breaking news
Prakasam
-
మహాశివరాత్రికి నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.29.18 లక్షలు
సీఎస్పురం (పామూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.29.18 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ బి.రమేష్ తెలిపారు. స్థానిక ఆలయ ప్రాంగణ భవనంలో సోమవారం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, ఆలయ ఈఓ, ధర్మకర్తల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీల ద్వారా రూ.16,89,755, టికెట్ల అమ్మకం ద్వారా రూ.3,85,680, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.3,08,700, అన్నదానానికి విరాళంగా రూ.2,87,754, మహాప్రాకార నిర్మాణానికి విరాళంగా రూ.25,116, ఉభయదాతల విరాళాల కింద రూ.1,80,696, ఇతర విరాళాలు రూ.41,096, మొత్తం రూ.29,18,797 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయిన ప్రజలు
యర్రగొండపాలెం: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మోసపోయారని, ఇచ్చిన వాగ్దానాలు, ప్రజా సంక్షేమ పథకాలు నీరుగార్చి తాము అన్ని పథకాలు సూపర్గా అమలు పరిచామని గోబెల్స్ ప్రచారం చేయడం మొదలు పెట్టారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న పాలనలో ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు ముందుకు సాగాయని, వైఎస్సార్ సీపీ పాలనలో మహిళలకు పెద్దపీటవేశారని, ప్రతి నెలా వారి అకౌంట్లలో ఏదో ఒక పథకం కింద డబ్బులు జమయ్యేవని, కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏ ఒక్క పథకం ఆగలేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా సంక్షేమ పథకాలకు తగినన్ని నిధులు కేటాయించలేదని, ఈ ఏడాది కూడా చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యే పరిస్థితి లేదని, పేదలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి కేసులు నమోదు చేయిస్తున్నారని, అనేక మందికి జైలుకు కూడా పంపారని మండిపడ్డారు. ఇటువంటి తరుణంలో మనమంతా ప్రజలకు అండగా నిలవాలని, వారికోసం పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరుగుతున్నాయని, ఈ ఎంపికలో నాయకుల ప్రమేయం ఏమాత్రం ఉండదని, మంచి కార్యకర్తలను, ప్రజల సమస్యలపై స్పందించే వారికే నాయకత్వం అప్పచెప్తున్నామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, టి.సత్యనారాయణరెడ్డి, ఆవుల రమణారెడ్డి, పబ్బిశెట్టి శ్రీనివాసులు, బాలకోటిరెడ్డి, తోకల ఆవులయ్య, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
50 ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఎప్పుడిస్తారు.. రెండేళ్లుగా మహిళలు మోసపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్కటంటే ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలో ప్రధానంగా అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇంత వరకూ అమలు చేయకపోగా ఒక్క నూతన పింఛను కూడా ఇవ్వకపోవడం దారుణం. కొత్త పింఛన్లు మంజూరుకాక అర్హులైన లబ్ధిదారులందరూ సచివాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం బాధాకరం. – నాలి కొండయ్య, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి, మార్కాపురం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ఊదరగొట్టాడు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంగతే మర్చిపోయారు. మూడు సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా మహిళలను మోసం చేశారు. అర్హత కలిగిన ప్రతి మహిళకు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం రూ.54 వేలు బాకీ ఉంది. గత ప్రభుత్వంలో జగనన్న చెప్పినట్లు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అర్హత కలిగిన మహిళకు ఏడాదికి రూ.18,750 అందించారు. కానీ చంద్రబాబు ఎప్పటిలాగానే గెలిచిన తరువాత మహిళలను మోసం చేశారు. – కనపర్తి గోవిందమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు, పొన్నలూరు -
బొత్సపై బాడీ షేమింగ్ దారుణం
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం టౌన్: శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై బాడీ షేమింగ్ చేస్తూ అవమానకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్త కిరాక్ ఆర్పీపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు హుందాతనంగా ఉండాలి కానీ, ఒకరిని ఎగతాళి చేసేలా ఉండకూడదని అన్నారు. ఒక సీనియర్ నేత గొంతును ఎగతాళి చేస్తూ వ్యక్తిగత హననం చేయడం సరికాదని జంకె పేర్కొన్నారు. ఒంగోలు టౌన్: దేశ రైతాంగానికి చేటు చేసేలా అమెరికాతో ఒప్పందం చేసుకోవడం దారుణమని, దేశ ప్రయోజనాలను కార్పొరేట్ శక్తులకు, విదేశాలకు కట్టబెట్టేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన చేస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి ఆరోపించారు. సుందరయ్య భవనంలో సోమవారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రమాదేవి మాట్లాడుతూ దేశ రైతులను ప్రధాని మోదీ వంచించారని ధ్వజమెత్తారు. భారత వ్యవసాయ పరిశ్రమలపై పరాయి దేశాల పెత్తనం కొనసాగించడానికి అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో పంటల కనీస మద్దతు ధరల కోసం విదేశాలపై ఆధారపడే దుస్థితి దాపురిస్తోందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ద హామీ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ, వ్యవసాయానికి రక్షణాత్మక విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు రహదారి అభివృద్ధి వంటి కీలక రంగాలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సమావేశంలో సయ్యద్ హనీఫ్, జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, ఎం.రమేష్, డి.సోమయ్య పాల్గొన్నారు. -
పృథులాపురి..జనఝరి
పొదిలిరూరల్: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పొదిలి పట్టణంలో వెలసిన పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి రథోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. విశేషంగా అలంకరించిన రథంపై అధిరోహించిన స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించి తరించారు. రథాన్ని లాగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు. హరహర మహాదేవ..శంభోశంకర అనే శివనామ స్మరణతో వీధులన్నీ మార్మోగాయి. వేలాది మంది భక్తులు వెంటరాగా స్వామి వారి ఉత్సవమూర్తులను పొదిలి పురవీధుల్లో ఊరేగించారు. కళ్యాణం..కమనీయం: రథోత్సవానికి ముందు స్థానిక నిర్మమహేశ్వరస్వామి దేవాలయంలో అర్చక స్వాములు మూలంరాజు సుబ్బనరసయ్య, దరిశి వెంకట సుధాకర్, దరిశి రామమూర్తిలు తెల్లవారుజామున 2 గంటలకు నిర్మమహేశ్వరుడు, పార్వతీదేవిలకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు ఉత్సవమూర్తులకు నందిసేవ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా గౌరీశంకర అలంకరణతో ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చారు. హోమాలు, ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారికి నీటితో వారుపోసి కుంభం పెట్టి పార్వేట బలీయడంతో వేలాది మంది భక్తజనం వెంటరాగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ సుమారు మధ్యాహ్నం 1.53 గంటలకు వేలాది మంది భక్తులు హరహర అంటూ శివనామస్మరణ చేస్తుండగా రథం కదిలింది. రథోత్సవాన్ని తిలకించడానికి పొదిలి పరిసర గ్రామాల నుంచి గాక, జిల్లా నలుమూలలు నుంచి కుల, మతాలకు అతీతంగా భారీగా భక్తులు తరలివచ్చారు. పట్టణ వీధులన్నీ భక్త జన సంద్రంగా మారాయి. రథం తిరిగే సమయంలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి రథం చక్రాల కింద గుమ్మడి కాయలు పెటి, కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు: రథోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహుకులు ఆలయ మర్యాదలతో అధికారులు, ప్రజా ప్రతినిధులను బాజా భజంత్రీలతో తీసుకురాగా ఆలయ పాలకమండలి వారిని శాలువతో సన్మానించారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రథం వద్ద టెంకామ కొట్టి రథాన్ని లాగారు. రథోత్సవంలో ఆలయ చైర్మన్ నుగ్గు వెంకటరామయ్య, తహశీల్దారు ఎంవీ కృష్ణారెడ్డి, ఈఓ నారాయనరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, డీ శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, సాయి రాజేశ్వరరావు, కే నరసింహారావు, వినోద్, కొత్తపులి బ్రహ్మారెడ్డి, సింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మోరాబోయిన మురళి, మోరా శంకర్రెడ్డి, రెడ్డెం వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవం సందర్భంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మార్కాపురం గుంటక వనజాక్ష్మిబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాటం, అఘోరీల వేషధారణ, కొంత మంది కళాకారులు చేసిన విచిత్ర విన్యాసాలు కనువిందు చేశాయి. డప్పులు కొడుతూ, బాణసంచా కాల్చుతూ యువకులు చిందులు వేసుకుంటూ తిరునాళ్లకు వచ్చిన భక్తులను ఉత్సాహపరిచారు. -
మూక దాడులతో టీడీపీ నేతల అరాచకం
● వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చింతలపూడి అశోక్ కుమార్ ● బొడ్డువారిపాలెంలో దాడి బాధితులకు పరామర్శ మేదరమెట్ల: కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుడు పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబంపై టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడికి పాల్పడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ పేర్కొన్నారు. గ్రామాల్లో విష సంస్కృతికి బీజం వేస్తున్నారంటూ మంత్రి గొట్టి పాటి రవికుమార్పై మండిపడ్డారు. గ్రామాల్లో దాడులను ప్రోత్సహించడం ఏ రకమైన రాజకీయం అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడలేని వ్యక్తి మంత్రి కావడం మన దౌర్భాగ్యమన్నారు. ఈ గొడవలన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయా..? లేక తెలిసే జరుగుతున్నాయా..? అనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దాడులు చేసి గాయపరిచింది కాక, తిరిగి పోలీసులను అడ్డం పెట్టుకుని బాధితులపైనే కేసులు పెడతామని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ.. ఖాకీ దుస్తుల వెనుక దాక్కుని రాజకీయ కక్షలు తీర్చుకోవడం మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని అని అశోక్కుమార్ బాధితులకు భరోసా ఇచ్చా రు. వీరి వెంట మండల పార్టీ కన్వీనర్ పాలపర్తి శ్రీధర్, కార్యకర్తలు, గ్రామ నాయకులు ఉన్నారు. ● ఇటీవల అతనిపై పోక్సో కేసు నమోదు కనిగిరిరూరల్: పోక్సో కేసులో అరైస్టె బెయిల్పై బయటకు వచ్చిన చాకిరాలకు చెందిన గూడూరి ఏషియా(33) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..మండలంలోని చాకిరాల ఎస్సీ కాలనీకి చెందిన జీ ఏషియా ను ఈనెల 9న పోక్సో కేసులో అరెస్ట్ చేశారు. అతనికి బెయిల్ రావడంతో బయటకు వచ్చిన తర్వాత చైన్నెలో బేల్దారీ పనికి వెళ్లాడు. తిరిగి ఈ నెల 15వ తేదీ ఆదివారం రాత్రి స్వగ్రామమైన చాకిరాల వచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడి పక్కన గదిలో నిద్రించేందుకు వెళ్లాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పెద్దగా శబ్ధం రావడంతో తల్లిదండ్రులు పరిశీలించగా ఏరియా ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో పరువు పోయిందనే మానసిక బాధ, ఎప్పటికై నా జైలుకు వెళ్లాల్సి ఉంటుదనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
శ్రీశైలం ఘాట్లో ఒరిగిన బస్సు
పెద్దదోర్నాల: వేగంగా వెళుతూ అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనే ఉన్న మార్జిన్ గుంతలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల గిరిజన గూడెం సమీపంలో సోమవారం జరిగింది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏఎస్సై పోలురాజు కథనం మేరకు..శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యాత్రికులు బస్సులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో చింతల వద్దకు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మార్జిన్ గుంతలోని దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. మార్జిన్లో దూసుకెళ్లి గంతలోకి దిగిన బస్సు పక్కనే ఉన్న కొండను ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ఎడమ వైపు పూర్తిగా కొండను ఆనుకోవడంతో కిటికీల వద్ద కూర్చున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకుండా తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురికావడంతో సంఘటనా స్థలిలో కొంత మేర గందరగోళ వాతావరణం నెలకొంది. అటుగా వెళుతున్న ప్రయాణికులు వెంటనే యత్రికులను సురక్షితంగా బయటకు తీశారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లిన వైనం సురక్షితంగా బయటపడిన 62 మంది ప్రయాణికులు -
కోర్టు వివాద భూమి ఆన్లైన్..
మర్రిపూడి: నకిలీ వంశవృక్షం సర్టిఫికెట్ సృష్టించి కోర్టు వివాదంలో ఉన్న భూమిని ఆన్లైన్ చేశారని వేమవరం పంచాయతీ రామచంద్రాపురానికి చెందిన వృద్ధురాలు శేషమ్మ ఆరోపించారు. బాధితురాలు సోమవారం రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని కోర్టులో ఉన్న నా భూమిని అక్రమంగా ఎలా ఆన్లైన్ చేశారని తహసీల్దార్ జనార్దన్ను నిలదీసింది. దీంతో సమాధానం చెప్పలేక తహసీల్దార్ నీళ్లు నమిలారు. బాధితురాలి కథనం మేరకు...వేమవరం పంచాయతీ రామచంద్రాపురం రెవెన్యూ సర్వే నం.35లో 47.75 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి అదే గ్రామానికి చెందిన నలుగురు రైతుల పేర్లపై రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అయితే ఎఫ్ఎల్ఆర్ దాఖలా మొదటి పేరు ముప్పరాజు పాపయ్య వాటా కింద 11.93 ఎకరాల భూమి వచ్చింది. ముప్పరాజు పాపయ్య చనిపోవడంతో వారసత్వంగా అతని ఇద్దరు కుమారులకు దక్కాల్సి ఉంది. అయితే పాపయ్య ఇద్దరు కుమారులు, పెద్దకోడలు సైతం మృతి చెందారు. వీరి ఇద్దరికి సంతానం లేదు. దీంతో ఆ ఆస్తికి చిన్న కుమారుడు బక్కయ్య భార్య ముప్పరాజు శేషమ్మ వారసురాలు. తనకు ఎవ్వరూ దిక్కులేరనే దురాలోచనతో ఈ భూమిపై ఒంగోలుకు చెందిన రియల్టర్ మారం వెంకటేశ్వరరెడ్డి కన్ను వేశాడని శేషమ్మ ఆరోపించింది. వేమవరం గ్రామానికి చెందిన ముప్పరాజు అనే ఇంటిపేరు ఉన్న వ్యక్తి ముప్పరాజు తిరుపతయ్యకు నకిలీ వంశవృక్షం ధ్రువీకరపత్రాన్ని రియల్టర్ వెంకటేశ్వరరెడ్డి సృష్టించి తిరుపతయ్యతో అగ్రిమెంట్ చేయించుకున్నాడని తెలిపింది. కొన్ని రోజులకు ముప్పరాజు తిరుపతయ్య చనిపోయాడని, నకిలీ వంశవృక్షం ధ్రువీకరణ పత్రంతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించాడని ఆమె ఆరోపించింది. 11.93 ఎకరాలను వెంకటేశ్వరరెడ్డి తన పేరుతో ఆన్లైన్ చేయించుకున్నాడని తెలుసుకొని కార్యాలయానికి వచ్చానని శేషమ్మ చెప్పింది. మా మామ ద్వారా సంక్రమించిన భూమిని ఇతరుల పేరుతో ఎలా ఆన్లైన్ చేస్తారని తహసీల్దార్ను నిలదీసింది. ఇప్పటికే భూమి విషయమై కోర్టులో పెండింగ్ ఉందని, ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్న విషయం మీకు తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. దీంతో తహసీల్దార్ ఆమెకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. నకిలీ వంశవృక్షం సర్టిఫికెట్ సృష్టించి ఆన్లైన్ కోర్టులో ఉన్న భూమిని ఎలా ఆన్లైన్ చేస్తారని తహసీల్దార్ను నిలదీసిన బాధితురాలు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన తహసీల్దార్ -
ఆది దంపతుల కల్యాణం.. చూసిన కనులదే భాగ్యం
కొత్తపట్నం: మహాశివరాత్రి సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరు శివాలయంలో మహాదేవుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. లింగోద్భవ పూజల అనంతరం సోమవారం వేకువజామున గంగ, పార్వతివర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, గంగా భ్రమరాంబ సమేత కన్నేశ్వర స్వామి కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈఓ సాంబశివరావు, గ్రామ పెద్దలు కల్యాణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి నాలుగు దేవుళ్ల గ్రామోత్సవం నిర్వహించారు. త్రిపురాంతకం: మహా శివారత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రసిద్ధిగాంచిన త్రిపురాంతక క్షేత్రంలో పార్వతీదేవి, త్రిపురాంతకేశ్వస్వామి కల్యాణ ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ రంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనులు ఆది దంపతుల కల్యాణాన్ని తిలకించి తరించారు. పెళ్లి పెద్దలుగా మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి దంపతులు, ఆలయ ఈఓ అనిల్కుమార్ దంపతులు వ్యవహరించారు. సామాజిక సత్రాల వారు, పలువురు ప్రముఖులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. -
మహాగని తోట దగ్ధం
● రూ.3 లక్షల ఆస్తి నష్టం ముండ్లమూరు: మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం సమీపంలో మూడు ఎకరాల మహాగని తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే..చీరాలకు చెందిన సురేష్ గ్రామంలో 20 ఎకరాల మహాగని పంట సాగు చేశారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చిల్లచెట్టుకు నిప్పు పెట్టగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న మహాగని తోటకు అంటుకున్నాయి. దీంతో తమ పొలంలో వేసిన రెండున్నర ఎకరాల మహాగని పంట పూర్తిగా దగ్ధమైంది. పొలంలో వేసిన డిప్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. కాపలాదారుడు ద్వారా విషయం తెలుసుకున్న యజమాని కాలిపోయిన తోటను చూసి కన్నీరు మున్నీరై విలపించాడు. దర్శి నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసినా పంట నష్టం వాటిల్లింది. -
చదును చేసేద్దాం.. ఆక్రమించేద్దాం..!
ఒంగోలు సబర్బన్: ఖాళీ జాగా కనిపస్తే వేసెయ్ పాగా...అన్న చందంగా తయారైంది అధికార టీడీపీకి చెందిన నాయకుల తీరు. ఒంగోలు నగరంలోని నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలంపై అధికార పార్టీకి చెందిన నాయకుల కన్నుపడింది. అనుకున్నదే తడువుగా స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నారు. కలెక్టర్ కార్యాలయానికి, ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు పథక రచన చేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు(సోదరులు)కూడబలుక్కొని సీఆర్పీ క్వార్టర్స్లో పార్కుకు దక్షిణం వైపు, ఫారెస్ట్ గెస్ట్ హౌస్కు తూర్పు వైపున ఉన్న క్వార్టర్స్కు ఆనుకొని ఉన్న స్థలాన్ని నాలుగు రోజులుగా బాగు చేయిస్తున్నారు. అడిగేదెవరు..? సీఆర్పీ క్వార్టర్స్లోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్లను స్థలం కాజేయటానికి పూనుకున్న అక్రమార్కులు అక్కడ ఉన్న చెట్లను గంపగుత్తగా రూ.50 వేలకు అమ్ముకున్నారు. దాదాపు 250 గదులకు పైగా శుభ్రం చేసిన కబ్జాదారులు అందులోని చిల్లచెట్లు, వేపచెట్లను అమ్మేశారు. ఆ ఖాళీ స్థలంలో ఉన్న చెట్టు మొత్తం కొట్టించారు. అన్నవరప్పాడు రెవెన్యూ సర్వే నంబరు–3లో భారీ స్థాయిలో చెట్లు కొట్టించి మరీ అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారు. కొంత స్థలంతో పాటు ఆ స్థలానికి ఆనుకొని ఉన్న కొండను తొలిచేందుకు రంగం సిద్ధం చేశారు. దాదాపు 250 గదులకు పైగా స్థలాన్ని కాజేసేందుకు పూనుకున్నారు. అక్కడ అతి తక్కువ అనుకున్నా గది రూ.2 లక్షలకు పైగానే ధర ఉంది. ఆ ప్రకారం ఆ స్థలం విలువ సుమారు రూ.5 కోట్లకు పైనే. నగరం నడిబొడ్డులో కబ్జా...ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏ ఒక్క విభాగానికి చెందిన అధికారులు కూడా ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ స్థలం ఆర్అండ్బీకి చెందిన స్థలం. అయినా ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో ఉంది కాబట్టి కనీసం నగర పాలక సంస్థ అధికారులైనా కబ్జాను గుర్తించాలి. కానీ ఏ ఒక్క ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులు ఆ ఆక్రమణలను అడ్డుకునే పరిస్థితులు చేపట్టలేదు. అంటే అధికారులకు తెలిసే ఈ కబ్జా పర్వం కొనసాగుతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. చెట్లు కొట్టి కొండను చదును చేసేందుకు సిద్ధం చేస్తున్న అక్రమార్కులు సీఆర్పీ క్వార్టర్స్లో చెట్లు కొట్టి బాగు చేస్తున్న ప్రభుత్వ స్థలం నగరం నడిబొడ్డున రూ.5 కోట్ల విలువైన స్థలంపై టీడీపీ నాయకుల కన్ను సీఆర్పీ క్వార్టర్స్లోని ఆర్అండ్బీకి చెందిన ఖాళీ స్థలం కబ్జాకు కుట్ర సర్వే నంబర్ 3లో ఉన్న చెట్లు కొట్టించి చదును చేస్తున్న వైనం కళ్లప్పగించి చూస్తున్న అధికారులు -
యువత, మహిళలను మోసం చేశారు
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన యువత, ఆడబిడ్డలను నిలువునా మోసం చేశారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్తో సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, యువతకు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేల చొప్పున ఇస్తామని చెప్పి రెండేళ్లుగా పైసా ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడంలో చంద్రబాబు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు. – ఎం.రవికుమార్, ౖవెఎస్సార్ సీపీ కన్వీనర్, కొమరోలు -
రాష్ట్రంలో అరాచక పాలన
పొదిలి రూరల్: రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న అరాచక పాలన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కొట్టినోళ్లకు స్టేషన్ బెయిల్.. తిట్టినోళ్లకు సెంట్రల్ జెయిల్ అన్నట్లుగా ఉందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం పొదిలి శివాలయంలో నిర్మమహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డితో కలసి విలేకర్లతో మాట్లాడారు. మహాశివరాత్రి రోజున ఆ దేవదేవుడైన పరమేశ్వరుని అందరికీ మంచి జరిగేలా దీవించమని ప్రార్థించినట్లు చెప్పారు. ఒంగోలు పార్లమెంటులోని ముఖ్య దేవాలయాల్లోని స్వామివార్లకు ఆనవాయితీగా సారె తీసుకొచ్చి సమర్పించామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరిని జైల్లో పెట్టాలనే ఆలోచన తప్ప, అభివృద్ధి చేద్దామనే మాట గుర్తుకు రాదన్నారు. ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గ పాలన ఎక్కడైనా ఉంటుందా అన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ కే నరసింహారావు, జీ శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, మస్తాన్వలి, పులిగొర్ల శ్రీనివాసులు, ఫిరోజ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. త్రిపురాంతకంలో పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిపురాంతకం ఆలయాలకు వచ్చిన వారికి ఆలయాల వద్ద అధికారులు, వైఎస్సార్ సీపీ నాయకులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల చిత్రపటం, శేషవస్త్రం అందించారు. వారి వెంట పార్టీ కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి, రంగబాబు, గాలెయ్య, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, శేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. -
జీవిత కాలం లేటు!
శంకరా..శుభంకరాభక్తసులభుడైన భోళా శంకరుడు ఆద్యంత రహితమైన లింగరూపంలో ఉద్భవించిన మహాశివరాత్రి పర్వదినాన్ని ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన త్రిపురాంతకం, భైరవకోన, జమ్ములపాలెం, మడనూరు తదితర ఆలయాల్లో వేలాది మంది భక్తులు శివయ్య దర్శనం కోసం బారులుతీరారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, శివకళ్యాణ మహోత్సవాలు, ఉపవాస నియమాలతో నిష్టగా స్వామిని అర్చించారు. – సాక్షి నెట్వర్క్ ఈ లైను..మహిళలను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసింది. ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ.1500 లు ఇస్తాననని హామీ ఇచ్చారు. బడ్జెట్లో దానికి కేటాయింపులు లేవు. సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించి రెండేళ్లవుతున్నా వాటిని పూర్తి స్థాయిలో అందివ్వలేదు. కేవలం మాటలు చెప్పి ఊక దంపుడు ఆర్భాటాలు తప్ప ఈ బడ్జెట్లో పేదలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. – ఉడుముల అరుణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బీసీలకు మొండిచేయి కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపింది. ఎన్నికల హామీలో భాగంగా బీసీలకు 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తాను అని చెప్పి ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలవుతున్నా పింఛన్ హామీని తుంగలో తొక్కారు. చంద్రబాబు నాయుడు చెప్పేది కొండంత.. చేసేది మాత్రం శూన్యం. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తాం. – తాతా నరసింహా గౌడ్, వైఎస్సార్ సీపీ గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు మార్కాపురం: కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ఏళ్లతరబడి సాగుతూనే ఉన్నాయి. సుమారు పదేళ్ల కిందట గుంటూరు–గుంతకల్ మధ్య డబ్లింగ్ పనులకు బడ్జెట్ మంజూరై పనులు ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రతి ఏడాది బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడంతో పదేళ్లుగా ఈ రైల్వే లైను మధ్య పనులు సాగుతూనే ఉన్నాయి. మొత్తం 401.47 కిలోమీటర్ల పొడవునా డబ్లింగ్ పనులు చేయాలి. అప్పట్లో రూ.3887.48 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. అప్పటి నుంచి దశలవారీగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా గిద్దలూరు–నంద్యాల మధ్య ఉన్న గాజులపల్లి, దిగువమెట్టల మధ్య దాదాపు 30 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులను చేయాల్సి ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో రెండు సొరంగాల పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. దాదాపు పదేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయి. పూర్తయితే పలు నూతన రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణించవచ్చు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ్ కూడా పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరో వైపు నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో కనిగిరి వరకూ రైల్వేలైను పూర్తయినా ఇంకా ట్రయల్ దశలోనే ఉంది. 15 ఏళ్లుగా నడికుడి–శ్రీకాళహస్తి పనులు.. నడికుడి – శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైను పనులు 2011–12లో నాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు 2014 నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 45 కిలోమీటర్లు రైల్వేలైను, గుండ్లకమ్మ నుంచి–కనిగిరి వరకూ వయా దర్శి, పొదిలి మీదుగా 75 కిలోమీటర్ల రైలు మార్గాన్ని పూర్తిచేసి ఇటీవలే ట్రయల్ రన్ చేశారు. ఇంకా రైళ్ల రాకపోకలను ప్రారంభించలేదు. ఆధునికీకరణ ఎప్పుడో..? అమృత్ భారత్ పథకం కింద మార్కాపురం రోడ్ రైల్వేస్టేషన్ను ఎంపిక చేశారు. 2024 ఫిబ్రవరిలో వర్చువల్గా ప్రధాని, రైల్వే శాఖామంత్రి ప్రారంభించారు. రూ.21.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇంకా కంభం రైల్వేస్టేషన్కు రూ.11.72 కోట్లు, గిద్దలూరు రైల్వేస్టేషన్కు రూ.11.72 కోట్లను కేటాయించింది. మొదట్లో పనులు వేగంగా సాగినా ఆ తరువాత పర్యవేక్షణ కొరవడి పనులు నెమ్మదించాయి. ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ సుమారు 3 నుంచి 4 వేల మంది ప్రయాణికులు, ఇటు గుంటూరు నుంచి గుంతకల్ వరకూ రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ మార్కాపురం రైల్వేస్టేషన్లో పనులు చాలా మిగిలి ఉన్నాయి. ప్లాట్ఫాంల విస్తరణ, ప్రయాణికుల విశ్రాంతి గదులు, శ్రీశైలం యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు, గూడ్స్ షెడ్లు నిర్మించాల్సి ఉంది. దీంతోపాటు గిద్దలూరు, కంభం రైల్వేస్టేషన్లలో కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టాలి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ పనులు మాత్రం నత్తనడకతో పోటీ పడుతున్నాయి. 2014–19 మధ్య ఒంగోలు ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అప్పటి కేంద్ర మంత్రులతో మాట్లాడి ప్రత్యేక నిధులు తేవడంతో రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు జరిగాయి. కంభం రైల్వేస్టేషన్ ద్వారా ప్రతిరోజూ సుమారు 2 వేల మంది, గిద్దలూరు రైల్వేస్టేషన్ ద్వారా రోజుకు సుమారు 3 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ఇక ఈ మార్గం గుండా ప్రతిరోజూ దాదాపు 20 రైళ్ల వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధానంగా హుబ్లీ, తిరుపతి, ప్రశాంతి, అమరావతి, ధర్మవరం, వాస్కోడిగామ, కాచీగూడ, నర్సాపూర్, బెంగుళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు కూడా ప్రయాణిస్తుంటాయి. ఇలా ఆదాయం బాగా ఉన్నప్పటికీ వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. త్వరగా రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు, డబ్లింగ్ పనులు పూర్తిచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. గిద్దలూరు– నంద్యాల మధ్య సొరంగ మార్గంఅధికారులకు వినతిపత్రం ఇచ్చాం.. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వాస్తవ మార్కాపురం రైల్వేస్టేషన్ సందర్శనకు వచ్చినప్పుడు రైల్వేస్టేషన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయనకు వివరిస్తూ వినతిపత్రం అందజేశాం. శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం డార్మిటరీ కట్టాలని, దొనకొండ రైల్వేస్టేషన్లో బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని, కంభం రైల్వేస్టేషన్లో ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించాలని కోరాం. పిడుగురాళ్ల మీదుగా తిరుపతి, హైదరాబాద్ మధ్య రోజూ రాత్రిపూట ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని కోరాం. – ఓరుగంటి మల్లిక్, రైల్వే ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు, మార్కాపురం ఒంగోలు సబర్బన్: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం–పీజీఆర్ఎస్) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డీఆర్లో బీసీహెచ్ ఓబులేసు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలోని అధికారులందరూ సింగరాయకొండ మండలం పాకలలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో విధులు నిర్వర్తించారన్నారు. దాంతో పాటు ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ కార్యాలయాలకు ఆప్షనల్ హాలిడే ను కలెక్టర్ పి.రాజా బాబు ప్రకటించారన్నారు. అందుకోసం మీ కోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పారు. ఒంగోలు టౌన్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పోలీసు అధికారులందరూ డ్యూటీలో ఉండడం, మరికొందరు ఐచ్చిక సెలవుల్లో ఉండటంతో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రైల్వే ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా మీదుగా వెళ్లే గుంటూరు–గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తిచేయలేదు. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులూ అసంపూర్తిగా ఉండి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. -
తౌషిక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి సయ్యద్ తౌషిక్ (11) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై ఆదివారం ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సుమారు గంట సేపు జరిగిన ధర్నాతో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ఫోన్లో తమతో మాట్లాడిన తౌషిక్ హుషారుగానే ఉన్నాడని, అంతలోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి చెప్పడం నమ్మదగిందిగా లేదని తలిదండ్రులు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలుడి తండ్రి సయ్యద్ అలీ మాట్లాడుతూ..తౌషిక్ మృతికి సంబంధించి తమకు అనేక సందేహాలున్నాయని చెప్పారు. తౌషిక్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. సమీపంలో ఉన్న ఒంగోలుకు తరలించకుండా కందుకూరుకు తీసుకెళ్లడంలో ఉద్దేశం ఏమిటన్నారు. బాలుడి గొంతు మీద గాయాలు ఎక్కడ నుంచి వచ్చాయో పాఠశాల యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, తౌషిక్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్ వార్డన్ బాబ్జీ గతంలోనూ తమ కుమారుడిపై చేయి చేసుకున్నాడని, అతడి వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున అతడిని అరెస్టు చేసి విచారించాలని కోరారు. పాఠశాల యాజమాన్యంతో కుమ్మకై ్కన సింగరాయకొండ ఎస్సైను విచారణ నుంచి తప్పించాలని కోరారు. ఏ తప్పు చేయకపోతే పాఠశాల యాజమాన్యం ఎందుకు పరారీలో ఉందో చెప్పాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ వినోద్ మాట్లాడుతూ హాస్టల్ వార్డన్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమన్నారు. 6వ తరగతి చదువుకునే విద్యార్థికి ఆత్మహత్య చేసుకునే కష్టమేముంటుందని, పాఠశాలలో జరిగిన విద్యార్థి మరణంపై అధికారులు తగిన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2007లోనూ ఈ పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలను సీజ్ చేయాలని అధికారులను కోరారు. డీఆర్ఓ హామీతో ధర్నా ఉపసంహరణ.. ధర్నా జరుగుతున్న సమయంలో అటుగా డీఆర్ఓ చిన ఓబులేసు వచ్చారు. ధర్నా విషయం అడిగి తెలుసుకున్న ఆయన బాధితుల వద్దకు వచ్చి మాట్లాడారు. తౌషిక్ మరణం గురించి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. దాంతో ఎస్ఎఫ్ఐ నాయకులు వినోద్, బాలుడి తండ్రి సయ్యద్ అలీ, ఇతర కుటుంబ సభ్యులు డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్తో మాట్లాడిన డీఆర్ఓ బాలుడి మృతిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో బాధితులు ధర్నా విరమించారు. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ స్కూలులో శనివారం రాత్రి ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాలు.. కనిగిరికి చెందిన సయ్యద్ ఆలీ, భార్య మౌలాబికి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు తౌషిక్(11) మూలగుంటపాడులోని శ్రీచైతన్య నవోదయలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల వార్డెన్ బాబ్జి తరుచూ తౌషిక్ను కొడుతుండటంతో.. కరస్పాండెంట్ రమణారెడ్డికి విద్యార్థి తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వార్డెన్ బాబ్జి సెల్ఫోన్ నుంచి తౌషిక్ తన తల్లి మౌలాబితో ఆనందంగా మాట్లాడాడు. ఆ తర్వాత అరగంటకే పాఠశాల నిర్వాహకుల నుంచి తౌషిక్ తల్లిదండ్రులకు ఫోన్ వచి్చంది.మీ కుమారుడు బాత్రూంలో టవల్తో ఉరేసుకున్నాడని.. కందుకూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేసి వెళ్లిపోయారంటూ తౌషిక్ తల్లిదండ్రులు విలపించారు. తన సెల్ఫోన్ను ఉపయోగించినందుకు వార్డెన్ బాబ్జి కొట్టడంతో తౌషిక్ స్పృహ తప్పి పడిపోయాడని సహ విద్యార్థులు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల నిర్వాహకులు మాత్రం తౌషిక్ బాత్రూంలోని హ్యాంగర్కు ఉరేసుకొని చనిపోయాడంటున్నారని వాపోయారు.ఆ హ్యాంగర్ పిల్లల చేతికి అందే ఎత్తులో ఉందని.. దానికెలా ఉరేసుకొని చనిపోతాడంటూ వారు ప్రశి్నంచారు. గొంతుపై గాట్లు ఎందుకున్నాయని నిలదీశారు. తమ కుమారుడిని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ఆలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం తౌషిక్ మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద ధర్నా చేశారు. కరస్పాండెంట్ రమణారెడ్డి, ఆయన కుమారులిద్దరూ పరారయ్యారని తెలియడంతో.. పాఠశాలపై దాడి చేసి పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఎస్సై బి.మహేంద్ర పాఠశాల వద్దకు చేరుకొని.. వారికి నచ్చజెప్పి పంపించేశారు. -
రాష్ట్ర స్థాయి రోల్ బాల్ పోటీలు ప్రారంభం
పోటీల్లో తలపడుతున్న జట్లు పోటీలను ప్రారంభిస్తున్న బసివిరెడ్డి సింగరాయకొండ: మండలంలోని కనుమళ్ల పంచాయతీలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శనివారం ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి రోల్ బాల్ అస్మితా లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రోల్ బాల్ ఇండియా రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కూల్ అసోసియేట్ డైరెక్టర్ కె.బసివిరెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, అనంతపురం, తాడిపత్రి, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. పోటాపోటీగా జరిగే ఈ పోటీలు ఆదివారంతో ముగుస్తాయన్నారు. గెలిచిన క్రీడాకారులు సౌత్ జోన్ నేషనల్ రోల్బాల్ అస్మితా లీగ్ పోటీల్లో ఆడతారన్నారు. కార్యక్రమంలో మలినేని లక్ష్మయ్య, లక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ ఏజీకే మూర్తి, ప్రిన్సిపాల్ దిల్నషీన్, రోల్ బాల్ సెక్రటరీ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ బ్రిడ్జిపై శనివారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని మోదేపల్లి గ్రామానికి చెందిన భీమని హనుమంతరావు (55) పని మీద అద్దంకి వచ్చాడు. తిరిగి తిమ్మాయపాలెం గ్రామానికి నడిచి వెళ్లాడు. అక్కడి నుంచి ఆటో ఎక్కడం కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో గుండ్లకమ్మ బ్రిడ్జిపైకి రాగా అద్దంకి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా మృతిచెందాడు. మృతునికి, భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొమరోలు: పరీక్షలు దగ్గరకొస్తున్నాయి చదువుపై శ్రద్ధ పెట్టమని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్మీడియెట్ విద్యార్థి శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని యర్రపల్లెకు చెందిన మల్లెబోయిన వెంకటేశ్వర్లు, రాములు దంపతుల రెండో కుమారుడు మల్లెబోయిన వెంకటసాయి (18) కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వెంకటసాయి చదువుపై శ్రద్ధ పెట్టకపోవడంతో తండ్రి వెంకటేశ్వర్లు చదువుకోవాలని మందలించాడు. పరీక్షలంటే భయపడిన వెంకటసాయి మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లోని సీలింగ్ కొక్కేనికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొదిలి: స్థానిక పిచ్చిరెడ్డితోటలోని గురజాల నరేష్కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం దగ్ధమైంది. చుట్టుపక్కల వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. రేకులు వేసుకునేందుకు తెచ్చిపెట్టుకున్న రూ.20 వేల నగదుతో పాటు టీవీ, మోటారు సైకిల్, వంట సామగ్రి, దుస్తులు కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలు మాత్రమే మిగిలాయని తెలిపారు. సింగరాయకొండ: మండల పరిధిలోని పాకల సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ఫెస్టివల్ సందర్భంగా హెలికాప్టర్ రైడింగ్, స్పీడ్ బోట్ రైడింగ్ ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ప్రారంభించారు. సాయంత్రం సాగరతీరాన వేదపండితుల ఆధ్వర్యంలో సాగరహారతి నిర్వహించారు. ప్రముఖ టీవీ యాంకర్ సుమ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్దన్రాజు, జేసీ కల్పనాకుమారి, ఇతర అధికారులు పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఫెస్టివల్ సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయలేదని పర్యాటకులు ఆసహనం వ్యక్తం చేశారు. ప్రచారం చేసిన స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంపై నిరాశ చెందారు. ఆర్టీసీ బస్సులు కూడా రెండు మూడు బస్సులు మాత్రమే ఏర్పాటు చేయడంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
పచ్చాకు ట్రాక్టర్ బోల్తా
● ఇద్దరు మహిళా కూలీలు మృతి లింగసముద్రం: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబాలను పోషించుకుంటుంటారు. ఎప్పటిలానే శనివారం కూడా పచ్చాకు కొట్టేందుకు వెళ్లారు. ఆకు రెలిపి ట్రాక్టర్లో నింపారు. ట్రాక్టర్లో ఆకుపైనే కూర్చుని ఇంటికి వస్తున్నారు. కానీ, అంతలోనే జరిగిన ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్లిపోయారు. లింగసముద్రం మండలంలోని గంగపాలెం సమీపంలో శనివారం మధ్యా హ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీ లు మృత్యువాత పడ్డారు. స్థానిక ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గంగపాలెం గ్రామానికి చెందిన గొర్రెపాటి చెంచురామయ్య పొగాకు బ్యారన్కు పొగాకు రెలిపేందుకు చెంచురామయ్య ట్రాక్టర్, ఏజర్ల ఏడుకొండలుకు చెందిన ట్రాక్టర్లలో స్థానిక ఎస్సీకాలనీకి చెందిన కూలీలు వెళ్లారు. పొలంలో పొగాకు రెలుపుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. చెంచురామయ్య ట్రాక్టర్ కొంతమంది కూలీలతో ముందు వెళ్తుండగా, ఏడుకొండలు ట్రాక్టర్ ఆరుగురు కూలీలతో వెనుక వెళ్తోంది. రోడ్డుపై ఉన్న గుంతను ఎక్కిదిగే క్రమంలో పచ్చాకుతో ఉన్న ఏడుకొండలు ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా చింతకాయ ఊడిపోయి తిరగబడింది. దీంతో దానిపై కూర్చుని ఉన్న ఆరుగురు కూలీల్లో ఇద్దరు అందులో నుంచి దూకివేశారు. మరో ఇద్దరు పక్కకు పడిపోయారు. మిగిలిన ఇద్దరైన స్వర్ణ సలోమి (35), పట్టపు రత్తమ్మ (40) పచ్చాకు కింద పడిపోయారు. ట్రాలీని జేసీబీ సహాయంతో పైకిలేపి పచ్చాకు తొలగించి చూడగా, అప్పటికే ఊపిరాడక వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో గంగపాలెం గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్డం నిమిత్తం కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉసురు తీసిన సరదా..
● రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి కనిగిరి రూరల్: సరదాగా చేసిన ప్రయాణం ఓ పదో తరగతి విద్యార్థి ఉసురు తీసింది. శనివారం కనిగిరిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన విద్యార్థులు వారి స్నేహితులతో కలిసి సరదాగా మూడు బైకులపై పట్టణ సమీపంలోని కలగట్ల వద్ద నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్ను చూసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కలగట్ల–కనిగిరి మధ్యలో మలుపు వద్ద ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో పట్టణంలోని ఏబీఎం గ్రౌండ్కు చెందిన విజయ్ కుమారుడైన పదో తరగతి విద్యార్థి కుడుముల ప్రతాప్ (15), మరో విద్యార్థి బీ అనీశ్కు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రతాప్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనీశ్కు చెయ్యి విరగడంతో చికిత్స చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలను మోసం చేసే మాయ బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేది లాగే ఉంది తప్ప ఏమాత్రం ఉపయోగం పడేట్టు లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసిన బడ్జెట్లకు, చంద్రబాబు బడ్జెట్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్లో లేవు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఒక్క కొత్త పెన్షన్ను మంజూరు చేయలేదు. ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎంతమాత్రం ఉపయోగం లేదు. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ -
ఆడబిడ్డల చెవిలో 1500 పూలు ...
గత ఎన్నికలకు ప్రచారంలో ఆడబిడ్డ నిధి పథకం పేరుతో 18 ఏళ్లు నిండి 58 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు అండ్ కో నమ్మబలికారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి పథకం గురించి మాట్లాడడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి అవసరమైన నిధులు కేటాయించనున్నట్లు లీకేజీలు ఇచ్చారు. తీరా చూస్తే అసలు ఆడబిడ్డ నిధి గురించి అస్సలు ప్రస్తావించకుండానే బడ్జెట్ ముగించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 7,35,002 మంది మహిళలు ఉన్నారు. వీరికి నెల నెలా రూ.1500 చొప్పున నెలకు రూ.110,25,03,000 ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ఈ సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టి మోసం చేశారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఉమ్మడి జిల్లాకు అన్యాయం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బడ్జెట్లో కేటాయింపులు శూన్యం. వెలిగొండ ప్రాజెక్టు కేవలం రూ.412 కోట్లతో ఎలా పూర్తవుతుంది. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అరకొర నిధులను కేటాయించడం దారుణం. నిర్వాసితులను తరలించడానికే రూ.1300 కోట్లు అవసరమవుతాయి. ఈ రకంగా నిధులు కేటాయిస్తే వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకు బడ్జెట్లో ఎలాంటి నిధులను కేటాయించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క పరిశ్రమ కానీ, ఉపాధి కల్పించడానికి కేటాయింపులు కానీ చేయలేదు. గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి అరకొర నిధులు ఇచ్చారు. హార్బర్, విమానాశ్రయాలు అని ఊదరగొట్టారు. వాటికి కూడా కేటాయింపులు లేవు. దొనకొండను పారిశ్రమికంగా అభివృద్ధి చేస్తామన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. ఇక సంక్షేమ పథకాలకు కూడా అంతంత మాత్రంగానే నిధులు కేటాయించారు. – డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
అబద్ధాలు, మోసాలే
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్లోను ప్రజలను మోసం చేసేలా అంకెల గారడీ చేశారు. సూపర్సిక్స్ పథకాలకు మరోసారి మొండిచేయి చూపారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలకు పైసా కేటాయించలేదు. మిగిలిన పథకాలకు అరకొరగానే నిధులు కేటాయించారు. బడ్జెట్లో చూపించిన ఆదాయాలు వస్తున్నాయా లేదా అనేది కూడా బడ్జెట్ లెక్కల్లో చూపలేదు. 2025–26 ఏడాదికి ప్రతిపాదించిన బడ్జెట్ రూ.3,22,359 కోట్లు అయితే సవరించిన తరువాత రూ.3,00,535 కోట్లకు తగ్గించారు. చివరి ఆ నిధులైనా ఖర్చు చేశారా లేదా అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇలా అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తప్పా బడ్జెట్లో ప్రజలకు మేలు చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయలేదు. – తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ -
వెలిగొండపై దొంగాట..
మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందిస్తూ శాశ్వతంగా కరువును నివారించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై పాలకులు దొంగాట ఆడుతున్నారని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదలశాఖామంత్రి నిమ్మల రామానాయుడు దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను మూడు సార్లు పరిశీలించారు. ఈ ఏడాది ఆఖరుకు వెలిగొండ నీరు పారిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే ప్రకటనలు చేశారు. అయితే బడ్జెట్ కేటాయింపులో రిక్తహస్తం చూపించారు. ఈ దఫా కేవలం రూ.412.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మార్కాపురం జిల్లా ఇచ్చిన ఆనందం వెలిగొండ ప్రాజెక్టు కేటాయించిన నిధులను చూసి ఆవిరైంది. కొత్త జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉమ్మడి ప్రకాశం ఉండేది. అందులో పశ్చిమ ప్రకాశమే పూర్తిగా వెనుకబడింది. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలతో కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధి ఎక్కువగా మార్కాపురం జిల్లాలోనే ఉంది. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెలిగొండకు అతితక్కువ నిధులు కేటాయించడంపై జిల్లా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు కూడా వెలిగొండకు కేటాయించిన నిధులపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా వెలుగొండకు రూ.492.90 కోట్లు కేటాయించింది. ఇందులో డ్యామ్ డెవలప్మెంట్స్కు రూ.300 కోట్లు, కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ పనులకు రూ.82.9 కోట్లు, ఆర్అండ్ఆర్ లబ్ధిదారులకు రూ.80 కోట్లు, ఆర్అండ్ఆర్ వర్కులకు రూ.30 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రూ.80 కోట్లు ఆర్అండ్ఆర్ వర్కులకు కేటాయించిన నిధులను పక్కన పెడితే రూ.412.90 కోట్లు కేటాయించినట్లు అయింది. కాగా కెనాల్ వర్కులకు సంబంధించి రూ.143 కోట్లను 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇదే సమయంలో 1237 ఎకరాల భూమిని 7 నెలల్లో భూసేకరణ కింద తీసుకోవాలని నిర్ణయించారు. అరకొర నిధులతో ఎప్పటికి పూర్తయ్యేనో..! బడ్జెట్లో నిధులు చూసినట్లయితే ఎలా పూర్తవుతుందో అర్థం కావడంలేదని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మార్కాపురం యూనిట్ పరిధిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సుమారు రూ.750 కోట్లు, కంభం యూనిట్ పరిధిలోని ఆర్అండ్ఆర్కు సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతాయని గతంలోనే అంచనా వేశారు. నిజానికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి ఫేజ్ పూర్తవడానికి కనీసం రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని స్వయంగా ఇరిగేషన్ మంత్రి ఇటీవల ప్రకటించారు. ఆయన చెప్పిన మాట ప్రకారమైన ఈ బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఇటీవల ఫీడర్ కెనాల్ నిర్మాణానికి రూ.540 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇప్పుడు తాజా బడ్జెట్లో కేటాయించిన నిధులు కంట్రాక్టర్కు చెల్లించడానికే సరిపోతాయని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. జిల్లాలో మరో కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కూడా.20 కోట్లు మాత్రమే విదిల్చింది. ఈ కేటాయింపుపై రైతులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నిర్వాసితులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. అందులో కేవలం 10 శాతం కూడా కేటాయించకపోవడాన్ని బట్టి చూస్తే వెలిగొండ ప్రాజెక్టును ఇప్పట్లో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించడంలేదని అనుకోవాల్సి ఉంటుందని నిర్వాసితులు విమర్శిస్తున్నారు. -
గుండ్లకమ్మ
చంద్రబాబు తన బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపారు. ప్రధానంగా సాగు, తాగునీటి రంగానికి అత్తెసరు నిధులు కేటాయించి జిల్లా వాసుల ఆశలపై నీళ్లు జల్లారు. కరువు నేలపై జీవనాడిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు ఎప్పటిలాగే మొక్కుబడిగా నిధులిచ్చి మోసం చేశారు. మరో కీలక ప్రాజెక్టు గుండ్లకమ్మకు సైతం అరకొరగా నిధులు విదిల్చారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. యువనేస్తం, ఆడబిడ్డ నిధి పథకాలను అటకెక్కించేసింది. కనీస మద్దతు ధర లభించక ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న అన్నదాతలను డబుల్ ఇంజన్ సర్కార్ రెండేళ్లుగా మోసం చేస్తూనే ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత బడ్జెట్లో మిర్చి క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి ఘనంగా ప్రకటించినా అది కనీసం కార్యరూపం దాల్చలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పద్దులో హార్టీకల్చర్ క్లబ్, అమరావతి క్యాపిటల్ రీజియన్ల్లోకి జిల్లాను తీసుకొస్తున్నట్టు మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ప్రకటనపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. ఉత్తుత్తి ప్రకటనలతో సర్కార్ మోసం చేస్తోందని మండిపడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి అసలు నిధులు కేటాయించకపోవడంపై ఆ ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. పీఆర్సీ, ఐఆర్పై ప్రస్తావన లేకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
వెలిగొండకు నిధులు లేవు..కొత్త జిల్లాకు కేటాయింపుల్లేవు
రాష్ట్ర బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు లేవు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ను అమరావతి ఎకనామిక్ జోన్గా పేరు మార్చారే తప్ప నిధులివ్వలేదు. మార్కాపురం జిల్లాను ప్రకటించారే తప్ప కేటాయింపులు లేవు. ఈ ప్రకారం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఈ బడ్జెట్ తీవ్ర నష్టం కలిగింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటానికి రూ.2,300 కోట్లు కావాల్సి ఉండగా అందులో రూ.900 కోట్లు నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉంది. కానీ అరకొర కేటాయింపులు మాత్రమే చేశారు. ప్రాజెక్టు వచ్చే సంవత్సరం కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. విద్యారంగానికి అరకొర కేటాయింపులు చేశారు. మార్కాపురం కొత్త జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపుల్లేవు. ఇది కేవలం అంకెల గారడీ బడ్జెట్. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ -
నిరుద్యోగులకు నమ్మక ద్రోహం..
ఈ సారి కూడా నిరుద్యోగులకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మేము గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మాత్రంగానైనా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదని విద్యార్థి, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 2,18,767 మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి నెల నెలా రూ.3 వేల భృతి ఇవ్వాల్సి ఉంది. నెలకు రూ.65,63,01,000 చెల్లించాలి. కానీ రెండేళ్లుగా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదు. ఈ బడ్జెట్లోనైనా నిరుద్యోగ భృతికి నిధులు కేటాయిస్తారేమోనని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. -
ప్రజలకు ఒరిగేదేమీ లేదు..
రాష్ట్ర బడ్జెట్లో అంకెల గారడీ, మాటల బురిడే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఈ సారి అయినా ఆదుకుంటారని ఆశించిన అక్కచెల్లెమ్మలకు మొండిచేయి చూపించారు. మహిళా నిధికి, నిరుద్యోగ భృతికి కూడా కేటాయింపులు శూన్యం. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు పాతరవేసినట్లే. అన్నదాత సుఖీభవ పథకానికి రైతుకు రూ.20 వేలు ప్రకారం ఇవ్వాలంటే బడ్జెట్ కేటాయింపులో సంవత్సరానికి రూ 10,700 కోట్లు కావాలి. కానీ కేటాయించింది మాత్రం కేవలం రూ.6 వేల కోట్లు. సున్నా వడ్డీ కింద రుణాలు, పంటలకు ఉచిత బీమా కేటాయింపులు లేనేలేవు. రైతులను పూర్తిస్థాయిలో విస్మరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ధరల స్థిరీకరణకు రూ.7,800 కోట్లు ఖర్చుచేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. 2026–27 సంవత్సర బడ్జెట్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి చూపించడం ప్రజలను మోసం చేయడమే. – తాటిపర్తి చంద్రశేఖర్, వైపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
బత్తాయి తోటకు నిప్పు పెట్టిన టీడీపీ వర్గీయులు
అర్థవీడు: పది ఎకరాల్లో ఉన్న బత్తాయి తోట, డ్రిప్ పైపులకు టీడీపీ నేతలు నిప్పంటించి తగులబెట్టిన ఘటన మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లెలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వడ్డెముట్ల వెంకటేశ్వరరావు, గొటికే రాజేశ్వరరెడ్డి, మరో నలుగురికి చెందిన బత్తాయి తోటలో డ్రిప్ పైపులు, చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వ్యాపించి బత్తాయి తోట పక్కన ఉన్న 4 ఎకరాల జామాయిల్ తోట దగ్ధమైంది. సర్వే నంబర్ 51, 53, 54లోని 25 ఎకరాలు మాజీ ఎంపీపీ గొటికే రాజేశ్వరరెడ్డి ఆధీనంలో ఉన్నాయని టీడీపీ నేతలు కలెక్టర్, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ 25 ఎకరాల్లో సాగులో ఉన్న రైతులు బోరు, కరెంట్ బిల్లులు, పాస్ పుస్తకాలు, రైతు భరోసా పత్రాలు విచారణకు వచ్చిన అధికారులకు అందజేశారు. ఈ భూములతో రాజేశ్వరరెడ్డికి సంబంధం లేదన్నారు. రాజకీయ ఒత్తిడితో విచారణకు వచ్చిన అధికారులు రాజేశ్వరరెడ్డి ఆధీనంలోనే భూమి ఉందని, పీఓటీ యాక్ట్ కింద ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై రైతులు సబ్ కలెక్టర్కు అప్పీలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గానికి చెందిన వారు కక్షపూరితంగా తమకు నష్టం చేకూర్చాలని తోటలను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ చించివేత
పుల్లలచెరువు: టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. మండలంలోని బీర్నినేనిపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు శివరాత్రి పండుగను పురస్కరించుకుని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్, కార్యకర్తల పేరుతో మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని గురువారం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం కార్యకర్తలు బయటకు వచ్చి చూసే సరికి ఫ్లెక్సీలో సగభాగం పూర్తిగా కోసి ఉంది. కార్యకర్తలు గ్రామంలో విచారణ చేయగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి తప్ప తాగి ఫ్లెక్సీ చించేసినట్లు ఒప్పకున్నాడని తేలింది. విషయం తెలుసుకున్న పార్టీ మండల కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు కార్యకర్తలతో మాట్లాడారు. ఈ విషయం పై స్థానిక పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
క్షణం తీరిక లేదు.. సమస్య పరిష్కరిస్తాం
ఒంగోలు టౌన్: కులాంతర వివాహం చేసుకున్న కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. శుక్రవారం కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామస్తులతో మాట్లాడి గ్రామ బహిష్కరణపై వివరాలు సేకరించారు. గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామ చావిడిలో గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 14, 15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్ ఉందని, మహా శివరాత్రి ఉత్సవాల బందోబస్తులో పోలీసులు తీరికలేకుండా ఉన్నారని తెలిపారు. రెండు రోజులు సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. గ్రామ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ఒకవేళ కుదరకపోతే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విచారణలో కొత్తపట్నం తహసీల్దార్ నాయబ్ రసూల్, ఎస్సై సుధాకర్, ఆర్ఐ, వీఆర్వోలు పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం రాజుపాలెంలో గ్రామ బహిష్కరణపై డీఎస్పీ, ఆర్డీఓ రెండు రోజులు సమయం ఇవ్వాలని గ్రామస్తులను కోరిన అధికారులు -
హెరిటేజ్ పాలలో కల్తీ సంగతేంటి బాబు?
ఒంగోలు సిటీ: ‘‘చంద్రబాబు నీ హెరిటేజ్ డైరీలోని పాలలో జరుగుతున్న కల్తీ సంగతి ఏమిటని’’ ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ప్రశ్నించారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ లడ్డూ విషయాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలని ఎంత ప్రయత్నం చేశారో మనందరికీ తెలుసన్నారు. చంద్రబాబు హెరిటేజ్ బాగోతాలన్నింటినీ ఒక్కొక్కటిగా వెంకటేశ్వరస్వామి బయటకు తీసుకొస్తున్నారన్నారు. ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనేదానికి ఇదొక నిదర్శనమన్నారు. లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పటం వేరని, పందికొవ్వు, చేప నూనె, జంతువుల కొవ్వు అని పిచ్చిమాటలు మాట్లాడి స్వామి వారిని అపవిత్రం చేయాలని ప్రసాదంపై దుర్మార్గంగా ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. శాఖాహారులు భయపడేటట్లు చేయడం దుర్మార్గమని, దేవుడు నిన్ను క్షమించడన్నారు. 30 ఏళ్ల నుంచి హెరిటేజ్ నడుపుతున్న చంద్రబాబుకి డిటర్జెంట్స్ సోప్ ఆయిల్ ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసని ఎద్దేవా చేశారు. ట్యాంకర్లను క్లీన్ చేయడానికి, పాత్రల జిడ్డును పోగొట్టడానికి కెమికల్ వాడతారన్నారు. లడ్డూ నెయ్యిలో బాత్రూం కెమికల్స్ కలిపారని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. హిందూ మత మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు బోలేబాబా డైరీతో ఉన్న సంబంధాలు బయటకు వస్తున్నాయన్నారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఉందని.. హెరిటేజ్ పెరుగు పాలతో తయారు కాలేదని విమర్శించారు. గతంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఒకరిద్దరు ఉండే వారని, ప్రస్తుతం ఒంగోలులోనే ఒక ఆస్పత్రి నడుస్తోందని, మరో రెండు రాబోతున్నాయన్నారు. కల్తీ పాల వల్ల వస్తున్న మార్పుల వల్లనే కేన్సర్ వస్తోందన్నారు. అలాగే పశువులకు ఇస్తున్న దాణాలో కూడా కల్తీ చేస్తున్నారని విమర్శించారు. యూరియాతో తయారైన పాలు ప్రజలకు సరఫరా చేస్తున్న డైరీలతో కేన్సర్ వస్తోందన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వైవీ.గౌతమ్ అశోక్, పిగిలి శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, సుతారం శ్రీను, చిన్న, అమర్, నాయకులు పాల్గొన్నారు. -
కార్యదర్శులకు ‘పన్ను’పోటు
బేస్తవారిపేట: పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు ఇంటి పన్ను వసూళ్లు గుదిబండగా మారాయి. ఏకంగా ఉద్యోగాలకే ఎసరు తెస్తున్నాయి. ఈనెల 15లోగా 50 శాతం, నెలాఖరులోగా 100 శాతం వసూళ్లు పూర్తి చేయాలని టీడీపీ సర్కారు ఆదేశించింది. గడువులోపు వసూళ్లు చేయకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. స్వర్ణాంధ్ర అంటూ పేర్లు పెట్టి కింది స్థాయి ఉద్యోగుల బాధలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. దీనిపై కార్యదర్శులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 530 మంది, మార్కాపురం జిల్లాలో 373 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1058 స్వర్ణ గ్రామం–స్వర్ణవార్డ్లు ఉన్నాయి. వీటిలో 9473 మంది ఉద్యోగులు సనిచేస్తున్నారు. 903 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ప్రతి ఏడాది మార్చిలో.. ప్రతి ఏడాది ఇంటిపన్ను వసూళ్లు మార్చి నెలలో డిమాండ్ నోటీస్లు జారీ చేసి ఆ నెలాఖరు, ఏప్రిల్ చివరకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరెక్కడా అప్పు పుట్టక తమపై పడిందంటూ గ్రామ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మెడపై కత్తి పెట్టి పన్నులు వసూలు చేయాలని చెప్పడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసంబద్ధంగా సస్పెన్షన్.. ఈనెల 15వ తేదీలోపు 50 శాతానికి మించి పన్ను వసూలు చేయలేని కార్యదర్శుల్లో మండలానికి ఒకరిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు దిగడమే కాకుండా బేస్తవారిపేట మండలంలోని అక్కపల్లె పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. బసినేపల్లె పంచాయతీ కార్యదర్శి పన్నుల వసూళ్లలో మండలంలో 11వ స్థానంలో ఉన్నాడు. పన్ను వసూళ్లలో ఇతనికంటే 8 పంచాయతీలు వెనుకబడి ఉన్నాయి. అయినా ఎవరో ఒకరిని బలిపశువుగా మార్చాలని చేసినట్లు అర్థమవుతోంది. క్యూఆర్ కోడ్ నిబంధనతో ఇక్కట్లు.. గతంలో ఇంటి పన్ను వసూళ్లు ఆఫ్లైన్లో కట్టించుకునేవారు. ఇంటింటికీ తిరిగి వసూలు చేసి రశీదులు ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం క్యూఆర్కోడ్ ద్వారా చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. స్మార్ట్ఫోన్ ఉన్న గృహ యజమానులు మాత్రమే ఇది చేసేందుకు అవకాశం ఉంది. పల్లెల్లో ఎక్కువ శాతం మందికి స్మార్ట్ఫోన్ సౌకర్యం, ఆన్లైన్ లావాదేవీల చెల్లింపు తెలియకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇంటిపన్ను వసూళ్ల కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. గడువులోపు పూర్తి చేయకుంటే సస్పెన్షన్ ఇప్పటికే పలువురు కార్యదర్శులపై వేటు ఆందోళనలో పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పలు సర్వేలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వామిత్వ సర్వే, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్వహణ, ఐవీఆర్ఎస్ కాల్స్, ప్రోన్యాప్ నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ, మనమిత్ర అవేర్నెస్, ఎస్ఏఎస్ఏ కార్యక్రమాలు, ఇతర యాప్ల నిర్వహణతోపాటు గ్రామ సభల విధుల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. క్షేత్ర స్థాయిలో పలు సమస్యలతో ఇంటిపన్ను వసూలు చేయలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి పెంచడంతో వయస్సు పైబడిన కార్యదర్శులు బీపీ, షుగర్లు పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు ఇది చేస్తాం..అది చేస్తామని ఆశలు పెట్టారని, కానీ తమకేమీ మేలు చేయకపోగా, పనిఒత్తిడి పెంచి పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేయడంతో మానసిక క్షోభకు గురవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. -
హామీలకు సున్నం.. అభివృద్ధి శూన్యం
కొండపి: ఎన్నికల వేళ టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రెడ్బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారని, గడిచిన 20 నెలల్లో కొత్తగా తెచ్చిన పరిశ్రమ ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని హామీని నెరవేర్చకపోగా, భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్న డప్పు కొట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. శుక్రవారం కొండపిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు అధ్యక్షతన పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మోసపూరిత ప్రకటలను చూసి టీడీపీ నాయకులే విస్తుపోతున్నారని చెప్పారు. తామంతా మోసపోయామని ఇప్పటికే ప్రజలు గ్రహించారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు. కొత్త పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు చేయకపోగా భర్త చనిపోయిన వారికి సైతం పింఛను ఎగ్గొట్టడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండానే.. నిధులు విడుదల చేసినట్లు క్షీరాభిషేకాలు చేయడం సిగ్గుచేటన్నారు. కొండపి నియోజకవర్గంలో ఒకరు అధికారికంగా, మరొకరు అనధికారికంగా మంత్రులుగా చెలామణి అవుతున్నా ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పాకలలో శాశ్వత పర్యాటకాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా.. బీచ్ ఫెస్టివల్ పేరుతో జబర్దస్త్ షోలు చేస్తే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. కార్యకర్తలే పార్టీకి బలం క్షేత్రా స్థాయిలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి జగనన్న 2.0లో సముచిత స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు మోసాలు, అక్రమాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ గ్రామ కమిటీలను ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, 2029 ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. రెడ్బుక్ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. 2029 ఎన్నికల్లో కొండపి గడ్డపై వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇద్దామన్నారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో మండల పరిశీలకుడు కొమ్మాలపాటి మదన్మోహనరావు, గొట్టిపాటి మురళి, బొక్కిసం సుబ్బారావు, వైస్ ఎంపీపీ రావులపల్లి కోటరాజు, మండవ మాలకొండయ్య, మణికంఠేశ్వర్ రెడ్డి, శివకృష్ణ, నరసారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భువనగిరి సత్యనారాయణ, రమేష్ సాంబశివరావు, వన్నూరు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారావు, వేణు, విజయరామరాజు, రవీంద్రారెడ్డి, సుబ్బయ్య, గంగాధర్ రెడ్డి, హరినారాయణ, కొర్నేలు, కోటి శేఖర్రెడ్డి, రెడ్డి రమణారెడ్డి, చిన్నబ్బాయి, నజీర్, శ్రీహరిబాబు, మోపర్తి నారాయణ, వెంకటనర్సు, గోవిందు, ఆదాము, నరసింహారావు, సుబ్బయ్య, శ్రీనివాసరెడ్డి, శ్రీను, చిన్న వసంత రావు, బ్రహ్మారెడ్డి, నాగిరెడ్డి, నాగుర్, బ్రహ్మయ్య, వినోద్ పాల్గొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు అండ్ కో బోగస్ ప్రకటనలు గడిచిన 20 నెలల కాలంలో యువతకు ఇచ్చిన ఉద్యోగాలెన్ని? జగనన్న 2.0లో పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ -
మీ అవినీతిపై సమాధానమివ్వు ఇంటూరీ..
కందుకూరు: ‘‘రేషన్, మట్టి, మద్యం మాఫియాల నుంచి ప్రతినెలా లక్షల్లో ముడుపులు తీసుకుంటూ ప్రశ్నిస్తే నాపై వ్యక్తిగత దాడి చేస్తావా, ముందు నియోజకవర్గంలో చేస్తున్న అవినీతి కార్యకలాపాల గురించి ప్రజలకు సమాధానం చెప్పి ఆ తరువాత వైఎస్సార్ సీపీ గురించి మాట్లాడాలంటూ’’ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మండిపడ్డారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డితో కలిసి శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి అవినీతిపై బుర్రా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతినెలా లక్షల్లో అవినీతి సొమ్ము ఎమ్మెల్యేకి చేరుతుందంటూ పలు ఆధారాలను ఆయన బయటపెట్టారు. లింగసముద్రం మండలంలోని పెదపవని గ్రామంలో రేషన్ మిల్లు కేంద్రంగా చేసుకుని మాఫియా నడుస్తోందని చెప్పారు. స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఓ రేషన్బియ్యం వ్యాపారితో చేసిన సంభాషణను ఈ సందర్భంగా బుర్రా బయటపెట్టారు. రేషన్ మాఫియా నుంచి నెలకు రూ.25 లక్షలు తీసుకుంటున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. బావ, బామ్మర్ది ట్యాక్స్ వసూల్ చేయడం లేదా... నియోజకవర్గంలో మట్టిమాఫియా నుంచి నువ్వు, నీ బామ్మర్ది కలిసి ట్యాక్స్ వసూల్ చేస్తున్న మాట వాస్తవం కాదా అంటూ బుర్రా నిలదీశారు. నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చలవిడిగా మట్టిమాఫియా చెలరేగుతోందని, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారని చెప్పారు. వీరి వద్ద నుంచి టిప్పర్కు ఇంత అని ట్యాక్స్ ఎవరు కట్టించుకున్నారని నిలదీశారు. ఎక్కడా ఒక్క టిప్పర్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవన్నారు. అలాగే ఎవరైనా వైఎస్సార్ సీపీ నాయకులు సొంత అవసరాల కోసం ఒక ట్రాక్టర్ మట్టి తీసుకుంటే బండ్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ల్లో పెట్టి వేధించడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 800ల వరకు బెల్టుషాపులు నిర్వహిస్తూ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రస్తున్నారని, వీరంతా ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఇటువంటి అవినీతిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత దాడి చేయడం సరైన విధానం కాదన్నారు. గత ఎన్నికల్లో కరేడు గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులను కొనుగోలు చేసేందుకు, నువ్వు, నీ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి కలిసి ఖర్చు చేసినంత డబ్బులు కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఈ రెండేళ్ల పాలనలో ఖర్చు చేయలేదని బుర్రా విమర్శించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పట్టణానికి రామతీర్ధం జలాలను తీసుకొచ్చి దాహార్తి తీరిస్తే, జగన్మోహన్రెడ్డి హయాంలో రామాయపట్నం పోర్టు వచ్చిందని, అభివృద్ధి అంటే ఇదన్నారు. పట్టణంలో డివైడర్లు వేయడం మంచిదే కానీ వాటికి టీడీపీ రంగులు, లైట్లు వేసుకుని భారీ అభివృద్ధి జరిగినట్లు చెప్పుకోవడం కాదని హితవు పలికారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు చెప్పేందుకు తాను సిద్ధమని సవాల్ చేశారు. టీడీపీలో నీ పరిస్థితి ఏంటో చూసుకో... ‘‘అవినీతి గురించి చెప్పాలని ప్రశ్నిస్తే నా వ్యాపారాల గురించి, నియోజకవర్గంలో ఉండడం లేదని చెప్తున్నావు. వ్యాపారం చేయడం తప్పుకాదు, నేను వ్యాపారంలో సంపాదించిన డబ్బులనే నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాను. నీలా నేను చందాలు వసూల్ చేసి, అప్పులు చేసి ఖర్చు చేయడం లేదు. ఆ అప్పులు తీర్చుకునేందుకు అవినీతికి పాల్పడడం లేదన్నారు’’. వ్యాపారం కోసమే కొన్ని రోజులు బయట ప్రాంతాల్లో ఉంటున్నానని, అదే నియోజకవర్గంలోనే ఉంటే నీ దుకాణం బంద్ అవుతుందంటూ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఉన్న నీకు ప్రస్తుతం టీడీపీలో పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోవాలన్నారు. పాలనలో లాస్టు నుంచి మూడవ ర్యాంకు వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని ముందు దీనిపై దృష్టిపెట్టాలని సూచించారు. బెదిరించే ధోరణిలో అనవసర విమర్శలు చేయడం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేకి హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే కల్తీ ఆరోపణలు వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డూ కల్తీ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డి ఆరోపించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం కోట్లాది మంది హిందువులకు అవమానం అన్నారు. సిట్ నివేదికలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పినా టీడీపీ నేతలు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్కళ్యాణ్ స్వయంగా యూటర్న్ తీసుకున్నారని, జనసేన నాయకులు కల్తీ జరగలేదని చెప్తున్నారని గుర్తు చేశారు. జగన్పై తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు సమాధానం చెప్పకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు వంటివి అన్నీ జగన్మోహన్రెడ్డి హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, అవినీతి కార్యకలాపాల్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మునిగితేలుతున్నారని విమర్శించారు. -
ఎస్హెచ్జీ రైతులకు రూ.87 కోట్ల రుణాలు
ఒంగోలు సబర్బన్: కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) గ్రూపు రైతులకు రూ.87 కోట్ల రుణాలు అందజేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప ప్రాంతీయ కార్యాలయ అధికారి ఈ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మడనూరులో నిర్వహించిన వ్యవసాయ రుణ అవగాహన, క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామానికి రూ.90 కోట్ల రుణాలు మంజూరు కాగా రూ.87 కోట్ల మేర నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. రుణ మంజూరు పత్రాలను సభ్యులైన రైతులకు అందజేశారు. సెంట్రల్ ఆఫీస్ డీజీఎం ఎం.పిచయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎల్డీఎం డి.రమేష్, ఏఓ జి. కిశోర్ బాబు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి డి.ఆశ, బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ చీఫ్ మేనేజర్ బీకే ప్రసాద్, మడనూరు బ్రాంచ్ మేనేజర్ విద్యాసాగర్, ఒంగోలు, క్విస్ కాలేజ్ శాఖ మేనేజర్లు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప ప్రాంతీయ అధికారి వెంకటేశ్వరరావు -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు
కొనకనమిట్ల: మండలంలోని ప్రభుత్వ, కొండపోరంబోకు, పశువుల బీడు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వడం, చెట్లు నరకడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ ఆవుల సురేష్ హెచ్చరించారు. కొనకనమిట్ల కొండపోరంబోకు భూముల్లో గ్రావెల్ తవ్వకాలపై గురువారం ‘సాక్షి’లో ‘పోరంబోకుల గ్రావెల్ దందా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. శుక్రవారం అన్ని గ్రామాల వీఆర్ఓలతో సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలపై నిఘా ఉంచాలని, అనుమతి లేకుండా గ్రావెల్ తరలించడాన్ని అడ్డుకోవాలని చెప్పారు. తవ్వకాలకు ఉపయోగించే జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేయడంతోపాటు జరిమానా విధిస్తామన్నారు. పామూరు: రోడ్డు దాటుతున్న స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం పామూరు సమీపంలోని 565 జాతీయ రహదారిపై సీహెచ్సీ వైద్యశాల సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఎస్సై కట్టా కథనం మేరకు. మండలంలోని లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన బేల్దారి కూలీ ఉడుముల వేణుగోపాలరెడ్డి, తన భార్య లక్ష్మీదేవికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్కూటీపై పామూరులోని వైద్యశాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సీహెచ్సీ సమీపంలో జంక్షన్ దాటుతుండగా కనిగిరి నుంచి దుత్తలూరు వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. వేణుగోపాల్రెడ్డి, లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడగా, స్కూటీ లారీ కిందకు దూసూకుపోయింది. సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇరువురు క్షతగాత్రులకు వేర్వేరు అంబులెన్సుల్లో ఒంగోలుకు తరలించారు. మార్గమధ్యంలో క్షతగాత్రుడు వేణుగోపాల్రెడ్డి(42) మృతి చెందారు. లక్ష్మీదేవి ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇద్దరు సంతానం ఉన్నారు. వేణుగోపాల్రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జరుగుమల్లి(సింగరాయకొండ): గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక గాయపడ్డ సంఘటన శుక్రవారం సాయంత్రం జరుగుమల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాలేరు నుంచి వరి చేల మీదుగా ఓ జింక రోడ్డుపైకి వచ్చింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నడవలేని స్థితిలో రోడ్డు పక్కన పడిపోయింది. హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పశు వైద్యాధికారుల కోసం ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్టు అధికారులు వచ్చి జింక తమ వెంట తీసుకెళ్లారు. ప్రమాదంలో బేల్దారి కూలీ మృతి భార్యకు తీవ్ర గాయాలు -
ఎస్హెచ్జీ మహిళల సర్వే నిర్వహించాలి
ఒంగోలు వన్టౌన్: 2026–27 ఆర్ధిక సంవత్సర ప్రారంభంలోనే స్వయం సహాయక మహిళల సర్వే నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టీ నారాయణ తెలిపారు. ఒంగోలు భాగ్యనగర్లోని టీటీడీ సెంటర్లో డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూపు సభ్యుల ఆదాయ వివరాల సర్వేపై శిక్షణ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇ–నారీ సీఆర్పీల ద్వారా సభ్యుల ఆదాయ, ఖర్చుల వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్సీలు, ఎఫ్పీఓలు తదితర సిబ్బందికి శిక్షణ అందించారు. కార్యక్రమంలో లైవ్లీ హుడ్ పాం డీపీఎం డీ రజనీ కాంత్, లైవ్లీ హుడ్ నాన్ ఫాం డీపీఎం డీ దానం, సంస్థాగత నిర్మాణాల డీపీఎం లక్ష్మీ రెడ్డి, ఏపీఎం జే నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శింగరకొండ హుండీ ఆదాయం రూ.30.41 లక్షలు
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం దేవస్థాన సహాయ కమిషనర్ తిమ్మానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 28 నుంచి ఇప్పటి వరకు 77 రోజుల్లో ఆలయానికి వచ్చిన భక్తులు సమర్పించిన హుండీలోని కానుకను లెక్కించగా రూ.30,41,065 వచ్చినట్లు సహాయ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు రావాల్సిన అరియర్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడూరి వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2018, 2019 సంబంధించిన డీఏ అరియర్ బిల్లులు, 2023, 2024 సంబంధించి సరెండర్ లీవ్ బకాయిలు, పదవీ విరమణ పొందిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ సరెండర్ లీవ్ ఆఫ్ పే లీవ్, మూడు నుంచి ఆరు విడతల డీఏ బకాయిలను ప్రస్తుత బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి ప్రస్తుతం రావాల్సిన మూడు విడతల డీఏ 2025 జనవరి, జూలై, 2026 జనవరి నెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డీఏలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ప్రస్తుతం 30 శాతం ఐఆర్ చెల్లించాలని కోరారు. -
గుట్కాయ స్వాహా..
కాసులుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచడం అటు వ్యాపారులకు, ఇటు అధికారులకు కాసులు కురిపిస్తోంది. లక్షలాది రూపాయల సరుకును నిల్వలు చేసుకొని రహస్యంగా నిల్వలు చేసినటు్ట్ సమాచారం. ఇదే అదనుగా తీసుకున్న విజిలెన్స్, పోలీసు అధికారులు కొందరు తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరాయకొండ, ఒంగోలులో జరిగిన తనిఖీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అధికారుల దాడుల సాకుతో వ్యాపారులు గుట్కాలను అధిక ధరలను విక్రయించి సొమ్ముచేసుకుంటుండడం గమనార్హం. సింగరాయకొండ తనిఖీల్లో దొరికిందెంత...? సింగరాయకొండలోని హోల్సేల్ దుకాణాల్లో ఈనెల 2వ తేదీ సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని ఒక హోల్ సేల్ దుకాణంలో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు రూ.50 వేలు విలువ చేసే పొగాకు ఉత్పత్తులను పట్టుకొని జరిమానా విధించినట్లు ప్రకటించారు. అయితే విజిలెన్స్ తనిఖీల్లో గుట్కాలతోపాటుగా సిగరెట్లు, విదేశీ సిగరెట్లు, నకిలీ గుట్కాలు, ఖైనీలు, సిగరెట్లు దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. రూ.10 లక్షలకు పైగా విలువ కలిగిన సరుకు పట్టుకున్నట్లు వ్యాపారవర్గాలు గుసగసలాడుకుంటున్నాయి. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భారీ ఎత్తున నిల్వలు గుర్తించినా కేవలం రూ.50 వేలు విలువైన సరుకును మాత్రమే పట్టుకున్నట్లు చెప్పడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారినట్లు వ్యాపార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అదనపు ధరలకు విక్రయిస్తున్నా... ఒంగోలులో తనిఖీలు చేసిందెవరు...?ఇక ఒంగోలులోని ఇస్లాంపేటలో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో పాటుగా తాలుకా పోలీసు స్టేషన్ పరిసరాల్లో కూడా తనిఖీలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తనిఖీలను విజిలెన్స్ అధికారులే చేశారా..లేక పోలీసులు చేశారా అనే విషయం మీద స్పష్టత లేదు. పోలీసులే తనిఖీలు చేసినట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఒక ఉన్నతాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైల టీం ఒకటి ఈ తనిఖీలను నిర్వహించిందని, మంగమూరు డొంకకు చెందిన ఒక గుట్కా వ్యాపారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భారీగా నెలమామూళ్లు ముట్టచెప్పేలా మధ్యవర్తి ఒకరు ఒప్పందం కుదిర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం జిల్లాలోని పోలీసు వర్గాల్లో కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది. ఈ దొడ్డి దారి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని, శాఖాపరంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.మార్కెట్లో జోరుగా నకిలీలునెలవారి మాముళ్ల మత్తులో అధికారులు జోగుతుండడంతో నకిలీ గుట్కాలు, సిగరెట్లు బహిరంగ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. నకిలీ గుట్కాలు ఒరిజనల్ గుట్కాల కంటే తక్కువ ధరలకు లభిస్తుండడంతో కొందరు వ్యాపారులు వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ గుట్కా ప్యాకెట్లు త్వరగా డ్యామేజీ అవుతున్నాయని, ప్యాకెట్ సైజులో తేడా ఉండడం గమనించవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. గుట్కాలు, సిగరెట్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు, బీడీ బంకులు, హోటళ్లు, చిల్లర దుకాణాలలో వీటిని బహిరంగంగా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా గుట్కాలపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు రేటు పెంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. సిగరెట్లు కూడా రెండు రూపాయల వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనక మతలబేమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జోరాబుల్ గుట్కా ఎంఆర్పీ రూ.5 ఉండగా రూ.20కు, విమల్ రూ.5 ఉండగా రూ.20కు మూడు ప్యాకెట్లు, హాల్స్ రూ.8 ఉండగా రూ.25కు, మిరాజ్ రూ.15 ఉండగా రూ.20 కు విక్రయిస్తున్నారని సమాచారం. ఎంఆర్పీ ధరలకు అదనంగా విక్రయిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సమస్యలపై గళమెత్తిన ఉపాధ్యాయులు
మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంగళరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ప్రభుత్వం 4 పెండింగ్ డీఏలు మంజూరు చేయడంతోపాటు మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకేఎస్ ప్రసాద్, ఆర్.దేశానాయక్ మాట్లాడుతూ.. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన రోజునే ఉద్యోగికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రోజురోజుకూ జీవన వ్యయం పెరుగుతోందని, అందుకు అనుగుణంగా తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఖాశీం తదితరులు ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి డివిజన్ నాయకులు నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీలత, రాజా, గిద్దలూరు డివిజన్ నుంచి రాఘవరెడ్డి, చెంచయ్య, ఎస్ వెంకటేశ్వర్లు, బీవి నారాయణ, రహమత్బాష, కృపానందం, సోఫియా, జయశ్రీ, ఉషారాణి, మార్కాపురం డివిజన్ నుంచి జిల్లా గౌరవ అధ్యక్షుడు రాందాస్, అక్కల నారాయణ, వెంకట రమణ, జ్యోతి, శ్యామలాదేవి, లక్ష్మీనారాయణ, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా -
టీడీపీలో గౌరవం, విలువలు లేవు
● రాజీనామా చేసిన పొన్నలూరు మండల బూత్ కమిటీ కో కన్వీనర్ ● అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆవేదన పొన్నలూరు: మండలంలోని పెద్ద వెంకన్నపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మండల బూత్ కమిటీ కో కన్వీనర్ చల్లా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనతోపాటు కుటుంబ సభ్యులంతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పుట్టింది మొదలు 40 ఏళ్లకు పైగా తమ కుటుంబ సభ్యులు టీడీపీ కోసం పనిచేశారని తెలిపారు. తన తాత, తండ్రి 40 ఏళ్లపాటు సర్పంచ్గా సేవలందించారని చెప్పారు. ప్రస్తుతం టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు, విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ పెద్దలు గ్రామంలో గ్రూపు రాజకీయం చేస్తూ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెటిస్తున్నారని ఆరోపించారు. గౌరవం, విలువలు లేని పార్టీలో ఉండలేనని, ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు పంపడంతోపాటు ఐ–టీడీపీ యాప్లో అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మరి కొంత మంది నాయకులు టీడీపీకి రాజీనామా చేస్తారని ‘చల్లా’ ప్రకటించారు. -
నిబద్ధత కలిగిన నాయకుడు శంకరారెడ్డి
ఒంగోలు టౌన్: నిబద్ధత కలిగిన నాయకుడు మేదరమేట్ల శంకరారెడ్డి అని, నేటి తరాలకు ఆదర్శంగా నిలిచారని వక్తలు కొనియాడారు. నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో మేదరమెట్ల శంకరారెడ్డి దశదిన కర్మ సందర్భంగా గురువారం సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన కుమారులు రాజశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలువురు ప్రముఖులు, మాజీ శాసనసభ్యులు హాజరయ్యారు. శంకరారెడ్డితో తమకున్న అనుభవాలు గుర్తు చేసుకున్నారు. చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డారని, ఇలాంటి వ్యక్తులు చాలా అరుదని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటరీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, బుర్రా మధుసూధనరావు, ముక్కు కాశిరెడ్డి, బాచిన చెంచుగరటయ్య, పీడీసీసీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. తొలుత శంకరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
భూములిచ్చిన రైతులపై వేధింపులేంటి
కందుకూరు: ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులను, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు విచారణ పేరుతో వేధించడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఇటీవల ఇండోసోల్ కంపెనీకి చెందిన నీటి తరలింపు పైప్లైన్లు దగ్ధమైన సంగతి తెలిసింది. అయితే ఈ సంఘటనతో సంబంధం ఉందంటూ గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు నక్కల శరత్, కళ్యాణ్లను పోలీసులు స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. అనంతరం విచారణ పేరుతో వేధించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గురువారం వైఎస్సార్సీపీ నాయకులను బుర్రా పరామర్శించారు. అనంతరం గ్రామంలోని సచివాలయంలో ఉన్న గుడ్లూరు ఎస్సై వెంకట్రావ్ని కలిసి ఆయన ప్రశ్నించారు. చెత్తకుప్ప పక్కనే ఉన్న పైప్లైన్లు ప్రమాదవశాత్తు దగ్ధమైతే ఎటువంటి ఆధారాలు లేకుండా వైఎస్సార్ సీపీ నాయకులను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రోజుల తరబడి విచారణ పేరుతో వారిని వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు. పరిశ్రమలు వస్తే తమ జీవతాలు బాగుపడతాయనే ఉద్దేశంతో భూములిచ్చి సహకరించిన రైతులను ఈ విధంగా పోలీసులు వేధించడం దుర్మార్గమైని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు గ్రామానికి వచ్చి విచారణ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని, పోలీసుల తీరు మారకపోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతగా ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఉంటే అసలైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలే తప్పా అమాయకులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఇటువంటి చర్యల వల్ల పోలీసులపై ఉన్న నమ్మకం పోతుందని, ఇప్పటికై నా తీరుమార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు బిల్లా రమణయ్య, కాట్రగడ్డ వెంకట్రావ్, కోర్సిపాటి రవికాంత్రెడ్డి, తాటిపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను వైఎస్సార్ సీపీ నాయకులకు అంటగడతారా విచారణ పేరుతో రైతులను, నాయకులను వేధించడం సరైన పద్దతి కాదు చేవూరులో పోలీసులు తీరుపై బుర్రా ఆగ్రహం -
15న రామాపురంలో పెద్ద బండలాగుడు పోటీలు
రాచర్ల: మండలంలోని గుడిమెట్ట పంచాయతీ రామాపురంలో సిద్ధిభైరవేశ్వరస్వామి మహా శివరాత్రి తిరుణాళ్ల మహోత్సవం సందర్భంగా 15వ తేదీ ఆదివారం జిల్లాస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి ఉన్న ఎడ్ల యజమానులు 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుతిగా రూ. 50 వేలు, రెండో బహుమతిగా రూ.30, మూడవ బహుమతిగా రూ.20 వేల అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 99639 70858 సంప్రదించాలని కోరారు. పొదిలి: పొదిలి ఎస్సైగా సూరెడ్డి రాజేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రామాయపట్నం మైరెన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన బదిలీపై పొదిలికి వచ్చారు. శాంతి భద్రతలతో పాటు, ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేస్తామని రాజేష్ చెప్పారు. ఆయన్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సింగరాయకొండ: మండల పరిధిలోని విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ వద్ద గురువారం 132 కేవీ అండర్లైన్ సర్వే పనులను ఎమర్జెన్సీ ల్యాండింగ్ జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ పై నుంచి వెళ్తున్న కేబుల్ లైనును తొలగించి అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం సర్వే చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో జేఏసీ సభ్యులు ప్రస్తుతం ఎమర్జెన్సీ ల్యాండింగ్ రద్దు కోసం పోరాడుతున్నామని, సర్వేను నిలిపివేసి సహకరించాలని సర్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారులు సర్వే పనులు నిలిపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ● క్యాబిన్లో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ చీమకుర్తి రూరల్: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం మండల పరిధిలోని మర్రిచెట్లపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఒంగోలు–కర్నూలు రహదారిపై చీమకుర్తి వైపు నుంచి వస్తున్న గ్రానైట్ లారీ, కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ వెళ్తుండగా మర్రిచెట్లపాలెం వద్ద ఎదెరుదురుగా వస్తూ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైర్లకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా ఎస్కార్ట్ సహాయంతో బయటకు తీశారు. బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. -
కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయ్!
అద్దంకి: మూడు మాసాల తర్వాత పెళ్లి బాజాల మోత మోగనుంది. శుక్ర మూఢమి శుక్రవారంతో ముగియనుండడంతో జిల్లాలోనూ సుముహూర్తాల సందడి మొదలుకానుంది. గత ఏడాది నవంబర్ 26 నుంచి ఈ నెల 13 వరకు శుక్ర మూఢమి కారణంగా సుముహూర్తాలకు బ్రేక్ పడింది. మాఘమాసం శుభప్రదమైన మాసమైనప్పటికీ మూఘమితో ముహూర్తాలు లేకుండా పోయాయి. ఈ నెల 19 నుంచి సుముహూర్తాలు ఉన్నట్లు పండితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు చేసుకున్న వారు వివాహాది, గృహప్రవేశ, గృహారంభాలకు సిద్ధమవుతున్నారు. మూడు నెలల తర్వాత జిల్లాలో పురోహితులు, భజంత్రీ కళాకారులు, కల్యాణ మండపాల నిర్వాహకులు, పూల వ్యాపారులు, వస్త్ర దుకాణాలు, అర్కెస్ట్రాలు, ట్రావెల్ ఏజెన్సీలు, కేటరింగ్ సంస్థలు, విద్యుత్, మైక్ సెట్టింగ్ నిర్వాహకులు తదితర 25 రంగాల వారికి మెండుగా ఉపాధి కలగనుంది. కల్యాణ మండపాలకు గిరాకీ మూడు నెలల తర్వాత మరో మూడు నెలలపాటు మెండుగా ముహుర్తాలు ఉండటంతో కల్యాణ మండపాల బుకింగ్లు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కొండపి, సంతనూతలపాడు, దర్శి, పొదిలి పట్టణాల్లో ఉన్న సుమారు 200కు పైగా ఉన్న కల్యాణ మండపాల్లో ఇప్పటికే కొన్ని డేట్లు బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సుముహూర్తాలు ఇవే.. ఈ ఏడాది ఫిబ్రవరితోపాటు, మార్చి, ఏప్రిల్ మే, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబరు నెలల్లో ఎక్కువగా ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24, 25, 26, మార్చిలో 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 20, 21, 25, 29, ఏప్రిల్ నెలలో 1 నుంచి 8వ తేదీ వరకు, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30వ తేదీల్లో దాదాపు ఎక్కువ మందికి సూటయ్యే ముహుర్తాలు ఉన్నట్లు పురోహితులు పేర్కొంటున్నారు. నేటితో ముగియనున్న శుక్ర మూఢమి 19 తర్వాత సుముహూర్తాలతో మోగనున్న బాజాభజంత్రీలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మెండుగా ముహూర్తాలు 3 నెలలుగా వేచి ఉన్న వివిధ రంగాల వారికి మళ్లీ ఉపాధి బుకింగ్లు మొదలయ్యాయి ఈనెల 18న చాలా పెళ్లిళ్లు ఉన్నాయి. తరువాత మూడు నెలల్లోనూ వివాహాలు పెట్టుకున్న వారు ముందుగానే కల్యాణ మండపాలను బుక్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే అని పురోహితులు చెబుతున్నారు. – సుబ్బారావు, కళ్యాణ మండపం నిర్వాహకుడు మంచి ముహుర్తాలు ఉన్నాయి మూడు నెలలపాటు మూఢం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఆ తరువాత కూడా సుముహూర్తాలు ఉన్నాయి. ఎక్కువ మందికి సూటయ్యే ముహూర్తాలు అధికంగా ఉండటం ఈ ఏడాది విశేషం. – గణేశ్, పురోహితుడు -
నేడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు
త్రిపురాంతకం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేశారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్వికరణం, పంచగవ్య ప్రాశనతో మహాశివరాత్రి మహోత్సవాల అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి రోజు బాలాత్రిపురసురదీదేవి, శ్రీపార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో విశేష అర్చనలు, రుద్రహోమం, బలిహరణ, విశేషపూజలు, ప్రదోషకాల పూజలు జరగనున్నాయి. 15వ తేదీ మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 3 గంటలకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ కాల రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, 12:30 గంటలకు స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. 17వ తేదీ మంగళవారం రథాంగ హోమం, రథాంగ బలి, రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 18వ తేదీ రుద్రహోమం, వసంతోత్సవం, నాగవల్లి, మూకబలి, ధ్వజావదోహణ ప్రత్యేక పూజలు, 19వ తేదీ శయనోత్సవం ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు ఇబ్బంది పడకుండా దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద సామాజిక సత్ర నిర్వాహకులు భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ● శ్రీశైలంకు 140..కోటప్పకొండకు 78 ఆర్టీసీ బస్సులు ● జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ వెల్లడి ఒంగోలు టౌన్: మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 ఆర్టీసీ బస్ డిపోల నుంచి శ్రీశైలం క్షేత్రానికి 140, కోటప్పకొండ క్షేత్రానికి 78 ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ డిపోలోని ఆయన ఛాంబర్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొగిలిచెర్ల 25, భైరవకోన 23, త్రిపురాంతకం 12, రామతీర్థం 8, సంగమేశ్వరం 5, పునుగోడు 2కు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు వివరించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా కనిగిరి, గిద్దలూరు నుంచి నేరుగా శ్రీశైలానికి, పొదిలి, దర్శి నుంచి కోటప్పకొండకు, పొదిలి, కనిగిరి నుంచి మార్కాపురం జిల్లా త్రిపురాంతకానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్కు 12 బస్సులు నడపుతున్నట్లు తెలిపారు. కందుకూరు 4, కనిగిరి 2, పొదిలి 2, అద్దంకి 2, ఒంగోలు నుంచి 2 బస్సులు నడిపేలా నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడాది కంటే అదనంగా 50 బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ● భారీగా తరలివెలుతున్న భక్తజన సందోహం ● రాత్రి పూట ప్రయాణాలకూ అనుమతినిచ్చిన అటవీశాఖ పెద్దదోర్నాల: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగే బ్రహ్మాత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా శ్రీశైలం తరలివెళుతున్నారు. దీంతో యాత్రికులు, భక్తులతో మండల కేంద్రంలో రద్దీ వాతావరణం నెలకొంది. పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ శ్రీశైలం ఘాట్ రోడ్డులో రాత్రి వేళ ప్రయాణాలకు అనుమతినిచ్చింది. దీంతో ఈ నెల 13వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి 16వ తేదీ వరకు రాత్రి వేళల్లో పుణ్యక్షేత్రానికి నిరంతరం ప్రయాణించే వెసులుబాటు భక్తులకు లభించింది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శ్రీశైలం చేరుకుంటున్నారు. అధిక శాతం భక్తులు కాలి నడకన నల్లమల అటవీ ప్రాంతం గుండా పుణ్య క్షేత్రానికి చేరుకుంటున్నారు. వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో పలువురు భక్తులు రైళ్ల ద్వారా మార్కాపురం చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం వస్తున్నారు. బ్రహాత్సవాలల్లో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతుండటంతో పండుగకు ముందే రద్దీ అధికంగా ఉంది. ఒంగోలు: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 149 బార్లలోని 40వేల మంది అడ్వకేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రకాశం జిల్లాలో 1600 మంది ఉండగా అందులో 821 మంది ఒక్క ఒంగోలు బార్ అసోసియేషన్లోనే ఉన్నారు. ఉదయం 10.30గంటలనుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. బరిలో 143 మంది: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి నుంచి మొత్తం 23 మంది రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఎన్నిక కావాల్సి ఉండగా అందులో ఐదుగురు మహిళా అభ్యర్థులు తప్పనిసరి . వీరందరినీ ప్రాధాన్యతా ఓటు ప్రకారం ఎన్నుకుంటారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన అడ్వకేట్ కనీసం ఐదుగురికి ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా 23 మంది వరకు ప్రాధాన్యత ఓటు వేయాలి. ప్రాధాన్యత ఓటు కూడా సంఖ్యలకు బదులుగా ఆంగ్ల వర్ణమాలలోని ఒకటవ బడి పెద్ద అక్షరాలను మాత్రమే వినియోగించాలి. పొరబాటున ఓకే ప్రాధాన్యత ఓటు ఒకరికంటే ఎక్కువమందికి వేస్తే అది చెల్లుబాటు కాదు. ఇలాంటి అనేక నిబంధనలు ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో వాయిస్ కాల్స్, సంక్షిప్త సందేశాలు, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల పంపిణీ, హోర్డింగ్లు ఏర్పాటు వంటి వాటి ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే బాధ్యతను ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు భాస్కరరావు వ్యవహరిస్తారు. ఒంగోలు బార్ అసోసియేషన్ హాలులో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఎన్నికలను అన్ని ఏర్పాట్లు చేశారు. ఒంగోలు టౌన్: కార్మిక నగర్ బాధిత పేదలపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇస్లాంపేటకు చెందిన షేక్ అల్లాబక్షు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది బాధితులతో పాటుగా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన కొందరు వ్యక్తులు కార్మికనగర్లో పేదల ఇళ్లను కూల్చివేయడం తెలిసిందే. ఆ తరువాత బుధవారం సాయంత్రం స్థల యజమానులుగా చెప్పుకొంటున్న ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ వేసేందుకు వెళ్లారు. వారిని బాధితులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తమపై కార్మిక నగర్ వాసులు దాడికి ప్రయత్నం చేశారని అల్లాబక్షు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో 1600 మంది ఒంగోలు బార్ అసోసియేషన్లో ఓటు హక్కు కలిగిన వారు 821 -
పాకలలో కరెంటు కట్..!
సింగరాయకొండ: మండలంలోని పాకలలో ఈ నెల 14, 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఒకవైపు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు పాకల ప్రజలు తీవ్రస్థాయిలో విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా విద్యుత్ సమస్యతో స్థానికులు అల్లాడుతున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం విద్యుత్ అంతరాయంపై ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోతుండటంతో గురువారం రోడ్డెక్కారు. రోజూలానే రాత్రి సుమారు 9 గంటల సమయంలో విద్యుత్ సరఫరా చేయగా, స్థానిక ఆది ఆంధ్ర కాలనీలోని ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో కాలనీలో రెండు వివాహాలు జరుగుతున్నాయి. దీంతో కాలనీవాసులు ఆగ్రహించి వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించి తిరిగి వెళ్తున్న జేసీ కల్పనాకుమారి కారు ఆపి సమస్య వివరించారు. స్పందించిన జేసీ.. సమస్య పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లుతో కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నోనెలలుగా కాలనీలో లో ఓల్టేజీ సమస్య ఉందని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా కరెంటు సమస్య ఎదుర్కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం కరెంటు తీసివేసి రాత్రి ఇచ్చిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఎస్ఈ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఈలోగా ఎస్సై బీ మహేంద్ర సంఘటన స్థలానికి చేరుకుని అధికారుల కార్లను కాలనీవాసులు అడ్డుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. -
ఆశల పంట.. నష్టాల మూట..!
● శనగ పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు ● కోల్డ్ స్టోరేజీలో 10 లక్షల క్వింటాల శనగలు ● శనగ రైతును దగా చేస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ● విదేశీ సుంకం తగ్గించి రైతుపై పోటు ● శనగ రైతును పట్టించుకోని సీఎం చంద్రబాబు ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కేంద్రంతో పోరాడి దిగుమతి సుంకం పెంపునకు కృషి ● ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 70 వేల ఎకరాలకు సాగు పరిమితం ● గత సంవత్సరం ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజీలో మూలుగుతున్న వైనం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి సంవత్సరం 1.50 లక్షల ఎకరాలకుపైగా శనగ సాగు చేస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అయితే దాదాపు 2 లక్షల ఎకరాల వరకూ సాగు చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత శనగ సాగు ఏడాదికేడాదికి దిగనాశిగా తయారవుతోంది. గత సంవత్సరం లక్ష ఎకరాల్లో సాగు చేస్తే.. ఈ సంవత్సరం కేవలం 70 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ ఏడాది రబీ సీజన్లో శనగ పంట మరో నెల రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. 10 లక్షల క్వింటాలు కోల్డ్ స్టోరేజీల్లో... రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రెండేళ్లుగా శనగ నిల్వలు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతున్నాయి. 50 వేల మందికిపైగా రైతులు తమ శనగ నిల్వలను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించాయి. కనీసం మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవటంతో నష్టాలకు అమ్ముకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక శనగ రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒంగోలుతో పాటు సంతనూతలపాడు, కొండపి, అద్దంకి, దర్శి, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలలో పది లక్షల క్వింటాల పాత శనగలు మగ్గుతున్నాయి. వీటికి అద్దెలు కూడా కట్టలేని స్థితిలో రైతులు ఉన్నారు. మద్దతు ధర కూడా లేక అవస్థలు... ఆరుగాలం రైతులు పండించిన శనగ పంటకు మద్దతు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5650 కూడా లేకపోవటంతో రైతుల బాధలు వర్ణణాతీతం. ప్రస్తుతం క్వింటా రూ.5 వేల లోపే కొనుగోలు చేసే పరిస్థితులు ఉండడంతో ఖర్చులు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు సంవత్సరాల్లో రైతులు పండించిన శనగ పంటను కొంత మేర తెగనమ్ముకున్నారు. ఎందుకంటే కూలీలకు, మందులకు పెట్టిన పెట్టుబడులు అయినా చెల్లించాల్సి ఉంది కాబట్టి ఇచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దిగుమతి సుంకం పెంచేందుకు పోరాటం... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విదేశాల నుంచి దిగుమతయ్యే శనగలపై సుంకాన్ని పెంచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య శాఖామంత్రుల చుట్టూ తిరిగి లేఖలమీద లేఖలు రాసి దిగుమతి సుంకం 30 శాతం నుంచి 60 శాతానికి తీసుకెళ్లారు. దాంతో దేశీయంగా శనగ పండించిన రైతులందరికీ ప్రయోజనం చేకూరింది. శనగ రైతుకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్... 2014 నుంచి 2019 మే నెల వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కూడా చంద్రబాబు దగా చేయడంతో రైతులు దిగుబడులను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసుకున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన శనగ రైతులకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి వైఎస్ జగన్ ఆదుకున్నారు. ఆ విధంగా జిల్లాలోని దాదాపు 35 వేల మంది శనగ రైతులకు ప్రయోజనం చేకూరింది. దానికితోడు 2020 నుంచి బహిరంగ మార్కెట్లో జేజే రకం శనగలకు దాదాపు క్వింటా రూ.8,000కు పైగా ధర పలికింది. కాగ్–2 రకానికి రూ.10,000 నుంచి రూ.11,000 వరకు ధర రావటంతో రైతులు ఎంతో సంతోషంగా పంట సాగు చేశారు. రాష్ట్రంలోని శనగ రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు తగ్గించిన సుంకాన్ని పెంచాలని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా 50 నుంచి 60 శాతం వరకు సుంకాన్ని పెంచాలని కోరుతూ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తి తదితరులంతా కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్కు, పియూష్ గోయల్కు లేఖలు రాశారు. విదేశాల నుంచి దిగుమతయ్యే శనగలకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. గతంలో ఉన్న 60 శాతం సుంకాన్ని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం 10 శాతానికి కుదించింది. ఫలితంగా స్థానికంగా పండే శనగలకు ధర ఇంకా దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. కనీసం పెట్టిన ఖర్చులు కూడా రావటం లేదని రైతులు వాపోతుంటే.. దిగుమతి సుంకాన్ని తగ్గించి రైతులను నిలువునా నడ్డి విరిచేసిందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేస్తాం
● పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా స్మార్ట్ కార్డు, ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం కొండపి మండల స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మనది కేడర్ బేస్డ్ పార్టీ అని, లీడర్ బేస్డ్ పార్టీ కాదని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో సుమారు వెయ్యి మంది సమర్థులైన నాయకులను పార్టీ పదవుల్లో నియమిస్తామన్నారు. మనమంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రూపు అని, ఆ ప్రకారమే ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, అంతేగానీ కోవర్టు రాజకీయాలు చేయవద్దని కోరారు. గతంలో బల్బు ఇక్కడ ఉండేదని, స్విచ్ మాత్రం ఎక్కడో ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి కొండపి సమావేశంలో ప్రకటించిన విషయాన్ని ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు. దమ్మున్న నాయకుడు జగనన్న... మన నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు అని వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఆదిమూలపు సురేష్ గర్వంగా చెప్పారు. కానీ, పక్క పార్టీల నాయకులలో ఒకరు శ్రీమా నాయన దేవుడి హారతితో సిగరెట్ వెలిగించేవాడని ఒకసారి, మా ఇంట్లో అంతా రామనామమే జపిస్తారని మరోసారి, నా భార్య బాప్టిస్టు అని ఇంకోసారి చెప్పి చివరకు సనాతన ధర్మమని అంటాడంటూ ఎద్దేవా చేశారు. సనాతన ధర్మమంటే ఏకపత్నివ్రతుడని, కానీ ఆ నాయకుడు ఉదయం ఒకమాట, సాయంత్రం ఒకమాట, తెల్లారి మరోమాట చెబుతాడని, జగనన్న అలాంటి వ్యక్తి కాదని అన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పొత్తులు లేకుండా ఒంటరిగానే జగనన్న పోటీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని, కొండపి నియోజకవర్గంలో తమ పార్టీ ఓడిపోలేదని, 92 వేల ఓట్లు రాగా 43 శాతం ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఆ శాతాన్ని పెంచేందుకు మాత్రమే కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం... రాబోయే రోజుల్లో పార్టీ కేడర్ను ఉత్సాహపరిచి పార్టీని బలోపేతం చేసే విధంగా జగనన్న బస్సుయాత్ర, పాదయాత్ర, నియోజకవర్గ యాత్రలు చేస్తారని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ యాత్రలు చేస్తారని వివరించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తాను పూర్తి అండగా ఉంటానని, గోడమీద పిల్లులుగా ఉండే నాయకులను దూరంగా పెడతానని స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ అవసరమని, కలుపు మొక్కలను ఏరివేస్తానని హెచ్చరించారు. నియోజకవర్గంలో రెడ్బుక్ పాలన... కొండపి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ పాలన సాగిస్తోందని ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఆస్తులు, పొలాలు బలవంతంగా లాక్కున్నారని, చివరికి గంజాయి కేసులు పెడతామని కూడా పోలీసులు బెదిరించారని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేసిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం, టీడీపీ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు...నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారిలో మారిటైం బోర్డు చైర్మన్ ఒకరని, ఇతను ముఖ్యమంత్రికి తక్కువ మంత్రికి ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సురేష్ విమర్శించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పోలీసులు తమ పార్టీ కార్యక్రమాలకు అడ్డంకుల సృష్టించటంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాను జాగ్రత్తగా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నానని తెలిపారు. అవసరమొచ్చినప్పుడు సై అంటే సై అంటానని స్పష్టం చేశారు. కొండపిలో విజయం సాధిస్తే రాష్ట్రంలో 175 సీట్లు సాధించినట్లేనని, అందువలన నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, మండల పరిశీలకుడు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నష్టాలతో కునారిల్లుతున్న శనగ రైతు
జిల్లాలో శనగ పండిస్తున్న రైతులు నష్టాలతో కునారిల్లుతున్నారు. గత సంవత్సరం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుని ఉన్నారు. క్వింటా శనగలకు కనీసం రూ.5 వేలు కూడా రావటం లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచే ప్రయత్నం చేయకపోగా, తగ్గిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. శనగ రైతులను ఆదుకుందామన్న ఆలోచనే చంద్రబాబుకు లేదు. – మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలిశనగలపై దిగుమతి సుంకం పెంచేందుకు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దేశీయ శనగ రైతులను ఆదుకోవాలి. గతంలో ఉన్న మాదిరిగా 50 శాతం, 60 శాతం దిగుమతి సుంకాలు అమలు చేస్తేనే దేశీయ శనగ రైతులు అప్పుల ఊభి నుంచి బయట పడతారు. లేకుంటే కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలు కూడా రైతులకు దక్కకుండా పోయే పరిస్థితులు ఎదురవుతాయి. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో పండించిన శనగ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – దుగ్గినేని గోపీనాథ్, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు -
డేటా ఎంట్రీ ఆపరేటర్ పరీక్ష వాయిదా
ఒంగోలు: జిల్లాలోని న్యాయసేవాధికార సంస్థలో ఖాళీలకు సంబంధించి ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్న పరీక్షలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పరీక్షను వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర రెండు పరీక్షలు స్థానిక ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో యథావిధిగా 15వ తేదీనే జరుగుతాయని చెప్పారు. వాయిదా వేసిన పరీక్ష నిర్వహించే తేదీని తదుపరి ఆదేశాల మేరకు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ ముదిరాజ్ విభాగం జిల్లా అధ్యక్షునిగా పులుసు సురేష్బాబును నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకంతో ముదిరాజ్ విభాగం జిల్లా అధ్యక్షునిగా నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, సహకరించిన జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబుకు సురేష్బాబు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ● శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్పై ఎస్పీ హర్షవర్థన్రాజు పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివెళ్తున్న నేపథ్యంలో పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలు, టోయింగ్ వెహికల్స్ను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూంల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. ఘాట్రోడ్డులో అనుభవం ఉన్న డ్రైవర్లే వాహనాలు నడపాలని ఎస్పీ కోరారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్కు ఆటంకం కలిగించరాదని, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రద్దీ సమయాల్లో అదనపు పోలీసు సిబ్బందితో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాద ప్రాంతాలలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఘాట్ రోడ్లలో వేగాన్ని, ఓవర్ టేకింగ్లను నియంత్రించాలని కోరారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మహా శివరాత్రి వేడుకలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ● యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం ఒంగోలు టౌన్: గత ఎన్నికలలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. గురువారం యూటీఎఫ్ నాయకులతో కలిసి కార్డులు పోస్టు చేశారు. అనంతరం రవి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ఆర్థిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 25 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, ఇంకా పీఆర్సీ కమిషన్ నియమించకుండా ప్రభుత్వం కాలపయాపన చేస్తోందని విమర్శించారు. ఐఆర్ 29 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రాట్యుటీ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హై, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం
ఒంగోలు టౌన్: చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదని, రైతుల గురించి ఆలోచించే తీరిక, ఓపిక లేనట్లు వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పొగాకు బోర్డు మాజీ సభ్యుడు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రబీలో వరి తరువాత అత్యధికంగా శనగ పండిస్తున్నారని, అనంతపురం, శ్రీసత్య సాయి, కర్నూలు, నంద్యాల, వైఎఎస్సార్ కడప, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 9.2లక్షల ఎకరాల సాగు చేస్తున్నారని తెలిపారు. సుమారు 6 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని అంచనాలు ఉన్నట్లు చెప్పారు. 2024, 2025 రబీలో నష్టాలకు శనగ అమ్ముకున్నారని, ఇప్పుడు 2026లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం క్వింటా రూ.5 వేల నుంచి రూ.5,200లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.5,650 ఉన్నా ఆ ధర గురించి పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో శనగ క్వింటా రూ.8 వేలకు పైనే అమ్ముడుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2025 శనగలను కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీలో దాచుకున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా గత ఏడాది కంటే 4.66 లక్షల హెక్టార్లలో శనగ సాగు పెరిగిందని, మన రాష్ట్రంలో కూడా శనగ సాగు పెరిగినట్లు తెలిపారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 10 శాతం డ్యూటీ మూలంగా విదేశాల నుంచి శనగలు దిగుమతి జరిగి దేశంలో రైతుల తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాకు వేయి రుపాయలు అదనంగా మద్దతు ధరను పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా శనగ రైతులకు న్యాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడం సిగ్గుచేటన్నారు. ఒంగోలు టౌన్: చెడు వ్యసనాలకు గురైన భర్త వ్యవహార శైలితో విసిగి వేసారిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే చంద్రశేఖర్, పద్మజ దంపతులు గోపాల్నగర్ నాల్గవ లైనులో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా చంద్ర శేఖర్ చెడు వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. ఎంతకూ మారకపోవడంతో విరక్తి చెందిన పద్మజ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు పెద్దపులి తారసపడటంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అందిన వివరాల మేరకు.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 6వ తేదీ నుంచి నల్లమల అడవిలో ఒకే ఒక్క ప్రాంతం నుంచి పాదయాత్ర భక్తులకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా వెంకటాపురం నుంచి పాదయాత్ర చేస్తున్న భక్తులకు మంగళవారం రాత్రి పెచ్చెరువు వద్ద పెద్దపులి కనిపించిందన్న వార్తతో యాత్రికుల్లో కలకలం రేగింది. దీంతో పెద్ద సంఖ్యలో పాద యాత్రికులు ఒకే ప్రాంతంలో చాలాసేపు వేచి ఉన్నారు. పెద్దపులి సంచారం ప్రస్తుతానికి లేదని అధికారులు నిర్ధారించిన అనంతరం తిరిగి పాదయాత్ర కొనసాగించారు. పెద్దపులి సంచారంపై పెద్దదోర్నాల ఫారెస్ట్ రేంజ్ అధికారి హరిని వివరణ కోరగా.. పెచ్చెరువు ఆత్మకూరు పరిధిలో ఉందని, తమ పరిధి కాదని, పూర్తి వివరాలు తెలియవని బదులిచ్చారు. పెద్దపులి రాత్రి వేళల్లో స్వేచ్ఛగా సంచరిస్తుందని, ఎవరిపై ఎటువంటి దాడులకు పాల్పడదని చెప్పారు. ప్రస్తుతం నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల గణన చేపడుతున్నందున భక్తులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి -
‘పోరంబోకు’ల గ్రావెల్ దందా
కొనకనమిట్ల: టీడీపీ నేతల ధనదాహానికి ప్రకృతి వననులు ధ్వంసమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులతో ఒప్పందం చేసుకున్న కొందరు పచ్చ నేతలు.. అధికారులపై అజమాయిషీ చేస్తూ గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లే.. కొనకనమిట్ల పరిధిలోని కొండ పోరంబోకు భూముల్లో గ్రావెల్ తవ్వకాలకు రంగం సిద్ధం చేసిన టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం పచ్చని వృక్షాలను జేసీబీలతో పెకలించి సొమ్ము చేసుకున్నారు. తద్వారా గ్రావెల్ రవాణాకు ‘మార్గం’ సుగమం చేసుకున్నారు. ‘రియల్’వ్యాపారులకు అవసరమైన మట్టిని ప్రభుత్వ భూముల్లో తవ్విస్తూ టిప్పర్కు రూ.2 వేలు, ట్రాక్టర్కు రూ.200 లెక్కన వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణా తంతు మొత్తం రాత్రి వేళ దర్జాగా సాగిస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం మొత్తం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇళ్ల స్థలాల పక్కనే తవ్వకాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొనకనమిట్ల కొండ సమీపంలో ఉన్న భూమిని చదును చేసి జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేస్తుండటంతో భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల దొనకొండ అడ్డరోడ్డు వద్ద ఉన్న వెంచర్కు టిప్పర్తో మట్టి తోలుతుండగా తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక రెవెన్యూ అధికారులు ఆపి మాట్లాడి పంపిచేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సోమవారం రాత్రి కూడా కొనకనమిట్ల సమీపంలో జగనన్న కాలనీ పక్కనే జేసీబీతో మట్టి తవ్వి ట్రాక్టర్ల సాయంతో తరలించారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా చెట్లు తొలగించడమే కాకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ గ్రావెల్ మైనింగ్పై తహసీల్దార్ సురేష్ను వివరణ కోరగా ‘మట్టి తవ్వకాల విషయం నాకు తెలియదు. కనుక్కొంటాను. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం’ అని ముక్తాయించారు. -
ఉత్సవాల ఏర్పాట్లపై జేసీ ఆగ్రహం
త్రిపురాంతకం: త్రిపురాంతక క్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్ల తీరుపై జేసీ పులి శ్రీనివాసులు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. క్యూలైన్లు, సాగర్ స్నాన ఘట్టాలను పరిశీలించారు. మెట్ల మార్గాన్ని నీటితో శుభ్రం చేయించాలని చెప్పారు. ప్రొటోకాల్ ఉన్నవారిని మాత్రమే వీఐపీలుగా పరిగణించాలని స్పష్టం చేశారు. మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, వినుకొండ డిపోల నుంచి ఇరవై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ ఐడీ కార్డులతో విధులకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, ఎన్ఎస్పీ ఈఈ విజయలక్ష్మి, తహసీల్దార్ భాస్కర్, ఈఓ అనిల్కుమార్, సీఐ అసాన్, ఎస్సై శివబసవరాజు తదితరులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం -
పాకల బీచ్ ఫెస్టివల్కు ప్రత్యేక ఏర్పాట్లు
● ఎస్పీ హర్షవర్ధన్రాజు సింగరాయకొండ: పాకల బీచ్ ఫెస్టివల్కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో బేస్ ఫెస్టివల్ నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫెస్టివల్కు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ద్విచక్ర వాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు మద్యం తాగి బీచ్ వద్దకు రావద్దని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా క్రేన్లు, టోయింగ్ వాహనాలు సిద్ధంగా ఉంచుతామన్నారు. బీచ్ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీచ్ ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రోన్లు ఎగరవేసి అనుమానితులను గుర్తిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు సకాలంలో స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫెస్టివల్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఫెస్టివల్కు వచ్చే రోడ్లను పరిశీలించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ సీహెచ్ హజరత్తయ్య, రామాయపట్నం మైరెన్ సీఐ శివన్నారాయణ, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, బి.మహేంద్ర పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా నేరస్తుల ముఠా అరెస్టు
మార్కాపురం టౌన్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా నేరస్తుల ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల నుంచి ఒక పల్సర్, 3 బుల్లెట్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో పట్టణ, రూరల్ ఎస్సైలు సైదుబాబు, వేమనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మార్కాపురం టౌన్లోని 10వ వార్డుకు చెందిన సయ్యద్ మసీద్ అలియాస్ ఆసిఖ్, ఇదే వార్డులోని విజయ థియేటర్ వద్ద ఉండే దూదేకుల మొహిద్దీన్ షా, గుంటూరు టౌన్లోని నల్లచెరువు 7వ లైన్లో తాత్కాలిక నివాసముంటున్న పులి అంజిరెడ్డి ముగ్గురూ ఒక ముఠాగా ఏర్పడి మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నారు. వీరిపై ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. జైల్లో ఉన్న సమయంలో స్నేహితులైన ముగ్గురు యువకులు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత బైకు చోరీలకు అలవాటుపడ్డారు. ఈ నెల 2వ తేదీన మార్కాపురం రైల్వేస్టేషన్ సమీపంలోని రాయవరం వద్ద బైకు చోరీ కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం మార్కాపురం మండలంలోని కుంట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నంద్యాల వైపు బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లో విచారించగా గుంటూరులో 2, వినుకొండలో 1, రాయవరంలో 1 బైకు చోరీ చేసి నికరంపల్లి సమీపంలోని చిల్లచెట్లలో దాచిపెట్టినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. 3 బుల్లెట్ బైక్లు, ఒక పల్సర్ స్వాధీనం నిందితులపై ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పలు కేసులు -
భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం వద్దు
● జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఒంగోలు సబర్బన్: ఒంగోలు అర్బన్ డెవలెప్మెంట్ అధారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్, అర్బన్ డవలెప్మెంట్ వైస్ చైర్మన్ కల్పనా కుమారి ఆదేశించారు. ప్రకాశం భవన్లోని ఆమె ఛాంబర్లో బుధవారం అర్బన్ డవలప్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్, ఏపీడీపీఎంఎస్, ఇంజినీరింగ్ విభాగం, గ్రామ పంచాయతీలలోని భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల్లో పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఆయా అంశాలపై ఆమె అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం తలనీలాలకు బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో రూ.2,30,150,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన కేవీఎన్ ఎంటర్ప్రైజర్స్ అధినేత కోటపాడు వెంకటనరసమ్మ హెచ్చు పాట పాడి దక్కించుకున్నట్లు తెలిపారు. పమిడపాడు గ్రూప్ టెంపుల్ ఈఓ యు శ్రీనివాసరావు ప్రత్యేకాధికారిగా కార్యక్రమం నిర్వహించారు. కార్యాక్రమంలో ఆలయ సిబ్బంది ప్రసాద్రావు, మధు, మోహన్రావు, మాల్యాద్రి, వంశీ, ఏఎస్సై బ్రహ్మయ్య, రాజు పాల్గొన్నారు. -
మేల్కొనకుంటే శ్రీశైలం సీన్ రిపీట్!
త్రిపురాంతకం: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ ఘటనలు భక్తుల్లో ఆధ్యాత్మికతను దెబ్బతీస్తూ ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆలయాల్లో భక్తుల రద్దీని నియంత్రించడం, తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందమే అందుకు కారణం. మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 13 నుంచి నిర్వహించే ఉత్సవాలకు ఇప్పటి వరకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం భక్తుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలం కావడంతో శివ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శివమాలధారులపై పోలీసులు లాఠీలు ఝులిపించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన భక్తులు మల్లన్న సన్నిధి ఎదుట ఆందోళనకు దిగిన దృశ్యాలు.. జిల్లాలోని శివ భక్తులను ఆలోచనలో పడేశాయి. త్రిపురాంతకం క్షేత్రంలో ఉత్సవాలకు లక్ష మందికి పైగా భక్త జనులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూజల సమయంలో, క్యూలైన్లలో తోపులాటలను నివారించడంతోపాటు తగిన భద్రత కల్పిస్తారా అని భక్తుల్లో చర్చ నడుస్తోంది. త్రిపురాంతకేశ్వరుని సన్నిధిలో శివరాత్రికి మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదని తెలుస్తోంది. ట్రాఫిక్ తిప్పలు తప్పేనా? కొండపైన చదును చేసినందున వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. కొండకు రెండు వైపులా రోడ్డు ఉన్నందున వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రద్దీ సమయంలో వాహనాలు నిలిపివేసినా మిగిలిన వేళ్లల్లో వాహనాలను కొండపైకి పంపాలన్న అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. ఆలయాలకు వెళ్లే రోడ్డులో సాగర్ కాలువ వంతెన వద్ద ఏటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి భక్తులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ వంతెన వద్ద పోలీసులకు భక్తులు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్య తప్పుతుంది. అడ్డదిడ్డంగా వాహనాలు నడిపితే రాకపోకలు నిలిచిపోవడం ఖాయం. వీఐపీల దర్శనానికి టైమింగ్ స్లాట్ విధించాలని పలువులు అభిప్రాయపడుతున్నారు. త్రిపురాంతకంలో శివరాత్రి ఉత్సవాలకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందా అని సంశయిస్తున్న భక్తులు శ్రీశైలంలో మాదిరి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన క్యూలైన్లు, మెట్ల మార్గంలో భక్తుల రద్దీని కట్టడి చేయాలి. గంటల తరబడి క్యూలైన్లలో ఉండే భక్తులకు కనీసం మంచినీరు, మజ్జిగ అందించాలి. ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. ఆలయంలో అభిషేకాలు, పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. -
దివ్యాంగుల పెన్షన్ మంజూరులో కూటమి వివక్ష
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పెన్షన్ మంజూరు, తొలగింపులో తీవ్ర వివక్ష కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి విమర్శించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఒంగోలుకు వచ్చారు. కిమ్స్ హాస్పిటల్ జాతీయ రహదారి వద్ద ఆయనను వైఎస్సార్ విభాగం జిల్లా నాయకుడు కొండరాజు రమణయ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులిపాటి దుర్గారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఉద్దేశపూర్వకంగా గందరగోళ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. సదరన్ రీ వెరిఫికేషన్లో కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వేధింపులకు గురిచేస్తోందని చెప్పారు. దివ్యాంగులు ప్రతి ఒక్కరూ లబ్ధిదారులుగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. దివ్యాంగులను చైతన్యపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. పులిపాటి దుర్గారెడ్డి వెంట రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఆవుల నాగేందర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కోణతం చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి
మార్కాపురం: వచ్చే నెలలో ఉగాది పండుగ నాటికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం లబ్ధిదారులతో ఇళ్లు కట్టించి గృహ ప్రవేశం చేయించాలని మార్కాపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇన్చార్జి పీడీ శ్రీనివాసప్రసాద్ చెప్పారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లాలోని హౌసింగ్ డీఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో మొత్తం 5,169 ఇళ్ల నిర్మాణాన్ని ఉగాది రోజు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో వైపాలెం నియోజకవర్గంలో 1140, గిద్దలూరు నియోజకవర్గంలో 1469, మార్కాపురం నియోజకవర్గంలో 1971, కనిగిరి నియోజకవర్గంలో 598 గృహాలను లక్ష్యంగా పెట్టుకుని పూర్తిచేయించాలన్నారు. ఇందులో బీసీ ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, చెంచులకు ప్రత్యేకంగా 1 లక్ష రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఆయా గృహాల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. జిల్లాలో ఆవాస్ పీఎంజేవై పథకం కింద 24,177 ఇళ్ల నిర్మాణాల సర్వే పూర్తయిందని చెప్పారు. ఇల్లు కట్టుకునే విషయంలో లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, త్వరగా పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పట్టణ శివార్లలో నిర్మాణంలో ఉన్న పలు గృహాలను మార్కాపురం ఇన్చార్జి ఈఈ పవన్కుమార్తో కలిసి పరిశీలించారు. -
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కంచె వేయడానికి వచ్చిన వారిని అడ్డుకుంటున్న బాధిత మహిళలువారంతా కార్మికులు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పదిహేను సంవత్సరాలుగా కార్మికనగర్లో చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. రూ.కోట్ల విలువజేసే ఈ భూములపై బడాబాబుల కన్నుపడింది. ఈ నెల 4వ తేదీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కిరాయి దుండగులు రాత్రికిరాత్రే జేసీబీలతో ఇళ్లను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేశారు. అవి ఇనాం భూములని రికార్డుల్లో ఉంది. కానీ, రిజిస్టర్డ్ భూములంటూ ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇళ్లు కూల్చేస్తుంటే పోలీసులు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వారం రోజులవుతున్నా ఇళ్లు కూల్చేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ కూల్చివేతల వెనుకున్న అదృశ్య శక్తి ఎవరన్న దానిపై చర్చ సాగుతోంది. 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం కుటుంబంతో కలిసి 15 ఏళ్లుగా కార్మిక నగర్లోనే నివాసం ఉంటున్నాం. మేము ఎవరి రిజిస్టర్ భూములనూ ఆక్రమించుకోలేదు. ఇనాం భూములలో తలదాచుకున్నాం. ఈ భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమిలో మాకు పట్టాలు ఇవ్వాలని పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం. వెంటనే ఈ భూమిని సర్వే చేసి నిజానిజాలు తేల్చాలి. అప్పటి వరకు మేము కార్మిక నగర్లోనే నివాసం ఉండేందుకు అనుమతివ్వాలి. ప్రభుత్వం రక్షణ కల్పించాలి. – గరికపూడి సుధాకర్ అధికారులు జోక్యం చేసుకోవాలి నేను ప్రైవేటు కారుకు డ్రైవర్గా పనిచేస్తుంటాను. నగరంలో ఉండటానికి ఇళ్లు లేక 15 ఏళ్లుగా కార్మిక నగర్లో నివాసం ఉంటున్నాను. రాత్రికి రాత్రి మా ఇళ్లను కూల్చివేశారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇనాం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నివాసితులకు పట్టాలివ్వాలి. – కురగంటి మనోహర్ కూల్చివ్యథలుసాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 186/1లో 4.62 ఎకరాలు, 186/2లో 4.47 ఎకరాల ఇనాం భూమిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇళ్లు లేని నిరుపేదలు కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తొలుత తడికలతో పాకలు వేసుకున్నారు. తరువాత చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుని పిల్లాపాపలతో జీవిస్తున్నారు. వీరిలో కొందరికి 2012 నుంచి కార్మికనగర్, నియర్ ఎంఎన్ఆర్ కేన్సర్ హాస్పిటల్ చిరునామాతో ఆధార్ కార్డులు కూడా మంజూరయ్యాయి. మధ్యలో ఒకసారి 2018లో చదలవాడ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమి తమదని చెబుతూ 50 మందిని తీసుకొచ్చి నాలుగు ఇళ్లు కూల్చివేశారు. దాంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు 2018లో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఆ తరువాత 2023లో సిట్ కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేశారు. అయితే, రెవెన్యూ రికార్డుల్లో మీ భూమి వెబ్సైట్లో ఇప్పటికీ ఈ భూములు ఇనాం భూములుగానే రికార్డయి ఉండటం గమనార్హం. వాస్తవాలు ఇలా ఉండగా, ఈ మరకలను వైఎస్సార్ సీపీకి అంటించడానికి ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుండడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యంగా ఇళ్లు కూల్చివేత... పరిస్థితి ఇలా ఉండగా ఈ నెల 4వ తేదీ సాయంత్రం సుమారు 150 నుంచి 200 మంది ప్రైవేటు సైన్యాన్ని వెంటబెట్టుకొని కొందరు వ్యక్తులు కార్మిక నగర్లోకి ప్రవేశించారు. వెంట మూడు జేసీబీలు తీసుకొచ్చారు. వచ్చీరాగానే మూడు గ్రూపులుగా విడిపోయి బలవంతంగా ఇళ్లను కూల్చివేయడం మొదలుపెట్టారని బాధితులు చెబుతున్నారు. ఇళ్లల్లో నిద్రపోతున్న చిన్నారులు, పిల్లలను బయటకు లాగి పడేశారు. అడ్డొచ్చిన మహిళలు, యువకులపైకి ఎగబడ్డారు. కనీసం ఇంట్లోని సామాన్లు తీసుకునేందుకు అవకాశం ఇవ్వమని బతిమాలినా వినలేదంటూ బాధితులు వాపోతున్నారు. ఇళ్లు కూల్చివేసిన తరువాత ఇంటి నిర్మాణానికి వాడిన కర్రలు, సిమెంటు రేకులను ధ్వంసం చేశారని, కాలనీలో చెట్లను నరికినట్లు మొదలుకంటా తీసేశారని, చివరికి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం గిన్నెను కూడా కాలితో తన్నారని ఒక బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది. డయల్ 100కు ఫోన్ చేస్తే ముగ్గురు పోలీసులు వచ్చి చోద్యం చూస్తూ నిలబడ్డారని బాధితులు ఆరోపించారు. 15 ఏళ్లకుపైగా ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేదలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వారం రోజుల నుంచి ప్రైవేటు వ్యక్తులు బాధితులను బెదిరిస్తూనే ఉన్నారు. రోజూ ఏదోక సమయంలో కార్మిక నగర్లోకి వచ్చి ఘర్షణలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బుధవారం కార్మిక నగర్కు వచ్చిన ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసులు ఏమయ్యారు... కార్మిక నగర్లోని పేదల ఇళ్లను కూల్చివేసి నేటికి వారం రోజులు. ఇళ్లను కూల్చివేసిన ప్రదేశంలో మీడియా సమావేశం పెట్టి బహిరంగంగా తామే ఇళ్లను కూల్చివేశామని ప్రైవేటు వ్యక్తులు ప్రకటిస్తుంటే ప్రభుత్వం ఏమైంది? ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఏమాయ్యారని నగర ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వ్యక్తుల మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలకు అధికారుల నుంచి జవాబులేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వలనే అధికారులు నోరు మెదపడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇనాం భూములను రిజిస్టర్ ఎలా చేస్తారు..? కార్మిక నగర్ను కూల్చివేసిన ప్రైవేటు వ్యక్తులు ఈ భూమిని రిజిస్టర్డ్ భూమిగా ప్రచారం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రిజిస్టర్లో ఈ భూములు ఇనాం భూములుగా ఉన్నాయి. అయితే ఇందులో 186/1లో 0.1800 భూమి ఒక వ్యక్తికి అనువంశికంగా, 0.1100 భూమి మరో వ్యక్తి కొనుగోలు చేసినట్లు ఉంది. ఇనాం భూములు ఎవరూ కొనడానికి, అమ్మడానికి వీలులేదని ప్రభుత్వ నిబంధనలు పేర్కొంటున్నాయి. మరి ఇనాం భూముని ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు మీ భూమి వెబ్సైట్లో చూపించడం పట్ల బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇనాం భూములను ఎలా రిజిస్టర్ చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు జవాబు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా లేని అభ్యంతం ఇప్పుడే ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భూమిని సర్వే చేసి ఇందులో ప్రభుత్వ భూమి లెక్క తేల్చాలని గత పదేళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమి అయితేనే తమకు పట్టాలు ఇవ్వాలని అధికారులకు మొరపెడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. కూల్చివేతల వెనక పెద్ద తలకాయలు... కార్మిక నగర్ కూల్చివేతల వెనక పెద్ద తలకాయలు ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఒక కీలక నేత ఆదేశాలతోనే కూల్చివేత జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నగర పరిధిలో దశాబ్దాలుగా కాపురాలు చేసుకుంటున్న వారి నివాసాలను ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఎలా కూలగొడతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ఈ భూములపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు ఎలాగైనా సరే దీన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి బాధితులను పిలిపించిన కీలక నేత ఆ స్థలం ఖాళీ చేసి వెళ్లాలని హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని యూఎఫ్బీయూ కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా నిరసన చేపట్టామన్నారు. అన్ని యూనియన్లు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్ల నాయకులు సుబ్బారావు, రాజేష్ ఖన్నా, వి.శ్రీనివాస రావు, ఉమా శంకర్, సుధాకరరావు, బ్రహ్మనాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: ప్రకాశం పోస్టల్ డివిజన్ పరిధిలోని చీమకుర్తి, మద్దిపాడు, వేటపాలెం, పర్చూరు పోస్టల్ కార్యాలయాల్లో ఉన్న ఆధార్ కేంద్రాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఎండీ జాఫర్ సాధిక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఈ నెల 12 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల వయస్సు నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి అని తెలిపారు. ఈ సేవలు ఈ నెల 30వ తేదీ వరకూ పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు, కందుకూరు, చీరాల, సంతనూతలపాడు, టంగుటూరు పోస్టు ఆఫీసులలో ఆధార్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్ నమోదు పూర్తిగా ఉచితం అని, డిమోగ్రాఫిక్ అప్డేట్కు రూ.75, బయోమెట్రిక్ అప్డేట్ రూ.125 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వారికి బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి అన్నారు. -
శంకరా..పయనమెలా..
పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీగిరి పర్వతంపై వెలసిన భ్రమరాంబ మల్లికార్జునల దర్శనానికి తరలివెళ్లే శివభక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. శివరాత్రి పర్వదినానికి ముందే అట్టహాసంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో శ్రీశైల ముఖద్వారంగా పేరొందిన దోర్నాలలో యాత్రికులు, శివస్వాముల రద్దీ పెరిగింది. యాత్రికుల సౌకర్యంపై దృష్టి సారించని దేవస్థానం అధికారులు.. శివరాత్రి పర్వదినానికి మరో రెండు రోజులు మాత్రమే ఉన్నా మండల కేంద్రంలో దేవస్థానం అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ముఖద్వారంగా పేరొందిన పెద్దదోర్నాలలో యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో శ్రీశైల దేవస్థానం అధికారులు చొరవ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సైతం పెద్దదోర్నాల మండల కేంద్రం మీదుగా శ్రీశైలం వెళ్లాల్సిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దోర్నాల నుంచి 50 కిలోమీటర్ల మేర నల్లమలగుండా శ్రీశైలం ప్రయాణించాల్సి ఉంది. అటవీ ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేనందున ఎందరో భక్తులు దోర్నాలలోనే బసచేసి భోజన, అల్పాహార కార్యక్రమాలు చూసుకున్న తరువాత శ్రీశైలం ప్రయాణమవుతారు. దీంతో సాధారణ సమయాల్లోనే అధిక రద్దీ ఉన్న దోర్నాలలో శివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా వేల మంది యాత్రికులతో మండల కేంద్రం కిటకిటలాడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు మండల కేంద్రంలో మంచినీటి సౌకర్యం, తాత్కాలిక వసతి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంపై యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల కేంద్రంలోని శివసదనంలో టెంట్లు వేసి దానికి అనుగుణంగా విశ్రాంతి తీసుకునేందుకు కార్పెట్లు ఏర్పాటు చేసేవారు. అధికారుల నిర్లక్ష్యంతో టెంట్లను సైతం వేయకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
● మరొకరికి గాయాలు మేదరమెట్ల: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల జాతీయరహదారిపై మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మెడసరి వెంకటేశ్వర్లు భార్య మల్లేశ్వరితో కలిసి ద్విచక్రవాహనంపై తమ్మవరం గ్రామానికి వచ్చి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో తమ్మవరం రోడ్డు నుంచి జాతీయరహదారిపైకి వెళ్లేందుకు సర్వీసు రోడ్డులో వెళ్లి జాతీయరహదారి ఎక్కారు. అదే సమయంలో ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపుకు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వెనుక కూర్చున్న మల్లేశ్వరి (42) రోడ్డుపై పడిపోగా అమైపె నుంచి లారీ చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని క్షతగాత్రున్ని వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టంగుటూరు: చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లవరప్పాడు సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు..మండలంలోని మల్లవరప్పాడు గ్రామానికి చెందిన చౌటూరి చిరంజీవి(35) తండ్రి సింగయ్యతో కలిసి మల్లవరప్పాడు, తూర్పునాయుడుపాలెం గ్రామాల మధ్య చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి చెట్టు మీద నుంచి జారిపడి గాయపడడంతో వెంటనే ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి సింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గుర్రంవారిపాలెంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్టూరు మండలం తాటవారిపాలెం గ్రామానికి చెందిన మర్రి శేషయ్య(65) పనిమీద గుర్రవారంపాలెం గ్రామానికి బైకుపై బయలుదేరారు. గుర్రంవారిపాలెం సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో శేషయ్యకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
బీచ్ ఫెస్టివల్కు పక్కా ఏర్పాట్లు
● అధికారుల సమీక్షలో కలెక్టర్ పి.రాజాబాబు ఒంగోలు సబర్బన్: సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో చేపట్టనున్న బీచ్ ఫెస్టివల్ను ఎలాంటి పొరపాట్లు లేకుండా చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ను ఛాలెంజ్గా తీసుకొని నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విజయవంతం చేయాలని సూచించారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో భాగంగా శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమానికి నోడల్ అధికారిగా జెడ్పీ సీఈఓ చిరంజీవిని నియమించామని వెల్లడించారు. కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును ఆదేశించారు. పారిశుధ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, తాగునీటి సౌకర్యం, పార్కింగ్ ఏర్పాట్లుపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు వివిధ రకాల సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, హెలికాప్టర్ రైడింగ్, లేజర్ షోలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేసు, డీపీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పాసుపుస్తకాల జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
కొండపి: పట్టాదారు పాసుపుస్తకాలు జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి అధికారులను హెచ్చరించారు. మండలంలోని ముప్పవరం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి వీఆర్ఓలు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని కొన్ని గృహాలను సందర్శించి పాసుపుస్తకాల జారీలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల కరెక్షన్ గురించి సమీక్షించి పొరపాట్లకు తావు లేకుండా పుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. పాసు పుస్తకాలు తీసుకున్న లబ్ధిదారులు అధికారులకు ఎటువంటి రుసుం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. తొలుత కేజీ కండ్రిక గ్రామంలో సర్వే నంబర్ 60లోని 7 ఎకరాల స్థలాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్కు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ ఎం.శివరామప్రసాద్, ఎంపీడీఓ రామాంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ రవిబాబు, ఆర్ఐ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఏఈ రవికుమార్, సర్వేయర్ రాజు, రెవెన్యూ, మండల పరిషత్ , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వండి ● మహా శివరాత్రి రోజు భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి ● దేవదాయ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఒంగోలు సబర్బన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర జిల్లా అధికారులతో మంగళవారం రాత్రి వర్చువల్గా మాట్లాడారు. సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. అసౌకర్యం లేకుండా శైవ క్షేత్రాల్లో దైవ దర్శనాలు కలిగేలా చూడాలన్నారు. ఈ నెల 15న మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో చేపట్టాల్సిన ఉత్సవ ఏర్పాట్లుపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేసు, దేవాదాయ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మహిళా చట్టాల అమలు పుస్తకం ఆవిష్కరణ
ఒంగోలు టౌన్: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాల అమలులో పోలీసు, న్యాయ వ్యవస్థ వైఫల్యాలను ఆధారాలతో నిరూపిస్తూ మహిళా పోరాట యోధుల అనుభవాలతో రచించిన మహిళా చట్టాల అమలు అనుభవాలు పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ అన్నారు. స్థానిక మాదాల నారాయణ స్వామి భవనంలో మహిళా చట్టాల అమలు అనుభవాలు, న్యాయం కోసం మహిళల సుదీర్ఘ ప్రయాణం పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, పనిస్థలంలో అసమానతలు, కుల వర్గ అధారిత వివక్ష వంటి అనేక సమస్యలపై ఈ పుస్తకంలో ప్రత్యేక్ష అనుభవాలను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకం మహిళలను కేవలం బాధితులుగా కాకుండా పోరాట యోధులుగా చిత్రీకరిస్తుందన్నారు. చట్టాలు ఉన్నా న్యాయం కోసం మహిళలు ఎంతటి సుదీర్ఘ పోరాటం చేయాల్సి వస్తుందో స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. మహిళా ఉద్యమాలు, సంఘటిత పోరాటాల అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుందన్నారు. ఈ నెల 12వ తేదిన జరిగే సార్వత్రిక సమ్మెలో మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వి.మంజుల, శాఖమూరి భారతి, సీహెచ్ పద్మ, వై.సుశీల, యరమాల కోటేశ్వరమ్మ, వి.సుజాత అమ్మాజీ, కుమారి పాల్గొన్నారు. -
గోరుముద్దను కాలదన్నారు!
రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి తనిఖీలో వెలుగులోకి వాస్తవాలు సింగరాయకొండ/సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్)/ఉలవపాడు: విద్యార్థుల సంక్షేమంపై చంద్రబాబు సర్కారు ఉదాసీన వైఖరి అవలంబిస్తోందన్న ఆరోపణలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ తనిఖీలతో వాస్తవమేనని నిరూపితమయ్యాయి. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను ఫుడ్ కమిషన్ సభ్యుడు ఇండేల లక్ష్మీరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. సింగరాయకొండలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పుచ్చిపోయిన వేరుశనగలు, పురుగు పట్టిన కందిపప్పు, నాసిరకంగా ఉన్న శనగలను చూసి శ్ఙ్రీపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడతారాశ్రీశ్రీ అంటూ ప్రిన్సిపాల్ రమాదేవితోపాటు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో 800 మంది బాలికలు ఉండగా వారికి సరిపడా ఆహారం వండకపోవడం, మెనూ పాటించకపోవడాన్ని గమనించి కేర్టేకర్ను ప్రశ్నించారు. ఉదయం బగారా రైస్, చికెన్ పెట్టాల్సి ఉండగా కేవలం సాధారణ రైస్, చికెన్ పెట్టారని, మెనూ పాటించటం లేదని బాలికలు చెప్పడంతో ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. స్టాక్ రిజిస్టర్ సక్రమంగా లేకపోవడం, పిల్లలకు ఆహారం సరిపడినంత ఇవ్వకపోవడంపై జేసీ కల్పనాకుమారికి తెలియజేశానని పేర్కొన్నారు. అంగన్వాడీల తీరుపై ఆగ్రహం సంతనూతనలపాడు మండలంలోని పి.గుడిపాడు 1, 2 అంగన్వాడీ కేంద్రాలను పుడ్ కమిషన్ సభ్యుడు తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకే చిన్నారులను తీసుకురావాల్సి ఉండగా 10.30 గంటల వరకు ఎందుకు తేలేదని అంగన్వాడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు పంపిణీ చేయకపోవడం, రిజస్టర్లు అస్తవ్యస్తంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్వైజర్ సావిత్రికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. పి.గుడిపాడు 2వ అంగన్వాడీ కేంద్రంలో హాజరు పట్టిక తప్పులతడకగా ఉండటం, పరిసరాల అపరిశుభ్రతను గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆహారం వండకుండా ఇంటి దగ్గర వంట చేయడంపై ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. ఇకపై పాఠశాలలోనే వంట వండి ఫొటోలు తీసి తనకు పంపాలని ఆదేశించారు. చీమకుర్తి మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం మూత వేయడం, ఎస్సీ కాలనీలో కేంద్రానికి పిల్లలను తేకపోవడం, అంగన్వాడీ కేంద్రాల్లో పిలల్లకు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం లేకపోవడాన్ని గమనించి, చర్యలకు సిఫార్సు చేశారు. ఆయన వెంట సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, డీఎస్ఓ పద్మశ్రీ, సివిల్ సప్లయ్ డీఎం వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత తదితరులు ఉన్నారు. జిల్లాలోని పలు అంగన్వాడీలు పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూకు మంగళం కడుపు నిండా అన్నం పెట్టడం లేదని విద్యార్థుల ఆవేదన సింగరాయకొండ గురుకులంలో పుచ్చిపోయిన పల్లీలు.. పురుగుల కందిపప్పు చీమకుర్తి మండల అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం నిల్ ఉలవపాడు సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ఆకలి కేకలు -
అవకతవకలు రూ.25 లక్షలు..రికవరీ రూ.32 వేలు
లింగసముద్రం: ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో సుమారు రూ.25 లక్షలు అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ..డ్వామా పీడీ కేవలం రూ.32 వేల రికవరీ చేయాలని ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు అధ్యక్షతన మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 16 పంచాయతీల్లో డీఆర్పీ అధికారులు రూపొందించిన నివేదికను నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగాభవాని విచారించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధిహామీ పథకం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్లలో రూ.9.65 కోట్లతో జరిగిన పనులపై గ్రామాల్లో డీఆర్పీలు తనిఖీలు నిర్వహించి కూలీలను విచారించారు. విచారణ సందర్భంగా ఏపీఓ సమీష్బాషా, డీఆర్పీలు పంచాయతీల వారీగా నివేదికలను చదివి వినిపించారు. డీఆర్పీలు చూపించిన రికార్డులు, మస్టరు కార్డుల్లో కూలీల వేలిముద్రలు దిద్దుబాటు, కొట్టివేతలు ఉండడం, కూలీల వేలిముద్రలు, సంతకాలు లేకపోయినా డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. పలు చోట్ల మొక్కలు లేకపోవడాన్ని కూడా గుర్తించారు. డీఆర్పీలు మొత్తం రూ.25 లక్షల మేరకు అవకతవకలు జరిగినట్లు గుర్తించినా డ్వామా పీడీ ఉపాధి సిబ్బందికి కేవలం రూ.32,243 రికవరీ చేయాలని ఆదేశించడం విశేషం. జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్షి, ఏపీడీలు శ్రీనివాసులు, బాబూరావు, ఎస్ఆర్పీ రవి తదితరులు పాల్గొన్నారు. -
చాలీచాలని భోజనం.. రోజూ అల్లాడుతున్నాం
● కందుకూరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీఐఎస్ఎఫ్ ర్యాలీకి హాజరైన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. పాఠశాలలో చదువుకుంటూ ఉలవపాడులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎమ్మెల్యేతో తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. శ్రీమాకు అన్నం సరిగా పెట్టడం లేదు, చాలీచాలని భోజనంతో రోజూ విలవిల్లాడుతున్నాం. మీరు ఒకసారి మాట్లాడండిశ్రీ అంటూ వేడుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో హాస్టల్కు వెళ్లిన ఎమ్మెల్యే మెనూ ఎందుకు అమలు చేయడం లేదంటూ వార్డెన్, వంట మనిషిని ప్రశ్నించారు. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని, పునరావృతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి వెనుదిరిగారు. -
కుష్టు వ్యాధిని నయం చేయడం సాధ్యమే
ఒంగోలు టౌన్: కుష్టు వ్యాధిని గుర్తించి సరైన వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయడం సాధ్యమేనని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో కుష్టు వ్యాధి నివారణపై పీహెచ్సీ, యుపీహెచ్సీ వైద్యాధికారులు, లెప్రసీ నోడల్ పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. లెప్రసీ, ఏయిడ్స్ , క్షయ జిల్లా అధికారి డాక్టర్ జి.బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై వైద్యాధికారులు, నోడల్ పర్సన్లు సంపూర్ణ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. వ్యాధి నివారణ గురించి నిత్యం అధ్యయనం చేయాలన్నారు. మంచి ఆహారం, సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. కుష్టు నివారణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ ఆధునిక వైద్యంలో కుష్టు వ్యాధి నివారణకు చాలా మంచి ఔషధాలు ఉన్నాయని చెప్పారు. చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ ఏడుకొండలు కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణకు సంబంధించి సమగ్రంగా విశ్లేషించారు. నెల్లూరు డామియన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ సతీష్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి వల్ల సంభవించే అంగవైకల్యం, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీహెచ్ వార్డ్ ఎంఓ డాక్టర్ రజిత, పీఎంఓ టి.సూరిబాబు, డీపీఎంఓలు, ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు -
సమ్మెకు రవాణా కార్మికులు మద్దతివ్వాలి
ఒంగోలు టౌన్: సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం రవాణా కార్మికుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెళ్లూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ అహమ్మద్ మాట్లాడుతూ లేబర్ కోడ్ల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రవాణా రంగాన్ని దెబ్బతీస్తుందన్నారు. పెట్రోల్ చార్జీలు పెంచుతున్న ప్రభుత్వం అందుకు బదులుగా రవాణా రంగానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడం లేదన్నారు. మోడీ పాలనలో రవాణా రంగం కుదేలైపోయిందని విమర్శించారు. నూతన విద్యుత్ చట్టం, విత్తన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచిన ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఎం.రమేష్, తంబి శ్రీనివాసులు, షేక్ ముహమ్మద్, యు.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ● ద్విచక్రవాహనదారుడు మృతి పెద్దదోర్నాల: ముందు వెళుతున్న టిప్పర్ను అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్లోని చిన్నారుట్ల వద్ద మంగళవారం జరిగింది. ఈ ఘటనలో తెనాలికి చెందిన విష్ణు మొలకల బ్రహ్మేశ్వరరరావు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట రమణయ్య హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఎస్సై కథనం మేరకు..మండల కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై శ్రీశైలం వెళుతున్న బ్రహ్మేశ్వరరరావు చిన్నారుట్ల వద్ద తన ముందుగా వెళ్తున్న టిప్పర్ను ఓవర్ టేక్ చేస్తుండగా అదే సమయంలో ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బ్రహ్మేశ్వరరరావు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఘాట్రోడ్లలో రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు వేగాన్ని నియత్రించుకుని జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఎస్సై కోరారు. ● పోస్ట్ కార్డుల క్యాంపెయిన్ ద్వారా సీఎంకు వినతి చీమకుర్తి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం తరఫున ఉపాధ్యాయులు పోస్టుకార్డు క్యాంపెయిన్ కింద పోస్టుకార్డులు రాసి సీఎం చంద్రబాబు నాయుడుకు పోస్టు చేశారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ను ప్రకటించాలని, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ను ప్రకటించాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ను అమలు చేయాలన్నారు. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరగనున్న బడ్జెట్ సమావేశాలలో పై సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్ళూరి రోజారావు, చలువాది శ్రీనివాసరావు, జిల్లా, మండల స్థాయి నాయకులు నల్లూరి వెంకటేశ్వరరావు, షేక్ శిలార్ సాహెబ్, పర్వతం వెంకటేశ్వర్లు, మన్నం శ్రీనివాసరావు, పల్లేల రమేష్, స్థానికులు పాల్గొన్నారు. -
లడ్డ్డూపై తప్పుడు ప్రచారంతో డైవర్షన్ పాలిటిక్స్
కనిగిరిరూరల్: కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం.. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డ్డూపై అసత్య ప్రచారాలు చేస్తున్న మానవ రూప రాక్షసులు చంద్రబాబు, కూటమి నేతలు అని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్డర్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్నలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన ప్రచారం అబద్ధమని సీబీఐ సిట్, చార్జిషీట్ సాక్షిగా బట్టబయలు కావడంతో.. వారి పై వస్తున్న ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడేందుకే కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీవారి ప్రసాదంపై ఎటువంటి ఆరోపణలు చేయని, చంద్రబాబు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. కేవలం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై విషప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే .. అత్యంత పవిత్రమైనా.. విశ్వాసమైన శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. కూటమి నేతలను ఆ దైవం క్షమించదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను జైలుకు పంపాలనే దురుద్దేశంతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు చంద్రబాబు తెరతీశాడని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్ల పై దాడులు, అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా పశ్చాత్తాపం ప్రకటించి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ప్రజా తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ శ్రీవారి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని సుప్రీం కోర్టు నివేదికలో స్పష్టం చేసినా కేవలం వైఎస్సార్ సీపీ నాయకులపై బురద జల్లేందుకే చంద్రబాబు, కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినేలా.. లడ్డూ తయారీకి బాత్రూం క్లీనింగ్కి వాడే రసాయనాలు వంటి కెమికల్స్ వాడారంటూ మరీ దిగజారుడు రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, ఒకేరెడ్డి, పులి శాంతి గోవర్ధన్రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, ఆర్ మాణిక్యరావు, పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, ఆవుల భాస్కర్ రెడ్డి, కటికల వెంకటరత్నం, ఆయిమల్ల నాగమణి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్ రసూల్, సిరుప వెంకట గోవర్ధన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు యక్కంటి శ్రీను, జీ బొర్రారెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, శ్యామల సాంబిరెడ్డి పోలక సిద్దారెడ్డి, ముల్లంగి శ్రీహరిరెడ్డి, దరిశి సుబ్రహ్మణ్యం, ఎస్కే రహీం, దాదిరెడ్డి మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
● టీచర్స్ గిల్డ్ డిమాండ్ ఒంగోలు సిటీ: ఎయిడెడ్ విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడూరి వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 136 ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 10,500 మంది పేద విద్యార్థులకు సంబంధించి బెంచీలు, ప్యానల్ బోర్డులు, స్పోర్ట్స్ మెటీరియల్, ఎఫ్ఎల్ఎన్ కిట్లు ఇంత వరకు ప్రభుత్వం సప్లై చేయలేదన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే 593 మంది ఉపాధ్యాయ, నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించి ఇంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద ఆరోగ్య కార్డులు మంజూరు కాలేదన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ సర్వీసులో మరణించిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల జీవో విడుదల చేయలేదని, ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పూర్తి సర్వీస్ను, ప్రస్తుతం పని చేస్తున్న తెలుగు, హిందీ సంస్కృత, పీఈటీలకు పదోన్నతి సౌకర్యం కల్పించకపోవడం, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఒంగోలు టౌన్: దేశం కోసం త్యాగాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సీనియర్ కమాండెంట్ సంజీత్ కుమార్ పిలుపునిచ్చారు. తీరం, తీర ప్రాంతాల పరిరక్షణతో పాటుగా మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్–2026 పేరిట చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరింది. జిల్లా పోలీసు అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు సీఐఎస్ఎఫ్ జవాన్లకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమాండర్ సంజీత్ కుమార్ మాట్లాడుతూ జనవరి 28వ తేదీ కోల్కతా నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఈ నెల 23వ తేదీ కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ముగిస్తుందని తెలిపారు. 100 మందికి పైగా సైకిలిస్టులతో నిర్వహిస్తున్న ఈ సైకిల్ ర్యాలీ ప్రతి రోజూ 150 నుంచి 160 కిలోమీటర్ల వరకు కొనసాగుతుందని వివరించారు. మొత్తం 6500 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో మహిళా జవాన్లు ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాతృభూమి రక్షణ, దేశం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలకు తీర భద్రత ప్రాధాన్యత, దేశ రక్షణలో వారి పాత్ర, భద్రతా దళాలకు తీర ప్రజల సహకారం ర్యాలీ ద్వారా వివరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండర్ విక్రమ్ సింగ్, ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయ కృష్ణ, ట్రాఫిక్ సీఐ జగదీష్, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణా రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఉల్లాస్ అక్షరాంధ్ర వాల్పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు సబర్బన్: ఉల్లాస్ అక్షరాంధ్ర వాల్పోస్టర్ను కలెక్టర్ పి.రాజాబాబు ఆవిష్కరించారు. స్థానిక ప్రకాశం భవన్లోని కాన్ఫరెన్స్ హాలులో వయోజన విద్య ఉపసంచాలకుడు బి.జగన్మోహనరావుతో కలిసి ఆయన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం మార్చి 29 వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రెండు గంటల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా పనిచేస్తాయన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మార్చి 29న జరిగే ఉల్లాస్ అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు అభ్యాసకులను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ బీసీహెచ్ ఓబులేసు, డివిజనల్ సూపర్వైజర్ టి.పోతురాజు, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వర రావు, డీఆర్డీఏ పీడీ నారాయణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, మెప్మా ఒంగోలు ప్రతినిధి రాణిలతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
ఒంగోలు టౌన్: కార్మికులను కట్టుబానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం, చర్చి సెంటర్, ట్రంక్ రోడ్డు, అద్దంకి బస్టాండు సెంటర్ మీదుగా కర్నూలు రోడ్డు, ఆర్టీసీ బస్టాండు సెంటర్ వరకు భారీ మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, యాజమాన్యంతో బేరసారాలాడుకునే హక్కులను కోల్పోతారని తెలిపారు. పరిమితకాల ఉద్యోగాలతో ఉద్యోగ భద్రత కోల్పోతారని, కార్మికులు కట్టు బానిసలుగా మారతారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ పథకంతో రాష్ట్రాలపై భారం పడుతుందని, గ్రామీణ జీవనం అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు. విత్తన బిల్లుతో రైతాంగం తీవ్రంగా నష్టపోతారని, విద్యుత్ చట్టంతో మొత్తం ప్రజల జేబులకు చిల్లు పడుతుందని, అమెరికాతో చేసుకున్న ఒప్పందంతో రైతాంగం నడివీధిన పడే పరిస్థితి దాపురిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యం.రమేష్, జీవి కొండారెడ్డి, పి.కల్పన, ఆర్.వెంకటరావు, కంకణాల ఆంజనేయులు, చుండూరి రంగారావు, మోహన్, హనుమారెడ్డి, రాజీవ్ రతన్ దేవ్, ఎంఏ సాలార్, జీ.శేషయ్య, చిరంజీవి, రాజశేఖర్, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సర్కారు వెనుకబడి!
ఈసీ హడావుడి..మార్కాపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 925 గ్రామ పంచాయతీలున్నాయి. మార్కాపురం జిల్లాలో 406, ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, కొండపి, అద్దంకి నియోజకవర్గాల్లోని 925 గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. అలాగే మార్చి 17 తో మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో హడావుడి ప్రారంభమైంది. మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత వార్డుల రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. దీనితో ఇప్పటి నుంచే ఆయా వార్డుల్లో పంచాయితీ సర్పంచ్ల పదవులకు, మున్సిపల్ చైర్మన్ల పదవులకు పలువురు ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. కొత్తగా వార్డులు, పంచాయతీలు ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబరు 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా షెడ్యూల్ను ప్రకటించినప్పటికీ మళ్లీ వాయిదా వేసింది. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది. జిల్లాలో ఎన్ని పంచాయతీలకు, మున్సిపాలిటీల్లో ఏయే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల జాబితా తయారీలో బిజీ..బిజీ మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఈనెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. 2026 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన వారికీ ఓటు హక్కు కల్పించేలా కొత్త ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సూచించింది. కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు, ఒంగోలు కార్పొరేషన్లో డివిజన్ల వారీగా వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ ఆదేశాల ప్రకారం ఒక ఇంటిలో ఉండే ఓటర్లు ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్లపై ఆశావహుల చర్చ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాలు, పట్టణాల్లో ఆశావహుల సందడి ప్రారంభమైంది. ఏ నలుగురు కలిసినా వార్డుల రిజర్వేషన్లు, పదవుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్లో 50 డివిజన్లు, మార్కాపురంలో 35 వార్డులు, కందుకూరులో 32, అద్దంకిలో 27, పొదిలిలో 20, కనిగిరిలో 20, దర్శిలో 27, గిద్దలూరు 20, చీమకుర్తిలో 27 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో దర్శిలో 20, చీమకుర్తిలో 20, అద్దంకిలో 20 ఉండగా ఇటీవలే 7 వార్డులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కందుకూరు మున్సిపాలిటీకి, పొదిలి నగర పంచాయతీలకు గతంలో కూడా ఎన్నికలు నిర్వహించలేదు. గ్రామాల విలీనంపై పలువురు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు వాయిదా వేశారు. -
అడ్డగోలు దోపిడీ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థలో అడ్డగోలుగా దోచుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్పై లక్షలాది రూపాయల వర్కులు కేటాయించారని వైఎస్సార్సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల లోపు వర్కులను మాత్రమే నామినేషన్ పద్ధతిపై కేటాయించాల్సి ఉంటే అంతకు మించి వర్కులను నామినేషన్పై ఇవ్వటం అత్యంత దారుణమని కౌన్సిల్లో వైఎస్సార్ సీపీ సభ్యులు నిలదీశారు. మేయర్ జీ.సుజాత అధ్యక్షతన మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. 130 అంశాలతో కూడిన అజెండాను నామమాత్రపు చర్చతో మ..మ అనిపించారు. అయితే ప్రజా సమస్యలను చర్చించకుండా అధికార టీడీపీ సభ్యులు ఆమోదం తెలపటంతో వైఎస్సార్ సీపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా ఒంగోలు నగరంలో డివైడర్లకు పెయింట్లు వేయటంతో పాటు ఇంటి నంబర్ల వేయటంలో నగర పాలక సంస్థ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలారంటూ ఇమ్రాన్ ఖాన్ ధ్వజమెత్తారు. ఇంటి గోడలకు రంగు పూసి, నంబర్లు వేయటానికి ఏకంగా నామినేషన్ పద్ధతిపై రూ.75 లక్షలకు కాంట్రాక్టు ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల లోపు వర్కుకు మాత్రమే నామినేషన్ పద్ధతిపై కేటాయిస్తారని, రూ.లక్షలోపు అయితే బాక్స్ పద్ధతిపై వర్కు ఇస్తారన్నారు. అలాంటిది రూ.75 లక్షల వర్కు నామినేషన్ పద్ధతిపై ఇవ్వటం వెనుక దాగిఉన్న మతలబు ఏమిటన్నది స్పష్టం చేయాలని అధికారులను నిలదీశారు. అదేవిధంగా ట్రంకు రోడ్డు విస్తరణ విషయంలో అధికారుల తీరు ప్రశ్నార్థకంగా ఉందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ట్రంకు రోడ్డు బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇస్తామనటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ప్రస్తావించారు. ఇదే అంశాన్ని అధికార జనసేన సభ్యుడు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు కూడా ట్రంకు రోడ్డు బాధితుల విషయంలో అన్యాయం చేయకూడదని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల వారీగా మంచినీళ్లు ఇస్తున్నారు... ఒంగోలు నగరంలో అగ్రహారం రైల్వే గేటు అవతల ప్రజలకు రాజకీయ పార్టీల వారీగా చూసిమరీ మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయటం దారుణమని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ ధ్వజమెత్తారు. అగ్రహారం రైల్వే గేటు అండర్ పాస్ పనులు జరుగుతున్నాయని, మంచినీటి పైపులైను తీసేయటంతో 16వ డివిజన్ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారని, అయితే అధికార పార్టీకి చెందిన ప్రజలకు ఒకరకంగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజలకు మరోరకంగా, అధికార పార్టీలోనే కూటమి పార్టీలోని మరో పార్టీ ప్రజలకు ఇంకో రకంగా మంచినీరు సరఫరా చేయటం దారుణమన్నారు. ఇంటికి ఒక డ్రమ్ము కూడా ఇవ్వటం లేదని, ప్రజలు సొంత డబ్బులు వెచ్చించి మరీ మంచినీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తేజతో పాటు ఏ.శ్రీనివాస్లు వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకున్నారు. నగరంలోని వ్యాపారుల వద్ద వసూలు చేయాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయకుండా బకాయిల పేరుతో నగర పాలక సంస్థ ఆదాయానికి మంగళం పాడుతున్నారని జనసేన సభ్యుడు ఈదర సురేష్ బాబు కౌన్సిల్లో ప్రస్తావించారు. మొత్తం నగరంలో 791 మంది నుంచి వసూలు చేయాల్సిన రూ.77 లక్షలను ఏ విధంగా రద్దు చేస్తారంటూ మండిపడ్డారు. ఆ అంశంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఈదర సురేష్కు మద్దతుగా మాట్లాడారు. బకాయిలు రద్దు చేసిన వాళ్లలో బడా బాబులు, పెట్రోలు బంకులు, ఇంకా రూ.కోట్లలో వ్యాపారం జరిగే వాళ్లు కూడా ఉన్నారన్నారు. నగరంలోని డివైడర్ల మధ్యలో ఎల్ఈడీ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు విద్యుత్ స్తంభాలకు బిగిస్తున్న అంశంపై జనసేన, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జనసేన సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కమిషనర్ కే.వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు వివిధ విభాగాల అధికారులు పాలొన్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
కొత్తపట్నం: మండలంలోని కె.పల్లెపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.55 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కొత్తపట్నం పంచాయతీకి కూడా ఇన్చార్జి కార్యదర్శిగా సంపత్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్తపట్నం డీడీ కాలనీ శ్మశానంలో రూ.4.70 లక్షలతో ఫెన్సింగ్ రాళ్లను కాంట్రాక్టర్ జాజుల జాలరామ్ ఏర్పాటు చేశారు. ఆ బిల్లులకు సంబంధించి ఎంబుక్ చేయడానికి రూ.55 వేల లంచాన్ని పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు.. సోమవారం కే పల్లెపాలెం సచివాలయంలో ఉన్న సంపత్ కుమార్ వద్దకు వెళ్లి కాంట్రాక్టర్ జాలరామ్ రూ.55 వేల లంచం ఇస్తుండగా మాటువేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ విజయవాడలో డెంటల్ డాక్టర్ కోర్సు పూర్తి చేశాడని, 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం పొందాడని తెలిపారు. తొలుత అద్దంకి నియోజకవర్గంలో పనిచేశాడని, బదిలీల్లో భాగంగా కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం పంచాయతీకి వచ్చాడని వెల్లడించారు. సంపత్ కుమార్ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. -
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
భూముల ధరలు భారీగా పెరగడంతో అధికారులను అడ్డంపెట్టుకుని అధికార టీడీపీ నేతలు జోరుగా భూ దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ భూ వ్యాపారాన్ని శాసిస్తూ తాము చెప్పిందే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో భూ ఆక్రమణలు చేసి కొందరు వ్యవసాయం చేస్తుండగా.. మరికొందరు అక్రమంగా పట్టాలు తీసుకున్నట్లు తెలిసింది. బల్లిపల్లి రెవెన్యూకు శాశ్వత వీఆర్వో లేకపోవడం, ఉన్న వీఆర్వో మూడు పంచాయతీలకు ఇన్చార్జి కావడంతో అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. కనిగిరి పట్టణ, మండలంలో 40 రెవెన్యూ గ్రామాలు, 25 పంచాయతీలు, 20 వార్డులు, 32 సచివాలయాలు ఉండగా, 14 మంది వీఆర్వోలు మాత్రమే ఉండటం గమనార్హం. రెవెన్యూ విభాగంలో అధికారుల కొరత కూడా అక్రమార్కులకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ‘‘గ్రీన్ ఫీల్డ్ హైవే.. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్.. ట్రిపుల్ ఐటీ లాంటి కీలకమైన ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి.. ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి’’ అంటూ పచ్చ మాఫియా భూ దందాకు తెగబడుతోంది. బల్లిపల్లి పంచాయతీ పరిధిలో నిన్నమొన్నటి వరకూ ఎకరా రూ.10 లక్షలు పలకగా.. నేడు రూ.80 లక్షలకు చేరింది. ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇదే అదునుగా కూటమి పార్టీల నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారన్న విమర్శలున్నాయి. కనిగిరి రూరల్: కనిగిరి మండలంలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామాల్లో బల్లిపల్లి పంచాయతీ ఒకటి. దీని పరిధిలో సుమారు 6 ప్రధాన గ్రామాలు(12 విడిగ్రామాలు, కాలనీలతో కలిపి) ఉన్నాయి. బల్లిపల్లి, విశ్వనాథపురం, బాలవెంకటాపురం రెవెన్యూ గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాలకుపైగా అసైన్డ్, వాగు, గ్రేజింగ్, కొండపోరంబోకు, ఫారెస్ట్ భూములున్నాయి. అత్యధికంగా ప్రభుత్వ భూములు, సుమారు 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న రూరల్ గ్రామాల్లో పెద్ద ెపంచాయతీ ఇది. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో అక్రమార్కుల కన్ను ఈ పంచాయతీపై పడింది. భూ మంత్రం.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణానికి గతంలో చంద్రబాబు, మంత్రులు పామూరు మండలం దూబగుంటలో శంకుస్థాపన చేసి వదిలేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజాభీష్టం మేరకు ప్రధాన రహదారి పక్కన కనిగిరి–పామూరు ఎన్హెచ్ 565 రహదారి పక్కన బల్లిపల్లి పంచాయతీలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు సర్వే నంబర్ 766, 766–1లోని సుమారు 255 ఎకరాల (పోరంబోకు) భూమి కేటాయించింది. దాని పక్కనే సుమారు 15 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మించింది. తాజాగా ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సంబంధించి అధికారులు భూ పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు. అలాగే బల్లిపల్లి లోపలి గ్రామంలోని కాలనీ వద్ద నడికుడి– కాళహస్తి రైలు మార్గం పనులు చురుగ్గా సాగుతున్నాయి. పంచాయతీకి కొంత దూరంలో (సుమారు 6 కిలోమీటర్ల దూరంలో) కనిగిరి రోడ్డు వైపు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సర్కిల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ పంచాయతీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములకు రెక్కలొచ్చాయి. అధికారం అండగా భూ దందా... అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి పార్టీల నేతలు భూ ఆక్రమణలు, భూ దందాకు తెరలేపారు. టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు ఇక్కడ భూ దందాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బల్లిపల్లి పంచాయతీలో అత్యధికంగా పోరంబోకు, అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ ఒక్క పంచాయతీలోనే సుమారు 4 వేలకుపైగా ప్రభుత్వ, పోరంబోకు, అసైన్డ్, కొండ పోరంబోకు భూములున్నట్లు రెవెన్యూ నివేదికలున్నాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ కళాశాలకు కేటాయించిన సర్వే నంబర్ 766లో దాదాపు 450 నుంచి 500 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. ట్రిపుల్ ఐటీకి, జగనన్న లే అవుట్కుపోను ఇంకా 150 ఎకరాల వరకు పోరంబోకు భూమి ఉంది. ఇందులో అగ్రభాగం ప్రధాన రహదారి వైపునకున్నట్లు తెలిసింది. దీంతో అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు భూ దందా షురూ చేశారు. అధికారుల అండతో కొందరు అక్రమార్కులు సుమారు రూ.కోట్ల భూమికి ఎసరు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గత తహసీల్దార్ హయంలో జగనన్న లే అవుట్లో ఇద్దరు టీడీపీ నేతల అండతో 12 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ఒక్కో పట్టాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణం పరిసర ప్రాంతాల్లో కొందరికి పట్టాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధికార కూటమి పార్టీలోని ఒక వర్గం రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. భారీగా పెరిగిన భూముల ధరలు... ప్రస్తుతం బల్లిపల్లి పంచాయతీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. గతంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న భూములు ఎకరా రూ.పది లక్షల వరకు ఉండగా.. ప్రస్తుతం రిజిష్టర్డ్ భూమి ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ధర పలుకుతోంది. అసైన్డ్ భూములైతే సుమారు రూ.45 లక్షల వరకు ఎకరా పలుకుతున్నాయి. లోపలి ప్రాంతాల్లో భూములు ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకుపైమాటే. దీంతో ఇక్కడ భూములపై అధికార టీడీపీ నేతల కన్నుపడింది. -
వక్ఫ్ భూముల ధారాదత్తంపై ఉద్యమిస్తాం
ఒంగోలు సబర్బన్: ముస్లిం మైనార్టీలకు చెందిన వక్ఫ్ భూములను చంద్రబాబు ప్రభుత్వం తమ అనుయాయులకు, బినామీలకు ధారాదత్తం చేస్తోందని వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం నాయకులు ధ్వజమెత్తారు. ఆ మేరకు సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవన్ ముందు వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ సుల్తాన్ బాషా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తొలుత వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రకాశం భవనం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ సుల్తాన్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మైనార్టీలకు చేస్తున్న అన్యాయాలను నిలదీశారు. అనంతరం ప్రకాశం భవనం ముందు ఆందోళన చేపట్టిన మైనారిటీ నాయకులు.. చంద్రబాబు ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సుల్తాన్ బాషా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వక్ఫ్ భూములపై కన్నేసిందన్నారు. తరతరాలుగా వక్ఫ్ భూములు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం, మసీదుల నిర్వహణ కోసం, ముస్లిం పేద విద్యార్థులను ఆదుకునేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. అలాంటిది.. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అంజుమాన్ సొసైటీకి కట్టబెట్టేందుకు చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డాడు. చంద్రబాబు బినామీలకు, అనుయాయులకు దోచిపెట్టడానికే వక్ఫ్ భూములపై కన్నేసిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మహమ్మద్ ఇమ్రాన్ఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా మైనార్టీలు పాల్గొని వక్ఫ్ భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. వక్ఫ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టి భవిష్యత్తు ముస్లిం తరాలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యక్తులకు, తమ అనుయాయులకు అమ్మకానికి పెడుతున్నారన్నారు. బినామీలకు వక్ఫ్ భూములు కట్టబెట్టడం అత్యంత దారుణమన్నారు. మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్ భూములను అంజుమాన్ సొసైటీకి అమ్మాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు మొండి ఆలోచనలతో ముందుకు పోతున్నారని, భవిష్యత్తులో ముస్లింల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులంతా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేసుకు వినతిపత్రం అందించారు. తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అయిన మార్కాపురంకు చెందిన గౌస్ మొహిద్దీన్, దర్శికి చెందిన అమాన్ బాషా, అల్లాభక్షు, ఖాశిం, రహంతుల్లా, ఒంగోలు కరీముల్లా, అబ్దుల్లా, సయ్యద్ అప్సర్, షేక్ జిలానీ బాషా, షేక్ మహబూబ్ బాషా, షేక్ మలాంగ్, ఎండీ చాంద్ బాషా, సయ్యద్ రఫి, షేక్ సమీర్, షేక్ కరీముల్లా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ప్రకాశం భవన్ ముందు సోమవారం జిల్లా స్థాయి పెన్షనర్లు ధర్నా చేశారు. ఏపీఆర్పీఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు అసోసియేషన్ అధ్యక్షుడు జి.శేషయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ ధర్నా చేపట్టడానికి గల ఉద్దేశాన్ని వివరించారు. ప్రధానంగా ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీస పింఛన్ నెలకు రూ.9 వేలు ఇవ్వాలని, దాంతో పాటు డీఏ కూడా కలిపి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈపీఎఫ్ పెన్షన్దారులకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఉద్యోగులకు ప్రకటించిన ఎనిమిదో పీఆర్సీ రిపోర్టును తక్షణమే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్వేలో ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ నియమించి ఐఆర్ 30 శాతం మంజూరు చేయాలన్నారు. 1–7–2018 నుంచి నేటి వరకు పెన్షనర్లకు రావాల్సిన డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2024 జూలై నుంచి రావాల్సిన కరువు భత్యాలను ప్రకటించాలని, 2024 ఆగస్టు నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలన్నారు. 2018 నుంచి డీఏ బకాయిలు అందరికీ రాలేదని, అందరికీ జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్ కార్డు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలన్నారు. ధర్నా అనంతరం జేసీ కల్పనా కుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, ఏపీఆర్పీ గౌరవ సలహాదారు అయ్యప్పరెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ పేరయ్య, నాయకులు నాగేశ్వరరావు, బి.బ్రహ్మానందరెడ్డి, ఆర్.నాగేశ్వరరావు, వెంకయ్య, అజీజ్, పోస్టల్ నుంచి కే వెంకటేశ్వరరావు, ఎస్.రంగారావు, కే వీరాస్వామిరెడ్డి, బ్యాంకుల నుంచి కే నారాయణరావు, సీబీ రావు, వీవీ రత్నం, వివిధ ప్రభుత్వ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని వినతి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తామని, అప్పటివరకూ ప్రతి ఒక్కరికీ నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే వివిధ ప్రభుత్వ శాఖల ఖాళీలను భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ప్రోత్సహకాలు ఇచ్చి ప్రతి ఒక్కరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి 19 నెలల గడుస్తున్నా కనీసం ఒక్క హామీనైనా అమలు చేయకుండా అటకెక్కించారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ సమస్యపై చర్చించాలని, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో మద్యం దుకాణాలలో పనిచేసిన సిబ్బందిని, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో రేషన్ వాహనాలకు డ్రైవర్లుగా, సహాయకులుగా పనిచేసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తొలగించారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై తక్షణమే కార్యాచరణ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, నాయకులు కొండ గోపి, వీవీఎస్ చౌదరి, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. -
జాబ్ క్యాలండర్ ప్రకటించాలి
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలన్నీ ప్రకటించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామన్న మాటను కనీసం ఈ ఏడాదైనా చంద్రబాబు ప్రభుత్వం నిలుపుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఒంగోలులో వాన్పిక్, కనిగిరి నిమ్జ్, చీమకుర్తి శిల్పారామం, దొనకొండ పారిశ్రామిక కారిడార్, తదితర పరిశ్రమలు పూర్తి చేయాలన్నారు. నిర్మాణం ఆగిపోయిన దర్శి డ్రైవింగ్ స్కూల్ను పూర్తి చేయాలన్నారు. ఇటీవల కనిగిరిలో శంకుస్థాపన చేసిన గ్యాస్ కంపెనీని వెంటనే పూర్తి చేసి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ భృతిగా నెలకు 3 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, ఈ బడ్జెట్ వలన నష్టం తప్ప లాభం లేదని వ్యాఖ్యానించారు. బడ్జెట్లో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను అడిగే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కార్.. 12 ఏళ్లు గడుస్తున్నా ఆతీగతీ లేదని మండిపడ్డారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వే సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ దేశం అభివృద్ధిలో నడుస్తోందని మోదీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో యువజన నాయకులు దానియేలు, టి.భాను, నవీన్, రాజు పాల్గొన్నారు. -
దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలా..?
చీమకుర్తి: భక్తిశ్రద్ధలతో తిరుపతి వెంకటేశ్వరస్వామిని కొలుచుకునే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చీమకుర్తిలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలతో రాజకీయాలు చేయొచ్చుగానీ.. పవిత్రమైన దేవదేవుడిని రాజకీయాలకు అడ్డం పెట్టుకోవడం దారుణమన్నారు. ఎన్డీడీబీ, సిట్ సంస్థలు లడ్డూలో కల్తీ లేదని ధ్రువీకరించినప్పటికీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను ప్రజలు చీత్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు చంద్రబాబు అమలు చేయకపోగా, ఎన్నికలప్పుడు అతను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. లడ్డూ మీద భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా వాల్పోస్టర్లు వేయించటం, చివరకు పెట్రో బాంబుల సంస్కృతిని కూడా తీసుకురావడం చంద్రబాబుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని ఎల్లకాలం మోసపూరిత రాజకీయాలు చేయలేరని, చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని వైఎస్సార్ సీపీ నాయకులు ఆలయాలలో పూజలు చేస్తుంటే కూడా తప్పుడు కేసులు పెట్టడం అతని కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలీసు గ్రీవెన్స్కు ఫిర్యాదుల వెల్లువ
ఒంగోలు టౌన్: వరసగా రెండు వారాలు పోలీసు గ్రీవెన్స్ వాయిదా పడడంతో సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన 124 మంది బాధితులు ఫిర్యాదులు అందజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు వారి సమస్యలను, పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ రమణకుమార్, పీసీఆర్ సీఐ దుర్గాప్రసాద్, రూరల్ సీఐ శేషగిరిరావు, సంతనూతలపాడు సీఐ వెంకటరావు, కొండపి సీఐ సోమశేఖర్, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీసింగ్, వేదిక ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. -
17న చెస్, 24న సైక్లింగ్ పోటీలు
ఒంగోలు: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 17న చదరంగం, 24న సైక్లింగ్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యదర్శి జి.రాజరాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలు ఉదయం 9 గంటలకు స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో ప్రారంభమవుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారు ముందుగా క్రీడాయాప్లో పేర్లు నమోదు చేసుకోవాన్నారు. చెస్ పోటీలు అండర్ 13, 15, 17,19 విభాగాల్లో, సైక్లింగ్ పోటీలు జూనియర్ అండర్ 18 విభాగంలో జరుగుతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 21,22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు, ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9121106840 నంబర్ను సంప్రదించాలని కోరారు. నాగులుప్పలపాడు: అతి వేగం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..మండలంలోని ఈదుమూడి గ్రామానికి చెందిన కుమ్మూరి అనుబాబు (18) తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం విధులు ముగించుకొని మోటార్సైకిల్ పై వెళ్తున్న క్రమంలో కొత్తకోట సమీపంలో అతివేగంగా ఆర్చీని బలంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ● రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఆపహరణ మర్రిపూడి: మర్రిపూడి పడమటిబజారులో పట్టపగలే చోరీ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.మర్రిపూడి పడమటి బజారుకు చెందిన మారెడ్డి నరేంద్రారెడ్డి, బేబి దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. వారం క్రితం బ్యాంకులో పెట్టిన బంగారాన్ని విడిపించి ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఇంటికి తాళాలు వేసి భార్యభర్తలు రోజూ పొలం వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీరువాను తెరవగా అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా తలుపులు తీసి లాకర్లో ఉన్న బంగారాన్ని దొంగిలించి, తిరిగి యధావిధిగా బీరువాకు తాళాలు వేశారని బాధితులు తెలిపారు. మొత్తం రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేశారు. తెలిసిన వ్యక్తులు దొంగిలించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో వివరాలు తెలియాల్సి ఉంది. -
పోటెత్తిన అర్జీదారులు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించుకునుందుకు తరలివచ్చారు. గత రెండు సోమవారాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కావడంతో ఈ సోమవారం కార్యక్రమానికి భారీగా పోటెత్తారు. అయితే వందల మంది అర్జీదారులు బారులుదీరి ఉన్నా భోజనం సమయం అయిందని జిల్లా అధికారులు వెళ్లిపోవడంతో వారంతా చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. కొంత మంది అలవాటు ప్రకారం మార్కాపురం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. వారిని అధికారులు బయట నుంచే మార్కాపురంలో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమానికి వెళ్లాలని పంపించారు. అర్జీల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వద్దే ఆలస్యం.. మీ కోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల కోసం అర్జీలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేందుకు కేవలం నాలుగు కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో వందల సంఖ్యలో వచ్చిన అర్జీదారులతో సిబ్బందికి ఆన్లైన్ చేయడం గగనంగా మారింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర తోపులాటలు, నెట్టుకోవడంతో పాటు కొద్దిపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో అర్జీదారులు క్యూ లైన్లలో ఉన్నా మధ్యాహ్నం 2.30 గంటలు అయిందని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.ఓబులేసు ప్రకటించారు. జేసీ కల్పనా కుమారి, డీఆర్ఓ, ఇతర జిల్లా అధికారుల వద్దకు వెళ్లే వీలులేక అర్జీదారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆ తరువాత ఆర్డీఓ కౌంటర్లు, రెవెన్యూ కౌంటర్ల వద్దే అర్జీదారులు ఆగిపోయారు. జిల్లా అధికారులు వేదికపై లేకపోవడంతో వందలాది మంది అర్జీలు ఇవ్వకుండానే నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. మొత్తంమీద 513 అర్జీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో వచ్చాయి. అర్జీదారులు ఉండగానే వెళ్లిపోయిన జిల్లా అధికారులు నిరాశతో వెనుదిరిగిన అర్జీదారులు -
మెరుగైన వైద్యం అందించాలి
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు అన్నారు. జీజీహెచ్లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది నియామకంపై సోమవారం పార్టీ నాయకులతో కలిసి స్థానిక కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా వైద్యశాలను 100 పడకల నుంచి 350 పడకలకు పెంచి జీజీహెచ్గా మార్చారన్నారు. అప్పుడు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు 75 మంది వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించడంతో 700 నుంచి 800 మంది ఓపీ పేషంట్లు వైద్య సేవలు పొందారని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఓపీల సంఖ్య 200 నుంచి 250కి పడిపోయిందని, గతంలో 150 ఉన్న ఇన్పేషంట్ల సంఖ్య ప్రస్తుతం 40 నుంచి 50కి తగ్గిందంటే జీజీహెచ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, పేద మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో ప్రస్తుతం 9 మంది మాత్రమే వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారని, సెక్యూరిటీగార్డులు, శానిటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఒక్క జీఓతో సుమారు 53 మంది వైద్య సిబ్బందిని బదిలీ చేయడం అన్యాయమని విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న జీజీహెచ్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందకపోవడంపై తాము పోరాడుతుంటే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తమపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు, బురద జల్లుతున్నారని సైటెర్లు వేయడం అన్యాయమన్నారు. మేము సమస్యలపై పోరాడుతుంటే అధికారంలో ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి మాపై ప్రెస్మీట్లు పెట్టి సైటెర్లు వేయడం తగదన్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని, జీజీహెచ్లో వైద్య సిబ్బందిని నియమించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారుబాపన్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ సలీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్ జి.శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పి.చెంచిరెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, పోరుమామిళ్ల విజయలక్ష్మి, చెన్నలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అందని సూపర్స్పెషాలిటీ వైద్యం ప్రభుత్వ వైద్యంపై ఎమ్మెల్యే స్పందించాలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు -
నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి
కందుకూరు: ఓ ప్రైవేట్ స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యానికి ఎంతో భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థి నిండుప్రాణం బలైంది. ఆదివారం స్కూల్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి చివరకు కుంటలో శవమై తేలాడు. ఈ సంఘటన సోమవారం కందుకూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. బాధిత తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం...పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన నరాల మధుసూదన్రెడ్డి, భాగ్యలక్ష్మీ కుమారుడు వెంకట మణిదీప్రెడ్డి(14) పట్టణంలోని కోవూరు రోడ్డులోని విజ్ఞాన్ విహార్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ హాస్టల్లోనే ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో తండ్రికి ఫోన్ చేసిన మణిదీప్రెడ్డి డబ్బులు కావాలని అడిగాడు. నేను సోమవారం స్కూల్ దగ్గరికి వస్తాను, అప్పుడు ఇస్తానులే అని చెప్పిన మధుసూదన్రెడ్డి జాగ్రత్తగా ఉండాలంటూ కుమారుడికి సూచించాడు. ఇంతలోనే ముగ్గురు స్నేహితులు వచ్చి పార్టీ చేసుకుందాం బయటకు వెళ్దాం రా అని పిలవడంతో వారితో కలిసి మణిదీప్రెడ్డి బయటకు వెళ్లాడు. ఆ తరువాత నలుగురు కలిసి పట్టణంలోని 60అడుగుల రోడ్డు చివరలో ఉన్న కోమటికుంట వద్దకు వెళ్లారు. అక్కడ బిర్యానీతో పాటు, థమ్స్ఆప్ బాటిల్స్తో పార్టీ చేసుకున్నారు. అనంతరం ఈత కొట్టేందుకు అంటూ కోమటికుంటలోకి దిగారు. మణిదీప్రెడ్డి ఈతరాదని చెప్తున్నా తోటి స్నేహితుల బలవంతంగా భుజాలపై ఎక్కించుకుని కుంటలోకి దిగారు. ఈ క్రమంలో లోతైన ప్రదేశంలో మణిదీప్రెడ్డి ఒక్కసారిగా నీళ్లలోకి మునిగిపోయాడు. ఈ సంఘటనతో భయపడిపోయిన మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. స్కూల్కు కూడా వెళ్లకుండా నేరుగా ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో నీటికుంటలో మునిగిన మణిదీప్రెడ్డి కుంటలోనే ప్రాణాలు వదిలాడు. శవాన్ని వెతికి బయటకు తీసిన బంధువులు అయితే ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన మణిదీప్రెడ్డి తిరిగి హాస్టల్కు చేరకపోయినా స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తీరిగ్గా సోమవారం ఉదయం తండ్రి మధుసూదన్రెడ్డికి ఫోన్ చేసి మీ పిల్లవాడు ఏమైనా ఇంటికి వచ్చాడా అని హాస్టల్ వార్డెన్ అడగడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు హడావుడిగా కందుకూరు వచ్చారు. తీరా వచ్చిన తరువాత అసలు విషయం తెలిసింది. దీంతో బంధువులతో కలిసి ప్రమాదం జరిగిన కోమటికుంట వద్దకు చేరుకుని కుంట వద్ద కుమారుడి దుస్తులు చూసి బోరున విలపించారు. బంధువులు కొందరు నీటి కుంటలోకి దిగి వెతకడం ప్రారంభించడంతో మణిదీప్రెడ్డి మృతదేహం దొరికింది. దీంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి కన్నీటిపర్యంతమయ్యారు. ఆ కుటుంబం మొత్తాన్ని ఒక్కడే కుమారుడు కావడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే శవమై తేలాడంటూ బోరున విలపించారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపాటు ఈ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు, బంధువులు స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉన్న పిల్లవాడు బయటకు ఎలా వెళ్లాడు, ఒకవేళ వెళ్లినా తిరిగి హాస్టల్కు రాకపోతే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ప్రమాదం జరిగిందని తెలిసిన తరువాత కూడా కుంట వద్ద స్కూల్ యాజమాన్యం గానీ, సిబ్బంది గానీ రాకపోవడంపై మండిపడ్డారు. స్కూల్ బాగా లేదని చెప్తున్నా వినకుండా అక్కడే ఉంచి పిల్లాడిని పోగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. విజ్ఞాన్విహార్ స్కూల్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లి శవమై తేలిన విద్యార్థి ఆదివారం తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన మణిదీప్రెడ్డి సోమవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం కోమటికుంటలో వెతికి శవాన్ని బయటకు తీసుకున్న విద్యార్థి బంధువులు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పార్టీతో శివారు ప్రాంతానికి వెళ్లడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. బైక్పై వెళ్లిన విద్యార్థులు అక్కడే బిర్యానీ తినడంతో పాటు, థమ్స్బాటిల్లు, ప్లాస్టిక్ గ్లాసులు పడి ఉండడంతో, ఆ సమీపంలోనే రెండు మద్యం బాటిళ్లు దొరకడంపై మణిదీప్రెడ్డి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ప్రదేశంలోనే రెండు క్వార్టర్ బాటిళ్లు చిల్లచెట్లలో దొరికాయని, వీటిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని చెప్పారు. మద్యంతాగి బలవంతంగా తమ పిల్లవాడిని లాక్కెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘటనలో పాల్గొన్న మిగిలిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. తమ్ముళ్ల జేబులు నింపేస్తూ..
అనుమతులుండవు.. అడిగేందుకు ఏ శాఖ అధికారీ ముందుకు రాడు. ఫిర్యాదులు వస్తే నామ్కే వాస్తేగా దాడులతో మమ అనిపిస్తారు. అధికారం మాది.. అధికారులు మావాళ్లు.. ఏవరి వాటా వారికిస్తున్నాం.. మా ఇష్టం అన్నట్లు తెల్ల ఖనిజాన్ని తెలుగు తమ్ముళ్లు కొల్లగొడుతూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతంలోని తెల్లరాయికి మంచి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ అండగా.. తెలుగు తమ్ముళ్ల భాగస్వామ్యంతో అక్రమార్కులు భారీగా తెల్లరాయి తవ్వకాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.కనిగిరిరూరల్/పీసీపల్లి: మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు రూ.లక్షలవిలువైన సహజ వనరులను, ఖనిజ సంపదలను ఇష్టాను సారంగా దోచుకుంటున్నారు. ఆరు మండలాల్లో రెవె న్యూ, ఫారెస్ట్, కొండ పరివాహక శివారు ప్రాంత భూములను అడ్డాగా మార్చుకుని యంత్రాలతో రాత్రుల్లో తెల్లరాయిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్నిచోట్ల కొంత భూమిని లీజు అనుమతి పొంది.. వారికి ఇష్టమొచ్చినంత తవ్వుతుండగా, మరికొన్ని చోట్ల అసలు అనుమతి అనే మాట లేకుండానే అధికార పార్టీ అండే తమకు లైసెన్స్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక మండలాల్లో తెల్లరాయి ఉన్నా.. కనిగిరి ప్రాంతంలో ఉన్న తెల్లరాయి కి మంచి గిరాకీ ఉంది. ఇక్కడ గ్రేడ్ 1 రకం రాయి లభ్యమవుతుంది. దీంతో కనిగిరి నియోజకవర్గంలో తెల్లరాయి తవ్వకాలకే మైనింగ్ మాఫియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెవెన్యూ, అటవీ ప్రాంతం అధికంగా ఉండటం.. శివారు ప్రాంతం కావడంతో చెన్నై లాంటి ప్రాంతాలకు వైట్క్వార్జ్ (తెల్ల రాయిని)ని ఎక్కువగా తరలించే అవకాశం ఉండటంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు స్థానిక టీడీపీ నేతల అండతో ఇక్కడ మకాం వేసి అక్రమ దందా సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులుతెల్లరాయి అక్రమ తవ్వకాల వ్యవహారం అధికారులకు తెలియదంటే పొరపాటే. అధికార పార్టీ నేతల ఒత్తిడి కొంత ఉన్నా.. అక్రమార్జనలో తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన కొల్లగొట్టిన తెల్ల ఖనిజ ఆదాయంలో అధికారులకు నెలవారీ నజరానాలు అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అధికారుల సలహాలు, సూచనలతో స్టాక్ పాయింట్లకు, తవ్వకాలకు కొంత భూములను అనుమతి తీసుకుని వాటిని అధికారులకు చూపి స్తూ ఇతర రెవెన్యూ, ఫారెస్ట్ భూములుగా నిర్ధారణ కాని, హద్దులు తేల్చని ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు. రాత్రుళ్లు పొక్లైన్లతో, జేసీబీలతో తవ్వకాలు చేసి అనుమతి పొందిన స్టాక్ పాయింట్ ప్రదేశంలో వేసుకుని తెల్లవారిన తర్వాత తరలిస్తున్నారు. ఇది ఒకరకం దోపిడీ కాగా మరోరకం దోపిడీ అయితే పీసీపల్లి కేంద్రంగా సాగుతోంది. ఇక్కడ అనుమతులుండవు.. అధికారులు రారు.. తమ్ముళ్లదే ఇష్టారాజ్యం. అటవీ, రెవెన్యూ ఇలా ఏ భూముల్లో అయినా రాత్రింబవళ్లు తవ్వకాలు జోరుగా చేస్తుంటారు. ఒక్కో లారీకి 30 నుంచి 40 టన్ను ల ఎగుమతి జరగ్గా.. టన్నుకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని తెలిసింది. వారానికి నాలుగు లారీల చొప్పున తెల్లరాయి తరలిస్తున్నాయి. పీసీపల్లి అడ్డాగా.. పచ్చనేతల చీకటి దందా పీసీపల్లి మండలంలో మైనింగ్ మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. మండలంలోని అధికార పార్టీ మాజీ ఎంపీటీసీ కుమారుడు నేరేడుపల్లి, లక్ష్మక్కపల్లిలో గుంటూరు లింగన్నపాలెం, అడవిలోపల్లి, మెట్లవారిపాలెం, గుంటుపల్లి, తురకపల్లి, మురిగమ్మి గ్రామాల్లో అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు. మురగమ్మిలో 20 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూములు, నేరేడుపల్లిలో 25 ఎకరాల్లో, గుంటుపల్లిలో 10 ఎకరాల్లో, తురకపల్లిలో 15 ఎకరాల్లో, లక్ష్మక్కపల్లిలో (మాలకొండకు పోయే దారిలో) 20 ఎకరాల్లో, లింగన్నపాలెంలో 5 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూముల్లో నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు స్థానిక అధికార పార్టీ నేతల అండతో జోరుగా తవ్వకాలు చేస్తున్నారు.గడిచిన కాలంలో ఒక్క మురగమ్మి ప్రాంతంలోనే మైనింగ్ శాఖ అధికారులు ఐదు సార్లు దాడులు చేసి లారీలను, జేసీబీలను, తెల్లరాయిని పట్టుకున్నారు. అయినా తెల్లరాయి దందాను తమ్ముళ్లు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పీసీపల్లి నుంచి నెల రోజుల వ్యవధిలో సుమారు ఒక వెయ్యి టన్నుల మేర అక్రమార్కులు గ్రేజింగ్, అటవీ పోరంబోకు భూముల్లో తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లు అంచనా. అనుమతి (లీజు) పొందిన ప్రదేశంలో తవ్వకాలు జరిపినట్లు రికార్డులు చూపిస్తూ.. పది శాతం చలానా చెల్లించి.. 100 శాతం అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.ఫిర్యాదులు చేస్తేనే కదలికమైనింగ్ అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు తెల్లరాయి ఖనిజాల తవ్వకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఆ వైపు అడుగులు వేసిన దాఖలాలు లేవు. మైనింగ్ శాఖ రాష్ట్ర అధికారులకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. నామ్కే వాస్తే రెండు నెలలకొకసారి మేమున్నాం అంటూ ఒకటి రెండు కేసులు పెట్టి మమ అనిపిస్తారు. కొంతకాలం క్రితం కనిగిరి, వెలిగండ్ల శివారు ప్రాంతాల్లో చీర్లదిన్నె, నాగిరెడ్డి కొండల మధ్య ఫారెస్ట్ బీట్ భూముల్లో టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్ తవ్వుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. అయితే సుమారు 10 టన్నుల రాయి స్టాక్ మాత్రమే దొరకడంతో రూ.1.30 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిసింది. గత గురువారం రాత్రి మురిగమ్మి కొండ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయిని మైనింగ్, విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఓ లారీ, జేసీబీ సీజ్ చేశారు. బల్లిపల్లి ప్రాంతంలో తెల్లరాయి తవ్వకం విషయంలో కూటమి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం.తెల్లరాయి తవ్వకం ప్రాంతాలు ఇవే..కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి మండలం బల్లిపల్లి, అడ్డరోడ్డు, చీర్లదిన్నె, బాల వెంకటాపురం, వెలిగండ్ల శివారు ప్రాంతాలు, నాగిరెడ్డిపల్లి, పీïÜç³ల్లి మండలంలో గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, మురిగమ్మి, పామూరు మండలం మార్కొండాపురం,నాసికాత్రయంబకం తది తర ప్రాంతాల్లో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. -
ఆటపాటలతో అలరించిన బాలోత్సవం
ఒంగోలు టౌన్: నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండో రోజు ఆదివారం బాలోత్సవం చిన్నారుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా నలుమూలల నుంచి సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పండుగకు తరలివచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో అంశంలో తన సత్తా చాటారు. ఏకపాత్రాభినయనంలో అద్భుతంగా నటించారు. సంప్రదాయ కోలాటంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. జానపద నృత్యాలతో అదరగొట్టారు. సీ్త్ర విద్య కోసం అవిరళ కృషి చేసిన సావిత్రిబాయి, పూలే, ఫాతిమా షేక్ వంటి మహనీయులను ఉద్దేశించి ‘మరవ వద్దురా సమాజమా మహనీయులను’ అంటూ ప్రదర్శించిన నృత్యం ఆహుతులను ఆలోచింపజేసింది. మట్టితో చేసిన బొమ్మలను చూడడానికి ఆసక్తి కనబరిచారు. సమాజంలో మూఢ విశ్వాసాల వలన జరుగుతున్న నష్టాలు, కష్టాల గురించి వివరిస్తూ మెడలో పుర్రె బొమ్మలతో తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్ధిని ఐ.భాగ్యశ్రీ చేసిన ప్రదర్శనకు ప్రశంసలు దక్కాయి. నూతన ఆవిష్కరణలతో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన అబ్బురపరిచింది. ఏక కాలంలో 8 వేదికలపై జరిగిన పలు ప్రదర్శనలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 200 మంది ఎన్సీసీ వాలంటీర్లు, వంద మంది ఉపాధ్యాయులు సేవలందించారు. బాలల ఉజ్వల భవితకు బాలోత్సవం బాటలు... బాలల ఉజ్వల భవితకు బాలోత్సవం బంగారు బాటలు వేస్తుందని వక్తలు చెప్పారు. మొబైల్ ఫోన్ల మాయలోపడి కొట్టుకుపోతున్న విద్యార్థులకు చక్కటి దిశానిర్దేశం చేసే బాలోత్సవం జిల్లాలోని అన్నీ ప్రాంతాలలో నిర్వహించాల్సిన అవసరముందని అతిథులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులను ఒక వేదిక మీదకు చేర్చిన నిర్వాహకుల కృషిని అభినందించారు. టంగుటూరు మండల విద్యాశాఖాధికారి టి.బాలాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మేయర్ గంగాడ సుజాత, బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు ఏవీ రమణా రెడ్డి, కమిటీ ప్రతినిధులు బండారు లక్ష్మి నారాయణ, డి.వీరాజంనేయులు, రవి, అబ్దుల్ హై, జ్యోతి, జయప్రకాష్, షేక్ ఖాజా హుసేన్, ఉమా మహేశ్వరి, భాస్కర్, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. 4 వేల మందికి పైగా విద్యార్థుల సందడి కోలాటం, జానపద నృత్యాలు, సైన్స్ ప్రదర్శనల, మట్టిబొమ్మలతో ఔరా అనిపించిన చిన్నారులు -
సింగరాయకొండలో చోరీ
● రూ.3.50 లక్షల విలువైన సొత్తు అపహరణ సింగరాయకొండ: మండల కేంద్రమైన శ్రీరాంనగర్ వడ్డెర కాలనీలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పంచాయతీ కార్మికుడు తన్నీరు శివనాగరాజు నివాసంలో దుండగులు రూ.3.50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు వెండి సామగ్రి చోరీ చేశారు. బాధితుడు శివనాగరాజు కథనం ప్రకారం.. శివనాగరాజు బంధువులు బుంగబావి సెంటర్లో నివాసముంటున్నారు. వారికి అనారోగ్యంగా ఉండటంతో చూసేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం 6 గంటలకు రాగా కిటికీ తలుపులు తీసి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా ఇంటి నిర్మాణానికి బీరువాలో ఉంచిన రూ.1.50 లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారు ఆభరణాలు, రూ.లక్ష విలువైన వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
మార్కాపురం టౌన్: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని కోరారు. గుడ్లూరు: ఇండో సోలార్ కంపెనీ పైపులు దగ్ధమైన ఘటన ఆదివారం గుడ్లూరు మండలంలోని చేవూరు చెరువు వద్ద జరిగింది. 150 మీటర్ల పొడవైన పైపులు కాలిపోయాయి. వాటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆ మేరకు గుడ్లూరు పోలీస్స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు పైపులను తగులబెట్టారని ఫిర్యాదు చేశారు. కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, సీఐ నరేశ్ కుమార్, గుడ్లూరు ఎస్సై ఐవీ వెంకట్రావు చేవూరు చెరువు వద్దకు చేరుకొని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు. పెరిగిన భక్తుల రద్దీ ● శ్రీశైలానికి భారీగా తరలివెళుతున్న యాత్రికులు పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి గాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రానికి భారీగా తరలివచ్చే భక్తులతో ఆదివారం మండల కేంద్రం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భారీగా తరలి రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, గంటూరు, కర్నూలు ప్రాంతాల నుంచి మాలలు ధరించిన శివస్వాములు శ్రీశైలానికి అధికంగా తరలివచ్చారు. దీంతో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ రుసుం వసూలు చేయడంలో అంతరాయంతో శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్పోస్టు వద్ద ట్రాఫిక్కు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఒంగోలు టౌన్: బైక్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరంలోని చంద్రయ్య కాలనీకి చెందిన వల్లెపు దుర్గా ప్రసాద్, మారుతీనగర్కు చెందిన ఇట్లా సందీప్ స్నేహితులు. ఆదివారం ఇద్దరు స్నేహితులు కలిసి తిరిగారు. సందీప్ను ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు బయలుదేరారు. పాత వర్మ హోటల్ వద్దకు రాగానే వేగంగా వచ్చిన మోటారు బైకు ఢీకొట్టింది. దీంతో సందీప్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దుర్గా ప్రసాద్కు స్వల్ప గాయలయ్యాయి. ఈ మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టంగుటూరు: ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలోఅదుపుతప్పి క్రేన్ బోల్తా పడింది. ఈ సంఘటన మండలంలోని మల్లవరప్పాడు సమీపంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..టంగుటూరు మండలం కందులూరు–మల్లవరపాడు గ్రామం దారిలో మల్లవరప్పాడు గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై మద్యం సేవించి వ్యక్తి వేగంగా వస్తుండగా ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న వంట కాలవలోకి క్రేన్ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
మార్కాపురం రూరల్: ఈతకు వెళ్లి నీటిలో మునిగి 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని రాయవరం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీకి చెందిన ఏసుబాబు (15) ఆదివారం సెలవు రోజు కావడంతో తన స్నేహితులైన బత్తుల జాన్ వెస్లీ, బూతపాటి అభిరామ్లతో కలిసి రాయవరం సమీపంలో హైవేరోడ్డు పక్కన ఉన్న పలకల క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడ ఈతకొట్టేందుకు గుంతలో దిగగా..నీళ్లు ఎక్కువ లోతు ఉండటంతో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటింది. మార్కాపురం సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై వేమన ఈతగాళ్లతో గుంతలో గాలించారు. రాత్రి 8 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తల్లిదండ్రులు ప్రభాకర్, అల్లూరమ్మలు బేల్దారి పనులు చేసుకుంటూ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటూ కుమారుడిని చదివించుకుంటున్నారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
పామూరు: మండలంలోని చింతపాలెంలో రైతు కేతు రాధాకృష్ణారెడ్డికి చెందిన పొగాకు బ్యార్నీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పొగాకు క్యూరింగ్ జరుగుతున్న సమయంలో ఆకు మొద్దు గొట్టడంపై పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మర్రిపూడి: మండలంలోని ధర్మవరంలో ఆదివారం పొగాకు బ్యారెన్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మార్తాల నరసింహారెడ్డికి చెందిన పొగాకు బ్యారెన్లో దాదాపు 1350 పచ్చాకు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా ఆకు మొద్దు గొట్టంపై పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. కొండపి నుంచి అగ్ని మాపక సిబ్బంది వచ్చిసరికి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 1350 అల్లుడు కర్ర, టైర్లు, గొట్టాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో రూ.3.50 లక్షల ఆస్తినష్టం సంభవించిందని బాధితుడు వాపోయాడు. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
ఒంగోలు సిటీ: ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రూ.35 వేల కోట్లను ప్రస్తుత బడ్జెట్లో కేటాయించేలా కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి కోరారు. ఒంగోలు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం బూచేపల్లిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు రూ.35 వేల కోట్లకు చేరాయన్నారు. మంజూరు కావాల్సిన వేతన సవరణ, 4 విడతల డీఏ, సరెండర్ లీవులు తదితర ప్రయోజనాల అంచనా కొన్ని వేల రూ.కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపు ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా మన సంఘం ‘బాకీకి భూమి’ అనే ప్రతిపాదనను అటు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ధిష్టమైన స్పందన లేనందున ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఆవేదన నెలకొందన్నారు. మరోపక్క వంది మాగదులుగా తయారైన భజన సంఘాలు ప్రభుత్వంతో చర్చించేశాం, వేల కోట్ల బకాయిల చెల్లింపులు అయిపోయాయి, వరాల జల్లులు కురిసిపోయాయి అంటూ యథావిధిగా తమ భజన కొనసాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో, ఉద్యోగులకు ఇప్పటికే మంజూరు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలు, అలాగే మంజూరు చేయాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, నాలుగు విడతల డీఎలు, మధ్యంతర భృతి తదితర అంశాలకు ఈ బడ్జెట్లోనే నిర్ధిష్టమైన కేటాయింపులు చూపాలన్నారు. ప్రత్యామ్నాయ పరిష్కారంపై ప్రభుత్వం తమ విధాన ప్రకటనను బడ్జెట్ ద్వారా తెలియపరచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వరకుమార్, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మహిళా విభాగం చైర్మన్ ప్రసన్న, ఒంగోలు సెక్రటరీ శ్రీనివాస యాదవ్. యేసు రత్నం, అంకబాబు, వంశీకృష్ణ, చంచారావు, హరిబాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అనుమతులుండవు.. అడిగేందుకు ఏ శాఖ అధికారీ ముందుకు రాడు. ఫిర్యాదులు వస్తే నామ్కే వాస్తేగా దాడులతో మమ అనిపిస్తారు. అధికారం మాది.. అధికారులు మావాళ్లు.. ఏవరి వాటా వారికిస్తున్నాం.. మా ఇష్టం అన్నట్లు తెల్ల ఖనిజాన్ని తెలుగు తమ్ముళ్లు కొల్లగొడుతూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ప్రాంతంలోని తెల్లరాయికి మంచి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ అండగా.. తెలుగు తమ్ముళ్ల భాగస్వామ్యంతో అక్రమార్కులు భారీగా తెల్లరాయి తవ్వకాలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. మైనింగ్ అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు తెల్లరాయి ఖనిజాల తవ్వకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఆ వైపు అడుగులు వేసిన దాఖలాలు లేవు. మైనింగ్ శాఖ రాష్ట్ర అధికారులకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. నామ్కే వాస్తే రెండు నెలలకొకసారి మేమున్నాం అంటూ ఒకటి రెండు కేసులు పెట్టి మమ అనిపిస్తారు. కొంతకాలం క్రితం కనిగిరి, వెలిగండ్ల శివారు ప్రాంతాల్లో చీర్లదిన్నె, నాగిరెడ్డి కొండల మధ్య ఫారెస్ట్ బీట్ భూముల్లో టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్ తవ్వుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. అయితే సుమారు 10 టన్నుల రాయి స్టాక్ మాత్రమే దొరకడంతో రూ.1.30 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిసింది. గత గురువారం రాత్రి మురిగమ్మి కొండ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయిని మైనింగ్, విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఓ లారీ, జేసీబీ సీజ్ చేశారు. బల్లిపల్లి ప్రాంతంలో తెల్లరాయి తవ్వకం విషయంలో కూటమి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. కనిగిరిరూరల్/పీసీపల్లి: కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు రూ.లక్షల విలువైన సహజ వనరులను, ఖనిజ సంపదలను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ఆరు మండలాల్లో రెవెన్యూ, ఫారెస్ట్, కొండ పరివాహక శివారు ప్రాంత భూములను అడ్డాగా మార్చుకుని యంత్రాలతో రాత్రుల్లో తెల్లరాయిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్ని చోట్ల కొంత భూమిని లీజు అనుమతి పొంది.. వారికి ఇష్టమొచ్చినంత తవ్వుతుండగా, మరికొన్ని చోట్ల అసలు అనుమతి అనే మాట లేకుండానే అధికార పార్టీ అండే తమకు లైసెన్స్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక మండలాల్లో తెల్లరాయి ఉన్నా.. కనిగిరి ప్రాంతంలో ఉన్న తెల్లరాయికి మంచి గిరాకీ ఉంది. ఇక్కడ గ్రేడ్ 1 రకం రాయి లభ్యమవుతుంది. దీంతో కనిగిరి నియోజకవర్గంలో తెల్లరాయి తవ్వకాలకే మైనింగ్ మాఫియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెవెన్యూ, అటవీ ప్రాంతం అధికంగా ఉండటం.. శివారు ప్రాంతం కావడంతో చైన్నె లాంటి ప్రాంతాలకు వైట్ క్వార్జ్ (తెల్ల రాయిని)ని ఎక్కువగా తరలించే అవకాశం ఉండటంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు స్థానిక టీడీపీ నేతల అండతో ఇక్కడ మకాం వేసి అక్రమ దందా సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు.. తెల్లరాయి అక్రమ తవ్వకాల వ్యవహారం అధికారులకు తెలియదంటే పొరపాటే. అధికార పార్టీ నేతల ఒత్తిడి కొంత ఉన్నా.. అక్రమార్జనలో తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన కొల్లగొట్టిన తెల్ల ఖనిజ ఆదాయంలో అధికారులకు నెలవారీ నజరానాలు అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అధికారుల సలహాలు, సూచనలతో స్టాక్ పాయింట్లకు, తవ్వకాలకు కొంత భూములను అనుమతి తీసుకుని వాటిని అధికారులకు చూపిస్తూ ఇతర రెవెన్యూ, ఫారెస్ట్ భూములుగా నిర్ధారణ కాని, హద్దులు తేల్చని ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు. రాత్రుళ్లు పొకై ్లన్లతో, జేసీబీలతో తవ్వకాలు చేసి అనుమతి పొందిన స్టాక్ పాయింట్ ప్రదేశంలో వేసుకుని తెల్లవారిన తర్వాత తరలిస్తున్నారు. ఇది ఒకరకం దోపిడీ కాగా మరో రకం దోపిడీ అయితే పీసీపల్లి కేంద్రంగా సాగుతోంది. ఇక్కడ అనుమతులుండవు.. అధికారులు రారు.. తమ్ముళ్లదే ఇష్టారాజ్యం. అటవీ, రెవెన్యూ ఇలా ఏ భూముల్లో అయినా రాత్రింబవళ్లు తవ్వకాలు జోరుగా చేస్తుంటారు. ఒక్కో లారీకి 30 నుంచి 40 టన్నుల ఎగుమతి జరగ్గా.. టన్నుకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని తెలిసింది. వారానికి నాలుగు లారీల చొప్పున తెల్లరాయి తరలిస్తున్నాయి. పీసీపల్లి అడ్డాగా.. పచ్చ నేతల చీకటి దందా.. పీసీపల్లి మండలంలో మైనింగ్ మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. మండలంలోని అధికార పార్టీ మాజీ ఎంపీటీసీ కుమారుడు నేరేడుపల్లి, లక్ష్మక్కపల్లిలో గుంటూరు లింగన్నపాలెం, అడవిలోపల్లి, మెట్లవారిపాలెం, గుంటుపల్లి, తురకపల్లి, మురిగమ్మి గ్రామాల్లో అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు. మురగమ్మిలో 20 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూములు, నేరేడుపల్లిలో 25 ఎకరాల్లో, గుంటుపల్లిలో 10 ఎకరాల్లో, తురకపల్లిలో 15 ఎకరాల్లో, లక్ష్మక్కపల్లిలో (మాలకొండకు పోయే దారిలో) 20 ఎకరాల్లో, లింగన్నపాలెంలో 5 ఎకరాల్లో అటవీ, రెవెన్యూ, కొండపోరంబోకు భూముల్లో నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు స్థానిక అధికార పార్టీ నేతల అండతో జోరుగా తవ్వకాలు చేస్తున్నారు. గడిచిన కాలంలో ఒక్క మురగమ్మి ప్రాంతంలోనే మైనింగ్ శాఖ అధికారులు ఐదు సార్లు దాడులు చేసి లారీలను, జేసీబీలను, తెల్లరాయిని పట్టుకున్నారు. అయినా తెల్లరాయి దందాను తమ్ముళ్లు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పీసీపల్లి నుంచి నెల రోజుల వ్యవధిలో సుమారు ఒక వెయ్యి టన్నుల మేర అక్రమార్కులు గ్రేజింగ్, అటవీ పోరంబోకు భూముల్లో తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లు అంచనా. అనుమతి (లీజు) పొందిన ప్రదేశంలో తవ్వకాలు జరిపినట్లు రికార్డులు చూపిస్తూ.. పది శాతం చలానా చెల్లించి.. 100 శాతం అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. -
మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం
మార్కాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్కాపురంలో మెడికల్ కాలేజీని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపేసి పీపీపీ విధానంలోకి తీసుకుని రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై సుమారు 3 నెలల పాటు ఉద్యమాలు కూడా చేశామని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్పారు. మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పలు మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి పలు చోట్ల పూర్తిచేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పీపీపీ విధానం తెచ్చారని, దీన్ని తాము వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడంతో నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జీజీహెచ్లో సుమారు 75 మంది వైద్యులను నియమించగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రస్తుతం జీజీహెచ్లో 9 నుంచి 15 మంది మాత్రమే ఉండటం శోచనీయమన్నారు. వైద్యం కూడా ప్రైవేటుపరం చేయడంతో పేద ప్రజలకు అందని ద్రాక్షలాగా మారిందన్నారు. నాణ్యమైన వైద్యం కోసం మళ్లీ ఒంగోలు, గుంటూరుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీజీహెచ్లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ సమస్యపై పోరాటం చేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయంపై ప్రజలకు వివరించాలని తెలిపారు. -
అపుస్మా జిల్లా అధ్యక్షునిగా మలికార్జునరెడ్డి
మార్కాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (అపుస్మా) మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా గొట్టం మలికార్జునరెడ్డిని ఎన్నుకున్నారు. స్థానిక కమలా స్కూల్లో ఆదివారం జిల్లా నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా పీ సుధీర్కుమార్రెడ్డి, కోశాధికారిగా ఏ వెంకటేశ్వరరెడ్డి, గౌరవ అధ్యక్షునిగా జే రత్నంబాబు, ఉపాధ్యక్షులుగా ఎస్ పిచ్చిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కే రంగయ్య, కార్యవర్గ సభ్యులుగా పీ మణి చైతన్య, ఆర్ గుంటయ్య, యం సాలీగ్రాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మాధవరావు, గౌరవ అధ్యక్షుడు బీ హనుమంతరావు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి సుమారు 60 మంది ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు హాజరయ్యారు. ● 3.3 సెం.మీ అతి సూక్ష్మ వరల్డ్ కప్ తయారీ చీరాల: 2026 అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ తయారు చేశారు. క్రికెట్లో ఇంగ్లాడ్ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పు తయారీలో 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లిగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి వరల్డ్కప్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. -
లడ్డూపై బాబు అండ్ కో కొత్త డ్రామా
ఒంగోలు సిటీ: పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు అండ్ కో కొత్త డ్రామాలకు తెరసిందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక వచ్చే వరకూ హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీల్లో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు. సిట్ నివేదిక వచ్చాక ప్రసాదంలో బాత్రూంలకు వినియోగించే రసాయనాలు వాడారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ తిన్న ఎంత మంది భక్తులు అనారోగ్యానికి గురయ్యారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం తగదని ఆయన ఖండించారు. సిట్ కోర్టుకు అందించిన నివేదికలో జంతుకొవ్వులు కలవలేదని పేర్కొందని చెప్పారు. 03–08–22లో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోలేబాబా, వైష్ణవి తదితర సంస్థలు సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్ను ల్యాబ్కు పంపిస్తే జంతుకొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని నివేదికలో ఎక్కడా చెప్పలేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం, వైఎస్ జగన్ మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డూపై తప్పుడు ప్రచారానికి దిగారని బూచేపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ సమర్పించిన నివేదికలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 06–07–24 నుంచి 12–07–24 నుంచి సేకరించిన శాంపిల్స్లో కూడా ఫిష్ ఆయిల్ కలవలేదని వచ్చిందన్నారు. దీనిని బట్టి ఎక్కడా జంతుకొవ్వు, పంది కొవ్వు కలవలేదని స్పష్టమవుతోందన్నారు. సిట్ నివేదిక బహిరంగమయ్యాక చంద్రబాబు మాటమార్చారని, బాత్రూంలకు వినియోగించే రసాయనాలు వాడారంటూ అసత్య ప్రచారానికి తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీ ఫాంల్లో క్లీనింగ్ కోసం వినియోగించే రసాయనాలు లడ్డూలో కలిసిందని చెప్పడం రాజకీయ కక్షలో భాగమేనన్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏనాడూ తన రాజకీయ స్వార్థం కోసం దేవుళ్లను వాడుకోలేదన్నారు. జగన్ నుంచి హిందువులను దూరం చేసేలా కుట్రలకు దిగుతున్నారన్నారు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వే రిపోర్టులు వస్తుండడంతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ విషయంలో ప్రజలు తన మాటలు నమ్మడంలేదని గుర్తించి జనసేన, బీజేపీ నాయకులతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. పవన్ రోజుకో మతం జపం.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజుకో మతాన్ని జపిస్తున్నారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తన తండ్రి దేవుడ్ని పూజించరని, దేవుడి దీపంతో సిగరెట్ వెలిగించేవారని చెప్పారని గుర్తు చేశారు. నేడు సనాతన ధర్మం పేరుతో అధర్మాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, దేవుడికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు సైతం తన మాటల్లో ఎక్కడా జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్పలేదన్నారు. కమిటీలు ఎందుకు: దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్ ఇచ్చిన నివేదికను కాదని ఇప్పుడు తన సొంత మనుషులతో వేసిన కమిటీ ఎందుకని బూచేపల్లి ప్రశ్నించారు. మీ పార్టీ నాయకులతో వేసిన కమిటీ మీకు అనుకూలంగా నివేదిక ఇస్తుందన్న విషయం అందరికీ తెలుసన్నారు. మీకు అనుకూలంగా మాట్లాడలేదని టీటీడీ ఈఓ అశోక్ సింఘాల్ను బదిలీ చేశారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి గారూ.. మరిచిపోయారా..?
అద్దంకి రూరల్: అద్దంకి పట్టణంలో 50 వేల జనాభా, మండలంలో మరో 50 వేల మంది, నాలుగైదు మండలాల నుంచి అద్దంకికి వచ్చే వారితో కలుపుకొని 2 లక్షలకు పైనే జనాభాకు పట్టణంలోని సీహెచ్సీ వైద్యశాలే దిక్కు. పెరుగుతున్న జనాభాకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వైద్యశాల స్థాయి పెరగలేదు. దీంతో చిన్న చిన్న వైద్య సేవలు తప్ప పెద్ద పెద్ద వైద్య సేవలకు ఒంగోలు, గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు పరుగులు తీయాల్సిన పరిస్థతి. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న రవికుమార్ పట్టణానికి వంద పడకల వైద్యశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా వంద పడకల వైద్యశాల హామీని పూర్తిగా విస్మరించారు. ఒక్కసారి కూడా దానిపై సమీక్షించడం గానీ, భవిష్యత్లోనైనా చేద్దామని ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వంద పడకల వైద్యశాల తేవాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చింతలపూడి అశోక్కుమార్ నడుం బిగించారు. మీరు తెస్తారా? లేక మేము వచ్చిన తరువాత వంద పడకల వైద్యశాల తెచ్చుకోమంటారా? అనే సవాల్ విసురుతున్నారు. ఉన్నతస్థాయి వైద్యం కరువు.. అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజలకు ఎలాంటి రోగాలు వచ్చిన అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు తమ స్థాయిలో ప్రాథమిక వైద్యం చేస్తారు. పెద్ద పెద్ద జబ్బులు అయితే వెంటనే ఒంగోలుకు లేదా మరో నగరానికి సిఫార్సు చేస్తారు. సీహెచ్సీలో నిపుణులైన వైద్యులు ఉన్నా పరికరాలు, వివిధ విభాగాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో వంద పడకల వైద్యశాల అవసరం అద్దంకికి ఎంతైనా అవసరం. అద్దంకి హైవేపై తరుచూ ప్రమాదాలు అద్దంకిలో ఉన్న హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చిన వారికి ప్రాథమిక వైద్యం చేయడం తప్ప వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు లేదా గుంటూరు సిఫార్సు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందక మార్గమధ్యంలోనే మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అద్దంకిలోనే 100 పడకల వైద్యశాల ఉంటే ఎంతో మంది ప్రాణాలతో బయటపడేవారు. ఇక్కడ ప్రసూతి, జ్వరాలు, జలుబు, చిన్నపిల్లలు వైద్యం వంటి సాధారణ విభాగాలు మినహా, ఇతర ఆధునికమైన పరికరాలు, వైద్యం అందే స్థాయి ఈ వైద్యశాలకు లేదు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో మంత్రి గొట్టిపాటి హామీ ఇవ్వడంతో అందరూ సంతోషించారు. ఆయన ఎమ్మెల్యే నుంచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా అద్దంకికి 100 పడకల వైద్యశాల మంజూరు పట్ల అలివిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. వైద్యశాల సాధనకు ఉద్యమం అద్దంకిలో 100 పడకల వైద్యశాల సాధనకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ అశోక్కుమార్ నడుం బిగించారు. విద్య, వైద్యం అద్దంకి ప్రజలకు అందనంత దూరం చేసిన ప్రజాప్రతినిధులు అలసత్వాన్ని ఖండిస్తూ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అది చేస్తాం..ఇది చేస్తాం..అంటూ ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం..అధికారం రాగానే ఆ హామీని, ప్రజలను విస్మరించడం నేతలకు రివాజుగా మారింది. అద్దంకికి 100 పడకల వైద్యశాల కూడా ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఎన్నికల సమయంలో ఆర్భాటంగా హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్..18 నెలల్లో ఆ హామీని పూర్తిగా మరిచిపోయారని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో అద్దంకిలో 100 పడకల ఆస్పత్రికి గొట్టిపాటి హామీ 18 నెలలైనా ఆ ఊసే ఎత్తని వైనం సీహెచ్సీ స్థాయికే పరిమితమైన వైద్యశాల మెరుగైన వైద్యానికి నగరాలకు తప్పని పరుగులు మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు 100 పడకల వైద్యశాల సాధనకు నడుం బిగించిన వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ -
ఆలయంలో చోరీ
కనిగిరిరూరల్: మండలంలోని నేలటూరి గొల్లపల్లి కాటంరాజు గంగమ్మ తల్లి గుడిలో ఆదివారం చోరీ జరిగింది. దేవస్థాన కమిటీ సభ్యుల వివరాల మేరకు..గుర్తు తెలియని దుండగులు తాళం పగులకొట్టి గుడిలోకి ప్రవేశించి అమ్మవారి వెండి కళ్లు రాగి గంటలతో పాటు హుండీ పగులకొట్టి అందులోని సుమారు రూ 20 వేల నగదు అపహరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిటీ సభ్యుడు పి.మధు తెలిపారు. కనిగిరిరూరల్: కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల 1980–82 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 46 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒకచోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎక్కడెక్కడో వివిధ హోదాల్లో, వ్యాపార, విద్యా రంగాల్లో స్థిరపడిన వారంతా దాదాపు 150 మంది ఒకచోట చేశారు. కార్య నిర్వాహకులు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, బొగ్గరపు సుందరరాజ, కేవీఎన్రాజు, వసంతకుమారి, పీవీఎస్ మురళీధర్, కేవీ రమణారెడ్డి, అబ్దుల్ ఖాదర్, బీవీ నారాయణ, కొప్పోలు ప్రభాకర్, భారతీ, జయరామిరెడ్డి, గోపి కిషోర్, జీవి లక్ష్మణ్ కుమార్, బచ్చలి భాస్కర్, ఒమేగా రామిరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, ఉషా, పద్మా, రత్నాకర్రెడ్డి, మైమున్నీసా, వి.భక్తవత్సలం పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి అధ్యాపకులు ఓబయ్య, జాకబ్లను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వారు తమ జీవిత అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకొని మనసారా నవ్వుకున్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.అనంతరం పూర్వ విద్యార్థుల కమిటీ కళాశాల అభివృద్ధికి తమ వంతు ఆర్థికసాయాన్ని ప్రకటించారు. భవిష్యత్లో సేవాహిత, సహాయ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్, పాఠశాల హెచ్ఎం రమణారెడ్డి, హెచ్ఎంలు జి.సంజివీ, పల్లా కోటిరత్నం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
కడవరకు కార్మిక నగర్లోనే..
ఒంగోలు టౌన్: ‘‘నగరంలో తలదాచుకునేందుకు చారెడు జాగా లేకపోవడంతో ఇక్కడ రేకుల షెడ్డులు వేసుకొని జీవిస్తున్నాం... పది పన్నెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం..ఇప్పుడు అర్ధంతరంగా మా ఇళ్లు పడగొట్టి బయటకు వెళ్లగొడితే మా పరిస్థితి ఏమిటి..ఎక్కడికి వెళ్లాలి..అందుకే చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటాం.. ఈ మట్టిలోనే చస్తామని’’ ఒంగోలులోని కార్మిక నగర్ కాలనీ నిర్వాసితులు ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన చెరుకూరి లక్ష్మి మాట్లాడుతూ ఏరోజుకారోజు పనులు చేసుకొని బతికేవాళ్లం, నగరంలో అద్దెలు చెల్లించే స్థోమత లేక, ఊరిబయట ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డులు వేసుకొని బతుకీడుస్తున్నాం. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, మా ఇళ్లు కూల్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కొందరు వ్యక్తులు నకిలీ రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకొచ్చి ఇళ్లు ఖాళీ చేయించాలని ప్రయత్నించారు, 2012, 2016లో తాము కోర్టుకు వెళితే తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఒంగోలుకు చెందిన అల్లాబక్షు, ఉన్నం నరేష్, కోడే శ్రీనివాసరావు, విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, పాడిబండ్ల కృష్ణ, ప్రవీణ్ అనే వ్యక్తులు కానిస్టేబుళ్లను తీసుకొచ్చి రాత్రి పూట దౌర్జన్యంగా ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. సామానులు సర్దుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని వాపోయారు. కార్మిక నగర్ నిర్వాసితులకు సీపీఎం మద్దతు తెలుపుతున్నట్లు నగర కమిటీ సభ్యుడు తంబి శ్రీనివాసరావు ప్రకటించారు. ముక్తినూతలపాడు సర్వే నంబర్ 186లోని కార్మిక నగర్ నిర్వాసితులకు చట్టపరంగా రక్షణ కల్పించాలని కోరారు. నిరుపేదలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కల్పనా కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ జరపాలని ఆమె రెవెన్యూ అధికారులకు ఆదేశించారని సీపీఎం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కాలనీకి చెందిన కారాణి దుర్గ, ఎస్కే సైదులు, బెల్లంకొండ వెంకట శేషయ్య, గరికపూడి సుధాకర్, అశోక్, పెదసింగు నాంచారమ్మ, మన్నేపల్లి ప్రమీల, చొప్పర సువార్తమ్మ పాల్గొన్నారు. -
గురుకుల విద్యాలయాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు సబర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల పోస్టర్ను శనివారం కలెక్టర్ పి.రాజాబాబు ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి జూనియర్ ఇంటర్ వరకు ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానంపై రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ జయ పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: వికసిత్ భారత్లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ప్రిన్సిపాల్ ఎన్.నిర్మలమణి అన్నారు. ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు గారి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయంలోని సెమినార్ హాల్లో ప్రధానమంత్రి మోదీ మంత్రా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని విద్యార్థినీ విద్యార్థులు దేశ చరిత్రను అవగాహన చేసుకోవాలని, సీ్త్ర సాధికారతను సాధించుకోవాలన్నారు. విద్యార్థులు ప్రొఫెషనల్ స్కూల్స్ లో లైఫ్ స్కిల్స్లో ప్రాధాన్యత పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. మార్కాపురం: ఎడ్లపందేల బరిలో బరువైన బండను లాగుతూ గుండెపోటుతో ఎద్దు మృతిచెందిన ఘటన మార్కాపురం జిల్లా తర్లుపాడులో శనివారం జరిగింది. గ్రామంలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో శనివారం నంద్యాల జిల్లా అలగనూరు గ్రామానికి చెందిన కట్టిబడి రోలి అనే రైతు ఎడ్ల జతలో ఒక ఎద్దు బండలాగుతూ గుండెపోటుతో మృతి చెందింది. సుమారు 800 అడుగులు లాగిన ఎడ్లజతలో ఒక ఎద్దు కుప్పకూలి తుది శ్వాస విడవడంతో ఉత్సవాల్లో విషాదం నెలకొంది. రైతులు కంటతడి పెట్టారు. ఎద్దు మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించారు. గ్రామస్తులు చందాలు వేసుకుని సుమారు రూ.2.50 లక్షలను ఎడ్ల యజమాని రోలికి అందజేశారు. -
కాలినడకన మల్లన్న చెంతకు..
పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంలోని శ్రీగిరి పర్వతంపై వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివెళ్లే శివభక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. దీంతో శ్రీశైల ముఖద్వారంగా పేరొందిన దోర్నాలలో యాత్రికులు, శివస్వాములతో సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా శివస్వాములు కాలినడకన శ్రీశైలం తరలి వెళుతుండడంతో నల్లమల అటవీప్రాంతం శివనామస్మరణతో మారుమోగుతోంది. దోర్నాల నుంచి 50 కిలోమీటర్ల మేర దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంగుండా కాలినడకన శివస్వాములు శ్రీశైలం వెళ్లాల్సి ఉండడంతో వారి సౌకర్యార్థం పలువురు స్వచ్ఛందంగా ఉచిత భోజన వసతి, తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు: శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామి వారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యహోమ బలిహరణలు, జపానుప్ఠానాలు, స్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు, రుద్రహోమం, చండీహోమం, సాయంత్రం నిత్యపూజలు, వాహన సేవలను కన్నుల పండువగా నిర్వహించనున్నారు. మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించాలి ● జేసీ శ్రీనివాసులు త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన త్రిపురాంతకంలో బాలాత్రిపురసుందరీదేవి, పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో మహా శివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. త్రిపురాంతకంలో శనివారం ఉత్సవాల నిర్వహణ సమాయత్త సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరమన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో నిర్వహించాల్సిన పనులు సక్రమంగా నిర్వర్తించేలా చూడాలన్నారు. అవసరమైతే ఇతర మండలాలకు చెందిన సిబ్బందిని బృందాలుగా ఏరా్పాటు చేసి విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. సాగర్ కాలువలకు ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 13 నుంచి 19 వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, తహసీల్దార్ విజయభాస్కర్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కాలం చెల్లిన ఆహారం..నిల్వ ఉన్న మాంసం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తూనికలు, కొలతల అధికారులతో కలిసి శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్స్ షాపుల్లో సంయుక్తంగా దాడులు చేపట్టారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడిన అధికారులు హోటల్స్లో, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాహారాలను గమనించారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్లలో ఉంచిన మాంసాన్ని చూసిన అధికారులు నివ్వెరబోయారు. 50 కేజీల మాంసాన్ని గమనించిన అధికారులు ఆ మాంసాన్ని ధ్వంసం చేశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను కూడా కనుగొన్నారు. అదేవిధంగా స్వీట్ షాపులు, బేకరీల్లో కూడా నిల్వచేసిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఆహార పదార్థాల్లో తయారు తేదీ కానీ, గడువు తేదీకానీ లేకుండా విక్రయిస్తున్న వాటిని, కాలం చెల్లిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 21 శాంపిల్స్ సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం ఫుడ్ లేబొరేటరీకి పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో తూనికలు, కొలతల అధికారులు మొత్తం 20 కేసులు నమోదు చేశారు. మొత్తం నివేదికను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి సమర్పిస్తామని జిల్లా ఫుడ్ కంట్రోలర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అధికారులు తెలిపారు. -
దిక్కులేని ‘దిశ’
ఒంగోలు సబర్బన్: డిస్ట్రిక్ట్ డవలెప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మోనటరింగ్ కమిటీ మీటింగ్ (దిశ) దిక్కులేనిదిగా మారింది. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక సమావేశం ప్రజాప్రతినిధులు లేక వెలవెలబోయింది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించేందుకు ఎంపీ చైర్మన్గా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవన్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి టీడీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు. చివరకు కొండపి ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి స్వామి కూడా హాజరుకాకుండా ముఖం చాటేశారు. సమావేశంలో ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన సీట్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా సమావేశానికి రావడానికి నిరాసక్తత వ్యక్తం చేసినట్లుగా దిశ సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులను బట్టి స్పష్టమవుతోంది. ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాకపోవడంపై విమర్శలు... ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదుగురు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమావేశానికి వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాకపోవటంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఇన్చార్జ్లు వస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల నిరసన... గతంలో జరిగిన దిశ సమావేశాలకు ప్రొటోకాల్కు వ్యతిరేకంగా దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన ఇన్చార్జ్లు వస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఈ విషయమై ప్రశ్నించారు కూడా. ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా అధికారికంగా నిర్వహించే సమావేశాలకు ఏ విధంగా హాజరవుతారని నిలదీశారు కూడా. అందుకే ఈ సమావేశానికి రాకుండా సహాయ నిరాకరణ పాటించారు. లోపాలను ప్రశ్నించేవారు లేక... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో లోపాలపై ప్రశ్నించేవారే కరువయ్యారు. దీంతో అజెండా ప్రకారం అధికారులు వారు తెచ్చుకున్న నోట్స్ను చదువుకుంటూ పోయారు. అయితే సమావేశానికి వచ్చిన వెలిగండ్ల, హెచ్ఎం పాడు జెడ్పీటీసీలు, సంతనూతలపాడు, జరుగుమల్లి ఎంపీపీలు మాత్రమే స్థానికంగా ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. నగరంలో గంజాయి బ్యాచ్... ఒంగోలు నగరంలో గంజాయి బ్యాచ్ ఎక్కువయ్యారని నగర మేయర్ గంగాడ సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు వేయకపోవటం వల్ల వీధిలైట్లు లేక రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తున్నారని, వచ్చేపోయే వారిపై దాడులు చేస్తున్నారని, మహిళలు రాత్రి వేళల్లో తిరగటానికే భయపడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా నగర శివారుతోపాటు, చెరువుకొమ్ముపాలెం వెళ్లే రోడ్డులో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. విద్యుత్ లైన్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లుకు ఎంపీ సూచించారు. సమావేశంలో జేసీ కల్పనా కుమారి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్ఓ బీసీహెచ్ ఓబులేసు, డ్వామా, డీఆర్డీఏ, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, చేనేత–జౌళి, మత్స్య, ఐసీడీఎస్, విద్యాశాఖ, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, రైల్వే, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు వైఎస్సార్ సీపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.ఆకాశం పాక్షికంగా మేఘావృతమైఉంటుంది. చలిగాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది. ఎరువుల ధరలు తగ్గించాలి ఇప్పటికే దిగుబడులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎరువుల ధరలు పెంచడం వలన వ్యవసాయం చేయాలంటే భారంగా ఉంది. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి సాగుకు అవసరమయ్యే ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. పత్తి సాగు చేసినా వర్షాలు లేకపోవడంతో వాడుముఖం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచడం రైతులకు భారమే. – ఉడుముల కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు పంటలకు మద్దతు ధరలు లభించక కుదేలవుతున్న అన్నదాతలపై పెనుభారం పడనుంది. ఒక వైపు యూరియా లభించకపోవడం, మరో వైపు ఎరువులు ధరలు పెరగడంతో రైతుల నడ్డి విరుగుతోంది. ఎరువుల ధరలు పెరగడంతో ఉమ్మడి జిల్లాలోని రైతులపై కోట్లాది రూపాయల భారం పడనుంది. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవసాయం కష్టతరంగా మారింది. పెరిగిన ఎరువుల ధరలు అన్నదాతపై మోయలేని భారాన్ని మోపుతోంది. వివిధ కంపెనీలకు చెందిన ఎరువులు బస్తాకు సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగాయి. గత ఏడాది మిర్చి, పత్తి, పొగాకు సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధరలు లేకపోవటంతో నష్టపోయారు. టన్నుకు 20 బస్తాలు లెక్కగా వ్యవసాయాధికారులు లెక్కిస్తారు. రబీలో మొత్తం ఎరువుల వినియోగం 1,26,060 మెట్రిక్ టన్నులు కాగా సగటున బస్తాకు రూ.150 ప్రకారం పెరిగిన ఎరువులు లెక్కిస్తే మొత్తం మీద సుమారు రూ.38 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. అప్పులు చేసి సాగుచేస్తే ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం చేయడం కష్టమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు ఎక్కువై ఉమ్మడి జిల్లాలో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎరువు..ధరవు!మార్కాపురం: జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులున్నారు. రబీ సీజన్కు సంబంధించి 86,982 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఒక వైపు యూరియా అందక అవస్థలు పడుతున్న రైతులకు పెరిగిన ఎరువుల ధరలు శాపంగా మారుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్లో మోంథా తుఫాన్ తాకిడికి మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రబీలో పప్పుశనగ, మొక్కజొన్న, శనగ పంటలపై ఆశలు పెంచుకున్నారు. ఈ దశలో ఎరువులు ధరలు మోతమోగుతుండడం రైతులకు షాక్ ఇచ్చింది. గత ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది. నాలుగైదు నెలల వ్యవధిలోనే మరోసారి ధరలు పెంచిన ప్రభుత్వం రైతులను పొలాకు దూరం చేస్తోంది. పెరిగిన ఎరువుల ధరలు చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా ఎరువుల ధరలు పెరుగుతుండడంతో సాగు చేయాలా ? వద్దా ? అన్న సందిగ్ధంలో పడిపోతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు అంటూ చెప్పుకుంటున్న నాయకులు కేంద్రం ధరలు పెంచితే నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబీలో 86,982 హెక్టార్లలో సాగు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం రబీ సీజన్లో 86,982 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 11,526 హెక్టార్లలో, జొన్న 2529 హెక్టార్లలో, మొక్కజొన్న 14,230 హెక్టార్లలో, శనగలు 19,430 హెక్టార్లలో సాగు చేశారు. ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు వినియోగం ఎక్కువగా ఉంటుంది. పెరిగిన ధరలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. గత సీజన్లలో గిట్టుబాటు ధరలు లభించక ఒక వైపు, ప్రకృతి వైపరీత్యాలు మరో వైపు కోలుకోలేకుండా చేశాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపడంతో రబీ సీజన్లోనైనా నష్టాన్ని పూడ్చుకుందామన్న వారి ఆశలపై ధరలు నీళ్లు జల్లాయి. హెక్టారుకు రెండున్నర బస్తాల డీఏపీ వినియోగం.. 28–28 రకం ఎరువులో యూరియా, భాస్వరం ఉంటాయి. వేర్లు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 14–35–14 (నత్రజని, భాస్వరం, పొటాష్) ఎరువు, 20–20–20–0–13 రకం ఎరువులను ఎక్కువగా వరి, మిర్చి పంటలకు వినియోగిస్తారు. ఇందులో ప్రధానంగా నత్రజని మొక్క పెరుగుదలకు, భాస్వరం వేర్ల అభివృద్ధికి, పొటాష్ గింజ నాణ్యతకు, బరువు పెరుగుదలకు, పురుగులు, తెగుళ్లు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీంతో కాంప్లెక్స్ ఎరువులను రైతులు కచ్చితంగా వాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు రైతులకు భారంగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా యూరియాను ఉపయోగిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 39,587 టన్నుల యూరియా జిల్లాకు రాగా సుమారు 38 వేల టన్నుల యూరియాను రైతులు వాడారు. మిగిలిన కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడారు. యూరియా ధర ఒక్కటి మాత్రం బస్తా రూ.266 చొప్పున విక్రయిస్తున్నారు. -
కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ జరుగుమల్లి (సింగరాయకొండ): వైఎస్సార్ సీపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తమది క్యాడర్ బేస్డ్ పార్టీగానీ.. లీడర్ బేస్డ్ పార్టీ కాదని ఆ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. జరుగుమల్లి మండలంలోని వావిలేటిపాడు గ్రామంలో శనివారం పార్టీ మండల స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ పదవుల్లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 8 వేల మందికి పదవులిచ్చి బలమైన టీమ్ను సిద్ధం చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్, రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేమైనా రాజరికం, జమీందారీ వ్యవస్థా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ, ప్రజలందరికీ రాజ్యాంగం హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. జగనన్న హయాంలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేశారని, ఏ ప్రభుత్వమైనా అదే విధానాన్ని పాటించాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. కొండపి నియోజకవర్గంలో పార్టీ ఓడిపోలేదు... కొండపి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం గెలిచింది తప్ప వైఎస్సార్ సీపీ ఓడిపోలేదని ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీకి 32 వేల ఓట్లు వచ్చాయని, 44 శాతం ఓటు బ్యాంకు ఉందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ఉంటారేగానీ శత్రువులు ఉండరన్నారు. జగన్మోహన్రెడ్డి దమ్మున్న నాయకుడని, తమ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లను పరామర్శించడానికి తన ఇంటి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి జగన్మోహన్రెడ్డికి సుమారు 8 గంటలు పట్టిందని, ఇది ప్రజలకు జగన్పై ఉన్న అభిమానమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా జైలులో పెడుతున్నారని, ఇళ్లపై పెట్రోలు బాంబులు వేస్తున్నారని, పొలాలు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫ్లెక్సీలు వేయకూడదని.. చివరకు గణేష్ నిమజ్జనం రోజున కూడా డీజేలు పెట్టకూడదని ఆంక్షలు విధించారని మండిపడ్డారు. చివరకు రోడ్డుపైనే గణేష్ విగ్రహం వదిలి వెళ్లే పరిస్థితి కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పదవులు పొందిన ప్రతిఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని, రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని వివరించారు. పార్టీ పేరు చెప్పుకుని ఎదిగినవారు పార్టీని మర్చిపోకూడదని, పార్టీ విధేయులుగా ఉండాలే తప్ప వెన్నుపోటు పొడవకూడదని కోరారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి... పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జగనన్న మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పొగాకు ధరలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతు కంటతడిపెట్టినా, కుదేలైనా ఆ ప్రభుత్వాలు మనుగడ సాగించవని హెచ్చరించారు. జగనన్నది సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పదవులు ఇస్తామని, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సురేష్ను పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసరావు, బత్తిన మదన మనోహరరావు, కనపర్తి శేషారెడ్డి, కొమ్మాలపాటి మధుసూదనరావు, దగ్గుమాటి బూసిరెడ్డి, హనుమారెడ్డి, పాడిబండ్ల వేణు, కసుకుర్తి పున్నారావు, నాగినేని భాస్కర్, పాలేటి రవి, ఉప్పాళ్ల శ్రీనివాసులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ముండ్లమూరు: సర్వీస్ వైరు బిగించేందుకు స్తంభం ఎక్కి ప్రమాదశాత్తూ విద్యుత్ షాక్కు గురై జారిపడి గూడాల అంజిరెడ్డి (38) మృతి చెందిన సంఘటన మండలంలోని పసుపుగల్లు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు పాత ఊరు వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఎక్కి సర్వీస్ వైర్ బిగుస్తున్నారు. ఆ క్రమంలో అంజిరెడ్డికి తన చేతిలో ఉన్న కటింగు బేర్ లైన్ తగలడంతో ఒక్కసారిగా షాక్ గురై స్తంభం పక్కన ఉన్న గోడపై పడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో సంఘటన స్థలంలోనే అంజిరెడ్డి మృతి చెందాడు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న అంజిరెడ్డిని కోల్పోయిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. విషయం తెలుసుకున్న ముండ్లమూరు ఎస్సై కమలాకర్ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ఎన్.వెంకటేశ్వరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. అంజిరెడ్డి మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. సింగరాయకొండ: హైకోర్టు పరిధిలో వివాదంలో ఉన్న మామిడి తోటను కొందరు అక్రమంగా జేసీబీలతో ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో జరిగింది. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యన్నాబత్తిన వెంకటేశ్వరరావు (చిన్నా), మాజీ ఎంపీటీసీ షేక్ సలీంబాషా, కనుమళ్ల మాజీ సర్పంచ్ తన్నీరు రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బాలయోగినగర్లో సోమరాజుపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వేనెంబరు 659–3లో 2.74 ఎకరాల స్థలాన్ని కుంచాల విజయకు 1997వ సంవత్సరంలో అప్పటి మంత్రి దామచర్ల ఆంజనేయులు అసైన్మెంటు కమిటీ ద్వారా కేటాయించారు. ఇటీవల ఆమె తన స్థలంలో సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసి మామిడిమొక్కలు వేసుకుని భధ్రత కోసం ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. కానీ, రాత్రివేళ సుమారు 30 మంది రెండు జేసీబీలు తీసుకొచ్చి ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అంతేగాకుండా వారు వెంట తెచ్చుకున్న కత్తులతో మామిడి మొక్కలను కూడా నరికేశారు. అక్కడ కాపలా ఉన్న వాచ్మెన్ను కూడా బెదిరించారు. కోర్టులో వివాదంలో ఉన్న భూమిలో ఈ విధంగా విధ్వంసం సృష్టించటంపై వైఎస్సార్ నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ఎస్పీ హర్షవర్థన్రాజును కలిసి బాధితురాలు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. కనిగిరి రూరల్: పీసీ పల్లి మండలం బండపాలెం గ్రామంలో ఏనుగంటి వెంగమ్మ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. స్థానిక డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీ బండపాలెంలోని ఏనుగంటి వెంగమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ సూచనలతో కనిగిరి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనుమానితుల కోసం గాలించారు. శనివారం స్థానిక బొడ్డు చావిడి సెంటర్లో బంగారపు వస్తువులు అమ్మడానికి వచ్చిన కాళహస్తి శివశంకర్ను అనుమానించి పట్టుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక బంగారు నల్లపూసల తాడు, రెండు బంగారపు ఉంగరాలు, ఒక బంగారు చెవి కమ్మలు, రెండు జతల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు చెప్పారు. అలాగే, పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో పట్టుకుని మిగతా ఆభరణాలను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. -
విద్యుత్ షాక్తో ఫీడ్ బాయ్ మృతి
టంగుటూరు: రొయ్యల చెరువులోని విద్యుత్ మోటారుకు మరమ్మతులు చేస్తుండగా షాక్ కొట్టి ఫీడ్ బాయ్ మృతిచెందిన సంఘటన మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధి లోని తాళ్లపాలెంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు టంగుటూరు మండలం తాళ్లపాలెం గ్రామ సమీపంలో కొల్లూరి శ్రీను అనే వ్యక్తి రెండు సంవత్సరాల లీజుకు రొయ్యల చెరువు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాడు. ఆ రొయ్యల చెరువుకు మరమ్మతులు చేసే క్రమంలో మోటారు పనిచేయలేదు. రొయ్య ల చెరువులకు ఫీడ్ బాయ్గా పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రతులను మండలం ఆనందపూర్ గ్రామానికి చెందిన రమేష్ మల్లిక్ (20) మోటారుకు ఉన్న కరెంటు వైర్లను కలుపుతుండగా ప్రమాదవశాత్తూ షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కిందపడి రమేష్ మల్లిక్ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి అతన్ని తరలించారు. తాళ్లపాలెం గ్రామ వీఆర్ఓ కత్తి నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వర రావు తెలిపారు. -
మొక్కజొన్న మేలు చేసేనా..!
మార్కాపురం: గత ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పత్తి, మిర్చి పైర్లను మోంథా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా అప్పుల పాలయ్యారు. ఆ నష్టపరిహారం ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో రబీలో సాగుచేసిన మొక్కజొన్న దిగుబడులపై రైతుల ఆశలు పెంచుకుంటున్నారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో 19,052 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు సుమారు 30 వేల వరకూ ఖర్చు వస్తోంది. దాదాపు 3 టన్నుల వరకూ దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో టన్ను రేటు రూ.35 వేల వరకూ ఉంది. ఎకరా మొక్కజొన్న నాటడానికి 3 వేల రూపాయలు, కలుపు మందుకు 1500 రూపాయలు, ఎరువులకు సుమారు 12 వేలు, పురుగుమందులకు 3 వేలు, జుట్లు పీకడానికి 2200, సేద్యపు ఖర్చుల కింద 2 వేలు, కోత ఖర్చుల కింద దాదాపు 6 వేల రూపాయల ఖర్చు వస్తోంది. ఈ నేపథ్యంలో మొక్కజొన్న దిగుబడులు, తద్వారా వచ్చే లాభాలపై రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటివరకూ ఉన్న గిట్టుబాటు ధర కొనసాగినా, పత్తి, మిర్చి సాగుచేసి వచ్చిన నష్టాలను మొక్కజొన్న ద్వారా తీర్చుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. మార్కాపురం జిల్లాలో 19,052 హెక్టార్లలో మొక్కజొన్న సాగు దిగుబడులు, లాభాలపై రైతుల ఆశలు -
మాలకొండ ఆదాయం రూ.7,96,793
వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ.7,96,793 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కుంకుమార్చన ద్వారా రూ.20,680, తలనీలాల ద్వారా రూ.27,325, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.2,36,800, రూమ్ అద్దెలకు రూ.25,860, లడ్డు ప్రసాదాలకు రూ.2,08,380, అన్నదానానికి విరాళంగా రూ.2,48,057, ఇతర విరాళాలు కలిపి మొత్తం రూ.7,96,793 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ● రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం టంగుటూరు: ప్రమాదవశాత్తూ పొగాకు బ్యారన్ దగ్ధమైన సంఘటన మండలంలోని ఎం.నిడమానూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎం.నిడమానూరు గ్రామానికి చెందిన అన్నాబత్తిన బాలాజీరావు బ్యారన్లో పొగాకు రెలిపి క్యూరింగ్ కోసం దాదాపు 1200 కర్రలు పెట్టారు. అయితే రైజ్ చూసే సమయంలో కర్ర మొద్దు గొట్టాంపై జారిపడి మంటలు వ్యాపించాయి. బ్యారన్లో ఉన్న కర్ర, ఆకు, టైర్లు అగ్నికి ఆహుతై సుమారు రూ.4 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మంగపతివారిపాలెంలో... పొన్నలూరు: మండలంలోని మంగపతివారిపాలెం గ్రామంలో మన్నెం స్రవంతికి చెందిన పొగాకు బ్యారన్ శనివారం ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. క్యూరింగ్ జరుగుతుండగా పొగాకు అల్లిక కర్రలు జారి మొద్దుగొట్టంపై పడి అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో సుమారు 1200 పొగాకు కర్రలు, బ్యారన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో దాదాపు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న కందుకూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గిద్దలూరు రూరల్: పట్టణంలోని రాజానగర్ ముందు భాగంలో శనివారం ఓ యువకుడు మద్యం మత్తు నెత్తికెక్కి తన గమ్యస్థానానికి వెళ్లలేక రోడ్డు పక్కనే ఉన్న మురికి కాలువ వద్ద పడిపోయాడు. ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేస్తుండటంతో యువకులు మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. మేదరమెట్ల: ఒంగోలు వైపు నుంచి మాచర్ల వైపునకు వెళ్తున్న లారీ ఢీకొని మహిళలకు గాయాలైన సంఘటన శనివారం రాత్రి జాతీయ రహదారిపై జరిగింది. కొరిశపాడు మండలం తిమ్మనపాలెం వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆత్మకూరు అంజమ్మ కాలికి తీవ్ర గాయమవగా హైవే అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కి తరలించినట్లు కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల పోలీసులు తెలిపారు. అద్దంకి రూరల్: అద్దంకిలోని చర్చిపై దుండగులు బుధవారం దాడి చేయగా, శనివారం వెలుగులోకి వచ్చింది. పంగులూరు మండలానికి చెందిన వ్యక్తి అద్దంకిలోని రామ్నగర్లో చర్చి ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ చర్చిపై దాడి చేసి లోపలున్న వస్తువులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం
ఇందుకూరుపేట: విద్యుత్ లైన్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేటలో శనివారం చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. మైపాడు– నెల్లూరు రోడ్డు విస్తరణలో భాగంగా పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్లు ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన ప్రళయకావేరి జాలయ్య (44)తో పాటు మరికొందరు మండలంలోని జగదేవిపేటలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు వచ్చారు. కొత్త స్తంభాలను ట్రాక్టర్ సాయంతో ఏర్పాటు చేసే క్రమంలో పాత లైన్కు తగలడంతో జాలయ్య, ఆవుల శీను, వెంకటరమణయ్యలకు కరెంట్ షాక్ తగిలింది. శీను, వెంకటరమణయ్య స్వల్పగాయాల పాలవగా, జాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత లైన్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి పనులు చేయాల్సి ఉండగా, ఇందుకు భిన్నంగా కరెంటు నిలిపివేయకుండా పనులు చేయడంతోనే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. -
ఆటో ఢీకొని యువకుడు మృతి
పామూరు: ముందు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొన్న ఘటనలో బైకుపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం రాత్రి మండలంలోని వగ్గంపల్లె గ్రామ సమీపంలో 565వ నంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కట్టా అనూక్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నిమ్మచెట్లపల్లె గ్రామానికి చెందిన రాగిపిండి గురునారాయణ (35) అనే వ్యక్తి బైకుపై వగ్గంపల్లె గ్రామం వైపు నుంచి స్వగ్రామం నిమ్మచెట్లపల్లెకు వెళ్తున్నాడు. అదే సమయంలో వగ్గంపల్లె వైపు నుంచి కనిగిరి వైపునకు వెళ్తున్న ఆటో అదుపుతప్పి ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. రోడ్డుపై పడిన గురునారాయణ తలకు గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. -
ఆడ దూడలు పుట్టేందుకు ఇంజక్షన్లు
అద్దంకి: సెక్స్ సార్టెడ్ సెమన్తో పశువులకు ఆడ దూడలు పుట్టే విధానంపై పశుసంవర్థకశాఖ సిబ్బంది పశుపోషకులకు అవగాహన కల్పించాలని జేడీ వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పశు వైద్యశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశుసంవర్థకశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. సాధారణ సెమన్తో పశువులకు గర్భధారణ జరిగేలా గతంలో ఉండేదన్నారు. ప్రస్తుతం సెక్స్ సార్టెడ్ సెమన్తో ఆడదూడలు నూరు శాతం పుడతాయని తెలిపారు. ఈ ఇంజక్షన్ గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.150కే అందుబాటులో ఉన్న విషయాన్ని పశుపోషకులకు తెలియజేసి ఆడ దూడల పుట్టుకతో పశువుల అభివృద్ధి, తద్వారా పాల వృద్ధికి దోహదపడాలని చెప్పారు. పాడి రైతులు బాగుంటే గ్రామాభివృద్ధి, తద్వారా మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మార్చి నాటికి లక్ష్యాలను అధిగమించాలని, రాబోయే కాలంలో నిర్వహించనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యులు సైదయ్య, రాంబాబు, 1962 మొబైల్ వాహన వైద్యులు స్వేత, నాగబాబు, నౌషద్, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ధర్మవరంలో మెగా గోకులం స్థలాన్ని పరిశీలించిన జేడీ... మండలంలోని ధర్మవరం గ్రామంలో ఏర్పాటు చేయనున్న మెగా గోకులం స్థలాన్ని జేడీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా గోకులంను ప్రభుత్వం స్థలంలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ మెగా గోకులం నిర్మించిన తరువాత మేత లేని పశుపోషకుల పశువులను ఇక్కడకు తెచ్చి మేపుకుని పాలు పిండుకుని వెళ్లవచ్చని తెలిపారు. అందుకోసం అయ్యే వ్యయాన్ని పశుపోషకులు భరిస్తే సరిపోతుందని చెప్పారు. జేడీ వెంట ఏడీ డాక్టర్ కసుకుర్తి వీరబ్రహ్మయ్య, గ్రామస్తులు ఉన్నారు. పశుసంవర్థకశాఖ జేడీ వెంకటేశ్వరరావు -
బాబు పాలనలో జీజీహెచ్ నిర్వీర్యం
మార్కాపురం టౌన్: మార్కాపురంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురం కేంద్రంగా ఉన్న జిల్లా వైద్యశాలను ప్రభుత్వ జనరల్ వైద్యశాలగా 100 పడకల నుంచి 350 పడకలకు పెంచడం జరిగిందన్నారు. ఆనాడు 75 మంది స్పెషలిస్టు డాక్టర్లతో కలిపి మొత్తం 498 మంది సిబ్బంది ఉన్నారన్నారు. 90 శాతం జీజీహెచ్లో సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఆనాడు ఓపీ 700 నుంచి 800 వరకూ వస్తుందని, వైద్యశాలకు అవసరమైన పరికరాలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మార్కాపురం కేంద్రంగా రాయవరం మెడికల్ కాలేజీని కోట్ల రూపాయల నిధులతో మంజూరు చేయించడంతో పాటు పనులను ప్రారంభించగా సుమారు 50 శాతానికిపైగా పనులు జరిగాయన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించారని, అయితే జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపరచాల్సిందిపోయి నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. కేవలం 15 మంది వైద్యులు మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. గతంలో 75 మంది డాక్టర్లున్న వైద్యశాలలో ప్రస్తుతం ఉన్న వైద్యులు ఎలా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. 65 మంది స్టాఫ్ నర్సులుండగా, సుమారు 53 మందిని బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యశాలకు వస్తున్న రోగులను సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ సిబ్బంది చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందక దూర ప్రాంతాలైన గుంటూరు, ఒంగోలు, నంద్యాల, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం జిల్లా ఇచ్చినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి సరిపోదని, జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న వైద్య సేవలు కూడా లేకుండా చేయడంపై పునరాలోచన చేసుకోవాలని కోరారు. రాజకీయ విమర్శలు కాకుండా ఈ ప్రాంతంలో జరిగే పరిస్థితులపై ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఈ ప్రాంత పరిస్థితులపై పునరాలోచించి పూర్తిస్థాయిలో వైద్యశాలకు వైద్యసిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. వైద్యశాలలో ఇంతటి దయనీయ పరిస్థితి ఏర్పడినా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమని అన్నా రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం కేంద్రంగా ఉన్న మెడికల్ కాలేజీని నిర్వీర్యం చేస్తూ పీపీపీకి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. జీజీహెచ్ని కూడా నిర్వీర్యం చేసి కేవలం 15 మంది వైద్యులతో సరిపెట్టడం సరికాదని అన్నారు. సరైన సిబ్బంది లేని కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సక్రమంగా వైద్యం అందక.. దూరప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేక అవస్థపడుతున్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్యశాలలో పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని, పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తగ్గిన వైద్య సేవలు ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలు పట్టించుకోని కూటమి ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
బైకు ప్రమాదంలో యువకుడు మృతి
లింగసముద్రం: మద్యం సేవించి మోటార్ సైకిల్పై వెళ్తూ అదుపుతప్పి కింద పడటంతో బొచ్చు వేణు (37) అనే యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన లింగసముద్రం మండలంలోని చినపవని ఎస్టీకాలనీ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై జి.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామానికి చెందిన బొచ్చు వేణు మద్యం సేవించి పూరేటిపల్లి మీదుగా చినపవని వైపు మోటార్ సైకిల్పై వేగంగా వెళ్తున్నాడు. ఎస్టీకాలనీ వద్ద అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్డం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
జగన్ హయాంలోనే పాలుట్ల అభివృద్ధి
యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి గిరిజన గూడాలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు ఇచ్చారని, తమ ప్రభుత్వ కాలంలోనే పాలుట్ల గిరిజన గూడెంను పంచాయతీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలుట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభిస్తున్న సోలార్ ప్యానల్ పరికరాల్లో సమస్యలు ఉన్నాయని కొంతమంది గిరిజనులు ఆరోపిస్తున్నారని, వాటి పరిస్థితిని గమనించి కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇదేవిధంగా ప్రచార ఆర్భాటంతో, కాసుల కక్కుర్తి కోసం నాసిరకం సోలార్ పరికరాలు ఏర్పాటు చేశారని, ఆ వెలుగులు పట్టుమని 12 నెలలు నిండక ముందే పనిచేయడం మానేశాయన్నారు. సోలార్ పరికరాల ప్యానల్ జీవితకాలం కనీసం 25 సంవత్సరాలు ఉంటుందన్న వాస్తవాన్ని గమనించాలని, ప్రస్తుతం బిగిస్తున్న పరికరాల నాణ్యత లోపాలను సరిచేయాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ఎంపీ నిధులతో పాలుట్ల గిరిజన గూడెంలో వీధి దీపాలు వెలిగించి అటవీ మృగాలు, విషపురుగుల బారి నుంచి రక్షణ కల్పించారని, ఆ పంచాయతీ అభివృద్ధి కోసం రూ.42 లక్షలు ఖర్చుపెట్టి గ్రామ సచివాలయం నిర్మించారని, జల్జీవన్ మిషన్ కింద రూ.29 లక్షలు వెచ్చించి ఇంటింటికీ మంచి నీటి సదుపాయం కల్పించారని, రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, రూ.15 లక్షలతో అప్రోచ్ రోడ్డు వేశారని, నాడు–నేడు కింద రూ.20 లక్షలతో పాఠశాలను ఆధునీకరించారని, ప్రస్తుతం జిల్లా పరిషత్ గ్రాంట్ కింద రూ.25 లక్షలు మంజూరు చేయించి ప్రధాన రోడ్డు వేయనున్నారని ఆయన అన్నారు. గిరిజనుల జీవన విధానాలకు మెరుగైన వ్యవస్థను జగనన్న పాలనలోనే ఏర్పాటు చేశారన్నారు. పాలుట్ల పంచాయతీని మరింతగా అభివృద్ధి పరచాలన్న ప్రధాన ఉద్దేశంతో ఢిల్లీలోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూయల్ ఓరంను ఈ నెల 4వ తేదీ కలిసి వారి అభివృద్ధిపై చర్చించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి ఏర్పాటు చేయాల్సిన పథకాలు అందకపోవడం వలన వారి అభివృద్ధి కుంటుపడిందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో కలిసి పాలుట్ల గిరిజన గూడెం వాసులు ఎదుర్కొంటున్న రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, రోడ్డును అడ్డుకుంటున్న అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. పాలుట్ల పంచాయతీలోని పవిత్రమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద జెడ్పీ గ్రాంట్తో బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేశామని అన్నారు. 6 సార్లు అధికారంలోకి వచ్చిన టీడీపీ నేటికీ ఆ గ్రామానికి చేసింది ఏమీలేకపోయినా.. ప్రచార ఆర్భాటాల కోసం గిరిజన గూడెంలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, నియోజకవర్గ యూత్ కన్వీనర్ ఆళ్ల కృష్ణారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, షేక్ మొహమ్మద్ ఖాసీం పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
బాబు పాలనలో జీజీహెచ్ నిర్వీర్యం మార్కాపురం జీజీహెచ్లో వైద్యసేవలు తగ్గిపోయాయని వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చల్లని గాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది.ఏఆర్వీ ఇంజక్షన్లు అందుబాటులో లేవు... జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలు, ఒంగోలులోని సర్వజన ఆస్పత్రి, మార్కాపురంలోని జీజీహెచ్ల్లో ఏఆర్వీ ఇంజక్షన్లు, ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో ఏఆర్వీ ఇంజక్షన్లు అందుబాటులో లేవని, కుక్క కరిచినప్పుడు ఆస్పత్రికి వెళితే బయట మెడికల్ షాపులకు ఇంజక్షన్లు రాస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కుక్క కరిస్తే ఒక్కొక్కరికి నాలుగు డోసుల ఇంజక్షన్ వేయాలి. బయట దుకాణాల్లో ఒక్కో డోసు రూ.500 అవుతోంది. ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్ ఖరీదు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటోంది.రోడ్డుమీదకొస్తే చాలు గుంపులు గుంపులుగా కనిపించే శునకాలు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేదు..నడిచి వెళ్లినా.. ద్విచక్ర వాహనాలపై వెళ్లినా వదలకుండా కుక్కలు మీదపడి రక్కేస్తున్నాయ్. జిల్లాలో రోజుకు సరాసరి 80 నుంచి 100 మంది దాకా కుక్కకాటు బారిన పడి గాయాలపాలవుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నా వాటిని నియంత్రించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఏఆర్వీ ఇంజక్షన్ల కొరతతో కుక్కకాటు బాధితులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మాత్రమే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉండటంతో కుక్కల నియంత్రణ నామమాత్రంగా సాగుతోంది.జిల్లాలో ఒక్కటే ఏబీసీ సెంటర్... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం ఒంగోలులో మాత్రమే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ఏబీసీ) ని ఏర్పాటు చేశారు. నగరంలోని మామిడి పాలెంలో ఏర్పాటు చేసిన ఏబీసీ సెంటర్కు జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుంచి కుక్కలను తరలించే సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. తరలించినా అంత పెద్ద సంఖ్యలో కుక్కలకు శస్త్ర చికిత్సలు చేసి, వ్యాక్సినేషన్ చేసేందుకు సిబ్బంది కూడా లేరు. ఏడాది కాలంగా ఏబీసీ సెంటర్లో కేవలం 5 వేల కుక్కలకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేశారు. ఈ ఏడాది మరో రెండు వేల కుక్కలను గుర్తించామని, వాటికి ఆపరేషన్లు చేయించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు చెప్పారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి మారుమూల గ్రామాల వరకు కుక్కల బెడద లేని గ్రామం లేదు. పట్టపగలు పిల్లలను ఒంటరిగా బడికి పంపించాలన్నా, మహిళలు మార్కెట్కు వెళ్లాలన్నా దడుస్తున్నారు. తెల్లవారుజామున జాగింగ్ కు వెళ్లేవారి మీద తరచుగా కుక్కలు దాడి చేసి కరుస్తున్నాయి. ఇక రాత్రి పూట ఏదైనా అత్యవసర పనిపడితే బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు సంచరిస్తూ ఒంటరిగా కనిపిస్తే చాలు పైనపడి రక్కేస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ వద్ద, పిల్లల వార్డు సమీపంలోనే తరచుగా కుక్కలు కనిపిస్తుండడంతో రోగులు భయపడిపోతున్నారు. కుక్కకాట్లపై సీరియస్గా స్పందించిన సుప్రీం కోర్టు బహిరంగ ప్రదేశాల్లో కుక్కలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒంగోలు నగరంలో ప్రతి వీధిలోనూ పెద్ద సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నా వాటిని పట్టుకొని తరలించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 30 వేల మందిని కరిచిన కుక్కలు... 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 30 వేల మందిని కుక్కలు కరిచినట్లు ప్రభుత్వ వైద్యశాలల లెక్కలను బట్టి తెలుస్తోంది. గత ఏడాది ఒక్క ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే 5843 మందిని కుక్కలు కాటు వేశాయి. కందుకూరు నియోజకవర్గంలో 2402, కనిగిరి 3598, దర్శి 2162, సంతనూతలపాడు 3577, కొండపి 3636, యర్రగొండపాలెం 1350, మార్కాపురం 2150, అద్దంకి 1590, గిద్దలూరు నియోజకవర్గంలో 2960 మందిని కుక్కలు కరిచి రక్కేశాయి. ఒంగోలు జీజీహెచ్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 603 మందిని కుక్కలు కరిచాయి. అంటే రోజుకు 82 నుంచి 100 మందిని కరుస్తున్నాయి. 5 వేల మందికి తీవ్ర గాయాలు... కుక్కలు మీద పడి ఎక్కడ పడితే అక్కడ రక్కేయడంతో అనేక మందికి తీవ్రగాయాలవుతున్నాయి. తొడ కండలు, కాలి పిక్కలే కాకుండా ముఖం మీద కూడా రక్కేస్తున్నాయి. దీంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. గత ఏడాది 30 వేల మందికి పైగా కుక్కలు కాటు వేయగా వారిలో సుమారు 5 వేల మందికి పైగా తీవ్రగాయాల బారినపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు వేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఒంగోలులో ఈ ఏడాది జనవరిలో కుక్కకాటుకు గురైన 603 మందిలో 105 మందికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు వేసినట్లు తెలుస్తోంది. అలాగే గతేడాది కుక్కలు కరిచిన వారిలో కనిగిరిలో 100 మందికి పైగా ఈ ఇంజక్షన్ వేసినట్లు సమాచారం. దర్శిలో 56, సంతనూతలపాడులో 150 మందికి, కొండపిలో 729 మందికి, యర్రగొండపాలెంలో 195 మందికి, ఒంగోలులో 1633 మందికి, అద్దంకిలో 150 మందికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు వేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని వైద్య శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. లక్ష కుక్కలకు పైగా సంచారం.. జిల్లాలో ఎటు చూసినా కుక్కలే కనిపిస్తున్నాయి. ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట రెండవ లైనులోని ఒక వీధిని కుక్కల బజారు అని పిలుస్తారు. ఈ వీధిలో పగలు, రాత్రి కుక్కల గుంపు తిరుగుతుంది. అంతేకాకుండా కుక్కలు ఇళ్లలోకి దూరి మంచాల కింద కూర్చుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లక్షకు పైగా కుక్కలు ఉన్నట్లు అంచనా. ఒంగోలు, కొండపి, దర్శి ప్రాంతాల్లోనే సుమారు 50 వేలకు పైగా కుక్కలు సంచరిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు పరిసరాల్లో 16 వేలకు పైగా కుక్కలు ఉన్నాయి. కేవలం నగరంలోనే 10 వేలకు పైగా కుక్కలున్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇక కొండపి, దర్శి నియోజకవర్గాలలో ఒక్కొక్కచోట 16750 కుక్కలు ఉన్నట్లు అంచనా. గిద్దలూరు పరిసరాలలో 1000, అద్దంకి పరిసరాల్లో 3500, మార్కాపురం ప్రాంతంలో 2 వేలు, యర్రగొండపాలెంలో 4 వేలు, సంతనూతలపాడులో 9500, కనిగిరిలో 10200, కందుకూరులో 3200 కుక్కలు ఉన్నట్లు అంచనా. వీధి కుక్కలతోపాటుగా పెద్ద సంఖ్యలో పెంపుడు కుక్కలున్నాయి. మొత్తం మీద లక్షకు పైగానే కుక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు, కుక్కకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం పరిధిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఈనెల 15న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ టి.రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు రికార్డు అసిస్టెంట్, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు డేటా ఎంట్రీ ఆపరేటర్, సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. ఈ రాత పరీక్ష ఒంగోలు దక్షిణ బైపాస్ సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి సూచించారు. ఒంగోలు సబర్బన్: జిల్లాలో సాగు చేసిన పొగాకు పంటను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) బి.విశ్వశ్రీ పరిశీలించారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన ఆమె ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ప్రత్యేకంగా ఎఫ్సీవీ పొగాకు పొలాలను పరిశీలించారు. పేనుబంక, పొగాకు మల్లెలాంటి వ్యాధులు సోకిన పంటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లిన ఈడీ విశ్వశ్రీ రైతులతో మాట్లాడారు. తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని, క్యూరింగ్, గ్రేడింగ్ చేస్తున్న సమయంలో ఉత్తమ యాజమాన్య పద్దతులు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒంగోలు–2 (త్రోవగుంట) పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి జే.తులసి ప్రస్తుతం సాగు చేసిన పొగాకు పంటకు సంబంధించి పలు గ్రామాల్లో ఉన్న పరిస్థితులను వివరించారు. ఈడీ వెంట పొగాకు ఆక్షన్స్ మేనేజర్ రామాంజనేయులు, ఆర్ఎం ఎస్.రామారావుతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
ముండ్లమూరు: భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఉల్లగల్లు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని బసాపురం గ్రామానికి చెందిన మోత్కూరి సుబ్బారావు (47) 20 సంవత్సరాల క్రితం ఉల్లగల్లుకు చెందిన సుభాషిణిని వివాహం చేసుకుని ఉల్లగల్లులోనే కాపురం ఉంటున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన భర్తతో భార్య సుభాషిని మద్యం మానుకోమని చెప్పింది. వరి పొలంలో మందు పిచికారీ చేయడానికి వెళ్లిన భర్త.. భార్య నీరు తీసుకొచ్చేలోపు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు సుబ్బారావును దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించేలోపే సుబ్బారావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముండ్లమూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
క్విస్ ఫెస్ట్ – 2026 ప్రారంభం
ఒంగోలు సిటీ: స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో క్విస్ ఫెస్ట్ – 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది స్పందన అద్భుతంగా ఉందని క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రిదేవి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1200 మంది విద్యార్థులు టెక్నికల్, స్పోర్ట్స్, పేపర్ ప్రజంటేషన్, పోస్టర్ ప్రజంటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో ఐపీఆర్ సీ యూనిట్ మాజీ డైరెక్టర్ బదరీ నారాయణమూర్తి, స్పెషల్ గెస్ట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ కపా కిరణ్రెడ్డి సారెళ్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా బదరీ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ పరుగులు పెడుతోందని, దానికి తగ్గట్లుగా అందరూ అప్ డేట్ అవ్వాలని విద్యార్థులకు సూచించారు. తాము చదువుకునే రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ లేవని, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని, ప్రతిఒక్కరూ దాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. క్విస్ విద్యాసంస్థల్లో టెక్నికల్ ఎక్స్ పోని సందర్శించిన ఆయన.. విద్యార్థుల ప్రాజెక్ట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం మాట్లాడిన బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ కపా కిరణ్ రెడ్డి సారెళ్ల ప్రకాశం జిల్లా నుంచి ఎంతోమంది అద్భుతమైన విద్యావంతులు వచ్చారని అన్నారు. నిడమానూరి గాయత్రిదేవి మాట్లాడుతూ క్విస్ కాలేజీ వరుసగా మూడో ఏడాది క్విస్ ఫెస్ట్ నిర్వహిస్తోందని తెలిపారు. సాయంత్రం జరిగిన డీజే నైట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో క్విస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.హనుమంతరావు, ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కిశోర్బాబు, డీపీఎస్ ఆర్ డైరెక్టర్ డాక్టర్ బి.వి.సుబ్బారావు పాల్గొనగా, డాక్టర్ సమీర్ కుమార్ కన్వీనర్గా, డాక్టర్ లక్ష్మీవరప్రసాద్, డాక్టర్ అరుణ్ నంబి కో – కన్వీనర్లుగా వ్యవహరించారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
మార్కాపురం: తర్లుపాడు మండలంలోని కేతగుడిపి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలో నివసిస్తున్న వి.రమణకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లోని గృహోపకరణాలు, దుస్తులు, నిత్యావసర సరుకులు మంటల్లో కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చింది. బాఽధిత కుటుంబం వద్దకు సచివాలయం సిబ్బంది చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుంకేశుల గ్రామంలో గడ్డివామి దగ్ధం... పెద్దారవీడు మండలంలోని సుంకేశుల గ్రామంలో రైతు అనంతయ్యకు చెందిన గడ్డివామి శుక్రవారం దగ్ధమైంది. గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి పడేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న మార్కాపురం ఫైర్ ఆఫీసరు రామకృష్ణ తన సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పారు. సుమారు 30 వేల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. రూ.2 లక్షల ఆస్తి నష్టం -
ఏసీబీ వలలో మైన్స్ సర్వేయర్
ఒంగోలు సిటీ/మార్కాపురం/కనిగిరి రూరల్: ఒంగోలులోని గనులు, భూగర్భజలాల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించింది. ఆసిఫ్ది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయన గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశారు. ఏడాదిగా ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతో పాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తుల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమారు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీనోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటారు సైకిల్, విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు తెలిపారు. ఇవికాక అసిఫ్ హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్లో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. అలాగే టొయోటా హై రైడర్ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో ఒక లాకర్ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు చెప్పారు. -
జీజీహెచ్లో వైద్యసిబ్బందిని నియమించకుంటే చూస్తూ ఊరుకోం
మార్కాపురం జీజీహెచ్లో పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమించకపోతే చూస్తూ ఊరుకోమని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మార్కాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జీజీహెచ్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి దాదాపు 75 మంది వైద్యులు, స్పెషలిస్టులను నియమించి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జీజీహెచ్ను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు 60 మందికిపైగా వైద్యులను బదిలీ చేయడంతోపాటు 53 మంది నర్సింగ్ స్టాఫ్ను కూడా పిడుగురాళ్లకు బదిలీ చేయడం దుర్మార్గమని అన్నారు. జిల్లా ఇచ్చిన ఆనందాన్ని చంద్రబాబు నాయుడు తీసేశారని, ప్రస్తుతం జీజీహెచ్ పూర్తిగా ఖాళీ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న వైద్యశాలల్లో డాక్టర్లు, స్పెషలిస్టు వైద్యులు లేకపోతే రోగులకు ఎలా సేవలందుతాయని ఆయన ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించి మంచి సేవలు అందించాలని జంకె డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, గిరిజనులు, పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వైద్య సేవల కోసం జీజీహెచ్కి వస్తుంటారని తెలిపారు. ప్రస్తుతం జీజీహెచ్లో వైద్యులు లేకపోవడంతో ఓపీ కూడా తగ్గిపోయిందని తెలిపారు. ఇప్పటికై నా వైద్యారోగ్యశాఖ అఽధికారులు దృష్టిపెట్టి డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని జంకె కోరారు. వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి -
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
పొదిలి: ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళను హత్యచేసిన కేసులో నిందితుడు మెడబలిమి ఏడుకొండలను అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, పొదిలి సీఐ రాజేష్కుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరించారు. పొదిలి మండలంలోని గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన పులి బుల్లెమ్మ భర్త మల్లికార్జునరావు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బుల్లెమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన మెడబలిమి ఏడుకొండలు వ్యవహారశైలి గురించి ఏడుకొండలు భార్యతో బుల్లెమ్మ చెప్పింది. పలువురు మహిళలతో నీ భర్తకు వివాహేతర సంబంధం ఉందని చెప్పడంతో ఏడుకొండలుతో అతని భార్య గొడవపడి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. తన భార్య అలిగి వెళ్లిపోవడానికి బుల్లెమ్మ కారణమని భావించి ఆమైపె ఏడుకొండలు పగ పెంచుకున్నాడు. లైంగిక కోరికలు, పగ తీర్చుకునేందుకు గత సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ రాత్రి పూట ఒంటరిగా ఉన్న బుల్లెమ్మ ఇంటిలోకి ఏడుకొండలు వెళ్లాడు. లైంగిక కోరికలు తీర్చాలని బుల్లెమ్మపై ఒత్తిడి చేశాడు. అందుకు బుల్లెమ్మ అంగీకరించకుండా పెనుగులాడింది. దీంతో ఈ విషయం గ్రామంలోని వారికి తెలిస్తే పరువుపోతుందని, గొడవలు అవుతాయని భావించిన ఏడుకొండలు.. బుల్లెమ్మను చంపాలని నిర్ణయించుకున్నాడు. పక్కనే షోకేసులో ఉన్న ప్లాస్టిక్ తాడును బుల్లెమ్మ మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు.. పోలీసుల నుంచి ఎక్కువ రోజులు తప్పించుకుని తిరగడం కష్టమని భావించి వీఆర్ఓ కిలారి సుబ్బారావును సంప్రదించాడు. దీంతో ఏడుకొండలును పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నటు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ రాజేష్కుమార్, హెడ్ కానిస్టేబుల్ షాకీర్, కానిస్టేబుల్ కోటేశ్వరరావును జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. -
గుండె జబ్బుతో బాధపడుతున్నాం..ఇప్పుడేం చేయాలో..
నా పేరు సైకం ఏసులీల. భర్త పేరు కృష్ణ. మాకు నలుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లయిపోయాయి. మేము ఇద్దరమే కాలనీలో నివసిస్తున్నాం. ఇద్దరికీ గుండె జబ్బు.. రేషన్ బియ్యం తెచ్చుకొని వండుకొని తింటున్నాం. మా ఆయనకు పెన్షన్ వస్తుంది. దాంతో మందులు తెచ్చుకొని బతుకుతున్నాం. మమ్మల్ని చూసేవారులేరు. ఉన్న ఇల్లు కూడా అన్యాయంగా కూల్చేశారు. ఎక్కడికి పోవాలో తెలియడం లేదు. గత ఎన్నికల్లో కూటమికి ఓటేశాం. న్యాయం సంగతి దేవుడెరుగు ఇల్లు లేకుండా దగా చేశారు. ఇప్పటికై నా మాకు కార్మిక నగర్లో పట్టాలు ఇవ్వాలి. పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి. – సైకం ఏసులీల -
అధికారుల తలా ఒకమాట...
కార్మిక నగర్లో పేదలు నివసిస్తున్న ఇళ్లను ప్రైవేటు వ్యక్తులు కూల్చివేయడం గురించి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మిక నగర్ ఇళ్ల సమస్య వివాదంలో ఉందని, ఇళ్ల కూల్చి వేత గురించి తమకేమీ తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. డయల్ 100కు ఫోన్ వస్తే పోలీసు సిబ్బంది వెళ్లారని, అక్కడ భూ వివాదం జరుగుతుండడంతో పోలీసులు వెనక్కి వచ్చారని తాలుకా సీఐ విజయకృష్ణ చెబుతున్నారు. జేసీబీలతో ఇళ్లు కూల్చిన విషయం తెలియదని, బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు ఘటనా స్థలంలో ఒక మహిళా ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారని బాధితులు చెబుతుండడం గమనార్హం. రెండు మూడు రోజుల ముందే ఒక పోలీసు జీపు కార్మిక నగర్లోకి వచ్చి పోయిందని, ఇలా జరుగుతుందని తాము ఊహించలేకపోయామని బాధితులు వాపోతున్నారు. -
12 వరకు పదో తరగతి పరీక్షల ఫీజు పొడిగింపు
ఒంగోలు సిటీ: జిల్లాలో మార్చి 2026 లో జరగబోవు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులకు ఫీజు చెల్లింపు తేదీలను తత్కాల్ స్కీం ద్వారా పొడిగించినట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 6 నుంచి 12వ తేదీ లోపల అపరాధ రుసుం రూ.1000 లు చెల్లించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు ఈ నెల 6 నుంచి 12వ తేదీ లోపల నామినల్ రోల్స్, ఇతర పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలని కోరారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలు సిటీ: ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో సెమిస్టర్ మూల్యాంకనం ఈనెల 6వ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ డీ కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ అన్ని సబ్జెక్ట్ల పేపర్లు వచ్చాయని, యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డులతో ఆయా సంబంధిత ప్రిన్సిపాల్ వద్ద నుంచి రిలీవింగ్ ఆర్డర్ కాపీలతో కళాశాలలో రిపోర్ట్ చేయాల్సిందిగా కోరారు. మూల్యాంకనం తప్పనిసరి బాధ్యత కనుక సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లను అధ్యాపకులను రిలీవ్ చేయాలన్నారు. ఒంగోలు టౌన్: ఎట్టకేలకు మూడు బార్లకు లైసెన్సులు జారీ అయ్యాయి. ఒంగోలు కార్పొరేషన్ 1, మార్కాపురం 2 బార్లకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్ఓ చిన ఓబులేసు చాంబర్లో లాటరీ నిర్వహించారు. ఒంగోలు బార్కు నలుగురు, మార్కాపురంలోని రెండు బార్లకు 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి సమక్షంలో లాటరీ నిర్వహించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ అయేషా బేగం తెలిపారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం బార్లకు లైసెన్స ప్రక్రియ ముగిసిందని చెప్పారు. ● డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య దర్శి: కార్మికుల సమస్యల కోసం ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలని కోరుతూ ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు డీవైఎఫ్ఐ పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య తెలిపారు. స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ నాయకులు వినోద్, అక్బర్ ని కిడ్నాప్ చేసిన మోహన్బాబు యూనివర్సిటీని బ్లాక్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ పిరా సాహెబ్, ఆర్ జెస్సిపాల్, నాయకులు కొండలు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం: కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పానుగంటి షాలేమ్రాజు, జిల్లా అధ్యక్షుడు మందాటి పీటర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నేదరపల్లి జయరాజ్ అన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా బొందిమడుగులలో ఎమ్మార్పీఎస్ నాయకులు టీఎం రమేష్ మాదిగను దారుణంగా హత్యచేయడాన్ని ఖండిస్తూ గురువారం మార్కాపురంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద, సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, దళితులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం పోరాడిన రమేష్ను దారుణంగా హత్య చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రమేష్ కుటుంబానికి పరిహారం అందించి, 5 ఎకరాల భూమిని, కుటుంబంలో ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గోన మొహన్, బూదాల ఆనంద్, భాస్కర్, గుర్రం రాణమ్మ, పి శీల, రాజు శ్రీధర్, మహేష్, సుధీర్, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పోరు బాట
నంద్యాల జిల్లా నందికొట్కూరు వద్ద ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నఅన్యాయానికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్తో పాటు పలువురు నియోజకవర్గ ఇన్చార్జ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మార్కాపురం టౌన్: మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకానికి వచ్చే భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సబ్కలెక్టర్ కార్యాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా త్రిపురాంతకం ఆలయం వద్ద తీసుకోవాల్సిన ఏర్పాట్లపై గురువారం ఆయన రెవెన్యూ, పోలీసు, దేవదాయశాఖ, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీరకాల వసతులు కల్పించాలని జేసీ సూచించారు. దేవస్థాన ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, భక్తులకు తాగునీరు అందించాలని, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, తొక్కిసలాట జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు మాట్లాడుతూ త్రిపురాంతకేశ్వరస్వామి రథోత్సవానికి సుమారు 45 నుంచి 50 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే అభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయని, భక్తుల సౌకర్యార్థం రూ.10, రూ.100, రూ.250 టిక్కెట్లను ప్రవేశపెడుతున్నామన్నారు. భోజన వసతి, మజ్జిగ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గూడు కూల్చి.. గుండె పగలకొట్టి..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దశాబ్దం క్రితం ఊరికి ఉత్తరాన దూరంగా విసిరేసినట్లున్న ప్రాంతం అది. ముక్తినూతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేసర్వే నంబర్ 186 లోని 12 ఎకరాల ఇనాం భూములు. నగరంలో తలదాచుకునేందుకు కాసింత చోటు లేని 60 కుటుంబాలకు చెందిన నిరుపేద ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కనీసం గుడిసెలేసుకునే తాహతు కూడా లేక చిరిగి పోయిన పాత చీరలను చుట్టూ కట్టేసుకొని లోపల నివాసం ఉంటున్నారు. కాలక్రమంలో రేకుల షెడ్డులు వేసుకున్నారు. అప్పో సప్పో చేసిన ఒకరిద్దిరు పక్కా గృహాలు నిర్మించుకున్నారు. అయితే ఇటీవల ఈ భూముల ధరలు భారీగా పెరిగాయి. వందల కోట్ల రూపాయలకు పెరిగిన ఈ భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా దీన్ని కాజేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు దొడ్డి దారిన డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు. ఇనాం భూములను రిజిస్టర్ భూములుగా చెబుతూ కాలనీపై పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నిజానికి ఈ భూములను ఇప్పటి వరకు ఎవరూ క్లయిమ్ చేసుకోలేదని, నిబంధనల ప్రకారం ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తరువాత అక్కడ పదేళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు చెబుతున్నారు. ఇనాం భూములను ఎవరికై నా సరే ఎలా రిజిస్టర్ చేస్తారని వాదిస్తున్నారు. పేదల భూములపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు ఒక వ్యూహం ప్రకారం భూముల కబ్జాకు పాల్పడ్డారని, అందులో భాగంగానే పదేళ్లుగా నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను అక్రమంగా కూల్చేశారని ఆరోపిస్తున్నారు. కరెంటు, మంచినీరు లేకపోయినా... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు 11 ఏళ్ల క్రితం నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఇక్కడ 60 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరిలో 15 ఎస్సీ కుటుంబాలు, 30 బీసీ కుటుంబాలు, 12 మైనార్టీ, 4 ఓసీ కుటుంబాలకు చెందిన వారున్నారు. వంటపని, ఇళ్లలో పాచిపనులు, హోటళ్లు, హాస్పిటళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు. మంచినీటి కొళాయిలు, విద్యుత్ సౌకర్యం లేదు. రాత్రయ్యే సరికల్లా గుడ్డి దీపాలు వెలిగించుకొని బిక్కు బిక్కుమని బతుకులు వెళ్లదీస్తున్నారు. తరుచూ ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తుంటాయి. దాంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్లాపాపలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. మోంథా తుఫాను సమయంలో కాలనీ నీట మునిగింది. అయినా సరే నీళ్లు తోడేసుకొన్నారు. తలదాచుకునేందుకు మరో అవకాశం లేకపోవడంతో ఇక్కడ జీవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా తమకు పట్టాలు ఇవ్వాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు. గత ఎన్నికలకు ముందు మేము గెలిస్తే మీకు న్యాయం చేస్తానంటూ కూటమి నాయకులు చెప్పారని, నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నెత్తిమీద నీడలేకుండా చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే కార్మిక నగర్ను నేలమట్టం చేశారని ఇక్కడి మహిళలు వాపోతున్నారు. మేమేం పాపం చేశామయ్యా... నా భర్త అనారోగ్యంతో ఉన్నారు. మాకు ఇద్దరు పిల్లలున్నారు. 11 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం. కూలీనాలి చేసుకొని బతుకుతున్నాం. కరెంటు లేదు. మంచినీళ్లు రావు. అయినా సరే గతి లేక ఇక్కడే సర్దుకొని జీవిస్తున్నాం. మాకు పట్టాలు ఇచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నాం. అదిగో ఇదిగో అంటూ చెబుతూ వచ్చారు. కానీ ఇంత పెద్ద కుట్ర చేస్తారని అనుకోలేదు. కట్టుకునే దుస్తులు, సామాన్లు కూడా తీసుకోకుండా ఇళ్లు కూల్చేయడానికి మేమేం పాపం చేశామయ్యా. ఇంత కక్ష ఎందుకు. నిరుపేదలకు పొట్టగొడితే మీకేం వస్తుంది. అయ్యా ..మాకు న్యాయం చేయండి. అన్యాయంగా మా ఇళ్లు కూల్చేసిన వారిని కఠినంగా శిక్షించండి. – షేక్ షంషాద్ బేగం మా పార్టీ అధికారంలో ఉంది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని బెదిరింపులు -
వీధి కుక్కల స్వైరవిహారం
● గురువారం ఒక్కరోజే ఏడుగురిపై దాడి హనుమంతునిపాడు: వీధి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం ఒక్క రోజే ఏడుగురిపై దాడి చేశాయి. దీంతో బాధితులంతా స్థానిక పీహెచ్సీకి వచ్చి వైద్యం పొందారు. మండలంలోని రశీదుపురానికి చెందిన సజ్జన్, హనుమంతునిపాడుకు చెందిన జి.తిరుపతమ్మ, నల్లగుండ్లకు చెందిన జి.హాన్సీ, వి.రత్తమ్మ, వేములపాడుకు చెందిన సీహెచ్ గంగాధర్, వాలిచర్లకు చెందిన వినయ్బాబు, ఎం వైశాల్యపై కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యారు. ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కుక్కల దాడి ఎక్కువైంది. దీంతో చిన్న పిల్లల తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఒంగోలు సబర్బన్: హరితాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపుపై గురువారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలో ప్రజలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు చురుకై న పాత్ర పోషించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్య, గిరిజన, పరిశ్రమల శాఖలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలను భాగస్వాములను చేస్తూ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటవీ విస్తీర్ణం 37 శాతం ఉందని, దీనికి 2030 నాటికి మరో 7 శాతం జోడించాల్సి ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సంబంధిత శాఖల నుంచి డిమాండ్ను తెలుసుకున్నారు. ఆ మేరకు మొక్కలు సరఫరా చేసి నాటించి, పర్యవేక్షించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలను అడవుల పెంపకానికి సమర్ధంగా వినియోగిచుకునేలా భాగస్వాములు దృష్టి సారించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో డీఎఫ్ఓ వినోద్కుమార్, డీఈఓ రేణుక, ఆర్ఐఓ ఆంజనేయులు, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, డ్వామా పీడీ జోసఫ్కుమార్, ఒంగోలు నగర కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ రవినాయక్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస రావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు బస్టాండ్ ఆవరణలో తమ వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని జేసీ దృష్టికి తీసుకెళ్లగా మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్ ప్రాంగణం మొత్తాన్ని శుభ్రంగా ఉంచాలని డిపో మేనేజర్ లావణ్యను ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి ఉన్నారు. సీఎస్పురం(పామూరు): మహాశివరాత్రి వేడుకలకు భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లను దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రకాశం జిల్లా ఏసీ ఎం పానకాలరావు గురువారం పరిశీలించారు. భక్తులకు ఎక్కడా తాగునీటి ఇబ్బందులు, క్యూలైన్లలో ఇబ్బందులు, వాహన పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏర్పాట్లపై ఈఓతో చర్చించి సూచనలు చేశారు. భైరవకోన ఆలయ చైర్మన్ ముప్పాళ్ల శ్యామ్సుందర్రాజు, సూపరింటెండెంట్ జి.శ్రీధర్రెడ్డి, ఇన్స్పెక్టర్ జి.ఏ.సత్యనారాయణ, చైతన్య, ఈఓ గిరిరాజు నరసింహబాబు, డిం.వంశీకృష్ణారెడ్డి ఉన్నారు. -
ఆర్మీ అధికారి అంత్యక్రియలు
అశ్రునయనాల మధ్య కంభం: తండ్రి చనిపోయి రెండు నెలలు గడవక ముందే కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటన మండలంలోని తురిమెళ్ల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన యేలం వెంకటరమణ(49) 30 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల లెఫ్టనెంట్గా పదోన్నతి పొంది అసోం రాష్ట్రం దిబ్రూగఢ్లో విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహించే క్రమంలో బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు వైద్యశాలలో చేర్పించగా..అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మరో నెల రోజుల్లో వెంకటరమణ రిటైర్డ్ అయి ఇంటికి రావాల్సి ఉండగా ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గురువారం ఆర్మీ అధికారి మృతదేహాన్ని తురిమెళ్లకు తీసుకురాగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల వెంకట రమణ తండ్రి వేమయ్య మరణించడంతో ఆయన దిశదిన కార్యక్రమాలు నిర్వహించే ఇటీవలే తిరిగి వెళ్లారు. అంతలోనే అంతలోనే తనువు చాలించడంతో గ్రామంలో సైతం విషాదచాయలు అలుముకున్నాయి. ఆర్మీ మేజర్ ఎస్పీ సింగ్, నాయక్ సుబేదార్లు గోపాల్రెడ్డి, గంగాసింగ్, హవాల్దార్ కేపీ గౌడ్ ప్రేరేడ్ నిర్వహించి అధికార లాంఛనలాతో అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబసభ్యులకు జాతీయ జెండా అందజేశారు. తహసీల్దార్ వి. కిరణ్కుమార్, కంభం ఎస్సై శివక్రిష్ణారెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు వేణుగోపాల్, సంకతాల ప్రసాద్, పుల్లయ్య, పోలయ్య, శ్రీనివాసులు, తదితరులు మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతి చెందిన వెంకటరమణ (ఫైల్) మరో నెలరోజుల్లో రిటైర్డ్ కానున్న వెంకటరమణ అంతలోనే ఇలా జరగడంతో కుటుంబంలో విషాదం తండ్రి చనిపోయి రెండు నెలలు గడవకముందే కుమారుడు మృతి తురిమెళ్ల గ్రామంలో విషాదచాయలు -
బీచ్ ఫెస్టివల్ జయప్రదం చేయండి
● కలెక్టర్ పి.రాజాబాబు సింగరాయకొండ: పాకల బీచ్లో ఈ నెల 14,15 తేదీల్లో జరిగే బీచ్ ఫెస్టివల్ జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ బి.రాజాబాబు అన్నారు. బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన పనులపై గురువారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో ప్రముఖంగా ఎగ్జిబిషన్, స్టేజ్షోలు, సింగర్స్, సెలబ్రిటీల హంగామా, వాటర్ గేమ్స్, హెలీ టూరిజం, వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఫెస్టివల్లో 30 వేల మంది పాల్గొంటారని భావిస్తున్నామని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తామన్నారు. బీచ్ ఫెస్టివల్కు బస్సులు, కార్లు, మోటార్సైకిల్పై వచ్చే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ వసతి కల్పిస్తామన్నారు. తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించి సింగరాయకొండ– పాకల, పాకల– ఊళ్లపాలెం మధ్య రోడ్డు గుంతలు పూడ్చాలని సంబంధిత శాఖల నుంచి నిధులు సమీకరించుకోవాలని సూచించారు. ఫెస్టివల్ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. తరువాత పాకల పల్లెపాలెంలో అక్షరాంధ్ర కేంద్రాన్ని సందర్శించి మహిళలతో మాట్లాడారు. డీఆర్ఓ ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాజేష్, సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జగనన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం
● వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో అన్నా కొనకనమిట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి, తువ్వపాడు, కాట్రగుంట పంచాయతీ ఓబులరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం నిర్వహించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గ్రామ కమిటీలు పటిష్టంగా ఉండాలని, కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న వ్యక్తిగత వర్గ విభేదాలు విడనాడి పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యకర్తల కోసం పోరాడేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే దిశగా అక్రమ కేసులు పెట్టి క్షణికానందం పొందుతున్నారని, అవి ఇంకెంతోకాలం సాగవని కూటమి నాయకులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దోచుకో..దాచుకో అనే విధానంతో ముందుకెళ్తోందని, బాబు పాలనలో వ్యవస్థల్లో అవినీతి పెరిగిపోయిందని అన్నా ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు శక్తులకు దోచిపెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం చేపట్టి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా మనం ప్రజల్లోకి తీసుకెళదామన్నారు. ముందుగా ఆయా గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కొండారెడ్డి, మందలపు శ్రీనివాసులరెడ్డి, రాజాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్రెడ్డి, తువ్వపాడు సర్పంచ్ శిలువకుమారి, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కందెర పెద్దన్న, కుమ్మరి రమణయ్య, చిరుగూరి కోటేశ్వరరావు, మంచికల కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు
మద్దిపాడు: పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి రెవెన్యూ శాఖ సిబ్బందిని హెచ్చరించారు. మండల కేంద్రమైన మద్దిపాడులో గురువారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టాల్లో ఏవైనా తప్పులు దొర్లితే సరి చేయించుకోవాలని రైతులను కోరారు. ఈ క్రమంలో పలువురు రైతులు తమ ఆవేదనను జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. పొలం విస్తీర్ణం తక్కువగా నమోదు చేశారని, అదేమని అడిగితే మీ పొలం మేం తీసుకోవడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా సర్వేయర్ సమాధానం ఇచ్చారని వాపోయారు. మరో రైతు శుద్ధపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొలాన్ని ఆన్లైన్లో తక్కువగా నమోదు చేశారని, దీనిపై రెండుసార్లు అర్జీ ఇఛ్చినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. మరోరైతు సింగారావు తమ బంధువుల పొలం తనకు ఆన్లైన్లో ఎక్కిందని చెప్పినా సరి చేయకుండా తనతో వేలి ముద్ర వేయించుకుని పాసుపుస్తకం ఇచ్చారని తెలిపారు. ఇలా పలువురు రైతులు సమస్యలు ఏకరువు పెట్టడంతో తొలుత జేసీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరి కొందరు నాయకులు మాట్లాడుతూ ఎకరాకు ఐదు సెంట్లు లోపు తగ్గితే దానిని ఒప్పుకోవాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయని వీఆర్ఓ, సర్వేయర్లు చెబుతున్నారని తెలిపారు. దీందో జేసీ తొలుత వీఆర్ఓ, సర్వేయర్లపై మండిపడి వారిని ప్రశ్నించగా వారు బిక్కముఖం వేశారు. ఇన్ని తప్పులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నలను ప్రశ్నించి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వీఆర్ఓ, సర్వేయర్కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పలువురు విలేకరులు మాట్లాడుతూ ఇప్పటి వరకు రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతులను పిలవకుండానే రీ సర్వే పూర్తి చేశారని, దీంతో భారీగా తప్పులు నమోదయ్యాయని చెప్పారు. దీనికి జేసీ స్పందించి ఇప్పటి వరకు రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, రీ సర్వే జరగనున్న గ్రామాల్లో తప్పులు లేకుండా పర్యవేక్షించాలని తహసీల్దార్, ఆర్డీఓను ఆదేశించారు. రీ సర్వే సమయంలో రైతులను నగదు కోసం పీడించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో ఆర్డీఓ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఎవరికీ మినహాయింపు లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పాస్పుస్తకాల్లో తప్పులపై వీఆర్ఓ, సర్వేయర్పై మండిపాటు మీరేం చేస్తున్నారని తహసీల్దార్, ఆర్డీఓపై అసహనం -
సహజీవనం చేస్తున్న మహిళపై దాష్టీకం
బిట్రగుంట / కావలి రూరల్: బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో అద్దెకు ఉంటున్న లోకో పైలెట్ గుంజి వెంకటశేషారావు తనతో సహజీవనం చేస్తున్న మహిళపై దాష్టీకానికి ఒడిగట్టాడు. కావలి పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ గురువారం కేసు పూర్వాపరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడుకు చెందిన గుంజి వెంకటశేషారావు లోకో పైలెట్గా పనిచేస్తున్నారు. అతనికి కావలికి చెందిన శ్రీలేఖతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య భర్తలు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో సుమారు మూడేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా విశాఖపట్నంలోని చిన్నముసిడివాడకు చెందిన కరుణకుమారితో పరిచయం ఏర్పడింది. వెంకటశేషారావు బిట్రగుంటలోనే లోకో పైలెట్గా విధులు నిర్వహిస్తుండటంతో గతేడాది జూన్ నుంచి విశ్వనాథరావుపేటలో భార్య భర్తలుగా ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. ఈ క్రమంలో వెంకటశేషారావు కావలిలో ఉంటున్న తన పిల్లలను చూసేందుకు వెళ్లిన ప్రతీసారి కరుణకుమారితో గొడవ జరిగేది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన వెంకటశేషారావుకు కరుణకుమారితో మరోమారు గొడవ జరిగింది. దీంతో కూరగాయలు కోసే కత్తితో కరుణకుమారిపై దారుణంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు తొలుత కావలి ఏరియా వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటున్నట్లు తెలిసింది. కాగా గర్భిణిపై కత్తితో దాడి అంటూ సోషల్ మీడియాలో, ఇతర మీడియాల్లో వస్తున్న కథనాలను పోలీసులు ఖండించారు. ఒంగోలు టౌన్: జె.పంగులూరు మండలం కొండమూరు గ్రామం వద్ద 2019లో జరిగిన హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఒంగోలు మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొండమూరు గ్రామానికి చెందిన చిలమకూరి అనంతరెడ్డి(33)కి అదే గ్రామానికి చెందిన చిలమకూరి వెంకట కృష్ణారెడ్డికి మధ్య చాలా కాలంగా భూ వివాదం ఉంది. ఈ క్రమంలో అనంతరెడ్డి నిర్మించిన కాంపౌండ్ వాల్తో కృష్ణారెడ్డి మరింత పగ పెంచుకున్నాడు. 2019 ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో అనంతరెడ్డి స్నేహితుడితో కలిసి మోటారు బైకుపై రేణంగివరం గ్రామం నుంచి కొండమూరు వెళుతున్నాడు. అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం బీమనాథం దిలీప్రెడ్డి మోటారు బైకును అడ్డగించి అనంతరెడ్డిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. దాడిలో అనంతరెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ హత్యను జె.పంగులూరు పోలీస్స్టేషన్లో అప్పటి ఎస్సై కె.అజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పట్లో ఇంకొల్లు సీఐగా ఉన్న మద్దినేని శేషగిరిరావు దర్యాప్తు చేశారు. అనంతరం చార్జిషీటు దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవీ రమేశ్వర్రెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. పోలీసులు సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి విచారణను సమర్ధవంతంగా నడిపించారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు కావడంతో గురువారం మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఏ.పూర్ణిమ నిందితులకు జీవితఖైదుతో పాటుగా ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించారు. హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్, కోర్టు లైజన్ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి ఎస్పీ హర్షవర్థన్ రాజు అభినందనలు తెలిపారు. మొదటి భార్య వద్దకు ఎందుకెళ్తున్నావని గొడవ -
మా పార్టీ అధికారంలో ఉంది.. దిక్కున్న చోట చెప్పుకోండి
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలు నార్త్ బైపాస్లోని హెచ్సీజీ క్యాన్సర్ ఆస్పత్రి వెనక ఉన్న కార్మిక నగర్ను బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు నేలమట్టం చేశారు. సుమారు 200 మంది ప్రైవేటు సైన్యం, మూడు జేసీబీలను తీసుకొచ్చి కాలనీపై విరుచుకు పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 186లో సుమారు 12 ఎకరాల ఈనాం భూములు ఉన్నాయి. గత 11 ఏళ్లుగా కూలినాలి చేసుకునే కొందరు నిరుపేదలు రేకుల షెడ్లు, గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలనీలో విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేనప్పటికీ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కార్మికనగర్లో భూముల విలువ భారీగా పెరిగింది. ఎకరం రూ.12 కోట్ల చొప్పున పలుకుతుండడంతో అధికార పార్టీకి చెందిన బడా నాయకుల కన్నుపడింది. శరవేగంగా తెరవెనుక తతంగం నడిపించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేతలు తమ ప్రైవేటు సైన్యంతో కార్మిక నగర్లోకి ప్రవేశించారు. అక్కడ 60 ఇళ్లల్లో నివాసం ఉండే నిరుపేదలకు ఏం జరుగుతుందో తెలియలేదు. చీకట్లోనే జేసీబీలతో ఇళ్లను వరుసగా నేలకూల్చారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించడంతో పాటు దాడికి దిగారు. ఒక ఇంటిని తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కేవలం గంటన్నర లోపే కాలనీలో షెడ్లు, గుడిసెలు నేలమట్టయ్యాయి. బాధితుల రోదనలు మిన్నంటినా పట్టించుకునే వారు లేరు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. కనీసం సామాన్లు సర్దుకునేందుకు సమయం ఇవ్వమంటూ కాళ్లు చేతులు పట్టుకుని బతిమాలినా వినలేదని బాధిత మహిళలు రోదిస్తున్నారు. అడ్డు వస్తే మనుషులను కూడా కూల్చేస్తాం.. ‘ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు కాకపోతే మరోసారి ఈ భూములను తీసుకోలేం.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అని బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేవలం ఇళ్లను మాత్రమే కూల్చేశాం.. రేపు అవసరమైతే మనుషులను కూడా ఇలాగే కూల్చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు వాపోయారు. ఇదంతా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విధ్వంసం జరుగుతున్న సమయంలో ఒక మహిళా ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై తాలుకా సీఐ విజయకృష్ణను విచారించగా డయల్ 100కు ఫోన్ వస్తే తమ సిబ్బంది వెళ్లారని, ఏదో భూవివాదం జరుగుతుండడంతో తమకు సంబంధం లేదని.. వెనక్కి వచ్చేశారని చెప్పారు. జేసీబీల విషయం తమకు తెలియదని.. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ఇల్లు నాదే’ .. కబ్జాకు టీడీపీ నేత కుట్ర
సాక్షి,ఒంగోలు: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకీ శృతిమించిపోతున్నాయి. అధికార మదంతో రెచ్చిపోతున్నారు. యజమానులను బెదిరించి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ‘నువ్వు కట్టుకున్న ఇల్లు నాదే.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో’.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.తాజాగా, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం బాలాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శివకుమార్ అనే వ్యక్తి ఇంటిపై టీడీపీ నేత కాట్రగడ్డ రఘు కన్నుపడింది. అంతే అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ను రఘు అనుచరులు ఇంట్లోకి ప్రవేశించి, ఆయనను బలవంతంగా బయటకు గెంటివేశారు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి.. ‘ఇల్లు మాది’ అంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు శివకుమార్ మాట్లాడుతూ.. తాను స్థలం కొనుగోలు చేసి, కష్టపడి ఇల్లు నిర్మించుకున్న తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయని వాపోయాడు. రఘు,ఆయన అనుచరులు తమను టార్గెట్ చేస్తూ, ఇల్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దిక్కున చోటు చెప్పుకో పో’ అంటూ రఘు అనుచరులు బెదిరింపులకు దిగారని మీడియా ఎదుట వాపోయారు. తమకు న్యాయం చేయాలని, దాడులకు తెగబడుతున్న రఘును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఇటుకరాయి తలపై పడి మహిళ మృతి
సీఎస్పురం(పామూరు): తిరుపతిలో గృహ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో మహిళా కూలీ తలపై ఇటుకరాయి పడటంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా క్షతగాత్రురాలు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాలు.. మండల కేంద్రమైన సీఎస్పురం వడ్డెపాలేనికి చెందిన బండారు అంజలి, ఆమె భర్త అంకాలు తిరుపతిలో భవన నిర్మాణ పనులకు వెళ్లారు. సోమవారం సాయంత్రం పని చేస్తున్న సమయంలో అంజలి తలపై ఇటుక పడి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని తిరుపతిలోని ఓ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తుండగా మంగళవారం వేకువజామున మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంజలి మృతితో వడ్డెపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సొంత నిధులతో మెటల్ రోడ్డు
● రూ.3 లక్షలు వెచ్చిస్తున్న చాపలమడుగు సర్పంచ్ పుల్లలచెరువు: మండలంలోని చాపలమడుగు పంచాయతీలోని సి.కొత్తపల్లి గ్రామానికి రహదారి సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని గ్రామానికి చెందిన కొందరు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ టి.సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులు రూ.3 లక్షలు వెచ్చించి మెటల్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. బుధవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రహదారి కోసం 600 ట్రాక్టర్ల గ్రావెల్ వినియోగిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే, సర్పంచ్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మల్లాపాలెం సర్పంచ్ ఆవుల రమణారెడ్డి, నాయకులు లింగం రవి, సంపతి, చిన్న ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏయ్ బయటకు వెళ్లు.. లేదా సంతకం పెట్టి మాట్లాడు
పుల్లలచెరువు: ‘సంతకం పెట్టి మాట్లాడు, బయట ఉండి మాట్లాడతావేంటి, ముందు బయటకు వెళ్లి మాట్లాడు’ అంటూ ఎంపీటీసీ సభ్యుడు, మండల ఉపాధ్యక్షుడు ఎల్.రాములుపై ఎంపీడీఓ మరియదాసు నోరుపారేసుకున్నారు. బుధవారం ఎంపీపీ అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంది. కోరం లేకుండా సమావేశం నిర్వహించేందుకు ఎంపీడీఓ సిద్ధం కావడంతో ఎంపీటీసీ సభ్యుడు రాములు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఎంపీడీఓ ఇష్టారీతిగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. కోరం ఎక్కడుందో చూపండి అని ఎంపీటీసీ కోరగా.. ‘ముందు బయటకు వెళ్లు, లేదా సంతకం పెట్టి సభలో ఉండు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతాం. అంతే కానీ సంతకం పెట్టకుండా మాట్లాడకు, ముందు కార్యాలయం నుంచి బయటకు వెళ్లు’ అని ఎంపీడీఓ దురుసుగా మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎంపీడీఓ తీరు పచ్చ కండువా కప్పుకొన్న రాజకీయ నాయకుడిలా ఉందని అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే అక్కడికి పోలీసులు చేరుకోవడం, రైతుల ఇబ్బందులపై సభ్యులు, విలేకర్లు ప్రశ్నిస్తుండగా పోలీసులు వారించడంతో సమావేశం రసాభాసగా మారింది. కోరం లేకుండా, ముఖ్య శాఖల అధికారులు పాల్గొనకుండానే సభ నిర్వహించి మమ అనిపించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చ ఆవగింజంతైనా అవకాశం లేకుండా ఎంపీడీఓ ఇష్టానుసారం వ్యవహరించారని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఎంపీడీఓ వ్యవహార శైలిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీటీసీ సభ్యుడు ఎల్.రాములు తెలిపారు. ఇదిలా ఉండగా సర్వసభ్య సమావేశంలో బయట వ్యక్తులు దర్జాగా పాల్గొనడం కొసమెరుపు. పుల్లలచెరువు ఎంపీడీఓ మరియదాసు నోటి దురుసు ఎంపీటీసీ సభ్యుడు రాములుపై దుర్భాష కోరం లేకుండానే సమావేశం నిర్వహణ -
కిడ్నాపర్లపై చర్యలేవి?
ఒంగోలు టౌన్: తిరుపతిలోని ఎంబీ యూనివర్శిటీలో అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్వి వీరాస్వామి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. బుధవారం నగరంలోని రంగరాయుడు చెరువు వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంబీ ఈ సందర్బంగా వీరాస్వామి మాట్లాడుతూ... ఎంబీ యూనివర్శిటీలో అక్రమాలను ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేక ఆ సంస్థ యాజమాన్యం విద్యార్థి సంఘ నాయకులకు కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. టంగుటూరు: జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 31వ తేదీన ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఆయుధం సన్నీకుమార్ ద్వితీయస్థానం సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
స్టడీ.. రెడీ!
పదో తరగతిలో మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం ఉన్న గణతం సబ్జెక్టుపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 100 రోజుల ప్రణాళికను ఉపాధ్యాయులు కచ్చితంగా అనుసరించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలే విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. సులువుగా ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉన్న సబ్జెక్టులకు ఎక్కువ సమయం, కష్టమైన సబ్జెక్టులకు తక్కువ సమయం ఇవ్వడంతో విద్యార్థులు మదనపడుతున్నారు. విద్యాశాఖ ఆదేశాలను ధిక్కరిస్తే చిక్కులు తప్పవని భావించిన ఉపాధ్యాయులు కిమ్మనడం లేదు. గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల ప్రిపరేషన్పై విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందుతున్నారు. మంచి స్కోర్ వచ్చే ఈ రెండు సబ్జెక్టులకు 100 రోజుల ప్రణాళికలో తక్కువ సమయం కేటాయించడంపై విద్యాశాఖ అధికారులు పునరాలోచన చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మార్కాపురం: విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. విద్యార్థుల బంగారు భవితకు పునాది వేసి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తొలిమెట్టు లాంటిది. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలకు ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించింది. యాక్షన్ ప్లాన్ ప్రారంభమై 60 రోజులు గడిచిపోయాయి. పరీక్షలకు మరో 40 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో 197 హైస్కూళ్ల నుంచి దాదాపు 28 వేల మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే విద్యార్ధులు స్టడీ అవర్స్లో కుస్తీలు పడుతున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో సిలబస్ ఇంకా కొనసాగుతోంది. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం కోసం ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక స్టడీ అవర్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను దత్తత తీసుకుని వెనుకబడిన సబ్జెక్టుల్లో సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అసెస్మెంట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. షైనింగ్, రైజింగ్ స్టార్స్గా విభజన ప్రతి పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్గా విభజించారు. చదువులో ముందుండే వారిని షైనింగ్ స్టార్లుగా పేర్కాన్న విద్యాశాఖ వారిపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక మార్కులు సాధించేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిని రైజింగ్ స్టార్స్గా పేర్కొంటూ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించేలా పాఠ్యాంశాలు బోధించాలని సూచించింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు కుస్తీ పడుతున్న విద్యార్థులు సర్కారు 100 రోజుల ప్రణాళికలో లోపాలు సబెక్టులకు కేటాయించిన సమయంపై ఆందోళన కొన్ని పాఠశాలల్లో ఇంకా పూర్తి కాని సిలబస్ -
కారుణ్య నియామకంలో 8 మందికి ఉద్యోగాలు
ఒంగోలు సిటీ: జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలో పనిచేస్తూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా 8 మందికి ఆఫీస్ సబార్డినేట్లుగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ నియామక ఉత్తర్వులను అందజేశారు. మండల ప్రజా పరిషత్, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో నియమించారు. ఒంటేరు బాల సుబ్రహ్మణ్యం దొనకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలకు, ముద్రగడ దివ్యాంజలికి టంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో, షేక్ రజియా బేస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయంలో, వలేటి దిలీప్కుమార్ను హనుమంతునిపాడు మండల పరిషత్ కార్యాలయంలో, కొంగలేటి దిలీప్కుమార్ ఆమనిగుడిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు, దేవండ్ల మహాలక్ష్మి కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో, అద్దంకి లక్ష్మిశశికళను వైదేన జెడ్పీ ఉన్నత పాఠశాలకు, బూచిరాజు నాగరాజు సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో నియమిస్తూ జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో సీఈఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
పన్ను వసూలు చేయలేదని వీడీఓ సస్పెన్షన్
చీమకుర్తి రూరల్: మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామ సచివాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న శ్యామ్పై జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హౌస్ టాక్స్ సక్రమంగా వసూలు చేయడం లేదనే కారణంతో సస్పెండ్ చేస్తూ డీపీఓ వెంకటేశ్వరావు ఉత్తర్వులు ఇచ్చారని ఎంపీడీఓ రాఘేంద్ర తెలిపారు. గిద్దలూరు(బేస్తవారిపేట): స్థానిక నంద్యాల రోడ్డులోని సగిలేరు రైల్వే వంతెనపై గూడ్స్ రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెకు చెందిన జంగం రమణారెడ్డి(45) భార్యతో విభేదాల నేపథ్యంలో ఒంటరిగా తల్లి వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి సగిలేరు వాగు వంతెన మీద రైల్వే ట్రాక్పై సెల్ఫోన్ చూస్తున్నాడు. అదే సమయంలో గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో వంతెన నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే ట్రాక్ తనిఖీ చేస్తున్న ట్రాక్మన్ మద్దిలేటి వంతెన కింద ఒకరు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మేదరమెట్ల: లారీ కింద కిందపడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గురువారం మేదరమెట్లలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(65) కూరగాయలు, సరుకులు కొనుగోలు చేసేందుకు మెయిన్ సెంటర్కు వెళ్తుండగా, అదే సమయంలో మలుపు తిరుగుతున్న కంటైనర్ లారీ వెనుక భాగం ఆమెను ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కింద వృద్ధురాలు పడిపోవడంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రురాలిని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్దిపాడు: నీళ్ల ట్యాంకర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి సర్వీస్ రోడ్డులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. గుండ్లాపల్లి గ్రామానికి చెందిన సాదినేని ఆంజనేయులు(59) మోటారుసైకిల్పై గుండ్లాపల్లి ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డులోకి వస్తుండగా వెనుక నుంచి కల్యాణి ఆక్వా సంస్థకు చెందిన నీళ్ల ట్యాంకర్ ఢీకొట్టింది. ట్యాంకర్ వెనుక టైరు కింద పడిపోవడంతో ఆంజనేయులు తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మద్దిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● రూ.5 లక్షల మేర నష్టం యర్రగొండపాలెం: మండలంలోని పందివానిపల్లె గ్రామంలో పొగాకు పందిరికి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో దాదాపు రూ 5 లక్షల రూపాయల విలువైన 30 క్వింటాళ్ల పొగాకు దగ్ధమైంది. ఉద్దేశపూర్వకంగా తన పొగాకును తగలబెట్టారని బాధిత రైతు మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టంగుటూరు: పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన టంగుటూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ఇద్దరు వ్యక్తులు రాజమండ్రి నుంచి సింగరాయకొండకు సుమారు 2.6 కేజీల గంజాయిని రైలు మార్గం ద్వారా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఈగల్ టీం సీఐ సుధాకర్, ఎస్సై సుదర్శన్ మాటు వేశారు. ఇద్దరు వ్యక్తులు సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గాన వచ్చి టోల్ ప్లాజా వద్ద మార్పిడి చేస్తున్న సమయంలో ఈగల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని టంగుటూరు పోలీసు స్టేషన్కు తరలించారు. ఇద్దరు నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం. -
ఛలో పోతిరెడ్డిపాడు వాల్పోస్టర్ ఆవిష్కరణ
కనిగిరిరూరల్: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డి కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటూ రైతులకు, ప్రజలకు తాగు, సాగు నీరు లేకుండా దూరం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు, రాయలసీమకు జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి నిరసనగా ఈ నెల 5న ఉదయం 10 గంటలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డి పాడు వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఛలో పోతిరెడ్డిపాడు వాల్పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దద్దాల నారాయణ యాదవ్ రెండు తెలుగు రాష్ట్రాల కుమ్మకై ్క రాజకీయాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఛలో పోతిరెడ్డి పాడు బహిరంగ సభకు 5వ తేదీ ఉదయం 7 గంటలకు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలు దేరనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఓకేరెడ్డి, జి.బొర్రారెడ్డి, కటికల వెంకట రత్నం, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, తమ్మినేని సుజాత, రామనబోయిన శ్రీను, పోలక సిద్ధారెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్ రసూల్, ఆయిమల్ల నాగమణి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కార్యదర్శులు దాదిరెడ్డి మాలకొండారెడ్డి, సంగటి మహేంద్రారెడ్డి, బత్తుల మాలీ, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, బచ్చు వెంగళరావు, ఎస్కే రహీం బాషా, ఎస్కే ఖాశింవలి, ఎస్కే షరీఫ్, వై దేవరాజ్, మూలే రాజశేఖరరెడ్డి, కంటు గురవయ్య, పలుకూరి భాస్కర్, మూలే యోగిరెడ్డి, సంగు వెంకటేశ్వరరెడ్డి, కసిరెడ్డి రామసుబ్బారెడ్డి, గోడి నారాయణరెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, యాళ్ల కృష్ణారెడ్డి, ఎస్కే షకీలా, మద్దిశెట్టి భారతీ, లక్ష్మీ, వేముల రేష్మా, శెట్టిపల్లి కొండయ్య, ఎస్కే రహిమాన్, ఎస్కే నాగూర్వలి, డబ్బుకొట్టు రవి, చిల్లా సాయి, దాసరి మాల్యాద్రి, దమ్ము వెంకటయ్య, మల్లెల యాకోబు, తాతపుడి నాని, గోనా జేమ్స్, ఏకుల వెంకట సుబ్బారెడ్డి, ఎస్కే షబ్బీర్, ఎస్కే ఖాదర్ జిలానీ, ఆండ్ర వెంకట్రావ్, జైపాల్, మోరా సుబ్బారెడ్డి, తిరుపతిరెడ్డి, తమ్మినేని కొండారెడ్డి, ఎస్కే రఫీ, దేవసాయం, ఎలిక శ్రీను, కాసుల బాల గురవయ్య, వేంపాటి మల్లికార్జున గంగులు పాల్గొన్నారు. -
విద్యార్థుల దత్తత
చదువులో వెనుకబడిన విద్యార్థులను మా ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి చదువుపై తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహిస్తున్నాం. మా స్కూల్లో మొత్తం 255 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు రాణించేందుకు కృషి చేస్తున్నాం. – చంద్రశేఖర్రెడ్డి, హెచ్ఎం, జెడ్పీ బాయ్స్, మార్కాపురం మార్కాపురం డివిజన్లో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహిస్తున్నాం. మొత్తం పాఠశాలలో విద్యార్ధి ఉండే సమయాన్ని నాలుగు సెషన్స్గా విభజించి పాఠాలు బోధిస్తున్నాం. వారిలో ఉన్న లోపాలను సవరించేందుకు పరీక్షలు పెడుతున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుపై దృష్టిపెట్టాలి. – ఎం శ్రీనివాసులరెడ్డి, ఉప విద్యాశాఖ అధికారి, మార్కాపురం డివిజన్


