breaking news
Prakasam
-
చీటింగ్ కేసులో రమానందనకు నోటీస్
ప్రకాశం జిల్లా: లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.లక్షల్లో వసూలు చేసి మోసగించిన వ్యవహారంలో యూట్యూబర్ రమానందనపై ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని పేరాయిపాలేనికి చెందిన యు.శ్రీనివాసరావు కోడలికి లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇప్పటికే ఎంతోమందికి ఇప్పించానని యూట్యూబర్ రమానందన నమ్మబలికారు. ఇందుకు రూ.10.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తొలుత ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.లక్ష, అనంతరం రూ.9.50 లక్షల నగదు జమ చేశారు. ఎంతకాలమైనా ఉద్యోగం ఇప్పించకపోగా, కనీసం నగదు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో మోసపోయామని గ్రహించిన బాధితురాలి మామ శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జూలై 4న ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ రమానందనకు అద్దంకి పోలీసుస్టేషన్లో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలంటూ శుక్రవారం పోలీసులు నోటీస్ జారీ చేశారు. ఇదీ చదవండి: భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే! -
మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కందుకూరు: స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మెజార్టీ స్థానా ల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమర్థంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. శుక్రవారం స్థానిక పామూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. పైగా చంద్రబాబు వస్తేనే కరువు వస్తుందన్న నానుడి నిజం చేస్తూ ప్రస్తుతం వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు దొరికే పరిస్థితి లేదని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం అన్నీ మరుగనపడి కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలే దీనికి నిదర్శనమన్నారు. కందుకూరు నియోజకవర్గంలోనూ పార్టీ గ్రాఫ్ పెరిగిందని సర్వేలు చెప్తున్నాయని వివరించారు. కూటమి దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలవాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అన్ని విధానాల దౌర్జన్యాలు, కుట్రలకు అధికార పార్టీ నాయకులు పాల్పడతారని బుర్రా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగా నామినేషన్లు వేసేందుకు పత్రాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తారన్నారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొవాలని సూచించారు. అభ్యర్థులకు అండగా ఉంటా.. పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే విషయాన్ని ఏ ఒక్కరూ విస్మరించరాదన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఇలా ఇన్ని స్థానాల్లోను బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో నాయకుల మధ్య ఉండే చిన్ని చిన్న విభేదాలను పక్కన పెట్టి నాయకులందరి సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ఆ జాబితాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అభ్యర్థులు ప్రకటిస్తామని వివరించారు. కందుకూరు మున్సిపాలిటీలో కూడా పార్టీ విజయం సాధిస్తుందనే బలమైన నమ్మకం తనకు ఉందన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు అన్ని విధాలా తాను అండగా ఉంటానని, ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఐడీ కార్డుల పంపిణీ పార్టీ అధిష్టానం జారీ చేసిన ఐడీ కార్డులను బుర్రా చేతు ల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ, మండల స్థాయిలో పదువులు ఉన్న ముఖ్య నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల అధ్యక్షులు ఈదర రమేష్, అనుమోలు లక్ష్మీనరసింహం, నోటి వెంకటేశ్వరరెడ్డి, నన్నం పోతురాజు, జిల్లా నాయకులు తోకల కొండయ్య, రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి, అధికార ప్రతినిధులు ముప్పవరపు కిషోర్, బద్దిపూడి జయరావు, నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు నలమోతు చంద్రమౌళి, రావులకొల్లు బ్రహ్మానందం, యరమాల నాగభూషణం, మద్దసాని నవీన్, పాలవల్లి అమర్నాథ్రెడ్డి, సయ్యద్ ఫజిల్, గొర్ల రమేష్, కర్పూరపు అశోక్, కాపులూరి మధుసూదన్, బద్దిపూడి ప్రభాకర్రావు, ఉచ్చులూరి రవీంద్ర, చేవూరి శ్రీనివాసమూర్తి, వెలిచెర్ల ధనకోటేశ్వరరావు, గుత్తా గోపి, మర్లపాటి ఆదాం, వల్లెపు ఏడుకొండలు, కాకు వెంకటస్వామి, తుళ్లూరి ఆదిలక్ష్మి, దేవరకొండ ఆదిలక్ష్మి, కొత్తగొర్ల వసంత, జంపని అనూరాధ పాల్గొన్నారు. సమర్థ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపాలి సమన్వయంతో పనిచేస్తే గెలుపు ఈజీ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ -
రెండు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
సంఘటన స్థలంలో మృతి చెందిన ఉమాశంకర్, చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మణ్వలేటివారిపాలెం: అయ్యవారిపల్లి–మాలకొండ మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మాలకొండ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వ్యక్తిని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు సమాచారం. ఎస్సై ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు కూడా..జరుగుమల్లి (సింగరాయకొండ): మోటారు సైకిల్పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు మార్జిన్ గుంతలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం వావిలేటిపాడు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రానికి చెందిన మక్బూల్ ఆలీ, హుస్సేన్లు మున్నంగి సీ ఫుడ్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు నమాజు చేసుకునేందుకు ఫ్యాక్టరీ నుంచి టంగుటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మక్బూల్ ఆలీ (22) సంఘటన స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన హుస్సేన్ (22)ను 108లో ఒంగోలు జీజీహెచ్కు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై భాగ్యరాజ్ తెలిపారు.జిల్లాలో శుక్రవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందారు. ఒక సంఘటన జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద జరగగా మరో సంఘటన వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి–మాలకొండ మధ్య జరిగింది. -
షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం
దర్శి: షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని చందలూరు సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. త్రిపుర సుందరీపురం గ్రామానికి చెందిన మద్దిరాల శివకృష్ణారెడ్డి తన కారులో దొనకొండ నుంచి దర్శి వస్తున్నారు. అందులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి తొలుత బానెట్ నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే కారు పక్కకు ఆపి ఆరుగురు కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షణాల్లో కారు కాలిపోయింది. కంభం: పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని మార్కాపురం ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా సూచించారు. ఈ నెల 15న పట్టణంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన పలు సూచనలు చేసారు. గ్రామోత్సవం రోజు డీజేలకు అనుమతి ఇవ్వాల ని అధికారులను పలువురు కోరారు. పట్టణం నుంచి కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చే విగ్రహాలను బస్టాండ్ మీద చెరువు కట్టకు నిమజ్జనానికి తరలిస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉందని మాజీ ఉప సర్పంచ్ సయ్యద్ ఖాసిం చెప్పారు. అనంతరం ఓఎస్డీ మాట్లాడుతూ ఒక్క కంభంలో మాత్రమే కాదని, మార్కాపురం, ఒంగోలు జిల్లాల వ్యాప్తంగా గ్రామోత్సవం రోజు డీజేలకు అనుమతుల ఇవ్వకూడదని ఎస్పీ ఆదేశించినట్లు చెప్పారు. -
అంబేడ్కర్ విగ్రహం ఇస్తారా..ఇవ్వరా?
● తహసీల్దార్కు నూజిళ్లపల్లి దళితుల అల్టిమేటంజె.పంగులూరు: మండలంలోని నూజిళ్లపల్లి దళితులు తహసీల్దార్ సింగారావుకు అల్టిమేటం జారీ చేశారు. తమకు మాయమాటలు చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రోజుల తరబడి ఉంచడాన్ని దళితులు తప్పుబట్టారు. తమ గోడు అధికారులకు పట్టదా..తమ పట్ల వివక్ష కొనసాగించాల్సిందేనా, తమ దేవుడి విగ్రహాన్ని అప్పగించండి..అంటూ తహసీల్దార్ సింగారావును శుక్రవారం నిలదీశారు. ఏ నిర్ణయమైనా తాను తీసుకోలేనని, ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానని ఆయన చేతులెత్తేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, ఆర్చి నిర్మాణం అనుమతి కోసం నాలుగు రోజులుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నూజిళ్లపల్లి దళితులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దళితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అంతకుముందు దీక్షలను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాసి దేశానికి మార్గదర్శకత్వం చూపించిన మహానుభావుడి విగ్రహం పెట్టుకునేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదన్నారు. నెల రోజులుగా సమస్య స్థానిక మంత్రికి తెలిసినా ఆయన తెలిసీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. సీఐటీయూ జిల్లా నాయకులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నా సామాజిక అంతరాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయని, దళితులు, పేదలను ఎదగనీయకుండా కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కౌలు రైతు సంఘ రాష్ట్ర నాయకుడు నాగబోయిన రంగారావు, మహిళా సంఘ జిల్లా నాయకురాలు రాయిని కృష్ణకుమారి మాట్లాడుతూ పెత్తందారులు, అధికారులకు వ్యతిరేకంగా అనేక సమస్యలపై పోరాడి సమస్యలు పరిష్కరించుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. నూజిళ్లపల్లిలో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠ, ఆర్చి నిర్మాణం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ సింగారావు శిబిరం వద్దకు వచ్చి సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, రైతు సంఘ జిల్లా నాయకులు తలపనేని రామారావు, హేమంత్, హనుమంతురావు, భానుప్రకాష్, రామారావు నాయకత్వం వహించారు. -
మహిళపై యువకుడి దాడి
గిద్దలూరు రూరల్: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన మండలంలోని గడికోట పంచాయతీ విఠాముసురుపల్లెలో శుక్రవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాశమ్మ అనే మహిళ పొలం వెళ్తున్న సమయంలో పూటుగా మద్యం తాగిన ఎలకా నాయుడు అనే యువకుడు మీ పొలంలోకి ఇక్కడి నుంచి దారి లేదని ఘర్షణ పడి కర్రతో గాయపరిచాడు. దీంతో ఆమె కుడి చెయ్యి విరిగింది. తీవ్రంగా గాయపడిన కాశమ్మను చికిత్స కోసం బంధువులు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కలనూతల, చింతలముడిపి ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజీలో భాగంగా ఎస్వీకేపీ కళాశాలలో శనివారం పట్టాలు, నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఉదయం 10 గంటలకు కార్యక్రమం పార్రంభం అవుతుందని తెలడపడంతో ముందుగానే అక్కడికి చేరుకున్న నిర్వాసితులు, లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూసినా సంబంధిత అధికారులు ఆలస్యంగా వచ్చారు. చేసేది లేక నిర్వాసితులు చెట్ల కింద నిరీక్షణ చేయక తప్పలేదు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తమపై అధికారులు మాత్రం దయ చూపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ● నల్లమల సాగర్లో గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్దదోర్నాల: ఫీడర్ కెనాల్లో గల్లంతైన యువకుడు రాజ్కుమార్ ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం కూడా జల్లెడ పట్టాయి. గత శనివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రాజ్కుమార్, వినయ్కుమార్లు నీటి తీవ్రతకు గల్లంతైన విషయం పాఠకులకు విదితమే. వినయ్కుమార్ మృతదేహం సుంకేసుల వద్ద లభించింది. రాజ్కుమార్ ఆచూకీ లభించక పోవడంతో గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. యువకుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
ఎల్నినో కష్టాలు
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుగ్రాస కొరతను ముందుగానే అంచనా వేసి గ్రామ స్థాయిలో గడ్డి బ్యాంకులు ఏర్పాటు చేయాలి. ఇటీవలే నేను రూ.20 వేలు పెట్టి గడ్డి కొనుగోలు చేశా. తక్కువ ధరకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి అందుబాటులోకి తీసుకురావాలి. పశువులకు అవసరమైన దాణాపై సబ్సిడీ ఇవ్వాలి. – సీహెచ్ చెంచిరెడ్డి, పాడి రైతు మార్కాపురం: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్నే కాదు..పాడి పరిశ్రమను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురవక పోవడంతో పచ్చిగడ్డి లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పశువులకు మేత అందించేందుకు రైతులు మార్కెట్పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పాల దిగుబడి తగ్గుతుండగా మరోవైపు పశుగ్రాసం, దాణా ధరలు పెరగడంతో పాడి రైతులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. పెరిగిన గడ్డి ధరలు గతేడాది ఒక యూనిట్/ట్రాక్టర్ లోడు గడ్డి సుమారు రూ.12 వేలకు లభించగా ఈ ఏడాది అదే గడ్డి ధర రూ.20 వేలకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.8 వేలకు పెరుగుదల నమోదైంది. ఇది దాదాపు 66.7 శాతం పెరిగినట్లు. గతంలో ఒక గేదె రోజుకు 3 నుంచి 4 లీటర్ల పాలు ఇవ్వగా ప్రస్తుతం ఒకటిన్నర నుంచి 2 లీటర్లు మాత్రమే ఇస్తోంది. పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్న రైతులకు ఈ అదనపు భారం మరింత తీవ్రంగా మారింది. పాలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగం మేత, దాణా కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తుండటంతో చేతికి మిగిలేది తక్కువగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డి లేదు..పాలు లేవు సాధారణంగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి సమృద్ధిగా లభిస్తే పశువులకు తగిన పోషకాహారం అందుతుంది. దీంతో పాల దిగుబడి కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో పొలాల్లో పశుగ్రాసం పెరగడం తగ్గిపోయింది. దీంతో రైతులు బయట మార్కెట్లో అధిక ధరలకు గడ్డి కొనుగోలు చేయాల్సి వస్తోంది. పల్నాడు, నర్సరావుపేట, వినుకొండ, దర్శి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అక్కడ కూడా పశుగ్రాసం లభించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మేత కొరతతో పశువులకు సరైన పోషకాహారం అందక పోవడంతో పాల దిగుబడి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. పాలు తగ్గినా పశువుల సంరక్షణ ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. మందులు, దాణా, గడ్డి, కూలీల ఖర్చులు యథాతదంగా లేదా మరింత పెరుగుతుండటంతో పాడి రైతులకు పాడి పరిశ్రమ భారంగా మారుతోంది. పాడి రైతుకు ప్రధాన ఆదాయ వనరు పాలే. రోజువారీ పాల దిగుబడి తగ్గితే నేరుగా ఆదాయంపై ప్రభావం పడుతుంది. అదే సమయంలో మేత ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఇలా ఆదాయం తగ్గడం.. ఖర్చులు పెరగడం అనే రెండు వైపులా రైతుపై భారం పడుతోంది. పశువులను పోషించడం కష్టంగా మారడంతో కొందరు రైతులు పశువుల సంఖ్యను తగ్గించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాభావంతో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం రాబోయే రెండు నెలల్లో ఎక్కువగా ఉంటోంది. వరి, జొన్న, సజ్జ తదితర పంటలు సాగులో లేకపోవడంతో మాగాణి భూములు సాగు కాలేదు. ఎల్నినో కారణంగా వర్షాలు తగ్గితే నవంబర్ నాటికి పశుగ్రాస కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పశుపోషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో పాల దిగుబడి తగ్గడం రైతులకు మరింత నష్టాన్ని తెచ్చి పెడుతోంది. ఒకవైపు పశువుల మేత కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండగా..మరోవైపు తక్కువ పాలు రావడంతో ఆశించిన ఆదాయం రావడం లేదు. అల్లాడుతున్న పశుపోషకులు వర్షాలు లేక గ్రాసానికి కొరత పెరిగిన గడ్డి ధరలు..తగ్గిన పాల దిగుబడి పశువుల పోషణకు అదనపు ఖర్చు రోజుకు ఉత్పత్తి అయ్యే పాలు 5 లక్షల లీటర్లు ప్రస్తుతం పాలదిగుబడి 4 లక్షల లీటర్లు ట్రాక్టర్ గడ్డి రూ.20 వేలు జిల్లాలో పశుసంపద ఇలా.. తెల్ల పశువులు : 35,988 నల్ల పశువులు : 3,40,493 గొర్రెలు : 11,00,669 మేకలు : 3,46,926 పాలిచ్చే గేదెలు : 2,04,295 రోజుకు పాలు సగటున : 3 లీటర్లు గతంలో రోజుకు పాల దిగుబడి : 5 లక్షల లీటర్లు ప్రస్తుత పాల దిగుబడి : 4 లక్షల లీటర్లు రోజుకు కావాల్సిన గడ్డి : 3,500 టన్నులు (5 కిలోలు చొప్పున) లభ్యమవుతున్న గడ్డి : 3 వేల టన్నులు (సుమారు) -
పీఎల్ఐలో వివక్ష వీడకుంటే నిరవధిక సమ్మె
ఒంగోలు వన్టౌన్: కేంద్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న 7వ ‘లోక్ సంవర్ధన్’ ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎస్.కె. ఫైజుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన ఆసక్తి గల హస్తకళాకారులు, వంట నిపుణులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఎంపికై న లబ్ధిదారులకు కేంద్ర మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం టీఏ, డీఏతో పాటు ప్రత్యక్ష ప్రదర్శన కోసం అయ్యే ముడిసరుకుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒక్కో కళాకారుడికి, స్టాల్ సహాయకునికి రోజువారీ భత్యం కింద రూ.1,000 చొప్పున, అలాగే ప్రదర్శన ముడిపదార్థాల ఖర్చుల నిమిత్తం రోజుకు గరిష్టంగా రూ.1,500 వరకు చెల్లిస్తారని వివరించారు. ఆసక్తి ఉన్నవారు తమ నామినేషన్లను ఈ నెల 13వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివరాలకు ఒంగోలు సంతపేటలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో లేదా 9849901157ను సంప్రదించాలని ఈడీ ఫైజుద్దీన్ సూచించారు.ఒంగోలు సబర్బన్: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే ఆమోదించి సిఫారసు చేసిన ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చట్టబద్ధంగా అమలు చేయాలని జాతీయ బ్యాంకుల ఐక్య వేదిక (యూఎఫ్బీయూ) కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ డిమాండ్ చేశారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ అలవెన్స్ (పీఎల్ఐ) అమలులో నెలకొన్న అక్రమాలు, తీవ్ర అసమానతలు, ఉద్యోగుల మధ్య పక్షపాత ధోరణిని కేంద్రం తక్షణమే తొలగించాలన్నారు. బ్యాంకింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె చేపట్టి, ఆపై నిరవధిక సమ్మెకు దిగుతామని ఆయన హెచ్చరించారు. యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు నగరంలో బ్యాంకర్లు భారీ ధర్నా నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని యూనియన్ బ్యాంకు ఎదుట ఏడు యూనియన్ల ఉద్యోగులు, అధికారులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెట్టే క్రమంలోనే కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని యూనియన్ నేతలు నిప్పులు చెరిగారు. సీనియర్ నాయకుడు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. బ్యాంకుల్లో తీవ్రమైన సిబ్బంది కొరత, విపరీతమైన వ్యాపార లక్ష్యాలు, డిజిటల్ బ్యాంకింగ్ ఒత్తిడితో ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఉద్యోగులు యంత్రాలు కాదని, ఆధునిక బ్యాంకింగ్కు ఆధునిక పని విధానం అవసరమని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగంలో పెరిగిన తీవ్ర పని ఒత్తిడి భరించలేక గత దశాబ్ద కాలంలో 500 మందికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. అందుకే ఇకపై తాము సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తామని యాజమాన్యాలకు ఇప్పటికే తేల్చిచెప్పామన్నారు. సాంకేతికత విస్తరించిన ప్రస్తుత తరుణంలో ఐదు రోజుల పనిదినాల అమలును ఇక ఏమాత్రం వాయిదా వేయలేరని, ఉద్యోగులకు కుటుంబ సమయం, సరైన విశ్రాంతి లభిస్తేనే పనితీరు మెరుగవుతుందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసేది అందరూ అయితే, పీఎల్ఐ ప్రయోజనాల్లో మాత్రం వివక్ష ఎందుకని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏకంగా 50 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో బ్యాంకుల్లో 2 లక్షలు, రైల్వేలో 4 లక్షల ఖాళీలు ఉన్నాయని నేతలు గుర్తుచేశారు. 1969, 1980లలో బ్యాంకుల జాతీయకరణ సమయంలో కేవలం రూ.50 వేల కోట్లుగా ఉన్న డిపాజిట్లు.. నేడు ఉద్యోగుల శ్రమతో రూ.146 లక్షల కోట్లకు చేరి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయన్నారు. పని చేసిన వారికి జీతాలిచ్చాం.. ఇక పెన్షన్లు ఎందుకనే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. గతంలో సీపీఎస్ రద్దుపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును, ప్రభుత్వాల పెన్షన్ల వ్యతిరేక నాటకాలను తీవ్రంగా ఆక్షేపించారు. ఐక్యతే మన బలం.. న్యాయం సాధించే వరకు పోరాటమే మన మార్గం అని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వి. శ్రీనివాస్, సుబ్బారావు, ఉమా శంకర్, రవి ప్రకాష్, బ్రహ్మనాయుడు, కిషోర్ రెడ్డి, ఎస్.కె. హసన్తో పాటు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. -
రాష్ట్రంలో కరువు విలయతాండవం
యర్రగొండపాలెం: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండవం చేస్తుంటే.. అన్నదాతలను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర సమితి, సీపీఐ, వ్యవసాయ కార్మిక, చేతివృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం యర్రగొండపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పూల సుబ్బయ్య శాంతి భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టి, అనంతరం ధర్నా నిర్వహించి తహశీల్దార్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 688 మండలాలకు గాను ఏకంగా 653 మండలాల్లో లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక పత్తి ఎదుగుదల లోపించిందని, వేరుశనగ విస్తీర్ణం భారీగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, ఇతర పైర్లు నీరందక ఎండుముఖం పట్టాయన్నారు. పంటలు లేక వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు ఉపాధి కోల్పోయి వలసబాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశుగ్రాసం, తాగునీరు కరువై రైతులు మూగజీవాలను కబేళాలకు తెగనమ్ముకుంటున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్ర పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలన్నారు. రైతు, కౌలు రైతుల పంట రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేయాలని, ఉపాధి హామీ దినసరి వేతనాన్ని రూ.700కు పెంచాలని డిమాండ్ చేశారు. పశువులకు ఉచితంగా మేత, తాగునీరు కల్పించడంతో పాటు రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసరాలను ఉచితంగా అందించాలని కోరారు. రైతు సంఘ నాయకులు కె.వి.కృష్ణగౌడ్, బాణాల రామయ్య, జి.గురునాధం, మన్నె సాంబశివరావు, వై.వెంకటశివయ్య, పి.తిరుమలయ్య, గుంటూరు శ్రీను, నూర్జహాన్, పూర్ణకంటి తిరుమలయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోరులో కూటమికి వణుకు పుట్టాలి
కొండపి: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టేలా వైఎస్సార్ సీపీ శ్రేణులు సమష్టిగా పోరాడాలని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కొండపిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఓట్ల సర్వే ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో 32,123 మందికి నోటీసులు ఇవ్వగా, వారిలో 2,000 మంది సమాధానం ఇవ్వలేదన్నారు. మొత్తం 2.40 లక్షల ఓటర్లలో దాదాపు 30 వేల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, చివరికి మిగిలే 2.10 లక్షల ఓట్లతోనే స్థానిక సమరానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, రెండేళ్ల పాలన అవినీతికి నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కొండపిలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ, ఇళ్లు, ప్రహరీ గోడలు, బొప్పాయి తోటలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది, వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎలాంటి ఆరోపణలు లేకుండా ఒకే నోటిఫికేషన్తో లక్షలాది సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తే.. ప్రస్తుత కూటమి సర్కార్ మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులను దగా చేసిందన్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులున్నా దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, మట్టి, ఇసుక, మద్యం మాఫియాతో జేబులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో నెలకు రూ.30 లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. పథకాలు అమలు చేయకుండా మహిళలు, వృద్ధులను మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కొండపిలోని పంచాయతీల్లో కనీసం 50 శాతం స్థానాల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి, 2029లో నియోజకవర్గాన్ని జగనన్నకు కానుకగా ఇవ్వాలని కోరారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. కొండపిలో ఇద్దరు మంత్రులున్నా చేసిన అభివృద్ధి శూన్యమని, ఎక్కడ చూసినా జేసీబీలతో చెరువుల మట్టిని కొల్లగొడుతున్నారని విమర్శించారు. రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ అమ్మకానికి పెట్టిందని, దమ్ముంటే మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ప్రెస్మీట్ పెట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, గతంలో జగన్మోహన్రెడ్డి పాలనలోనే కమ్మవారికి సముచిత గౌరవం దక్కిందని, వెలుగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టిన ఘనత వైఎస్సార్దేనన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం, సినీ నటి వ్యవహారాల్లో సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంకై ్వరీ వేయడానికి కూటమి పాలకులు వణికిపోతున్నారని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇటీవల శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై న తూమాటి మాధవరావును ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు షంషీర్ అలీ బేగ్, పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, ఆరు మండలాల కన్వీనర్లు బచ్చల కోటేశ్వరరావు, స్మశానం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, ఇనుకొల్లు సుబ్బారెడ్డితో పాటు పలువురు స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
● పురుగుమందు తాగిన తల్లి మౌలాభి.. ఆరోగ్యం విషమం
సింగరాయకొండ: కన్నబిడ్డను కోల్పోయి న్యాయం కోసం రోడ్డెక్కిన ఆ తల్లి ఆవేదన అధికారుల గుండెలను కరిగించలేకపోయింది. ఈ పరిణామం చివరికి ఆమె ప్రాణాల మీదికి తెచ్చింది. సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో చదువుతున్న 11 ఏళ్ల తౌషిక్ ఆరు నెలల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అప్పటి నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న బాలుడి తల్లి మౌలాభి.. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని బంధువులు తెలిపారు. విష ప్రభావంతో ఆమె కిడ్నీలు, లివర్ తీవ్రంగా దెబ్బతినడంతో ఒంగోలు నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కందుకూరు డీవైఈవో రవి పాఠశాల వద్ద విచారణ చేపట్టినట్లు ఎంఈవో కత్తి శ్రీనివాసరావు తెలిపారు. కాగా, మౌలాభికి అండగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పింఛన్లకు పచ్చ ముద్ర!
● టీడీపీ మద్దతుదారుల దరఖాస్తులకే తొలి ప్రాధాన్యం ● సామాన్యుల అర్జీలు నిర్ధాక్షిణ్యంగా బుట్టదాఖలు ● ఓటేస్తేనే పింఛనంటూ లబ్ధిదారులకు ‘పచ్చ’ నేతల బెదిరింపులుదర్శి: కూటమి ప్రభుత్వంలో అధికారుల పచ్చపాతం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పాలిట శాపంగా మారుతోంది. అర్హతతో సంబంధం లేకుండా.. టీడీపీ కండువా కప్పుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ సచివాలయ సిబ్బందిపై అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను సైతం రద్దు చేయడంతో నిరుపేదలు కాళ్లరిగేలా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తమ సొంత జేబుల్లోంచి ఇస్తున్నట్లు పచ్చ నేతలు ఫొటోలకు ఫోజులివ్వడం పరిపాటిగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం మళ్లీ కొత్త పింఛన్ల దరఖాస్తులంటూ లబ్ధిదారుల్లో ఆశలు రేపిన కూటమి పాలకులు.. క్షేత్రస్థాయిలో తీవ్ర వివక్ష చూపుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సచివాలయం పరిధిలో 100 నుంచి 200 వరకు దరఖాస్తులు నమోదైనట్లు తెలుస్తోంది. అర్హత ఉన్నా అడుక్కోవాలా? దర్శి మండల ఎంపీడీఓ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు సిబ్బంది కేవలం టీడీపీ సానుభూతిపరుల దరఖాస్తులను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజల అర్జీలను పక్కన పడేస్తున్నారు. తమ దరఖాస్తులను అప్లోడ్ చేయాలని నిలదీస్తున్న లబ్ధిదారులకు.. గ్రామంలోని టీడీపీ నేతలతో చెప్పిస్తేనే పని జరుగుతుందని కొందరు సిబ్బంది తెగేసి చెబుతున్నారు. గతి లేక పచ్చ నేతల వద్దకు వెళ్తే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే ఓటు వేస్తామని హామీ ఇస్తేనే పని చేస్తామంటూ నిర్లజ్జగా బేరసారాలకు దిగుతున్నారు. ఆన్లైన్ నమోదుకు ఓటీపీ తప్పనిసరి కాగా, అమాయక లబ్ధిదారుల నుంచి కాగితాలు తీసుకుని ‘తర్వాత ఫోన్ చేసి ఓటీపీ అడుగుతాం’ అని చెప్పి వారిని మభ్యపెడుతూ అర్జీలను బుట్టదాఖలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పచ్చ దగాపై దర్శి ఎంపీడీఓను వివరణ కోరగా.. తాను ఎవరికీ అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతూ వెంటనే ఫోన్ కట్ చేయడం గమనార్హం. -
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల నగారా ఇంకా మోగకముందే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కూటమి పార్టీల్లో అసమ్మతి కుంపట్లు భగ్గుమంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సీట్ల పంపకాలు, స్థానిక ఆధిపత్య పోరుతో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతలు పరస్పరం కత్తులు నూరుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు కలిసి తిరిగిన నాయకులు.. ఇప్పుడు తమ రాజకీయ ఉనికిని, క్షేత్రస్థాయి బలాన్ని నిరూపించుకునేందుకు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఎవరికి దక్కాలనే అంశంపై ఇరు పార్టీల మధ్య రగిలిన చిచ్చు చినికి చినికి గాలివానలా మారుతోంది. వేర్వేరుగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటూ బలప్రదర్శనకు దిగుతుండటంతో కూటమిలో విభేదాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఒకవైపు కూటమిలో కుర్చీలాట రచ్చకెక్కుతుంటే.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ మాత్రం సమష్టి వ్యూహంతో శ్రేణులను ఏకతాటిపైకి తెస్తూ స్థానిక సమరానికి సర్వసన్నద్ధమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లా పరిధిలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మార్కాపురం, కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, అద్దంకి, పొదిలి, దర్శి, చీమకుర్తి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కీలకమైన ఒంగోలు నియోజకవర్గంలో కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు ఇప్పటికే వీధిన పడ్డాయి. జనసేన ముఖ్య నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గత కొద్దికాలంగా పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు కూటమిలోని లుకలుకలను బజారున పడేశాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు అవినీతి అస్త్రాలు సంధించుకోవడంతో పార్టీల పరువు గంగపాలైంది. దీంతో కూటమి అధిష్టానం జోక్యం చేసుకుని నేతలెవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పైకి ఆదేశించినప్పటికీ, తెరవెనుక మాత్రం వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఇటీవల మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలో ‘‘దామచర్ల సైలెంట్గా ఉంటాడు.. ఆయన జోలికి వస్తే దబిడిదిబిడే’’ అంటూ చేసిన వ్యాఖ్యలు మిత్రపక్ష జనసేనను రెచ్చగొట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధిష్టానమే కయ్యానికి కాలుదువ్వేలా ప్రోత్సహిస్తోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికితోడు స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల కూర్పుపై జనసేనలోనే అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఒక వర్గానికి పెద్దపీట వేసి, మరో వర్గాన్ని విస్మరించారన్న అసంతృప్తితో సొంత పార్టీలోనే నేతలు రగిలిపోతున్నారు. ఒంగోలు మేయర్ పీఠంపై పేచీ.. ఒంగోలు కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడమే ఇప్పుడు కూటమిలో పెను వివాదంగా మారింది. నగరంలో తమకు తిరుగులేని కేడర్ బలం ఉందని చెబుతున్న జనసేన పార్టీ.. మేయర్ స్థానాన్ని తమకే కేటాయించాలని గట్టిగా పట్టుబడుతోంది. పార్టీ బలంగా ఉన్న చోట్లే పోటీ చేస్తామని అధినేత ప్రకటించిన నేపథ్యంలో ఒంగోలు పీఠంపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం నగరపాలక సంస్థను మిత్రపక్షానికి ఇచ్చే ప్రసక్తే లేదన్న ధీమాతో పావులు కదుపుతోంది. నగరంలోని మొత్తం 62 డివిజన్లలో జనసేనకు అతి తక్కువ సీట్లు విదిల్చి చేతులు దులుపుకోవాలని టీడీపీ యోచిస్తోంది. టీడీపీ ఎత్తుగడలను ముందుగానే పసిగట్టిన జనసేన శ్రేణులు.. అన్ని డివిజన్లలోనూ సొంతంగా అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పథక రచన చేశారు. పొత్తు కుదరకపోతే స్వతంత్రులుగా, రెబల్స్గానైనా బరిలో నిలవాలని స్థానిక క్యాడర్కు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. ఒంగోలుతో పాటు గిద్దలూరు, దర్శి మున్సిపాలిటీల్లోనూ సీట్ల సర్దుబాటు తీవ్ర వివాదాస్పదంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానికంలో..సీటు మార్!సమష్టి వ్యూహంతో కదం తొక్కుతున్న వైఎస్సార్ సీపీ కూటమి పక్షాలు కుర్చీల కొట్లాటలో మునిగి తేలుతుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నేతృత్వంలో పార్టీ యంత్రాంగం ఇప్పటికే సమరశంఖం పూరించింది. నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో వరుసగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రేణులను ఏకతాటిపైకి తెస్తూ.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూనే ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ప్రజల మద్దతుతో స్థానిక సంస్థల్లో విజయదుందుభి మోగించడమే లక్ష్యంగా నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. కూటమిలో స్వార్థపూరిత ఆధిపత్య పోరు ప్రజల ముందు నవ్వులపాలవుతుంటే.. వైఎస్సార్సీపీ శ్రేణులు సైనికుల్లా కదం తొక్కుతుండటం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. -
పోషకాహార కేంద్రాలు.. అంగన్వాడీలు
ఒంగోలు సబర్బన్: అంగన్వాడీ సెంటర్లు పోషణ్ ఫలహారాలకు కేంద్రాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు హాలులో గురువారం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాసోత్సవాల్లో జేసీ పాల్గొని మాట్లాడారు. మహిళలు గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం వరకూ, ప్రసవం తర్వాత చిన్నారులు, బాలింతలకు ఎన్నో రకాల పోషకాహారాలను అందించే కేంద్రాలుగా అంగన్వాడీ సెంటర్లను అభివర్ణించారు. ఉత్సవాల్లో పాల్గొన్న గర్భిణులు, చిన్నారులతో వచ్చిన బాలింతలతో జేసీ ముచ్చటించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పురుషులతో వంట ప్రదర్శన, ఆరోగ్యవంతమైన శిశువులను గుర్తించి బహుమతులివ్వడం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద గర్భిణులను నమోదు చేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వారికి పోషక విలువలు కలిగిన మునగాకు పొడి కూడా సరఫరా చేశారు. ఆరోగ్యవంతమైన పిల్లలకు జేసీ చేతుల మీదుగా నిర్వాహకులు బహుమతులిప్పించారు. గర్భిణులకు పోషకాహారం అందించారు. జేసీ కల్పనా కుమారి -
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఒంగోలు సబర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అందులో భాగంగా జిల్లాలోని బ్యాంకులన్నీ మూతబడనున్నాయి. జిల్లా యూఎఫ్బీయూ కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ విడుదల చేసిన ప్రకటన మేరకు ఐదు రోజుల బ్యాంకింగ్, న్యాయమైన పీఎల్ఐని కోరుతూ బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన, సమానమైన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ మంజూరు చేయాలని కోరుతున్నారు. బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన ఐదు రోజుల బ్యాంకింగ్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా చేస్తున్నట్లు వివరించారు. -
పొలానికి కరెంట్ కంచె..మహిళ బలి!
మార్కాపురం రూరల్: పొలాలకు కంచె వేస్తే పంటలు రక్షితంగా ఉంటాయి.. కానీ ప్రాణాంతక విద్యుత్ కంచె ఏర్పాటు చేస్తే ప్రాణాలే పోతాయి. అక్రమంగా విద్యుత్ సరఫరా చేసి ఏర్పాటు చేసిన కరెంట్ కంచె ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న ఘటన మార్కాపురం మండలం గజ్జలకొండ పంచాయతీ పరిధి పడమటిపల్లిలో చోటుచేసుకుంది. పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన రోడ్డ నారమ్మ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కరెంట్ కంచెతో కాటేసిన మృత్యువు స్థానికుల కథనం ప్రకారం.. నారుకోట సుబ్బారెడ్డి తన పొలానికి ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా చేసి కంచె ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పొలంలోకి వెళ్లిన నారమ్మ కరెంట్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతదేహం మాయం చేసేందుకు యత్నం? నారమ్మ మృతి విషయం బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని సుబ్బారెడ్డి కొంతదూరం తరలించేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల జనాలు గమనించడంతో మృతదేహాన్ని సమీపంలోని చెట్ల పొలంలో వదిలేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారమ్మ కుమార్తె తన తల్లి కోసం పొలం వద్దకు వచ్చి సుబ్బారెడ్డిని ప్రశ్నించగా ‘నారమ్మను చూడలేదు’ అంటూ చెప్పినట్లు సమాచారం. అనంతరం మృతదేహం ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో రైతు చెప్పిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం? మృతురాలి కుమార్తె ప్రశ్నించినా పట్టించుకోని రైతు రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు -
గొంతు తడుపు స్వామీ..
గురుకులం సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వంలో సర్కారు పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస వసతులు కూడా లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు తాగునీటికి, వాడుక నీటికి ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో 720 మంది విద్యార్థినులున్నారు. పాఠశాలలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పాతదైపోయి ఓల్టేజి హెచ్చుతగ్గులతో తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. ఇక్కడున్న మినరల్ వాటర్ ప్లాంట్ కూడా తరచూ మరమ్మతులకు గురవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద మంజూరైన మినీ వాటర్ ప్లాంట్లు సైతం మూలనపడ్డాయి. దీంతో తాగునీటికి, వాడుక నీటికీ అవస్థలు తప్పడం లేదు. మరమ్మతులకు గురైన మోటార్లు: పాఠశాలలో బోర్ల నుంచి ట్యాంకుకు సరఫరా చేయటానికి మూడు మోటార్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో విద్యుత్ హెచ్చు తగ్గుల కారణంగా ఉన్న మూడు మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. దీనికి తోడు తెల్లవారితే మంత్రి స్వామి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఉండటంతో అప్పటికప్పుడు మోటారు మరమ్మతు చేయించి ప్రిన్సిపాల్ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. పాఠశాలలో తరచూ మోటార్లు కాలిపోవడం, వాటర్ ప్లాంట్లు మొరాయిస్తుండటంతో వాటిని మరమ్మతులు చేయించడం ప్రిన్సిపాల్కు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం నుంచి మెయింటినెన్స్ గ్రాంట్ సరిగా ఇవ్వకపోవడంతో ప్రిన్సిపాల్ చేతిడబ్బులు పెట్టి మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. తరచూ ఈ సమస్యలు ఎదురవుతుండటంతో విసిగిపోయిన గతంలో ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాల్ రమాదేవి నెల రోజుల పాటు సెలవులో వెళ్లి తిరిగి వచ్చారు. ఆ తరువాత ఆమె బదిలీపై వెళ్లిపోయారు. ఆపై అరుణ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆమె కూడా ఇక్కడి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు పనిచేయనప్పుడు తాగటానికి ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంటు నుంచి ట్యాంకర్ తెప్పించినా ప్రస్తుత ఎండ తీవ్రతకు చాలటం లేదని, ట్యాంకరు వచ్చే వరకు నీటి కోసం వేచి ఉండాల్సిన దుస్థితి ఉందని ఒక్కోసారి గత్యంతరం లేక వాడుకనీటిని తాగుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంధువుల ద్వారా వాటర్ బాటిల్స్ తెప్పించుకుని దాహార్తి తీర్చుకుంటున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్రెడ్డి విద్యార్థినులతో కలిసి భోజనం చేసే సమయంలో అరకొరగా విద్యార్థినులు తెచ్చుకున్న వాటర్బాటిల్స్ తాగునీరు రాకపోవటంతో నిరుపయోగంగా ఉన్న కొళాయిలుమంచినీటి ట్యాంకరు వద్ద నీరు పట్టుకుంటున్న విద్యార్థినులుఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటనలో బహిర్గతమైన తాగునీటి సమస్య రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్రెడ్డి మంగళవారం రాత్రి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలుసుకుని అప్పటికప్పుడు బయట నుంచి మినరల్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేసే సమయంలో విద్యార్థినుల వద్ద వాటర్ బాటిల్స్ నామమాత్రంగా ఉన్నాయి. విద్యార్థినులు భోజనం చేసి వాటర్ ట్యాంకర్ వద్దకు వెళ్లి నీరు తాగారు. ఈ విషయాన్ని విలేకరులు ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికై నా తమ సమస్యకు శాశ్విత పరిష్కారం దక్కుతుందేమోనని విద్యార్థినులు ఎదురుచూస్తున్నారు. -
నా బిడ్డను పూడ్చినచోటే నన్నూ పూడ్చండి..
సింగరాయకొండ: సింగరాయకొండలో శ్రీచైతన్య నవోదయ స్కూలు వద్ద నిరసన దీక్ష చేస్తున్న సయ్యద్ మౌలాబి గురువారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ పాఠశాల విద్యార్థి అయిన తన కుమారుడు సయ్యద్ తౌషిక్ (11) మృతికి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని, అనుమతి లేని హాస్టల్ను మూసేయాలని మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన ఆమె జూలై నుంచి స్కూలు వద్ద దీక్ష చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం దీక్షకు కూర్చున్న ఆమె.. తాను దీక్ష చేస్తున్నా పోలీసులు, విద్యాశాఖ అధికారులు స్పందించడంలేదని, స్కూలు యాజమాన్యం మాటలతో వేధిస్తోందని పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరారు. పోలీసులు ఆమెను 108లో ఒంగోలు జీజీహెచ్కి, ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మౌలాబి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పురుగుమందు తాగటంతో మౌలాబి కిడ్నీ ఒకటి పనిచేయటం లేదని బంధువులు చెప్పారు. శ్రీచైతన్య నవోదయ స్కూలులో ఆరో తరగతి చదువుతూ నవోదయ కోచింగ్ తీసుకుంటున్న సయ్యద్ తౌషిక్ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తౌషిక్ టవల్తో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని స్కూలు యాజమాన్యం చెబుతుండగా తౌషిక్ మృతికి స్కూలు యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు మౌలాబి, ఆలీ ఆరోపించారు. ఈ క్రమంలో స్కూలు యాజమాన్యం ఒక ఎంపీ అండదండలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలున్నాయి. తనకు న్యాయం చేయాలని మౌలాబి ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేశ్ను అర్థించారు. చివరకు హైకోర్టును ఆశ్రయించారు. స్కూలు యాజమాన్యం అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్ను మూసేయాలని, తన లాగా మరొకరికి గర్భశోకం కలగకూడదని గత జూలై 16వ తేదీ ఆమె విద్యాశాఖ అధికారులను కోరారు. అధికారులు స్పందించకపోవడంతో ఆరోజు నుంచి పాఠశాల ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో పురుగుమందు తాగడానికి ముందు మౌలాబీ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘నా కుమారుడు అనుమానాస్పద మృతికి కారకులను శిక్షించాల్సిన సీఐ హజరత్తయ్య, ఎస్ఐ బి.మహేంద్ర లంచం తీసుకుని స్కూలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ మాపై కేసులు పెడతామని బెదిరించారు. అనుమతులు లేని హాస్టల్ను నిర్వహిస్తున్నారని చర్యలు తీసుకోవాలని నిరసనదీక్ష చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. దీనికితోడు స్కూలు యాజమాన్యం సూటిపోటి మాటలతో నేను మానసికంగా వేదన అనుభవిస్తున్నాను. నా కుమారుడు ఏ స్కూలు వద్ద చనిపోయాడో నేను కూడా అక్కడే చనిపోతాను. నా మృతదేహాన్ని నా కుమారుడు తౌషిక్ను పూడ్చిపెట్టిన చోటే పూడ్చాలి. నన్ను, నాకుమారుడిని దయచేసి వేరు చేయవద్దు. నా చావుకు స్కూలు యాజమాన్యమే కారణం’ అని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. మౌలాబి తాగిన పురుగుమందు డబ్బా మౌలాబీని ఒంగోలు జీజీహెచ్కు తరలిస్తున్న దృశ్యం -
ఒంగోలు నియోజకవర్గంలో 10,321 డూప్లికేట్ ఓట్లు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 10,321 డూప్లికేట్ ఓట్లు నమోదైనట్లు గుర్తించామని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. వైఎస్సార్ సీపీ సర్ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు గురువారం ఒంగోలు ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ) చంద్రశేఖర నాయుడును ఆయన చాంబర్లో కలిసి ఫిర్యాదు చేసి వినతిపత్రం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో చుండూరి రవిబాబు మాట్లాడుతూ డూప్లికేట్ ఓట్లను సమగ్రంగా పరిశీలించి చట్టప్రకారం తొలగించాలని కోరుతూ ఎన్నికల నమోదు అధికారికి వినతిపత్రం ఇప్పించామన్నారు. విశ్వసనీయ వనరుల నుంచి తాము సేకరించిన అనుమానాస్పద డూప్లికేట్ ఓటర్ల జాబితాలను బూత్ల వారీగా జత చేసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) ఈ జాబితాలను అందించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు స్వీకరించలేదని చెప్పారు. దీంతో పూర్తి వివరాలను నేరుగా ఈఆర్ఓ కార్యాలయానికి అందించినట్లు వెల్లడించారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించకపోతే దొంగ ఓటింగ్కు అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, సమగ్రత దెబ్బతింటాయని రవిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన ఓటర్ల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి తగిన విచారణ నిర్వహించి డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల అధికారులను కోరారు. డీఆర్ఓకు వినతిపత్రం ఇచ్చిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రకాశం జిల్లా సర్ టాస్క్ఫోర్స్ సభ్యుడు పాలడుగు రాజీవ్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కన్వీనర్ కొల్లం కార్తీక్, ప్రకాశం జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు పులుసు సురేష్బాబు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు వైఎస్సార్ సీపీ సర్ టాస్క్ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో ఆర్డీవోకు ఫిర్యాదు -
రేషన్ దుకాణం వద్ద డీటీ హైడ్రామా
దర్శి: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కుతున్నారు. మండలంలోని బొట్లపాలెం గ్రామంలో డీలర్ ఉల్లి విజయలక్ష్మికి చెందిన రేషన్ దుకాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, పేదలకు బియ్యం ఇవ్వకుండా.. అసలు రేషన్ దుకాణంలో బియ్యం దించకుండా నేరుగా పక్కదారి పట్టిస్తున్నారని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయప్రతాప్ రెడ్డికి వచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం ఆయన బొట్లపాలెం రేషన్ దుకాణం వద్దకు తనిఖీ చేసేందుకు వచ్చారు. ఆయన వస్తున్న సంగతి తెలుసుకుని సదరు రేషన్ దుకాణం డీలర్ అక్కడ లేకుండా ఉడాయించారు. కొంతసేపు వేచి ఉన్నా డీలర్ రాకపోవడంతో డీఎస్ఓ, డీటీలకు ఆ దుకాణం తీయించి సరుకు లెక్కించి నివేదిక తనకు అందించాలని ఆదేశించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లే ముందు ఈ దుకాణంలో సరుకులేదని, మొత్తం సరుకు వందశాతం పక్కదారి పట్టించారని సమాచారం ఉందని చెప్పి మరీ వెళ్లారు. అయితే ఆ షాపు యజమాని టీడీపీ నేత కావడంతో అధికారులు సైతం హైడ్రామా ఆడుతున్నారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు కచ్చితంగా రేషన్ దుకాణం తీయాలి. అయితే సదరు డీలర్ విజయలక్ష్మి ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పటి నుంచి రెండు రోజులుగా దుకాణం తీయడం లేదు. దీంతో నిత్యం రేషన్ కోసం వచ్చే లబ్ధిదారులు వచ్చి దుకాణం మూసి ఉండటం చూసి వెళ్లిపోతున్నారు. గురువారం డీటీ అక్కడ ఉన్న సమయంలోనే రేషన్ కోసం పదుల సంఖ్యలో లబ్ధిదారులు వచ్చి వెళ్లారు. ఏపీ ఫుడ్ కమిటీ చైర్మన్ స్థాయి వ్యక్తి తనిఖీ చేసి నివేదికలు పంపమని ఆదేశించినప్పుడు అవసరమైతే రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి తాళం పగులగొట్టి లోపల ఉన్న సరుకు నిల్వలు లెక్కించి నివేదిక అందజేయాలి. అయితే అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకు కారణం ఆ డీలర్షిప్ గ్రామ టీడీపీ నాయకుడి కుటుంబానికి చెందినది కావడమే. గురువారం సరుకు నిల్వలు లెక్కించాలని డీటీ రాధాకృష్ణ అక్కడికి వచ్చారు. వచ్చిన పని చేయకుండా అక్కడ వెంకటాచలంపల్లె గ్రామానికి చెందిన డీలర్ల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు సుబ్బారావుతో గూడు పుఠానీ చేశారు. మరి ఏ మంతనాలు జరిగాయో కానీ లోపల ఉన్న సరుకు లెక్కించకుండానే వెళ్లిపోయారు. షాపును కేసు నుంచి కాపాడే క్రమంలో డీఎస్ఓ, డీటీలకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. అక్కడకు వెళ్లిన విలేకరులకు కూడా సరైన సమాధానం చెప్పకుండా డీటీ వెళ్లిపోవడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా రేషన్ దుకాణంలో రేషన్ సక్రమంగా ఇస్తున్నట్లు గ్రామంలో కొందరి చేత సంతకాలు చేయించుకుని వీఆర్వో కొత్తనాటకానికి తెరతీస్తున్నారని సమాచారం. ఈ రేషన్ దుకాణాన్ని కేసునుంచి కాపాడేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నానాతంటాలు పడుతున్నారు. ఈ విషయంపై డీటీ రాధాకృష్ణను వివరణ కోరడానికి ఫోన్ చేయగా ఆయన ఫోన్లో స్పందించలేదు. డీఎస్ఓ అధికారిణికి ఫోన్చేయగా ఫోన్ ఎత్తి బొట్లపాలెం రేషన్ దుకాణం గురించి వివరణ అడగ్గానే ఫోన్ పెట్టేయడం గమనార్హం. డీలర్ల సంఘం అధ్యక్షుడు సుబ్బారావుతో మంతనాలు సాగిస్తున్న డీటీ డీటీ అక్కడ ఉండగానే రేషన్ కోసం వచ్చిన మహిళలు -
అడవిలో ఆగని వేట..!
గిద్దలూరు రూరల్: అభయారణ్యంలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. నాటు తుపాకీలతో వేటాడుతూ పెద్ద పులులను సైతం హతమారుస్తున్నారు. గుండ్లకమ్మ, గిద్దలూరు, తురిమెళ్ల అటవీ రేంజ్ పరిధిలో 2022 నుంచి 2026 వరకు పెద్దపులి, దుప్పి, జింక, ఉడుము, కణతి, నెమలి, అడవి పందులు తదితర వన్యప్రాణులను వేటాడిన ఘటనల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయంటే వేటగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని అభయారణ్యం సుమారు 10 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇంత విస్తారమైన అటవీ ప్రాంతంలోకి వేటగాళ్లు యథేచ్ఛగా ప్రవేశించి తమకు కావాల్సిన జంతువులను వేటాడటం పలు అనుమానాలు తావిస్తోంది. అభయారణ్యంలోకి అక్రమార్కులు, వేటగాళ్లు ప్రవేశించాలంటే స్థానిక పరిస్థితులపై అవగాహన, మార్గాలపై సమాచారం అవసరం. దీంతో అటవీశాఖలోని కొందరు సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అటవీశాఖలోని కొందరు సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేటగాళ్లకు అటవీ ప్రాంతంలోని మార్గాలు, జంతువుల సంచారం, గస్తీ వివరాలు వేటగాళ్లకు చేరవేస్తున్నట్లు తెలిసింది. అడవిలో యథేచ్ఛగా వేట సాగుతున్నా వేటగాళ్లను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై తురిమెళ్ల రేంజ్ ఆఫీసర్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. రాచర్ల బీటులో పెద్దపులి హత్య కేసులో తన రేంజ్ పరిధికి చెందిన ఏడుగురు వేటగాళ్లను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో పాటు, ఆగస్టు 23న సంగపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు కుందేలును వేటాడిన విషయం తెలిసినా కేసు నమోదు చేయకపోవడంతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు గుండ్లకమ్మ రేంజిలోని రాచర్ల బీటులో పెద్దపులి మృతి ఘటనకు సంబంధించి బీట్ ఆఫీసర్ లక్ష్మణ్నాయక్ను సెప్టెంబర్ 9న సస్పెండ్ చేసినట్లు తెలిసింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం రేంజ్ ఆఫీసర్ పరిధిలో స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ వేటగాళ్ల కదలికలను గుర్తించాల్సిన బాధ్యత ఈ సిబ్బందిపై ఉంది. అయితే స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో గస్తీ కంటే ఉన్నతాధికారుల వ్యక్తిగత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. బేస్తవారిపేట రేంజ్ ఆఫీసర్ వీరస్వామికి గుండ్లకమ్మ, జీటీడీ రేంజిల అదనపు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డిని కాదని సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్తవారిపేట రేంజ్ ఆఫీసర్కు గుండ్లకమ్మ రేంజ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు కీలక రేంజిలకు అదనపు బాధ్యతలు.. ఈ పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో నిరంతర నిఘాపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆభయారణ్యంలో వేటగాళ్లు విచ్చలవిడిగా నాటు తుపాకీలు వినియోగిస్తున్నారు. అయితే ఈ నాటు తుపాకీలు వేటగాళ్లకు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. కార్డన్ సెర్చ్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఎక్కడా ఈ నాటు తుపాకీలు పట్టుబడిన సందర్భాలు లేవు. మరీ వేటగాళ్లకు ఈ తుపాకీలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది విచారణలో తెలియాల్సి ఉంది. ఆగస్టు 4న పెద్దపులిని చంపిన కేసులో నిందితులు (ఫైల్) పెద్దపులికీ రక్షణ కరువు అడవి రారాజుగా పేరొందిన పెద్దపులినీ వేటగాళ్లు వదలడం లేదు. గత రెండు నెలలుగా పెద్ద పులలే లక్ష్యంగా చేసుకొని వేట సాగిస్తున్నారు. అయితే అడవిని సంరక్షించాల్సిన అధికారులు, సిబ్బందే వేటగాళ్లకు సహకరిస్తుండటంతో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. గుండ్లకమ్మ రేంజ్లోని రాచర్ల బీటులో జూలై 31న పెద్దపులి హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆగస్టు 3న ఏడుగురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులు వారి వద్ద నుంచి నాటుతుపాకీ, గొడ్డలి, పులిగోర్లు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 28న అంబవరం బీటులో నాటుతుపాకీతో అడవిపందిని కాల్చి చంపిన కేసులో ఇద్దరిని పట్టుకున్నారు. ఆగస్టు 9న గిద్దలూరు రేంజిలోని గయికోట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవనగరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నెమలిని వేటాడారు. ఆ కేసులో నిందితులను గుర్తించి అధికారులు పట్టుకొని వారి వద్ద నుంచి నెమలి మాంసం, వేటకు ఉపయోగించే ఉచ్చులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 3న గుండ్లకమ్మ రేంజిలోని దిగువమెట్ట పరిధిలో ఉడుములను వేటాడిన ముగ్గురిని అధికారులు పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించారు. తాజాగా సెప్టెంబర్ 8న తురిమెళ్ల రేంజ పరిధిలోని పాపినేనిపల్లె బీటులో పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మరోసారి కలకలం రేపింది. వేటగాళ్లకు అడ్డుకట్ట ఎక్కడ? స్ట్రైకింగ్ ఫోర్స్ ఏం చేస్తోంది? ఇంటి దొంగలెవరు..? విధుల్లో నిర్లక్ష్యం వహించారని.. నాటు తుపాకీలు ఎక్కడివి..? అధికారుల మధ్య సమన్వయలోపం -
పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
● టీడీపీ నాయకుడికి చెందినవిగా సమాచారం.? నాగులుప్పలపాడు: మండలంలోని గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను ఎస్సై బీబీ మహేంద్ర గురువారం తన సిబ్బందితో దాడి చేసి పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. వాటిని నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం కాగా, ఒంగోలు రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: వైద్య, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్, గ్రాస్సాలరీ తదితర సమస్యలపై చేస్తున్న ఆందోళనలకు సీఐటీయూ ప్రకాశం జిల్లా కమిటీ మద్దతు తెలుపుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాలం సుబ్బారావు, యం.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరిట కాలయాపన చేయకుండా వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ చేయాలని కోరారు. వైద్య, ఆరోగ్యశాఖలో తాత్కాలిక పద్ధతిన ఏళ్ల తరబడి పనిచేయించుకోవడం సరైనది కాదని, గతంలోనే హైకోర్టు తీర్పును వెల్లడించింది. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆప్కాస్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీరందరికీ గతంలోలా మినిమం టైమ్స్కేల్ను పునరుద్ధరించాలని చెప్పారు. మార్కాపురం టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతా సిబ్బంది నియామకానికి మాజీ సైనికుల ఎంపిక ప్రక్రియ గురువారం మార్కాపురం పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. జిల్లా సైనిక్ బోర్డు, ఏడబ్ల్యూపీఓ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికకు మొత్తం 23 మంది మాజీ సైనికులు హాజరయ్యారు. వివిధ దశల్లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియ అనంతరం 21 మంది అర్హత సాధించి ఎంపికై నట్లు ప్రకాశం జిల్లా సైనిక సంక్షేమ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం తెలిపారు. మాజీ సైనికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సేవా అనుభవాన్ని టీటీడీ భద్రతా వ్యవస్థలో వినియోగించుకునే ఉద్దేశంతో ఈ సెలక్షన్ నిర్వహించినట్లు అధికారులు చెప్పా రు. ఎంపికై న అభ్యర్థులకు తదుపరి ప్రక్రియ, విధులు, బాధ్యతలపై అధికారులు వివరించారు. ఈ ప్రక్రియలో, ఏడబ్ల్యూపీఓ గోవర్ధనరావు, ఎస్.మురళి, మార్కాపురం మాజీ సైనికుల ప్రతినిధులు శీలం హరి నారాయణరెడ్డి, ఎన్.చెన్నయ్య, రామకృష్ణయ్య, శేషసాయి, వెంకటేశ్వర్లు, తిరుమలయ్య తదితరులు పాల్గొని ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. పెద్దారవీడు: మండలంలో బద్వీడు, సానికవరం గ్రామాల్లో కేంద్ర జలశక్తి బృందం సీడబ్ల్యూసీ, ఎంఏఆర్డీ బృందం జిల్లా నోడల్ అధికారి వీ గణేష్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ (జేఎస్జేబీ) 2.0 కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. జల సంరక్షణ, నీటి నిర్వహణకు సంబంధించిన పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయా పనుల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నీటి వనరుల సంరక్షణ, నీటి నిర్వహణ కోసం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరును, పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఏపీడీ బాలునాయక్, ఏపీఓ సాంబశివరావు, ఈసీ ఎస్ మంత్రునాయక్, ఈసీలు, టీఏలు, వీబీజీ రామ్జీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
భారీగా మొహరించిన పోలీసులు
నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మొహరించారు. ప్రజలకు మద్దతు ఇవ్వడానికి వస్తున్న మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను అడ్డుకునేందుకు యరజర్ల వద్ద మూడు టీంలుగా పోలీసులు బారికేడ్లు ఉంచారు. అలాగే మర్లపాడు వద్ద కొండల మీదుగా వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ అడ్డుకున్నారు. పోలీసులు ఎలా అడ్డుకున్నా దాదాపు 500 పైనే ఆయా గ్రామల ప్రజలు, మహిళలు, రైతులు హాజరయ్యారు. అలాగే పోలీసులు ఆంక్షలు పెట్టడంతో డాక్టర్ ఆదిమూలపు సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు మరి కొందరు ఒంగోలు నుంచి మంగమూరు మీదుగా కొణిజేడు చేరుకొని నిరసన సభకు హాజరయ్యారు. -
కోడిగుడ్లను సొమ్ము చేసుకుంటున్నారా..
దర్శి: విద్యార్థులకు వండి పెట్టాల్సిన కోడిగుడ్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారా అని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ మస్తాన్, ఎంఈఓ రమాదేవిల పై ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతల విజయప్రతాప్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల, ఎస్సీ కాలనీ వద్ద అంగన్వాడీ కేంద్రం, పాత పోస్టాఫీసు వద్ద అంగన్వాడీ కేంద్రం, జిల్లాపరిషత్ బాలికల పాఠశాలల్లో ఆయన బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. జెడ్పీబాలికల పాఠశాలలో స్టోర్రూంలో కొన్ని చెడిపోయిన గుడ్లు పరిశీలించారు. అనంతరం బాగున్న గుడ్లను లెక్కవేసి చూడగా 1824 గుడ్లు ఉండాల్సి ఉండగా 2160 గుడ్లు ఉన్నాయి. 336 గుడ్లు ఎక్కువ ఉన్నాయని, తేడా ఎందుకు వచ్చాయని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్ మస్తాన్ను ప్రశ్నించారు. ఇంత తేడాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ఎంఈఓ రమాదేవిని ప్రశ్నించారు. మాకు ఇక్కడ గుడ్లు పక్కదారి పడుతున్నాయని ఆటోల్లో తీసుకుని వెళ్లి బయట అమ్ముకుంటున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకే తనిఖీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వారు ఫిర్యాదు చేసినట్లే ఇక్కడ తేడా ఉందని చెప్పారు. రెండు బ్యాగులు రైస్కూడా ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రధానోపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ డీఈఓ రంగయ్యను ఆదేశించారు. ఆయన ఇచ్చే వివరణను బట్టి జరిగిన తప్పును సుమోటోగా తీసుకుంటామని కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. ఏపీమోడల్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడారు. తమకు పెట్టే ఉప్మా తినలేక పోతున్నామని విద్యార్థులు చెప్పగా అందుకు బదులుగా ఎగ్ఫ్రైడ్రైస్, టమోటా రైస్లను పెట్టాలని మెనూలో మార్పు చేశారు. ఆ తరువాత కోడిగుడ్లను లెక్కవేయగా అక్కడ కూడా తేడాలు వచ్చాయి. గత బుధవారం గుడ్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయని, మురిగిన గుడ్లు పిల్లలకు ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు. గుడ్లకు ఉండాల్సిన రంగులు లేవని చైర్మన్ ప్రశ్నించగా ఈ రంగులతోనే సరఫరా ఇచ్చారని సమాధానం ఇవ్వడం పై మండిపడ్డారు. మొదటి తప్పిదంగా వదిలేస్తున్నామని రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. కేజీబీవీ స్కూల్లో అట్టగుడ్లను కాటా వేసి చూశారు. 300 గ్రాములు తేడా రావడంతో గుడ్లు సరఫరా చేసే వ్యక్తి ఎలా ఇలాంటి గుడ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇంత చిన్నగుడ్లు పిల్లలకు ఇస్తుంటే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ తో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రేషన్దుకాణం యజమాని పరార్: బొట్లపాలెంలో విజయలక్ష్మికి చెందిన రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ చేసేందుకు ఫుడ్ కమిటీ చైర్మన్ అక్కడకు వెళ్లారు. విషయం తెలుసుకున్న దుకాణదారులు రేషన్ దుకాణానికి తాళంవేసి పరారయ్యారు. దర్శి నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చుట్టూ రేషన్ దుకాణాదారులు ప్రదక్షిణలు చేయడం కనిపించింది. ఎక్కడ తమ దుకాణాలు తనిఖీలు చేస్తారోనన్న భయంతో రేషన్ షాపుల యజమానులకు ముచ్చెమటలు పట్టాయి. దుకాణాలు అన్నీ మూసి వేసి వెళ్లగా, కొందరు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విజయ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదులపై జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు. బొట్లపాలెం గ్రామంలో విజయలక్ష్మీకి సంబంధించిన రేషన్ దుకాణంలోకి రైస్ రావడం లేదని, బయట నుంచి బయటే బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. గ్రామంలో ఎవరికీ రేషన్ సక్రమంగా ఇవ్వడంలేదని, బయోమెట్రిక్లు వేసి బియ్యం ఇవ్వడం లేదని తమకు వచ్చిన ఫిర్యాదులపై ఇక్కడకు వచ్చామన్నారు. తాము వస్తున్న విషయం తెలుసుకుని రేషన్ దుకాణం యజమాని మూసేసి వెళ్లిపోయారని చెప్పారు. డీఎస్ఓను దుకాణం తనిఖీ చేసి తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
ధరలు పెరిగాయి.. పనులు ఆగాయి
మెట్ట ప్రాంత రైతుల కరువు తీర్చాలి.. బీడు భూములను సాగులోకి తేవాలి.. నాలుగు మండలాల ప్రజల దాహార్తిని తీర్చాలన్న సంకల్పంతో చేపట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వంలో పనులు ముందుకు కదల్లేదు. ఇరవై ఏళ్ల క్రితం మొదలైన ప్రాజెక్టులో ఇప్పటికీ పూర్తయిన పనులు పావువంతు దాటలేదు. అవి కూడా ప్రధాన నిర్మాణానికి ఉపయోగపడే స్థాయిలో కాకుండా మట్టికట్ట, రాళ్ల తొలగింపునకే పరిమితమయ్యాయి. హామీలు ఎన్నో.. ప్రకటనలు మరెన్నో.. కానీ పనుల్లో మాత్రం కదలిక కనిపించడంలేదు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వర్షపు నీళ్లతో స్పీల్వే నిర్మాణ ప్రాంతంఇరవై ఏళ్లయినా... పావువంతే..! పొన్నలూరు: మాకేరు–పాలేరు నదులపై 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా సంగమేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కొండపి నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రూ.50.50 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.34.50 కోట్లు నిర్మాణానికి, రూ.16 కోట్లు భూసేకరణకు కేటాయించారు. 2007లో పనులు ప్రారంభమై 2009 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ గడువు కాస్తా ఏళ్లుగా సాగిపోతోంది. దీంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు పంటలు సాగుచేయక భారీగా నష్టపోయారు. పావువంతు పనులే.. 154 మీటర్ల పొడవున స్పిల్వే, 11 గేట్లు.. ఇరువైపులా 2.8 కిలోమీటర్ల మట్టికట్ట.. 0.584 టీఎంసీల నీటి నిల్వ.. ఇవీ ప్రాజెక్టు రూపకల్పనలో ఉన్న లక్ష్యాలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పనుల పురోగతి నత్తనడకనే. సుమారు రెండు దశాబ్దాలు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకపోవడం పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది. నాలుగు మండలాలకు జీవనాడి సంగమేశ్వరం పూర్తయితే పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల్లో 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయితే మెట్ట ప్రాంతంలో సాగు విస్తరించి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ పాలకుల నిర్లక్ష్యంతో ఈ ఆశలు కాగితాలకే పరిమితమయ్యాయి. లోకేష్ హామీ ఏమైంది? 2023లో యువగళం పాదయాత్ర సందర్భంగా పొన్నలూరు మండలం కె.అగ్రహారంలో నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ను మార్చి పనులు వేగవంతం చేస్తామని ప్రకటించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రకటనలే.. పురోగతి ఏదీ? ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని పలుమార్లు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా పనుల్లో మాత్రం చెప్పుకోదగ్గ పురోగతి లేదు. తాజాగా రూ.166 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించినా.. ఆ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి? పనులు ఎప్పుడు మొదలవుతాయి? అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, సంబంధిత కాంట్రాక్టర్లకు మధ్య విభేదాలు తలెత్తడంతోనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదన్న ఆరోపణలున్నాయి. రైతుల నోట.. నష్టాల లెక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే ఈపాటికి వేల ఎకరాలు పచ్చని పంటలతో కళకళలాడేవి. కానీ నీరు లేక ఆయకట్టు భూముల్లో సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రెండు దశాబ్దాలుగా ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతులు కోట్ల రూపాయల పంట దిగుబడిని కోల్పోయారు. ఇప్పటి వరకు సుమారు రూ.360 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. మెట్ట ప్రాంత ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాల్సిన ప్రాజెక్టు.. పాలకుల ప్రకటనలకే పరిమితమైంది. నిధులు, టెండర్లు, కాంట్రాక్టర్లు, హామీలు.. ఇలా ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రజల జీవనాడిగా భావించిన సంగమేశ్వరం.. ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హామీలతో కాదు.. పనులతోనే ప్రాజెక్టు పూర్తవుతుందని, తమకు ఇక ప్రకటనలు కాదు.. నీళ్లే కావాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యానికి కాంట్రాక్టర్లు, సబ్కాంట్రాక్టర్లు మారడం, పాత ధరలకు–ప్రస్తుత ధరలకు భారీ వ్యత్యాసం రావడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. 2015లోనే అదనంగా రూ.20 కోట్లు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. పనుల వ్యయానికి అనుగుణంగా అదనపు నిధులు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో కొంతకాలం మట్టికట్ట, ఎర్త్వర్క్ పనులు జరిగాయి. అయితే హామీ మేరకు నిధులు అందకపోవడంతో పనులు మళ్లీ నిలిచిపోయాయి. -
చేపల చెరువుల పాలవుతున్న సాగర్ జలాలు
● పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు బల్లికురవ: మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు మండలంలో వాగులు, చేపల చెరువుల పాలవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆగస్టు 30వ తేదీ సాగర్ జలాలు విడుదల చేసింది. 18/0 మైలు సంతమాగులూరు మండలం అడవిపాలెం వద్ద 1015 క్యూసెక్కులు, 33/0 మైలు బల్లికురవ మండలం వల్లాపల్లి లాకుల వద్ద 700 క్యూసెక్కులు పారేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఆ నీటిని పక్కదారి పట్టించి రెండు మండలాల్లో అద్దంకి బ్రాంచి కాలువ ద్వారా నల్లవాగు, చేపల చెరువుకు, పవర్ ప్లాంటుకు ఎగువన సూరేపల్లి గ్రామ సమీపంలో ప్రధాన కాలువ వద్ద లీకేజ్తో కాలువ కట్ట ఏర్పాటు చేసుకుని కొందరు రైతులు పంట పొలాలు దుక్కులు, వరినాట్లు చేపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి 227 తాగునీటి నోటిఫైడ్ చెరువులను పూర్తిస్థాయిలో సాగర్ నీటితో నింపాలని ప్రజలు కోరుతున్నారు. ఐరన్ ఓర్ తవ్వకాలు నిలిపేయండి టంగుటూరు: మండలంలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు, సర్వేరెడ్డిపాలెం, యరజర్ల గ్రామాల కొండల్లో ఇనుప ఖనిజం మైనింగ్ పనులను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఒంగోలు రూరల్ మండలంలోని యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, టంగుటూరు మండలంలోని మర్లపాడు, కొణిజేడు, కందులూరు గ్రామాల ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మైనింగ్ కారణంగా తమ భూములు, నీటి వనరులు, పశువుల మేత భూములు, జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా గ్రామస్థులు ఏకమై నిరసన చేపట్టారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులతోపాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు గ్రామస్థులకు మద్దతుగా నిలిచారు. కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళనలో పాల్గొని మైనింగ్ పనులు, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ, జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఓపెన్కాస్ట్ ఇనుప ఖనిజం మైనింగ్తోపాటు అక్కడే శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. మొత్తం సుమారు 1,300 ఎకరాల భూమి ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. కొణిజేడు ప్రాంతంలో 300 ఎకరాలు, కందులూరులో 100 ఎకరాలు, మర్లపాడులో 300 ఎకరాలు, యరజర్లలో 300 ఎకరాలు, సర్వేరెడ్డిపాలెంలో 200 ఎకరాలకు పైగా భూములు ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణలో జేఎస్డబ్ల్యూకు 89 శాతం వాటా, ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి 11 శాతం వాటా ఉండటంపై సురేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఏపీఎండీసీ జిమ్టెక్స్ అనే సంస్థను తీసుకొచ్చి అనంతరం జేఎస్డబ్ల్యూకు అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. 2015లో మంజూరైన పర్యావరణ అనుమతులను ఆధారంగా చేసుకుని తాజా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే డ్రిల్లింగ్, తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. 2011లో కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన సమయంలోనే గ్రామస్థులు మైనింగ్ను తీవ్రంగా వ్యతిరేకించారని, అప్పట్లో గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని గుర్తుచేశారు. ప్రస్తుతం మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లే గ్రామస్థులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనింగ్ పనులకు సంబంధించి సరైన మైనింగ్ ప్రణాళికలు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, జాయింట్ వెంచర్ పత్రాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైనింగ్తో తీవ్ర కాలుష్యం: మైనింగ్ ప్రాంతంలోని ఇనుప ఖనిజంలో మాగ్నటైట్ శాతం తక్కువగా ఉందని, దీంతో ఖనిజాన్ని శుద్ధి చేయడానికి విస్తృతమైన ప్రక్రియ అవసరమవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ వల్ల ధూళి, వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుద్ధి ప్రక్రియకు భారీగా నీరు అవసరమవుతుందని, దీనివల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడంతోపాటు నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. స్థానికంగా సుమారు 500 ఎకరాల చెరువులు, కుంటలు, సమీపంలోని ఎన్ఎస్పీ కాలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వంద ఎకరాలకు పైగా పశువుల మేత భూములు దెబ్బతిని పశువులకు మేత, నీటి కొరత ఏర్పడుతుందని గ్రామస్థులు తెలిపారు. సారవంతమైన వ్యవసాయ భూములు దెబ్బతింటే రైతుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నా స్థానికులకు ఎక్కువగా ప్రమాదకరమైన, నైపుణ్యం లేని పనులే దక్కే అవకాశం ఉందని సురేష్ విమర్శించారు. మైనింగ్ పనులను తక్షణమే నిలిపేసి కలెక్టర్ స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై ముందుకెళ్తే ఉద్యమమే.. గతంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన అంశంపై మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదిమూలపు సురేష్ కోరారు. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా బలవంతంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రామాల భవిష్యత్తు, పర్యావరణం, వ్యవసాయ భూములు, నీటి వనరులు, ప్రజల జీవనోపాధిని కాపాడేందుకు ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామని గ్రామస్థులు స్పష్టం చేశారు. మైనింగ్ పనులు నిలిపేయాలంటూ ఐదు గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు యువత అన్ని వర్గాల వారు తీవ్ర నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో నిరసనకారులను అడ్డుకునేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా సామరస్య పూర్వకంగా తమ నిరసనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తమ ప్రాంతాలకు నష్టం జరగకుండా కాపాడాలని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ మండల పార్టీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి టీ.రాము, సీపీఎం మండల కార్యదర్శి వి.మోజెస్, కొణిజేడు నాయకులు ఎస్.కె.మీరాస్, ఎమ్.కోటయ్య, సీపీఐ మండల కార్యదర్శి టీ.ప్రభాకర్, నాయకులు ఎన్.పేరయ్య, ఈదా వెంకటరెడ్డి, బుర్ర అంకరాజు, సింగమనేని బ్రహ్మయ్య, ఈదర అమర్నాథ్, కొమ్ము సురేంద్ర, మేదరమెట్ల భరత్ రెడ్డి, శ్రీపతి విజయ్, మస్తాన్ బాబు, ఆ గ్రామాల రైతులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. -
దేవుడి విగ్రహాల దొంగల అరెస్టు
ఒంగోలు సబర్బన్: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను మార్కాపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దేవతా మూర్తుల విగ్రహాలు అపహరించిన మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.22.70 లక్షల విలువైన దేవతా మూర్తుల విగ్రహాలను, ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మార్కాపురం జిల్లా సీఎస్పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని దేవాలయాల్లో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను నియమించామన్నారు. నిందితులను పామూరు మండలం రావిగుంటపల్లి గ్రామ శివారులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టయిన నిందితుల్లో రావిగుంటపల్లికి చెందిన ఇండ్ల విష్ణువర్ధన్, సీఎస్పురానికి చెందిన తమ్మిశెట్టి రమణయ్య, గుడ్లూరు మండలం ఏలూరుపాడుకు చెందిన మల్లాల చెంచు సుబ్బారావు, పొదిలికి చెందిన సోమరాజుపల్లి ఉమా మహేశ్వరరావు, కనిగిరి మండలం వంగపాడు గ్రామానికి చెందిన కొమ్మి కాటంరాజు, సీఎస్ పురానికి చెందిన బత్తుల శ్రీను, కొత్తపట్నం మండలం పల్లెపాలేనికి చెందిన పిన్నీ రాజీవ్, ఒంగోలు కమ్మపాలేనికి చెందిన కమ్మ సూర్యతేజ, ఎన్జీపాడు మండలం వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన మోకా ఆంజనేయులు, అద్దంకికి చెందిన డేరంగుల వెంకట రమణ, సీఎస్పురం వడ్డెపాలేనికి చెందిన బండారు తిరుపతయ్య, గిద్దలూరుకు చెందిన దూదేకుల నాగూర్ షరీఫ్, వీళ్ళ వద్ద విగ్రహాలు కొనుగోలు చేసిన కొమరోలు మండలం భావాపురం గ్రామానికి చెందిన చందలూరి బాల గురవయ్యలను అరెస్ట్ చేశామన్నారు. అపహరించిన వాటిలో సీఎస్.పురం శివాలయంలో సుమారు రూ.12 లక్షల విలువైన రెండు పార్వతీ పరమేశ్వరుల పంచలోహ విగ్రహాలు, ఒక ఇత్తడి అయ్యప్ప విగ్రహం, కనిగిరి మండలం చీర్లదిన్నె గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో సుమారు రూ.10 లక్షల విలువైన 4.5 కేజీల వెండి కవచం, వెండి నాగాభరణం, కొనకనమిట్ల మండలం గొట్లగట్టు రామాలయంలో రూ.25 వేల విలువైన సుమారు 25 కేజీల ఇత్తడి హనుమంత వాహనం, పామూరు మండలం వగ్గంపల్లి గ్రామంలో పోలేరమ్మ తల్లి దేవాలయంలో సుమారు రూ.50 వేల విలువైన ఇత్తడి కిరీటం, రెండు చేతుల కవచాలు మొత్తం విలువ సుమారు రూ.22,75,000 ఉంటాయన్నారు. నిందితులు బేల్దారు పనులు, మరికొందరు స్లాబ్ మిల్లర్ పనులు చేస్తుంటారు. ఆయా పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఒకరికొకరికి పరిచయం ఏర్పడింది. వీరిలో విష్ణువర్ధన్ ఒక ప్రైవేట్ వెంచర్లో వాచ్మెన్గా పనిచేస్తుండగా, అతనికి సుబ్బారావు తోడుగా ఉండేవాడు. వీరిలో పాత నేరస్తుడైన సోమరాజుపల్లి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ, దేవాలయాల్లో చోరీలకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే సలహాలు ఇచ్చేవాడు. కొమరోలు మండలానికి చెందిన బాల గురవయ్య చోరీ చేసిన సొత్తును స్వీకరించే రిసీవర్గా ఉండేవాడు. ఈ విధంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు దేవాలయాలను ముందుగా గుర్తించి, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ, దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. దేవాలయాల్లో జరుగుతున్న ఈ వరుస దొంగతనాల కేసులు ఛేదించడంలో కృషి చేసిన కనిగిరి డీఎస్పీ పి.శ్రీధర్ బాబు, పామూరు సీఐ డి.వినోద్ కుమార్, కనిగిరి సీఐ యు.శ్రీనివాసరావు, ఎస్సైలను, వారి సిబ్బంది, సీసీఎస్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. -
అధైర్యపడొద్దు అండగా ఉంటాం
● పొగాకు రైతులపై అన్యాయంగా కేసులు బనాయించారు● అక్రమ కేసులు ఎక్కువ కాలం నిలవవు● మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కొనకనమిట్ల: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అన్నీ విధాలా అండగా ఉంటుందని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భరోసా ఇచ్చారు. గతేడాది పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు పొదిలి పొగాకు బోర్డు సందర్శించారు. అప్పట్లో కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా జగన్మోహన్రెడ్డికి మద్దతుగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, పలువురు రైతులపై కేసుల పెట్టారు. కేసులు పెట్టిన వారిలో మండలంలోని వాగుమడుగు గ్రామానికి చెందిన బొరిగొర్ల తిరుపతయ్య, సాదం పెద్దవీరయ్య ఉన్నారు. గత నెలలో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం దర్శి సబ్జైల్కు పంపారు. వారికి మంగళవారం బెయిల్ మంజూరైంది. విషయం తెలుసుకున్న అన్నా రాంబాబు, పార్టీ నాయకులతో కలిసి దర్శి సబ్ జైల్ దగ్గరికి వెళ్లారు. దర్శి సబ్జైల్ నుంచి బెయిల్పై బయటికి వచ్చిన కార్యకర్తలను పరామర్శించారు. అక్రమ కేసులు ఎప్పుడూ నిలవవని, ఎవరూ భయపడొద్దని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా సమష్టిగా పోరాడదామన్నారు. ఏ సమస్యలు వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అన్నాతో పాటు జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్రెడ్డి, వాగుమడుగు ఎంపీటీసీ పి.కృష్ణవేణి కోటయ్య, నాయకులు కల్లం దిబ్బారెడ్డి, బొరిగొర్లబాలయ్య తదితరులు ఉన్నారు. -
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సుడిగాలి పర్యటన
కనిగిరిరూరల్: ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ్ ప్రతాప్రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. కనిగిరి, మార్కాపురం, కొండపి నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పలు అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, పాఠశాలలను, ఎండీఎంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కనిగిరి పట్టణంలోని 8వ వార్డు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రతాప్రెడ్డి తనిఖీ చేశారు. అంగన్వాడీ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో పాటు, కార్యకర్త జీ సత్యావతి విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని తదితర అంశాలపై విచారణ జరిపారు. ఆరోపణలు వాస్తవంగా నిర్ధారించుకుని అంగన్వాడీ కార్యకర్తపై చర్యలకు ఆదేశించారు. 8వ వార్డు అంగన్వాడీ కార్యకర్తను డిస్మస్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘కనిగిరిలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు బాగా లేదు. నిత్యం అనేక ఫిర్యాదు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా చాలామంది నాకు ఫిర్యాదులు పంపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సమయ పాలన పాటించడం లేదని నేరుగా వాట్సప్లో టైమింగ్ తో సహా పెడుతున్నారు. మీరు అసలు పట్టించుకోరా.. మీరు వారి ఆధీనంలో పనిచేస్తున్నారా.. లేక వారు మీ ఆధీనంలో ఉన్నారా..?’’ అంటూ సీడీపీఓ సరోజనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఐసీడీఎస్ పట్టణ పరిధిలోని 31 మంది కార్యకర్తలు, ఆయాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కనిగిరి అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రేషన్ షాపుల తనిఖీ.. పట్టణంలోని పలు రేషన్ షాపులను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. 12వ రేషన్ షాపులో స్టాక్ నిల్వకంటే అధికంగా 15 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. తక్షణం రేషన్ డీలర్ ఎస్కే బాషా పై 6ఏ కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే జెడ్పీ బాలికోన్నత పాఠశాలను, గురుకుల పాఠశాలను, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఎండీఎంను పరిశీలించారు. అనంతరం ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థినులతో ముఖా ముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సీ, బీసీ వెల్ఫేర్ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి నాలుగు గుడ్లు ఇస్తున్నారని.. త్వరలో ప్రభుత్వం ఎండీఎం రేట్లు పెంచుతారని అప్పుడు కచ్చితంగా 6 గుడ్లు విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి 105 గ్రాముల చికెన్ కచ్చితంగా ఉండాలని తెలిపారు. పేద వర్గాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్నారు. బియ్యం సరిగా పంపిణీ చేయకుంటే డీలర్ల వ్యవస్థకే ముప్పు: అనంతరం ఏపీ ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కనిగిరి నుంచి తనకు విపరీతమైన ఫిర్యాదులు రావడంతో తనిఖీలకు వచ్చినట్లు చెప్పారు. రేషన్ డీలర్లు పేదలకు బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నట్లు అనేక మంది ఫిర్యాదు చేశారన్నారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో రేషన్ డీలర్ వ్యవస్థకే ముప్పు తెచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. డీలర్లు ఇదే తప్పు కొనసాగిస్తే భవిష్యత్తులో పేదలకు బియ్యం బదులు నగదు ఇచ్చి డీలర్ వ్యవస్థనే రద్దు చేస్తే ఆలోచనలు జరుగుతాయని పరోక్షంగా హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తహసీల్దార్ టీవీఎం కృష్ణా ప్రసాద్, జీసీడీఓ హేమలత, డీఎస్ఓ, డిప్యూటీ డీఈఓ జీ సంజీవి, సీడీపీఓ సరోజని, ఎంఈఓలు యూవీ నారాయణరెడ్డి, దేవిరెడ్డి రామిరెడ్డి, రాజాల కొండారెడ్డి, సుబ్బారావు, శివ నాయక్, ఆర్ఐ మాధవరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్, తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్పై 6ఏ కేసు నమోదు చేయండి మార్కాపురం టౌన్: రేషన్ షాపులో ఆన్లైన్ స్టాక్కు, షాపులో ఉన్న స్టాకులో తేడా ఉన్నందున 33వ రేషన్షాపు డీలర్పై 6ఏ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఏకలవ్య కాలనీలో రేషన్షాపును తనిఖీ చేశారు. షాపు నంబర్ 33పై ఫిర్యాదులు రావటంతో ఆయన తనిఖీ చేయగా బియ్యం 50 కిలోలు ఎక్కువగా, గోధుమపిండి 85 కిలోలు, చక్కెర 15 కిలోలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని సదరు డీలర్పై కేసు నమోదు చేయలని డీఎస్వో అంకయ్యను ఆదేశించారు. -
40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
నలభై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. పత్తి ఎందుకు వేశానా అని బాధపడుతున్నా. ఒక్క చినుకు కూడా పడకపోవడంతో పంట మొత్తం ఎండిపోతోంది. అప్పుడప్పుడూ నీటి తడులు ఇస్తున్నా పైరుకు సరిపోవడం లేదు. ఎండాకాలం మాదిరిగా వాతావరణం ఉంది. పంటను కాపాడుకునేందుకు రాత్రిపూట నిద్రపోకుండా నీళ్లు పెడుతున్నాం. రెండెకరాలకు ఇప్పటికే రూ.20 వేలకుపైగా ఖర్చు చేశాను. ఆ పెట్టుబడైనా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అడవి పందుల బెడద కూడా పెరిగింది. – జానపాటి ఆవులయ్య, పత్తి రైతుమార్కాపురం: ఖరీఫ్ ఆరంభంలో తొలకరి జల్లులు పలకరించడంతో ఆశగా విత్తనాలు వేసిన రైతులకు.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో కష్టాలు మొదలయ్యాయి. కీలకమైన పూత, కాయ దశలో చినుకు జాడ లేకపోవడంతో పొలాల్లో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక శాతం మార్కాపురం జిల్లా పరిధిలోని 14 మండలాల్లో పత్తి పంట సాగవుతోంది. ఖరీఫ్ సీజన్లో 19,711 హెక్టార్లలో పత్తి సాగు కావాల్సి ఉండగా.. 16,338 హెక్టార్లలో సాగైంది. ప్రధానంగా వర్షాధారంగానే పంటను సాగుచేశారు. తొలకరి వర్షాలు ఆలస్యం కావడంతో కొంతమంది రైతులు జల్లుల కోసం ఎదురుచూశారు. అడపాదడపా కురిసిన వర్షాలతో మొక్కలు మొలకెత్తి ఎదుగుదల కనిపించలేదు. దీంతో ఎరువులు, పురుగుమందులు వినియోగించారు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పంట పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి పత్తి సాగు కోసం రైతు ఎకరాకు సుమారు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. విత్తనాల కొనుగోలు, దుక్కులు, అరకలు, అంతర్ సేద్యం, ఎరువులు, పురుగుమందులకు ఖర్చు చేశాడు. మూడు ప్యాకెట్ల విత్తనాలు, రెండుసార్లు దున్నడం, అంతర్ సేద్యం, రెండుసార్లు పురుగుమందులు, ఎరువులు చల్లడం తదితర ఖర్చులు కలిపి పెట్టుబడి పెరిగిపోయింది. ఇప్పుడు పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ మొత్తం వృథా అయ్యే ప్రమాదం నెలకొంది. పూత దశలోనే.. పంట వాడుముఖం పత్తి పంటకు ప్రస్తుత సమయం అత్యంత కీలకం. పూత, కాయలు నిలవాలంటే నేలలో తేమ అవసరం. వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ తగ్గి మొక్కలు బలహీనపడుతున్నాయి. పూత నిలవకపోవడం, కాయలు ఏర్పడకపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎరువులు, బలవర్ధక మందులు వినియోగించినా వాన లేకపోవడంతో ఆశించిన ఫలితం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. బోర్లతో తడులు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు వర్షాధార పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు బోర్ల ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. రాత్రింబవళ్లు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. అయినా ఎండ తీవ్రతకు ఆ తడులు సరిపోవడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండటంతో భవిష్యత్లో నీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గ్రామాల్లో దయనీయ పరిస్థితి మార్కాపురం మండలంలోని వేములకోట, జమ్మనపల్లి, చింతగుంట్ల, తిప్పాయిపాలెం, మిట్టమీదిపల్లి, నికరంపల్లి, గజ్జలకొండ, బోడపాడు, పెద్దారవీడు మండలంలోని బద్వీడు, చెర్లోపల్లి, చట్లమిట్ట, సానికవరం, తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి, మీర్జపేట, తుమ్మలచెరువు, సీతానాగులవరం తదితర గ్రామాల్లో పత్తి పంట పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రైతులకు అవగాహన.. అయినా వాన కోసం ఎదురుచూపులే ఎల్నినో ప్రభావంతో పంటపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దర్శి కేవీకే శాస్త్రవేత్తలు, స్థానిక వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. నేలలో తేమను కాపాడుకోవడం, అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. అయితే వర్షం లేకపోవడంతో పంటను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. -
పేర్నమిట్టలో వార్డుల విభజన అస్తవ్యస్తం
చీమకుర్తి: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్టలో వార్డుల పునర్విభజన అత్యంత అశాసీ్త్రయంగా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. జనాభా ప్రాతిపదికను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా విభజన చేపట్టి స్థానిక ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తపాలాధికారి ఎబినైజర్ను వైఎస్సార్సీపీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, స్థానిక నేతలు కలిసి తమ అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట పరిధిలో నాలుగు పూర్తి వార్డులు, మరో రెండు వార్డుల్లో సగం ఓటర్లు ఉండేవారని, విభజన అనంతరం వాటిని ఐదు వార్డులుగా మార్చారని నాయకులు పేర్కొన్నారు. అయితే పాత 38, 39 వార్డులు రెండింటినీ కలిపి ఏకంగా 5,500 మంది ఓటర్లతో నూతనంగా 48వ వార్డుగా మార్చడం దారుణమన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఇతర వార్డుల్లో సగటున 2,500 నుంచి 3,000 మంది ఓటర్లు మాత్రమే ఉంటే, పేర్నమిట్టలోని 48వ వార్డులో మాత్రం 5,500 మందిని చేర్చడం ఏంటని ప్రశ్నించారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు, భారీ భౌగోళిక విస్తీర్ణం ఉన్న ఈ వార్డులో ప్రజలకు సచివాలయ సేవలు, ప్రభుత్వ పథకాలు అందడం గగనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరం మొత్తం మీద అదనంగా 12 నూతన వార్డులను పెంచిన అధికారులు.. దాదాపు 35 వేల మంది ఓటర్లున్న పేర్నమిట్ట ప్రాంతానికి ఒక్క కొత్త వార్డు కూడా కేటాయించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. ఇప్పటికై నా అధికారులు పునరాలోచించి 5,500 మంది ఓటర్లున్న 48వ వార్డును తక్షణమే రెండు వార్డులుగా విభజించాలని, తద్వారా స్థానిక ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డితో పాటు వార్డుల ఇన్చార్జిలు ఎస్కే రసూల్, సాయి, రామచంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. 38, 39 వార్డులను కలిపి ఒకే వార్డుగా చేయడమేంటి? ఒంగోలులో ఎక్కడా లేని విధంగా ఒకే వార్డులో 5,500 మంది ఓటర్లేంటి? కార్పొరేషన్లో 12 వార్డులు పెరిగినా.. 35 వేల మంది ఉన్న పేర్నమిట్టకు అన్యాయం 48వ వార్డును రెండుగా విభజించాలని కార్పొరేషన్ అధికారికి వైఎస్సార్ సీపీ నేతల వినతి -
ఓట్ల విభజనపై వైఎస్సార్సీపీ అభ్యంతరం
● కనిగిరి 7వ వార్డు ఓట్లను యథావిధిగా ఉంచాలని వినతి కనిగిరిరూరల్: నిబంధనలకు విరుద్ధంగా 7వ వార్డు పరిధిలోని ఓట్లను ఇతర వార్డుల్లోకి మార్చారని ఆరోపిస్తూ కనిగిరి పట్టణ వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో సుమారు 200 ఓట్లను ఎటువంటి ముందస్తు సమాచారం, విచారణ లేకుండా 9వ వార్డులో కలిపారన్నారు. ఒకే ఇంట్లో 5 ఓట్లు ఉంటే మూడు ఓట్లను వేరే వార్డుకు మార్చి, రెండు ఓట్లను ఇక్కడే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏ నిబంధనల ప్రకారం వార్డుల పునర్విభజన చేశారో కనీసం స్థానికులకు సమాచారం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లను ఉద్దేశపూర్వకంగానే చీల్చారని, దీనిపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి సరిచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షుడు భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, నాయకులు కన్నేటి సుబ్బారెడ్డి, తమ్మనేని రమణారెడ్డి, తమ్మనేని వెంకటరెడ్డి, టి.రామచంద్రారెడ్డి, బి.వెంకటేశ్వరరెడ్డి, టి.వెంకటరెడ్డి పాల్గొన్నారు. ● పొక్లెయిన్ అనుమతి కోరుతున్న చెంచు గిరిజనులు పెద్దదోర్నాల: తాము సాగు చేసుకుంటున్న ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో పెరిగిన పిచ్చిచెట్లను తొలగించుకునేందుకు పొక్లెయిన్ అనుమతి కోరుతూ ముఖ్యమంత్రికి మూకుమ్మడిగా పోస్టుకార్డులు పంపనున్నట్లు పెద్దదోర్నాల మండల పరిధిలోని చింతల, తుమ్మలబైలు చెంచు గిరిజనులు తెలిపారు. మంగళవారం గిరిజన సంఘ నాయకులు భూమని వెంకటయ్య, ఆర్తి వెంకటేశం మాట్లాడుతూ.. గతంలో తమకు పట్టాలు మంజూరైన ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో చిల్లచెట్లు భారీగా పెరిగి సాగుకు ఆటంకంగా మారాయన్నారు. ఈ విషయమై గత నెల 14న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎఫ్ఓలకు అర్జీలు ఇచ్చామని, రెండు నెలలుగా అటవీశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా అనుమతులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే చింతలలోనే రాస్తారోకో నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు. హనుమంతునిపాడు: మండలంలోని ముప్పళ్లపాడు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్నకు గురైనట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. ఒంగోలు శ్రీకృష్ణనగర్లో నివాసముంటున్న మువ్వ తిరుపతయ్య కుమార్తె స్థానిక చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తాతను చూసేందుకు ఆమె ఇటీవల ముప్పళ్లపాడుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఒంగోలుకు చెందిన పిన్నిక మహేష్ అనే యువకుడు కారులో వచ్చి బాలికను బలవంతంగా లాక్కెళ్లినట్లు తండ్రి తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. -
ఘాటెక్కిన ఉల్లి.. కిలో రూ.60!
మార్కాపురం టౌన్: మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటుండటంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పది రోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.35 పలికిన ధర, ప్రస్తుతం ఏకంగా రూ.50 నుంచి రూ.60కి చేరింది. మార్కెట్లో మహారాష్ట్ర నుంచి దిగుమతయ్యే పాత ఉల్లి ధర రూ.60 ఉండగా, కర్నూలు, నంద్యాల ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త గడ్డల ధర రూ.50 పలుకుతోంది. ప్రధాన మార్కెట్లలోనే ధరలు పెరగడంతో తామేమీ చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండగా, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై ఉల్లి విక్రయించి ఉపశమనం కలిగించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఫీడర్ కెనాల్ బాధితులకు పరిహారం ఇవ్వాలి
మార్కాపురం: వెలిగొండ ఫీడర్ కెనాల్లో గల్లంతైన కటకానిపల్లికి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి జలదంకి నరశింగరావు మాదిగ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, రెండెకరాల భూమి ఇవ్వాలని కోరుతూ మంగళవారం స్థానిక జీజీహెచ్ ఎదుట రహదారిపై ధర్నా నిర్వహించారు. మార్కాపురం ఆర్డీవో అక్కడికి చేరుకుని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని, గల్లంతైన రాజు మృతదేహాన్ని వెలికితీయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పందిటి కాశిరావు, కోటయ్య, వినయ్, పులివేముల అనిల్తో పాటు మృతుల బంధువులు పాల్గొన్నారు. ● మార్కాపురం విద్యుత్ ఎస్ఈ కరీం మార్కాపురం: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు సమస్యలపై వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఎస్ఎ.కరీం అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో డీఈఈలు, ఏడీఈఈలు, ఏఈఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, సాంకేతిక లోపాలు, వర్షాకాల ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి రెండో శనివారం సబ్స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ పనులను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈదురుగాలులు, వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా విద్యుత్ తీగలకు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, బలహీన స్తంభాలను సరిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈ అశోక్కుమార్, డీఈలు ఉమాకాంత్, యుగంధర్, ఏఈఈ సీయానాయక్, ఈఈ టెక్నికల్, ఈఈ ఎంఆర్టీ, ఏఏవోలు, జేఏవోలు పాల్గొన్నారు. -
మాజీ సైనికుడి ఇంట్లో చోరీ
గిద్దలూరు రూరల్: పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో నివాసముంటున్న మాజీ సైనికుడు సూరేపల్లె చిన్నిక్రిష్ణయ్య ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. అందిన సమాచారం మేరకు.. చిన్నిక్రిష్ణయ్య తన భార్యతో కలిసి గుజరాత్లోని కుమారుడి వద్దకు వెళ్లారు. ఇల్లు తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని దుస్తులు, సామగ్రిని చెల్లాచెదురు చేసి, అందులోని 4 తులాల వెండి, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. సోమవారం తిరిగొచ్చిన బాధితులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.సత్యానంద్ పిలుపు ఒంగోలు వన్టౌన్: ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.సత్యానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సివిల్, రాజీపడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంక్ రికవరీ, మోటార్ వాహన ప్రమాద పరిహారం, కుటుంబ, కార్మిక, విద్యుత్ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎక్కువ కేసులు రాజీ మార్గంలో ముగిసేలా చూడాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని, ఇక్కడ వెలువడే అవార్డు అంతిమమని, దీనిపై ఎలాంటి అప్పీల్ ఉండదని స్పష్టం చేశారు. అద్దంకి రూరల్: బైక్ వెనుక చక్రంలో చీర చెంగు ఇరుక్కొని కిందపడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మేదరమెట్లకు చెందిన సంధ్య, మహేష్ దంపతులు ఈ నెల 5వ తేదీ రాత్రి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై అద్దంకి రామ్నగర్లోని చర్చికి ప్రార్థనల నిమిత్తం వచ్చారు. తిరిగి వెళ్తుండగా వెంకటేశ్వర అపార్ట్మెంట్ సమీపంలో వెనుక కూర్చున్న సంధ్య చీర చెంగు చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోవడంతో తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. భర్త మహేష్ వెంటనే ఆమెను అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం గుంటూరు కిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం సంధ్య మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుడ్లూరు: పట్టపగలే గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలి చేతుల్లోని బంగారు గాజులను లాక్కెళ్లిన ఘటన మండల కేంద్రమైన గుడ్లూరులో కలకలం రేపింది. మంగళవారం స్థానిక మెయిన్ బజారులోని ఇనుప వ్యాపార దుకాణం వద్దకు మోటార్ సైకిల్పై ఇద్దరు ఆగంతకులు వచ్చారు. కిరోసిన్ కొలిచే లీటరు క్యాన్ కావాలని షాపు యజమాని సరోజనమ్మను అడిగారు. ఆమె చేతులకు ఉన్న బంగారు గాజులను చూసి, ‘ఇలాంటి డిజైన్తోనే గాజులు చేయించుకుంటాం’ అని నమ్మబలుకుతూ క్షణాల్లో వాటిని లాక్కుని పరారయ్యారు. అనంతరం అదే బజారులో మరో వ్యక్తి చేతి ఉంగరాన్ని, సినిమా హాల్ సెంటర్లో మరికొందరిని లక్ష్యంగా చేసుకుని చోరీకి యత్నించగా స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనలపై ఎస్సై వి.వెంకట్రావును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ● నాలుగో రోజూ ఎస్డీఆర్ఎఫ్ ముమ్మర గాలింపు పెద్దదోర్నాల: ఈతకు వెళ్లి వెలిగొండ ఫీడర్ కెనాల్ ప్రవాహంలో గల్లంతైన యువకుడు రాజ్కుమార్ ఆచూకీ నాలుగో రోజైన మంగళవారం కూడా లభ్యం కాలేదు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రాజ్కుమార్, అతని సోదరుడు వినయ్కుమార్ కెనాల్ నీటిలో కొట్టుకుపోయారు. సోమవారం వినయ్కుమార్ మృతదేహం సుంకేసుల సమీపంలో లభ్యం కాగా, రాజ్కుమార్ మృతదేహం కోసం గాలింపును ముమ్మరం చేశారు. రెవెన్యూ, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఫీడర్ కెనాల్, నల్లమలసాగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా జల్లెడ పడుతున్నారు. -
గ్రామాలపై
టంగుటూరు: ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు అల్లాడుతుంటే.. మరోవైపు కూటమి ప్రభుత్వం వారి జీవనాధారంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. జిల్లా కేంద్రం ఒంగోలుకు సమీపంలోని యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, టంగుటూరు మండల పరిధిలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల చుట్టూ ఉన్న కొండల ప్రాంతంలో ఈ కాలుష్య కర్మాగార ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుండటంతో స్థానిక ప్రజలు భగ్గుమంటున్నారు. పచ్చని పొలాలకు ఉరి.. ఈ ఐదు గ్రామాల్లో తరతరాలుగా వరి, జొన్న, మినుము, శనగ తదితర పంటలు పండే వేలాది ఎకరాల సారవంతమైన భూములున్నాయి. పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల పంటల దిగుబడి పడిపోయి భూములు బీడుగా మారే ప్రమాదముంది. రసాయన వ్యర్థాలతో తాగునీటి చెరువులు, భూగర్భ జలాలు విషతుల్యమై రోగాల బారిన పడతామని ప్రజలు వాపోతున్నారు. వేలాది పశువులకు మేత దొరక్క పాడి పరిశ్రమ కుదేలవుతుందని, కాలుష్యం పెరిగి ప్రజలు ఊళ్లు వదిలి వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా కుట్రలే.. 2001లోనే చంద్రబాబు నాయుడు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, 2013లో మర్లపాడులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఈ భూములను సిద్ధం చేస్తే, మైనింగ్ ప్రాంతమంటూ టీడీపీ నేతలు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణ ప్రభావ అధ్యయనం చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా అనుమతులిచ్చారు. దీనిపై కలెక్టర్ రాజాబాబుకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
వల్లూరు చెరువు..మట్టి మాఫియా దరువు..!
టంగుటూరు: మండలంలోని వల్లూరు చెరువు మట్టి మాఫియా అక్రమార్జనకు అడ్డాగా మారింది. ఒకప్పుడు ఆ గ్రామంలో నీటికి ఆధారంగా ఉన్న చెరువు.. నేడు మట్టి మాఫియాకు ఆదాయ వనరైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వల్లూరు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అనుమతులు, నిబంధనలను పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పగలూరాత్రీ తేడా లేకుండా మట్టి తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలిస్తున్న విషయం కళ్లకుకట్టినట్లు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వెనుక భారీగా అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ వందలాది ట్రిప్పులు... వల్లూరు చెరువులో మూడు చిన్న జేసీబీలు, ఒక భారీ జేసీబీతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు యంత్రాలు పనిచేస్తూనే ఉంటున్నాయి. భారీ స్థాయిలో మట్టిని బయటకు తరలిస్తున్నారు. నిత్యం సుమారు ట్రాక్టర్లతో 300 ట్రిప్పులు, లారీలతో 100 ట్రిప్పుల వరకు మట్టి తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దాని ప్రకారం.. రోజూ వేల టన్నుల మట్టిని చెరువులో తవ్వి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఒంగోలు, పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్లాట్లను చదును చేసేందుకు మట్టి సరఫరా చేస్తూ అక్రమార్కులు యథేచ్ఛగా దోచుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు మట్టికి డిమాండ్ ఉండటంతో కాసుల వర్షం కురిపిస్తోందని చెబుతున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో చెరువుకు ముప్పు... చెరువులో ఇదే విధంగా మట్టి తవ్వకాలు కొనసాగితే చెరువు అసలు స్వరూపం దెబ్బతినడంతో పాటు భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఇంత భారీ స్థాయిలో యంత్రాలు, వాహనాలతో మట్టి తవ్వి తరలిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మట్టి తవ్వకాలకు అనుమతులున్నాయా..? ఉంటే ఎంత మేరకు తవ్వకాలకు అనుమతిచ్చారు..? నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా..? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వల్లూరు చెరువు మట్టి దోపిడీపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, మట్టి తరలింపు, వాహనాల రాకపోకలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అడ్డగోలుగా మట్టి తవ్వి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు నాలుగు జేసీబీలతో చెరువులో మట్టి తవ్వి కొల్లగొడుతున్న వైనం ప్రతిరోజూ ట్రాక్టర్లతో 300 ట్రిప్పులు, లారీలతో 100 ట్రిప్పులతో వేల టన్నుల మట్టి రవాణా ఒంగోలులో రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్లాట్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు -
భోజనం బాగాలేదు..వసతులు లేవు
గిద్దలూరు రూరల్: భోజనం బాగుండటం లేదు..మెనూ పాటించడం లేదు.. హాస్టళ్లలో కనీస వసతులు లేవంటూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థినులు ఏపీ ఫుడ్ కమిషనర్ విజయప్రతాప్రెడ్డికి ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం, పెద్దపోస్టాఫీస్ వద్ద పోస్ట్మెట్రిక్ బాలికల వసతి గృహం, ఎస్టీ బాయ్స్ హాస్టల్, గిరిజన గురుకుల పాఠశాల, రాచర్ల రోడ్డులో పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం, పోలీసు స్టేషన్ సమీపంలోని రేషన్షాపులను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ బాలికల వసతి గృహం, పోస్ట్మెట్రిక్ ఎస్సీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులు హాస్టళ్లలో వసతులు సక్రమంగా లేవని, భోజనంలో మెనూ పాటించడం లేదని, మినరల్ వాటర్ ఇవ్వడం లేదని వారి సమస్యలను విజయప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రెండు హాస్టళ్లకు వార్డెన్ జయమ్మ బాధ్యతలు నిర్వహిస్తూ అక్కడి విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తోందని గ్రహించి ఆమైపె కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ మెట్రిక్ ఎస్సీ బాలికల వసతి గృహంలో రక్షణ కరువైందని, కొందరు ప్రైవేటు వ్యక్తులు హాస్టల్ ముందు భాగంలో ఉండే ఖాళీ ప్రదేశంలోకి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ర్యాగింగ్కు పాల్పడుతున్నారని కొందరు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై వెంటనే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా వార్డెన్కు కమిషనర్ సూచించారు. మెనూలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వార్డెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. సమస్యలు తెలిపిన విద్యార్థినులపై వేధింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారికి ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి భరోసానిచ్చారు. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలుసుకుని కొందరు అంగన్వాడీ కార్యకర్తలు, డీలర్లు, వార్డెన్లు అందుబాటులో ఉండకుండా వెళ్తున్నారని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏఎస్డబ్ల్యూఓ ఎం.విజయభాస్కర్రావు, వార్డెన్లు, వీఆర్ఓ నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులనూ వదలకుండా.. కూటమి నేతల దౌర్జన్యకాండ..!
మర్రిపూడి: కూడు పెట్టే అన్నదాతలపై సైతం కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. భూమిని నమ్ముకుని కాయాకష్టం చేసుకుని జీవించే రైతులపై టీడీపీ సానుభూతిపరుల దౌర్జన్యం రోజురోజుకూ పెచ్చురిల్లుతోంది. రైతులు తమ పొలం పక్కనే ఖాళీగా ఉన్న కొంతభూమిని దున్నుకుని సజ్జ సాగు చేస్తే.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తారా.? అంటూ పొట్టదశలో ఉన్న సజ్జ పంటకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ రాళ్లను రెవెన్యూ అధికారులు డోజర్ సహాయంతో పట్టపగలే విచక్షణా రహితంగా విరగ్గొట్టి పడగొట్టారు. పైగా, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు పొలం వద్దకు పరుగులు తీశారు. లబోదిబోమన్నా కనికరించలేదు. మా చేలకు రక్షణగా వేసుకున్న ఫెన్సింగ్ రాళ్లు, తీగలు ధ్వంసం చేయవద్దని వేడుకున్నాగానీ.. రెవెన్యూ అధికారులు లెక్కచేయకపోవడంతో చివరకు పురుగుమందు తాగి చనిపోతామని రైతులు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. మర్రిపూడి మండలంలోని గంగపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మర్రిపూడి పంచాయతీ పరిధిలోని గంగపాలెం గ్రామంలో సర్వే నంబర్ 185లో 8.03 ఎకరాలు, సర్వే నంబర్ 176లో 20 ఎకరాల మేత భూమి ఉంది. ఆ భూమిని గత 50 ఏళ్లుగా గ్రామానికి చెందిన ఇరుపార్టీల రైతులు ఒక్కో రైతు ఎకరా నుంచి అరెకరా చొప్పున సాగుచేసుకుని జీవిస్తున్నారు. మర్రిపూడి – గంగపాలెం రహదారిలో గ్రీన్ఫీల్డ్ హైవే వేశారు. హైవేను ఆనుకుని సర్వే నంబర్ 184లో కొంత పట్టా భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు బోన వెంకటనారాయణ, బోన రమణయ్య, బోన శ్రీనివాసరెడ్డి కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. కౌలుకు తీసుకున్న పట్టా భూమిని ఆనుకుని ఉన్న మరో 1.5 ఎకరాల మేత భూమి కూడా సాగు చేస్తున్నారు. సోమవారం టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ జనార్దన్ వీఆర్ఓ బడే సాహెబ్, తలారి నరసింహారావులను ఆ పొలం వద్దకు పంపించారు. డోజర్ సహాయంతో ఫెన్సింగ్ రాళ్లు పడేసి విచక్షణారహితంగా విరగ్గొట్టించారు. విషయం తెలుసుకున్న రైతులు హడావిడిగా పొలం వద్దకు చేరుకుని రెవెన్యూ అధికారులకు నచ్చేజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పొట్ట దశలో ఉన్న సజ్జ పంటను ఇన్నాళ్లూ కాపాడుకున్నామని, తీరా కోత దశలో ఫెన్సింగ్ రాళ్లు విరగ్గొడితే పంటను పశువుల నుంచి ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు. రైతులకు ముందుగా సమాచారం ఎందుకివ్వలేదని నిలదీశారు. కనీసం దండోరా కూడా వేయించలేదన్నారు. గ్రామస్తులందరూ మేత భూమిని తలా ఎకరా, అరెకరా చొప్పున గత 50 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారని, ఇప్పుడే ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో చివరకు రైతులు పురుగుమందు డబ్బా తీసుకుని తమ చేల వద్ద నిలబడ్డారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి మర్రిపూడి వీఆర్ఓ బడే సాహెబ్, తలారి గురిజాల నరసింహారావు తిరుగుముఖం పట్టారు. -
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
చీమకుర్తి: బస్సు ఢీకొని బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చీమకుర్తి మెయిన్రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి మండలం కొర్లమడుగు గ్రామానికి చెందిన గోరోజీ రాజాలు (45)ను కొన్ని సంవత్సరాలుగా చీమకుర్తి మండలం పీ నాయుడుపాలెంలో నివాసం ఉంటున్నాడు. చీమకుర్తిలోని మసీదు సెంటర్లో మెయిన్రోడ్డు మీదుగా పడమర వైపున్న బైపాస్ దగ్గరకు బైకుపై వెళ్తున్న సమయంలో మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజాలు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని సీఐ డీ ప్రసాద్ పరిశీలించారు. మృతుని కుమారుడు ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం టౌన్: ఆన్లైన్ చెల్లింపుల పేరుతో ఓ కేటుగాడు మహిళను మోసం చేసిన ఘటన మార్కాపురంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలోని సత్యనారాయణస్వామి గుడి వీధిలో ఉన్న ఓ కూల్డ్రింక్ షాపు వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి, షాపు నిర్వాహకురాలికి రూ.40 వేలు ఫోన్పే చేస్తానని నమ్మబలికాడు. అనంతరం నగదు పంపినట్లుగా తన ఫోన్లోని ఫేక్ మెసేజ్ను ఆమెకు చూపించాడు. అది నిజమని నమ్మిన నిర్వాహకురాలు సదరు వ్యక్తికి రూ.40 వేల నగదు చేతికిచ్చింది. కాసేపటికి తన బ్యాంకు ఖాతాలోకి నగదు జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి లబోదిబోమంది. ● పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం తరలింపు ● రాజ్కుమార్ మృతదేహం కోసం జల్లెడ పడుతున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో గత శనివారం ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కటకానిపల్లెకు చెందిన ఇద్దరు యువకులలో వినయ్కుమార్ అనే యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో వినయ్కుమార్ మృతదేహం 19వ కిలోమీటర్ వద్ద కనిపించి మళ్లీ మునిగిపోయిన విషయం విధితమే. సోమవారం మధ్యాహ్నం సుంకేసుల వద్ద చిల్లచెట్లలో చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో యువకుడు రాజ్కుమార్ మృతదేహం కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. -
తొలిరోజే సర్వర్ షాక్
టంగుటూరు/మార్కాపురం: రెండేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వారికి దరఖాస్తు దాఖలులో తొలిరోజే చుక్కలు కనిపించాయి. ఉమ్మడి జిల్లాలో సర్వర్ పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు అవస్థపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన గడువు తక్కువగా ఉండటం.. మరోవైపు ఆనన్లైన్ సర్వర్లు మొరాయించడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాల వద్దకు చేరుకున్న ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాశారు. సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కొత్తగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాలు 905 ఉన్నాయి. వీటిల్లో దాదాపు 32 వేల మందికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లకు అర్హత ఉందని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. తొలిరోజే సర్వర్ షాక్... దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే సర్వర్లు స్తంభించడంతో వివరాలు నమోదు చేసుకోవడం కష్టంగా మారింది. సర్వర్ నెమ్మదిగా పనిచేయడం, పదేపదే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దరఖాస్తుదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దరఖాస్తు కేంద్రాల వద్ద రద్దీ పెరిగినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో చాలామంది గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. గడువు తక్కువ.. గుబులు ఎక్కువ... తొమ్మిది రోజుల వ్యవధిలోనే దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు, నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో సైట్ సక్రమంగా పనిచేయకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ వ్యవధి మాత్రమే ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తొలిరోజే సర్వర్ సమస్యలు తలెత్తితే మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సమస్యలను వెంటనే పరిష్కరించి గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు. వృద్ధులు.. వితంతువులకు అవస్థలు... ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత కార్మికుల, మత్య్సకారుల, డప్పు కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు లేదా ఇతరుల సహాయం తీసుకోవాల్సి రావడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచి ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆధార్–మొబైల్ అనుసంధానానికి పాట్లు... దరఖాస్తు ప్రక్రియలో ఆధార్కు మొబైల్ నంబర్ అనుసంధానం, ఓటీపీ వంటి ప్రక్రియలు కూడా అర్జీదారులకు మరో సమస్యగా మారాయి. మొబైల్ నంబర్ అనుసంధానం లేకపోవడం, ఓటీపీ ఆలస్యంగా రావడం లేదా రాకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలకే గంటల సమయం వృథా అవుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. -
క్రీడా పతకాలు సాధించిన వారికి ఎస్పీ అభినందన
● వివిధ విభాగాల్లో 42 పతకాలు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు సిటీ: రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 4 వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో గుంటూరు రేంజ్ తరఫున పాల్గొన్న ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బంది మొత్తం 42 పతకాలు సాధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజు సోమవారం ప్రత్యేకంగా అభినందించి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్రాజు మాట్లాడుతూ జిల్లా పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 42 పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఇందులో 13 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్లో నిర్వహించే మరిన్ని క్రీడా పోటీల్లో ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వివిధ క్రీడా విభాగాల్లో పతకాలు సాధించిన విజేతలు ఎస్.వి.రమణారెడ్డి (ఆర్ఐ)–లాన్ టెన్నిస్ డబుల్స్ (ఎన్జీవో)లో వెండి పతకం సాధించారు. వి.సురేష్ బాబు 100 మీటర్ల పరుగులో బంగారు, 200 మీటర్ల పరుగులో బంగారు, కబడ్డీలో వెండి పతకం సాధించారు. సీహెచ్.శివ సుబ్రహ్మణ్యం–కంప్యూటర్ అవేర్నెస్లో వెండి, పీపీటీలో కాంస్య, ఆఫీస్ ఆటోమేషన్ లో కాంస్య పతకాలు సాధించారు. రాజగోపాల్ వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పతకం సాధించారు. వరలక్ష్మి ఆర్మ్ రెజ్లింగ్, పెన్కాక్ సిలాట్లో బంగారు పతకాలు, కబడ్డీలో వెండి, ఫెన్సింగ్, కాంస్య పతకాలు సాధించారు. రాజశేఖర్ వుషు, ఫెన్సింగ్ లో బంగారు పతకాలు, తైక్వాండో, పెన్కాక్ సిలాట్, కరాటే లో వెండి పతకాలు సాధించారు. శ్రీనివాసులు పవర్ లిఫ్టింగ్లో వెండి, వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. రత్నంబాబు తైక్వాండో, పెన్కాక్ సిలాట్, వుషులో బంగారు పతకాలు, కరాటేలో వెండి పతకం సాధించారు. కరీముల్లా వుషు, పెన్కాక్ సిలాట్లో బంగారు పతకాలు, తైక్వాండో, కరాటే లో వెండి పతకాలు, హ్యాండ్బాల్లో కాంస్య పతకం సాధించారు. స్పర్జన్రాజు తైక్వాండో, పెన్కాక్ సిలాట్ లో వెండి పతకాలు, కరాటే లో కాంస్య పతకం సాధించారు. శ్రీలక్ష్మి వెయిట్ లిఫ్టింగ్లో బంగారు, పవర్ లిఫ్టింగ్లో కాంస్య, కబడ్డీలో వెండి పతకం సాధించారు. వెంకటేష్, గిరిబాబు కబడ్డీలో వెండి పతకం సాధించారు. కోటేశ్వరరావు హ్యాండ్బాల్లో కాంస్య పతకం సాధించారు. సుధాకర్, యస్దాని, వెంకటరావు, శుభాన్ రెడ్డి హ్యాండ్బాల్లో కాంస్య పతకం సాధించారు. -
పునరావాసం సామగ్రి పంపిణీలో గందరగోళం
● సుంకేసుల నిర్వాసితులకు మార్కాపురం కలెక్టరేట్లో ఇళ్ల పట్టాలు, సామగ్రి పంపిణీ ● మార్కాపురం పట్టణానికి దూరం కావడంతో తరలించేందుకు అవస్థలు మార్కాపురం/ మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మార్కాపురం కలెక్టరేట్లో కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు, ఆర్డీఓ శివరామిరెడ్డి, తహసీల్దార్లు కలిసి ఇళ్ల పట్టాలతో పాటు రేషన్ కిట్లు, పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేశారు. అయితే, పంపిణీ కార్యక్రమం వద్ద కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరికి ఏ వస్తువు ఎక్కడివ్వాలి.. ఎక్కడ తీసుకోవాలనే విషయంలో స్పష్టత లేకపోవడంతో నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఇళ్ల పట్టాలు, మరోవైపు రేషన్్ కిట్లు, పసుపు, కుంకుమ, చీరలు తీసుకోవాల్సి రావడంతో పాటు మార్కాపురం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్ ఉండటంతో సామగ్రి మోసుకుని వెళ్లేందుకు నిర్వాసితులు అవస్థపడ్డారు. ఆటోల్లో సామగ్రి తరలించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామగ్రి తరలించేందుకు ఆటో చార్జీలు అధికంగా ఉండటంతో అదనపు భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామగ్రిని కలెక్టరేట్ వద్ద కాకుండా పట్టణంలోనే అందజేసి ఉంటే ఇబ్బందులు తప్పేవని పలువురు పేర్కొన్నారు. దాంతో పాటు ఇళ్ల పట్టాలు, రేషన్ కిట్లు, చీరలు తదితర వస్తువులను ఒకేచోట క్రమపద్ధతిలో అందజేసి ఉంటే వృద్ధులు, మహిళలు, పిల్లలతో వచ్చిన కుటుంబాలకు సౌకర్యంగా ఉండేదన్నారు. -
పంజా వేసిన నిర్లక్ష్యం!
పెద్దదోర్నాల: అడవిలో తల్లి ఒడిని వీడి అనాథలైన పులి కూనలకు ఆశ్రయం కల్పించాలన్న సంకల్పం.. అధికారుల అలసత్వంతో అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొంటోంది. సహజసిద్ధ వాతావరణంలో పెంచి.. వేటాడటం నేర్పి.. తిరిగి నల్లమల అడవుల్లోకి వదలాలన్న లక్ష్యంతో చేపట్టిన టైగర్ ఎన్క్లోజర్ పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించినా.. నిర్మాణం మాత్రం కొలిక్కి రాలేదు. ఫలితంగా ఏ పులి కూనల కోసం ఎన్క్లోజర్ ఏర్పాటు చేయాలని భావించారో.. అవే కూనలు ఇప్పుడు నాలుగేళ్ల వయసుకు చేరి పెద్దపులులుగా మారాయి. నిర్మాణం పూర్తికాక.. ఉద్దేశం నెరవేరక.. కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రయోజనం లేకుండా పోతోంది. పులి కూనల కోసం.. రూ.కోట్ల కేటాయింపు 2023 మార్చిలో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం వద్ద తల్లి పులి నుంచి విడిపోయిన నాలుగు పులి కూనలు స్థానికులకు కనిపించాయి. సుమారు 50 రోజుల వయసున్న ఆ కూనలను అటవీశాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్కుకు తరలించి సంరక్షణ చేపట్టారు. వాటిలో రెండు అనారోగ్యంతో మృతి చెందగా.. మిగిలిన రెండింటిని జూ అధికారులు కంటికి రెప్పలా కాపాడారు. క్రమంగా అవి పెరిగి పెద్దవుతుండటంతో సహజ వాతావరణంలోకి తీసుకెళ్లి.. స్వయంగా వేటాడేలా తీర్చిదిద్దాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2 కోట్లు మంజూరు చేసింది. వేట నేర్పాల్సింది.. వేచి చూస్తున్నాం! అనాథగా దొరికిన పులి కూనలను తొలుత నర్సరీ ఎన్క్లోజర్లో ఉంచుతారు. అనంతరం టైగర్ ఎన్క్లోజర్కు తరలించి.. సహజసిద్ధంగా వేటాడేలా శిక్షణ ఇస్తారు. ఎన్క్లోజర్లో జింకలు, దుప్పులు వంటి వన్యప్రాణులను వదిలి.. పులులు స్వయంగా వేటాడి ఆహారం సంపాదించుకునే సామర్థ్యాన్ని పెంచుతారు. ఒక్కో పులి కనీసం 50 వన్యప్రాణులను స్వయంగా వేటాడిన తర్వాత దాని వేట నైపుణ్యాన్ని పరిశీలించి.. అడవిలోకి వదిలేలా ప్రణాళిక రూపొందించారు. కానీ.. ఎన్క్లోజర్ సిద్ధం కాకపోవడంతో ఈ ప్రక్రియ అంతా కాగితాలకే పరిమితమైంది. అడుగడుగునా నిర్లక్ష్యం పులి కూనలను కాపాడి.. వాటిని అడవికి అప్పగించాలన్న మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ప్రాజెక్టు.. అధికారుల నిర్లక్ష్యంతో కాలయాపనకు చిహ్నంగా మారింది. అప్పట్లో చిన్నచిన్న కూనలుగా ఉన్న వాటి కోసం ఏర్పాటు చేయాల్సిన ఎన్క్లోజర్ పూర్తయ్యేలోపే అవి పెద్దపులులుగా ఎదిగాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పనులను వేగవంతం చేసి.. ఎన్క్లోజర్ను అందుబాటులోకి తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని పెద్దపెంట వద్ద 15 హెక్టార్లలో టైగర్ ఎన్క్లోజర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు నర్సరీ, హెర్బివోర్స్ ఎన్క్లోజర్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితమే పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పులుల సంరక్షణకు కీలకమైన ఈ ప్రాజెక్టు పురోగతి మాత్రం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పులులకు సహజసిద్ధమైన వేట అలవాటు చేయించేందుకు నెక్కంటి రేంజ్ పరిధిలోని ఆరపెంట, గంగారంపెంటతో పాటు పెద్దదోర్నాల మండలంలోని తెట్టుగూడెం తదితర ప్రాంతాల్లో జింకలు, దుప్పుల కోసం హెర్బివోర్స్ నర్సరీలను ఏర్పాటు చేశారు. పులి ఎన్క్లోజర్ సిద్ధమైతే వీటిని అక్కడికి తరలించి వేటాడే అవకాశాన్ని కల్పించాలన్నది అధికారుల ప్రణాళిక. ప్రధాన ఎన్క్లోజర్ పనులే ముందుకు సాగకపోవడంతో ఇవి కూడా నిరుపయోగంగా మారాయి. -
ఆటోను ఢీకొన్న టూరిస్టు బస్సు
పెద్దదోర్నాల: వేగంగా వచ్చిన ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటన మండల కేంద్రానికి సమీపంలోని బైపాస్రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎగువ చర్లోపల్లికి చెందిన పలువురు మహిళలు ఓ ఆటోలో బమ్మిదోర్నాలలో జరిగే పెళ్లికి ఆటోలో బయలుదేరారు. వారి ఆటో బైపాస్రోడ్డులోకి ప్రవేశించగానే ఎదురుగా వస్తున్న టూరిస్టు బస్సు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పులివేముల పెద్ద మరియమ్మ, పులివేముల చిన్న మరియమ్మ, పులవేముల నవమ్మ, పులివేముల ఎస్తేరులకు తీవ్ర గాయాలవగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. 108లో క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వెంకట రమణయ్య వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి, నాయకులు అల్లు రాంభూపాల్రెడ్డి వైద్యశాలకు చేరుకుని పరామర్శించారు. నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు పరామర్శించిన వైఎస్సార్ సీపీ నాయకులు -
రోడ్డుపై కారు దగ్ధం
కొనకనమిట్ల: మండలంలోని పెదారికట్ల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. బల్లికురవ మండలం పల్లాయపాలెం గ్రామానికి చెందిన ఆర్.సామ్యూల్ కుటుంబంతో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు బ్రహ్మంగారిమఠం వెళ్తుండగా, కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సామేలు కుటుంబం కారులో నుంచి బయటకు దిగగా.. కొంతసేపటికే కారు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలార్పారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
‘మీ కోసం’కు 246 అర్జీలు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’మీకోసం’ ద్వారా ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి ప్రాధాన్యమిచ్చి, వేగవంతంగా, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ పి.వెంకట రమణలతో ఎస్డీసీ మాధురి, ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వరరావులతో కలిసి ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 246 అర్జీలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న వినతుల పట్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల తమ స్థాయిలో పరిష్కరించలేని పరిస్థితి ఉంటే, దానికి స్పష్టమైన కారణాలను అర్జీదారులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ సర్వేలో ప్రజల నుంచి అత్యుత్తమ సానుకూల అభిప్రాయం లభించేలా అధికారులు చురుగ్గా పనిచేయాలని, రీ–ఓపెన్ అయ్యే అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. శాఖాపరంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల అమలును నిరంతరం పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. -
రొయ్యయ్యో..
కొత్తపట్నం: రొయ్యల సాగు సంక్షోభంలో చిక్కుకుంది. రొయ్యలకు ధర తగ్గిందని ఒక పక్క రైతులు ఆందోళన చెందుతుంటే మరోవైపు ఫీడ్ ధర విపరీతంగా పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాదిలో ఊహించని రీతిలో ఫీడ్ టన్నుకు రూ.28 వేలు పెరిగింది. ఈ భారం పూర్తిగా రైతులపై పడింది. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాక నష్టం వాటిల్లింది. రెండేళ్ల నుంచి రొయ్యల రైతులకు పంటలు రాక వరుసగా నష్టపోతున్నారు. తెచ్చిన పెట్టుబడులకు వడ్డీలు రెట్టింపు కావడంతో అప్పుల భారం పెరిగిపోతోందని రైతులు వాపోతున్నారు. మండలంలో వ్యవసాయం తర్వాత ఆక్వా సాగు రెండోదిగా ఉంది. మండలంలో సుమారు 3 వేల ఎకరాలు రొయ్యల సాగు చేస్తున్నారు. బీరంగుంట, మోటుమాల, గుండమాల, పాదర్తి, కొత్తపట్నం, ఈతముక్కల, మడనూరు గ్రామాల పరిధిలో రొయ్యలు సాగు అధికంగా ఉంది. మొన్న మోంథా.. నేడు ఎల్నినో: రెండేళ్లల్లో మోంథా, ఎల్నినో వలన రొయ్యల రైతులపై ప్రభావం పడింది. ఈ విపత్తుల వలన రొయ్యల రైతులు కోలుకునే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలయ్యారు. గత ఏడాది మోంథా తుఫాన్ వచ్చి చేతికి వచ్చిన రొయ్యలు వరదకు కొట్టుకుపోయాయి. పెట్టిన పెట్టుబడి రాక భారీగా నష్టపోయారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన ఐదు నెలలకు కేజీకి 20 కౌంట్ రావాల్సి ఉండగా ఏడు నెలలు కావస్తున్నా 20 కౌంట్కు రాలేదు. వర్షం లేక అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత వల్ల నీటిలో వేడి శాతం పెరిగి రొయ్యల పెరుగుదల మందగించింది. దీంతో రెండు నెలలు పాటు ఫీడ్ ఖర్చు, అదనపు ఖర్చుల భారం పడింది. ఇవన్నీ చూసుకుంటే చివరికి నష్టం మిగిల్చింది. ఏడాదిలోనే టన్ను మేత రూ.28 వేలకు పెంపు ఆక్వా కల్చర్ ప్రారంభం నుంచి చూస్తే ఈ ఏడాది పెరిగినంత ఫీడ్ ధర ఎన్నడూ లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మూడు సార్లు కేజీకి రూ.28 పెంచారు. దీని ప్రకారం టన్ను మేత కొంటే రూ.28 వేలు అదనంగా పడుతుంది. ఒక చెరువుకు 5 టన్నుల నుంచి 6 టన్నులు మేత వాడతారు. టన్నుకు రూ.14 వేల నుంచి రూ.16 వేల దాక అదనంగా రైతుపై భారం పడుతుంది. కూటమి ప్రభుత్వం రొయ్యల మేత యజమానులతో కుమ్మకై ్క ఇష్టానుసారంగా మేతను పెంచుతున్నారు. మేత ధర తగ్గించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు చెబుతున్నారు. టైగర్ రొయ్యల ధర తగ్గింపు ఒక వైపు రొయ్యల మేత పెరిగిందని, ఎక్కువ రోజులైనా తగిన కౌంట్కు రాలేదని అల్లాడుతుంటే రొయ్యల ధరలు గణనీయంగా తగ్గించారు. రొయ్యల రైతులను ఎవరికి తగ్గట్టుగా వారు ఆటాడుకుంటున్నారు. కేజీకి 30 తూగే రొయ్యల ధర రూ.520 నుంచి రూ.440, 20 కౌంట్ రూ.720 ఉండాల్సిన ధర రూ.600 తగ్గించారు. దీంతో ఒక్కో రైతుకు టన్నుకు రూ.1.20 లక్షలు నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నుడూలేని విధంగా ఈ ఏడాది ధర పతనమైందని రైతులు అంటున్నారు. 5 నెలలు రావాల్సిన కల్చర్కు 7 నెలలకు వెళ్లడంతో ఖర్చు పెరగడం, ఫీడ్ ధర పెరగడం, రైతు పండించిన రొయ్యలు టన్ను రొయ్యలకు ధర రూ.1.20 లక్షలు తగ్గించడం ఇవన్నీ లెక్కవేస్తే ఒక్కో చెరువు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు దాకా నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. -
గుక్కెడు నీరు రాదు
నిలువ నీడ లేదు..లక్షలాది మంది ప్రజల బాగుకోసం తమ సర్వస్వాన్నీ త్యాగం చేసిన వారి జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో కనీస వసతులకు నోచుకోక గుక్కెడు నీటి కోసం కూడా నిర్వాసితులు అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. అద్దె ఇళ్ల భారం భరించలేక రోడ్డు పక్కనో, చెట్టు నీడనో.. పరదాల మాటునో తలదాచుకోవాల్సి వస్తోంది. ఉపాధి, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని నిర్వాసితులు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, పునరావాస కాలనీల్లో అన్నీ కష్టాలే... ప్రాజెక్టు కోసం ఉన్న ఊర్లను, ఇళ్లను, భూములను వదిలి పునరావాస కాలనీలకు చేరుకున్నా.. అక్కడ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇళ్ల పట్టాలు అందకపోవడం.. మరోవైపు తాగునీరు, రేషన్ వంటి కనీస అవసరాల కోసం అవస్థలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. పునరావాస ప్రాంతానికి వచ్చినా రేషన్ బియ్యం కోసం తమ పాత ప్రాంతాల నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న కాలనీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాసితులు చెబుతున్నారు. ఉపాధి, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం ఒకచోట.. రేషన్ కోసం మరోచోట తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. వెలిగొండ నిర్వాసితుల కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బాధితులు చెబుతున్నారు. కనీసం తాగేందుకు, వంట చేసుకునేందుకు నీరు కూడా సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పాత గ్రామాల్లో ఇతరులకు నీళ్లు అందించిన తామే.. ఇప్పుడు తమ కుటుంబాలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులతో దిక్కుతోచని పరిస్థితి చిన్నపిల్లలను వెంట పెట్టుకుని కొత్త కాలనీలకు వచ్చిన తమకు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియడం లేదని నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సొంత ఇల్లు లేదు.. పట్టాలు లేవు.. నీళ్లు లేవు.. కనీస సౌకర్యాలు లేవు.. ఈ పరిస్థితుల్లో పిల్లలను పెట్టుకుని ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో నీళ్లు లేక రోడ్డు పైకి వచ్చి మోసుకెళ్తున్న నిర్వాసితులు ఇళ్లను ఖాళీ చేసి కాలనీకి వచ్చిన నిర్వాసితుల కుటుంబం ఇళ్లు లేక రోడ్డు పక్క వేసిన రేకులు దూరంగా ఉన్న రేషన్ దుకాణం -
‘టెట్’ టెన్షన్..!
టీచర్లకు ఒంగోలు సిటీ: విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపాధ్యాయులకు కొత్త టెన్షన్ తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా టెట్ అర్హతను పదోన్నతులతో ముడిపెట్టడం, సుదీర్ఘకాలంగా బోధనలో కొనసాగుతున్న సీనియర్ ఉపాధ్యాయులు మళ్లీ అర్హత పరీక్ష రాయాల్సిన పరిస్థితి కల్పించడం ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులతో సహా టెట్ నిబంధనల పరిధిలోకి వచ్చే వారిపై పరీక్ష భారాన్ని మోపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లకుపైగా సర్వీసున్న ఉపాధ్యాయులు నిర్దేశిత వ్యవధిలో టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో సీనియర్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పదవీ విరమణకు ఐదేళ్లలోపు సర్వీసున్న వారికి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ.. పదోన్నతుల విషయంలో టెట్ అర్హత తప్పనిసరి చేయడం మరింత ఇబ్బందికరంగా మారిందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు సుమారు 3500 మంది వరకు ఉన్నారు. ఏళ్ల తరబడి తరగతి గదుల్లో బోధిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు మళ్లీ అర్హత పరీక్ష పెట్టడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్లుగా ఎలిమెంటరీ స్థాయిలో బోధిస్తున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ పరీక్షలో అధిక స్థాయి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి రావడం తమకు అన్యాయమని వాపోతున్నారు. టెట్ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. అర్హత మార్కులు కూడా కేటగిరీల వారీగా నిర్ణయించడంతో సీనియర్ ఉపాధ్యాయుల్లో పోటీ ఒత్తిడి పెరుగుతోంది. ఓసీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, తదితర రిజర్వుడ్ కేటగిరీలకు 40 శాతం అర్హత మార్కులు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం మాత్రమే ఉండటం, ముఖ్యంగా గణిత ప్రశ్నలను పరిష్కరించేందుకు తగినంత సమయం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టెట్ పేపర్–2లో సబ్జెక్టుల కలయిక కూడా ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. బయాలజీ ఉపాధ్యాయులు గణిత సంబంధిత ప్రశ్నలు, గణిత ఉపాధ్యాయులు బయాలజీ అంశాలను ఎదుర్కోవాల్సి రావడం, తెలుగు, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు పరస్పరం సంబంధం లేని సబ్జెక్టుల ప్రశ్నలు రాయాల్సి రావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా ఒక నిర్దిష్ట సబ్జెక్టు బోధిస్తున్న ఉపాధ్యాయుడి సామర్థ్యాన్ని సంబంధం లేని మరో సబ్జెక్టులో పరీక్షించడం వలన బోధనా నైపుణ్యానికి బదులు పరీక్ష సామర్థ్యమే ప్రమాణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ రాయాల్సిన ఉపాధ్యాయుల్లో గణనీయమైన సంఖ్యలో 50 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష వారికి ఇబ్బందికరంగా మారుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సుదీర్ఘ సర్వీసున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. 2010కి ముందు విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయుల్లో చాలామంది తెలుగు మీడియంలో చదువుకున్నవారే. టెట్లో తెలుగు–ఇంగ్లిష్ పదజాలం, అనువాద పదాల కారణంగా కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ప్రశ్నల భాషను సరళీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి ఎలిమెంటరీ విద్యార్థులకు బోధిస్తున్నారు. అలాంటి వారికి వారి బోధనా స్థాయికి సంబంధం లేని విధంగా అధిక కాఠిన్యతతో ప్రశ్నలివ్వడం సరికాదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. సీనియారిటీ, బోధనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ను కీలక అర్హతగా ముడిపెట్టడం వలన ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి కొత్త ఒత్తిడి ఏర్పడిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్లపాటు సేవ చేసిన ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి అర్హత పరీక్షతో వారి భవిష్యత్తును ముడిపెట్టడం పునరాలోచించాల్సిన అంశమని అంటున్నారు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను పరీక్షల ఒత్తిడిలోకి నెట్టకుండా సీనియారిటీ, అనుభవం, ఇప్పటికే ఉన్న విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వయసు పైబడిన వారికి ఆఫ్లైన్ పరీక్ష, సబ్జెక్టుకు సంబంధం లేని ప్రశ్నల తొలగింపు, ప్రశ్నపత్రం కాఠిన్యత తగ్గింపు, అదనపు సమయం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బోధనపై దృష్టి పెట్టాల్సిన ఉపాధ్యాయులు పరీక్షల భయంతో సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులకు పరీక్షా పర్వతం రెండేళ్లలో పాస్ కాకుంటే ఉద్యోగానికే ముప్పు..? విద్యాశాఖ నిర్ణయాలతో సీనియర్ ఉపాధ్యాయుల్లో ఆందోళన సంబంధం లేని సబ్జెక్టులపై పరీక్షలతో ఇబ్బందులు సబ్జెక్టు కాని సబ్జెక్టుతో సతమతం..! ఆన్లైన్ పరీక్షపై అభ్యంతరాలు... తెలుగు మీడియం వారికి భాషా సమస్య... ఎలిమెంటరీ టీచర్లకు 10వ తరగతి స్థాయి ప్రశ్నలా..? ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెటు పరీక్ష నుంచి మినహాయించేలా ఆర్టీఏ యాక్టు విద్యాహక్కు చట్టంలోని 23(1) క్లాజుకి సవరణ చేసి 2011కు ముందున్న ఉపాధ్యాయులందరినీ టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షల అర్హత మార్కులు 40 శాతం మాదిరిగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సిలబస్ తగ్గించి స్పెషల్ టెట్ నిర్వహించాలి. అన్ని కేటగిరి ఉపాధ్యాయులకు కామన్గా 150 మార్కులకు 40 శాతం.. అనగా 60 మార్కులు ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించాలి. అలాకాకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ పరీక్ష ఎందుకు..? పరీక్ష పాసైతేనే పదోన్నతి అనడంపై అసంతృప్తి... -
ఉర్దూ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
మార్కాపురం: ఉర్దూ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ అన్వర్ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని 2వ వార్డులో ఉన్న ఉర్దూ ప్రైమరీ స్కూల్లో ఆదివారం జిల్లా ఉర్దూ టీచర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీసు, అర్హతలు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉర్దూ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలని, ఖాళీగా ఉన్న కేటగిరి ఉర్దూ టీచర్ పోస్టులను రానున్న డీఎస్సీ నోటిఫికేషన్లో చూపించి భర్తీ చేయాలని, ఉర్దూ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉర్దూ అంగన్వాడీ సెంటర్లను ప్రారంభించాలని తెలిపారు. ఉర్దూ పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు సకాలంలో అందించాలని, జిల్లాలోని ప్రతీ హైస్కూల్లో 20 మంది ముస్లిం విద్యార్థులు ఉన్న చోట ఒక ఉర్దూ బీఈడీ పోస్టును మంజూరు చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రుటా మార్కాపురం జిల్లా నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. మార్కాపురం జిల్లా యూనిట్గా రాష్ట్ర ఉర్దూ ఉపాధ్యాయసంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సయ్యద్ సమీవుల్లా బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రూటా జనరల్ సెక్రటరీగా పఠాన్ ముర్తుజావలి ఖాన్, కోశాధికారిగా ఎం. గుల్షన్ అహ్మద్ బేగ్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా షేక్ ఖాజావలి, ఎలక్షన్ అధికారిగా పఠాన్ హకీమ్ ఖాన్ వ్యవహరించారు. సమావేశం లో రూట కార్యవర్గ సభ్యులు షేక్. అన్వర్ బాషా, సయ్యద్ సమీవుల్లాబాషా, పఠాన్ హిదాయతుల్లా ఖాన్, షేక్ బురాని పీరా, పఠాన్ హకీమ్ఖాన్, ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు పఠాన్ అబ్దుల్ వహీద్ఖాన్, ఉర్దూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
కనిగిరిరూరల్: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం కనిగిరిలో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. కనిగిరి మండలం బొట్టికిర్లపాడుకు చెందిన పొదిలి మల్లేశ్వరి (35)కి హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన కొండలరావుకు సుమారు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు పట్టణంలోని బాదుల్లా వారి వీధిలో దాదాపు 4 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. కొద్ది కాలంగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మల్లేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం మృతురాలి తల్లి చందలూరి మహాలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● బాలుడు మృతి మద్దిపాడు: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో బాలుడు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారిపై మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఆ వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి అరుణాచలానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెల్లంపల్లి సమీపంలోకి వచ్చిన క్రమంలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శ్రీకాంత్కు స్వల్పగాయాలయ్యాయి. మధ్య సీటులో పడుకుని నిద్రిస్తున్న శ్రేయాన్ష్రామ్ (16)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ చేరుకుని ఒంగోలు జీజీహెచ్కి తరలించింది. అక్కడి డాక్టర్లు పరీక్షించి శ్రేయాన్ష్రామ్ మృతి చెందినట్లు తెలిపారు. మద్దిపాడు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం టౌన్: పట్టణంలోని జవహర్నగర్ కాలనీలోని ఇంట్లో దొంగలు పడి రూ.50 వేల నగదు అపహరించారు. పోలీసుల వివరాల మేరకు..కాలనీలోని విజయకుమారి ఇంట్లో శనివారం దొంగలు పడి రూ.50వేలు నగదు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● కారుపై పడిన సిమెంట్ బస్తాలు ● తప్పిన పెను ప్రమాదం ● ఇద్దరికి గాయాలు మార్కాపురం రూరల్: మండలంలోని కోమటికుంట వద్ద అదివారం సిమెంట్ లారీ బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే..మాచర్ల నుంచి కడపు వైపు సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ...ఎదురుగా వచ్చినా కారును తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న సిమెంట్ బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. అదే సమయంలో నంద్యాల నుంచి తెనాలి వైపు వెళ్తున్న మరో కారుపై సిమెంట్ బస్తాలు పడటంతో వాహనంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కారుఓ ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. కొంత సేపు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కారులో ఉన్న వాణిశ్రీ తీవ్రంగా గాయపడటంతో ఆమెను తొలుత మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి జిజిహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు హాస్పిటల్కు వైద్యులు రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాకప్ డెత్పై సమగ్రంగా విచారించాలి
జె.పంగులూరు: దివ్యతేజ లాకప్ డెత్పై సమగ్ర విచారణ జరిపించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రేణింగవరం పోలీస్స్టేషన్ ఎదుట ఆదివారం దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దివ్యతేజ శవం ఉన్న కొండమూరు సమీపంలో చప్టా ఉన్న ప్రాంతాన్ని సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం రేణింగవరం పోలీస్స్టేషన్ వద్దకు సమాచారానికి వెళ్లగా స్టేషన్లో ఎస్సై అందుబాటులో లేరని, లేడి కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారన్నారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ దళితుడైన దివ్యతేజను చంపి శవాన్ని మాయం చేసిన సంఘటనలో ఎస్సైని అరెస్టు చేయక పోగా కనీసం సస్పెండ్ కూడా చేయలేదన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివ్యతేజ, శశికాంత్ సెల్ ఫోన్ దొంగతనం చేశారనే అరోపణతో కేసు నమోదు చేసిన రేణింగవరం ఎస్సై విచారణ చేయడంతో దివ్యతేజ చనిపోయాడన్నారు. శశికాంత్ ఎక్కడ ఈ విషయం చెబుతాడో అని భయపెట్టి అతన్ని వదిలేశారన్నారు. ఒక దళితుడిని సెల్ఫోన్ దొంగతనం కేసులో లాకప్డెత్ చేయడం అమానుషమన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులే బరితెగించి శవాన్ని మాయం చేసిన కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. కేసు విచారణ గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి స్వయంగా విచారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్ష, కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, దేవరపల్లి గోపి, ఎర్రమల శ్రీను, మురళి తదితరులు ఉన్నారు. -
గల్లంతైన యువకుల కోసం గాలింపు
పెద్దదోర్నాల: ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుల ఆచూకీ ఆదివారం అర్ధరాత్రి వరకు లభ్యం కాలేదు. ఆదివారం 4.30 గంటల సమయంలో వినయ్కుమార్ మృతదేహం ఒక్కసారిగా కనిపించి మరలా మునిగి పోయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఇద్దరి ఆచూకీ కోసం పలువురు అధికారులు, పోలీసు సిబ్బంది అడుగడునా జల్లెడ పట్టినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. శనివారం 12 గంటల సమయంలో ఈత కోసం స్నేహితులతో కలిసి ఫీడర్ కెనాల్ వద్దకు వెళ్లిన కటకానిపల్లెకు కాబోయే వరుడు రాజ్కుమార్, అతని సోదరుడు వినయ్కుమార్లు ఫీడర్ కెనాల్లో గల్లంతైన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో తహసీల్దార్ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టి పూర్తిగా చీకటి పడటంతో ఫలితం లేక గాలింపు చర్యలను నిలిపివేఽశారు. ఈ నేపథ్యంలో చేసేదేమి లేకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్టీఆర్ఎఫ్ బృందాలు తొలుత యువకులు ఈతకు దిగి గల్లంతైన 17.7 కిలోమీటర్ వద్ద ర్యాంపు నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్ వరకు ఇన్ప్లేటబుల్ మోటార్ రెస్క్యూ బోటు ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకుల అచూకీ కోసం కటకానిపల్లె గ్రామస్తులు ఉదయం నుంచి మండుటెండలో పడిగాపులు కాశారు. ఈ క్రమంలో వినయ్కుమార్ మృతదేహం కనిపించి జరిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో యువకుల ఆచూకీ తెలియకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి ఓ ఇంటి వాడుగా ఉండాలని కోరుకున్న రాజ్కుమార్ తల్లిదండ్రులు పెద్దఅవులయ్య, జానీలు పెండ్లికి ఓ రోజు ముందే తమ కుమారుడు నీటిలో గల్లంతు కావడాన్ని జీర్జించుకోలేకపోయారు. దీంతో పాటు తండ్రి లేకపోయినా కుటుంబాన్ని ఒంటి చేత్తో పోషిస్తున్న వినయ్కుమార్ అచూకీ లభించకపోవడంతో తల్లి రాములమ్మలు తమ కుమారుల ఆచూకీ కోసం రాత్రంతా ఫీడర్ కెనాల్ సమీపంలోనే పడిగాపులు కాయటం గ్రామస్తులను కలిచివేసింది. రెస్క్యూ బోటుతో రంగంలోకి దిగిన ఎస్టీఆర్ఎఫ్ బృందం గల్లంతైన ప్రాంతం నుంచి నల్లమల సాగర్ వరకు గాలింపు కనిపించినట్లు కనిపించి జారిపోయిన వినయ్ మృతదేహం ఆదివారం అర్ధరాత్రి వరకు లభ్యం కాని యువకుల ఆచూకీ -
మార్కాపురం జెడ్పీ ఏర్పాటుకు సన్నాహాలు
● 25న ప్రారంభించేందుకు ఏర్పాట్లు ● సీఈఓ, డిప్యూటీ సీఈఓ సిబ్బంది నియామకంపై దృష్టి మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని 21 మండలాలను కలిపి నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు సిబ్బందిని కూడా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 25న జడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించాలని అధికారులు సన్మాహాలు చేస్తున్నారు. ప్రకాశం సీఈఓ చిరంజీవి మార్కాపురం జిల్లాకు కూడా ఇన్చార్జి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన మార్కాపురంలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటుకోసం పలు కార్యాలయాలను సందర్శించారు. రేడియో స్టేషన క్వార్టర్స్, రాయవరంలోని డీడీఓ కార్యాలయ ఆవరణ, ఇంకా పలు ప్రైవేట్ భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం ఒంగోలు జెడ్పీలో ఉన్న సిబ్బందిలో 50 శాతం ప్రకాశానికి, 38 శాతం మార్కాపురంకు, 12 శాతం బాపట్లకు కేటాయించినట్లు తెలిసింది. ముగ్గురు సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు తదితర సిబ్బంది అంతా కలిపి సుమారు 25 మంది వరకూ రానున్నారు. మొత్తం జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 14,82,757.24 ఎకరాల్లో ఉంది. జిల్లాలో మొత్తం 1145 పోలింగ్ స్టేషన్లతో పాటు మొత్తం 9,08,772 మంది ఓటర్లు ఉన్నారు. నూతన జడ్పీ ఏర్పాటైతే జడ్పీ సమావేశాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీసి, ఎంపీడిఓల శిక్షణా తరగతులు ఇక్కడే జరగనున్నాయి. నూతన జెడ్పీ ఏర్పాటుకు ముందే ఒంగోలు జెడ్పీలో ఉన్న సిబ్బందిని ఆయా జిల్లా పరిషత్ల నిష్పత్తి ప్రకారం కేటాయించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు. ● సత్తా చాటిన తెలంగాణ ఎడ్లు రాచర్ల: మండలంలోని జేపీ చెరువులో ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో మొత్తం 5 జతల ఎడ్లు పాల్గొనగా తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూలు జిల్లా, లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన ఎం.అక్షరారెడ్డి ఎడ్ల జత నిర్ణీత 20 నిమిషాల్లో 3283 అడుగులు లాగి మొదటి బహుమతి సాధించాయి. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన ఎం.అక్షరారెడి చెందిన ఎడ్లజత 3251 అడుగులు లాగి రెండో బహుమతి సాధించాయి. నల్గొండ జిల్లా కొప్పుల గ్రామానికి చెందిన సత్యనారాయణ చెందిన ఎడ్లజత 2368 అడుగులు లాగి మూడో బహుమతి సాధించాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన నారాయణ ఎడ్లజత 1250 అడుగులు లాగి నాల్గవ బహుమతి, కొమరోలు మండలం, ఎడమకల్లు గ్రామానికి చెందిన నోస్సం వెంకటేశ్వర్లు చెందిన ఎడ్లజత 1000 అడుగులు లాగి ఐదో బహుమతిని సాధించాయి. ఎడ్ల పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ.50వేలు, రూ.35 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను గ్రామపెద్దల చేతులు మీదుగా పంపిణీ చేశారు. -
పశువుల కాపరి అనుమానాస్పద మృతి
కురిచేడు: పశువులను కాసేందుకు వెళ్లి వాగులో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారంలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కేసనపల్లి ఏలియా(45) పశువులను మేపేందుకు ప్రతిరోజు లాగానే ఆదివారం వెళ్లాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తనతో పాటు పశువులను మేపుకుంటున్న తాటి అంజమ్మతో తన పశువులను చూస్తుండాలని, తాను మంచినీరు తాగి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఇంటికి వచ్చి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో రాత్రి సమయంలో పొలం వద్దకు వెళ్లి చూడగా రాత్రి వరకు వాగులో ఓ నీటి కుంట వద్ద ఏలియా మృతి చెంది పడి ఉన్నట్లు తెలిపారు. ఏలియాకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఏలియా ఎలా మృతి చెందాడో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
అపుస్మా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో 2026 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల కార్యక్రమాన్ని ఆదివారం మార్కాపురంలో నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఉత్తమ విద్యా ప్రమాణాల సాధనకు, పాఠశాలల అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న 210 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యం.వి.రామచంద్రరెడ్డి హాజరై మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఒక ఉపాధ్యాయుడి కృషి ఒక్క విద్యార్థి జీవితాన్నే కాకుండా, భవిష్యత్ సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి.రమణారెడ్డి, అపుస్మా రీజినల్ ప్రెసిడెంట్ ఎ.వి.సుబ్బారావు తదితరులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. మార్కాపురం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి పెద్దసంఖ్యలో పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అపుస్మా అధ్యక్షుడు జి.మల్లికార్జున రెడ్డి, కార్యదర్శి పి.సుధీర్ కుమార్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, గౌరవాధ్యక్షుడు జి.సుబ్బరత్నం (బాబురావు) తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లా మోడరన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షునిగా శంకర్రావు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా మోడరన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షునిగా రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కందికట్టు శంకర్రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మండల కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ చైర్మన్గా డాక్టర్ మలినేని పెరుమాళ్లు, ఉపాధ్యక్షులుగా ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, ఓగుబోయిన శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా తేళ్ల వంశీకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా ఆనాల రవీంద్ర, ఎన్టీ ప్రసాద్, కోశాధికారిగా టీ శ్రీకాంత్రెడ్డి, తదితరులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అల్లూరు: ఆంధ్రప్రదేశ్ 12వ సీనియర్ సీ్త్ర, పురుషుల అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2026 పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (ఎస్ఏఏపీ అనుబంధం), నెల్లూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో అల్లూరులోని రామకృష్ణ జూనియర్– డిగ్రీ కళాశాలల వేదికగా మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ట్రోఫీలు, జ్ఞాపికలు, అవార్డులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో విన్నర్స్గా ప్రకాశం, రన్నరప్గా విశాఖపట్నం, మహిళల విభాగంలో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నరప్గా గుంటూరు నిలిచాయి. ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 39,338 మందికి ఆధార్ అప్డేట్ ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు జిల్లా నోడల్ ఆఫీసర్ ముప్పూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఉమ్మడి జిల్లాలో 39,338 మంది విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నామన్నారు. 15–17 సంవత్సరాల వయస్సున్న విద్యార్థులకు మ్యాన్డేట్ బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ) చేయించేందుకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యార్థుల ఆధార్ వివరాలను అప్డేట్ చేయించేందుకు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించి ఎంబీయూ పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నామన్నారు. ప్రత్యేక ఆధార్ శిబిరాల తేదీలు... D¯ðlÌS 8Ð]l ™ól© ¯]l$…_ 11Ð]l ™ól© Ð]lÆý‡MýS$, 21 ¯]l$…_ 25Ð]l ™ól© Ð]lÆý‡MýS$️ Ððl¬™èl¢… 9 ÆøkÌS ´ër$ {ç³™ólÅMýS B«§éÆŠ‡ Õ¼-Æ>Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢Æý‡-¯é²Æý‡$. ºÄñæ*-Ððl${sìæMŠS A‹³-yólçÙ¯ŒS ò³…yìl…VŠæÌZ E¯]l² ѧéÅ-Æý‡$¦Ë$ D {ç³™ólÅMýS B«§éÆŠ‡ Õ¼Æ>-ÌS¯]l$ çܨ-Ó-°-Äñæ*VýS… ^ólçÜ$MýS$° ™èlÐ]l$ B«§é-ÆŠ‡ÌZ ™èlç³µ-°-çÜ-ÇV> ºÄñæ*Ððl$-{sìæMŠS A‹³-yólsŒæ ç³NÇ¢ ^ólçÜ$-MøÐéÌS° A«¨-M>-Æý‡$Ë$ çÜ*_…-^éÆý‡$. మార్కాపురం: మార్కాపురం జిల్లా లాన్ టెన్నిస్ అసిసోసియేషన్ అధ్యక్షునిగా డాక్టర్ జీకే మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. పట్టణంలోని స్థానిక టెన్నిస్ ప్రాంగణంలో ఆదివారం మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాలకు చెందిన టెన్నిస్ క్రీడాకారుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కనిగిరికి చెందిన జి.అల్లు సత్యనారాయణ, కోశాధికారిగా పట్టణానికి చెందిన ఐ.అశోక్రెడ్డి, ఉపాధ్యక్షులుగా సీహెచ్.మోహన్రావు, కె.మనోహర్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్కేటీ వలి, ఉప కార్యదర్శులుగా షేక్.ఇబ్రహీం, వి.చంద్రశేఖర్, గౌరవ సలహాదారులుగా షేక్.అబ్దుల్ గఫార్, జి.వి.రాఘవులు, టి.కునాల్, కార్యవర్గ సభ్యులుగా ఎం.వి.ఎస్. రమేష్, షేక్.షబ్బీర్, వై.రామకోటేశ్వరరావు, యు.మహేష్ కుమార్, ఎస్.ప్రదీప్ రెడ్డి, షేక్.అబ్దుల్లా, ఎం.పృథ్వీరెడ్డి, ఎం.ప్రసాద్, పి.చంద్రశేఖర్, ఎస్.విజయ్ కుమార్, షేక్.సమైర్, టెన్నిస్ అసోసియేషన్ కోచ్గా సీహెచ్.మురళీమోహన్ రెడ్డి, అసోసియేషన్ వైద్య నిపుణులుగా ఎన్.సందీప్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. నూతన సభ్యులందరూ టెన్నిస్ క్రీడను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషిచేయాలన్నారు. -
‘వెలిగొండ’ వైఎస్సార్ పుణ్యమే..
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం అంతా వైఎస్సార్ కుటుంబ పుణ్యమేనని, చంద్రబాబువి డబ్బా కుబుర్లు, డాబుసరి మాటలేనని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. మండల పరిధిలోని కొత్తూరు వద్ద నిర్మించిన సొరంగ ప్రాంతానికి చేరుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేసిన స్థూపాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ కొత్తూరు వద్ద నిర్మించిన రెండు సొరంగ నిర్మాణాలు, గొట్టిపడియ డ్యాం, సుంకేసుల డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు కెనాల్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ తవ్వకం ఇవన్నీ పూర్తి చేసింది రాజశేఖర్రెడ్డేనని, ఇందులో చంద్రబాబు ప్రమేయం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. నల్లమల సాగర్లో ఈ తట్ట మట్టి తీశారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఊసరవెల్లి విధానాలను మార్చుకోవాలని, ఎవరికో దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడం ఆపాలన్నారు. ఇప్పుడు వదలిన 10 టీఎంసీలు డెడ్ స్టోరేజీ మాత్రమేనని, తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా ప్రజలకు అందదన్నారు. ముందు 10 వేల కుటుంబాల త్యాగాన్ని గుర్తించాలని ఆయన కోరారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో జగన్మోహన్రెడ్డిని తిట్టించేందుకు హెలికాప్టర్లో మాగుంటను రప్పించారని విమర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి, నాయకులు దూదేకుల రసూల్, ఒంటేరు నాగేశ్వరరావు, పవన్కుమార్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. పునరావాస కేంద్రంలో సదుపాయాల కల్పనలో విఫలం పెద్దారవీడు: మండలంలోని తోకపల్లి సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకేసుల పునరావాస కేంద్రాన్ని ఆదివారం హైకోర్టు న్యాయవాది రజినీతో కలిసి సందర్శించిన తాటిపర్తి నిర్వాసితుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు కల్పించి, వారికి ఇంటి పట్టాలు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వాసితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని అధికారులు సమాచారం ఇచ్చారని, అయితే పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వాసితులను అప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి రావాలని చెప్పడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో నిర్మించిన బ్రిడ్జిల కింద, అంగన్వాడీ కేంద్రంలో, చర్చిలో చాలా మంది నిర్వాసితులు తలదాచుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నిర్వాసితులు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు తమ వద్దకు వచ్చి పరిస్థితులను పరిశీలించిన పాపాన పోలేదని నిర్వాసితులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. సుంకేసుల నుంచి నిర్వాసితులను బలవంతంగా తరలించడంలో ఉన్న శ్రద్ధ వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో లేదా అని ప్రశ్నించారు. మూడు రోజుల్లో పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించి, అర్హులైన నిర్వాసితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయని పక్షంలో నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తాటిపర్తి హెచ్చరించారు. -
మార్కాపురం జెడ్పీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
మార్కాపురం: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు జిల్లా పరిషత్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పాత 13 జిల్లాల పరిషత్ల స్థానంలో 28 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు 13 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, 13 డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో పాటు పలు పోస్టులను కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ● పొగాకు బోర్డు ఆర్ఎం ప్రసాద్ ఒంగోలు సబర్బన్: స్వల్ప పెనాల్టీతో అధిక అనధికార పొగాకు అమ్మకంపై కొన్ని సిఫార్సులు చేసినట్లు ఒంగోలుకు చెందిన దక్షిణ ప్రాంత పొగాకు బోర్డు ఆర్ఎం జీఎల్కే ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఆర్ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పొగాకు అమ్మకాలపై వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్ ప్రాంతాల పరిధిలో పొగాకు వేలం, అమ్మకాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పొగాకు బోర్డు ఆథరైజేషన్ ఇచ్చింది కేవలం 89 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి మాత్రమేనన్నారు. ఇప్పటి వరకు మొత్తం 129 పొగాకు కొనుగోలు రోజుల్లో ఎస్బీఎస్ ప్రాంతంలో సుమారు 31.41 మిలియన్ కిలోలు, ఎస్ఎల్ఎస్ ప్రాంతంలో సుమారు 32.24 మిలియన్ కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయని చెప్పారు. రెండు ప్రాంతాలకు కలిపి 63.64 మిలియన్ కిలోల అధీకృత పొగాకు కోటా అమ్మకాలు జరిగాయన్నారు. ఇది కాకుండా రైతులు అదనంగా, అనాథరైజ్డ్గా మరో 96 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేశారన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు స్వల్పంగా అపరాధ రుసుం (పెనాల్టీ) విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాణిజ్య శాఖకు సిఫార్సు చేశామన్నారు. పొగాకు బోర్డులో రిజిస్టర్ అయిన రైతులు మాత్రమే పొగాకు పంట సాగు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక విస్తీర్ణంలో నాటడం, అధికంగా పండించడం చేయరాదన్నారు. కౌలు భూముల్లో పొగాకు సాగు లాభదాయకం కాదని, స్వంత భూములు, స్వంత పొగాకు బ్యారన్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వర్జీనియా పొగాకు సాగు చేయాలని సూచించారు. -
ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలి
ఒంగోలు సిటీ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అన్ని స్థానాల్లోనూ గట్టిగా పోటీ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, పంచాయతీ, మండల స్థాయి ఎన్నికలు ఏవైనాగానీ.. ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకుండా అభ్యర్థులను బరిలోకి దించాలని నాయకులకు సూచించారు. పార్టీకి బలమైన కేడర్, కార్యకర్తల అండ ఉందని, ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గెలుపోటములు సహజమేనని, పార్టీ కోసం పోటీ చేసిన వారికి భవిష్యత్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను ప్రతి గ్రామంలోనూ ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు బూచేపల్లి పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలులో విఫలమైన విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన కరపత్రాలు, బుక్లెట్లను కార్యకర్తలకు విస్తృతంగా పంపిణీ చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తప్పకుండా పోటీ చేస్తోందని, కార్యకర్తలు సమష్టిగా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగాలి : జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో జగనన్న ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. జిల్లాను కూడా అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు జగనన్న కృషి చేశారని చెప్పారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారని అభినందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాబోయే అన్ని ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని కోరారు. స్థానిక ఎన్నికలంటే ప్రీ ఫైనల్స్ : పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్గా భావించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గాల ఇన్చార్జిలు, మండల స్థాయి నాయకులు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని కోరారు. పార్టీ క్యాడర్ ఐక్యతను కాపాడుకోవాలని సూచించారు. ఎన్నికల రణరంగంలో వైఎస్సార్ సీపీ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గౌరవం పెంచడంతో పాటు శాసనమండలి ప్రతిష్టను కాపాడేలా తన పదవీకాలంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్గా సభ నిర్వహించే అవకాశం ఒకవైపు, సభ్యుడిగా జిల్లా సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశం మరోవైపు తనకు ఉందన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిట్టనిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక సంస్ధల ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాలని, ఆ దిశగా చైతన్యం తేవాలని కోరారు. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి : పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ స్థానిక సంస్థల్లో ప్రజలకు మరింత ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మేయర్, కౌన్సిలర్ తదితర పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంటారన్నారు. పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కె.నాగార్జున మాట్లాడుతూ గ్రామస్థాఽయిలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుడితే.. చంద్రబాబు దాన్ని అనుసరిస్తున్నారన్నారు. కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ జగనన్న హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి వివరించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని కోరారు. అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ చింతలపూడి అశోక్కుమార్ మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలి, చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించాలన్నారు. సమావేశంలో పార్టీ దర్శి అసెంబ్లీ పరిశీలకుడు మాదాసి వెంకయ్య, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కసుకుర్తి ఆదెన్న, కర్నేటి ప్రసాద్, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, నాయకులు పిడతల ప్రవీణ్కుమార్రెడ్డి, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, దామరాజు క్రాంతికుమార్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవ్వాలి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కార్యకర్తలకు అండగా ఉంటాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు
● ఇద్దరికి తీవ్రగాయాలు టంగుటూరు: నిద్రమత్తు కారణంగా ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానిక జూనో బేకరీ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..టంగుటూరు ఫ్లైఓవర్ మీద ఒంగోలు నుంచి కందుకూరు వెళ్తున్న కారు..ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. కారు లారీని బలంగా ఢీకొని డివైడర్ దాటి సింగరాయకొండ నుంచి ఒంగోలు వైపు రోడ్డు మీదకు వచ్చి ఆగింది. ప్రమాదంలో కారు నడుపుతున్న రూపేష్కు బలమైన రక్త గాయమైంది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు, టంగుటూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తొలుత ఒంగోలు రిమ్స్కు, అక్కడి నుంచి బంధువులు మెరుగైన వైద్యం కోసం సంఘమిత్ర హాస్పిటల్కు తరలించారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ కోన్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎస్సై ఫణిభూషణ్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్ధవీడు: మండల పరిధిలోని చీమలేటిపల్లెలో శనివారం సాయంత్రం ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. అందిన వివరాల ప్రకారం.. స్కూల్ బస్సు కంభం నుంచి విద్యార్థులతో అచ్చంపేట వరకు వచ్చి విద్యార్థులను గమ్యస్థానానికి చేర్చి తిరుగు ప్రయాణంలో చీమలేటిపల్లెలో మోటార్ సైకిల్పై వెళ్తున్న యర్రా భానుప్రకాష్ (30)ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య అంజలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
హాస్టల్ మూసేయాలంటూ తౌషిక్ తల్లి నిరసన
సింగరాయకొండ: స్థానిక శ్రీచైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్ను మూసి వేయాలంటూ శనివారం తౌషిక్ తల్లి సయ్యద్ మౌలాబీ స్కూల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన దీక్ష చేసింది. హాస్టల్కు అనుమతుల విషయమై విద్యాశాఖ అధికారులు స్పందించాలని కోరుతూ ఆమె ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ తన కుమారుడి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని నిరసన దీక్ష చేస్తున్న మౌలాబీ ఇప్పుడు అనుమతులు లేని హాస్టల్ను మూసి వేయాలంటూ దీక్ష చేస్తోంది. -
రాధాకృష్ణన్కు ఘన నివాళి
● నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ నాయకులు ఒంగోలు సిటీ: ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ తదితరులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే లు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ చింతలపూడి అశోక్కుమార్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, కర్నేటి ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఉలవపాడు: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కరేడులో శనివారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. కరేడు యాదవ్ కాలనీకి చెందిన వాకా వెంకటేశ్వర్లు (49) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు నెలలుగా దంపతులు, పిల్లల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గొర్రెలు మేపేందుకు పొలం వెళ్లి వచ్చి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. కందుకూరు సీఐ ఎస్కే అన్వర్బాషా తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఎస్సై శివయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పునరావాసం.. ఊరుడింపునివ్వక
నిన్నటి వరకు అదే వారి ప్రపంచం. తాతలు, ముత్తాతలు కట్టిన ఇళ్లు.. తరతరాలుగా సాగు చేసిన పొలాలు.. పశువులు.. పంటలు.. బంధాలు.. ఆత్మీయతలు.. అన్నీ అక్కడే. ఇప్పుడు ఆ ఊరు లేదు.. ఉన్నా మరికొద్ది రోజుల్లో నీట మునిగిపోనుంది. ‘మా ఊరు పోయింది.. ఇల్లు పోయింది.. ఇప్పుడు ఉండేందుకు చోటు కూడా లేకుండా పోయింది. ప్రాజెక్టుకు నీళ్లు వచ్చాయి.. మా జీవితాల్లో మాత్రం కన్నీళ్లే మిగిలాయి’ అంటూ వెలిగొండ నిర్వాసితులు వాపోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన సుంకేసుల నిర్వాసితులు ప్రస్తుతం నిలువ నీడ కోసం నానా అవస్థలు పడుతున్నారు. నిర్వాసితుల కష్టాలపై గ్రౌండ్ రిపోర్టు...మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు కోసం పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన 2,901 మంది సర్వం ధారపోశారు. నిర్వాసితుల పట్ల పాలకులు కనీస కనికరం చూపించలేదు. హడావిడిగా నీళ్లు విడుదల చేశారుగానీ.. వారి పునరావాసం గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్న భరోసాతో నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేశారు. కొందరు మార్కాపురం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో తలదాచుకోగా, మరికొందరు కలెక్టరేట్ సమీపంలోని పునరావాస కాలనీకి చేరుకున్నారు. కేటాయించిన స్థలాల్లో సామాన్లు వేసుకుని మూడు రోజులుగా అక్కడే ఉంటున్నారు. కానీ పునరావాస కేంద్రంలోనూ నిలువ నీడ కరువైంది. ’చెట్టుకొకరు.. పుట్టకొకరు’ అన్న చందంగా వారి పరిస్థితి మారింది. ఊరు పోయింది.. గూడు ఏదీ? స్వగ్రామంలోని ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి చేరుకున్న కుటుంబాలకు ఇక్కడ మరో పరీక్ష ఎదురైంది. కొత్త ఇళ్లు పూర్తికాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి సామాన్లు తెచ్చుకున్నా వాటిని పెట్టుకునేందుకు కూడా చోటు లేకుండా పోయింది. స్వగ్రామంలో ఉన్న గూడు పోయింది. కొత్తగా కట్టిస్తామన్న ఇల్లు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ‘ప్రాజెక్టు కోసం ఊరును వదిలాం.. కనీసం పునరావాసంలోనైనా ప్రశాంతంగా బతుకుదామనుకున్నాం. ఇక్కడ కూడా నిలువ నీడ లేకుండా పోయింది’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రయితే రోడ్డే గూడు... పగలు ఎలాగోలా గడిచినా.. రాత్రి వేళ పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇళ్లు లేని కుటుంబాలు రోడ్డు పక్కన, ఖాళీ ప్రదేశాల్లో, చెట్ల కింద నిద్రించాల్సి వస్తోంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఆరుబయటే రాత్రులు గడుపుతున్నారు. దోమలు, పురుగులు.. విషసర్పాల భయం వెంటాడుతోంది. వర్షం వస్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళన మరోవైపు. రాత్రయితే పిల్లలను ఎక్కడ పడుకోబెట్టాలో తెలియడం లేదు’ అంటూ మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాగునీటికీ తిప్పలే... పునరావాస కేంద్రంలో కనీస తాగునీటి సదుపా యం కూడా సక్రమంగా లేకపోవడంతో నిర్వాసితు ల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. నీటి కోసం మహిళలు, పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఊరిని ఖాళీ చేయించి కొత్త ప్రాంతానికి తరలించినా కనీస వసతులు కల్పించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్లు ఎక్కడ పెట్టాలి.? ఇళ్లను ఖాళీ చేసే సమయంలో తమకు ఉన్న కొద్దిపాటి సామాన్లను కూడా నిర్వాసితులు వెంట తెచ్చుకున్నారు. కానీ.. పునరావాస కాలనీలో వాటిని భద్రపరిచేందుకు ఇళ్లు లేకపోవడంతో కొందరు వాటిని ఆరుబయటే ఉంచుతున్నారు. వర్షం వస్తే సామాన్లు తడిసి పాడవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఉపాధి పోయింది.. జీవితం ఎక్కడ.? సుంకేసుల పునరావాస కేంద్రంలోదయనీయ పరిస్థితులు ఊరు కోల్పోయి నిలువ నీడ కోసం వెతుకులాట పునరావాసం అంటే ఇల్లు నిర్మించి ఇవ్వడం మాత్రమే కాదని నిర్వాసితులు అంటున్నారు. జీవనోపాధికి భరోసా కల్పించాల్సి ఉందని కోరుతున్నారు. స్వగ్రామంలో వ్యవసాయం, పశుపోషణ, కూలి పనులతో జీవించిన వారు ఇప్పుడు కొత్త ప్రాంతంలో ఉపాధి కోసం వెతుకులాట మొదలుపెట్టాల్సి వచ్చింది. పశువులు, ఎడ్లు, జీవాలను కూడా ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. కొందరు తాము ఉంటున్న చోటే కట్టెలు పాతి కట్టేస్తుండగా.. మరికొందరు కాలనీలోని వాటర్ ట్యాంకుల వద్ద కట్టేస్తున్నారు. -
గల్లంతైన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే తాటిపర్తి పరామర్శ
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో శనివారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతైన పెద్దదోర్నాల మండలంలోని కటకానిపల్లెకు చెందిన యువకులు రాజ్కుమార్, వినయ్కుమార్ల కుటుంబాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే కటకానిపల్లె చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. సోమవారం పెళ్లిపీటలెక్కనున్న రాజ్కుమార్తో పాటు అతనికి వరుసకు సోదరుడైన వినయ్కుమార్ గల్లంతవడం తీవ్ర విచారకరమని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ పెద్దదోర్నాల మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి, నాయకులు ఉన్నారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
రోడ్డుపైనే నివాసముంటున్న మండ్లా రామయ్య సుంకేసుల పునరావాస కాలనీ ఒంగోలు సిటీ: ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, అనంతరం మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ క్యాడర్ను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా జిల్లాలో సుమారు 80 వేల నుంచి 85 వేల మంది కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందించనున్నట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో చాలా వరకు అమలు కాలేదని బూచేపల్లి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన ఆరోపించారు. కూటమి నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యం: జూపూడి రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు ధరల నియంత్రణపై దృష్టి పెట్టకుండా బహిరంగ సభలు, కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని జూపూడి పిలుపునిచ్చారు. రామాయపట్నం పోర్టు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు : తూమాటి ప్రకాశం జిల్లా అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు అన్నారు. జిల్లా వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా నాయకులంతా కలిసికట్టుగా పనిచేసిన చరిత్ర ప్రకాశం జిల్లాకు ఉందన్నారు. జిల్లా ప్రజల దశాబ్దాల కల రామాయపట్నం పోర్టు అని మాధవరావు తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పోర్టుకు అనుమతులు తీసుకురావడంతో పాటు కోవిడ్, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా భూసేకరణ పూర్తి చేసి నిర్మాణాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో నిర్మించిన ప్రజా ఆస్తిని తక్కువ ధరకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పోర్టు ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. పోర్టు విషయంలో ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, అవసరమైన వేదికలపై ప్రజల తరఫున తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను వక్రీకరించొద్దు: ఎమ్మెల్యే తాటిపర్తి వెలిగొండ ప్రాజెక్టును తామే పూర్తి చేశామని టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడం సరికాదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. వెలిగొండ అంటే కేవలం రెండు టన్నెల్స్ పూర్తి చేయడం కాదని, 53 టీఎంసీల నల్లమలసాగర్, రెండు టన్నెల్స్, ఫీడర్ కాలువలు, కుడి–ఎడమ కాలువలు, తాగునీటి వసతులు తదితర నిర్మాణాలన్నీ కలిసిన సమగ్ర ప్రాజెక్టు అని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్రెడ్డి పునాది వేసి, అనుమతులు తీసుకొచ్చి, నిధులు కేటాయించి పనులను ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. నల్లమలసాగర్ రిజర్వాయర్తో పాటు మూడు డ్యామ్ల నిర్మాణం, ఫీడర్ కాలువ పనులు, టన్నెల్ పనుల్లో గణనీయమైన పురోగతి ఆయన హయాంలోనే జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మిగిలిన టన్నెల్ పనులు పూర్తి చేశారని తెలిపారు. రెండు టన్నెల్స్ మొత్తం సుమారు 37 కిలోమీటర్ల పొడవు ఉంటే, వాటిలో అత్యధిక భాగం గత ప్రభుత్వాల హయాంలోనే పూర్తయిందని, మిగిలిన కొంత పనిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసి మొత్తం ప్రాజెక్టు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన తీగలేరు కాలువ పనులు, భూసేకరణ ఇంకా పూర్తి కాలేదని చంద్రశేఖర్ అన్నారు. ఈ కాలువ ద్వారా సుమారు 62 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ నంబర్ 324 ద్వారా భూసేకరణకు రూ.110 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు భూసేకరణ పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. కాలువలు పూర్తి చేయకుండా నల్లమలసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే ఆ నీరు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు చేరే పరిస్థితి ఉండదని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. సుమారు 9 వేల కుటుంబాలు పునరావాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపా రు. సుంకేసుల గ్రామ నిర్వాసితులకు పునరావాసం, నివాస స్థలాల విషయంలో స్పష్టత లేదన్నారు. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసాన్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టులో నీటి విడుదలకు ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని చంద్రశేఖర్ ఆరోపించారు. ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. నీటి విడుదలకు ముందు కాలువలు, పరిసర ప్రాంతాల్లో హెచ్చరికలు, భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. కలెక్టర్, ఇరిగేషనన్ మంత్రి తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణయాదవ్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్సీపీ నాయకులు పిడతల ప్రవీణ్కుమార్రెడ్డి, వెన్నా హనుమారెడ్డి, దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, తదితరులు పాల్గొన్నారు. -
పురపోరుకు రంగం సిద్ధం
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పురపోరుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. అందుకుగానూ ఒంగోలు కార్పొరేషన్తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పునర్విభజన జరిగిన వార్డులు, డివిజన్ల జాబితాలను శనివారం అధికారులు ప్రచురించారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీ కాలం ఈ ఏడాది మార్చితో పూర్తయింది. ఆ తర్వాత ఒంగోలు నగరపాలక సంస్థలోని డివిజన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వార్డులకు పునర్విభజన కార్యక్రమం చేపట్టారు. అయితే అధికార టీడీపీ నాయకులు ఇష్టానుసారం డివిజన్లు, వార్డుల విభజన చేపట్టారంటూ వైఎస్సార్ సీపీకి చెందిన నేతలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పరిశీలించి డివిజన్లు, వార్డులను ప్రకటించి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలని సూచించింది. ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి కూడా ప్రచురించారు. నియమం 3 కింద విభజించాలని సూచన... సహజ సరిహద్దులను సక్రమంగా పరిగణనలోకి తీసుకుని నియమం 3 కింద ప్రభుత్వం నోటిఫై చేసిన విధంగా కార్పొరేషన్ ప్రాంతాన్ని వార్డులుగా విభజించాలని సూచించారు. ఆ మేరకు సహజ సరిహద్దులు, భౌగోళిక లక్షణాలు, ఆ ప్రాంతం అవిచ్ఛిన్నతను సక్రమంగా పరిగణనలోకి తీసుకుని నియమం 3 కింద ప్రభుత్వం నోటిఫై చేసిన విధంగా కార్పొరేషన్ ప్రాంతంలో వార్డులుగా విభజించబడుతుంది. సహజ సరిహద్దులను నిర్ధారించడం సాధ్యం కాని చోట, సాధ్యమైనంత వరకు సర్వే నంబర్లు, టి.ఎస్.నంబర్లు, ముఖ్యమైన కూడళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. వార్డులలో జనాభాలో వ్యత్యాసం, సాధ్యమైనంత వరకు వార్డు సగటు జనాభాలో 10 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. వార్డు విభజన కార్పొరేషన్ భౌగోళిక సరిహద్దులో క్లాక్ వైజ్గా ఈశాన్య బిందువు నుంచి ప్రారంభం కావాలి. వార్డులకు ఈశాన్య బిందువు నుంచి సవ్యదిశలో వరుస క్రమంలో సంఖ్యలు ఇవ్వాలి. మున్సిపల్ కార్పొరేషన్ను వార్డులుగా విభజించడం, పునర్విభజించడం అనే ప్రతిపాదనకు సంబంధించి కమిషనర్ ఒక ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి దానిని కార్పొరేషన్ నోటీసు బోర్డుపై, ఇతర ప్రముఖ ప్రదేశాలపై, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించాలి. నోటీసు ప్రచురించిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మున్సిపల్ కార్యాలయానికి చేరేలా సాధారణ ప్రజల నుంచి సూచనలు కోరాలి. కమిషనర్ సదరు నోటీసును మున్సిపల్ కౌన్సిల్ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల కోసం వారి ముందు కూడా ఉంచాలి. నిర్ణీత కాలంలో అందిన అన్ని సూచనలు, అభ్యంతరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ను వార్డులుగా విభజించే ప్రతిపాదనపై ప్రజల నుంచి సూచనలు కోరుతూ కార్పొరేషన్ నోటీసు బోర్డు, ఇతర ప్రముఖ ప్రదేశాలలో ఫారం–1లో ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురణను ఈ నెల 5వ తేదీ ప్రకటించారు. వారం రోజుల్లో అంటే ఈ నెల 11వ తేదీలోపు ప్రజలు వాళ్ల అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలి. అనంతరం ఈ నెల 12వ తేదీ ఆ అభ్యంతరాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్కు కమిషనర్లు పంపుతారు. నిర్ణీత గడువులోగా ఎటువంటి సూచనలు తెలియజేయకుంటే అప్పటికే చేసిన ప్రతిపాదనలను ఖాయం చేస్తామని ఆ ప్రచురణలో పేర్కొన్నారు. నగర పంచాయతీల్లోనూ ముమ్మరంగా ఏర్పాట్లు హైకోర్టు ఆదేశాల మేరకు వార్డులు, డివిజన్ల ప్రచురణ అభ్యంతరాలుంటే వారం రోజుల్లో తెలియజేయాలని సూచన కోర్టుల్లో కేసులున్న మున్సిపాలిటీలివే... కందుకూరు మున్సిపాలిటీకి సంబంధించి హైకోర్టులో వివాదం కొనసాగుతోంది. 2012 నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. వార్డుల విభజనతో పాటు కొన్ని గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 8వ తేదీ వాయిదా ఉంది. అదేవిధంగా పొదిలి నగర పంచాయతీ 2021లో ఏర్పడగా, కంభాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలను విలీనం చేయవద్దని ఆయా గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో మొదట ఏర్పాటు చేసిన 20 వార్డులతోనే పాదిలి నగర పంచాయతీలో పాలన కొనసాగుతోంది. ఒంగోలు నగరపాలక సంస్థలో గతంలో 50 డివిజన్లు ఉండేవి. పునర్విభజన తర్వాత వాటిని 62కు పెంచారు. ఒంగోలు నగరపాలక సంస్థలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 6 డివిజన్లు కూడా కలగలిసి ఉన్నాయి. -
గురువుల సూచనలే భవితకు మార్గదర్శకం
ఒంగోలు టౌన్: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గురువులిచ్చే సలహాలు, సూచనలను ప్రతిఒక్కరూ ఆచరణలో పెట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. సమాజంలో విజయం సాధించిన ప్రతిఒక్కరి వెనుక ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ లీప్ యాప్ ద్వారా విద్యార్థుల ప్రతిభను నిత్యం గమనిస్తుండాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను నిశితంగా గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రకాశం జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత బాధ్యాతాయుతంగా పనిచేయాలని టీచర్లకు సూచించారు. తాను చదువుకునే రోజుల్లో విదేశాలకు వెళ్లాలని కోరిక ఉండేదని, దానికంటే ప్రజలకు ఎక్కువగా సేవ చేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వస్తుందని గురువులు చెప్పిన మాటలే తనను కలెక్టర్ను చేశాయని గుర్తు చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అఽధికారి సీవీ రేణుక అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో 72 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో పండుగ వాతావరణం నెలకొంది. గురుపూజోత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గురుదేవోభవ అంటూ చిన్నారులు ఆలపించిన గేయాలు పులకింపజేశాయి. కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖ అధికారులు రవి, రంగయ్య, సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్, డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు ఒంగోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం -
మా మంచి మాస్టారు..
పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి చదువుకుంటున్నాను. శ్రీనివాసరావు మాస్టారు చాలా మంచాయన. మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తారు. తెలియనివి చెబుతుంటారు. – వీఎస్ఎన్వీ నందకిశోర్, తొమ్మిదో తరగతి మాస్టారు ప్రోత్సాహంతో జిల్లా అవార్డు.. మా హెడ్ మాస్టారు ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుంటుంది. నేను ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాను. వినియోగదారుల దినోత్సవ సందర్భంగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి వ్యాసరచన, డిబేట్లో పాల్గొనేలా చేశారు. నాకు జిల్లా స్థాయి అవార్డు వచ్చింది. – పీ లక్ష్మీ అమూల్య, పదో తరగతి -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
● మరో ఇద్దరికి తీవ్రగాయాలు కొండపి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొండపి మండలంలో కొండపి నుంచి టంగుటూరు వెళ్లే మార్గంలో రంగసాయి వాగు సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై టీ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన ఎస్.రవి (20), మనోహర్, వెంకటరావు ద్విచక్ర వాహనంపై మద్దులూరు నుంచి మిట్టపాలెంలో వివాహానికి బయలుదేరారు. వ్యక్తిగత పనులు ఉండటంతో మిట్టపాలెం నుంచి కొండపి వచ్చి పనులు ముగించుకుని మిట్టపాలెంలో వివాహానికి వెళ్తున్న సమయంలో అతివేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మనోహర్, వెంకటరావును 108లో కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలులోని జీజీహెచ్కి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై త్యాగరాజుతో కలిసి సీఐ వైవీ రమణయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లతో ఐద్వా నిరసన ఒంగోలు టౌన్: ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అరకొరగా అమలు చేస్తూ మహిళలను దగా చేస్తోందని ఐద్వా మహిళా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. ఎవరెవరికి ఎన్నెన్ని సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం స్థానిక చైతన్య నగర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ చౌకదుకాణాలలో బియ్యంతో పాటుగా కందిపప్పు, నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పిన హామీని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న ధరలతో నిరుపేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిందని, అన్నీ చేసేశామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా నగర కార్యదర్శి జి.ఆదిలక్ష్మి, ఐద్వా నాయకులు ఎస్.అనిత, డి.తిరుపతమ్మ, ఎం.సుబ్బరత్తమ్మ, గురవమ్మ, నాగమణి, శిరీష, శ్రావణి, ఆర్.సుబ్బులు, డి.వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పు సాగు చప్పగా..!
దళారులదే రాజ్యం... సింగరాయకొండ: కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు ఎల్నినో ప్రభావం తోడవడంతో ఈ సంవత్సరం ఉప్పు రైతు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఈ ఏడాది ఉప్పు ఉత్పత్తి బాగా పెరిగింది. కానీ, ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ధరలు పూర్తిగా దిగజారాయి. చివరకు ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దీనికితోడు వ్యాపారులు సిండికేటై లాభాల కోసం పాకులాడుతూ రైతులను మోసం చేసి నష్టాలకు గురిచేస్తున్నారు. ఇతర ప్రాంతాల వ్యాపారులు రాకుండా అడ్డుకుంటూ తాము నిర్ణయించిందే ధర అంటూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. 60 కేజీల ఉప్పు బస్తా ధర కనీసం రూ.220 పలికితేనే రైతుకు గిట్టుబాటయ్యే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం రూ.70 మాత్రమే పలుకుతోంది. గత సంవత్సరం 75 కేజీల బస్తా ధర రూ.300 పలికింది. ఈ ఏడాది దారుణంగా పడిపోయినా కూటమి ప్రభుత్వ పెద్దలు కనీసం పట్టించుకోకపోవడంతో ఉప్పు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పాతాళానికి పడిపోయిన ధరలు... ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురవకపోవటంతో ఉప్పు ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ ధరలు పాతాళానికి పడిపోయాయి. దానికితోడు కూటమి ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఉప్పు రైతు నడ్డి విరిగే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనపర్తి, చిన్నగంజాం, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. 7 వేల మందికిపైగా రైతులు, 10 వేల మందికిపైగా కూలీలు ఉప్పు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. సింగరాయకొండ, చిన్నగంజాం నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఉప్పు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం మినహా సుమారు 9 నెలల పాటు ఉప్పు సాగవుతోంది. ఎకరాకు 75 కేజీల ఉప్పు బస్తాలు 1,000 వరకు ఉత్పత్తి అవుతాయి. దాని ప్రకారం ప్రతి నెలా 25 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి వస్తోంది. గత సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి లక్ష్యానికన్నా తక్కువగా వచ్చింది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి అధికంగా ఉండటంతో ఎగుమతులు బాగా జరిగి లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ, ధరలు భారీగా పడిపోయి రైతులకు నిరాశే మిగిలింది. గత ఫిబ్రవరిలో రూ.200.. ప్రస్తుతం రూ.70..! జిల్లాలో సాగవుతున్న ఉప్పు ధరలు రోజురోజుకూ పడిపోతుండటంతో సాగుచేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గత ఫిబ్రవరి నెలలో తయారైన ఉప్పు 75 కేజీల బస్తా ధర నాణ్యతను బట్టి రూ.160 నుంచి రూ.200 పలికింది. జూలై నెలలో పండించిన ఉప్పు ధర 75 కేజీల బస్తా రూ.100 మాత్రమే ఉంది. ప్రస్తుతం 60 కేజీల బస్తా ధర కేవలం రూ.70 పలుకుతోంది. ఇటీవల యుద్ధం కారణంగా హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు మూతపడే పరిస్థితి రావడంతో పడిపోయిన ధరలు తిరిగి పుంజుకునే దశలో ఎల్నినో ప్రభావంతో ఉప్పు ఉత్పత్తి మరింత పెరిగి ధరలు భారీగా పతనమయ్యాయి. ఎకరాకు వారానికి రూ.2 వేలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తయారైన ఉత్పత్తి కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయని, కాని ఉప్పు ఉత్పత్తి ఆపలేక మానసికంగా వేదన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో దళారులు రాజ్యమేలుతున్నారు. వీరు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి నెలకొంది. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం, బింగినపల్లి ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 5 నుంచి 7 లారీల వరకు ఉప్పు రవాణా అవుతోంది. ఉప్పు ఉత్పత్తి గణనీయంగా పెరగటంతో సాగుపై ఆధారపడే కార్మికులు లబ్ధిపొందుతుండగా, రైతులు మాత్రం ధరలు పడిపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చివరికి కౌలు కూడా కట్టలేని దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వంలో పండించిన ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, చివరకు ఉప్పు పంటకు కూడా ధరలు పడిపోయాయని, ప్రభుత్వం ఉప్పు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని ఉప్పు రైతులు కోరుతున్నారు. -
బోధనకు సృజనను జోడించి..
బేస్తవారిపేట: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి భవితకు మార్గదర్శకునిగా నిలుస్తున్నారు మద్దుల వెంకటేశ్వరరెడ్డి. బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు మెయిన్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఆయన మార్కాపురం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపే వెంకటేశ్వరరెడ్డి తాను పనిచేసిన పాఠశాలల్లో విద్యార్థులకు నోట్పుస్తకాలు, పలకలు, కాపీ రాత పుస్తకాలు సొంత నిధులతో అందించారు. నవోదయ, గురుకుల పాఠశాలల అర్హత పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందిస్తూ పలువురి ఉన్నత విద్యకు మార్గదర్శకంగా నిలిచారు. విద్యారంగంతో పాటు సామాజిక సేవలోనూ వెంకటేశ్వరరెడ్డి తనదైన ముద్ర వేశారు. 12 ఏళ్లగా చేయూత మిత్రమండలిలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మిత్రులు శివ, నబిల సహకారంతో త్రీ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిల్లో పలు టాలెంట్ పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మార్కాపురం రూరల్: విద్యాబోధనే కాదు..విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మార్కాపురం మండలం బోడపాడు ఎంపీపీ స్కూల్ ఎస్జీటీ పి.శ్రీనివాసులు. అంకిత భావంతో ఆయన అందించిన సేవలు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యేలా చేశాయి. శ్రీనివాసులు గతంలో ఆర్మీలో సేవలందించి రిటైర్డ్ అయ్యారు. అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావాన్ని ఉపాధ్యాయ వృత్తిలోనూ కొనసాగించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీనివాసులు బోడపాడు పాఠశాలలో చేరిన సమయంలో కేవలం 30 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. రెండేళ్లలో ఆయనతోపాటు ఇతర ఉపాధ్యాయుల కృషితో పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది. దీంతో 2026 నాటికి విద్యార్థుల సంఖ్య 170కు చేరింది. ప్రస్తుతం పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులతో ఉన్న పాఠశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరే స్థాయికి తీసుకురావడంలో శ్రీనివాసులు కీలక పాత్ర పోషించారని గ్రామస్థులు చెబుతున్నారు. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.15 లక్షల మేర అభివృద్ధి పనులు జరిగాయి. ఇందులో శ్రీనివాసులు తన సొంత డబ్బుతో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి పాఠశాల అభివృద్ధికి సహకరించినట్లు స్థానికులు తెలిపారు. చిన్న పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన మార్గదర్శకత్వంలో గత రెండేళ్లలో ఆరుగురు విద్యార్థులు నవోదయలో సీట్లు సాధించడం విశేషం.ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న బోడపాడు ఎంపీపీ పాఠశాలలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు సిటీ: చదువు అంటే పుస్తకాల్లోని పాఠాలను బట్టీ పట్టడం కాదు.. నేర్చుకున్న విషయాన్ని ప్రయోగించి చూడటం.. ప్రశ్నించడం.. కొత్తగా ఆలోచించడం. ఇదే సూత్రాన్ని నమ్మి ఉపాధ్యాయ వృత్తికి కొత్త నిర్వచనం చెబుతున్నారు కాకి స్వర్ణలత. ముండ్లమూరు మండలం వేముల జెడ్పీ హైస్కూల్లో సైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె సైన్స్ పాఠాలను ప్రయోగాలతో ఆసక్తికరంగా మార్చడమే కాకుండా.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్తున్నారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వ్యక్తిగతంగా చేయూతనిస్తూ.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 2009 నుంచి సైన్స్ ప్రాజెక్టులు, ప్రయోగాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్.సీ.ఎస్.సీ) ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఏపీ సైన్స్ కాంగ్రెస్ తదితర వేదికల్లో విద్యార్థుల ప్రాజెక్టులు ప్రదర్శించేలా మార్గనిర్దేశం చేశారు. ఆమె పర్యవేక్షణలో రూపొందించిన విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో గుర్తింపు పొందాయి. జాతీయ స్థాయిలో నాలుగు, సదరన్ ఇండియా స్థాయిలో 12, రాష్ట్ర స్థాయిలో 27 ప్రాజెక్టులకు అవకాశాలు లభించడంతో పాటు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. వేముల జెడ్పీ హైస్కూల్లో పనిచేసేటప్పుడు సుమారు రూ.లక్ష వ్యయంతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడంలో స్వర్ణలత కీలకంగా వ్యవహరించారు. పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, దుస్తులు వంటి విద్యా సంబంధిత సామగ్రిని, ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. విద్యా సామగ్రి రూపకల్పనలోనూ భాగస్వామ్యమయ్యారు. 8, 9, 10 తరగతుల మాడ్యూల్ రచన, అనువాద కార్యక్రమాలు, ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పీఎస్ పాఠ్యపుస్తక రచనలో భాగస్వామ్యం, రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్, ఎస్ఆర్పీగా బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ గ్రీన్ క్రాప్స్ క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. కాకి స్వర్ణలత సేవలకు పలు అవార్డులు వరించాయి. 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2022లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. 2018 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘భారత మహిళా శిరోమణి’ అవార్డును అందుకున్నారు. 2019 లో ఎన్టీఆర్ అవార్డును అందుకున్నారు. 2022 సంవత్సరంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో ‘డైమండ్ జూబ్లీ అవార్డు’ కూడా అందుకున్నారు. జరుగుమల్లి(సింగరాయకొండ): విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి ఉన్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు జరుగుమల్లి మండలం పచ్చవ హైస్కూల్ హెచ్ఎం బాపిరెడ్డి ఇందిర. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న ఆమె విద్యార్థులతో పాటు పాఠశాల అభివృద్ధికీ కృషి చేస్తున్నారు. ఉలవపాడు, మైనంపాడు, చీమకుర్తి, కనిగిరి పాఠశాలల్లో పనిచేశారు. 2024–25 లో ట్రిపుల్ ఐటీలో 4 సీట్లు, 2025–26లో త్రిపుల్ ఐటీలో 3 సీట్లు విద్యార్థులు సాధించారు. అలాగే జిల్లా సైన్స్ ఫెయిర్లో ఇన్స్పైర్ మానక్ అవార్డు సాధించి రూ.10 వేలు ప్రైజ్ మనీ, కలెక్టర్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు తో పాటు రూ.20 వేలు ప్రైజ్మనీ అందుకున్నారు. దాతల సహకారంతో పచ్చవ పాఠశాలలో కళా ప్రాంగణం నిర్మించారు. పాఠశాల పూర్వవిద్యార్థులతో పాఠశాలలో అభివృద్ధి పనులకు కృషి చేశారు. మేడమ్ స్ఫూర్తితో ట్రిపుల్ ఐటీ సీటు సాధించా నేను పచ్చవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాను. నా తల్లిదండ్రులు బేల్దారి కూలీ పనులు చేస్తుంటారు. నాకు మొదటి నుంచి సరైన గైడ్లైన్స్ లేదు. కానీ ప్రధానోపాధ్యాయురాలు బాపిరెడ్డి ఇందిర మేడమ్ నాలోని ప్రతిభను గుర్తించి గత డిసెంబర్ నెలలో నేను క్లాస్ రూమ్ లో ఉండగా నా ఫొటో తీసి ఈ ఫొటో ఫ్లెక్సీలో రావాలి అంటూ నాలో బాగా చదువుకోవాలి అన్న పట్టుదలను, ట్రిపుల్ ఐటీ సీటు సాధించాలన్న స్ఫూర్తిని నింపారు. ఆ స్ఫూర్తితో పదో తరగతిలో 579 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీటు సాధించాను. నేను ఇందిర మేడమ్కు నా జీవితాంతం రుణపడి ఉంటాను. – వీ అలేఖ్య, విద్యార్థిని సంతమాగులూరు(అద్దంకి): జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై న ఏల్చూరు పాఠశాల ఉపాధ్యాయుడు ఎం హనుమంతరావు తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో నాడు–నేడులో పాఠశాలలను అభివృద్ధి చేయించారు. 1996లో ఎస్జీటీగా బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం పాఠశాలలో ఉద్యోగంలో చేరిన ఆయన సంతమాగులూరు మండలంలోని మిన్నెకల్లు యూపీలో పదేళ్లు పనిచేసిన సమయంలో ప్రధానోపాధ్యాయునిగా యూపీ పాఠశాలను హైస్కూల్గా మార్చేందుకు కృషిచేశారు. అదే విధంగా బోధించే తెలుగులో 9 మందికి నూటికి నూరు మార్కులు సాధించేలా చేశారు. ఎనభై శాతం మంది విద్యార్థులకు సగటున 80 మార్కులు వచ్చేలా విద్యను బోధించారు. సంతమాగులూరు పాఠశాలను స్థానిక పెద్దల సహకారంతో ప్రహరీ, మూడు భవనాలు కట్టించారు. ఏల్చూరు ముస్లిం పాఠశాలలో మూడు భవనాలు మంజూరు చేయించి యూపీ నుంచి హైస్కూల్ చేయించారు. డ్రాయింగ్లో తర్పీదునిచ్చారు.. మా మాస్టారు తెలుగు సబ్జెక్టులోనే కాకుండా మాకు చిత్ర లేఖనంలోనూ తర్ఫీదునిస్తుంటారు. నాకు పోటీల్లో మంచి ప్రైవ్ వచ్చింది. – నూకల విద్యావైష్టవి, తొమ్మిదో తరగతి -
సమష్టి కృషికి రాష్ట్ర స్థాయి గుర్తింపు
ఒంగోలు సిటీ: విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ సమన్వయం చేసుకుని..సమగ్ర ప్రణాళికలతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటుకు స్కూళ్లకు దీటుగా నిలబెట్టారు ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మువ్వ రాధిక. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచేలా విద్యా ప్రమాణాలను ఆమె మెరుగుపరిచారు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టారు. ఫలితంగా ప్రస్తుతం పాఠశాలలో 607 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా గణనీయంగా పెంచగలిగారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు పాఠశాలలో రాత్రి స్టడీ తరగతులు, ప్రత్యేక తరగతులు అమలు చేస్తున్నారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈ పాఠశాల 94 శాతం ఉత్తీర్ణత సాధించింది. 585, 584 మార్కులతో నగరంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను పాఠశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, అభ్యసన స్థాయి తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేయడం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరి సమష్టి కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని మువ్వ రాధిక పేర్కొన్నారు. -
ఒంగోలులో మెడికల్ హబ్ ఏర్పాటు
ఒంగోలు టౌన్: జిల్లా అభివృద్ధిలో భాగంగా ఒంగోలు నగరంలో మెడికల్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. నగరంలోని వివిధ స్పెషాలిటీ సేవలందిస్తున్న ఆస్పత్రులన్నీ ఒకచోట ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో శుక్రవారం ప్రైవేటు వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెలలో 150 మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని వైద్యులు ఒంగోలు నగర విశిష్ట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. మెడికల్ క్యాంపుల నిర్వాహణకు సంసిద్ధం కావాలని, సేవలను మరింత విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, పీడీసీపీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కె.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుకు మహిళా కూలీ మృతి
మర్రిపూడి: పాముకాటుకు ఓ మహిళా కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన మర్రిపూడిలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని మూలే పేరయ్య భార్య వెంకట లక్ష్మమ్మ (62) వరి నారు పీకేందుకు కూలీలతో కలిసి మర్రిపూడి పంచాయతీ పరిధిలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామం వెళ్లింది. నారుమడిలోకి దిగి నారు పీకుతోంది. ఆ సమయంలో బురదలో పామున్న విషయాన్ని గుర్తించని వెంకటలక్ష్మి కుడిచేతిపై పాము కాటు వేసింది. ఆమెను తోటి కూలీలు మర్రిపూడి తీసుకొచ్చారు. అప్పటికే పాము విషం శరీరం మొత్తం వ్యాపించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నాటు వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాటు వేసింది కట్ల పాముగా స్థానికులు భావిస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. బేస్తవారిపేట: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై గురువారం అర్ధరాత్రి జరిగింది. 35 నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు 5.3 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు, ఎడమ భుజం, ఎడమ ఛాతిపై పుట్టు మచ్చలతో కాఫీ కలర్ నిండు చేతుల చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బేస్తవారిపేట పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ఎస్.రవీంద్రారెడ్డి కోరారు. అర్ధవీడు: పెద్ద పులి దాడి చేయడంతో గేదె మృతిచెందిన సంఘటన అర్ధవీడు మండల పరిధిలోని బొల్లుపల్లి ఫారెస్ట్ బీటులో అల్లురేణికుంట సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. బొల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ బాషుకు చెందిన గేదె గత శనివారం మేతకు వెళ్లి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు గాలించారు. అల్లురేణికుంటలో గేదె కళేబరం కనిపించడంతో పాటు పెద్ద పులి దాడి చేసి చంపిన ఆనవాళ్లున్నట్లు స్థానికులు గుర్తించారు. సుమారు రూ.లక్షకుపైగా విలువైన గేదె మృతిచెందడంతో భాషు కన్నీరుమున్నీరయ్యాడు. జీవనోపాధికి ఆధారమైన గేదెను కోల్పోయిన తనకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. అద్దంకి: ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ డిస్ట్రిక్ట్ స్టీల్ సెలక్షన్స్కు సంబంధించి, పురుషుల, మహిళా సబ్ జూనియర్, జూనియర్ జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమం పట్టణంలో నిర్వహించారు. రెండు విభాగాల్లో పురుషుల జట్టులో 16 మందిని, సీ్త్రల జట్టులో 16 మందిని ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమం రాష్ట్ర అడహక్ త్రీమెన్ కమిటీ అధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్, జూనియర్స్ విభాగాల్లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఆడనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ నరసింహ, నెల్లూరు మహేశ్, వాసు, విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పీడీ పీ తిరుపతి స్వామి పర్యవేక్షించారు. -
అడుగడుగునా జన నీరాజనం
నాగులుప్పలపాడు: మండలంలోని కనపర్తి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి డా.మేరుగు నాగార్జున ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు మండలంలోకి ప్రవేశించిన ఎంపీ, ఎమ్మెల్యేలకు చదలవాడ గ్రామం వద్ద ఎంపీపీ దంపతులు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ బంగారుబాబు, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, మండల నాయకులు, మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చదలవాడ నుంచి కనపర్తి వరకు 17 కి.మీ సాగిన బైక్ ర్యాలీలో యువకులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. అగ్రహారం, చీర్వానుప్పలపాడు, అమ్మనబ్రోలు, వినోదరాయునిపాలెం, దాసరివారిపాలెం గ్రామాలలో కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కనపర్తి గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కొమ్మూరి కనకారావు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, రాష్ట్ర మేధావుల సంఘం కార్యదర్శి కంచర్ల సుధాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, జడ్పీటీసీ లు వేమా శ్రీనివాసరావు, తేళ్ళ పుల్లారావు, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, కనపర్తి గ్రామాధ్యక్షుడు విజయ సింహరెడ్డి, నారపరెడ్డి, గోపిరెడ్డి, అంజిరెడ్డి, ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్లు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలువైఎస్సార్ విగ్రహానికి గజమాలతో నివాళులర్పిస్తున్న వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ, మేరుగు నాగార్జున, నాయకులు -
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె నిద్ర
గుడ్లూరు: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే పల్లె నిద్ర చేస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. గుడ్లూరు మండలంలోని చెమిడిదపాడు గ్రామంలో గురువారం రాత్రి పల్లె నిద్ర చేసిన కలెక్టర్.. స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా అర్జీలలో పేర్కొన్న సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం గ్రామంలో విస్తృతంగా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అదేవిధంగా జగనన్న కాలనీలో నీటి సమస్య పరిష్కరించేందుకు పైపులు ఏర్పాటు చేస్తామన్నారు. మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతోందో..లేదో పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల తరగతి గదులను పూర్తి చేసేందుకు చర్యలు తీనుకుంటామని చెప్పారు. తొలుత సచివాలయం వద్ద ఉన్న జగనన్న కాలనీలో తాగునీటి సమస్య గురించి కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట కాలువను, మంచినీటి సరఫరాను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నారా..లేదా..? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులపై కూలీలను ఆరా తీశారు. కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల అధికారి వెంకటేశ్వరరావు, డీపీవో అనుపమ, డ్వామా పీడీ జోసఫ్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్, 44 శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు -
సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు
తెలుగు పద్యాలు, కవితలు, కథలు, వ్యాసాలు, ప్రసంగాలు, పద్య పఠనం వంటి అంశాలను ఆసక్తికరంగా బోధిస్తూ మాలో తెలుగు ఉపాధ్యాయురాలు ఆకవీటి సరోజ సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి గా ఎంపిక కావడంతో ఎంతో సంతోషంగా ఉంది. భాషాభివృద్ధి, విద్యార్థుల్లో భాషాభిమానాన్ని పెంపొందించడం, సాహిత్యంపై ఆసక్తిని కలిగించడంతో తెలుగుపై మాకు మక్కువ ఏర్పడింది. హజరత్గూడెం పాఠశాలలో వంటగది, భోజనశాల, గ్రంథాలయం ఏర్పాటులో, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించారు. మేడమ్ సొంత నిధులతో పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశారు. – వల్లంశెట్టి మాధవి, పదో తరగతి, హజరత్గూడెం జెడ్పీ హైస్కూల్ -
విద్యను బోధిస్తూ..ప్రతిభను ప్రోత్సహిస్తూ..
బల్లికురవ: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారిని వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతున్నారు కొప్పెరపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాసరావు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న ఆయన గతంలో చిలంకూరు, తర్లుపాడు, బూదవాడ, కోటపాడు, దద్దుకూరు పాఠశాలల్లో పనిచేశారు. పనిచేసిన ప్రతి చోటా పెద్దలచే సన్మానాలు అందుకున్నాడు. పనిచేసే చోట నివాసం ఉంటూ తోటి ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునిచ్చారు. పాఠశాలను నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాంతో పాఠశాలను పీఎంశ్రీకి ఎంపికయ్యేలా కృషిచేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం, ఎన్ఎంఎంఎస్లో 46 మంది ఎంపికకు కృషి, కౌశిల్ క్విజ్ చెకుముకిలో రాష్ట్ర స్థాయిలో విన్నర్స్గా విద్యార్థులు నిలిచేలా కృషిచేశారు. సహచర ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు ఉత్తమ బోధన అందించారు. -
భాషా బోధన..సాహిత్య ప్రోత్సాహం
కంభం: భాషా బోధనతో పాటు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న హజరత్గూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు ఆకవీటి సరోజ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తెలుగు ఉపాధ్యాయురాలిగా సరోజ కేవలం పాఠ్యపుస్తకాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. తెలుగు పద్యాలు, కథలు, కవితలు, వ్యాసాలు, ప్రసంగాలు, పద్యపఠనం వంటి అంశాలను ఆసక్తికరంగా బోధిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. అష్టావధానం, కవితా పఠనం, వ్యాసరచన, కథారచన, ప్రసంగం, సాహిత్య చర్చలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు. గతంలో పనిచేసిన ఎల్.కోట పాఠశాలలో సుమారు రూ.లక్ష సొంత నిధులను వెచ్చించి తెలుగు సాహిత్య నిలయాన్ని ఏర్పాటు చేయడం సరోజ సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది. అందులో ప్రముఖ తెలుగు కవుల చిత్రాలు, వ్యాకరణ అంశాలు, పద్యాలు, ఇతర సాహిత్య సమాచారాన్ని అందుబాటులో ఉంచి విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని మరింత చేరువ చేశారు. సొంత నిధులతో పాటు దాతల సహకారంతో హజరత్గూడెం పాఠశాలలో అదనపు గది, భోజనశాల, గ్రంథాలయం వంటి సదుపాయాల ఏర్పాటుకు కృషి చేశారు. -
లాకప్లోనే నా కుమారుడ్ని చంపేశారు
ఒంగోలు టౌన్: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి బిడ్డను పోగొట్టుకున్న మరో తల్లి కన్నీరు పెట్టుకుంది. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బి.బిట్రగుంట మండలం అల్లిమడుగు సంగం గ్రామానికి చెందిన మల్లి దివ్యతేజ తల్లి సలోమీ తన కుమారుడిని పోలీసులే పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరయింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తమను ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతోనే పోలీసులు దివ్యతేజను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపారని అతని చెల్లెలు శ్రీనిధి వాపోయింది. దివ్యతేజను ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కొట్టారని, ఆ దెబ్బలకు లాకప్లోనే చనిపోయాడని, ఆ తరువాత పంట పొలాల్లో పడేశారని సలోమీ, శ్రీనిధి ఆరోపించారు. దివ్య తేజ మృతదేహం జె.పంగులూరు మండలం రేణింగవరం–కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో గురువారం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శుక్రవారం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అక్కడకు వచ్చి న హతుడి తల్లి సలోమీ, చెల్లెలు శ్రీనిధి మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. దివ్యతేజను పోలీసులే కొట్టి చంపారని ఆరోపించారు. దివ్యతేజ బాధితుల కథనం ప్రకారం.. మల్లి దివ్యతేజ (34) గత శనివారం రాత్రి దాబాకు వెళ్లి భోజనం చేసి వస్తానంటూ తల్లి సలోమీ వద్ద డబ్బులు తీసుకొని స్నేహితుడు సాతపాటి శశికాంత్తో కలిసి బయలుదేరాడు. రాత్రి 12 గంటలకు ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు వారిని పట్టుకెళ్లారు. శశికాంత్ను వదిలి పెట్టిన పోలీసులు దివ్యతేజ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి అతను కనిపించలేదు. అనుమానం వచ్చి న తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి నెల్లూరు జిల్లా కావలి పోలీసు స్టేషన్కు వెళ్లి సీఐకు ఫిర్యాదు చేశారు. జె.పంగులూరు తన పరిధిలో లేదు కనుక అక్కడకు వెళ్లి పోలీసులను కలవమని ఆయన సలహా ఇచ్చారు. దాంతో బాధితులు జె.పంగులూరు ఎస్సైని కలవగా.. శశికాంత్ ఒక్కడినే పట్టుకున్నామని, దివ్యతేజ సంగతి తెలియదని చెప్పారు. ఆ సమయంలో ఎస్సై కంగారుపడినట్లు వారు గమనించారు. ఈనెల 1వ తేదీ వరకు పోలీసుల నుంచి సమాచారం లేకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు. దివ్యతేజ ఆచూకీ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ సమాచారం తెలిసిన గంటకే పోలీసులు లాయర్కు ఫోన్ చేసి కండమూరు పొలాల్లో దివ్యతేజ మృతదేహం ఉన్నట్లు గుర్తించామని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడకు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో దివ్యతేజ మృతదేహం పొలాల్లో పడి ఉంది. దెబ్బలతో ఒళ్లంతా కమిలిపోయి ఉన్నట్లు గమనించారు. ఇవన్నీ పోలీసులు కొట్టిన దెబ్బలేనని, తన కుమారుడిని లాకప్లో కొట్టి చంపేశారంటూ సలోమీ విలపించారు.మమ్మల్ని చూడగానే ఎస్సై కంగారుపడ్డారు: శ్రీనిధితాము హైకోర్టులో పిల్ వేయకపోతే తన అన్న మృతదేహాన్నీ పోలీసులు మాయం చేసేవారని దివ్యతేజ చెల్లెలు శ్రీనిధి కన్నీరు పెట్టుకుంది. జె.పంగులూరు పోలీసు స్టేషన్కు వెళ్లిన తమను చూడగానే ఎస్సై కంగారు పడిపోయారని, భయంభయంగా మాట్లాడడంతో ఏదో జరిగిందన్న అనుమానం వచ్చి ందని తెలిపారు. తన సోదరుడు డిగ్రీ చదివాడని, ఐటీఐ చేశాడని చెప్పారు. ఆయనకు 4, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, భార్య చనిపోయిందని, ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాడని వివరించింది. పోలీసులు తన అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని విలపించింది. కోర్టుకు వెళ్లకపోతే శవం కూడా దొరికేది కాదు: నీలం నాగేందర్ బాధితులు హై కోర్టులో పిటిషన్ వేయకపోతే దివ్యతేజ మృతదేహం కూడా దొరికేది కాదని దళిత హక్కుల సంఘం నాయకుడు నీలం నాగేందర్ చెప్పారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత నాయకులు కాకుమాను రవి, కోలా జీవరత్నం, దేవరపల్లి గోపి, ఎర్రమల శ్రీనుతో కలిసి ఆయన జీజీహెచ్ వద్ద బాధిత కుటుంబంతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పోలీసులు దివ్యతేజను లాకప్లోనే కొట్టి చంపారని, శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాధితులు కోర్టులో పిటిషన్ వేసే దాకా మృతదేహం ఎక్కడ ఉందో కూడ చెప్పలేదన్నారు. దివ్యతేజ కంటి మీద, వీపు మీద, పొట్టమీద గాయాలున్నాయని, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయని తెలిపారు. దివ్యతేజ లాకప్డెత్ కేసులో వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని, కేసును గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.విచారణ జరుపుతున్నాం: దర్శి డీఎస్పీ గత నెల 29వ తేదీ రాత్రి జె.పంగులూరు లిమిట్స్లో నైట్ బీట్లో ఉన్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకొని వెళ్లి పోవడానికి ప్రయత్నించడంతో అనుమానం వచ్చి వెంటపడ్డారని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. మరుసటి రోజు శశికాంత్ను పోలీసులు పట్టుకున్నారని, రెండో వ్యక్తి పారిపోయాడని తెలిపారు. గురువారం మధ్యాహ్నం కండమూరు పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని, విచారణలో అది దివ్యతేజదిగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాధితుల ఆరోపణలో నిజం లేదన్నారు. -
మద్యం మత్తులో యువకుల వీరంగం
అద్దంకి రూరల్: పట్టణంలోని భవానీ సెంటర్ వేయి స్తంభాల గుడి ఎదురుగా మద్యం మత్తులో కొందరు యువకులు పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ వీరంగం సృష్టించారు. మంగళవారం సాయంత్రం శింగరకొండ వైపు నుంచి బైకులపై వచ్చిన కొందరు, రేణింగవరం రోడ్డు వైపు నుంచి వచ్చిన మరో వర్గంతో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వారిని వారించేందుకు ప్రయత్నించగా.. ఆవేశంతో చొక్కాలు విప్పి, బైకులను అతివేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటువంటి అసాంఘిక చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
ప్రకాశం గుండెల్లో రాజసం
దివికేగి ఏళ్లు గడుస్తున్నా ప్రకాశం జిల్లా ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు నిత్యనూతనంగా వెలుగొందుతూనే ఉన్నాయి. కరవు నేల ప్రకాశం జిల్లాను ప్రగతి బాట పట్టించి, పశ్చిమ ప్రాంత ప్రజల దశాబ్దాల సాగు, తాగునీటి స్వప్నాలకు ప్రాణం పోసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. జలయజ్ఞంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించడం, గుండ్లకమ్మను పూర్తి చేయడం, పేదల ముంగిట్లోకి కార్పొరేట్ వైద్యాన్ని తెచ్చిన రిమ్స్ కళాశాల నిర్మాణం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో జిల్లా రూపురేఖలనే మార్చేశారు. నేడు మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాటి ఆయన సంకల్పం, తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగించిన ప్రగతి ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. మార్కాపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకాశం జిల్లా అభివృద్ధిపై తనదైన చెరగని ముద్ర వేశారు. 1996లో చంద్రబాబు శంకుస్థాపనకే పరిమితం చేసి వదిలేసిన వెలిగొండ ప్రాజెక్టును ‘జలయజ్ఞం’లో చేర్చి పనులను పరుగులు పెట్టించిన ఘనత ఆయనదే. ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక పథకాలతో కోట్లాది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపారు. 2004కు ముందు ప్రకాశం జిల్లా తీవ్ర వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడేది. సరైన సాగునీటి ప్రాజెక్టులు లేక రైతులు కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడగా, చిన్న అనారోగ్య సమస్య వచ్చినా గుంటూరు లేదా కర్నూలు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్సార్ జిల్లా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశారు. సముద్రం పాలవుతున్న వరద నీటిని ఒడిసిపట్టి రైతులకు అందించాలన్న సంకల్పంతో రూ.543.43 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారు. 9 మండలాల పరిధిలోని 84 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఒంగోలు నగరంతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మందికి రక్షిత తాగునీటిని సమకూర్చి, 2008 నవంబరు 24న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందించేందుకు మరో రూ.100 కోట్లతో కాలువల ఆధునీకరణను పూర్తి చేసింది. గిద్దలూరు నియోజకవర్గంలో రూ.22 కోట్లతో రామన్నకతువ నిర్మాణానికి వైఎస్సారే శ్రీకారం చుట్టారు. గిద్దలూరు సమీపంలోని నల్లమల అభయారణ్యంలో రూ.12 కోట్లతో వైఎస్సార్ చేపట్టిన బైరేనిగుండాల ప్రాజెక్టు పనులు పట్టాలెక్కాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో నీటి భద్రతను పటిష్టం చేసే దిశగా వైఎస్సార్ బాటలో అడుగులు వేశారు వైఎస్ జగన్. 2019–24 మధ్య రూ.400 కోట్లతో నాగార్జున సాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు. ఫలితంగా త్రిపురాంతకం, పుల్లలచెరువు, దర్శి, చీమకుర్తి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లోని 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమైంది. అలాగే మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద సుమారు రూ.1200 కోట్లతో చేపట్టిన ఇన్టెక్ వెల్ ట్యాంకు నిర్మాణం ద్వారా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని 500కు పైగా గ్రామాలకు వెలిగొండ జలాలు అందనున్నాయి. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం పనులు వివిధ దశలో ఉన్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్సార్ నాడు రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జీజీహెచ్గా సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వంలో అదనంగా రూ.170 కోట్లు, అత్యాధునిక మౌలిక వసతుల కోసం మరో రూ. 100 కోట్లు కేటాయించి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనికితోడు పశ్చిమ ప్రకాశం ప్రజల వైద్య కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్ సర్కార్ రూ.475 కోట్లతో మార్కాపురంలో నూతన వైద్య కళాశాల నిర్మాణాన్ని చేపట్టి 70 శాతం పనులు పూర్తి చేయడమే కాకుండా, ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం దోర్నాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా మంజూరు చేశారు. నాడు 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి, జిల్లాలోని 63,559 మంది రైతుల పాత కరెంటు బకాయిలను రద్దు చేయడంతో పాటు 71,321 మందికి పైగా రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఇలా రైతు శ్రేయస్సు, పేదల వైద్యం, సాగు–తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తండ్రీతనయులు ప్రకాశం జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రగతిని సాధించి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారు. జలయజ్ఞంతో వెలిగొండ, గుండ్లకమ్మ పనులకు వైఎస్సార్ శ్రీకారం ఆధునికీకరణ పనులతో సస్యశ్యామలమైన సాగర్ ఆయకట్టు ఉచిత విద్యుత్, వైద్య కళాశాలలతో పేదలు, రైతులకు భరోసా తండ్రీతనయుల పాలనలోనే జిల్లా సమగ్ర రూపురేఖలు మార్పు నేడు మహానేత, దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి తండ్రి బాటలోనే తనయుడు చెంతకు చేరిన జలం.. ఆయకట్టుకు జీవం ‘పవర్’ ఫుల్గా అన్నదాతలు పేదల డాక్టర్ వైఎస్సార్ -
బ్యాటరీ షార్ట్ సర్క్యూట్తో మినీ ట్రక్ దగ్ధం
సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని సంతగుడిపాడు నుంచి కొప్పరపాడుకు కూలీలను తరలిస్తున్న టాటా ఏస్ వాహనం అడ్డరోడ్డు టోల్ప్లాజా వద్ద మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. నేషనల్ హైవే రోడ్డు పనుల కోసం కూలీలను తీసుకెళ్తున్న ఈ వాహనంలో ఒక్కసారిగా బ్యాటరీ వద్ద షార్ట్సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. దీన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపి ఆరుగురు కూలీలను కిందికి దించి ప్రాణాలు కాపాడాడు. హైవే సిబ్బంది మంటలనుార్పేందుకు ప్రయత్నించినా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. సకాలంలో స్పందించి పెను ప్రమాదం తప్పుంచిన డ్రైవర్ సమయస్ఫూర్తిని స్థానికులు, కూలీలు అభినందించారు. ● అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ ఒంగోలు వన్టౌన్: జాతీయ లోక్ అదాలత్లో రాజీపడదగిన కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించేందుకు న్యాయవాదులు, చిట్ఫండ్ సంస్థల ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి సీహెచ్వీ రామకృష్ణ కోరారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో, అనంతరం తన చాంబర్లో చిట్ఫండ్ సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన, అతి తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకోవచ్చని వివరించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పంగులూరు గోవిందయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రమేష్బాబు, ఉపాధ్యక్షుడు రవికుమార్, న్యాయవాది సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు మెప్పు కోసమే దిగజారుడు మాటలు
● ఎంపీ పదవిని ఆదాయాలు, వ్యాపారాలకు వాడుకునే స్వార్థపరుడు మాగుంట ● దిగజారి మాట్లాడితే భవిష్యత్లో ఒంగోలు ప్రజలు తిరగనివ్వరు ● మాగుంట తన రాజకీయ సమాధిని తానే తవ్వుకున్నారు ● ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు వ్యాఖ్యలు చేసి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన రాజకీయ జీవితానికి తానే సమాధి తవ్వుకున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం తప్పు కాదు కానీ, స్థాయికి దిగజారి మాట్లాడటం మాత్రం రాజకీయ కు సంస్కారానికి నిదర్శనమని ఆక్షేపించారు. ఒంగోలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడారు. జగనన్నను ప్రాధేయపడి 2019లో ఎంపీ సీటు తెచ్చుకున్న మాగుంట, ఈనాడు చంద్రబాబు మెప్పు కోసం జగనన్నను విలువలు వదిలి దిగజారి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ‘‘మాగుంట..! జగనన్నను వాడు వీడు మూర్ఖుడు అని నీవు నీ నోటి దూలతో మాట్లాడిన ప్రతి మాట ఒంగోలు ప్రజలను తాకింది. మాగుంట దిగజారి మాట్లాడిన మాటలు జగనన్నను కాదు, ఒంగోలు ప్రజలను అన్నట్టు భావిస్తున్నారు. కేంద్రం సంవత్సరానికి రూ.5 కోట్లు ఎంపీ ఫండ్స్ ఇస్తుంటే, 8 శాతం కూడా ఒంగోలు ప్రజల కోసం ఖర్చు పెట్టడం ఇష్టం లేని ప్రబుద్ధుడు మాగుంట. ఎంపీ పదవిని ఆదాయాలకు, వ్యాపారాలకు తన పరిశ్రమల అభివృద్ధి కోసం వాడుకునే స్వార్థపరుడు. ఎంపీ పదవిని అడ్డు పెట్టుకొని ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులు, అక్రమ వ్యాపారాలు అన్నీ ప్రజల ముందుపెడతాం. సాయం చేసిన జగనన్నను వాడు, వీడు అని మాట్లాడిన మాగుంటను అదే ఒంగోలు ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు ‘ఒరేయ్ శ్రీనుగా’.. ‘వాడు శ్రీనుగాడు ఎక్కడ’ సంవత్సరానికి ఒక్కసారి కూడా కనబడటం లేదని మాట్లాడితే ఎలా ఉంటుంది. రేపటి నుంచి మాట్లాడమంటావా..! దిగజారి మాట్లాడితే భవిష్యత్తులో ఒంగోలు ప్రజలు మాగుంటను జిల్లాలో తిరగనివ్వరనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి కులం గురించి మాట్లాడావు.. రెడ్డి అంటేనే ఒక పెద్దరికం, ఒక హుందాతనం, రెడీ టు హెల్ప్ అంటారు. అలాంటిది నీకు సాయం చేసిన వ్యక్తిని ఇంత దిగజారి మాట్లాడిన మాగుంట ఇకపై ‘నేను రెడ్డి’ అంటే రెడ్లు ఆయన ముఖంపై ఉమ్మేస్తారు. వెలిగొండ ప్రాజెక్టును కట్టింది, నీళ్లు తెచ్చింది ఆనాడు పెద్దాయన వైఎస్సార్, ఈనాడు జగనన్న కాదు అని మాగుంట శ్రీనివాసులరెడ్డి తన భార్య, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలడా. ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది, నీళ్లు ఇచ్చింది వైఎస్ కుటుంబం అని జిల్లాలో ఏ పిల్లాడిని అడిగిన చెబుతారు. మేలు చేసిన జగనన్నను అవమానించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, తనకు, మాగుంట కుటుంబానికి శాశ్విత రాజకీయ సమాధి కట్టాడు. ఐదేళ్లకు ఒకసారి పార్టీ మార్చే మాగుంట మాట్లాడిన దిగజారిన భాషకు చరిత్ర ఏదో ఒక రోజున తప్పక సమాధానం చెబుతుంది’’ అని చెవిరెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వై.రమేష్, డి.అంజిరెడ్డి, డి.రమణయ్య, బుజ్జి, దాసరి కరుణాకర్, దేవ, ప్రసన్న, శ్రీకాంత్, యోహాన్, పీటర్ పాల్గొన్నారు. -
హక్కుల సాధనే లక్ష్యంగా..
ఒంగోలు సబర్బన్: ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా ఆందోళనలు చేపడుతున్నామని ఏపీ అమరావతి జేఏసీ ప్రకాశం జిల్లా కమిటీ చైర్మన్ జి.ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు మంగళవారం వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రకాశం భవన్లోని పలు విభాగాల్లో, కలెక్టరేట్లోని పలు సెక్షన్లలో పర్యటించారు. ఏపీజేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అమరావతి జేఏసీ ఉద్యమ కార్యాచరణ చేపట్టిందని, అందులో భాగంగా మొదటి రోజు కలెక్టర్ పి.రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందించామన్నారు. తదుపరి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని విధులకు హాజరు కావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా 3 వ తేదీ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొంటారని ఆంజనేయులు చెప్పారు. కార్యక్రమానికి జిల్లాలోని ఏపీజేఏసీ అమరావతి అనుబంధం సంఘాలు, ఏఐటీయూసీ, సీఐటీయూతో పాటు అన్ని ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొంటారన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిల విడుదల చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ బకాయిలను చెల్లించాలని, సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఉద్యోగి బాధ్యతగా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా కార్యదర్శి పోలయ్య, ట్రెజరర్ బాలసుబ్రమణ్య కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఊతకొలు శ్రీనివాసరావు, ప్రశాంత్, రాము, డ్రైవర్స్ జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఎలీషా, ఉమెన్ వింగ్ సెక్రటరీ ఎన్.శ్రీదేవి, లావణ్య, అనంతలక్ష్మి, హసీనా, హరిత, మీనా, మేరీ గౌరీ, సెక్రటరీ జి. శ్రీనివాసులు, కె.వెంకటేశ్వర్లు, హెడ్మాస్టర్స్ సంఘం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగులు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కోఆపరేటివ్ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు 3వ తేదీ కలెక్టరేట్లో నిరసన ఉద్యమ కార్యాచరణ ప్రారంభించామన్న ఏపీ అమరావతి జేఏసీ నాయకులు -
కరువు సీమ ధన్యం
పశ్చిమ ప్రకాశం జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టును 2005 మే నెలలో వైఎస్సార్ స్వయంగా గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల గ్యాప్ డ్యామ్ పనులతో పాటు దోర్నాల మండలం కొత్తూరు వద్ద 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు టన్నెళ్ల తవ్వకాన్ని ప్రారంభించారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల పరిధిలోని 15.20 లక్షల మందికి తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. అయితే టీడీపీ హయాంలో 2014–19 మధ్య మందగించిన ఈ పనులను, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రత్యేక చొరవతో కరోనా కష్టకాలంలోనూ శరవేగంగా నడిపించారు. మధ్యంతర రంధ్రాలు లేని ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాలను రికార్డు సమయంలో పూర్తి చేసి, 2024 మార్చి 6న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ద్వారా తండ్రి ఆశయాన్ని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ చోరీకి యత్నించి దొంగ మృతి
బల్లికురవ: జల్సాలకు అలవాటుపడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో రాగి వైరు చోరీ చేయడానికి యత్నించిన ఓ దొంగ విద్యుత్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం అర్ధరాత్రి బల్లికురవ మండలంలోని గొర్రెపాడు నుంచి కొత్తూరు వెళ్లే రోడ్డులో ఈ ఘటన జరిగింది. కొత్తూరు గ్రామానికి చెందిన తన్నీరు నరసింహారావు సులభంగా డబ్బు సంపాదించేందుకు దాదాపు 15 ఏళ్లుగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టడం, ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు దొంగిలించడమే వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే సంతమాగులూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, తాజాగా ట్రాన్స్ఫార్మర్లో రాగి వైర్లు తొలగిస్తుండగా విద్యుత్ ప్రసారమై షాక్తో మృతి చెందాడు. మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వై. నాగరాజు కేసు దర్యాప్తు చేపట్టారు. బల్లికురవ: చెల్లెల్ని అత్తగారింట దింపి బైక్పై తిరిగి వస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి వినుకొండ – కొప్పెరపాడు ఆర్అండ్బీ రోడ్డులోని గొర్రెపాడు గ్రామ సమీపంలోని వెంపరాల మేజర్ కాలువ వద్ద చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా మురికిపూడి గ్రామానికి చెందిన మేక ఆనంద్ (26).. ఉమ్మడివరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వై. నాగరాజు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ఆసుపత్రికి తరలించారు. పీసీపల్లి: మండలంలోని చిన్నవరిమడుగు గ్రామానికి చెందిన పసల శ్రీహరి (18), బుడ్డారెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కోనంకి అనూక్ మారెళ్ల చెరువు బ్రిడ్జి వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అగత నెల 23 నుంచి 31వ తేదీ వరకు కనిగిరి, ఒంగోలు, గుంటూరులోని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన శ్రీహరి సోమవారం మరణించినట్లు బంధువులు తెలిపారు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు వెంకట్రావు, కుమారి శోకసంద్రంలో మునగిపోయారు. శ్రీహరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టు గ్రామం సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న రేకుల షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగు చూసింది. తెల్లని చొక్కా, తెల్ల పంచె ధరించిన ఆ వ్యక్తి వయస్సు సుమారు 5 అడుగుల ఎత్తు, నలుపు రంగు కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ కోసం ఎస్సై సైదుబాబు దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం టౌన్: గత ఏడాది ఏప్రిల్ 4న మార్కాపురం పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో నిందితునికి 8 నెలల సాధారణ జైలుశిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ మార్కాపురం ప్రథమ శ్రేణి కోర్టు అదనపు న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు పట్టణ ఎస్సై పి.విశ్వనాథరెడ్డి తెలిపారు. గతంలో రూ.30 వేల నగదు, రూ.18 వేల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో గుడిపాటి వీరాజీ అలియాస్ వీరాంజనేయులును పోలీసులు అరెస్ట్ చేయగా, నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. -
ప్యాకేజి, ఇంటి పట్టాలు ఇవ్వాలి
ఇళ్లు ఖాళీ చేసిన ప్రభుత్వం నేటికీ ప్యాకేజి, ఇంటి పట్టాలు ఇవ్వలేదు. పునరావాస కేంద్రాల్లో ఇంటి పట్టాలు ఇస్తే సమానులు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. నా పేరుపై డబ్బులు వేయాల్సి ఉండగా వేరే వారి అకౌంట్లో జమ చేశారు. నా అకౌంట్ నంబరు వేయాల్సి ఉండగా ఒక నంబరు తేడాతో వేరే వారి ఖాతాలో డబ్బులు జమ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్యాకేజి పడలేదు. అధికారులను సంప్రదించగా త్వరలో డబ్బులు పడతాయని చెబుతున్నారు. – భూతలపాటి యోబు, సుంకేసుల గ్రామం -
చింపేస్తే ‘చిరిగిపోద్ది’!
దర్శి: ‘ఏడాదికి ఒక సారి వచ్చే పుట్టిన రోజున కూడా మా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫ్లెక్సీ కట్టకూడదా..? సంవత్సరం మొత్తం టీడీపీ ఫ్లెక్సీలే వేస్తున్నారు ఒక్కరోజు మేం ఫ్లెక్సీ వేస్తే సహించలేక మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి ఫ్లెక్సీ తీసేసేందుకు ప్రయత్నిస్తారా.. మీకు దమ్ముంటే ఫ్లెక్సీ తీయండి’ అంటూ జనసేన పార్టీకి చెందిన వారు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శి గడియారం స్తంభం సెంటర్లో మంగళవారం జరిగిన ఈ సంఘటనతో టీడీపీ, జనసేన మధ్య దర్శి నియోజకవర్గంలో విభేదాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. దర్శి గడియారం స్తంభం సెంటర్లో గతంలో టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మికి కట్టిన పాత ఫ్లెక్సీపై జనసేన పార్టీ నాయకుడు వరికూటి నాగరాజు వర్గీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమకు చెప్పకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లలచెర్వు చిన్నా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి ఆ ఫ్లెక్సీని తీసి వేయాలని టౌన్ ప్లానింగ్ అధికారిని తీసుకొచ్చారు. ఫ్లెక్సీ తొలగించబోగా జనసేన నేతలు అక్కడకు భారీగా చేరుకుని అడ్డుకున్నారు. ఈ తరుణంలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ నేతలపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తమ అనుమతి తీసుకుని ఫ్లెక్సీలు వేసుకోవాలని అనగా... మిమ్మల్ని అడిగి మేం ఫ్లెక్సీలు కట్టాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కట్టిన ఫ్లెక్సీ తీయం.. ఫ్లెక్సీ మీద చెయ్యివేస్తే స్టేట్ లెవల్లో స్పందిస్తాం అటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదు. మీరు చేస్తున్న చేష్టలపై జనసేన సెంట్రల్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారి వారి వద్దకు వచ్చి మీకు అనుమతి లేదని, అందుకే ఫ్లెక్సీ తీస్తున్నామని చెప్పగా ఆయనతో కూడా వాగ్వాదానికి దిగారు. అసలు నీ ఐడెంటిటీ చూపించు.. ఎవరు నువ్వు.. మా డిప్యూటీ సీఎం ఫ్లెక్సీ తీసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఫ్లెక్సీ తీయాలంటే మాకు నోటీసు ఇచ్చి చెయ్యి వేయండి అంటూ మండిపడ్డారు. దీంతో చేసేదేమీ లేక టౌన్ ప్లానింగ్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంటకు పైగా జరిగిన ఈ వాగ్వాదంలో జనసేన–టీడీపీ నేతల మధ్య కాసేపు తోపులాట కూడా జరిగింది. జనసేన నేతలు అక్కడకు భారీగా చేరుకునే సరికి టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత పోలీసులను కాపలా పెట్టారు. సాయంత్రం వరకు ఫ్లెక్సీని తీయలేదు. ఫ్లెక్సీలో టీడీపీ నేతల ఫొటోలు పెట్టలేదనే అక్కసుతోనే జనసేన ఫ్లెక్సీ తీసేయాలని ప్రయత్నించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఆదేశాలతోనే అధికారులు ఫ్లెక్సీలు తీసేందుకు యత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఫ్లెక్సీ’ వార్తో దర్శిలో టీడీపీ, జనసేన మధ్య రచ్చకెక్కిన విభేదాలు డిప్యూటీ సీఎం పుట్టినరోజు ఫ్లెక్సీ తొలగింపునకు టీడీపీ నేతల యత్నం మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి తొలగిస్తుండగా అడ్డుకున్న జనసేన శ్రేణులు తమ అనుమతి తీసుకోవాలంటూ హుకుం జారీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు గడియార స్తంభం సెంటర్లో గంటకు పైగా తీవ్ర ఉద్రిక్తత.. తోపులాట టీడీపీ ఇన్చార్జ్ ఆదేశాలతోనే అధికారుల హడావుడి అంటూ ఆరోపణలు -
రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం
ఒంగోలు సబర్బన్: రహదారి ప్రమాదాల నివారణ, బాధితుల ప్రాణరక్షణే ధ్యేయంగా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయాలని ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ ప్రతినిధులకు కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. మంగళవారం ఆ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తన నేతృత్వంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఎన్హెచ్ఏఐ ప్రతినిధులు, ఇతర అధికారులతో కూడిన ‘రహదారి భద్రత కమిటీ’ చేపడుతున్న చర్యలు, సాధించిన ఫలితాలను వివరించారు. రహదారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ముందుకొచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ లక్ష్యంగా సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో డీటీసీ ఆర్.సుశీల, జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’తో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజాబాబు -
పరిహారం కోసం ఎదురు చూపులు
ఇళ్లు ఖాళీ చేసి బయటికి వెళ్లినా ఇంత వరకు ప్యాకేజి వేయలేదు. నా కుమారులు జడి పెద్దసుబ్బయ్య, చిన్నసుబ్బయ్యలకు ప్యాకేజి పడింది. నాకు, నా చిన్న కుమారుడు రమేష్, కుమార్తెకు ప్యాకేజి పడలేదు. అధికారులకు ఎన్ని సార్లు కాగితాల రూపంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికారుల చుట్టూ తిరిగి కాళ్లు అరిగినవే తప్ప ప్యాకేజి వేయలేదు. ఇంటిని అద్దెకు మాట్లాడుకొని సామానులు తీసుకుపోదామనే లోపు నీటిని వదిలారు. ఇంటిలో దాదాపు రూ.2 లక్షల విలువైన సమానులున్నాయి. అవి నీటిలో మునిగిపోతాయని ఆందోళనగా ఉంది. – జడి ఎలియా, సుంకేసుల గ్రామం -
పిల్లల ప్రగతికి బాటలు వేసి...
కొనకనమిట్ల: మండలం చింతగుంట హరిజనవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వి.రమేష్ రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సెంకడరీ గ్రేడ్ టీచర్ విభాగంలో ఆయనను ఎంపిక చేశారు. 2008 డీఎస్సీ ద్వారా ఉద్యోగాన్ని పొందిన రమేష్.. ఎఫ్ఎల్ఎన్, టీఏఆర్ఎల్ వంటి వాటికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్గా పనిచేశారు. టెస్ట్ బుక్స్లో వచ్చే క్యూఆర్ కోడ్స్కి రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్గా పనిచేశారు. పిల్లల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. టీఎల్ఎం తయారీకి సంబంధించిన ట్రైనింగ్ కోసం మైసూర్ కూడా వెళ్లొచ్చారు. -
పాఠశాల ప్రగతికి పాటుపడి.. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొంది...
ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాల అంటేనే వెనుకబడిన విద్యకు చిరునామా అన్న భావనకు చెక్ పెడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా ప్రమాణాలు పెంచారు. విద్యార్థుల సంఖ్య పెంచడం నుంచి పదో తరగతి ఫలితాల వరకు పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విజయాల వెనుక ప్రధానోపాధ్యాయురాలు మువ్వ రాధిక నాయకత్వం, ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకంగా నిలిచాయి. పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలు, నమోదైన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని లీప్ యాప్ ద్వారా మువ్వ రాధికను రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. -
రోడ్డు భద్రతకు సేఫ్టీ మిర్రర్
సమాజంలో ప్రతి ఒక్కరికీ ఒక కుటుంబం ఉంటుంది. భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, అన్నా చెల్లెల్లు ఉంటారు. వారి మధ్య మమకారాలు, అనుబంధాలు ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి. కుటుంబంలో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ యజమానికో, చేతికందివచ్చిన కొడుకుకో జరగరానిది జరిగితే ఆ కుటుంబం పరిస్థితి తలకిందులవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోని కుటుంబమైతే భార్యాబిడ్డలు రోడ్డున పడతారు. రోడ్డు ప్రమాదాలలో చాలా కుటుంబాలు ఇలాగే నష్టపోతున్నాయి. ఆ విషాదం నుంచి కోలుకోలేని కుటుంబాలెన్నో ఉన్నాయి. ఒక్కొక్కరిని కదిలిస్తే చాలు.. కన్నీటి ప్రవాహాలవుతుంటారు. వారిని చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతుంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటాను. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఇటీవల అనేక చర్యలు తీసుకున్నానన్నారు ఎస్పీ హర్షవర్థన్రాజు. -
బాధ్యతలు చేపట్టిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ
ఒంగోలు సబర్బన్: జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా సీహెచ్ రాజశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో ఈఈగా పనిచేస్తున్న రాజశేఖర్ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేసుకున్న అనంతరం జిల్లా ఈఈగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని పరిస్థితులు, పర్యావరణానికి సబంధించిన అంశాలపై సమీక్షించారు. సమావేశంలో అసిస్టెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, అనలిస్టులు, తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: ప్రభుత్వ వైద్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ డి.ఏడుకొండలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రభుత్వ వైద్యులు గురువారం స్థానిక జీజీహెచ్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ 2016 జనవరి 1 నుంచి యూజీసీ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. డీపీహెచ్, డీఎస్హెచ్ వైద్యులకు డైనమిక్ సీఏఎస్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని, నాన్ క్లినికల్ విభాగంలోని ఎంఎస్సీ అర్హత కలిగిన వారిని నియమించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ వైద్యుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. వైద్యులకు న్యాయం, వైద్య వ్యవస్థ బలోపేతం, ప్రజలకు మెరుగైన వైద్యం అనే లక్ష్యంతో తామంతా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు తిరుపతిరెడ్డి, నటరాజ్, వెంకటేశ్వరరావు, మస్తాన్బాషా, రంజిత్ బాషా, రాజమ్మ, చంద్రకళ, శ్రీలత, రామస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: పీజీ కోర్సులకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలు, సిలబస్, కోర్సుల నిర్మాణం, క్రెడిట్స్, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, తదితర అంశాలపై సభ్యులు సమగ్రంగా చర్చించి ఉత్తమ పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని స్థానిక ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ) వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి ఆదేశించారు. ఏకేయూలో పీజీ కోర్సులపై గురువారం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశం నిర్వహించారు. ఈట అమృతవల్లిదేవి ప్రారంభోపన్యాసం చేయగా, ముఖ్యఅతిథిగా వీసీ ప్రొఫెసర్ మూర్తి పాల్గొని మాట్లాడారు. అనంతరం విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత ఉన్నత విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పీజీ కోర్సుల సిలబస్ రూపొందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. సభాధ్యక్షుడు, విద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ రాజమోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనా దృక్పథం, నైపుణ్యాభివృద్ధి పెంపొందించే విధంగా కోర్సులను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు సభ్యులు పలు విలువైన సూచనలు చేసి ఉన్నత పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని కోరారు. విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ మండే హర్షప్రీతం దేవ్కుమార్, పలు విభాగాల అధ్యాపకులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సీడీసీ డీన్ ప్రొఫెసర్ కేవీఎన్ రాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ సోమశేఖర, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ భారతీదేవి, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, సోషల్ వర్క్ హెచ్ఓడీ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
● రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ● ప్రమాదాలకు అవకాశం ఉన్న, తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో 300కుపైగా సేఫ్టీ మిర్రర్లు ● 16 హైవేలపై హెచ్చరిక బోర్డులు ● ప్రతిరోజూ తెల్లవారుజామున లారీ డ్రైవర్లకు ఫేస్ వాష్ ● రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆదుక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించాం. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించాం. బ్లాక్ స్పాట్లు, గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లే మార్గంలో మెయిన్ రోడ్లు, లింక్ రోడ్లు, సర్వీస్ రోడ్ల నుంచి మలుపు తిరిగే ప్రదేశాలను, టి.జంక్షన్లు, వై.జంక్షన్లు, యూటర్న్, విజిబిలిటీ తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించాం. ఈ రెండు జిల్లాలను కలుపుకుని అప్రోచ్ రోడ్లు, ప్రధాన మూలమలుపుల వద్ద 300కుపైగా కన్వెక్స్ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు) ఏర్పాటు చేశాం. దీంతో వాహనం దగ్గరకు వచ్చే వరకు చూసుకోకుండా ఢీకొట్టడం వంటివి తగ్గిపోయాయి. ఏదైనా మోటారు బైకు, ఆటోలను దూరం నుంచే గమనించి ముందుగానే జాగ్రత్త పడవచ్చు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో... శ్రీశైలం ఘాట్ రోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనడంతో తరచూ ట్రాఫిక్ జామ్ కావడం, గంటల తరబడి వాహనాలు ఆగిపోవడం జరుగుతోంది. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో 16 కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశాం. వేసవి సెలవుల్లోనే ఈ ఘాట్ రోడ్డులో సమస్యలు ఏర్పడుతున్నాయి. అద్దాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డులో ప్రమాదం జరగలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా పెద్ద సమస్యలు ఏర్పడటం నా దృష్టికి రాలేదు. ఇది మంచి పరిణామం. హెచ్చరిక బోర్డులతో అప్రమత్తం... ఉమ్మడి జిల్లాలోని హైవేలపై సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రయాణంలో వేగంగా వస్తున్న వాహనాలకు ముందుగా ఏముందో తెలియక ప్రమాదాలు అవుతుంటాయి. సూచిక బోర్డుల ద్వారా దాన్ని ముందుగానే హెచ్చరించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గించడం సాధ్యమవుతుంది. అంతేగాకుండా వేగ పరిమితి హెచ్చరికలు కూడా చేయడం వలన డ్రైవర్లు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. కన్వెక్స్ మిర్రర్లు, హెచ్చరిక బోర్డులతో పాటుగా రిఫ్లెక్టివ్ స్లిప్లను కూడా ఏర్పాటు చేశాం. డ్రైవర్లకు ఫేష్ వాష్... జిల్లాలో అతి పెద్ద జాతీయ రహదారి ఉంది. నిత్యం ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ప్రధానంకా లారీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట నిద్రపోకుండా డ్రైవింగ్ చేస్తుంటారు. దాంతో తెల్లవారుజామున చల్లగాలికి కునుకు పట్టినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న సమస్యతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిని గుర్తించి ప్రతిరోజూ తెల్లవారుజామున హైవేల వద్ద లారీ డ్రైవర్లకు చల్లటి నీటితో ఫేష్ వాష్ చేయిస్తున్నాం. పోలీసు సిబ్బంది దగ్గరుండి మరీ డ్రైవర్ల మొహం, చేతులు కడుక్కునేందుకు సహాయపడుతున్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగాం. నిరంతరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. ఒక చిన్న దురలవాటు వలన కుటుంబాలను విషాదంలో ముంచివేయడం సరికాదు కదా. అందుకే నగరంలోగానీ, జిల్లా వ్యాప్తంగాగానీ ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించాను. మందు తాగి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి రావాలని మందుబాబులను పట్టుకున్న వెంటనే కోర్టులో హాజరుపరుస్తున్నాం. గౌరవ కోర్డు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సీరియస్గా పరిగణిస్తోంది. ఈ కేసులో పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా, మరికొందరికి జైలు శిక్షలు వేయడం జరుగుతోంది. దీని ప్రభావంతో ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారు రెండోసారి ఆ తప్పు చేయడానికి భయపడిపోతున్నారు. రోడ్డు సేఫ్టీ టీంలతో తక్షణ సహాయం... రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోడానికి వివిధ శాఖలను సమన్వయం చేసి రోడ్డు సేఫ్టీ టీంలను ఏర్పాటు చేశాం. ఈ టీంలో ఉన్న శాఖలకు చెందిన బాధ్యులైన ఉద్యోగులతో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశాం. ఎక్కడైనా సరే రోడ్డు ప్రమాదం జరిగిందంటే వెంటనే సమాచారాన్ని ఆ గ్రూపులో పెడతాం. దాంతో ఎవరికి వారు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుంటారు. దీని వలన బాధితులను సకాలంలో రక్షించడమే కాకుండా అవసరమైన వారికి తక్షణ వైద్య సహాయం కూడా అందించడం జరుగుతుంది. -
మట్టి ఖర్చుల బకాయిలే రూ.22 కోట్లు..!
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు.. ప్రభుత్వం నుంచి మట్టి ఖర్చుల బకాయిలే రూ.22 కోట్ల నుంచి రూ.23 కోట్ల వరకూ ఉన్నాయని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన కోర్కెల సాధనలో భాగంగా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు ఉద్యోగుల సమస్యలపై తన గళం విప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే.. ఉద్యోగ సంఘాల మీద, ఉద్యమ నాయకుల మీద అబాంఢాలు వేస్తారా అంటూ పాలకులపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మీద నమ్మకంతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని రెండున్నర సంవత్సరాలు వేచి ఉన్నామన్నారు. కానీ పట్టించుకోకపోవడంతో రెండున్నర సంవత్సరాల తర్వాత న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గళం విప్పితే అబాంఢాలు, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ నాయకులకు ఇవేమీ కొత్త కాదన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో అనని మాటలు ఇప్పుడు అంటున్నారంటే ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చడమే పనిగా పెట్టుకున్నారని అర్థమవుతోందని మండిపడ్డారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరుతున్నామని, గొంతెమ్మ కోర్కెలు ఏమీ లేవని బొప్పరాజు అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకు సరిపోతోందనడం దుర్మార్గమైన చర్యని ఆయన అభివర్ణించారు. వచ్చే ఆదాయంలో కేవలం 37 శాతం మాత్రమే ఉద్యోగులకు ఖర్చు చేస్తున్నారని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ నివేదికలో వెల్లడించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి జీఓ కూడా విడుదల చేస్తే.. ఆ జీఓకు ఇప్పటి వరకూ అతీగతీ లేదన్నారు. ముగ్గురు మంత్రులు, 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులతో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు బయటపెట్టాలని నిలదీశారు. ఉద్యమం ఉధృతం కాకముందే డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఒక్క రూపాయి ఖర్చులేని పీఆర్సీ కమిషనర్ను ఇప్పటి వరకూ ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఐదు డీఏల బకాయి ఉందని, ఐఆర్ ఊసే లేదని అన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు కేంద్రం నుంచి 5 డీఏలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టుల చైర్మన్లకు రావాల్సిన అన్ని ఆర్థికపరమైన అంశాలు తీర్చుకుంటున్నారన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేసే ఉద్యోగులకు మాత్రం బకాయిల మీద బకాయిలు పెట్టుకుంటూ పోతున్నారని ధ్వజమెత్తారు. తాము ఉద్యోగుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని కుండబద్దలు కొట్టిమరీ చెప్పారు. 15 నుంచి వర్క్ టూ రూల్... తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు బొప్పరాజు తెలిపారు. 15వ తేదీ నుంచి వర్క్ టూ రూల్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రకటించిన కార్యాచరణ ప్రకారం తదుపరి దశల్లో మరింత ఉధృతంగా ఉద్యమం చేపడతామన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ లోపల ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు.. సీఎం సార్ మా డబ్బులు మాకు చెల్లించండి అంటూ నినాదాలు చేయడంతో కలెక్టరేట్ మార్మోగింది. కార్యక్రమంలో ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జి.ఆంజనేయులు, కార్యదర్శి పోలయ్య, బాలసుబ్రహ్మణ్యకుమార్, రాష్ట్ర నాయకులు శివకుమారిరెడ్డి, ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ చైర్పర్సన్ ఎస్.జయలక్ష్మి, కార్యదర్శి ఎస్.శ్రీదేవి, కలెక్టరేట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.సత్య శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి వైస్ ప్రెసిడెంట్ ఊతకోలు శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఉద్యోగుల అధ్యక్షుడు కే వెంకటేశ్వర్లు, జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ప్రశాంత్ నాయుడు, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. -
గురువులకు
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వీరిని పురస్కారాలతో సత్కరించనుంది. జిల్లాకు చెందిన ఆరుగురికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో విద్యాశాఖలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ● ఉమ్మడి జిల్లాలో ఆరుగురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి పురస్కారాలు ● ప్రకాశం జిల్లాలో ఇద్దరు ● మార్కాపురం జిల్లాలో నలుగురుసాక్షి నెట్వర్క్: ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు, మార్కాపురం జిల్లా నుంచి నలుగురు ఉన్నారు. ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మువ్వా రాధిక, బల్లికురవ మండలం కొప్పెరపాడు జెడ్పీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, మార్కాపురం పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మ్యాథ్స్ టీచర్ కె.వేణుగోపాల్, చింతగుంట్ల ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న ఎస్జీటీ రమేష్, హజరత్గూడెంలో పనిచేస్తున్న సరోజ, బోడపాడు ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న పీ శ్రీనివాసులు ఉన్నారు. -
వెలిగొండ ఫీడర్ కెనాల్ లీకేజీకి మరమ్మతులు
● కదిలిన అధికార యంత్రాంగం.. ● గంటవానిపల్లె వద్ద కాంక్రీట్ పనులు ప్రారంభం పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లీకేజీ వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ యంత్రాంగం స్పందించింది. పెద్దదోర్నాల మండల పరిధిలోని గంటవానిపల్లె సమీపంలో ఫీడర్ కెనాల్కు ఏర్పడిన లీకేజీలను పూడ్చేందుకు గురువారం హుటాహుటిన మరమ్మతు పనులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రాజెక్టు ప్రారంభించిన 48 గంటల్లోనే వెలిగొండ ప్రాజెక్టు కార్యాలయానికి కిలోమీటరు దూరంలో కెనాల్కు లీకేజీ ఏర్పడటం తీవ్ర కలకలం రేపింది. పనుల్లో నాణ్యత లోపించిందని స్థానికులు విమర్శించినా, అధికారులు మాత్రం ఇది కేవలం ‘నేల చెమ్మగిల్లడమే’నంటూ బుకాయించే యత్నం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ ‘సాక్షి’లో కథనం వెలువడటంతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించారు. లీకేజీ ఏర్పడిన ప్రాంతంలో కట్ట వెంబడి ప్రత్యేకంగా కాలువ తీసి, అందులో కాంక్రీట్ నింపి నీరు బయటకు రాకుండా పనులు చేపట్టారు. ప్రస్తుతం కెనాల్లో నీటి ప్రవాహం కొనసాగుతున్నందున తాత్కాలికంగా లీకేజీని అరికట్టామని, నీటి విడుదల తగ్గిన తర్వాత పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతామని అధికారులు చెప్పారు. -
జీతాలు పెంచే వరకు ఐక్య పోరాటం
● రెండో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు ఒంగోలు సబర్బన్: పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ల జీతాలు పెంచే వరకు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. 36 గంటల పాటు నిర్వహించనున్న ఆందోళనకు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్న్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కొండారెడ్డి మాట్లాడుతూ గ్రీన్్ అంబాసిడర్లకు రూ.6 వేలు, పంచాయతీ కార్మికులకు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. నెలకు రూ.6 వేలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక్క రోజు జీవించగలరా అని ప్రశ్నించారు. పంచాయతీ పారిశుధ్య కార్మికుల్లో 90 శాతం మంది నిరుపేద దళితులు పనిచేస్తున్నారని, నెలల తరబడి జీతాలు చెల్లించకుండా వారి కుటుంబాలను ఆకలి కేకల్లోకి నెట్టడమేనా దళితుల ఉద్ధరణ అని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు ఉన్న వేతన బకాయిలను యుద్ధ ప్రాతిపదికన చెల్లించి కుటుంబాలను ఆకలి బాధల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. కురిచేడు, బి.నిడమానూరులో 13 నెలలు, కల్లూరులో 24 నెలలుగా వేతనాలు చెల్లించకపోతే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. అనంతరం జేసీ కల్పనా కుమారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడి తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. కల్పన, జిల్లా ఉపాధ్యక్షులు టి. రాము, జిల్లా నాయకులు జీవీబీ కుమార్, జి. బసవపున్నయ్య, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్న్ జిల్లా ట్రెజరర్ ఏలిషా, ఎ. ఇశ్రాయేలు, తిరిపాల్, సునీత, లక్ష్మయ్య, కె.శివాజీ, బాలకోటయ్య, ఎం. దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నేతల మధ్య కొట్లాట ● పవన్కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పాటకచేరీ ● పాటకచేరీ సందర్భంగా రెండు వర్గాల మధ్య కొట్లాట ● అడ్డు వచ్చిన పోలీసులపై దౌర్జన్యం సాక్షి టాస్క్ఫోర్స్: దర్శి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పార్టీల మధ్య రాజకీయ విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. పవన్కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు పార్టీల నేతలు గొడవకు దిగారు. అయితే బుధవారం ఉదయం ఇరు పార్టీ నేతలు గొడవ పడి కొంత సేపటి తరువాత సర్దుమణిగారు. ఆ తరువాత బుధవారం రాత్రి గడియారం స్తంభం సెంటర్లో జనసేన నాయకుడు వరికూటి నాగరాజు జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పవన్కళ్యాణ్ పుట్టిన రోజు కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. ఆ తరువాత కురిచేడు రోడ్డులో ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాటకచేరీ ఏర్పాటు చేశారు. రాత్రి 11:30 గంటల సమయంలో టీడీపీ జనసేన నేతలు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో రెండు పార్టీల నేతల మధ్య మాటా మాటా పెరిగి కొట్లాడుకునే స్థాయికి వచ్చింది. పరిస్థితి విషమించడంతో ఎస్సై మత్తులో ఉన్న రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో వారు రాళ్లు తీసుకొని పోలీసులపై దాడికి దిగారు. పోలీస్ జీపుపై కూడా రాళ్లు వేసి వాహనం అద్దం పగులగొట్టారు. అయితే ఈ గొడవల్లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు ముఖ్య కారకులను వదిలేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ పెద్దల నుంచి కేసులు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.అయితే పోలీస్ జీప్ పగులగొట్టి గొడవలకు దిగిన వారిపై పోలీసులు కేసు పెడతారో లేదో వేచి చూడాల్సిందే. ఒంగోలు వన్టౌన్: వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి మహిళ మృతికి కారణమైన డ్రైవర్కు ఏడాది జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు మూడో మున్సిఫ్ మేజిస్ట్రేట్ వి.నవ్యశ్రీ గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. 2022 ఏప్రిల్ 20న ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారును నడుపుతున్న కడపకు చెందిన ఎస్ గంగాధర్ అనే వ్యక్తి ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద రోడ్డుపై వెళుతున్న జి శేషమ్మ అనే మహిళను ఢీకొట్డాడు. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితున్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితునికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
ఘన గౌరవం
మూడున్నర దశాబ్దాలుగా... బల్లికురవ: ‘నేను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటాను.. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటే ఆ పాఠశాలలోని విద్యార్థుల సాదక బాధలు తెలుస్తాయి. నేను ఎక్కడ పనిచేసినా అలాగే చేస్తాను’ అని బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికై న పి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీనివాసరావు స్వగ్రామం ఇంకొల్లు. ఈయన 1989లో ఎస్జీటీగా పామూరు మండలం చిలంకూరులో ఉద్యోగంలో చేరారు. 2000లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా తర్లుపాడులో పదోన్నతి పొందారు. అక్కడి నుంచి జే పంగులూరు మండలం బూదవాడ, కోటపాడు, ఇంకొల్లు మండలం దుద్దుకూరులో పనిచేశారు. 2021లో బల్లికురవ మండలం కొప్పెరపాడుకు ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతిపై వచ్చారు. 37 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించారు.విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా... మార్కాపురం టౌన్: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై న కే వేణుగోపాల్ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూనే సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో కూడా విద్యార్థులపై దృష్టి సారించారు. ఆయన పనిచేసిన నాగులవరం, అర్థవీడు మండలంలోని అచ్చంపేట, మార్కాపురం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు కౌసెల్, ఇన్స్పైర్, సైన్సు ఫెయిర్లో శిక్షణ ఇచ్చి ప్రదర్శనలో పాల్గొనేలా చేశారు. 10 రాష్ట్ర స్థాయి బహుమతులు సాధించారు. వేణుగోపాల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ట్రీ రీప్లాంటేషన్ ప్రదర్శన 2017లో జాతీయ స్థాయిలో ఎంపికై ంది. కథలు, కవితలు రాస్తున్న వేణుగోపాల్ విద్యార్థుల్లో మోటివేషన్ కోసం పుస్తకాలు కూడా రాశారు. నాగులవరం పాఠశాలలో పనిచేస్తూ దాతల సహకారంతో 6 లక్షల రూపాయలతో పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అధికారులు, ప్రజల మన్ననలు పొందారు.సొంత డబ్బుతో సేవ... కంభం: మండలంలోని హజరత్గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆకవీటి సరోజ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈమె 1996 నవంబర్ నెలలో తురిమెళ్ల ప్త్రెమరీ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. సాక్షి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2010లో పదోన్నతి పొంది ఎల్.కోట ఉన్నత పాఠశాలలో పనిచేశారు. ఎల్.కోట పాఠశాలలో లక్ష రూపాయలతో తెలుగు సాహితీ నిలయం ఏర్పాటు చేశారు. హజరత్గూడెంలో వంటగది, భోజనశాల, గ్రంథాలయం ఏర్పాటు, పాఠశాల, గ్రామంలో మొక్కలు పెంచడం వంటి కార్యక్రమాలను సొంత నిధులతో చేపట్టారు. -
సైనికుడిలా పాఠశాల అభివృద్ధి...
మార్కాపురం రూరల్: సైన్యంలో పనిచేసిన క్రమశిక్షణ.. ఉపాధ్యాయుడిగా విద్యార్థులపై బాధ్యత.. పాఠశాల అభివృద్ధిపై అంకితభావం.. ఇవన్నీ కలిసి బోడపాడు ఎంపీపీ పాఠశాల రూపురేఖలే మార్చేశాయి. పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు పి.శ్రీనివాసులుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. మార్కాపురం జిల్లా నుంచి సెకండ్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) విభాగంలో ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాసులు గతంలో ఆర్మీలో సేవలందించి రిటైరయ్యారు. అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి 2024లో బోడపాడు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఎస్జీటీగా విధుల్లో చేరారు. సైన్యంలో పనిచేసిన సమయంలో అలవర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావాన్ని ఉపాధ్యాయ వృత్తిలోనూ కొనసాగించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. -
పోలీసు కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం
● ఏఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు ఒంగోలు టౌన్: సర్వీసులో లేకపోయినా పోలీసు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ మరణించిన పోలీసు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరినీ ఎప్పటికీ పోలీసు కుటుంబ సభ్యులుగానే భావిస్తామని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగంధర్ బాబు అన్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తూ వివిధ కారణాలతో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది, హోంగార్డులతో గురువారం పోలీసు కళ్యాణమండపంలో సమావేశం నిర్వహించారు. వారికి అందాల్సిన సంక్షేమ, రిటైర్డ్మెంట్ ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరించారు. పెండింగ్ ఫైళ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని డీపీఓ సిబ్బందికి ఆదేశించారు. సందర్భంగా ఏఎస్పీ యుగంధర్బాబు మాట్లాడుతూ కారుణ్య నియామకాలు పొందని కుటుంబ సభ్యులకు త్వరితగతిన నియామకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆర్ఐ సీతారామిరెడ్డి, ఏఏఓ విజయ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ యాస్మిన్ బాను, వినుత తదితరులు పాల్గొన్నారు. ● వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వేసిన పూలదండలు తొలగింపు ● వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన వైఎస్సార్ అభిమానులకు బెదిరింపు ● భయాందోళన చెందుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు మర్రిపూడి: గ్రామాల్లో టీడీపీ నేతల ఆకృత్యాలకు అడ్డే లేకుండా పోయింది. అధికారం అండగా బెదిరింపులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..మండలంలోని రామాయపాలెంలో బుధవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామనికి చెందిన యర్రమోతు వెంకటేశ్వర్లు, పోకూరి కొండయ్య, మార్నేని రామకృష్ణ, జొన్నలగడ్డ సురేష్, వై సురేష్ తదితరులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు యర్రమోతు శ్రీను, పోకూరి వెంకటేశ్వర్లు, మలసాని నాగేశ్వరరావు, మలసాని సుబ్బయ్య కుమారుడు నాగేశ్వరరావులు వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహానికి ఉన్న పూలదండలు తీసివేశారు. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన వారిని ఫోన్ చేసి బెదిరించారు. దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మీకు ఎంత ధైర్యం ఉంటే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు అంటూ పరుష పదజాలంతో దూషించారు. గ్రామంలోకి వస్తే మీ సంగతి తేలుస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తారు. మార్కాపురం టౌన్: ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కడప, నెల్లూరు జిల్లాల మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా సైనికుల సంక్షేమ అధికారి గురువారం తెలిపారు. సెక్యూరిటీ విభాగంలో మొత్తం 287 ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి గల అర్హులు ఈ నెల 10న ఉదయం 6.30 గంటలకు మార్కాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూలకు అసలు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
ఫీజు కట్టి వస్తానంటూ కానరాని లోకాలకు..
● తాగునీటి చెరువులో దూకి బీటెక్ విద్యార్థి అభిలాష్ ఆత్మహత్య ● మృతుడి స్వగ్రామం చీమకుర్తి మండలం పల్లామల్లి చిలకలూరిపేట టౌన్/చీమకుర్తి రూరల్: కళాశాలలో ఫీజు కట్టి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి విగతజీవిగా తేలాడు. తాగునీటి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు గనిపినేని అభిలాష్ (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత ఏప్రిల్ వరకు చిలకలూరిపేటలోని టిడ్కో గృహాల్లో స్నేహితులతో కలిసి అద్దెకు ఉన్న అభిలాష్, ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల క్రితం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో కుటుంబంతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో కళాశాలలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించి వస్తానని ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. చెరువు గట్టుపై బ్యాగు, చెప్పులు.. చిలకలూరిపేట పట్టణ పరిధిలోని టిడ్కో గృహాల సమీపంలో తాగునీరు సరఫరా చేసే కొత్త చెరువు వద్దకు చేరుకున్న అభిలాష్.. గట్టుపై తన దుస్తులు, బ్యాగు, ఐడీ కార్డు, చెప్పులు విడిచిపెట్టి నీటిలోకి దూకాడు. బుధవారం సాగర్ జలాలతో చెరువును నింపే పనుల్లో ఉన్న సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై జి.అనిల్కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో చెరువుతో పాటు ఫిల్టర్ బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఐడీ కార్డు ఆధారంగా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. గురువారం ఉదయం నీటిపై తేలిన అభిలాష్ మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మొదటి నుంచీ చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతమాగులూరు(అద్దంకి): ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి చెందింది. ఈ సంఘటన సంతమాగులూరు పోలీస్స్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పొలాల్లో సుబాబుల్ కర్రకొట్టేందుకు చీమకుర్తి మండలం బుక్కిరెడ్డిపాలెంకు చెందిన పది మంది కూలీల కుటుంబాలు పోలీస్స్టేషన్కు సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. వీరిలో నాగరాజు కుమార్తె మేకల మంజుల(5) తల్లిదండ్రులు హైదరాబాద్లో కూలీ పనులు చేసుకంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇద్దరూ నాలుగు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ రామాంజనమ్మ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మంజుల గురువారం సాయంత్రం బహిర్భూమికి గుడిసెలకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ కాలు జరడంతో చెరువులో పడి మృతిచెందింది. ఏఎస్సై శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ● ఏపీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు ఒంగోలు సబర్బన్: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ఏపీ ఎన్జీఓ అసోసియషన్ జిల్లా అధ్యక్షుడు కె.శరత్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎన్జీఓ హోంలో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శరత్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలను ప్రారంభించి ఉద్యోగుల న్యాయమైన, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చర్చలు మాత్రమే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమన్నారు. ప్రభుత్వం ముందుకు రాకుంటే రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని, పెండింగ్లో ఉన్న 5 డీఏలను రిలీజ్ చేయాలని, డీఏ అరియర్స్ను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణా రెడ్డి, జిల్లా కోశాధికారి కె.శివకుమార్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.కృష్ణ కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులుడు ట శ్రీనివాసు, పి.రామాంజనేయులు, బి.విజయ్ కుమార్, ఆర్ దీపక్ కుమార్, కె.కోటేశ్వరమ్మ సంయుక్త కార్యదర్శులు, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కంభం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున స్థానిక హైవే రోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళితే..బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న 60 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతుని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బేస్తవారిపేట: మండలంలోని పందిళ్లపల్లె టోల్ప్లాజా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లెకు చెందిన శేఖర్, షఫీలు మోటార్సైకిల్పై కంభం వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో బొలెరో వాహనం కంభం వైపు వెళ్తుండగా వెనుక వైపున ఢీకొట్టారు. ఈ సంఘటనలో మోటార్సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో శేఖర్ తలపగిలి తీవ్రంగా గాయపడ్డాడు. షఫీకి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవేరోడ్డు అంబులెన్స్లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బేస్తవారిపేట: పాముకాటుకు మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పూసలపాడులో బుధవారం జరిగింది. బొగ్గు వెంకట లక్ష్మమ్మ(48) చిక్కుడు పంట సాగు చేస్తున్న పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లగా పాముకాటుకు గురైంది. గట్టిగా కేకలు పెట్టడంతో కుటుంబ సభ్యులు ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త చిన్న రంగయ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒంగోలు సబర్బన్: జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)గా సీహెచ్.రాజశేఖర్ నియమితులయ్యారు. తిరుపతిలో ఈఈగా పనిచేస్తున్న ఆయన్ను రాష్ట్ర హెడ్ క్వార్టర్కు బదిలీ చేశారు. రాష్ట్ర హెడ్ క్వార్టర్లో విధులు నిర్వర్తిస్తూనే ప్రకాశం జిల్లా ఈఈగా రాజశేఖర్ను కేటాయిస్తూ అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) ఉన్నతాధికారులు అప్పగించారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న విజయ మోహన్ మృతి చెందటంతో విజయవాడ రీజినల్ కార్యాలయంలో ఈఈగా పనిచేస్తున్న పి.శ్రీనివాస్ను ప్రకాశం జిల్లాకు కేటాయిస్తూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రాజశేఖర్ను కూడా ఎఫ్ఏసీ కింద కేటాయించారు. ఇప్పటి వరకూ పనిచేస్తున్న పి.శ్రీనివాస్ను తిరిగి విజయవాడ రీజినల్ కార్యాలయానికి రావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంగోలు వన్టౌన్: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాలులో బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రమేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కర్నూలులో రాష్ట్ర హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుండటం, కర్నూలు హైకోర్టు బెంచ్లో ప్రకాశం జిల్లాను కూడా కలపడంతో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలపనున్నారు. ప్రకాశం జిల్లాకు కర్నూలు దూరంలో ఉందని, అదే విజయవాడ అయితే దగ్గరగా ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లాను విజయవాడ హైకోర్టు పరిధిలోనే కొనసాగించాలనికోరుతున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. -
వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి
ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. 17వ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, రైతులు, సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్సార్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. జిల్లాలో గుండ్లకమ్మ, రామతీర్థం, వెలిగొండ వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి వైఎస్సార్ హయాంలోనే బలమైన పునాది పడిందన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో పేద ప్రజలకు అండగా నిలిచిన మహానుభావుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రతి ఇంట్లో దేవుడి పటం పక్కన వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నారంటే ఆయన చేసిన మంచి పనులేనన్నారు. ఆయన ఆశయసాధన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేసి ప్రజలకు సేవ చేస్తామన్నారు. వైఎస్సార్ బాటలోనే జగన్ పాలన.. వైఎస్సార్ ప్రజల కోసం పాదయాత్ర చేసి తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్, రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఆరోగ్యశ్రీ, 108, 104, అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, రైతుభరోసా వంటి పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. సంక్షేమం..అభివృద్ధికి పెద్దపీట: వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున తెలిపారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు సాగునీరు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను చేపట్టిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించి అనేక పనులను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. విద్య, మహిళా సంక్షేమం, రైతులు, పేదల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసిన మహానేతగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. జలయజ్ఞానికి ఆద్యుడు వైఎస్సార్.. వైఎస్ రాజశేఖర్రెడ్డి జలయజ్ఞానికి ఆద్యుడని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో అనేక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమైన పలు ప్రాజెక్టులను వైఎస్సార్ ముందుకు తీసుకెళ్లి అనుమతులు సాధించి పనులు వేగవంతం చేశారని పేర్కొన్నారు. తెలుగు నేల ఉన్నంతకాలం జలయజ్ఞ ప్రదాతగా వైఎస్సార్ పేరు నిలిచిపో తుందన్నారు. ఆయన వారసుడు వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని తెలిపారు. వెలిగొండకు వైఎస్సార్ కృషి మరువలేనిది.. జలయజ్ఞ ప్రదాతగా వైఎస్సార్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో వందేళ్ల నాటి కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకురావడంలో వైఎస్సార్ కృషి కీలకమన్నారు. ఆయన హయాంలోనే ప్రాజెక్టు పనులు గణనీయంగా ముందుకు సాగాయని, అనంతరం జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, దర్శి అసెంబ్లీ పరిశీలకుడు మాదాసి వెంకయ్య, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, చీమకుర్తి జెడ్పీటీసీ శ్రీనివాసరావు, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు పాలడుగు రాజీవ్, దేవా, సన్నీ పాల్గొన్నారు. -
కనిగిరిలో పోలీసుల అత్యుత్సాహం
కనిగిరిరూరల్: కనిగిరిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు అత్యుత్సాం ప్రదర్శించడంతో కనిగిరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కనిగిరిలో కొన్నేళ్ల నుంచి ఒకే ప్రదేశంలో పట్టణంలోని చెక్ పోస్టు సమీపంలోని దర్గా ప్రాంతంలో అన్నదాన, సేవా హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం 8 గంటలకు కనిగిరి ఎస్సై జి.సందీప్ కుమార్, ఏఎస్సై శ్రీనివాసులరెడ్డిలు పోలీస్ సిబ్బందితో వచ్చి టెంట్లు పీకేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు సంఘటనా స్థలికి చేరుకొని ఎస్సైతో మాట్లాడారు. అయితే వారితోనూ ఎస్సై దురుసుగా మాట్లాడారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులను ప్రశ్నించారు. సుమారు 16 ఏళ్లుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నామని, ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేదన్నారు. రోడ్డు మార్జిన్లో టెంట్ వేసి పేదలకు భోజనం పెడుతున్నామని, దాన్ని ఎందుకు ఇంత రాద్దాంతం ం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఎస్సై స్పందిస్తూ..తనకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయని, మా డ్యూటీ మేం చేస్తున్నామంటూ మొండిగా వాదించారు. దీన్ని దద్దాల ఖండించారు. గతంలో ఎప్పుడూ లేని ట్రాఫిక్ సమస్య ఇప్పుడు ఎందుకు వస్తోంది.. మీరు కావాలని వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎస్సైను నిలదీసిన దద్దాల ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల సందర్భంగా నడిరోడ్డుపై మున్సిపల్ కార్యాలయం ఎదురుగా టెండ్లు వేసి రోడ్లు బ్లాక్ చేశారని, ఇది మీ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కూటమి నేతలకు ఒక న్యాయం ..? మాకు ఒక న్యాయమా అని మండిపడ్డారు. కేవలం అధికార పార్టీ నేతల మెప్పు కోసమే పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో దద్దాల నారాయణ యాదవ్కు, ఎస్సైకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని ఉద్రిక్తంగా మారింది. ఎస్సై దురుసు ప్రవర్తన వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం ఏర్పాటుకు స్థానిక చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను ఎస్సై జి. సందీప్, పోలీసులు వచ్చి టెంట్లను తొలగించారు. విషయం తెలుసుకుని ముందుగా అక్కడికి చేరుకున్న పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వాకుమళ్ల రాజశేఖర్రెడ్డి దాన్ని అడిగారు. దీంతో ఎస్సై జి.సందీప్ యువజన నేతపై దురుసుగా వ్యహరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పోలీస్ జీపు ఎక్కించేందుకు బలవంతంగా వాకుమళ్ల రాజశేఖరరెడ్డిని లాక్కెళ్లారు. దీన్ని చిత్రికరీంచేందు ప్రయత్నించిన ఓ మీడియా ప్రతినిధిపై ఎస్సై, ఏఎస్సైలు దుర్భాషలాడుతూ దురుసుగా వ్యహరించారు. మీడియా ప్రతినిధినని చెప్పినా వినకుండా లెక్కలేనితనంగా వ్యవహరించారు. ఎస్సై తీరుపై మీడియా ప్రతినిధులు సైతం నిరసన తెలిపారు. ఎస్సై, పోలీసుల తీరును ప్రెస్క్లబ్ నాయకులు ధూళ్లిపాళ్ల మల్లికార్జునరావు తీవ్రంగా ఖండించారు. సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బూచేపల్లి ఎస్సై జి.సందీప్కుమార్ తీరుపై కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి సమస్యను ఎస్పీ వి హర్షవర్ధన్రాజు దృష్టికి తీసుకెళ్లి వివరించారు. విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న ఎస్పీ వెంటనే స్పందించి.. కార్యక్రమం జరుపుకునేందుకు కనిగిరి ఇన్చార్జి డీఎస్పీకి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. దీంతో ఇన్చార్జి డీఎస్పీ పి. శ్రీధర్... పార్టీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్తో మాట్లాడారు. దీంతో తిరిగి అదే ప్రదేశంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ విలేర్లతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సై జి.సందీప్ కుమార్ అధికార పార్టీ నేతలతో వత్తిడితోనే వైఎస్సార్ వర్ధంతిని అడ్డుకునేందుకు కుట్రలు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఎస్సై దురుసుగా వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికి లేదని, ఎస్సై జి.సందీప్ కుమార్ మీడియా ప్రతినిధులపై వ్యహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్కే గఫార్, జెడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్న, పార్టీ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు వాకుమళ్ల రాజశేఖర్రెడ్డి, పార్టీ మున్సిపల్ నియోజకవర్గ అధ్యక్షుడు సిరుప వెంకట గోవర్ధన్రెడ్డి, పలుకూరి భాస్కర్, దాదిరెడ్డి మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబులపై రూ.12 లక్షల జరిమానా
ఒంగోలు టౌన్: ఆగస్టు ఒక్కనెలలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 366 మందిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచామని, వారిపై కోర్టు రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. ఇద్దరు వ్యక్తులకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు వివరించారు. బుధవారం ఆయన ఆగస్టు నెల క్రైం రిపోర్టును విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం కింద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలపై మొత్తం 8,539 చలానా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దీనికి గాను రూ.42,82,910 జరిమానా విధించినట్లు వివరించారు. జిల్లాలో కోడి పందేలు, పేకాట వంటి జూదాలపై ప్రత్యేక దాడులు నిర్వహించామని, 200 మందిని అదుపులోకి తీసుకొని 37 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారినుంచి రూ.7,24,750 నగదు, 7 కోళ్లు, 19 మోటారు సైకిళ్లు, 42 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా మద్యం తాగే వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఒక్క నెలలోనే 926 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మద్యం తాగడానికి అనువుగా ఉన్న 935 ఖాళీ స్థలాలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న 143 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కోర్టులో జరిమానాలు, శిక్షలు విధించామన్నారు. గంజాయి నివారణలో భాగంగా ఒక కేసు నమోదు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తమ పరిధిలో గ్రామాలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని, దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించాలని సూచించారు. -
చెరగని జ్ఞాపకం
కాలం కదిలినా..నాగులుప్పలపాడులో గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున కొండపిలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ దర్శి వైఎస్సార్ సెంటర్లో అన్నదానం ప్రారంభిస్తున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, పక్కన వెంకాయమ్మ అద్దంకిలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న చింతలపూడి అశోక్ కుమార్ కనిగిరిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తున్న నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ‘రాజన్న’ను స్మరించుకున్నారు. పల్లె నుంచి పట్టణం వరకు వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహించారు. పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. ఆయన లేరు.. కానీ ఆయన జ్ఞాపకం ఉంది. కాలం కదిలిపోతుంది. రోజులు దొర్లిపోతున్నాయి. తరాలు మారిపోతున్నాయి. కానీ ఆయన కొన్ని జ్ఞాపకాలు మాత్రం ప్రతి గుండె గర్భంలో పదిలంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ చెరగని జ్ఞాపకం. ఆయన భౌతికంగా దూరమై పదిహేడేళ్లు గడిచినా.. ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. పేదల కన్నీటిలో ఓదార్పుగా.. ఆపన్నుల ఆశలో భరోసాగా.. ప్రతి గుండె చప్పుడులో ఓ సజీవ స్ఫూర్తిగా నేటికీ నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా ఆయనను స్మరించుకున్నారు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి కన్నీటి నివాళులర్పించారు. పేదలకు వస్త్రదానాలు, అన్నదానాలు నిర్వహించి వైఎస్సార్తో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. -
వసతి గృహం వద్ద తల్లిదండ్రుల నిరసన
గిద్దలూరు రూరల్: గిద్దలూరు పట్టణ శివారులోని ఎస్సీ బాలుర వసతి గృహంలోని విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహం వద్ద నిరసన తెలియజేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం వసతి గృహంలోని విద్యార్థులను కలిసేందుకు తల్లిదండ్రులు వచ్చిన సమయంలో వారిని కలవనివ్వకుండా గేట్లు వేసే ప్రయత్నం చేశారు. తరువాత విద్యార్థులు వారి తల్లిదండ్రులను కలిసి వసతి గృహంలో వసతులు సక్రమంగా లేవని, వార్డెన్ అందుబాటులో ఉండరని వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన చిక్కీలు, దుప్పట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. వసతి గృహంలో శుభ్రత, పరిశుభ్రత పాటించడం లేదంటూ వాపోయారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి వసతి గృహం వద్ద నిరసన తెలియజేస్తూ వారి సమస్యలు వివరించారు. ఉన్నతాధికారులు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా వారు కోరారు. ఈ విషయమై వార్డెన్ రాజేష్కు ఫోన్ చేయగా ఆయన ఫోన్లో స్పందించలేదు. -
నవోదయలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు
ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిల్లో చేరేందుకు వచ్చే విద్యా సంవత్సరానికి 2027–2028 మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలని నవోదయ విద్యా లయ ప్రిన్సిపాల్ సి.శివరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 8, 10 వ తరగతి చదువుకున్న విద్యార్థులు విద్యా సంవత్సరం 2026 –2027 వారు మాత్రమే అర్హులని, ఆన్లైన్ లో లేదా అఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అప్లికేషన్ కావాల్సిన వారు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే వివరా ల కోసం జవహర్ నవోదయ విద్యాలయ ఆఫీస్ లో సంప్రదించాలని, లేదా అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్లో చూడాలని తెలిపారు. సెప్టెంబరు 30వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. ● అందించిన జేసీ కల్పనా కుమారి ఒంగోలు సబర్బన్: పలు విభాగాల్లో అర్హత పొందిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అందజేశారు. స్థానిక ప్రకాశం భవన్లోని తన చాంబర్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో నడుపుతున్న వన్ స్టాప్ సెంటర్లోని సెంటర్ అడ్మిన్, కేసు వర్కర్లకు, బాలసదనం, శిశు గృహాల్లోని రెండు హెల్పర్ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కొత్తగా నియామకం పొందిన మహిళా అభ్యర్థులను జేసీ అభినందించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి పద్మ, సునంద, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అర్దవీడు: వెలగలపాయ లోయ గ్రామాల్లో బస్సు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాకర్ల ఆనకట్ట మీదుగా ఉన్న రహదారిపై ఆర్టీసీ బస్సులను మంగళవారం నిలిపివేయడంతో లోయ గ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వెలిగొండ జలాలు కాకర్ల డ్యాముకు రాక ముందే బస్సు సర్వీసులు నిలిపేయడం, ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఆటోలు కంభం నుంచి వెలగలపాయకు రూ.300 చార్జి వసూలు చేస్తున్నారని ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. కంభం నుంచి వయా మిట్టమీదిపల్లి, శంకరాపురం మీదుగా అడవి ప్రదేశంలో నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ రోడ్డును మాగుటూరు వరకు త్వరగా ఏర్పాటు చేసి బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని లోయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి..?
ఒంగోలు సబర్బన్: పని చేయించుకొని జీతాలు ఇవ్వకుంటే ఏ విధంగా బతకాలని గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి జీతాలు లేకుండా పనిచేయించుకోవడం న్యాయమేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు దాదాపు కొన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఈ మేరకు బుధవారం ప్రకాశం భవన్ ముందు బుధవారం గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు. రెండేళ్లుగా జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకున్నారని, జీతం లేకుండా కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు కురిచేడు, బి. నిడమనూరులో 13 నెలలు, కల్లూరులో 24 నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే కార్మికుల కుటుంబాలు ఎలా బతకాలని అన్నారు. నిత్యం పరిసరాలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆహర్నిశలు పాటుపడుతున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ అన్ స్కిల్డ్, డైలీ లేబర్కు నిర్ణయించిన కనీస వేతనం రూ.708 ఎక్కడ అమలుకావటంలేదన్నారు. ఇస్తున్న అతి తక్కువ వేతనాలు 24 నెలల వేతనబకాయిలు ఉంటే వారు కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. నిరాహార దీక్షలో ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ –వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి పి. శ్రీనావాసరావు, జిల్లా ట్రెజరర్ ఎన్. ఏలిషా, కె. శివాజీ, తిరిపాల్, ఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ప్రకాశం భవనం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ల ఆందోళన మద్దతు ప్రకటించిన సీఐటీయూ నాయకులు -
అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం
కందుకూరు: అక్రమ మద్యం అమ్మకాలపై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా సూర్య బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 88 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పట్టణ పోలీసులకు అప్పగించారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం అమ్మకాలకు సంబంధించి సమాచారం ఉంటే 112 నంబర్కు గానీ, 9121102266 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ కె.కమలాకర్, ఎస్సై సీహెచ్ చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్బాషా పాల్గొన్నారు. మద్దిపాడు: మండలంలోని నేలటూరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్సై వెంకటసూర్య సిబ్బందితో కలిసి అదపులోనికి తీసుకున్నారు. నిందితుడు శేషారెడ్డి వద్ద 23 రకాల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని నిందితున్ని అదుపులోనికి తీసుకున్నారు. ఎక్కడైనా మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. గిద్దలూరు రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్పై వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..బురుజుపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు, అతడి భార్య భారతి, రెండేళ్ల కుమార్తె లోహితతో కలిసి బైక్పై గిద్దలూరుకు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో శ్రీనివాసులుకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం నంద్యాలకు తరలించారు. ఆయన భార్య భారతి రెండు నెలల గర్భిణి. ఆమెను, కుమార్తెను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచి వైద్యసేవలను అందిస్తున్నారు. ఒంగోలు వన్టౌన్: బాలల హక్కులు, సంరక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్వీ రామకృష్ణ అన్నారు. నగరంలోని బాలసదన్న్ను బుధవారం జడ్జి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలల సంరక్షణ చట్టాలు, బాలల హక్కులు, బాలలపై జరిగే వేధింపులు గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాలలకు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, వివిధ సంక్షేమ పథకాలు గురించి విద్యార్థులకు వివరించారు. ఏదైనా చట్టపరమైన సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. జువనైల్ జస్టిస్ లీగల్ అడ్వైజర్ రత్న ప్రసాద్, బాలసదన్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి, ప్యానెల్ న్యాయవాది తదితరులు పాల్గొన్నారు. -
రేంజ్ ఆఫీసర్పై వేటు
గిద్దలూరు రూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన తురిమెళ్ల రేంజ్ ఆఫీసర్ బి.మధుప్రియాంకను అటవీ శాఖ పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరులో పనిచేస్తూ 2022 తురిమెళ్ల రెంజ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే జూలై 31న గుండకమ్మ రేంజ్ పరిధిలోని రాచర్ల బీటులో లభ్యమైన పెద్దపులి మృతదేహం కేసులో నిందితులు తురిమెళ్లరేంజి పరిధిలోని జేపీ చెరువు గ్రామానికి చెందిన వారై ఉండగా వారు పులిని వేటాడి చంపి చనిపోయిన పులిని గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోకి తీసుకువచ్చి పడేశారని అటవీశాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఆ కేసులో వేటగాళ్లు తురిమెళ్ల రేంజ్ పరిధిలో ఉన్నారని గుర్తించడంలో జాప్యం వహిస్తూ నిర్లక్ష్యం వహించించారనేది కారణం ఒకటి. కాగా గత నెల 23న రాచర్ల మండలం సంగపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు కుందేలును వేటాడి పట్టుబడగా వారి పై ఎటువంటి కేసు నమోదు చేయకుండా వదిలేయడం వంటి కారణాలతో ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోను రాచర్ల బీటులోని ఆరవీటికోట సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల విషయంలో సస్పెండ్ అయిన ఎఫ్బీఓ గఫార్తో కలిసి ఫొటోలు దిగిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి బాధ్యతారహితమైన చర్యలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ఉల్లంఘనపై తురిమెళ్ల రేంజ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
అన్నం తినలేం..టీం తాగలేం
ఒంగోలు టౌన్: బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి ఏర్పడిందని, పంచదార ధరలు పెంచడంతో కనీసం టీ తాగే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. పెరిగిన ధరలను తగ్గించాలని కోరుతూ ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరంలోని సత్యనారాయణపురంలో ఖాళీ గ్యాస్ సిలిండర్, సరుకులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ జూలై, ఆగస్టు నెలల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా 40 శాతం నుంచి 75 శాతానికి ఆమాంతం పెరిగాయన్నారు. బియ్యం, వంటనూనెలు, కందిపప్పు, ఉల్లిపాయలు పెరగడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కిలో రూ.40 ఉన్న పంచదార రూ.80లకు చేరిందని, బియ్యం రూ.1050 నుంచి రూ.1500లకు పెరిగిందన్నారు. రోజురోజుకు ధరలు ఇలా పెరిగిపోతే పేదలు ఏం తిని బతకాలని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం చేతకాని పాలకులు అరకొర సంక్షేమ పథకాలతో పేదలకు తామేదో మేలు చేస్తున్నట్లు ఫోజులు కొట్టడం సిగ్గుచేటని విమర్శించారు. దేశ సంపదను, దేశంలోని ప్రజల కష్టాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. ఆహార భద్రతా చట్టం కింద రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా నగర కార్యదర్శి జి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఎల్నినో పేరుతో నల్లబజారు వ్యాపారస్తులు ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచడం లేదని, రోజువారి కూలీలను పెంచడంలేదని, అలాంటప్పుడు చిరువ్యాపారులు, చిరుద్యోగులు ఎలా బతకాలని ప్రశ్నించారు. వర్షాభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం దేశంలో పండిన చెరుకును ఈ 20 ఆయిల్ తయారికీ తరలించి పేదల కడుపులు కొడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ నెల 7న న కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు అంజనీదేవి, రంగమ్మ, నాగేశ్వరమ్మ, రాధారాణి, శ్రీరంజనీ, పద్మ కమల, అనిత, అన్నపూర్ణ, ఈశ్వరమ్మ, నాగలక్ష్మి, జ్యోతి , ఏ.రమాదేవి పాల్గొన్నారు. పెరిగిన ధరలపై ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన -
నిద్రమత్తుకు నిండుప్రాణం బలి
టంగుటూరు: నిద్రమత్తులో ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సూరారెడ్డిపాలెం జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసులు వివరాల మేరకు..సూరారెడ్డిపాలెం వద్ద ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలోని ఒంగోలు నుంచి కందుకూరు వెళుతున్న కారు..రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కొని పోయింది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మహిళలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నడుపుతున్న కందుకూరు మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మేడికొండ హరిబాబు(50) అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి కూతుళ్లు జయమ్మ, రాణిలకు గాయాలయ్యాయి. జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చేశారు. ఎస్సై ఫణిభూషణ్ సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొన్న కారు అక్కడికక్కడే ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు సూరారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం -
వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు కోసం రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. పైగా సాంకేతికంగా ఈ ప్రాజెక్టు ఏమాత్రం ఫీజుబులిటీ కాదని చంద్రబాబు పక్కన పెట్టేశారని గుర్తుచేశారు. కానీ నేడు ఈ ప్రాజెక్టు తన ఘనతే అంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. 1996లోనే కాదు ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపనల డ్రామా ఆడిన చంద్రబాబు ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదని చెప్పారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ తర్వాత రెండుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు దీన్ని ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.2004లో డాక్టర్ వైఎస్సార్ సీఎం అయిన తర్వాత చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నరసరావుపేటలో శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్తున్న సమయంలో స్థానిక కమ్యూనిస్టు నేతలు ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టాలని కోరారని తెలిపారు. పూల సుబ్బయ్య పేరు పెడితే ఏమైనా అభ్యంతరమా? అని వైఎస్సార్ పక్కనే ఉన్న తమను అడిగారని, తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో అక్కడికక్కడే పూల సుబ్బయ్య పేరు ఈ ప్రాజెక్టుకు పెడుతున్నట్టు ప్రకటించారని వివరించారు. ఆరోజు వైఎస్సార్ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టకపోతే ఈరోజు చంద్రబాబు ప్రారంభించే పరిస్థితి వచ్చేదే కాదన్నారు. వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం కింద 2004–09 మధ్య ఈ ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టించారని, మొత్తం 37.587 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించాల్సి ఉండగా దాదాపు 20.333 కిలోమీటర్ల మేర నిర్మించారని చెప్పారు. వైఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు కేవలం 6.686 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగాలు పూర్తిచేశారని చెప్పారు. అనంతరం సీఎం అయిన వైఎస్ జగన్ మిగిలిన 10.568 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు పూర్తిచేయడమే కాకుండా డ్యామ్ పనులు కూడా చేపట్టారని తెలిపారు. సొరంగాల పనులు పూర్తిచేసిన వైఎస్ జగన్ 2024 మార్చి 6న వాటిని జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరిగాయన్నారు. ఈ ప్రాజెక్టు పేరు చెబితే ఈ ప్రాంత ప్రజలు దివంగత వైఎస్సార్తో పాటు ఆయన తనయుడు జగన్ను గుర్తుచేసుకుంటారని చెప్పారు. మాగుంట ఇంత దిగజారతాడనుకోలేదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచానికి దిగజారతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని రాజమోహన్రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రారంబోత్సవ సభలో వైఎస్ జగన్ను ఉద్దేశించి మాగుంట మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మాగుంట కుటుంబానికి రాజకీయభిక్ష పెట్టింది దివంగత వైఎస్సార్ అని గుర్తుచేశారు. వైఎస్సార్తో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మాగుంట నోటి వెంట విన్నప్పుడు ఆయన రాజకీయంగా పతనమైపోయాడేమో అనిపించిందన్నారు. మాగుంట వ్యాఖ్యలను ప్రజలు ఏమాత్రం హర్షించరని చెప్పారు. రాజకీయంగా మాగుంటకు ఇది మాయనిమచ్చగా మిగిలిపోతుందని మేకపాటి పేర్కొన్నారు. -
‘పవన్ ఫ్లెక్సీని తొలగించండి’.. టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం
సాక్షి,దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనసేన స్థానిక నాయకులు దర్శిలో ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీల ఏర్పాటును స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే వాటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులను రంగంలోకి దింపి ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. దీనిని గమనించిన జనసేన నాయకులు, కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందితో పాటు టీడీపీ నేతల యత్నాలను అడ్డుకున్నారు. -
వెలిగొండ జలాల బీభత్సం!
పెద్దారవీడు/మార్కాపురం రూరల్: వెలిగొండ టన్నెల్స్ నుంచి నల్లమల సాగర్కు నీరు విడుదల చేసిన తొలిరోజే తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నీరు విడుదల చేయడం ఐదుగురి ప్రాణాల మీదకు తెచ్చింది. వీరిలో ఇద్దరు గల్లంతవ్వగా, మిగతా ముగ్గురు చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దయనీయ పరిస్థితిలో ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేయగా.. అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. కలనూతలకు చెందిన నల్లబోతుల శ్రీనివాసులు మార్కాపురం పవర్ ఆఫీస్ వెనుక భాగంలో 3 నెలలుగా నివాసం ఉంటున్నాడు. సోమవారం మార్కాపురం పట్టణం 10వ వార్డుకు చెందిన మరో నలుగురు మిత్రులతో కలిసి వ్యాపారం నిమిత్తం కారులో అర్ధవీడు మండలం గన్నేపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెలిగొండ ప్రాజెక్టు జలాలను చూడాలన్న ఆసక్తితో కలనూతల–సుంకేసుల మార్గంలో వచ్చారు. కలనూతల దాటాక జెడ్పీ హైసూ్కల్ సమీపంలో వెలిగొండ నుంచి వదిలిన నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. వీరి ముందు వెళ్తున్న టిప్పర్ సురక్షితంగా దాటడంతో, వీరు కూడా ధైర్యం చేసి కారును ముందుకు పోనిచ్చారు. అయితే నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు ఒక్కసారిగా కొట్టుకుపోయింది.చెట్టెక్కి సెల్ఫోన్ లైట్లతో కేకలుప్రవాహంలో కొట్టుకుపోతున్న కారు సమీపంలోని చెట్టుకు బలంగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు వెంటనే తేరుకుని ప్రాణభయంతో ఆ చెట్టుపైకి ఎక్కగా, మిగతా ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం దాదాపు 100 అడుగుల వెడల్పున ఉధృతంగా ప్రవహిస్తుండటం, ఎప్పుడు ఏ క్షణాన చెట్టు కూలిపోతుందోనన్న భయంతో ముగ్గురు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. సెల్ఫోన్ టార్చ్లైట్లు వేస్తూ, కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశారు. ప్రమాద సమయంలో కలనూతల వైపు 10 మంది.. సుంకేసుల మార్గం వైపు 10 మంది స్థానికులు ఉన్నప్పటికీ, నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో వారెవరూ దగ్గరకు వెళ్లి రక్షించే సాహసం చేయలేకపోయారు. ప్రవాహం అంతకంతకూ పెరగడంతో స్థానికులు సైతం ప్రాణ భయంతో వెనక్కు పరుగులు తీశారు.అధికారుల పర్యవేక్షణ లోపంపై ఆగ్రహంట్రయల్ రన్లో భాగంగా ఆదివారం వదిలిన నీరే కలనూతల, సుంకేసుల గ్రామాలను చుట్టుముట్టగా, సోమవారం ప్రాజెక్టు నుంచి సీఎం అధికారికంగా నీటిని విడుదల చేయడంతో ఉధృతి మరింత పెరిగింది. ఇంత పెద్దఎత్తున నల్లమల సాగర్కు నీరు వదులుతున్నప్పుడు పుచ్చకాయలపల్లి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు మండిపడుతున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న జేసీ శ్రీనివాసులు, ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, పెద్దారవీడు ఎస్సై సైదుబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించారు. అర్ధరాత్రి కావడం.. నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విద్యుత్ స్తంభాలకు తాళ్లు కట్టేందుకు యత్నించి విరమించుకున్నారు. చివరకు భారీ క్రేన్తో పాటు, గజ ఈతగాళ్లను తీసుకొచ్చి ముగ్గురు వ్యక్తులను రక్షించే యత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
2028 మార్చికి వెలిగొండ పూర్తి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ 2028 మార్చి నాటికి పూర్తిచేసి మార్కాపురంలోనే కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ మొదటి దశను సీఎం స్విచ్ ఆన్చేసి కృష్ణా జలాలను నల్లమల సాగర్లోకి విడుదల చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ 1996 మార్చి 5న ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి, 2026 ఆగస్టు 31న తానే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందన్నారు. భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులందరికీ పరిహారం అందజేస్తామన్నారు. ఇప్పటి వరకూ రూ.900 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.169 కోట్లు అందిస్తామన్నారు. నీళ్లొదిలే తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి రూ.2 లక్షల ప్యాకేజీ అందిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంతా తానే చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెట్టింగ్ తరహాలో.. సీఎం చంద్రబాబు పాల్గొన్న సభ ప్రాంగణం సినిమా సెట్టింగును తలపించింది. పంచెకట్టుతో వచ్చిన ముఖ్యమంత్రికి బంజారా నృత్యంతో స్వాగతం పలకడం.. కృష్ణమ్మకు హారతి తరువాత సీఎం భూమిని తాకడం లాంటి దృశ్యాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. తొలుత పైలాన్ను ఆవిష్కరించారు. సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని భావించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 180 బస్సులు, రాష్ట్రవ్యాప్తంగా 750 బస్సుల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేసినా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో టీడీపీ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి ఆ బస్సులను కూడా మోహరించినా స్పందన కానరాలేదు.తొలుత సీఎం పర్యటన ఉదయం 10.25 గంటలకు ఉంటుందని ప్రకటించినా హాజరు పలుచగా ఉండటంతో గంట ఆలస్యంగా వచ్చారు. ఒకవైపు సీఎం సభ జరుగుతుండగానే ప్రాంగణం నుంచి ప్రజలు బయటకు వెళ్లిపోయారు. సభా ప్రాంగణానికి పలువురు కూటమి కార్యకర్తలు మద్యం తాగి చిందులు తొక్కుతూ వచ్చారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంటతోపాటు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఆనంకు అవమానం! సభలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ మాగుంటతోపాటు ఎమ్మెల్యేలు మాట్లాడగా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మాత్రం ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సభలో మాట్లాడే అవకాశం దక్కక పోవడం అవమానంగా భావించిన మంత్రి ఆనం సభా ప్రాంగణంలో ముక్తసరిగా ఉన్నారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టు పూజా సమయంలోనూ చంద్రబాబు పక్కనే ఉన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని వెనక్కు పొమ్మంటూ పలుమార్లు సంజ్ఞలు చేశారు. చివరకు ఆయన్ను వెనక్కి పంపి మరో మంత్రి నిమ్మల రామానాయుడిని ముందుకు పిలిపించుకున్నారు. చంద్రబాబు తీరుతో ఆనం మనస్తాపం చెంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. పూలు వేయకుండానే అలిగి వెళ్లిపోయిన మంత్రి ఆనం.. ఆపై జ్యోతిప్రజ్వలనకు సైతం హాజరుకాలేదు. బాబు సభలో బీజేపీ కండువాలకు నో ఎంట్రీ వెలిగొండ సభకు బీజేపీ కండువాలతో వచ్చినవారిని అనుమతించని పోలీసులు చంద్రబాబు ప్రభుత్వంపై మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి ఆగ్రహం యర్రగొండపాలెం: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడంలేదని మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారం¿ోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణంలోకి బీజేపీ కండువాలు వేసుకున్న నాయకులను పోలీసులు అనుమతించలేదని ఆమె మండిపడ్డారు. పార్టీ కండువాలతోనే తాము సభలో పాల్గొంటామని, ఎవరు ఈ నిబంధనలు పెట్టారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చంద్రబాబు సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి విజయలక్షి్మతోపాటు బీజేపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారు?
● డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ధ్వజం ఒంగోలు టౌన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ.పిచ్చయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం నిర్వహించిన డీవైఎఫ్ఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ హయాంలో నీట్ పేపర్ లీకేజీతో పాటు పలు రాష్ట్రాల్లో పరీక్ష పత్రాల లీకేజీలు జరుగుతున్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యువజన సంఘం జిల్లా కార్యదర్శి కె.ఎఫ్. బాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగే డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభల్లో నిరుద్యోగ సమస్యలపైనే ప్రధానంగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.సురేష్, కె.వంశీధర్, సీహెచ్. మోహన్, జి.శ్రీకాంత్, కె.రాణి, కార్తీక్, మురళి, దినేష్, ప్రవీణ్ పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య -
సీఎం చంద్రబాబు నోట అబద్ధాల ప్రవాహం
మార్కాపురం: వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టు సభలో మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు క్రెడిట్ను కొట్టేసేందుకు చంద్రబాబు నీచమైన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వెలిగొండకు 1996లో తానే శంకుస్థాపన చేశానని, అంతా తానే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని కేపీ నాగార్జునరెడ్డి ఎద్దేవా చేశారు. 1996 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించని మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ నిజాన్ని పక్కనబెట్టి మంత్రి నిమ్మల రామానాయుడు గంటావానిపల్లె సభలో చంద్రబాబును ఆకాశానికెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్యాప్లు, రెండు టన్నెళ్లకు భారీగా నిధులు కేటాయించి వెలిగొండ పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. మొత్తం ప్రాజెక్టు పనుల్లో 70 నుంచి 75 శాతం వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు జమానాలో కేవలం 5.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు మాత్రమే జరిగాయని వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, మిగిలిన మూడేళ్లలో రికార్డు స్థాయిలో 13 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులను పూర్తి చేశారని పేర్కొన్నారు. చరిత్ర ఇలా ఉంటే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేవలం 2 శాతం పనులే చేసిందంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నెల్లూరు వరకు వందల కిలోమీటర్ల కెనాల్స్ ఎలా పూర్తి చేశారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. టీబీఎం మిషన్ను లోపలే నిర్మూలించి సులభంగా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా, తన అనుచరులకు దోచిపెట్టేందుకే దాన్ని తీసే నెపంతో రూ.100 కోట్లు కేటాయించారని ఆరోపించారు. మాగుంట వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్ దయతో రాజకీయంగా ఎదిగి, పదవులు అనుభవించిన మాగుంటకు వైఎస్ జగన్ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. మాగుంట తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ఘనత ముమ్మాటికీ వైఎస్సార్ కుటుంబానిదే.. జగన్ చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు వైఎస్సార్ హయాంలోనే 75 శాతం పనులు పూర్తి ఎంపీ మాగుంట బేషరతుగా క్షమాపణ చెప్పాలి మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ధ్వజం -
డీఎస్పీ ఆఫీసు ఎదుట మందుబాబుల వీరంగం
● రోడ్డు పక్కన నిలిబెట్టి ఉన్న కారు అద్దాలు ధ్వంసం ● రాజీ చేసేందుకు రంగంలోకి దిగిన టీడీపీ నాయకులు ● టూ టౌన్ పోలీసు స్టేషన్లో రాజీ యత్నాలు సాక్షి టాస్క్ఫోర్స్: మద్యం మత్తులో ఉన్న యువకులు కొందరు డీఎస్పీ ఆఫీసు సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేయడం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి చెందిన ఏసీ మెకానిక్ షేక్ నజీర్ ఆర్టీసీ బస్సులో కొప్పోలు వైపు వెళ్తున్నాడు. బస్సు గేటు వద్ద నిలుచున్న నజీర్కు డీఎస్పీ ఆఫీసు దాటిన తరువాత ఒక కారు ఎదురైంది. కారు డ్రైవర్ హారన్ కొడుతుండడంతో హారన్ కొట్టొద్దని నజీర్ సైగలు చేశాడు. అయినా అతడు పట్టించుకోలేదు. దాంతో ఫ్లైఓవర్ వద్ద బస్సులోంచి దిగిన నజీర్ హారన్ కొడుతున్న కారు డ్రైవర్తో వాదన పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కారు డ్రైవర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించుకున్న నజీర్ కొత్తపట్నం బస్టాండు సెంటర్కు చేరుకొని పూటుగా మద్యం తాగాడు. తిరిగి కొప్పోలు వైపు వెళుతున్న సమయంలో డీఎస్పీ ఆఫీసుకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఒక కారు కనిపించింది. తనతో వాదన పెట్టుకున్న కారు ఇదేనని పొరబడిన నజీర్, అతడి స్నేహితుడు ఇద్దరు కలిసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఒక బ్యాంకులో ఉద్యోగం చేసే రాయపాటి బాబురావు రోడ్డుకు అవతల వైపు నివాసం ఉంటారు. ఇంటి వద్ద పార్కింగ్ లేకపోవడంతో కారును డీఎస్పీ ఆఫీసుకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన పెట్టుకున్నారు. మందుబాబుల దాడిలో కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే కమ్మపాలెంకు చెందిన ఒక టీడీపీ నాయకుడు, 8వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పోలీసు స్టేషన్కు చేరుకొని రాజీ యత్నాలు చేశారు. అయితే బాబురావు అంగీకరించకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. టూ టౌన్ పోలీసులు ఫిర్యాదును విచారిస్తున్నారు. -
మాగుంటా..స్థాయికి మించి మాట్లాడొద్దు
ఒంగోలు సిటీ: ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కావాలంటే చంద్రబాబు భజన చేయండి.. కానీ మా నాయకుడు జగన్మోహన్రెడ్డిని అవహేళనగా మాట్లాడితే సహించమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. సోమవారం బూచేపల్లి మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో వెలిగొండ పర్యటనకు సీఎం చంద్రబాబుతో పాటు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి నానా విధాలుగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందన్నారు. ‘‘అయ్యా మాగుంట శ్రీనివాసులరెడ్డి మీ స్థాయి ఏంది, జగన్మోహన్రెడ్డి స్థాయి ఏంది. స్థాయికి మించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మాగుంట శ్రీనివాసులరెడ్డి 2019 నుంచి 2024 వరకు ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారంటే జగన్మోహన్రెడ్డి అనుకుంటేనే ఎంపీ అయ్యారు. ఎంపీ సీటు కోసం జగన్ చుట్టూ తిరిగింది వాస్తవం కాదా? రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డిని దైవంగా పూజిస్తున్నారు. కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు పేదలందరి గడప గడపకూ అందాయంటే అది కేవలం జగన్మోహన్రెడ్డి పుణ్యమే. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రికి ఒక కులంవారుగానీ, ఒక మతంవారు గానీ ఓట్లు వేస్తే సీఎం కారు. అది మాగుంట శ్రీనివాసులరెడ్డి గుర్తించుకోవాలి. రాష్ట్రంలో మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్రెడ్డిని గెలిపించుకున్నారు. ఒక కులంవారు ఓట్లు వేస్తేనే గెలిచారని, జగన్మోహన్రెడ్డి మూర్ఖుడని మాట్లాడటం చాలా బాధాకరం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడం కోసం ఎన్ని కష్టాలు, నష్టాలు, విపత్తులు, కరోనాలు వచ్చినా అన్ని కులాలవారికి, అన్నీ మతాల వారికి సమన్యాయం చేశారు. జగన్మోహన్రెడ్డి 2024 లో వెలిగొండ ప్రాజెక్టు రెండు టెన్నెళ్లు పూర్తి చేసి వాటిని జాతికి అంకితం చేశారని చెప్పారుకానీ, ఎక్కడా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పలేదు. చంద్రబాబు ప్రసంగంలో కానీ, మీ ప్రసంగంలో కానీ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశామన్నారని కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారు. మీకు మా నాయకుడి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎవరినీ కించపరిచి జగన్మోహన్రెడ్డి మాట్లాడలేదు. పేదవారందరికీ ఉపయోగపడే పనులు చేశారు. మాకు కనిపించే దేవుడు జగన్మోహన్రెడ్డి. ఏ ఆపద వచ్చినా అండగా ఉండే నాయకుడు ఆయన. చంద్రబాబు లాగా వెన్నుపోటు పొడిచే నాయకుడు కాదు. మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. పబ్లిక్ గా జగన్మోహన్రెడ్డికి క్షమాపణ చెప్పాలి’’ అని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టులో 10 టీఎంసీల డెడ్ స్టోరేజీతో తాగు, సాగు నీరు ఎలా సాధ్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 10 టీఎంసీల డెడ్ స్టోరేజీ నీటితో 1 లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇలా చెప్పడం ప్రజలను భ్రమలకు గురి చేయడం, మభ్యపెట్టడం కిందకే వస్తుందన్నారు. నీటిని వ్యవసాయ భూములకు సరఫరా చేయడానికి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయని అన్నారు. తాగునీటి కుళాయిలకు పైపులైను నిర్మాణ వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు ప్రారంభ సభలో స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రకటించడం ప్రజలను మోసంచేయడమే అవుతుందన్నారు. నిర్వాసితుల ప్రజల సమస్యలు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, వెయ్యి మందికి పైగా గెజిట్లో నమోదు కానీ కుటుంబాలకు పరిహారం ఇంకా అందలేదని, దాదాపు 2 వేల మంది 18 సంవత్సరాల నిండిన యువతీ, యువకులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదని తెలిపారు. పునరావాస కాలనీల్లో గుండంచర్ల, గొట్టపడియ గ్రామ నిర్వాసితులకు పట్టాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు. అర్ధాంతరంగా, హఠాత్తుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాలను ఖాళీ చేయించారని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురై రోశమ్మ అనే మహిళ హఠాన్మరణం చెందడం ప్రభుత్వ తొందరపాటు చర్య వల్లేనని అన్నారు. గోతం రోశమ్మ ఇంటిలో ఆరుగురికి గాను ఒక్కరికి మాత్రమే ప్యాకేజీ లభించడం, మిగతా ఐదుగురికి ప్యాకేజీ దక్కుతుందో లేదో అన్న ఆందోళనలో గ్రామాలు ఖాళీ చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన గోతం రోశమ్మ హఠాన్మరణం చెందిందన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా పరిధిలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా ఎంపికై న 205 మంది అభ్యర్థులకు పాఠశాలలను కేటాయించినట్లు డీఈఓ సి.వి.రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ ఎంపికై న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు సెప్టెంబరు 1వ తేదీన వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని సూచించారు. ఆయా మండలాల్లో ఎంపికై న అభ్యర్థులకు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 2 వతేదీ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల హాజరు, విధుల వివరాలను సంబంధిత అధికారులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.బాబు నోట..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు మొదటిదశ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభా ప్రాంగణం చాలా వరకు జనం లేక ఖాళీగా ఉండటంతో ముఖ్యనేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిర్వాసితుల సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదన్న విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా పరిహారం అందని నిర్వాసితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్ధితి ఏర్పడినా తమకు రావాల్సిన పరిహారం పూర్తిగా అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం తన ప్రసంగంలో వెలిగొండ ప్రాజెక్టునంతా తానే చేసినట్టు పదే పదే చెప్పడంపై సభా ప్రాంగణానికి వచ్చిన ప్రజలు రైతులు ఆశ్చర్యపోయారు. ప్రాజెక్టు కోసం గత 30 ఏళ్లుగా పోరాడిన ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నిర్వాసితులను పక్కనపెట్టి ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. పంచకట్టుతో వచ్చిన ముఖ్యమంత్రి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడం.. సాష్టాంగ ప్రణామం చేయడం.. గిరిజన బంజారా నృత్యంతో స్వాగతం పలకడం.. రైతులతో మాట్లాడటం అంతా సినిమా సెట్టింగును తలపించిందని పలువురు బహిరంగంగానే చర్చించుకున్నారు. 1996 మార్చి 5న తానే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఇప్పుడు తానే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు చెప్పుకోవడంపై జనం మండిపడుతున్నారు. ప్రాజెక్టుకు గతంలో రూ.3581.58 కోట్ల వ్యయాన్ని మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఖర్చుపెట్టారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండను ఏటీఎంగా వాడుకున్నారు. ధరల సర్దుబాటు కింద అప్పట్లో రూ.630.57 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. టీబీఎంల మరమ్మతుల కోసం రూ.66.44 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. కాగ్ నివేదిక కూడా ఇదే వెల్లడి చేసింది. 2019–24 మధ్య కోవిడ్లోనూ వెలిగొండ పనులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరుగులెత్తించారు. ప్రతికూల పరిస్థితుల్లో, ఆర్ధిక ఇబ్బందుల్లోనూ రూ.1046.46 కోట్లు ఖర్చుచేశారు. 7225 నిర్వాసిత కుటుంబాలకు 2024 జూలై నాటికి రూ.1301.56 కోట్లతో పునరావాస ప్రణాళిక సిద్ధంచేశారు. ఇంతటి అభివృద్ధి పనులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తే అవన్నీ మర్చిపోయి వెలిగొండ ప్రాజెక్టు పనులన్నీ తానే చేసినట్టు చెప్పుకోవడం పట్ల సభా ప్రాంగణంలో రైతులు, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. జనం లేక గంట ఆలస్యం: సీఎం సభా ప్రాంగణానికి సుమారు గంట సేపు ఆలస్యంగా వచ్చారు. అప్పటికీ ప్రాంగణంలో ప్రజలు తక్కువ సంఖ్యలో ఉండటంతో టీడీపీ ముఖ్యనేతలు ఆందోళనకు గురై పోలీసులతో మాట్లాడి అన్నీ ద్వారాల నుంచి ప్రజలను లోపలికి పంపే ఏర్పాట్లు చేశారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే భోజనాలు మొదలు పెట్టడంతో ప్రాంగణంలో ఉన్న ప్రజలు భోజనాల కోసం వెళ్లిపోయారు. దీంతో నాయకులు సమావేశం ప్రాంగణంలోనికి రండి.. రండి.. అంటూ పిలిచారు. గ్రామాలకు బస్సులు ఫుల్.. జనాలు నిల్.. ముఖ్యమంత్రి సభకు జనాలను తరలించేందుకు వివిధ డిపోల నుంచి వందల సంఖ్యలో బస్సులను తెప్పించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి బస్సులు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 750 బస్సులను సీఎం సభ కోసం కేటాయించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి బస్సుల్లో ప్రజలను రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. వీటితో పాటు మార్కాపురం, ప్రకాశంజిల్లాలోని ప్రైవేటు బస్సులను సైతం కేటాయించారు. గ్రామానికి 1 లేదా 2 బస్సుల చొప్పున పంపినప్పటికీ సభకు మాత్రం అంతంతమాత్రంగానే వచ్చారు. సీఎం సభకు వచ్చే పురుషులకు క్వార్టర్ మద్యం, బిర్యానీ, అలాగే మహిళలకు రూ.300 డబ్బులు, బిర్యానీ, చీరె ఆశచూపారు. ఇదిలా ఉంటే డ్వాక్రా మహిళా సంఘాలకు మాత్రం సీఎం సభకు రాకపోతే గ్రూపుసభ్యుల నుంచి పెనాల్టీ కింద రూ.5 వేల నగదు కోత, వారికి లోన్లు మంజూరు కాకుండా చేస్తామని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. బస్సుల్లో వచ్చిన వారంతా సభా ప్రాంగణంలో ఎక్కువసేపు ఉండేందుకు ఆసక్తి చూపలేదు. భారీగా జనసమీకరణ చేసినట్టు చూపేందుకు అధికార యంత్రాంగం, కూటమి నాయకులు ప్రయత్నించినా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అవమానం: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీవ్ర అవమానం జరిగింది. పూజ సమయంలో పలుమార్లు తన పక్కన ఉన్న ఆనంను వెనక్కు వెళ్లి మంత్రి నిమ్మల రామానాయుడిని ముందుకు రమ్మని చంద్రబాబు చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురై వెనక్కు వెళ్లిపోయారు. సభలో కూడా మాట్లాడే అవకాశం రాకపోవడంతో సభా ప్రాంగణంలో ముక్తసరిగా ఉన్నారు. ఇదే సభలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ మాగుంటతోపాటు ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం సభలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో జరిగే కార్యక్రమంతో పాటు తాగు, సాగు నీరు ముఖ్యమైన ప్రాజెక్టులో తన భావాలను రైతులకు, ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించకపోవడంతో ఎడమొఖం.. పెడమొఖంగా కనిపించారు. అబద్ధాల ఊటయర్రగొండపాలెం: కూటమి నాయకుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద దోర్నాలలో మద్యం ఏరులై పారింది. సీఎం సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో జోగులాడారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వచ్చిన వారికి కూటమి నాయకులు మద్యం పంపిణీ చేశారు. దోర్నాల నుంచి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం రోడ్డులో అక్కడక్కడా తాము వచ్చిన వాహనాలను నిలిపి మద్యం తాగడం కనిపించింది. ఆయా వాహనాల్లో మహిళలు సైతం ఉన్నప్పటికీ మందు బాబులు తమ పనిని వదలిపెట్టుకోలేకపోయారు. మద్యం షాపుల వద్ద పచ్చకండువాలు కప్పుకొని మద్యం తాగారు. మత్తు ఎక్కువై అనేక మంది తెలుగు తమ్ముళ్లు సభా ప్రాంగణంలోనే పడి నేలపై పొర్లాడారు. ఎక్కడ చూసినా మందుబాబుల హల్చల్ కనిపించింది. బాబు ప్రసంగం కోసం కాదు.. వెలిగొండ కాలువ చూడటానికి చంద్రబాబు ప్రసంగించే సమయంలో వెనుదిరిగిన ప్రజలు యర్రగొండపాలెం: చంద్రబాబు ఎదుట తమ బలం నిరూపించుకోవటానికి మార్కాపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు పోటీ పడ్డారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు స్కూల్ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. సభా ప్రాంగణంలోకి వచ్చిన ప్రజలు బాబు ప్రసంగం వినకుండా వెలిగొండ కాలువ చూడటానికి పరుగులు తీశారు. సభా ప్రాంగణంలోని కుర్చీలు ఖాళీగా లేకుండా చూసేందుకు పోలీసులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాలువ వద్దకు గుంపులు గుంపులుగా వెళ్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నా వారిని లెక్కచేయకుండా బారికేడ్లు నెట్టుకుంటూ కాలువ వద్దకు చేరారు. సభా వేదిక ముందు పలు వరసల్లో ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన వారి మెడలో ఆకుపచ్చ రంగు కండువాలు కప్పి కూర్చోపెట్టారు. సభా ప్రారంభంలో రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ఊకదంపుడు ప్రసంగాలతో పాటు చంద్రబాబును ఆకాశాన్ని ఎత్తారు. ఆ ప్రసంగాలు వినే ఓపిక తమకు లేదని, తాము వచ్చింది వెలిగొండ కాలువ చూడటానికి అని అరకొరగా వచ్చిన జనం కూడా బాబు మాట్లాడుతుండగానే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ముందు భాగాన కూర్చొని ఉన్న నిర్వాసితులు మాత్రం ఎటూ వెళ్లలేక గత్యంతరంలేక కుర్చీలను అంటిపెట్టుకొని ఉండాల్సి వచ్చింది. -
అడ్డూఅదుపులేని ‘గ్రావెల్’ దందా!
ఉలవపాడు: గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోని కూటమి ప్రజాప్రతినిధులు, కీలక నేతల అండదండలతో అక్రమార్కులు సాగిస్తున్న మట్టి దోపిడీ పర్వం మూడు ట్రాక్టర్లు.. ఆరు టిప్పర్లుగా వర్ధిల్లుతోంది. మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలు గాలికొదిలేసి మట్టిని కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తున్నా, స్థానికులు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా అధికారులు శ్రీమామూళ్లశ్రీ మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వివరాల్లోకి వెళ్తే.. ఉలవపాడు, శింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య సముదాయాలు, గృహ నిర్మాణాల కోసం గ్రావెల్ను విచ్చలవిడిగా తరలిస్తున్నారు. సింగరాయకొండ మండలం శానంపూడి సమీపంలోని నీలకంఠేశ్వరస్వామి దేవాలయ మాన్యాలు, పోరంబోకు భూములతో పాటు రాజుపాలెం, భీమవరం చెరువులను జేసీబీలతో భారీగా తవ్వేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి కొల్లూరుపాడు సమీపంలోని ఓ ప్రైవేట్ భూమితో పాటు, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మరో వెంచర్కు ఏకంగా 300 ట్రిప్పులకు పైగా గ్రావెల్ను తరలించారు. ప్రభుత్వ ఖజానాకు కోట్లల్లో నష్టం అక్రమార్కులు కనీస మైనింగ్ అనుమతులు తీసుకోకుండా, ప్రభుత్వానికి నయాపైసా రాయల్టీ చెల్లించకుండా కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ను తరలిస్తున్నారు. దీంతో గనుల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ తవ్వకాలపై స్థానికులు లేదా రైతులు ప్రశ్నిస్తే శ్రీమాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయిశ్రీ అంటూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగడం రివాజుగా మారింది. అధికారుల మౌనం.. నేతల జేబుల్లోకి కమీషన్లు! రెండు మండలాల పరిధిలోని రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు కేవలం శ్రీపచ్చశ్రీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ట్రిప్పుకూ ఇంత మొత్తం అని స్థానిక నాయకుల జేబుల్లోకి లక్షల రూపాయల కమీషన్లు చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమ మైనింగ్పై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ రవాణాకు వినియోగిస్తున్న టిప్పర్లను సీజ్ చేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. సింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా దేవుడి మాన్యాలు, చెరువులను కొల్లగొడుతూ జేబులు నింపుకొంటున్న కూటమి నేతలు రాయల్టీ ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి.. నాశనమవుతున్న రహదారులు అక్రమార్కులపై చర్యలకు అధికారులు వెనుకాడటంపై విమర్శలు -
అడుగంటిన రామతీర్థం
చీమకుర్తి రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థం జలాశయంలో నీటిమట్టం అట్టడుగుకు చేరింది. చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలో ఉన్న ఈ జలాశయం నీటిపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన నెలకొంది. గత 20 ఏళ్లలో ఇలాంటి క్లిష్ట పరిస్థితిని చూడలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. రామతీర్థం జలాశయం ద్వారా ఒంగోలు బ్రాంచి కాలువ కింద 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు చీమకుర్తి, ఒంగోలు, కందుకూరు పట్టణాలకు తాగునీటి వసతి, 45 గ్రామాల్లోని చెరువులకు నీటి సరఫరా అవుతోంది. దీంతో ఈ జలాశయం ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులకు వరప్రసాదంగా నిలుస్తోంది. వరి సాగుపై ప్రభావం జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ ఏడాది వరి పంటకు నీరందించడం సాధ్యం కాదని, రైతులు వరి సాగు చేయవద్దని అధికారులు గతంలోనే సూచించారు. ప్రస్తుతం జలాశయంలో నీరు మరింతగా అడుగంటడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. వర్షాలు కురవకపోతే సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీర్చడం కూడా సవాలుగా మారే పరిస్థితి నెలకొంది. డెడ్ స్టోరేజీకి చేరువలో.. సుమారు 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రామతీర్థం జలాశయంలో ప్రస్తుతం కేవలం 0.574 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఎల్నినో ప్రభావం కొనసాగి వర్షాల జాడ లేకపోతే చెరువులు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో సాగర్ జలాలు.. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామతీర్థం జలాశయంలోకి రెండు రోజుల్లో సాగర్ జలాలు చేరనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ జలాలను అందుబాటులోకి తీసుకొచ్చి తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న తాగునీటి ఇబ్బందులకు కొంత ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. -
ప్రైవేట్ భూమిపై ‘పచ్చ’ కన్ను!
అధికార బలంతో ఆక్రమిత భూమిలో నిర్మించిన కట్టడాలు సాక్షి టాస్క్ఫోర్స్: అధికార బలంతో చట్టాలను తుంగలో తొక్కడం.. అమాయక పేదలను, ఎస్సీలను పావులుగా వాడుకుంటూ ప్రైవేట్ భూముల్లో వివాదాలు సృష్టించడం కొండపి నియోజకవర్గంలో టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. కోర్టులో విచారణలో ఉన్న స్థలాలు, ఆంక్షలు విధించిన భూములను సైతం వదలకుండా ఆక్రమణలకు తెగబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొండపి మండలం పెట్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 450 లో ఉన్న 4.40 ఎకరాల భూమిని 2010లో కల్లూరి హరిబాబు, ఆయన సోదరులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి స్వాధీనంలోనే ఉంది. అయితే 2013లో ఈ స్థలంపై వివాదం తలెత్తడంతో కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో జారీ చేసింది. 2024 జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్థానిక టీడీపీ నాయకులు తమ పెత్తనాన్ని ప్రదర్శించారు. గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులను రెచ్చగొట్టి, వారిని ముందుంచి పంట పొలంలోకి జేసీబీలను దించారు. రాత్రికి రాత్రే పొలాన్ని చదును చేసి పూరిపాకలు, నిర్మాణాలతో పాటు దుకాణాలను కూడా ఏర్పాటు చేయించారు. ఉత్తర్వులను లెక్కచేయని వైనం బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వివరాలను పరిశీలించిన కోర్టు మార్చి 2025లో ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. అప్పట్లో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 145, 107 కింద భూమిలోకి ఎవరూ ప్రవేశించరాదని, అతిక్రమిస్తే రూ.2 లక్షల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, అధికార పార్టీ నేతల అండ చూసుకుని ఆక్రమణదారులు కోర్టు ఆదేశాలను, అధికారిక ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా భూమిలోకి ప్రవేశించడమే కాకుండా, వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. పచ్చ నేతలకు విద్యుత్ శాఖ దాసోహం వివాదాస్పద భూమిలోని దుకాణాలకు అక్రమంగా విద్యుత్ మీటర్లు బిగించడంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి కనెక్షన్లను తొలగించారు. అయితే మంత్రితోపాటు ఆయన స్వగ్రామానికి చెందిన టీడీపీ కీలక నేత రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో, తొలగించిన విద్యుత్ మీటర్లను అధికారులు తిరిగి ఏర్పాటు చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమార్కులకు సహకరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని, తమ భూమిని తమకు దక్కేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమ బాట
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ ప్రకటించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కేంద్రంలో కలెక్టర్ పి.రాజాబాబుకు ఉద్యమ కార్యాచరణ నోటీసును జేఏసీ జిల్లా నాయకులు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ జి.ఆంజనేయులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించడంతో పాటు మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల కుటుంబ సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో జిల్లాలోని ప్రతి ఉద్యోగి భాగస్వామ్యమై ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా కార్యదర్శి పోలయ్య, ట్రెజరర్ బాలసుబ్రమణ్య కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఊతకోలు శ్రీనివాసరావు, ప్రశాంత్, రాము, డ్రైవర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ఎలీషా, ఉమెన్ వింగ్ సెక్రటరీ ఎన్.శ్రీదేవి, లావణ్య, అనంతలక్ష్మి, హసీనా, హరిత, మీనా, మేరీ గౌరీ, సెక్రటరీ జి.శ్రీనివాసులు, కె.వెంకటేశ్వర్లు, హెడ్మాస్టర్స్ సంఘం నేత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగులు, ఏపీఎస్ఆర్టీసీ, కోఆపరేటివ్, గ్రామ/వార్డు సచివాలయ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, మహిళా, రిటైర్డ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కలెక్టర్కు నోటీసు అందజేసిన ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ పీఆర్సీ కమిషన్ వేయడంతోపాటు ‘ఐఆర్’ ప్రకటించాలని డిమాండ్ డీఏ బకాయిలు చెల్లించాలి.. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలి ఉద్యోగుల జేఏసీ జిల్లా ఇన్చార్జ్ చైర్మన్ ఆంజనేయులు -
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు:
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు సభకు జనాలతో పాటు పలువురు విద్యార్థులు, ఉద్యోగులను కూడా తరలించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టుగా జీవోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సభకు ప్రభుత్వ జీఓతో సెలవు ప్రకటించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను ఆదివారం రాత్రే రవాణాశాఖ అధికారులు తమ ఆధీనంలోనికి తీసుకోవడంతో సదరు పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్లు సోమవారం సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్లు పంపారు.జనాల తరలింపునకు వాడిన ప్రైవేటు స్కూల్ బస్సులు -
ప్రాణం తీసిన చంద్రబాబు హడావుడి క్రెడిట్ చోరీ!
ప్రకాశం: చంద్రబాబు హడావుడి క్రెడిట్ చోరీకి ఓ నిండు ప్రాణం బలైపోయింది. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితురాలైన రోశమ్మ అనే వృద్ధురాలు.. ఊరు నుంచి బయటకు వెళ్లిన మరుక్షణం తుదిశ్వాస విడిచింది. చంద్రబాబు హడావుడి కార్యక్రమంలో భాగంగా కలనూతల గ్రామాన్ని ఖాళీ చేయించిన సందర్భంలో ప్రకాశం జిల్లా కలనూతల గ్రామానికి చెందిన రోశమ్మ కుటుంబం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కలనూతల నుంచి గొబ్బూరు వెళ్లిందా కుటుంబం. అయితే అక్కడ అద్దె ఇళ్లు దొరకలేదు. దాంతో రాత్రంతా చెట్టు కిందే జాగారం చేసింది రోశమ్మ కుటుంబం. మరొకవైపు తన కుటుంబంలోని మరో ఐదుగురి పరిహారం ఇంకా రాలేదని ఆవేదన చెందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత పొలం వదిలి ఇలా అనాథలుగా రోడ్డుపై పడిపోయామని పదే పదే కలత చెందుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఊపిరి ఆగిపోయింది. ఎక్కడైతే చెట్టు కింద ఉన్నారో అదే చెట్టు కిందే తెల్లారేసరికి ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియలు ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితుల్లో గొబ్బూరు గ్రామస్థుల సాయంతో ఆమెను అక్కడే ఖననం చేశారు.ఇదీ చదవండిసీఎం చంద్రబాబు తీరుతో మంత్రి ఆనం మనస్తాపం -
సీఎం చంద్రబాబు తీరుతో మంత్రి ఆనం మనస్తాపం
మార్కాపురం(ప్రకాశం జిల్లా): చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడి మరీ చేసిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అవమానం జరిగింది. ప్రారంభోత్సవ పూజ సమయంలో మంత్రి ఆనంని వెనక్కి వెళ్లమని చెప్పిన చంద్రబాబు.. అదే స్థానంలో మరో మంత్రి నిమ్మల రామానాయుడిని ముందుకు రమ్మన్నారు. ఆనం రామనారాయణరెడ్డిని అక్కడ ఉంచి నిమ్మలను ముందుకు పిలిచినా అది మంత్రి ఆనంకు అవమానంగా ఉండేది కాదు. కానీ ఒక మంత్రిని వెనక్కి పంపీ మరో మంత్రిని పిలవడమే చర్చనీయాంశమైంది. చంద్రబాబు పక్కనే ఉన్న మంత్రి ఆనంను పలుమార్లు వెనక్కి వెళ్లమంటూ సంజ్ఞలు చేశారు చంద్రబాబు చివరకు ఆయన్ను వెనక్కి పంపీ రామానాయుడిని ముందుకు పిలిపించుకున్నారు. చంద్రబాబు తీరుతో ఆనం మనస్తాపం చెంది అక్కడ నుండి వెళ్లిపోయారు. పూలు వెయ్యకుండానే అలిగి వెళ్లిపోయారు మంత్రి ఆనం. ఆపై జరిగిన జ్యోతి ప్రజ్వలనకు కూడా హాజరు కాలేదు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఇదీ చదవండి: తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు బాబు అబద్ధాలు..‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ -
నిర్వాసితులపై కనికరంలేని ప్రభుత్వం
యర్రగొండపాలెం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపటంలేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లు తీసేయించారని, కనీసం తాగునీరు గ్రామాల్లోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మార్కాపురం జిల్లాలోని నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ నిర్వాసితుల గోడు వర్ణనాతీతంగా ఉందని చెప్పారు. ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నా.. రెవెన్యూ, పోలీసు అధికారులు కనికరం చూపడంలేదన్నారు. నిర్వాసిత గ్రామాలైన సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల పంచాయతీల్లో నివాసితులైన వారికి ఇప్పటివరకు ఇంటి పట్టాలు ఇవ్వకుండా వారికి కేటాయించిన ప్లాట్ల నంబర్లు చెప్పకుండా, లేఅవుట్లలో రోడ్లకన్నా లోతు ఉన్న ప్లాట్లను మెరక చేయకుండా వారి జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. నిర్వాసితుల పరిస్థితి చూస్తుంటే హృదయం ద్రవిస్తోందన్నారు. గెజిట్లో పేరున్న వారికి అవార్డు పాస్ చేయకుండా, ఆయా ప్రాంతాల్లో ఉన్న 234 కుటుంబాలను అంధకారంలో నెట్టేశారని, వారు తాగేందుకు నీరు, తినటానికి తిండి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలు రోడ్లు ఎక్కి సహాయం కోసం దయనీయంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. నిర్వాసితుల ఇళ్లు, పొలాలు, ఓట్లు అక్కడే ఉన్నాయని, అటువంటప్పుడు వారు ఏ విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి అర్హులు కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. చివరిరోజు వరకు వారిని మభ్యపెట్టి మోసం చేశారన్నారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ నిబంధనల ప్రకారం తగిన సమయం ఇవ్వకుండా నిర్వాసితులను నడిరోడ్డుపైకి నెట్టడంతోపాటు సుంకేశుల ఎస్సీ కాలనీపై పార్టీ పేరుతో వివక్ష చూపి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ దక్కనివ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్ చేశారు. -
వెలిగొండ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహణ
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. సోమవారం సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆదివారం ట్రయల్ రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా సైరన్ మోగించి దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోని కొల్లంవాగు వద్దనున్న హెడ్ రెగ్యులేటర్ గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్తూరు వద్దనున్న ఉమ్మడి సొరంగాల వద్దకు 3 గంటల సమయంలో కృష్ణా జలాలు చేరాయి. అనంతరం గంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన రెగ్యులేటర్ల వద్దకు చేరిన నీటిని గంట పాటు నల్లమలసాగర్ రిజర్వాయర్ వైపునకు విడుదల చేసి ఆపై గంటవానిపల్లె వద్ద గేట్లను మూసివేశారు. అనంతరం అక్కడ నీటిని స్టోరేజి చేసి సోమవారం సీఎం చేతుల మీదుగా జలహారతికి అవసరమయ్యేలా నీటిని నిలిపి ఉంచారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్రాజు పర్యవేక్షించారు. మంత్రులు కొలను పార్ధసారథి, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, డీబీవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలోనూ ఇంకా పలువురు నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం నగదు జమకాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పరిహారం ఇస్తారంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. గొట్టిపడియ, సుంకేశుల, గుండంచెర్ల, తదితర ముంపు గ్రామాల్లో అవార్డు పొందిన వారికి కూడా పరిహారం అందలేదు. అలాగే, 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం రావాల్సి ఉంది. ముంపు గ్రామాల ప్రజలను స్వగ్రామాల నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ వేగవంతమైనప్పటికీ, అందుకు అనుగుణంగా పరిహారం చెల్లింపులు పూర్తికాకపోవడం నిర్వాసితుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఇప్పటికే అనేక కుటుంబాలు తమ ఇళ్లు, ఆస్తులు, పశువులు, జీవనోపాధిని వదిలి పునరావాస కేంద్రాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. అయితే, పరిహారం మాత్రం అందరికీ పూర్తిస్థాయిలో అందకపోవడంతో వారి భవిష్యత్తుపై అయోమయం నెలకొంది. రూ.250 కోట్లకు పైగా బకాయిలు.. ముంపు గ్రామాల నిర్వాసితులకు చెల్లించాల్సిన వివిధ రకాల పరిహారం, పునరావాస ప్యాకేజీల కింద సుమారు రూ.250 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియ ముందుకు సాగుతున్నా.. పరిహారం చెల్లింపుల్లో మాత్రం ఆ వేగం కనిపించడంలేదని నిర్వాసితులు వాపోతున్నారు. తమ చేతిలో ఉన్న ఇల్లు, భూమి పోతున్న సమయంలో పరిహారం అందకపోతే కొత్త జీవితం ఎలా ప్రారంభించాలని ప్రశి్నస్తున్నారు. అలాగే, ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీపై కూడా నిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామాలు ఖాళీ అవుతున్న వేళ కనీసం ఈ మొత్తమైనా వెంటనే ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముంపునకు గురైతే పరిహారం పరిస్థితి ఏంటి? ఇక ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసే సమయం దగ్గర పడుతుండటంతో నిర్వాసితుల్లో టెన్షన్ మరింత పెరిగింది. నీరు చేరిన తర్వాత ఇళ్లు, భూములు ముంపునకు గురైతే తమ పరిహారం పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా పరిహారం చెల్లించి, ఆ తర్వాతే గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. ‘ఊరు వదిలాం.. ఇళ్లు వదిలాం.. జీవనాధారం వదిలాం.. ఇప్పుడు పరిహారం కోసం కూడా ఎదురు చూడాలా?’ అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హామీలను తక్షణమే అమలుచేసి, పెండింగ్లో ఉన్న పరిహారాన్ని పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 18 ఏళ్లు నిండిన వారికి ప్రకటించిన రూ.2 లక్షల సాయాన్ని కూడా జమచేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. ప్యాకేజీ రాకపోతే ఇక్కడే నా చావు.. మాది వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గొట్టిపడియ. నా భర్తకు గతంలో యాక్సిడెంట్ కావడంతో మానసిక పరిస్థితి సరిగ్గాలేదు. మాకు రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చాం. అయినా ఇప్పటివరకు మా ఖాతాలో ప్యాకేజీ నగదు జమకాలేదు. ఇప్పుడు ఇల్లు ఖాళీచేసి బయటకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఇంట్లోని సామాన్లు బయటకు తీసుకొచ్చినా వాటిని పెట్టుకునేందుకు కనీసం అద్దె ఇల్లు తీసుకునే స్థోమత కూడా నాకు లేదు. ప్యాకేజీ రాకపోతే ఇక్కడే నా చావు తథ్యం. – ఇరుగుల శ్రీలక్ష్మి, గొట్టిపడియ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి.. మాది గొట్టిపడియ గ్రామం. నాకు నలుగురు ఆడపిల్లలు. ఇప్పటివరకు మాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదు. ప్రాజెక్టు కోసం మా ఊరు, ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో మా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మా నలుగురు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే అందించి ఆదుకోవాలి. – భూతపాటి రాణి, గొట్టిపడియ పంట చేతికొచ్చే వేళ ఖాళీ చేయాలంటే ఎలా!?.. వెలిగొండ ప్రాజెక్టు కింద నా పదెకరాల పొలంలో పత్తి పంట సాగుచేశా. ఇప్పటివరకు రూ.6 లక్షలు ఖర్చుచేశాను. అయితే, పొలాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని మాకెలాంటి సమాచారంగానీ, నోటీసుగానీ ఇవ్వలేదు. పంట చేతికొచ్చే సమయంలో పొలాన్ని ఖాళీ చేయాలంటే పెట్టుబడి మొత్తం నష్టపోతాం. పంట కోతకు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలి.. లేదా నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి పరిహారం ఇవ్వాలి. – రొక్కం శ్రీనివాసరెడ్డి, గొట్టిపడియ -
ప్యాకేజీ పడితేనే ఖాళీ చేస్తాం..
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎక్కడ చూసినా విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో నిర్వాసితులు ఇళ్లలోని సామగ్రిని ట్రాక్టర్లు, మినీ ట్రాలీల్లో ఎక్కించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కడసారి తమ ఇళ్లను, పరిసరాలను చూసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. ఇరుగుపొరుగు వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. ముంపు గ్రామమైన గొట్టిపడియలో ఆదివారం నాటి దృశ్యాలివీ. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఒంగోలుమార్కాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గం.9.30కు ఉండవల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి గం.10.15 కు దోర్నాల మండలం గంటంవానిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అధికారులను కలిసిన అనంతరం ఆయన అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టు నీటిని విడుదల చేసే ప్రాంతానికి వెళ్లి నీటిని విడుదల చేసి కృష్ణమ్మకు జల హారతి ఇవ్వనున్నారు. గం.11.30కు గంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడుతారు. గం.1.25కు తిరిగి హెలికాప్టర్లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. మార్కాపురం రూరల్/మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఇంకా పరిహారం అందకపోవడంతో ఆయా గ్రామాల్లో 311 కుటుంబాల వారు ఇళ్లు ఖాళీ చేయకుండా అలాగే ఉన్నారు. గొట్టిపడియలో 130 కుటుంబాలు, సుంకేశులలో 150, కలనూతలలో 41 కుటుంబాల వారు ఖాళీ చేయలేదు. తమకు ఇప్పటికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదని పరిహారం ఇస్తే తప్ప ఖాళీ చేయబోమని వారి తేల్చి చెబుతున్నారు. ప్యాకేజీ, పునరావాసంపై స్పష్టత ఇవ్వకుండా ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో పోలీసులు మైక్ ద్వారా సాయంత్రంలోగా గ్రామాన్ని ఖాళీ చేయాలని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అనంతరం సాయంత్రం సమయంలో కొంతమంది పోలీసులు గొట్టిపడియకు వెళ్లి ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక నిర్వాసితులు అయోమయానికి గురయ్యారు. విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేదు. తమకు న్యాయం జరిగేంత వరకు ఊరు వదలం అని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కొందరు నిర్వాసితులు పరిహారం పడుతుందన్న ఆశతో ఆదివారం రాత్రి మార్కాపురం కలెక్టరేట్ వద్దకు కొందరు చేరుకున్నారు. తెల్లవారితే నీళ్లొదుతారు తమ పరిస్థితి ఏమిటని వెలిగొండ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అభిషేక్ను నిలదీశారు. అధికారులు వారికి సర్దిచెప్పి పంపేశారు. -
అంబాపురంలో స్థల వివాదంలో ఘర్షణ
కొనకనమిట్ల: మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురంలో ఆదివారం జరిగిన ఘర్షణలో వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పొడతరపు గంగయ్య ఇంటి స్థలాన్ని ఆయన బంధువులైన పొడతరపు శ్రీనివాసరావు, శివయ్యలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై గంగయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఆయనకే అనుకూలంగా తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఆ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందేందుకు శ్రీనివాసరావు, శివయ్యలు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన గంగయ్య బ్యాంకు అధికారులకు అసలు వాస్తవాలను వివరించారు. దీంతో కక్ష పెంచుకున్న శివయ్య, పొడతరపు శ్రీనివాసరావు, మల్లికార్జున్, వెంకటస్వామి కలిసి పొడతరపు గంగయ్య, కట్లా చక్రవర్తి, గురువర్థన, గురవమ్మలతో గొడవపడి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నలుగురూ తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో చక్రవర్తి, గురువర్థన్ల తలలకు ఎనిమిదేసి కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనయుడు కృష్ణచైతన్య పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ మోరుబోయిన మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్రెడ్డి తదితర పార్టీ నాయకులు ఉన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి.. నలుగురికి గాయాలు బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణచైతన్య -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి సీతారామపురం: అతను కుమార్తెను బడిలో వదిలాడు. పనికి అవసరమైన సామగ్రి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే విధి చిన్నచూపు చూడటంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మండలంలోని సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మార్కాపురం జిల్లా సీఎస్ పురం మండలం నల్లమడగల ఎస్సీ కాలనీకి చెందిన గుడిగుంట్ల నారాయణ (45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నారాయణ ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన కుమార్తెను మోటార్ బైక్పై వైఎస్సార్ కడప జిల్లాకు తీసుకెళ్లి ఓ పాఠశాలలో వదిలిపెట్టాడు. తిరుగు ప్రయాణంలో అత్తగారి గ్రామమైన సాయిశెట్టిపల్లెకు వెళ్లి అక్కడున్న బేల్దారి సామగ్రిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. దారిలో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయమై మృతిచెందాడు. అటుగా వెళ్లే ప్రయాణికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
వాన కురవాలి.. పంటలు పండాలి
● వర్షాలు సకాలంలో కురవాలని పోలేరమ్మకు మొక్కులు మార్కాపురం రూరల్: సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద యాచవరం గ్రామంలో అల్లూరి పోలేరమ్మ అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేకంగా బండ్లు కట్టారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆదివారం అమ్మవారి ఆలయానికి కాలినడకన వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు ట్రాక్టర్లతో ఆలయం చూట్టూ ప్రదక్షిణలు చేశారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఒక్కటై అమ్మవారి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ముంపు గ్రామాల్లో ఇక చీకట్లు
మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నీరు గ్రామాల వైపు వచ్చేలోపే విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలను తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలంలోని కలనూతల, సుంకేసుల, గుండంచర్ల, కాటంరాజుతండా, అక్కచెరువు తండా తదితర గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ తొలగించారు. ఇప్పటికే ప్రాజెక్టు ముంపు ప్రభావంతో ఆయా గ్రామాల ప్రజలు తమ ఇళ్లు, పంట పొలాలు, పశువులు, చిరకాల అనుబంధాలను వదిలి పునరావాస కేంద్రాలు, సమీప పట్టణాలు, గ్రామాలకు తరలిపోతున్నారు. తాజాగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుండటంతో ముంపు గ్రామాల్లో సాధారణ జనజీవనం పూర్తిగా ముగిసే దశకు చేరుకుంది. 1,200 వ్యవసాయ కనెక్షన్లకు ముగింపు ముంపు గ్రామాల పరిధిలో సుమారు 1,200 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఈ వ్యవసాయ కనెక్షన్లపై ఆధారపడి సుమారు రెండు వేల ఎకరాల్లో పత్తి మిర్చి, సజ్జ జొన్న కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలో వ్యవసాయ బోర్లు, మోటార్లు, విద్యుత్ ఆధారిత సాగు వ్యవస్థలు ఉన్నాయి. గ్రామాలు ముంపునకు గురికానున్న నేపథ్యంలో వీటికి విద్యుత్ సరఫరాను నిలిపేయనున్నారు. ఇక సుమారు 1200 గృహ విద్యుత్ కనెక్షన్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇళ్లను ఖాళీ చేసే ప్రక్రియ వేగవంతం కావడంతో గృహ విద్యుత్ సరఫరాను కూడా నిలిపేయనున్నారు. దీంతో ముంపు గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్ దీపాలు కనిపించని పరిస్థితి ఏర్పడనుంది. 100 ట్రాన్స్ఫార్మర్ల తొలగింపు విద్యుత్ సరఫరా నిలిపేతతో పాటు గ్రామాల్లోని విద్యుత్ మౌలిక వసతులను కూడా తొలగిస్తున్నారు. సుమారు 40 వరకు 100 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లు, మరో 60 వరకు 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నట్లు అంచనా. మొత్తం సుమారు 100 ట్రాన్స్ఫార్మర్లను తొలగించనున్నారు. అలాగే గ్రామాల్లో ఉన్న విద్యుత్ లైన్లకు సంబంధించిన సుమారు మూడు టన్నుల వరకు వైర్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ముంపుతో విద్యుత్ పరికరాలు దెబ్బతినకుండా, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుగానే వీటిని తొలగించే చర్యలు చేపడుతున్నారు. నీటి విడుదలకు ముందే చర్యలు వెలిగొండ ప్రాజెక్టుకు నేడు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పెరిగే కొద్దీ ముంపు గ్రామాలపై ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో విద్యుత్ సరఫరాను కొనసాగించడం ప్రమాదకరంగా మారుతుంది. దీంతో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను తొలగించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ సిబ్బంది గ్రామాలకు వెళ్లి ఇల్లు ఖాళీ చేసినవారి గృహాల విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇంకా దక్కని పరిహారం: ఒకవైపు ప్రాజెక్టుకు నీటి విడుదలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా, మరోవైపు నిర్వాసితుల పరిహారం, పునరావాసం, ఉపాధి వంటి అంశాలపై ఇంకా కొన్ని కుటుంబాల్లో ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకముందే గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపేయడంపై నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ కరీంను వివరణ కోరగా ముంపు గ్రామాల్లో చివరి వ్యక్తి బయటకు వచ్చే వరకు విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని తెలిపారు. అయితే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సరఫరా నిలిపేశామన్నారు. -
క్రెడిట్ కక్కుర్తి!
ప్రచారం జాస్తి..నిజానికి 2002లో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కాపురానికి వచ్చారు. సాగునీటి కోసం ఈ ప్రాంత రైతులు, తాగునీటి కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.1448.14 కోట్లు కేటాయించారు. 2005 మే నెలలో సుంకేసుల గ్యాప్ వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. కమ్యూనిస్టులు కోరిన వెంటనే వెలిగొండకు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టారు. అప్పటి వరకు శ్రీశైలం నుంచి 3 వేల క్యూసెక్కులు తెచ్చేలా ఉన్న సింగిల్ టన్నెల్ డిజైన్ను ‘ట్విన్ టన్నెల్’గా మార్చి రోజుకు ఒక్క టీఎంసీ నీటి తెచ్చేలా పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించారు. ఆయన హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించారు. యావత్ భారతదేశం ఈ వైపు చూసేలా రెండు టన్నెళ్లు తవ్వేందుకు విదేశాల నుంచి భారీ పరికరాలు టన్నెల్ బోరింగ్ మిషన్లను తెప్పించి పనులు చేపట్టారు. 2009 ఆగస్టు నాటికే రూ.3454 కోట్ల వ్యయంతో నల్లమల సాగర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేశారు. దీంతో పాటు 20 కిలో మీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేశారు. రెండో దశలో ఉన్న కెనాల్ పనులను కొలిక్కి తెచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత పనులకు గ్రహణం పట్టింది. -
సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మూడు దశాబ్దాల కల..ప్రకాశం జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. శంకుస్థాపన పేరుతో డ్రామాలు ఆడి.. అత్తెసరు నిధులిచ్చి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన ఆయన తనదైన శైలిలో అబద్ధాలు..మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేశానంటూ క్రెడిట్ చోరీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులిచ్చి పనులు ప్రారంభిస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి పనులు వేగవంతం చేసి ప్రాణం పోశారని, టన్నెళ్లను జాతికి అంకితం చేశారని జిల్లా వాసులు గుర్తు చేసుకుంటున్నారు. -
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి
● బీటీఏ డిమాండ్ ఒంగోలు సిటీ: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించారు. బీటీఏ జిల్లా గౌరవ అధ్యక్షుడు పారాబత్తిన జాలరామయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ 55 ఏళ్ల వయస్సు దాటిన ఉపాధ్యాయులను కూడా ఇప్పుడు టెట్ రాయమనడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తోందని, టెట్ సిలబస్ కూడా చాలా అసంబద్ధంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులో కాకుండా ఇతర సబ్జెక్టుల్లో సిలబస్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఆందోళనకు గురైతే పాఠశాలలో విద్యా బోధన కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా దేవ సహాయం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని, 12వ పే కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవ్ బకాయిలు నాలుగు సంవత్సరాల నుంచి చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు డీఏలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు సానుకూలంగా పరిష్కరించని పక్షంలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏల్చూరి మాధవరావు, పల్లె కృష్ణ్ణమూర్తి, పాలేటి సువర్ణబాబు, చెక్క కోటేశ్వరరావు, కొప్పోలు కిషోర్, చిటితోటి రామకృష్ణారావు, అల్లరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
2019లో జగన్ సీఎం అయిన వెంటనే...
2019లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా పనులు ఆపకుండా 2021 నాటికే మొదటి టన్నెల్ను లైనింగ్తో సహా పూర్తి చేశారు. ఆయన హయాంలో రూ.1213 కోట్లు ఖర్చు చేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువ, ఉప కాలువలు, ఉదయగిరి ఉప కాలువ, పడమర కాలువ, టి–5 కాలువ పనులు పూర్తయ్యాయి. భూ సేకరణకు రూ.79.21 కోట్లు, పునరావాస కల్పనకు రూ.76.73 కోట్లు కేటాయించారు. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తాండ నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంట వద్ద, పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, చింతముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేసులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద, కలనూతలలో కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలను ఏర్పాటు చేశారు. ఇందులో సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, పాఠశాలలు నిర్మించారు. పునరావాస కాలనీలను కూటమి పాలకులు నిర్లక్ష్యం చేశారు. అయితే ఈ కాలనీలను కూడా తానే ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం విని నిర్వాసితులు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండో టన్నెల్ను 2024 జనవరి నాటికే పూర్తి చేశారు. వెలిగొండ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.1311 కోట్ల పరిహారం చెల్లించి, 2024 ఆగస్టు నాటికే నీళ్లు ఇవ్వాలని వైఎస్ జగన్ ప్లాన్ చేశారు. -
చెదిరిన ఊళ్లు.. చెమర్చిన కళ్లు!
● ముంచెత్తిన ‘వేదన’ కన్నీటి వరదలో ‘వెలిగొండ’ ముంపు గ్రామాలు!గొట్టిపడియ గ్రామాన్ని వీడలేక వీడుతున్న స్థానికులుసాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం రూరల్/ పెద్దారవీడు: వెలిగొండ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశామని ప్రచారం చేసుకునే తాపత్రయమే తప్ప.. నిర్వాసితులకు న్యాయం చేయాలన్న కనీస మానవతా దృక్పథం చంద్రబాబు సర్కారులో లేశమంతైనా కానరావడం లేదు. నిర్వాసితులను బెదిరించి, గ్రామాల్లో భయోత్పాతం సృష్టించేందుకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్న తీరు బాబు సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన గెజిట్లో పేర్లు ప్రచురితమైనప్పటికీ, క్షేత్రస్థాయి ప్యాకేజీ జాబితాలోకి వచ్చేసరికి పేర్లు గల్లంతు కావడం వెనుక అధికారుల తీవ్ర బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకే కుటుంబంలో కొందరికి ప్యాకేజీ మంజూరు చేసి, మిగిలిన వారికి మొండిచేయి చూపుతూ వ్యత్యాసాలకు తెరలేపారు. గతంలో అధికారులు ఫొటోలు తీసే సమయంలో పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లిన పేద రైతులు, కూలీల వివరాలను నమోదు చేయలేదు. ప్రస్తుతం వారి వద్ద ఆధార్, రేషన్ కార్డులు వంటి పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ జాబితాలో చోటు కల్పించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు సైతం పరిహారం అందకపోవడం బాబు సర్కారు నిరంకుశ వైఖరికి అద్దం పడుతోంది. గ్రామంలో ఉండగానే న్యాయం చేయని అధికారులు, ఊరు విడిచి బయటకు వెళ్లాక పరిహారం ఇస్తారని ఎలా నమ్మాలని, అప్పుడు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని బాధితులు నిలదీస్తున్నారు. ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తున్నామని ప్రచార ఆర్భాటం చేసుకోవడం కోసం అర్హులైన నిర్వాసితులకు అందాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీని నీరుగారుస్తున్నారనే అనుమానాలు బాధితుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి తాము ఎన్నడూ అడ్డు చెప్పలేదని, తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం, ఇంటి పట్టాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టులోకి నీటిని పంపాలని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి త్వరలోనే గ్రామాలకు బస్సు రాకపోకలను, నివాస విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ముంపు ప్రజలు తీవ్ర భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు భారీగా అప్పులు తెచ్చి మూడు నెలల క్రితం ఎకరాకు రూ.20 వేల ఖర్చుతో పత్తి, రూ.50 వేల పెట్టుబడితో మిరప సాగు చేశారు. గుండంచర్ల గ్రామంలో 500 ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో మిరప, కలనూతలలో 600 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో మిరప, సుంకేసులలో మరో 800 ఎకరాల్లో పత్తి, మిరపతో పాటు ఆముదం, అరటి తోటలు సాగయ్యాయి. పైర్లన్నీ పూత, పిందె, కాయ దశకు చేరుకుని చేతికొచ్చే సమయంలో గ్రామాలు ఖాళీ చేయాలంటూ ఆదేశించడంతో రైతుల గుండెలు పగిలాయి. దీనికితోడు విద్యుత్ శాఖాధికారులు వ్యవసాయ మోటార్లకు కరెంట్ తొలగించి ట్రాన్స్ఫార్మర్లను తరలించుకుపోవడంతో, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు నీరందక కళ్లముందే నిలువునా ఎండిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పచ్చటి పత్తి చేలల్లోకి గొర్రెలు, మేకలను తోలాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరువు సీమలో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు, లక్షలాది గొంతుల దాహం తీర్చేందుకు.. తమ పురిటిగడ్డను, సర్వస్వాన్నీ త్యాగం చేసిన వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల బతుకులు నేడు కన్నీటి సుడిగుండంలో చిక్కుకున్నాయి. తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని, చిన్ననాటి జ్ఞాపకాలను, రక్తమాంసాలు ధారపోసి నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాల్సిన వేళ.. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులతో అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. ఆర్అండ్ఆర్ పరిహారం పూర్తి స్థాయిలో అందించకుండా, పునరావాస కేంద్రాల్లో ఇంటి పట్టాలు కేటాయించకుండానే బాధితులను గ్రామాల్లో నుంచి బలవంతంగా గెంటేసేందుకు అధికారులు యత్నిస్తుండటం నిర్వాసితులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల, కలనూతల, సుంకేసుల తదితర ముంపు గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న హృదయవిదారక పరిస్థితులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పాలకుల రాతి గుండెలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటి పట్టాలు పూర్తిగా ఇవ్వకుండానే నిర్వాసితులపై నిర్బంధం గెజిట్లో పేర్లున్నా ప్యాకేజీ జాబితాలో గల్లంతు.. దివ్యాంగులకు అందని పరిహారం పూత, పిందె దశలో ఉన్న పత్తి, మిరప పైర్లు.. రూ.లక్షల పెట్టుబడి వృథా రూ.2 లక్షల మోటార్లు రూ.70 వేలకు, రూ.1.5 లక్షల ఎడ్లజత రూ.60 వేలకే విక్రయం ముంపు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, బస్సులు నిలిపివేత.. భారీగా పోలీసుల మోహరింపు పుట్టి పెరిగిన మట్టిని వీడలేక కన్నీటి పర్యంతమవుతున్న నిర్వాసిత కుటుంబాలు సర్వస్వం త్యాగం చేసినా బాబు సర్కారు దగా.. చేతికొచ్చిన పంటలు బూడిదపాలు నీటి విడుదల నెపంతో నిర్బంధం అర్హుల పేర్లు గెజిట్లో గల్లంతు! -
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదు
మాది గొట్టిపడియ గ్రామం. వెలిగొండ ప్రాజెక్టు కింద నాకు ఆరు ఎకరాల పొలానికి సంబంధించిన పరిహారం డబ్బులు వచ్చాయి. నాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మాత్రం ఇప్పటి వరకు అందలేదు. గెజిట్ కోసం ఫొటోలు తీసే సమయంలో మా పాప డెలివరీ కావడంతో ఆమెను హైదరాబాద్కు తీసుకెళ్లాను. ఆ సమయంలో గ్రామంలో లేకపోవడంతో గెజిట్లో ఫొటో దిగలేకపోయాను. అయితే నా వద్ద కుటుంబానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము గొట్టిపడియ గ్రామానికి చెందిన వారమని నిరూపించే పత్రాలు కూడా ఉన్నాయి. కేవలం గెజిట్ సమయంలో గ్రామంలో లేని కారణంతో మాకు రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిలిచిపోవడం చాలా బాధగా ఉంది. భూమికి పరిహారం తీసుకున్నప్పటికీ పునరావాస ప్యాకేజీ అందకపోతే ఐదుగురు పిల్లలతో ఉన్న మా కుటుంబం భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. అధికారులు మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి, వాస్తవ పరిస్థితిని గుర్తించి మాకు రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి. ప్రాజెక్టు కోసం మా భూమిని త్యాగం చేసినందుకు ప్రభుత్వం మా కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయాలని కోరుతున్నాను.– చల్లా వెంకటేశ్వర్లు, గొట్టిపడియ


