breaking news
Prakasam
-
పేదరికాన్ని రూపుమాపటమే లక్ష్యం
● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఒంగోలు సబర్బన్: పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి–4 విధానాన్ని రూపొందించిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ ఆర్ గోపాల కృష్ణతో కలసి మండల స్థాయి అధికారులతో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా అర్హులైన బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను గుర్తించాలని జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. జిల్లాలో 74 వేల 911 బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరికి కావాల్సిన అవసరాలను గుర్తించడంతోపాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా ఈ నెల 25వ తేదీ లోపు గ్రామ, వార్డు సభలు నిర్వహించి గుర్తించాలన్నారు. సచివాలయం వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఈనెల 19న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, హౌసింగ్ పీడీలు జోసెఫ్ కుమార్, నారాయణ, శ్రీహరి, శ్రీనివాస ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, డీటీసీ సుశీల, డీసీఓ పద్మశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వీఏఏల బదిలీలపై హైకోర్టు స్టే
బేస్తవారిపేట: విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీల్లో అన్యాయం జరిగిందని హైకోర్టుకు ఏడుగురు వీఏఏలు వెళ్లారు. స్పౌజ్ కోటా, వికలాంగులు, సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని, సీనియారిటీ ఉన్న వీఏఏలు ఎంచుకున్న ప్రదేశాల్లో జూనియర్లను నియమించడం, రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏకపక్షంగా ఎంచుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం చట్ట విరుద్ధంగా జరిగిందని కోర్టుకెళ్లారు. చోళ్లవీడు ఆర్ఎస్కే వీఏఏ సుమంత్బాబు, సలకలవీడు టీ రమణారెడ్డి, గుడిపాటిపల్లి దుర్గం జిలానీ, రాజుపాలెం కేవీ ధనూషా శ్రీ, కంభం టీ చెన్నారెడ్డి, ఎంపీ చెరువు ఎం బాలకృష్ణ, పెద్ద ఓబినేనిపల్లె ఏ శ్రీనివాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఈనెల 23వ తేదీ వరకు కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్ సరఫరా లేక జీజీహెచ్లో రోగుల అవస్థలు మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్లో శుక్రవారం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ విద్యుత్ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం అర్ధరాత్రి నుంచి మార్కాపురం ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో జీజీహెచ్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఫ్యాన్లు, లైట్లు లేక చీకట్లో ఇబ్బందులు పడ్డారు. ఆపరేషన్ చేయించుకున్నవారు తీవ్రమైన ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. జీజీహెచ్లో జనరేటర్ సౌకర్యం ఉన్నా వేయలేదని పలువురు రోగులు తెలిపారు. సాయంత్రం సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. 21న మీటర్ రీడర్స్ చలో విజయవాడ కంభం: మీటర్ రీడర్స్ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 21న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీటర్ రీడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం చలోవిజయవాడ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్ రీడర్స్ అందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి అందరూ తరలిరావలని కోరారు. మీటర్ రీడర్స్ కాశిరెడ్డి, పిట్టల శ్రీను, రామక్రిష్ణ, నారాయణ, నాసర్ పాల్గొన్నారు. పడిపోతున్న పొగాకు సరాసరి ధరలుటంగుటూరు: పొగాకు సరాసరి ధరలు రోజు రోజుకీ అమాంతం పడిపోతున్నాయి. గత సంవత్సరం 40 నుంచి 50 పొగాకు కంపెనీలు వేలంలో పాల్గొనేవి. ఇప్పుడు కేవలం 20 కంపెనీలే పాల్గొంటున్నాయి. అందులో కూడా చాలా కంపెనీలు మొక్కుబడిగా పాల్గొంటున్నాయని రైతులు అంటున్నారు. వేలం ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నా బోర్డు ఉన్నతాధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసర ధర రూ.197.87 పలికింది. వేలం కేంద్రానికి కారుమంచి గ్రామానికి చెందిన రైతులు వేలానికి 957 బేళ్లను తీసుకురాగా వాటిలో 798 బేళ్లు కొనుగోలు చేశారు. 159 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280 కాగా, కనిష్ట ధర రూ.160, సరాసరి రూ.197.87 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 25 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆగని తిరస్కరణ పొగాకు బేళ్లు కొండపి: రోజు రోజుకీ తిరస్కరణ బేళ్లు పెరుగుతున్నా అటు ప్రభుత్వం, ఇటు బోర్డు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బోర్డు అధికారులు ఆర్డర్లు వచ్చాయి ఏ రకం పొగాకునైనా కొనుగోలు చేస్తామని చెబుతున్నా అది ఆచరించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరస్కరణ బేళ్లు వేలం కేంద్రం నుంచి ఇంటికి తీసుకొని పోయి మళ్లీ కేంద్రానికి తీసుకురావాలంటే ఒక్కో బేలుకు వందల్లో ఖర్చవుతుందని రైతులు వాపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. శుక్రవారం నెన్నూరుపాడు, మూగచింతల, గుర్రపడియ, సతుకుపాడు, కె.అగ్రహారం గ్రామాలకి చెందిన రైతులు 1223 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 822 కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 401 తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160, సరాసరి రూ.223.64 ధర పలికింది. -
నమ్మించి మోసగించడమే బాబు నైజం
దర్శి: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నమ్మించి మోసం చేయడం బాబు నైజమని, ఇచ్చిన మాటకు కట్టుబడి 100 శాతం హామీలు అమలు చేయడం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దర్శి పట్టణంలోని బూచేపల్లి నివాసంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ అర్హులందరికీ అన్నీ పథకాలు అందిస్తే...ఈవీఎంల ద్వారా సీఎం అయి చంద్రబాబు వైఎస్సార్సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెబుతున్నారంటే ఆయన ఎంత దుర్మార్గపు ముఖ్యమంత్రో ప్రజలు ఆలోచించాలన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్లను చూస్తే ఆరోగ్య శ్రీ, డ్యాంలు, అమ్మఒడి, నాడు–నేడు, కార్పొరేట్ విద్య, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చిహ్నలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, నయవంచన, ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన మోసగాడుగా గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రంలో స్కీంలు ఒక్కటీ అమలు కావడం లేదుకానీ స్కాంలు మాత్రం భారీగా జరుగుతున్నాయన్నారు. మహిళలకు మొండిచేయి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ చంద్రబాబు తల్లికి వందనం అంటూ అర్హులైన తల్లులకు పథకాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టారన్నారు. దీపం పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్తే ఆ దీపం వెలగకుండానే ఆరిపోయిందని ఎద్దేవా చేశారు. పిఠాపురం పీఠాధిపతి పవన్ తన సొంత జిల్లాలో మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడరు కానీ పక్క రాష్ట్రాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తా, నారతీస్తా అంటారని అన్నారు. సకల శాఖా మంత్రి లోకేష్ జగన్న పథకాలు అన్నీ తానే సృష్టించానని ప్రచారం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాత్రి బొద్దింక అని చెప్పి తెల్లవారు జామున వెంట్రుక అని చెప్పే మహిళా హోంమంత్రి కూటమి పాలనలో ప్రతి గంటకు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడలేదని మండిపడ్డారు. జీవితాంతం జగనన్నతోనే పయనం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ తమ జీవితాంతం వైఎస్ జగనన్నతోనే పయనిస్తామని, నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పొదిలి పర్యటనలో టీడీపీ వాళ్లు తప్పులు చేస్తే దాచి పెట్టి అమాయకులను జైల్లో పెట్టారన్నారు. సెంటర్లో బ్యానర్లు వేస్తామంటే అధికార పార్టీ వాళ్లు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు రౌడీలు, గూండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ పై దాడి చేస్తే మహిళా హోం మంత్రి అయి బాధితురాలిపైనే కేసులు పెట్టించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, అంతకు రెండు రెట్లు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మార్కాపురంలో నిర్వహించిన సభలో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వంలో ఉంటామని చెప్పడమే జగనన్న అంటే వాళ్లకు పట్టుకున్న భయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమికి దడపట్టుకుందని చెప్పారు. మద్యం, ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జెండాలు, ఫ్లెక్సీలు కట్టనీయడం లేదని కనీసం కార్యక్రమాలకు కళ్యాణ మండపాలు కూడా ఇవ్వకుండా ఆపితే కార్యక్రమాలు ఆగిపోవని, అంతకు రెట్టింపు ఉత్సాహంతో భారీగా కార్యకర్తలు హాజరయ్యారన్నారు. క్యూఆర్ కోడ్ను ప్రతి ఇంటికి చేర్చి చంద్రబాబు ఇచ్చిన హామీలు– చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతుల కోసం వచ్చిన జగనన్నను కలవడానికి వస్తే 40 మంది పై కేసులు పెట్టారన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగన్న హయాంలో ఆయన పేరు చెప్పి సంపాదించుకుని, అధికారంలో లేనప్పుడు ఒకరు పార్టీని వదిలి వెళ్తే.. జిల్లాను మరింత బలోపేతం చేసే మంచి నాయకుడుగా బూచేపల్లిని జగనన్న ఎంపిక చేశారన్నారు. చంద్రబాబు మోసాల గురించి చెప్పాలన్నా... రాజన్న, జగనన్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలన్నా ఒకరోజు సరిపోదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కేవీ రమణారెడ్డి, ఎంపీపీలు బొడిచర్ల ఉషామురళి, సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, చింతాశ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పోశం మధుసూదన్రెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్రెడ్డి, కౌన్సిలర్లు ఆవుల జ్యోతి, మేడం మోహన్రెడ్డి, తుళ్లూరి బాబురావు, జెడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. హామీల అమలులో కూటమి విఫలం క్యూఆర్ కోడ్ ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి మాట తప్పిన నాయకులు వస్తే నిలదీయండి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీలో వైఎస్సార్ సీపీ నేతలు కారుమూరి, బూచేపల్లి, శ్యామల, బత్తుల -
సౌండ్ పెంచితే సహించం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరిక ఒంగోలు టౌన్: మాడిఫైడ్ సైలెన్సర్లతో విపరీతమైన శబ్దాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తీవ్రంగా హెచ్చరించారు. గత 6 నెలల కాలంలో ఒంగోలు నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 550 మాడిఫైడ్ సైలెన్సర్లను శుక్రవారం మంగమూరు రోడ్డులోని రత్నదీప్ స్టోర్స్ సెంటర్లో రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. కార్యక్రమాన్ని ఎస్పీ దగ్గురుండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు ఆకతాయిలు ఉద్దేశ పూర్వకంగానే కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో అధిక శబ్దం చేసుకుంటూ తిరుగుతున్నట్లు తమ దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మాడిఫైడ్ సైలెన్సర్ల వలన అధిక శబ్దాలు వస్తాయని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. మోడిఫైడ్ సైలెన్సర్లను వాడడం మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, చట్టప్రకారం ఇది నేరమన్నారు. కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శ్రీనివాసరావు, శివప్రసాద్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రాచర్ల: మండలంలోని ఎడవల్లి క్రాస్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. మండలంలోని గుండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన నల్లబోతుల వెంకటయ్య (74) గుండ్రెడ్డిపల్లె నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్లగుంట్ల హత్య కేసులో నిందితులకు బేడీలు ● కేసు వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకర్రావు పెద్దదోర్నాల: మండల పరిధిలోని నల్లగుంట్లలో గత నెల 4వ తేదీన జరిగిన బైరబోయిన వెంకటేశ్వర్లు హత్య కేసులో నిందితులకు పోలీసులు బేడీలు వేశారు. వారిని శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. సీఐ ప్రభాకర్రావు, ఎస్సై మహేష్ కథనం ప్రకారం.. తన భర్త హత్యకు గురయ్యాడని బైరబోయిన వెంకటేశ్వర్లు భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు మొద్దు తిరుపతిరావు, భైరబోయిన బాల తిరుమలయ్య, మొద్దు వెంకటేశ్వర్లు, మొద్దు రాంకుమార్లతో పాటు మరో మైనర్ బాలుడిని గుర్తించి అరెస్టు చేశారు. హతుడు వెంకటేశ్వర్లు 2022వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన మొదటి నిందితుడు సోదరుడైన మొద్దు వెంకటేశ్వర్లును కొర్రప్రోలు వద్ద నరికి చంపాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న సదరు నిందితులు పథకం ప్రకారం గత నెల 4వ తేదీన నల్లగుంట్లలో పీర్ల పండగ జరుగుతున్న సమయంలో పీర్లకు మొక్కుతున్న భైరబోయిన వెంకటేశ్వర్లును కత్తులతో దాడి చేసి చంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మండల పరిధిలోని కొర్రప్రోలు వద్ద ఉన్నట్లు తెలుకుని అక్కడికి వెళ్లారు. నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టినట్లు సీఐ ప్రభాకరరావు తెలిపారు. కరుణించిన వరుణుడు! ఒంగోలు సబర్బన్: వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి.. పంటలు మొలకదశలోనే వాడు ముఖం పడుతుండటంతో దిగాలు చెందిన రైతులకు వానదేవుడు కాస్త ఊరటనిచ్చాడు. జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి మొదలుకొని శుక్రవారం తెల్లవారే వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా యర్రగొండపాలెంలో 122.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పామూరు మండలంలో 5.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. టంగుటూరు మండలంలో 88 మిల్లీమీటర్లు, కొత్తపట్నం 77.4, మద్దిపాడు 70.2, జరుగుమల్లి 68.4, తాళ్లూరు 59.8, దర్శి 54.6, సంతనూతలపాడు 52.6, తర్లుపాడు 49.8, పుల్లలచెరువు 49.4, బేస్తవారిపేట 46.4, రాచర్ల 46.2, దొనకొండ 43.6, పెద్దారవీడు 42.8, చీమకుర్తి 40, సింగరాయకొండ 39.4, మార్కాపురం 36.2, పొన్నలూరు 32.4, నాగులుప్పల పాడు 30.2, గిద్దలూరు 26.8, కొండపి 21.4, పెదచెర్లోపల్లి 21.2, అర్ధవీడు 20.2, పొదిలి 19.6, కంభం 19.4, దోర్నాల 18.6, మర్రిపూడి 18.6, కొమరోలు 17.2, కనిగిరి 16.6, కొనకనమిట్ల 15.6, కురిచేడు 15, ముండ్లమూరు 14.2, హనుమంతునిపాడు 11.2, ఒంగోలు రూరల్ 10.2, ఒంగోలు అర్బన్ 10.2, వెలిగండ్ల 8, సీఎస్పురం 7, త్రిపురాంతకం మండలంలో 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి కూలిన పొగాకు బ్యారన్ టంగుటూరు: భారీ వర్షానికి పొగాకు బ్యారన్ కూలింది. ఈ సంఘటన మండలంలోని జమ్ములపాలెంలో శుక్రువారం రాత్రి జరిగింది. బాధిత రైతు నరగర్ల కొండయ్య కథనం ప్రకారం.. భారీ గాలి, ఉరుములు, మెరుపులు, వర్షం ధాటికి ఒక్కసారిగా బ్యారన్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై బోర్డు అధికారులకు సమాచారం అందించానని స్పష్టం చేశాడు. -
బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
గుడ్లూరు: వైఎస్సార్ సీపీలో పనిచేసిన కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని బసిరెడ్డిపాలెం పంచాయతీ చెంచిరెడ్డి పాలేనికి చెందిన నరాల శ్రీనివాసులరెడ్డి పార్టీలో రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో పార్టీ శ్రేణులు బుర్రా దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే బుర్రా మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డికి శ్రీనివాసులరెడ్డి విషయం చెప్పారు. వెంటనే జగన్ బాధిత కుటుంబానికి రూ.1 లక్ష అందించాలని బుర్రాను ఆదేశించారు. మరో రూ.1 లక్షను కలిపి మొత్తం రూ.2 లక్షలను శ్రీనివాసుల రెడ్డి కుటుంబానికి బుర్రా అందించారు. దీంతో కుటుంబ సభ్యులు మాజీ సీఎం జగన్కు, బుర్రాకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలి
ఒంగోలు సబర్బన్: ఆర్డీఎస్ఎస్ పథకం పనులు వేగవంతం చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక సంతపేటలోని విద్యుత్ భవన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ముఖ్య పథకాలైన ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్ పురోగతిపై లోతుగా సమీక్షించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, పరివర్తకాల పనితీరు, విద్యుత్ శాఖపై ప్రజల అభిప్రాయం, విద్యుత్ కలెక్షను, బకాయిలపై సబ్ స్టేషన్ల వారీగా సమీక్షించారు. ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని, జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్క విద్యుత్ అధికారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందరికీ అందించాలని, దానికోసం ఫీడర్ పెట్రోలింగ్ చేసి లోపాలను సరి చేయాలని తద్వారా ప్రజలకు విద్యుత్ శాఖపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. ప్రజలకు స్మార్ట్ మీటర్లపై ఉన్న అపోహలను తొలగించాలని, ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్ ఆవశ్యకతను తెలియజేస్తూ మారుతున్న సమాజంలో స్మార్ట్ మీటర్తో కలిగే ఉపయోగాలు వివరించాలని సూచించారు. సమావేశంలో ఏపీ సీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. పీఎం సూర్య ఘర్ పురోగతి పెరగాలి విద్యుత్ బకాయీల విషయంలో నిర్లక్ష్యం వీడాలి విద్యుత్ శాఖ అధికారుల సమీక్షలో సీఎండీ పుల్లారెడ్డి -
రామరాజ్యం జగన్తోనే సాధ్యం
మర్రిపూడి: రామరాజ్యం కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మర్రిపూడి పడమటి బజారులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథిగా హాజరయ్యాఉ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని, అధికారులు సైతం పాలకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా సూపర్–6 పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అందిస్తామని చెప్పి చివరకు తల్లులను మోసం చేశారని ధ్వజమెత్తారు. అర్హులైన వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తానని ఏడాదిగా మహిళలను మభ్యపెడుతూ వస్తున్నారని, అన్నదాత సుఖీభవ పథకాన్ని గత ఏడాది ఎగ్గొట్టి రైతులును నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకుండా విద్యార్థులను అన్యాయం చేశారని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో గృహిణులకు మొండి చేయిచూపారని నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే బెదిరింపులకు పాల్పడుతూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పచ్చ నేతలు మద్యం బెల్డ్ దుకాణాలు, అక్రమ రేషన్ దందా, ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిస్తున్నారని, ఎమ్మెల్యేలు, మంత్రి సైతం కమీషన్ దండుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ ఆక్రమణలు, నిధుల దోపిడీని కట్టడి చేయకపోగా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టించడమంటే ఏడాది వ్యవధిలో రూ.1.70 లక్షల కోట్లు అప్పు చేయడమేనా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేంత వరకు వైఎస్సార్ సీపీ పోరాటాన్ని ఆపబోమన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలు కొనసాగాలంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఇనుకొల్లు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మాకినేని సుధారాణి వెంకట్రావు, నియోజకవర్గ రైతు విభాగం, ఎంప్లాయర్స్, పెన్షనర్ విభాగం అధ్యక్షులు బొల్లినేని నాగేశ్వరరావు, పెట్లూరి కృష్ణమూర్తి, సర్పంచ్ కదిరి భాస్కర్, వైస్ ఎంపీపీ ఎస్కే నాసర్, ఇనుకొల్లు మాదిరెడ్డి, ఇనుకొల్లు జగన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాలనూ చంద్రబాబు వంచించారు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అరాచకం సృష్టిస్తున్నారు ఏడాదిలోనే రూ.1.70 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం అధోగతిపాలు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం -
అర్ధాకలి.. అగచాట్లు!
గుండె తరుక్కుపోయేలా.. కళ్లు చెమర్చేలా గిరిజన చిన్నారుల పరిస్థితి ‘వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూడాలి. వారికి అక్షయపాత్ర ద్వారా నాణ్యమైన ఆహారం అందించాలి’ ఇవీ గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు.. ‘ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏఎన్ఎంలను నియమిస్తాం’ ఇదీ గత ఏడాది నవంబర్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన ప్రకటన.. ఇవేవీ వాస్తవ రూపం దాల్చలేదు సరికదా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల కష్టాలు రెట్టింపయ్యాయి. బుక్కెడు కూటికి, గుక్కెడు మంచినీటికి మొహం వాచిపోయిన గిరిజన చిన్నారుల పరిస్థితి చూస్తే ఎవరికై నా గుండె తరుక్కుపోవాల్సిందే. యర్రగొండపాలెం: జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఎక్కడ అంటు వ్యాధులు ప్రబలుతాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు కాక గిరిజన బాలలు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితి. జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో సుమారు రెండు వేల మంది చిన్నారులు చదువుకుంటున్నారు. పుల్లలచెరువు మండలంలోని మురికిమళ్ల, గారపెంట, యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల, అల్లిపాలెం, దద్దనాల(శాంతినగర్), అల్లిపాలెం(హనుమంతుని గూడెం), బిల్లగొందిపెంట, దోర్నాల మండలంలోని తుమ్మలబైలు, చింతల, మర్రిపాలెం, బీఎంసీ కాలనీ, చిలకచెర్ల, పెద్దమంతనాల, పెద్దారవీడు మండలంలోని చింతలముడిపి, అర్ధవీడు మండలంలోని భీమరాయునిచెరువు గూడెంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో అరకొర వసతులతోపాటు పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 1963లో ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పటికీ ఆశ్రమ పాఠశాలల నిర్వహణ కొనసాగుతుండటం గిరిజనులపై పాలకుల సవతి ప్రేమను తేటతెల్లం చేస్తోంది. నాటి జోవో ప్రకారం 30 మంది విద్యార్థులు ఉన్న ఆశ్రమ పాఠశాలలో నలుగురు వర్కర్లు సేవలు అందించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో 240 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కూడా ఇద్దరు లేదంటే ముగ్గురు వర్కర్లు మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. పుల్లలచెరువు మండలం మురికిమళ్ల ఆశ్రమ పాఠశాలలో అమలు కాని మెనూ అపరిశుభ్రంగా క్యాంపస్.. వర్కర్స్ లేక పనులన్నీ విద్యార్థులతోనే.. 162 మంది పిల్లలకు పాఠాలు చెబుతోంది 8 మంది టీచర్లే.. 13 మంది టీచర్ల కొరతతో బోధన సక్రమంగా లేదని తల్లిదండ్రుల ఆవేదన -
వంట పని.. పాచి పని విద్యార్థులతోనే..
పుల్లలచెరువు మండలంలోని మురికిమళ్లలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాఠశాలలో రక్షిత మంచినీరు లేక పోవడంతో ఓవర్ హెడ్ ట్యాంక్లో నిల్వ ఉన్న నీటిని తాగుతున్నారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు వివిధ ప్రాంతాలకు చెందిన 162 మంది గిరిజన బాలికలు ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 21 మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధించాల్సి ఉంది. కానీ ఇక్కడ 8 మంది ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలోనూ ఒకరిద్దరు నిత్యం సెలవులో ఉంటారని విద్యార్థులు చెబుతున్నారు. యర్రగొండపాలెం–మాచర్ల రహదారి సమీపంలో ఉన్న ఈ పాఠశాల పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక రాకపోకలకు సరైన మార్గం లేని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్వహణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మురికిమళ్ల ఆశ్రమ పాఠశాలలో రెండు రోజుల క్రితం వరకు కేవలం ఇద్దరు మాత్రమే వర్కర్లు ఉండేవారు. వీరు వంట, పారిశుధ్య పనులు నిర్వహించాల్సి ఉంది. వర్కర్లు తక్కువగా ఉండటంతో అన్ని పనులు బాలికలతోనే చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు విడతల వారీగా వంట పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. గత ఆదివారం తమ పిల్లలతోనే చపాతీలు చేయించారని, పారిశుధ్య పనులకు కూడా పిల్లలనే వాడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొనడం పాఠశాలలో పరిస్థితికి అద్దం పడుతోంది. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తాము శుభ్రంగా ఉంటామని, అలాంటి పరిస్థితి ఆశ్రమ పాఠశాలల్లో కనిపించడం లేదని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. -
జీతం పెంచే వరకు సమ్మె ఆపేది లేదు
ఒంగోలు సబర్బన్: తమకు జీతం పెంచేంత వరకు సమ్మె ఆపేది లేదని ఒంగోలు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు తెగేసి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తొలుత కార్మికులు కార్యాలయం ముందు రోడ్డులో మానవహారంగా ఏర్పడ్డారు. సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు, యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నేపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జీవో, సమ్మె కాలపు ఒప్పందాల జీవో ఇచ్చేంత వరకు నగరంలో సమ్మె కొనసాగుతుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడేళ్ల నుంచి జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజినీరింగ్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.21 వేల జీతం, స్కిల్ వర్కర్కు రూ.24 వేల జీతం ఇవ్వాలని గత సమ్మెలో ఒప్పందం చేసుకున్న సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించకుంటే పట్టణాలు, నగరాలు కంపుకొడతాయని, మున్సిపల్ యూనియన్ పోరాటానికి ఇతర ప్రజా సంఘాలు కూడగట్టుకొని ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రేడ్ యూనియన్స్ను కలుపుకొని ప్రభుత్వం మెడలు వంచి కార్మిక వర్గం సాధించుకున్న విజయాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. మున్సిపల్ పోరాటానికి మద్దతుగా పెన్సర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు పాల్గొని కార్మికులకు మద్దతు పలికారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సామ్రాజ్యం, యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు జి.నరసింహ, టి.విజయమ్మ, జాలయ్య, శంకర్, శివమ్మ, శ్రీదేవి, ఆర్.శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వర్లు, కె.మోహన్రావు, భారతి, వంశి, బి.బాబు, ఎం.బాబు, జేమ్స్, అనిత, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఇంజినీరింగ్, పారిశుధ్య కార్మికుల నిరసన -
ఇంత దుర్మార్గమా?.. కూటమి సర్కార్ కళ్లు తెరవాలి: కారుమూరి
సాక్షి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం లేకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఏడాది కాలంలో 250 మంది రైతులు బలవన్మరణానికి గురయితే.. ప్రభుత్వం మాత్రం కేవలం 104 మంది అని మాత్రమే చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఎన్నికల ముందు రైతులకు అన్నదాతకు వందనం పేరుతో రూ.20 వేలు అని చెప్పారు. ఏడాది గడిచి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టినా వారికి ఏ సాయం చేయలేదు. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు అమ్మబోతే అడవి.. ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది. దళారీ వ్యవస్థ పెరిగిపోవడం వల్ల... రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ప్రజలు కొనుక్కువాలనుకుంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతులు గురించి కనీస ఆలోచన చేయని ఈ ప్రభుత్వం.. రైతులు కోసం జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తారు. సాయం చేస్తున్నామంటూ హడావుడి చేస్తుంటారు. పొదిలిలో పొగాకు రైతుల పరిస్ధితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. పొగాకు బేళ్ల వేలంలో వ్యాపారులు గ్రూపుగా తయారవడంతో రైతులకు మంచి ధర లేకుండా పోయింది. అయినా ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు.రైతులను గాలికొదిలిన ప్రభుత్వం:వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మద్ధతు ధర అందేలా ప్రభుత్వమే రూ.100 కోట్లు నిధులు విడుదల చేసి... మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మెరుగైన ధర అందించారు. ఇవాళ మిర్చి, పత్తి, అపరాలు ఏ పంట చూసుకున్నా మద్ధతు ధర లేకుండా పోయింది. మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఇ-క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా కల్పించడంతో పాటు గిట్టుబాటు ధర వచ్చేట్టు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చాం. ఇవాళ ఉచిత ఇన్సూరెన్స్ చేయలేదు. రైతులను పూర్తిగా గాలికొదిలేశారు. ఒంగోలులో గతంలో అపరాలు పంట నష్టపోతే ఇ-క్రాప్ ద్వారా నష్టపోయిన రైతులకు లక్షల్లో పరిహారం అందింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ప్రగల్భాలు పలకడం తప్ప పనుల్లేవు. మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఆయన రైతులకు శాపంగా మారాడు.కనీసం రూ.7 లక్షలు చనిపోయిన రైతులకు వెంటనే అందించే కార్యక్రమం గతంలో చేస్తే... ఈ ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండడం లేదు. వీరి పనితీరు చూస్తుంటే ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టు తయారైంది. అన్ని రంగాలను తుంగలో తొక్కి.. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. కేసుల పేరుతో వేధించడంతో పాటు భయబ్రాంతులకు గురిచేస్తూ.. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు.నాలుగు దశాబ్దాలు అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పాలనకి, తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి పాలనకు ఉన్న తేడా చూడండి. కులాలు, పార్టీ, ప్రాంతం చూడకుండా పథకాలు ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే వాళ్లకు పాలుపోసినట్లు అనడం దారుణం. చంద్రబాబు ఇంట్లో డబ్బు ఇవ్వడం లేదు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా పాలన ఉండాలి.రైతులను ఆదుకోవాల్సిందే:రైతుసాగుని నిర్లక్యం చేస్తే మనుగడ ఉండదు. అలాంటి రైతులను ఆదుకోల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైతులు నాగలి వదిలేసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు భరోసాతో అందిస్తే.. రెండేళ్లు అయినా మీరు రైతులకు రూపాయి కూడా సాయం లేదు. చిన్నవయసులో తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తే... చంద్రబాబు మామిడి, పొగాకు, మిర్చి, ధాన్యం సహా ఏ రైతులనూ ఆదుకోలేదు. రైతులకు పెట్టుబడి సాయం ఎలాగూ లేదు కనీసం మద్ధతు ధర కూడా ఇవ్వడం లేదు.విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ జగన్ హయాంలో రైతులకు అండగా నిలబడి.. విత్తనం నుంచి నాణ్యమైన ఎరువులు వరకు రైతు ముంగిటకే అందించారు. రైతులు యూరియా కోసం ఎదురు చూస్తుంటే కనీసం స్పందడం లేదు. రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అదే ధోరణిలో రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేని పరిస్ధితికి ఈ ప్రభుత్వ పాలన దిగజారిపోయింది. సార్టెక్స్ బియ్యం అని ప్రకటించి అవి కూడా సక్రమంగా అమలుచేయడం లేదని ఆయన మండిపడ్డారు. -
జేబు గుల్ల!
తక్కువ ధరకు విక్రయించాల్సిన జనరిక్ మందులను ఎమ్మార్పీ రేట్లకే విక్రయిస్తూ ప్రజలను దోచేస్తున్నారు. 80 శాతం తక్కువకు అందించాల్సిన వీటిని ఎమ్మార్పీ రేట్లకు అమ్ముతూ జనం జేబులు గుల్ల చేస్తున్నారు. ఏది జనరిక్ మందో తెలియక మందుల దుకాణాల మాయాజాలంతో ప్రజలు మోసపోతున్నారు. గుర్తింపునిచ్చిన జనరిక్ దుకాణాల్లో రూ.30కి విక్రయించే మందును పెద్ద పెద్ద మెడికల్ షాపుల్లో రూ.150కి విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఔషధ దుకాణాల్లో అడ్డగోలు దోపిడీని అరికట్టాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● నిరుపేద, సామాన్య ప్రజల జేబులు గుల్ల చేస్తున్న వైనం ● జిల్లాలో 88 జనరిక్ మందుల దుకాణాలు ● ఒక్క ఒంగోలు నగరంలోనే ఏడాదికి రూ.100 కోట్ల వ్యాపారం ● 20 శాతం రాయితీ పేరుతో మెడికల్ షాపుల దోపిడీ ● ఆరోగ్య శ్రీ రోగులకు జనరిక్ మందులు కట్టబెడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు ● ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే తంతు ● ఔషధ నియంత్రణ శాఖనే నియంత్రిస్తున్న మెడికల్ వ్యాపారులు ● బదిలీపై వెళ్లిన డ్రగ్ ఇన్స్పెక్టర్కు భారీ నజరానా మందుబిళ్ల.. మెడికల్ షాపుల్లో జనరిక్ మాయాజాలం ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలులో జనరిక్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఔషధ నియంత్రణ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 88 జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయి. ఇందులో 34 హోల్సేల్ దుకాణాలుండగా 54 రిటైల్ దుకాణాలున్నాయి. ఒక్క ఒంగోలు నగరంలోనే 21 జనరిక్ హోల్సేల్ దుకాణాలున్నాయి. మార్కాపురంలో 13 జనరిక్ హోల్సేల్ దుకాణాలున్నాయి. నగరంలోని దిబ్బల రోడ్డులోని ఓ షాపులో ఏడాదికి 50 కోట్ల రూపాయలకుపైగానే బిజినెస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిరోజూ ఈ హోల్సేల్ షాపునకు కనీసం 5 నుంచి 10 లారీల సరుకు వస్తుందని, అంతే మొత్తంలో ఇక్కడి నుంచి సరుకు బయటకు వెళ్తోందని సమాచారం. ఒంగోలు నగరంలోనే ఏడాదికి రూ.100 కోట్ల జనరిక్ మెడిసిన్ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 20 శాతం రాయితీ ఒట్టిమాయ... జిల్లా కేంద్రమైన ఒంగోలులో 530 మెడికల్ షాపులు ఉన్నాయి. సుమారు 250కిపైగా హోల్సేల్ షాపులు ఉన్నాయి. కొన్ని మెడికల్ షాపులలో 20 శాతం రాయితీ ఇస్తుంటారు. సహజంగా మెడికల్ షాపుల్లో వినియోగదారులు ఎవ్వరూ బేరాలు చేయరు. అలాంటిది ఏకంగా 20 శాతం రాయితీతో మందులు విక్రయిస్తుండడంతో ప్రజలు ఆయా మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. వాస్తవానికి ఈ 20 శాతం రాయితీ పెద్ద మాయ అని కొందరు ఫార్మాసిస్టులు చెబుతున్నారు. 20 శాతం రాయితీ పేరుతో మందులు విక్రయిస్తున్న చైన్ మెడికల్ షాపులలో 75 శాతానికి పైగా జనరిక్ మందులను అమ్ముతున్నట్లు సమాచారం. నిజానికి జనరిక్ మందులను వాటిపై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే 80 శాతం తక్కువకు విక్రయించాల్సి ఉంటుంది. బయట మార్కెట్లో జనరిక్ మెడికల్ షాపులలో అలాగే తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు కూడా. కానీ, అందుకు భిన్నంగా కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనరిక్ మందులను బ్రాండెడ్ పేరుతో విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. -
ఆరోగ్య శ్రీ రోగులకు జనరిక్ మందులు...
నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నారు. ఎక్కువగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి జబ్బులకు వైద్య సేవలు అందిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో జనరిక్ మందులిచ్చి ఎమ్మార్పీకి బిల్లులు చేసుకుంటున్నట్లు సమాచారం. గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి గుండె కవాటాల్లో రక్తం గడ్డకట్టకుండా టికాగ్రేలార్ 90 ఎంజీ మందును డాక్టర్ రాశారు. దానిమీద ఎమ్మార్పీ రూ.359 రూపాయలు ఉంది. నిజానికి ఇది జనరిక్ ఔషధం. బహిరంగ మార్కెట్లో దీన్ని కేవలం 60 నుంచి 75 రూపాయలకు మాత్రమే విక్రయించాలి. కానీ, సదరు కార్పొరేట్ ఆస్పత్రిలో దీనికి ఎమ్మార్పీ బిల్లు ఇవ్వడం గమనార్హం. అలాగే కొలెస్టరాల్ను నియంత్రించే రోసువాస్టాటిన్ 40 ఎంజీ మందుపై ఎమ్మార్పీ రూ.584 ఉంది. దీనిని కూడా ఎమ్మార్పీకే ఇస్తున్నారు. నిజానికి ఈ మందు జనరిక్ మెడికల్ షాపులలో కేవలం రూ.80కే లభిస్తుంది. లివోసిట్రిజన్ ట్యాబెట్ల మీద ఎమ్మార్పీ రూ.99.55 ఉండగా, ఇది జనరిక్ మెడికల్ షాపులో కేవలం రూ.6కే లభిస్తుంది. ఇదే పెద్ద మెడికల్ షాపులలో ఎమ్మార్పీ మీద 20 శాతం ఇచ్చి రోగుల చెవిలో పూలు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్కు వాడే ర్యాబిప్రజోల్, పాంటా ప్రజోల్ ట్యాబ్లెట్ల మీద కూడా ఇదే తరహాలో బాదేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖ, ఆరోగ్యశ్రీ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కోక్క షీటు మీద పదింతలు అధిక రేటుకు విక్రయిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వెలిగొండను నిర్వీర్యం చేస్తున్న కూటమి
పెద్దదోర్నాల: రాష్ట్రంలోని కూటమి సర్కార్ వెలిగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. మేక్ ఆంధ్ర గ్రేట్ ఎగైన్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దదోర్నాల మండలంలో ఆమె పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత వాసుల కడగండ్లను గమనించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలు గట్టెక్కాలన్న ఉద్దేశంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారన్నారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా అతి పొడవైన సొరంగాల నిర్మాణాలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారన్నారు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4 లక్షల 47 వేల 300 ఎకరాలకు సాగు నీరు, ఆయా జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో లక్షలాది మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. ప్రాజెక్టులో భాగంగా సుంకేసుల నుంచి తీగలేరు కెనాల్కు నీరు తరలించడం ద్వారా యర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. పనులు కూడా నత్తనడకన జరుగుతుండటంతో పనులు చేసే సిబ్బందిని సైతం ఇక్కడి నుంచి పంపించే చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె కోరారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆమె ఆకాక్షించారు. సూపర్ స్పెషాలిటీ పూర్తయితే గిరిజనులకు మెరుగైన వైద్యం... చెంచు గిరిజనుల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చిన్న రోగాలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల కోసం నాటి జగన్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వారి కోసం మండల కేంద్రంలోని ఐనముక్కల వద్ద 50 కోట్ల రూపాయలతో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం వైద్యశాల పనులను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు గిరిజనుల కోసం యర్రగొండపాలెంలో రూ.26 కోట్లతో 100 పడకల వైద్యశాల, పెద్దదోర్నాలలో రూ.3 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు జరిగాయన్నారు. దీని వలన నల్లమల పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్యం అందబోతోందని ఆమె అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అటవీ హక్కుల చట్టం ఏర్పాటు చేసి గిరిజనులు సాగు చేసుకునే భూములపై వారికే హక్కు కల్పించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పెద్దదోర్నాల మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి, మండల నాయకులు లాలూనాయక్, యక్కంటి లింగారెడ్డి, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్, నియోజకవర్గ నాయకులు షేక్ షెక్షావలి, మాండ్ల వెంకటేశ్వర్లు, అల్లు రాంభూపాల్రెడ్డి, చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, షేక్ జబ్బార్, అల్లు రమణారెడ్డి, ఎంపీటీసీ నాగమల్లేశ్వరి, దొందేటి కృష్ణారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బాబు మోసాలు ఎండగడదాం
● వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: రాష్ట్ర ప్రజలకు కూటమి నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని వై.పాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన కూటమి నాయకులు ఒక బాండు చేతులో పెట్టి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని ప్రచారం చేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కూటమి పెద్దమనుషులు.. 15 నెలలు కావస్తున్నప్పటికీ ఆ పథకాలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి సామాన్యుడి నడ్డివిరిగే విధంగా పెంచారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, దీనివలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పేదలకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన లబ్ధి ఏ మాత్రం అందడం లేదని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ దాడులు, భూ కబ్జాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్లు చేయిస్తున్నారని ఆయన అన్నారు. 19న బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం... కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిలదీసి బాబు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలిపేందుకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 19న త్రిపురాంతకం రోడ్డులోని వైష్ణవి గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తాటిపర్తి తెలిపారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సీపీ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరవుతారని అన్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ విభాగాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గృహ సారధులు, సచివాలయాల కన్వీనర్లు, కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, షేక్ అబ్దుల్ మజీద్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, గంటా రమణారెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కె.ఓబులరెడ్డి, గుమ్మా ఎల్లేష్ యాదవ్, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, సూరె రమేష్, ఆర్.అరుణాబాయి, ఉడుముల అరుణ, పల్లె సరళ, పి.కృష్ణారెడ్డి, వల్లభనేని పవన్కుమార్, శేషశయనారెడ్డి, ఎ.ఆదినారాయణ, రంగబాబు, జానకి రఘు పాల్గొన్నారు. -
ప్రకాశం
37 /277గరిష్టం/కనిష్టంఇంజక్షన్ వికటించి ఇన్ఫెక్షన్ బీసీ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థికి తోటి విద్యార్థి వేసిన ఇంజక్షన్ వికటించింది. ఇన్ఫెక్షన్ రావ డంతో వైద్యశాలకు తరలించారు. ధరపై దిగాలు.. రైతుల గగ్గోలు పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు వేలం కేంద్రాల్లో బేళ్ల తిరస్కరణతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది. శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025– 8లో.. -
నకిలీ ధ్రువీకరణ పత్రాల కేసులో నలుగురు అరెస్టు
జరుగుమల్లి(సింగరాయకొండ): తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, నకిలీ రిబ్బరు స్టాంపులు తయారు చేసి ప్రభుత్వం స్థలం కాజేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. కేసులో నిందితులైన ఎన్ఎన్ కండ్రిక గ్రామానికి చెందిన చింతగుంట్ల అంకయ్య, పొన్నలూరు మండల కేంద్రానికి చెందిన గౌడపేరు రవికుమార్, వలేటివారిపాలెం మండలం కూనిపాలెం గ్రామానికి చెందిన యెండ్లూరి ఇమ్మానియేల్, శాఖవరం గ్రామానికి చెందిన తాటిపర్తి అశోక్లను అరెస్టు చేశామన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై వివరాలు వెల్లడించారు. ఎన్ఎన్ కండ్రిక గ్రామంలో 1997లో ప్రభుత్వం ఆ గ్రామానికి చెందిన మల్లయ్య, సుందరరామయ్యలకు చెందిన 1.92 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో 5 సెంట్ల చొప్పున ప్లాట్లు వేసి 24 మంది మాదిగలకు ఇళ్లు కట్టించి ఉచితంగా ఇచ్చారు. మిగిలిన స్థలాన్ని సామాజిక అవసరాలకు ఉంచారు. గ్రామానికి చెందిన ఎస్సీ కులస్తుడు చింతగుంట్ల రోశయ్యకు ఎటువంటి స్థలం ఇవ్వలేదు. అయితే రోశయ్య గ్రామ అవసరాలకు ఉంచిన స్థలాన్ని కాజేసే ప్రయత్నంలో తన అన్న కొడుకు అంకయ్యతో కలిసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించాలని నిర్ణయించి ఇందుకోసం పొన్నలూరు మండల కేంద్రానికి చెందిన రవికుమార్తో తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసేందుకు రూ.23 వేలు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. తరువాత రవికుమార్, ఇమ్మానియేల్, అశోక్ ముగ్గురు కలిసి సర్వేనంబరు 97 లోని 286 గజాల స్థలం 15 ఏళ్లుగా రోశయ్య అనుభవంలో ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తరువాత ఆ స్థలాన్ని రోశయ్య భార్య కోటమ్మ పేరుపై కందుకూరు రిజిష్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ స్థల విషయమై మాదిగ కులస్తులు ఒంగోలు మీకోసంలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహేంద్ర కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రిజిస్ట్రేషన్ కాగితాలు, రెండు రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
ఇంజక్షన్ వికటించి ఇన్ఫెక్షన్
కంభం: ఇంజక్షన్ వికటించి ఓ విద్యార్థికి ఇన్ఫెక్షన్ సోకిన ఘటన కంభం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వారం రోజుల క్రితం వేసిన ఇంజక్షన్ వికటించి అనారోగ్యానికి గురైన విద్యార్థిని గురువారం కంభం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని పూసలబజారులో నివాసం ఉంటున్న కె.సతీష్ కుమార్ బీసీ హాస్టల్లో ఉంటూ కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన సతీష్ కుమార్ ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయులకు చెప్పడంతో హాస్టల్కు పంపించేశారు. ఆ తర్వాత హాస్టల్లో చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. కుమారుడి కుడిచేతి మణికట్టు వద్ద రంధ్రం లాగా ఉండి నల్లగా మారడాన్ని గమనించిన తల్లి.. గురువారం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లింది. ఇంజక్షన్ వికటించి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పిన వైద్యులు.. ఏం జరిగిందని ఆరా తీశారు. శ్రీవారం రోజుల క్రితం తనకు నీరసంగా ఉందని తరగతి గదిలో పడుకోగా పదో తరగతి ఏ సెక్షన్ విద్యార్థి నితీష్ వచ్చి ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోతుందని తీసుకెళ్లాడు. చర్చి సమీపంలో ఉన్న క్లినిక్ వద్ద ఇంజక్షన్ వేశాడుశ్రీ అని సతీష్ వివరించాడు. విషయం తెలుసుకున్న కంభం ఎస్సై నరసింహారావు వైద్యశాలకు చేరుకుని బాలుడి వద్ద వివరాలు సేకరించారు. పాఠశాలకు వెళ్లి నితీష్ను విచారించగా తానే ఇంజక్షన్ వేసినట్లు ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు. చర్చి సమీపంలో ఉన్న తెలిసిన వారి క్లినిక్లో ఇంజక్షన్ తీసుకున్నట్లు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. నితీష్ ఖాళీ సమయంలో క్లినిక్ వద్దకు వెళ్లి కూర్చునేవాడని, నీరసంగా ఉందని చెప్పిన సతీష్కు డైక్లోఫెనాక్ ఇంజక్షన్ వేస్తే తగ్గిపోతుందని ఊహించుకుని అలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, క్లినిక్ నుంచి ఓ బాలుడు ఇంజక్షన్ తీసుకెళ్తున్నా సదరు వైద్యశాల సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నీరసంగా ఉందన్న విద్యార్థికి డైక్లోఫెనాక్ ఇంజక్షన్ వేసిన స్నేహితుడు వారం రోజుల క్రితం కంభంలో ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు -
మూడో రోజు ఒక కేంద్రంలోనే ఏపీపీఎస్సీ పరీక్ష
ఒంగోలు సబర్బన్: లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో పటిష్ట భద్రత మధ్య పరీక్షలు జరుగుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు తెలిపారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకూ ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జిల్లావ్యాప్తంగా ఆరు సెంటర్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం ఒంగోలు నగరం మామిడిపాలెంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కాలేజీలో మాత్రమే పరీక్షలు జరిగాయన్నారు. పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఆర్వో.. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఏపీపీఎస్సీ నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఉదయం పరీక్షకు 49 మందికిగానూ 29 మంది, మధ్యాహ్నం పరీక్షకు 77 మందికిగానూ 35 మంది హాజరయ్యారని డీఆర్ఓ వివరించారు. డీఈఈ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం ఒంగోలు సిటీ: డీఈఈ సెట్ కౌన్సెలింగ్ను ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, మైనంపాడులో ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం సూచించిన మేరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలకు రెండు టీంలు ఏర్పాటు చేశారు. ఆయా టీంల ద్వారా అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫై చేశారు. ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్తో వచ్చిన అభ్యర్థికి అన్ని సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుందని సుబ్బారావు తెలిపారు. జిల్లాలో డైట్తో పాటు దర్శి, కనిగిరి రెండు ప్రైవేట్ డైట్ కళాశాలలకు మైనంపాడు డైట్లోనే వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, తొలిరోజు నలుగురు అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. -
144 గోవా మద్యం బాటిళ్లు స్వాధీనం
సింగరాయకొండ: అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఎం శివకుమారి తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.2.13 లక్షల విలువైన 144 మద్యం బాటిళ్లు, రెండు మోటారుసైకిళ్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటన గురువారం మండలంలోని పాకల పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెం సమీపంలో బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..చినగంజాం మండలం కోడూరివారిపాలెం గ్రామానికి చెందిన ప్రళయకావేరి జయంతిబాబు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం శ్రీరాంనగర్కు చెందిన జాన నాగార్జున, ఊళ్లపాలెం గ్రామానికి చెందిన అరవ పవన్లను అదుపులోకి తీసుకున్నామని, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు వివరించారు. గోవా మద్యానికి, రాష్ట్రంలో అమ్మే మద్యానికి రూ.60 నుంచి రూ.120 వరకు వ్యత్యాసం ఉందని, దీంతో గోవా తయారీ మద్యం తీసుకుని వచ్చి అమ్ముతున్నారని, ఆ విధంగా అమ్మడం చట్టరీత్యా నేరమని తెలిపారు. -
నిరుద్యోగుల గొంతుకోసిన చంద్రబాబు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నమ్మించి గొంతుకోశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో గురువారం అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోజ్జాడ యుగంధర్ అధ్యక్షత వహించగా, ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సృష్టిస్తానని, లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మొత్తం 143 హామీలిచ్చిన చంద్రబాబు తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తానని, వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంటి దగ్గర కూర్చుని లక్షలు సంపాదించేలా చేస్తానని చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ ఈ ఏడాదికి రావాల్సిన 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఐటీ హబ్లు పెడతాను, ఇండస్ట్రియల్ కారిడార్లు పెడతానని ఒట్టి మాటలు చెప్పడం తప్ప ఆచరణలో ఒక్క జిల్లాలో కూడా ఎలాంటి పరిశ్రమలు పెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులతో పాటు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ యువత దగ్గరకు ఏఐవైఎఫ్ వెళ్తోందని చెప్పారు. యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి లేని వారి సంఖ్య 2.50 కోట్లకుపైగానే ఉన్నట్లు స్కిల్ సర్వేలో తేలిందని తెలిపారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిలో కోటిన్నర మంది ఎలాంటి ఉపాధి లేని వారు ఉన్నారని చెప్పారు. కూటమి పాలనలో యువతకు దక్కిందేమీ లేదన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖలలో సుమారు 3.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్పప్పటీకీ వాటిని భర్తీ చేసే పరిస్థితి కానరావడం లేదన్నారు. నిరుద్యోగ యువత పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆఫీస్ బేరర్లు పోతుల ప్రభాకర్, వై.బాబి, కత్తి రవి, షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో అభివృద్ధి తిరోగమనం
మార్కాపురం/పొదిలి రూరల్: ప్రజల దాహార్తిని తీర్చేందుకు, విద్యాభివృద్ధికి, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే తుంగలోకి తొక్కిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. గురువారం ఆమె మార్కాపురం మండలం గొట్టిపడియ వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటెక్ వెల్, రాయవరం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో అభివృద్ధి పనులను గాలికొదిలేసిన తీరును ఎండగట్టారు. పశ్చిమ ప్రకాశం వాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.75 కోట్లతో ఇన్టెక్ వెల్ నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా జల్ జీవన్ మిషన్ కింద రూ.1270 కోట్లు ఖర్చు చేసే పథకానికి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఎన్నికల్ కోడ్ అమలయ్యే నాటికి ఇంటెక్ పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఈనెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మార్కాపురంలో జల్జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేస్తూ తామే నిధులు తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పడాన్ని తప్పుబట్టారు. వెలిగొండ ప్రాజెక్టును 2004లో జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించగా, ఆయన తనయుడు వైఎస్ జగన్ టన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్వహించాలి మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 70 శాతానికిపైగా పూర్తి కాగా కూటమి అధికారం చేపట్టగానే నిలిపేయడంపై శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్య, నాణ్యమైన వైద్యం అందరికీ అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్కు అప్పగించాలని కూటమి ప్రభుత్వం భావించడం దారుణమన్నారు. మెడికల్ కాలేజీ పనులను వేగంగా పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ బాటలోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్ నడుస్తున్నారని, వారు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. అనంతరం ఆమె పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబును కలిసి మాట్లాడారు. చెరువా.. డంపింగ్ యార్డా? పొదిలి పెద్ద చెరువు పైప్లైన్ పనులను శ్యామల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2023 ఏప్రిల్ 12వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పెద్ద చెరువు పైపులైన్ పనులను ప్రారంభించారన్నారు. రూ.50.13 కోట్ల వ్యయంతో దర్శి ఎన్ఎస్పీ కాలువ నుంచి పెద్దచెరువుకు సాగర్ నీరు సరఫరా చేసేందుకు భూగర్బ పైపు లైన్ పనులను కూటమి ఏడాదిపాటు నిలిపేయడంతో డంపింగ్ యార్డులా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నంచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలను తొలగించినంత మాత్రానా చేసిన మంచిని ప్రజల మది నుంచి చెరిపేయలేరని కూటమి నాయకులకు చురకలంటించారు. అబద్ధాలు చెప్పడం మానుకుని ప్రజలకు అవసరమైన మంచి పనులు చేయాలని హితవు పలికారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జిశ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మస్తాన్వలి, గుంటూరి పిచ్చారెడ్డి, సింగారెడ్డి వెంకటేశ్వర్లు, అనుబంధ సంఘాల నాయకులు మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు నిలిపేయడం దుర్మార్గం జల్జీవన్ మిషన్ పనుల మంజూరుపై పవన్కల్యాణ్ డబ్బా పొదిలి చెరువును డంపింగ్ యార్డుగా మార్చిన ఘటన కూటమి సర్కారుదే.. ప్రజల హృదయాల్లో వైఎస్సార్ కుటుంబానికి సుస్థిర స్థానం వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
ఒంగోలు సిటీ : ఒంగోలు మండలంలోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల దుకాణాలను గురువారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. మంగళగిరి ఏడీఏటీ శ్రీనివాసరావు, నెల్లూరు విజిలెన్స్ సీఐ ఎస్కే సుభాని తనిఖీలు చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకపోవడంతో బాలాజీ ఏజెన్సీలో రూ. 54 లక్షల విలువైన పురుగుమందులు, శాంతి సీడ్స్లో రూ.2.80 లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేశారు. తనిఖీల్లో ఒంగోలు మండల వ్యవసాయాధికారి కె.రమేష్బాబు, టెక్నికల్ ఏఓ పి.వేణుగోపాల్రావు పాల్గొన్నారు. లారీ బోల్తా.. ● ముగ్గురికి గాయాలు కొమరోలు: ఎదురుగా వస్తున్న మహిళను తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ సంఘటన మండలంలోని నల్లగుంట్ల గ్రామ సమీపంలోని క్రాస్రోడ్డు వద్ద బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రామారావు, రమేష్, సల్మాన్రాజు ఎద్దుల జతను లారీలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు తీసుకువెళుతుండగా నల్లగుంట్ల గ్రామానికి చెందిన మహిళ అడ్డురావడంతో లారీ అదుపుతప్పి రహదారి పక్కన బోల్తా పడింది. ప్రమాదంలో రమేష్కు తీవ్ర గాయాలు కాగా సల్మాన్రాజు, రామారావుకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. జీతం ఇవ్వలేదని పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నం చీమకుర్తి రూరల్: జీతం ఇవ్వడం లేదని పెట్రోల్ పోసుకోని నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మండలంలోని హంస క్వారీలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..క్వారీలో బస్సు డ్రైవర్గా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పని చేస్తున్నాడు. క్వారీ యాజమన్యం కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కార్మికులంతా మేనేజ్మెంట్తో మాట్లాడుతున్న సమయంలో సుబ్రహ్మణ్యం పెట్రోల్ పెసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించగా..అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఆస్తి వివాదంలో పిన్ని, పినతండ్రిపై దాడి గిద్దలూరు రూరల్: ఆస్తి విషయంలో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి పిన్ని, పినతండ్రిని అంతమొందించేందుకు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలోని పొదలకుంటపల్లె గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శనివారపు రమణారెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రమణారెడ్డి అన్న కుమారుడు నిరంజన్రెడ్డి ఇనుప రాడ్తో వారి తలపై బలంగా మోదాడు. తలకు తీవ్రగాయలపాలైన వారి కేకలకు స్థానికులు నిద్రలేచే సరికి నిరంజన్రెడ్డి అక్కడ నుంచి పారిపోయాడు. గాయపడిన దంపతులను స్థానికులు 108 అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. బాధితుల కుమారుడు సాయికుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.సురేష్ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు. -
ధరపై దిగాలు.. రైతుల గగ్గోలు
పొగాకుకు గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడి చేతికిరాక నష్టాలపాలు కంభం: పొగాకు రైతులను కష్టాలు, నష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలో పొగాకు అధికంగా పండించే గ్రామాల్లో ఒకటిగా ఉన్న కంభం మండలం జంగంగుంట్లలో రైతులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గ్రామంలో రైతులు 50 ఏళ్లకు పైగా వంశపారపర్యంగా పొగాకు సాగు చేస్తున్నారు. ఇక్కడ నీటి సౌకర్యం తక్కువ ఉండటం, బోర్లు వేసినా నీరు పడక పోవడంతో వాణిజ్య పంట పొగాకు వైపు మొగ్గుచూపారు. సుమారు 400 మంది రైతులు వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పొగాకు సాగు చేస్తున్నారు. గ్రామంలో సుమారు 100 వరకు బ్యారన్లు ఉన్నాయి. జంగంగుంట్లతో పాటు పరిసర గ్రామాల్లోనూ సుమారు 1500 ఎకరాల వరకు పొగాకు సాగు చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారడం, గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల సిండికేట్తో నష్టం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి కొన్ని బేళ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, తిరస్కరించిన బేళ్లను ఇళ్లలో నిల్వ ఉంచుకోవాలంటే ఇబ్బందిగా ఉందని రైతులు వాపొతున్నారు. ఎండకు, వానకు పొగాకు నాణ్యత తగ్గిపోతుండటంతో మళ్లీ గ్రేడింగ్ చేసుకోవడం అదనపు భారంగా మారుతోందని చెబుతున్నారు. గతంలో నోబిడ్ అయిన, తిరస్కరించిన బేళ్లను అక్కడే గోడౌన్లో పెట్టుకునేవారు. ప్రస్తుతం పొగాకు ఎక్కువగా ఉందని అధికారులు నిరాకరిస్తుండటంతో తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు నానాతిప్పలు పడుతున్నారు. వైఎస్సార్, జగన్ హయాంలోనే లబ్ధి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్టీసీ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయించడమే కాకుండా ఎఫ్–8, ఎఫ్–9 రకం రైతులకు క్వింటాకు రూ.2 వేల చొప్పున డబ్బు ఇచ్చి నాడు ప్రభుత్వం ద్వారా ఆదుకున్నారన్నారని జంగంగుంట్ల రైతులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంతో లాభపడ్డామని, గడిచిన నాలుగేళ్లలో ఎఫ్–1 నుంచి ఎఫ్–4 రకం వరకు క్వింటా రూ.36 వేల వరకు ధర పలకగా, మిగిలిన రకాలకు రూ.30 వేల వరకు ధర లభించిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 రకాలు రూ.28 వేలు ఉండగా ఎఫ్4 రూ.18 వేలు పలుకుతోందని, లోగ్రేడ్ రకం, పచ్చాకును అసలు కొనడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని రకాల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి గత ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకు ఏనాడూ నష్టాలు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పొగాకు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. గిట్టుబాటు ధరలు కల్పించి, అన్ని రకాల గ్రేడ్ల పొగాకును కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుని, పొగాకు రైతులను ఆదుకోవాలి. – గొంగటి చెన్నారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, కంభం -
కూతురి గొంతు నులిమి చంపేసిన తల్లిదండ్రులు
ఒంగోలు టౌన్: క్షణికావేశానికి గురైన తల్లిదండ్రులు కుమార్తె గొంతు నులిమి చంపేయడం సంచలనం సృష్టించింది. ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముంగమూరు రోడ్డులోని విలేకరుల కాలనీ 1వ లైనులో నివశించే పల్నాటి రమేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కుమార్తె తనూష (23) డిగ్రీ చదివి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసింది. కొద్దిరోజులుగా ఒంగోలులోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఒంగోలుకు చెందిన పెళ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని తనూష ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తనూషకు, తల్లిదండ్రులు రమేష్, లక్ష్మికి మధ్య మంగళవారం రాత్రి వివాదం జరిగింది. క్షణికావేశానికి గురైన రమేష్, లక్ష్మి తనూష గొంతును బలంగా నులిమారు. ఊపిరాడని తనూష ప్రాణం వదిలింది. కాసేపటికి తేరుకున్న రమేష్, లక్ష్మి భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ తెలియకుండా కుమార్తె మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీశారు.రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుందని, కరెంటు లేకపోవడంతో సకాలంలో తాము గమనించలేదంటూ సీన్ క్రియేట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు తనూష మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. తల్లిదండ్రుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన తీరులో విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. సీఐ విజయకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు రెజాంగ్ లా రాజ్ కలశ రథయాత్ర
ఒంగోలు సబర్బన్: భారత సైన్యంలో అహిర్ రెజిమెంట్ (యాదవ రెజిమెంట్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న రెజాంగ్ లా రాజ్ కలశ రథయాత్ర గురువారం ఉదయం 8 గంటలకు పెళ్లూరులోని గంగమ్మ గుడి (నేషనల్ హైవే) నుంచి ప్రారంభమవుతుందని అఖిల భారత యాదవ మహా సభ నాయకులు తెలిపారు. ఈ మేరకు యాదవ మహాసభ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు బొట్ల రామారావు యాదవ్, బొల్ల సుబ్బారావు యాదవ్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పవిత్ర యాదవ వీరుల జ్ఞాపకార్థం లక్ష కిలో మీటర్ల మేర సాగే యాత్రను యాదవ పెద్దలు, నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రెజాంగ్ లా రాజ్ కలశ్ యాత్ర ఏప్రిల్ 13 వ తేదీన బీహార్ లోని పాట్నా నుంచి మొదలైందన్నారు. నేడు రోల్బాల్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక ఒంగోలు: రోల్బాల్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక స్థానిక మంగమూరు రోడ్డులోని ప్రగతి ఎన్క్లేవ్ వద్ద గురువారం ఉదయం నిర్వహిస్తున్నట్లు రోల్బాల్ అసోసియేషన్ జిల్లా ఇన్చార్జి గుర్రం అనీల్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 11, 14, 17, 17 ప్లస్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా ఎంపిక ఉంటుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారితో జిల్లా జట్టును ఎంపిక చేసి వారిని ఈనెల 19, 20 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు పంపుతారన్నారు. ఆసక్తిగలవారు ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, రోల్ బాల్ ఆఫ్ ఇండియా వారిచే ధ్రువీకరించిన గుర్తింపు పత్రం తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఇన్చార్జి గుర్రం అనీల్కుమార్, సెల్:9100553717ను సంప్రదించాలన్నారు. సెల్ ఫోన్ మరమ్మతులపై ఉచిత శిక్షణ ఒంగోలు వన్టౌన్: ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెల్ఫోన్ మరమ్మతుపై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ డైరక్టర్ పి శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30 రోజుల పాటూ సెల్ఫోన్ మరమ్మతు, సర్వీసింగ్పై ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలని, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో పూర్తి వసతి, భోజనం ఉచితంగా అందిస్తారని చెప్పారు. ఇతర పూర్తి వివరాలకు 8309915577 అనే నెంబరుపై సంప్రదించాలన్నారు. బీఎడ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం పరిధిలోని 110 బీఎడ్ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు ఏకేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు గాను మొత్తం 11,331 మంది విద్యార్థులు నమోదు కాగా, వారిలో 10,481 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 10,394 మంది విద్యార్థులు పాసైనట్లు హరిబాబు విలేకర్లకు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డి.వి.ఆర్.మూర్తి, బి.హరిబాబుతో పాటు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.నిర్మలామణి, సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర, పూర్వపు సీఈ, ప్రస్తుత సీడీసీ డీన్ డాక్టర్ కే.వి.ఎన్.రాజు తదితరులు అభినందించారు. కార్యక్రమంలో పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్ విభాగం) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. 345 బేళ్లు తిరస్కరణ కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో 345 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి జి. సునీల్కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని పెట్లూరు ఎన్.ఎన్. కండ్రిక, జగ్గరాజుపాలెం, వర్ధినేనివారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు 1070 బేళ్లను వేలానికి తీసుకురాగా 725 బేళ్లనుకొనుగోలు చేశారు. గరిష్ట ధర రూ.281, కనిష్ట ధర రూ.160, సరాసరి ధర రూ.225.90గా నమోదైంది. వేలంలో 23 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వం సరళమైన విధానం
ఒంగోలు: మధ్యవర్తిత్వం సరళమైన, వేగవంతమైన విధానం అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం నుంచి శ్రీపొట్టి శ్రీరాములు బొమ్మ వరకు బుధవారం నిర్వహించిన మీడియేషన్ ఫర్ నేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియేషన్లో పరిష్కారమైన కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో చెల్లించిన కోర్టు ఫీజును కూడా తిరిగి పొందవచ్చన్నారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి న్యాయవాదులు సంపూర్ణంగా సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో మధ్యవర్తిత్వం మీద శిక్షణ పొందిన న్యాయవాదులు అయినాబత్తిన సుబ్బారావు, సిరిగిరి సరళ, దేవకుమారి, అదనపు ప్రభుత్వ న్యాయవాది బోడపాటి వెంకట శివరామకృష్ణ ప్రసాద్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గొల్లకారం రవిశంకర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.వీరరాఘవులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ చీమకుర్తి: చీమకుర్తిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో పదో తరగతి, సీనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మావతి బుధవారం ఒక ప్రకనటలో తెలిపారు. గతేడాది 9వ తరగతి పూర్తి చేసి 60 శాతం మార్కులు సాధించిన వారు, గతేడాది జూనియర్ ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన వారు గురువారం సాయంత్రం 5 గంటల్లోపు తమ సర్టిఫికెట్లు తీసుకురావాలని తెలిపారు. -
టోల్ బాదుడు..!
పెద్దదోర్నాల: శ్రీశైలం వెళ్లే రహదారిలో గణపతి చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్తో వాహనదారులు రెండో సారి టోల్ రుసుం చెల్లిస్తూ వారికి తెలియకుండానే నష్టపోతున్నారు. వివరాల్లోకి వెళితే..నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించే వాహనాలు విధిగా పర్యావరణ పరిరక్షణ రుసుంను చెల్లించేలా పెద్దదోర్నాల మండల కేంద్రం సమీపంలోని గణపతి వద్ద ఓ చెక్ పోస్టు, కర్నూల్ రోడ్డులోని కొర్రప్రోలు వద్ద మరో చెక్ పోస్టును అటవీశాఖ అధికారులు గతంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా శిఖరం, చెక్ పోస్టు వద్ద, బైర్లూటి చెక్ పోస్టుల వద్ద ఒక్కసారి రుసుం చెల్లిస్తే మరే చెక్పోస్టు వద్ద రుసుంను చెల్లించకుండా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించవచ్చు. ఈ ప్రక్రియను కొంత కాలం వరకు మాన్యువల్గా నిర్వహించేవారు. దీంతో నంద్యాల జిల్లా బైర్లూటి చెక్ పోస్టు వద్ద టోల్ రుసుమును చెల్లించిన వాహన దారులు అక్కడ చెల్లించిన రశీదులను చూపించి గణపతి చెక్ పోస్టును దాటేవారు. అయితే కాలక్రమేణా గణపతి చెక్ పోస్టు వద్ద టోల్ గేట్ను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు ఫాస్టాగ్ యంత్రాన్ని సమకూర్చారు. దీంతో గతంలో కార్లు, చిన్నపాటి వాహనాలకు రూ.50, లారీలు, పెద్ద వాహనాలకు రూ.100 వసూలు చేసే అధికారులు టోల్ గేట్ పెట్టిన నాటి నుంచి రేట్లను పెంచి కార్లకు రూ.70, లారీలకు రూ.130 టోల్ ఫీజుగా నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అవగాహన లేక నష్టపోతున్న వాహనదారులు గణపతి చెక్ పోస్టు వద్ద ఉన్న రహదారిని రెండు భాగాలుగా విభజించిన అధికారులు ఒక రహదారి శ్రీశైలం వెళ్లేదిగా, రెండో రహదారిని శ్రీశైలం నుంచి వచ్చేదిగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లే రహదారిలో ఆటోమేటిగా టోల్ రుసుం వసూలు చేసేలా యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అవగాహన లేని కొందరు వాహనదారులు బైర్లూటి చెక్ పోస్టు వద్ద టోల్ చార్జీని చెల్లించినా, తిరిగి గణపతి చెక్ పోస్టు వద్ద వారికి తెలియకుండానే రహదారిలో ప్రయాణించి టోల్ రుసుంను చెల్లిస్తున్నారు. చెక్ పోస్టు గేట్ను దాటిని తరువాత తమ తప్పును తెలుసుకున్నా, చేసేది లేక గమ్మున్న ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటక, కర్నూల్, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన పలువురు వాహనదారులు తమకు తెలియకుండానే టోల్ రుసుంను రెండోసారి చెల్లించి నష్టపోతున్నారు. అటవీశాఖ అధికారులు ఈ విషయంపై వాహనదారులకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకొని, బైర్లూటి వద్ద టోల్ రుసుం చెల్లించిన వాహనాలను మరో మార్గంలో పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. శ్రీశైలం వెళ్లే వాహనాలకు డబుల్ టోల్ వసూలు గణపతి వద్ద చెక్పోస్టు వద్ద టోల్గేట్ ఏర్పాటు చేసిన అధికారులు బైర్లూటి వద్ద చెల్లించినా, అవగాహన లేక రెండోసారి టోల్ చెల్లింపు తెలియక నష్టపోతున్న కర్నాటక, రాయలసీమ జిల్లాల వాహనదారులు -
పురుగుమందుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
పెద్దారవీడు: గుంటూరు వ్యవసాయ కమిషనర్ అనుమతించిన ప్రిన్సిపుల్ సర్టిఫికెట్స్ లేని వివిధ రకాల పురుగుమందుల అమ్మకాలను నిలిపివేస్తూ అదేశాలు జారీ చేసినట్లు సెంట్రల్ స్క్వాడ్ అధికారి టి.శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో హనుమాన్ జంక్షన్ కుంటలో పురుగుమందులు, విత్తనాల దుకాణాలను నెల్లూరు విజిలెన్స్ సీఐ షేక్ సుహాని, జిల్లా సాంకేతిక వ్యవసాయాధికారి వేణుగోపాల్ బృందం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. రాష్ట్ర కమిషనర్ కార్యాలయం సూచించిన అనుమతి పత్రాలు చూపించని కారణంగా రూ.58.28 లక్షల విలువైన 12,427 కేజీల పురుగుమందుల అమ్మకాలను తాత్కాలింగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ రిజిస్టర్లోని వివరాలకు గోడౌన్లో ఉన్న స్టాక్కు, ఎరువుల ఇన్వాయిస్లు, రైతులకు ఇచ్చిన బిల్లులను పరిశీలించారు. సెంట్రల్ స్క్వాడ్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికృత డీలర్ల నుంచి మాత్రమే ఎరువులు, విత్తనాలు కోనుగోలు చేయాలని రైతులకు సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు చట్టాలకు లోబడి మాత్రమే వ్యాపారం చేసుకోవాలని, అతిక్రమిస్తే లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు అమ్మరాదని చెప్పారు. ఆయన వెంట మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు బాలజీనాయక్, మండల వ్యవసాయాధికారి ఎన్.లక్ష్మీనారాయణ, ఏఈఓ సునీల్నాయక్, ఉన్నారు. -
ప్రకాశం
39 /297గరిష్టం/కనిష్టంటోల్ బాదుడు శ్రీశైలం వెళ్లే వాహనదారులు డబుల్ టోల్ ఫీజు చెల్లించి నష్టపోతున్నారు. బైర్లూటి వద్ద టోల్ చెల్లించినా అవగాహన లేక గణపతి చెక్పోస్టు వద్ద మళ్లీ చెల్లిస్తున్నారు. ఇల్లు ఇవ్వరు.. బిల్లు చెల్లించరు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా పేదలకు ఒక్క ఇల్లు మంజూరు చేయకపోగా గతంలో కట్టుకున్న ఇళ్లకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా చిరుజల్లులు పడవచ్చు. ఉక్కపోతగా ఉంటుంది. – 8లో.. గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025 -
బిల్లు చెల్లించరు..!
ఇల్లు ఇవ్వరు.. మొండిగోడలకు మోక్షమెప్పుడో..! మార్కాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా పేదలకు ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు. పాత గృహాలకు కూడా బిల్లులు మంజూరు కావడం లేదు. దీనితో పేదల పక్కా గృహాల నిర్మాణాలు నత్తనడకతో పోటీపడుతున్నాయి. అధికారంలోకి వస్తే 2014 నుంచి 2019 వరకు కట్టిన గృహాలకు కూడా బిల్లులు తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. దీంతో లబ్ధిదారులంతా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 8837 గృహాలను శ్రావణమాసం నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4791 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, సిమెంట్, ఇటుక, ఇసుక, ఇనుము ధరలు పెరగడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖాధికారులపై ఒత్తిడి తెస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో దర్శి, యర్రగొండపాలెం, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు మందగించాయి. శ్రావణ మాసానికి గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ అధికారులపై కత్తి పెట్టింది. దీంతో ప్రతిరోజూ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇల్లు కట్టుకోమని పోరుపెడుతుంటే డబ్బులెవరిస్తారంటూ లబ్ధిదారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రకటనతో 2014 నుంచి 2019 మధ్య ఇల్లు కట్టుకున్నవారు కూడా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. 2019–2024 మధ్య కాలంలో ఇళ్ల లబ్ధిదారులకు స్వర్ణయుగమే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి పట్టాలు ఇచ్చి గృహాలు మంజూరు చేశారు. అర్హులైన పేదలు సొంతిల్లు కావాలంటే ఎప్పుడైనా ఇంటికి దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే..సిబ్బంది పరిశీలించి వెంటనే మంజూరు చేసేవారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల నగదుతో పాటు ఇంకా అవసరమైతే బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు సైతం చేసుకున్నారు. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తరువాత గ్రామాలు, కాలనీలే ఏర్పడ్డాయి. కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉంటున్న లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇడుపూరు లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ లేక అవస్థలు పడుతున్నారు. వాటిని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బిల్లుల కోసం ఇళ్ల లబ్ధిదారుల ఎదురుచూపులు లక్ష్యానికి 50 శాతం మాత్రమే పూర్తి పూర్తి కావాల్సిన గృహాలు 8837 వివిధ దశల్లో పూర్తయినవి 4791 గృహాలు చెప్పారంటే..చేయరంతే.. గతమెంతో ఘనం.. కనీస సౌకర్యాలు నిల్... పేదల గృహాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ఎన్నికలకు ముందు అది చేస్తాం.ఇది చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలిచ్చిన కూటమి నేతలు..అధికారంలోకి వచ్చి ఏడాదైనా పేదలకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదు. ఒక్క రూపాయి బిల్లు కూడా మంజూరు చేయలేదు. ఓ పక్క పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు, మరో పక్క కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం.. వెరసి ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పేదల ఇళ్లపై కక్ష కట్టి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పేదల గృహాలపై కక్ష కట్టింది. బిల్లులు మంజూరు చేయగా..కట్టుకుంటావా.. లేదా.. అంటూ గృహ నిర్మాణ శాఖ అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తోంది. వివిధ కారణాలతో పలువురు పేదలు గృహాలను ఇంకా ప్రారంభించలేదు. దీంతో వైఎస్సార్ జగనన్న కాలనీలను రద్దు చేసే కుట్రకు ప్రభుత్వం తెరలేపింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురు పేదలకు ఈ నిర్ణయం పిడుగులాగా మారింది. ఏడాది కాలంలో ఒక్క ఇల్లూ మంజూరు చేయకపోగా ఉన్న వాటిని రద్దు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల నిర్మాణంలో కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మార్కాపురం పట్టణంలోని ఇడుపూరు లేఅవుట్ –1, 2 లో 2,330 గృహాలు మంజూరు కాగా 920 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక 2014–19 మధ్య కట్టుకున్న 1546 గృహాలకు రూ.4 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా మంజూరుకాలేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం: బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కాలనీల్లో కనీస సౌకర్యాలైన రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అందిస్తాం. పవన్కుమార్, హౌసింగ్ డీఈ, మార్కాపురం -
కూలీలు రాకుండానే హాజరు
సింగరాయకొండ: ‘కూలీలు రాకుండానే హాజరు వేశారు. చేసిన పనుల్లో కొలతలు తేడా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో పనులు కానిచ్చేశారు’అని సామాజిక తనిఖీ బృందం సభ్యులు ప్రజావేదికలో నివేదిక చదివి వినిపించారు. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.11.32 కోట్ల పనులపై సామాజిక తనిఖీ బృందం చేపట్టిన విచారణ వివరాలను బుధవారం ప్రజావేదికలో వివరించారు. ఈ సందర్భంగా పీడీ జోసెఫ్ గతంలో ఈసీగా పనిచేసిన భార్గవి, కొన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రూ.2.53 లక్షలు కొలతల్లో తేడా వచ్చిందని, ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి రూ.44,500, రూ.3,,600 జరిమానా కింద అధికారులు, సిబ్బంది నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. రూ.1.64 లక్షల పనులకు సంబంధించి ఏపీడీ సుబ్బారావును విచారించాలన్నారు. కూలీలకు చేసిన పనులకు సంబంధించి రావాల్సిన రూ.88,246 వారి ఖాతాలకు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ ప్రతి కూలీకి దినసరి వేతనం రూ.306లుగా ప్రభుత్వం నిర్ణయించిందని, సరాసరిన రూ.250 వస్తుందని తెలిపారు. దీనిపై పలువురు వారానికి రూ.100 ఇచ్చిన కూలీలకు రూ.1200 జమవుతున్నాయని, నగదు ఇవ్వని వారికి కేవలం రూ.600 మాత్రమే జమవుతున్నాయని, అలాంటప్పుడు సరాసరి రూ.250 ఎలా పడుతుందని ప్రశ్నించారు. తక్కువ మంది కూలీలు వస్తే ఎక్కువ మంది వచ్చినట్లు హాజరు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పగా, యర్రగొండపాలెం, చుట్టుపక్కల మండలాల్లో ఈ సంస్కృతి ఉందని ఇక్కడ కూడా ఉందా అని పీడీ మండల అధికారులను ప్రశ్నించడంతో వారంతా విస్తుపోయారు. కార్యక్రమంలో ఎంపీడీఓ డి.జయమణి, ఏపీఓలు సుభాషిణి, సుధాకర్, ఎస్ఆర్పీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. రూ.11.32 కోట్ల ఉపాధి పనులపై ప్రజావేదిక అధికారులు, సిబ్బందికి జరిమానా రూ.2.53 లక్షల రికవరీ చేయాలని ఆదేశం -
బస్తా మే సవాల్..!
రేషన్ మాఫియా..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జిల్లాలో కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని కార్డుదారులకు అరకొరగా పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 1392 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 6,37,820 తెల్లకార్డులు ఉండగా, అంత్యోదయ అన్న యోజన కార్డులు 32,807 ఉన్నాయి. ఈ రేషన్ దుకాణాలన్నీ కూటమి పార్టీల నాయకులకు చెందిన డీలర్ల నిర్వహణలో ఉన్నాయి. దీంతో ఎక్కడికక్కడ రేషన్ దుకాణాలను సిండికేట్ చేసి అక్రమంగా బియ్యాన్ని తరలించి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాకు ప్రతి నెలా 10,582 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తోంది. ఇందులోంచి 50 శాతానికి పైగా బియ్యాన్ని తరలించాలని అధికార పార్టీ నాయకులు డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు సుమారుగా 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలిపోతుందన్నమాట. ఇందులో కిలోకు 5 రూపాయలు చొప్పున ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ కీలక నేతలకు ఇచ్చేలా మాఫియా మధ్య ఒప్పందం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ కీలక నేతలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ముడుపులు చెల్లించాల్సి ఉంటుందని ఆరోపణలున్నాయి. అలాగే అధికారులకు కూడా ఎవరికి ముట్టచెప్పాల్సింది వారికి ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక అధికారికి నెలకు రూ.8 లక్షల వరకు రేషన్ మాఫియా ద్వారా కమీషన్లు ముడుతున్నట్లు ప్రచారం. పట్టుబడింది 3 వేల బస్తాలైతే 750 బస్తాలకే కేసు... దర్శి నియోజకవర్గంలోని ఒక రైస్ మిల్లులో రెండు రోజుల క్రితం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 వేల (25 కేజీలు) బస్తాల బియ్యం దొరికినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ కీలక నాయకురాలు రంగంలోకి దిగినట్లు చెప్పుకుంటున్నారు. పైస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దాంతో కేవలం 750 బస్తాల బియ్యం మాత్రమే దొరికినట్లు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన బియ్యాన్ని అక్కడే వదిలివెళ్లి పోయారని, ఆ బియ్యాన్ని రాత్రికి రాత్రే ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. భారీ మొత్తంలో రేషన్ బియ్యం దొరకడంతో దర్శి నియోజకవర్గ ప్రజలు విస్తుపోయారు. చక్రం తిప్పుతున్నది వీళ్లే.. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో కీలకనేతల అనుచరులు, పీఏలు, సోదరులు ఇతర కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జికి సన్నిహితుడిగా మెలిగే ఒక నాయకుడు గతంలో పోలీసులతో ఘర్షణకు దిగడం సంచలనం సృష్టించింది. పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు వద్ద దొరికిన రేషన్ బియ్యం వ్యవహారంలో సదరు అనుచర నాయకుడు పోలీసులపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. ఒంగోలులో కీలక నేత వద్ద ఉన్న ఏడుగురు పీఏలలో ఒకరికి రేషన్ బియ్యం వ్యవహారాన్ని అప్పగించినట్లు సమాచారం. గిద్దలూరులో అన్నీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న కీలక నేత సోదరుడు రేషన్ అక్రమ రవాణాను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొండపిలో టీడీపీ నాయకుడి తండ్రి కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. కనిగిరి రేషన్ వ్యాపారాన్ని ఒంగోలు జనసేన నేత చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. చీరాలలో రేషన్ బియ్యాన్ని ఒంగోలు టీడీపీ కార్పొరేటర్లు ఇద్దరు నిర్వహిస్తున్నారని సమాచారం. దర్శిలో 10 మంది కూటమి నాయకులను రేషన్ బియ్యం రవాణాకు కేటాయించినట్లు చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రంగా రేషన్ మాఫియా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ బియ్యం వ్యాపారానికి జిల్లా.. కేంద్రంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రికి అత్యంత సన్నిహితుడిగా మెలిగే ఒక కార్పొరేషన్ చైర్మన్ బియ్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని 8 నియోజకవర్గాలతో పాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, చీరాల రేషన్ బియ్యాన్ని సైతం జిల్లా నాయకులే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దాంతో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఒక అవగాహన కుదుర్చుకున్న సదరు నాయకుడు జిల్లా కేంద్రంలో రెండు రైస్ మిల్లుల ద్వారా బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ ప్రకాశం నుంచి వచ్చే బియ్యాన్ని కర్నూలు రోడ్డులోని పీర్లమాన్యంలో ఒక రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు జిల్లా నుంచి వచ్చే బియ్యాన్ని తీరప్రాంతం నుంచి తరలించి ఈతముక్కల గ్రామంలోని ఒక రైస్ మిల్లులో నిల్వ చేసి అక్కడ నుంచి కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు తరలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పేదల బియ్యం అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోతోంది. అధికార టీడీపీ ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా పోర్టుల ద్వారా రేషన్ బియ్యాన్ని ఎల్లలు దాటించేస్తోంది. నిరుపేద ప్రజల కడుపులు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ బడా బాబులు బొజ్జలు నింపుకుంటున్నారు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల కిందట దర్శిలో ఒక రైస్ మిల్లుపై అధికారులు దాడులు చేసి అక్కడ సుమారు 3 వేల బస్తాలు ఉంటే కేవలం 706 బస్తాలకే కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీడీపీ కనుసన్నల్లో యథేచ్ఛగా రేషన్ బియ్యం వ్యాపారం కీలక మంత్రికి సన్నిహితుడి గుప్పిట్లో జిల్లా రేషన్ మాఫియా రాత్రికి రాత్రే కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలింపు పాలకుల అండతో మిన్నకుండిపోతున్న అధికారులు దర్శిలో అధికారుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత మిల్లులో ఉన్న బస్తాలు 3 వేలు.. కేసు నమోదు 706 బస్తాలే అధికారులపై ఉన్నత స్థాయి ఒత్తిళ్లు -
అంగన్వాడీ సిబ్బంది విధుల నుంచి తొలగింపు
కంభం: మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నుంచి ఈనెల 8వ తేదీ అదృశ్యమై 10వ తేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పొదిలి లక్షిత్ మృతికి పరోక్షంగా అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒక కారణమని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల పీడీ సువర్ణ విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్కు సమర్పించిన నేపథ్యంలో అంగన్వాడీ టీచర్ కె.గోవిందమ్మ, ఆయా ఎ.కృష్ణకుమారిని విధుల్లో నుంచి తొలగిస్తూ బుధవారం కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాగా ఆ ఉత్తర్వులను సిబ్బందికి అందజేసినట్లు సూపర్ వైజర్ గాలెమ్మ తెలిపారు. బాలుడి మృతి కేసు దర్యాప్తులో లేని పురోగతి: బాలుడు మృతి చెంది వారం రోజులు కావస్తున్నా కేసులో ఎటువంటి పురోగతి లేనట్లు తెలుస్తోంది. ముక్కుపచ్చలారని బాలుడి అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో మృతికి కారకులైన వారిని పోలీసులు త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. -
మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
● ఒంగోలులో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మొదటి రోజు సమ్మె ఒంగోలు సబర్బన్: షరతులు లేకుండా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు నగర మున్సిపల్ పారిశుధ్య కార్మికులు బుధవారం మొదటి రోజు సమ్మె నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొర్నెపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని, కోవిడ్ కార్మికులను ఆప్కాస్లోకి తీసుకోవాలని, గత 17 రోజులు సమ్మె కాల ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని కోరారు. చనిపోయినా, ఆరోగ్యం బాగాలేని కార్మికులకు వాళ్ల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్లో ఎంప్లాయ్ కోడ్ లింకును తీసివేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ పట్టించుకోకపోవటం దారుణమన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి టి.మహేష్ మాట్లాడుతూ చనిపోయినా, ఆరోగ్యం బాగాలేని కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఖాళీ అయిన స్థానాల్లో టీడీపీ కార్యకర్తలను ఆప్కాస్లో చేర్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఖాళీ పోస్టుల స్థానంలో కోవిడ్ కార్మికులను ఆప్కాస్ లోకి తీసుకోవాలని, లేకుంటే ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వై రవి, ఏం బాబు, ఆర్ శ్రీనివాసరావు, బి బాబు, కే వెంకటేశ్వర్లు, కే యాకోబు, యూనియన్ నగర కార్యదర్శి విజయమ్మ, అనిత, బందెల సుబ్బారావు, కసుకుర్తి వెంకటేశ్వర్లు, ఆనంద్, కే మోహన్రావు, ఆర్ రాములు, కే సామ్రాజ్యం, పి పద్మ, కమల, కే వంశీతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పాలకులకు పట్టవా..
● ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఇంజినీరింగ్ సిబ్బంది ధర్నా ఒంగోలు సబర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నా పాలకులకు ఏ మాత్రం పట్టడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు ధ్యజమెత్తారు. స్థానిక ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె కొనసాగింపులో నిరసన కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి మున్సిపాలిటీ ఇంజినీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. యూనియన్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు కూడా పిలవకుండా పక్కదారులు పట్టించే పద్ధతిలో ఉందని మండిపడ్డారు. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్ ప్రకారం వేతనాలు చెల్లించకుండా అందరికీ ఒకే తరహా వేతనాలు చెల్లించటం మోసగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన లేకుండా, వేతనాల పెంచకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం మున్సిపల్ అధికారులతో పోటీ కార్మికులతో పని చేయించుకునే పద్ధతిలో ఉండటం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఎస్టీడబ్ల్యూఎఫ్ ఒంగోలు బ్రాంచ్ ఒంగోలు డిపో కమిటీ కార్మికులకు ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.హైపురెడ్డి మాట్లాడుతూ కార్మికులకు కనీసం వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. చట్టాలు అమలు చేయడంలో కార్మికుల పక్షాన నిలవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ ఒంగోలు నగర కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులు, జీ రమేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసరావు, ఇంజినీర్ కార్మికులు, యూనియన్ నాయకులు కే జాలయ్య, కే వెంకటరావు, కే మోహన్ రావు, సుధాకర్, ప్రసన్న, శ్రీదేవి, శివమ్మ, వంకాయల ప్రతాప్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్తో పనితీరు వేగవంతం
ఒంగోలు టౌన్: జిల్లాలోని అన్నీ పోలీస్స్టేషన్లలో టెక్నాలజీ వినియోగం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పోలీసు శాఖ ఆధునికీకరణలో భాగంగా బుధవారం పోలీస్స్టేషన్లకు ఆధునిక డిజిటల్ పరికరాలను ఎస్పీ అందజేశారు. 176 ఆల్ఇన్ వన్ కంప్యూటర్లు, 44 వెబ్ కెమెరాలు, 48 ప్రింటర్లను ఆయా పోలీస్స్టేషన్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను అందించినట్లు తెలిపారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, విచారణ, న్యాయ ప్రక్రియ, కేసు ముగింపు వరకు సాగే ప్రతి దశను డిజిటల్గా నమోదు చేసేలా చేసేలా ఈ ఆధునిక పరికరాలు ఉపయోగపడతాయన్నారు. పాత టెక్నాలజీకి బదులు నూతన కంప్యూటర్ల పనితీరు పోలీసు శాఖకు ఎంతో ఉపయుక్తం అవుతాయని చెప్పారు. కేసులు మరింత పారదర్శకంగా ఉండేలా, ప్రజలు తమ కేసుల స్థితిగతులను ఆన్లైన్లో తేలికగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తాయన్నారు. పర్చువల్ విచారణలు, వీడియా రికార్డింగ్, సాక్ష్యాల డిజిటల్ స్టోరేజీ వంటి ఆధునిక విధానాలకు అనుగుణంగా ఉపయోగపడతాయని తెలిపారు. క్రైమ్ అనాలిసిస్, డేటా ఇంటిగ్రేషన్, నేరాల నిరోధంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పీఎస్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, సీఐలు నాగరాజు, మేడా శ్రీనివాసరావు, విజయకృష్ణ, సుధాకర్, హజరత్తయ్య, శ్రీకాంత్, డీటీసీ సీఐ షమీముల్లా, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లా పోలీసులకు ఆధునిక కంప్యూటర్లను అందజేసిన ఎస్పీ -
చెల్లని చెక్కు కేసులో జైలు
గిద్దలూరు రూరల్: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో హెచ్ఎంపాడుకు చెందిన రాచూరి రంగారావుకు గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.భరత్చంద్ర ఏడాది జైలుశిక్షతో పాటు రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన దాసరి బాల సుబ్బయ్య వద్ద హెచ్ఎంపాడుకు చెందిన రంగారావు 2016 లో వ్యక్తిగత కారణాలపై నగదు తీసుకొని చెల్లని చెక్కు ఇచ్చాడు. ఈ మేరకు బాధితుడు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.10 లక్షలు చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. మున్సిపల్ కార్మికుల వంటావార్పు మార్కాపురం టౌన్: సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి డీకే రఫీ మాట్లాడుతూ జీఓ నం.36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని కోరారు. గత 4 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంఏ కార్యాలయం వద్ద జరిగే నిరసనలో కార్మికులు పాల్గొనాలని అన్నారు. సమావేశంలో రూబెన్, సుబ్బరాయుడు, హరికృష్ణ, చెన్నరాయుడు, అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాజీ రాజు తెలిపారు. ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్షలు ఒంగోలు సబర్బన్: ఏిపీపీఎస్సీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ప్రశాంతంగా జరిగాయి. లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తోంది. ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 6 సెంటర్లలో పరీక్ష జరుగుతోంది. రెండో రోజు బుధవారం ఒంగోలు నగరం మామిడిపాలెంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కాలేజీలో ఉదయం పరీక్షకు 170కు గాను 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 135 కి గాను 62 మంది హాజరయ్యారు. అదే విధంగా ఒంగోలులోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లో జరిగిన పరీక్షకు 97 మందికి గాను 41 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీఆర్ఓ బి.చిన ఓబులేసు సందర్శించారు. ఆన్లైన్లో జరుగుతున్న పరీక్ష తీరును ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్తి కోసం వేధిస్తున్నారని తల్లి ఫిర్యాదు ● కుమార్తె, అల్లుళ్లపై కేసు నమోదు పెద్దదోర్నాల: ఆస్తి కోసం తనను వేధిస్తున్నారంటూ కొత్తూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సై మహేష్ ఆమె కుమార్తె, అల్లుళ్లపై కేసు నమోదు చేశారు. కొత్తూరుకు చెందిన ఓ వితంతువుకు చెందిన వ్యవసాయ భూమిలో వేసిన పత్తి పంటను సోమవారం అమె కుమార్తె, అల్లుళ్లు కలిసి ధ్వంసం చేశారని ఆమె ఆరోపించిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో తల్లి యేరువ చిన్నమ్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ మాట్లాడుతూ ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కరేడులో మానవ హక్కుల వేదిక నాయకుల పర్యటన ఉలవపాడు: మండలంలోని కరేడు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం మానవ హక్కుల వేదిక నాయకులు పర్యటించారు. పరిశ్రమలకు భూ సేకరణను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులకు సంఘీభావంగా కరపత్రాలు పంచిపెట్టారు. ప్రజల ఆమోదాన్ని కాదని భూసేకరణ చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ప్రాజెక్టును తక్షణమే రద్దు చేసి భూ సేకరణ ప్రకటనలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, రాష్ట్ర కార్యదర్శి రోహిత్, రాష్ట్ర చేనేత జనసమాఖ్య అధ్యక్షుడు మోహన్రావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలులో పుస్తక మహోత్సవం
ఒంగోలు సబర్బన్: విజయవాడ బుక్ ఫెస్టివల్స్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, గ్రంథాలయ శాఖ సంయుక్తంగా ఆగస్టు 15 నుంచి 10 రోజుల పాటు మూడో పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు తెలిపారు. పుస్తక మహోత్సవానికి సంబంధించిన వాల్పోస్టర్ను బుధవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి 24వ తేదీ వరకు పది రోజుల పాటు పుస్తక మహోత్సవాన్ని నగరంలోని పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. పుస్తక ప్రదర్శనలో ప్రముఖ పబ్లిషర్స్ వంద స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తారన్నారు. ప్రతిరోజూ సాయంత్రం సాహిత్య, సాంస్కృతిక వి/్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పుస్తక మహోత్సవంలో సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుస్తక పఠనంపై మక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఈ పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు నాయక్, కార్యదర్శి ఆర్ రామకృష్ణ, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వేంకట శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్, పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి 10 రోజుల పాటు పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా -
వైఎస్ జగన్ను కలిసిన శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బుధవారం తాడేపల్లిలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ను శివప్రసాద్ రెడ్డి, వెంకాయమ్మ పరామర్శించారు. పార్టీ, తాము అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఒక బీసీ మహిళ పార్టీ సమావేశానికి వెళ్తుంటే ఆమె వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆమైపె దాడికి పాల్పడడం సబబుకాదన్నారు. అనంతరం వారు తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. -
రౌండ్ రౌండ్కూ రైతుల ఘోష రీసౌండ్!
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో ఎనిమిదో రౌండ్ ప్రారంభం నుంచి బేళ్ల తిరస్కరణ సంఖ్య పెరిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడో రౌండ్ ప్రారంభమైన రోజు నుంచి రౌండ్ చివరి దశ సమయం వరకు రోజుకు దాదాపుగా 200పైగా బేళ్లు తిరస్కరణకు గురవుతూ వచ్చాయి. 8వ రౌండ్ ప్రారంభం నుంచి బేళ్ల తిరస్కరణ రోజుకు దాదాపు 300పైగా ఉన్నాయి. అసలే మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బేళ్ల తిరస్కరణతో ఖర్చు అధికమవుతుందని వాపోతున్నారు. అధికారులు పర్యటించి అన్ని బేళ్లను కొనుగోలు చేయాలని వ్యాపారస్తులకు సూచించినా వ్యాపారస్తులు అధికారుల మాటలను పట్టించుకోవట్లేదు. ఏడో రౌండ్ మధ్యలో రీజినల్ మేనేజర్ శీలం రామారావు పొగాకు వేలాన్ని పరిశీలించి అన్ని బేళ్లు కొనుగోలు చేయాలని వ్యాపారస్తులకు సూచించారు. ఆ సమయంలో వ్యాపారస్తులు అన్నీ బేళ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ప్రతిరోజూ వందల బేళ్లను కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. గత సంవత్సరంలో కేజీ రూ.240 పలికిన లో గ్రేడ్ పొగాకును వ్యాపారస్తులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు వెనక్కి తీసుకుపోతున్నారు. మళ్లీ వాటిని తీసుకురావాలంటే వ్యయప్రయాసలకు లోను కావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 326 బేళ్ల తిరస్కరణ మంగళవారం జరిగిన వేలంలో 326 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి జి.సునీల్కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని కొండపి, పోలిరెడ్డి పాలెం, చౌటపాలెం, రామాయపాలెం, దాసిరెడ్డిపాలెం గ్రామాల రైతులు 1091 బేళ్లను తీసుకురాగా 765 బేళ్లను కొనుగోలు చేసి 326 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160గా నమోదైంది. వేలంలో 23 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 8వరౌండ్ ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో బేళ్ల తిరస్కరణ ఏడో రౌండ్ వరకు నిత్యం 200 బేళ్లు తిరస్కరణ 8వ రౌండ్ ప్రారంభం నుంచి 300 బేళ్లకు పైగా తిరస్కరణ -
ప్రకాశం
38 /297గరిష్టం/కనిష్టంబాబు మోసాలు బయటపెడదాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలను బయటపెడదామని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.సి‘ఫార్సు’ బదిలీ..వీఏఏలు బలి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీల్లో మితి మీరిన రాజకీయ జోక్యంతో వారు అవస్థలు పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో రెండుసార్లు బదిలీ జాబితాలు ఇచ్చారువాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు. బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025– 8లో.. -
ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల సస్పెన్షన్
మార్కాపురం: పార్టీ ఆదేశాలను ధిక్కరించి మున్సిపల్ చైర్మన్పై జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్లో పాల్గొన్న ఏడుగురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటన జారీ చేసింది. గత నెల 11వ తేదీన మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణపై టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా ఏడుగురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 17వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, 24వ వార్డు కౌన్సిలర్ బుసెట్టి నాగేశ్వరరావు, 19వ వార్డు కౌన్సిలర్ టీ.రంగలక్ష్మమ్మ, 29వ వార్డు కౌన్సిలర్ షేక్ ఖుర్షీద్ బి, 10వ వార్డు కౌన్సిలర్ ఏలూరు జ్యోతి, 12వ వార్డు కౌన్సిలర్ షేక్ ఫాతిమా, 14వ వార్డు కౌన్సిలర్ బుర్రి ఎల్లమ్మను సస్పెండ్ చేశారు. నైపుణ్యాభివృద్ధిలో యువత ముందుండాలి ఒంగోలు సిటీ: పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ప్రత్యక్షంగా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారిణి రమాదేవి పేర్కొన్నారు. ప్రపంచ యువనైపుణ్య దినోత్సవంలో భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో జనశిక్షణ సంస్థ, ఐటీఐ కళాశాల, జిల్లా యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధిలో యువత ముందుండాలని అదే సమయంలో క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ బాబు, జనశిక్షణ సంస్థ డైరక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ‘నెత్తురు నది’కి నాగభైరవ సాహిత్య పీఠ పురస్కారం ఒంగోలు మెట్రో: జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేరిట నాగభైరవ సాహిత్య పీఠం ఏటా ఇచ్చే అనువాద సాహిత్యంపై పురస్కార ప్రదానం కోసం పుస్తకాలను ఆహ్వానించింది. వచ్చిన పుస్తకాలను పరిశీలించి న్యాయనిర్ణేతల అభిప్రాయం మేరకు రూ.10 వేల ప్రథమ బహుమతికి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రచించిన ‘నెత్తురు నది’ నవలను, రూ.5 వేల ద్వితీయ బహుమతికి కోనేరు కల్పన రచించిన ‘దర్పణం’ కథా సంపుటిని ఎంపిక చేసినట్టు సాహితీ పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17వ తేదీ ఆదివారం ఉదయం జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో నిందితుడికి 80 రోజుల జైలు ● మరో ఇద్దరికి 30 రోజులు, ఇంకొకరికి 15 రోజుల శిక్ష.. ● రూ.10 వేల చొప్పున జరిమానా కూడా.. గిద్దలూరు రూరల్/కంభం/బేస్తవారిపేట: పట్టణంలోని రాచర్ల గేటు సెంటర్ వద్ద మద్యం మత్తులో, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి 80 రోజుల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భరత్చంద్ర తీర్పు వెల్లడించినట్లు సీఐ కె.సురేష్ తెలిపారు. ● కంభం పరిధిలో మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్కు 30 రోజుల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గిద్దలూరు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి తీర్పు వెల్లడించినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ● బేస్తవారిపేట మండల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరిని మంగళవారం గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.భరత్చంద్ర తీర్పు వెల్లడించినట్లు ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి తెలిపారు. ఒకరికి రూ.10 వేల జరిమానా, 15 రోజుల జైలు శిక్ష, మరొకరికి రూ.10 వేలు జరిమానా, 30 రోజుల జైలు శిక్ష విధించారని వివరించారు. -
బాబు మోసాలు బయటపెడదాం
సంతనూతలపాడు: ప్రతి ఎన్నికల్లో అసాధ్యమైన హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచాక వాటిని విస్మరించడం చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు సక్రమంగా అమలు చేయలేదన్నారు. కానీ మన పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రతి నెలా అర్హులకు నగదు జమైందన్నారు. 30 లక్షల ఇళ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించారన్నారు. చంద్రబాబు పాలన అనుచరుల అభివృద్ధికే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించి అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల గుండెల్లోనే ఉన్నాయన్నారు. 2029లో పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు ఏడాది కాలంలోనే అధికార టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, త్వరలోనే తిరుగుబాటు తప్పదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అన్నారు. జగన్మోహన్రెడ్డి తన హయాంలో నిజాయితీ రాజకీయాలు చేశారని, అందుకే ప్రజల్లో ఆయన ప్రతిష్ట రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ఈ సమయంలో కష్టపడే ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయన్నారు. జగన్ ప్రభంజనం మరోసారి చరిత్ర సృష్టిస్తుందన్నారు. సమావేశంలో మాజీ సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, సీనియర్ నాయకులు బొల్లిలేని కృష్ణయ్య, అబ్బూరి శంకరరావు, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, మండల మహిళాధ్యక్షురాలు సీతమ్మ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణా కోటిరెడ్డి, దమ్మల శ్రీనివాసరావు, ఏడుకొండలు, వైస్ ఎంపీపీ తన్నీరు రాగమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు దర్శి నాగమణి, శైలజ, వెంకటరెడ్డి, మున్సిపల్ విభాగం రావూరి శ్రీనివాస్రెడ్డి, బలరాంరెడ్డి, వెంకటనారాయణ, వెంకట్రెడ్డి, అమర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ శూన్యం కార్యకర్తలు అధైర్యపడొద్దు..2029లో మళ్లీ జెండా ఎగరేస్తాం మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
సిఫార్సు బదిలీ.. వీఏఏలు బలి!
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే సచివాలయ సేవలను సగానికి కుదించి, సర్వేల పేరుతో చెడుగుడు ఆడుకున్న సర్కారు.. తాజాగా బదిలీల మాటున ఏకంగా బంతాట ఆడుతోంది. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నియోజకవర్గ ఇన్చార్జుల సిఫార్సు లేఖలను ప్రామాణికంగా తీసుకుని అడ్డగోలుగా బదిలీలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి నెట్వర్క్: సచివాలయ ఉద్యోగులుగా ఎంపికై న వారు సొంత మండలంలోనే, సమీప గ్రామాల్లోనే విధులు నిర్వహించేలా అవకాశం కల్పిస్తామని ఆ వ్యవస్థ ప్రారంభ సమయంలోనే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే నియామక ప్రక్రియ సాగింది. కానీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సచివాలయ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడే నిర్ణయాలను వరుసగా తెరమీదకు తెస్తోంది. ఇటీవల మొదలైన బదిలీల ప్రక్రియ తమను మానసికంగా కుంగదీస్తోందని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల్లో దివ్యాంగులకు వెసులుబాటు కల్పించాలన్న నిబంధనలను రాజకీయ జోక్యంతో అధికారులు తుంగలో తొక్కారు. గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలంలోని సలకలవీడులో పనిచేస్తున్న దివ్యాంగుడు టి.రమణారెడ్డికి మొదటి జాబితాలో కందులాపురం–2 పోస్టింగ్ ఇచ్చారు. రెండో జాబితాలో త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం బదిలీ చేశారు. బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్లలో పనిచేస్తున్న కొండారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే సిఫార్సుతో కందులాపురం–2కు చేరాడు. ● కంభం మండలం కందులూపురం–1లో పనిచేస్తున్న దివ్యాంగుడు బి.వెంకట రమేష్ను మొదట మార్కాపురం మండలం చింతకుంట బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో జాబితాలో మాత్రం ఆయన పేరు చీమకుర్తి మండలం దేవరపాలేనికి మారింది. ● కంభం మండలంలోని చిన్నకంభం సచివాలయంలో పనిచేస్తున్న బి.ప్రగతిని మొదటి లిస్టులో హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లెకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పేర్కొని, రెండో లిస్ట్లో ఏకంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు వేశారు. ● గిద్దలూరు మండలంలోని కొమ్మునూరు సచివాలయంలో పనిచేస్తున్న చేరెడ్డి సుస్మితను శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా కందుకూరుకు బదిలీ చేశారు. 9 నెలల బాబుతో వేరే జిల్లాకు వెళ్లి ఎలా పనిచేయాలని ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది. త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకట ధనుశ్రీ బదిలీల కౌన్సెలింగ్లో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఉన్న మూడు సచివాలయాలను కోరుకుంది. అయితే ఆమె కోరుకున్న గ్రామాలు కాకుండా యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలేనికి బదిలీ చేస్తున్నట్లు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు కూడా సిద్ధపడిన ఆమెను వెంకటాద్రిపాలెంలో జాయిన్ చేసుకోలేదు. ఈ నెల 5వ తేదీన మరో జాబితాను పాత తేదీ(జూన్ 21)తో విడుదల చేశారు. రెండో జాబితాలో ఏకంగా ఆమెను మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి సచివాలయానికి బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మనోవేదనకు గురైన ఆమె గత సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో గ్రీవెన్స్కు వెళ్లి అర్జీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో 17 చోట్ల ఉందని, ఆయా ప్రాంతాలకు చెందిన నాయకుల సిఫార్సు లెటర్లు లేకపోవడం వలన కౌన్సెలింగ్ ప్రకారం కాకుండా ఖాళీ ఉన్న సచివాలయాలకు బదిలీ చేయాల్సి వచ్చిందని ఒక అధికారి చెప్పడం గమనార్హం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 88 సచివాలయాలు ఉండగా అనేక మంది కూటమి నేత సిఫార్సు లెటర్తో అనుకూలమైన చోట పోస్టింగ్ దక్కించుకున్నారు. దర్శి నియోజవకర్గంలో సచివాలయాల ఉద్యోగులు కొందరికి రాజకీయాలు ఆపాదించి బదిలీల పేరుతో వేధింపులకు తెరతీయడం చర్చనీయాంశమైంది. సిఫార్సు లేఖలు తెచ్చుకోనివారిలో కొందరిని బాపట్ల జిల్లాకు, మరికొందరిని యర్రగొండపాలెం మండలానికి బదిలీ చేయడం గమనార్హం. స్థానిక టీడీపీ నేతలు సిఫార్సు లేఖల పేరుతో చేతివాటం చూపినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముండ్లమూరు మండలంలో నియోజకవర్గ టీడీపీ నేత పేరు చెప్పి ఉద్యోగుల నుంచి రూ.15 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జుల రికమెండేషన్ ఉంటే కోరుకున్న చోట పోస్టింగ్ సిఫార్సు లెటర్ లేదనే సాకుతో పక్క జిల్లాలకు గెంటేసిన వైనం బదిలీల్లో కిరికిరి.. సిఫార్సులతో రెండుసార్లు జాబితాలు విడుదల గ్రీవెన్స్, హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైన ఉద్యోగులు ఉద్యోగులకు బదిలీల్లో అన్యాయం చేశారు సార్.. దివ్యాంగులు, బాలింతలపైనా -
కందికి ఎగనామం!
చౌక నిర్ణయం.. 6,61,206జిల్లాలో రేషన్కార్డులు1,392రేషన్ దుకాణాలురేషన్ కార్డుదారులకు కందిపప్పు దూరమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరకొరగా ఇస్తూ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రేషన్ షాపులకు పంపిణీని నిలిపేసింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 655 టన్నులు అవసరమవుతుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కందిపప్పు ధరలు భారీగా పెరిగినప్పుడు కార్డుదారులకు చౌకధరల దుకాణంలో తక్కువ ధరకే అందిస్తూ అండగా నిలిచింది. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ● రేషన్ దుకాణాల్లో కందిపప్పునకు మంగళం పాడేసిన కూటమి సర్కార్ ● ఏడు నెలలుగా పంపిణీ నిలిపివేత ● బియ్యం, పంచదారకే పరిమితం ● డీలర్లకు డీడీలు తీయొద్దంటూ అధికారుల సూచన ● జిల్లా వ్యాప్తంగా 655 టన్నుల పప్పు అవసరం ● బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనలేక ఇబ్బందులు బేస్తవారిపేట: కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అధికారంలోకి వచ్చీ రాగానే అధికార టీడీపీ నేతలు రేషన్ దుకాణాలపై కన్నేశారు. దశాబ్దాలుగా రేషన్ దుకాణాలనే నమ్ముకుని ఉన్నవారిని తొలగించేందుకు కుట్రలకు తెరతీశారు. చాలా మందిపై బెదిరింపులకు దిగారు. అధికారులతో దాడులు చేయించారు. జిల్లాలో తమ మాట వినని దుకాణాలపై పదుల సార్లు అధికారులతో దాడులు చేయించారంటే ఎంతకు తెగించారో అన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్య్ప్తాంగా 1392 రేషన్ దుకాణాలు ఉండగా అందులో 1000 మందికి పైగా డీలర్లను తమకు అనుకూలమైన వారిని పెట్టుకుని బియ్యం దందాకు తెరతీశారు. ఇక కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ఇంటి ముంగిటకే ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎండీయూ వాహనాలతో నాలుగేళ్లుగా రేషన్ పంపిణీ చేస్తూ లబ్ధిదారులకు అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీల నేతలు రేషన్ పంపిణీ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని బియ్యం దందాకు తెరతీశారు. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాలకు వెళ్లి అవస్థలు పడుతూ నిత్యావసరాలు తీసుకునే దుస్థితి కల్పించింది. ఇదిలా ఉంటే ప్రజలకు అత్యవసరమైన కందిపప్పు సరఫరాకు మంగళం పాడేసింది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ రేషన్ దుకాణాలు 1,392, రేషన్కార్డులు 6,61,206 ఉన్నాయి. నెలనెలా కందిపప్పు లబ్ధిదారులకు సరఫరా చేయాలంటే సుమారు 655 టన్నులు అవసరమవుతుంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి మూడు నెలలు అరకొరగా కందిపప్పు సరఫరా చేస్తూ వచ్చింది. లబ్ధిదారుల్లో సగం మందికి అందేది కాదు. ఇక రాను రాను పంపిణీని నిలిపేసింది. వచ్చే నెలలో పంపిణీ చేస్తామంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఏ నెలకానెల చెబుతూ వస్తున్నారు. ప్రతి నెలా కార్డుదారులకు నిరాశ తప్పడంలేదు. ఈనెల కూడా కందిపప్పు రాలేదని డీలర్లు చెబుతుండటంతో చేసేది లేక ఇచ్చిన బియ్యం తీసుకుని వారు వెనుతిరుగుతున్నారు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 వరకూ పలికింది. ఈ ధర కొన్ని నెలలపాటు కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో సబ్సిడీ ధరకు కందిపప్పు సరఫరా చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చెతులెత్తేసింది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.130 ఉంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై ఇవ్వలేని ప్రభుత్వం, కనీసం ధర తక్కువగా ఉన్నప్పుడైనా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడంలేదు. కూటమి ప్రభుత్వం వస్తుంది మీ కష్టాలు తీరుస్తుంది అని ఊదరగొట్టిన పాలకులు పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకపోగా, చివరికి కందిపప్పు కూడా కార్డుదారులకు పంపిణీ చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీడీలు తీయని డీలర్లు... రేషన్ డీలర్లు ప్రతి నెలా 20వ తేదీ లోపు డీడీలు తీసి, తమ పరిధిలోని కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పంచదార వంటి సరుకులు దిగుమతి చేసుకుంటారు. కొన్ని నెలలుగా డీలర్లు డీడీలు తీస్తున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని డీలర్లకు ముందుగానే అధికారులు సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు డీడీలు కట్టడం మానేశారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని కార్డుదారులు అడుగుతుంటే తమకే రాలేదని డీలర్లు బదులిస్తున్నారు. పెరిగిన ధరలతో అవస్థలు.. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఆయిల్, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. 19,37,977కార్డుల్లోని సభ్యులు -
మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
గిరిజన ప్రాంతాల్లో ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు త్వరగా కల్పించడంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. పీ.ఎం–జన్మన్, డీ.ఏ– జె.జి.యు.ఏ. పథకాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ఆవాసాల్లో, ప్రత్యేకించి ఐటీడీఏ పరిధిలో ఉన్న పశ్చిమ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. గృహ నిర్మాణాల్లో ప్రతివారం స్పష్టమైన పురోగతి ఉండాలన్నారు. గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతోపాటు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. బిల్లులను ప్రభుత్వం త్వరగా చెల్లిస్తున్నందున లబ్ధిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ఆవాస గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, వంట గ్యాస్ కనెక్షన్లు, టెలిఫోన్ టవర్ల నిర్మాణం, మొబైల్ మెడికల్ యూనిట్ల సేవలు అందేలా శాఖల వారీగా, సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర్రావు, డిప్యూటీ డీఈవో చంద్రమౌళీశ్వరరావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ పద్మశ్రీ, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, మత్స్యశాఖ జే.డీ.శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడీ రవికుమార్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాలు, టెలికాం శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పెన్షన్ వాలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
ఒంగోలు సబర్బన్: కేంద్ర ఆర్థిక బిల్లులో చొప్పించిన పెన్షన్ వాలిడేషన్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంచర్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పెన్షనర్లు తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. జిల్లా యూనియన్ అధ్యక్షుడు బి.అంకిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెన్షనర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. 1972 నుంచి ఉన్న పెన్షన్ చట్టాన్ని మార్చి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దయాధర్మ బిక్షం కాదని, ఇది ఉద్యోగుల హక్కు అని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ బిల్లుతో 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. భవిష్యత్లో పే కమిషన్ సిఫార్సులు పాత పెన్షనర్లకు వర్తించకుండా చేయడానికి కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాయని మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక బిల్లులో భాగంగా మార్చి 25న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, మార్చి 29న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఇది చట్టమైతే సీనియర్ పెన్షనర్లకు పెన్షన్ అప్డేషన్ గాలిలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ లాంటి సందర్భాల్లో కేంద్రం మూడు డీఏల చెల్లింపులను నిలిపేసిందని, రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయని మండిపడ్డారు. తక్షణమే కేంద్రం 8వ పీఆర్సీ, రాష్ట్రానికి 12వ పీఆర్సీ నియమించి అమలయ్యే వరకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు బీ అంకిరెడ్డి, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.రామ్మోహన్ రావు మాట్లాడుతూ పెన్షన్ బిల్లును ఉపసంహరించకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ నాయకులు పరిటాల సుబ్బారావు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కంభం యూనిట్ అధ్యక్షుడు ఎం.డి.ఇబ్రహీం, పొదిలి యూనిట్ ఉపాధ్యక్షుడు ఏ.బాదుల్లా, ఏపీటీ ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు ఎం కృష్ణయ్య, మర్రి లక్ష్మీనారాయణ, నేలటూరి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. అనంతరం కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ఆందోళన -
సర్పంచ్ను పరామర్శించిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: గుంటూరు జిల్లా పొన్నూరులో ఇటీవల టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన మన్నవ సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావును ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం పరామర్శించారు. గుంటూరులోని రమేష్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలా ఆదుకుంటారని, పార్టీ నాయకుల అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పొన్నూరు ఇన్చార్జి అంబటి మురళి ఉన్నారు. రొయ్య రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి ● రొయ్య రైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ ఒంగోలు సబర్బన్: రొయ్య రైతులకు యూనిట్కు రూ.1.50 విద్యుత్ ఇవ్వాలని రొయ్య రైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఒంగోలు కర్నూల్ రోడ్డులోని రొయ్యల రైతుల సంఘం కార్యాలయంలో మంగళవారం రొయ్యల రైతుల సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాఽథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రొయ్యల రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తగ్గిన సోయా ధరలకు అనుగుణంగా ఫీడ్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1800 మంది రొయ్యల రైతులు ఉంటే కేవలం 1000 మందికి మాత్రమే సబ్సిడీ అందుతుందన్నారు. మిగిలిన రైతులకు 10 ఎకరాలు ఉన్న కారణంగా, డీకేటీ భూముల్లో సాగు చేస్తున్న కారణంగా సబ్సిడీ విద్యుత్ అందడం లేదన్నారు. దీంతో రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు భారం పెరుగుతుందన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో అధికంగా వాడే సోయా ధరలు సగానికి సగం తగ్గాయని, కానీ ఫీడ్ ధరలు మాత్రం తగ్గించలేదన్నారు. గత నెలరోజుల కాలంలో బ్లాక్ టైగర్ రొయ్యలు ధరలను 40 కౌంట్, 30 కౌంట్లలో కేజీకి రూ.100 ధర తగ్గించారన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఓ. సుబ్బారెడి, సంఘం గౌరవ అధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, ఉపాధ్యక్షుడు శింగంనేని అంజిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. రేపు విద్యుత్ అదాలత్ ఒంగోలు సబర్బన్: నగరంలోని సంతపేట విద్యుత్ భవన్లో ఈ నెల 17న విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఒంగోలు ఈఈ ఎం.హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ భవన్లోని కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదాలత్ జరుగుతుతుందన్నారు. అదాలత్లో సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్. విక్టర్ ఇమ్మానియేల్, ఫారం సభ్యులు ఒంగోలు ఆపరేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కట్టా వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు పాల్గొంటారన్నారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి మండలాల విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులను రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. అదాలత్లో నమోదు చేసుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చట్టాలపై అవగాహన అవసరం ● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ ఒంగోలు: చట్టాలపై అవగాహన కల్పించడం ప్రతి న్యాయ విద్యార్థి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో న్యాయ కళాశాల విద్యార్థులతో మంగళవారం లీగల్ లిటరసీ క్లబ్ను ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యల పరిష్కారం అనే అంశానికి సంబంధించిన ఐదు పరిష్కార విభాగాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వం అనే అంశంపై అవగాహన అవసరమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారుల మధ్య వ్యాజ్యాలపై అవగాహన ఏవిధంగా కలిగించాలనే అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల కరస్పాండెంట్ సీహెచ్ రామకృష్ణారావు మాట్లాడుతూ లీగల్ లిటరసీ క్లబ్ తమ కళాశాలలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ కె.నటరాజ్ కుమార్ పాల్గొన్నారు. తప్పుడు ప్రచారంతో వేధిస్తున్నారు ● ఎస్పీకి పామూరు వీఓఏ ఫిర్యాదు ఒంగోలు టౌన్: డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బు దుర్వినియోగం చేసి పారిపోయినట్లు తనపై తప్పుడు ప్రచారం చేసి వేధిస్తున్నారని పామూరు మండలం వెలుగు వీఓఏ మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్కు పిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం వెలుపల మీడియాకు వివరాలు వెల్లడించారు. సీసీ విజయభాస్కర్రెడ్డి, ఏపీఎం విద్యాసాగర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే రూ.5 లక్షలు డిమాండ్ చేశారని, తనవద్ద అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. -
అర్హులకు ఇంటి నివేశన స్థలం
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: రానున్న మూడేళ్లలో జిల్లాలో ఇల్లు లేని వారు ఉండరాదన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జేసీ రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల వివరాలను పెండింగ్లో లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పీజీఆర్ఎస్లో రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తుల పెండెన్సీ, ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ, రీ సర్వే పురోగతి, కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డుల మంజూరు, నిత్యావసర సరుకుల పంపిణీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో సమావేశంలో ఎస్డీసీలు వరకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఎస్ఓ పద్మశ్రీ, జిల్లా సర్వ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా తదితర అధికారులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో పంట ధ్వంసం
పెద్దదోర్నాల: కుటుంబ కలహాలతో ఓ మహిళా రైతు వేసిన పత్తి పంటను కన్న కూతుర్లే ధ్వంసం చేసిన సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరులో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. ఈ సంఘటనతో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయింది. బాధితురాలి కథనం మేరకు.. కొత్తూరుకు చెందిన రైతు యేరువ శ్రీనివాసరెడ్డి గతంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఆయన భార్య చిన్నక్క అన్నీ తానై తన ముగ్గురు కుమార్తెలను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. వారికి ఇవ్వాల్సిన లాంఛనాలు అన్నీ ఇచ్చి వారిని అత్తారిళ్లకు పంపారు. కూతుళ్లకు ఇచ్చింది పోగా, గ్రామంలో మిగిలిన రెండు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తమ కుటుంబంలో ఆస్తి విషయమై తనకు, తన కూతుళ్లకు మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఆస్తిని పంచి తమ వాటా తమకు రాసివ్వాలని కుమార్తెలు గొడవలు పడుతున్నారని చిన్నక్క ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తనతో గొడవ పెట్టుకున్న తన ఇద్దరు కుమార్తెలు వారి భర్తలతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న రెండెకరాల పత్తి పంటను మొదళ్లతో సహా పీకేసి ధ్వంసం చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే తల్లిపై కసిని పెంచుకుని, చివరకు ఇలా నష్టాన్ని మిగిల్చారని ఆమె రోదిస్తోంది. కడుపున పుట్టిన బిడ్డలే శత్రువులుగా మారిన వైనం పత్తి పంటను ధ్వంసం చేసిన కుమార్తెలు -
వైఎస్సార్ విగ్రహం తొలగింపునకు కుట్ర
మార్కాపురం టౌన్: పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్(కుంట) సెంటర్లో సుమారు 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీసీపీ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గుంటూరు, కర్నూలు బైపాస్ రోడ్డు ఏర్పాటుకు ఎటువంటి ఆటంకం లేకపోయినా వైఎస్సార్ విగ్రహన్ని తొలగించాలని అధికారులతో కలిసి కొందరు రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విగ్రహాన్ని తొలగించాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. అర్జీ ఇచ్చినవారిలో సర్పంచ్ మల్లేశ్వరి, నాయకులు లక్ష్మీనారాయణ, మేకల కాశయ్య, ఎస్కె నూర్ అహ్మద్, రామచంద్రుడు, నారాయణ, దానం, సుబ్బారావు, నాగార్జునరెడ్డి, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. సబ్ కలెక్టర్కు వైఎస్సార్ సీపీ నేతల అర్జీ -
నాయకత్వంపై హెచ్ఎంలకు శిక్షణ
పొదిలి: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పొదిలిలోని జోసఫ్ శ్రీహర్ష అండ్ ఇంద్రజ మేరీ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణను మార్కాపురం డీవైఈఓ మామిళ్లపల్లి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. కోర్సు డైరెక్టర్గా మర్రిపూడి ఎంఈఓ రంగయ్య వ్యవహరించారు. శిక్షణ ఉద్దేశాలను వివరించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి డి.నాగరాజు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం.జాలరత్నం, ఎంఈఓ యు.శ్రీనివాసులు, 289 పాఠశాలల హెచ్ఎంలు, 9 మంది మాస్టర్ ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 94 ఫిర్యాదులు ఒంగోలు టౌన్: ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు పోలీసు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులను స్వీకరించిన ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్సీఎస్టీ సెల్ సీఐ దుర్గాప్రసాద్, డీటీసీ సీఐ షమీముల్లా, పీజీఆర్ఎస్ ఎస్సై జనార్దనరావు పాల్గొన్నారు. గ్రానైట్ గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి చీమకుర్తి రూరల్: గ్రానైట్ గనుల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. సోమవారం చీమకుర్తి మండలంలోని పలు గ్రానైట్ గనులు, పరిశ్రమలను ఎస్పీ దామోదర్తో కలిసి ఐజీ సందర్శించారు. భద్రతా ప్రమాణాలపై పలు సలహాలు, సూచనలు చేశారు. ముందుగా చీమకుర్తి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ గనులు, పరిశ్రమలలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండటంతో ఎక్కువ నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఎసైలు కృష్ణయ్య, హరిబాబు, శివరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు.!
సాక్షి ప్రతినిధి ఒంగోలు: దర్శి కేంద్రంగా కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు ఊపందుకుంది. దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవి విషయంలో కూటమి పార్టీలైన టీడీపీ–బీజేపీ మధ్య అగ్గి రాజుకుంది. ఈ పదవిని టీడీపీకి చెందిన ఓసీ మహిళకు కేటాయించేందుకు ఎస్సీ రిజర్వేషన్ను సైతం టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి మార్పించారు. టీడీపీకి చెందిన దారం సుబ్బారావు సతీమణి, దర్శి 19వ వార్డు కౌన్సిలర్ దారం నాగవేణి పేరును ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాగవేణి కోసం ఎస్సీలకు కేటాయించిన సీటును మార్పించి ఎస్సీలకు అన్యాయం చేశారు. కానీ, బీజేపీ నేతలు పావులు కదిపి ఆ పార్టీ నాయకుడు మాడపాకుల శ్రీనివాసులు భార్య నారాయణమ్మకు దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, తాజాగా బీజేపీకి కేటాయించిన దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిని మళ్లీ టీడీపీకే కట్టబెట్టారు. జీవో సవరణ పేరుతో గతంలో ప్రకటించిన మాడపాకుల నారాయణమ్మ పేరు మార్చి దారం నాగవేణికి చైర్మన్ పదవిస్తూ జీవో సవరణ చేశారు. దీంతో బీజేపీ నేతలకు టీడీపీ నేతలు షాక్ ఇచ్చినట్లయింది. మంత్రుల ద్వారా పావులు కదిపిన గొట్టిపాటి లక్ష్మి... బీజేపీ నాయకులు అనూహ్యంగా ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకోగా, ఆ ఉత్తర్వులు మార్పించేందుకు మంత్రుల ద్వారా పావులు కదిపి గొట్టిపాటి లక్ష్మి సక్సెస్ అయ్యారు. బీసీ కులానికి చెందిన బీజేపీ నాయకుని భార్య మాలపాకుల నారాయణమ్మ పేరును చైర్మన్ పదవికి ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. దీంతో తమకు మాట ఇచ్చి వేరొకరికి పదవి కట్టబెట్టడంపై గొట్టిపాటి లక్ష్మిని నాగవేణి వర్గీయులు, టీడీపీ నేతలు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా గొట్టిపాటి లక్ష్మి పేరు మార్పు చేయించినట్లు సమాచారం. సోమవారం గుంటూరు మార్కెట్ యార్డ్లోనే ఈ మార్పు చేయించి సంబంధిత ఉత్తర్వుల కాపీ తీసుకున్న తర్వాతే గొట్టిపాటి లక్ష్మి దర్శి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మండిపడుతున్న ఎస్సీ, బీసీలు... సోమవారం కురిచేడు మండలం కల్లూరు వద్ద విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభానికి గొట్టిపాటి లక్ష్మి రావాల్సి ఉండగా, పేరు మార్చిన జీవో కాపీ చేతికి వచ్చిన తర్వాతే దర్శి వస్తానని పట్టుబట్టింది. ఆ జీవో తీసుకున్న తర్వాతే గొట్టిపాటి లక్ష్మి దర్శి వచ్చారని దర్శి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో ఎస్సీలకు కేటాయించిన సీటును కాదని ఓసీలకు మార్చారని, ఆ తర్వాత అధిష్టానం బీసీలకు కేటాయిస్తే వారికి కూడా దక్కనీయకుండా ఓసీలకు కట్టబెట్టడంపై ఎస్సీలు, బీసీలు మండిపడుతున్నారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ.. ఇప్పుడు బీసీలకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి బీజేపీ నేతలు... ఏఎంసీ చైర్మన్ పదవికి పేరు మార్చడంపై దర్శి బీజేపీ నేతలు వెంటనే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ని కలిసినట్లు తెలిసింది. తమకు జరిగిన అన్యాయాన్ని వారు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ మరో పదవి ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా.. వచ్చేసారైనా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమకు లభించేలా చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి ఇచ్చిన ఒక్క పదవి కూడా వారికి దక్కకుండా టీడీపీ నేతలు పేరు మార్చడంతో తామంతా పార్టీకి కష్టపడి పనిచేయడం ఎందుకని బీజేపీ నేతలు ఆవేదన వెల్లగక్కుతున్నారు. ఈ విషయంపై బీజేపీ నాయకుడు, మాడపాకుల నారాయణమ్మ భర్త శ్రీనివాసులను సాక్షి ప్రతినిధి సంప్రదించగా, తామంతా కూటమిలో భాగస్తులమని, గత ఎన్నికల్లో కూటమికి కష్టపడి పనిచేశామని చెప్పారు. తమకు వచ్చిన అవకాశాన్ని దక్కకుండా మార్పు చేయడం తమను ఎంతో బాధిస్తోంన్నారు. అధికారికంగా ఇచ్చిన జీవోలో సునాయాసంగా పేర్లు మార్పు చేయించడంపై అసహనం వ్యక్తం చేశారు. దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి సాక్షిగా బహిర్గతం బీజేపీపై నెగ్గిన టీడీపీ పంతం టీడీపీకి చెందిన నాగవేణికే ఏఎంసీ చైర్మన్ పదవి తొలుత బీజేపీకి చెందిన నారాయణమ్మకు కేటాయిస్తూ ఉత్తర్వులు పంతానికి పోయి ఉత్తర్వులు మార్పించిన టీడీపీ దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి భగ్గుమంటున్న బీజేపీ నేతలు -
అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డీ జయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత గురుకులాల్లో దరఖాస్తులను విద్యార్థులు సమర్పించాలన్నారు. దరఖాస్తులు సమర్పించే విద్యార్థినీ, విద్యార్థులు 10వ తరగతిలో ప్రవేశాలకు 9వ తరగతిలో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందగోరే వారు మొదటి సంవత్సరంలో 50 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలని చెప్పారు. కుల ప్రాతిపదికన రోస్టర్ విధానంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారన్నారు. ఈ నెల 16వ తేదీలోపు సంబంధిత పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందన్నారు. మద్యం బాటిళ్లు పట్టివేత ● ముగ్గురిపై బైండోవర్ కేసులు నమోదు బేస్తవారిపేట: మండలంలోని పాత మల్లాపురం, శింగరపల్లెలో బెల్ట్షాపులపై కంభం ప్రొహిబిషన్–ఎకై ్సజ్శాఖ సీఐ కొండారెడ్డి తనిఖీలు నిర్వహించారు. సోమవారం సాక్షిలో ‘ఊరూరా ఎల్లో బెల్ట్’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. పాత మల్లాపురంలో 15 మద్యం క్వార్టర్ బాటిళ్లు కలిగిన కే దాయదును పట్టుకున్నారు. శింగరపల్లెలో పేరయ్య, గోవిందరెడ్డిలను అదుపులోకి తీసుకుని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయించారు. యువతను మోసం చేస్తే ఊరుకునేది లేదు ● కూటమి ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ హెచ్చరిక ఒంగోలు టౌన్: గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యార్థులు, యువతకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఏడాది పాలన పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రభాకర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని, అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించి అభివృద్ధి చేయాలని, 26 జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఆర్.కరుణానిధి మాట్లాడుతూ కనిగిరి నిమ్జ్, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.రాంబాబు, గోపి, మత్తయ్య, శాంబాబు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్టు
● 3.100 కేజీల గంజాయి, రూ.9.06 లక్షల సొత్తు స్వాధీనం సింగరాయకొండ: గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3.100 కేజీల గంజాయి, రూ.9.06 లక్షల విలువైన వెండి, బంగారు వస్తువులు, వెండి కరిగించే మిషన్, కట్టర్ స్వాధీనం చేసుకున్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య వెల్లడించారు. మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సీఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హజంఘడ్ జిల్లా టేక్కా మండలం మెయిన్పూర్ గ్రామానికి చెందిన ముకేష్కుమార్ మద్దిపాడులో నివసిస్తున్నాడు. ఇతనితో పాటు 65 కేసుల్లో ముద్దాయిగా ఉన్న గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఒడ్లమాను శివారెడ్డి, ఒంగోలు లోని 10వ డివిజన్ ఎఫ్సీఐ గోడౌన్ వద్ద ఉన్న ఇందిరమ్మ కాలనీ దగ్గర గుర్రం జాషువా నగర్ లో నివసిస్తున్న ట్రంకు కార్తీక్ లు జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉండగా వారిని విచారించామన్నారు. ముకేష్కుమార్ మద్దిపాడు జాతీయ రహదారి పై లారీల దగ్గర తక్కువ రేటుకు డీజిల్కొని అమ్మేవాడు. ఆ ఆదాయం చాలకపోవటంతో గంజాయి అమ్మి అధిక లాభాలు పొందాలనే అత్యాశతో లారీ యజమానుల దగ్గర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి లభించే మార్గాలను తెలుసుకుని అక్కడికి వెళ్లి కేజీ రూ.10 వేలు చొప్పున తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేవాడు. ఇతని వద్ద నుంచి కేజీ రూ.12 వేలకు శివారెడ్డి, కార్తీక్లు కొనుగోలు చేసి వారు కూడా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మేవారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ముకేష్కుమార్ ఒడిశా నుంచి తెప్పించిన 3.100 కేజీల గంజాయిని వీరిద్దరికి ఇచ్చే క్రమంలో పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. తరువాత వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి మోటారుసైకిల్, వెండి కరిగించే మిషన్, సెల్ఫోన్లు, 8 కేజీల బరువున్న 57 వెండి కడ్డీలు, 9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. వీరిలో శివారెడ్డి పై ఒంగోలు తాలూకా, హెచ్ఎంపాడు, పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, వెలిగండ్ల మండలాల్లో సుమారు 65 కేసులు ఉన్నాయన్నారు. వీరి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు సీఐ వివరించారు. ఈ సందర్భంగా సీఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్సై బీ మహేంద్ర, సిబ్బంది అమీర్జాన్, నరశింహ, శివకుమార్, నాగూర్వలీ, సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. -
షాపులకు సీళ్లు
కూరగాయల మార్కెట్లో ఒంగోలు సబర్బన్: కొత్త కూరగాయల మార్కెట్ దుకాణదారులపై వేధింపులు ఆగటం లేదు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మార్కెట్పై దాడులు చేయటం పనిగా పెట్టుకున్నారు. సోమవారం పోలీసులను తీసుకొని కూరగాయల మార్కెట్లోని హోల్సేల్, రిటైల్ షాపులపై దాడులకు దిగారు. అద్దె బకాయిల పేరుతో నిత్యం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం హోల్సేల్ షాపుల్లో 8 షాపులకు సీళ్లు వేశారు. అప్పటికప్పుడు రూ.లక్ష చొప్పున కట్టిన మూడు షాపులకు సీళ్లు తొలగించారు. రిటైల్ షాపులకు 15కు పైగా వేశారు. ఈ విధంగా మార్కెట్ని షాపులపై దాడులు చేయటంతో వ్యాపారులు బెంబేలెత్తారు. పాలకులు, అధికారులు చేసిన పాపానికి కూరగాయల మార్కెట్లోని షాపుల లీజుదారులు అల్లాడిపోతున్నారు. రిటైల్, హోల్సేల్ కలిపి దాదాపు 23 షాపులకు సీల్ మూడు షాపులకు ఒక్కొక్కరు రూ.లక్ష కడితే సీళ్లు తెరచిన అధికారులు -
బరితెగించిన గ్రావెల్ మాఫియా
బేస్తవారిపేట: అధికార పార్టీ నేతల అండతో గిద్దలూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఇప్పటికే పెంచికలపాడు సమీపంలోని చెరువు మట్టిని బేస్తవారిపేట, కొమరోలు, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు నిరంతరం తరలిస్తున్నారు. తాజాగా జగనన్న కాలనీ వద్ద ఉన్న కొండపై అక్రమార్కుల కన్ను పడింది. అనుమతి తీసుకోకుండా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మండల స్థాయి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి గ్రావెల్ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఉన్న జగనన్న కాలనీ పైఎత్తున ఉన్న కొండపై అక్రమార్కులు కన్నేశారు. గత మూడు రోజులుగా ప్రభుత్వ భూముల్లో రెండు జేసీబీలతో గ్రావెల్ తవ్వి, 20 ట్రాక్టర్లతో దర్జాగా తరలిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో అక్రమార్కులకు అడ్డులేకుండాపోయింది. సోమవారం అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. అక్రమంగా మట్టి తరలిస్తున్నారని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే శ్రీమా వద్ద స్టాఫ్ ఇద్దరే ఉన్నారు.. మేము ఎక్కడికని రావాలి.. స్థానికంగానే అడ్డుకోండిశ్రీ అని సెలవిచ్చారని మోక్షగుండం గ్రామస్తులు తెలిపారు. వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికై న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని మట్టి అక్రమ రవాణాను అడ్డుకుని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోక్షగుండం, పందిళ్లపల్లె గ్రామస్తులు కోరుతున్నారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో కరిగిపోతున్న కొండ 2 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమ రవాణా 3 రోజులుగా దోచేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు -
రూ.100 కోట్ల భూమి అన్యాక్రాంతం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద దాదాపు రూ.100 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం అయిందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షేక్ ఇమ్రాన్ ఖాన్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమానికి ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, కార్పొరేటర్లు జి.ప్రవీణ్ కుమార్, వెన్నపూస కుమారి, కో–ఆప్షన్ సభ్యులు రషీదా, శ్యామ్ సాగర్లు ఇన్చార్జ్ కలెక్టర్ను కలిశారు. పాత మార్కెట్ స్థలం అన్యాక్రాంతంపై ఈ ఏడాది జూన్ 29న సాక్షిలో శ్రీభూదందాశ్రీ శీర్షికతో కథనం ప్రచురితమైందని ఆ పేపర్ క్లిప్పింగ్ను కూడా అందజేశారు. ఆ విషయమై విచారించామని సుమారుగా రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని నిర్ధారించినట్లు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులను వాటికి సంబంధించిన లీజు ప్రక్రియ ఆధారాలు అడిగినా సరైన సమాధానం చెప్పలేదన్నారు. ఈ భూమిని అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడుకి తాత్కాలిక లీజుకు ఇచ్చినట్లు తెలిపిందన్నారు. రోడ్డు మార్జిన్లో తాత్కాలికంగా పందిళ్లు, చలువ పందిళ్లు, రేకుల గుడారాలు వేసుకునేందుకు టౌన్ ప్లానింగ్ వారు ఒక వారానికి పరిమితంగా 10 చదరపు మీటర్లకు రూ.100 లు చొప్పున రుసుము వసూలు చేయటానికి సంబంధించిన సాధారణ అనుమతి మాత్రమే ఇచ్చారన్నారు. సర్వే నం.77, బ్లాకు నం.4, వార్డు నం.3లో 83 సెంట్ల స్థలంలో సంవత్సరం లీజుకు తాత్కాలిక అనుమతులు ఇస్తే దాదాపు రూ.25 లక్షలకు పైగా వెచ్చించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని ఇన్చార్జ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి తీర్మానం చేయకుండానే టీడీపీ నాయకులకు మేలు చేసేలా అధికారులు తెగబడ్డారన్నారు. సాధారణ ఓపెన్ ఆక్షన్, టెండర్ జరిపితే దాదాపుగా ఈ స్థలానికి రూ.5 లక్షలు ప్రతినెలా అద్దె లీజు రూపంలో నగరపాలక సంస్థకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. కానీ కేవలం రూ.33,600 ఒక సంవత్సరం పాటు లీజుకు ఇవ్వటం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఈ స్థలాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కమర్షియల్ కాంప్లెక్సుగా మార్చి అభివృద్ధి చేయాలని యత్నించి డిజైన్ల కోసం సీబీఆర్ఈ అనే సంస్థకు పంపారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రభుత్వానికి అనుమతి కోసం వెళ్లిందన్నారు. ఈ స్థలానికి సంబంధించిన తాత్కాలిక అనుమతులు తొలగించి ఒంగోలు నగరపాలక సంస్థ స్వాధీన పరచుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సీరియస్ అయ్యారు. వెంటనే దీనిపై విచారణ కోసం ఒంగోలు తహశీల్దార్, నగర కమిషనర్, మున్సిపల్ సర్వేయర్తో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. మంగళవారం సాయంత్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సాధారణ లీజు పొంది శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న అధికార పార్టీ నాయకులు వారితో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు కుమ్మక్కు మీ కోసంలో ఇన్చార్జ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అన్యాక్రాంతంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటురూ.కోట్ల విలువైన ఆస్తులు కబ్జాలకు ఆస్కారం ఒంగోలు నగరంలోని రూ.కోట్ల విలువైన ఆస్తులను టీడీపీ కూటమి ప్రభుత్వం కబ్జాలకు ఆస్కారం ఇస్తోందని వైఎస్సార్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలోని పాత కూరగాయల మార్కెట్ స్థలం కబ్జాకు గురైందని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్కు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ఇలాంటి వాటిని ప్రోత్సహించదన్నారు. ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం కావటాన్ని సహించేది లేదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు. -
ప్రకాశం
37 /297గరిష్టం/కనిష్టంగ్రావెల్ తవ్వకాల్లో బరితెగింపు బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలోని కొండను తవ్వి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు. 2 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు. అరకొర నిధులు..పనులు సాగర్ కాలువల మరమ్మతుల విషయంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అరకొర నిధులివ్వడంతో కాలువల మరమ్మతు పనులు కూడా అరకొరగానే చేశారు. – వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు.మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025– 8లో.. -
బడిలో అవినీతి బాగోతం
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్ నిర్వహణ, మధ్యాహ్న భోజనం నిర్వహణలో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలైంది. పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుతీరుపై పరిశీలించేందుకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ రాగా అక్కడ జరుగుతున్న అక్రమాలు బయటకు వచ్చాయి. రికార్డులు పరిశీలించగా రిజిస్టరులో నమోదు చేసిన బియ్యానికి, వంట మనుషుల వద్ద ఉన్న బియ్యానికి తేడా రావడంతో హెచ్ఎం శ్రీదేవిని ప్రశ్నించారు. దీంతో ఆమె హడావుడిగా రిజిస్టర్లను దిద్దటానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాను పిలిపించి జరుగుతున్న అక్రమాలను వెల్లడించారు. పాఠశాలలో సుమారు 802 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమైన సుమారు 120 కిలోల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 70 కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కోడిగుడ్లు కూడా సక్రమంగా అందించకుండా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారన్నారు. విద్యార్థులకు అవసరమైన మంచినీటి కోసం పాఠశాలలో ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేశారు. అయితే గతేడాది ప్రభుత్వం నిర్వహణ నిమిత్తం లక్ష రూపాయలు మంజూరు చేయగా కేవలం రూ.10 వేలు ఖర్చుపెట్టి రూ.90 వేలు తన సొంతానికి వాడుకున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన మెనూ రికార్డులను తనముందే తారుమారు చేస్తున్నట్లు గుర్తించారన్నారు. రికార్డులకు సంబంధించిన రిజిస్టరును విలేకరుల ఎదుట చూపారు. పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి వారికి కావాల్సిన టీసీలు, మార్కు లిస్టులు తదితరాలు ఇచ్చేందుకు రూ.500 వసూలు చేస్తున్నారని తెలిపారు. హెచ్ఎం శ్రీదేవిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్, సబ్కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు. సబ్కలెక్టర్ విచారణ: జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన్ ఆరోపణలపై మార్కాపురం సబ్కలెక్టర్ త్రివినాగ్, తహశీల్దార్ చిరంజీవి పాఠశాలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తహశీల్దార్ తెలిపారు. బట్టబయలు చేసిన పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఆర్ఓ ప్లాంటు మరమ్మతుల పేరుతో రూ.90 వేలు స్వాహా బియ్యం పంపిణీలో చేతివాటం అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థినులు సబ్కలెక్టర్ విచారణ -
‘గ్రామ సమాఖ్య’ స్ఫూర్తికి విఘాతం
బేస్తవారిపేట: టీడీపీ నాయకుల ఒత్తిడితో అక్రమంగా వీఓఏలను తొలగించిన అధికారులు తాజాగా గ్రామ సమాఖ్య కమిటీలను ఇష్టారీతిగా మార్చడం చర్చనీయాంశమైంది. రూల్స్ పుస్తకాల్లో ఉంటాయి.. కానీ తమకు వర్తించవు, తాము పాటించము అన్నట్లు ఉంది వెలుగు కార్యాలయ సీసీలు వ్యవహార శైలి. వివరాల్లోకి వెళ్తే.. బేస్తవారిపేట మండలంలోని వంగపాడు, ఖాజీపురం, ఎంపీ చెరువు గ్రామ సమాఖ్య కమిటీలను గుట్టుచప్పుడు కాకుండా తొలగించి కొత్త కమిటీలను తెరపైకి తీసుకొచ్చారు. సాధారణంగా ఒక్కో గ్రామ సమాఖ్య కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఏపీ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం బైలా నిబంధనల ప్రకారం సభ్యుల తొలగింపునకు 30 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి గ్రామ సమాఖ్య సమావేశం నిర్వహించాలి. ఏటా 3తో భాగించబడే పాలకవర్గ సభ్యులు పదవీ విరమణ చేయగా.. కొత్తవారిని నియమించడం లేదంటే వారినే ఎన్నుకోవాలన్నది నిబంధన. ఎప్పటికీ ఐదుగురు సభ్యులను ఒకేసారి తొలగించకూడదనే నిబంధన సైతం బైలాలో పొందుపరిచారు. కొత్తగా ఇద్దరిని మాత్రమే గ్రామ సమాఖ్య కమిటీలోకి తీసుకోవాలని బైలాలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ పాత కమిటీ సభ్యులకు తెలియకుండానే వెలుగు సీసీలు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఐదుగురు సభ్యులను కొత్తవారిని ఎన్నుకున్నట్లు సీసీ సంబంధిత బ్యాంకు మేనేజర్కు లెటర్ ఇవ్వడంతో బ్యాంకులో నూతన కమిటీ సభ్యులతో బ్యాంక్ ఖాతా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో గ్రామ సమాఖ్యలో ఉన్న నగదు విత్డ్రా చేశారు. ఆ డబ్బు ఏమైందో తెలియడం లేదని పాత కమిటీ సభ్యులు వాపోతున్నారు. గ్రామ సమాఖ్య కమిటీ సభ్యుల అడ్డగోలు తొలగింపుపై వంగపాడు గ్రామానికి చెందిన పాత కమిటీ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బైలాను తుంగలో తొక్కి ఇష్టారీతిగా కమిటీల మార్పు సమాఖ్య నిధుల దోపిడీకి స్కెచ్ -
రాజీకీయాలు!
కబ్జా తమ్ముళ్లు ..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు ఎడాపెడా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అది ప్రభుత్వ, ప్రైవేటు భూమా అన్న తేడా లేకుండా భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఈ బెడద ఎక్కువగా ఉంది. ఏడాది కాలంలోనే ఒంగోలు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఐదు భూ వివాదాలను పరిష్కరించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల నగరంలో జరిగిన ఒక భూ వివాదానికి సంబంధించిన పరిష్కారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన కీలక నేత నేరుగా రంగంలోకి దిగి పంచాయితీలు చేస్తుండడంతో కింది స్థాయి నాయకులు సైతం బరితెగిస్తున్నారు. పచ్చ గద్దల భూ మాయాజాలాన్ని చూసి నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. శివారు భూ వివాదంలో.. నగర శివారులోని ఓ భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు సమాచారం. టీడీపీ కీలక నేత సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. దీంతో ఆస్థలం కొనుగోలు చేసిన వ్యక్తి సదరు నేతకు ఎకరం భూమి గిఫ్ట్గా ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కేసులో కొంత మంది పోలీసు అధికారులకు సైతం పెద్ద ఎత్తున తాయిలాలు అందినట్టు సమాచారం. ఉర్దూ స్కూలును పడగొట్టి: పాత మార్కెట్ సమీపంలోనే ఉర్దూ స్కూలును 1938లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదేళ్లుగా ఈ స్కూలు శిథిలావస్థకు చేరుకుంది. దీని విస్తీర్ణం 23 సెంట్లు కాగా ఇక్కడ గది రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంది. రూ.35 కోట్లకు పైగా విలువ చేసే ఉర్దూ స్కూలు భూమి మీద కన్నేసిన పచ్చదండు ఎలాగైనా సరే కబ్జా చేసేందుకు పావులు కదిపారు. ఉర్దూ స్కూలును నేలమట్టం చేసేందుకు మే 2వ తేదీ జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. జూలై 1వ తేదీ గుట్టుచప్పుడు కాకుండా ఉర్దూ స్కూలును నేలమట్టం చేశారు. ఇక్కడ టీడీపీకి చెందిన ఒక వ్యాపారవేత్త పెట్రోలు బంకు ఏర్పాటుకు యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లీజు పేరుతో తక్కువ ధరకే ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ కీలక నేతకు భారీగా ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ముక్తినూతలపాడు భూ కబ్జాకు ప్రయత్నం... నగర శివారులోని ముక్తినూతలపాడు పంచాయతీ సర్వే నంబర్ 15లో 21.60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కీలక నేత అనుచరులు ప్రయత్నించడం వివాదంగా మారింది. ఈ భూమిలో 5.60 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించారు. మార్కెట్లో దీని విలువ ఎకరం రూ.6 కోట్లు పైగానే ఉంది. 5.60 ఎకరాలు అంటే స్థలం విలువ సుమారు రూ.36 కోట్లు పైమాటే. కీలక నేత అండదండలతో ఒంగోలు కమ్మపాలేనికి చెందిన ఒక టీడీపీ నాయకుడు, ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు కలిసి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి రికార్డుల్లో కుంట భూమిగా నమోదై ఉంది. దీనిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి స్థలాల కింద పంపిణీ చేయాలని జాన్ ప్రభాకర్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. కబ్జాకు గురైన స్థలాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నాయకులు ఈ భూమిని కాపాడాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలోని దత్తాత్రేయ కాలనీ ఎదురుగా ఉన్న 1.36 ఎకరాల అసైన్మెంట్ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసి అమ్మకాలు చేపట్టడం విమర్శల పాలైంది. ఈ భూమి విలువ సుమారుగా రూ.5 కోట్లకు పైగానే ఉంది. దీనిలో ప్లాట్లు వేసి పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టడం పచ్చదండు బరితెగింపునకు నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. కేశవరాజు కుంట వద్ద సర్వే నంబర్ 81లోని ప్రభుత్వ స్థలాన్ని సైతం పచ్చ మాఫియా కబ్జా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.రూ.వంద కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను... నగరం నడిబొడ్డున పాత కూరగాయల మార్కెట్ వద్ద 83 సెంట్ల ప్రభుత్వ స్థలంపై టీడీపీ యువనేత ఒకరు కన్నేశారు. 15 సెంట్ల స్థలానికి నగర పాలక సంస్థ నుంచి తాత్కాలిక ఒప్పందం మీద అనుమతులు తీసుకున్నారు. నగర పాలక సంస్థ ఇచ్చిన అనుమతుల ప్రకారం ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు నిర్మించడానికి వీలులేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ రెస్టారెంట్ ఏర్పాటుకు భారీ స్థాయిలో కట్టడాలు చేస్తున్నారు. ఇక్కడ గది రూ.25 లక్షల వరకు ఉంది. ఆ లెక్కన చూస్తే ఈ భూమి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇంత ఖరీదైన స్థలాన్ని దొడ్డిదారిన కాజేయడానికి పక్కా ప్రణాళికతోనే నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
ఊరూరా ఎల్లో బెల్ట్
జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు171గీత కార్మికులకు కేటాయించినవిసోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025– 8లో.. ఎల్లో ‘బెల్ట్’..పచ్చని పల్లెలకు ఉరితాడుగా మారుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చపార్టీ నేతలు లైసెన్సు షాపులకు అదనంగా పది నుంచి 15 బెల్టుషాపులు పెట్టి యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. బెల్టు షాపుల వద్దే సిట్టింగ్లు ఏర్పాటు చేసి పగలు, రాత్రి తేడా లేకుండా మందుపోస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా ఆటోల్లో, బైక్ మీద వీధివీధినా తిరుగుతూ మద్యం అమ్ముతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎకై ్సజ్ అధికారులు వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మొక్కుబడి దాడులు.. నామమాత్రపు హెచ్చరికలతో సరిపెడుతున్నారు. దీంతో బెల్టుషాపుల దందాకు అంతులేకుండా పోతోంది. -
మద్యం విక్రయ కేంద్రాలుగా మారిన దాబా హోటళ్లు...
రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దాబా హోటళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎటు చూసినా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన అనేక దాబా హోటళ్లు వెలిశాయి. రాత్రయితే చాలు దాబా హోటళ్లు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ వారు తాగి తందనాలాడటానికి సిటింగ్ ఏర్పాటు ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. దీంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో వెంగముక్కలపాలేనికి వెళ్లే దారిలో ఉన్న ఒక దాబాలో అర్ధరాత్రి జరిగిన గొడవ రణరంగాన్ని తలపించింది. బిల్లు చెల్లించే విషయంలో హోటల్ నిర్వాహకులు, కస్టమర్లకు మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు చితక్కొట్టుకున్నారు. దాబా హోటళ్లు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో మద్యం తాగే ఏర్పాటు చేయడం, అర్ధరాత్రి వరకు హోటళ్లు నిర్వహించడం, మద్యం తాగే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం, మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం లాంటివి జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, నెలవారీ మాముళ్లు తీసుకుంటూ వీటిని పోలీసులు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ మద్దతు ఉండడంతో దాబా నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. -
మానుకోకుంటే ఖబడ్దార్
మహిళలపై దాడులు ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంటి నుంచి బయటకు రావాలంటే మహిళలు భయపడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం, జనసేన గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక బీసీ మహిళా నాయకురాలు, జిల్లాకే ప్రథమ పౌరురాలి మీద దాడి చేయడం, ఆమె కారు అద్దాలను పగులగొట్టి, రాళ్లతో దాడులు చేసి ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. హారికను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా హతమార్చేందుకే ఈ దాడి జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. గుడివాడలో జరిగిన దాడి దృశ్యాలను టీవీల్లో చూసిన రాష్ట్ర ప్రజలు, మహిళలు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోవడం సిగ్గుచేటన్నారు. హారిక మీద దాడిని హోంమంత్రి ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. మహిళల మీద దాడులు చేయడమేనా మంచి ప్రభుత్వమంటే అని చురకలంటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే జెడ్పీ చైర్ పర్సన్ల గన్మెన్లను తొలగించారని, వారిని కొనసాగించి ఉంటే నేడు ఈ దాడి జరిగేదే కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి జనంలోకి వస్తుంటే మీకెందుకింత భయం అని నిలదీశారు. జగన్ పర్యటనలకు వేలాదిగా జనం తరలిరావడాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం వణికిపోతుందని ఎద్దేవా చేశారు. రేపు తాము అధికారంలోకి వస్తామని, ఈ రోజు గుండాయిజం చేసిన వాళ్లకు తగిన పాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, మీ ధోరణి మార్చుకోకుంటే ఇంతకింత అనుభవిస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ సమావేశాలకు హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హారిక మీద టీడీపీ గూండాలు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మహిళలను ఏదైనా మాట అంటే ఊరుకోనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ గాయం సావిత్రి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి రవణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ అఫ్సర్, వాలంటీర్ విభాగం రాష్ట్ర కార్యదర్శి గోనెల మేరీ కుమారి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, నియోజకవర్గ అంగన్వాడీ అధ్యక్షురాలు వడ్లమూడి వాణి, సిటీ మహిళా అధ్యక్షురాలు బత్తుల ప్రమీల, మద్దలూరు సర్పంచ్ కె.రమణ, నాగమణి, నాగలక్ష్మి, బి.శైలజ, కె.లక్ష్మి పాల్గొన్నారు. మహిళలపై దాడులు చేయడమేనా మంచి ప్రభుత్వమంటే జెడ్పీ చైర్పర్సన్కే రక్షణ లేకుంటే ఇక సామాన్య మహిళల పరిస్థితేంటి ఇదే ధోరణి కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -
దేవుడి పేరుతో వేలంపాటలు..
జిల్లాలో అనేక గ్రామాల్లో దేవుడి పేరుతో బెల్టు షాపులను వేలం పాటలు వేస్తారు. గిద్దలూరు నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో వేలంపాట పెట్టుకొని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. బేస్తవారిపేట మండలంలోని పెద్ద ఓబినేనిపల్లె, చిన ఓబినేనిపల్లె, జేసీ అగ్రహారం, ఎంపీ చెరువు, బసినేపల్లి, గంటాపురం, కొత్తపేట, పీవీపురం, గలిజేరుగుళ్ల, పూసలపాడు గ్రామాల్లో దేవుడి పేరుతో వేలం పాటలు వేసి బెల్టు షాపులు దక్కించుకున్నారు. ఒక్కో గ్రామానికి అక్కడి జనసాంద్రత, ఆర్థిక స్థితిగతులను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వేలం పాడుకున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో రూ.2.5 లక్షలకు వేలం పాడినట్లు సమాచారం. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం తుమ్మల చెరువులో పీర్ల పండుగ సందర్భంగా వేలం పాట నిర్వహించారు. కేవలం మూడు రోజులకు గాను రూ.3 లక్షలకు పాట పాడినట్లు ప్రచారం జరుగుతోంది. సింగరాయకొండ మండలంలోని మత్స్యకార గ్రామాల్లో కూడా వేలం పాటలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో వేలం వేసి వచ్చిన సొమ్ముతో గ్రామాభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక్కడ రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు వేలం పాట వేసినట్లు తెలుస్తోంది. వేలం పాటలో బెల్టు షాపులు దక్కించుకున్న వారు మాత్రమే ఇక్కడ మద్యం విక్రయించాలి. బాటిల్ మీద రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసే అధికారం కూడా నిర్వాహకుడికి ఉంటుంది. -
నేడు ఆక్రమించుకుని..!
నాడు పట్టాల పంపిణీ.. పీసీ పల్లి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయగా, నేడు కూటమి ప్రభుత్వంలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆయా భూములను ఆక్రమించుకుని ఏకంగా దున్నేస్తున్నారు. పీసీ పల్లి మండల పరిధిలోని మురుగమ్మి గ్రామ పంచాయతీలో శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటన అధికార పార్టీ నేతల అరాచకాలకు అద్దం పడుతోంది. గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 333/6లో మొత్తం రెండెకరాలు ప్రభుత్వ భూమి ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. సుమారు 46 మంది పేదలకు పట్టాలు అందజేశారు. అయితే, ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతూ పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కూడా వదలకుండా కాజేస్తున్నారు. అందులో భాగంగానే శని, ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు చూసుకుని ఓ టీడీపీ నాయకుడు మురుగమ్మి గ్రామంలో పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చిన భూమిని దర్జాగా కబ్జా చేశాడు. శనివారం సంబంధిత భూమిని ఏకంగా దున్నేశాడు. పంటలు సాగుచేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మురుగమ్మి గ్రామంలోని ఓ టీడీపీ నాయకుడు సచివాలయ శిలాఫలకాన్ని పగలగొట్టాడు. మరికొంత మంది నాయకులు అందినకాడికి దోచుకుందామంటూ అటవీ, పోరంబోకు, రెవెన్యూ భూములపై పడి రాత్రికిరాత్రి లారీలకు లారీల తెల్లరాయిని తరలిస్తున్నారు. వీటన్నింటినీ మరవకముందే తాజాగా పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసిన భూములను ఆక్రమించుకోవడంతో టీడీపీ నేతల దౌర్జన్యాలపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలకు 3 లక్షల మంది దూరం
చీమకుర్తి: కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పోయిందని, ఫలితంగా ఈ ఏడాది 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. చీమకుర్తిలో శనివారం నిర్వహించిన యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ మండల విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఆదేశాలను విద్యారంగంపై రుద్దుతోందన్నారు. రెండేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను అప్పటి ప్రభుత్వం హైస్కూళ్లకు పంపించిందని, వారికోసం పదోన్నతుల పేరుతో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా నియమించిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం హైస్కూళ్లలో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపించిందన్నారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ హైస్కూళ్లలో ఇటీవల పదోన్నతులు పొందిన స్కూలు అసిస్టెంట్లను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపించిందని తెలిపారు. అంతేతప్ప కూటమి ప్రభుత్వం విద్యారంగంలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఏమీ లేవన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారన్నారు. అమ్మ ఒడి, నాడు–నేడు ఆధునికీకరణతో కోవిడ్ సమయంలో ప్రైవేటు పాఠశాలల నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చారన్నారు. నేడు తల్లికి వందనం వలన విద్యార్థుల హాజరు శాతం పెరగకపోగా, పలు రకాల యాప్ల భారం కారణంగా ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి పెరిగి విద్యార్థులు నాణ్యమైన బోధనకు దూరమవుతున్నారన్నారు. దానివలన విద్యార్థుల తల్లిదండ్రులలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలు, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, 11వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉపాధ్యాయుల జీతాల సమస్యలు రాకుండా పొజిషన్ ఐడీలు, క్యాడర్ స్ట్రెంగ్త్లను వెంటనే తెప్పించాలన్నారు. తొలుత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో యూటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న పాత్రను అభినందించారు. తొలుత యూటీఎఫ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ హైస్కూళ్లలో పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరించారు. ఇటీవల జరిగిన పదోన్నతులు, బదిలీలపై వెళ్లిన వారిని యూటీఎఫ్ మండల శాఖ తరఫున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు డాక్టర్ బీ జవహర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్హై, డీ వీరాంజనేయులు, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.రవి, జిల్లా కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే అక్బర్, చలువాది శ్రీనివాసరావు, యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ స్థానిక నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ ఏడాది తగ్గిన విద్యార్థుల అడ్మిషన్లు ఉపాధ్యాయులపై యాప్ల భారం.. విద్యార్థులకు బోధన దూరం తల్లిదండ్రుల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిన కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అనుసరిస్తున్న పాలకులు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ ధ్వజం -
దళితులకు రక్షణ కరువు
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, దళితులకు రక్షణ లేకుండా పోయిందని కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై దాడులు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. నేరస్తులకే అండగా నిలుస్తోందని విమర్శించారు. దళితులపై జరుగుతున్న అమానవీయ దాడులపై నిర్వహించాల్సిన మానిటరింగ్ కమిటీ సమావేశాలను సక్రమంగా జరపకపోవడం విచారకరమన్నారు. అసలు మానిటరింగ్ కమిటీనే ఏర్పాటు చేయకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎస్సీ చైర్మన్గా మూడు నెలల క్రితం నియమితులైన జవహర్ చైర్మన్ హోదాలో ఇప్పటి వరకు దళితులపై దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శించకపోవడం దారుణమన్నారు. ఏడాది కాలంగా దళితులపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఎస్సీలకు ఉచిత విద్యుత్ను నీరుగారుస్తున్న కూటమి... కూటమి అధికారంలోకి వచ్చాక దళితులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఎస్సీలకు అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. బాబూ జగ్జీవన్రామ్ పేరు మీద ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, దాన్ని నగరంలో అమలు చేయడం లేదని తెలిపారు. తమ బృందం జరిపిన పర్యటనలో ఒంగోలు నగరంలోని మామిడిపాలెం, గద్దలగుంటలో వినియోగదారుల నుంచి విద్యుత్ ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. పెంచిన ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో ఎస్సీలకు ఎలాంటి షరతులు లేకుండా సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్మీటర్లను పగులగొట్టమంటూ పిలుపునిచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతాంగానికి వాడే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద గ్రౌండ్ చేసిన 7 లక్షల మంది లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని మాల్యాద్రి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం, జిల్లా నాయకులు అట్లూరి రాఘవులు, వి.మోజెస్ పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శ -
షాక్..!
● దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంలో ఊహించని పరిణామం ● నాలుగు నెలల క్రితమే టీడీపీకి చెందిన నాగవేణిని ప్రకటించిన ఆ పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి ● బీజేపీకి చెందిన నారాయణమ్మను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ● పేరు మార్పిస్తామని, చైర్మన్ పదవి మాదేనని అంటున్న టీడీపీ నాయకులు ● నోరు మెదపని లక్ష్మి ● మా సంగతి ఏంటంటూ మదనపడుతున్న జనసేన నేతలునాగవేణికి నారాయణమ్మఇష్టారాజ్యంగా రిజర్వేషన్ల ఉల్లంఘనలు... ● మండిపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకంలో కూటమి పాలకులు ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు ఉల్లంఘించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ జీవో నంబర్ 77 విడుదల చేశారు. ఇప్పుడు కూడా దాని ప్రకారమే ఏఎంసీ చైర్మన్లను నియమించాలని కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులిచ్చిన కూటమి పాలకులు.. ఆచరణలో మాత్రం ఎక్కడా పాటించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది పాటు రిజర్వేషన్లను సడలిస్తున్నట్లు ఎక్కడికక్కడ జీవోలు విడుదల చేసి రిజర్వేషన్లకు తూట్లు పొడిచినట్లు సమాచారం. తద్వారా తమకు ఇష్టమొచ్చిన నాయకులు, తమను సంతృప్తిపరిచిన నాయకులు, గత ఎన్నికల్లో తమ కోసం భారీగా ఖర్చు చేసిన వారికి ఏఎంసీ చైర్మన్ పదవులు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. చైర్మన్ల నియామకాలకు సంబంధించిన రిజర్వేషన్లపై జీవో నంబర్ 77ను ఇటీవల కలెక్టర్ విడుదల చేశారు. దాని ప్రకారం యర్రగొండపాలెం ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయింది. కానీ, కూటమి పాలకులు టీడీపీ సామాజికవర్గానికి చెందిన చేకూరి సుబ్బారావు పేరు ప్రకటించారు. అలాగే, పొదిలి చైర్మన్ పదవిని బీసీ మహిళ (మైనారిటీ)కు రిజర్వ్ చేశారు. కానీ, ఇక్కడ బీసీ జనరల్కు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనిగిరిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కనిగిరికి ఎస్సీ మహిళను రిజర్వ్ చేయగా, పామూరు మండలానికి చెందిన యారవ శ్రీనివాసులచౌదరిని తొలుత చైర్మన్గా ప్రకటించారు. ఆ తర్వాత అతని సతీమణి పేరును ప్రకటించారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ స్థానంలో ఓసీని ఎలా నియమిస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లు మార్చడం రాజ్యాంగ విరుద్ధమని, జీవో నంబర్ 77ను రద్దు చేయాలనుకుంటే కేబినేట్లో నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. రిజర్వేషన్లకు భిన్నంగా ఏఎంసీ చైర్మన్ల నియామకాలపై ఎస్సీ, ఎస్టీలు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవి నియామకంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ పదవికి టీడీపీ నాయకుడు దారం సుబ్బారావు సతీమణి, దర్శి మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ అయిన దారం నాగవేణిని ఎంపిక చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి నాలుగు నెలల క్రితమే ప్రకటించారు. దీంతో దారం సుబ్బారావు, నాగవేణి దంపతులు మార్కెట్ చైర్మన్ పేరుతో అనేక కార్యక్రమాలకు ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. ఏఎంసీ చైర్మన్ పదవి దక్కుతుందనే ఉత్సాహంతో టీడీపీ కార్యక్రమాలకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకుడు, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసరావు సతీమణి నారాయణమ్మను దర్శి ఏఎంసీ చైర్మన్గా నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా విడుదల చేసిన జాబితాలో దర్శి ఏఎంసీ చైర్మన్గా బీజేపీకి చెందిన నారాయణమ్మ పేరు ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ శ్రేణులు, నాగవేణి వర్గీయులు షాక్కు గురయ్యారు. గొట్టిపాటి లక్ష్మీపై తీవ్ర అసంతృప్తి... దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిని తొలుత ఎస్సీ సామాజికవర్గానికి కేటాయించారు. గొట్టిపాటి లక్ష్మి చక్రం తిప్పి దానిని ఓసీగా మార్పించి కాపు సామాజికవర్గానికి చెందిన దారం నాగవేణిని ప్రకటించారు. అప్పటి నుంచి ఎస్సీ సామాజికవర్గం వారు తమకు వచ్చిన అవకాశాన్ని తమకు దక్కకుండా చేసిన గొట్టిపాటి లక్ష్మిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన ఎస్సీలంతా రగిలిపోతున్నారు. కానీ, చివరకు బీజేపీకి చెందిన బీసీ సామాజికవర్గ మహిళ మాడపాకుల నారాయణమ్మ పేరును ప్రభుత్వం ఫైనల్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి రెండు రోజులుగా నోరు మెదపకపోవడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ప్రెస్మీట్ పెట్టి బీజేపీకి ఏఎంసీ చైర్మన్ పదవి కేటాయించినందుకు గొట్టిపాటి లక్ష్మికి ధన్యవాదాలు తెలపడంతో లక్ష్మిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. దీనిపై ఆమె స్పందించకపోవడం, పేరు మార్పు ప్రచారం గురించి స్పష్టత ఇవ్వకపోవడంతో బీజేపీ వారికే బలం చేకూరినట్లయింది. నాలుగు నెలల క్రితమే తమ పేరు ప్రకటించినప్పటికీ పదవి దక్కకపోవడంపై టీడీపీ నాయకులు, దారం వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. జనసేన నాయకుల నైరాశ్యం... ఇదిలా ఉండగా, దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని ఉన్న జనసేన నాయకులు నైరాశ్యానికి గురయ్యారు. బీజేపీ కంటే ఎక్కువ శాతం ఓట్లు జనసేనకు ఉన్నాయని, తమ మద్దతుతోనే టీడీపీకి బలం చేకూరుతుందని, కానీ, తమకెందుకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వకూడదని జనసేన పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేనకు ఇన్చార్జ్గా ఉన్న నేతలెవరూ ఇక్కడకు రాకపోవడం, తమ పార్టీ వారికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అడగకపోవడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి నియామకంతో నియోజకవర్గంలో రాజకీయ దుమారం లేచిందని, కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఏఎంసీ చైర్మన్ల జాబితాలో దర్శికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదం వలన పేరు పొరపాటు పడిందని, నాగవేణికే చైర్మన్ పదవి కేటాయిస్తూ మార్పులు జరగడం ఖాయమని దారం సుబ్బారావు వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒత్తిడి మేరకు బీజేపీ కోటా కింద దర్శి ఏఎంసీ పదవిని నారాయణమ్మకు కేటాయించారంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. టీడీపీ దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి కూడా తమకు సహకరించారంటూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ధన్యవాదాలు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదమని, పేరు మార్చడం ఖాయమని ప్రచారం... -
ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి
పామూరు: ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీ టైరు కిందపడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామం వద్ద 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీఎస్ పురం మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మేకల అంజమ్మ (49) ఇసుక ట్రాక్టర్ పనికి వెళ్లింది. మండలంలోని తిరగలదిన్నెవద్ద నుంచి గోపాలపురంకు ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్.. తిరగలదిన్నె వద్ద 565వ నంబర్ జాతీయ రహదారిపైకి ఎక్కే సమయంలో అదుపుతప్పింది. జాతీయ రహదారి దిగి గుంతల్లోకి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర కుదుపులకు గురైంది. ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజిన్పై డ్రైవర్ వెనుకవైపు ఉన్న చెక్కపై కూర్చున్న మేకల అంజమ్మ కిందపడగా ట్రాక్టర్ ట్రాలీ టైరు ఆమైపెగా వెళ్లింది. ఈ ప్రమాదంలో అంజమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతుని బంధువు వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.కిషోర్బాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతురాలికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పనికి వెళ్లిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతురాలి కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అధిక వేగమే ప్రమాదానికి కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ముంచే ప్రభుత్వం
మంచి ప్రభుత్వం కాదురీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీపై క్యూఆర్ కోడ్ను ఆవిష్కరిస్తున్న ఆర్కే రోజా, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సతీష్రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, తూమాటి మాధవరావు తదితరులుకొండపి: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ప్రభుత్వం లేదని, ప్రజలను ముంచే ప్రభుత్వం మాత్రమే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కొండపిలో శుక్రవారం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన రోజా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పే ధైర్యం కూటమి నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. రెడ్బుక్ రాజ్యాంగం అంటూ ఎగిరి పడితే రాబోవు రోజుల్లో ప్రజలు ఎగరేసి తంతారని విమర్శించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ తోడు దొంగల్లాగా తయారై రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా అవేమీ తమకు పట్టవంటూ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నించడానికి పార్టీ స్థాపించానని బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ నేడు పవర్ లేని స్టార్ గా మిగిలిపోయాడని విమర్శించారు.విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ని చూసి నేర్చుకోవాలని.. ఏ విధంగా ఉండకూడదో నారా లోకేష్ని చూస్తే తెలిసిపోతుందన్నారు. యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా టార్గెట్ జగన్ అన్నారు. జగనన్న పై కేసులు బనాయించి భూస్థాపితం చేస్తామనడం కూటమి నాయకుల కుట్రలకు అద్దం పడుతోందన్నారు. ఏడాది తర్వాత తల్లికి వందనం పథకాన్ని అరకొరగా అమలు చేసి ప్రజలకు ఏదో వెలగబెట్టినట్లు ఆ పథకం తన కుమారుడు లోకేష్ కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కల్తీ మద్యం తయారుచేసి వారి బతుకులతో ఆడుకుంటున్నారన్నారు. ఈరోజు మద్యం సీసాలకు పవర్ స్టార్ పేరు పెట్టడం వలన పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారన్నారు. చంద్రబాబు మూడు మాటలు మాట్లాడితే వాటిలో రెండు అబద్ధాలు..ఒకటి సొల్లు అని విమర్శించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని చెప్పిన చంద్రబాబు నేడు ఉచిత బస్సును జిల్లాకే పరిమితం చేయడం మరోసారి మహిళలు మోసం చేయడమేమన్నారు. వేల కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారం మోపి ఆ నేరాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పై వేయటానికి చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగిరేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఆదిమూలపు సురేష్కి అండగా నిలవాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేయటం మంచి పద్ధతి కాదన్నారు. లోకేష్ రెడ్బుక్ మడిచి గూట్లో పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలన్నారు. వినేవాళ్లు వెధవలైతే చెప్పేవాడు చంద్రబాబు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగనన్న 2.0లో ఒక కన్ను ప్రజలైతే రెండవ కన్ను కార్యకర్తలేనని ఉత్సాహపరిచారు. జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట: జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీలోకి ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని, ఎవరు పార్టీ వీడి వెళ్లినా వైఎస్సార్సీపీకి వచ్చిన నష్టం లేదని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి 2029లో జిల్లాలోని అన్ని స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క: కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరవుతుంటే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు సృష్టించారన్నారు. సమావేశాన్ని ఫెయిల్యూర్ చేయాలని మంత్రి స్వామి ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలుగా మారిన పోలీసులు సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కొంతమంది నాయకుల కార్యకర్తల ఫోన్లను తీసుకొని బెదిరింపులకు గురి చేశారని, అయినా నాయకులు లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. నియోజకవర్గంలో కూటమి సృష్టించే ఆగడాలకు అదుపు లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందంటే విద్యా వ్యవస్థ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం పనితీరు ఇట్టే కనిపిస్తోందన్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరును మీకు నచ్చిన బుక్కులో రాసుకోండని దానికి తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వాటిని దీటుగా ఎదుర్కొంటామన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలపై హామీల జల్లు కురిపించిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచిందన్నారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. మిర్చి, పొగాకుతో పాటు మరి కొన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను దగా చేశాడన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మారిందన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలకు గమనిస్తున్నారని సరైన సమయంలో తప్పక బుద్ధి చెబుతానన్నారు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో డాకా పిచ్చిరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, శేషారెడ్డి, మురళి, మండవ మాలకొండయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, వేముల రమేష్, బొక్కిసం సుబ్బారావు, వసంతరావు, మణికంఠేశ్వర్ రెడ్డి, రామకృష్ణ, జెడ్పీటీసీ అరుణ వెంకటాద్రి, ఇనకొల్లు సుబ్బారెడ్డి, మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లికార్జున్ రెడ్డి, పిన్నిక శ్రీనివాసులు, బెజవాడ వెంకటేశ్వర్లు, మురళి, భువనగిరి సత్యనారాయణ, ఆరు మండలాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీలో వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంస్థ అండగా ఉండాలి
ఒంగోలు వన్టౌన్: రైతులకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జీవనోపాధులు పెంపొందించడంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అండగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డైరక్టర్ టీ నారాయణ సూచించారు. ఒంగోలు భాగ్యనగర్లోని టీటీడీసీలో జిల్లాలోని 12 మండలాల ఎఫ్పీఓ–కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, ఫార్మర్ మిత్రాలు, ఎఫ్పీఓ అకౌంటెంట్లతో శుక్రవారం పీడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు, మునగ సాగు, వెదురు సాగు, తేనెటీగల పెంపకం, కొర్రమీను చేప పెంపకం తదితర సబ్ సెక్టార్లకు 50 శాతం సబ్సిడీని చిన్న, సన్న కారు రైతులకు అందజేయాలని పీడీ తెలిపారు. షేడ్ నెట్ కల్టివేషన్, సోలార్ డ్రైయర్ ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్, ఉద్యాన వన శాఖ అధికారి డీ సంధ్యారాణి, డీ ఝాన్సీరాణి, జేపీఈ ఏపీసీఎన్ఎఫ్ లక్ష్మీరెడ్డి, అడిషనల్ పీడీ డి.దానం, జీవనోపాధుల డీపీఎం జే నారాయణ, లైవ్లీ హుడ్ యూనిట్ జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి
● ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, ప్రాజెక్టు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్హెచ్ 565, ఎన్హెచ్ 216, ఎన్హెచ్ 544, ఎన్హెచ్ 167బి, ఎన్హెచ్ 765, ఎన్హెచ్ 544జి, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్, తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పురోగతిపై అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ల్యాండ్ క్లెయిమ్స్, పెండింగ్ క్లెయిమ్స్ను పూర్తి చేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అవార్డులను పాస్ చేయాలన్నారు. రెవెన్యూ సంబంధిత ప్రాజెక్టుల అధికారులతో సమన్వయం చేసుకుని భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. -
పేద కుటుంబాన్ని దత్తత తీసుకున్న ఇన్చార్జి కలెక్టర్
మద్దిపాడు: మండలంలోని మల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్న శింగమనేని మరియమ్మ కుటుంబాన్ని ఇన్చార్జి కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ శుక్రవారం దత్తత తీసుకున్నారు. మరియమ్మ భర్త చనిపోగా ఆమె తన కుమార్తె, కుమారునితో కలిసి తల్లి వద్దనే ఉంటూ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకోవడానికి ఇన్చార్జి కలెక్టర్ ముందుకు వచ్చారు. మరియమ్మ కుమార్తె ఇంటర్ చదువుతుండగా, అబ్బాయి 9వ తరగతి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. కుమార్తెను ఏదైనా ఒకేషనల్ కోర్సులో చేర్పించి ఉద్యోగం వచ్చేలా తాను చూసుకుంటానని గోపాలకృష్ణ హామీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇప్పిస్తానని, దానికి అదనంగా అవసరమైతే తాను డబ్బుఖర్చు చేస్తానని తెలిపారు. ఇన్చార్జి కలెక్టర్ మరియమ్మ ఇంటికి వెళ్లే క్రమంలో ఆ కుటుంబానికి కావలసిన రేషన్, కూరగాయలు, ఇతర వస్తువులు తాను స్వయంగా కొనుగోలు చేసి అందించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, గ్రామ సర్పంచ్ నారా సుబ్బారెడ్డి, ఎంపీడీఓ వి జ్యోతి సచివాలయ సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. నగరంలో మెడికల్ షాపుల తనిఖీలు ఒంగోలు టౌన్: ఔషధ నియంత్రణ అధికారులు నగరంలో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు, బాపట్ల, మార్కాపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ల బృందం జీజీహెచ్, సుందరయ్య భవన్ రోడ్డు, కొత్తపట్నం సెంటర్, 60 అడుగుల రోడ్డు పరిసరాల్లోని 9 మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని నిబంధనల ప్రకారం ఫార్మాసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులను నిర్వహించడం, బిల్లులను ఇవ్వకుండానే ఔషధాలను విక్రయించడం వంటివి గుర్తించినట్లు అసిస్టెంట్ డైరక్టర్ జ్యోతి తెలిపారు. కొన్ని మెడికల్ షాపుల నుంచి జనరల్, జనరిక్ ఔషధాలకు సంబంధించిన శాంపిల్స్ను సేకరించినట్లు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన షాపులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి సీఎస్పురం(పామూరు): రోడ్డు ప్రమాదంతో గాయపడిన యువకుడు తిరుపతి వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై ఎం.వెంకటేశ్వరనాయక్ కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన సురేష్(32), వినోద్ గురువారం పామూరులోని బంధువుల ఇంటికి వచ్చి, రాత్రి వేళ బైక్పై ఇంటికి వెళ్తున్నారు. అయ్యలూరివారిపల్లె సమీపంలో జాతీయ హైవేపై గేదెలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సురేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఉదయగిరి వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడు వినోద్కు స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి
? కంభం: మూడేళ్ల బాలుడు పొదిలి లక్షిత్ అనుమానస్పద మృతి కేసులో తమకు న్యాయం చేయాలంటూ కంభం పోలీస్స్టేషన్ ఆవరణలో కుటుంబ సభ్యులు, లింగోజిపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కంభం మండలం లింగోజిపల్లిలో మంగళవారం ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రం నుంచి అదృశ్యమైన లక్షిత్ గ్రామానికి 3 కి.మీ దూరంలో సూరేపల్లి శివార్లలో ఉన్న పంటపొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీయగా.. అడవిలో చిక్కుకున్న బాలుడు ఆహారం, నీరు లేక మృతి చెంది ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా పోలీస్ అధికారులు చెప్పినట్లు కొన్ని మీడియా చానళ్లు, దినపత్రికల్లో(సాక్షి కాదు) వార్తలొచ్చాయి. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లలో తరలివచ్చిన మహిళలు బాలుడి మృతిపై న్యాయం జరగడం లేదని ఆగ్రహించిన మహిళలు, గ్రామస్తులు రెండు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై పోలీస్స్టేషన్కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యంలో వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాదించిన గ్రామస్తులు అక్కడి నుంచి కంభం పోలీస్స్టేషన్కు చేరుకుని బైఠాయించారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉండగా పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే తమకు న్యాయం జరుగుతుందని అనిపించడం లేదని ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బాలుడిని ఎవరు ఎత్తుకెళ్లారో, ఎందుకు చంపారో విచారించి నిందితులను శిక్షించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా బాబు తప్పిపోలేదు.. ఎవరో ఎత్తుకెళ్లారు తన కొడుకు లక్ష్మిత్ తప్పిపోలేదని ఎవరో పథకం ప్రకారం ఎత్తుకెళ్లి హత్య చేశారని తల్లి సురేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో కనిపెట్టాలని, సాధారణ మృతిగా మార్చేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘నా కొడుకు ఎలాగూ నాకు దక్కలేదు, ఇంకో తల్లికి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల’ని కోరారు. పెద్దవాళ్లే దిగి ఎక్కలేని వాగును చిన్న పిల్లాడు ఎలా దాటతాడని, కేసును తప్పు దోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే హంతకులు అక్కడ చెప్పులు పెట్టి ఉంటారని లక్షిత్ అమ్మమ్మ అనుమానం వ్యక్తం చేశారు. అంగన్వాడీ నిర్లక్ష్యంపై ఆగ్రహం అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ఐదుగురు పిల్లల్లో ఒక బాలుడు అదృశ్యమై మృతి చెందిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లవాడి మరణానికి పరోక్షంగా వారు కూడా కారకులని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిన్నారి లక్షిత్ మృతి కేసు దర్యాప్తుపై బంధువులు, గ్రామస్తుల ఆగ్రహం కంభం పోలీస్ స్టేషన్ ఎదుట లింగోజిపల్లి వాసుల ఆందోళన రెండు ట్రాక్టర్లలో వస్తున్న మహిళలకు మధ్యలోనే నచ్చజెప్పేందుకు పోలీసుల యత్నం కేసు విచారణ కాకుండానే సాధారణ మృతి అని ఎలా చెబుతారని ఆగ్రహం అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యంపై నిప్పులుచెరిగిన స్థానికులు విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న సీఐ మల్లికార్జున 45 గంటల పాటు బాలుడు ఎక్కడున్నాడన్న దానిపై పలు అనుమాలు బాలుడి కుటుంబానికి ‘అన్నా’ పరామర్శ లింగోజిపల్లిలో అంగన్వాడీ కేంద్రం నుంచి అదృశ్యమై పంట పొలాల్లో శవమై తేలిన బాలుడు పొదిలి లక్షిత్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు శుక్రవారం పరామర్శించారు. తీరని వేదనతో కుమిలిపోతున్న లక్షిత్ తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అణ్యం పుణ్యం ఎరుగని బాలుడి అనుమానాస్పద మరణం తనను కలచివేసిందని, ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. ఆయన వెంట ఎల్కోట సర్పంచ్ బాషా, ఎంపీటీసీ రావూరి రవి, జగన్, బొల్లు రాములు ఉన్నారు. 45 గంటలపాటు బాలుడు ఏమయ్యాడు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అదృశ్యమైన బాలుడు 45 గంటల తర్వాత విగతజీవిగా కనిపించాడు. లింగోజిపల్లి నుంచి సంఘటనా స్థలం ప్రాంతానికి చేరుకోవాలంటే మధ్యలో నల్లవాగు దాటాలి. ఈ నేపథ్యంలో బాలుడు ఒంటరిగా వెళ్లి ఉంటాడన్న వాదనను కొట్టిపడేస్తున్నారు. రెండో రోజు నల్లవాగు వద్ద బాలుడి చెప్పులు కనుగొన్న పోలీసులు చుట్టుపక్కల పంటపొలాలు, పరిసరాలను డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. డాగ్ స్క్వాడ్తోపాటు గ్రామస్తులు ఆ ప్రాంతంలో అడుగడుగూ తిరిగినా ఆచూకీ లభించలేదు. బాలుడి మృతదేహం లభ్యమైన ప్రదేశంలో ముందురోజు ఏమీ కనబడలేదు. బాలుడు తప్పిపోయిన మొదటి రాజు రాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. బాలుడు నిజంగా తప్పిపోయి వచ్చి ఉంటే ఆ వర్షంలో ఎక్కడ ఉన్నాడు?, రెండు రాత్రులు ఎలా గడిచాయన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. బాలుడు అదృశ్యమైన కొంత సమయానికే పోలీసులు, గ్రామస్తులు చుట్టుముట్టడంతో కిడ్నాపర్లే అంతమొందించి ఉంటారన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఒంగోలు జీజీహెచ్కు చెందిన ప్రొఫెసర్తో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే సహజ మరణమా లేక బలవన్మరణమా అనే విషయం తెలుస్తుంది. బాలుడి అనుమానాస్పద మృతి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. దర్యాప్తు పూర్తయితే వివరాలు వెల్లడిస్తాం. – మల్లికార్జునరావు, కంభం సీఐ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
రాచర్ల: వ్యవసాయ బోరు స్టార్టర్ బాక్స్ వద్ద ఫ్యూజులు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురైన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రాచర్ల మండలంలోని ఒద్దులవాగుపల్లె గ్రామ వ్యవసాయ పొలాల్లో శుక్రవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అన్నపురెడ్డి రామ్భూపాల్రెడ్డి(61) ఒద్దులవాగుపల్లె–సత్యవోలు మార్గంలో ఉన్న తన పొలంలో 10 రోజుల క్రితం మొక్కజొన్న సాగు చేశారు. మొలక దశలో ఉన్న పంటను అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మైకు ఏర్పాటు చేసి ఇంటికి వచ్చారు. మైకును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు శుక్రవారం వేకువజామున బైక్పై పొలానికి వెళ్లారు. డీప్బోర్ స్టార్టర్ బాక్స్ ఫ్యూజులు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. రామ్భూపాల్రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య లక్ష్మీదేవి పొలం వద్దకు వెళ్లి చూసింది. విగతజీవిగా పడి ఉన్న రామ్భూపాల్రెడ్డిని చూసి బోరున విలపిస్తూ బంధువులకు సమాచారమిచ్చింది. ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రైల్వే స్టేషన్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు ఒంగోలు టౌన్: గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఒంగోలులో శుక్రవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈగిల్ టీం, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతోపాటుగా పోలీసు డాగ్ స్క్వాడ్తో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాలు, రైలు బోగీలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్లోని పార్సిల్ సర్వీసు సెంటర్లో అనుమాస్పదంగా కనిపించిన ప్రతి పార్సిల్ను పరిశీలించారు. ఒంగోలు మీంచి వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లోని బోగీలలో ఎక్కి అనువణువు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరంలోని అన్నీ ప్రధాన కూడళ్లతో పాటుగా రైల్వే స్టేషన్లోనూ తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 11972, స్థానిక పోలీసులు, డయల్ 112 , పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలో మహిళా పీఎస్ సీఐ సుధాకర్, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్, ఆర్పీఎఫ్ సీఐ కొండయ్య, ఈగల్ టీం, ఎస్సైలు పాల్గొన్నారు. టంగుటూరులో దొంగలు హల్చల్ ● 4 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ టంగుటూరు: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన టంగుటూరు పురం సెంటర్లో గురువారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. స్థానిక పురం సెంటర్లో నివాసం ఉండే బడుగు దీనదాసు కుటుంబ సభ్యులు నిమ్మకూరు గ్రామంలో చదువుతున్న కూతురు వద్దకు ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి ఇంటికి వచ్చారు. తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. దుండగులు బీరువా పగలగొట్టి సుమారు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య, ఎస్సై నాగమల్లీశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గ్రానైట్ రాయి కింద పడి కూలీ మృతి
పొదిలి రూరల్: గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తుండగా రాయి జారి మీద పడటంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పొదిలి మండలంలోని ఏలూరు పంచాయతీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏలూరు పరిధిలోని వర్ణ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉత్తరప్రదేశ్కు చెందిన సుడమా కుష్వాహా(33) గత కొంత కాలం నుంచి పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే కటింగ్ మెషీన్తో భారీ గ్రానైట్ రాయిని కోసేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో జారిపడింది. రాయి మీద పడటంతో కుష్వాహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తోటి కార్మికులు గమనించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇద్దరు మాజీ సైనికుల గృహాల్లో చోరీ
కంభం: ఇద్దరు మాజీ సైనికుల గృహాల్లో దొంగలు పడి బంగారు నగలు, నగదు అపహరించారు. ఈ సంఘటనలు శుక్రవారం కంభం పట్టణంలో చోటుచేసుకున్నాయి. వివరాలు.. బస్టాండ్ సమీపంలోని రహమత్నగర్ మొదటి లైనులో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు చల్లా కోటయ్య కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. మూడు బంగారు ఉంగరాలు, చెవి పొగులు, కమ్మలు సహా మొత్తం 3 తులాల బంగారం, రూ.2 వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఉదయం 10.30 గంటల తర్వాత ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకొని వచ్చి వెళ్లినట్లు సమీపంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమై ఉంది. ● ఎల్బీఎస్ నగర్లో నివాసం ఉంటున్న మరో మాజీ సైనికుడు రంగనాయకులు పది రోజుల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. కింద ఇల్లు ఖాళీగా ఉండగా పైన వారు నివాసం ఉంటున్నారు. శుక్రవారం పైన ఇంటి కటాంజనం కొంత తెరుచుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు పైకి వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉంది. యజమానులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా తలుపు పూర్తిగా విరగగొట్టి మంచం మీద పెట్టారు. బీరువాలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. సుమారు మూడున్నర తులాల బంగారు నగలు, రూ.10 వేల వరకు నగదు చోరీ అయినట్లు యజమానులు చెప్పారు. చోరీ జరిగిన రెండు గృహాలను ఎస్సై నరసింహారావు పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. బంగారు ఆభరణాలు, నగదు అపహరణ -
అడుగడుగునా ఆంక్షలు..
కొండపి: కొండపిలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి మంత్రి ఆదేశాలతో పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి నుంచి ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. భారీగా సమావేశం నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని మంత్రి స్వామి ఎలాగైనా తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని సమావేశం జరగకుండా చేయాలని కుట్రలు పన్నారు. దీనికి పోలీసులతో అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఫ్లెక్సీలు కడుతున్న వారిని అడ్డుకొని వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు చెబితే ఫ్లెక్సీలు కట్టారు, ఫ్లెక్సీలు కడితే మీ మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి సురేష్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. ఎటువంటి ప్రభుత్వాన్ని కించపరిచే ఫ్లెక్సీలు లేనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి కొండపికి నలుమూలల ఎనిమిది చోట్ల చెక్పోస్ట్లు పెట్టి తనిఖీలు నిర్వహించారు. కొండపి నుంచి టంగుటూరు వెళ్లే గురుకుల పాఠశాల సమీపంలో ఒకటి, కే.ఉప్పలపాడు వద్ద, కామేపల్లి వెళ్లే రోడ్డులో హోసన్న చర్చి దగ్గర ఒకటి, పొదిలి వెళ్లే రోడ్డులో ఫైర్ స్టేషన్ దగ్గర, సంతనూతలపాడు వెళ్లే రోడ్డులో పోలీస్ స్టోరేజ్ వద్ద, జాళ్లపాలెం వెళ్లే రోడ్డులో జండా చెట్టు సెంటర్ వద్ద, కొండపి టౌన్లోని కామేపల్లి సెంటర్లో, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా వస్తున్న వారందరినీ కూడా ఒకే కారులో రావాలని అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారిని హెల్మెట్ లేదనే కారణంతో వెనక్కి తిప్పి పంపించారు. ఎన్నడూ లేని విధంగా హెల్మెట్లు, వాహన పత్రాలు తనిఖీ చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలను, కార్లను ఆపి తనిఖీలు చేశారు. మీకు కొండపిలో ఏం పని? ఈ సమయంలో కొండపి కి ఎందుకు వెళ్తున్నారు? విస్తృత స్థాయి సమావేశానికి వెళితే తిరుగు ప్రయాణంలో మీ మీద చర్యలు తీసుకుంటామని వాహనదారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సమావేశానికి రాకుండా కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కొంతమంది కార్యకర్తల మొబైల్ ఫోన్లు తీసుకొని సమావేశానికి రాకుండా ఆటంకపరిచారు. అయినా కార్యకర్తలు ఇవేవీ లెక్కచేయకుండా తమ వాహనాలను కొండపికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపి నడుచుకుంటూ సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వేలాది మంది కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు మంత్రి ఆదేశాలతో నలుమూలల చెక్ పోస్టులు, తనిఖీలు అయినా భారీగా హాజరైన వైఎస్సార్ సీపీ శ్రేణులు -
రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి
రాచర్ల: ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో గొర్రెల కాపరితోపాటు 10 జీవాలు మృతి చెందాయి. ఈ సంఘటన రాచర్ల మండలంలోని యడవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 199–10 మైలు రాయి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొత్తకోట రాధాకృష్ణ(38) తన 50 గొర్రెలను మేత కోసం సత్యవోలు వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్తున్నాడు. గొర్రెల మందను రైల్వే ట్రాక్ దాటిస్తున్న సమయంలో గుంటూరు నుంచి ఔరంగబాద్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు దూసుకొచ్చింది. గొర్రెలను పక్కకు తోలేందుకు ప్రయత్నించిన రాధాకృష్ణను రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందగా, 5 గొర్రెలు తీవ్ర గాయాలతో ట్రాక్ పక్కన ఎగిరిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన రైల్వే గార్డు ఎక్స్ప్రెస్ను నిలిపి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రాధాకృష్ణను అదే రైలులో గిద్దలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల జీఆర్పీ కానిస్టేబుల్ షేక్.ఖలీల్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
Ongole: పాపం పసివాడు
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
మూడు కోతుల్లా మూసుకున్న బాబు, లోకేష్, పవన్
సాక్షి, ప్రకాశం: పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ లేదని.. ఈ పాలనలోనూ పేదపిల్లల చదువుకు మోకాలడ్డుపెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే మ్యానిఫెస్టో రీకాలింగ్ పేరిట అని చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె అన్నారు.శుక్రవారం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖమంత్రి అంటే ఎలా ఉండాలో ఆదిమూలపు సురేష్ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది లోకేష్ కార్యకర్తలు కాదు... జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు. -
కడ‘గండ్ల’కు కారుకులెవరు?
సాగుకు సంకటం.. పునుగోడు రిజర్వాయర్ కనిగిరి రూరల్: పంట భూములకు సాగు నీరందించి, భూగర్భ జలాల మట్టాన్ని పెంచే రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు నిలిచే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిర్వహించిన మండల పరిషత్ సమావేశాల్లో సైతం చెరువుల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం కరువైంది. కనిగిరి ప్రాంతంలోని ప్రధాన చెరువులకు ఏర్పడిన గండ్ల వెనుక చేపల కాంట్రాక్టర్ల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనిగిరి నియోజకవర్గంలో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న మైనర్ చెరువులు 53, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన మోపాడు రిజర్వాయర్ ఉన్నాయి. కనిగిరి మండలంలో పునుగోడు, ఎన్గొల్లపల్లి రిజర్వాయర్లతోకలిపి 13 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా... 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 30 వరకు ఉన్నట్లు నివేదికలున్నాయి. ఇక 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు పామూరులో 7, హెచ్ఎంపాడులో 3, వెలిగండ్లలో 8, పీసీపల్లిలో 10, సీఎస్పురంలో 12 వరకు ఉన్నాయి. దెబ్బతిన్న తూములు, షట్టర్లు కనిగిరి నియోజకవర్గంలో మోపాడు రిజర్వాయర్ కింద 12 వేల ఎకరాల ఆయకట్టు, నేలటూరి గొల్లపల్లి మైనర్ రిజర్వాయర్ కింద 2,500 ఎకరాల ఆయకట్టు, పునుగోడు రిజర్వాయర్ కింద 2 వేల ఎకరాల ఆయకట్టు, పందువ గండి రిజర్వాయర్ కింద వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్ కట్ట, తూము, షట్టర్లు, కాలువలు పూర్తిగా అవసాన దశకు చేరాయి. భారీ వర్షం పడితే లీకుల నుంచి ఉధృతంగా నీరు ప్రవహించకుండా ఇసుక బస్తాలు వేసి మమ అనిపించారు. రిజర్వాయర్ రెండు ప్రధాన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పునుగోడు రిజర్వాయర్ షట్టర్ తుప్పు పట్టి విరిగిపోయింది. రిజర్వాయర్ కట్టకు రంధ్రాలు పడటంతోపాటు చెట్లు మొలిచాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి గోడలు నెర్రెలిచ్చాయి. మోపాడు రిజర్వాయర్కు గతంలో 5 చోట్ల నీరు ఊటరాగా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టలేదు. కలగట్ల, జమ్మలమడక చెరువు కట్టలు దెబ్బతిన్నా నేటికీ పట్టించుకున్న దిక్కులేదు. ● బలహీనంగా మారిన పామూరు పాత చెరువు కట్ట బలోపేతానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. పామూరు కొత్త చెరువు కట్ట సైతం బలహీనంగా మారింది. 2023లో వర్షాలకు చెరువు నీరు కట్టపైకి చేరగా తాత్కాలికంగా బలోపేతం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టలేదు. వగ్గంపల్లె చెరువు అలుగువద్ద కట్ట దెబ్బతినగా మరమ్మతుల సంగతే మరిచారు. ● హనుమంతునిపాడు మండలంలో హాజీపురం, నందనవనం, తిమ్మారెడ్డిపల్లి, మిట్టపాలెం, వీరరాంపురం, వాలిచర్ల చెరువులు మరమ్మతులకు గురయ్యాయి. హాజీపురం, దొడ్డి చింతల చెరువుల కింద 1,250 ఎకరాల ఆయకట్టు ఉంది. పదేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోలేదు. కట్టపై చిల్ల చెట్లు మొలవడంతోపాటు రాతి కతువ సైతం దెబ్బతింది. చెరువు కాలువలు మరమ్మతులకు గురయ్యాయి. ● పీసీపల్లి మండలంలోని 15 మైనర్ ఇరిగేషన్ చెరువులు చిల్లచెట్లతో నిండిపోయాయి. తూముల వద్ద లీకులతో నీరు నిలబడే పరిస్థితి లేదు. గతంలో మారెళ్ల చెరువు వర్షానికి నిండినా తూములకు లీకులు ఏర్పడి నీరంతా వృథాగా పోయాయి. చేపల కోసమే గండ్లు? మోపాడు రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడం కోసం అందులోని నీటిని బయటకు పంపేందుకు కొద్ది నెలల క్రితం కాంట్రాక్టర్లు జేసీబీతో అలుగు వాగుకు గండి కొట్టారు. దీనిపై ఆగ్రహించిన ఆయకట్టు రైతులు, వామపక్షాలు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే పునుగోడు రిజర్వాయర్లో చేపల కోసం నీటిని బయటకు పంపేందుకు కాంట్రాక్టర్లు రహస్యంగా రంధ్రాలు వేశారన్న ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, పురాతన కాలం నాటి గోడలు కావడంతో చెట్ల వేర్ల వల్ల రంధ్రాలు పడుతున్నాయని చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపాం పునుగోడు, నేలటూరి గొలపల్లి షట్టర్లు, తూములు దెబ్బతిన్నది వాస్తవమే. కలగట్ల చెరువు కట్టకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఎన్.గొల్లపల్లి రిజర్వాయర్ మరమ్మతులకు రూ.46 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. పునుగోడు రిజర్వాయర్ షట్టర్కు రూ.3 లక్షలతో కొద్దిరోజుల్లోనే మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 30 చెరువుల మరమ్మతులకు రూ.12.70 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చేపల వేట కోసం నీళ్లను బయటకు పంపించేందుకు గండ్లు కొట్టారన్న ప్రచారంలో వాస్తవం లేదు. – మధుబాబు, ఇరిగేషన్ జేఈ -
మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం
ఒంగోలు: కక్షిదారులు మధ్యవర్తిత్వంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని గురువారం జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ సీవీఎన్ రీడింగ్ రూం సెంటర్, కేశవస్వామిపేట జంక్షన్, నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా చర్చిసెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొని 1కే రన్ను జయప్రదం చేశారు. అనంతరం చర్చిసెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు, సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన మీడియేషన్ టు నేషన్ స్టాల్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. 7వ అదనపు జిల్లా జడ్జి టి.రాజా వెంకటాద్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 59 మంది మీడియేటర్లను నియమించామన్నారు. వీరి ద్వారా వివిద స్థాయిల్లో ఉన్న వ్యాజ్యాలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ర్యాలీలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, ఎ.పూర్ణిమ, పి.లలిత, జి.దీన, కె.శైలజ, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఒంగోలు బార్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఒంగోలు నగర డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి -
నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు
కొండపి: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను, స్టేషన్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. కేసుల రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకట్ట వేసేలా పటిష్ట బీట్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. గుడ్ ట్రయిల్ మానిటరింగ్ ద్వారా కేసుల్లో శిక్షలు పడేలా చూలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో శక్తి యాప్ గురించి, వారికి ఉన్న రక్షణ చట్టాల గురించి శక్తి టీం బృందాలపై అవగాహన కల్పించాలన్నారు. నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశాల్లో, వాణిజ్య సముదాయాల్లో, నిర్మానుష ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ సోమశేఖర్, కొండపి ఎస్సై ప్రేమ్కుమార్, పొన్నలూరు ఎస్సై అనూక్, మర్రిపూడి ఎస్సై రమేష్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. హనుమంతునిపాడు: స్థానిక పోలీస్స్టేషన్ను ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ ఖాజావలి, ఎస్సైలు కె.మాధవరావు, శ్రీరామ్లు ఐజీకి, ఎస్పీ దామోదర్కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ప్రస్తుతం హనుమంతునిపాడు పోలీస్స్టేషన్ కనిగిరిలో ఉందని, మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భవనం పూర్తయిన వెంటనే అక్కడకు మారుస్తామన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై లైంగిక దాడుల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
మా భూములు ఆన్లైన్ చేస్తారా లేదా?
కొత్తపట్నం: తమ భూములను ఆన్లైన్ చేయకుండా రెవెన్యూ, రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ 20 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు. వివరాలు.. కొత్తపట్నం మండలంలో కె.పల్లెపాలెం రెవెన్యూ సర్వే నంబర్ 1680లో 119.40 ఎకరాల భూమిని సుమారు 70 ఏళ్ల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రయ విక్రయాలు కూడా జరిగాయి. అయితే భూముల ఆన్లైన్ ప్రక్రియ అమల్లోకి వచ్చాక రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆన్లైన్లో భూమి చూపించడం లేదన్న కారణంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అది రిజర్వ్ ఫారెస్ట్ భూమి తామేమీ చేయలేమంటూ రెవవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు మాత్రం అది తమ భూమి కాదంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఈ రెండు శాఖల అధికారుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓపిక నశించిన రైతులు ఇటీవల గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చారు. దీంతో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు సరైన సమాచారం తీసుకురాకపోవడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్టాదారు పాస్పుస్తకాలు, భూముల డాక్యుమెంట్లు, భూముల్లో సాగు చేసిన పంటలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డులు తనఖీ చేసి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఆర్డీఓ చెప్పారు. -
ఈదుమూడిలో అగ్ని ప్రమాదం
నాగులుప్పలపాడు: షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని ఈదుమూడిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన కృష్ణమూర్తి పెంకుడు ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రూ.50 వేల నగదు, ద్విచక్రవాహనం, ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమమయ్యాయి. అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లంతా తాళం వేసి గుడికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పంటలను అదుపు చేశారు. రూ.1.10 లక్షల నగదు చోరీ సింగరాయకొండ: ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడి రూ.1.10 లక్షల నగదు, వెండి పట్టీలు చోరీ చేశారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని ప్రశాంతి థియేటర్ ఎదురు సందులో నివాసం ఉంటున్న పఠాన్ రఫీఖాన్ నివాసంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం..రఫీఖాన్ ఈతముక్కలలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. మొహర్రం పండుగను పురస్కరించుకొని భార్య, పిల్లలు ఈతముక్కలలోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.1.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేటి నుంచి డిగ్రీ రెండో సెమిస్టర్ మూల్యాంకనం ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం డిగ్రీ రెండో సెమిస్టర్ మూల్యాంకనం ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ డి.కళ్యాణి తెలిపారు. మూల్యాంకనానికి ఎంపిక చేసిన అధ్యాపకులు యూనివర్శిటీ ఐడీ కార్డులు, తమ కాలేజీ ప్రిన్సిపాల్ లేఖతో కళాశాలలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. అధ్యాపకులను తక్షణమే రిలీవ్ చేయాలని ప్రిన్సిపాళ్లను క్యాంప్ ఆఫీసర్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి 40 రోజుల జైలు రాచర్ల: మద్యం మత్తులో లారీ నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. రాచర్ల మండల పరిధిలో హైవేపై ఈ నెల 9న డ్రంక్ అండ్ పరీక్షలు చేస్తుండగా ఒంగోలు మండలం త్రోవగుంట గ్రామానికి చెందిన పట్టిం వెంకటరావు పట్టుబడ్డాడు. నిందితుడిని గురువారం గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి కె.భరత్చంద్ర 40 రోజులు జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరియానా విధించారని, ఆరు నెలలపాటు లైసెన్స్ రద్దు చేశారని ఎస్సై వివరించారు. కరేడు రైతుల కోసం పోరాడతాం.. ఉలవపాడు: కరేడు రైతుల కోసం ఎంతవరకు పోరాడేందుకై నా సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం కరేడులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, వారు రాస్తారోఖో చేసిన రోజే వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాయన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్పొరేట్ల పక్షమా.. లేక ప్రజల పక్షమా తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ తప్పుడు సమాచారం మీడియాకు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పనులు చేయడం మంచిది కాదన్నారు. ప్రజలతో మాట్లాడకుండా బయట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఓట్లు వేసిన రైతులకు మేలు చేస్తాడా.. లేక కంపెనీలకు మేలు చేస్తాడా.. అనేది నిర్ణయించుకోవాలన్నారు. భూములు లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు పేర్కొంటున్నారని గుర్తు చేశారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అవసరం అనుకుంటే మనమే ఒక హత్య చేద్దామని అన్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా మాట్లాడతానని, రైతుల సమస్యలు తెలియజేస్తానన్నారు. రైతుల సమస్యల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఏకం చేస్తామన్నారు. రైతులు అమరావతి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తొలుత భూములు వద్ద రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీవీ ప్రసాద్, సీపీఐ ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు నారాయణ, దామా అంకయ్య, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమారెడ్డి, కరేడు రైతు ఉద్యమ నాయకులు మిరియం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పేరెంట్స్ సమావేశం కాదు.. టీడీపీ సంబరాలు..!
యర్రగొండపాలెం: ప్రభుత్వం పాఠశాలల్లో అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం కాస్తా టీడీపీ సంబరాలుగా మారాయి. ఈ సమావేశాల్లో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణ, ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలపై చర్చించడం లాంటివి జరగాల్సి ఉంది. అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు సమావేశాల్లో పాల్గొని ఊకదంపుడు ప్రసంగాాలతో ముగించారు. ఈ సమావేశాల్లో పేరెంట్స్ కేవలం 40 శాతం మంది మాత్రమే పాల్గొన్నారు. గణపవరం గురుకుల పాఠశాలలో సమావేశం ప్రారంభం కాకముందే ఆ పాఠశాల ప్రిన్సిపాల్తో ఎస్ఎంసీ చైర్మన్ వాదనకు దిగారు. పేరెంట్స్–టీచర్స్ సమావేశం జరుగుతుందని తమకు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పెద్దదోర్నాల కేజీబీవీ కళాశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు కళాశాల ప్రాంగణంలోకి చేరుతున్న మురుగునీరు, కోతుల బెడదపై ప్రిన్సిపాల్ను నిలదీశారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో మురుగునీటి నిల్వలతో తమ పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని, కోతులు కళాశాలలో ఎక్కువగా ఉంటున్నాయని, దుస్తులు శుభ్రం చేసుకుని ఆరబెట్టుకునే సమయంలో అవి తమ పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళనగా ఉందని అన్నారు. యర్రగొండపాలెం, పుల్లలచెరువు పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్–టీచర్స్ మీటింగ్లో ఎటువంటి అర్హతలేని పచ్చనేతలు పాల్గొన్నారు. సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. -
సర్వం సాయి..
గురుపౌర్ణమి వేడుకలు జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సాయినాథులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలులోని సంతపేట, లాయర్పేట సాయి మందిరాలు కిటకిటలాడాయి. సామూహిక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. – సాక్షి, ఒంగోలు వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్ ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా చావలి శివప్రసాద్ను నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించిన ఎస్ఈ ఒంగోలు వన్టౌన్: నగరంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కట్టా వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. ఇందిరాకాలనీ, పులివెంకటరెడ్డికాలనీలో లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నూతనంగా ఏర్పాటు చేసిన 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లను తనిఖీ చేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.శ్రీకాంత్, ఏఈఈ ఎంఎస్వీ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
ప్రకాశం
37 /277గరిష్టం/కనిష్టంనేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు మహిళలు, చిన్నారులపై నేరాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. కడగండ్లకు కారకులెవరు? కనిగిరి నియోజకవర్గంలో చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు అధ్వానంగా తయారయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి నోచుకోక నిరుపయోగంగా మారాయి.వాతావరణం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది.– 8లో.. శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025 -
అండగా ఉంటాం..అధైర్యపడొద్దు
● కోర్టు వద్ద కార్యకర్తలను పరామర్శించిన బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, అన్నా రాంబాబు పొదిలి: అక్రమ కేసుల్లో అరైస్టె రిమాండ్లో ఉన్న కార్యకర్తలకు పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భరోసా ఇచ్చారు. రిమాండ్లో ఉన్న పార్టీ కార్యకర్తలు వాయిదా రోజైన గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు కార్యకర్తలను కలిసి ధైర్యం చెప్పారు. తప్పు చేయలేదని నిరూపించేంత వరకు పార్టీ లీగల్ టీం న్యాయ సేవలు అండగా ఉంటాయని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పొదిలి పోరుబాట కార్యక్రమం ఊహించనంత విజయవంతం కావడంతో ఓర్వలేని కూటమి నేతలు అక్రమంగా అరెస్టులు చేయించి జైలుపాలు చేశారన్నారు. తప్పు చేయని కార్యకర్తలు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. పార్టీ కోసం మీరు చేసిన సేవలు గుర్తుంటాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మాజీ వార్డు సభ్యులు షేక్.మస్తాన్వలి, ముల్లా జాకీర్, రియాజ్, అన్నవరం బ్రహ్మారెడ్డి, దోర్నాల చిన్న నారాయణరెడ్డి, శింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి వల.. క్యాంపస్విలవిల
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీలో బయటి వ్యక్తుల పెత్తనంతో భ్రషు్టపట్టిపోయింది. కాలేజీలో పచ్చ బ్యాచ్ను నాన్ టీచింగ్ సిబ్బందిగా నియమించడం ద్వారా క్యాంపస్ ఎత్తివేత కుట్రలకు ప్రభుత్వం తెరదీసింది. ఏడాది పాటు ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్ అద్దె చెల్లించకుండా నిలిపేసింది. కరెంటు బిల్లులూ చెల్లించలేదు. మౌలిక సదుపాయాలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. చివరకు క్యాంపస్ను ఎత్తివేసింది. ఈ పరిణామాలతో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరాలంటే విద్యార్థులు భయపడిపోయే పరిస్థితి దాపురించింది. తాజాగా జరిగిన కౌన్సెలింగ్లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మిగిలిపోయిన కాలేజీగా నిలవడం పరిస్థితికి అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు ఉండగా ఒక్కో క్యాంపస్కు 1100 సీట్లున్నాయి. ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 5వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరిగింది. ఈ కౌన్సెలింగ్లో మొత్తం 598 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇందులో ఒంగోలు క్యాంపస్కు సంబంధించి 183 సీట్లు ఖాళీగా మిగిలి రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మిగిలిపోయిన కాలేజీగా నిలిచింది. గతంలో ఎన్నడూ ఇన్ని సీట్లు మిగలలేదని కాలేజీ ఉద్యోగులు చెబుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్లో ఈ సీట్లు ఎన్ని భర్తీ అవుతాయో చూడాలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక పదవిలో ఉన్న మంత్రికి సన్నిహితుడైన ఒక ప్రైవేటు కాలేజీ అధినేత కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. తన గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలకు నాన్ టీచింగ్ స్టాఫ్గా నియమించినట్లు సమాచారం. అప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగిన ఒంగోలు క్యాంపస్లో రచ్చ మొదలైంది. ఆ 50 మంది పచ్చ బ్యాచ్కు ఎలాంటి విధులు అప్పగించకుండా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. క్యాంపస్లోని ఎగ్జామ్ సెల్ పక్కనే ఉన్న ఒక గదిని డెన్గా మార్చుకున్న సదరు ఎల్లో బ్యాచ్ డ్యూటీ చేయకుండా టీవీలు చూస్తూ టైం పాస్ చేసేవారని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కాలేజీ నిబంధనలకు వ్యతిరేకంగా తమ ఇష్టమొచ్చినప్పుడు కాలేజీకి వచ్చి సంతకాలు చేసేసి వెళ్లిపోయేవారని సమాచారం. దీంతో క్యాంపస్లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే క్యాంపస్ అద్దె చెల్లించలేదు. దాంతో రూ.2.50 కోట్ల అద్దె బకాయి మిగిలిపోయింది. కరెంటు బిల్లు సైతం కోటి రూపాయలకు పైగానే చెల్లించకుండా నిలిపేశారు. దీంతో తరచుగా కరెంటు కట్ చేయడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. మోటార్లు కాలిపోయి నీటి సరఫరా ఆగిపోయినా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. రకరకాల సాకులు చూపి రావ్ అండ్ నాయుడు క్యాంపస్ను ఎత్తివేశారు. ఇది విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపిందని కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు. ఎస్ఎస్ఎన్లో ఆదిలోనే హంసపాదు... రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఎత్తేసిన తరువాత ఒంగోలులో మిగిలింది ఎస్ఎస్ఎన్ క్యాంపస్. కాలేజీ తరగతులు ప్రారంభం కాకముందే ఇక్కడ మరో పచ్చ బ్యాచ్ రచ్చ రచ్చ చేసి విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ క్యాంటిన్ నిర్వహణను రెండుగా విభజించి ఇద్దరికి ఇచ్చారు. బాలికల క్యాంటిన్ను చవటపాలెం గ్రామానికి చెందిన ఒకరికి, బాలుర క్యాంటిన్ను కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. ఈ ఇద్దరూ టీడీపీ నాయకులు, సానుభూతిపరులు కావడం గమనార్హం. గత బుధవారం బాలికల క్యాంటిన్ను తెరవడంతో బాలుర క్యాంటిన్ కాంట్రాక్టర్ గొడవకు దిగారు. 20 మంది యువకులను తీసుకొచ్చి కాలేజీలోకి బలవంతంగా ప్రవేశించి బాలికల క్యాంటిన్ నిర్వాహకురాలి భర్త మీద దాడి చేశారు. క్యాంటిన్లోని వస్తువులతోపాటు ఆహార పదార్థాలను రోడ్డు మీద పడేశారు. ఈ దాడితో కాలేజీలో రిపోరి్టంగ్ చేయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తలిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అసలు క్యాంటిన్ నిర్వహణ బాధ్యతను ఇద్దరికి కట్టబెట్టడం వలన గొడవలు జరిగే అవకాశం ఉందని అంచనా వేయడంలో అధికారులు వైఫల్యం చెందారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఎస్ఎస్ఎన్ క్యాంపస్ను కూడా ఎత్తివేసే క్రమంలోనే అధికార పార్టీ పక్కా ప్రణాళికతో గొడవలు సృష్టించిందని కొందరు విశ్లేషి స్తున్నారు. సొంత భవనాలు ఎప్పుడు నిర్మిస్తారో... ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి తరచుగా క్యాంపస్లను మార్చడం. తొలుత ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీలో ఒంగోలు క్యాంపస్ను నిర్వహించారు. అక్కడ నుంచి మార్చి ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్లో ఏర్పాటు చేశారు. అంతా బాగుందనుకుంటున్న విద్యార్థులకు ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం వచ్చి ఒంగోలు క్యాంపస్ను నూజివీడుకు మార్చింది. పిల్లి పిల్లను తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నట్లు విద్యార్థులు తరచుగా క్యాంపస్లు మారాల్సి రావడంతో చిరాకుకు గురౌతున్నారు. కొత్తగా చేరే విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడింది. ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలను నిర్మించడం ఒక్కటే దీనికి పరిష్కారమని కొందరు అధ్యాపకులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కూడా తరచుగా మాట మారుస్తోంది. తొలుత పామూరులో ట్రిపుల్ ఐటీ కాలేజీని నిర్మిస్తామన్నారు. తాజాగా కనిగిరిలో ట్రిపుల్ ఐటీ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ మార్కాపురాన్ని జిల్లాగా మారిస్తే కనిగిరి.. మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఒంగోలుకు అసలు ట్రిపుల్ ఐటీ కాలేజే లేకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీకి సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.పోలీసు బందోబస్తు మధ్య క్యాంటిన్ నిర్వహణ..బాలికల క్యాంటిన్ నిర్వాహకుడి మీద దాడి జరిగిన రోజు రాత్రి జిల్లాకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యే నివాసంలో అర్ధరాత్రి వరకు రాజీ ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. అంతా అయిపోయింది. తెల్లారేసరికల్లా ఇద్దరూ కలిసిపోయారని చెప్పారు. ఈ లోపు ఏం జరిగిందో ఏమో కానీ దాడికి గురైన బాలికల క్యాంటిన్ నిర్వాహకులు శుక్రవారం సంతనూతలపాడు పోలీసు స్టేషన్లో కేసు పెట్టినట్లు సమాచారం. అదే రోజు క్యాంపస్కు వచ్చిన పోలీసులు విచారణ జరిపి దాడి తాలుకు సీసీ ఫుటేజీలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి పోలీసు బందోబస్తు మధ్య బాలికల క్యాంటిన్ను నిర్వహిస్తున్నారని సమాచారం. కాలేజీ క్యాంపస్లో పోలీసు పహారా మధ్య విద్యార్థులు భోజనాలు చేయడానికి భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటీ అధికారుల వైఫల్యం వల్లనే ఇలాంటి దౌర్భాగ్యం నెలకొందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హామీలు నెరవేర్చలేని బాబు సిగ్గుపడాలి
నాగులుప్పలపాడు: ప్రజలకు నాలుగింతల మంచి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వాటిని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు, జైళ్లలో పెడుతున్నా కార్యకర్తలు, నాయకులు ఏ మాత్రం భయపడకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఈ సమావేశానికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలే నిదర్శనమన్నారు. ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తే వాటిని ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఓ సంచలనంగా ఉందని, దీనిని చంద్రబాబు ప్రభుత్వం ఓర్చుకోలేక అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. పొగాకు రైతుల పక్షాన పోరాటం చేస్తే తట్టుకోలేని కూటమి నాయకులు ఆ సభలో రాళ్లు రువ్వి చేసిన గందరగోళం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్ని కూటములు ఏకమైనా, కుట్రలు చేసినా ప్రజాతీర్పు భవిష్యత్లో జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. ఈ సారి జగన్ 2.0 పాలనలో కార్యకర్తలే కీలకంగా మారనున్నారన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం గోతులు తీసే నాయకత్వం చేయనని, జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేద ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తూ ఆనాడు పాదయాత్రలో డా.వైఎస్సార్ అమలు చేసిన 108, ఆరోగ్యశ్రీ అనేవి ఈనాటికీ ప్రజల్లో చిరస్థాయి గా నిలిచిపోయాయన్నారు. అలాంటి పాలనే మళ్లీ జగన్మోహన్ రెడ్డిలో చూశామని అన్నారు. రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో మేరుగు నాగార్జున, శివప్రసాద్ రెడ్డిలకు అండగా ఉండాలని కార్యకర్తలను కోరారు. పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డా.మేరుగు నాగార్జున మాట్లాడుతూ తాను ఈ నియోజకవర్గానికి వచ్చాక ఈ ప్రాంతానికి మహానేత వైఎస్సార్ వలన జరిగిన మంచిని కళ్లారా చూశానని ఇలాంటి ప్రాంతానికి తాను సేవ చేసే భాగ్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞుడనన్నారు. మోసపూరిత హామీలతో గెలిచిన కూటమి నాయకులు నేడు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పారిపోయే రకాన్ని కాదన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తుపెట్టుకొని భవిష్యత్ లో వారికి సముచిత స్థానం కల్పించడానికి కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. హామీలేవీ అమలు చేయకుండా మోసగించిందన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారని ఎద్దేవా చేసిన చంద్రబాబు తన ముసలితనంలో బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వలన జగన్ కు వస్తున్న ఆదరణ చూసి అసలు అధికారంలో ఎవరున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ తో గెలిచిన కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. అనంతరం త్వరలో క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించే క్యూఆర్ కోడ్ స్కానర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పాలడుగు రాజీవ్, వేమా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, మేధావుల సంఘం రాష్ట్ర సెక్రటరీ కంచర్ల సుధాకర్, మారెడ్డి సుబ్బారెడ్డి, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు మండల పరిషత్ అధ్యక్షుడు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, వాకా అరుణ కోటిరెడ్డి, బుడంపాటి విజయ, యద్దనపూడి శ్రీనివాసరావు, మండలాధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, పోలవరపు శ్రీమన్నారాయణ, దుంపా చెంచిరెడ్డి, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు కిష్టిపాటి శేఖర్ రెడ్డి, తేళ్ల పుల్లారావు, బెజవాడ రాము, గుడ్డపాతల రవి, నారా విజయలక్ష్మి, నన్నపురెడ్డి రవణమ్మ, కాకర్లపూడి రజనీ, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు -
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
ఒంగోలు టౌన్: అధిక ధరలకు మద్యం విక్రయాలు చేయకుండా ఎకై ్సజ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆదేశించారు. స్థానిక డీసీ కార్యా లయంలో బుధవారం నెలవారీ నేర సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 10 ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరిగేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల్లో అన్నీ బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గంజాయితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అరికట్టేందుకు గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అనధికార మద్యం విక్రయాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. లోక్ అదాలత్ను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను త్వరితగతిన వేలం వేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు ఈ.వెంకట్, ఏ.జనార్దన్రావు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
ఒంగోలు టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలను దేశంలోని అన్నీ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తీరు మార్చుకోకుంటే మరింత ఉధృతంగా పోరాటాలను కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లకు అనుకూలంగా పనిగంటలను పెంచిందని మండిపడ్డారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి అద్దంకి బస్టాండు సెంటర్, మస్తాన్ దర్గా, ట్రంకు రోడ్డు, చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ప్రకాశం భవనం వద్ద నిర్వహించిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన దేశంలోని నిరుపేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ధనవంతులు, అవినీతిపరులు, అక్రమార్కులు మాత్రమే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారని అన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కనీసం మౌలిక వసతులను కూడా కల్పించలేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా రూ.30 కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి పోరాడుతున్నారని తెలిపారు. కనీస వేతన చట్టాలు అమలు చేయాలి: సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల కోసం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం దొడ్డిదారి ప్రయత్నాలు మానుకోకపోతే రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, ఉద్యోగుల అభిప్రాయాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా చట్టాలను మార్చడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ఉపాధిహామీ పనులను ఏడాదిలో 200 రోజులు నిర్వహించాలని, రోజుకి రూ.600 వేతనం ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశ యూనియన్ల నాయకులు అన్నపూర్ణ, మేరి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్కీం వర్కర్లను తొలగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీ సమ్మెకు ఎస్డీపీఐ నాయకులు షేక్ సత్తార్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్.లలిత కుమారి, బి.పద్మ, శ్రీరాం శ్రీనివాసరావు, జి.రమేష్, తంబి శ్రీనివాస్, ఎంఏ సాలార్, తాళ్లూరు వెంకటేశ్వర్లు, జె.ఉదయ కిరణ్, టి.విజయ, కేవీ సుబ్బమ్మ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు సర్కార్ సార్వత్రిక సమ్మెలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు హెచ్చరిక -
బధిరుల సమస్యలను పరిష్కరించాలి
ఒంగోలు వన్టౌన్: జిల్లాలోని బధిరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బధిరుల సంఘ నాయకులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ సువార్తని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క బధిరునికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో బధిరులకు రిజర్వేషన్ రోస్టర్ను తప్పక పాటించాలని కోరారు. బధిరులకు రుణాలను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో బధిర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి ఎం.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకులను త్వరగా గుర్తించాలి ● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: పీ–4 పథకం కింద మార్గదర్శకులను త్వరగా గుర్తించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలోని పురోగతిపై సమీక్షించేందుకు బుధవారం ఆయన ప్రకాశం భవనం నుంచి నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు కూడా తమ శక్తి మేరకు ‘బంగారు కుటుంబాల’కు అండగా నిలిచేలా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకుంటానని చెప్పారు. ఈ నెలాఖరికే మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసేలా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులను, ఉన్నత విద్యావంతులను, వ్యాపార, పారిశ్రామికవేత్తలను సంప్రదించి ‘మార్గదర్శకులు’గా వారు ముందుకు వచ్చేలా చూడాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో మెరుగైన పరిష్కారం
ఒంగోలు: న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అనేది భవిష్యత్తు రోజుల్లో కక్షిదారుల సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం అనేది సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వేదికని అన్నారు. ఈ కార్యక్రమంపై ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. మీడియేషన్కు సంబంధించి శిక్షణ ముగించిన న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులు వారికి అప్పగించిన మీడియేషన్ వ్యాజ్యాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మీడియేషన్పై స్థానిక న్యాయవాదులకు శిక్షణ ఇచ్చిన న్యాయవాది ఎస్.అరుణాచలంను అభినందించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పి.లలిత, పూర్ణిమ, జి.దీన, టి.రాజా వెంకటాద్రి, సీనియర్ న్యాయమూర్తులు ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, జూనియర్ న్యాయమూర్తులు, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. నేడు కిలోమీటరు నడక మధ్యవర్తిత్వ అంశాన్ని కక్షిదారుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం చేపట్టిన కిలోమీటరు నడక కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొనాలని ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 8.50 గంటలకు జిల్లా న్యాయస్థానం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. మూలికా వైద్య సంఘ జాతీయ అధ్యక్షుడిగా ఇమాంసాహేబ్ మార్కాపురం టౌన్: వంశపారంపర్య మూలికా వైద్య సంఘ జాతీయ అధ్యక్షుడిగా మార్కాపురం పట్టణానికి చెందిన మూలికా వైద్యుడు షేక్ ఇమాంసాహేబ్ ఎన్నికయ్యారు. రావులపాలెంలో నిర్వహించిన ఆయుర్వేద మూలికా వైద్యుల సమావేశంలో తనతోపాటు కార్యదర్శులుగా రామకృష్ణారెడ్డి, శంకర్, సహాయ కార్యదర్శిగా రాజు, మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారయని ఆయన వివరించారు. -
నాన్ బెయిలబుల్ కేసులో నిందితుడు అరెస్టు
టంగుటూరు: నాన్ బెయిలబుల్ కేసులో నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కారుమంచి గ్రామానికి చెందిన దోనంపూడి అచ్చమ్మకు భర్త దోనంపూడి రమేష్ మెయింటెనెన్స్ భరణం చెల్లించాలి. కానీ చెల్లించకపోవడంతో అచ్చమ్మ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది అరెస్టు చేసి ఎకై ్సజ్ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ నెల రోజుల జైలుశిక్ష విధించారు. అక్రమ మద్యం విక్రేత అరెస్ట్ గిద్దలూరు రూరల్: మండలంలోని సంజీవరాయుడుపేట గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్థానిక ఎకై ్సజ్ శాఖ సీఐ ఎం.జయరావు తన సిబ్బందితో కలిసి గ్రామంలో సోదాలు నిర్వహించగా ఓ వ్యక్తి 10 మద్యం సీసాలతో పట్టుబడ్డాడు. తనిఖీల్లో సిబ్బంది శ్రీపతి, ఆర్షాదుల్లా, శంకర్, హరిబాబు పాల్గొన్నారు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణల తొలగింపు పొదిలి: వక్ఫ్ భూముల్లో ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని నగర పంచాయతీ కమిషనర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. షెడ్లు ఏర్పాటు చేసుకుని, వాస్తవంగా నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకుడు మోహన్ధర్మా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. నోటీసులు ఇవ్వకుండా నివాసాలు తొలగించడం సరికాదని, పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోగులకు మెరుగైన సేవలందించాలి ● ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ మద్దిపాడు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఇన్చార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవల వివరాలు, రోగుల రిజిష్టర్లు, రికార్డులు, క్యాజువాలిటీ రూం, అత్యవసర సేవా విభాగాన్ని, మెడిసిన్స్ భద్రపరుస్తున్న విధానాలను పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మూమోంట్ రిజిష్టర్, సిబ్బంది డ్యూటీ చార్ట్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ వి.జ్యోతి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రావణ్, డాక్టర్ అన్వేష్, వైద్య శాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. -
నీటి కుంటలో పడి యువకుడు మృతి
కురిచేడు: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన కురిచేడు మండలంలోని అలవలపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రావి పెద్దకోటయ్య పొలం వద్ద ఉద్యానవనశాఖ నీటి కుంట నిర్మించింది. దాని కొలతల కోసం ఉద్యానశాఖ సిబ్బంది వచ్చారని, తోడుగా రమ్మని కొరివి రోశయ్య(30)ను పెద కోటయ్య తన వెంట తీసుకెళ్లాడు. కుంట కొలతలు తీసేందుకు గట్టుపై మెట్లు చెక్కాలని రోశయ్యను కోరాడు. పనిచేస్తున్న క్రమంలో అలసట తీర్చుకునేందుకు రోశయ్య కట్టపై ఉన్న వేప చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఏమైందో తెలియదు నీటి కుంటలో పడిపోయాడు. రైతుతోపాటు ఉద్యాన సిబ్బంది నీటి కుంటలో దిగి వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వీఆర్వో రమాదేవి సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో కుంట కట్టకు గండి కొట్టించి నీటిని బయటకు పంపారు. రోశయ్య అప్పటికే మృతి చెందగా మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని భార్య గంగాభవాని ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో ఒక అబ్బాయి దివ్యాంగుడు. సంఘటనా స్థలానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యానవనశాఖ సిబ్బంది కొలతల సందర్భంలో ఘటన -
జాడ లేని లక్ష్మిత్.. పోలీసుల ముమ్మర గాలింపు
కంభం: అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా.. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చిన మూడేళ్ల బాలుడు పొదిలి లక్ష్మిత్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. తొలిరోజు మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ కె.మల్లికార్జున , ఎస్సై నరసింహారావు తమ సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాలతో గ్రామ పరిసరాలను జల్లెడ పట్టినా ఆచూకీ లభించలేదు. బుధవారం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో నల్లవాగు వద్ద బాలుడి చెప్పులను పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భారీగా నల్లవాగు వద్దకు చేరుకుని వెదికినా ఫలితం లేకుండా పోయింది. ఆగంతకులు ఎత్తుకెళ్లారా? బాలుడి చెప్పులు వాగు వద్ద గుర్తించిన పోలీసులు ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించారు. తొలుత పోలీస్ జాగిలం సంఘటనా స్థలం నుంచి నేరుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి ఆగింది. రెండోసారి సంఘటనా స్థలం నుంచి నేరుగా సూరేపల్లి సమీపంలో కంభం–తర్లుపాడు రోడ్డుపైకి వచ్చి ఆగింది. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించింది. పోలీస్ జాగిలం వెళ్లిన మార్గాన్ని బట్టి చూస్తే ఆగంతకులు బాలుడిని తీసుకుని నల్లవాగు వెంబడి సూరేపల్లి వద్ద రోడ్డుపైకి చేరుకుని వాహనంలో వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని తీసుకెళ్తున్న క్రమంలో వాగు వద్ద చెప్పులు జారి పడినట్లు తెలుస్తోంది. గాలింపు చర్యల్లో 5 బృందాలు బాలుడి అదృశ్యం కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు మార్కాపురం డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సీఐ కె.మల్లికార్జున ఆధ్వర్యంలో 5 బృందాలుగా ఏర్పడి కంభం, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు, పొదిలి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో గాలిస్తున్నారు. కొందరు కొత్త వ్యక్తులు చెత్త ఏరుకునేందుకు గ్రామంలోకి వచ్చారని గ్రామస్తులు చెబుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు పంట పొలాల్లో నల్లవాగు సమీపంలో బాలుడి చెప్పులు లభ్యం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు గొట్లగట్టులో విషాద ఛాయలు కొనకనమిట్ల: లక్ష్మిత్ అదృశ్యం కావడంతో స్వగ్రామం కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాలుడి తండ్రి పొదిలి శ్రీను ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉండగా, ఇటీవల వరకు లక్ష్మిత్ తన తల్లి సురేఖ, నానమ్మ తులశమ్మతో కలిసి గొట్లగట్టులో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం లక్ష్మిత్ అమ్మమ్మ స్వగ్రామమైన కంభం మండలం లింగోజిపల్లికి వెళ్లాడు. ఎంతో చలాకీగా ఉండే లక్ష్మిత్ అదృశ్యం కావడంపై బంధువులతో పాటు గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. లక్ష్మిత్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మిత్ అదృశ్యమైన ఘటన గ్రామాల్లో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. -
13న ఉచిత మెగా వైద్య కంటి శిబిరం
చీమకుర్తి: బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 13న చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. చీమకుర్తిలోని బూచేపల్లి కమలాకర్రెడ్డి పార్కులో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి సినీ హీరో బూచేపల్లి కమలాకర్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర కంటి ఆస్పత్రి వారి సహకారంతో కంటి వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు శంకర కంటి ఆస్పత్రి వైద్యులతో నిర్వహించే వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హాజరైన రోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందిస్తారన్నారు. కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తే శంకర కంటి ఆస్పత్రికి బస్సుల్లోఉచితంగా తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి చీమకుర్తిలో వదిలిపెడతారని తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొనే రోగులందరికీ మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కూడా బూచేపల్లి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలుత ఉచిత మెగా కంటి వైద్య శిబిర వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్.మాణిక్యం, కౌన్సిలర్లు బీమన వెంకట్రావు, సోమా శేషాద్రి, పాటిబండ్ల గంగయ్య, ఖాజా, గోపురపు చంద్ర, మేకల యల్లయ్య, బడే అయ్యపరెడ్డి, తెల్లమేకల గాంధీ, చీదర్ల శేషు, కుంచాల రాంబాబు, షేక్ ఖాదర్బాషా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బూచేపల్లి ట్రస్టు, శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో సినీ హీరో బూచేపల్లి కమలాకర్రెడ్డి వర్ధంతి సందర్భంగా.. -
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా ప్రకాశం భవనం వద్ద కార్మిక సంఘాల ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పి. సుబ్బారావు, కె.రాజీవ్ రతన్దే్ , పి.రామయ్య, ఉమాశంకర్, హాసన్, బ్రహ్మానాయుడు, దుర్గాప్రసాద్, గాయత్రి తదితరులు నాయకత్వం వహించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగ నాయకులు పీకే రాజేశ్వరరావు, వి.పార్ధసారధి, సీబీ రావు, బ్రహ్మయ్య తదితరులు వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి పుల్లలచెరువు: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొండారెడ్డి కొష్టాలు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మునగాల శేషరెడ్డి(65) అనే రైతు చౌటపాచర్ల గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ట్రాన్స్పార్మర్ తీగలు తగిలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంతప్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య సీతారావమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా పాలన బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో యూనియన్ నాయకుల ధ్వజం -
ఎస్ఎంసీ చైర్మన్ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం
యర్రగొండపాలెం: స్కూల్ మానిటరింగ్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్ అరాచకాలను తట్టుకోలేకపోతున్నామని, తమను మురికిమల్ల గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి ఎక్కడికై నా డిప్యుటేషన్పై బదిలీ చేయాలని కోరుతూ బుధవారం ఆ పాఠశాల హెచ్ఎం, పలువురు ఉపాధ్యాయులు డీటీడబ్ల్యూఓ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. పుల్లలచెరువు మండలంలోని మాచర్ల హైవే రోడ్డుపై ఉన్న మురికిమల్ల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ బయ్యన్నతోపాటు మరో ఐదుగురు ఉపాధ్యాయులు మూకుమ్మడిగా సెలవుపెట్టి ఒంగోలు వెళ్లారు. అక్కడ డీటీడబ్ల్యూవో కార్యాలయంలో తమ గోడును లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఎస్ఎంసీ చైర్మన్ అనుమతి లేకుండా తాము పాఠశాలలోకి వెళ్లేందుకు వీలులేదని, రోజూ రోడ్డుపై నిల్చుని నమస్కారం చేసి పాఠశాలలోకి వెళ్లాలని చెబుతున్నాడని, ఆయన అనుమతి లేకుండా న్యూఅడ్మిషన్స్ చేర్చుకోవద్దని హుకుం జారీ చేస్తున్నాడని వినతి పత్రంలో ఉపాధ్యాయులు ఆరోపించారు. తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా పాఠశాలలోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడని, క్లాస్ రూంలోకి వెళ్లి టీచర్ను బయటికి పంపి తానే క్లాస్ తీసుకుంటాడని, విద్యార్థుల ఎదుట హెచ్ఎంను, ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడుతున్నాడని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకెళ్లారు. వర్కర్స్ను బెదిరించి స్టోర్ రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న నిత్యావసర సరుకులను తీసుకెళ్తుంటాడని, స్కూల్లో ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే టీచర్స్ అందరూ కలిసి ఆయన ఇంటి వద్దకు వెళ్లి పిలవాలని హుకుం జారీ చేస్తున్నాడని, పాల్–లాబ్కు సంబంధించి రూ.22,500 అకౌంట్లో పడితే వాటిని డ్రా చేసి తనకు ఇవ్వమంటున్నాడని అర్జీలో పేర్కొన్నారు. సాధారణ బదిలీలపై ఉపాధ్యాయులు వెళ్లిపోతే వారికి తానే బదిలీ చేయించానని ప్రచారం చేస్తున్నాడని, ఎస్ఎంసీ చైర్మన్కు స్కూల్లో ప్రత్యేకంగా ఒక చాంబర్ ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీఇది నా స్కూల్, నాకు తెలియకుండా ఏ పని చేయకూడదశ్రీని ఆదేశాలిస్తున్నాడని, జిల్లా, మండల స్థాయి అధికారులు, ఫారెస్ట్ అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను కూడా ఆయన అనుమతి లేకుండా రానివ్వవద్దంటూ నిప్పులు చెరుగుతున్నాడని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత జనవరిలో గిరిజన బాలికలను అరకులో చలి ఉత్సవాలకు తీసుకెళ్లాలని కలెక్టర్ ఆదేశించారని, ఆ ఉత్సవాలకు వెళ్లే బాలికలతోపాటు తాను కూడా వస్తానని, లేదంటే తనకు ప్రత్యేకంగా కారు కేటాయించి తీసుకెళ్లాలని ఒత్తిడి చేశాడని, అందుకు తాము అనుమతించలేదని డీటీడబ్ల్యూఓకు వివరించారు. బయట గ్రామాల్లో ఆయన కనిపిస్తే నమస్కారం చేసి, బిర్యానీ పెట్టించి, ఖర్చులకు డబ్బు ఇవ్వాలని అడుగుతున్నాడని టీచర్లు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ అరాచకాలను తాము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని వేడుకున్నారు. మురికిమల్ల ఆశ్రమ పాఠశాల నుంచి బదిలీ చేయండి మూకుమ్మడిగా సెలవు పెట్టిన హెచ్ఎం, ఐదుగురు టీచర్లు డీటీడబ్ల్యూఓ వరలక్ష్మికి వినతి పత్రం అందజేత -
ఎన్నికల హామీలపై నిలదీయండి
కనిగిరిరూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా కల్లిబొల్లి మాటలతో సుపరిపాలన పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న కూటమి నేతలను పార్టీ శ్రేణులు, ప్రజలు.. హామీలు ఏమయ్యాయో నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి అన్నారు. స్థానిక పవిత్ర కళ్యాణ మండపంలో బాబు షూరిటీ–మోసం గ్యారంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కు సంబంధించి క్యూర్ కోడ్ కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఎస్కే గఫార్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో శివ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ మోసం, వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు, మరో 143 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి.. ఏడాదైనా వాటిని అమలు చేయకుండా తీవ్ర మోసం చేస్తున్నాడని విమర్శించారు. 2014, 2024 రెండు దఫాలు అబద్ధాల, మోస పూరిత హామీలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి.. ప్రజా మన్ననలు పొందిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ 2.0 పాలనలో ప్రతి కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. కనిగిరిలో పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కొరవ లేదని.. పార్టీ విజయానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. అక్రమ కేసులకు భయపడేది లేదు: బూచేపల్లి వెంకాయమ్మ కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. అటువంటి వాటికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడరని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరన్నారు. సుపరిపాలన పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న నేతలను హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలన్నారు. ఎవరూ ఎల్లప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండరని.. మారుతుంటాయని.. అధికార పార్టీ నాయకులు అది గమనించుకుని.. వేధింపులు మానుకుని పథకాల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. బొద్దింకలు, వెంట్రుకల ఉన్న భోజనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి మోసాలను ప్రజలకు వివరించాలి: దద్దాల నారాయణ యాదవ్ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు వివరించేందుకు పార్టీ నేతలు, శ్రేణులు, అంతా సమష్టిగా పనిచేద్దామని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేలా పనిచేద్దామన్నారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురేద్దామన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు: బత్తుల, కదిరి కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి.. అధికారంలోకి వచ్చారని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, విశాఖపట్నం పరిశీలకుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు సున్నం పెట్టారని విమర్శించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలన పేరుతో గ్రామాల్లోకి వస్తున్న టీడీపీ నేతలను యువకులు నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగాలు ఎక్కడా అని..? మహిళలు ఉచిత బస్సు ఏదీ అని..? విద్యార్థులు తల్లులు తల్లికి వందనం బిడ్డలందరికీ ఎందుకు ఇవ్వలేదనీ..? భరోసా, బీమా ఎక్కడా అని రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. కూటమి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు గుంటక తిరుపతిరెడ్డి, కస్తూరిరెడ్డి, పులి శాంతి గోవర్ధన్రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, చింతంగుంట్ల సాల్మన్, వైఎం సరితా ప్రసాద్రెడ్డి, గంగసాని హుస్సేన్రెడ్డి, డాక్టర్ రసూల్, రహీం, సిద్దారెడ్డి, ఎస్కే జిలాని, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, ఎస్ నరసారెడ్డి, శ్రీహరిరెడ్డి, కాకర్ల వెంకటేశ్వర్లు, జీ ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, గట్టా విజయభాస్కర్రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు మేకల శ్రీనివాస్ యాదవ్, చప్పిడి వెంకట సుబ్బయ్య, లక్ష్మీకాంతం రెడ్డి, ఎంపీపీలు గాయం సావిత్రి, మూడమంచు వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్కే చాంద్బాషా, యక్కంటి శ్రీను, జీ బొర్రారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, పాలుగుల్ల మల్లి కార్జునరెడ్డి, వైస్ ఎంపీపీలు దుగ్గిరెడ్డి ప్రతాప్రెడ్డి, లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, భూమిరెడ్డి వెంకటరెడ్డి, ముత్యాల నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీలు గాయం బలరాంరెడ్డి, భువనగిరి వెంకటయ్య, గట్ల విజయభాస్కర్రెడ్డి, ఎస్కే బుజ్జీ, ఆవుల భాస్కర్, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, పోలు జయరాంరెడ్డి, మితికల గురవయ్య, సాయి, పల్నాటి భాస్కర్రెడ్డి, వాకుమళ్ల రాజశేఖరరెడ్డి, ఎం నాగమణి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
మహా నివాళి!
జన బాంధవుడికి..వాడవాడలా సేవా కార్యక్రమాలు దర్శి నియోజకవర్గంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ నేతృత్వంలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. దర్శి వైఎస్సార్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. శివరాజ్నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ముండ్లమూరు మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి. వెంకాయమ్మ పాల్గొన్నారు. కురిచేడు బస్టాండ్సెంటర్లో పార్టీ నాయకులు అన్నదానం, మండలం పడమర వీరాయిపాలెం లోనిశ్రీ కరుణా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. దొనకొండ పట్టణంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొండపిలో.. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సింగరాయకొండ కందుకూరు రోడ్డు సెంటర్, బాలయోగినగర్ ఆర్చి, సుందర్నగర్, మూలగుంటపాడు, పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. బాలయోగినగర్లో దుస్తులు పంపిణీ చేశారు. ఆరోగ్య ప్రదాత వైఎస్సార్ చరిత్రలో గుర్తు పెట్టుకోగలిగిన నాయకుడు, ‘ఆరోగ్యశ్రీ’ తో ప్రజల గుండెల్లో నిలిచిన ఆరోగ్యప్రదాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కొనియాడారు. మంగళవారం ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరంలను ముఖ్య అతిథులుగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 45వ డివిజన్లో, చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పేదల కోసం పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని మ్యానిఫెస్టోలో పెట్టి రైతు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్కు దక్కుతుందన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రజలకు దగ్గర చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఇటువంటి నాయకుడిని చరిత్ర గుర్తు పెట్టుకుంటుందన్నారు. వైఎస్సార్ హాయాంలో ఎమ్మెల్యేగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచిఉన్నారని, చిరస్మరణీయుడని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలన్నింటినీ గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. 2029 లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. వై.పాలెంలో.. మహానేత వైఎస్సార్ జయంతిని వైపాలెం నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు. వై.పాలెంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పుల్లలచెరువు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకంలో ఆ పార్టీ నాయకులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఊరూ..వాడ అన్నదానాలు రక్తదాన శిబిరాలు.. వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ -
ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావివ్వద్దు
● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గోపాల కృష్ణ ఒంగోలు సబర్బన్: పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల బాధ్యతలు కీలమని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఓటర్ జాబితా తయారీ, బీఎల్ఓ యాప్ నిర్వహణపై ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బీఎల్ఓలకు, బీఎల్ఓ సూపర్వైజర్లకు సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు అర్బన్ తహశీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి ఫీజుల రేట్లు తెలియచేయాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2002 రూల్ నంబర్ 9 ప్రకారం జిల్లాలోని అన్నీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, లేబొరేటరీలలో వసూలు చేసే ఫీజుల వివరాలను ఇంగ్లిషుతో పాటు స్థానిక భాషలో రిసెప్షన్ కౌంటర్ల వద్ద రోగులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, లేబొరేటరీలలో లభ్యమయ్యే సేవల వివరాలను ఈ నెల 15వ తేదీలోపు జిల్లా వైద్యారోగ్య శాఖ ఈ మెయిల్కు పంపించాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను మోసం చేసిన మంత్రి లోకేష్ ఒంగోలు టౌన్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ విద్యార్థి లోకాన్ని మోసం చేశారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మిరియాలపాలెం సెంటర్లోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాసర్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూ తూ మంత్రంగా కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నాటికి రూ.3900 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండగా రూ.2600 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఆ కేటాయింపులు కేవలం పేపర్ల మీదకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. ఇంత వరకు కనీసం ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రుపాయికి కూడా రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదన్నారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయని, విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్నా ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు తెచ్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఫణిరాజు, మరియబాబు, మధు, హుసేన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అడుగంటిన ఆశలు
అడుగంటి పోతున్న కంభం చెరువు (ప్రస్తుతం 5 అడుగులు ఉన్న నీటిమట్టం)గోవిందాపురం సమీపంలో చెరువు నీళ్ళతో చిన్నపాటి చెరువులను తలపిస్తున్న బీడుభూములుపెద్దకంభం తూములనుండి లీకేజి ద్వారా పంటకాల్వల్లో పారుతున్న నీళ్ళుకంభం: ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువు నిండితే మూడేళ్ల వరకు ఆయకట్టు కింద అధికారికంగా 6944 ఎకరాలు, అనధికారింగా 12 వేల ఎకరాలు సాగులో ఉండేది. ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో చెరువులో నీళ్లు చేరే పరిస్థితులు కనబడటంలేదు. మే నెలలో అడపా దడపా భారీ వర్షాలు కురిసినా కంభం చెరువుకు నీరుచేరే నల్లమల అటవీ ప్రాంతంలో కురవకపోవడంతో చెరువుకు నీళ్లు చేరలేదు. నీటికష్టాలు తప్పవా: కంభం చెరువులో నీళ్లుంటే చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి ఆ గ్రామాల్లో నీటి సమస్య ఉండదు. ప్రస్తుతం చెరువులో 5 అడుగుల మేర నీళ్లు ఉండగా ఇరిగేషన్ అధికారులు తూము ఎత్తడంతో నీటి మట్టం తగ్గిపోతోంది. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తలెత్తుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించారు. ట్యాంకర్ల ద్వారా టీడీపీ నాయకులు భారీగా డబ్బులు సంపాదించుకున్నారన్న విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించేవి. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు పుష్కలంగా పడి కంభం చెరువులో కొంత మేర నీళ్లు చేరడంతో ట్యాంకర్ల అవసరం లేకుండానే ఐదేళ్లు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు అందించారు. ప్రస్తుతం చెరువు నీళ్లు అడుగంటి పోతుండటంతో వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు అడుగంటితే మళ్లీ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడలా..ఇప్పుడేమో ఇలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కంభం చెరువులో సుమారు 10 అడుగుల నీళ్లున్నప్పటికీ పంటల సాగుకు రైతులకు నీళ్లు వదిలితే చెరువు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతాయన్న ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు పొలాలకు నీళ్లు వదిలేందుకు అనుమతించలేదు. తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు మొరబెట్టుకున్నా తూములు ఎత్తేందుకు ససేమిరా అన్నారు. ప్రస్తుతం కంభం చెరువులో నీటి మట్టం 5 అడుగులకు పడిపోయి అడుగంటుతున్నా దర్గా గ్రామంలో కేవలం 70 ఎకరాల్లో సాగులో ఉన్న పత్తి పంట కోసం రెండుసార్లు చిన్నకంభం తూములు ఎత్తడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృథాగా పోతున్న కంభం చెరువు నీళ్లు: ఇప్పటికే చిన్నకంభం, పెద్దకంభం, నక్కల గండి తూముల వద్ద లీకేజిల ద్వారా చాలా వరకు నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నాయి. వాటిని అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులు చెరువులో ఉన్న కొద్దిపాటి నీళ్లను కాపాడుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. దర్గా గ్రామంలో రైతుల కోసం నీళ్లు వదలగా ఆ నీళ్లు చిన్నకంభం, గోవిందాపురం గ్రామాల మీదుగా పంటకాల్వల గుండా వెళ్తున్నాయి. దారి పొడువునా పంటల కాల్వలు సక్రమంగా లేకపోవడంతో గోవిందాపురం సమీపంలో ఉన్న పలు బీడు భూములు చెరువు నీళ్లతో నిండిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఇన్ని నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నక్కల గండి తూమును సైతం రాత్రి వేళల్లో పలువురు అక్రమంగా ఎత్తుకొని పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. కంభం చెరువు నీటి సామర్థ్యం: 3.30 టీఎంసీలు ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి మట్టం: 5 అడుగులుసాగు విస్తీర్ణం: అధికారికంగా 6944 ఎకరాలు అడుగంటుతున్న చారిత్రాత్మక కంభం చెరువు నీటిమట్టం గతంలో పది అడుగుల నీళ్లున్నా రైతులకు నీళ్లొదలని ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం 5 అడుగులుంటేనే తూములెత్తేసిన వైనం ఇప్పటికే తూముల లీకేజి ద్వారావృథాగా వెళ్లిపోతున్న నీళ్లు భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రాత్మక కంభం చెరువు అడుగంటుతోంది. వర్షాలు లేక చెరువు నీళ్లు 5 అడుగులకు పడిపోగా.. ఉన్న నీటినీ ఇరిగేషన్ అధికారులు తూములెత్తి వదిలేయడంతో ఆ నీరు తూముల లీకేజీల ద్వారా వృథాగా పోతోంది. చెరువులో నీరు లేకపోవడంతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. ఉన్న కొద్దిపాటి నీళ్లనూ కాపాడుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్గా రైతుల కోసం తూములు ఎత్తాం దర్గా గ్రామంలో పత్తి రైతులకు నీళ్లు కావాలని అడిగితే చిన్నకంభం తూములు ఎత్తాం. 15 రోజుల క్రితం ఒకసారి, ప్రస్తుతం రెండో సారి తూములు ఎత్తాం. నీళ్లు వృథాగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీను నాయక్, ఇరిగేషన్ ఏఈ, కంభం నీరు వృథాకాకుండా చూడాలి కంభం చెరువు నీళ్లు వృథా కాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. చెరువులో నీళ్లు అయిపోతే భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. అప్పుడు మండలంలో నీటి సమస్య తలెత్తుతుంది. చెరువు నీళ్లు వృథాగా వెళ్లకుండా ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించాలి. – చేగిరెడ్డి తులశమ్మ, ఎంపీపీ కంభం గ్రామంలో ఇప్పటికే నీటి సమస్య ఉంది సూరేపల్లి గ్రామంలో ఎప్పుడూ నీటి సమస్య ఉంటుంది. చెరువులో నీళ్లున్నా 500 అడుగులకు పైగా బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. చెరువు ఎండిపోతే ఎన్ని అడుగులు వేసినా ఈ గ్రామంలో నీళ్లు పడవు. అధికారులు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. – బిజ్జం వెంకటేశ్వరరెడ్డి, సూరేపల్లి -
తండ్రిపై హత్యాయత్నం కేసులో కుమారుడికి రిమాండ్
టంగుటూరు: తండ్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన కుమారుడికి రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామానికి చెందిన దివి చందు కొంత కాలం నుంచి చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తల్లిదండ్రులను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దీనిపై జూన్ 12వ తేదీ అతని తల్లిదండ్రులు దివి వెంకటరావు, దివి లక్ష్మి ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం తమను చందు ఇబ్బందిపెడుతూ కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అడిగినప్పుడల్లా డబ్బులివ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. అతనికి భయపడి బంధువుల ఇంటి వద్ద ఉంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ పెన్షన్ కోసం ఆలకూరపాడు గ్రామానికి దివి వెంకటరావు, దివి లక్ష్మి రాగా, రాత్రి 8.45 గంటల సమయంలో ఇంటికొచ్చిన చందు.. తన తండ్రి దివి వెంకటరావుతో గొడవపడ్డాడు. అతన్ని చంపాలనే ఉద్దేశంతో కర్ర తీసుకుని తలపై కొట్టగా తీవ్రగాయమైంది. వెంటనే ఒంగోలు జీజీహెచ్కి స్థానికులు తరలించారు. క్షతగాత్రుడి భార్య దివి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కుమారుడు దివి చందుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సోమవారం అతన్ని అరెస్టు చేసి సింగరాయకొండ కోర్టులో జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు. ఏకేయూ కళాశాల నూతన ప్రిన్సిపాల్గా నిర్మలామణి ఒంగోలు సిటీ: మూడేళ్ల క్రితం ఏర్పడిన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఇప్పటి వరకు వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే కాకుండా తన పదవీ కాలంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి వన్నె తెస్తానని అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఏకేయూ ఉప కులపతి, ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్గా తనను నియమించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణిని సహచరులైన ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఓఎస్డీ, పూర్వపు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుత్తి రాజమోహన్రావు, ఏకేయూ పరీక్షల నియంత్రణ అధికారి (సీఈ), ఏకేయూ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సోమశేఖర్తో పాటు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి చెందిన బోధన, బోధనేతర సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు బ్రహ్మయ్యమాదిగ ఒంగోలు వన్టౌన్: ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల అలుపెరుగని పోరాటం ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో మాదిగ మహామేళా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్యమాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల మాదిగల ఆశ, ఆకాంక్ష నెరవేరిందన్నారు. 1994 నుంచి 2024 వరకూ ఎస్సీ వర్గీకరణ పోరాటం జరిగిందన్నారు. 1994 జూలై 7వ తేదీ జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో ఎస్సీ వర్గీకరణ కోసం 20 మందితో ఎమ్మార్పీఎస్ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మాదిగ దండోరా పేరుతో ఉద్యమాన్ని సాగించామన్నారు. పార్లమెంటులో చట్టం చేయాలనే డిమాండ్తో 2004 నుంచి 2023 వరకూ నిత్యం ఉద్యమం నిర్వహించామన్నారు. ఢిల్లీ వీధుల్లో కూడా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
మామిడికాయల లోడు వాహనం బోల్తా
మద్దిపాడు: మామిడికాయల లోడుతో వెళ్తున్న 407 వాహనం జాతీయ రహదారిపై మద్దిపాడు సమీపంలో బోల్తాపడింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి మామిడికాయల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న 407 వాహనం మద్దిపాడు సమీపంలోకి వచ్చేసరికి ముందు టైరు పేలిపోయి అదుపుతప్పి తిరగబడింది. వాహనంలోని మామిడి కాయలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. సమాచారం అందుకున్న మద్దిపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గుమిగూడిన ప్రజలను అదుపుచేశారు. వాహనం నడుపుతున్న వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఎకై ్సజ్ అధికారుల తనిఖీలు
టంగుటూరు: మండలంలోని ఎం.నిడమానూరు, పొందూరు గ్రామాల్లో ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ లీనా, ఎస్సై గీత వారి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై మద్యం విక్రయించడం గురించి.. మంత్రి ఇలాకాలో మొ‘బైక్’ మద్యం అనే శీర్షికతో సోమవారం సాక్షి దినపత్రిక మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు సీఐ, ఎస్సైలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ లీనా మాట్లాడుతూ ఎక్కడైనా అనధికారికంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అనధికారికంగా మద్యం నిల్వలు, విక్రయాలపై తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కాగా, ఆదివారం బైక్పై మద్యం విక్రయించిన వ్యక్తిని టంగుటూరు ఎస్సై అదుపులోకి తీసుకుని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు తెలిపారు. కార్లు అద్దెకు తీసుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు ఒంగోలు టౌన్: తన కార్ ట్రావెల్స్లో మూడు కార్లు అద్దెకు తీసుకుని అద్దె చెల్లించకుండా, తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ బాధితుడు సోమవారం ఎస్పీ దామోదర్కి ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఒంగోలు మారుతీనగర్కు చెందిన వ్యక్తి.. తాను కార్ ట్రావెల్స్ నిర్వహిస్తూ జీవిస్తుండగా, ఒంగోలు సమతా నగర్కు చెందిన వ్యక్తి మూడు కార్లను అద్దెకు తీసుకున్నాడని, ఏడు నెలలైనా ఒక్క రూపాయి అద్దె చెల్లించకుండా కార్లను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 79 ఫిర్యాదులు రాగా, బాధితులు ఎస్పీని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. -
వాకర్స్కు మంచినీటి సౌకర్యం కల్పించాలి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని మామిడిపాలెం ఎస్ఎస్ ట్యాంక్–1 కట్టపై వాకర్స్ కోసం మంచినీటి సదుపాయం కల్పించాలని కోరుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జేసీని కలిసి విజ్ఞప్తి చేశారు. వాకర్స్కు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంకుపై మంచినీటి సదుపాయం కోసం జూన్ 23, 2025న ఒకసారి, జూన్ 30, 2025 మరోసారి జిల్లా కలెక్టర్కు మీ కోసం కార్యక్రమంలో అర్జీ సమర్పించామని చెప్పారు. ఎస్ఎస్ ట్యాంక్ కట్ట మీద నాలుగు చోట్ల షెడ్లు, బెంచీలు, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయాలని విన్నవించారు. సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామని జేసీ హామీ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించాలి... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా శాశ్వతంగా పరిష్కరించాలని జేసీ, ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, పార్థసారధి, విజయజ్యోతితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక వ్యవస్థ ద్వారా అందిన దరఖాస్తులకు మెరుగైన పరిష్కారాన్ని చూపాలన్నారు. నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులకు సంబంధిత కారణాలను స్పష్టంగా దరఖాస్తుదారుడికి తెలియజేయాలని సూచించారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కూడా జేసీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీకి వినతిపత్రం నిర్దేశించిన సమయంలోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు జేసీ ఆదేశం -
పట్టపగలే ఇంట్లో చోరీ
టంగుటూరు: పట్టపగలే ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసిన సంఘటన శుక్రవారం జరగ్గా, సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇత్తడి వినోద్కుమార్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతని భార్య అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఈ నెల 4వ తేదీ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చి చూడగా, ఇంటి తాళం పగలకొట్టి ఉంది. ఇంట్లో పరిశీలించగా దుస్తులు, వస్తువులు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా పగలకొట్టి అందులోని రూ.92 వేల నగదు, మూడు సవర్ల బంగారు నల్లపూసల దండ, ఉంగరం, చెయిన్ను చోరీ చేశారు. దీనిపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా, క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు. -
10న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: మెగా టీచర్ – పేరెంట్ మీటింగులను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్, జేసీ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల విద్యాశాఖాధికారులతో వర్చువల్గా సమీక్షించారు. ఈ నెల 10న జిల్లాలో జరగనున్న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడానికి విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి పాఠశాల విద్య, సమాజ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం 2,955 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, 188 జూనియర్ కళాశాలల్లో మీటింగులు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. అలాగే పూర్వ విద్యార్థులు, అక్కడ చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన వారిని కూడా ఆహ్వానించి సన్మానించాలని సూచించారు. కార్యక్రమానికి విద్యార్థులందరూ యూనిఫాంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికితీసేలా పోటీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులకు కూడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించేలా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ కిరణ్కుమార్, ఆర్ఐఓ సైమన్ విక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెగా టీచర్–పేరెంట్ మీటింగులపై ఇన్చార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ సమీక్ష అదే రోజు ప్రతి పాఠశాల, కళాశాలలో మొక్కలు నాటాలని ఆదేశం -
వైద్య రంగంలో ఆరోగ్య శ్రీ విప్లవం...
వైద్యారోగ్య రంగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, 108, 104 లాంటివి ఎందరో నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చాయి. జిల్లాలో 43 కార్పొరేట్ ఆస్పత్రులు, 64 పీహెచ్సీలు, 11 సెకండరీ హెల్త్ ఆస్పత్రులు ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రులుగా వైద్య సేవలు అందిస్తున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.25 లక్షల వరకు పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఆరోగ్య శ్రీని ఎత్తివేసేందుకు కుట్రలు మొదలు పెట్టింది. ఆస్పత్రులకు సకాలంలో బిల్లులను చెల్లించకుండా వేధిస్తోంది. ఆరోగ్య శ్రీని బీమా కిందకు తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది అమలులోకి వస్తే నిరుపేదలకు ఆరోగ్య శ్రీ సేవలు దూరమైనట్టే. -
మేరు నగధీరుడు వైఎస్సార్
ఒంగోలు సిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలు జీవితకాలం గుర్తుంచుకోదగ్గ మేరు నగధీరుడు అని ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. నేడు వైఎస్సార్ 76వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సోమవారం ఆయన పిలుపునిచ్చారు. బత్తుల మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో పేదవాడి గుండెచప్పుడు పసిగట్టిన దార్శనికుడు వైఎస్సార్ అని అన్నారు. వృత్తిపరంగా వైద్యుడైనా ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యాలను గుర్తించి ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ వైద్యం పేదల దరి చేర్చారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో కార్పొరేట్ విద్య, 108 సేవలు ఆయన వల్లే పురుడు పోసుకున్న విషయాన్ని ఆయన రాజకీయ వైరులు సైతం స్వాగతించారన్నారు. నేడు వీధికి ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నారంటే అది నాడు వైఎస్సార్ దార్శనికత వల్లే సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయాన్ని సంస్కరణల బాట పట్టించి 82 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించి అపర భగీరథునిగా వైఎస్సార్ నిలిచారన్నారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందించి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయాన్ని పండగ చేశారని చెప్పారు. విలువలతో కూడిన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రైతు పక్షపాతిగా, రాజకీయాల్లో మాటతప్పని, మడమ తిప్పని నేతగా నిలిచిన వైఎస్సార్ బాటలో నడుస్తున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెన్నంటి ఉండి దివంగత నేతకు నివాళులర్పిద్దామని పిలుపునిచ్చారు. నేడు మహానేత వైఎస్సార్ జయంతిని జయప్రదం చేద్దాం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి బత్తుల బ్రహ్మానందరెడ్డి -
సంక్షేమ పరవళ్లు!
అభివృద్ధికి బాటలు..● వైఎస్సార్ హయాంలోనే శరవేగంగా వెలిగొండ నిర్మాణం ● గుండ్లకమ్మ, రామతీర్థంలకు జలసవ్వడులు ● రైతు రుణమాఫీతో అన్నదాతలకు అండగా నిలిచిన మహానేత ● వైఎస్సార్సీపీ పాలనలో పూర్తయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ● మార్కాపురంలో మెడికల్ కళాశాల పనులు వేగవంతం ● నేడు కూటమి పాలనలో అంతా తిరోగమనం పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సాయం.. కరువు జిల్లాగా పేరొందిన జిల్లాకు వెలిగొండ వచ్చింది. గుండ్లకమ్మ పరుగులు పెట్టింది. రామతీర్థం జలకళతో సవ్వడి చేసింది. రైతు మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. జిల్లా కేంద్రం ఒంగోలుకు మెడికల్ కళాశాల వచ్చింది. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన పునాదులు జిల్లా అభివృద్ధికి బాటలు వేశాయి. అప్పటిదాకా కరువు కాటకాలతో విలయతాండవం చేసిన జిల్లాలో ఆయన నడిచినంత మేరా పచ్చనిపైర్లు పలకరించాయి. ఆయన వారసుడిగా వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి స్ఫూర్తితో పాలన కొనసాగించారు. మార్కాపురంలో మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించారు. సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాలకు అండగా నిలిచారు. నేడు కూటమి పాలన అంతా తిరోగమనంలో సాగుతోంది. వెలిగొండపై నిర్లక్ష్యం.. మెడికల్ కళాశాల వెనక్కి..ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీపై నీలి నీడలు.. ఇలా ఏడాది కాలంలో కూటమి పాలకులు జిల్లాకు చేసిన అన్యాయంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా నాటి రాజన్న పాలనను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ (ఫైల్)సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.477 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. శరవేగంగా పనులు సాగుతున్న సమయంలో ఆయన మరణంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. 2014 నుంచి 2019 చంద్రబాబు పాలనలో వెలిగొండ దాదాపుగా మూలనపడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన అరకొర పనులు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసురావడం లేదు. బడ్జెట్లలో కేవలం రూ.300 కోట్లు కేటాయించారంటే ఈ ప్రాజెక్టుపై వారి శ్రద్ధ అర్థం చేసుకోవచ్చని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూపాయి కూడా కేటాయించకుండా ప్రాజెక్టు పనులు పూర్తి కావడం అసాధ్యం. పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువులు ఆగిపోకూడదంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులనభ్యసించారు. చంద్రబాబు పాలనలో ఆ పథకం నీరుగారడంతో పేద విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తిరిగి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు అండగా నిలిచారు. గత ఐదేళ్లలో 3,09,817 మంది విద్యార్థులకు విద్యా దీవెన, 2,72,315 మంది విద్యార్థులకు వసతి దీవెన ద్వారా కోట్ల రూపాయల సాయం అందించారు. మళ్లీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిగా విద్యార్థులకు సాయం అందించకుండా వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందివెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెళ్లు -
మంత్రి స్వామికి సమస్యల స్వాగతం
సింగరాయకొండ: మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ టీపీ నగర్, అప్పాపురం ఎస్టీకాలనీలో సోమవారం రాత్రి రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి నిర్వహించిన సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో గ్రామస్తుల నుంచి సమస్యలు స్వాగతం పలికాయి. పింఛన్ మంజూరు కాలేదని, తల్లికి వందనం డబ్బులు రాలేదని, ఇళ్లు మంజూరు కాలేదని పలువురు ప్రజలు మంత్రికి ఏకరువు పెట్టారు. ఆధార్కార్డు లేక ప్రభుత్వ పథకాలు రావడం లేదని, ఆధార్కార్డు మంజూరు చేయించాలని ఎస్టీలు మంత్రికి విన్నవించుకున్నారు. వెంటనే పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని మంత్రి స్వామి అధికారులకు సూచించారు. టీపీ నగర్, అప్పాపురంలో సుమారు 1300 గృహాలుండగా, మంత్రి స్వామి కేవలం 300 గృహాలే తిరిగారని, తమ గృహాలకు రాలేదని టీపీ నగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. -
నేడు ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొననున్నటు తెలిపారు. అన్ని నియోజకవర్గాల యూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెస్తాం ● నూతనంగా విధుల్లో చేరిన పలువురు అడ్మిన్లు ఒంగోలు సిటీ: విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఏకేయూలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కళాశాలల అభివృద్ధి మండలి (సీడీసీ)డీన్ డాక్టర్ కే.వి.ఎన్.రాజు, నూతనంగా ఏకేయూ పరీక్షల నియంత్రణ అధికారి (సి.ఈ)గా విధుల్లో చేరిన ప్రొఫెసర్ జి.సోమశేఖర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో వారి నూతన విభాగాల్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరికి యూనివర్సిటీకి చెందిన సహచర అధ్యాపకులు, సిబ్బంది, పలు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ‘అక్షర ఆంధ్ర’ ను విజయవంతం చేయాలి ●● సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సబర్బన్: నిరక్షరాస్యులైన వయోజనులను కూడా అక్షరాస్యులుగా మార్చే ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో నిర్వహించారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉల్లాస్’ పథకంలో భాగంగా 2025–26 విద్యా సంవత్సరంలో ‘అక్షర ఆంధ్ర’ అనే ప్రత్యేక సాక్షరతా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్ మోహన్రావు ఈ సందర్భంగా వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 1,29,497 మందిని అక్షరాస్యులుగా చేయాల్సి ఉందన్నారు. ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బోధన ప్రారంభమయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినందున, దీనికి సంబంధించిన వాలంటీర్ టీచర్ల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలను ప్రణాళిక మేరకు ఈ నెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, డీఈవో కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు
● మనుషుల నుంచి జంతువులకు కూడా.. ● వరల్డ్ జూనోసిస్ డేలో జిల్లా పశుసంవర్థక శాఖాధికారి రవికుమార్ ● పెంపుడు కుక్కలకు టీకాలు ఒంగోలు సబర్బన్: జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయని, అదేవిధంగా మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాధులు సంక్రమిస్తాయని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి బి.రవికుమార్ తెలిపారు. వరల్డ్ జూనోసిస్ డేని పురస్కరించుకుని స్థానిక సంతపేటలోని బహుళార్ద పశువైద్యశాలలో ఆదివారం పెంపుడు కుక్కలకు వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జంతువులతో మానవునికి సహచర్యం ఎంతో ప్రాచీనమైనదన్నారు. ప్రతి మనిషి పౌష్టికాహార అవసరాలకు పశుపక్ష్యాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ఆధారపడి ఉన్నారన్నారు. మనుషులు, పశువుల సహచర్యంతో జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులని పిలుస్తారన్నారు. ఈ వ్యాధులు సుమారు 280 వరకు గుర్తించబడ్డాయని తెలిపారు. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారి 1885 జూలై 6వ తేదీ పిచ్చికుక్క కాటుకు గురైన బాలునికి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందును విజయవంతంగా ఇచ్చినందున ఆ రోజు నుంచి ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు వైరల్కు సంబంధించి రేబిస్, మెదడు వాపు, అమ్మవారు (పాక్స్), బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, నిఫా, బ్యాక్టీరియల్ వ్యాధులైన ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాలో నెల్లోసిస్, లిస్టీరియోసిస్, క్షయ (టీబీ), పారాసైటెక్ వ్యాధులు, అమీబియాసిస్, బాలాంటిడియోసిస్, సార్బోసిస్టోసిస్, టీనియాసిస్, ట్రైకినెల్లోసిస్, ఆస్కారియాసిస్, స్కేబీస్ (గజ్జి), తామర, హైడాటిడోసిస్, ఆంకై లోస్టోమియోసిస్ లాంటి వ్యాధులు వస్తాయన్నారు. రేబిస్ వ్యాధి పిచ్చికుక్కల కాటు ద్వారా వ్యాప్తిచెందే అతి భయంకరమైన వ్యాఽధి అని తెలిపారు. పెంపుడు కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలను ప్రతి సంవత్సరం వేయించాలని సూచించారు. ఒంగోలు నగరంలోని 518 పెంపుడు కుక్కలను వాటి యజమానులు తీసుకొచ్చి రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. పోలీస్ జాగిలాలను కూడా వాటి సంరక్షకులు తీసుకొచ్చి వ్యాక్సిన్ చేయించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, మేయర్ సుజాత, పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హైవే పక్కన ఆక్రమణల తొలగింపు
● ఫెన్సింగ్ తొలగించి దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు ● రూట్ ఆఫీసర్ నరసింహారావు హెచ్చరిక ఒంగోలు సబర్బన్: ఆరు లైన్ల జాతీయ రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని సింహపురి ఎక్స్ప్రెస్ హైవే రూట్ ఆఫీసర్ కే నరసింహారావు హెచ్చరించారు. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటి స్పీడ్ రోడ్డు మార్జిన్లో నిబంధనలకు విరుద్ధంగా పంక్చర్ షాపులు, దుకాణాలు, హోటళ్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఒంగోలులోని పెళ్లూరు వద్ద హైవే మార్జిన్లో ఏర్పాటు చేసిన దుకాణాలను ఆదివారం హైవే సిబ్బందితో తొలగించారు. దుకాణాలున్న ప్రాంతాల్లో వాహనాలను రోడ్డు మీద నిలిపివేస్తుండటంతో ఇటీవల ప్రమాదాలు జరిగాయన్నారు. స్పీడ్ రహదారి కావడంతో జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం ఫెన్సింగ్కు నష్టం కూడా చేయకూడదన్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైవే మార్జిన్లలో ఎక్కడా వాహనాలు నిలపరాదన్నారు. అలాంటిది ఏకంగా పంక్చర్ షాపులు, టీ, టిఫిన్ హోటళ్లు ఏర్పాటు చేయడం, వాటి వద్ద వాహనాలు నిలుపుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అందుకోసం రోడ్డు మార్జిన్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హైవే నిబంధనలను వివరించారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని నరసింహారావు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు సీహెచ్ నరసింహులు, సిబ్బంది మహేష్, మోహన్బాబు, రాబర్ట్, తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య
కొమరోలు/ప్యాపిలి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామ సమీప రేగలగడ్డ చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కట్టెల భారతికి(20)మూడేళ్ల క్రితం అలేబాదు గ్రామానికి చెందిన శివప్రసాద్తో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఏడాదిగా భారతి స్వగ్రామంలో ఉంటోంది.ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(26)తో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం పెద్దలకు తెలియడంతో వారు హెచ్చరించారు. దీంతో ఇరువురూ ఈ నెల 4న ఇంటి నుంచి పారిపోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపించి ఫోన్ స్విచాఫ్ చేశాడు. స్థానిక ఎస్సై నాగరాజు ఆదివారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి లొకేషన్ ఆధారంగా అక్కపల్లె గ్రామానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గాలించగా భారతి, రాముడు చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పురివిప్పిన పాత కక్షలు.. వ్యక్తి దారుణ హత్య
ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం నల్లగుంట్లలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. 2022 ఫిబ్రవరి 9వ తేదీన కొర్రప్రోలు సమీపంలో జరిగిన మొద్దు వెంకటేశ్వర్లు హత్య కేసులో గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు కక్షతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గ్రామంలో మొహర్రం వేడుకల సందర్భంగా బాదుల్లా షరగత్ను నిర్వహించారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థి వర్గీయులు అర్ధరాత్రి సమయంలో కాపు కాసి వెంకటేశ్వర్లుపై కత్తులతో చేసిన దాడి కిరాతకంగా నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గ్రామంలో పోలీస్ పికెట్వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగింది. భార్య విజయలక్ష్మి భర్త మృతదేహంపై పడి బోరున విలపించటం అందరినీ కలిచి వేసింది. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో స్పెషల్ పార్టీ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. -
గోవా మద్యం స్వాధీనం
కంభం/గిద్దలూరు రూరల్: అక్రమంగా గోవా మద్యం తరలిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు రెండు చోట్ల చిక్కినట్టే చిక్కి పారిపోయారు. గిద్దలూరు, కంభం ఎకై ్సజ్ సీఐలు శనివారం తమ కార్యాలయాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మార్కాపురం ఏఈఎస్టీఎఫ్ సిబ్బందితో కలిసి ఆర్పీఎఫ్ అధికారుల సహకారంతో కంభం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ఒక బ్యాగులో 4.7 లీటర్ల గోవా లిక్కర్ పట్టుబడింది. గుర్తు తెలియని నిందితుడు పారిపోయాడని ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. గిద్దలూరు రైల్వేస్టేషన్లో 7 గోవా మద్యం బాటిళ్లు సీజ్ చేశామని, నిందితుడు తప్పించుకున్నాడని స్థానిక ఎకై ్సజ్ పోలీసులు చెప్పారు. ఒకే రోజు రెండు సంఘటల్లో నిందితులు పారిపోయారని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిద్దలూరులో స్వాధీనం చేసుకున్న గోవా మద్యం -
12, 13న బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేఎస్ లక్ష్మణ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11,13,15,17,19 విభాగాల బాలబాలికలతోపాటు సీనియర్ మహిళలు, పురుషుల విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్కార్డు, వయసు ధ్రువీకరణ పత్రంతో ఈనెల 10వ తేదీలోగా 9398260109ను సంప్రదించాలని సూచించారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్కాపురంలో ఇద్దరు యువకుల ఆత్మహత్య మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ యువకుడు ఉరేసుకుని తనువు చాలించగా, మరో యువకుడు పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మరణించాడు. పట్టణ ఎస్సై సైదుబాబు కథనం మేరకు.. పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లికి చెందిన వెన్నం రాంబాబు(24) తన కుటుంబ సభ్యులతో కలిసి మార్కాపురంలోని జవహర్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన తండ్రి ఒక అపార్టుమెంటులో వాచ్మెన్. కుటుంబ సమస్యల నేపథ్యంలో గురువారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడి అన్న దశరథరాముడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● మార్కాపురం జవహర్నగర్ కాలనీలో నివాసముండే నూతలపాటి చెన్నకేశవులు(30) కుటుంబ సమస్యల కారణంగా శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య ఆగ్నేషా, కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు ఉన్నత చదువు చదివాడు. ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఇద్దరు యువకుల మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆదాయం దిగదుడుపు.. రైతు చావులే రెట్టింపు
ఒంగోలు టౌన్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడతామని చెప్పిన మోదీ మాటలన్నీ నీటిలో మూటలయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ధ్వజమెత్తారు. మోదీ కార్పొరేట్ అనుకూల పాలనతో వ్యవసాయ రంగం మరింతగా సంక్షోభంలో కూరుకుపోయిందని, కనీస ఆదాయం కూడా లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని నిప్పులు చెరిగారు. కార్మికుల హక్కులు కాపాడాలని, రైతులకు గిట్టుబుటు ధరలు కల్పించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు కర్షకులు, కార్మికులు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంకణాల మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా తిప్పికొట్టేందుకు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 24 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా కుదించడం దుర్మార్గమన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నారని, లేబర్ కోడ్ల వల్ల 8 గంటల పని దినాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే కాకుండా, ఉపాధి హామీ చట్టాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుదామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరుమూసుకొని కూర్చోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు ఊసా వెంకటేశ్వర్లు, అన్నవరపు శేషారావు, కంకణాల వెంకటేశ్వర్లు, గడ్డం పిచ్చయ్య, గోగుల నారాయణ, ఉబ్బా వెంకటేశ్వర్లు, తలారి ఆదాం, జి.వందనం, ఎం.దాసు, టి.అంజిబాబు, గోపి తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో సంక్షోభంలో వ్యవసాయం కార్మిక హక్కులు హరించేలా లేబర్ కోడ్లు దుర్మార్గం కార్మికులంతా ఏకంకండి.. సమ్మెకు కదిలిరండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల -
నేడు తుమ్మలచెరువులో పెద్ద షహాదత్
తర్లుపాడు: మొహర్రం వేడుకల్లో భాగంగా ఆదివారం తుమ్మలచెరువులో పెద్ద షహాదత్ నిర్వహించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దర్గాలో కొలువైన పెద్ద ఖాశీం స్వామి, చిన్న ఖాశీం స్వాములను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పీర్ల మకాన్, దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శనివారం రాత్రి అగ్ని గుండం మండించారు. తెల్లవారుజామున స్వామివారిని గ్రామంలో ఊరేగిస్తారు. కాగా, ఆర్టీసీ ఆధ్వర్యంలో తరుమ్మలచెరువుకు ప్రత్యేక బస్సులు, దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పొదిలి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏరులై పారుతున్న మద్యం పెద్ద షహాదత్ సందర్భంగా ఖాశీం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుండటంతో మార్కాపురానికి చెందిన సిండికేట్ నాయకుడు తన మనుషుల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాడు. ఎకై ్సజ్, పోలీసు అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టానుసారంగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి
కొత్తపట్నం: ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈతముక్కల గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. టంగుటూరు మండలం వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన దూడల నారాయణ(40) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఈతముక్కలలో రొయ్యలు కొనుగులు చేసి తన బైక్పై ఇంటికి బయలుదేరాడు. గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ అదుపు తప్పి ఢీకొనడంతో నారాయణకు బలమైన గాయాలై స్పహ కోల్పోయాడు. స్థానికులు 108 అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఎస్ఐ సుధాకర్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రైతుల మాట అబద్ధం.. కాదు పోలీసులదే తప్పు!
త్రిపురాంతకం: ఓ భూవివాదం పోలీసులు, రైతుల మధ్య మాటల మంటలు రేపింది. పోలీసులు అన్యాయం చేస్తున్నారని రైతులు ఓ వీడియోలో ఆరోపించగా.. అదంతా తప్పుడు ప్రచారమంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో సీఐ హసన్, ఎస్సై శివబసవరాజు విలేకర్లతో మాట్లాడారు. త్రిపురాంతకం మండలం దీవేపల్లి వద్ద తలెత్తిన భూ వివాదంలో ఇరువర్గాల వారి మధ్య ఘర్షణ వాతావరణం ఉందన్నారు. రైతులు తమవని చెబుతున్న భూములు వేరే వ్యక్తులపై రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. వివాదం నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులకు తెలియజేశామన్నారు. ఈ భూ తగాదాపై కేసు నమోదు చేశామని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల వాదన ఇదీ.. రైతులు ఒక వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూములను అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని దివేపల్లికి చెందిన ఎస్.చెన్నయ్య, కొండయ్య, ఓబులు, నర్సమ్మ, దూపాడుకు చెందిన చెన్నయ్య, పుల్లయ్య, డేవిడ్ ఆరోపించారు. భూములు పోతే ఆత్మహత్యే శరణ్యమని పురుగు మందు బాటిళ్లతో హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ తెలియకుండా సర్వే నంబర్ 881లో తుమ్మలవాగు పోరంబోకు భూమి 7.70 ఎకరాలను రిటైర్డ్ ఉద్యోగి భార్య, కుమారుడు శివకుమార్పై అసైన్మెంట్ చేసుకున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై హక్కు కల్పించాలని కోరారు. -
ఇంతుల కోర్టులోకే రుణాల బంతి!
పాత బకాయిలు రూ.16 కోట్లు చెల్లించాకే కొత్తవంటూ మెలిక బేస్తవారిపేట: డ్వాక్రా సంఘాల మహిళలకు సీ్త్ర నిధి రుణాల మంజూరులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పాత బకాయిల వసూలుకు కొత్త రుణాల మంజూరు ప్రక్రియకు ముడి పెట్టడంపై మహిళలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎల్పీ–ఎంసీపీ యాప్లో వివరాల నమోదులో కొనసాగుతున్న జాప్యం రుణాల మంజూరుకు మరో అడ్డంకిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ఉచ్చులో చిక్కుకోకుండా, వారి జీవనోపాధి కోసం ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్రీనిధిని ఏర్పాటు చేసింది. చిన్న హోటళ్లు, కిరాణ దుకాణాలు, కూరగాయలు పండించడం–విక్రయించడం, పేపర్ ప్లేట్ల తయారీ, టైలరింగ్ లాంటి వ్యాపారాలు, వృత్తులు చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు చిన్నచిన్న మొత్తాల్లో సీ్త్రనిధి బ్యాంకు రుణాలు అందిస్తుంది. మూడు నెలల క్రితం వరకు రుణం అవసరమైన డ్వాక్రా మహిళలకు సీ్త్రనిధి యాప్లో వివరాలు నమోదు చేసి, బ్యాంకుల నుంచి కావాల్సిన రుణం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం హెచ్ఎల్పీ–ఎంసీపీ యాప్(హౌస్హోల్డ్ లవులీఉడ్ ప్లాన్–మైక్రో క్రెడిట్ ప్లాన్)లో గ్రూప్ సభ్యులందరి జీవనోపాధి వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ గత మూడు నెలలుగా కొనసాగుతుండటంతో సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయకుండా నిలిపివేశారు. జిల్లాలో రూ.16 కోట్ల మేర సీ్త్రనిధి రుణాల బకాయిలు వసూలయ్యే వరకు కొత్త రుణాలు మంజూరు చేసేది లేదని చెబుతుండటంతో అర్హులైన మహిళలు విస్తుపోతున్నారు. సకాలంలో రుణాలు అందకపోవడంతో చిన్న చిన్న అవసరాల కోసం ప్త్రెవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తోందని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే మహిళలు పెట్టుబడి కోసం, అలాగే కళాశాలలు తెరవడంతో తమ పిల్లల ఫీజులు, పుస్తకాల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ మహిళలకు ఉన్నతి కింద సున్నా వడ్డీకే సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తారు. ఈ నేపథ్యంలో ఎస్సీ మహిళలు నెలల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయాలని పొదుపు సంఘాల మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో డ్వాక్రా సభ్యులు 4,54,628 గ్రామ సమాఖ్య సంఘాలు 1,541 డ్వాక్రా సంఘాలు 45,062 సీ్త్రనిధి రుణాల కోసం డ్వాక్రా మహిళల ఎదురుచూపులు మూడు నెలలుగా రుణం మంజూరు కాక మహిళల అవస్థలు హెచ్ఎల్పీ–ఎంసీపీ యాప్లో సభ్యుల వివరాల నమోదుతో మరింత ఆలస్యం బయోమెట్రిక్ పూర్తయిన గ్రూపులు 34,814 సీ్త్రనిధి రుణాలు తీసుకున్న వారి నుంచి రికవరీ సరిగా లేదు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.1.60 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీఓఏలు సక్రమంగా రుణాలు కట్టించడంలేదు. కొన్ని గ్రామ సంఘాల సభ్యులు రెండు నుంచి మూడేళ్లుగా రుణాలు చెల్లించడం లేదు. ప్రస్తుతం రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాం. – రాజేశ్వరి, గిద్దలూరు క్లస్టర్ సీ్త్రనిధి మేనేజర్ -
భర్త వేధిస్తున్నాడంటూ భార్య నిరసన
ఒంగోలు టౌన్: వివాహమై 30 ఏళ్లయినా తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. భర్త పనిచేస్తున్న స్థానిక రాజాపానగల్ రోడ్డులోని యూనియన్ చెస్ బ్యాంక్ వద్ద అతని ఫొటోతో కూడిన ఫ్లెక్సీ పట్టుకుని ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వల్లభరావుపాలేనికి చెందిన ఇందిరకు ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన తొట్లెంపూడి పోలయ్యతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం కాగా, పోలయ్య ఒంగోలులోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 30వ తేదీ రిటైర్డ్ కాబోతున్నాడు. ఆయన కొంతకాలంగా ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ప్రస్తుతం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళతో ఉంటున్నాడని ఇందిర ఆరోపించింది. ఒంగోలు నగరంలోని సుజాతనగర్లోని ఓ ఇంట్లో ఆమెతో కలిసి సహజీవనం చేస్తూ తనను, పిల్లలను బయటకు గెంటేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో విడాకులు కోరుతూ కోర్టులో కేసు కూడా వేశాడని తెలిపింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని, అతని సర్వీసు రికార్డులో తన పేరు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే పోలయ్యపై ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశానని, దిశ పోలీస్స్టేషన్కు రిఫర్ చేశారని తెలిపింది. తన భర్త మీద చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. -
ఏకేయూ అడ్మిన్ స్థానాల్లో మార్పులు
ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి యూనివర్శిటీలో పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు పలు అడ్మిన్ స్థానాల్లో మార్పులు చేసినట్లు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి. హరిబాబు శుక్రవారం తెలిపారు. ఏకేయూ నూతన ఓఎస్డీగా ప్రస్తుత ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జి.రాజమోహన్రావును, ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణిని ప్రిన్సిపాల్గా నియమించారు. సీడీసీ డీన్ ప్రొఫెసర్ జి.సోమశేఖరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వైస్ ప్రిన్సిపాల్గా, అలాగే సీఈగా పనిచేస్తున్న డాక్టర్ కేవీఎన్ రాజుకు సీడీసీ డీన్గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత మార్పుచేర్పులు 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయని రిజిస్టార్ స్పష్టం చేశారు. నూతనంగా విధుల్లో చేరనున్న అడ్మిన్లు ఈ పదవుల్లో తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కొనసాగుతాయని రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతనంగా అడ్మిన్ స్థానాలు పొందిన ప్రొఫెసర్లకు వీసీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తదితరులు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. -
మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన!
మార్కాపురంపై ఇటీవల కమ్ముకున్న మేఘాలు మార్కాపురం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. నైరుతి రుతు పవనాలు ముందుగా వచ్చినప్పటికీ జూన్ రెండో వారం నుంచి సరైన వర్షాలు కురవలేదు. జూన్ మాసంలో జిల్లా సాధారణ వర్షపాతం 43.75 మిల్లీమీటర్లు కాగా 40.9 మి.మీ కురిసినట్లు ఐఎండీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం వర్షం జాడ లేక పొలాలు పదునెక్కలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పొలాలను దుక్కి దున్నిన రైతులు పదును వాన పడితే పంటలు సాగు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసినా వర్షాలు లేకపోవడంతో రైతులతో కలకలలాడాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల షాపులు వెలవెలబోతున్నాయి. వర్షం కురిస్తే రైతులు పత్తి, మిర్చి, కంది, సజ్జ, కొర్ర, ఆముదం, జొన్న తదితర పంటలు సాగుచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదునుదాటి వర్షాలు కురిస్తే పంటలకు తెగుళ్లు సోకి పెట్టుబడి వ్యయం ఎక్కువవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సాయమేది? ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటల పెట్టుబడికి ప్రభుత్వం అందించే సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు కొంత మేర ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఎకరా పత్తి సాగు చేయాలంటే రూ.50 వేలు, మిర్చికి సుమారు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీంతో రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్న నైరుతి రుతుపవనాలు జూన్లో సాధారణ వర్షపాతం 43.75 మి.మీ కాగా కురిసింది 40.9 మి.మీ అదును దాటి వర్షాలు కురిస్తే తెగుళ్ల బెడద వెంటాడుతుందని ఆందోళన జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 4,62,944 ఎకరాలు ఇప్పటి వరకు సాగైంది 1687.7 ఎకరాలు ప్రారంభం కాని ప్రధాన పంటల సాగు అన్నదాత సుఖీభవ పథకం అమలులో సర్కారు వాయిదాల పర్వం పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు ఆకాశమే గంభీరం.. అన్నదాతల్లో సన్నగిల్లుతున్న ఆత్మస్థైర్యం సాగు అత్యల్పం! జిల్లాలో ప్రస్తుత సీజన్లో పంటల సాగు లక్ష్యం 4,62,944 ఎకరాలు కాగా ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1700 ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగు చేశారు. ప్రధానంగా వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, మినుములు, పెసలు, కంది తదితర ప్రధాన పంటలు సాగు కాలేదు. వరి 12,826 హెక్టార్లు, సజ్జ 7,020, మొక్కజొన్న 3,120, కొర్ర 1,337, పెసలు 949, మినుములు 2,456, కంది 68,287 హెక్టార్లు, నువ్వులు 3,457, ఆముదం 1,537, పత్తి 26,981, మిర్చి 25,217 హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు సజ్జ 88, ఆముదం 10, పత్తి 287, నూగులు 6 హెక్టార్లలో మాత్రమే సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూరగాయలు 237 హెక్టార్లలో సాగవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద ఖరీఫ్ సాగు ఆశాజనకంగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాన పడితేనే పంటలేస్తాం ఈ ఏడాది జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. పొలాలన్నీ దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నాం. వర్షం పడితే పత్తి, సజ్జ, కంది పంటలు వేసేందుకు అనువుగా ఉంటుంది. – టి.రామిరెడ్డి, రైతు -
రెండు గంటల్లో.. ‘వెనకడుగు..’ మంత్రి, ఎంపీలకు చేదు అనుభవం
జరుగుమల్లి (సింగరాయకొండ): కూటమి ప్రభుత్వ హామీల అమలు, అవకతవకలపై అడుగడుగునా మహిళలు నిలదీయడంతో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు చేదు అనుభవం ఎదురైంది.ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో గురువారం తొలిరోజు ప్రారంభమైన ‘తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా నాయకులు జరుగుమల్లి మండల కేంద్రానికి వచ్చారు.‘అయ్యా.. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాపకు మాత్రమే తల్లికి వందనం నగదు పడింది.. మిగతా వారికి పడలేదు’ అని మహిళ అడగ్గా, ‘మాకు గ్యాస్ డబ్బులు పడలేదు’ అంటూ మరికొందరు నిలదీశారు. ‘సార్.. నాకు ఇంటి స్థలం ఉంది.. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు కాలేదు’ అని మరో మహిళ ఆగ్రహం వ్యక్త చేసింది. -
వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు పట్టవా
టంగుటూరు: వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టవా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే వీరారెడ్డి అన్నారు. స్థానిక వేలం కేంద్రం నిర్వహణాధికారి శ్రీనివాసరావుకు పొగాకు రైతుల సమస్యలపై బుధవారం వినతి పత్రం అందించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రైతులు పండించిన ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని అన్నారు. రైతులు పండించిన పొగాకు గతంలో క్వింటా రూ.36 వేలు పలికినా నేడు రూ.28 వేలు కూడా ఇవ్వటం లేదన్నారు. వ్యాపారుల సిండికేట్ ముసుగులో రైతులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం నష్టాల నుంచి కాపాడాలని కోరారు. రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని తెలిపారు. రైతులు తెచ్చిన పొగాకును వెనక్కి తీసుకెళ్లకుండా పొగాకు వేలం కేంద్రం అధికారులు చూడాలన్నారు. పొగాకు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతుల పొగాకును గిట్టుబాటు ధరలకు కొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి పొగాకు రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని వేలం నిర్వహణ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మి, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ప్రభాకర్, రైతు నాయకులు జీ ప్రసాద్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, కిరణ్, కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
● రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఒంగోలు టౌన్: చట్టాలపై సమగ్రంగా అవగాహన పెంపొందించుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. డైరక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ రాహుల్ దేవ్ శర్మతో కలిసి బుధవారం ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీని సందర్శించారు. కాలేజీలో శిక్షణ పొందుతున్న 102 మంది ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడారు. శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ల ప్రకారం నిందితులను అరెస్టు చేయడం, కేసు నమోదు చేయడం వంటి విషయాలను వివరించారు. మహిళలను అరెస్టు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. చెక్ పోస్టు నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిత్యం చట్టాల గురించి అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, ఏఈఎస్లు, సీఐ, ఎస్సైలు, పీటీసీ అధికారులు పాల్గొన్నారు. -
నేడు ప్రైవేట్ పాఠశాలలు బంద్
ఒంగోలు సిటీ: ప్రైవేట్ యాజమాన్యాలపై అతిగా స్పందిస్తున్న కొంతమంది అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో గురువారం అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అపుస్మ ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్, కార్యదర్శి కాట్రగడ్డ మురళీకృష్ణ, వంశీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది అధికారులు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై అతిగా స్పందించడం, పాఠశాలలపై 3 మెన్ కమిటీలు, తనిఖీలను అమలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. కొన్ని ఏకపక్ష వార్తలు, కొంతమంది వ్యక్తుల లేఖలు, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఎప్పటికప్పుడు నోటీసులు జారీచేయటం వాటిని వెంటనే అమలు చేయమనడం, కొంతమంది ఫీల్డ్ అధికారుల నుంచి అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు వంటి చర్యలు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల్లో తీవ్ర వేదన కలిగిస్తున్నాయన్నారు. కొంతమంది అధికారులు తీసుకున్న అన్యాయమైన, ఏకపక్ష నిర్ణయాలతో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలను ఆర్టీఈ 12.1.సీ దరఖాస్తుదారులను తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని బలవంతం చేయడం, పాఠశాలలను షోకాజ్ నోటీసులతో వేధించడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయనున్నట్లు తెలిపారు. సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం ఒంగోలు సిటీ: భారత ప్రభుత్వం 2025వ సంవత్సరానికి గాను జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ జాతీయ స్థాయిలో జాతీయ ఐక్యత, సమగ్రత పై అత్యుత్తమ సేవ చేసిన వ్యక్తులు, సంస్థలకు సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డు ప్రదానం చేస్తున్నట్లు స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం జిల్లాలో ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు జాతీయ ఐక్యత, సమగ్రతపై వారు చేసిన విశేష కృషిని తెలియచేస్తూ తమ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎడబ్ల్యూఆర్డీఎస్.జీవోవీ.ఇన్ అనే వెబ్ సైట్లో ఈ నెల 9వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. ఆ దరఖాస్తును, ఇతర వివరాలను ముఖ్య కార్యనిర్వహణాధికారి, స్టెప్, జిల్లా యువజన సంక్షేమశాఖ, ఒంగోలు కార్యాలయంలో 9వ తేదీలోగా మూడు కాపీలు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో స్వయంగా కానీ లేదా ఫోన్ నంబర్ 91828 91095 ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరారు. జాతీయ స్థాయి ఎల్ఎస్వీఎస్ శిక్షణకు విజయానంద్ సింగరాయకొండ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ ఆధ్వర్యంలో జూన్ 24, 25వ తేదీల్లో నిర్వహించిన ఎల్ఎస్వీఎస్ శిక్షణ కార్యక్రమంలో పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు డీ విజయానంద్ పాల్గొన్నారు. ఈ శిక్షణకు రాష్ట్రం నుంచి 10 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా జిల్లా ప్రతినిధిగా విజయానంద్ ప్రాతినిధ్యం వహించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో నాణ్యతా ప్రమాణాల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసే పద్ధతులపై రెండు రోజులు శిక్షణ ఇచ్చారని విజయానంద్ వివరించారు. విజయవాడకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వారు తనను నామినేటెడ్ చేశారని, శిక్షణ పూర్తి చేసిన వారికి సంస్థ డీజీఎం చిత్రాగుప్తా, డాక్టర్ ఎస్ సూర్యకళ్యాణి ధ్రువపత్రాలు అందజేశారన్నారు. ఈ శిక్షణ ద్వారా తాను నేర్చుకున్న విజ్ఞానంతో విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తానన్నారు. -
భవితకు బీటలు!
పచ్చకుట్రలు..ఒంగోలు టిపుల్ ఐటీ రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ భవనానికి తాళాలు వేసిన దృశ్యంక్యాంపస్ తరలిపోదంటూ మభ్యపెట్టి.. కొత్త విద్యా సంవత్సరం నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఉండదని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మభ్య పెట్టారు. క్యాంపస్ ఎక్కడికీ వెళ్లదంటూ చెప్పుకొచ్చారు. అధికారులతో సమావేశాలంటూ డ్రామాలకు తెరతీశారు. వారి మాటలన్నీ అబద్ధాలే అని నెల రోజుల తర్వాత స్పష్టమైంది. క్యాంపస్కు తాళాలు వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో సొంత భవనాలు లేకపోవడంతో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో తరగతులు నిర్వహించారు. అక్కడ ఆర్కే వ్యాలీ విద్యార్థులకు, ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు మధ్య తరచుగా గొడవలు జరగడం మొదలయ్యాయి. సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజం లేకుండా పోయింది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇడుపులపాయలోని ఒంగోలు క్యాంపస్ను నగరంలోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్కు తరలించింది. ఆ తరువాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ రావడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్ను లీజుకు తీసుకుంది. అప్పటి నుంచి విద్యార్థులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు సమస్యలు మొదలయ్యాయి. అద్దె బకాయిలు రూ.2.50 కోట్లు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్కు అద్దె చెల్లించడం నిలిపివేసింది. ఏడాది కాలానికి గాను రూ.2.50 కోట్లు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతోపాటుగా కళాశాల కరెంటు బిల్లులు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తరచుగా విద్యార్థులు చీకటిలో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి విద్యార్థులకు కనీసావసరాలకు నీరు అందుబాటులో లేకుండా చేసింది. గత్యంతరంలేక విద్యార్థులు నాల్గవ అంతస్తు నుంచి బకెట్లలో నీళ్లు మోసుకోవాల్సి వచ్చింది. కుట్రపూరితంగానే విద్యార్థులను కష్టపెడుతూ వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. చిట్ట చివరకు కాలేజీనే ఎత్తేసింది. ప్రస్తుతం క్యాంపస్లోనే కళాశాలకు చెందిన సామగ్రి, విద్యార్థుల మంచాలు, బెడ్షీట్లతోపాటుగా ఎగ్జామ్ సెల్ కు సంబంధించిన పరికరాలు ఉండిపోయాయి. తమకు రావల్సిన బకాయిలు చెల్లించమని అడుగుతున్న భవన యజమాని కళాశాలకు తాళం వేసేశారు. దిక్కుతోచని అధికారులు కళాశాలకు చెందిన సామగ్రి, ఇతర పరికరాలకు 10 మంది సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. ఎస్ఎస్ఎన్ క్యాంపస్ కూడా ఎత్తేస్తారా...? చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు 2026 డిసెంబర్ వరకు ఉంది. నాటి ప్రభుత్వం ముందు చూపుతో ఈ క్యాంపస్కు అడ్వాన్స్ చెల్లించడంతో ప్రస్తుత ప్రభుత్వం అద్దెలు చెల్లించకపోయినప్పటికీ క్యాంపస్ కొనసాగుతోంది. ఈ అడ్వాన్స్ అయిపోయాక ఎస్ఎస్ఎన్ క్యాంపస్ను కొనసాగించడం కూడా ప్రశ్నార్థకమేనని సిబ్బంది, విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్యాంపస్కు సైతం కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. ప్రస్తుతం రూ.2 కోట్లు వరకూ కరెంటు బిల్లు బకాయి ఉన్నట్లు సమాచారం. రావ్ అండ్ నాయుడు తరహాలో దీన్ని కూడా పూర్తిగా ఎత్తివేసేందుకు కూటమి పాలకులు కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రాజీనామా బాటలో ఫ్యాకల్టీలు... రావ్ అండ్ నాయుడు క్యాంపస్లో 150 మంది వరకు ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. క్యాంపస్ ఎత్తివేయడంతో ఈ ఫ్యాకల్టీని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లకు సర్దుబాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా అయినవారికి కంచాల్లో వడ్డిస్తున్నారు. తమకు సానుకూలంగా వ్యవహరిస్తున్న ఫ్యాకల్టీలను కోరిన చోట పోస్టింగులు ఇస్తున్నారని, మిగిలిన వారిని తమకు ఇష్టమైన చోటుకు బదిలీ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్యాంపస్ ఎత్తేయడంతో ఫ్యాకల్టీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుటుంబ సభ్యులను తీసుకొని ఎక్కడికో వెళ్లలేక సుమారు 50 మంది ఫ్యాకల్టీలలో కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకోగా, మరికొందరు రాజీనామా చేసినట్లు తెలిసింది. మరో 40 మంది బదిలీల విషయంలో వెసులుబాటు కల్పించాలని డైరక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు సమాచారం. దీంతో అధ్యాపకుల కొరత ఏర్పడింది. నిన్నటి దాకా వేలాది మంది విద్యార్థులతో కళకళ నేడు నిర్మానుష్యంగా రావ్ అండ్ నాయుడు క్యాంపస్ అద్దె బకాయిలు రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో క్యాంపస్కు తాళం వేసిన భవన యజమాని కరెంటు బిల్లులు కోటి రూపాయలకు పైగా బకాయి విద్యార్థులు, ఫ్యాకల్టీలతో మూడు ముక్కలాట తర్వాత ఎస్ఎస్ఎన్ క్యాంపస్ వంతు మభ్యపెట్టిన అధికార టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులునిర్మానుష్యంగా ఉన్న రావ్ అండ్ నాయుడు కాలేజీలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ -
గ్రావెల్ మటాష్..!
సింగరాయకొండ: కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది టీడీపీ నాయకులు కావడంతో ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న జువ్వలగుంట చెరువులో టీడీపీ నాయకులు గద్దల్లా వాలిపోయారు. గడిచిన వారం రోజులుగా అక్రమంగా గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా రాత్రి వేళల్లో జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అమాత్యుడి ఆదేశాలతోనే అధికార గణం కళ్లు మూసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భగ్గుమన్న విభేదాలు చెరువులో గ్రావెల్ను పక్క గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తుండటంతో సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శానంపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల అక్రమ గ్రావెల్ దందాకు వీఆర్ఓలు కూడా సహకరిస్తున్నారని, తమ గ్రామ చెరువులో వారి పెత్తనం ఏమిటని మూలగుంటపాడు నాయకులు మంత్రి స్వామి వద్ద పంచాయతీ పెట్టినట్టు తెలిసింది. చోద్యం చూస్తున్న అధికారులు వారం రోజుల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులకు పట్టించుకోకపోగా పచ్చ నేతలకు సహకరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు కూడా గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. చెరువులో గ్రావెల్ తవ్వకంతో శ్మశాన స్థలం ధ్వంసమైందని, కర్మకాండలకు ఇబ్బందిగా మారిందని సమీపంలోని వెంకటేశ్వరనగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రావెల్ అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే. జువ్వలగుంట చెరువులో గ్రావెల్ తవ్వేస్తున్న పచ్చ ముఠా గత వారం రోజులుగా రాత్రి వేళ సాగుతున్న అక్రమ దందా గ్రావెల్ తవ్వకాలపై పచ్చ తమ్ముళ్ల మధ్య తలెత్తిన విభేదాలు అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులు -
దాణా సొమ్ము మేశారు!
మర్రిపూడి: రాయితీపై ప్రభుత్వం అందించే పశువుల దాణా కోసం నగదు చెల్లించిన పశుపోషకులను ఆ శాఖ సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. పశువైద్యశాలలో దాణా నిల్వ ఉన్నా నగదు చెల్లించిన వారికి పంపిణీ చేయకపోవడంతో పశుపోషకులు ఆగ్రహించారు. బుధవారం మర్రిపూడి పశువైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. దాణా పేరుతో వసూలు చేసిన సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మర్రిపూడి మండలంలోని కాకర్ల, మర్రిపూడి గ్రామాల్లో రెండు పశువైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, ఎద్దులు 1570, గేదెలు 18,240, మేకలు 61,200, గొర్రెలు 16200 ఉన్నాయి. కాగా మర్రిపూడి పశు వైద్యశాలలో లైవ్స్టాక్ అసిస్టెంట్ ఖాజావలి, అటెండర్ సురేష్ పశుపోషకుల వద్ద రూ.555 విలువ చేసే 50 కిలోల పెల్లెట్ దాణా బస్తాకు రూ.600 చొప్పున వసూలు చేశారు. ఇద్దరు ధైర్యంగా పశువైద్యశాలలోనే మద్యం సేవించడం, అక్కడే పడుకోవడం, ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకపోవడం గమనార్హం. రెండు నెలల క్రితం వల్లాయపాలెం, మర్రిపూడి, రాజుపాలెం, దుగ్గిరెడ్డిపాలెం, గంగపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 200 మంది పశుపోషకుల వద్ద సుమారు రూ.1.20 లక్షలు వసూలు చేసి ఇప్పటికీ దాణా ఇవ్వకపోవడంతో పశుపోషకులు రోజూ ఆస్పత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం మర్రిపూడి వైద్యశాలలకు 44 బస్తాల దాణా వచ్చిన విషయం తెలుసుకున్న పశుపోషకులు బుధవారం ఆందోళన చేపట్టారు. దాణా పంపిణీ చేసే వరకు కదలబోమని భీష్మించారు. ఆస్పత్రిలో పరిస్థితి తెలుసుకున్న ఖాజావలి బుధవారం వైద్యశాలకు రాకపోగా, అటెండర్ సురేష్ స్టాక్ రూమ్కు తాళం వేసి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం రైతులు రోజంతా గాలించారు. ఉదయం విధులకు హాజరైన పశు వైద్యాధికారి మంచాల మణిశేఖర్ ఆందోళనకు దిగిన పశుపోషకులను చూసి విస్తుపోయారు. ‘నేను వారం రోజుల క్రితం బాధ్యతలు చేపట్టాను. మీరు డబ్బు చెల్లించిన విషయం నాకు తెలియదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా’ అని చెప్పడంతో రైతులు శాంతించారు. మర్రిపూడిలో పశువుల దాణా పేరుతో బస్తాకు రూ.600 చొప్పున వసూలు దాణా నిల్వ ఉన్నా పంపిణీ చేయకపోవడంపై అనుమానాలు 200 మంది రైతులు చెల్లించిన రూ.1.20 లక్షలు సొంత ఖాతాల్లోకి! రైతులు నిలదీయడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న నూతన పశువైద్యాధికారి -
జిల్లా హామీ అమలు చేశాకే పవన్ మార్కాపురంలో అడుగు పెట్టాలి
● వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి పెద్దదోర్నాల: మార్కాపురాన్ని జిల్లా చేస్తామన్న హామీని అమలు చేసిన తర్వాతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ ప్రకాశంలో అడుగు పెట్టాలని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పవన్ మార్కాపురం పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్కాపురాన్ని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ హామీ ఊసే లేదని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్వ స్థితిలోనే ఉన్నాయని, ప్రాజెక్టుకు నీరు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టకుండా ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి మార్కాపురం: ఈనెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మార్కాపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం ఆమె మార్కాపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ త్రివినాగ్తో కలిసి డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కింద 18 మండలాల ప్రజలకు తాగునీరు అందించే పథకానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. హెలీప్యాడ్, సభావేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమీవేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశినాఽథ్, డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా చిట్యాల హనుమంతునిపాడు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఐటీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా చిట్యాల విజయ్భాస్కర్రెడ్డి ఎంపికయ్యారు. హనుమంతునిపాడు మండలం పెద్దగోళ్లపల్లి గ్రామానికి చెందిన విజయభాస్కర్రెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 7న బోయలపల్లెలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు యర్రగొండపాలెం: మండలంలోని బోయలపల్లె గ్రామంలో వెలసిన ఆత్మానంద అవధూత స్వాముల వారి ఆలయ 56వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ రాష్ట్ర స్థాయి పాలపండ్ల ఎడ్ల (6 పండ్ల సైజులోపు) పందేలు నిర్వహించనున్నట్లు ఆ స్వామి సేవా సంఘం బుధవారం తెలిపింది. ఈ పందేల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 1 నుంచి 5 బహుమతులు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.20 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందిస్తారని చెప్పారు. ఈ పందేల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కోసం సంఘ అధ్యక్షుడు మన్నెం ఆంజనేయులు, సెల్ నంబర్: 94415 86783కు సంప్రదించాలన్నారు. -
భూమి హాంఫట్!
1రూ. కోటిసాక్షి టాస్క్ఫోర్స్: మార్కాపురంలో ప్రసిద్ధిగాంచిన చెన్నకేశవ ఆలయానికి చెందిన భూములను కబ్జాల బారి నుంచి కాపాడుకుంటున్నట్లు గొప్పగా డప్పు వేస్తున్న పాలకులు.. కూటమి నాయకుల కబ్జా పర్వాన్ని మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారు. చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.కోటి విలువైన భూమిపై కన్ను వేసిన కూటమి నాయకులు ఆక్రమించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామివారికి భజంత్రీల ఇనాం కింద సుమారు 32 ఎకరాలు కేటాయించారు. అయితే ప్రభుత్వ అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంకు, ఇళ్ల స్థలాలు తదితర నిర్మాణాల కింద కొంత భూమి పోగా ప్రస్తుతం సంక్రాంతి మండపం వద్ద పార్వేట నిమిత్తం 40 సెంట్ల స్థలం మిగిలింది. ఆ భూమిలో కూడా సొసైటీకి చెందిన స్థలం ఉందంటూ కూటమి నాయకులు జేసీబీలతో యథేచ్ఛగా చదును చేశారు. నాలుగేళ్ల క్రితం సంక్రాంతి మండపానికి చెందిన స్థలాన్ని సర్వేయర్ కొలత వేయగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొందరు టీడీపీ నాయకులు రూ.కోట్ల విలువచేసే ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో సర్వే చేసి సంక్రాంతి మండపానికి కేటాయించిన భూమిలో సొసైటీ పేరుతో అక్కడ ఇంకా స్థలం ఉందని చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. కూటమి నాయకుల కబ్జా పర్వానికి అధికారులు పరోక్షంగా వత్తాసు పలకడం ఎంత వరకు సబబని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సదరు ఆక్రమణలపై ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. సంక్రాంతి మండపం వద్ద సొసైటీకి చెందిన భూమి కొంత ఉందని కొందరు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. స్వామివారికి చెందిన భూమిని కొందరు చదును చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని అంగీకరించారు. అధికారులతో సమీక్షించి ఆలయానికి చెందిన భూమిని ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెన్నకేశవస్వామి ఆలయ భూమిపై కూటమి నాయకుల కన్ను సంక్రాంతి మండపం ఫెన్సింగ్ లోపల భూమి దర్జాగా చదును చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులు -
హ్యాపీ బర్త్డే రత్నం మేడమ్
కుటుంబ సభ్యులతో బత్తుల రత్నం ● ఘనంగా శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుక ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకను బుధవారం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మామిడిపాలేనికి చెందిన రిటైర్డ్ టీచర్ బత్తుల రత్నం 103 ఏళ్లు పూర్తి చేసుకొని 104వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుక నిర్వహించారు. 1977లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైరైన రత్నం 48 ఏళ్ల నుంచి పెన్షన్ పొందుతుండటం విశేషం. -
ఖైదీలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ముఖాముఖి
ఒంగోలు: ఖైదీలతో స్థానిక జిల్లా జైలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ బుధవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి కుటుంబాలకు దూరంగా ఉండడం, తద్వారా సమాజానికి భారంగా ఉండడం దురదృష్టకరమన్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమతలేని ఖైదీలకు ఉచితంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం ద్వారా న్యాయ సహాయం అందిస్తారన్నారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, స్టోర్ రూమును పరిశీలించి మరింత మెరుగైన వసతుల కోసం అవసరమైన సలహాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.వరుణ్రెడ్డి, వైద్యులు బ్రహ్మతేజ, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.రవిశంకర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీర రాఘవులు, జైలర్ యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు మైనంపాడు క్రీడాకారిణి సంతనూతలపాడు: హాకీ ఇండియా ఆధ్వర్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు జరగనున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ జట్టుకు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆకుల లోహిత ఎంపికయ్యారని హెచ్ఎం డీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణిని జిల్లా అసోసియేషన్ సెక్రటరీ సుందరరామిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో శర్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, పీఈటీ దాసరి శ్రీనివాసరావు, పీఈటీ తిరుమలశెట్టి రవికుమార్, స్కూలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బైక్ ఢీకొని వృద్ధుడు మృతి తర్లుపాడు: ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తర్లుపాడు మండలంలోని ఓబాయపల్లి కలుజువ్వలపాడు మధ్య బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొండారెడ్డిపల్లికి చెందిన వెంకటస్వామి(65) అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తర్లుపాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 5న జాతీయ లోక్ అదాలత్ ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ఒంగోలు: ఈ నెల 5న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎ.భారతి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీకి అర్హత కలిగిన క్రిమినల్, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలను కక్షిదారుల ఆమోదంతో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమమని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న వ్యాజ్యాలకు సంబంధించి కోర్టుకు చెల్లించిన ఫీజును వాపసు పొందే అవకాశం ఉందని, ప్రీ సిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని పోలీసు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు. -
అధికార జలగలు !
దోపిడీకి నోటీసులు.. ఒంగోలు నగరపాలక సంస్థ వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా తయారైంది. చిరు వ్యాపారం చేసుకునే కూరగాయల నిర్వాహకులపై బకాయిలను వడ్డీల రూపంలో మోయలేని భారాన్ని మోపుతున్నారు. నగర పాలక సంస్థ ఇచ్చిన నోటీసులు చూసి వ్యాపారుల కళ్లు బైర్లు కమ్మాయి. చెల్లించాల్సింది రూ.5.78 కోట్లు అయితే వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీ కలిపి రూ.7.08 కోట్లు వేశారు. మొత్తంగా రూ.12.86 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అధికారులిచ్చిన నోటీసులు చూసి వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేంటి అని అడిగిన వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. అధికారులు చిరు వ్యాపారులను జలగల్లా పీక్కుతింటున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షిప్రతినిధి, ఒంగోలు: నగరంలో కొత్త కూరగాయల మార్కెట్ వ్యాపారులు అధికారులు, పాలకుల మధ్య నలిగిపోయి..చిక్కి శల్యమవుతున్నారు. ఒక పక్క బాడుగల పేరుతో వేధింపులు...మరోపక్క దుకాణాలు పెట్టుకోనీయకుండా బెదిరింపులు అక్కడి వ్యాపారులకు నిత్యకృత్యమయ్యాయి. కొత్త కూరగాయల మార్కెట్ ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు దోచుకునేందుకు సొంత ఆదాయ వనరుగా మారిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ) కోసం కాంప్లెక్స్ నిర్మించారు. ఒంగోలు నడిబొడ్డులో కాంప్లెక్స్ నిర్మాణం కావటంతో అప్పటి పాలకులు ఏఎంసీకి కాకుండా కూరగాయల మార్కెట్ అయితే నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావించి ఏఎంసీని పాత గుంటూరు రోడ్డుకు తరలించి ఆ కాంప్లెక్స్ను ఒంగోలు మున్సిపాలిటీకి అప్పగించారు. దాంతో 2008లో పాత కూరగాయల మార్కెట్ నుంచి వ్యాపారులను ఇక్కడకు మార్చారు. అప్పట్లో మున్సిపాలిటీ అధికారులు అద్దెలు ఖరారు చేసి వసూలు చేయటం ప్రారంభించారు. 2008 నుంచి 2019 నవంబర్ వరకు వ్యాపారులు అందరూ పూర్తిగా బకాయిలు లేకుండా అద్దెలు చెల్లించారు. కరోనా నుంచి కష్టాలు ప్రారంభం: కరోనా సమయం నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వ్యాపారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి షాపులను నగరపాలక సంస్థ అధికారులు అప్పటి వరకు ఉన్న అద్దెకు 33.33 శాతం పెంచి షాపులను వ్యాపారులకు రెన్యువల్ చేయాల్సి ఉంది. ఇంతలో కరోనా వచ్చింది. 2020 మార్చి నుంచి కరోనాతో లాక్డౌన్ ప్రకటించారు. దాంతో మార్కెట్ మూత పడింది. అయితే మార్కెట్లో కాకుండా రంగారాయుడు చెరువు పక్కనే ఉన్న పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా షెడ్లు వేసి ఆ వ్యాపారుల చేతనే ఇక్కడ కూరగాయలను ప్రజల అవసరాలు తీర్చేందుకు అమ్మకాలు జరిపించారు. ఈ విధంగా రెండేళ్ల పాటు చేయించారు. అయితే కరోనా సమయంలో ఉన్న అద్దె బకాయిలను మాఫీ చేయమని వ్యాపారులు పాలకులను, అధికారులను అడుగుతూ వచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేయిస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. అద్దె మాత్రం మాఫీ చేయలేదు. కానీ కరోనా సమయం నుంచి నగర పాలక సంస్థ అధికారులు 193 షాపులకు అద్దెల లెక్కలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రూ.5.78 కోట్లు అసలు.. వడ్డీ రూ.7.08 కోట్లు..! ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో మొత్తం షాపులు 193 ఉన్నాయి. వాటిలో రిటైల్ షాపులు 123, హోల్ సేల్ షాపులు 70 ఉన్నాయి. 2019 డిసెంబరు నుంచి 2022 నవంబర్ వరకు మాత్రమే. 2022 డిసెంబర్ నుంచి రెన్యూవల్ చేయాల్సి ఉంది. అప్పటి వరకూ కట్టాల్సిన అద్దె బకాయిలు రూ.5.78 కోట్లు. వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీ, ఐజీఎస్టీలు వేసి రూ.7.08 కోట్లు ఉందంటూ నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం మొత్తం రూ.12.86 కోట్లు చెల్లిచాల్సి వస్తుంది. ఈ బకాయిలు రిటైల్, హోల్సేల్ వ్యాపారుల పాలిట శాపాలుగా మారాయి. చివరకు మోయలేనంతగా తయారై కట్టలేని స్థితికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే 2025 నవంబర్తో మూడేళ్లకు గడువు ముగుస్తుంది కూడా. ఇప్పటి వరకు కట్టాల్సిన రూ.12.86 కోట్లతో పాటు అదనంగా మళ్లీ 33.33 శాతం అద్దె పెంచాలి. పెరిగిన అద్దెతో పాటు వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీలు కలుపుకొని మరో రూ.15 కోట్ల వరకు కట్టాల్సిన పరిస్థితి. అంటే మొత్తం కలుపుకుంటే రూ.27.86 కోట్లు బకాయిలు చెల్లించాలని అధికార వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు ఇస్తున్న నోటీసులు చూసిన చిరువ్యాపారులు కళ్లు తేలేస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారులే నయం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2.50 శాతం మాత్రమే వడ్డీ... కానీ 50 శాతంపైగా వసూలు... వాస్తవానికి కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం అద్దె బకాయిలపై కేవలం 2.50 శాతం మాత్రమే వడ్డీ, అపరాధ రుసుం కట్టాలి. ఆ నిబంధనలు గాలికి వదిలేసిన నగర పాలక సంస్థ అధికారులు ఇష్టం వచ్చినట్లు వడ్డీ, అపరాధ రుసుం విధిస్తూ నోటీసులు పంపారు. ఇచ్చిన ఆ నోటీసులు కూడా మున్సిపల్ కార్యాలయంలో రికార్డు ఏమీ ఉండదు. కంప్యూటర్లో ఒక ప్రింట్ తీసుకొని ఇచ్చి మరీ డబ్బులు వసూలు చేసుకుపోయారు. గతంలో వాటికి లెక్కా..పక్కా లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ, అపరాధ రుసుం కలుపుకొని కట్టాల్సింది 193 షాపులకు కలిపి రూ.5.78 కోట్లు అయితే (2022 నవంబర్ వరకు) దానికి అదనంగా వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీలు కలుపుకొని రూ.7.08 కోట్లు కట్టాలని నోటీసులు షాపులకు అతికించారు. వ్యాపారులకు చేతికి కూడా ఇవ్వటం లేదు. ఇదొక అడ్డగోలు వ్యవహారంలా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. సొంత ఖర్చులకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొత్త కూరగాయల మార్కెట్ కార్పొరేషన్ అధికారులకు గుర్తుకు వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. బకాయిల పేరుతో పలు మార్లు కార్పొరేషన్ అధికారులు డబ్బులు వసూలు /చేశారు. అలా ఇప్పటి వరకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. ఏ ఒక్కరికీ రసీదులు ఇచ్చిన పాపాన పోలేదు. వసూలు చేసిన అధికారులు ఒకరిద్దరు చనిపోగా, కొందరు బదిలీపై వెళ్లారు. కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. కానీ కూరగాయల మార్కెట్ వ్యాపారులు కట్టిన అద్దె డబ్బులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. కొంత మంది అధికారులు సంవత్సరాల తరబడి కార్పొరేషన్లోనే పనిచేస్తూ వ్యాపారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు 2019వ సంవత్సరం నుంచి నేటికీ అదే జరుగుతుందంటే వ్యాపారుల బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందినకాడికి దోచుకుంటూ..? కూరగాయల మార్కెట్ను వేధిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు గుదిబండలా మారిన బకాయిలు అద్దె బకాయిలు మొత్తం రూ.5.78 కోట్లు వడ్డీ, అపరాధ రుసుం, జీఎస్టీతో రూ.7.08 కోట్లు మొత్తం రూ.12.86 కోట్లు చెల్లించాలంటూ కార్పొరేషన్ అధికారుల ఒత్తిడి నిబంధనల ప్రకారం 2.50 శాతం వడ్డీ మాత్రమే అడ్డగోలుగా 50 శాతానికి పైగా వడ్డించి వసూలు కరోనా సమయంలో మార్కెట్ లేకపోయినా అద్దె కట్టాల్సిందే అంటూ వేధింపులు ముఖం చాటేస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు -
భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వండి..
● సబ్కలెక్టర్కు రైతుల వినతి మర్రిపూడి: ఎన్హెచ్544జీ (గ్రీన్ఫీల్డ్ హైవే)కు అవసరమైన 6.51 ఎకరాల భూములు కోల్పోయిన ఏడుగురు రైతులకు సుమారు రూ.65 లక్షలు పరిహారం చెల్లించాలని మండలంలోని దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు రోడ్ పనులను పరిశీలించేందుకు మర్రిపూడి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్కు మంగళవారం విన్నవించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా అధికారులు రేపు, మాపు అని కాలయాపన చేస్తున్నారని దుగ్గిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బూదాల ఆశీర్వాదం, దుద్దుకుంట కోటయ్య, ఆకుల పెదగంగిరెడ్డి, ఆకుల సుగుణమ్మ, ఆకుల గంగిరెడ్డి, గురుగూరి ఆదెమ్మ, బీ ఆదిలక్ష్మిలు డిప్యూటీ కలెక్టర్ ముందు వాపోయారు. ఈ భూమి ద్వారా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, అసైన్మెంట్ భూమిని గతంలో అధికారులు ఎలాంటి విచారణ జరపకుండా ఏడబ్ల్యూ ల్యాండ్ అని రాసి పంపారని, విచారించి మాకు తగు న్యాయం చేయండి సార్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు సమస్యను విన్నవిస్తున్న దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు అంటూ డిప్యూటీ కలెక్టర్కు గ్రామస్తులు విన్నవించారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ఆటంకం పెట్టరాదని, రైతుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట తహశీల్దార్ జనార్దన్ డీటీ రాజు, వీఆర్వోలు ఉన్నారు. -
క్షయ పరీక్షలు చేయించుకోవాలి
ఒంగోలు టౌన్: 60 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా క్షయ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. టీబీ ముక్తి భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 49వ డివిజన్లో టీబీ ముక్త్ భారత్ అవగాహన ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 1,12,817 మందిని పరీక్షలు చేయగా వారిలో 5,432 మంది అనుమానితులుగా గుర్తించారని తెలిపారు. వారిలో 137 మందికి క్షయవ్యాధి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి అవసరమైన మందులను అందించారన్నారు. ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించుకోవాలని, కుటుంబంలో ఎవరికై నా రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వెంటనే క్షయ నివారణ మందులను మింగించి క్షయ వ్యాధి నుంచి విముక్తం కావాలన్నారు. తూర్పునాయడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా క్షయ అధికారి డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. తడిసిన పొగాకునూ కొనుగోలు చేయండి ●● కలెక్టర్ తమీమ్ అన్సారియాకు బర్లీ పొగాకు రైతుల వినతి మద్దిపాడు: మూడు రకాల పొగాకు గ్రేడులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, వర్షానికి తడిసి నల్లబడిన పొగాకును కూడా కొనుగోలు చేస్తేనే తాము తక్కువ నష్టాలతో బయట పడతామని బర్లీ పొగాకు రైతులు కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలోని బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆమె రైతులతో పొగాకు పంట ఎన్ని ఎకరాల్లో వేశారు? పంట దిగుబడి ఎంత వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాలు అడిగారు. ఈక్రమంలో నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతులు పలువురు నాల్గవ గ్రేడు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ను కోరగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట మార్క్ఫెడ్ డీఎం హరికృష్ణ, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, ఏఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు వన్టౌన్: కౌలు రైతులకు నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో వీడియో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్స్, హౌసింగ్ ఫర్ ఆల్లో భాగంగా ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్, నూతన ఇంటి పట్టాల కోసం దరఖాస్తుల పరిశీలన, జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్, రీ సర్వే ప్రక్రియ, రేషన్ షాపుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో 46,015 మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 11,579 మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలన్నారు. కోర్టు కేసులను ఆన్లైన్లో చూసుకునేలా రెవెన్యూ కేసులు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జీఓ ఎంఎస్ 30 ప్రకారం రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 22ఏ డాటెడ్ ల్యాండ్, భూమి అప్పగింత, అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్డీసీలు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, జిల్లా వ్యవసాయ అధికారులు శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ పెరుగు శ్రీనివాస ప్రసాద్, డీఎస్ఓ పద్మశ్రీ,, సివిల్ సప్లైస్ డీఎం వరలక్ష్మి, జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, రెవెన్యూ డివిజినల్ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.