతో బియ్యం పక్కదారి పడుతున్న విషయం బహిరంగం కాగా, ప్రభుత్వమే ఆలస్యంగా సరఫరా చేయడం గమనార్హం. జిల్లాలో దాదాపు లక్ష రేషన్ కార్డుదారులకు బియ్యం చేరాల్సి ఉంది. బియ్యం కోసం ఎదురుచూపులు... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇంటివద్దనే అందించడంతో ప్రజలు సంతోషంగా ఏ టెన్షన్ లేకుండా తీసుకునేవాళ్లు. కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మార్చి 6వ తేదీ దాటినా ఇంకా రేషన్ పంపిణీ ప్రారంభం కాలేదు. గత బుధవారం మార్కాపురం ఎంఎల్ఓ పాయింట్కు 60 టన్నుల బియ్యం మాత్రమే రాగా.. వాటిని కొన్ని షాపులకు పంపారు. గురువారం కూడా పూర్తిస్థాయిలో రాలేదు. గురువారం సాయంత్రానికి జిల్లాలోని కొన్ని రేషన్ షాపులకు మాత్రమే బియ్యం పంపారు. ఇంకా సుమారు 300 టన్నుల బియ్యం ఎంఎల్ఓ గోడౌన్ పాయింట్కు రావాల్సి ఉంది. అధికారులు మాత్రం జిల్లా విభజన వలన సాఫ్ట్వేర్లో మార్పులు చేయడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. రెండుమూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. ఏదిఏమైనా నిత్యావసర వస్తువులు అందకపోవడంతో కార్డుదారులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్కాపురం జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 3,34,528మొత్తం రేషన్ షాపులు 743 -
గ్రామ దేవతకే శఠగోపం.!
ముండ్లమూరు: అధికార టీడీపీ నాయకుల అక్రమాలు, దందాలకు రోజురోజుకూ అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చివరకు దేవుడి మాన్యం భూములను సైతం వదలకుండా ఆక్రమిస్తున్నారు. బహిరంగంగా బరితెగిస్తున్నప్పటికీ అధికార పార్టీ కావడంతో పోలీసులు, అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ముండ్లమూరు మండల కేంద్రంలో జరుగుతున్న దేవుడి మాన్యం భూముల ఆక్రమణలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి. స్థానిక పోలేరమ్మ దేవస్థానానికి సర్వే నంబర్ 75/15లో 1.16 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో గ్రామ ప్రజలు, ఎండోమెంట్ సహకారంతో పోలేరమ్మ దేవస్థానం నిర్మించారు. అయితే, ఆ భూమి అద్దంకి – దర్శి ప్రధాన రోడ్డు పక్కన ముండ్లమూరులోని మెయిన్ సెంటర్లో ఉండటంతో దానిపై కబ్జాదారుల కన్ను పడింది. రేషన్ డీలర్ అయిన టీడీపీ మండల నాయకుడు వీరపనేని నాగేశ్వరరావు 20 సెంట్ల భూమిని కబ్జా చేసి గోడ నిర్మిస్తున్నాడు. దానిపై గ్రామస్తులు ప్రశ్నించగా, ఇది మా భూమి అంటూ దౌర్జన్యం చేస్తున్నాడు. ఆ భూమి ఎప్పటి నుంచో ఎండోమెంట్ పరిధిలో ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ, సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే దేవుడి మాన్యం భూమిని కబ్జా చేస్తూ అధికార పార్టీ అనే అహంకారంతో గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ ఆక్రమణ వెనుక టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుడి హస్తముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొలతలు వేయించి చర్యలు తీసుకుంటాం గోడ కడుతున్న భూమి దేవుడి మాన్యమే. భూమి కబ్జాకు గురైన విషయం తెలిసి కొలతల కోసం మండల తహసీల్దార్కు అర్జీ అందజేశాం. కొలతలు వేసిన తర్వాత కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ గోడలు తొలగిస్తాం. కార్తీక్, ఎండోమెంట్ ఈవో -
కదలని గ్రానైట్ బ్లాక్లు
సింగరాయకొండ: మద్యం మత్తులో లారీ అతివేగంగా నడపడంతో భారీ గ్రానైట్ బ్లాక్లు రోడ్డుపై అడ్డంగా పడిన విషయం విదితమే. బల్లికురవ నుంచి బెంగళూరుకు రవాణా చేస్తుండగా స్థానిక పెరల్ డిస్టిలరీ సమీపంలో రోడ్డుపై గ్రానైట్ బ్లాక్లు పడ్డాయి. అయితే ఈ గ్రానైట్ బ్లాక్లను తిరిగి ట్రాలీపై ఎక్కించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జాతీయరహదారి అధికారులు టంగుటూరు, గుండ్లాపల్లి టోల్ప్లాజాల నుంచి మూడు భారీ ట్రాలీలను తీసుకువచ్చారు. గ్రానైట్ బ్లాక్లను రోడ్డుకు అడ్డంగా లేకుండా డివైడర్ మధ్యలోకి జరిపే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రేన్లు సుమారు 30 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉండగా గ్రానైట్ బ్లాక్లు 50 టన్నులకు పైగా బరువు ఉన్నాయి. దీంతో ఆ బ్లాక్లను పక్కకు జరపడానికి కుదరలేదు. వాటిని పక్కకు నెట్టే క్రమంలో క్రేన్ల చైన్లు తెగిపోయాయని లారీ యజమానులు వాపోతున్నారు. దీంతో చివరికి క్వారీ యజమానితో సంప్రదించి విజయవాడ నుంచి భారీ క్రేన్లు తెప్పించనున్నట్లు జాతీయరహదారి అధికారులు తెలియజేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం... జాతీయరహదారిపై పెట్రోలింగ్ నిర్వహించాల్సిన హైవే పెట్రోలింగ్ పోలీసులు, జాతీయరహదారి భధ్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తృటిలో ఘోర ప్రమాదమే తప్పింది. ట్రాలీ సామర్ాధ్యన్ని మించి అధిక లోడింగ్తో రవాణా జరుగుతుండగా పట్టించుకోవాల్సిన బ్రేక్ ఇన్స్పెక్టర్లు పత్తాలేరు. డ్రైవర్ ఒంగోలులో మద్యం సేవించి అతివేగంగా, అజాగ్రత్తగా ట్రాలీ నడుపుతుంటే పర్యవేక్షించాల్సిన హైవే పెట్రోలింగ్ పోలీసులు, జాతీయ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కాని ప్రశ్న. చివరికి పెరల్ డిస్టిలరీ సమీపంలో ఈ భారీ గ్రానైట్ బ్లాక్లు జారి కిందపడి అవతల రోడ్డు వైపుకు వెళ్లాయి. ఆ సమయంలో వాహనాల సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదే కనుక ప్రైవేట్ బస్సు, కారు వచ్చి ఉంటే ఈ ఘటనను ఊహించడమే కష్టం. ఈ ఘటనతో అధికారులు స్పందించి జాతీయరహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మూడు క్రేన్లతో గ్రానైట్ బ్లాక్ల తొలగింపునకు చర్యలు ఫలించని హైవే అధికారుల కృషి విజయవాడ నుంచి భారీ క్రేన్లు వస్తాయంటున్న హైవే అధికారులు -
మార్కాపురం జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి
మార్కాపురం: మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీని వెంటనే ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు శుక్రవారం చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక దశాబ్ధాలుగా అన్ని రంగాల్లో వెనుకబడి ఇటీవలే జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కురిచేడు, దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. జిల్లాగా నేటికీ కలెక్టర్, ఎస్పీ, రెవిన్యూ ఆఫీసరు లాంటి కీలక పోస్టులను భర్తీ చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇన్ఛార్జిలతో ఎంతకాలం పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్, ఎస్పీ పోస్టులను భర్తీ చేసి ఇక్కడే ఉండి పాలన చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈశ్వరయ్య కోరారు. 4 లక్షల 32 వేల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని పార్టీ డిమాండ్ చేయగా, బడ్జెట్లో రూ.490 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాటాలు చేసిన పూల సుబ్బయ్య పేరును నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రాజెక్టు పేరుకు ముందు పూలసుబ్బయ్య పేరు చేర్చారని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం బహిరంగ సభలో ఆయన పేరును ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం బాధాకరమని, తక్షణమే విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎంపికై న ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు తక్షణమే ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి 3 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా పూర్తికాకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు అందె నాసరయ్య, కేవీ కృష్ణ గౌడ్, రైతు సంఘం నాయకులు డి శ్రీనివాస్, నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి అందె నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ -
ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మళ్లీ గంజాయి పట్టుబడింది. మహిళా పోలీస్స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం మాదక ద్రవ్యాలను గుర్తించే జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసరాలు, పార్సెల్ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నుంచి కావలి వైపు వెళుతున్న ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద వ్యక్తులు తారసపడ్డారు. వారి బ్యాగులను పరిశీలించగా 1.2 కిలోల గంజాయి లభ్యమైంది. ఒడిశా రాష్ట్రంలోని జేక్ పూర్ గ్రామానికి చెందిన మచ్చా భూను అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీరాం, చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర దేవా సహాయం మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, పెండింగ్ ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రే వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల శరత్ చంద్రబాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు పారబత్తెన జాలరామయ్య, జిల్లా నాయకులు జగన్నాథం ప్రసాదరావు, చెక్క కోటేశ్వరరావు, పల్లె కృష్ణమూర్తి, నూకతోటి కుమారస్వామి, పల్లె తిరుపతిస్వామి, కొండమూరి కొండల రాయుడు, గాలిమోటు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కె.పల్లెపాలెంలో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..పెదగంజాం పల్లెపాలెం గ్రామానికి చెందిన కొల్లాటి వెంకట గోపి (30) బేల్దారీ పనులు చేసేవాడు. మండలంలోని కె.పల్లెపాలెం గ్రామానికి తిరుపమ్మతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన గోపి భార్యను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కె.పల్లెపాలెం వచ్చాడు. నాలుగు రోజుల క్రితం కుటుంబసభ్యులంతా తిరుపతమ్మ తిరునాళ్లకు వెళ్లారు. అయితే గోపీ మాత్రం తిరునాళ్లకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లోని వారంతా తిరునాళ్లకు వెళ్లి వచ్చే సరికి బీరువా పగులగొట్టి అందులోని నగదు దొంగిలించి మద్యం తాగాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికి పట్టుకున్నారు. అయితే ఇప్పుడు వస్తానని బయటకు వెళ్లిన గోపీ తుఫాన్ షెల్టర్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్రిపురాంతకం: నేషనల్ హైవేపై బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. త్రిపురాంతకంకు చెందిన కాశీం (62) హైవేలో ఉన్న తన హోటల్ వద్ద నుంచి బైక్పై వచ్చే క్రమంలో ఎదురుగా శ్రీశైలం నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు ఢీకొట్టింది. ప్రమాదం కాశీం తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రిపురాంతకం: చెరువుకొమ్ముతండా గ్రామ పరిధిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహం గుర్తించినట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు. త్రిపురాంతకం మండలం సంఘంతండా పంచాయతీ పరిధిలోని చెరువుకొమ్ముతండా పరిసర ప్రాంతంలోని పొలంలో సుమారు 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. తెలుపు రంగు చొక్కా ధరించి ఉండగా ఇతని వద్ద ఎరుపు రంగు దుప్పటి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముస్లింల పవిత్ర మాసం రంజాన్
కురిచేడు: ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిన నెల రంజాన్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. స్థానిక మదర్సాలో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ముస్లింలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ వారి అభివృద్ధికి సహకరించామన్నారు. చంద్రబాబు సర్కారు అందరితో పాటు ముస్లింలను కూడా మోసం చేసిందని విమర్శించారు. రానున్న రోజుల్లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యన్నబత్తుల వెంకట సుబ్బయ్య, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు మేరువ సుబ్బారెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ షేక్ ఖాశీం, జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, లీగల్ సెల్ నాయకులు పసుమర్తి వెంకటరావు, వైస్ ఎంపీపీ షేక్ చిన్న మస్తాన్, ఎన్వీ నాగిరెడ్డి, నుసుం ప్రతాప్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గోగులముడి లింగారెడ్డి, బోరిగర్ల శ్రీను, సాదం నారయ్య, గొట్టిపాటి బాలకోటయ్య, షేక్ జానీ, షేక్ సుభాని, షేక్ నాయబ్ రసూల్, షేక్ యూసఫ్, కండె గంగయ్య తదితరులు పాల్గొన్నారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
పెద్దదోర్నాల: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం కర్నూలు రోడ్డులోని మోట్ల మల్లికార్జునపురం సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ద్విక్రవాహనంపై ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా బోమన చెరువుకు చెందిన బెస్త శరత్కుమార్ (25) మృతి చెందగా, మరో యువకుడు దేవేంద్రకుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై వెంకట రమణయ్య కథనం మేరకు..కర్నూల్ జిల్లా బోమనచెరువుకు చెందిన బెస్త శరత్కుమార్, దేవేంద్రకుమార్ హైదరాబాద్ నుంచి పల్నాడు జిల్లా మాచర్లలలో స్నేహితులను కలిసేందుకు వచ్చారు. స్నేహితులను కలిసిన అనంతరం మాచర్ల నుంచి డ్రోన్కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మోట్లమల్లికార్జునపురం వద్దకు రాగానే ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వెంకట రమణయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేరాఫ్ చంద్రబాబు
అబద్ధాలకు పుల్లలచెరువు: రాష్ట్ర అభివృద్ధిని మరిచి కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటుగా మారిందని, అరాచక పాలన సాగిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని ముటకుల గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా రాష్ట్ర ప్రజల ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని ఆ దేవున్ని మొక్కినట్లుగా తెలిపారు. అనంతరం వైఎస్సాఆర్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై ఆశేష జనవాహిని మధ్య ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఆరాచక పాలన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అభివృద్ధిని మరిచిపోయి అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు రాష్ట్రంలో జనరంజక పాలన సాగించారని గుర్తుచేశారు. ప్రస్తుత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని, కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లు విహారయాత్రల పేరుతో విమానాల్లో తిరుగుతూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా అబద్ధపు మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీని వదిలేశారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ కునారిల్లుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేశాందో నాయకులు చెప్పాలన్నారు. ఆలయ ప్రతిష్టను కాపాడలేని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవా..? తిరుపతి లడ్డూ విషయంలో పదే పదే అబద్ధాలు వల్లె వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు చూస్తున్నారని, కానీ ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆలయ ప్రతిష్టను కాపాడలేని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవిని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీ్త్ర లోలుడు అయిన బీఆర్ నాయుడుకు చైర్మన్ పదవిని ఇచ్చి తిరుమల ఆలయ ప్రతిష్టను మంట కలిపారని విమర్శించారు. బీఆర్ నాయుడు చేస్తున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి వదిలేసి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును త్వరలో సాగనంపాలని, రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటాని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ ఎల్, రాములు, సర్పంచ్లు సత్యనారాయణరెడ్డి, ఆవుల కోటిరెడ్డి, జె, వెంకటరెడ్డి, ఆవుల రమణారెడ్డి, బోల్లేపల్లి సాంబయ్య, శేషయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ, గద్దె బ్రహ్మయ్య, రవణారెడ్డి, మండల మహిళా అధ్యక్షరాలు రవణమ్మ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంగరాజు, దినేష్యాదవ్, ఆవులయ్య, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ఎక్కడ బాబు..? ఊకదంపుడు మాటలు తప్ప అభివృద్ధి శూన్యం రాష్ట్రంలో అరాచక పాలన ముటుకుల తిరునాళ్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ధ్వజం -
రీ సర్వేలో సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: రీ సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకాశం భవన్లోని సర్వే ఏడీ కార్యాలయం ముందు పెన్డౌన్ చేసి నిరసనకు దిగారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాల కృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి వారి అభిప్రాయాల ఆధారంగా మాత్రమే తదుపరి రీ సర్వే ప్రాజెక్ట్పై ముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుతం నాల్గవ విడత రీసర్వే గ్రామాల్లో రోజుకు ఒక టీం 25 ఎకరాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని వాపోయారు. పనిభారంతో మానసికంగా తీవ్ర ఒత్తికి లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యే వరకు స్వామిత్వ ప్రాజెక్ట్లో మేము భాగస్వాములం అవ్వలేమని తెగేసి చెప్పారు. అధిక పనిభారం కారణంగా అర్ధరాత్రి వరకు పనిచేయడం వల్ల గ్రామ సర్వేయర్లు ప్రయాణాల్లో ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు. పదోన్నతులు కల్పించి ఆదుకోవాలన్నారు. పే స్కేలు అంశాలను పరిష్కరించాలన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: గ్రామ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని శుక్రవారం నిరసనకు దిగారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలతో పాటు రిక్రూట్ అయిన ఇతర ఉద్యోగుల మాదిరిగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రామ సర్వేయర్లకు జిల్లా వారీగా 70 శాతం వరకు గ్రేడ్ 1 ప్రమోషన్లు, రూ.34,580 బేసిక్ స్కేల్ అమలు చేయాలని కోరారు. గ్రామ సర్వేయర్ గ్రేడ్ 1కు మండల డిప్యూటీ సర్వేయర్కు మధ్య స్పెషల్ సర్వేయర్ పోస్టు సాంకేతిక విభాగ సమాన పేరోల్ కనీసం రూ.37,640 బేసిక్ అమలు చేయాలన్నారు. ఐదేళ్లుగా పై స్థాయి నుంచి మండల సర్వేయర్ పోస్టు వరకు పదోన్నతులు వస్తున్నాయని, కానీ విలేజ్ సర్వేయర్లకు మండల డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు స్పెషల్ గ్రేడ్ సర్వే పోస్టులకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ఎటువంటి పదోన్నతులు రావడం లేదని, త్వరితగతిన ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం సర్వే ఏడీ కార్యాలయం ముందు సర్వేయర్ల నిరసన -
తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం: తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటారన్నారు. టీటీడీ ఛైర్మన్పై నింద వచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిందన్నారు. కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తుందన్నారు. నెయ్యి విషయంలో ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు దొడ్డిదారిలో తీసుకున్నారు. సీబీఐ కూడా రిపోర్టులో అదే చెప్పిందని వైవీ అన్నారు.‘‘వెంకటేశ్వరస్వామిపై వైఎస్ జగన్కు పూర్తి నమ్మకం ఉంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి చిత్తశుద్ధితో మొక్కుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘బాలిలేని మాటలకు నేను స్పందించడం ఏంటి? జిల్లా నాయకులు ఉన్నారు. ప్రస్టేషన్తో బాలినేని ఏదో మాట్లాడితే నేనెందుకు దానిపై కామెంట్ చేయాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
యాడున్నరో.. ఎట్టున్నరో..?
మార్కాపురం జిల్లా: పశ్చిమాసియాలోని అరబ్ దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు మార్కాపురం జిల్లాలోని వందలాది కుటుంబాలను తీవ్ర భయాందోళనకు గురిచేయడమే కాదు కన్నీళ్లు కురిపిస్తున్నాయి. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫోన్లు, వాట్సప్లు, వీడియో కాల్స్పై అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతోపాటు తాత్కాలికంగా నిలిపివేయడంతో బంధుమిత్రుల సమాచారం తెలియక వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది గల్ఫ్ దేశాలైన దుబాయ్, కువైట్, ఖతార్లో ఉంటున్నారు. పొట్ట చేతపట్టుకుని కొందరు, గల్ఫ్లో బంధువుల వద్దకు మరికొందరు వెళ్లారు. ఈ క్రమంలో ఇరాన్కు ఇజ్రాయేల్, అమెరికా మధ్య యుద్ధం తలెత్తడంతో గల్ఫ్ దేశాలకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా విమానాల రద్దుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రోజురోజుకూ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అరబ్ దేశాల్లో ఉంటున్న వారు సాధారణంగా ప్రతి రంజాన్ పండగకు స్వగ్రామాలకు వచ్చి కొద్దిరోజులు ఉండి మళ్లీ అక్కడికి వెళ్తుంటారు. ఈసారి మాత్రం పండగ 15 రోజుల్లో ఉందనగా ఇరాన్పై ఇజ్రాయేల్, అమెరికా క్షిపనులతో విరుచుకుపడటం, ఇరాన్ భీకర ప్రతిదాడులకు దిగడంతో వారి ప్రయాణానికి అవాంతరం ఏర్పడింది. తాము స్వదేశానికి రాలేమంటూ పలువురు తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. గత సోమవారం మధ్యాహ్నం నుంచి అక్కడి ప్రభుత్వాలు వీడియో, వాట్సప్ కాల్స్ను నిలిపివేయడంతో మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో ఉంటున్న బంధువులు ఆందోళన చెందుతున్నారు. విమానం టికెట్ రద్దయింది నా కూతురు, అల్లుడు కువైట్కు సమీపంలోని ఫర్మేనియా సిటీలో ఉంటున్నారు. నేను ఫిబ్రవరి 18వ తేదీన వారి వద్దకు వచ్చాను. మార్చి 6వ తేదీన మళ్లీ మార్కాపురం వచ్చేందుకు విమానం టికెట్ బుక్ చేసుకున్నా. ఆదివారం ఉదయం ఊహించని విధంగా యుద్ధం ప్రారంభం కావడంతో విమాన టికెట్లు క్యాన్సిల్ చేశారు. కువైట్ మీద కూడా ఇరాన్ బాంబులు వేసింది. మా ప్రాంతంలో ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదు. బయట కూడా ఎవరూ తిరగడం లేదు. కువైట్ రాజు మా ప్రాంతానికి వచ్చి యోగక్షేమాలు అడిగారు. కానీ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పరిస్థితులు త్వరగా చక్కబడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. – ఎన్.బద్రి, మార్కాపురం దుబాయ్లో టెన్షన్గా ఉంది నా కుమారుడు అబ్దుల్ రహీమ్ దుబాయ్లో ఐటీ వింగ్లో పనిచేస్తున్నాడు. యుద్ధం కారణంగా ప్రభుత్వం వాట్సప్, వీడియో కాల్స్ నిషేధించింది. అతి కష్టంమీద ఈ రోజు ఫోన్లో మాట్లాడాడు. ప్రస్తుతానికి వర్క్ఫ్రమ్ హోం కింద దుబాయ్లోని ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. – అజీజ్, మార్కాపురం -
రెండు రోజులైనా దొరకని మహిళ ఆచూకీ
● ఆందోళనలో కుటుంబ సభ్యులు బల్లికురవ: సాగర్ అద్దంకి బ్రాంచ్ కెనాల్లో మంచి నీటి కోసం దిగి గల్లంతైన మహిళ ఆచూకీ రెండు రోజులైనా లభించలేదు. మండలంలోని వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని(28) భర్త వీరాంజనేయులుతో కలిసి మంగళవారం సాయంత్రం గొర్రెపిల్లల మేత కోసం అద్దంకి బ్రాంచ్ కాలువ 33/0 మైలు ఎగువకు వెళ్లింది. ఈ క్రమంలో దాహం వేయడంతో నీటి కోసం సాగర్ కాలువలోకి దిగింది. పైకి వచ్చే క్రమంలో జారి పడటంతో నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీమ్ సభ్యులు రెండు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అయినప్పటికీ భవానీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆశతో కుటుంబ సభ్యులంతా సాగర్ కాలువ కట్టపైనే పడిగాపులు కాస్తున్నారు. కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెలుగొండలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 11, 12, 13వ తేదీల్లో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, సభ్యులు జవ్వాజి బాషాపతినాయుడు, మేకలవారిపల్లి రెడ్ల సంఘం సభ్యులు తెలిపారు. 11వ తేదీన ఆరు పళ్ల సైజు విభాగంలో, 12, 13వ తేదీల్లో న్యూ కేటగిరీ, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా విభాగాల పోటీలలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. బహుమతుల వివరాలివీ.. ఆరు పళ్ల సైజు విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు బహుమతులు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, న్యూ కేటగిరీ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఏడు బహుమతులు వరుసగా రూ.75 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.8 వేలు, అలాగే సీనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఏడు బహుమతులు వరుసగా రూ.90 వేలు, రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలను దాతల సహకారంతో అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఎడ్ల పోటీల్లో పాల్గొని బహుమతి దక్కని ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కాసు వెంకటేశ్వరరెడ్డి అందజేస్తారని కమిటీ సభ్యులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 8008716521, 9505345703, 9963429928, 9581137317ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ షేక్ సాజిద్ కుటుంబానికి 2009 బ్యాచ్కు చెందిన పోలీసు సిబ్బంది అండగా నిలిచారు. కందుకూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ ఈ ఏడాది జనవరి 19వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో సాజిద్ మరణించారు. అతని కుటుంబం కోసం సహోద్యోగులు సేకరించిన రూ.2,14,000ను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజు చేతుల మీదుగా సాజిద్ తండ్రి షేక్ బాషాకు అందజేశారు. ఈ సందర్భంగా సాజిద్ కుటంబ వివరాలడిగి తెలుసుకున్న ఎస్పీ.. పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలుంటే తనను సంప్రదించాలని సూచించారు. సాజిద్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సహోద్యోగులను అభినందించారు. -
మద్యం మత్తులో.. గ్రానైట్ లారీ బీభత్సం
సింగరాయకొండ: సరైన భద్రతా చర్యలు పాటించకుండా మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడపడంతో రెండు భారీ గ్రానైట్ బండలు రోడ్డుపై జారిపడిన సంఘటన జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలో పెరల్ డిస్టిలరీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టంగానీ, గాయాలుగానీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీ నుంచి బెంగళూరుకు రెండు భారీ గ్రానైట్ బండలను ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండా రవాణా చేస్తున్నారు. దానికితోడు లారీ ట్రాలీ డ్రైవర్ ఎన్.తిరుమల మద్యం సేవించి అతివేగంగా నడపటంతో పెరల్ డిస్టిలరీ సమీపంలోకి రాగానే రెండు గ్రానైట్ రాళ్లు ట్రాలీ నుంచి జారి రోడ్డు మధ్యలో డివైడర్పై పడ్డాయి. ఒంగోలు వైపు వెళ్లే రోడ్డుకు డివైడర్ అంచునపడగా, ఆ సమయంలో అటుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. ట్రాలీ లారీ డ్రైవర్కు డ్రంక్ డ్రైవ్ పరీక్ష చేయగా, 264 పాయింట్లు వచ్చిందని, పూర్తిగా మద్యం మత్తులో వాహనం నడపడం, భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని స్థానిక ఎస్సై బీ మహేంద్ర తెలిపారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. హైవేపై జారి పడిన భారీ గ్రానైట్ బ్లాకులు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అతివేగంగా వాహనం నడపడమే కారణమంటున్న పోలీసులు -
వ్యాజ్యాల పరిష్కారం అభినందనీయం
ఒంగోలు: ప్రాథమిక స్థాయిలోనే వ్యాజ్యాల పరిష్కార కార్యక్రమం అభినందనీయమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ప్యానల్ అడ్వకేట్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలోనే వ్యాజ్యాల పరిష్కారంతో కక్షిదారులకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి న్యాయసేవాధికార సంస్థ రూపొందించిన న్యాయ సహాయ జాబితాలో భాగంగా చట్టాల పట్ల అవగాహన కూడా కలిగిస్తున్న విధానాన్ని వివరించారు. ఏడాదికి రూ.3 లక్షల్లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు, మహిళలు, షెడ్యూల్డు తెగలు, జాతుల వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.వీర రాఘవులు, న్యాయవాదులు పరుచూరి లక్ష్మీకుమారి, షేక్ అజీజ్, నాయుడు ఈశ్వరరావు, డేగల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: నిరుద్యోగుల పట్ల కపట ప్రేమ నటిస్తున్న చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో విఫల ముఖ్యమంత్రిగా నిలబడిపోతారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని, కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని 20 నెలలుగా ఊదరగొట్టడమే కానీ ఒక్క కంపెనీ రాలేదు, నిధులు రాలేదని తేల్చి చెప్పారు. మాయమాటలతో రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసపుచ్చుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయడం లేదని అడిగారు. నిరుద్యోగుల ఆకలి కేకలు ముఖ్యమంత్రికి వినిపించడంలేదని, చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలకు చెందిన విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి లడ్డూ రాజకీయంతో విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. ఇప్పటికై నా ఒట్టిమాటలు కట్టబెట్టి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, జిల్లాలో భారీ పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగమో, ఉపాధి కల్పనో చూపించేంత వరకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతుల ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.పవన్, ఎస్.రామాంజి యాదవ్, ఊటికొండ గోపి, కట్ట ఆంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ -
నయన మనోహరం.. శ్రీవారి పరిణయం
కొనకనమిట్ల: ప్రసిద్ధిగాంచిన వెలుగొండ పుణ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడమ శ్రీలక్ష్మీ అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో వెలగొండ క్షేత్రం ప్రతిధ్వనించింది. ముందుగా రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన వేదికపై ఉభయదేవేరులతో సహా శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. కల్యాణ ఉభయదాతలుగా వాగిచెర్ల, జూటూరి, మూర్తి, తాడి కుటుంబ సభ్యులు, ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి, కమిటీ సభ్యుడు కుందురు కాశిరెడ్డి దంపతులు వ్యవహరించి స్వామి వారికి పట్టువస్త్రాలు, పసిడి, రజత, ఆభరణాలు సమర్పించారు. వేద పండితులు వెంకటరమణాచార్యులు భార్గవ రామాచార్యులు, పవన్కుమార్శర్మ, తిరుమలాచార్యులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణ వ్యాఖ్యాతగా తాల్లూరి దుర్గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. వెలుగొండ క్షేత్ర పరిసర గ్రామాల ప్రజలతోపాటు ఒంగోలు, మార్కాపురం, విజయవాడ, తెనాలి, చీరాల, వినుకొండ, నంద్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. శ్రీవారికి ముత్యాల తలంబ్రాలు స్వామివారికి భక్తులు సమర్పించిన ముత్యాలతో ఉభయదాతలు తలంబ్రాలు పోశారు. తొలుత తాడివారిపల్లికి చెందిన తాడివారు కత్తులు కటార్లతో ఆచారం ప్రకారం గుర్రాల మీద ఉత్సవంగా ఆలయానికి చేరుకున్నారు. కల్యాణానికి ముందు నిశ్చితార్ధ రాయబార ఘట్టం ఉత్సాహంగా సాగింది. కల్యాణం అనంతరం మహిళలకు ముత్యాల తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు, అలాగే లాటరీ ద్వారా 10 మంది మహిళా భక్తులకు చీరలు అందజేశారు. ఉదయం ఆల్పాహరాన్ని బ్రాహ్మణ అన్నదాన సత్రం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. వైభవంగా సాగుతున్న వెలుగొండ బ్రహ్మోత్సవాలు ముత్యాలతో స్వామివారికి తలంబ్రాలు గోవింద నామస్మరణతో పరవశించిన భక్తులు -
యుద్ధోన్మాది ట్రంప్.. కొమ్ముకాస్తున్న మోదీ
ఒంగోలు టౌన్: ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న యుద్ధోన్మాది ట్రంప్ దుర్నీతికి ప్రధానమంత్రి మోదీ కొమ్ముకాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అమెరికా విధానాలను నిర్ద్వందంగా తిరస్కరించగా.. నేటి ప్రధానమంత్రి ట్రంపు విధానాలకు తలూపుతున్నారని మండిపడ్డారు. చిన్న దేశాలపై అమెరికా చేస్తున్న యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత వాతావరణానికి ముప్పుగా పరిణమించాయని చెప్పారు. దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల పేరుతో ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ విధానాలని, దీని వలన దేశ ప్రగతి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతూ కాలయాపన చేస్తోందన్నారు. 1996లో వెలిగొండకు పునాదిరాయి వేసి 30 సంవత్సరాలు అవుతోందని, నేటికీ ఆ ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చంద్రబాబు అధికారంలో కొనసాగేంత వరకు సాగదీస్తారని వా్య్ఖ్యానించారు. ప్రజల సమస్యలను మరుగున పడేసేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకు ఇవ్వడం సరికాదని, లోకేష్ కుటుంబ ఆస్తి ఇచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి జంగాల అజయ్ కుమార్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, అరిగెల సాయి, తన్నీర సింగరకొండ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శ -
అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు
ఒంగోలు టౌన్: వేసవి ప్రభావంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు చెప్పారు. అగ్నిమాపకదళ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఆస్పత్రులు, అపార్ట్మెంట్లలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్, ఏసీ మెషిన్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి నీరు, ఫోమ్, సీఓ2, పౌడర్లను ఉపయోగించే విధానాలను తెలిపారు. జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ అద్దెయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ఆస్పత్రి సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యుత్ పరికరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీఎస్ఆర్ఎంఓ మాధవీలత, అసిస్టెంట్ డైరక్టర్ అనిల్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎం.విజయలలిత, సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో విధ్వంసక పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందని, విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేసి చంద్రబాబు అండ్ కో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తే నేడు వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో శనగ రైతు పూర్తిగా దెబ్బతిన్నాడని, మద్దతు ధర లేక సరుకును కోల్డ్స్టోజీల్లో ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతు పరిస్థితి కూడా దారుణంగా ఉందని, మా ప్రభుత్వ హయాంలో ధరలు తగ్గకుండా చూశామన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని తీసేసిందని ఆరోపించారు. మిర్చి రైతులను సైతం ముంచేశారన్నారు. చంద్రబాబు పాలన అంతా విధ్వంసమేనని విమర్శించారు. డెత్ సర్టిఫికెట్ పొందాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రెవెన్యూ విభాగం అవినీతి మయమైందన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఇదేనా సుపరిపాలనా అని ఆయన నిలదీశారు. వెలిగొండ ఫీడర్ కాలువ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా మార్కాపురంలో నిర్వహించిన సభలో ‘‘తమ్ముళ్లూ నేను ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తానా? ఆడిన మాట తప్పుతానా? అబద్దాలు ఆడతానా’’ అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని ఆయన ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు నేడు అమలు అవుతుంటే వాటిని మీ ఖాతాల్లో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కళాశాలను కట్టడం మీకు చేతనైందా అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రై వేటుకు అప్పగించడం సరికాదన్నారు.విలువైన ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచవగ్గా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. తిరుమల లడ్డూపై రాజకీయాలా..? భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో రాజకీయాలు, అసత్య ప్రచారాలు చేస్తోందని చుండూరి మండిపడ్డారు. దేవుడి ప్రసాదాన్ని అప్రతిష్టపాలు చేశారన్నారు. జగన్ హయాంలో దేశం నలుమూలల టీటీడీ ఆధ్వర్యంలో గుడులు కట్టారని, దళితవాడల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించారని గుర్తు చేశారు. మీరు మాత్రం బోలేబాబాలతో మిలాఖత్ అయి నెయ్యి విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్వామి అంటే మీకు భక్తిలేదని ధ్వజమెత్తారు. పవన్ కషాయ వస్త్రాలు వేసి సనాతన ధర్మం పేరుతో డ్రామాలు ఆడారని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లీలలపై ఎందుకు పవన్ స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ నాయుడు సైతం తగ్గేదేలే అన్నారు. దేవుడి దగ్గర ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ బలోపేతం.. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో నియోజకవర్గంలో కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని చుండూరి రవిబాబు తెలిపారు. మెప్మా అవినీతి వెలుగులోకి వచ్చి మూడు నెలలైందని, అప్పటి జేసీ చేసిన విచారణ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ నగర్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మీద చేసిన జనసేన నాయకుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన్ను జైలులో వేస్తే సంతోషిస్తాను అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. బొమ్మినేని మురళిని దామచర్ల జనార్దన్ అనుచరుడు రాము కొట్టాడనీ, కేసులు కట్టారనీ, ఎవరివీ అరెస్ట్లు లేవన్నారు. రిమ్స్ ఆస్పత్రి వద్ద, వెంగముక్కలపాలెం వద్ద కొట్లాటలు జరిగాయన్నారు. మొత్తం 94 మంది మీద కేసులు పెట్టారన్నారు. చార్జిషీట్లో దామచర్ల, బాలినేని, ప్రణీత్, మధు, మాల్యాద్రి, పేర్లు తీసేశారని, మిగిలిన 94 మంది మీకోసం జైలుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. మీ ఇద్దరు ఒకటీ మేము ఒకటా అన్నారు. అన్ని సమస్యల మీద వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోరాడుతున్నామన్నారు. 5 వేల మంది పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చారన్నారు. మా పాలనలో ట్రాక్టరు ఇసుక రూ.3 వేలు అయితే ఇప్పుడు ట్రాక్టరు రూ.5 వేలు అని, డబ్బంతా ఎటు పోతోందని విమర్శించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, వైఎస్సార్ సీపీ నాయకులు గౌతమ్ అశోక్, రొండా అంజిరెడ్డి, సీఎం వెంకటేశ్వరరెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, పేరం ప్రసన్న, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనపై దృష్టి
● కలెక్టర్ పి.రాజాబాబు ఒంగోలు సిటీ: పేదరిక నిర్మూలనకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ), జీరో పావర్టీ (పీ–4)పై మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ విజనరీ ప్లానింగ్ సభ్యులతో గురువారం పీజీఆర్ఎస్ హాల్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ అధికారుల వ్యక్తిగత పనితీరుకు వివిధ అంశాల్లో సాధించిన పురోగతిని తెలిపే కేపీఐ ప్రతిబింబాలుగా ఉంటాయన్నారు. ప్రతినెలా పదో తేదీతో డేటా ఎంట్రీ ఫ్రీజ్ అవుతుందని, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో రూపొందించిన విజన్ యాక్షన్ ప్లాన్ను జిల్లా స్థాయి ప్రణాళికతో సమన్వయం చేస్తూ అమలు చేసేలా అధికారులు పనిచేయాలన్నారు. ‘బంగారు కుటుంబా’ల అవసరాలను గుర్తించి వాటికి అండగా నిలిచేలా ‘మార్గదర్శు’లను అనుసంధానం చేయాలన్నారు. సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, సీపీఓ సుధాకర్ రెడ్డి, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
దళితుల సమస్యలపై కేవీపీఎస్ ఇంటింటి సర్వే
ఒంగోలు టౌన్: దళితులు ఎదుర్కొంటున్న పలు దైనిందిన సమస్యలపై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి రాబోయే రోజుల్లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రఘురాం తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవనంలో గురువారం కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జువ్వాజి రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం, వివిధ రూపాల్లో కొనసాగుతున్న కులవివక్ష, శ్మశానాలకు సంబంధించిన సమస్యలపై దళిత వాడల్లో అధ్యయనం నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వే అంశాలపై దళితులను చైతన్యం చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తామన్నారు. దళితుల సమస్యలపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిఘటనా పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యల సుడిగుండంలోనే దళితులు జీవితాలను గడుపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దళితుల సమస్యల పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అట్లూరి రాఘవులు, వి.మోజేష్, పరదేశి రాజశేఖర్, దిడ్ల నారాయణ, కొలనీడి నరేష్, కాకుమాను సుబ్బారావు, మెడిబలిమి ప్రసాద్, జువ్విగుంట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పదిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
బేస్తవారిపేట: పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ గీత అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్, పాపాయిపల్లె ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులను గణితంపై ప్రశ్నలు అడిగారు. ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులు టేబుల్స్ 20 వరకు, 5 వేల వరకు అంకెలు, చదవడం, రాయడం చక్కగా నేర్చుకోవాలన్నారు. చిన్నారులతో బోర్డుపై గణితంపై పలు ప్రశ్నలడిగి సమాధానాలు రాయించారు. బోర్డ్పై అంకెలను రాసి ఎలా నేర్చుకోవాలో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఎన్ మధుసూదన్రెడ్డి, చేగిరెడ్డి రమణారెడ్డి, హైస్కూల్ హెచ్ఎం ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వేలం మార్చిపోయారా!
పొగాకు రైతు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. రెండేళ్లుగా కనీస మద్దతు ధర లభించక ఆర్థికంగా కుదేలయ్యాడు. కొనుగోళ్లు సరిగ్గా లేక, నాణ్యత పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తూ కంపెనీలు మోసం చేయడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తక్కువ ధరకు తెగనమ్ముకోలేని రైతులు పొగాకును కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరుచుకున్నారు. ఈసారైనా కష్టాలు తీరుతాయని ఆశలు పెంచుకున్నారు. అయితే ఇప్పటి వరకూ వేలం కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, బోర్డు అధికారులు సైతం ఏర్పాట్లు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న వేలంలో ఆశించిన ధరలు రాకపోవడం ఇక్కడి రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ప్రధాన పంట అయిన పొగాకు అమ్మకాల ప్రారంభంపై స్పష్టత రావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో వేలం ఆలస్యం ఇక్కడి వేలం ప్రారంభంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ కర్ణాటకలో వేలం పూర్తికాకపోవడంతో 2026–27 ఏడాదికి సంబంధించిన వేలాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఒక నిర్ణయానికి బోర్డు అధికారులు రాలేకపోతున్నారు. జాప్యంతో నష్టం.. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా పొగాకు పంటను రైతులు ముందుగానే సాగు చేశారు. దీంతో ఇప్పటికే ఆకురెలుపు, క్యూరింగ్ జరిగి రైతుల వద్ద పొగాకు ఉత్పత్తులు అధికంగా నిల్వ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అయితే ఇప్పటికే పొగాకు బోర్డు పరిధిలోని 11 వేలం కేంద్రాల పరిధిలో పొగాకు వేలం ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. ప్రతి ఏడాది కర్ణాటక రాష్ట్రంలో వేలం ప్రక్రియ ముగిసిన తరువాత ఇక్కడ వేలం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది కర్ణాటకలో వేలం ప్రక్రియ దాదాపు రెండు వారాల ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటక వేలం కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ప్రారంభం కావాల్సిన వేలం ప్రక్రియ ఆలస్యమవుతోంది. అదే గతేడాది మార్చి 10వ తేదీ నాటికే జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది ఇప్పటికీ బోర్డు అధికారులు ఓ స్పష్టతకు రావడం లేదు. ఇటీవల జరిగిన బోర్డు అధికారుల సమావేశంలో మార్చి నెలాఖరు నుంచి వేలం ప్రారంభించాలని భావించినా దానిపై కూడా అధికారికంగా ఓ నిర్ణయానికి రాలేదు. వేలం కేంద్రాల వారీగా రైతుల అభిప్రాయాలు తీసుకొని వేలం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే వేలం ప్రక్రియ జాప్యం జరిగితే రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా వాటి నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన రైతుల్లో ఉంది. ఆశలు రేకెత్తిస్తున్న నాణ్యత ఒంగోలు పొగాకు రీజినల్ పొగాకు బోర్డు పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో దాదాపు 85 వేల హెక్టార్లలో ఈ ఏడాది పొగాకు పంటను సాగైంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది పొగాకు పంట నాణ్యత బాగుంది. క్యూరింగ్లో అధికంగా దాదాపు 60 శాతానికి పైగా బ్రైట్ గ్రేడ్ రకం పొగాకు ఉత్పత్తులు రావడం రైతుల్లో ఆశలు పెంచుతోంది. రెండేళ్ల నుంచి రైతులకు సరైన ధరలు రావడం లేదు. దీంతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. కనీసం ఈ ఏడాదైనా మద్దతు ధరలు ఇచ్చి ఆదుకోవాలని రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కర్ణాటక ప్రభావం ఎంత... కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పొగాకు వేలంలో ఆశించిన మేర ధరలు రాకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశం. మొదట్లో బ్రైట్గ్రేడ్ రకం పొగాకు కేజీకి రూ.320లకు ధరలు ఇచ్చి వ్యాపారులు తరువాత దాన్ని రూ.280లకు తగ్గించి ప్రస్తుతం రూ.300ల వరకు ఇస్తున్నారు. ఈ ప్రభావం ఇక్కడి మార్కెట్ ఎంత ఉంటుందనే చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రారంభమయ్యే వేలం కూడా ఇదే రకమైన రేట్లు ఉంటే మరోసారి నష్టాలు తప్పవనే అభిప్రాయం రైతుల్లో ఉంది. నేడు బోర్డు మీటింగ్ పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభంపై నేడు గుంటూరులో పొగాకు బోర్డు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పొగాకు వేలం ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి నెలాఖరుకు ప్రారంభించాలా లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలా అన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో వేలం ముగియనందునే ఇక్కడ ఆలస్యమవుతుందని, అక్కడి వేలం ముగిసి వ్యాపారులు వస్తేనే వేలం ప్రారంభించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వేలం ప్రారంభంపై నేడు జరిగే బోర్డు మీటింగ్ కీలకం కానుంది.కోల్డ్ స్టోరేజ్ల్లో భారీగా నిల్వలు ఇప్పటికే క్యూరింగ్ పూర్తి అవడంతో రైతుల వద్ద భారీగా పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి. దీంతో వీటి నాణ్యత దెబ్బతినకుండా కోల్డ్స్టోరేజ్ల్లో నిల్వ చేస్తున్నారు. బోర్డు నిర్ణయించిన దాని ప్రకారం 11 వేలం కేంద్రాల పరిధిలో 90.20 మిలియన్ కేజీలు మాత్రమే విక్రయించాల్సి ఉంది. దాదాపు 130 మిలియన్ కేజీల వరకు ఉత్పత్తి ఉండవచ్చని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంటే దాదాపు నవంబర్, డిసెంబర్ వరకు వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం వేలం జరిగే అవకాశం ఉన్నందున నాణ్యత దెబ్బతినకుండా, మార్కెట్కు అనుగుణంగా అమ్ముకోవచ్చనే అభిప్రాయంతో రైతులు కోల్డ్స్టోరేజ్ల్లో అధికంగా పొగాకును నిల్వ చేసుకుంటున్నారు. -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు
ఒంగోలు: రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాలెంజ్ లాన్ టెన్నిస్ క్రీడా పోటీలు ఈనెల 7, 8 తేదీల్లో స్థానిక హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే మోహన్రెడ్డి, హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.రాఘవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెన్ ఓపెన్, 40 ప్లస్, 50 ప్లస్, 60 ప్లస్, 70 ప్లస్ విభాగాల్లో జరిగే ఈ పోటీలకు రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు పాల్గొంటారని, విజేతలకు విలువైన నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఎంఈఓలు, ఉప విద్యాశాఖాధికారులకు ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా నోడల్ ఆఫీసర్ ఏ.సుబ్బారెడ్డి, మార్కాపురం జిల్లా పరిశీలకులు ఎన్.గీత, పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులు బి.లింగేశ్వరరెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులందరూ నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఒంగోలు సిటీ: జిల్లాలో గురువారం నిర్వహించిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ తెలుగు పరీక్షలో 2518 మంది విద్యార్థులకు గాను 2133 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ పరీక్షలో 27 మంది విద్యార్థులకు గాను 23 మంది, ఉర్దూ పరీక్షలో 10 మంది విద్యార్థులకు గాను 10 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు గీత అకస్మాత్తుగా మార్కాపురం, గిద్దలూరు లోని ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తక్షణమే ఆర్జేడీ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్ల నుంచి విద్యార్థులు లేక వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ, జీవో నంబర్ వన్ ప్రకారం మిగులుగా ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 108 మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం 8 మంది, సోషల్ ఆరుగురు, సైన్స్ నలుగురు, తెలుగు పండితులు ఆరుగురు, హిందీ పండిట్లు ఐదుగురు, పీఈటీలు ఐదుగురు, క్రాఫ్ట్ డ్రాయింగ్ ముగ్గురు, నాన్ టీచింగ్ స్టాఫ్ 20 మంది అదనంగా ఉన్నారన్నారు. వీరికి సీనియార్టీ లిస్టు రూపొందించి ఆర్జేడీ బీ లింగేశ్వర్ రెడ్డి ఏప్రిల్ చివరిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా హౌసింగ్ పీడీగా ఎంవీ మోహన్రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నెల్లూరు హౌసింగ్ ఈఈగా పనిచేస్తూ పదోన్నతిపై మార్కాపురం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టరుగా వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి కలెక్టర్ రాజాబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగులో ఉన్న గృహాలను త్వరగా పూర్తిచేయిస్తానని తెలిపారు. హౌసింగ్ డీఈ పవన్కుమార్, ఏఈలు సిబ్బంది ఆయనను కలిశారు. -
కొనుగోలు కేంద్రాలు ఉపయోగించుకోండి
● జేసీ శ్రీనివాసులు మార్కాపురం: కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు సూచించారు. మార్కాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన ఏడీఏ బాలాజీ నాయక్తో కలిసి పరిశీలించి మాట్లాడుతూ దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని తెలిపారు. కందుల్లో 12 శాతం, శనగలు 14 శాతం తేమ ఉంటే మంచి ధర లభిస్తుందని ఏడీఏ బాలాజీ నాయక్ తెలిపారు. అనంతరం జేసీ రికార్డులను, రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మార్కాపురం, పెద్దారవీడు ఏఓలు బుజ్జీబాయి, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
సేవలకు పరీక్ష
అద్దంకి: వ్యవసాయం దండగ కాకుండా పండుగలాగా సాగాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రైతులు, పశుపోషకులు, ఆక్వా రైతుల కోసం ఇంటిగ్రేడెట్ అగ్రి ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 10 ల్యాబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మాణాలు ప్రారంభించగా అందులో 8 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ల్యాబ్కు రూ.62.70 లక్షలు కేటాయించింది. యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, సంతనూతలపాడు, గిద్దలూరు, అద్దంకిలలో ల్యాబ్లు వినియోగంలోకి వచ్చాయి. సింగరాయకొండలో మాత్రం వ్యవసాయ, పశుసంవర్ధక, ఆక్వా కలిపి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిబ్బంది కొరత సాకుగా చూపి అగ్రి, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ల నిర్వీర్యానికి కుట్రలు చేస్తోంది. ఇందులో పనిచేస్తున్న వ్యవసాయశాఖకు చెందిన సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం కందుకూరు, దర్శి, గిద్దలూరులోని అగ్రి ల్యాబ్ల్లో అరకొరగా సేవలందుతున్నాయి. సింగరాయకొండ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లో కేవలం ఆక్వా రైతులకు మాత్రమే మొక్కుబడిగా సేవలందుతున్నాయి. ఉపయోగాలు ఇవీ.. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే రైతు సొంతంగా తయారు చేసుకున్న విత్తనం లేదా, కొనుగోలు చేసిన విత్తనాన్ని తీసుకెళ్లి ఉచితంగా మొలక పరీక్ష చేయించుకోవచ్చు. ఎరువుల నాణ్యతను తెలుసుకోవచ్చు. విత్తన పరీక్ష నివేదికను వారం నుంచి పది రోజుల్లోపు పొందవచ్చు. ఎరువుల నాణ్యతను రెండు మూడు రోజుల్లోనే పొందవచ్చు. రైతులకు అన్ని పరీక్షలు పూర్తిగా ఉచితం. ప్రతి ల్యాబ్లో ఆటోమేషన్ నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతీ ఒక్కటి రికార్డు కావడంతోపాటు ఫలితాలు ఆటోమేటిగ్గా సిస్టంలో నమోదవుతాయి. ఏ ల్యాబ్ లో ఏ బ్యాచ్ శాంపిల్ ఏ సమయంలో పరీక్షించారో నిర్ధారిస్తూ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ నమోదు చేస్తుంది. రైతు షాపుకెళ్లినప్పుడు బ్యాచ్ నంబర్ చెక్ చేసుకుంటే చాలు నాణ్యతా సర్టిఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. శాంపిల్ టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నిధులు లేవు..భద్రత లేదు భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ భవనం కిటికీలకు అద్దాలు మాత్రమే బిగించారు. గ్రిల్స్ ఏర్పాటు చేయలేదు. దాంతో అందులో విలువైన పరికరాలు ఉంచితే భద్రత ముప్పు ఏర్పడుతుందని పరికరాలు బిగించలేదు. కెమికల్స్ ఇవ్వలేదు. – ఏడీఏ ఎఫ్రాయిమ్ నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులు అద్దంకి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ల్యాబ్ నిర్మాణానికి రూ.62.70 లక్షలు కేటాయించింది. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో భవనాన్ని నిర్మించి నియోజకవర్గ స్థాయిలో ప్రయోగశాలలను అందుబాటులోకి తెచ్చింది. ఒక వైపు భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టరు ఆ భవనానికి ఏర్పాటు చేసిన కిటికీలకు అద్దాలు మాత్రమే పెట్టి గ్రిల్స్ ఏర్పాటు చేయలేదు. దీనిని గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించినా అన్ సెక్యూరిటీతో(భద్రత) అధికారులు పరికరాలను అందులో ఉంచలేదు. ఫలితంగా ప్రయోగశాల ఉపయోగంలోకి రాలేదు. విత్తనాల మొలక, మందుల నాణ్యత పరీక్షించే అవకాశం లేక నియోజకవర్గంలోని జే పంగులూరు, ఇతర మండలాల్లో నకిలీ విత్తనాలను రైతులు వాడి నష్టపోతున్నారు. అయితే ఇక్కడ వెటర్నరీ ల్యాబ్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై ఎస్సై దురుసు ప్రవర్తన
పొన్నలూరు: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తుండడంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సంఘటన పొన్నలూరు మండలం ఉప్పలదిన్నెలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు... ఉప్పలదిన్నె గ్రామం సర్వే నంబర్ 54/1లో కుంట పోరంబోకు భూమి ఉంది. ఈ భూమి ఉప్పలదిన్నెకి కిలోమీటర్ ముందు రోడ్డు పక్కనే గ్రామానికి ప్రారంభంలో చిన్న జంక్షన్లా ఉంటుంది. ఇక్కడి నుంచి రావులకొల్లు, వేంపాడు తదితర గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు ఉంటాయి. ఉప్పలదిన్నె, వేంపాడు గ్రామస్తులు కూడా ఈ జంక్షన్ నుంచి ఆటోలు, ఇతర వాహనాలు ఎక్కి పొన్నలూరు, కందుకూరు ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. దీంతో గతంలో దాతలు ఈ జంక్షన్లో బస్ షెల్టర్ నిర్మించగా, ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 15 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ జంక్షన్లో ప్రయాణికులు, బాటసారులు కూర్చోవడానికి గ్రామ ఉప సర్పంచ్ కట్టా కరుణాకర్ రూ.10 వేలు వెచ్చించి రెండు బల్లలు ఏర్పాటు చేశారు. ఇది మింగుడు పడని స్థానిక టీడీపీ నాయకుడు గత శుక్రవారం పంచాయతీ కార్యదర్శిని పురమాయించి బల్లలను తొలగించి పక్కన పడేశారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మన్నెం పద్మ, ఉప సర్పంచ్ కట్టా కరుణాకర్, మన్నెం చిన్న వెంకటేశ్వర్లు, గ్రామస్తులు కార్యదర్శిని ప్రశ్నించగా... తనపై ఒత్తిడి ఉండటం వల్ల అలా చేయాల్సి వచ్చిందంటూ సమాధానమిచ్చాడు. మరోసారి అడ్డుకున్న పోలీసులు... ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి ఉప సర్పంచ్ కట్టా కరుణాకర్, సర్పంచ్ భర్త మన్నెం చిన్న వెంకటేశ్వర్లు, గ్రామస్తులు బల్లలను ఏర్పాటు చేయడానికి జంక్షన్కు వెళ్లారు. సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసిన తర్వాత... ఎస్సై సత్యనారాయణతో స్థానిక టీడీపీ నాయకుడు మాట్లాడి వారి మీదకు ఉసిగొల్పాడు. దీంతో టీడీపీ నాయకుడు చెప్పిందే తడవుగా ఎస్సై రంగప్రవేశం చేసి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ప్రాంతంలో బల్లలు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదని, ప్రయాణికులు, బాటసారులకు ఉపయోగపడతాయిని చెప్పినప్పటికీ ఎస్సై దురుసుగా ప్రవర్తించి... నాయకులపై చెయ్యి వేస్తూ పోలీస్ స్టేషన్కు పదండంటూ ఓవరాక్షన్ చేశాడు. బల్లలు తొలగించకపోతే కేసులు పెడతామని బెదిరించాడు. పోలీసుల తీరును ప్రశ్నించిన స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు పట్ల కూడా ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. జెడ్పీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీపు ఎక్కు.. పోలీస్ స్టేషన్కు నడువంటూ హూంకరించాడు. ఎస్సై ఓవరాక్షన్తో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకుడు చెప్పాడంటూ ఎస్సై దురుసుగా ప్రవర్తించడం ఏమిటంటూ గ్రామస్తులు నిలదీశారు. మొత్తంగా బల్లలు ఏర్పాటుపై టీడీపీ నాయకుడు, పోలీసుల తీరు వల్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడి మృతి
పెద్దదోర్నాల: రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడిని ఢీకొన్న మోటారుసైకిల్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్న గిరిజన యువకుడు పులిచర్ల బయ్యన్న (20) మృతి చెందగా రోడ్డుపై నడిచి వెళ్తున్న మద్దయ్యతో పాటు బైక్పై ఉన్న సానికొమ్ము కార్తీక్రెడ్డి, ఉడుతల భరత్లు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక యువకులు మోసుకుంటూ వైద్యశాలకు తరలించగా వైద్యశాలలో చికిత్స పొందుతూ పులిచర్ల బయ్యన్న మృతి చెందాడు. గాయపడిన వృద్ధుడు మద్దయ్య, కార్తీక్రెడ్డిలను నరసరావుపేటకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటాం..
ఒంగోలు టౌన్: ‘‘మేము 17 ఏళ్లుగా కార్మిక నగర్లో కాపురం ఉంటున్నాం. 2016లో మాకు పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. కొంతమంది 2018లో కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అయితేనే మాకు పట్టాలు ఇవ్వండి, ప్రైవేటు భూమి అయితే మేమే దండం పెట్టి వెళ్లిపోతామని చెబుతున్నాం. అయినా వినకుండా గత నెల 4వ తేదీ కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా మా ఇళ్లను రాత్రికి రాత్రి పడ గొట్టారు. 200 మంది ప్రైవేటు వ్యక్తులు, మూడు జేసీబీలు తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు పోలీసులతో వచ్చి బలవంతంగా ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇది అన్యాయం..మాకు న్యాయం చేయకపోతే మేము పెట్రోలు పోసుకొని తగలబెట్టుకొని చనిపోతాం. మా చావుకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పాలకులు, అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని’’ కార్మిక నగర్ బాధితురాలు చెరుకూరి లక్ష్మి చెప్పారు. కార్మిక నగర్లో నిరుపేదల గృహాలను కూల్చిన ప్రైవేటు వ్యక్తులు బుధవారం పోలీసులతో వచ్చారు. కూల్చివేసిన నివాసాల వద్ద ఉంటున్న బాధితులను స్థలంలోంచి బయటకు రావాలని హెచ్చరించారు. స్థానికులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా స్థలం చుట్టూ బలవంతంగా ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు అడ్డుకున్నారు. ఫెన్సింగ్ వేయడం ఆపకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగారు. దాంతో వెంటనే మరికొంతమంది పోలీసులు రంగంలోకి దిగారు. స్థలాలు ఖాళీ చేయించారు. దీంతో బాధితులు పోలీసులతో వాదనకు దిగారు. మాకు నోటీసులు ఇవ్వకుండా ఎలా ఫెన్సింగు వేస్తారని బాధిత మహిళలు ప్రశ్నించారు. అప్పటికప్పుడు గత 14వ తేదీ నోటీసులు ఇచ్చినట్లు రెవెన్యూ సిబ్బంది ఒకరు మొబైల్ ఫోన్లో మెసేజ్ సృష్టించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓ జారీ చేసినట్లు చెబుతున్న ఉత్తర్వులను తీసుకోవాల్సిందిగా బాధితుల మీద పోలీసులు ఒత్తిడి చేశారు. ఉత్తర్వులు తీసుకోని బాధితుల మీద కేసులు పెడతామని బెదిరించారు. ఇది జరుగుతున్న సమయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ నాయకులు హరిబాబు, జయచంద్ర నాయక్, శేషాద్రి రెడ్డిలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. బాధితుల కుటుంబాలతో మాట్లాడి సమస్యను జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళతామని భరోసా ఇచ్చారు. ఒకవైపు రవిబాబు మాట్లాడుతుండగానే మరోవైపు పోలీసులు దగ్గరుండి మరీ ఫెన్సింగ్ వేయించారు. ఇది గమనించిన రవిబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కానీ, నగర పాలక సంస్థ అధికారులు కానీ లేకుండా ఫెన్సింగ్ ఎలా వేస్తున్నారని రవిబాబు ప్రశ్నించినా సమాధానం లేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఫెన్సింగ్ వేయడం గమనార్హం. దీంతో బాధితులంతా రాత్రంతా రోడ్డు మీదనే గడిపారు. చిన్నపిల్లలతో కలిసి రోడ్డు పక్కనే భోజనాలు వండుకొన్నారు. ప్రైవేటు స్థలం అయితే మేమే వెళ్లిపోతాం... కార్మిక నగర్ స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బాధిత మహిళ చెరుకూరి లక్ష్మి ఆరోపించారు. ఇప్పటికే ఈ స్థలం విషయంలో కోర్టుకు వెళ్లామని, కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. స్థలం ఎవరిదో తేల్చాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రైవేటు స్థలం అయితే మేమే వెళ్లిపోతామని చెప్పినా స్థలాన్ని ఎందుకు సర్వే చేయడం లేదని ప్రశ్నించారు. దౌర్జన్యంగా, అక్రమంగా మా నివాసాలను కూల్చివేసిన వారికి అధికారులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మరో బాధితురాలు కామేపల్లి సీతమ్మ మాట్లాడుతూ కార్మిక నగర్ పేదలపై దౌర్జన్యం చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం పోయిందని చెప్పారు. బాధితులతో మాట్లాడుతున్న చుండూరి రవిబాబు -
శునక విశ్వాసం
ఒంగోలు వన్టౌన్: ప్రస్తుత సమాజంలో మానవత్వం లేని మనుషుల కంటే మూగజీవాలే నయం అని నిరూపించే ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు కుక్కకు ఓ వీధి కుక్క రక్తం దానం చేసి సాటి మూగజీవి ప్రాణం కాపాడింది. మనుషుల హృదయాలను కదలించే ఈ ఘటన బుధవారం ఒంగోలులో వెలుగు చూసింది. ఒంగోలులోని అంజయ్య రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన ఇంట్లో రూబీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అది అనారోగ్యం బారిన పడడంతో అతను పశువైద్యులను సంప్రదించాడు. వారు కుక్కను పరిశీలించి రక్తం ఎక్కించాలని చెప్పడంతో రూబీ యజమాని సేవ్ ది యానిమల్స్ ఫౌండేషన్ నిర్వాహకురాలు తాటిపర్తి దివ్యను సంప్రదించాడు. ఇటీవల ప్రమాదంలో గాయపడి సేవ్ ది యానిమల్స్ ఫౌండేషన్లో కోలుకున్న వీధి శునకం రక్తాన్ని సేకరించారు. ఒంగోలు పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఎన్ జగత్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పశువైద్యులు 3 గంటలు శ్రమించి రక్తం రూబీకి ఎక్కించారు. -
ఏప్రిల్లో చలో సెక్రటేరియట్
మార్కాపురం: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్లో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ కార్యదర్శి ఓవీ వీరారెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన యూటీఎఫ్ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇప్పటికే యూటీఎఫ్ రణభేరీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. నాలుగు డీఏలు పెండింగులో ఉన్నాయని, 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయలేదన్నారు. హెల్త్కార్డుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. సమస్యలు పరిష్కరించలేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. మార్చి 24న నియోజకవర్గ స్థాయిలో రిలే దీక్షలు, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా స్థాయిలో రిలే దీక్షలను, ఏప్రిల్ 14 నుంచి 19 వరకూ రాష్ట్ర స్థాయి రిలే దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటరీయట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. -
హామీల అమలులో విఫలం
ఒంగోలు సిటీ: ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ కీర్తి అన్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఆర్. సంజీవ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు నెరవేర్చకపోగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. హామీలన్నీ అమలు చేయకుంటే భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని, అరియర్స్ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఫియా కౌన్సిలర్ ఎం.రాఘవరావు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ ప్రభుత్వం ముందుంచిన 20 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్.లక్ష్మీనారాయణ, టి.పాండురంగ స్వామి, ఐపీయూ కౌన్సిలరు పీవీ సుబ్బారావు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాసులు, మాజీ ప్రధాన కార్యదర్శి బి.అశోక్కుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు ఏ.అమ్మయ్య, కబీర, సబ్ కమిటీ మెంబర్లు ఎం.సురేష్బాబు, కె.పెద్దన్న, గురులింగం, సి.సుబ్బారావు, టీఎల్ కాంతారావు, హరినాథ్ బాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.మహబూబ్ఖాన్, పండిత్ పరిషత్ నాయకులు సీహెచ్ కొండయ్య, సీనియర్ నాయకులు కె.వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, పి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు లబ్ధిదారులకు అందాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పేదల గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లేఅవుట్స్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో అగ్రహారం, యరజర్ల వద్ద లే అవుట్స్ను వేశారని, ఈ రెండు లేఅవుట్స్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలో నిరుపయోగంగా, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పీపీపీ పద్ధతిలో నగర కార్పొరేషన్కు ఆదాయం వచ్చేలా షాప్స్, మాల్స్ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమీక్షలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, రిజిస్ట్రేషన్, సర్వే అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం: జనాభా లెక్కల సేకరణ సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు సిబ్బందిని ఆదేశించారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులోని జవహర్ నవోదయ కేంద్రియ విద్యాలయలో మంగళవారం జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జేసీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ జనాభా లెక్కల సేకరణ త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమానికి కేటాయించిన అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించి లోటుపాట్లు లేకుండా పూర్తిచేయాలన్నారు. సెన్సెస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ దఫా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టాలన్నారు. మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో జన, కుల గణన చేపడతామన్నారు. ప్రజలే తమ వివరాలను స్వయంగా ఇంటివద్ద నుంచే నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చామన్నారు. మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఇక్కడ శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో జనాభా లెక్కల ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందికి వివరించాలన్నారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 497 గ్రామాల్లో జనాభా లెక్కల సేకరణ చేయాల్సి ఉంటుందన్నారు. మే నెల 1 నుంచి 30 వ తేదీ వరకూ మొదటి విడత జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ డీసీహెచ్ ఓబులేస్, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
కొనకనమిట్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడుతున్నాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మునగపాడులో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా సోమవారం రాత్రి గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై వారు మాట్లాడారు. చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని మాయ మాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు అవేమీ అమలు చేయకుండా మరోమారు ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. గత జగనన్న పాలన సంక్షేమ పథకాలతో అభివృద్ధి పరుగులు పెడుతూ ప్రతిరోజూ పండగలాగే ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిసలు కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి మనమందరం అండగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అన్నా, ఉడుముల పిలపునిచ్చారు. విద్యుత్ ప్రభ ఏర్పాటు చేసిన మునగపాడు సర్పంచ్ పార్లపల్లి సిద్దానభి, పార్టీ నాయకులు గర్రె శ్రీనివాసులు, బాలపిచ్చయ్య, చంద్రశేఖర్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కామసాని వెంకటేశ్వరరెడ్డి, వెలిగండ్ల సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్లు గర్రె కుసమ కుమారి శ్రీనివాసులు, భత్తుల రవియాదవ్ పార్టీ అనుబంద విభాగాల సభ్యులు ఏలూరి సంజీవరెడ్డి, పావులూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026
ప్రతి గ్రామంలో ఏజెంటు.. రేషన్ బియ్యం అక్రమ దందాకు ఒంగోలుకు చెందిన ముఠా గ్రామ గ్రామాన ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో రేషన్ మాఫియా ముఠా లారీ వచ్చినప్పుడు దగ్గరుండి.. రేషన్ షాపులకు తిప్పడంతో పాటు.. ఆ రేషన్ షాపులో ప్రతి నెలా ఎన్ని బస్తాలు మిగులుతాయి.. మాఫియా లారీలోకి ఎన్ని బస్తాల లోడ్ ఎక్కించాడు. ఏమైనా ఇతర వ్యాపారులకు అమ్ముతున్నాడా.. ఇవన్నీ గ్రామ బియ్యం ఏజెంట్లు పర్యవేక్షించాలి. ముందుగా ఏ షాపులో ఎంత స్టాక్ ఉందనేది చెప్పడంతో పాటు లారీ లోడ్ అయ్యాక.. మండల కేంద్రం దాటేంత వరకు పర్యవేక్షించాలి. దీనికి గాను ఆ ఏజెంట్లకు కేజీకి కొంత నగదు చెల్లింపు ఉంటుంది. అధికార పార్టీ నేతలు సంపద సృష్టిలో తలమునకలవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రేషన్ అక్రమ దందాకు అధికారిక రెక్కలు వచ్చాయి. రేషన్ షాపులను కూటమి నేతలు హస్తగతం చేసుకున్నాక రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు చేరాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి జేబులు నింపుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది. జోరుగా దందా.. అక్రమార్కులు ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీని కూడా అక్రమ మార్గానికి వాడుకుంటున్నారు. ప్రతి నెలా 26 నుంచి 31 తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు, బెడ్రిడెన్ పేషంట్లకు ఇంటికి పోయి నేరుగా కార్డు థంబ్ వేయించుకుని రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా మార్చుకుని.. రేషన్ డీలర్లు ముందుగానే సాధారణ రేషన్ కార్డుదారుల థంబ్ను కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది కార్డుదారులకు బియ్యం స్థానంలో ప్రతి కేజీకి రూ.10 నగదు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఒక్క కనిగిరి మున్సిపల్ పరిధిలో బెడ్రిడెన్, దివ్యాంగుల రేషన్ కార్డులు 1,500 వరకు మాత్రమే ఉంటాయి. కానీ నెలాఖరు లోపు సుమారు 4 వేలకు పైగా రేషన్ కార్డులకు బియ్యం ఇచ్చినట్లు డీలర్లు నివేదికలు ఇస్తున్నారు.రేషన్ దందాకుకనిగిరిరూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వ్యవస్థ పూర్తిగా తెలుగు తమ్ముళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఏదో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా అధికార పార్టీకి చెందిన వాళ్లే. ఎంతలా అంటే తహసీల్దార్ స్థాయి అధికారులను సైతం రేషన్ డీలర్లు బెదిరించే పరిస్థితి. అధికార పార్టీ నేతల హుకుం.. వ్యవస్థలోని లాలూచీ వారిని ఏమీ చేయలేని నిశ్చేష్టులుగా మార్చింది. గడిచిన 19 నెలలుగా అసలు రెవెన్యూ అధికారులు ఒక్క డీలర్ షాపును తనిఖీ చేసిన పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. రేషన్ డీలర్లపై అనేక ఫిర్యాదులు వస్తున్నా.. ఆర్డీఓ స్థాయి అధికారులు సైతం రేషన్ షాపుల గడప తొక్కలేదనే ఆరోపణలున్నాయి. పంపిణీకి ముందే దోపిడీ.. జిల్లాలో సుమారు 1392 రేషన్ దుకాణాలు ఉండగా.. సుమారు 6.37 లక్షల రేషన్కార్డులున్నాయి. జిల్లాలో ప్రతి నెలా 10,500 మెట్రిక్ టన్నులు బియ్యం వస్తుండగా.. అందులో 45 శాతం బియ్యం అక్రమ మార్గాన తరలుతోంది. కనిగిరి నియోజకవర్గంలోని 201 షాపుల్లో సుమారు 75 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు మండల కేంద్రాల్లో ఎఫ్సీఐ గోడౌన్ పాయింట్లు ఉన్నాయి. కనిగిరి ఎఫ్సీఐ గోడౌన్ పాయింట్ నుంచి 600 టన్నుల బియ్యం, అలాగే పామూరు పాయింట్ నుంచి మూడు మండలాల రేషన్ షాపులకు 530 టన్నుల పీడీఎస్ బియ్యం పరఫరా చేస్తుండగా.. వాటిలో సింహ భాగం రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్తోంది. కార్డుదారులతో ముందే థంబ్.. చాలా వరకు రేషన్ షాపుల్లో బియ్యానికి ముందే స్లిప్పులు ఇస్తున్నారు. ఒక కార్డుదారునికి 20 కేజీలు బియ్యం ఇవ్వాల్సి ఉంటే 10 కేజీలు మాత్రమే బియ్యం... మిగతా పది కేజీలకు కేజీ రూ.10 చొప్పున ముందే చెల్లిస్తున్నారు. అదేంటి మాకు మొత్తం బియ్యం కావాలని ఏవరైనా ప్రశ్నిస్తే.. బియ్యం పూర్తిగా రాలేదు అలా అయితే పూర్తిగా వచ్చినప్పుడు చెప్తాం.. అప్పుడు తీసుకో.. నీ థంబ్ సరిగా పడటం లేదు... తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లండనీ.. మీ అలాట్మెంట్ ఈ సారి మరో రేషన్ షాపునకు వచ్చిందని.. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరు దీనిపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నా డీలర్లంతా అధికార పార్టీ నేతలు కావడం, బియ్యం కార్డుదారులు ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన వారు కావడంతో జంకుతున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే. పూర్తిగా నిఘా వైఫల్యం.. గతంలో ప్రతి షాపు వద్ద నుంచి నెలాఖరులో లారీ ద్వారా ఎక్కించుకుని కనిగిరి నియోజకవర్గం మొత్తం నాలుగు రోజుల్లో బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా బయటకు తరలించే వారు. ఇటీవల కనిగిరి పట్టణంలో లారీని ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్నారు. అందులో పలు రేషన్ షాపుల బియ్యంతో పాటు.. విద్యార్థుల బియ్యం కలిపి మొత్తం 235 బస్తాలు పట్టుబడ్డాయి. అవి ఏ పాఠశాల నుంచి లిఫ్ట్ చేశారనేది ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. దీంతో రూటు మార్చిన రేషన్ మాఫియా.. వాహనాల ద్వారా ముందుగా ఒక పాయింట్లో మొత్తం సరుకును డంప్ చేసి.. అక్కడి నుంచి రాత్రికి రాత్రికి ఎత్తుతున్నట్లు తెలిసింది. అయితే డంపింగ్ పాయింట్లుగా ఒక చోట కాకుండా పల్లెలోని రేషన్ షాపులను, పట్టణంలోని రేషన్ షాపులను, గ్రామ శివారు ప్రాంతాల్లోని జన సంచారం లేని గృహాల వద్ద ఎంచుకుని దిగుమతి చేసుకుని రాత్రి వేళ తరలిస్తున్నారు. రైస్ మిల్లులకే సింహభాగం.. ప్రస్తుతం ఎక్కువ రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పొదిలి, కంభం, నెల్లూరు, గిద్దలూరు రైస్ మిల్లులకు.. తక్కువ శాతం మాత్రమే పోర్టుకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కార్డుదారుడి దగ్గర డీలర్ రూ.10కి కొనుగోలు చేస్తుండగా.. డీలర్ రేషన్ ముఠాకు రూ.16 నుంచి రూ.17కు విక్రయిస్తాడు. అక్కడి నుంచి అన్ని రకాల అమ్యామ్యాలు.. ఖర్చులు మొత్తం కలిపి రూ.25 వరకు పడుతుంది. రైస్ మిల్లర్ మాఫియా దగ్గర రూ.30 నుంచి రూ.35 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పోర్టుకు తరలించే రిస్క్ను తగ్గించుకుని రైస్ మిల్లర్లకే ఎక్కువగా సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రేషన్ అక్రమ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు కనీసం నిఘా పెట్టడం లేదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. పట్టిస్తే.. కేసులు రాయడం తప్పా.. నిఘా పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారిక రెక్కలువిజిలెన్స్ కమిటీ ఉన్నట్లా..లేనట్లా.. ? అసలు రెవెన్యూ అధికారులు ఉన్నారా.. విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణ ఉందా.. అనేది ప్రశ్నార్థకం. ప్రతి నెలా, లేదా రెండు నెలలకొకసారి జరగాల్సిన విజిలెన్స్ కమిటీ (ఆహార సలహా సంఘం) సమావేశం ఎప్పుడు జరుగుతుందో...అనేది ఎవరికి తెలియని దుస్థితి. గడిచిన రెండేళ్లలో ప్రజా సంఘాల నేతలు పట్టుకున్న బియ్యం తప్పా.. అధికారులు ఒక్క బస్తా బియ్యం పట్టుకున్న దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. పట్టణ శివారు ప్రాంతాలకు వెళ్లి ఒక్కసారి కార్డుదారులను పలకరిస్తే.. డీలర్ల బాగోతం బట్టబయలవుతుంది. మేం ఏ బియ్యమూ పట్టుకోలేదు రేషన్ షాపుల తనిఖీలు నిర్వహిస్తున్నాం. విజిలెన్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. గత రెండేళ్లల్లో ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్న బియ్యం తప్పా.. మరేమీ పట్టుకోలేదు. అందులోని విద్యార్థుల బియ్యం 136 బస్తాలపై విచారణ కొనసాగుతోంది. – ఎన్ఫోర్స్మెంట్ డీటీ భూపతి -
ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ
కంభం: ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం తెల్లవారుజామున కంభంలో అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు శ్రీశైలం వెళ్తున్న క్రమంలో కంభం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉండగా.. పలువురి మోచేతులు, కాళ్లకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం శ్రీశైలం వెళ్తున్న మరో బస్సులో ఎక్కించి పంపించారు. పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని కంభం పోలీసులు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు దెబ్బతిన్న ట్రావెల్స్ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలోనూ ఇదే ఫ్లైఓవర్ పరిసరాల్లో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, నివారణకు హైవే అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. ● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పునాయుడుపాలెం ఫ్లైఓవర్పై మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..విజయవాడ నుంచి చైన్నె పని నిమిత్తం కారులో వెళుతుండగా తూర్పునాయుడుపాలెం ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో సమయంలో ముందు వెళ్తున్న కట్టెల లోడు లారీ ఒక్కసారిగా నెమ్మదించడంతో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు వైపు కూర్చొని ఉన్న ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన షేక్ అబ్దుల్లా(27) అక్కడికక్కడే మృతి చెందగా దుర్గాప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని చరణ్, సీతారామయ్య, షఫీలటు ఎటువంటి గాయాలు కాలేదు. ఎస్సై నాగమల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కంభంలో అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై ప్రమాదం బస్సులో 20 మంది ప్రయాణికులు.. పలువురికి స్వల్పగాయాలు పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు ప్రథమ చికిత్స అనంతరం మరో బస్సులో శ్రీశైలం పయనం -
ఈడ్చుకెళ్లడం అమానుషం
● అంగన్వాడీలు అరెస్టును ఖండించిన ప్రగతిశీల మహిళా సంఘం ఒంగోలు టౌన్: శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను మహిళలన్న విజ్ఞత లేకుండా అమానుషంగా ఈడ్చుకెళ్లడం దుర్మార్గమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి ఖండించారు. న్యాయమైన హక్కుల సాధన కోసం ధర్నా చేస్తున్న అంగన్వాడీ యూనియన్ నాయకుల అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ స్థానిక ఎల్బీజీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలన్న కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఽఅర్దరాత్రి ధర్నా శిబిరం వద్దకు వచ్చి లైట్లు ఆపేసి, టెంట్లు కూల్చేయడం, మేము ఉగ్రవాదులం కాదు, ఉద్యమకారులం అని చెబుతున్నా వినకుండా పురుష పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం, చివరికి వాష్ రూంలకు వెళ్లి వస్తామన్నా వినకుండా దురుసుగా వ్యవహరించడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారని, వాగ్దానాలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. నిరసనలో ఐద్వా నాయకులు జి.ఆదిలక్ష్మి, ఉమా మహేశ్వరి, కె.రాజేశ్వరి, జి.కళ్యాణి, బి.రంగమ్మ, జి.నాగేశ్వరమ్మ, ఎస్.జ్యోతి, వై.అంజనీదేవి పాల్గొన్నారు. -
రెడ్డి జనాభ్యుదయ సంఘ సేవలు ప్రశంసనీయం
ఒంగోలు వన్టౌన్: ఒంగోలులోని రెడ్డి జనాభ్యుదయ సంఘం పేద విద్యార్థులకు చేస్తున్న సేవలు అమోఘమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ ఆలూరుకు చెందిన గాదె శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మామిడిపాలెంలోని రెడ్డి హాస్టల్ను ఆయన మంగళవారం సందర్శించి హాస్టల్ యాజమాన్యంతో కలిసి హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థుల వసతి కోసం మూడవ అంతస్తు నిర్మాణాన్ని తన సొంత నిధులతో నిర్మిస్తామని చెప్పారు. భవన నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన చేస్తామన్నారు. హాస్టల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డిని సంఘ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, కార్యదర్శి అన్నపురెడ్డి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో శేషి రెడ్డి, శంకర్రెడ్డి, నరసింహారెడ్డి, రామసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, యుగంధర్రెడ్డి, సుబ్బారెడ్డి, వినయ్కుమార్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శివ రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నంలో చోరీ ● రూ.2.30 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ కొత్తపట్నం: మండలంలో కొత్తపట్నంలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన పురిణి సరోజినీ ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్లు తన తండ్రి రఘురాములు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి ఉండగా బీరువా పగులగొట్టి ఉంది. అందులోని రూ.72 వేల నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. దీంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. ఎస్సై వేముల సుధాకర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● నాలుగు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్ మార్కాపురం: తర్లుపాడు మండల పరిధిలోని కర్నూలు–ఒంగోలు హైవేపై తాడివారిపల్లి ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో క్రేన్ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. పొదిలి వైపు నుంచి తాడివారిపల్లి వైపు వెళ్తున్న క్రేన్ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడటంతో సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, కార్లు ట్రాఫిక్లో చిక్కుకోవడంతో వాహనదారులంతా అవస్థలు పడ్డారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్రేన్ను పక్కకు తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మార్కాపురం టౌన్: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రీఫైనల్, ఈ నెల 15వ తేదీన ఫైనల్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,00,900 మందిని అక్షరాంధ్రలో నమోదు చేశామని, అభ్యాసకుల సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా ప్రీఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు, శ్రమ శక్తి సంఘాల్లోని సీ్త్ర, పురుషులకు వలంటరీ టీచర్లతో గ్రామాల్లో శిక్షణ ఇచ్చినట్లు వయోజన విద్య జిల్లా డీడీ బి.జగన్మోహన్రావు తెలిపారు. -
పెద ఉల్లగల్లులో భారీ చోరీ
ముండ్లమూరు: తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో భద్రపరిచిన 11 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి వస్తువులు, రూ.20 వేల నగదు అపహరించారు. ముండ్లమూరు మండలంలోని పెదఉల్లగల్లులో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ భారీ చోరీ వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సికాకొల్లి శంకరరావు తన భార్యాపిల్లలతో కలిసి సోమవారం రాత్రి 8 గంటలకు శింగరకొండ తిరునాళ్లకు వెళ్లారు. మంగళవారం వేకువజామున ఇంటికి చేరుకున్న శంకరరావు దంపతులు.. తలుపులు తెరిచి ఉండటంతో కంగుతిన్నారు. బీరువా తెరిచి ఉండటంతోపాటు దుస్తులు, వస్తువులు మంచంపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు లేకపోవడాన్ని గుర్తించి, వెంటనే ముండ్లమూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు క్లూస్ టీం సీఐ కె.రవీంద్రారెడ్డి, దర్శి సీఐతోపాటు ఎస్సై కమలాకర్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. బంగారు నల్లపూసల దండ, ఫ్యాన్సీ పూసల దండ, గుండ్లు పుస్తెల దండ, చెవి కమ్మలు, ఒక జత చెంప సవరాలు, ఒక జత మాటీలు, ఒక జత చిన్న కమ్మలు, వెండి అరకిలో, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు శంకరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీ అయిన సొత్తు విలువ రూ.17 లక్షలు ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు తప్పించి చోరీ శంకరరావు ఇంట్లో ముందు వైపు కిరాణా షాపు, ఇంటి పక్కన ఆర్ఓ ప్లాంట్ నిర్వహిస్తుండటంతో భద్రత కోసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దొంగలు ఇంటి వెనుక వైపున సీసీ కెమెరాను పైకి తిప్పి లోపలికి ప్రవేశించి, మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టారు. 11 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి, 20 వేల నగదు అపహరణ శింగరకొండ తిరునాళ్లకు వెళ్లి వచ్చేలోగా ఇల్లు లూటీ సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగపడని వైనం -
కమనీయం లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం
● ఘనంగా కళ్యాణ గజోత్సవం మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి కల్యాణం మంగళవారం రాత్రి కనులపండువగా సాగింది. వేదమంత్రాలు, భాజాభజంత్రీల నడుమ కల్యాణం నిర్వహించారు. అర్చకులు నారాయణం మారుతీ చార్యులు, నారాయణం శ్రీనివాసాచార్యులు, నారాయణం తిరుమలా చార్యులు, వేంకటసాయి చార్యులు కల్యాణ ఘట్ట్టాన్ని జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో కొండకు చేరుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులతో కిక్కిరిసింది. ఘనంగా గజోత్సవం శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఎదురుకోల ఉత్సవం, గజోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యలక్ష్మీసహితుడైన నృసింహుని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి ముందుగా ఎదురుకోల ఉత్సవం చేశారు. అనంతరం స్వామి ప్రతిమలను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. కుప్పం పెద కొల్లారావు, కుప్పం చిన కొల్లారావు, ప్రసాదు, సత్యన్నారాయణ, బీఎల్ఎన్ శాసీ్త్ర అన్నదమ్ములు, కుమారులు ఉభయదాతలుగా వ్యహరించారు. ఆలయాన్ని విద్యుత్దీపాలతో ప్రత్యేంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణం తిలకిస్తున్న భక్తులు (ఇన్సెట్) కల్యాణం జరిపిస్తున్న వేదపండితులుపల్లకిపై లక్ష్మీ నృసింహ స్వామి ఊరేగింపు -
రణభేరికి సన్నద్ధంకండి
ఒంగోలు సిటీ: యూటీఎఫ్ త్వరలో చేపట్టబోయే 3.ఓ రణభేరి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని, ఐఆర్ 29 శాతం ప్రకటించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రూ.25 వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. తక్షణమే సరెండర్ లీవ్ బకాయిలు, డీఏ బకాయిలు మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టిందని సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి అన్నారు. ప్రకాశం జిల్లా శాఖ వివిధ మండల శాఖలకు మీ మండలంలోని అత్యధికంగా ఎన్రోల్మెంట్ విద్యార్థులను చేసిన వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు డీ వీరాంజనేయులు, జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావ్, సహాధ్యక్షురాలు జీ ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్ చిన్నస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పీ రాజ సులోచన, జే బాబురావు, జిల్లా కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, ఎం సంధ్యారాణి, వైఎస్ఎన్ జ్యోతి, మీదిగ శీను, టీ రాజశేఖర్, పీ రామాంజనేయులు, ఎస్డీవీ ప్రసాద్, ఎం మాలకొండయ్య, జీ మధుసూదన్ రావు, పీ వలిఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్మార్గం
అంగన్వాడీల అరెస్టు ● అరెస్టులకు నిరసనగా అంగన్వాడీల మానవహారం ఒంగోలు టౌన్: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ చేపట్టిన చలో విజయవాడ మహాధర్నాలో పాల్గొన్న అంగన్వాడీ రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ ఖండించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకులు, కార్యకర్తలు చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా, అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ధర్నాకు ఒంగోలు ప్రాజెక్టు కార్యదర్శి కె.ఎమీమా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనివార్య పరిస్థితులలో విజయవాడలో మహాధర్నా చేపట్టినట్లు వివరించారు. ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీలు హాజరయ్యారని, దీన్ని సహించలేక మూడో తేదీ ఉదయం 4.30 సమయంలో నిద్రలో ఉన్న రాష్ట్ర నాయకులను లేపి పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని తెలిపారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాలలో తీసుకెళ్లి అరెస్టు చేశారని , ఇది దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. ఐసీడీస్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిరా అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ , పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడగడం నేరమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం మాట తప్పడమేనని చెప్పారు. న్యాయమైన డిమాండ్ల కోసం విజయవాడ మహాధర్నాలో పాల్గొన్న నాయకులపై పోలీసులను ఉసిగొల్పడం దారుణమన్నారు. సీఐటీయూ నాయకులు సీహెచ్ మంజుదార్, జి.రమేష్ మాట్లాడుతూ కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్లు విమానాల్లో తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ధర్నాలో కేవి.సుబ్బమ్మ, నిర్మలా దేవి, శేషమ్మ, సంధ్య, మాధవి, శోభ, అరుణ, స్వామిరెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి ఒకరికి తీవ్ర గాయాలు
గాయపడిన నలబోలు కొండారెడ్డి సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు ● సబ్స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన పీసీపల్లి: విద్యుదాఘాతానికి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..జంగాలపల్లికి చెందిన నల్లబోలు కొండారెడ్డి చిన్నచిన్న విద్యుత్ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం విద్యుత్ అధికారులు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో పీసీపల్లికి చెందిన నూకతోటి మాలకొండయ్య లైన్మన్ సులోమన్కు ఫోన్ చేశాడు. సులోమన్ ఎల్సీ ఇస్తాను, జంగాపల్లికి చెందిన కొండారెడ్డిని పిలిపించుకొని హెడ్ ఫీజు వేసుకొని సలహా ఇచ్చారు. ఆ తరువాత సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేషటర్ గోపాల్, లైన్మెన్ సులేమాన్, ప్రైవేట్ వ్యక్తి కొండారెడ్డి ముగ్గురు ఫోన్ లైన్లో ఉండి కొండారెడ్డిని స్తంభం ఎక్కమని చెప్పారు. అయితే ఎల్సీ ఇచ్చిన వెంటనే మళ్లీ మారెళ్ల ఫీడర్కు కరెంట్ ఇవ్వడంతో కొండారెడ్డికి విద్యుదాఘాతానికి గురై కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. కుడికాలు, కుడి చేయి, ఎడుమచేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో బంధువులు హుటాహుటిన పీసీపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. సబ్స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొండారెడ్డి విద్యుదాఘాతానికి గురయ్యాడని గ్రామస్తులు సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడ నుంచి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆందోళనలో రైతులు ఓబుల్ రెడ్డి, నాగిరెడ్డి, పెసల నరసింహారెడ్డి, కసిరెడ్డి మాలకొండయ్య, నలబోలు నారాయణ, నలబోలు కష్ణారెడ్డి, నలబోలు చిన్నపరెడ్డి, సాదు వెంకటేశ్వర్లు, పెసల కొండారెడ్డి, వెలుతుర్ల ప్రభాకర్ రెడ్డి, గంగిశెట్టి నరసింహంలు పాల్గొన్నారు. -
శింగరకొండ తిరునాళ్లలో టీడీపీ దుశ్చర్య
అద్దంకి రూరల్: శింగరకొండ తిరునాళ్లలో సోమవారం రాత్రి పచ్చ తమ్ముళ్లు దుశ్యర్యకు పాల్పడ్డారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్ద వైఎస్సార్ సీపీ జెండాలను తగలబెట్టి రాక్షసానందం పొందారు. ఈ దుశ్యర్య తాలూకూ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల జరగడం ఇష్టం లేని పచ్చ తమ్ముళ్లు వైఎస్సార్ సీపీ జెండాలను తగలబెట్టడం ద్వారా తమ బలహీనతను బయటపెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జి చింతలపూడి అశోక్కుమార్ పేర్కొన్నారు. జెండాలను తగలబెట్టడం పిరికి పంద చర్య అని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను రాజకీయంగా ఎదుర్కోలేక ద్వేషం, అసహనంతో దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. పచ్చమూక దుశ్యర్యను సమర్థిస్తారా లేక ఖండిస్తారా అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ప్రశ్నించారు. జెండాలను తగలబెట్టినంత మాత్రాన పార్టీ శ్రేణుల ఆత్మగౌరవాన్ని, సంకల్పాన్ని దహనం చేయలేరన్నారు. జెండాలు కాల్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జెండాకు నిప్పుపెట్టిన పచ్చ తమ్ముళ్లు పిరికిపందల చర్యగా పేర్కొన్న వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అశోక్కుమార్ -
ఫిర్యాదుల పరిష్కారంపై మరింత శ్రద్ధ చూపాలి
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశం ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం వేదికలో 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అత్తారింటి వేధింపులు, ఉద్యోగ మోసాలపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ చేసి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..మీ కోసం ఫిర్యాదులపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సూచించారు. జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పారు. బాధితులకు నమ్మకం కలిగేలా నిర్ణీత గడువు లోగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పోలీసు మీ కోసంలో ఫిర్యాదులు చేసేందుకు ఒంగోలు వరకు రాలేని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, కందుకూరు సీఐ అన్వర్బాషా, చీమకుర్తి సీఐ ప్రసాద్, మీ కోసం ఎస్సై జనార్దన్రావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్, సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు అందినట్లు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు అర్జీదారులతో మాట్లాడి సమస్యల పూర్వాపరాలు తెలుసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి అర్జీలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ కేసులు, ఉద్యోగ మోసాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ సురేష్, కంభం సీఐ కె.మల్లికార్జునరావు సిబ్బంది పాల్గొన్నారు. కందుకూరు రూరల్: పాత కక్షల నేపథ్యంలో దాడి చేశారని మనస్తాపం చెందిన ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఓగూరులో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..కందుకూరులోని ఆనందపురంకు చెందిన కె.మాధవరావు ట్రాక్టర్ల ఫైనాన్స్లో పని చేస్తుండేవాడు. ఆ పనిపై సుమారు రెండేళ్ల క్రితం కారులో ఓగూరు గ్రామానికి వెళ్లాడు. రోడ్డులో కారు అడ్డంగా పెట్టావని ఓగూరు గ్రామానికి చెందిన ఏ.వరుణ్ సాయి మాధవరావు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వరుణ్ సాయి మాధవరావును కొట్టి కారు అద్దాలు పగలగొట్టాడు. దీంతో అప్పుడు మధ్యవర్తులు మాట్లాడి సరిచేసి పంపారు. అప్పటి నుంచి కె.మాధవరావు వరుణ్ సాయిపై కక్షపెట్టుకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం వరుణ్ సాయి తన స్నేహితుడితో కలిసి కందుకూరులోని ఓ మద్యం షాపుకు వెళ్లి మద్యం సేవిస్తున్నారు. అక్కడే మద్యం సేవిస్తున్న మాధవరావు, మరో నలుగురు కలిసి వరుణ్ సాయిపై దాడి చేసి, కొట్టి గాయపరిచారు. అక్కడ నుంచి బయటపడిన వరుణ్ సాయి ఇంటికి వచ్చి బంధువులకు చెప్పారు. మాధవరావు అనే వ్యక్తి నన్ను చేస్తాడని కుటుంబ సభ్యులతో, బంధువుల వద్ద వాపోయాడు. అనంతరం మనస్తాపానికి గురైన వరుణ్ సాయి (22) తన చావుకి కారణంగా ఆనందపురంకు చెందిన మాధవరావు అని ఫోన్ సెల్ఫీ వీడియో తీసుకొని ఫోన్ అక్కడే పెట్టి ఊరిలోనే ఉన్న పాడుపడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంభం: మండలంలోని తురిమెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని సిట్టింగ్ స్క్వాడ్ డీబార్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సోనీ తెలిపారు. ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్ పరీక్ష రాస్తున్న విద్యార్థి కాపీయింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సిట్టింగ్ స్క్వాడ్ సదరు విద్యార్థిని డీబార్ చేసినట్లు తెలిసింది. సీఎస్పురం(పామూరు): మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం వద్ద వివిధ రకాల దుకాణాలు, ఇతరాల నిర్వహణకు సంబంధించి వేలం నిర్వహించగా వేలం ద్వారా రూ.31,84,700 ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ తెలిపారు. సోమవారం దేవదాయ, ధర్మాదాయ శాఖ కందుకూరు డివిజన్ ఇన్స్పెక్టర్ జి.ఏ.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈఓ, ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో దుకాణాలు, ఇతరాలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2027 మార్చి 31 వ తేదీ వరకు నిర్వహించుకునేందుకు వేలం వేశారు. తలనీలాలు పోగు చేసుకునేందుకు రూ.18,11,700, టోల్గేట్ నిర్వహణకు రూ.5.71 లక్షలు, కొబ్బరి చిప్పలు పోగుచేసుకునేందుకు రూ.4.22 లక్షలు, కూల్డ్రింక్స్ దుకాణం నిర్వహణకు రూ.2 లక్షలు, క్యాంటిన్, మిఠాయిల కోసం రూ.1.80 లక్షలు ఆదాయంగా వచ్చినట్లు ఈఓ, ధర్మకర్త తెలిపారు. -
పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
● పాఠశాల విద్య జేడీ ఎన్.గీత కనిగిరి రూరల్: పబ్లిక్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్, పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు ఎన్.గీత పేర్కొన్నారు. కనిగిరి బాలికోన్నత పాఠశాల, చింతలపాలెం పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ రాజాల కొండారెడ్డితో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా గిద్దలూరు, వైపాలెం, మార్కాపురం, కనిగిరి పట్టణాల్లో 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2,909 మంది పరీక్షలు రాస్తున్నట్లు వెల్లడించారు. పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సిబ్బంది నియామకం పూర్తయిందని తెలిపారు. అనంతనం కనిగిరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. -
ఒంగోలులో మీ కోసంకు 281 అర్జీలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 281 అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను నేరుగా గడువు లోగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లీనిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువు లోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పరిష్కరించకుంటే ఎందుకు పరిష్కరించలేదో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్రెడ్డి, మాధురి, కళావతి, విజయజ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధిలో 125 రోజుల పనిదినాలు పచ్చి మోసమే..
ఒంగోలు టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీ జీ రాంజి పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చిన మోదీ సర్కార్ గ్రామీణ ప్రజల కడుపు కొట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. జీ రాంజీ పథకంలో ఏడాదిలో 125 రోజలు పనిదినాలు కల్పిస్తున్నట్లు చెబుతున్న మోదీ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులను మాత్రం కేటాయించలేదని చెప్పారు. ఈ పథకం అమలుకు 2.30 లక్షల కోట్ల రూపాయలు అవసరం కాగా కేవలం 95 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతదంగా కొనసాగించాలని, వీబీ జీ రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను కేటాయిస్తుండగా ఇప్పుడు అమలు చేయనున్న కొత్త పథకంలో కేవలం 60 శాతం నిధులను కేంద్రం, మిగతా 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలని చెప్పడం మసిపూసి మాయ చేయడమేనన్నారు. ఆంధ్ర రాష్ట్రం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఇటీవల బడ్జెట్లో రూ.3,346 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు ఉపాధి కూలీలకు 125 రోజుల పని ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. హక్కులు, నిధులు లేని వీబీ జీ రాంజీ పథకాన్ని గ్రామీణ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా 58 శాతం నిరుపేద మహిళలు, 19 శాతం దళితులు, 18 శాతం గిరిజనులు పనిచేస్తున్నారని వివరించారు. ఈ పథకాన్ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, ధనిక వర్గాలకు ఉపయోగం కలిగేలా వీబీ జీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. మోదీ విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వీబీ జీ రాంజీ పథకం రాష్ట్రాలపై మోయలేని భారం మోపుతోందంటూ అరుణోదయ సంస్థ ఏర్పాటు చేసిన దృశ్యమాలిక అందరినీ ఆలోచింపజేసింది. ధర్నాలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.మంజుల, ఎస్.భారతి, రైతు కూలీ సంఘం నాయకులు హనుమంతరావు, చంద్రశేఖర్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు జాలన్న, సీపీఐ న్యూ డెమోక్రసీ నాయకులు సీఎస్ సాగర్, ఎల్.రాజశేఖర్, సీహెచ్ పద్మ, కృష్ణారావు, సీతారావమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పృథులాద్రి
భక్తులతో పులకించినమర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన పృథులగిరి లక్ష్మీనృసింహస్వామి తిరుణాళ్ల సోమవారం వైభవంగా సాగింది. పృథులగిరి భక్తులతో పోటెత్తింది. గత నెల 25 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అశేషభక్త సమూహంతో పృథులాద్రి కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం మారుతీచార్యులు, ఆదిశేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, వెంకటసాయిలు స్వామిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు. గరుడసేవ సందర్భంగా స్వామిని పల్లకిపై ఉంచి, బోయిలు సహయంతో స్వామిని మెట్లమార్గాన తీసుకెళ్లి అన్ని సత్రాల సమీపంలోని భక్తులకు దర్శనార్థానికి వీలుగా ఊరేగించారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, గ్రామాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకొని ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు బారులుదీరారు. వివిధ సామాజిక సత్రాల్లో భక్తులకు అన్నదానంచేశారు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారు స్వామి సన్నిధిలో ఊయల కట్టడం ఆనవాయితీ. మెట్ల మార్గాన నడిచి వచ్చే భక్తులకు సీతమ్మవారి పాదాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తులు మెట్లను పసుపు, కుంకుమలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు. మర్రిపూడి వైద్యాధికారి వీరబాబు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, కొండపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో మర్రిపూడి, కొండపి, పొన్నలూరు ఎస్సైలు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైభవంగా గరుడోత్సవం తిరునాళ్లను పురస్కరించనుకొని ఆలయ ఆవరణలో గరుడోత్సవం వైభవంగా సాగింది. అలవల వెంకయ్య, సుందరరావు, వలేటి నర్శింహారావులు ఉభయదాతలుగా వ్యవహరించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కమనీయం శివపార్వతుల కల్యాణం.. శివ,విష్ణు పుణ్యక్షేత్రాలు ఒకే చోట కొలువై ఉండటంతో ఈ పృథులాద్రి ప్రత్యేకతను సంతరించుకుంది. లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి తూర్పు వైపున వేంచేసిన శివాలయంలో తిరునాళ్లను పురస్కరించుకొని స్వామి ప్రతిమలను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. గండ్రకోట సోదరులు శ్రీనివాసశర్మ, వాసు, సురేంద్ర, కుమార్ తదితరులు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్టారు. ఘనంగా లక్ష్మీనృసింహస్వామి గరుడోత్సవం లక్ష్మీనృసింహుని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం కమనీయం శివపార్వతుల కళ్యాణం -
అక్రమ రిజిస్ట్రేషన్పై పోరాడుతున్నా పట్టించుకోరా?
● అధికారులకు 15 సార్లు అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదు ● కన్నీటి పర్యంతమైన సుబ్బలక్ష్మి తనకు చెందిన భూమిని మరో మహిళ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై 15 సార్లు అధికారులకు అర్జీలిచ్చినా న్యాయం చేయలేదని యర్రగొండపాలేనికి చెందిన వెలగపూడి సుబ్బలక్ష్మి సోమవారం కలెక్టరేట్లో జేసీ శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్ ఎదుట కన్నీటి పర్యంతమైంది. ‘యర్రగొండపాలెం పట్టణంలో సర్వే నం.58/1లో నాకు 570 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. అందులో 390 చదరపు గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నా. ఈ స్థిరాస్తి మా అత్త వెలగపూడి వసుంధరాదేవి ద్వారా సంక్రమించింది. సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా నాకు లభించిన స్థలాన్ని యర్రగొండపాలెం మండలం సర్వాయపాలేనికి చెందిన బి.యోగమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ.. యర్రగొండపాలెం ఎమ్మార్వో, జిల్లా రిజిస్ట్రార్కు ఇప్పటి వరకు 15 సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. పూర్తి రికార్డులు పరిశీలించి అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని వేడుకుంటున్నా’ అని జేసీకి విన్నవించింది. దీనిపై స్పందించిన జేసీ పూర్తి రికార్డులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని మార్కాపురం రిజిస్ట్రార్ను ఆదేశించారు. -
బాలికపై అసభ్య ప్రవర్తన
● యువకునిపై పోక్సో కేసు నమోదు హనుమంతునిపాడు: మండలంలోని రశీదుపురంలో 14 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన యువకునిపై పోక్సో కేసు నమోదైంది. ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. రశీదుపురం గ్రామానికి చెందిన మేకల సుబ్బయ్య కుమారుడు మేకల నాగార్జున్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించి చేయి పట్టుకొని చెట్లలోకి లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు యువకునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం మాధవరావు తెలిపారు. ఒంగోలు టౌన్: జనసేన సభ్యత్వ నమోదులో భాగంగా ఏర్పాటు చేసిన ఉద్యమి సమావేశానికి మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దూరంగా ఉన్నారు. సోమవారం రవిప్రియమాల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాలినేని వర్గం దూరంగా ఉందన్న విషయం తెలుసుకుని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బాలినేని ఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం కొణతాల మీడియాతో మాట్లాడి సమావేశానికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బేస్తవారిపేట: అంతర్జాతీయ పారా త్రోబాల్ చాంపియన్షిప్కు బేస్తవారిపేట మండలంలోని ఆర్.కొత్తపల్లెకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు పండుగల రాయుడు ఎంపికయ్యాడు. ఫిబ్రవరిలో రాజస్థాన్లో నిర్వహించిన నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో ఏపీ జట్టు విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాయుడు మలేషియాలోని కౌలాలంపూర్లో ఏప్రిల్ 20 నుంచి 25 వరకు నిర్వహించనున్న రెండో ఏషియన్ ఇంటర్నేషనల్ పారా త్రో బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు సెలక్ట్ అయ్యాడు. ఈ మేరకు పారా త్రోబాల్ అసోసియేషన్ ఇఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు అందాయి. టంగుటూరు: రైలు కిందపడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన టంగుటూరు రైల్వేస్టేషన్ సమీపంలోని 193 రైల్వే గేట్ వద్ద సోమవారం జరిగింది. ఒంగోలు రైల్వే పోలీసులు, టంగుటూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు..టంగుటూరు రైల్వేస్టేషన్ ఉత్తర పక్కన రైల్వే ఎల్సీ గేట్ 193 దిగువ లైన్ వద్ద గుర్తు తెలియని వృద్దురాలి మృతదేహం పడి ఉంది. రైల్వేస్టేషన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై టి.శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. -
అర్జీల పరంపర.. సమస్యల మొర
మార్కాపురం టౌన్: క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. రోజులు, నెలల తరబడి మండల కేంద్రాల్లో అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన బాధితులంతా జిల్లా కలెక్టరేట్లో లిఖితపూర్వకంగా అర్జీలు అందజేశారు. తమ సమస్యలను జిల్లా అధికారులకు వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సోమవారం ప్రకాశం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు 281 అర్జీలు, మార్కాపురం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు 83 అర్జీలు అందాయని ఆయా కార్యాలయాల అధికారులు వెల్లడించారు. మార్కాపురంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ పులి శ్రీనివాసులు, జిల్లా గనుల శాఖ ఏడీ పోలిరెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్బాబు, ఆర్డీఓ ప్రభాకర్, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రీవెన్స్కు గైర్హాజరైతే వేటు తప్పదు ● మార్కాపురం జేసీ హెచ్చరిక మార్కాపురం జిల్లాలోని ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలపై అర్జీలు అధికంగా వస్తున్నాయని తహసీల్దార్లు, సిబ్బంది దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జేసీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవిన్యూ సమస్యలపై పదే పదే అర్జీలు వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గైర్హాజరైన కొందరు అధికారులకు ఫోన్ చేసి ఆహ్రహం వ్యక్తం చేశారు. మరోసారి నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఇకపై జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వారంలో మంగళ, గురు, శనివారాల్లో పట్టణాలు, గ్రామాల్లోని వైద్యశాలలు, ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలు, అన్నా క్యాంటీన్, ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పధకాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. గ్రీవెన్స్కు వచ్చిన అర్జీల్లో కొన్ని.. రెవెన్యూ గ్రీవెన్స్కు ప్రకాశంలో 281, మార్కాపురంలో 83 అర్జీలు సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని జేసీల ఆదేశం -
అసలు దొంగలెవరో తేల్చాలి..
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026ఒంగోలులో అధికార కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘‘నువ్వు దొంగంటే.. కాదుం నువ్వే దొంగ’’ అంటూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు గుప్పించుకుంటూ ఇరుపార్టీల నేతలు పోటాపోటీగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహిరంగంగానే బురదజల్లుకోవడంతో స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ–జనసేన పార్టీ నేతలు కలిసి అధికారం అనుభవిస్తున్నప్పటికీ, ఒంగోలులో పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా పార్టీ అధినాయకత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. నగర రాజకీయాలు ఇక ఎటు మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. నవ్వుల పాలవుతున్న కూటమి నాయకుల తీరు.. వారిద్దరూ అధికార కూటమి పార్టీ నాయకులే. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరొకవైపు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వంటే నువ్వని ఒకరి మీద మరొకరు అవినీతి అరోపణలు చేసుకుంటున్నారు. నువ్వు చేసిన కబ్జాలు ప్రజలందరికీ తెలుసంటూ దామచర్ల భగ్గుమంటే, నీ అవినీతి అరాచకాలను బయటపెట్టేంత వరకు వదిలి పెట్టేది లేదని బాలినేని సవాల్ విసురుతున్నారు. ఒంగోలులో జరుగుతున్న భూ కబ్జాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో నిరుపేద ప్రజలు భయపడిపోతున్నారని, వారికి అండగా నిలబడతానని ప్రకటించారు. నువ్వేం దోచుకుంటున్నావో, నేనేం దోచుకున్నానో ప్రజలకు తెలుసన్నారు. దీనికి స్పందించిన దామచర్ల.. హైదరాబాద్ నుంచి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నీ ఇష్టం వచ్చినట్లు ఇసుక, మట్టి లూటీ అని మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి బాలినేని గురించి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దొంగ నువ్వంటే నువ్వేనని ఒకరి మీద మరొకరు అవినీతి అరోపణలు చేసుకుంటుంటే అసలు దొంగలెవరో తేల్చాలని ఒంగోలు ప్రజలు కోరుతున్నారు.మాటలు వేడెక్కి..కూటమి వీధికెక్కి!సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలులో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై వచ్చిన లేఖ ఈ చిచ్చును మరింత రాజేసింది. దీంతో కూటమి నాయకులు నువ్వా నేనా అంటూ కుస్తీకి దిగారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, ఇసుక, మట్టి, రేషన్, మద్యం లూటీ జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. మెప్మా అవినీతికి పాల్పడిన వారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల అవినీతి జరిగితే అధికారులను బలిచేసి సొంత మనుషులను కాపాడుకున్నారని ఆరోపించారు. తన హయాంలో బ్రాహ్మణుల భూమిని కబ్జా చేసినట్లు దామచర్ల తప్పుడు ప్రచారం చేయించారని గుర్తు చేసిన బాలినేని ఇప్పుడా భూమిని ఎవరు కబ్జా చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల భూమి ఒక్కటే కాదని ఇంకా నాలుగైదు భూముల కబ్జా చేశారని, వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విచారణ జరపాలని చెప్పారు. ఎమ్మెల్యే అవినీతిపై వచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ఆ లేఖను హైదరాబాద్లో కూర్చొని రాయించినట్లు తనపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. సొంత ఇంటి మనిషే లేఖ రాసినట్లు తేలితే ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకున్నారని ఆరోపించారు. తన మీద లేఖ రాసిన వ్యక్తిని ఎవరైనా ఇంటికి పిలిపించుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల సొంత మనుషులే మెప్మా దొంగలని, వారిని కాపాడేందుకు అధికారులను బలిచేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే దామచర్ల మీద లెటర్ వేయించలేదని తన కుమారుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, నా పాత్ర ఉందని నీవు నీ కూతురి మీద ప్రమాణం చేయగలవా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలినేనిపై రెచ్చి పోయారు. పరుష పదజాలంతో దూషణలందుకున్నారు. తన మీద వచ్చిన లేఖను వెనక బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు ఆరోపణలు చేశారు. లేఖ రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మినేని మురళిని రక్షించేందుకు బాలినేని ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆరోపించారు. ఇప్పుడు తనకేమీ తెలియదంటే ఎలాగని ప్రశ్నించారు. ఎప్పటిలాగే బాలినేనిని ఒదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకరి మీద మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కారు. మెప్మా అవినీతిపై విచారణ జరపాలి.. మెప్మా అవినీతిపై విచారణ జరపాలని, అసలు నిందితుల పేర్లను బయట పెట్టాలని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా కలెక్టర్కు ఫోన్ చేసినట్లు చెప్పడం సంచలనం సృష్టించింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తనకు చెప్పారని మీడియా సమావేశంలో బాలినేని చెప్పారు. మెప్మాలో జరిగిన అవినీతి మీద ఊరికే ఆరోపణలు చేయకుండా కలెక్టర్ వద్దకు వెళ్లి కలవాలని చెప్పిన దామచర్లకు గొంతులో వెలక్కాయ పడినట్లయిందని టీడీపీలోని అసంతృప్తి వర్గం చెబుతోంది. తొలి నుంచి ఒంగోలు కూటమిలో ఎమ్మెల్యే దామచర్ల, జనసేన నేత బాలినేని మధ్య విభేదాలున్నాయి. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. నాయకులిద్దరూ ఒకరి మీద మరొకరు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకుంటుంటే ఆ రెండు పార్టీలకు చెందిన అధినాయకత్వం చూసిచూడనట్లు వదిలిపెట్టడం వెనక ఉద్దేశం ఏమిటో అర్థంకాక టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. బాలినేని మీద ఆరోపణలు చేస్తున్న దామచర్ల తాను ఎమ్మెల్యేగా మాట్లాడడం లేదని చెబుతున్నారు. బాలినేని సైతం తాను జనసేన నాయకుడిగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని చెబుతున్నారు. కూటమి ఐక్యత కోసం ఏడాదిన్నర కాలం ఊరుకున్నట్లు ఇద్దరు నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో కలిసి అధికారం అనుభవిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు ఒంగోలులో పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కడంపై రెండు పార్టీల కేడర్ అయోమయంలో పడిపోయింది. వారం రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
తల్లిని కోల్పోయినా..లక్ష్యం చెదరక..
● ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన కుమారుడు జె.పంగులూరు: అనారోగ్యంతో తల్లి మృతి చెందిన బాధలో ఉన్న కుమారుడు ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే..ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన జే పంగులూరు మండల పరిధిలోని అలవలపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన కాకర్లమూడి సుజాత (35) రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఒంగోలు ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయిస్తున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం భర్త ఆదాం ఆమెను చైన్నె తీసుకెళ్లాడు. సుజాత చైన్నె వెళ్లే సమయంలో తన ముగ్గురు పిల్లలైన రత్నరాణి, ప్రేమ్కుమార్, విజయ్తో మాట్లాడింది. బాగా చదువుకోవాలని..తాను చూపించుకొని వెంటనే వస్తానని చెప్పి వెళ్లింది. ఆదివారం రాత్రి చైన్నెలో చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. సోమవారం ఆమె మృతదేహాన్ని అలవలపాడు గ్రామానికి తీసుకొచ్చారు. తల్లి మృతదేహం చూసిన ముగ్గురు పిల్లలు బోరున విలపించారు. తల్లి మృతదేహం ఇంటిలో ఉండగానే ఆమె కోరినట్లు తన భవిష్యత్తు కోసం కుమారుడు ప్రేమ్ కుమార్ అద్దంకిలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాసిన అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కుమార్తె రత్నరాణి డిగ్రీ చదువుతోంది. మూడో కుమారుడు విజయ్ గ్రామంలోనే 7వ తరగతి చదువుతున్నాడు. -
కల్తీ లడ్డూతోనే కాలయాపన
● ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, చింతలపూడి అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం లేనిపోనివి సృష్టించి తిరుమల లడ్డూ కల్తీ అంటూ అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు సోమవారం రాత్రి ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కొత్తరెడ్డిపాలెం, అద్దంకి టౌన్ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో అద్దంకిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, అద్దంకి మండల కన్వీనర్ గుజ్జుల జగన్మోహన్రెడ్డి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, కొరిశపాడు మండల కన్వీనర్ పాలపర్తి శ్రీధర్, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణంలో చోరీ
● రూ.1.75 లక్షలు అపహరించిన దుండగులు నాగులుప్పలపాడు: మద్యం దుకాణం తాళాలను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి కౌంటర్లో ఉంచిన నగదు కాజేశారు. ఈ సంఘటన నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. ఉప్పుగుండూరు గ్రామంలోని వైన్ షాపు నంబర్ 30లో శనివారం రాత్రి వ్యాపారం తాలూకా నగదు రూ.1.75 లక్షలను కౌంటర్లో ఉంచి మూసివేశారు. ఈ దుకాణానికి వాచ్మన్ను నియమించినప్పటికీ శనివారం అతను విధుల్లో లేడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అర్ధరాత్రి తర్వాత దుకాణం తాళాలు పగలగొట్టి నగదు కాజేశారు. ఆదివారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి ఎస్సై మహేంద్ర నాయక్ పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజ్ను సేకరించారు. చోరీ కేసు త్వరలోనే చేధిస్తామని ఎస్సై చెప్పారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం అద్దంకి: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో మధురానగర్ సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..మండలంలోని కొంగపాడు ఎస్సీ కాలనీకి చెందిన ఏసపోగు వినోద్(28), ఎచ్చెర్ల చిన్నా(22) పచ్చాకు కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. వినోద్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా, చిన్నాకు వివాహం కాలేదు. వీరిద్దరు ఆదివారం పని నిమిత్తం బైకుపై అద్దంకికి వచ్చారు. పనులు ముగించుకుని, బైక్పై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రాష్ట్రీయ రహదారిలో మధురానగర్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్ భార్య అనిత, చిన్నా తల్లి నవనీతం ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం ఒకే రోజు రెండు కుటుంబాలకు చెందిన ఆశల దీపాలు ఆరిపోవడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వందేళ్లు తనకు తోడుంటాడనుకున్న భర్త మరణంతో వినోద్ భార్య, తమ కుమారుడు మృతితో చిన్నా తల్లి మృతదేహాలను చూసి తల్లిడిల్లిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి కొత్తపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జాలన్ జిల్లా, ఎయిర్ గ్రామానికి చెందిన అశ్రపి (63) పానీపూరి బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తను స్వగ్రామానికి కుమారుడు నరేంద్రతో కలిసి ఆటోలో వెళుతున్నారు. ఒంగోలు నుంచి గుర్తు తెలియని వాహనం కొత్తపట్నం సమీపంలో మార్కెట్ యార్డ్ ఎదురుగా వచ్చే సరికి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆశ్రపికి బలమైన గాయాలు కావడంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఉలవపాడు: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జాతీయరహదారిపై కరేడు ర్యాంపు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడు వరిగచేను సంఘంకు చెందిన పోట్లూరి కోటేశ్వరరావు, పోట్లూరి రమేష్ ద్విచక్రవాహనంపై సింగరాయకొండ వెళుతూ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కిందపడిపోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ముందు వాహనం నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయాలైన ఇద్దరిని 108 సిబ్బంది ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై భర్త, అత్తమామల దాడి
ఒంగోలు టౌన్: అత్తమామలతో కలిసి తన భర్త వేధిస్తున్నాడని, భర్త, మరిది, అత్తమామలు కలిసి తనతో బలవంతంగా మత్తు మాత్రలు మింగించి ఇంటి నుంచి గెంటేశారని వివాహిత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు.. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ నశీర్ అహ్మద్, హుసేన్ బీ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దమ్మాయి షేక్ మనీషాను ఒంగోలు సీతారామపురంలో నివాసం ఉండే షేక్ బిస్మిల్లా కుమారుడు ఆరీఫ్ అల్లాకు ఇచ్చి 2021లో వివాహం చేశారు. వివాహ సమయంలో 50 సవర్ల బంగారు నగలు, వేరు కాపురానికి రూ.10 లక్షల నగదు ఇచ్చారు. రూ.50 లక్షలు ఖర్చు చేసి అట్టహాసంగా వివాహం జరిపించారు. బీటెక్ చదువుకున్న ఆరీఫ్ ఉద్యోగం చేయకుండా తండ్రి నిర్వహించే రెస్టారెంట్, వడ్డీ వ్యాపారాలు చూసుకుంటుంటాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆరీఫ్ భార్యతో సరిగా కాపురం చేయకపోవడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విడాకుల కోసం సంతకం చేసి వెళ్లి పోవాలని మనీషాను వేధించసాగాడు. దీంతో మనీషా పుట్టింటికి చేరింది. గత ఏడాది డిసెంబర్లో తిరిగి అత్తారింటికి వచ్చింది. అయినప్పటికీ వేధింపులు మానలేదు. దీంతో కొద్ది రోజులుగా తల్లి హుసేన్ బీ కూతురికి తోడుగా ఒంగోలుకు వచ్చి ఉంటోంది. ఎలాగైనా సరే మనీషాను వదిలించుకోవాలని భావిస్తున్న ఆరీఫ్, అతని తల్లిదండ్రులు, తమ్ముడు మరికొందరితో కలిసి ఆదివారం దాడికి పాల్పడ్డారు. మనీషాతో బలవంతంగా మత్తు మాత్రలు మింగించారు. ఆమె తల్లి హుసేన్బీని ఇంటి బయటకు గెంటేశారు. ప్రస్తుతం మనీషా జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. దాడిపై బాధితులు ఒంగోలు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మనీషాను అత్తామామలు వేధిస్తున్నట్లు ఆమె తలిదండ్రులు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.


