Prakasam
-
పొగాకు రైతులను విస్మరించిన కూటమి
యర్రంవారిపాలెం (కారంచేడు): ఈ ఏడాది పొగాకు సాగుచేసిన రైతన్నలను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం బాపట్ల జిల్లా కారంచేడు మండలంలోని యర్రంవారిపాలెంలో స్థానిక పొగాకు రైతులు ఆయనను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం విలేకర్లతో బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలో కొంత మేర బ్లాక్ బర్లీ, దొర పొగాకు సాగుచేశారన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గిట్టుబాటు ధరలు లేక, కొనే నాథుడు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమన్నట్లుగా జీవిస్తున్నారని తెలిపారు. పొగాకు సాగు చేసిన రైతుల్లో ఎక్కువ శాతం కౌలు రైతులేనన్నారు. వైఎస్ జగన్ స్టేట్మెంట్తో మంత్రుల బృందం హడావిడి... పొగాకు రైతుల పక్షాన పోరాడతానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అప్పటికప్పుడు ఆఘమేఘాల మీద మంత్రుల బృందం పర్యటించి హడావిడి చేసిందని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ మాటలకే పరిమితమైందని తెలిపారు. నెలవుతున్నా ఇంత వరకు పొగాకు రైతుల కన్నీరు తుడవలేకపోయారన్నారు. 89 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తే.. ఇప్పటికి కేవలం 25 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి పట్టీపట్టనట్లు దోబూచులాడుతున్నారన్నారు. మే 28వ తేదీ పొగాకు రైతులను ఆదుకునేలా పొదిలి రావాల్సిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక వర్షాల వలన రాలేకపోయారన్నారు. నాలుగైదు రోజుల్లో ఆయన వస్తారన్నారు. ఏప్రిల్ 29వ తేదీ లాం ఫాంలో వ్యవసాయ శాఖామంత్రి అచ్చన్నాయుడు 10 రోజుల్లో పొగాకు కొనుగోలు చేయిస్తానని చెప్పారని, ప్రస్తుతం నెలరోజులు దాటినా కొనుగోళ్లలో చలనం కనిపించడం లేదని విమర్శించారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడానన్న సీఎం చంద్రబాబు మాటల్లో నిజాయితీ లేదన్నారు. గత సంవత్సరం ప్రముఖ జీపీఐ పొగాకు కంపెనీ 40 నుంచి 50 వేల మిలియన్ కిలోల నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కూడా తమ ప్రతినిధులతో రైతులను పొగాకు సాగు చేయమని ప్రోత్సహించడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఐటీసీ కంపెనీ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి పోలిశెట్టి సోమసుందరం, తదితర కంపెనీల ప్రతినిధులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం అన్యాయమన్నారు. వీరంతా కుమ్మకై ్క ధరలు రాకుండా తొక్కి పట్టి రైతులను దీవాళా తీయించాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తే పొగాకు కంపెనీలన్నీ కొనుగోలు చేసినా 25 శాతం మాత్రమేనని, మిగిలిన పొగాకు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించకుండా వెంటనే బర్లీని మొత్తం కొనుగోలు చేయాలని బత్తుల డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో తడిచిన పొగాకును కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.30 వేల నుంచి రూ.36 వేల వరకు ధరలు వెచ్చించి పొగాకు కొనుగోలు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో రైతు స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లను మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. బత్తుల బ్రహ్మానందరెడ్డి వెంట యర్రం లక్ష్మారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పోలూరి శివారెడ్డి, భవనం రాజగోపాల్రెడ్డి, భవనం వెంకటేశ్వరరెడ్డి, మనుబోతు వెంకటరెడ్డి, గుదిబండి అంజిరెడ్డి, పమ్మి వెంకటరెడ్డి, స్థానిక రైతులు ఉన్నారు. పంట కొనుగోలు చేస్తామని మాటలతో సరిపెట్టారు కల్లబొల్లి కబుర్లతో రైతులను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారు ఇప్పటికై నా మద్దతు ధరకు పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
త్యాగానికి ప్రతీక.. బక్రీద్
కనిగిరి రూరల్/కంభం: ముస్లింలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ పండుగ ఒకటి. దీనినే ఈదుల్ అజహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్ హిజ్ 10వ తేదీ బక్రీద్ పండుగను ముస్లింలు నిర్వహించుకుంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజ్ తీర్థ యాత్రను కూడా ముస్లింలు ఈ నెల ప్రారంభంలోనే భక్తిప్రవత్తులతో, నియమ నిష్టలతో చేస్తారు. నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈదుల్ జుహా అనేది మనిషి త్యాగనిరతిని చాటి చెప్పే పండుగ. ఈ పండుగనే బక్రీద్ అంటారు. బక్రీద్ ఎందుకు జరుపుకుంటారంటే.. హజ్రత్ ఇబ్రహీం (సో.అ.స) వారు నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లాహ్ కనిపించి, నీకు ఆత్యంత ప్రాణమైన నీ ఎనిమిదేళ్ల వయస్సు గల కుమారుడిని నాకు (అల్లాహ్ మార్గంలో ఖుర్బాని) దేవుని పేరిట త్యాగం ఇవ్వమని కోరతారు. నిద్ర నుంచి మేల్కొన్న ఇబ్రహీం (సో.అ.స) తన కుమారుడు ఇస్మాయిల్కు ఈ విషయాన్ని తెలియజేస్తారు. దైవ భక్తుడైన ఇస్మాయిల్ తాను దైవానుసారం, దైవాజ్ఞ అమలుపరిచేందుకు సిద్ధంగా ఉన్నానని అంగీకారం తెలుపుతారు. దీంతో అల్లాహ్ ఆదేశానుసారంగా ఇబ్రహీం (సో.అ.స) తన ఏకై క పుత్రుడైన ఇస్మాయిల్ను ఖుర్బానీ ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. కలలో ఆదేశించిన సూచనల మేరకు అడవిలోని ఏకాంత ప్రదేశంలో రాతిపై ఇబ్రహీం (సొ) కుమారుడు ఇస్మాయిల్ను సమర్పించేందుకు తీసుకెళ్తారు. వెంట తల్వార్ (పదునైనా కత్తి) కూడా తీసుకెళ్తారు. ఈ క్రమంలో బాలుడు (ఇస్మాయిల్) నాన్నా.. నా మీద ఉన్న ప్రేమతో నీవు కత్తిని గొంతుపై కోయలేవు. నా మొహానికి గుడ్డ కట్టి నాపై కత్తి కోయాలని చెప్తాడు. ఆ రీతిలో కుమారుడిని ఖుర్బానీ ఇచ్చేందుకు తల్వార్ (పదునైన కత్తి)తో కుమారుడి గొంతుపై నరుకుతాడు. కానీ ఆ కత్తి తెగలేదు. ఆ సమయంలో అల్లాహ్ (దేవుడు) ఇబ్రహీం త్యాగనిరతిని ప్రశంసిస్తూ.. సంతోషిస్తూ.. ఒక్కసారిగా ఇస్మాయిల్ పడుకోబెట్టిన స్థానంలో ఒక పొట్టేలును ప్రత్యక్షం చేస్తాడు. దీంతో పొట్టేలు జువా అవుతుంది. దీంతో అల్లా దేవదూత అయిన జిబ్రయిల్ (సొ) అక్కడికి వచ్చి మీరు అల్లాహ్ పెట్టిన అగ్ని పరీక్షల్లో నెగ్గారని చెప్తారు. దీనికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగ నిర్వహించుకుంటారు. నాటి నుంచి నేటి వరకు అలాగే ప్రళయదినం రోజు దాకా బక్రీద్ పండుగ రోజు స్థితిమంతులు, ఉన్నతులు, ఆర్థిక స్థోమత ఉన్నవారు పొట్టేలు మాంసాన్ని ఖుర్బాని పేరుతో పేదలకు పంచుతారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఇచ్చే ఖుర్బానీని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒంటె, మేక, పొట్టేలును ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ చేసిన తర్వాత దాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగాన్ని పేదలకు, మరో భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకోభాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. రంజాన్ ప్రార్థనల మాదిరిగానే బక్రీద్ పండుగకు కూడా ఈద్గాల వద్ద నమాజ్ చదువుతారు. ధార్మిక ప్రసంగం (ఖుద్బా) తర్వాత ఈద్గా నమాజ్ జరుగుతుంది. బక్రీద్ నమాజ్ను ఈద్గా లేదా మసీదులో సామూహిక (జమాత్తో) ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహిస్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు నిర్వహించే ప్రార్థనలకు ఈద్గా మైదానాలతో పాటు మసీదులు ముస్తాబయ్యాయి. ప్రార్థనలకు వెళ్లేవారు తమ ఇళ్ల వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరి ఈద్గా మైదానాలలో ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈద్గా వద్దకు వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు, ఇతరుల కోసం మసీదుల్లో ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఈద్గాలో నమాజులు ప్రారంభమవుతాయని, ఆలోపు అందరూ అక్కడికి చేరుకోవాలని కమిటీ పెద్దలు తెలిపారు. నేడు భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకునేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్లు ముస్తాబైన మసీదులు త్యాగనిరతిని చాటి చెప్పే పండుగ... ఈద్గా వద్ద నమాజ్... మూడు భాగాలుగా విభజించి... కనిగిరిలో రెండు చోట్ల... కనిగిరిలో రెండు చోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు సమయాన్ని, ప్రదేశాలను ఇప్పటికే ప్రకటించారు. మసీద్ ఏ అలీ పాత 4వ వార్డు ప్రస్తుత 8వ వార్డులో మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ ఇంటి సమీపంలోని మసీద్లో ఉదయం 7 గంటలకు బక్రీద్ పండుగ ప్రత్యేక బయాన్, 7.30 గంటలకు ప్రత్యేక నమాజ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వృద్ధులు, ఆరోగ్యం బాగా లేని వారు, నడవలేని వారు ఇక్కడ నమాజ్ చదువుకుంటారు. అలాగే, కనిగిరి పెద్ద చెరువు వద్ద గల ప్రత్యేక ప్రార్థనా స్థలంలో (ఈద్గా వద్ద) ఉదయం 9 గంటలకు బయాన్, అనంతరం 9.30 గంటలకు ప్రత్యేక నమాజ్ జరుగుతుందని ముస్లిం పెద్దలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమైన మసీదులు, ఈద్గాలు... -
రోజు రోజుకూ పొగాకు ధరలు దిగజారుతున్నాయి
● ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ఒంగోలు సిటీ: పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజు రోజుకీ ధరలు దిగజారుతున్నాయని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రాన్ని శుక్రవారం చుండూరి రవిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోగ్రేడ్ను రూ.180 లకు కొనేటప్పుడు బేళ్లు వెనక్కు వెళుతున్నాయనీ, రూ.240 పెట్టి కొనేటప్పుడు కూడా వెనక్కి పంపిస్తున్నారన్నారు. కూలీ రైతులు, కౌలు రైతులు, నోరులేని రైతులు అయ్యేసరికి కంపెనీలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. వాస్తవానికి ఆర్డర్లు వచ్చాయి కాబట్టే పొగాకును కొనుగోలు చేస్తున్నారనీ, ఆర్డర్లు రాలేదని చెప్పడం అవాస్తమన్నారు. మే నెల మొదటి వారంలోనే ఆర్డర్లు వచ్చాయనీ, ఇప్పటికీ ఆర్డర్లు రాలేదని చెప్పడం అబద్ధమన్నారు. గత సంవత్సరం పొగాకు ధరలు బాగా ఉన్నాయని, ఈ సంవత్సరం వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ ధరకు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. బోర్డు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. బోర్డు అధికారులే రైతులకు ఇంకా ధర తగ్గిపోతుందని అని చెప్పడం దారుణమన్నారు. రైతులను చైతన్య పరిచాల్సిన వారే ఇంకా రేటు తగ్గుతుందని చెబుతూ వారి కమీషన్ వారు తీసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మీరు ఒత్తిడి చేయండి కంపెనీలు భయపడతాయి అని చెప్పాల్సిన వారే కంపెనీ తరఫున వకాల్తా పుచ్చుకుని అమ్ముకోండి ఇంకా రేట్లు తగ్గుతాయని రైతుల ఆశలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. వారికి వచ్చే కమీషన్ కోసం ఒత్తిడి పెడుతూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఫ్లోర్లలో ఉండే రైతు నాయకులు, వారి అనుయాయుల బేళ్లు కంపెనీలకు చెప్పి అమ్మించుకుంటూ నోరు లేని రైతులకు సహాయం చేయకుండా వారికి అండగా నిలబడకుండా ఉంటున్నారని విమర్శించారు. రైతుల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. రైతుల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరతో కొనిపిస్తేనే రైతులు నష్టాల నుంచి బయటపడతారని, లేకపోతే ఆత్మహత్యల పాలవుతారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మన జిల్లాలో నష్టపోయి ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం రైతాంగం ఓర్పుగా పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. చుండూరి వెంట ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. -
మూల్యాంకనంలో తప్పులు లోకేష్ పుణ్యమే
ఒంగోలు సిటీ: పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో వేలాది మంది విద్యార్థుల మార్కులు తప్పుగా రావడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుణ్యమేనని, ఆ తప్పిదానికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు డీఈఓ కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం ముట్టడించారు. డీఈఓ కిరణ్కుమార్కు పదో తరగతి పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుగ్గిరాల నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ మీద పెట్టి శ్రద్ధ విద్యారంగం మీద చూపించడం లేదని విమర్శించారు. కూటమి పాలనలో విద్యార్థుల భవిష్యత్ను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ మీద తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. ఏడాది పాటు కష్టపడి చదివి మంచిమార్కులు సాధించినా మూల్యాంకనంలో జరిగిన తప్పుల వల్ల ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను కోల్పోయారని చెప్పారు. త్రిపుల్ఐటీకి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల సీటు రాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మూల్యాంకనం తప్పిదాల వలన ట్రిపుల్ఐటీ సీట్లు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా అడ్మిషన్లు నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీతో పాటు గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు లభించక అన్యాయమైన విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఎలాంటి రుసుం లేకుండా ప్రతి విద్యార్థికి చెందిన జవాబు పత్రాలను సక్రమంగా రీవాల్యుయేషన్ చేయాలని, తుది ఫలితాలు విడుదల చేసేంత వరకు పదో తరగతి మార్కుల ఆధారంగా నిర్వహిస్తున్న వివిధ విద్యా సంస్థల అడ్మిషన్లను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మూల్యాంకనంలో చేసిన తప్పులకు బాధ్యులైన ఉన్నతాధికారులపైన, విద్యామంత్రి లోకేష్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ బాధ్యులైన అందరిపైనా చర్యలు చేపట్టాలని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన తమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిపై గంజాయి కేసు పెట్టి జైల్లో పెట్టారని, ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఇటువంటి బెదిరింపులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం భయపడదని, పోరాటం ఇంకా ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ నారాయణ రెడ్డి, మహేంద్ర రెడ్డి, వేముల శ్రీకాంత్, ఖాదర్ బాషా, సాయి, దావీదు, విక్రమ్, వాసు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ తప్పిదాన్ని ప్రశ్నించిన వారిపై గంజాయి కేసు పెట్టడం దుర్మార్గం విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ డీఈఓ కార్యాలయం ముట్టడి -
లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సింగరాయకొండ: ప్రసిద్ది చెందిన పాతసింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ఊరేగింపుగా వచ్చి పుట్టమట్టి సేకరించి పూజలు చేశారు. ఆ మట్టిలో నవధాన్యాలు మొలకెత్తే విధంగా చేసి ఆలయ నలుమూల ఏర్పాటు చేయడంతో బ్రహ్మోత్సవాలలో తొలి ప్రధాన ఘట్టం పూర్తయింది. శనివారం మధ్యాహ్నం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టం పూర్తవుతుందని, స్వామివారి గరుడప్రసాదం భక్తులకు పంచిపెడతామని, దీని కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి పి.కృష్ణవేణి వివరించారు. -
ఎమ్మెల్యే బూచేపల్లి బక్రీద్ శుభాకాంక్షలు
దర్శి (కురిచేడు): జిల్లాలోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీక గా ముస్లింలు బక్రీద్ పండుగ చేస్తారని అన్నారు. పేదలకు దాన ధర్మాలు చేసే బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.నిర్ధిష్ట వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు టౌన్: పరిశ్రమల స్థాపనకు నిర్ధిష్ట వ్యవధిలోనే అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనంలో ప్రత్యేక జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. పరిశ్రమల అనుమతులు కోసం వివిధ శాఖలకు చెందిన 137 దరఖాస్తుల్లో 110 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా నిర్ధిష్ట గడువులోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో పరిశ్రమలకు చెందిన వివిధ రాయితీలకు 449 క్లైయిమ్లకు గాను రూ.7.22 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాబార్డు ఏజీఎం రవి కుమార్, ఏపీఐఐసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాలి ఒంగోలు టౌన్: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు కోరారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించి తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం–1977ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. జంతువుల అక్రమ రవాణా, జంతు వధ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా జంతువధ శాలల వద్ద ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. స్లాటర్ హౌస్ల వద్ద పారిశుధ్య చర్యలు తీసుకోవాలని, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో ఇద్దరు అరెస్టు ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో శుక్రవారం మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయ పాలెం గ్రామానికి చెందిన గోళ్ల రుత్యేంద్ర బాబు అలియాస్ నాని, నెల్లూరు జిల్లాకు చెందిన ఓబిలి నాగరాజును త్రోవగుంట వద్ద అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితులకు రిమాండ్ విధించారు. నాని మీద రౌడీషీట్ తో పాటు రెండు హత్యకేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రశాంతంగా డీఎస్సీ
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 629 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 24,659 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి రోజు రెండు షిఫ్ట్ల్లో పరీక్షలు జరుగుతాయి. ఒంగోలు నగరంతోపాటు మార్కాపురం పట్టణంలో మొత్తం ఎనిమిది కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తొలి రోజు 5 కేంద్రాల్లో 791 మంది హాజరు కావాల్సి ఉండగా 718 మంది హాజరయ్యారు. 81 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో 170 మందికి గాను 147 మంది, క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో 200 మందికి 179 మంది, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో 201 మందికి గాను 189 మంది, మార్కాపురంలోని డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కాలేజీలో 120 మందికి గాను 106 మంది, కృష్ణచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో 100 మందికి గాను 89 మంది హాజరయ్యారు. మెగా డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులో మెగా డీఎస్సీ పరీక్ష జరుగుతున్న బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా అన్నీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్ష జరుగుతుందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారన్నారు. కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ మధుసూదన్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
కన్నీటి రహదారి!
కనిగిరిరూరల్: తెలంగాణ రాష్ట్రం నకిరేకల్ నుంచి నల్గొండ, రాష్ట్రంలోని మాచర్ల, మార్కాపురం, చిన్నారికట్ల, పొదిలి, కనిగిరి, పామూరు, వెంకటగిరి తిరుపతి జిల్లా ఏర్పేడు వద్ద జాతీయ రహదారిని కలుస్తుంది ఈ ఎన్హెచ్ 565 రహదారి. తిరుపతికి, చైన్నె నగరానికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఇన్ని ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి కోసం రైతులు విలువైన భూములను ఇచ్చారు. దాదాపు మూడున్నర కిలోమీటర్లు బైపాస్ను నిర్మాణానికి అధికారులు చకచకా భూ సేకరణ చేశారు. పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉన్నా పరిహారం విషయంలో భూములిచ్చిన వారు మాత్రం అవస్థలు పడుతూనే ఉన్నారు. భూములిచ్చిన వారిలో బడాబాబులకు మాత్రం వెంటనే పరిహారాన్ని అందజేశారు. చిన్న సన్నకారులు రైతులు నిత్యం అధికారులు చూట్టూ తిరుగుతూనే ఉన్నారు. రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యమే వీరిపాలిట శాపంగా మారింది. న్యాయం చేయాల్సిన రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులే చేతులెత్తేస్తుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో ప్రారంభమైన పనులు.. ఎన్హెచ్ 565 రోడ్డు పనులు 2014లో కనిగిరిలో ప్రారంభమయ్యాయి. కనిగిరి పట్టణంలోని కనిగిరి–కంభం క్రాస్ రోడ్డు, చెక్పోస్టు సమీపం నుంచి కనిగిరి– పామూరు రోడ్డు.. కొత్తూరు గుడి వరకు ఎన్హెచ్ 565 హైవే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి పట్టణ సమీపంలోని సుమారు 19 ఎకరాల భూమిని 20 నుంచి 25 సర్వే నంబర్లలో సేకరించారు. బడా, చిన్న, సన్నకారు రైతులు 100 మంది వరకు భూములు కోల్పోయారు. వీరు కాక మరో 30 నుంచి 40 మంది వరకు ప్లాట్లు కోల్పోయిన వారున్నారు. దాదాపు 140 మంది వరకూ భూములు ఇచ్చిన వారు ఉన్నారు. నష్ట పరిహారం కింద రూ.14 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఇందులో బడాబాబులకు మాత్రం రూ.10 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. మరో రూ.4 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వీరందరికీ గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో రెండు విడతలుగా పరిహారం నగదు బాధితులకు జమ చేశారు. ఇంకా సుమారు 39 మంది సెంట్లల్లో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం రావాల్సి ఉంది. వారు కాకుండా ప్లాట్ల కోల్పోయిన సుమారు 30 మంది బాధితుల పేర్ల ఇంకా అసలు పరిహార జాబితాలోనే నమోదు కాలేదు. సర్వే నంబర్ 659, 709/3 లలో భూములు, ప్లాట్లు కోల్పోయిన వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని బాధితులు తెలిపారు. అనేక మంది భూ బాధితులు రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పరిహారం ఫైళ్లు వెనక్కి.. భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో భూసేకరణ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 39 మంది బాధితులకు సంబంధించి పరిహారం కోసం పంపుతున్న ఫైలు ఇప్పటికీ మూడు సార్లు వెనక్కి వచ్చేసింది. తప్పు ఏ శాఖదైనా.. నిర్లక్ష్యం ఏ అధికారులదైనా భూములిచ్చిన వారు మాత్రం అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ మూడు సార్లు ఫైలు వెనక్కి వచ్చిందంటే తప్పు ఎవరిదో అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫైనాన్షియల్ ఇన్ వాలిడ్ పేరుతో జాతీయ రహదారుల అథారిటీ ఉన్నతాధికారులు ఫైలును తిప్పి పంపారు. మార్చిలో మళ్లీ పంపగా తిరస్కరణకు గురైంది. తాజాగా మరో తప్పుతో పరిహార ఫైలు తిరస్కరించినట్టు శుక్రవారం జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్టు తెలిసింది. పరిహారం ఇచ్చే విషయంలో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. పూర్తికావస్తున్న పనులు: కనిగిరిలో ఎన్హెచ్ 565 రోడ్డు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. రోడ్డు పూర్తయితే తమను ఎవరు పట్టించుకుంటారని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. పరిహార జాబితా రీ ఫైనలైజేషన్ ఎప్పటికి జరుగుతుంది.. తమకు ఎప్పటికి పరిహారం దక్కుతుందని బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల పరిహార విషయం పై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి న్యాయం చేయాల్సిన జిల్లా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం.. అసలు తరచూ ఫైల్ ఎందుకు రిజక్ట్ చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టకపోవడంపై పలు విమర్శలకు దారితీస్తోంది. ఎన్హెచ్ 565 నిర్మాణానికి 19 ఎకరాల భూసేకరణ భూములిచ్చిన రైతులు, ప్రజలు పరిహారం కోసం సగంమందికిపైగా బాధితుల ఎదురు చూపులు సాంకేతిక సాకులు చూపుతూ ముచ్చటగా మూడోసారి ఫైలు వెనక్కి కనిగిరి సమీపంలో పూర్తి కావస్తున్న బైపాస్ పనులు శాపంగా మారిన భూసేకరణ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రూ.4 కోట్ల బకాయిలు పెండింగ్ ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులుజాతీయ రహదారి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశ పడ్డారు. అధికారుల హామీలు నమ్మి భూములు ఇచ్చారు. జాతీయ రహదారి 565 నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులకు మాత్రం పరిహారం అందక అవస్థలు పడుతున్నారు. భూసేకరణ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వీరి పాలిట శాపంగా మారింది. పరిహారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. బడా బాబులకు పరిహారం ఇచ్చేసిన అధికారులు చిన్న, సన్నకారు రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక సాకులు చూపుతూ ఇప్పటికీ మూడు సార్లు ఫైలు వెనక్కి వచ్చింది.భూమి రాసి పోర్టల్ నుంచి రిటర్న్.. కనిగిరి ఎన్హెచ్ 565 బైపాస్ భూ బాధితుల పరిహారానికి సంబంధించిన ఫైల్ గతంలో ఒక సారి సాంకేతిక లోపంతో రిటన్ వచ్చింది. మళ్లీ రీఫైనలైజేషన్ చేసి పెట్టాం. మళ్లీ ఇప్పుడు రిటన్ వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. మా వైపు నుంచి మేము ఫైల్ను పరిశీలించే పంపుతున్నాం. పై నుంచి ‘భూమి రాసి పోర్టల్’ నుంచి రిటర్న్ వస్తోంది. దీనిపై సోమవారం మళ్లీ విజయవాడ టెక్నికల్ అధికారులతో మాట్లాడుతాం. – గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ నాటి మాటలు హామీలు ఏమయ్యాయి..? ఎన్హెచ్ 565 రోడ్డు నిర్మాణ సమయంలో భూ బాధితులందరికీ న్యాయం చేస్తాం.. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోవద్దు..దశల వారీగా నష్టపోయిన భూ బాధితునికి ప్రతి సెంటుకు పరిహారం ఇప్పిస్తామని పలు మార్లు సభలు, సమావేశాలు పెట్టి కలెక్టర్, జేసీ, ఇతర ఉన్నత స్థాయి అధికారులు నమ్మబలికారు. రోడ్డు పనులు అడ్డు లేకుండా సాఫీగా జరుగుతున్నాయి. అయితే డివిజన్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మాత్రం సన్న, చిన్న కారు రైతులకు పరిహారం అందించే విషయాన్ని విస్మరించారు. నష్ట పరిహార ఫైల్ మూవింగ్ విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సెంటు నుంచి ఐదు సెంట్ల భూములు, ప్లాట్లు కోల్పోయిన 39 మంది భూ బాధితులు కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ పరిహారం కోసం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సుమారు రూ.3 కోట్లు బాధితులకు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. తమకు రావాల్సిన పరిహారం పై ఆందోళన చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. -
రేషన్ బియ్యం లారీ పట్టివేత
నాగులుప్పలపాడు: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని ఎన్ఫోర్సుమెంట్ అధికారులు పట్టుకున్నారు. ఆ శాఖ డీటీ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. చీరాల వైపు నుంచి ఒంగోలు వైపునకు గురువారం అర్ధరాత్రి లారీలో రేషన్ బియ్యం తరలిస్తున్న విషయాన్ని పసిగట్టి చదలవాడ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. లారీలో సుమారు 300 బస్తాల వరకు రేషన్ బియ్యం ఉండవచ్చని అంచనా వేశారు. అనంతరం లారీని, డ్రైవరును నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు డీటీ తెలిపారు. ఈ దాడిలో ఎఫ్ఐ గుణ వంశీ, సిబ్బంది పాల్గొన్నారు. మద్దిపాడులో... మద్దిపాడు: స్థానిక శ్రీ వెంకటేశ్వర రైస్మిల్లులో రేషన్ బియ్యాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారులు పట్టుకున్నారు. రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఆదేశాల మేరకు మద్దిపాడు తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎస్ఐ శివరామయ్య రైస్మిల్లు వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ రేషన్ బియ్యం ఉండటంతో సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్, జిల్లా సివిల్ సప్లయిస్ శాఖకు బియ్యం అప్పగించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ రైస్మిల్లులో ఉన్న బియ్యాన్ని లోడ్ చేయించి చూడగా, 2108 బస్తాల బియ్యం పట్టుబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.40,05,200 ఉంటుందన్నారు. పట్టుబడిన బియ్యాన్ని గోడౌన్కు తరలిస్తున్నట్లు ఏఎస్ఓ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఐ వంశీ, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎండ ప్రచండం
నిర్మానుష్యంగా ఉన్న చర్చి సెంటర్ఒంగోలు టౌన్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజుల నుంచి ఉదయం నుంచే ఎండ ప్రభావం చూపిస్తోంది. నడినెత్తిన సూర్యుడు భగభగమంటుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయని పెద్దలు చెప్పిన మాట వాస్తవమన్నట్లుగా నిప్పుల కుంపటిలా ఎండ వేడి వేధిస్తోంది. మే 27 నాటికి రుతుపవనాలు వచ్చేస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చెప్పినట్లే మూడు రోజుల పాటు వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఇక ఎండా కాలం ప్రభావం ముగిసినట్లేనని అంతా భావించారు. అందుకు భిన్నంగా మళ్లీ ఎండలు మండిపోవడం మొదలైంది. ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరుకుంది. మారిన వాతావరణంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దానికి తోడు గాలి స్తంభించడంతో ఉక్కపోత అల్లాడిస్తోంది. కొద్దిసేపు ఫ్యాను తిరగకపోతే చెమటలతో దేహమంతా తడిసిపోతోంది. ఉదయం 6 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతోంది. 10 గంటల కల్లా తీవ్రరూపం దాలుస్తోంది. సాయంత్రం 7 గంటల వరకు ఉక్కపోతతో వేడి గాలులు వీస్తున్నాయి. బుధవారం నాటికి జిల్లా అంతటా 39 డిగ్రీల ఎండ కాయగా శుక్రవారం 40 డిగ్రీ గరిష్ట ఉష్ణోగ్రత, 29.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే పరిస్థితి మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో నానాటికీ తీవ్రమవుతున్న ఎండలు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఉదయం నుంచే భానుడి ప్రతాపం షురూ -
ధర కోసం మొర
మద్దతు ధర కల్పించాలని పొగాకు రైతులు గొంతు చించుకుంటున్నా వ్యాపారుల పంథాలో ఎలాంటి మార్పు కానరావడం లేదు. నాణ్యమైన పొగాకును సైతం తిరస్కరిస్తుండటంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గురువారం ఒంగోలులోని త్రోవగుంట వేలం కేంద్రంలో ఎఫ్–3 రకం బేళ్లకు వ్యాపారులు సరైన ధర ఇవ్వకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియను అడ్డుకుని రైతులు నిరసన తెలిపారు. పలువురు రైతులు చేసేదేమీ లేక బేళ్లను ట్రాక్టర్లలో ఎత్తుకుని ఇంటిబాట పట్టారు. – సాక్షి ఒంగోలు -
భజే.. భజే.. భక్తాభీష్ఠా..
వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్దానం సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధిగాంచిన, దక్షిణ సింహాచలంగా పేరొందిన పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం అంకురార్పణతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు, పాలక మండలి ఏర్పాటు చేస్తోంది. బ్రహ్మోత్సవాలు ఇలా.. వేద పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శనివారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ, రాత్రి 10 గంటలకు చంద్రప్రభ వాహనం, 8వ తేదీ ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 10 గంటలకు హంసవాహనం, 9వ తేదీ సోమవారం రాత్రి 10 గంటలకు శేషవాహనం, 10వ తేదీ రాత్రి 10 గంటలకు హనుమంత సేవ, 11వ తేదీ ఉదయం 10 గంటలకు మోహినీ ఉత్సవం, రాత్రి 11 గంటలకు గరుడ సేవ, 12వ తేదీ రాత్రి 9 గంటలకు వసంతోత్సవం, 10 గంటలకు గజోత్సవం, 13వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, 14వ తేదీ రాత్రి 10 గంటలకు గుర్రపు వాహనం, 15వ తేదీ ఉదయం 10 గంటలకు లక్ష్మీసంవాద ఉత్సవం, 11 గంటలకు చక్రస్నానం, రాత్రి 10 గంటలకు ధ్వజావరోహణ, పూర్ణాహుతి పూజలు, 16వ తేదీ సోమవారం రాత్రి 10 గంటలకు పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సమయంలో రోజూ ఉదయం స్వామివారికి చప్పరసేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పి.కృష్ణవేణి తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా 10వ తేదీ నుంచి సత్యహరిశ్చంద్ర, చండీమేళం, కోలాట ప్రదర్శన, 11వ తేదీన పాటకచేరి, 12వ తేదీన కూచిపూడి నాట్య ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు శ్రీకృష్ణ యాదవ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో 9వ తేదీన పొట్టేళ్ల బలప్రదర్శన, 10వ తేదీన ఎడ్ల బండలాగుడు పోటీలు, 11వ తేదీన ఎడ్ల బండి రాధాడు పోటీలు నిర్వహించనున్నారు. వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ 11 రోజులపాటు సాగే ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పొట్టేలు పందేలు, ఎడ్ల పోటీలు భక్తులను అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
దగా.. మో...సం!
● వివాహం పేరుతో యువకుడిని మోసగించిన కిలేడీలు ● రూ.లక్ష స్వాహా చేసిన ముగ్గురు మహిళలు కురిచేడు: ‘మంచి అమ్మాయి.. ఈడూ జోడు బాగుంటుందయ్యా..’అంటే గుడ్డిగా నమ్మాడు ఆ యువకుడు. బాజాభజంత్రీలు, పురోహితుడిని మాట్లాడుకున్నాడు. బంధుమిత్రులకు ఆహ్వానం పంపాడు. మొత్తం మీద పెళ్లి తంతుకు సకలం సిద్ధం చేసుకున్నాడు. చివరకు తాను మోసపోయానని తెలియగానే ఒక్కసారిగా కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు మహిళలు మ్యారేజ్ బ్యూరో పేరుతో కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ యువకుడిని సంప్రదించారు. పెళ్లి కావాల్సిన యువతులు ఉన్నారంటూ సంబంధం మాట్లాడారు. వివాహం కుదిరితే రూ.3 లక్షలు కమీషన్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం యువకుడిని విజయవాడ పిలిపించి అక్కడే యువతిని చూపించి నిశ్చితార్థం కూడా చేశారు. అడ్వాన్సుగా లక్ష రూపాయలు తీసుకున్నారు. మిగతా రూ.2 లక్షలు వివాహం కాగానే ఇవ్వాలని షరతు విధించారు. గురువారం రాత్రికి వివాహం జరగాల్సి ఉంది. బుధవారం రాత్రి ప్రదానం తీసుకుని కాటంవారిపల్లెకు చెందిన నలుగురు యువకులు విజయవాడ వెళ్లారు. వివాహం కుదుర్చుకున్న యువకుడు ఇచ్చిన చిరునామాలో ఎవరూ లేకపోవడంతో బిత్తరపోయారు. వారిని సంప్రదించేందుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసి ఉంది. వివాహం కుదుర్చుకున్న యువకుడికి విషయం చేరవేశారు. గురువారం మధ్యాహ్నం వరకు వేచి చూసిన ఆ యువకులు నిరాశగా వెనుదిరిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా వద్దా అనే మీమాసంలో ఉన్నారు. -
సత్తా చాటిన తెలంగాణ ఎడ్లు
సీఎస్పురం(పామూరు): మండల కేంద్రమైన సీఎస్పురంలో రాచూరి పెద్దమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా గురువారం కాపునాయుళ్ల సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం హుజూర్నగర్కు చెందిన ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచింది. పోటీలను వైఎస్సార్ సీపీ నాయకుడు కదిరి ప్రకాశరావు, కాపు సంఘ నాయకులు ఆమంచి స్వాములు ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 10 జతల ఎడ్లు పాల్గొనగా హుజూర్నగర్కు చెందిన కేశవరెడ్డి, సురేందర్రెడ్డిల ఎడ్ల జత ప్రథమ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేష్యాదవ్ ఎడ్ల జత ద్వితీయ స్థానం, అదేజిల్లా రంగసాయపల్లెకు చెందిన వెంకటసుబ్బారెడ్డి ఎడ్ల జత తృతీయ స్థాఽనం, నంద్యాల జిల్లా రామసుబ్బారెడ్డి ఎడ్ల జత నాలుగో స్థానం, బాపట్ల జిల్లా పావులూరి వీరాస్వామి ఎడ్ల జత ఐదో స్థానం, నంద్యాల జిల్లా దినేష్రెడ్డి ఎడ్ల జత ఆరో స్థానం, అనంతపురం జిల్లా రామాంజనేయులు ఎడ్ల జత ఏడో స్థానంలో నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.1,00,116 తులబందుల చలమయ్య నాయుడు, ద్వితీయ బహుమతి రూ.75,116ను మరాసుల రోశయ్య, తృతీయ బహుమతి రూ.50,116ను తిరుమలశెట్టి కిరణ్కుమార్, నాలుగో బహుమతి రూ.30,116ను ఆకుపాటి రమణయ్య, 5వ బహుమతి రూ.20,116ను మన్నేపల్లి వెంకటనరసయ్య, ఆరో బహుమతి రూ.15 వేలు బోయిన మాలకొండయ్య, ఏడో బహుమతి రూ.10 వేలను తోట అశోక్నాయుడు అందజేశారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం
ఒంగోలు టౌన్: ప్రార్ధించే పెదవుల కంటే సాయపడే చేతులే గొప్పవని చాటారు జిల్లా ఫార్మసి ఉద్యోగులు. నగరంలోని గద్దలగుంటకు చెందిన ఎ.ఆంజనేయులు నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఫార్మసి ఆఫీసర్గా పనిచేస్తూ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. కాంట్రాక్ట్ ఉద్యోగి కావడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందలేదు. ఈ క్రమంలో ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రకాశం జిల్లా ఫార్మసి అసోసియేషన్ నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా సంఘ సభ్యులందరూ కలిసి రూ.1.72 లక్షలు సేకరించారు. గురువారం గద్దలగుంటలోని ఆంజనేయులు నివాసంలో డీఎంహెచ్లో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. ఆంజనేయులు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేలా కలెక్టర్కు సిఫార్సు చేయాలని సంఘ సభ్యులు డీఎంహెచ్ఓకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ ఫార్మశీ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జె.రవికిరణ్, కార్యదర్శి కె.రత్నాకర్బాబు, నాయకులు పి.సూర్య ప్రగతి, స్వర్ణ మంజరి, పద్మ, కృపా కుమారి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
పామూరు: మండల కేంద్రమైన పామూరులోని మదన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రుక్మిణి, సత్యభామా సమేత మదన వేణుగోపాలస్వామి వారికి గురువారం రుత్విక్కులు నారాయణయం సత్యబాబు, గోపి పూజలు చేశారు. ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు ఆధ్వర్యంలో నగర సంకీర్తన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు ఈఓ దేవాదాయశాఖ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటిరోజు బ్రాహ్మణ ఉభయం ఘనంగా నిర్వహించారు. వేద సభ నిర్వహించి ఎమ్మెల్యే ఉగ్ర దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ భీమానాయక్ పూజల్లో పాల్గొనగా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు ఆకుమళ్ల చలపతిరావు, డాక్టర్ దీక్షితులు, నెల్లూరు నరసింహారావు, విఠపు కుమార్, కొల్లూరు రవికిరణ్శర్మ, మహంకాళి శివప్రసాద్, జొన్నాబొట్ల గురునాథప్రసాద్, బండ్లా నారాయణ, గుర్రం వెంకటేశ్వర్లు, భక్తులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన వార్డు సభ్యుడు
పెద్దదోర్నాల: కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చక పెద్దదోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు పందీటి అనిల్ గురువారం యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీని వీడిన అనిల్కు యర్రగొండపాలెంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి వైఎస్సార్ సీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి, మొద్దు తిరుపతిరావు, భైరబోయిన శ్రీను(గాంధీ), పార్టీ నాయకులు సీమోను, చిన్ని, వాదం శ్రీను, సంజీవమ్మ, కొట్టి రోజ్మేరీ పాల్గొన్నారు. ఆహ్వానించిన ఎమ్మెల్యే తాటిపర్తి -
విజయవాడకు తరలి వెళ్లిన ఉద్యోగులు
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా నుంచి వందలాది మంది ఉద్యోగులు తరలి వెళ్లారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలోని ఎస్ఎస్ కన్వన్షన్ హాల్ బందర్ రోడ్డులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ఉద్యోగులు వివిధ తాలూకాల నుంచి హాజరై సభను జయప్రదం చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న 14 ప్రధాన డిమాండ్లను నెరవేరే దానికి ప్రభుత్వానికి కొంత గడువు ఇస్తున్నామని, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. జిల్లా కార్యదర్శి వరకుమార్, ట్రేడర్ రంగారెడ్డి, సహాధ్యక్షుడు మసూద్, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి శ్రీదేవి, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు చెంచిరెడ్డి, దర్శి తాలూకా అధ్యక్షుడు ఎన్వీ సుబ్బారెడ్డి, గిద్దలూరు తాలూకా అధ్యక్షుడు ఎస్వీ రంగయ్య, కంభం తాలూకా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి, ఎర్రగొండపాలెం తాలూకా అధ్యక్షుడు జానీబాషా పాల్గొన్నారు. -
నేటి నుంచి డీఎస్సీ
ఒంగోలు సిటీ/ఒంగోలు సబర్బన్: టీచర్ల ఉద్యోగాల కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు షిప్టుల్లో జరిగే ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకూ జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:00 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 629 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. 24,659 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సెషన్కు 12,939 మంది, రెండో సెషన్లో 10,968 మంది, 24వ తేదీ నిర్వహించే మోడల్ స్కూలుకు సంబంధించి నిర్వహించే ఇంగ్లిష్ పరీక్షకు 752 మంది హాజరవుతున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎనిమిది మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, రెండు ఫ్లయింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేసినట్టు డీఈఓ ఏ అరుణ్కుమార్ తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు... జిల్లాలో 2025 మెగా డీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఆ మేరకు స్థానిక ప్రకాశం భవన్లోని కలెక్టర్ చాంబర్లో గురువారం డిపార్ట్మెంటల్ అండ్ పరీక్ష కేంద్రాల లైజనింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూంలో నలుగురు అధికారులు నిరంతరం విధులు నిర్వర్తిస్తారన్నారు. ఎస్కే మదార్ బీ (జూనియర్ అసిస్టెంట్, 9441991757), సీహెచ్ నవ్య (జూనియర్ అసిస్టెంట్, 8977690457), నవ్య రోహిణి (జూనియర్ అసిస్టెంట్, 7989416703), ఎస్.హర్షిణి (అనలిస్ట్, 7416109602)ని సంప్రదించాలన్నారు. రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఒంగోలులో ఆరు కేంద్రాలు, మార్కాపురంలో రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలులో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ, రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలలో రెండు సెంటర్లు, క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియాలో, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో, మార్కాపురంలోని డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కాలేజీలో, మార్కాపురం దేవరాజుగట్టు వద్ద ఉన్న కృష్ణచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటా 30 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. సెల్ ఫోన్లు, జామెంట్రీ బాక్సులు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ డివైజ్లను అనుమతించమని తెలిపారు. సమావేశంలో డీఈఓ ఎ.కిరణ్ కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 729 పోస్టులకు 24,659 మంది అభ్యర్థులు ఎనిమిది కేంద్రాల్లో రెండు షిప్టుల్లో నిర్వహణ ప్రకాశం భవన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పకడ్బందీగా పరీక్షలు : కలెక్టర్ తమీమ్ అన్సారియా -
ప్లాస్టిక్ను అరికడదాం..పర్యావరణాన్ని కాపాడదాం
మద్దిపాడు: ప్లాస్టిక్ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడుకుందామని కలెక్టర్ తమీమ్ అన్సారియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఉన్న వినాయస్వామి ఆలయం వద్ద ఏపీఐఐసీలోని పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రోత్ సెంటర్ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకుని ఆదర్శంగా నిలపాలన్నారు. ఇక్కడ అనేక ఫ్యాక్టరీలున్నాయని వాటి ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గించడానికి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను ప్రభుత్వం నిషేధించిందని, అందువలన ఎవరూ ఆ ప్లాస్టిక్ వాడరాదన్నారు. సదరు ప్లాస్టిక్ నీటిలో కరుగుతుందని, భూమిలో మాత్రం కరిగిపోయే పరిస్థితి లేదన్నారు. అటువంటి ప్లాస్టిక్ బాటిల్స్లో నీరు తాగడం వలన రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంట ప్లాస్టిక్ విపరీతంగా ఉందని, అందువలన రహదారుల కాంట్రాక్టర్కు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసి ప్లాస్టిక్ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వారిని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా తాము వెనకాడమని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటామని, ఇది మంచి పరిణామమని అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణ హితంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నారు. నర్సరీలలో 35 లక్షల మొక్కల పెంపకం... కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా 35 లక్షల మొక్కలను నర్సరీలలో పెంచుతున్నామని తెలిపారు. వాటిలో నీడనిచ్చే చెట్లు, పండ్ల మొక్కలు కూడా ఉన్నాయన్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ల వారు ఎవరైనా అడిగితే వారికి ఉచితంగానే మొక్కలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రోడ్ల వెంట కూడా మొక్కలు నాటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీఆర్డీఏ ద్వారా మొక్కల సంరక్షణకు నిధులు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. అనంతరం దేవాలయ ఆవరణలో కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జోసఫ్కుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, ఎంఆర్ఓ నారాయణరెడ్డి, ఎంపీడీఓ డీఎస్వీ ప్రసాద్, గ్రోత్ సెంటర్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మండవ రత్నాకర్, దేవస్థానం కమిటీ సభ్యులు కొండా సర్వేశ్వరరావు, పెనుబోతు అజిత్, బోయిళ్ల శ్రీనివాసరావు, ఫ్యాక్టరీల యజమానులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య పిలుపు ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం -
ప్రకాశం
40 /299గరిష్టం/కనిష్టందగా.. మో...సం! ముగ్గురు కిలేడీలు వివాహం పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో రూ.3 లక్షలు కమీషన్ ఇవ్వాలని చెప్పి రూ.లక్ష స్వాహా చేశారు. భజే..భజే.. భక్తాభీష్ఠా.. పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.వాతావరణం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025– 10లో.. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
● విద్యార్థులకు ఎస్పీ దామోదర్ పిలుపు ఒంగోలు టౌన్: చిన్నారులు చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ రాణించాలని, తలిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండులో నిర్వహించిన చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపు ముగింపు సభలో ఆయన మాట్లాడారు. విలువలతో కూడా విద్య బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలని, నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మాటలు వినాలని, వారి అనుభవాలను పాఠాలుగా అధ్యయనం చేయాలని సూచించారు. చిన్నారుల్లో నేర్చుకునే గుణం ఎక్కువగా ఉంటుందని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మరింత మెరుగుపెట్టడమే ఉపాధ్యాయులు చేయాల్సిన విధి అని చెప్పారు. సమ్మర్ క్యాంపులో నిపుణులైన కోచ్ ద్వారా చిన్నారులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఫుట్బాల్, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, ఇతర క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. క్యాంపు విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు చిల్డ్రన్స్ కమిటీ ప్రెసిడెంట్ రాజేంద్ర, వివిధ రంగాలకు చెందిన నేషనల్ క్రీడాకారులకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఎస్పీ అశోక్బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, క్రీడాకారులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. -
అధికారులు గులాం!
ఓటమి పెత్తనం.. కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక రాజ్యాంగం అమలవుతోంది. జిల్లాలో దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పేరుకే వారు ఎమ్మెల్యేలు.. అక్కడ పెత్తనమంతా అధికార పార్టీ నాయకులదే. ప్రభుత్వం మాది.. పెత్తనమూ మాదే అన్న విధంగా ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం వార్డు సభ్యులు కూడా కాని వారికి అధికార యంత్రాంగం జీ హుజూర్ అంటోంది. కనీస ప్రొటోకాల్ అమలు విషయంలో కూడా వివక్ష కనిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా జరిగే జిల్లా స్థాయి సమీక్షల్లో కూడా వారికి రాచమర్యాదలు సాగుతున్నాయి. ప్రజల మద్దతుతో గెలిచిన వారిని కాదని వీరికి పెద్ద పీట వేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గత సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో దర్శి, యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు నేడు పెత్తనం చలాయిస్తున్నారు. రాజ్యాంగేతర శుక్తుల్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు ఎస్కార్ట్తో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలలో అధికారికంగా పాల్గొంటున్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నార్న విమర్శలు ఉన్నాయి. ఈ ఇన్చార్జిల తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అటు పాలకులు, ఇటు అధికారులకు ఏమాత్రం చీమకుట్టినట్టయినా లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యర్రగొండపాలెంలో ఎరిక్షన్దే పెత్తనం... యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ను ప్రజలు గెలిపించుకున్నారు. అయితే, దొడ్డిదారిన టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు అధికారం చలాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నియోజకవర్గంలో రైతులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరగాలి. కానీ, అందుకు విరుద్ధంగా గత ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థిచేత పంపిణీ చేయించడంతో ప్రజలు విస్తుపోయారు. యోగా సన్నాహక కార్యక్రమంలో కూడా ఇదే పునరావృతమైంది. జిల్లా అధికారులు హాజరైన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేకు కనీసం ఆహ్వానం కూడా లేదంటే కూటమి పాలకుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజాస్వామికవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి అధికారికంగా ఏదైనా కార్యక్రమం, సమీక్షగానీ నిర్వహిస్తే సంబంధిత శాఖ అధికారులు మొహం చాటేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యర్రగొండపాలెంలో ఇదే దుస్సంప్రదాయం కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఒక సర్పంచ్గా కూడా ఎన్నిక కాని వ్యక్తి అంతా తానే అయినట్లు అధికారం చలాయించడం, పోలీసు ఎస్కార్ట్తో ప్రజల మధ్య తిరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా సమావేశాలలో కూడా అదే తీరు.. ఆ మధ్య నాటుసారాకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు జిల్లా పోలీసు కార్యాయలంలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఎకై ్సజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే వేదిక మీద ఎమ్మెల్యేలతో పాటుగా దర్శి టీడీపీ ఇచ్చార్జి గొట్టిపాటి లక్ష్మి, యర్రగొండపాలెం ఇన్చార్జి ఎరిక్షన్బాబుకు కూడా సమానంగా కుర్చీలు కేటాయించారు. ఈ విషయం మీద అనేక విమర్శలు వచ్చాయి. అంతేగాకుండా ఇటీవల జరిగిన డీఆర్సీ మీటింగులో కూడా వీరిద్దరికీ కుర్చీలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే నిబంధనలను ఉల్లంఘిస్తున్నామన్న భావన అధికారులలో ఏమాత్రం కనిపించడంలేదు. తమ పరిధికి మించి వ్యవహరిస్తున్నామన్న ఆలోచన నాయకులు చేయడం లేదని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికార ఎమ్మెల్యే చుట్టూ... గత ఎన్నికలలో ఓటమి పాలైన అభ్యర్థులకు జిల్లా అధికారులు జీ హుజూర్ అనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దర్శి, యర్రగొండపాలెం అనధికార ఎమ్మెల్యేల చుట్టూ తిరగలేక అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. యర్రగొండపాలెంలో అయితే ఇన్చార్జి అవినీతిని కాపుకాయలేక చస్తున్నామని ఒక అధికారి వాపోవడం గమనార్హం. ప్రతిరోజూ ఉదయాన్నే మార్కాపురంలో నివాసం ఉంటే ఆయన్ను కలిసి నమస్కారం పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే వేధింపులు తప్పడంలేదని వాపోయారు. దాంతో ఉద్యోగులంతా ఎమ్మెల్యే తాటిపర్తిని కాదని అనధికార ఎమ్మెల్యే చుట్టూ తిరగడం తప్పడంలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేల కంటే టీడీపీ ఇన్చార్జిల పెత్తనం ఎక్కువైపోయిందని ఉద్యోగ సంఘాల నాయకులు కామెంట్ చేస్తున్నారు. దర్శిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అక్కడ మేడం గారితో పాటు సార్ను కూడా గౌరవించుకోక తప్పడంలేదన్న ప్రచారం జరుగుతోంది. మేడమ్ తీరు పట్ల ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ప్రత్యేక రాజ్యాంగం రెండు చోట్లా వైఎస్సార్ సీపీ గెలిస్తే పెత్తనం మాత్రం టీడీపీ నేతలదే దర్శిలో ప్రభుత్వాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి యర్రగొండపాలెంలో టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు మాటే వేదం జిల్లా స్థాయి అధికారిక సమావేశాల్లోనూ వారికి రాచమర్యాదలు పోలీసు ఎస్కార్ట్తో దర్జా ఒలకబోస్తున్న టీడీపీ నేతలు ఇన్చార్జిలకు సలాం చేస్తున్న అధికారులు దర్శిలో లక్ష్మి దర్పం.. ఆమె ఎమ్మెల్యే కాదు. పోనీ మండలాధ్యక్షురాలా అంటే అదీ కాదు. సర్పంచ్ కూడా కాదు. చివరకు గ్రామ వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. ఆమె గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైన ఒక అభ్యర్థి మాత్రమే. అయినా సరే దర్శి నియోజకవర్గంలో ఆమెదే పెత్తనం. ఎన్నికలలో ఓటమి పాలైన మొదటి నెలలోనే దర్శిలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీకి వెళ్లారు. ఏకంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని ఫైళ్లను పరిశీలించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ప్రజలు ముక్కమీద వేలేసుకున్నారు. అయినా సరే ఆమెకు పట్టలేదు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. అధికారులను ఇంటి వద్దకు పిలిపించుకుని ఎమ్మెల్యేలా సమీక్షలు చేస్తున్నారు. సీఐలు, ఎస్సైల ఎస్కార్ట్ లేకుండా ఇంటి నుంచి బయటకు ఆమె అడుగు పెట్టడం లేదంటే ఎంతగా అధికారం చలాయిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ఆమె ముందు సాగిలపడడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
జాళ్లపాలెం బాధిత మహిళలకు సజ్జల పరామర్శ
కొండపి: ీససీ ఫుటేజీ కోసం ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్సై రమేష్బాబు దుకాణంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో బాధిత మహిళలు చంద్రమ్మ, ఆదిలక్ష్మిలను వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన వివరాలను బాధిత మహిళలు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. సీసీ ఫుటేజీ కోసం లోపలికి వెళుతున్న ఎస్సైను మా అన్న వచ్చిన తరువాత రావాలని చెప్పామని, కానీ ఎస్సై మాత్రం ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని నెట్టివేశారని తెలిపారు. ఆ విషయంలో విధులకు ఆటంకం కలిగించామని మా పైనే కేసులు పెట్టారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ మీకు అండగా ఉంటుందని, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన విషయమై కోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపి పరామర్శించారు. బాధితులను పరామర్శించిన వారిలో మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ ఉన్నారు. -
6 నుంచి డీఎస్సీ పరీక్షలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో 2025 మెగా డీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక ప్రకాశం భవన్లోని కలెక్టర్ చాంబర్లో బుధవారం పరీక్షల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి రెండు షిఫ్టుల్లో ఈ నెల 30వ తేదీ వరకు మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా ఈ కింది తెలిపిన ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి సెషన్ ఉదయం గం.9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం గం.2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. ఒంగోలులో ఆరు కేంద్రాలు, మార్కాపురంలో రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలులో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ, రైజ్ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండు సెంటర్లు, క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ద సెర్చ్ సోషల్ యాక్షన్ ఇండియాలో, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో, మార్కాపురంలోని డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కాలేజీలో, మార్కాపురం దేవరాజుగట్టు వద్ద ఉన్న కృష్ణ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో సదరు ఆన్లైన్ పరీక్షకు (సీబీటీ) హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాల్సి ఉంటుందన్నారు. హాల్ టిక్కెట్స్పై ఫొటో లేని అభ్యర్థులు తాజా ఫొటోగ్రాఫ్, సరైన గుర్తింపు కార్డుతో పరీక్షకు అనుమతిస్తారన్నారు. నామినల్ రోల్స్లో అభ్యర్థి పేరు/తండ్రి పేరు/లింగం వంటి చిన్న స్పెల్లింగ్ తప్పులను మార్చుకోవడానికి అభ్యర్థులు టెట్ పరీక్ష కేంద్రంలోని డిపార్ట్మెంటల్ అధికారులను సంప్రదించి మార్చుకోవచ్చన్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలో కమాండ్ కంట్రోల్ అన్ని పరీక్ష రోజుల్లో ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేస్తుందని చెప్పారు. ఒంగోలు డీఈఓ కార్యాలయంలో ఏపీ మెగా డీఎస్సీ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే శివ కుమార్, అసిస్టెంట్ కమిషనర్, పరీక్షల విభాగం వారి మొబైల్ ఫోన్ నెం.8125264606 ను సంప్రదించవచ్చన్నారు. -
వల్నరబుల్ చిల్డ్రన్పై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా మార్కాపురం: వల్నరబుల్ చిల్ట్రన్(దుర్భలమైన) కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వివరాలు సేకరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం మార్కాపురం పట్టణంలోని మెప్మా కార్యాలయంలో బంగారు బాల్యంపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వల్నరబుల్ చిల్ట్రన్ కుటుంబ అవసరాలను గుర్తించి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద రాచర్ల మండలాన్ని ఎంపిక చేసి 360 మంది పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో కొందరికి మూడు చక్రాల కుర్చీలు అవసరమని గుర్తించి అందజేశామన్నారు. వల్నరబుల్ చిల్ట్రన్కు అవసరమైన ఇల్లు, ఆధార్, రేషన్కార్డు మంజూరు, స్కూల్లో చేర్పించడం తదితర అవసరాలు ప్రభుత్వ పరంగా తీర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ యాప్పై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకుని పేద, బలహీన పిల్లల కుటుంబ స్థితిగతుల అవసరాలను నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో సబ్కలెక్టర్ వెంకట త్రివినాగ్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, డీసీపీఓ దినేష్కుమార్, బంగారు బాల్యం నోడల్ అధికారి గిరిధర్ శర్మ, సార్డ్స్ ప్రతినిధి సునీల్, స్థానిక ఐసీడీఎస్, విద్యాశాఖ, మెడికల్ అధికారులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఆధార్ కేంద్రం పరిశీలన పట్టణంలోని 12వ వార్డులో సచివాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కొత్తగా మంజూరైన ఆధార్కార్డును లబ్ధిదారులకు అందజేశారు. కలెక్టర్ వెంట కమిషనర్ నారాయణ, తహసీల్దార్ చిరంజీవి, ఇన్చార్జి ఎంపీడిఓ భాగ్యవతి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అరుణ, బుజ్జి, ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు బూదాల గురవయ్య, లూకా తదితరులు ఉన్నారు. ఉర్దూ పోస్టులు కొనసాగించాలి మార్కాపురం టౌన్: జిల్లాలో తొలగించిన 46 ఉర్దూ పోస్టులను తిరిగి కొనసాగించాలని కోరుతూ కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ వహీద్ఖాన్ వినతిపత్రం అందజేశారు. బుధవారం పట్టణంలోని మెప్మా కార్యాలయం వద్ద కలెక్టర్ను కలిసి ఉర్దూ పోస్టుల తొలగింపు విషయమై మాట్లాడారు. ఉర్దూ పోస్టులను తొలగించడం వల్ల పాఠశాలల్లో సబ్జెక్ట్ బోధించేవారు లేక ఉర్దూ విద్యార్థులు చదువుకు దూరమవుతారని వివరించారు. మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర జిల్లాల్లో అదనంగా 50 ఉర్దూ పోస్టులు అవసరమని, జిల్లాలో 46 పోస్టులను తొలగించడం అన్యాయమన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఉర్దూ పోస్టులను కొనసాగించేందుకు సహకారం అందించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు సబ్దార్ అలీబేగ్, అబ్దుల్ రవూఫ్, అష్రఫ్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొమరోలు: ఓ శుభకార్యానికి డెకరేషన్ లైట్లు ఏర్పాటు చేయడానికి వెళ్లిన ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని ఓబులాపురం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని చింతలపల్లె గ్రామానికి చెందిన పిట్టల నాగేశ్వరరావు(40) ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఓబులాపురం గ్రామంలో ఓ శుభకార్యానికి డెకరేషన్ లైట్లు వేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎస్సై నాగరాజు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి పెద్దదోర్నాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరులో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం రాత్రి మృతి చెందాడు. వివరాలు.. పెద్దదోర్నాల మండల కేంద్రంలోని గిరిజన కార్పొరేషన్ వీధిలో నివసించే నబీరసూల్ మే 30వ తేదీన తన బైక్పై వెళ్తుండగా రోడ్డుపై పంది అడ్డురావడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన యవకుడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతుడు నబీ రసూల్కు భార్య కౌసర్తోపాటు ఓ కుమార్తె ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భంతో ఉందని బంధువులు తెలిపారు. నబీరసూల్ మృతితో తల్లిదండ్రులు నాసర్వలి, మాభున్నీ గుండెలవిసేలా రోదించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు అనుమానాస్పద మృతి మర్రిపూడి: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన మర్రిపూడికి చెందిన పడిదపు వెంకట్రావు(24) పొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకట్రావు చిత్తూరు జిల్లాకు చెందిన పొక్లెయిన్ను బాడుగకు తీసుకుని తిప్పుతున్నాడు. ఈ నెల 2వ తేదీన ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర రక్తగాయాలతో వెంకట్రావు పడి ఉండటాన్ని స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం అందించగా ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. పోలీసుల ద్వార సమాచారం తెలుసుకున్న బంధువులు బుధవారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జీజీహెచ్లో చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందాడు. వెంకట్రావు శరీరంపై తీవ్రగాయాలు ఉండటంతో ప్రమాదవశాత్తు గాయపడ్డాడా? లేదా ఎవరైన దాడికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి సింగరాయకొండ: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు(35) మృతి చెందిన సంఘటన బుధవారం సింగరాయకొండ–ఉలవపాడు స్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే లైనుపై చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మృతుడి శరీరంపై తెలుపు రంగు చారలు గల లైట్ పింక్ కలర్ హాఫ్ హ్యాండ్ టీషర్టు, లైట్ గ్రీన్ జీన్స్ ప్యాంట్ ఉన్నాయి. కుడి కాలి తొడ కింది భాగాన పుట్టుమచ్చ ఉంది. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆచూకీ తెలిసిన వారు 9440627647కు సమాచారం అందించాలని ఒంగోలు ఆర్పీ ఎస్సై కె.మధుసూదనరావు విజ్ఞప్తి చేశారు. -
చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ సమీపంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్తోపాటు ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి శివాంజలి ప్రైవేట్ ట్రావెల్ బస్సు 34 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఓ ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ కొండల్రావు(42) క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన దండిబోయిన గోవిందమ్మ(47)కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు గోవిందమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిద్దరితో కలిసి హైదరాబాద్లో బంధువుల ఇంటి వద్ద ఫంక్షన్ ఉండడంతో కుందుకూరు నుంచి బస్సులో వెళ్తోంది. డ్రైవర్ నిద్రమత్తే కారణం ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉండగా అందులో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన పోకూరు భుజంగరావు, చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన పులి సన్ని, సుజాత నగర్కు చెందిన యనమల మమత, కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన నాయుడు వెంకయ్య, నాయుడు రజని ఉన్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుల్లో కొందరిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి, మరికొంత మందిని హైదరాబాద్లోని ఉస్మానియా, హయత్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కొండల్రావు, ప్రయాణికురాలు గోవిందమ్మ మృతదేహాలకు చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. మృతురాలు గోవిందమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బస్సు డ్రైవర్, మహిళా ప్రయాణికురాలు మృతి మరో 18 మందికి తీవ్ర గాయాలు -
ఆర్మీ జవాన్పై పోలీస్ జులుం!
సాక్షి టాస్క్ఫోర్స్: ఆర్మీ సైనికుడిపై రాచర్ల ఎస్సైతో సహా పోలీసు కానిస్టేబుళ్లు దాడి చేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై బాధితుడు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు చేసిన ఫిర్యాదు పత్రాలు బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఆర్మీ ఉద్యోగి రాచర్ల ఎస్సైపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. అందిన వివరాల మేరకు.. రాచర్లకు చెందిన జవాన్ మల్లెబోయిన వినోద్కుమార్ జె.పుల్లలచెరువు సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్దకు పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతి కోసం నాలుగు రోజుల క్రితం రాచర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఏఎస్సైతో మాట్లాడుతున్న క్రమంలో ఎస్సై పి.కోటేశ్వరరావు వెనుక నుంచి మెడ పట్టుకుని దాడి చేశారని, అదే సమయంలో స్టేషన్లోని 8 మంది కానిస్టేబుళ్లు దాడి చేయడంతో గాయాలై, చొక్కా సైతం చిరిగిపోయిందని, బంగారు చైన్ రెండు ముక్కలైందని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో జవాన్ పేర్కొన్నారు. ఆర్మీ ఐడీ కార్డు జిరాక్స్ ఇవ్వనందుకు అరెస్టు చేస్తున్నామని చెప్పి రాత్రి 8 గంటల తర్వాత జడ్జి గారి ఇంటికి తీసుకెళ్లారని, జడ్జి ఆదేశాలతో స్టేషన్ బైయిల్ ఇచ్చి పంపారని అర్జీలో వివరించాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మెడ, గుండె నొప్పి రావడంతో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి ఒంగోలు జీజీహెచ్కు వెళ్లి చికిత్స చేయించుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. జవాన్ ఆరోపణలపై రాచర్ల ఎస్సైని వివరణ కోరగా.. వినోద్కుమార్పై నాలుగు కేసులు ఉన్నాయని, ఓ కేసులో అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్పై వదిలేశామని చెప్పారు. -
కూటమి వైఫల్యాలపై ప్రజా పోరాటం
కనిగిరిరూరల్: కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై.రవీంద్రబాబు పిలుపునిచ్చారు. కనిగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు సంపాదనే ధ్యేయంగా ఇసుక, ప్రభుత్వ, అసైన్డ్ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కులం, మతం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గ్రామ స్థాయి నుంచి ప్రజా ఉద్యమాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. ఈనెల 21, 22న దర్శిలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు వజ్రాల సుబ్బారావు, ఎస్కే మౌలాలి, పందిటి మోహన్,జీపీ రామారావు, పోతుల ప్రభాకర్, పాలపర్తి మస్తాన్రావు, పుట్టా సుబ్బారావు, ఖాశింపీరా, సయ్యద్ మౌలాలి(ఆర్ట్), ఎస్డీ ఖాదర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై.రవీంద్రబాబు -
బీఎస్ఎఫ్ జవాన్కు కన్నీటి వీడ్కోలు
సింగరాయకొండ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాకలకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పాండూరి ప్రదీప్కుమార్ అలియాస్ సన్నీ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. గత నెలలో పాకిస్థాన్పై భారత్ ప్రెసిసన్ స్ట్రయిక్ చేపట్టిన తర్వాత ప్రదీప్కుమార్ సెలవుపై స్వగ్రామమైన సింగరాయకొండ మండలంలోని పాకల వచ్చారు. ఈ క్రమంలోతన తమ్ముడు అతిల్తో కలిసి మోటారుసైకిల్పై ఒంగోలుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బుధవారం పాకలలో బంధుమిత్రులు అశ్రునయనాల మధ్య ప్రదీప్కుమార్కు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రదీప్కుమార్ భౌతికకాయానికి చిత్తూరు జిల్లా కలికిరి బీఎస్ఎఫ్–53 బెటాలియన్కు చెందిన 11 మంది జవాన్లు గన్ సెల్యూట్ చేసి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ప్రదీప్కుమార్కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాకలలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు -
కొనకనమిట్ల ఎస్సైగా ప్రభాకర్రెడ్డి
కొనకనమిట్ల: కొనకనమిట్ల ఎస్సైగా జి.ప్రభాకర్రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలులో పనిచేస్తున్న ఆయన బదిలీపై కొనకనమిట్లలో నియమితులయ్యారు. నూతన ఎస్సై ఏఎస్సై ముల్లా సాహెబ్, స్టేషన్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కాగా ఇప్పటి వరకు ఎస్సైగా విధులు నిర్వర్తించిన టి.రాజ్కుమార్ అంకిత భావంతో పనిచేయక పోవడం, స్టేషన్లో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, పోలీస్ స్టేషన్కు వచ్చేవారికి అందుబాటులో లేకపోవడం తదితర ఆరోపణల నేపథ్యంలో వీఆర్కు బదిలీ అయ్యారు. -
న్యాయం చేయమంటే... మాపైనే ఎదురు కేసు పెట్టారు
ఒంగోలు టాస్క్ఫోర్స్/ఒంగోలు టౌన్: ఎస్సై దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని, న్యాయం చేయాలని ఎస్పీకి మొరపెట్టుకుంటే... విధులకు ఆటంకం కలిగించారంటూ తమపైనే ఎదురుకేసు పెట్టారని జాళ్లపాలెం ఘటనలో బాధితులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు బండి చంద్రమ్మ మాట్లాడుతూ ‘నేను జాళ్లపాలెంలోని మా అన్న మారంరెడ్డి కొండలరావు కిరాణాషాపులో ఉండగా మర్రిపూడి ఎస్సై రమేశ్బాబు షాపు ఆలయాల్లో దొంగతనాలు జరిగాయి... మీ షాపులో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించాలని అడిగారు. నాకు తెలియదని, మా అన్న షాపులో లేడని చెప్పా. మా అన్నకు ఫోన్ చేయమన్నారు. దీంతో ఫోన్చేసి ఎస్సైకి ఇచ్చా. తాను ఊళ్లో లేనని, పెన్డ్రైవ్ ఇస్తే కాపీ చేసి ఇస్తానని అన్నయ్య చెప్పాడు. దీంతో తాను ఎస్సై రమేశ్బాబునని చెప్పడంతో... సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేది లేదనీ, గతంలో తనపై అక్రమ కేసు బనాయించే ప్రయత్నం చేశారని, కొండపి ఎస్సైకి మాత్రమే ఇస్తానని అన్నయ్య చెప్పాడు. దీంతో ఎస్సై రమేశ్బాబు ఫోన్ పెట్టేసి సీసీ టీవీ ఫుటేజ్ చూడాలంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. నేను అడ్డుకునే యత్నం చేయగా నన్ను నెట్టుకుంటూ మేడపైకెళ్లి సెల్ఫోన్, రెండు పెన్డ్రైవ్లు, సీసీ కెమెరా యూనిట్ తీసుకెళ్లిపోయారు’ అని చెప్పారు. కొండలరావు అన్న కూతురు మారంరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ‘నేను లా చదువుతున్నా. జడ్జి పరీక్షకు సిద్ధమయ్యేందుకు మేడమీద చదువుకుంటున్నా. ఆ సమయంలో మా అత్త చంద్రమ్మ మేడపైకి వచి్చంది. వెనకాలే ఎస్సై రమేశ్బాబు వచ్చి సీసీ కెమెరాకు సంబంధించి మెటీరియల్ తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. మేమిద్దరం అడ్డుకునే ప్రయత్నం చేయగా, మాపై దాడిచేసి మరీ మెటీరియల్ని తీసుకుపోయారు’ అని తెలిపారు. బాధిత మహిళలపైనే కేసు.. ఈ ఘటనపై ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పందించారు. సీసీ ఫుటేజీని పరిశీలించకుండా ఎస్సై రమేశ్బాబు విధులకు ఆటంకం కలిగించిన బండి చంద్రమ్మ, మారంరెడ్డి ఆదిలక్ష్మిలపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎస్సైను చంద్రమ్మ అడ్డుకోవడమే కాకుండా పదేపదే పక్కకు నెట్టి వేసిందని చెప్పారు. ఈ ఘటన వీడియోను మారెడ్డి కొండలరావు ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టి పోలీసులను అప్రతిష్ట పాల్జేశారని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకే కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఇదిలావుండగా మర్రిపూడి ఎస్సై రమేశ్బాబు వ్యవహారశైలిపై కొండలరావు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
హామీల హేళన
కక్షల పాలన..బాబు ఏలుబడిలో జిల్లా వాసులు అడుగడుగునా దగా పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మి మరోసారి మోసపోయారు. జిల్లాకు జీవనాడులుగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం వాసుల ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచే మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేశారు. ఇక జిల్లాలో మిర్చి, శనగ, పత్తి, వరి, పొగాకు రైతులు గిట్టుబాటు ధర రాక రైతాంగం కుదేలవుతోంది. మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసినా కూటమి సర్కార్ కనికరించలేదు. మార్కాపురం జిల్లా అంటూ ఊరించి ఉసూరుమనిపించారు. ఒంగోలు జీజీహెచ్పై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దొనకొండ ఇండస్ట్రియల్ పార్క్ అటకెక్కింది. ఇక సంక్షేమ పథకాలు సరేసరి. రేషన్ బియ్యం కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇలా ఏడాది కాలంగా జిల్లా వాసులు అన్ని రంగాల్లో అన్యాయానికి గురయ్యారు. ఇదేమని అడుగుతున్న వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అంటూ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏడాది దగా పాలనపై ఫోకస్..వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్మిర్చిని కుప్పగా పోస్తున్న రైతు (ఫైల్)అసంపూర్తిగా ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణంసాక్షి ప్రతినిధి, ఒంగోలు: సూపర్ సిక్స్ పథకాలతో పాటు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసానికి జిల్లా ప్రజలు నిలువునా దగాపడ్డారు. జిల్లాకు జీవనాడి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుంచి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో సాగు, తాగు నీటిని అందిస్తానని ప్రగల్భాలు పలికాడు. జిల్లాతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్సార్ కడప జిల్లాలకు ఎంతో ప్రయోజనకారి అయిన వెలిగొండ ప్రాజెక్టుకు మొండి చేయి చూపి మొన్నటి రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.116 కోట్లు కూడా కేటాయించి చిన్న చూపు చూశాడు. చివరకు 2026 జూలై నెలకు కానీ వెలిగొండ నుంచి నీరు ఇవ్వలేమని ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు కింద పునరావాసం పూర్తికాలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు పైసా కూడా విదిల్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టును చుట్టపు చూపుగా సందర్శించిన ముగ్గురు మంత్రుల బృందం పోలవరం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు వెలిగొండ అని, వచ్చే సీజన్ నుంచి నీళ్లు ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ముంపు గ్రామాలకు ఆర్వో ప్యాకేజి, రెండో సొరంగంలో కొంత మేర పనులు మినహా వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలోనే మొత్తం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2014 నుంచి 2019 మధ్య వెలిగొండ ఎలా నిర్లక్ష్యానికి గురైందో ఇప్పుడూ అంతేనని జిల్లా వాసులు నిట్టూరుస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒంగోలు జీజీహెచ్కు మహర్దశ పట్టింది. వందల కోట్లతో పలు అభివృద్ధి పనులు జరిగాయి. మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు వచ్చేలా కృషి చేసింది. కరోనా సమయంలో జీజీహెచ్లో అందించిన సేవలు నేటికీ ప్రజలు గుర్తుకు చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. మెడికల్ కళాశాల, కొత్త జిల్లాలకు మంగళం.. గత ఏడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మార్కాపురం, పొదిలి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే వెంటనే వెలుగొండ పూర్తిచేస్తానని, మార్కాపురాన్ని జిల్లా చేస్తానని హామీలు ఇచ్చారు. ఈ రెంటినీ నెరవేర్చకపోగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులను బదిలీ చేశారు. ఈ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యం అందకుండా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేవి. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయిన మెడికల్ కళాశాల భవనాలు నిరుపయోగంగా మారాయి. చంద్రబాబు నిర్ణయం ఫలితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లా చేస్తానన్నారు. ఏడాది పూర్తవుతున్నా ఆ ఊసేలేకుండా వంచనకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మిర్చి క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఇంత వరకూ ఆ ప్రకటన మాటలకే పరిమితమైంది. – ఎన్నికల సందర్భంగా గత సంవత్సరం జనవరి 5వ తేదీ కనిగిరిలో చంద్రబాబు ‘రా కదలిరా..కార్యక్రమం’ ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చారు. కనిగిరి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, కనిగిరి ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తానని, ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మిస్తానన్నారు. కనిగిరికి సురక్షిత జలాలు.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు మంజూరుకు హామీ ఇచ్చారు. ఏడాదైనా.. అవి అమలుకు నోచుకోలేదు. యువగళం పాదయాత్రలో నారాలోకేష్ పలు హామీలు ఇచ్చారు. వలసల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ సాగర్ నల్లా నీరు అందిస్తామని, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లు పెంచి, పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమిస్తామని, బత్తాయి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు. పచ్చమూకల దౌర్జన్యకాండకు అంతేలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఒకవైపున ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే సచివాలయాల మీద దాడులు చేసి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. సచివాలయాలు ప్రభుత్వ సంపద అనే ఇంగితం కూడా మరచి పచ్చమూకలు దాడులు చేస్తుంటే పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారు. ఎక్కడా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఎక్కడా స్పందించలేదు. మాకు తెలియదు, ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ బుకాయించారు. ఎక్కడైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్వీకరించలేదు. ఒకటి అరా ఫిర్యాదులను స్వీకరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇష్టారాజ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పచ్చమూకలు దాడులకు తెగబడ్డాయి. ఒంగోలు నగరంలో పార్టీకి చెందిన ఒక నాయకుడిని మేకులు కొట్టిన కర్రలతో దాడి చేసి కొట్టడం సంచలనం సృష్టించింది. నగర శివారులోని ఒక సానుభూతిపరుడి కారును ధ్వంసం చేయడమే కాకుండా పోలీసుల సమక్షంలోనే అతడి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి కుటుంబ సభ్యులపై సైతం కర్రలు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఇదే పరిస్థితి జిల్లా అంతటా కనిపించింది. ఈ ఏడాది కాలంగా జిల్లాలో ఇదే తరహాలో దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. మహిళలని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి పాలనలో రాష్ట్రం మరో బీహారులా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిపైనా కేసులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్బుక్ రాజ్యాంగంతో కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎప్పుడో సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా కేసులు పెట్టింది. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ఏకంగా ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద కూడా కేసులు పెట్టించింది. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి వేధిస్తోంది.జీవనాడులపై పోట్లురైతుల కష్టాలు తీర్చలేనివి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా సాగింది. సకాలంలో వర్షాలు పడటంతో పాటు సాగర్ జలాలు ఐదేళ్ల పాటు సజావుగా తాగు, సాగుకు అందాయి. పుష్కలంగా పంటలు పండాయి. బహిరంగ మార్కెట్లోనే పంటలకు మంచి ధరలు వచ్చాయి. పొగాకులాంటి పంటకు గిట్టుబాటు ధర రాకపోతే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతుల వద్ద నుంచి మాడు పొగాకును కూడా అత్యధిక ధరకు కొనుగోలు చేయించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం జిల్లాలో రైతు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. సకాలంలో వర్షాలు లేవు. ఒక వేళ వర్షాలు పడినా ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అలమటిస్తున్నారు. మిర్చి, పత్తి, శనగ, వరి, పొగాకు రైతులు మద్దతు ధర రాక కుదేలవుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి పండించిన ఒక్క పంటను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఆదుకున్న పాపాన పోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలపై జనం గగ్గోలు.. పోలింగ్కు రెండు రోజుల ముందు ఒంగోలు నగరం అద్దంకి బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచారనీ, తాను అధికారంలోకి వచ్చిన తదుపరి విద్యుత్ చార్జీలు తగ్గిస్గానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత చార్జీలు పెంచుకుంటూ పోతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు. బిల్లులు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు. పొగాకుకు గిట్టుబాటు ధరల కోసం కొండపి–టంగుటూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్)డ్రైవింగ్ స్కూలు.. మొండిగోడలు 13 నెలల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు దర్శిని అభివృద్ధి చేసి ఎక్కడికో తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిస్తాననన్నారు. ప్రస్తుతం దాని గేటు తీసి ఎలా ఉందో చూసిన దాఖలాలు కూడా లేవు. దొనకొండను పారిశ్రామికవాడ చేస్తానని పాతపాట పాడారు. దొనకొండ వైపు ఒక్క కంపెనీ ప్రతినిధి వచ్చి చూసిన దాఖలాలు కూడా లేవు. మొగలిగుండాల రిజర్వాయరు ముఖమే చూడలేదు. రాగమొక్కపల్లి ఎంఎస్ఎంఈ కి ఊసే లేదు. గుండ్లకమ్మ నీరు ముండ్లమూరు, తాళ్లూరుకు కు నీరందిస్తానని పట్టించుకోలేదు. ఇలా ఎన్నికల ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి -
బాబు వెన్నుపోటుపై నిరసన గళమెత్తండి
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కోరారు. చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజలు నిరసన గళమెత్తాలన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. రైతులు, మహిళలు, యువకులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై నిరసన తెలపాలన్నారు.షూటింగ్లో జిల్లా స్థాయి ఎంపికలు రేపు ఒంగోలు: ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక ఈనెల 5న స్థానిక నెక్ట్స్జెన్ స్కూలులో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రైఫిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కమ్మ ఖాదర్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్ రైఫిల్, పీప్ సైట్, ఓపర్ సైట్, పిస్టల్ విభాగాల్లో అండర్ 16, 19, 21, 21 నుంచి 45 సీనియర్ కేటగిరీలకు సంబంధించి ప్రతిభను పరీక్షిస్తారన్నారు. బాలబాలికలకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారు మాత్రమే ఈ ఎంపికకు అర్హులు. ఈ పోటీల్లో మంచి పాయింట్లు సాధించిన వారు ఈనెల 21 నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9505561357 నంబర్ను సంప్రదించాలన్నారు. బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్–23 బాలుర బాస్కెట్ బాల్ జట్టును కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం ఎంపిక చేశారు. మొట్టమొదటి అండర్–23 త్రీ అండ్త్రీ రాష్ట్ర చాంపియన్షిప్ చిత్తూరులో ఈ నెల 4, 5వ తేదీల్లో జరుగుతుంది. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి రవీంద్ర, సెక్రటరీ తొట్టెంపూడి సుబ్బారావు అభినందించారు. పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మార్కాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిస్మిస్ మార్కాపురం: మార్కాపురం అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా (ఎఫ్ఆర్ఓ)గా పనిచేస్తున్న వరప్రసాద్ పై వచ్చిన లైంగిక వేధింపుల కేసులో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట న్యాయస్థానం శిక్ష విధించిన నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరప్రసాద్ గతంలో సూళ్లూరుపేటలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మహిళా ఉద్యోగిని పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఈ ఏడాది ఏప్రిల్లో న్యాయస్థానం ఆయనకు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో వరప్రసాద్ పై నేరం రుజువై శిక్ష ఖరారు కావడంతో ఆయన్ను ప్రభుత్వ విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము పేరుతో మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. -
మిర్చి క్లస్టరు హామీ ఏమైంది
మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో మిర్చిని అమ్మాలంటే అనేక వ్యయప్రయాసలకోర్చి గుంటూరుకు వెళ్లి అమ్ముకుంటున్నాం. ఈ ఏడాది మిర్చి ధరలు పూర్తిగా పడిపోయాయి. గత ఏడాది నవంబరులో క్వింటా రూ.18 వేలు ఉండగా జనవరి నుంచి అనూహ్యంగా మిర్చి ధర రూ.13 నుంచి రూ.14 వేలకు పడిపోయి ప్రస్తుతం క్వింటా రూ.8 వేలు కూడా పలకడం లేదు. నేను మూడున్నర ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. రూ.5 లక్షల పెట్టుబడి ఖర్చులు కాగా మరో రూ.5 లక్షలు అదనపు ఖర్చులు వచ్చాయి. క్వింటా మిర్చి రూ.8 వేలు ధర పలకడంతో వచ్చిన డబ్బులన్నీ కూలీలు, ఇతరత్రా ఖర్చులకే సరిపోయాయి. 2023 లో మిర్చి ధర రూ.22 వేలు పైగా ఉంది. – జగన్, మిర్చి రైతు, ఓబాయపల్లి, తర్లుపాడు మండలం -
జిల్లా ఏర్పాటు ఎప్పుడో...?
అధికారంలోకి రాగానే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి ఏడాది దాటుతోంది. ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. మార్కాపురం జిల్లాగా ఏర్పాటైతేనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. ఏడాది కావస్తున్నా ఇంత వరకూ ప్రకటనలే తప్ప ఆచరణలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం పుల్లలచెరువు, అర్ధవీడు, గిద్దలూరు, కొమరోలు మండలాల ప్రజలు ఒంగోలుకు వెళ్లి పనులు చూసుకుని రావాలంటే ఒకరోజు సమయం పడుతోంది. మార్కాపురం జిల్లా ఏర్పాటైతే ఈ సమస్యలు తీరుతాయి. – కేవీ రమణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పొదిలి -
హరిత శోభితంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: హరిత శోభిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సంబంధిత శాఖలు సమన్వయంతో వివిధ వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవనం మనం్ఙ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమం అమలుపై మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీఎప్ఓ (సోషల్ ఫారెస్ట్) రాజశేఖర్ మాట్లాడుతూ 5 వ తేదీన ప్రకాశం జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటడం లక్ష్యమన్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు 6 నెలల వ్యవధిలో జిల్లాలో 35 లక్షల 76 వేలకు పైగా మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 36 శాతం అటవీ విస్తీర్ణం ఉందని, దీనిని 50 శాతానికి పెంచేలా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థల్లో విస్తృత స్థాయిలో వీటిని నాటేలా చూడాలన్నారు. సంబంధిత శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నాటేలా మొక్కలను సరఫరా చేయాలని హార్టీకల్చర్, అటవీ శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యాన అధికారి గోపి చంద్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాఘవరెడ్డి, డ్వామా ఏపీడీ వండర్ మాన్, హౌసింగ్ బోర్డు ఎస్ఈ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల సంస్థ జీఎం శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి అంజల, డీపీఓ గొట్టిపాటి వెంకట నాయుడు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, జిల్లా ఉప విద్యాధికారి చంద్ర మౌళి, జిల్లా పరిషత్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పశ్చిమ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని, వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో మార్కాపురం మండలం రాయవరం వద్ద రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. 75 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేయడం దారుణం. ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టి, పూర్తి చేసి వైద్య విద్యను, కార్పొరేట్ వైద్య సేవలను అందించాలి. పశ్చిమ ప్రకాశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ. జీజీహెచ్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. – అందె నాసరయ్య, మెడికల్ కాలేజీ పరిరక్షణ కమిటీ కన్వీనర్, మార్కాపురం -
మురుగమ్మి కొండ!
పిండవుతున్న ఎట్టకేలకు కదిలిన మైనింగ్ శాఖ మురుగమ్మిలో వైట్ క్వార్ట్జ్ అక్రమ మైనింగ్పై గ్రామస్తులు వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేయగా ఎట్టకేలకు మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. మైనింగ్ శాఖ ఏజీ పోలిరెడ్డి, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్నది వాస్తవమేనని నిర్ధారించారు. మైనింగ్ శాఖ అధికారులు వచ్చారని తెలుసుకున్న స్మగ్లర్లు, డ్రైవర్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో వాహనాలతోపాటు తరలించేందుకు సిద్ధం చేసిన రాయిని సీజ్ చేశారు. వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు మైనింగ్ ఏజీ చెప్పారు. పీసీపల్లి: వ్యక్తిగత ‘సంపద సృష్టి’ కోసం ఓ టీడీపీ నాయకుడు బరితెగించాడు. మురుగమ్మి సమీపంలోని పచ్చటి కొండ ప్రాంతంలో విరివిగా లభ్యమవుతున్న వైట్ క్వార్ట్జ్ ముడి ఖనిజాన్ని అడ్డగోలుగా తవ్వేస్తున్నాడు. మూడు జేసీబీలతో కొండ ప్రాంతంలో తీసిన భారీ కందకాలు చూసి విస్తుపోవడం గ్రామస్తుల వంతయింది. టీడీపీ నేత సాగిస్తున్న ధ్వంసరచనపై మైనింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా స్పందిచడం విమర్శలకు తావిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పీసీపల్లి మండలంలోని మురుగమ్మి గ్రామ పరిధిలో అటవీ, బంజర, పోరంబోకు భూముల్లో వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. వైట్ క్వార్ట్జ్ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం రచించిన మురుగమ్మి గ్రామ టీడీపీ నాయకుడు తెలంగాణకు చెందిన వ్యక్తులతో కలిసి అక్రమ మైనింగ్కు తెరలేపాడు. రాత్రీపగలు అనే తేడా లేకుండా మూడు జేసీబీలతో కొండ ప్రాంతాన్ని తొలిచేస్తున్నాడు. సుమారు 20 అడుగుల లోతున.. దాదాపు 70 చోట్ల తవ్విన భారీ గోతులు అటవీ భూముల రూపురేఖలనే మార్చేశాయి. రూ.లక్షల్లో అక్రమార్జన వైట్ క్వార్ట్ట్జ్ను గాజు తయారీ పరిశ్రమలు, మెటల్ కాస్టింగ్, రబ్బర్, పెయింట్, సెరామిక్, పెట్రోలియం తదితర పరిశ్రమల్లో అవసరాలకు అధికంగా వినియోగిస్తారు. రాయి నాణ్యతను బట్టి పరిశ్రమలు ధర చెల్లిస్తాయి. పీసీపల్లి మండలంలో మురుగమ్మితోపాటు మరికొన్ని గ్రామాల్లో లభ్యమయ్యే వైట్ క్వార్ట్జ్కు మంచి ధర పలుకుతుండటంతో టీడీపీ నాయకుడు అక్రమ తవ్వకాలకు పూనుకున్నాడు. రూ.లక్షల విలువ చేసే రాయిని తెలంగాణకు చెందిన కొందరు పెట్టుబడిదారులతో కలిసి తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ అక్రమ బాగోతంపై కొందరు గ్రామస్తులు మైనింగ్, అటవీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏమీ చేయలేరట! వైట్ క్వార్ట్జ్ అక్రమ మైనింగ్పై గ్రామస్తులు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు మరింతగా రెచ్చిపోయాడు. ‘అధికారులకు ముట్టజెప్పాల్సింది ముట్టజెప్పాం. అధికారంలో ఉంది మేమే. ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ టీడీపీ నేత బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మురుగమ్మి కొండ ప్రాంతంలో వైట్ క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై మార్కాపురం మైనింగ్ ఏడీని వివరణ కోరగా.. ‘మాకు సంబంధం లేదు. ఫారెస్ట్ అధికారులదే బాధ్యత’ అని చెప్పారు. అటవీశాఖతోపాటు బంజరు భూముల్లో అడ్డగోలుగా వైట్ క్వార్జ్ట్ మైనింగ్ కొండ ప్రాంతంలో మూడు జేసీబీలతో భారీ కందకాలు మురుగమ్మి గ్రామ టీడీపీ నాయకుడే సూత్రధారి వైట్ క్వార్జ్ట్ ముడి ఖనిజాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారుల మౌనం గ్రామస్తుల వరుస ఫిర్యాదులతో ఆలస్యంగా తనిఖీ -
కారు ఢీకొని వృద్ధుడు మృతి
చీమకుర్తి రూరల్: రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధుడిని వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్రగాయాలతో మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన చీమకుర్తి మండలంలోని రెడ్డినగర్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డి నగర్కు చెందిన గుణపాటి తిరుపతిరెడ్డి(60) సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు పక్కన నిల్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒంగోలు నుంచి చీమకుర్తి వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తిరుపతిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మంగళవారం జీజీహెచ్లో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కారుతోపాటు ఓనర్ను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చీమకుర్తి సీఐ సుబ్బారావు తెలిపారు. -
పోలీస్ క్రికెట్ టోర్నీ విజేత జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్టు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా సబ్ డివిజన్ పోలీసు అధికారుల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్టు 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచ్లో జిల్లా సబ్ డివిజన్ పోలీస్ జట్టు నిర్ణీత 9.5 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 6.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టును ఎస్పీ అభినందించారు. నిత్యం విధులు, బందోబస్తులతో సతమతమవుతున్న పోలీసు అధికారులు, సిబ్బందికి మానసికోల్లాసం కలిగించడానికి క్రీడా పోటీ నిర్వహించినట్లు చెప్పారు. ఏఆర్ ఎస్పీ అశోక్ బాబు, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, నాగరాజు, సాయిఈశ్వర్ యశ్వంత్, శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఆత్మ రక్షణకు కరాటే ఉపయోగకరం
● ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్బాబు ఒంగోలు: ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగకరమని ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్బాబు అన్నారు. స్థానిక హైదరీ క్లబ్ ఆవరణలో మంగళవారం కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మర్ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. జిల్లా ఽఅధ్యక్షుడు గుండవరపు రాఘవ, ఉపాధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, అసిస్ట్ డిప్యూటీ డైరెక్టర్ వడ్డెంపూడి సుజాతారావు, ప్రకాశం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కరరావు తదితరులు బెల్టులు అందించారు. కార్యక్రమంలో కోచ్ నల్లూరి మోహనరావు, సిద్దార్థ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, అట్లూరి శ్రీధర్, వల్లపు వెంకటేశ్వర్లు, పీవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు● డీటీసీ సుశీల కొమరోలు: రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీటీసీ సుశీల తెలిపారు. మండలంలోని తాటిచెర్లమోటులో 10 రోజులక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మంగళవారం డీటీసీ సుశీల, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీటీసీ సుశీల సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ప్రమాదం ఏ విధంగా జరిగిందో వివరించారు. ఈ సందర్భంగా డీటీసీ సుశీల మాట్లాడుతూ వాహనాలు వేగంగా నడుపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వాహనదారులు అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, కొమరోలు ఎస్సై నాగరాజు పాల్గొన్నారు. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య తర్లుపాడు: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తర్లుపాడు మండల పరిధిలోని కేతగుడిపి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మార్కాపురం రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణారెడ్డి కథనం ప్రకారం.. మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముండే చిలకా నాగయ్య(60) తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం ఉదయం రైల్వే పోలీసులు కేతగుడిపి సమీపంలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. స్థానికంగా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడంతో మృతుడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
బడుగులపైనా పోలీసుల దౌర్జన్యం..?
సింగరాయకొండ: రాష్ట్రంలో తెనాలి ఘటన మరవకముందే కొండపి మండలం జాళ్లపాలెంలో మహిళలపై ఎస్సై దౌర్జన్యం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తుందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాళ్లపాలెం ఘటనలో ఎస్సై రమేష్బాబు సీసీ ఫుటేజీ కోసం దుకాణంలోని మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, ఇంట్లోకి బలవంతంగా వెళ్లి హార్డ్డిస్క్, సెల్ఫోన్, పెన్డ్రైవ్లు బలవంతంగా తీసుకెళ్లారన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి వీరిపైనే కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా చట్టాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాయడం హేయమైనచర్యగా అభివర్ణించారు. ఈ ఘటనలో ఎటువంటి రాజకీయానికి తావు లేదని, కానీ మంత్రి స్వామి మాత్రం ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పట్టపగలు ఎస్సై రమేష్బాబు మహిళలపై దౌర్జన్యం చేస్తే మంత్రి స్వామి కులం పేరుతో వైఎస్సార్ సీపీపై అభాండాలు వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 766 హత్యాయత్నాలు, హత్యలు జరిగాయని, 390 మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. సుమారు 2,466 మందిపై అక్రమ కేసులు బనాయించారని, 500 మందిని జైలుకు పంపారని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు సోషల్మీడియా యాక్టివిస్టులపై 440 కేసులు బనాయించి 79 మందిని జైలుకు పంపారన్నారు. జాళ్లపాలెం ఘటనలో రౌడీషీటర్ ఉన్నాడని, మహిళ ఎస్సైపై దాడి చేసిందని మంత్రి స్వామి ఆరోపిస్తున్నాడని, మంత్రి అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని హితవుపలికారు. షాపు యజమాని కొండలరావుకు వాటర్ప్లాంట్ ఉంటే టీడీపీ శ్రేణులు జేసీబీ తీసుకువచ్చి ధ్వంసం చేసి సామానులు వాగులో పడేశారని, దీనిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. జగ్గరాజుపాలెం పెట్రోల్బంకు వద్ద దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. జాళ్లపాలెం ఘటనలో బాఽధితులతో జగనన్న మాట్లాడతాడనే సరికి హడావుడిగా బాధితులపైనే కేసులు నమోదు చేశారన్నారు. ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ న్యాయం చేయాలని కోరారు. కొండపి మండలం పెట్లూరులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కల్లూరి చంద్రమౌళికి చెందిన 3.5 ఎకరాల బొప్పాయి తోటను ధ్వంసం చేశారని, రూ.20 లక్షల విలువైన పంటను ధ్వంసం చేసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. కేసుల విషయంలో హోంమంత్రి కులం ప్రస్తావన వద్దంటే, మంత్రి స్వామి మత్రం కుల ప్రస్తావన తీసుకువస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో బలహీన వర్గాల వారిపై ఎన్నో దాడులు జరిగాయని, కానీ చర్యలు లేవని మండిపడ్డారు. వెన్నుపోటు దినం జయప్రదం చేయండి ఏడాది పాలనలో ఒక్క హామీని అమలు చేయని కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం 10 గంటలకు కొండపిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తహశీల్దార్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్కుమార్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గాదంశెటి గుప్తా, సోమిశెట్టి సురేష్, షేక్ కరీం, కోమట్ల వెంకారెడ్డి, మిడసల అశోక్, పి శ్రీనివాసులరెడ్డి, షేక్ అబ్దుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల హక్కులు హరిస్తున్న కూటమి ప్రభుత్వం జాళ్లపాలెం ఘటనను వక్రీకరిస్తున్న మంత్రి స్వామి, ఎస్పీ దామోదర్ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ -
పూరి గుడిసె దగ్ధం
● రూ.2 లక్షల ఆస్తి నష్టం యర్రగొండపాలెం: స్థానిక గాయత్రి థియేటర్కు సమీపంలో ఉన్న పూరిగుడిసె మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ సంఘటనలో దాదాపు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాలు.. బేల్దారి పనులు పనిచేసుకునే పోలేపల్లి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఆరుబయట కూర్చుని టిఫిన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుడిసెకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమై మంటలు ఆర్పేలోగా గుడిసెతోపాటు ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. బ్యాంకులో పొదుపు గ్రూపు ఖాతా నుంచి డ్రా చేసుకుని వచ్చిన రూ.80 వేల నగదు, టీవీ, బీరువా, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు అదుపు చేశారు. తక్షణ సహాయం కింద చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు రూ.8,500 నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. -
ప్రకాశం: మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రెడ్బుక్ రాజ్యాంగంలో సామాన్యుల పట్ల పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ ఎ.రమేష్బాబు మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి.. అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు.బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.కాగా, ఈ కేసులో జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు అదేరోజు కొండపి పోలీస్స్టేషన్కు, ఎస్పీ ఏఆర్ దామోదర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో సోమవారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్ఐ రమేష్బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్డ్రైవ్ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు.దీంతో ఎస్ఐ రమేష్బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు.నేటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్ఐ ఫోన్ కట్ చేశారు. తరువాత కొండలరావు కుటుంబ సభ్యులపై ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎంత పొగరు. తలుపులు వేసేస్తారా’ అని తలుపులు నెట్టుకుంటూ షాపులోకి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టారు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్వీఆర్, మొబైళ్లు, పెన్డ్రైవ్లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కొండలరావు కొండపి పోలీస్స్టేషన్లోను, ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని, తక్షణమే విచారించి న్యాయం చేయటంతో పాటు దోషులను శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులను రికవరీ చేసి ఇప్పించాలని మరోమారు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోనని అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన శ్రీమీ కోసం్ఙ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ‘మీ కోసం’ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్ధవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆమె ఆదేశించారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని ఆమె చెప్పారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్, కుమార్, జాన్సన్, డిప్యూటీ కలెక్టర్ పార్ధసారథి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
● జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ ఒంగోలు సబర్బన్: జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, డీఎల్పీఓలు, ఈఓఆర్డీలు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఎస్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ పథకం పనుల పురోగతి, హౌసింగ్ పురోగతి, ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమంపై, యోగాంధ్ర క్యాంపెయిన్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకనుగుణంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం ఉండగా, ప్రకాశం జిల్లాలో 36 శాతం ఉందన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ వరకు జిల్లాలో 35 లక్షల 75 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారన్నారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వీడియో సమావేశంలో డీఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్ రాజశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో బాల అదాలత్లు ఏర్పాటు చేయాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో బాల పంచాయతీలు (బాల అదాలత్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి కోరారు. ఈ మేరకు కమిషన్ సభ్యురాలు పద్మావతి..కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను సోమవారం ఆమె ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు కొన్ని సూచనలు చేశారు. జిల్లాలోని బాల బాలికల సమస్యలను కమిషన్ సభ్యురాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎంఎస్కేలు క్షేత్రస్థాయిలో పిల్లలతో మమేకమై పని చేయాలని సూచించారు. స్కూల్స్ జూన్ 12 నుంచి పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫీజుల జాబితాలను ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాలని కలెక్టర్కు సూచించారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు కూడా 25 శాతం ఉచితంగా సీట్లు ప్రైవేటు స్కూళ్లలో చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించి డీఈఓ కార్యాలయ అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఆడపిల్లలకు హెచ్బీ శాతం ప్రతినెలా చెక్ చేయాలని కలెక్టర్కు సూచించారు. ఏపీఆర్జేసీ అండ్ గురుకులం పాఠశాలల్లో చిన్నారులపై వేధింపులు లేకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. ఆయా స్కూళ్లలో కంప్లెయింట్ బాక్స్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి సీసీఐలలో ఉన్న పిల్లల పెండింగ్ కేసులు పూర్తి చేయాలని, తిరుపతిలోని హోంలో ఉన్న పిల్లలకు విద్యపై ఆసక్తి కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో పద్మావతితో పాటు డీసీపీఓ పి.దినేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. బాలల సమస్యలపై ఆ సమావేశాల్లో చర్చించాలి కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సూచించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మావతి -
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలన ఏడాదిగా కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఓట్లు వేయించుకునేందుకు ప్రజలను మభ్యపెట్టేలా ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. అమలు చేయమని అడుగుతున్న వారిపై అధికారాన్ని, అధికారులను అడ్డంపెట్టుకుని దాడులు, బెదింపులు, అరెస్టులు చేయిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ సుమారు 400 మంది హత్యకు గురయ్యారని, 800 మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే ఇంత దుర్మార్గమైన పాలన ఎటువైపు వెళుతోందో ప్రజలు గమనించాలన్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక వంచిస్తోందని, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని, ఇందుకు నిరసనగా ఈ నెల 4వ తేదీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలసి వంచనకు పాల్పడుతున్న చంద్రబాబుపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. 4వ తేదీ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడాదిగా కూటమి నేతలు చేసిన మోసానికి ప్రజలు ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తప్పుడు కేసులకు భయపడం: తప్పుడు కేసులు పెడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తోందని, దీనికి భయపడేది లేదన్నారు. ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుని ప్రభుత్వం 30 యాక్టు, 144 సెక్షన్లు అంటూ నిబంధనలు పెడుతోందని చెవిరెడ్డి విమర్శించారు. ప్రజల పక్షాన పోరాటం చేసే సమయంలో పుట్టిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, ఎలాంటి బెదిరింపులకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బెదరని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని విలేకరుల సాక్షిగా చెప్పే ధైర్యం ఈ మంత్రులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. రేషన్ వాహనాలు రద్దు చేయడంతో నేడు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొచ్చే బియ్యాన్ని ఈ రోజు ఎన్నో అవస్థలు పడి తెచ్చుకోవాల్సి వస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పెద్ద ఎత్తున జనం పోరాటాలకు ముందుకు వస్తున్నారన్నారు. ఒక సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. తొలుత ఈ నెల 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించిందన్నారు. చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు పీకేయడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 20 వేల మంది ఎకై ్సజ్ లో పనిచేస్తున్న సిబ్బందిని, 9 వేల మంది రేషన్ వాహనాల డ్రైవర్లు తొలగించి వెన్నుపోటు పొడిచారన్నారు. రైతులను, మహిళలను, అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని, ఇలా అన్ని వర్గాల వారిని వెన్నుపోటు పొడిచారన్నారు. మా పార్టీ పిలుపు మేరకు జూన్ 4వ తేదీ అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు కనువిప్పు కలిగేలా ఈ వెన్నుపోటు దినంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, దేవా, శ్రీకాంత్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు సాధం విజయలక్ష్మి, అప్సర్బేగ్, తదితరులు పాల్గొన్నారు. ఏడాదిలో 400 మంది హత్యకు గురయ్యారు 800 మందిపై దాడులు జరిగాయి ఎన్ని యాక్టులు పెట్టినా బెదిరేదిలేదు తప్పుడు కేసులకు భయపడం 4వ తేదీ నిరసనను విజయవంతం చేయండి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబువెన్నుపోటు దినం వాల్పోస్టర్ను ఆవిష్కరిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చుండూరు రవిబాబు తదితరులు -
కష్టాల మూట
కార్డుదారులకుఒంగోలు సబర్బన్: జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ తీరుతో కార్డుదారులు నరకం చవిచూస్తున్నారు. ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ దుకాణాలకు తంటాలు పడుతూ వెళ్లి బియ్యం తీసుకున్నా.. మోసుకెళ్లే క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు పడుతున్న అవస్థలు అన్నీ కావు. దీనికి తోడు సర్వర్ తరచూ మొరాయిస్తుండటంతో గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదు. అంతసేపు క్యూలో నిల్చోలేక వృద్ధులు, మహిళలు నేలపై కూలబడి తమ వంతు కోసం వేచి చూస్తున్న పరిస్థితి. డీలర్లు బియ్యం ఇంటికి తెచ్చి ఇవ్వరన్న భయం, లేవని తిరస్కరిస్తారన్న ఆందోళనతో వృద్ధులు, దివ్యాంగులు రేషన్ షాపుల వద్దకు క్యూకడుతున్నా వారికి భరోసా ఇచ్చే వారు కరువయ్యారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం తెచ్చిస్తారన్న అధికారుల మాట కేవలం ప్రకటనలకే పరిమితమైంది. అప్పుడే బాగుంది.. ఇప్పుడిదేంది? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించకూడదనే సదుద్దేశంతో ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు) విధానాన్ని తీసుకొచ్చారు. కార్డుదారుల ఇళ్ల వద్దకే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో సంతోషంగా తీసుకున్నారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న విధానానికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడుతూ ఎండీయూ వాహనాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో కార్డుదారులు శాపనార్థాలు పెడుతూ బియ్యం మోసుకెళ్తున్నారు. పల్లెల్లో రేషన్ పంపిణీ తీరు దారుణంగా మారింది. సుమారు 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేక కార్డుదారులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. బియ్యం మోసుకెళ్లలేక మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు పనులు మానుకుని రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు సర్వర్ మొరాయిస్తుండటంతో ప్రహసనంగా సరుకుల పంపిణీ -
జేఈఈ అడ్వాన్స్లో సత్తా చాటారు
ఒంగోలు సిటీ: జేఈఈ అడ్వాన్స్ 2025 పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో ఒంగోలుకు చెందిన శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి ఎం.రఘునాథ్ మకని 3వ ర్యాంకు, బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురానికి చెందిన మంతు వెంకట రవిచంద్రారెడ్డి ఆల్ ఇండియా 8వ ర్యాంక్ సాధించారు. పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పాల మణికంఠ నాయుడు 630వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి వి.మణికంఠబాబు 119 వ ర్యాంక్, కె.లోకక్రిటి 1343 వ ర్యాంక్ సాధించారని ఆల్ ఇండియా స్థాయిలో శ్రీసరస్వతి విద్యాసంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చైర్మన్ రమణారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎ.గణేష్రెడ్డి, ఎ.గంగాశంకరరెడ్డి, సీఈఓ ఎన్.వి.సురేష్, డీన్స్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు అభినందనలు తెలిపారు. ● జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యార్థి కాటూరి హరినాథ్ ఆల్ఇండియా స్థాయిలో 994 (ఎస్సీ కేటగిరీలో) ర్యాంకు సాధించినందుకు ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాశ్నారాయణ్, అధ్యాపకులు, సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపారు. ● ఆర్.వి.హాసిని ఆల్ ఇండియా స్థాయిలో 2237వ ర్యాంకు సాధించింది. తండ్రి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి జలవనరుల శాఖలో ఉద్యోగిగా, ఎన్జీఓ సంఘ నాయకునిగా ఉన్నారు. తల్లి ఎం.జ్యోతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ● ఉమామహేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థిని దాసరి యామిని ఆల్ ఇండియా స్థాయిలో 3837 (ఎస్సీ కేటగిరీ) లో సాధించినందుకు డైరెక్టర్స్ సి.మల్లేశ్వరరావు, సి.జయలక్ష్మి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ● జేఈఈ అడ్వాన్స్డ్ లో ఒంగోలు ఎస్.ఆర్ కళాశాల విద్యార్థి దాసరి గగన్కుమార్కు జాతీయ స్థాయిలో 1857 వ ర్యాంక్ సాధించినందుకు అకడమిక్ డీన్ అరవింద్, జోనల్ ఇన్చార్జ్ బి.శ్రీనివాస్, డీన్ శంకరరావు, ప్రిన్సిపాల్ కె.బాలరాజు, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. -
ఫిర్యాదులపై సత్వర స్పందన
ఒంగోలు సీటీ: ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లాలోని పోలీస్ అధికారులను ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఎస్పీ అర్జీలు స్వీకరించారు. సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, జాబ్ మోసాలు, భూ వివాదాలు తదితర సమస్యలపైనే అధికంగా అర్జీలు వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రమణ కుమార్, సీసీఎస్ సీఐ జగదీష్, ఎస్సీ,ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం నాగులుప్పలపాడు: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం కావడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధిత వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటన సోమవారం ఉదయం నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలులో చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. అమ్మనబ్రోలు ముస్లిం కాలనీకి చెందిన షేక్ కమ్రాన్ అనే వృద్ధురాలి పూరింట్లో విధ్యుత్ తీగలు షార్ట్సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించి మంటలు ఆర్పేలోగా పూరిల్లు మొత్తం కాలిపోయింది. ఈ సంఘటనలో వృద్ధురాలు రెండు రోజుల క్రితం తీసుకున్న పెన్షన్ నగదుతో సహా మొత్తం రూ.50 వేల డబ్బు, దుస్తులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని బాధిత వృద్ధురాలు వేడుకుంటోంది. ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ గ్రీవెన్స్కు 79 ఫిర్యాదులు -
చిక్కుముళ్లు!
వివాహ ధ్రువీకరణకు కంభం: మూడు ముళ్ల బంధానికి ధ్రువీకరణ పత్రం పొందాలంటే సాంకేతిక చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. ఏ కులం వారికై నా వివాహం చేసుకోడానికి అర్హత వయసు వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకునే సమయంలో మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నిబంధనలు పెట్టడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారు తమ భార్య వివరాలు రికార్డుల్లో నమోదు చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. అందులో మొదటిది హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, రెండోది స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికెట్. హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్ పొందేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ స్పెషల్ కేటగిరీ కిందకు వచ్చే ముస్లింలు, క్రిస్టియన్లు వివాహ ధ్రువీకరణ పత్రం పొందలేక అవస్థలు పడుతున్నారు. దరఖాస్తులోనే తిరకాసు! హిందూ మ్యారెజ్ సర్టిఫికెట్ అవసరమైన వారు దరఖాస్తు చేసే సమయంలో పెళ్లికూతురి వయసు 18 ఏళ్లు ఉంటే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసేందుకు వీలవుతోంది. అయితే స్పెషల్ మ్యారెజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ముస్లింలు, క్రిస్టియన్ వర్గాలకు చెందిన యువతుల వయసు 18 ఏళ్లు నిండినా వైబ్సైట్లో వివరాలు పొందుపరిచేందుకు అవకాశం ఉండటం లేదు. పెళ్లి కుమార్తె వయసు కచ్చితంగా 21 ఏళ్లు ఉండాలని వెబ్సైట్లో స్పష్టం చేయడంతో తలపట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ‘తాము ఏమీ చేయలేం, ఆన్లైన్లో ఉన్న దాని ప్రకారం దరఖాస్తు చేసుకోండి’ అని సూచిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగులకూ తిప్పలు ఆర్మీ ఉద్యోగులతోపాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి. అదే విధంగా ఆధార్, రేషన్ కార్డులో వివరాల నమోదుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరమవుతోంది. అయితే స్పెషల్ కేటగిరీ వర్గాలకు చెందిన యువతులకు 21 ఏళ్ల వయసు నిబంధన విధించడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. ఇదిలా ఉండగా నిరక్షరాస్యులు వయసు ధ్రువీకరణ తెలియజేసే అవకాశం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికెట్ల జారీలో సాంకేతిక సమస్య ఆ కేటగిరీ కింద ముస్లింలు, క్రిస్టియన్లు వివాహానికి అర్హత వయసు యువతులకు 18, యువకులకు 21 ఏళ్లు స్పెషల్ కేటగిరీలో యువతులకు 21 ఉంటేనే దరఖాస్తుకు అవకాశం ఈ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు -
పేదలకు నివేశన స్థలాలివ్వాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలం మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రానికి తహసీల్దార్కు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు సంపద దోచిపెట్టే విధంగా పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్లు, మహిళలకు ఉచిన బస్సు, మహిళకు నెలకు రూ.1500, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇచ్చే పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఒంగోలులోని అగ్రహారం దగ్గర ఇచ్చిన పట్టాలకు పొజిషన్ చూపాలని, ఒక సెంటు భూమిని రెండు సెంట్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న 42వ డివిజన్ సరళాదేవినగర్, 16వ డివిజన్ దత్తాత్రేయ కాలనీ, కార్మిక నగర్ గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలన్నారు. సీపీఐ నాయకులు ఆర్.వెంకట్రావు, ఆర్.రామకృష్ణ, ఎం.విజయ, శ్రీరాం శ్రీనివాసరావు, ఎంఏ సలార్, నూనె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు గృహాల్లో చోరీ
● 2 తులాల బంగారం, రూ.36 వేల నగదు అపహరణ జరుగుమల్లి(సింగరాయకొండ): తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీకి తెగబడ్డారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలోని ఎస్టీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటచేసుకుంది. కాలనీలోని వల్లెపు అంజమ్మ, వేటగిరి ప్రశాంతి ఇళ్ల తాళాలు పగలగొట్టి సుమారు 2 తులాల బంగారం, రూ.36 వేల నగదు చోరీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీపెద్దారవీడు: బత్తాయి లోడ్తో వేగంగా వెళ్తున్న లారీ కూల్డ్రింక్, జ్యూస్ షాపుల్లోకి దుసుకెళ్లింది. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు బస్టాండ్లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కనిగిరి ప్రాంతం నుంచి బత్తాయి లోడుతో రాజస్థాన్కు వెళ్తున్న లారీ దేవరాజుగట్టు జంక్షన్లోని హైవే అండర్ పాస్ మూలమలుపు వద్ద అదుపు తప్పింది. తెల్లవారుజామున లారీ డ్రైవర్కు రూట్ అర్థం కాక నేరుగా షాపుల ముందున్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి దూసుకెళ్లింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయందోళన చెంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ స్తంభాలు విరిగి తీగలు వేలాడుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సరఫరాను నిలుపుదల చేశారు. కూల్డ్రింక్ దుకాణం యజమాని మునగపాటి నాగరామాచారికి రూ.1.50 లక్షలు, జ్యూస్ షాప్ యజమాని సుబానీకి రూ.40 వేల మేర నష్టం వాటిల్లింది. లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు కాగా మార్కాపురం జీజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పవర్లిఫ్టింగ్లో యువత రాణించాలి ఒంగోలు: పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతి ఇనుమడింపజేయాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మినీ స్టేడియంలో పవర్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి ముగింపు పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చివరిరోజు నిర్వహించిన జూనియర్ మెన్ బెంచ్ ప్రెస్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలకు మెమెంటోలు, పతకాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో వివిధ విభాగాలలో రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు సాధన చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయి పోటీలలో సైతం సత్తా చాటి రాష్ట్ర క్రీడాఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ప్రభాకరరావు, గంటా వెంకటేశ్వర్లు, సౌత్ జోన్ సెక్రటరీ సకల సూర్యనారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పవన్కుమార్, కార్యదర్శి జి.భక్తధృవుడు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. -
చోరీ కేసులో సొత్తు రికవరీ
సంతనూతలపాడు: మండల కేంద్రమైన సంతనూతలపాడులోని రజకవాడలో ఓ ఇంట్లో గత నెల 31వ తేదీ రాత్రి చోరీ అయిన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. రజకవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి గృహంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 25 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. 10 గ్రాముల బంగారు బ్రాస్లెట్, నాలుగు గ్రాముల బంగారు ఉంగరం, ఆరు గ్రాముల బంగారు బుట్ట కమ్మలు, నాలుగు గ్రాముల బంగారు కమ్మలు చోరీకి గురైనట్టు బాధితుడు ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ ఉదయ్కుమార్ కేసు నమోదు చేశారు. ఒంగోలు రూరల్ సీఐ ఎన్.శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన సంతనూతలపాడు పోలీసులు తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన పొదిలి బ్రహ్మయ్యను నిందితుడిగా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం సంతనూతలపాడు బస్టాండ్ సెంటర్లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ అయిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభచాటిన హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ కుమార్, కానిస్టేబుళ్లు నారాయణరెడ్డి, నాగార్జునను డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీకాంత్బాబు అభినందించారు. -
కూటమి నేతల దాష్టీకం
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న అక్కసుతో ఓ రైతుకు చెందిన బొప్పాయి తోటను కూటమి నేతలు ధ్వంసం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో జరిగింది. బాధిత రైతు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కల్లూరి చంద్రమౌళి కుటుంబం మొత్తం వైఎస్సార్సీపీ సానుభూతిపరులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నేతలు, గ్రామంలోని ఎస్సీలను రెచ్చగొట్టి వారిచేత చంద్రమౌళి, అతని బంధువులకు చెందిన 4.40 ఎకరాల పట్టా భూమిని స్వాదీనం చేసుకున్నారు. అప్పటికే ఆ పట్టా భూమి వ్యవహారంపై కందుకూరు కోర్టులో చంద్రమౌళికి అనుకూలంగా స్టే ఆర్డరు ఉంది. అయినా దానిని ఆక్రమించి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఆక్రమణ విషయమై కలెక్టర్కు అర్జీ ఇవ్వడంతో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఆ భూమిలో జేసీబీలతో గుంతలు తీయించి ఆక్రమణదారులు చిన్న గృహాల్లా కట్టుకుని అందులో బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. బెల్ట్షాపు నిర్వాహకుడిని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకోవడంతో అది చంద్రమౌళే పట్టించాడని నిర్వాహకుడు నానా హంగామా చేశాడు.ఈక్రమంలో అధికారులు ఆక్రమిత భూమిలోని ఇళ్లను ఖాళీ చేయించారు. దీనిపై కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు సర్వే నంబర్ 49–1బీలో చంద్రమౌళి సాగు చేసిన బొప్పాయి తోటను శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. -
రేషన్ వాహనాలు రద్దు చేయడం సరికాదు
ప్రభుత్వం రేషన్ వాహనాలు రద్దు చేయడం వలన గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న చెంచుగూడెం వాసులు రేషన్ షాపులకు బియ్యం ఏ విధంగా తీసుకొని వెళ్లగలుగుతారు. గత ప్రభుత్వం ఇంటివద్దకే రేషన్ బియ్యం పంపించేలా చర్యలు తీసుకుంది. దీనివలన చెంచు మహిళలు తమ బియ్యం మూటలను నెత్తిన పెట్టుకొని మోసుకొని వెళ్లే బాధ తప్పింది. కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలు ఎందుకు రద్దు చేసిందో అర్థం కావడం లేదు. వెంటనే వాహనాలను పునరుద్ధరించి చెంచులను ఆదుకోవాలి. – భూమని ఈరన్న, గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
మోత బరువులు
పడిగాపులు..సమయపాలన ఏదీ... రేషన్ ప్రారంభించిన మొదటి రోజే రేషన్ డీలర్లు సమయ పాలన పాటించలేదు. కొన్ని చోట్ల ఉదయం 11 గంటలకు కూడా రేషన్ షాపులకు తాళాలు వేసి ఉన్నాయి. జిల్లాలోని రేషన్ షాపులు 1,392 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం కార్డులు 6,70,571 కాగా సరఫరా చేస్తున్న సరుకులు బియ్యం 9,500 మెట్రిక్ టన్నులు, చక్కెర 350 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ అందజేయాలి. అలాంటిది మొదటి రోజే రేషన్ డీలర్లు ఇష్టారీతిన వ్యవహరించి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారు. ఆదివారం కావటంతో పనులకు వెళ్లని వాళ్లు కాబట్టి సర్దుకు పోయారు. ఇక పనిదినాల్లో రేషన్ కోసం ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటాయన్నది మొదటి రోజే అర్థమైంది. ఒంగోలు సబర్బన్: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ తొలిరోజు ప్రహసనంగా మారింది. పేదలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించకూడదనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్దకే రేషన్ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు) విధానాన్ని తీసుకొచ్చారు. అలాంటి విధానానికి మంగళం పాడిన ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ వాహనాలను పూర్తిగా రద్దుచేసింది. మళ్లీ పాత వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల కష్టాలకు తెర తీసింది. ఈ నిర్ణయంతో రేషన్ సరుకుల పంపిణీ ఇక డీలర్ల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంటుందనటానికి ఆదివారం నుంచి ప్రారంభమైన రేషన్ పంపిణీనే నిదర్శనం. రేషన్ కష్టాలు, మోత బరువు మళ్లీ దాపురించిందని పేదలు వాపోతున్నారు. సర్వర్ల మొరాయింపు...పడిగాపులు... జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సర్వర్లు మొరాయించడంతో కార్డుదారులు గంటల తరబడి షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ షాపులు పసుపు బెలూన్లతో నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే షాపు ప్రారంభానికి టీడీపీ కూటమి నాయకులు రాలేదని షాపు వద్దకు రేషన్ కోసం వచ్చిన వారిని గంటల తరబడి కూర్చోబెట్టారు. దాంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. రేషన్ షాపు డీలర్ను ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే డీలరు కూడా ఒక రాజకీయ నాయకుడే కావటంతో కిమ్మనకుండా కూర్చోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. రెండు వస్తువుల కోసం ఏమిటీ పడిగాపులు... కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న రెండు వస్తువుల కోసం ఏమిటీ పడిగాపులు అని షాపుల వద్దకు వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ షాపుల్లో కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పురుగులు పట్టిన బియ్యాన్ని సరఫరా చేసేవారు. అలాంటిది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సార్టెక్స్ (నాణ్యమైన) బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా పేద ప్రజల కడుపునింపారు. దీంతో పాటు పంచదార, కందిపప్పు, మిల్లెట్స్, గోధుమ పిండి వంటి నిత్యావసరాలను సబ్సిడీపై అందించారు. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాలంలో నెమ్మదిగా ఒక్కోటి ఎగిరిపోయాయి, ఇప్పట్లో కందిపప్పు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం బియ్యం, పంచదార మాత్రమే అందిస్తున్నారు. దీని కోసం కూటమి ప్రభుత్వం పేద ప్రజలను రోడ్లపైకి తీసుకొచ్చిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆరు నెలలుగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం కందిపప్పు ఊసే లేకుండా చేసింది. రేషన్ వాహనాల రద్దుతో ఇంటి వద్దకే నిత్యావసరాల సరఫరాకు మంగళం జిల్లా వ్యాప్తంగా మొరాయించిన సర్వర్లు మొదటి రోజు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారుల పడిగాపులు కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్న డీలర్లు ఈ నెలలో కూడా కందిపప్పు ఇవ్వని సర్కారు ఆటోలకు బాడుగలు చెల్లించి మరీ రేషన్ తీసుకెళ్లాల్సిన దుస్థితి నాయకులు రాలేదని రేషన్ ఇవ్వకుండా కార్డుదారులను ఇబ్బంది పెట్టిన డీలర్లు కొన్ని చోట్ల రేషన్ దుకాణాల తాళాలే తీయని వైనం వృద్ధులను రేషన్ షాపులకు రప్పించి మరీ రేషన్ ఇస్తున్న డీలర్లుసర్వర్ పనిచేయక పడిగాపులు మర్రిపూడి: రేషన్ దుకాణాల్లో రేషన్ పంపిణీ చేసేందుకు ఈపాస్ మిషన్లలో కార్డుదారులు థంబ్ వేయాల్సి ఉంది. అయితే సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మర్రిపూడిలో మండల స్థాయి టీడీపీ నాయకులు రేషన్ దుకాణం నంబర్ 2 వద్దకు చేరుకుని ఎంతో ఆర్భాటంగా పచ్చతోరణాలతో పంపిణీ ప్రారంభించారు. అయితే సర్వర్ పనిచేయకపోవడంతో అక్కడే పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుని.. డీలర్, రెవెన్యూ అధికారులతో కలిసి టీలు, కాఫీలు తాగి వెళ్లిపోయారు.పల్లె ప్రజల అష్టకష్టాలు... కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పల్లె ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రేషన్ షాపు గ్రామంలో ఉంటుంది. కానీ పల్లెలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలు గ్రామానికి దూరంగా ఉంటాయి. ఆయా కాలనీవాసులు బియ్యం, చక్కెర కోసం ఆటోలు వేసుకొని, ఆటోలకు బాడుగలు చెల్లించి మరీ రావాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. రేషన్ షాపుల పనివేళల వల్ల వ్యవసాయ పనులకు వెళ్లేవారు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఒకేసారి ఎక్కువమంది లబ్ధిదారులు రేషన్ కోసం వస్తే సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం రేషన్ షాపు నుంచి అంకమ్మగూడెంకు చెందిన గిరిజన చెంచులు ఒక్కొక్కరు రూ.20 ఆటోలకు ఇచ్చి మరీ రేషన్ను తీసుకుపోవాల్సి వచ్చింది. ఇక్కడే కాదు అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. -
ఏడాదైనా హామీల అమలేదీ..
మార్కాపురం: సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 4వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొనాలని ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులు పిలుపునిచ్చారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం, ప్రెస్మీట్లో వెన్నుపోటు దినం వాల్పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నగదు బదిలీ పథకం ద్వారా సుమారు రూ.2.70 లక్షల కోట్లను పేదలకు వారి ఖాతాల్లో జమ చేసి పేదల ఆర్ధిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచి దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ఉద్దేశంతో 200 వ్యాధులతో ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటి సంఖ్యను 2200కు పెంచి పేద ప్రజల ప్రాణాలు కాపాడారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను, వలంటీర్ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల వద్దకే పరిపాలన అందించి గాంధీజీ ఆశయాలను అమలులోకి తెచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఇంగ్లిషు విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు నాడు.. నేడు.. ద్వారా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశారని అన్నారు. అమలుకాని హామీలు... గత ఎన్నికల ముందు దుష్ప్రచారాలతో, అలవికాని హామీలతో, ఈవీఎంల సహకారంతో వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలే అమలుచేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బత్తుల మండిపడ్డారు. తెనాలిలో ముగ్గురు అమాయక యువకులను పోలీసులు కొట్టడం దారుణమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినంలో ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొనాలని అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు మార్కాపురం పాత బస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు అందరూ చేరుకోవాలని, అక్కడి నుంచి ర్యాలీగా సబ్కలెక్టర్ కార్యాలయం వరకూ వెళ్లి వినతిపత్రం అందజేస్తామని రాంబాబు తెలిపారు. అనంతరం బత్తుల బ్రహ్మానందరెడ్డిని అన్నా రాంబాబు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు డాక్టర్ చప్పల్లి కనకదుర్గ, సిరాజ్, సలీమ్, చంద్ర, వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పత్తి రవిచంద్ర, పార్టీ కార్యదర్శులు పత్తి రవిచంద్ర, బొగ్గరపు శేషయ్య, పీఎల్పీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 4న ‘వెన్నుపోటు దినం’లో అందరూ పాల్గొనాలి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి వాల్పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నా, బత్తుల -
రేషన్ షాపునకు తాళం
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులతో పాటు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వాళ్ల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయాలి. అలాంటిది రేషన్ డీలర్లు అధికార టీడీపీకి చెందిన నాయకులే కావటంతో అదేం కుదరదు వృద్ధులైనా, వికలాంగులైనా రేషన్ షాపు వద్దకు రావాల్సిందేనంటూ హుకుం జారీ చేయటంతో ఆపసోపాలు పడుతూ వృద్ధులు సైతం రేషన్ షాపుల వద్దకే వచ్చి బియ్యం తీసుకుపోవాల్సిన పరిస్థితులను రేషన్ డీలర్లు కల్పిస్తున్నారు. ప్రభుత్వం 60 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. రేషన్ పంపిణీకి వచ్చేసరికి 65 ఏళ్లు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● రాచర్ల మండల కేంద్రంలో 65 సంవత్సరాల వృద్ధురాలు బియ్యానికి రావటంతో డీలరు షాపులోని బియ్యం గోతాముకు ఎత్తుకోవాలని చెప్పటంతో ఆ వృద్ధురాలు చేసేదేమీ లేక బియ్యాన్ని గోతాముకు ఎత్తుకుంది. పీసీపల్లి: మండల పరిధిలోని పెదఅలవలపాడు రేషన్ షాపు ఆదివారం తాళం వేసి ఉంది. కొత్తూరుపాడు, చింతలపాలెం, వడ్డెపాలెం వంటి దాదాపు ఐదారు గ్రామాల ప్రజలు 7, 8 కి.మీ నుంచి ఈ రేషన్ షాపునకు రావాల్సి ఉంది. కానీ డీలర్ అందుబాటులో లేకపోవడంతో నిత్యవసర సరుకులు సరుకుల కోసం పదేపదే తిరిగి అల్లాడుతున్నారు.వృద్ధులను రేషన్ షాపులకు రప్పిస్తున్న డీలర్లుషాపులో తానే బియ్యం తీసుకెళ్తున్న 65 ఏళ్ల వృద్ధురాలు -
ప్రజలకు వెన్నుపోటు పొడిచిన బాబు
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించి వెన్నుపోటు పొడిచాడని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం హైదరాబాదులో ఐటీ వింగ్ ఉద్యోగులతో కలిసి ఆయన వెన్నుపోటు దినం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల్లో చదివే చిన్నారుల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడి జీవించే ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఊసెత్తని బాబు దగా మాటలు చెప్పేందుకు మహానాడు జరిపాడన్నారు. ఏడాది పాలనలో ఏం సాధించావని ప్రశ్నిస్తే కడపకు వెళ్లి మహానాడు జరిపానని బదులిస్తాడని ఆయన వ్యగ్యంగా అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేశామని చెప్పుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితి మహానాడులో వారికి ఏర్పడిందని, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా వంచించారో మహానాడు ద్వారా బయటపెట్టారన్నారు. కడపలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అవమానపరుస్తూ విగ్రహం చుట్టూ పచ్చతోరణాలు కట్టి తమ అధికార మదం ఏంటో రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. తిరుగులేని అప్పుల రాష్ట్రంగా రికార్డుల్లో ఎక్కుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై గళం విప్పుదామని ఆయన ఐటీ వింగ్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
యథేచ్ఛగా అక్రమ కట్టడం
సాక్షి టాస్క్ఫోర్స్: గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ముందు భాగంలో వైద్యశాలలో పనిచేస్తున్న ఔట్స్సోర్సింగ్ ఉద్యోగి అక్రమ నిర్మాణం చేపట్టాడు. స్థానిక టీడీపీ నాయకుల అండదండలతో వైద్యశాల ముందుభాగంలో క్యాంటీన్ నిర్మాణం చేపట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నాడు. దీనిపై ఒంగోలుకు చెందిన దేశబోయిన వెంకటరాజు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే కాకుండా అక్రమ కట్టడాన్ని తొలగించాలంటూ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ వైద్యశాల ఆవరణలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని తొలగించాలంటూ ఉద్యోగి పందరబోయిన శ్రీనివాసులుకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న శ్రీనివాసులు.. అధికార పార్టీ నాయకులను ఆశ్రయించాడు. దాంతో అక్రమ కట్టడం తొలగింపు చర్యలు నిలిచిపోయాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు.. ప్రభుత్వ నిబంధనలకు అధికారులు పాతరవేస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత నీచంగా ఉందో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమ కట్టడంపై ఓ వ్యక్తి నేరుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అక్రమంగా నిర్మిస్తున్న కట్టడంపై చర్యలు ఉంటాయో.. లేదో.. వేచి చూడాలి మరి. -
తప్పుల తడకగా డీఎస్సీ హాల్ టికెట్లు
దర్శి (కురిచేడు): డీఎస్సీ కోసం తాము చేసుకున్న దరఖాస్తులోని వివరాలను పక్కన పెట్టి వారి ఇష్టానుసారం వివరాలు ఇచ్చారని దర్శికి చెందిన డీఎస్సీ అభ్యర్థి ఎం లక్ష్మీ మాధురి ఆందోళన వ్యక్తం చేశారు. తన విద్యాభ్యాసం అంతా గుంటూరు జిల్లాలో జరిగిందని, అందువల్ల తన దరఖాస్తులో కూడా గుంటూరు జిల్లాకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తన తండ్రి వృత్తి రీత్యా దర్శిలో నివాసముంటున్నాడని పేర్కొంది. అయితే తన హాల్ టికెట్లో మాత్రం తన పూర్తి చదువు ప్రకాశం జిల్లాలో చదివినట్లు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. దాని వల్ల సొంత జిల్లాకు దూరం కావడమే కాకుండా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ లోకూడా తేడా కనిపిస్తుందని తెలిపింది. ప్రభుత్వం ఈ తప్పులను సరిచేసి తనకు, తనలాంటి వారికి న్యాయం చేయాలని కోరింది. -
అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వండి
● డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఒంగోలు టౌన్: లాడ్జీలు, హోటళ్లకు వచ్చే అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందివ్వాలని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లా పోలీసు కల్యాణ మండపంలో ఆదివారం లాడ్జీలు, హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..నగరంలోని హోటళ్లు, లాడ్జీలలో భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్, ఇతర కీలక ప్రాంతాలలో హై క్వాలిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిరంతరం పనిచేసేలా చూడాలని, రికార్డింగులు భద్రపరచేలా చూడాలన్నారు. కస్టమర్లకు గదులు కేటాయించే సమయంలో గుర్తింపు కార్డులైన ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించాలని, వాటి జిరాక్స్ కాపీలను డిజిటల్ స్కాన్ను భద్రపరచాలని చెప్పారు. అనుమానాస్పదంగా కనిపిస్తే అదనపు గుర్తింపు కార్డులను తీసుకోవాలని , కస్టమర్ల వివరాలు, బస చేసే సమయం, వారి స్వస్థలం వంటి సమగ్ర సమారాన్ని సేకరించాలన్నారు. చట్టవిరుద్ధంగా ఎవరికీ లాడ్జీలు ఇవ్వరాదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలతో వచ్చిన వారు అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి గదులు అద్దెకు ఇవ్వరాదన్నారు. అసాధారణ ప్రవర్తన గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. సమావేశంలో తాలుకా సీఐ విజయకృష్ణ, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, వన్టౌన్ సీఐ నాగరాజు, ఎస్సైలు హరిబాబు, ఫణి భూషణ్, ఎస్వీ రమణ, పున్నారావు పాల్గొన్నారు. బదిలీల్లో అసంబద్ధ నిర్ణయాలు తొలగించాలి ● జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ ఒంగోలు సిటీ: ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యా య సంఘాల ఐక్య వేదిక నాయకులు ఆదివారం డీఈఓ కిరణ్కుమార్ను కలిసి ఉపాధ్యాయ బదిలీల సమస్యలపై మాట్లాడి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ బలవంతంగా పీఎస్ హెచ్ఎం పోస్టులను కోరుకోమని, బదిలీకి దరఖాస్తు చేయని వారిని, పాఠశాలలో సర్ప్లస్ కానప్పటికీ వారిచేత దరఖాస్తు చేయించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వారికి ఈ బలవంతపు బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్లకు సబ్జెక్టు వేకేన్సీతో పాటు పీఎస్ హెచ్ఎం పోస్టులకు ఒకేసారి ఆప్షన్ వచ్చేలా కల్పించాలన్నారు. జీఓ 22లోని 11వ నిబంధనను అనుసరించి పాయింట్స్ సమానమైనప్పుడు క్యాడర్ సీనియారిటీని మాత్రమే ముందుగా పరిగణలోనికి తీసుకొని సీనియారిటీ జాబితా తయారు చేయాలన్నారు. గ్రీవెన్స్ పూర్తి చేసి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ప్రకటించిన తర్వాతే వెబ్ఆప్షన్స్ అవకాశం కల్పించాలన్నారు. కార్యాలయ సమాచారం ఉపాధ్యాయ సంఘాలకు వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేయాలన్నారు. మిగిలిన గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను ప్రస్తుత సీనియారిటీ కొనసాగించి పూర్తి చేయాలన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్యాడర్ స్ట్రేన్త్ వివరాలు అడిక్విసి పేర్లతో సహా ఇవ్వాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొమ్మోజు శ్రీనివాసరావు, ఏపీయుఎస్ రాష్ట్ర బాధ్యులు సీహెచ్ శ్రావణ్కుమార్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.జనార్దనరెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే అబ్ధుల్ హై, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎర్రయ్య, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎం.మల్లికార్జునరావు, ఎన్.లక్ష్మీనారాయణ, వెంకటరావు, ఉమామహేశ్వరి, రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, శేషారావు పాల్గొన్నారు. -
దేశ సమైక్యతను కాపాడుకోవాలి
● మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఒంగోలు టౌన్: దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసనమండలి మాజీ సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. నగరంలోని సుందరయ్య భవనంలో ఆదివారం జరిగిన సమైక్యతా సదస్సులో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం ఉగ్రవాద దాడుల్లో 26 మంది మరణించారని, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయని చెప్పారు. ఉగ్రదాడిని దేశ వ్యాప్తంగా సమైక్యంగా ఖండించారని గుర్తు చేశారు. అయినా బిజేపీ, కార్పొరేట్ మీడియా, వాట్సప్ యూనివర్శిటీలు హిందువులను ముస్లింలు హత్య చేశారని వక్రీకరించి ట్రోల్ చేశారని చెప్పారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై 184 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఉగ్రవాదదాడులను నుంచి తమను స్థానిక ముస్లింలే రక్షించారని బాధితులు చెప్పడం గమనించాలని కోరారు. ఈ ఘటన తరువాత జరిగిన పరిణామాలు దేశ సార్వభౌమత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై యుద్ధ విమానాలతో విరుచుకొని పడిన కల్నల్ సోఫియాపై బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యను సుప్రీం కోర్టు సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆపరేషన్ సిందూర్ను బీహార్ ఎన్నికల అస్త్రంగా మార్చుకోవడం ఆక్షేపనీయమన్నారు. భారత్ పాక్ యుద్ధం విషయంలో దేశ సార్వభౌమత్వాన్ని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కాశ్మీర్ సమస్యలను మోదీ ప్రభుత్వం పెంచి పెద్దది చేసిందన్నారు. 370 అధికరణను రద్దు చేయడం, కనీస రాష్ట్ర హోదా లేకుండా చేయడం అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. దేశంలోని భిన్నత్వాన్ని రక్షించుకునేందుకు ప్రజాస్వామిక వాదులు ముందుకు రావాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ పెహల్గాం దాడుల వెనుక భధ్రతా దళాల వైఫల్యం వుందని చెప్పారు. సీపీఐఎంఎల్ న్యూ డెమెక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ విధానాల వల్ల దేశంలో సామరస్యం దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో వివిధ వామపక్ష పార్టీల నాయకులు డివిఎన్ స్వామి, చుండూరి రంగారావు, జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, రఫీ, చీకటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
35 ఏళ్ల తర్వాత కలుసుకుని..
● 1989–90 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక కొత్తపట్నం: 35 ఏళ్ల క్రితం కొత్తపట్నంలోని బొమ్మిశెట్టి సీతమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకుని ఆనందంగా గడిపారు. కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ వేదికగా నిర్వహించిన 1989–90 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న బాల్యమిత్రులంతా సందడి చేశారు. పురిణి చెంచురామయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా తమతో కలిసి చదువుకుని వివిధ కారణాలతో మరణించిన వారి ఆత్మకు శాంతిచేకూరాలని నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఒకరికొకరు ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆనంద సాగరంలో మునిగితేలారు. తాము చదువుకున్న చదువులు, కలిసి తిరిగిన ప్రాంతాలు, చేసిన అల్లరిని గుర్తుచేసుకున్నారు. టెక్నాలజీ అరకొరగా ఉన్న సమయంలో ఎంతో కష్టపడి చదువుకుని ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొని జీవితంలో స్థిరపడిన తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారంతా హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందరూ కలిసిమెలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో గొల్లపూడి దత్తాత్రేయశర్మ, దోసపాటి పాణి, బొబ్బాల బాలాజీ, నాగమల్లేశ్వరి, వసంతకుమారి, జ్ఞానేశ్వరి, అపర్ణ, జయంతి, అన్నం తిరుపతిరావు, రామకృష్ణ, ప్రకాశ్రావు, అరుణ, కాలేషా, దేవమణి, శ్రీనివాసరావు, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రీడల్లో మహిళల సత్తా అభినందనీయం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు : మహిళలు క్రీడారంగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నారని, అత్యంత ప్రతిభతో సత్తా చాటుతుండటం అభినందనీయమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. 12వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళా క్రీడాకారులకు ఆదివారం నగరంలోని మినీ స్టేడియంలో ఎస్పీ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని మహిళా క్రీడాకారులు నిరూపిస్తున్నారన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి అలవరచుకోవాలని, జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను కూడా క్రీడల్లో ప్రోత్సహించాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తోడ్పాటునందించాలని అన్నారు. జిల్లా తరఫున ప్రాతినిధ్యం విహించి జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచి వారికి పోలీసు శాఖ తరఫున బహుమతులు ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్ సీఐ విజయకృష్ణ, డీఎస్డీఓ రాజేశ్వరి, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భక్తధృవుడు, జిల్లా పవర్ లిఫ్టింగ్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రికెట్ జట్ల ఎంపిక
ఒంగోలు: క్రికెట్ క్రీడా జట్ల ఎంపిక స్థానిక మంగమూరు రోడ్డులోని మినీ లార్డ్స్ మైదానంలో ఆదివారం ఉత్సాహంగా సాగింది. పురుషుల విభాగంలో అండర్ 19, సీనియర్స్, మహిళల విభాగంలో అండర్ 15, అండర్ 19 క్రీడాజట్ల ఎంపిక జరిగింది. ఎంపిక ప్రక్రియను ఆంధ్రా రంజీ క్రీడాకారుడు శరత్ పర్యవేక్షించారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్లో ప్రతిభను పరిశీలించి జట్లను ఎంపిక చేశారు. ఎంపికై న బాలబాలికల జట్లు ఈ నెల 10 నుంచి మంగళగిరిలో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో జిల్లా తరుఫున ప్రాతినిఽధ్యం వహిస్తారని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, రాము, మహేష్, రామకృష్ణ, కోచ్లు పాల్గొన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలిఒంగోలు టౌన్: శాంతి చర్చలకు సంసిద్ధత తెలుపుతున్న మావోయిస్టులతో కేంద్రం ఎందుకు చర్చలు జరపడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. ఆపరేషన్ ఖగార్ పేరుతో దండకారణ్యంలో అమాయక ఆదివాసీలను, మావోయిస్టులను అత్యంత పాశవికంగా కాల్చి చంపుతున్నారని, మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కోటేశ్వరరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా అడవిలోనే అంత్యక్రియలు నిర్వహించడం ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో సీపీఐ నగర మహాసభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సభకు కె.అంజయ్య, ఇస్తర్య నరసింహారావు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గుజ్జుల మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ దేశాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నారని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23 తేదీల్లో దర్శిలో నిర్వహిస్తున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. తొలుత ప్రముఖ న్యాయవాది మురివర్తి రాఘవులు జెండావిష్కరణ చేశారు. ఈ సభలో కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్ వెంకటరావు, రామకృష్ణ, కారుమూడి నాగేశ్వరరావు, నూనె మోహనరావు, ఆదినారాయణ, ఎంఏ సాలార్ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం ధరలతో బెంబేలు.!
మార్కాపురం డివిజన్లో వరిసాగు ఇలా... మండలం సాగు సాగైన చేయాల్సిన విస్తీర్ణం విస్తీర్ణం (హెక్టార్లలో) మార్కాపురం 118 82 తర్లుపాడు 212 206 గిద్దలూరు 231 223 బేస్తవారిపేట 207 256 కంభం 416 201 అర్ధవీడు 197 158 కొమరోలు 379 429 రాచర్ల 85 108 వై.పాలెం 7 0 పుల్లలచెరువు 913 968 త్రిపురాంతకం 2745 1734 పెద్దారవీడు 12 1 పెద్దదోర్నాల 41 1 మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో బియ్యం కొరత ఏర్పడింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో వరిసాగు తగ్గిపోవడంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి బియ్యం తెప్పించి ఇక్కడ అధిక ధరలకు వ్యాపారులు అమ్ముతున్నారు. పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలువురు వ్యాపారులు లారీల్లో బియ్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉన్న బియ్యం కొరతను ఆసరాగా చేసుకుని బస్తాకు 100 నుంచి 200 రూపాయలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది పశ్చిమ ప్రకాశంలో వరిసాగు తక్కువగా ఉండటంతో నరసరావుపేట, పల్నాడు, బాపట్ల, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గత నెలాఖరులో బీపీటీ రకం 6 వేల రూపాయలు ఉండగా, పదిరోజుల వ్యవధిలోనే బస్తా ధర 200 రూపాయలు పెరిగింది. గత రెండు రోజుల నుంచి మరో 100 రూపాయలు పెంచి విక్రయిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో సుమారు 20 మందికిపైగా బియ్యం హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు. వీరు కర్నూల్ సోనా, బీపీటీ, నంబర్లు, తదితర రకాల బియ్యాన్ని అమ్ముతుండటంతోపాటు స్థానికంగా బియ్యాన్ని సేకరించి ఏదో బ్రాండ్ నేమ్ను బస్తాలపై వేసి సూపర్ క్వాలిటీ అంటూ పాతిక కిలోల టిక్కీని 1400 నుంచి 1600 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే 100 కేజీల బస్తాకు 5,600 నుంచి 6,400 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. ౖపైపెకి బియ్యం ధరలు... పశ్చిమ ప్రకాశంలో బియ్యం ధరలు ౖపైపెకిపోతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు తగ్గిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. మనిషి తీసుకునే ఆహారాల్లో బియ్యంకు మొదటి ప్రాధాన్యత ఉండటంతో ప్రతిఒక్కరూ బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. దీంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఖరీఫ్ సీజన్లో డివిజన్లోని 13 మండలాల్లో 5,563 హెక్టార్లలో వరి సాగుచేయాల్సి ఉండగా, 4,367 హెక్టార్లలోనే సాగు చేశారు. మార్కాపురం, కంభం, అర్ధవీడు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల్లో వరిసాగు గణనీయంగా తగ్గిపోయింది. వరి సాగు చేయాలంటేనే భయపడుతున్న రైతులు... కడప జిల్లా ప్రొద్దుటూరు, కర్నూలు, గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల నుంచి కొంత మంది వ్యాపారులు బియ్యాన్ని హోల్సేల్గా కొనుగోలు చేసి పశ్చిమ ప్రకాశంలో అమ్ముతున్నారు. వరి సాగు లేకపోవటం, రాబోయే నాలుగు నెలల వరకు పంట వచ్చే అవకాశం లేకపోవటంతో బియ్యం ధరలు బస్తా 5600 నుంచి 6 వేల రూపాయలకు చేరాయి. పెట్టుబడి వ్యయం ఎక్కువగా పెరగడం, ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవటం, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, భూగర్భజలాలు అడుగంటి పోవటంతో నీటి కొరత ఏర్పడి వరి సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. వరిని సాగు చేసే కంభం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, మార్కాపురం, తదితర మండలాల్లో చెరువుల్లో నీరులేకపోవటం, సాగర్ నీటి సరఫరా లేకపోవటంతో ఈ ఏడాది వరి సాగు తగ్గిపోయింది. పశ్చిమ ప్రకాశంలో బియ్యం కొరత తగ్గిన వరిసాగుతో ఇబ్బందులు ఇతర జిల్లాల నుంచి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు ఆందోళనలో ప్రజలు -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఒంగోలు సిటీ: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. ఆమె అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గ్రామీణ నీటి సరఫరా, డ్వామా, డీఆర్డీఏ, విద్య, వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. చట్టసభ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. ముందుగా పహల్గాం ఉగ్ర దాడిలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. బాధిత రైతుకు పరిహారం అందించాలి : యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని గురిజేపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు బొప్పాయి పంటను నష్టపరిచారని, బాధిత రైతుకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు. యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ జాబితాలో 320 మంది పేర్లు లేవని, పరిశీలించి వాటిని చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రక్షిత మంచినీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పనులను పూర్తి చేసే గడువును 2028 వరకు పెంచినందున ఆయా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. రైతుల వద్ద పొగాకు నిల్వలు భారీగా ఉన్నందున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. కొత్త జెడ్పీ సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు తోడు సాగర్నీటిని పంపణీ చేసే పైపులైన్లు దెబ్బతిన్నందున కొత్త పైపులైన్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూడాలన్నారు. హనుమంతునిపాడు మండలంలో తక్కువ వర్షపాతం నమోదైనా కరువు మండలంగా ప్రకటించలేదని, పున:పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు చెప్పారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. రామతీర్ధం, గుండ్లకమ్మ కాలువలను బాగుచేయించాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్ నెలాఖరుకు పూర్తిచేయకపోతే నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం ఉండదన్నారు. పలు సమస్యలు ఏకరువు పెట్టిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు... పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు అనేక సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లలో విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యే విధంగా చూడాలని కోరారు. చీమకుర్తి బాలికల హాస్టల్లో భోజనం నాణ్యంగా లేదని, వర్కర్లు దారుణంగా మాట్లాడుతున్నారని, ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్యను పరిష్కరించాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని అధికారులను కోరారు. రామతీర్థం ప్రాజెక్టుకు వెళ్లే దారిలో ఉన్న ముళ్లచెట్లను తొలగించాలని, శ్మశానాలలో ముళ్లచెట్లను తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మండలాల్లో ఆధార్ కేంద్రాల సంఖ్య పెంచాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి : జేసీ గోపాలకృష్ణ జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యాహక్కుచట్టం అమలు, అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ జాబితాలో పేర్లు లేని వారి అర్హతను పరిశీలించేందుకు గ్రామసభలు పెట్టామన్నారు. అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ సవరించిన మార్గదర్శకాల మేరకు, మండల పరిషత్ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు, జిల్లా పరిషత్ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రభుత్వం పెంచిందన్నారు. కొత్త జెడ్పీ సమావేశ మందిరం నిర్మాణానికి గతంలో రూపొందించిన రూ.20 కోట్ల అంచనాలను సవరించేందుకు గత రెండు స్టాండింగ్ కమిటీలలో ఆమోదించిన 350 ప్రతిపాదనలకు కూడా సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. బాపట్ల, నెల్లూరు జిల్లాల డీఆర్వోలు గంగాధరగౌడ్, ఉదయభాస్కర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో పాల్గొన్నారు.ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించడం లేదు : దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి జెడ్పీ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జాబ్కార్డులు కలిగిన వారందరికీ పని ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఉన్న జాబ్కార్డుల్లో యాభై శాతం మందికి కూడా పని కల్పించడం లేదన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల వారికి పని కల్పించడం కోసమే ఉపాధి హామీ పథకం ఉందన్నారు. కానీ, అధికారులను అడిగినా పని కల్పించడం లేదన్నారు. కిందిస్థాయిలో ఇబ్బందిపెడుతున్నారని, అటువంటివి లేకుండా అందరికీ పని కల్పించాలని కోరారు. తన నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన ఉద్యానవన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
ఎండగడదాం
చంద్రబాబు నయవంచనను ● 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున పిలుపు సంతనూతలపాడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయవంచనను ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ సంతనూతలపాడు మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సంతనూతలపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాదైనా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దగా చేశాడంటూ మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలు, కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఏడాది పాలన చూసి మోసపోయామని గ్రహించిన ప్రజలు.. కూటమిని గెలిపించి తప్పు చేశామని పశ్చాత్తాపానికి గురవుతున్నారన్నారు. చంద్రబాబు మోసాన్ని, నయవంచనను నిలదీసేందుకు జూన్ 4న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని మేరుగు నాగార్జున వెల్లడించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. ఎందుకు నెరవేర్చలేదో చంద్రబాబు చెప్పాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం పేరుతో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఇంత వరకు అమలుచేయలేదన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామన్నారని, మహిళలకు ఉచిత బస్సు అన్నారని, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారని, కానీ, అవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని వారిని అసలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఇంటింటికి రేషన్ అందించామని, చంద్రబాబు ఎండీయూ వాహనాలను రద్దు చేసి ఇంటి వద్దకే రేషన్ అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదైనా కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఉన్న పింఛన్లు తొలగించడం బాధాకరమని అన్నారు. వీటన్నింటికి నిరసనగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం ర్యాలీలో చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, రైతులు, నిరుద్యోగులు, వలంటీర్లు భారీగా పాల్గొనాలని మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. సమావేశానికి వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షుడు దుంపా యలమందారెడ్డి, నాయకుడు రావూరి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు కే వెంకటేశ్వరరావు, కే సుబ్బారావు, వి.కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన పొగాకు రైతు
ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి మార్కాపురం: ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం సాయంత్రం మార్కాపురం మండలంలోని కుంట – చింతగుంట్ల గ్రామాల మధ్య జరిగింది. రూరల్ ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న లారీకి టైరు పంక్చర్ కావడంతో కుంట – చింతగుంట్ల గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఆపి ఉంది. టైరుకు పంక్చర్ వేసుకుంటుండగా, మార్కాపురం సబ్స్టేషన్లో హెల్పర్గా పనిచేసే తిప్పాయపాలేనికి చెందిన కుందురు చిన్న నారాయణరెడ్డి (32) ఇంటికి వెళ్తూ ఏమరపాటుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న భార్య, తల్లిదండ్రుల రోదనలు చూపరులతో సైతం కంటతడి పెట్టించాయి. రూరల్ ఎస్సై అంకమరావు, ఏఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం ఒంగోలు: స్థానిక మినీ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తూ విజేతలుగా నిలిచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ మూడు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. జిల్లా కార్యదర్శి జి.భక్తధృవుడు మాట్లాడుతూ సబ్జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ సౌత్జోన్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు ప్రభాకరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండపి: వ్యాపారుల ధోరణితో పొగాకు రైతుల సహనం నశించింది. రోడ్డెక్కి రాస్తారోకో చేసేందుకు దారితీసింది. కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో శనివారం మూగచింతల, నెన్నూరుపాడు, గురప్పడియా, కే అగ్రహారం, చతుకుపాడు గ్రామాల రైతులు బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. కొనుగోలు ప్రారంభం నుంచి డిస్ప్లే బోర్డుపై ధరలు కనిపించాల్సి ఉండగా, ఒక లైను పొగాకు కొనుగోలయ్యేంత వరకు ధరలు కనిపించలేదు. వేలం ప్రారంభంలో లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేశారని, వేలం కొనసాగుతున్నకొద్దీ ఎఫ్–3 పొగాకు బేళ్లను నో బిడ్లుగా చూపిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. అనంతరం రైతులతో వేలం నిర్వహణ అధికారి మాట్లాడి వేలం కొనసాగించడానికి ప్రయత్నించారు. లోపలికి వెళ్లిన రైతులు అదే పరిస్థితి కొనసాగడంతో బయ్యర్లతో వాగ్వాదానికి దిగి వేలాన్ని బహిష్కరించి బయటికి వచ్చేశారు. అనంతరం రైతులు కొండపి, టంగుటూరు రోడ్డులో ధర్నాకు దిగి ఆందోళన వ్యక్తం చేశారు. వేలం నిర్వహణ అధికారి రైతుల పక్షాన నిలిచి వ్యాపారులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించాలని, బేళ్ల కొనుగోలును ప్రారంభించాలని నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సై ప్రేమ్కుమార్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. వేలం నిర్వహణ అధికారితో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వేలం నిర్వహణ అధికారి దగ్గరికి మీరు కూడా రావాలని ఎస్ఐని రైతులు కోరగా, అందుకు అంగీకరించడంతో రైతులు ధర్నాను విరమించారు. రైతును బట్టి ధరలా..? వేలం కేంద్రంలో రైతును బట్టి గ్రేడ్, ధరలు నిర్ణయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మంచి ధర కల్పించాలని నిలదీస్తే అటువంటి రైతును టార్గెట్ చేసి ధర తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు మంచి గ్రేడ్లు, ధర ఇస్తున్నారన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుని రైతులందరికీ గ్రేడ్లను బట్టి మంచి ధరలు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దిగివచ్చి పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని రైతు కూలీ సంఘ కార్యదర్శి లలిత కుమారి, సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నిలిచి రోడ్డుపై వారు బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి రైతులకు మద్దతు ధర కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎట్టకేలకు ప్రారంభమైన వేలం... రైతులతో పలు దఫాలుగా పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి చర్చలు జరిపిన అనంతరం గిట్టుబాటు ధర కల్పించే విధంగా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించి వేలానికి మొగ్గుచూపారు. అనంతరం ఆగిన చోట నుంచి వేలం ప్రారంభమైంది. ఆందోళనలతో కాకుండా చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు వేలం నిర్వహణ అధికారి సూచించారు. వేలం బహిష్కరించి రాస్తారోకో అధిక సంఖ్యలో మీడియం గ్రేడ్ బేళ్లను తిరస్కరిస్తున్నారంటూ ఆందోళన అన్ని బేళ్లను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ -
సమాచారశాఖ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు
ఒంగోలు సబర్బన్: సమాచారశాఖలో సుమారు 38 ఏళ్లపాటు టైపిస్టుగా విధులు నిర్వర్తించి శనివారం ఉద్యోగ విరమణ పొందిన ఓ ఇందిరాకుమారిని సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. స్థానిక ప్రకాశం భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐపీఆర్ఓ వేణుగోపాల్, డీపీఆర్ఓ రమేష్, డివిజినల్ పీఆర్ఓ దుర్గాప్రసాద్, రిటైర్డ్ డీఈఐఈ రమణమూర్తి, రిటైర్డ్ డీపీఆర్ఓ నారాయణ, కార్యాలయ సబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం డివిజన్ కార్యాలయంతో పాటు ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో పనిచేసిన ఇందిరాకుమారి సేవలను కొనియాడారు. -
ప్రకాశం
36 /25జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంజిల్లా సమగ్రాభివృద్ధే ల క్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. 7గరిష్టం/కనిష్టంరోడ్డెక్కిన పొగాకు రైతువ్యాపారుల ధోరణితో సహనం నశించిన పొగాకు రైతులు కొండపిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చు.– 8లో.. ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025 -
ప్రభుత్వం పనిచేయకపోతే ప్రశ్నిస్తా అంటూ గతంలో హడావుడి చేశారు. నేడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని చేతుల్లో ఉంచుక
ఆస్పత్రిలో ఉంటే... పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి. బీటెక్ చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక చవితి పండుగ సమయంలో విగ్రహం ఏర్పాటుకు డబ్బులు వసూలు చేయడాన్ని ప్రశ్నించాడు. అది కూటమి పాలకులకు పెద్ద నేరంగా కనిపించింది. అతడి మీద సంతనూతలపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించింది. తిరుపతిలో మరో కేసు బనాయించింది. ఈలోపు అనుకోకుండా సదరు యువకుడికి ఆరోగ్యం దెబ్బతింది. దాంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లాడు. వైద్యులు అతడికి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. దాంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతడిని అరెస్టు చేసేందుకు తిరుపతి పోలీసులు ఆస్పత్రికి వెళ్లారంటే రెడ్బుక్ రాజ్యాంగం దుర్మార్గాలను అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ తరువాత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్కు వచ్చి సీఐ ఎదుట విచారణకు హాజరయ్యాడు. -
గంజివారిపల్లిలో పులి కలకలం
యర్రగొండపాలెం: మండలంలోని గంజివారిపల్లిలో పులి కలకలం రేపింది. మూడు రోజుల క్రితం గంజివారిపల్లి నుంచి కొలుకుల వెళ్లే దారిలో ఉన్న పొలాల్లో పులి సంచరించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ మేరకు అటవీ శాఖాధికారులు తమ సిబ్బందితో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే వారికి పులి సంచరించినట్లు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. పులి సంచరించినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లోని అటవీ శివారు ప్రాంతాలతోపాటు పొలాలను పరిశీలించామని, పులి అడుగు జాడలు తమకు కనిపించలేదని గంజివారిపల్లె రేంజర్ సుబ్బారావు తెలిపారు. పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, పులి జాడ తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్గా సీతారామయ్య ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు. కష్టపడి పని చేసి బ్యాంకును అభివృద్ధి బాటలో నడిపిస్తామని అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ కుంభా రాఘవయ్య, అధికారులు ఎన్.ఇందిరా దేవి, బ్యాంకు డీజీఎమ్, ఏజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. రంగనాయకుని దర్శనానికి పోటెత్తిన భక్తులు రాచర్ల: వుండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం సమీపంలోని నీటిగుండంలో స్నానాలు ఆచరించి, గంటల తరబడి క్యూలో నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు అన్నవరం పాండురంగచార్యులు, సత్యనారాయణచార్యులు ఆధ్వర్యంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూల అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కృష్ణదేవరాయుల కాపుబలిజ, గోపాలకృష్ణ యాదవ, కాశినాయన, యోగి వేమన రెడ్ల, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల్లో అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల విజేత కర్నూలు ఎడ్లజత తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడులో నీలంపాటి అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన సుబ్రమణ్యేశ్వరరెడ్డి ఎడ్లజత మొదటి బహుమతిని, బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పాలూరి వీరయ్య చౌదరికి చెందిన ఎడ్ల జత ద్వితీయ బహుమతిని, కర్నూలు జిల్లా మిడుతూరుకు చెందిన రోలిమెడం ఎడ్ల జత తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ అన్నా రాంబాబు బహుమతులు అందజేశారు. తొలుత ఆలయంలో అన్నా రాంబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ మురారి, ఎంపీపీ రామసుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సర్పంచ్ పీ వరాలు, వైస్ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల పందెం నిర్వాహకులు వెన్న చిన్న సత్యనారాయణరెడ్డి, ఏరువ మల్లారెడ్డిలను, ట్రాక్టరు దాతలు అశోక్రెడ్డి, నాగార్జునరెడ్డిలను మాజీ ఎమ్మెల్యే అన్నా అభినందించారు. -
పాలన ఎరుపెక్కి!
ప్రశ్నించే గొంతునొక్కి.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించడం మొదలు పెట్టింది. ఎప్పుడో సోషల్మీడియాలో చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా కేసులు పెట్టింది. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ఏకంగా ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి మీద కూడా కేసులు పెట్టించింది. భయానక వాతావరణాన్ని సృష్టించి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడకుండా చేసింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయించి భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. ఏడాది పాలన -
రెచ్చిపోయిన దొంగలు
బేస్తవారిపేట: ఇంటి యజమానులు ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు చేతివాటం చూపించారు. వరుసగా ఉన్న ముగ్గురు అన్నదమ్ముళ్ల గృహాల్లో 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.65 వేల నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచిన యజమానులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల కథనం మేరకు.. పీవీ పురంలో అన్నదమ్ముళ్లు తమటం గురునారాయణరెడ్డి, తమటం జగన్మోహన్రెడ్డి, తమటం చిన్నవెంకరెడ్డి గృహాలు వరుసగా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ గురువారం రాత్రి ఆరుబయట, వరండాలో నిద్రపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ గృహం వెనుక వైపు తలుపు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో వరుసగా ఉన్న మూడు ఇళ్లను లూటీ చేశారు. షెల్ఫ్ల్లో దుస్తుల కింద దాచిపెట్టిన బీరువా తాళాలు తీసుకుని చోరీకి పాల్పడ్డారు. తమటం గురునారాయణరెడ్డి గృహంలో 13 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, జగన్మోహన్రెడ్డి ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, చిన్న వెంకటరెడ్డి ఇంట్లో బంగారు ఉంగరం, రూ.5 వేల నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కంభం సీఐ కె.మల్లికార్జున, ఎస్సై రవీంద్రారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు క్లూస్ టీమ్ ఎస్సై శరత్కుమార్ వేలిముద్రలు సేకరించారు. పోలీస్ జాగిలాలు గృహాల వెనుక వైపున పొలాలు, పాఠశాల వద్దకు, గృహ పరిసరాల్లో తిరిగాయి. ఆ ఇళ్లపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. వీరాయపాలెంలో నిద్రిస్తున్న మహిళల మెడలో.. దర్శి(కురిచేడు): దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెం గ్రామంలో గురువారం అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేశారు. పంచల్లో పడుకున్న మహిళల మెడల్లో నాలుగున్నర సవర్ల బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. వివరాలు.. తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ముప్పరాజు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇంటి వరండాలో నిద్రిస్తున్నారు. ఇద్దరు దొంగలు రాత్రి 12.30 గంటల సమయంలో ఇంట్లోకి గోడదూకి ప్రవేశించారు. నాగేశ్వరరావు భార్య పద్మ మెడలో బంగారు తాళిబొట్టు, నానుతాడు కట్ చేశారు. అయితే తాళిబొట్టు కిందపడటంతో పద్మకు మెళకువ వచ్చింది. లేచి చూసే సరికి దొంగలు తాడు తీసుకుని పరారయ్యారు. నాగేశ్వరరావు వెంటపడినా ఫలితం లేకపోయింది. అదే గ్రామంలో రాత్రి ఒంటి గంట తరువాత మధుమంచి ఏడుకొండలు కుటుంబ సభ్యులు వారి ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్నారు. ఏడుకొండలు భార్య గురువర్దిని మెడలోని తాళిబొట్టు, నానుతాడు లాక్కుని పరారవుతుండగా ఏడుకొండలు వెంటపడ్డాడు. దొంగలు పొలాల్లో గుండా పారిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. బేస్తవారిపేట మండలం పీవీ పురంలో ముగ్గురు సోదరుల గృహాల్లో దొంగతనం 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.65 వేల నగదు అపహరణ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ కురిచేడు మండలం తూర్పువీరాయపాలెంలో మహిళ మెడలో గొలుసు చోరీ -
సత్తా చాటిన బాపట్ల జిల్లా ఎడ్లు
రాచర్ల: మండలంలోని ఒద్దులవాగుపల్లె పంచాయతీ పరిధిలోని అచ్చంపల్లె గ్రామంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత పట్టాభిరామస్వామి నూతన విగ్రహ, ధ్వజ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ ఎడ్ల బండలాగుడు పోటీల్లో బాపట్ల జిల్లా ఎడ్ల జతలు సత్తా చాటాయి. పోటీల్లో మొత్తం 7 జతల ఎడ్లు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన శివకృష్ణచౌదరి ఎడ్లు నిర్ణీత 20 నిమిషాల్లో 3767 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.80 వేలు సాధించాయి. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బొరెడ్డి కేశవరెడ్డి ఎడ్ల జతలు రెండో బహుమతి, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్లు మూడో బహుమతి, కురిచేడు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఎం.బయ్యపురెడ్డి ఎడ్లు నాలుగో బహుమతి, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఉప్పుమాగుటూరు గ్రామానికి చెందిన తేజశ్రీరెడ్డి ఎడ్లు ఐదో బహుమతి, తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడ గ్రామానికి చెందిన డాక్టర్ హుసేన్ ఎడ్లు ఆరో బహుమతి, నంద్యాల మండలం ఎన్.కొత్తపల్లి గ్రామానికి చెందిన చల్లా వెంకటహారిక ఎడ్లు ఏడో బహుమతి గెలుపొందాయి. ప్రథమ బహుమతిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి బహూకరించారు. -
పెళ్లింట తీవ్ర విషాదం
కొమరోలు: బావ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన బావమరిది పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరాడు. ఈ విషాద సంఘటన కొమరోలు మండలం యర్రపల్లె గ్రామం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు కొమరోలు మండలం మదవపల్లె గ్రామానికి చెందిన బైరగాని శ్రీకాంత్(23) నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ప్రైవేట్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. తన బావ మల్లికార్జున వివాహ వేడుకల్లో పాల్గొనడానికి 4 రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. దగ్గరుండి పెళ్లి పనులు చూడసాగాడు. శుక్ర, శనివారాల్లో మృతుడి బావ మల్లికార్జున వివాహ వేడుకలు నిర్వహించడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. పెళ్లికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి కొమరోలుకు బైక్పై వెళ్లి వస్తున్న శ్రీకాంత్ను యర్రపల్లె గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. అదే సమయంలో కడప వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై పడిపోయిన శ్రీకాంత్ మీదుగా వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో వైఎస్సార్ కడప జిల్లా బూరవారిపల్లె గ్రామానికి చెందిన బట్టపోతుల నారాయణ కాలు విరిగింది. క్షతగాత్రుడిని ప్రైవేట్ వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. మరో రెండు నెలల్లో శ్రీకాంత్కు వివాహం మృతుడు శ్రీకాంత్కు మరో రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉంది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన యువతితో నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు రంగమ్మ, నడిపి తిరుమలయ్య గుండెలవిసేలా విలపించారు. వివాహానికి వచ్చిన బంధువులంతా సంఘటన స్థలంలో కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగరాజు పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బావ పెళ్లికి వచ్చి మృత్యు ఒడిలోకి చేరిన యువకుడు వచ్చే శ్రావణ మాసంలోనే వివాహం నిశ్చయం -
ఉర్దూ బోధనకు ఉరి!
కంభం: ప్రస్తుతం నిర్వహిస్తున్న టీచర్ల బదిలీలు ఉర్దూ మీడియం విద్యకు మైనారిటీ విద్యార్థులను దూరం చేసేలా ఉన్నాయని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల్లో భాగంగా 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉన్న ఉపాధ్యాయులు కచ్చితంగా మరో చోటకు వెళ్లిపోవాల్సి ఉంది. ఆ పాఠశాలల్లో తిరిగి ఉపాధ్యాయులను నియమిస్తే అక్కడ చదువుకునే ఉర్దూ మీడియం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత బదిలీల నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీలను పీహెచ్(ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్) కోటా కింద భర్తీ చేయాల్సి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు మాత్రమే సీహెచ్ ఉపాద్యాయులుండగా జిల్లాలో 8 పాఠశాలలను పీహెచ్ కోటాకు కేటాయించారు. పీహెచ్ కోటా ఉపాధ్యాయులు ఉన్న చోటే యథావిధిగా కొనసాగవచ్చని ఇప్పటికే కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో వారు తమ స్థానాల్లోనే కొనసాగితే ఖాళీ అవనున్న ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరని తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం స్పందించడం లేదు. పీహెచ్ కోటా పాఠశాలలివే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం మండల కేంద్రం అర్బన్కాలనీ ఉర్థూ పాఠశాల, లింగోజిపల్లి ప్రాథమిక పాఠశాల, చీమకుర్తి ప్రాథమిక పాఠశాల, కందుకూరులోని సరూర్ నగర్ ప్రాథమిక పాఠశాల, పొదిలిలోని ప్రాథమిక పాఠశాల, సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు, కొమ్మలపాడు ప్రాథమిక పాఠశాలలు, యర్రగొండపాలెం ప్రాథమిక పాఠశాలలు పీహెచ్ కోటా కిందకు వచ్చాయి. ఇక్కడ పనిచేసే ఉర్దూ ఉపాద్యాయులు లాంగ్ స్టాండింగ్ కావడంతో వారు వెళ్లిపోనున్నారు. జిల్లాలో పీహెచ్ ఉపాద్యాయుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో అక్కడ చదువుకునే ఉర్దూ మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగనుంది. హైస్కూళ్లుగా అప్గ్రేడ్ కానున్న యూపీ స్కూళ్లు ఉర్దూ యూపీ స్కూళ్లలో 6, 7, 8వ తరగతుల్లో 30 మందికన్నా ఎక్కువగా విద్యార్థులుంటే వాటిని హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైపాలెం, ఏల్చూరు, కొమ్మలపాడు, కందుకూరు, ఖాజీపాలెం, వలపర్ల యూపీ స్కూళ్లు ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూళ్లుగా మారనున్నాయి. ఈ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో ఉర్థూ మీడియం పాఠశాలల వివరాలు ఉర్దూ విద్యార్థులకు అన్యాయం చేసేలా టీచర్ల బదిలీల ప్రక్రియ నిబంధనల ప్రకారం పీహెచ్ కోటా కింద 40 శాతం బదిలీలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పీహెచ్సీ కింద 8 పాఠశాలలు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు ముగ్గురు మాత్రమే.. ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఇబ్బంది లేకుండా చూడాలని తల్లిదండ్రుల వినతి ఖాళీల వివరాలు పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలి నా ఇద్దరు పిల్లలను ఉర్దూ మీడియంలో చదివిస్తున్నా. తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉర్దూ బోధించలేరు. కాబట్టి ఉర్దూ పాఠశాలల్లో ఉర్దూ బోధించేవారినే నియమించాలి. లేదంటే పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – పఠాన్ రుక్సానా, విద్యార్థి తల్లి ఉన్నతాధికారుల దృష్టికి సమస్య జిల్లాలో ఉర్దూ పాఠశాలల్లో ఉన్న ఖాళీల వివరాలు, ఉర్దూ పాఠశాలల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. – మొయినుద్దీన్, జిల్లా ఉర్దూ డీఐ -
పేలిన గ్యాస్ సిలిండర్
● కర్రీస్ షాప్లో వంట సామగ్రి దగ్ధం ● తప్పిన పెను ప్రమాదం పొదిలి: కర్రీస్ షాప్లో గ్యాస్ సిలిండర్ పేలడంలో మంటలు ఎగసిపడి వంట సామగ్రి దగ్ధమైన సంఘటన పొదిలిలోని విశ్వనాథపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. దర్శి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. వివరాలు.. విశ్వనాథపురంలోని కాలేజీ రోడ్డు మొదటి లైనులో కూరలు, పాలు విక్రయించే దుకాణంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. అదృష్టవశాత్తూ సిలిండర్లో గ్యాస్ స్వల్పంగా ఉండటం, జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనంపై భాగంగా పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తుంటారు. అక్కడ కూడా ఎవరూ లేక పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత మేర ఆస్తినష్టం సంభవించిందని యజమాని బంకా అనంతరావు చెప్పారు. రెగ్యులేటర్ ఆపకపోవడం, నాణ్యతలేని పైపును వాడటం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం చోటుచేసుకుందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు. నగల దుకాణంలో మహిళ చేతివాటం మార్కాపురం: పట్టణంలోని ఓ నగల దుకాణంలో మహిళ చేతివాటం చూపి ఆభరణాలు అపహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టణంలోని చెన్నకేశవ స్వామి గుడి సమీపంలోని బంగారు నగల వీధిలోని ఓ దుకాణానికి మహిళలు వెళ్లారు. ఈ సమయంలో ఓ మహిళ దుకాణ యజమానిని ఏమార్చి ఆభరణం దొంగిలించి వెళ్లిపోయింది. సీసీ ఫుటేజీలో ఆలస్యంగా చోరీ విషయాన్ని గుర్తించిన షాపు యజమాని సదరు మహిళలను నిలదీశారు. దీంతో వారు తమ తప్పు ఒప్పుకొని ఆ ఆభరణాన్ని వెనక్కి ఇచ్చారు. -
తనిఖీల్లో కిరికిరి.. థియేటర్లపైనే గురి!
సాక్షి నెట్వర్క్: ‘కూటమి ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు కృతజ్ఞత లేదు. మీ కోసం ఎంతో చేస్తే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..’ అంటూ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. థియేటర్లకు అద్దె కాకుండా షేర్ ఇవ్వాలని యజమానుల యూనియన్ కోరిన నేపథ్యంలో బంద్ ప్రస్తావన తెరపైకి రావడం, దీనిపై లోతుగా విచారించాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. థియేటర్లలో వసతులు, టికెట్ ధరలు, తినుబండారాల ధరలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని డీప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోనూ శుక్రవారం తనిఖీలు ప్రారంభించారు. అయితే నేరుగా థియేటర్లను మాత్రమే తనిఖీ చేస్తే ప్రజల్లోకి మరో విధంగా సందేశం వెళ్తుందని భావించిన కూటమి పాలకులు రూటు మార్చారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్లు, ఆర్టీసీ డిపోలు తదితర వ్యాపార కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించడం గమనార్హం. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
తర్లుపాడు: తర్లుపాడులోని నీలంపాటి లక్ష్మీ అమ్మవారి పంచమదశ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నుంచి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సీనియర్ విభాగంలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.60 వేలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.40 వేలు, చతుర్థ బహుమతి రూ.30 వేలతోపాటు 8 జతల ఎడ్ల యజమానులకు కన్సోలేషన్ బహుమతులు అందించనున్నట్లు వివరించారు. వివరాలకు 9440791698, 9640408773ను సంప్రదించాలని సూచించారు.విద్యుత్ తీగలు తెగి 4 దూడలు మృతిఅర్ధవీడు: రోడ్డుపై 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో నాలుగు దూడలు చనిపోయిన సంఘటన శుక్రవారం అర్ధవీడులోని ఈద్గా సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో మామిళ్ల మల్లికార్జునరెడ్డికి చెందిన 4 దూడలు చనిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీగలను సరిచేశారు. -
జీవితాలు కూల్చి!
సంపద సృష్టిస్తాం.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికలప్పుడు కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే చిరుద్యోగులపై కక్షగట్టారు. వారు చేస్తున్న ఉద్యోగాలను నిర్దాక్షణ్యంగా ఊడగొట్టి రోడ్డున పడేశారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్ వాచ్మెన్లు.. ఇలా జిల్లాలో సుమారు 18 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్టగొట్టారు. హామీల బూచి..చిరుద్యోగుల పొట్టకొట్టి...మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లు 178మద్యం దుకాణాల్లో సేల్స్మెన్లు 356మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 3000వైద్యశాలల్లో పనిచేసిన పారిశుధ్య సిబ్బంది 180 ఒంగోలు నగరంలో మేసీ్త్రల సంఖ్య 45ఒంగోలు నగరంలో పారిశుధ్య కార్మికులు 23 ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఖ్య 650డ్వాక్రా వీఓఏలు 700సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రజలకు జీవనోపాధి చూపించాల్సిన ప్రభుత్వం రాజకీయ కారణాలతో వివిధ శాఖలకు చెందిన చిరుద్యోగులను తొలగించి వారి కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న వారిని కూడా తొలగించి ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన ప్రదర్శనలకు దిగినా పట్టించుకోలేదు. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చని ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. వలంటీర్లను వంచించి... అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని, ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తామని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం జిల్లాలో పనిచేస్తున్న 12,489 మంది వలంటీర్లను కూటమి ప్రభుత్వం పీకేసింది. అప్పటి వరకు ఇంటింటికి అందించే పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను సైతం నిలిపివేసింది. వలంటీర్లకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. వలంటీర్లు వివిధ మార్గాల్లో పోరాటాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే, చంద్రబాబు కేబినేట్లో ఉన్న మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్ల శాఖకు మంత్రిగా ఉండటం గమనార్హం. కోర్టు ఉత్తర్వులు సైతం లెక్కచేయకుండా... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 5,500 మందికిపైగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులున్నారు. వీరిలో చాలా మంది 20 ఏళ్లకుపైగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోయినప్పటికీ అప్పులు చేసి వంట వండి పిల్లలకు భోజనం పెడుతున్నారు. ఎక్కువగా ఎస్సీ, బీసీ మహిళలే పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3 వేల మందితో బలవంతంగా రాజీనామాలు చేయించింది. అయితే, కొంత మంది అంగీకరించలేదు. ప్రజా సంఘాలతో కలిసి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోరాటానికి దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నాలు చేశారు. మరికొందరు మాత్రం న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వారిని కూటమి నేతలు వేధించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ వేధింపులు కొనసాగుతుండటం శోచనీయం. తాజాగా ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిని తొలగించి తమ సొంత మనుషులను నియమించుకున్నారు. సెలవుల తర్వాత నుంచి విధులకు రావద్దని బెదిరిస్తున్నట్లు సమాచారం. రోడ్డున పడిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలు... కూటమి అధికారంలోకి రాగానే పారిశుధ్య కార్మికులనూ వదల్లేదు. వారిపై వైఎస్సార్ సీపీ ముద్ర వేసి ఉద్యోగాల నుంచి తొలగించేసింది. ఒంగోలు నగరంలో పనిచేస్తున్న 45 మంది మేసీ్త్రలు, 23 మంది పారిశుధ్య కార్మికులను ఉన్నపళంగా తొలగించింది. స్థానిక ఎమ్మెల్యేను కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజుల తరబడి దీక్షలు చేసినా పట్టించుకోలేదు. ఆప్కాస్ను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో పారిశుధ్య కార్మికులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆప్కాస్ను రద్దు చేస్తే కార్మికులకు వేతనాలు సక్రమంగా రావని, పీఎఫ్ చెల్లింపులు సరిగ్గా జరగవని, మొత్తం కార్మికుల ప్రాథమిక హక్కులు కాలరాసి బానిస వ్యవస్థను తయారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కూటమి పాలకులపై కార్మికులు మండిపడుతున్నారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పట్టణ ప్రజలకు పారిశుధ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ప్రజాసంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉపాధికి దెబ్బ... జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో 729 మంది పీల్డ్ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా, వారిలో 60 పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. దీంతో 650 మందికిపైగా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే టీడీపీ నాయకులు వీరిపై దాడులు చేయడం మొదలుపెట్టారు. రేపటి నుంచి పనికి వస్తే ఊరుకోమంటూ హుకుం జారీ చేశారు. రాజకీయంగా అధికారులపై ఒత్తిడి చేశారు. పోలీసుల ద్వారా బెదిరించారు. బలప్రయోగం చేస్తామంటూ వార్నింగులిచ్చారు. దాంతో కొందరు స్వచ్ఛందంగా ఉద్యోగం మానుకున్నారు. మరికొందరితో రాజీనామాలు చేయించారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను అమ్ముకున్నట్లు ప్రచారం జరిగింది. ఏదేమైనా కూటమి పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి ఉపాధిని దెబ్బకొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో తొలగించిన ఉద్యోగుల వివరాలు...ఏడాది పాలన లక్షల ఉద్యోగాలంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ వలంటీర్లకు రెట్టింపు జీతమంటూ నిట్టనిలువునా మోసం అధికారంలోకి వచ్చీరాగానే చిరుద్యోగులపై ప్రతాపం పారిశుధ్య కార్మికులనూ వేధించిన పాలకులు మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొట్టిన బాబు రోడ్డున పడిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు డ్వాక్రా వీఓఏలపై కూటమి కక్ష సాధింపులుజిల్లాలో 1200 మంది డ్వాక్రా వీఓఏలు ఉన్నారు. వారిలో 700 మందిని ప్రభుత్వం తొలగించి వారికి అన్యాయం చేసింది. జిల్లాలో ఉన్న 178 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్మెన్లు, సూపర్వైజర్లు 534 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తివేయడంతో వారంతా ఉద్యోగాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లాలో 1,392 రేషన్ దుకాణాలు ఉన్నాయి. పచ్చకూటమి పాలనలోకి రాగానే దాదాపుగా వారందరినీ తొలగించింది. గత వైఎస్సార్ సీపీ పాలనలో వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ తెచ్చి ఇచ్చేవారు. జిల్లాలో 385 వాహనాలు ఉండగా, వాటిని కూడా తీసేసి రేషన్ దుకాణాల వద్దకే వెళ్లి తెచ్చుకోవాలని ఆదేశాలిచ్చింది. కూటమి పాలనలో ఏ ఒక్క శాఖనూ వదలకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నింటిలో పచ్చమందను తెచ్చిపెట్టింది. -
నోటికాడ కూడు కాజేశారు
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు కొత్తపల్లి రాణి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా 15 సంవత్సరాలుగా అర్థవీడులో పనిచేస్తున్నారు. రాణి భర్త ఆరేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చిన జీతంతో తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీఓ శ్రీనివాసరెడ్డి అకారణంగా రాణిని విధులకు రానివ్వకుండా అడ్డుకున్నారు. కూటమి నేతల ఆదేశాలతో ఆమెను అన్యాయంగా తొలగించి ఇబ్బందులకు గురిచేశారు. 2024 జూన్ నుంచి జీతం కూడా ఇవ్వకుండా నిలిపివేశారు. భర్త కూడా లేని రాణితో పాటు ఆమె ముగ్గురు పిల్లల నోటికాడ కూడు కాజేశారు. -
కూటమి పాలకులు నా నోటికాడ కూడు తీసేశారు
కూటమి ప్రభుత్వం వచ్చాక చిరుద్యోగులను తొలగించి వారి నోటికాడ కూడు తీసేసింది. నేను 2009 నుంచి ఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ వేతనం లభించేది. భార్య, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు నన్ను తొలగించారు. ప్రస్తుతం నా పరిస్థితి దయనీయంగా ఉంది. పొట్టకూటి కోసం బేల్దారి పనికి వెళ్తున్నా. – పరిశపోగు జీవన్, దొడ్డిచింతల, హెచ్ఎం పాడు మండలం -
జలజీవన్ మిషన్ను సద్వినియోగం చేసుకోండి
● కేంద్ర ప్రత్యేకాధికారి వగీష్ తివారి యర్రగొండపాలెం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ మిషన్ ప్రత్యేకాధికారి డాక్టర్ వగీష్ తివారి సూచించారు. యర్రగొండపాలెం మండలంలోని గురిజేపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన ఫారం పాండ్లు, గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తివారి మాట్లాడుతూ ఫారం పాండ్లతో రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. వీటి ద్వారా రైతులు పొలాల్లోనే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని రైతులంతా పొలాల్లో ఫారం పాండ్లు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం కింద ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిల నుంచి సక్రమంగా నీటి సరఫరా జరుగుతుందా..? అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. తాగునీటిని వృథా చేయకుండా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం సచివాలయంలో నీటిని పరీక్షించే మిషన్ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని, మురారిపల్లెలో ఉన్న ఫారెస్ట్ నర్సరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జలజీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ పేరివాల్, డ్వామా పీడీ జోసఫ్కుమార్, మార్కాపురం క్లస్టర్ ఏపీడీ నిర్మలాదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు, ఏపీవో శైలజ, ఈసీ లక్ష్మానాయక్ పాల్గొన్నారు. -
ఆగిన రేషన్ బండి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రేషన్ సరుకులను ఎండీయూ వాహనం ద్వారా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు అదే వ్యవస్థను కొనసాగించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం జూన్ 1 నుంచి ఆ వాహనాలను రద్దు చేసింది. ఇక నుంచి రేషన్ షాపు వద్దకు వెళ్లి క్యూలో పడిగాపులు కాస్తూ రేషన్ తీసుకోవాలి. దీంతో ప్రజలు అవస్థలు పడటంతో పాటు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. జిల్లాలో మొత్తం 1,392 రేషన్ షాపులు ఉన్నాయి. అందుకుగానూ రేషన్ సరఫరా చేసే వాహనాలు 385 ఉన్నాయి. వీటిని రద్దు చేయడంతో 385 మంది ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. జిల్లాలో 6,70,627 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరూ జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిందే. -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
ఒంగోలు: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఈ నెల 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.భక్తధృవుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషులకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. మహిళలకు 43, 47, 52 కేజీల విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. 31వ తేదీ సాయంత్రం 3 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. గ్రేడ్–2 మున్సిపాలిటీగా గిద్దలూరు గిద్దలూరు రూరల్: గిద్దలూరు నగర పంచాయతీని గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీని ద్వారా మున్సిపాలిటీకి అదనంగా నిధులు విడుదలై అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. సిబ్బంది పెరుగుదల, అన్నిశాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ఏ పెరుగుదల వంటి వసతులు దక్కనున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2011 ఆగస్టు 22లో గిద్దలూరు మార్పు చెందింది. ప్రస్తుతం నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. ఇంటర్ విద్య జిల్లాఅధికారిగా ఆంజనేయులు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ)గా తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు గురువారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన ఐ.శ్రీనివాసరావు నుంచి ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ప్రిన్సిపాళ్ల సంఘం, అధ్యాపకుల సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆంజనేయులుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ కుమ్మరకుంట సురేష్, ప్రిన్సిపాళ్ల సంఘ నాయకులు కె.పి.రంగనాయకులు, బి.సి.హెచ్.అల్లూరయ్య, విశ్వనాథబాబు, వెంకట్రావు, పాలపర్తి మాధవరావు, వై.గురవయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చీకట్లో మాన్యువల్ కౌన్సెలింగ్ ● ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్ అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం ● చివరికి హడావిడిగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వైనంఒంగోలు సిటీ: స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్లో ప్రభుత్వం విఫలమవడంతో రెండు రోజుల నుంచి సంబంధిత ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి గత పది రోజులుగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తారుమారైంది. ఈ పదోన్నతులకు సంబంధించి జెడ్పీలో 83, మున్సిపల్ యాజమాన్యం కింద 4, మున్సిపల్ కార్పొరేషన్ కింద 1 పోస్టుకు పదోన్నతులు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. దీనికి సంబంధించిన పదోన్నతులలో 1:3 నిష్పత్తిలో 245 వరకు పిలిచినట్లు సమాచారం. 28వ తేదీ మధ్యాహ్నం పదోన్నతులు నిర్వహించాలనే సమాచారం అందడంతో ఉపాధ్యాయులంతా ఒంగోలు డీఆర్ఆర్ఎం హైస్కూల్కు చేరుకున్నారు. సాయంత్రం 9 గంటల వరకు ఉన్నారు. అయితే, గురువారం ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఉపాధ్యాయులను కోరారు. సాయంత్రం 6.30 గంటలకల్లా వెబ్ కౌన్సెలింగ్ పెట్టాలని చూశారు. చివరికి మాన్యువల్గా జరుపుకోవాలని డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. ఈ ప్రమోషన్లకి సంబంధించి 28వ తేదీ మధ్యాహ్నం నుంచి 29వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఉపాధ్యాయులు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ల ప్రకారం బదిలీలు, పదోన్నతులకు ఆటోమేటిక్గా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో పూర్తిగా విఫలమైంది. చివరి సమయంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా అనేక అక్రమాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అవకతవకలకు పాల్పడినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
రైతుకు దక్కని భరోసా..
జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటికి జిల్లా వ్యాప్తంగా 593 భవన నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.12,553.40 లక్షల అంచనాలతో నిధులు మంజూరు చేయగా, 400 భవనాలు పూర్తయ్యాయి. మిగతా భవనాలు పురోగతిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద దాదాపు 3 లక్షల మంది రైతులకు నాలుగు విడతలుగా రూ.13,500ను నేరుగా వారి ఖాతాలకు జమచేసేవారు. రైతులకు నిత్యం అవగాహన కార్యక్రమాలు జరిగేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ నిలిచిపోయాయి. అన్నదాతతో అనుబంధం పెంచుకున్న రైతు భరోసా కేంద్రం నిర్జీవమైపోయింది. అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క పైసా విదిల్చలేదు. పండించిన పంటలకు మద్దతు ధర లభించక అప్పుల పాలై రైతులు రోడ్డున పడుతున్నారు. పేదల పిల్లలు ఆంగ్లం నేర్చుకోకూడదా.? కూటమి ప్రభుత్వం వచ్చాక పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమం అందకుండా చేస్తోంది. 2019 వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకోవాలంటే ధనికుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని పేదలకు ఆంగ్ల మాధ్యమం చేతికందిన అమృత ఫలంలా మారింది. దానిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం రద్దు చేసి పేదలకు అందని ద్రాక్షలా చేసింది. – ఇందూరి దేవి, కురిచేడు ఆర్బీకేలు అన్నదాతకు అండగా నిలిచాయి రైతు భరోసా కేంద్రాలు అన్నదాతకు అండగా నిలిచాయి. క్షేత్రస్థాయిలోనే రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందజేసి అన్ని రకాల సేవలు ఒకేచోట లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. పెట్టుబడి నిధులు మంజూరు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట పండించక ముందే ఆయా పంటలకు మద్దతు ధర, విపత్తుల సమయంలో బీమా సౌకర్యం, ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. రైతులను అన్ని విధాలుగా కూటమి ముంచేసింది. – వెన్నపూస మాల్యాద్రిరెడ్డి, రైతు, చెన్నిపాడు, పొన్నలూరు -
రైతుల జీవితాలతో కూటమి చెలగాటం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి సింగరాయకొండ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతుల్లో జిల్లాలోనే 70 శాతం ఉండగా, కొండపి నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఉన్నారన్నారు. పొగాకు బోర్డు 170 మిలియన్ టన్నులు పొగాకు పండించుకోవడానికి అనుమతిచ్చిందన్నారు. మే నెలాఖరుకు 70 శాతం కొనుగోలు చేయాల్సి ఉండగా, కేవలం 25 శాతంలోపే కొనుగోలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు క్వింటా ధర రూ.38 వేల వరకు ఉంటే.. కూటమి ప్రభుత్వంలో రూ.20 వేలలోపు మాత్రమే ఉందన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి జగనన్న వస్తున్నాడన్న ప్రకటనతో మేల్కొన్న కూటమి ప్రభుత్వం రూ.20 వేల నుంచి రూ.23 వేలకు కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికి 5 శాతం కొనుగోలు చేసి మిగతా పొగాకు వెనక్కి పంపుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఐఎల్టీడీ కంపెనీ గుత్తాధిపత్యానికి గండికొట్టిన జగనన్న.. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి రైతులకు మంచి ధరలు ఇప్పించారని బత్తుల గుర్తుచేశారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన జగనన్న... రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన విషయాన్ని బత్తుల బ్రహ్మానందరెడ్డి గుర్తుచేశారు. ఆ నిధిని రూ.7 వేల కోట్లకు పెంచి రైతుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని జగనన్న చాటుకున్నారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రూ.5 వేల కోట్లతోఽ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క పంటకూ మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ఐటీసీ కంపెనీతో కుమ్మక్కై పొగాకు రైతులను నట్టేట ముంచిందన్నారు. మహానాడు వేదికగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల్లో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారంటూ బత్తుల బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, మండలాల అధ్యక్షులు పిన్నిక శ్రీనివాసులు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్ పాల్గొన్నారు. -
ఏడాది శోకాలు!
పారని పథకాలు.. టంగుటూరు మండలం జమ్ములపాలెంలో నిరుపయోగంగా సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలునెల మొదటి తేదీ సూర్యోదయానికంటే ముందే వలంటీర్లు ఇంటి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేవారు. 50 ఇళ్లకో వలంటీరు ద్వారా సకల సేవలూ అందేవి. కూటమి పార్టీలు వారిని సంఘ విద్రోహశక్తుల్లా అభివర్ణించాయి. అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకు మంగళం పాడేశాయి. విచిత్రమేమిటంటే వలంటీర్లకు ఒక మంత్రి కూడా ఉన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా ఉచితంగా ఇంటి సమీపంలోనే అందేవి. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనితప్పింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అవి కళతప్పాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడింది. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ఐదేళ్లు జిల్లా వ్యాప్తంగా 59,30,289 సేవలు అందాయి. పల్లెల్లో ఆర్బీకేలు, సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భవనాలు నిర్మించింది. చాలా ప్రాంతాల్లో అవి వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతుండటం గమనార్హం. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు మొక్కుబడిగా సేవలందుతున్నాయి. దీంతో పల్లెలు కళతప్పాయి. సేవలు మృగ్యమై జనం కంట కన్నీరుకారుతోంది. ఏడాది పాలన -
ఇంత బరితెగింపా..!
కురిచేడు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే అక్రమాలకు తెరలేపారు. దీంతో ఎన్నో ఏళ్ల నాటి ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే ప్రైవేట్పరం అయిపోతున్నాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయంలోని అధికారుల లీలలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కూటమి నాయకుల అండదండలతో అడ్డగోలుగా ప్రభుత్వ భూములకు ఆన్లైన్ చేసి దండుకుంటున్నారు. ఒక వైపు ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములపై విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఆన్లైన్ చేయడం విశేషం. ప్రభుత్వభూమి ఆన్లైన్.. మండలంలోని కల్లూరు గ్రామ సర్వే నంబర్ 272/74 లోని ప్రభుత్వ భూమిని కొంతమంది పేర్లతో ఆన్లైన్ ఎక్కించినట్లు గ్రామ వైఎస్సార్ సీపీ నాయకుడు పాలెబోయిన పెద్ద పెద్దయ్య ఆధారాలతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల అవినీతి దాహంతో గ్రామంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు కలెక్టర్కు ఫిరా్య్దు చేసినా రెవెన్యూ అధికారులు బరితెగించి మాకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని బాహాటంగా చెప్పుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తి తన కుటుంబసభ్యుల పేరుపై సర్వే నంబఱ్ 272/1కే లోని 3 ఎకరాల భూమిని ఆన్లైన్ చేశారు. అలాగే 272/74 లోని ప్రభుత్వ భూమిని నక్కా ఆంజనేయులు పేరుతో 50 సెంట్లు ఆన్లైన్ చేశారు. అదే సర్వే నంబర్లోని మరో 50 సెంట్లు నక్కా లింగమ్మకు అనువంశికం కింద ఆన్లైన్ చేశారు. వల్లెం వెంకటేశ్వర్లు పేరుతో కూడి మరో 50 సెంట్ల భూమిని ఈ నెల 19వ తేదీ ఆన్లైన్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి గయాల్ అని ఉంది. గతంలో పనిచేసిన తహసీల్దార్ నాగుల్మీరా సైతం ప్రభుత్వ భూమి అని ఎండార్స్మెంట్ చేశారు. అలాగే సమాచార హక్కుచట్టం ద్వారా కూడా 272/1కే, 39 సర్వేనంబర్లు గయాలు భూమిగా సమాధానం ఇచ్చారు. అలాగే నక్కా లక్ష్మిదేవి పేరుపై ఉన్న మూడు ఎకరాల భూమిపై విచారణ చేయాలని డీఆర్ఓ ఓబులేశు గత మార్చి నెలలో విచారణకు ఆదేశించారు. ఈ భూములపై గ్రామస్తులు సైతం హైకోర్టులో కేసు వేశారు. ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నా, కోర్టుల్లో పెండింగ్ ఉన్నా అధికారులు అవేమీ మాకు సంబంధం లేదని అక్రమంగా ఆన్లైన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే రెవెన్యూ అధికారుల లీలలు బయటకు వస్తాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అడ్డగోలుగా ప్రభుత్వ భూముల ఆన్లైన్ నేతల అండదండలతో బరితెగిస్తున్న అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూమని తెలిసినా అక్రమంగా ఆన్లైన్ చేసేస్తున్న వైనం ఉన్నతాధికారుల ఆదేశాలూ బేఖాతరు. -
అతి వేగం.. టిప్పర్ బీభత్సం
పొదిలి: మితిమీరిన వేగంతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి బైక్ను ఢీకొట్టడమే కాకుండా పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బీభత్సం సృష్టించిన ఈ సంఘటన గురువారం పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరివారిపాలెం సమీపంలో ఒంగోలు–కర్నూలు హైవేపై చోటుచేసుకుంది. వివరాలు.. వినుకొండకు చెందిన పెనుమాల్ల లక్ష్మీనారాయణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను డ్రైవింగ్ చేసే మినీ లారీ మర్రిపూడి మండలం చిమట గ్రామంలో బొప్పాయి కాయల లోడింగ్కు వెళ్లింది. లారీ ఓనర్ తాను డ్రైవింగ్ చేస్తానని చెప్పి తన మోటారుసైకిల్పై లక్ష్మీనారాయణను వెళ్లాలని సూచించాడు. బైక్పై పొదిలి వైపు వస్తున్న లక్ష్మీనారాయణను కాటూరివారిపాలెం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. బైక్ను తొక్కుకుంటూ పెట్రోల్ బంకు వైపు దూసుకెళ్లిన టిప్పర్ అక్కడ ఉన్న హోర్డింగ్లను ఢీకొట్టి, సిమెంటు దిమ్మె పైకి ఎక్కింది. పెట్రోల్ బంకులోకి నేరుగా దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన లక్ష్మీనారాయణను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సురక్షితమైన తాగునీరు అందించాలి పొదిలి రూరల్: ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ నోడల్ అధికారి వి.దినేష్కుమార్ అన్నారు. మండలంలోని అక్కచెరువు గ్రామంలో రూ.96.10 లక్షలతో చేపట్టిన జల జీవన్ మిషన్ పథకం పనులను గురువారంఆయన పరిశీలించారు. తొలుత పంచాయతీ కార్యాలయంలో పథకానికి సంబంధించి పనుల పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర్రావు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తరువాత రికార్డులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో దినేష్కుమార్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడి భూగర్భనీటి వనరులు పెంచాలన్నారు. ఈ పథకం అమల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని గ్రామస్తులు అడిగారు. ఈ క్రమంలో గృహఆలు హెచ్చు తగ్గులుగా ఉండటంతో శివారు ప్రాంతాలకు నీరు సరఫరా అందడం లేదని తెలిపారు. అనంతరం కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంకు, ఇంటింటికీ ఏర్పాటు చేసిన నీటి కుళాయి, పశువుల షెడ్డు, ఫారంపాండ్లను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసఫ్కుమార్, ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ చేరెడ్డి నాగలక్ష్మి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జాబ్మేళా ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి కె.రవితేజ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండ్లూరు డొంక మహిళా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. జాబ్మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. అభ్యర్థులు 10వ తరగతి ఆపైన విద్యార్హత ఉండాలన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు 9963005209 నంబర్ను సంప్రదించాలని కోరారు. బైక్ను ఢీకొట్టి, పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన వైనం ఒకరికి తీవ్ర గాయాలు జలజీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ -
బడుగు యువకులపై దాడి మంత్రి మనోహర్ పనే..
ఒంగోలు వన్టౌన్: తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను దారుణంగా హింసించి, కర్కశంగా ప్రవర్తించిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. యువకులను బహిరంగంగా లాఠీలతో మోది చిత్రహింసలు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ప్రదర్శన చేపట్టి, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత యువకులపై కూటమి ప్రభుత్వ మంత్రి నాదెండ్ల మనోహర్ దాడి చేయించారని ఆరోపించారు. తెనాలి ఐతా నగర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు మంత్రితోపాటు పొలీసు, మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాలను దళితులు అడ్డుకున్నారన్నారు. మూడు రోజులపాటు దళితులు ఆందోళన చేయడంతో మంత్రి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో పొలీసులకు, దళితులకు మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని గుర్తుచేశారు. ఇది మనసులో పెట్టుకుని దళిత యువకులను పోలీసులు దారుణంగా కొట్టారని, కిరాతక పోలీసులు రాములు నాయక్, రమేష్ బాబును అరెస్టు చేయాలని, నాదెండ్ల మనోహర్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కోటిమాదిగ, మాల సంఘాల జేఏసీ నాయకులు టి.శోక్బాబు, కె.ఏడుకొండలు, కేవీపీఎస్ నాయకుడు రఘురాం తదితరులు పాల్గొన్నారు. నాదెండ్లను బర్తరఫ్ చేయాలని దళిత సంఘాల డిమాండ్ -
పీఆర్సీ కమిషన్ నియమించాలి
ఒంగోలు సిటీ: సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిషన్ను నియమించడంతోపాటు మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. సంఘ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన విజయవాడలోని లయోలా కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న రాష్ట్ర కౌన్సిల్ మూడో సమావేశానికి ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది హాజరై విజయవంతం చేయాలని కోరారు. గురువారం స్థానిక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న 14 ప్రధాన డిమాండ్ల సాధనకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.20 వేల కోట్లకు పైగా ఉన్న పీఆర్సీ, డీఏ, ఎస్ఎల్ఎస్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపునకు కాలపరిమితితో కూడిన రూట్ మ్యాప్ విడుదల చేయాలన్నారు. సీపీఎస్/జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే వేతనం, పెన్షన్ల చెల్లింపు చట్టబద్ధం చేయాలన్నారు. జూన్ 5వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రకాశం భవన్ నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి వరకుమార్, పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, ట్రెజరర్ యేసు రత్నం, తాలూకా అధ్యక్షుడు సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ 14 ప్రధాన సమస్యల పరిష్కారానికి జూన్ 5న కౌన్సిల్ సమావేశం -
కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
గిద్దలూరు రూరల్: మండలంలోని కేఎస్పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా అర్ధవీడులో పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తుంటాడు. ప్రసాద్ తన కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి అందులోని వస్తువులు అపహరించారు. ప్రసాద్ తిరుపతి నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి వెనుక భాగంలో ఉన్న తలుపులు తెరచి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్ ఢీకొని దంపతులకు తీవ్రగాయాలు మార్కాపురం: టూవీలర్ను వెనుక నుంచి మరో టూవీలర్ ఢీకొట్టడంతో దంపతులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి పట్టణంలోని వై జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. తర్లుపాడు మండలం మంగళికుంట గ్రామానికి చెందిన భార్యభర్తలు షకీలా, నాగేశ్వరరావు వ్యక్తిగత పనిపై మార్కాపురం పట్టణానికి వస్తున్నారు. వారి వెనుకే వస్తున్న మరో టూవీలర్ అదుపుతప్పి భార్యాభర్తలను ఢీకొట్టింది. గాయాలైన సంఘటన చోటుచేసుకుందని పట్టణ పోలీస్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. న్యాయవాదులు బాధ్యతగా పనిచేయాలి సింగరాయకొండ: న్యాయవాదులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి న్యాయాన్ని కాపాడాలని హైకోర్టు జడ్జి కె.మన్మథరావు పిలుపునిచ్చారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని గంజి కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఆయనకు ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మన్మథరావు మాట్లాడుతూ దేశంలో కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. ఇటీవల హైకోర్టు జడ్జిలంతా సమష్టి కృషితో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. తాను ఒక్కడినే 13 వేల కేసులు పరిష్కరించానన్నారు. దీంతో కేసుల పరిష్కారంలో ఏపీకి రెండో స్థానం దక్కిందన్నారు. సింగరాయకొండలో నూతన కోర్టు ఏర్పాటుకు తన కృషి కన్నా ఇక్కడి అవసరాలే కారణమన్నారు. అనంతరం జడ్జి మన్మథరావుకు ఆత్మీయ పౌర సన్మానం చేశారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులనాయుడు, అడ్వకేట్ పంగులూరి గోవిందయ్య, మేకల రామ్మూర్తి, డాక్టర్ కొంపల్లి హెచ్ఎస్ఎస్ సుందర్, డాక్టర్ నూకసాని సుబ్బారావు, అడ్వకేట్ రాయి రమేష్, కొల్లూరి నరసింహారావు, బక్కమంతుల వెంకటేశ్వర్లు, పంతగాని వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
వదిన కుమారుడు మరణించాడని.. గుండెపోటుతో బాబాయి మృతి
యర్రగొండపాలెం(ప్రకాశం): వదిన కుమారుడు మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక బాబాయి గుండెపోటుతో మరణించిన సంఘటన బుధవారం యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆలేటి అఖిల్ మంగళవారం నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి పిన్ని భర్త పెద్దారవీడు మండలంలోని చాట్లమడ గ్రామానికి చెందిన జి.దానియేలు(45) హైదరాబాద్లో బేల్దారి పని చేస్తుంటాడు.అఖిల్ మృతి విషయం తెలిసి యర్రగొండపాలెం వచ్చాడు. ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాన్ని చూసిన తీవ్రంగా కలతచెందాడు. అఖిల్ మృతి చెందిన ఫారం పాండ్ పరిసరాలను పరిశీలిస్తూ దానియేలు ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాడు. బంధువులు హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో వీరభద్రాపురం, చాట్లమడ గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ట్రిపుల్ ఐటీ తరలింపు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించి అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. అదంతా నిజమేనని జిల్లా ప్రజలు నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించకుండా ఏడాదిగా కాలయాపన చేస్తున్నారు. అంతేగాకుండా గత వ్రభుత్వ హయాంలో ఇడుపులపాయలో ఇబ్బంది పడుతున్న ఒంగోలు క్యాంపస్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని వారిని ఒంగోలు తరలించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒంగోలు క్యాంపస్ విద్యార్థులను తిరిగి ఇడుపులపాయకు తరలిస్తోంది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేడు ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు
ఒంగోలు సిటీ: స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కార్యక్రమం స్థానిక డీఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు డీఈఓ ఏ.కిరణ్కుమార్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ లిస్టులో 249 నంబర్ వరకు పేర్లు ఉన్న వారు ప్రమోషన్లకు తప్పకుండా హాజరుకావాలని కోరారు.బెల్ట్షాప్ నిర్వాహకుడు అరెస్టుయర్రగొండపాలెం: పద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టులో నిర్వహిస్తున్న మద్యం బెల్ట్ షాపుపై బుధవారం మార్కాపురం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖాధికారులు దాడులు దాడులు చేసి ఆ షాప్ యజమాన్ని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న 20 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. ‘దేవరాజుగట్టులో ఓపెన్ బెల్ట్ షాపు’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ ఎస్సై ఎంవీ గోపాలకృష్ణ స్పందించి దాడులు చేశారు. బెల్ట్షాపులు నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నలుగురు చిన్నారులకు విద్యుత్ షాక్చీమకుర్తి రూరల్: మండలంలోని కూనంనేనివారిపాలెం సచివాలయం సమీపంలో బీసీకాలనీ చిన్నారులు నలుగురు బుధవారం విద్యుత్ షాక్కు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. బీసీ కాలనీ దగ్గర విద్యుత్ స్తంభం ఒరిగిపోవడంతో తీగలు కిందకు జారిపోయి నేలకు మూడడుగుల ఎత్తులోనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న చిన్నారులు రేవూరి ధనుష్, పాలకీటి దివ్య, పాలకీటి దీపిక, దాసరి విజయలక్ష్మి విద్యుత్ తీగలకు తగలడంతో షాక్కు గురయ్యారు. అందరూ క్షేమంగా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సమస్య పరిష్కరించాలని ఎంపీటీసీ వేమా అశ్వని, స్థానికులు డిమాండ్ చేశారు.ప్రశాంత జీవనానికి యోగా ఉత్తమం● ఎస్పీ ఏఆర్ దామోదర్ఒంగోలు టౌన్: శారీరక, మానసిక ఆరోగ్యానికి, ప్రశాంత జీవనానికి యోగా ఏకై క మార్గమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. యోగాంధ్ర –2025లో భాగంగా బుధవారం పోలీసు కల్యాణ మండపంలో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..పోలీసు సిబ్బంది రోజువారి విధి నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారని చెప్పారు. మానసిక ఒత్తిడిని తగ్తించే శక్తి యోగాకు ఉందన్నారు. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదని, శరీరం, మనసు మధ్య సమతుల్యం ఏర్పరిచే సాధనమన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐలు నాగరాజు, విజయకృష్ణ, మేడా శ్రీనివాసరావు పాల్గొన్నారు.డీఐఈఓగా ఆంజనేయులుతాళ్లూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ఆంజనేయులు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఐఈఓ)గా పదోన్నతి వచ్చింది. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్తీక్ శుక్లా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
దొనకొండ కారిడార్ సంగతేంటి..?
దొనకొండలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. అవేవీ పట్టించుకోని చంద్రబాబు దొనకొండను పారిశ్రామిక కారిడార్ చేస్తానంటూ హంగామా చేశారు. 2014–19లో దొనకొండకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదేపాట పాడుతున్నారు. బ్రిటీష్ పాలనలో ఇక్కడ ఏర్పాటు చేసిన విమానాశ్రయాన్ని మూలనపడేశాడు. నిజానికి దొనకొండను పారిశ్రామికకారిడార్గా చేసేపనైతే విమానాశ్రయాన్ని ఒంగోలు తరలించడం దేనికనే ప్రశ్నకు సమాధానం లేదు. -
వేర్వేరు ఆలయాల్లో చోరీ
● రూ.2.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.25 వేల నగదు అపహరణ జరుగుమల్లి(సింగరాయకొండ)/కొండపి: కొండపి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో మంగళవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి తెగబడ్డారు. జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక కొత్తపాలెంలోని అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి కిరీటం, సుమారు రూ.20 వేల నగదు చోరీ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● కొండపి మండలంలోని పెట్లూరు శివాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి నగలు దోచుకెళ్లారు. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయని గ్రామస్తులు తెలిపారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అంకారావు తెలిపారు. -
మెడికల్ కళాశాలపై పచ్చపడగ...
వెనకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇది గమనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యతో పాటు పశ్చిమ ప్రజలకు వైద్య చికిత్స అందించే లక్ష్యంతో మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.475 కోట్లు మంజూరు చేసి 75 శాతం పనులు పూర్తి చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాల ప్రారంభించాలని భావించారు. ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని నిలిపివేసింది. అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని బదిలీ చేసింది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తోంది. -
గాల్లో మేడలు..!
● దొనకొండను పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తామంటూ పట్టించుకోని కూటమి పాలకులు ● ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ ఎత్తివేసి ఇడుపులపాయకు తరలింపు ● ఒంగోలు ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టును అటకెక్కించారు. ● ఒక్క హామీ అమలు చేయకుండా నిత్య కలహాలతో కాలయాపన చేస్తున్న కూటమి పాలకులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా అభివృద్ధికి అది చేస్తాం..ఇది చేస్తామంటూ చాలా హామీలిచ్చారు. నోటికొచ్చినట్లు వాగ్దానాలు చేశారు. తీరా హామీల అమలును ప్రశ్నిస్తే సోషల్ మీడియా కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీసులను ఉసిగొల్పి చుక్కలు చూపిస్తున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమిలో కుంపటి రాజేసి కలహాలతో కాలపయాపన చేస్తున్నారు. వెలిగొండకు మొండిచేయి మార్కాపురం జిల్లా పట్టాలెక్కేనాఒంగోలు ఎయిర్పోర్ట్ కొత్త నాటకం మెడికల్ కళాశాలకు గ్రహణంఏడాది పాలన -
అటకెక్కిన మంచినీటి పథకం...
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగరంలో 3.50 లక్షల జనాభా ఉన్నారు. 50 డివిజన్లకుపైగా విస్తరించింది. అయితే, ఒంగోలు నగర, నగర శివారు ప్రాంతాల ప్రజలను మంచినీటి కొరత వేధిస్తోంది. జిల్లా పర్యటనకు వచ్చిన ఆప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. నగర ప్రజలకు ప్రతిరోజూ మంచినీరు అందించేందుకు రూ.350 కోట్లు మంజూరు చేశారు. దీనికి పరిపాలనాపరమైన అనుమతులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం పూర్తిగా అటకెక్కింది. -
ప్రకటనలు దాటని జిల్లా ఏర్పాటు...
ఎన్నికల ప్రచారంలో మార్కాపురాన్ని జిల్లా చేస్తామని చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా చేసిన తరువాతనే మార్కాపురంలో అడుగుపెడతానంటూ పశ్చిమ ప్రకాశం ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. ఇప్పటికీ ఆయన రెండుసార్లు మార్కాపురం వచ్చి వెళ్లారు. మొదటిసారి పర్యటనలో మార్కాపురంను జిల్లా చేయడం ఇప్పట్లో కుదరదని తేల్చి చెప్పారు. రెండోసారైనా ఏమైనా చెబుతారేమోనని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మార్కాపురం వచ్చిన ఆయన జిల్లా గురించి ప్రస్తావించకుండా వెళ్లిపోయారు. చంద్రబాబు ఏదైనా మాట ఇచ్చారంటే దానిని చేయరని అర్థం చేసుకోవాలని పశ్చిమ ప్రాంత ప్రజలు నిట్టూరుస్తున్నారు. -
జిల్లాను సస్యశ్యామలం చేయాలి
● కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ పెరివాల్ ఒంగోలు సబర్బన్: సవాళ్లను అధిగమించి జిల్లాను సస్యశ్యామలం చేసేలా పథకాలు అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి వాగేష్ తివారీ, డాక్టర్ దినేష్ కుమార్ పెరివాల్ అన్నారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులను పరిశీలించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు కలెక్టర్తో కలిసి ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు జిల్లాలో జల్జీవన్ మిషన్ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డ్వామా పీడీ జోసఫ్కుమార్ మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితి, వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ నీటి మట్టాన్ని, పచ్చదనాన్ని పెంచేందుకు, నీటి వనరుల మరమ్మతులకు చేపట్టిన చర్యలు వివరించారు. గ్రౌండ్ వాటర్ ఈఈ విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల్లో 93 గ్రామాలను పరిమితికి మించి భూగర్భ జలాలను వాడినట్లుగా గుర్తించామన్నారు. అయితే జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో భూగర్భ నీటిమట్టం ఏడాదిలోనే సగటున 3 మీటర్లు పెరిగిందన్నారు. దీనిపై వాగేష్ తివారీ స్పందిస్తూ జిల్లాలోని క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. డీపీఓ గొట్టిపాటి వెంకటనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి, చుండూరి
ఒంగోలు సిటీ/యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు చుండూరి రవిబాబు తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ జగన్కు ప్రకాశం జిల్లా లీగల్ టీమ్ సభ్యులను చెవిరెడ్డి, చుండూరి పరిచయం చేశారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ టీమ్ సభ్యులు ధర్నాసి హరిబాబు, కాకుటూరి సంపత్కుమార్, కత్తి కోటేష్బాబు, బి.నాగమల్లేశ్వరరెడ్డి, నాయకులు రాయపాటి అంకయ్య, మలిశెట్టి దేవ, పులుసు సురేష్ తదితరులు ఉన్నారు. -
మర్రిపూడిలో రెవెన్యూ రికార్డుల తనిఖీ
మర్రిపూడి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డులను కనిగిరి ఆర్డీఓ జి.కేశవర్థన్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. మండలంలోని గుండ్లసముద్రంలో సర్వే నంబర్ 571లో ఉన్న 207.86 ఎకరాల పశువుల బీడులో నిబంధనలకు విరుద్ధంగా కొంత భూమిని అధికారపార్టీ నాయకులు ఆన్లైన్ చేయించుకున్నారు. దీనిపై ఈ నెల17న ‘పశువుల బీడు ఫలహారం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైంది. అలాగే మండల కేంద్రమైన మర్రిపూడిలో లక్ష్మీనృసింహస్వామి కొండ సమీపంలో సర్వే నంబరు 990–1లో 327.27 ఎకరాల భూమి ఉంది. దీనిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని అప్పటి జిల్లా కలెకర్ట్ బ్లాక్లిస్టులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున తహసీల్దార్ జ్వాలా నరసింహారావు తమ సిబ్బందితో కలిసి సర్వే నంబర్ 990–1లో కొంత భూమిని టీడీపీ సానుభూతిపరులకు ఆన్లైన్ చేయడంతో అసలైన భూ హక్కుదారులు కార్యాలయానికి వచ్చి గగ్గోలుపెట్టారు. ఈ విషయంపై ఈ నెల 26న ‘పచ్చనేతల తెగింపు.. తహసీల్దార్ బరితెగింపు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. వీటిపై స్పందించిన కలెక్టర్ తమీమ్అన్సారియా విచారణకు ఆదేశించడంతో ఆర్డీఓ బుధవారం రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. గుండ్లసముద్రం, మర్రిపూడి భూరికార్డుల తనిఖీ నివేదినకను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. -
పులి దాడిలో ఆవు మృతి?
ఆర్ధవీడు: పాపినేనిపల్లె ఫారెస్టు బీట్ పరిధిలోని నారాయనపల్లి గ్రామ కొండ అంచు వ్యవసాయ పొలాల్లో ఆవుపై అడవి మృగం దాడి చేసి చంపింది. బొప్పాయి తోటలో ఆవు మరణించి ఉండటాన్ని రైతులు బుధవారం మధ్యాహ్నం గుర్తించారు. ఆవు మెడ, ఎడమ కాలిపై మృగం కొరికిన ఆనవాళ్లు ఉండటంతో పులి దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పులి సంచరిస్తోందన్న వార్త ఆనోటా ఈనోటా తెలియడంతో నారాయనపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆవు మృతి చెందిన విషయం అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో ట్రాప్ కెమెరాలు అమర్చారు. బుదవారం రాత్రి కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఏ జంతువు దాడి చేసిందో నిర్ధారిస్తామని ఫారెస్ట్ బీట్ అధికారి మురళీకృష్ణ తెలిపారు.ఆర్మీ జవాన్ మృతిపై కేసు నమోదుకొమరోలు: మండలంలోని తాటిచెర్ల గ్రామంలో ఆర్మీ జవాన్ రవి(41) మంగళవారం ఉదయం మృతి చెందారు. రాజస్థాన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన సెలవుపై గత సోమవారమే స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం వేకువజామున కుటుంబ సభ్యులు ఎంతగా పిలిచినా లేవకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. రవి తల్లి రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు బుధవారం తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనారోగ్యంతో మరణించారా మరేదైనా కారణమా అనేది పోస్టుమార్టంలో వెల్లడవుతుందని ఎస్సై చెప్పారు. -
ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్లో మధుసూదన్కు స్థానం
మార్కాపురం: గిన్నిస్ బుక్తో సమానమైన ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ బుక్లో మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ కప్పగంతుల మధుసూదన్శాస్త్రికి స్థానం దక్కింది. సంబంధించిన పత్రాలను అందుకున్న ఆయన అవార్డు వివరాలను బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆసియా ఖండంలో విశిష్ట సేవలు, అత్యంత ప్రతిభ కనపరిచిన వారి విశేషాలను ఈ బుక్ ప్రచురిస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన బుక్లో మొత్తం 498 మంది వివరాలు ఉండగా అందులో 13వ వాల్యూంలో మధుసూదన్శాస్త్రి వివరాలు నమోదు చేశారు. 1980 నుంచి న్యూఢిల్లీకి చెందిన రవిభూషన్ ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ బుక్ ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకంలో మధుసూదన్ తండ్రి వేణుగోపాల కృష్ణమూర్తి 1988లో చోటు సంపాదించడం విశేషం. ఈ సందర్భంగా ఆయనను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోపాలుని హరిహారరావు, విశ్రాంత విద్యాశాఖ ఆర్జేడీ డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం చంద్రశేఖరరెడ్డి తదితరులు అభినందించారు.హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవంమార్కాపురం టౌన్: హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్కాపురంలోని జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శుభవాణి బుధవారం తీర్పు వెల్లడించారు. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన పఠాన్ ఖాశింఖాన్ను 2015 జూన్ 21న మార్కాపురం మండలంలోని రాయవరం సమీపంలో బాషా టిఫిన్ బంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తన భర్తకు వ్యవసాయ భూమి విషయంలో షేక్ సుబానీ, అతని మనుషులతో గొడవలు జరిగాయని, వారే హత్య చేసి ఉండవచ్చని మార్కాపురం రూరల్ పోలీసులకు ఖాశింఖాన్ భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి సీఐ కరుణాకర్రావు కేసు దర్యాప్తు చేశారు. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన పఠాన్ సుబానీ అలియాస్ గడ్డ అలియాస్ గడ్డగాడు, రాయవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన షేక్ బాషా అలియాస్ లేషా, ఇదే ప్రాంతానికి చెందిన సయ్యద్ మాబుసుబానీ, సయ్యద్ బడే హుస్సేన్ను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ట్రయల్ నడుస్తున్న క్రమంలో సయ్యద్ మాబుసుబానీ, సయ్యద్ బడే హుస్సేన్ మృతి చెందారు. బుధవారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో పఠాన్ సుబానీ, షేక్ బాషాకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.బాలునాయక్ పేర్కొన్నారు. ఒక్కో నిందితుడికి రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా కోర్టులో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన అప్పటి సీఐ కరుణాకర్రావు, ప్రస్తుత సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు, లైజన్ హెడ్ కానిస్టేబుల్ ఐవీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ కిషోర్కుమార్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. -
నా భర్తను కాపాడండి
సీఎం గారూ.. ఒంగోలు టౌన్: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారూ.. నా భర్త ప్రాణాలు కాపాడండి.. వైద్యపరంగా చికిత్స కోసం సాయం అందించండి’ అంటూ గిద్దలూరుకు చెందిన కందుల విజయలక్ష్మి వేడుకున్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆమె పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. తన భర్త సురేంద్ర మార్కాపురానికి చెందిన సుబ్బారెడ్డి వద్ద లారీ కొనుగోలు చేశారని, రూ.2.25 లక్షలకు బేరం మాట్లాడుకుని రూ.1.50 లక్షల అడ్వాన్స్గా ఇచ్చారని వివరించారు. మిగతా డబ్బు ఫైనాన్స్ ద్వారా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, అయితే లారీ చూసి రావడానికి వెళ్లిన రోజే తమ లారీ ఒకటి ప్రమాదానికి గురవడంతో సురేంద్ర సెంటిమెంట్గా భావించారని, దాంతో లారీ వద్దని సుబ్బారెడ్డికి చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంలో సుబ్బారెడ్డితో విభేదాలు రావడంతో పోలీసులతో కలిసి వేధిస్తున్నారని, మనస్తాపానికి గురైన తన భర్త గడ్డిమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని విలపించారు. తన భర్త నంద్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడని, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఇదిలా ఉండగా 2024 నవంబర్లో సురేంద్రకు లారీ విక్రయించినట్లు సుబ్బారెడ్డి చెబుతున్నారు. అప్పటి నుంచి ఫైనాన్స్ కిస్తీలు సక్రమంగా చెల్లించకుండా లారీ తిప్పకొంటున్నారని, ఫైనాన్స్ విషయంలో వచ్చిన సమస్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు అవాస్తవం : డీఎస్పీ నాగరాజు సురేంద్ర కుటుంబ సభ్యులు పోలీసుల మీద చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు చెప్పారు. సురేంద్ర రెడ్డి ఒక లారీని మిస్సింగ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, విచారణ నిమిత్తంి స్టేషన్కు పిపలిచారని వివరించారు. సురేంద్రను కొట్టలేదని, వివరాలు కనుక్కొని పంపించి వేశామన్నారు. -
కార్డుదారులందరికీ రేషన్ అందాలి
● రేషన్ షాపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఒంగోలు సబర్బన్: కార్డుదారులందరికీ సకాలంలో రేషన్ అందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పౌర సరఫరాల శాఖ అధికారులు, రేషన్ దుకాణాల డీలర్లను ఆదేశించారు. ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీని చేపడుతున్న విషయం తెలిసిందేనన్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నెలాఖరు నాటికి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎంతమంది కార్డుదారులు ఉన్నారు, ఎంత రేషన్ సరఫరా చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ మధుసూదనరావు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం ఎన్టీఆర్కు నివాళి
ఒంగోలు సబర్బన్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బుధవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ తమీమ్ అన్సారియా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, మెప్మా పీడీ శ్రీహరి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. -
బ్యాంగ్!
బూమ్..మేఘాల్లో ధన, రుణావేశం పిడుగుల జననం జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు జనాన్ని ఆశ్చర్యానికి, అయోమయానికి గురిచేస్తున్నాయి. అంతకు మించి భయాన్ని పుట్టిస్తున్నాయి.! అనూహ్య రీతిలో వాతావరణం మారిపోయి, ఆకాశంలో మబ్బులు కమ్మేయడం.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో పిడుగులు పడుతుండటంతో మనుషులతోపాటు మూగ జీవాలు బలవుతున్నాయి. పిడుగుల బారి నుంచి రక్షణ పొందాలంటే అప్రమత్తతే ఆయుధం. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న హెచ్చరికలను అనుసరించడం అత్యంత ముఖ్యం.పొన్నలూరు/కనిగిరి రూరల్: వేసవి కాలం అయినప్పటికీ బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా అడపా దడపా వర్షాలు కురిశాయి. పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే చెట్లు, నివాసాలు, ఖాళీ స్థలాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఆలయాలపై పిడుగులు పడటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సాధారణంగా పిడుగుపాటు బారి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే వర్షాలు కురిసే సమయాల్లో చెట్ల కింద, ఎత్తయిన ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.సమయ స్ఫూర్తి ఎంతో అవసరం..వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి రైతులు అప్రమత్తం కావాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒక వేళ సురక్షిత ప్రాంతానికి వెళ్లే సమయం లేకుంటే సమయస్ఫూర్తితో వ్యవహరించి.. మోకాళ్లపై కూర్చుని చేతులు, తల నేలకు తగిలేలా ముడుచుకుని కూర్చోవాలి. దీని వల్ల సమీపంలో పిడుగు పడినా ఆ ప్రభావం తక్కువగా ఉండి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. అలా కుదరని పరిస్థితిలో కాళ్లను భూమి మీద పూర్తిగా ఆనించకుండా, కాలి వేళ్లపై నిల్చునేందుకు ప్రయత్నించాలి.ఈ జాగ్రత్తలు పాటించాలిæ సాధారణంగా ఎత్తుగా ఉండే నిర్మాణాలు, ప్రాంతాలపై పిడుగులు ఎక్కువగా పడతాయి. అందువల్ల వర్షం కురిసే సమయంలో చెట్లు, సెల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు.æ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్ కుక్కర్లు, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు ఉపయోగించకూడదు.æ గుంపులు గుంపులుగా కాకుండా దూరంగా ఉండాలి.ప్రథమ చికిత్స ఇలా..● పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన వారిని గాలి, వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతంలో ఉంచాలి.● తడి దుస్తులు తొలగించి పొడి దుస్తులు వేయాలి.● తల ఒక వైపునకు తిప్పి, రెండు కాళ్లు కాస్త పైకి ఎత్తి ఉంచాలి.● తాగు నీరు, ఆహార పదార్థాలు అందించకూడదు.● అందుబాటులో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.జిల్లాలో పిడుగుల గర్జనì ఏప్రిల్ 3న వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి పంచాయతీ కట్టకిందపల్లిలో బి.తిరుపాలుకు చెందిన సుమారు 10 జీవాలు పిడుగుపాటుకు మృతి చెందాయి.ì ఏప్రిల్ 4న కొమరోలు మండలం ఎడమకల్లులో ఎం.యాకోబుకు చెందిన మూడు గేదెలు చనిపోయాయి.ì ఏప్రిల్ 20న బేస్తవారిపేట మండలంలోని పెద్ద ఓబినేనిపల్లెలో క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యుర్థులు ఆకాష్, సన్ని పిడుగుపాటుతో మృత్యువాతపడ్డారు. గొర్రెల కాపరి తిరుపతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ì కొమరోలు మండలం తాటిచర్ల మోటులో గుమ్మళ్ల శింగరయ్యకు చెందిన రెండు గేదెలు, రెండు దూడలు పిడుగుపాటుకు చనిపోయాయి.ì ఏప్రెల్ 16న అర్ధవీడు మండలం యాచవరంలో పొలంలో పనిచేస్తున్న కూలీలపై పిడుగు పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ì ఏప్రిల్ 30న కంభంలోని హజరత్ గూడెంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతిచెందాయి.ì మే 2న కనిగిరి మండలం కలగట్ల సమీపంలో నూకపోటి శివపార్వతమ్మకు చెందిన గొర్రెల మందపై పిడుగు పడి 20 మేకలు మృత్యువాతపడ్డాయి.ì మే 4న నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన కొండపి నాగమల్లేశ్వరరావు పిడుగుపాటుతో మృతి చెందారు.ì మే 16న సింగరాయకొండ మండలం బేసిన్ పల్లెపాలెంలో రామాలయంపై పిడుగుపడి మూడు విగ్రహాలు ధ్వంసమయ్యాయి.ì మే 17న రాచర్ల మండలంలోని జేపీ చెరువు సమీపంలో పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి.ì ఇటీవల ముండ్లమూరు మండలంలో ఓ నివాసంపై పిడుగుపడటంతో చుట్టుపక్కల 12 ఇళ్లలో గృహోపకరణాలు దెబ్బతిని రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది.పిడుగుల ప్రతాపం ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనే అధికం గడిచిన నెలన్నర వ్యవధిలో దాదాపు 20 వరకు పిడుగుపాట్లు మనుషులతోపాటు మూగజీవాలు మృత్యువాత గృహోపకరణాలు దగ్ధమై భారీగా నష్టం పిడుగులు పడే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న వాతవరణ శాఖ గృహాలు, కార్యాలయాలపై లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు ముఖ్యంలైట్నింగ్ కండక్టర్తో ప్రయోజనం30,000 డిగ్రీల ఉష్ణం గంటకు 4.34 లక్షల కి.మీ వేగంపిడుగులు పడే సమయంలో శక్తి విస్ఫోటనం చెంది అధిక ఉష్ణోగ్రత వెలువడుతుంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం పిడుగు పడినపుడు 50 వేల డిగ్రీల ఫారన్ హీట్ లేదా 30 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణగ్రత విడుదల అవుతుంది. సుమారు 300 మిలియన్ వాట్ల విద్యుత్ జనిస్తుంది. గంటకు 4.34 లక్షల కిలోమీటర్ల వేగంతో పిడుగు భూమికి చేరుతుంది.విరుద్ధ విద్యుదావేశాలున్న రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వాటి మధ్య జనించే శక్తినే పిడుగు అని పిలుస్తాం. ధ్వని వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ కావడంతో ముందుగా మెరుపు కనిపిస్తుంది. తర్వాత ఉరుము శబ్ధం వినిపిస్తుంది. తేమ విద్యుత్ ప్రవాహంగా పనిచేయడం వల్ల ధనావేశం ఉన్న విద్యుత్ శక్తి భూమిపై రుణావేశం గల ప్రదేశానికి క్షణాల వ్యవధిలో దూసుకొస్తుంది. పిడుగులు ఎత్తయిన ప్రదేశాలపై పడి భూమిలోకి తటస్థంగా వెళ్లిపోతాయి. సహజంగా భూమిపై చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల పిడుగులు వాటిపైనే అధికంగా పడుతుంటాయి.చెట్లకు దూరంగా ఉండాలి..ప్రజలు వర్షం కురిసినప్పుడు చెట్ల దగ్గరకు వెళ్లకపోవడమే మంచిది. అలాగే వర్షం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ వినియోగించడం కూడా మంచిది కాదు. విద్యుత్ను గ్రహించే వాటికి దూరంగా ఉండాలి. పిడుగుపాటుకు గురైతే వెంటనే స్పృహ కోల్పోతారు. ప్రథమ చికిత్సకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పిడుగుపాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి వెంటనే వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ రవికిరణ్, పీహెచ్సీ, పొన్నలూరుపిడుగుల నుంచి రక్షణ కోసం భౌతిక శాస్త్రవేత్త బెంజిమన్ ప్రాంక్లిన్ రాగి తీగలతో లైట్నింగ్ కండక్టర్ రూపొందించారు. వీటిని ఎత్తయిన భవనాలు, గుడి గోపురాలపై అమర్చేవారు. ఈ కండక్టర్ పిడుగుల్లోని విద్యుదావేశాన్ని గ్రహించి రాగి తీగల ద్వారా నేరుగా భూమిలోకి పంపిస్తుంది. ఈ క్రమంలో రాగి తీగలు కూడా కరిగిపోతుంటాయి. ప్రస్తుతం రాగి, కాంస్య మిశ్రమంతో రూపొందిచిన లైట్నింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కూడా ప్రజలు అవసరాన్ని బట్టి వినియోగించి పిడుగుల బారి నుంచి రక్షణ పొందవచ్చు. -
పొగాకు రైతుల సమస్యలపై పోరాటం
● ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ఒంగోలు టౌన్: రాష్ట్ర మంత్రులు ఆర్భాటాలు చేయడం మానుకొని గిట్టుబాటు ధరలకు పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం రైతు సంఘం జిల్లా కమిటి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతి బాబు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసే చర్యల్లో భాగంగానే ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కంపెనీలు సరైన ధరలు ఇవ్వకపోవడం, సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో ఇప్పటికే నల్లబర్లీ సాగు చేసిన నలుగురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులు ఆత్యహత్యలు చేసుకోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకును కొనుగోలు చేయించాలని కోరారు. వర్జీనియా పొగాకు లో గ్రేడ్ రకాన్ని కంపెనీలు అసలు కొనుగోలు చేయడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి రామారావు తెలిపారు. వర్జీనియా పొగాకు ధరలను తగ్గించేందుకు కంపెనీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బ్యారన్కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని వివరించారు. ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి పొగాకును కొనాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబు మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునేందుకు పోరాటాలు చేస్తామని చెప్పారు. సమావేశంలో రైతు నాయకులు హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీనివాసరావు, కిష్టిపాటి చిన్నపరెడ్డి, కనపర్తి సుబ్బారావు, శ్రీకాంత్, ఉషా వెంకటేశ్వర్లు, సోమయ్య, ముప్పరాజు బ్రహ్మయ్య, సింగయ్య, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్ లారీ
టంగుటూరు: ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో నలుగురు పచ్చాకు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై బాబాయ్ హోటల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సూరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లగొర్ల అశోక్ ట్రాక్టర్లో పచ్చాకుతో సహా కూలీలను తీసుకుని తూర్పునాయుడుపాలెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒంగోలు వైపు నుంచి చైన్నె వైపు వెళ్తున్న కంటైనర్ లారీ పచ్చాకు ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లుకు కాలు విరగగా, జక్రయ్య, మార్కు, రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఎస్సై నాగమళ్లీశ్వరరావు పరిశీలించారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఆగకుండా వెళ్లిపోగా పోలీసులు గాలించి బోదనం టోల్గేట్ సమీపంలోని చిల్లకూరు వద్ద సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నలుగురు పచ్చాకు కూలీలకు తీవ్ర గాయాలు -
దళిత, ముస్లిం యువకులకు బహిరంగ శిక్ష దారుణం
సింగరాయకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వంలో దళితులు, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయనేందుకు గుంటూరు జిల్లా తెనాలిలో నడిరోడ్డుపై యువకులను పోలీసులు కొట్టడమే నిదర్శనమని, ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఆరోపించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో రోజూ దళితులు, మైనార్టీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని తెనాలి ఘటనే ఇందుకు పరాకాష్ట అని ప్రభుత్వ పనితీరును విమర్శించారు. పోలీసులు తమ దందాలకు సహకరించడం లేదని ఆ యువకులను అతిక్రూరత్వంగా, రాక్షసత్వంగా గాయపరిచారని, దీంతో ఆ ప్రాంత ప్రజలు పోలీస్స్టేషన్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు తప్పు చేస్తే ఈ విధంగా బహిరంగంగా శిక్షిస్తారా అని ప్రశ్నించారు. యువకులపై అతికిరాతకంగా దాడి చేసిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించి, తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య -
కూలిన వందేళ్ల భారీ వృక్షం
టంగుటూరులో కూలిన భారీ వృక్షం టంగుటూరు: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 100 సంవత్సరాల నాటి భారీ వృక్షం కూలిన సంఘటన టంగుటూరు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షానికి నాని నాని వృక్షం ఒక్కసారిగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాలింది. ఆ రోడ్డు మార్గాన నిత్యం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వందలాదిగా రాకపోకలు సాగిస్తుంటాయి. వృక్షం వాలిన సమయం మధ్యాహ్నం కావటంతో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు వాహనాలను దారిమల్లించారు. పంచాయతీ అధికారులు, పోలీసులు వాలిన భారీ వృక్షాన్ని తొలగించడంతో రాకపోకలు ఎప్పటిలాగే సాగాయి. -
జైలు జీవితం మార్పునకు నాంది పలకాలి
● జిల్లా జైలును సందర్శించిన ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: జైలు జీవితం కేవలం శిక్షకు మాత్రమే పరిమితం కాదని.. అక్కడి నుంచే సానుకూల మార్పునకు నాంది పలకాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. మంగళవారం జిల్లా జైలును ఆయన సందర్శించారు. జైలు గదులు, హాస్పిటల్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం జైలు అంతర్గత భద్రతపై జైలు అధికారులు, సెక్యురిటీ రివ్యూ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా ఖైదీలకు ప్రత్యేక భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జైలులో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. రిమాండ్ ఖైదీలను తరలించే సమయంలో పోలీసులు, జైలు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్పీ వెంట జైలు సూపరెండెంట్ పి. వరుణా రెడ్డి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయ కృష్ణ, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఆర్ఐ సీతారామి రెడ్డి, జిల్లా జైలర్ రమేష్, ఎం.శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాసరావు, కారాగార వైద్యాధికారి యస్వియస్ బ్రహ్మతేజ తదితరులు వున్నారు. -
కారు, బైకు ఢీ.. ఒకరు మృతి
మార్కాపురం: బైకును కారు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై మిట్టమీదిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. పెద్దారవీడు మండలం శివాపురం గ్రామానికి చెందిన పోతిరెడ్డి వెంకటేశ్వర్లు(30) తన బైక్పై కంభం వెళ్తున్నాడు. మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు తిప్పాయపాలెం–చింతకుంట్ల గ్రామాల మధ్య మిట్టమీదిపల్లి హైవే రోడ్డు దగ్గర బైకును ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే వెంకటేశ్వర్లు మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్కాపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఫారంపాండ్లో పడి యువకుడు మృతియర్రగొండపాలెం: నీళ్ల కోసం వెళ్లి ఫారం పాండ్లో జారిపడి యువకుడు మృతి చెందిన సంఘటన స్థానిక మార్కాపురం రోడ్లోని హైవే రెస్ట్ హౌస్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆలేటి అఖిల్(23) రెస్ట్ హౌస్ సమీపంలో భవన నిర్మాణ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు నీళ్లు తీసుకురావడానికి సమీప పొలంలో ఉన్న ఫారం పాండ్ వద్దకు చేరుకున్నాడు. నీరు పట్టుకునే క్రమంలో కాలుజారి పాండ్లో పడిపోయాడు. బయటకు రాలేక నీట మునిగి మృతి చెందాడని తోటి కార్మికులు చెప్పారు. అఖిల్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం వేచి ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉండేందుకు బేల్దారి పనులకు వెళ్తున్నాడని అతని బంధువులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.చౌడయ్య తెలిపారు. -
మహిళలు సమాజ చోదకులు
ఒంగోలు సబర్బన్: మహిళలు కుటుంబ, సమాజ చోదక శక్తిగా ఎదగాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బ్యాంకర్లు కూడా స్వయం సహాయక సంఘ సభ్యులకు రుణాలు మంజూరు చేసి అండగా నిలవాలని కోరారు. డ్వాక్రా మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే వార్షిక రుణ, జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో డీఆర్డీఏ, మెప్మా అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 4.5 లక్షల మంది స్వయం సహాయక సంఘ మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తగా తయారు కావాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీఆర్డీఏతో బ్యాంకర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. బోగస్ గ్రూపులను, రుణాలు తీసుకోవడంలో డూప్లికేషన్ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులో 10 శాతం నిల్వ ఉంచి మిగతా నిధులను వారికే రుణంగా మంజూరు చేయాలని స్పష్టం చేశారు. లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేసే క్రమంలో జూన్ 5వ తేదీ నాటికి జిల్లాలో 1,720 యూనిట్లు అందుబాటులోకి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యమని చెప్పారు. ఇందుకుగాను రూ.23 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.6759.13 కోట్ల మేర రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. అనంతరం కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంజూరైన రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 2025–26 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్, ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ.. త్వరగా సబ్సిడీ క్రెడిట్ అయ్యేలా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఆర్డీఏ అధికారులకు సూచించారు. డీఆర్డీఏ పీడీ నారాయణ మాట్లాడుతూ.. ఎస్హెచ్జీ మహిళలకు ఇచ్చే వ్యక్తిగత రుణాలకు డీఆర్డీఏనే ష్యూరిటీ ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీహరి, డీపీఎంలు, ఏపీఎంలు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు సహకరించాలి డీఆర్డీఏ, మెప్మా, బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా -
నేతలు వీధికెక్కి !
మాటలు వేడెక్కి.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముందస్తు రుతుపవనాలతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. అయితే మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన విమర్శలతో జిల్లా కేంద్రం ఒంగోలులో మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. అప్పటి నుంచి గత వారం రోజులుగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. దామచర్ల చేసిన విమర్శలకు ప్రతిగా జనసేన నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు జడా బాల నాగేంద్ర ఎమ్మెల్యే దామచర్లపై విమర్శలు చేయడంతో కూటమిలో కుంపటి రాజుకుంది. అది ఈ విడత శృతి మించింది. టీడీపీ, జనసేన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో మరింత వేడి రాజుకుంది. ఇరు పార్టీల నాయకులు పత్రికల్లో రాయలేని భాషలో తిట్టుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తిట్లను వినలేక ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అధికారం ఇచ్చి పరిపాలన చేయమంటే దాన్ని వదిలేసి కూటమి నాయకులు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ రోడ్డున పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దామచర్ల విమర్శలు వ్యక్తిగతమా... ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అవకాశం చిక్కినప్పుడల్లా మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒంగోలులో జరిగిన మినీ మహానాడులో బాలినేనిపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒంగోలును సర్వనాశనం చేసి హైదరాబాద్ వెళ్లి ప్రశాంతంగా ఆడుకుంటున్నాడని విమర్శించారు. అంతేకాకుండా ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో హైదరాబాద్ పారిపోయి జనసేన పార్టీలో చేరాడని ఎద్దేవా చేశారు. అయినా జనసేన నాయకులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. జనసేనలో మొదట్నుంచి రెండు గ్రూపులు ఉన్నాయి. అందులో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తొలి నుంచి దామచర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా ఆయన దామచర్లతోనే కొనసాగుతున్నాడు. దాంతో బాలినేనిపై దామచర్ల చేసిన విమర్శలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రియాజ్ చెబుతున్నారు. అంతేకాకుండా నిన్నా మొన్నటి వరకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరిగిన నాయకురాలు కూడా మౌనంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో జడా నాగేంద్ర కౌంటర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. దామచర్లకు కౌంటర్ ఇచ్చిన నాగేంద్ర... ఎమ్మెల్యే దామచర్ల చేసిన విమర్శలకు జనసేన నాయకుడు జడా బాల నాగేంద్ర కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల కూటమి ధర్మాన్ని పాటించాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో జనసేన మద్దతు వల్లనే దామచర్ల గెలిచాడని గుర్తు చేసిన ఆయన... బాలినేని ఏదో పార్టీలో చేరాడని విమర్శించడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి సొంతంగా బాలినేనిపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. 7 మంది పీఏలను పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నావని, నీ పాపాల చిట్టా లోకేష్ దగ్గర ఉందని ధ్వజమెత్తారు. ఒంగోలులో ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్మికుల వద్ద నుంచి జె.టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దాంతో కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరాయి. వ్యక్తిగత విమర్శలతో వీధిలో పడ్డ కూటమి నాయకులు... ఈ రెండు ఘటన తరువాత టీడీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు శృతి మించి రాగాన పడ్డాయి. ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం మొదలుపెట్టారు. బాలినేని దయాదాక్షిణ్యాలపై నాగేంద్ర బతుకుతున్నాడంటూ పరుష పదజాలంతో టీడీపీ నాయకులు తిట్లదండకం అందుకున్నారు. డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన నాగేంద్ర సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దొంగలు, కిరాయి హంతకులు, కాల్మనీగాళ్లతో ప్రెస్మీట్ పెట్టించి బెదిరించాలనుకుంటున్నారా అంటూ ఎమ్మెల్యే దామచర్లను ప్రశ్నించారు. నగరపాలక సంస్థలోనూ ఇదే తంతు.. నగర కార్పొరేషన్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన కార్పొరేటర్ల మధ్య కూడా విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీలో చేరిన 14 మంది కార్పొరేటర్లు నగర మేయర్ గంగాడ సుజాత తీరుపై గుర్రుగా ఉన్నారు. మేయర్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లను కూడా వదిలిపెట్టడం లేదని, వారి నుంచి కూడా డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి కార్పొరేటర్లు ఎడ్డెమంటే తెడ్డెమంటూ ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకుంటూ అభివృద్ధి పనులను గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా నగరంలోని అనేక డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డివిజన్ల అభివృద్ధిపై దీని ప్రభావం కనిపిస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. తెలుగుదేశం మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన విమర్శలతో రేగిన చిచ్చు చల్లారడం లేదు. వారం రోజులుగా టీడీపీ, జనసేన నాయకులు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం గమనార్హం. ఇరు పార్టీల నేతలు పరిధి దాటి పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషణలకు దిగుతున్నారు. కుటుంబసభ్యులను సైతం ఇందులోకి లాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో తారస్థాయికి చేరిన విభేదాలు ఎమ్మెల్యే దామచర్ల విమర్శలతో రాజుకున్న చిచ్చు బాలినేనిపై విమర్శలు చేసినా పట్టించుకోని జనసేన నాయకులు బాలినేని అనుచరుడు జడా బాల నాగేంద్ర, టీడీపీ నాయకుల వ్యక్తిగత విమర్శలతో కాక రాయడానికి వీల్లేని భాషలో దూషించుకుంటూ వీధిన పడిన కూటమి నాయకులు వ్యక్తిగత విమర్శలపై మండిపడుతున్న జనం -
రైతులకు కష్టాలు, కరువు
చంద్రబాబు జమానాలోనే ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు గద్దెనెక్కగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతులకు కష్టాలు వస్తున్నాయని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేక రెండు నెలలుగా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారని, కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారు కాగానే సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం ఆగమేఘాలపై స్పందించడాన్ని ఎండగట్టారు. అవసరమైతే మార్క్ఫెడ్ను రంగంలోకి దించుతామని సీఎం మౌఖికంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు అవసరమయ్యే మార్క్ఫెడ్తో కొనుగోళ్లు చేయించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ లేవనెత్తే వరకు రాష్ట్రంలో ఏ సమస్యలూ ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. మిర్చి ధరలు పతనమై ఇబ్బంది పడుతున్న రైతులను గుంటూరు మిర్చియార్డులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన తర్వాత మార్క్ఫెడ్తో కొనుగోలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు జీఓ ఇవ్వలేదని విమర్శించారు. రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతోందని, గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని సూచించారు. పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నా ధర పడిపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు నెలలు నుంచి టుబాకో బోర్డు అధికారులు సైతం రైతులకు అబద్ధాలు చెబుతూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మార్క్ఫెడ్ను రంగంలోకి దించడంతోపాటు పొగాకు కంపెనీలతో సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దించితే లాభాలే తప్ప నష్టాలు వచ్చే అవకాశమే లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉందంటే వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఎత్తుగడ కాక మరేమిటని నిలదీశారు. రైతులను మోసం చేస్తే చరిత్ర హీనులు కావడం ఖాయమన్నారు. పొగాకు రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని, ప్రభుత్వం మెడలు వంచి గిట్టుబాటు ధర దక్కేలా చూసే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతులను గ్రూపులుగా విడదీయడం, గట్టిగా నిలదీసేవారి బేళ్లు కొనడం, పేద రైతుల బేళ్లు తిరస్కరించడం టుబాకో బోర్డు అధికారులకు సరికాదన్నారు. బోర్డు అధికారుల మీద నమ్మకం పోతే రైతులు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. పొగాకు ధరల పతనంపై కూటమి స్పందన శూన్యం పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటం వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు -
ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి
● హౌసింగ్ స్పెషలాఫీసర్ అన్నపూర్ణ అల్లూరు (కొత్తపట్నం): మండలంలోని అల్లూరు గ్రామ పరిధిలోని జగనన్న లే అవుట్లను హౌసింగ్ స్పెషలాఫీసర్ ఎన్ అన్నపూర్ణ మంగళవారం పరిశీలించారు. గ్రామంలోని నాలుగు జగనన్న లే అవుట్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎస్టీలకు అదనంగా రూ.75 వేలు కేటాయిస్తే ఎందుకు ఇళ్లు నిర్మించుకోలేదని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ నీటి వసతి లేకపోవడంతో నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. కాలనీలకు నీరు వచ్చేలా చూడాలని కోరారు. నాలుగు లే అవుట్లలో 193 గృహాలు మంజూరు కాగా 42 పూర్తయ్యాయని, శ్లాబ్ దశలో 14, బేస్మట్టం 95, మిగిలిన 42 వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లే అవుట్లకు నీటి సౌకర్యం వెంటనే కల్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాసరావు, హౌసింగ్ ఇన్చార్జి ఏఈ వలిరాజు, ఉప సర్పంచ్ తాటపర్తి సుబ్బారెడ్డి తదితరులు పాల్గోన్నారు. -
వేగవంతం చేయండి
లబ్ధిదారుల గుర్తింపు ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రకాశం భవనం నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, సీసీఆర్సీ కార్డుల మంజూరుపై క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ, ఇతర ప్రయోజనాలు లభించడానికి సీసీఆర్సీ కార్డులే ప్రధానమైనందున రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో కౌలుదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. వాస్తవ భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా సాగుదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు లభించేలా చూడాలన్నారు. గ్రీవెన్స్ ఆర్జీల పరిష్కారంపై, రెవెన్యూ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ సారించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ మాట్లాడుతూ సీబీజీ, ఎంఎస్ఎంఈ, ఇతర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మ్యుటేషన్లు, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రతి నెలా మూడో సోమవారం ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నందున ఎలాంటి లోపాలు లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. -
30న జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
ఒంగోలు: జిల్లాస్థాయి ఫుట్బాల్ సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికల క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 30న స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అంచిపోగు రమేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. జూనియర్స్ విభాగంలో 2010 జనవరి నుంచి 2011 డిసెంబర్ మధ్య జన్మించిన వారు, సబ్ జూనియర్స్ విభాగంలో 2012 జనవరి నుంచి 2013 డిసెంబర్ మధ్య జన్మించిన వారు పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎంపికకు హాజరయ్యే వారు ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికై న క్రీడాజట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9849760566 నంబర్ను సంప్రదించాలని కోరారు. 2న వాలీబాల్ సెలక్షన్స్ ఒంగోలు: స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా(సాయి) వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక జూన్ 2న విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఇన్చార్జి కార్యదర్శి డాక్టర్ జి.ధనుంజయరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 190 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలురు, 170 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలికలు ఎంపికకు అర్హులు. ఎంపికై న బాలబాలికలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ వైద్యుని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 5 పాస్పోర్టు సైజు ఫోటోలు, స్పోర్ట్సు సర్టిఫికెట్లు తీసుకుని ఎంపిక కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 9490382802 నంబర్ను సంప్రదించాలని డాక్టర్ జి.ధనుంజయరావు విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ జాబితా సరిచేయాలి ఒంగోలు సిటీ: ఉపాధ్యాయులు పదోన్నతుల బదిలీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్–2 హెచ్ఎంగా పదోన్నతుల జాబితాలో అనేక పొరపాట్లు ఉన్నాయని, వాటిని సరిచేయాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మంగళవారం డిమాండ్ చేశారు. రూల్ ప్రకారం ఒకే డీఎస్సీలో నియామకం పొంది వివిధ సబ్జెక్టులకు పదోన్నతి పొంది ఒకే తేదీ జాయిన్ అయిన వారి ఇంటర్ సీనియారిటీ నిర్ణయించేటప్పుడు వారి సీనియారిటీ ఫీడర్ కేడర్ తీసుకురావాలన్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతుల జాబితా సరిచేస్తామని డీఈఓ కార్యాలయం ప్రకటించింది. వెంటనే ఆ జాబితా సరిచేసి గ్రేడ్–2 హెచ్ఎంల పదోన్నతుల జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి చెరువులకే సాగర్ జలాలు ● ఎస్ఎస్పీ ఎస్ఈ నాగమురళీమోహన్ కురిచేడు: నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమేనని ఎన్ఎస్పీ ఎస్ఈ నాగమురళిమోహన్ తెలిపారు. మంగళవారం ఆయన సాగర్కాలువపై పరిశీలించారు. ఒంగోలు బ్రాంచికాలువ హెడ్ రెగ్యులేటర్, దర్శి బ్రాంచి కాలువ హెడ్రెగ్యులేటర్, త్రిపురాంతకం, జిల్లా సరిహద్దు 85/3 మైలు వరకు పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది తమ తాగునీటి చెరువులను నింపుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక అట్లపల్లి రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలకు కలిపి విడుదల చేశారని, వారం రోజుల్లో కాలువ నిలిపివేస్తారన్నారు. నోటిఫై చెరువులు మాత్రమే నింపుకోవాలని, అలా కాకుండా నీటి చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఈఈ రామకృష్ణ, డీఈఈ అక్బర్బాషా, ఏఈలు శ్రీకాంత్రెడ్డి, రవీంద్రరెడ్డి, సాంబశివరావు, సిబ్బంది ఉన్నారు. -
కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అటవిక పాలన సాగుతోందని, ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, మరీ ముఖ్యంగా దళిత, మైనారిటీలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. తెనాలిలో మైనారిటీ, దళిత యువకులపై పోలీసులు చేసిన అమానుష ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ పది నెలల కాలంలో దళితులు, మైనారిటీలు, మహిళలపై దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. తెనాలిలో సభ్యసమాజం తలదించుకునేలా ఽథర్డ్డిగ్రీ ప్రయోగిస్తూ ఒక సీఐ కాళ్లను తొక్కుతూ మరొక సీఐ లాఠీతో విరిగిపోయే వరకు కొడుతూనే ఉండటం చూస్తుంటే రాష్ట్రంలో రక్షణ ఏమాత్రం ఉందో అర్థమవుతుందన్నారు. యువకులు నేరం చేస్తే విచారణ చేయాలే గానీ నడిబజారులో దారుణంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ సంఘటనను వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ సంఘటనపై మానవహక్కుల సంఘం గానీ, ఎస్సీ కమిషన్ గానీ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై రోజు రోజుకూ దాడులు తీవ్రతరం అవుతున్నాయన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగిందని, దీనికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఘటన బయటకు వచ్చినా ఇంత వరకు ఆ పోలీసులపై శాఖాపర చర్యలు తీసుకుంటామని ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేసినా పోలీస్స్టేషన్కు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామన్నారు. మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు ప్రవర్తించిన సంఘటనతో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితులకు, మైనారిటీలకు, మహిళలకు భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల పట్ల ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కళ్యాణ్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. పవన్కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే బహిష్కరిస్తే కనీసం అక్కడకు వెళ్లిన పాపాన పోలేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన పాలకులు దళిత మైనారిటీలపై దాడులు జరుగుతుంటే కనీస స్పందన లేదని విమర్శించారు. సూపర్సిక్స్ అమలు చేయలేని టీటీడీకి మహానాడు జరుపుకునే అర్హత లేదన్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే దళిత హోంమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెనాలి ఘటనపై తక్షణమే స్పందించి నిందితులైన పోలీసులపై చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ తెనాలిలో యువకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం దళితులు, మైనారిటీలపై ఒక పథకం ప్రకారం దాడులు చేయిస్తోందన్నారు. గ్రామాల్లో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని కూటమి నేతలు ఇటువంటి ఘటన పట్ల మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఇంకేం లేదన్నారు. తప్పుడు పనులు చేసే పోలీసులను వదిలిపేట్టే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని ప్రతి పోలీసు గుర్తు పెట్టుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ యువకులను కిరాతంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, కార్పొరేటరు ఇమ్రాన్ఖాన్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ సుల్తాన్భాషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్, దర్శి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గల్లెపోగు ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం తెనాలి ఘటనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పోలీసుల ప్రవర్తన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
దర్శి(కురిచేడు): భర్త మందలించాడని మనస్తాపం చెందిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మురళి కథనం మేరకు.. తూర్పువీరాయపాలెం గ్రామానికి చెందిన చెరుగూరి వెంకటరత్నం(30)ను సోమవారం రాత్రి అన్నం వండే విషయమై ఆమె భర్త బాల సుందరరాజు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం వేకువ జామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
‘మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’
ప్రకాశం జిల్లా: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు ఆదిమూలపు.ఈ మేరకు మంగళవారం మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. ‘దళిత యువకులపై పోలీసులు పాశవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రెడ్ బుక్ ర్యాజ్యాగం శ్రుతిమించి అమలు చేస్తున్నారు. నడిరోడ్డు పై కర్రలు విరిగే దాకా పోలీసులు కొట్టడం చూస్తుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోంది. ఆత్మగౌరవం దెబ్బతినేలా, సభ్య సమాజం తలదుంచుకునేలా పోలీసులు తీరు ఉంది. తెనాలి ఘటనపై హోంమంత్రి బాధ్యత వహించాలి. తక్షణమే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ను, మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తాం. కూటమి ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు. పోలీస్ స్టేషన్ లు ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయి’ అని మండిపడ్డారు ఆదిమూలపు సురేష్.కాగా, ముగ్గురు దళిత, మైనారిటీ యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి.. ఇద్దరు పోలీసు అధికారులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలాకా గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. యువకుల అరికాళ్లపై పోలీసులు కర్కశంగా లాఠీలతో చితకబాదారు. -
YS Jagan: పొదిలి పర్యటన వాయిదా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన(Podili Tour) వాయిదా పడిందని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.ఇదీ చదవండి: కోనసీమ విషాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
జగన్ పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం
● పనులను పరిశీలించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, నాయకులు పొదిలి రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పొదిలిలో ఆయన పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జగనన్న పర్యటన ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మార్కాపురం సమన్వయకర్త అన్నా రాంబాబు, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి సోమవారం పరిశీలించారు. ముందుగా పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద జరుగుతున్న హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలకు సలహాలు, సూచనలు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చెట్ల తొలగింపు, మట్టితోలకం, చదును చేయడం వంటి పనులు వేగవంతం చేయాలని చెప్పారు. జగనన్న పర్యటనకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా భోజనం, మంచినీరు, తదితరాలను ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై స్థానిక నాయకులతో చర్చించారు. ఆయా ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు ధరలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు నాగులుప్పలపాడు: రాష్ట్రంలో పొగాకు రైతులతో పాటు ఇతర పంటలు పండించిన రైతాంగానికి మద్దతు ధరలు కల్పించకుండా ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అది తగదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావుమాదిగ అన్నారు. జిల్లాలో గిట్టుబాటు ధరలకు పొగాకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో నేరుగా రైతులతో మాట్లాడనున్నట్లు తెలిపారు. పొగాకు రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనకారావు మాట్లాడారు. ఈ ఏడాది పొగాకు పంట సాగుచేసిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేటై ఇలాగే రైతులను ఇబ్బందిపెట్టాలని చూసిన సందర్భంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేయడంతో పాటు రూ.3,500 కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారన్నారు. తద్వారా మిగతా పంటలకు కనీస మద్దతు ధర ఇప్పించిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంగా రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందులు చూస్తూ కూడా గుడ్డిగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం కళ్లుతెరిచి రైతుల వద్ద ఉన్న పొగాకు పంటతో పాటు మిగతా పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పొలినేని కోటేశ్వరరావు, రైతు విభాగం మండల అధ్యక్షుడు తగిరిస సుబ్బారావు, గ్రీవెన్సు సెల్ రాష్ట్ర కార్యదర్శి పేరాల చెన్నకేశవులు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జెట్టి శ్రీనివాసరావు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రేణు, పార్టీ నాయకులు గండు హరిబాబు, యడవల్లి మోహనరావు, రైతులు అక్కి సాంబశివరావు, నల్లూరి సుబ్బారావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితాలు కూలిపోయి
ధర పడిపోయి.. పొదిలి: పృధులాపురి రైతుల ధనాగారంగా ఉన్న పొగాకు నేడు పగాకుగా మారుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో పొగాకు సాగుకు మొగ్గు చూపారు. తీవ్ర కరువుతో పంటలకు నీరందుతుందన్న నమ్మకం లేక రైతులు తక్కువ నీటితో సాగయ్యే పొగాకు వైపు ఆసక్తి చూపి సాగుచేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరువు రైతుపై కోలుకోలేని దెబ్బ పడనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ సహకారం లోపించడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పొగాకు రైతు కుదేలవుతున్నాడు. అధిక మొత్తంలో లో గ్రేడ్ ఉత్పత్తి కావడం, నాణ్యమైన పొగాకు ధర తగ్గుతుండటంతో లో గ్రేడ్ ధరలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలం జరిగే తీరుపై రైతుల్లో అసహనం నెలకొంది. కేంద్రాలకు వస్తున్న అధిక బేళ్లను తిప్పి పంపించివేస్తుండడంతో రైతుపై అదనపు భారం పడుతోంది. ఈ పరిణామాలన్నీ రైతు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలల పంట.. ఆరు నెలల అమ్మకాలు... పొగాకు రైతులు నష్టపోయే మరొక సమస్య అమ్మకాలు. సకాలంలో అమ్మకాలు జరిగి డబ్బు చేతికొస్తే పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చుకుంటే వడ్డీలైనా మిగులుతాయి. మూడు నెలల పంట కాలం అయితే ఆరేడు నెలల పాటు అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోవటంతో పాటు దీర్ఘకాలంగా నిల్వ ఉండడంతో పొగాకు నాణ్యత, బరువు తగ్గిపోతున్నాయి. సేద్యాలు చేసినందుకు, పచ్చాకు ముఠాలకు, క్యూరింగ్ కర్రకు, కూలీలకు అప్పులు తెచ్చారు. ఈ సంవత్సరం ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 మిలియన్ కిలోలు కూడా కొనుగోలు జరగలేదు. గుబులు పుట్టిస్తున్న లో గ్రేడ్... ఈ ఏడు వాతావరణం అనుకూలించకపోవటం, లేత ప్లాంటేషన్ల కారణంగా లో గ్రేడ్ ఉత్పత్తి ఎక్కువగా జరిగింది. సుమారు 65 శాతం మేర సగటున లో గ్రేడ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సగటున లో గ్రేడ్కు రూ.230 ఉంటేనే రైతులు గట్టునపడే అవకాశం ఉంది. లేదంటే అప్పులు మిగిలే ప్రమాదం ఉంది. గ్రేడ్ పొగాకుకే ధరలు ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవటంతో, అధిక శాతం ఉన్న లో గ్రేడ్ మార్కెట్ తలచుకుంటేనే గుబులు పుడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండగా నిలవాల్సిన టుబాకో బోర్డు, పాలకులు రైతును గాలికొదిలేశారు. కంపెనీలు సిండికేట్గా మారి దోపిడీ చేస్తున్నా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ పాలనలో పొగాకు రైతుకు స్వర్ణయుగం... వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో పొగాకు రైతుకు స్వర్ణయుగంగా ఉంది. రైతులు పండించిన పొగాకుకు గతంలో ఎన్నడూ లేనంతగా సగటు ధర వచ్చింది. కంపెనీల వారు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటే, వెంటనే మార్క్ఫెడ్కు నిధులిచ్చి పొగాకు కొనుగోలు చేయించారు. దీంతో పలు కంపెనీల వారు చేసేదేమీ లేక పోటీ పడి అధిక ధరలకు పొగాకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో గత సంవత్సరం రూ.274.79 సగటు ధర వచ్చింది. ఈ ఏడు ప్రభుత్వం, బోర్డు పట్టించుకోకపోవడంతో రైతులకు నష్టాలు మిగిలి పొగాకు ధనాగారం వట్టిపోతుందనే ఆందోళన రైతాంగంలో ఉంది.కరువు రైతుపై పొగాకు పోటు గడిచిన ఐదేళ్లూ లాభాల పంటగా అమ్మకాలు గత సంవత్సరం సగటు ధర రూ.274.79 ప్రస్తుతం ధర తగ్గుతుండటంతో ఆందోళన రైతుల వద్ద భారీగా లోగ్రేడ్ పొగాకు నిల్వలు 2 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలు ఇలా... మొత్తం మండలాలు 13 మొత్తం బ్యారన్లు 2,602 మొత్తం రైతులు 4,390 అనుమతించిన విస్తీర్ణం 21,335 ఎకరాలు పొగాకు సాగు విస్తీర్ణం 27,577 అమ్మకాలకు అనుమతి 11.10 మి.కిలోలు ఉత్పత్తి అంచనా 18 మి.కిలోలు ఇప్పటి వరకూ కొనుగోలు 2 మి.కిలోలు నిన్నటి వరకూ కరువు మండలాల రైతుకు పొగాకు సాగు లాభాలు పండించింది. నీటి వనరులు తక్కువగా ఉండడంతో ఏళ్లతరబడి సాగుచేస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి తక్కువ నీటితో సాగయ్యే పొగాకుపై రైతులు దృష్టి సారించారు. ఇటు రైతులతో పాటు రైతు కూలీలకు కూడా మంచి ఆదాయం లభిస్తుండటంతో రైతులు పొగాకు సాగుపై ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో పరిస్థితి తలకిందులైంది. దీనిని నమ్ముకున్న రైతులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. సంవత్సరం సాగు విస్తీర్ణం అమ్మకాలు సగటు ధర (ఎకరాలలో) (మిలియన్ కిలోలు) (రూపాయలు) 2019–20 19,305 9.35 104.50 2020–21 14,017 6.91 135.54 2021–22 12,432 6.76 167.16 2022–23 19,497 12.29 214.76 2023–24 20,532 13.00 274.79 ప్రతి సంవత్సరం సగటు ధర పెరుగుతుండటంతో రైతులకు లాభాలు వచ్చాయి. -
జగనన్న పర్యటనను విజయవంతం చేద్దాం
ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం విజయవంతం స్ఫూర్తితో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు జిల్లాకు వస్తున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను కూడా విజయవంతం చేయాలని పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు పిలుపునిచ్చారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు బోర్డు వద్దకు జగన్ వస్తున్నారని తెలిపారు. పొగాకు రైతులకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా వైఎస్సార్ సీపీ పాలనలో మంచి గిట్టుబాటు ధర లభించిందని తెలిపారు. కూటమి పాలనలో పొగాకుకు సరైన ధరలు లేక, అమ్ముడుపోక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు... వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన జగనన్న సైనికులు ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చుండూరి రవిబాబు తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంటు ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, హాజరైన నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశాన్ని బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, మన్నే శ్రీనివాసరావు, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ఖాన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల కమిటీల నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ సీపీ సైన్యానికి ధన్యవాదాలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు -
కాకాణి అరెస్ట్ దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఒంగోలు సిటీ: ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాకాణి అక్రమ అరెస్టును ఖండించారు. ఆదివారం కాకాణిని అరెస్టు చేశామని పోలీసు ధ్రువీకరించారన్నారు. అప్పటి నుంచి ఎక్కడ ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న కనీస సమాచారం కూడా లేకుండా గోప్యంగా ఉంచడం చట్టవిరుద్ధమన్నారు. మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు కనీస సమాచారం ఇవ్వాలన్న బాధ్యత పోలీసులకు లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఈ విధంగా అక్రమ కేసులు నమోదు చేయలేదని, గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కాకాణిపై పెట్టిన అక్రమ కేసుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చట్టబద్ధంగా పోరాటం చేస్తుందన్నారు. ఈ కేసులో క్లీన్ చీట్తో కాకాణి బయటికి వస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. వైఎస్సార్ సీపీ కేడర్ మొత్తం కాకాణికి అండగా నిలుస్తుందన్నారు. హెచ్ఎంల పదోన్నతులకు నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ కింద పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తున్నట్లు డీఈఓ ఏ కిరణ్కుమార్ సోమవారం తెలిపారు. పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పారు. జిల్లా పరిషత్ యాజమాన్యం కింద 83 ఖాళీలున్నట్లు తెలిపారు. 249 మందితో జాబితా ఉందన్నారు. మొదటిరోజు ఈ నెల 27వ తేదీ 120 మంది, 29వ తేదీ మిగిలినవారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. అందరూ హాజరుకావాలని కోరారు. మున్సిపల్ యాజమాన్యం కింద 4 ఖాళీలున్నాయని, 12 మంది జాబితా ఉందని తెలిపారు. ఈ జాబితాలో ఉన్నవారు ఈ నెల 27వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యం కింద ఒక ఖాళీ ఉందని, ముగ్గురు జాబితా ఉందని, వీరు ఈ నెల 27వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుగు స్కూల్ అసిస్టెంట్లు వారి సేవా పుస్తకం, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో హాజరు కావాలని కోరారు. గుంటూరు జోన్–3 పరిధిలో... గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, తత్సమానమైన కేడర్లలో పనిచేస్తున్న వారికి ప్రధానోపాధ్యాయులు గ్రేడ్–2గా పదోన్నతి కల్పిస్తున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, గుంటూరు వారి కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చేవారు తప్పనిసరిగా సేవా పుస్తకాలు, ఒరిజినల్ కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. జోన్–3 పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు పాత జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లు సీనియారిటీ జాబితాలో సీరియల్ నంబర్ 1 నుంచి 75 వరకు పేర్లున్న వారు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ప్రహసనంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియఒంగోలు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహనంగా సాగుతోంది. అడుగడుగూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆన్లైన్ సమస్య పరిష్కరిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా అడపాదడపా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సోమవారం వరకూ సుమారు 6,650 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అందులో ప్రధానోపాధ్యాయులు 141 మంది, పీఎస్ హెచ్ఎంలు 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి లాగ్వేజస్ 2,660, నాన్ లాంగ్వేజస్ 3700 మంది అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. -
బ్యాంకు లోన్ పేరుతో రూ.57 లక్షలకు టోకరా
ఒంగోలు టౌన్: బ్యాంకు లోన్ పేరుతో ఒక పరిశ్రమ యజమాని వద్ద రూ.57 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాక కానీ తాను మోసపోయానని బాధితుడికి అర్థం కాలేదు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. ఒంగోలుకు చెందిన ఒక పరిశ్రమ నిర్వాహకుడిని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో సంప్రదించాడు. 50 శాతం సబ్సిడీపై బ్యాంకు లోన్ ఇప్పిస్తానని, అందుకుగాను క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరు మీద కొంత నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నమ్మించాడు. వెనకా ముందు ఆలోచించకుండా గుడ్డిగా బాధితుడు రూ.57 లక్షలు ఫిక్స్డ్ చేశాడు. ఆ తర్వాత క్రెడిట్ సొసైటీ గురించి వాకబు చేయగా అలాంటి సంస్థ ఏదీ లేదని తెలిసింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా సదరు వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో ఎస్పీని కలిసి మోసపోయిన తీరును వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆన్లైన్ గేమ్ పేరుతో దగా కనిగిరి పట్టణానికి చెందిన ఒక మహిళ వాట్సప్కు కొంత నగదు ఇన్వెస్ట్ చేసి టెలిగ్రామ్లో గేమ్ అడితే భారీగా డబ్బు గెలుచుకోవచ్చని ఆశ పెట్టారు. ఇదంతా నిజమని నమ్మిన సదరు మహిళ విడతల వారీగా 1.15 లక్షల రుపాయలను ఫోన్ పే చేశారు. అయినప్పటికీ సంతృప్తి చెందని మోసగాడు ఇంకా అదనంగా డబ్బు చెల్లించాలని మెసేజ్ పంపించడంతో మోసపోయినట్లు గుర్తించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ● విజయవాడ రైల్వే స్టేషన్లో ఔట్సోర్సింగ్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ విజయవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు 25 వేల రుపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారని, ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు కూడా తిరిగివ్వడం లేదని సంతనూతలపాడుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లా నలుమూలల నుంచి పోలీస్ గ్రీవెన్స్కు మొత్తం 73 ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలు విన్న ఎస్పీ దామోదర్ ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడి చట్టపరంగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సురేష్ బాబు, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, డీటీసీ సీఐ షమీవుల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, నాగులుప్పలపాడు ఎస్సై షేక్ రజియా సుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ దామోదర్కు బాధితుడి ఫిర్యాదు పోలీస్ గ్రీవెన్స్కు 73 అర్జీలు -
పోలేరమ్మ ఆలయంలో చోరీ
బాలికపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అరెస్టు కంభం: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు కంభం ఎస్సై బి. నరసింహారావు తెలిపారు. కేసు వివరాలను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన మండలంలోని జంగంగుంట్ల గ్రామానికి చెందిన మునిగేటి శౌరయ్య అనే వృద్ధుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో వృద్ధుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం కంభం–జంగంగుంట్ల మధ్యలో హైవే రోడ్డుపై కందులాపురం అడ్డరోడ్డు వద్ద నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. -
విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకోం
● కార్మిక సంఘాల హెచ్చరిక ఒంగోలు టౌన్: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేది లేదని చెబుతూనే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిలో ప్రయత్నాలు చేస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరు రంగారావు విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రూ.11 వేల కోట్ల నిధులు ఇచ్చినట్లు గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం 4 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగించిందని, మూడు నెలలుగా వేతనం ఇవ్వకుండా ఆపేయడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కార్మికులను ఏకం చేసి పోరాడుతామన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఎస్డీ సర్దార్, పేరయ్య, శేషయ్య, రాంబాబు, రమేష్, తంబి శ్రీనివాసరావు, బీవీ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో క్యాన్సర్ నిర్ధారణ పరికరం
ఒంగోలు టౌన్: పీజీ నిధులతో జీజీహెచ్కు మరో సరికొత్త వైద్య పరికరం సమకూరింది. క్యాన్సర్ నిర్ధారణ, నివారణకు ఉపయోగపడే ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ(ఐహెచ్సీ) పరికరాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీ నిధులు రూ.40 లక్షలతో ఐహెచ్సీ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ పరికరం క్యాన్సర్ ఏ రకానికి చెందినదో కచ్చితంగా నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ఏ రకమైన మందులను ఎంత డోస్ వాడాలి, ఎంత కాలం వాడాలన్నది ఐహెచ్సీ సాయంతో తెలుసుకోవచ్చన్నారు. రోగులకు ఓవర్ డోస్ సమస్య ఉత్పన్నం కాదన్నారు. మహా నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఐహెచ్సీని జిల్లా ప్రజలతోపాటుగా వైద్య రంగంలోని వారు కూడా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు, వివిధ విభాగాల హెచ్ఓడీలు దుర్గాదేవి, సుధాకర్, సుధాకర్ బాబు, కమ్యూనిటీ మెడిసిన్ శ్రీదేవి, మైక్రోబయాలజీ పద్మప్రియ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కిషన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కురిచేడు చేరిన సాగర్ జలాలు
కురిచేడు: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసిన సాగర్ జలాలు సోమవారం కురిచేడు చేరాయి. పది రోజులపాటు సరఫరా అయ్యే ఈ నీటితో రక్షిత నీటి పథకాల చెరువులను నింపాల్సి ఉందని, చేపల చెరువులు, నాన్ నోటిఫైడ్ చెరువులకు మళ్లిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్ఎస్పీ డీఈఈ అక్బర్బాషా హెచ్చరించారు. సాగర్ ప్రధాన కాలువపై 9 రక్షిత నీటి పథకాలు ఉన్నట్లు తెలిపారు. సాగర్ డ్యాం వద్ద 5,500 క్యూసెక్కులు, 85/3 మైలు జిల్లా సరిహద్దు వద్ద 1793 క్యూసెక్కులు, దర్శి బ్రాంచి కాలువ హెడ్ రెగ్యులేటర్ 126వ మైలు కురిచేడు వద్ద 884 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందని వివరించారు. -
రెబల్స్తో తలపోటు!
మేయర్పై తిరుగుబాటు..ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థలో అధికార కూటమి ప్రభుత్వానికి చెందిన కార్పొరేటర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. తొలి నుంచీ టీడీపీలో ఉన్న కార్పొరేటర్లది ఒక మాటైతే.. వైఎస్సార్ సీపీ నుంచి జంప్ జిలానీలుగా మారిన కార్పొరేటర్లది మరో మాటగా ఉంది. మేయర్ జి.సుజాతపై గుర్రుగా ఉన్న జంప్ జిలానీలు గత రెండు రోజులుగా తమ ఆలోచనలకు పదునుబెట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్ సీపీ నుంచి మేయర్తో మొత్తం 16 మందికి పైగా కార్పొరేటర్లు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీలోకి జంప్ అయిన కార్పొరేటర్లు అక్కడ కూడా నిలకడగా ఉంటున్న పరిస్థితి కనిపించడం లేదు. నిన్నామొన్నటి వరకు మేయర్తో అంటకాగిన ఆ కార్పొరేటర్లు ఇప్పుడు ఆమైపె తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 14 మంది కార్పొరేటర్లు ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి మేయర్ను దించేయాల్సిందేనంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీరితో రెండుసార్లు చర్చలు జరిపిన ఎమ్మెల్యే దామచర్ల సోమవారం ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్లో టీడీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నుంచి జంప్ అయిన కార్పొరేటర్లు, మేయర్, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేయర్కు, పార్టీలో రెబల్స్గా మారిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణకు మధ్య అగాధంపై సమావేశంలో ప్రస్థావనకు వచ్చినట్లు సమాచారం. అధికారులకు, మేయర్కు, రెబల్ కార్పొరేటర్లకు మధ్య ఏం జరుగుతోందనే విషయంపై ప్రత్యేకంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే దామచర్ల ఒక పక్క రెబల్ కార్పొరేటర్లను బుజ్జగిస్తూనే మరోపక్క బెదిరింపు ధోరణిని ప్రదర్శించినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో గందరగోళ పరిస్థితులకు ప్రధాన కారణం.. పనుల్లో పర్సెంటేజీలు, కమీషన్లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో వచ్చే వాటాల పంపకాల్లో విభేదాలేనన్నది సమావేశంలో స్పష్టమైంది. పథకాలపై సమీక్ష పేరుతో రెబల్ కార్పొరేటర్లను శాంతింపజేయడమే ధ్యేయంగా సమావేశం సాగినట్లు సమాచారం. ఒంగోలు నగర కార్పొరేషన్లో మేయర్ పదవిపై లొల్లి టీడీపీలో రెబల్స్గా మారిన ‘జంపింగ్’ కార్పొరేటర్లు మేయర్ సుజాతను మార్చాలంటూ ఎమ్మెల్యే వద్ద పంచాయితీ కౌన్సిల్ హాల్లో మీటింగ్.. రెబల్స్కు బుజ్జగింపులతోపాటు బెదిరింపులు వాటాల పంపకాల్లో తేడాతోనే గందరగోళ పరిస్థితికౌన్సిల్ హాలా? పార్టీ ఆఫీసా? నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్లో కేవలం టీడీపీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయడంపై కూటమి కార్పొరేటర్లే మండిపడుతున్నారు. నగర అభివృద్ధిపై సమీక్ష అని చెప్పి మిగతా కార్పొరేటర్లకు సమాచారం లేకుండా కేవలం టీడీపీ వారినే పిలవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులను సైతం సమావేశంలో భాగస్వాములను చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెబల్స్ను బుజ్జగించేందుకై తే పార్టీ కార్యాలయంలోనో లేక హోటళ్లలోనో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి కానీ కౌన్సిల్ హాల్లో రాజకీయాలు చేయడం సరికాదని కూటమిలోని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. -
ఒంగోలు నుంచే విజయభేరి
ఒంగోలు టౌన్: ఒంగోలు సభ నుంచే వైఎస్సార్ సీపీ విజయభేరి మొదలైందని, నియోజకవర్గ విస్తృతస్థాయి సభకు తరలివచ్చిన కార్యకర్తలంతా కూటమి పాలకులు వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కలిసికట్టుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ 40 శాతం ఓటింగ్ వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. ఇది జగనన్న మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ఆదివారం ఒంగోలు నగరంలోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో విజయోత్సవ సభను తలపించింది. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య జై జగన్ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ గత జగనన్న ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేస్తే.. ప్రస్తుత కూటమి పాలకులు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలంతా సుఖంగా ఉండాలన్న సదుద్దేశంతో సంక్షేమ పథకాల నగదును నేరుగా ప్రజలకు జగనన్న అందజేశారన్నారు. కానీ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతులు ఎక్కువగా ఉంటారన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని వివరించారు. శనగ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు శనగలు కొనుగోలు చేశారని, పొగాకుకు గిట్టుబాటు ధరలు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ఆదుకున్నారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల బాధలు వినిపించుకోవడం లేదని వైవీ మండిపడ్డారు. ఓట్లేయని వారికి కూడా సంక్షేమ పథకాలిచ్చిన జగనన్న : కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగిస్తూ తనకు ఓటేసిన వారితో పాటు ఓట్లేయని వారికి కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందజేస్తే, కూటమి పాలకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను డాక్టర్లుగా నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్చిదిద్దితే, దానికి నాలుగడుగులు ముందుకేసిన జగనన్న.. చదువుల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టారని కొనియాడారు. అందుకు భిన్నంగా ఫార్టీ ఇయర్స్ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. పార్టీ మారిన కార్పొరేటర్లను చూస్తే జాలేస్తోంది : చెవిరెడ్డి ఎన్నికల తర్వాత వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి వెళ్లిన కార్పొరేటర్లను చూస్తే జాలేస్తోందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. కూటమి నాయకుల గొడవల మధ్య ఎలాంటి గౌరవం లేకుండా అనామకులుగా వారు కొనసాగుతున్నారని, మాతృపార్టీలోకి తిరిగి రావాలని, తిరిగి వచ్చిన కార్పొరేటర్లను తగిన విధంగా గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, ప్రజల పోరాటాలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగిస్తూ జగనన్న పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుల సంక్షేమం కోసం పనిచేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు నాయకత్వంలో ఒంగోలు గడ్డపై వైఎస్సార్ సీపీ విజయపతాకాన్ని ఎగరేయడం ఖాయమన్నారు. ప్రత్యర్థులు సైతం ఉలిక్కిపడేలా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని చుండూరిని అభినందించారు. జగనన్నను ఎదుర్కొనే శక్తి లేకనే : తాటిపర్తి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రసంగిస్తూ ఎవ్వరికీ తలవంచని జగనన్నను ఎదుర్కొనే శక్తి లేకనే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టాయని విమర్శించారు. గుంపులుగా వచ్చినప్పటికీ తమ మీద తమకు నమ్మకం లేక చివరకు ఈవీఎంలతో మాయచేసి అధికారంలోకి వచ్చాయని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ఇప్పటికే లిక్కర్ కుంభకోణం కేసు ఉందన్నారు. కూటమి పాలనలో బియ్యం, ఇసుక, మద్యం మాఫియాలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. సెకీ ఒప్పందం మీద ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు 2 రూపాయలు అదనంగా రేటు పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారని, రొయ్యల వ్యాపారానికి క్రాప్ హాలిడే ప్రకటించారని, సినిమా హాళ్లను మూసేస్తున్నారని విమర్శించారు. స్కాములు చేయడం ఒక్కటే చంద్రబాబు పాలనలో జరుగుతోందన్నారు. మాజీ మంత్రి, కొండపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే ప్రాణమన్నారు. నాయకులను గెలిపించేది, వారి కోసం త్యాగాలు చేసేది కార్యకర్తలేనన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల సమయంలో తన మీద ఎల్లో మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని, పార్టీ కోసం ఏం చేయడానికై నా తాను సిద్ధమేనని చెప్పారు. మాజీ మంత్రి, సంతనూతలపాడు సమన్వయకర్త మేరుగు నాగార్జున ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేసిన వారంతా ఇప్పుడు తప్పు చేసినట్లు బాధపడుతున్నారన్నారు. పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ వచ్చి తీరుతారని స్పష్టం చేశారు. మార్కాపురం సమన్వయకర్త అన్నా రాంబాబు ప్రసంగిస్తూ ఒంగోలు సభ జిల్లాకే స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ప్రజలను మోసం చేస్తున్న బాబు : జూపూడి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో నాయకులకు కొరత లేదన్నారు. జగనన్న ఇస్తానన్న దానికి రెట్టింపు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒట్టిచేతులు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర పాలనలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. ప్రపంచ స్థాయి రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం మంగళగిరి స్థాయి నగరాన్ని అయినా నిర్మించగలరా అని ప్రశ్నించారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు వేయాలని, పార్టీని అన్నివిధాలుగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన చుండూరి రవిబాబు ప్రసంగిస్తూ సమష్టి కృషితో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణయాదవ్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి కనరారావు, ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, వివిధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల నడుమ వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు బూచేపల్లి, తాటిపర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మార్మోగిన జగన్ నినాదాలు విజయోత్సవ సభను తలపించిన సమావేశం -
పచ్చనేతల తెగింపు.. తహసీల్దార్ బరితెగింపు..!
మర్రిపూడి: టీడీపీ నేతల భూ దాహం, రెవెన్యూ అధికారుల ధన దాహానికి ఆదివారం మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకున్నాయి. పనిదినాల్లోనే కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి అరకొరగా పనిచేసి వెళ్లిపోయే తహసీల్దార్ జ్వాల నరసింహారావు ఒక వీఆర్ఓ, మరొక ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ను దగ్గర పెట్టుకుని భూముల ఆన్లైన్ పనులను బిజీబిజీగా చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయ తలుపులు మూసివేసి మరీ ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా భూముల ఆన్లైన్ నమోదు పనులు చేపట్టారు. మర్రిపూడి పరిసరాలలోని పశువుల మేత భూమిని టీడీపీ నాయకుల పేర్లపై ఆన్లైన్ చేస్తున్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ను నిలదీశారు. ఎవరి పేరుతో అయితే ఆన్లైన్ చేస్తున్నారో.. వారు హక్కుదారులు కాదని, నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులకు ఆన్లైన్ చేయడం తగదని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన తమకు అన్యాయం చేయవద్దంటూ వేడుకున్నారు. 60 ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూములను కాసులకు కక్కుర్తిపడి మరొకరికి ఆన్లైన్ చేయవద్దని అధికారులను కోరారు. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే అధికారులు ఈ తంతు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇదీ అసలు కథ... మండల కేంద్రమైన మర్రిపూడిలో శ్రీపృధులగిరి లక్ష్మీనృసింహస్వామి కొండ సమీపంలో సర్వే నంబర్ 990–1లో 327.27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని వెంకటగిరి రాజావారు తన హయాంలో పలు గ్రామాల వారు ఉమ్మడిగా పశువులు మేపుకునేందుకు వదిలారు. విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు పలు గ్రామాలకు చెందిన 57 మంది పేర్లతో అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ క్రమంలో 57 మంది వంశీకుల వారసులు కొందరు ఆ భూమిని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్ముకున్నారు. గత టీడీపీ హయాంలో రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపి బ్లాక్లిస్టులో పెట్టారు. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు మరోసారి భూ అక్రమాలకు తెరలేపారు. ఆ భూమిని కొందరు హక్కుదారులు సాగుచేసుకుంటుండగా, మరికొంతమంది రైతులు అలాగే వదిలేశారు. మండలంలోని గుండ్లసముద్రం, రేగలగడ్డ, మర్రిపూడి, గంగపాలెం, పొట్టిరెడ్డిపాలెం తదితర గ్రామాలకు చెందిన వారు పశువులు మేపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పశువుల బీడుపై కన్నుపడింది. తెలుగు తమ్ముళ్ల ఒత్తిడితో పాటు కాసులకు కక్కుర్తిపడిన స్థానిక తహసీల్దార్.. ఆదివారం బీడు భూమిని అక్రమార్కుల పేరుతో ఆన్లైన్ పనులు చేపట్టారు. పమిడి రమేష్బాబు పేరుతో సర్వే నంబర్ 990–1సీ20లో 17.10 ఎకరాలు, నల్లూరి శ్రీనివాసరావు పేరుతో సర్వే నంబర్ 990–1సీ24లో 11.40 ఎకరాలు, నేరెళ్ల ఏడుకొండలు పేరుతో 990–1సీ4ఏలో 2.85 ఎకరాలు, 990–1సీ4ఏలో 2.85 ఎకరాలును ఆన్లైన్ చేశారు. విషయం తెలుసుకున్న ఆ భూమి వారసులైన గొంటు హనుమాయమ్మ, గొంటు వెంకట నర్శింహారెడ్డి, సూరే రమణారెడ్డి, మరి కొంతమంది భూహక్కుదారులు వెళ్లి తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఆన్లైన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్ఎల్ఆర్లో ఉన్న పేర్లకు నకిలీ వారసులను సృష్టించి వారితో రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్పుస్తకాలు మంజూరు చేయడం ఏమిటని మూకుమ్మడిగా తహసీల్దార్ను నిలదీశారు. ఆధారాలను పరిశీలించి ముందుగా తమకు ఆన్లైన్ చేయాలన్నారు. అసలైన వారసులను మీరు ఎలా గుర్తించారో.. మా పొలానికి వారు వారసులు ఎలా అవుతారో చెప్పాలని నిలదీశారు. తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. దీంతో కంగుతిన్న తహసీల్దార్.. ఆధారాలు తీసుకువస్తే పరిశీలిస్తానని చెప్పారు. అయితే, సంబంధిత ఆధారాలను ఇప్పటికే మూడు సార్లు రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు అందజేశామని రైతులు తెలిపారు. దీంతో ఏం చేయాలో అర్థంగాక తహసీల్దార్ వెళ్లిపోయారు. పశువుల మేత భూములు కాజేసేందుకు చక్రం తిప్పిన టీడీపీ నేతలు ఆదివారం కార్యాలయ తలుపులు వేసుకుని మరీ ఆన్లైన్ చేస్తున్న తహసీల్దార్, సిబ్బంది గతంలో కలెక్టర్ హోల్డ్లో పెట్టినప్పటికీ.. నిబంధనలకు తూట్లు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ పనులు విషయం తెలుసుకుని వెళ్లి నిలదీసిన గ్రామస్తులు తమకు అన్యాయం చేయవద్దంటూ తహసీల్దార్తో గగ్గోలు -
బతుకులు చితికి!
సంవత్సరం పొగాకు సరాసరి ధర 2014–15 రూ.81.37 2015–16 రూ.112.94 2016–17 రూ.116.47 2017–18 రూ.129.96 2018–19 రూ.118.23 అదో పీడకల.. 2014–19 మధ్య పొగాకు రైతులకు అన్నీ కష్టాలే.. ఆ రోజులు తలుచుకుంటేనే రైతు వెన్నుల్లో వణుకుపుడుతోంది. మద్దతు ధరల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిందే. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనీస మద్దతు ధర సరాసరి రూ.118 దాటని పరిస్థితి. నష్టాలు మూటగట్టుకున్న రైతులు పొగాకు సాగుచేయాలంటే భయపడిపోయిన పరిస్థితులు నాడు నెలకొన్నాయి. నేడు అదే పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. వేలం ప్రారంభమై 70 రోజులు కావస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేలం కేంద్రాల్లో ధరలు రాకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. రైతులకు అండగా నిలవాల్సిన పొగాకు బోర్డు, కూటమి ప్రభుత్వం ప్రకటనలతో కాలక్షేపం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర రోడ్డెక్కి..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పాలన అంటనే రైతులకు ఓ శాపంలా మారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధరల కోసం నిరంతర పోరాటాలు చేయాల్సిందే. అందుకు నిదర్శనం ప్రస్తుతం పొగాకు పంటకు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటయిన పొగాకు రైతుల వెన్నువిరిచేలా చంద్రబాబు పాలనలో ధరలు పతనమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ ప్రకారం రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. దీంతో రైతులు మద్దతు ధరల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2014–19 మధ్య సాగిన చంద్రబాబు పాలనలోనూ పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సి వచ్చింది. అయినా రైతులకు మాత్రం మద్దతు ధరలు దక్కిన దాఖలాలు లేవు. దీంతో పొగాకు రైతులు తీవ్ర నష్టాలపాలై పొగాకు పంట సాగుచేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం అదే పరిస్థితులను పొగాకు రైతాంగం ఎదుర్కొంటోంది. నాటి ఐదేళ్లూ తీవ్ర నష్టాలే... చంద్రబాబు పాలనలో పొగాకు రైతులకు ఏనాడూ మద్దతు ధర దక్కిన పాపానపోలేదు. అందుకు 2014–19 మధ్య జరిగిన పాలనలో పొగాకు రైతులకు దక్కిన ధరలే నిదర్శనం. ఉమ్మడి ప్రకాశం జిల్లా కింద మొత్తం 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే.. అంటే 2014–15 సీజన్కు సంబంధించి పొగాకు ధరలు దారుణంగా పడిపోయాయి. అప్పట్లో విదేశీ ఆర్డర్లు రావడం లేదనే కారణంతో పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో పండించిన పొగాకు అతి తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. 2014–15 సీజన్లో జిల్లాలో కేజీ పొగాకు సరాసరి ధర రూ 81.37 మాత్రమే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అసలు లోగ్రేడ్ రకం పొగాకుకు అయితే కేవలం రూ.45 కూడా రాని పరిస్థితి. ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ దెబ్బతో 2015–16 సీజన్లో పొగాకు సాగుచేసేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో బోర్డు అనుమతించిన పరిమితి కంటే కూడా రైతులు పొగాకును తక్కువగా పండించారు. సహజంగా మార్కెట్లో ఉత్పత్తులు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సీజన్లో కూడా పొగాకు రైతులు భిన్నమైన పరిస్థితినే ఎదుర్కొన్నారు. మార్కెట్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తులు లేకపోయినా వ్యాపారులు ధరలు మాత్రం పెంచలేదు. కేవలం ఆ ఏడాది వచ్చిన పొగాకు సరాసరి ధర రూ.112.94 మాత్రమే. దీంతో వరుసగా రెండేళ్లపాటు వచ్చిన తీవ్ర నష్టాలతో అనేక మంది రైతులు పొగాకు సాగు వదిలేసి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక, 2016–17, 2017–18 సీజన్లలోనూ పొగాకు రైతులు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరల కోసం ఆ ఐదేళ్ల పాలనలో రైతులు ప్రతిరోజూ రోడెక్కి ధర్నాలు చేశారు. అయినా మార్కెట్లో ధరలు కల్పించడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి చంద్రబాబు పాలనలో పొగాకు రైతులు ఆనాటి ఐదేళ్ల పాలనలో ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొంటుండడం గమనార్హం. పొగాకు రైతులకు అండగా వైఎస్ జగన్... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు నష్టాల పాలవ్వగా, 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఒకానొక సందర్భంలో మార్కెట్ ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వం తరఫున మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడి తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అదనపు పొగాకు అమ్మకాలపై జరిమానాలను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులకు అదనపు లాభం కూడా చేకూరింది. గతేడాది వరకు పొగాకు పంటకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధరలు దక్కాయి. కేజీ పొగాకు ధర రూ.366 పలకగా, సరాసరి ధర రూ.275 వరకు వచ్చింది. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరోసారి పొగాకు రైతుల పరిస్థితి తారుమారైంది. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డునపడే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.. గతం తలుచుకుంటేనే భయమేస్తోంది... గతం తలుచుకుంటే భయమేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 వరకు పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎన్ని ధర్నాలు చేసినా, పొగాకు వేలం నిలిపివేసినా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. అప్పుడు రైతులు ఇంకో పంట సాగుచేయలేక, వచ్చే ఏడాది ఽఅయినా ధరలు పెరుగుతాయని ఐదు సంవత్సరాలు పొగాకు సాగు చేసి అప్పులపాలయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో కూడా రైతులు లాభాలు పొందారు. అప్పటి పొగాకు వ్యాపారస్తులు ధరలు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా ప్రభుత్వమే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి వ్యాపారుల్లో పోటీ పెంచి రైతులకు మద్దతు ధరలు కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – ఏలూరి వంశీకృష్ణ, పొగాకు రైతు, పొందూరు గ్రామం, టంగుటూరు మండలం. టీడీపీ గత ఐదేళ్ల పాలనలోనూ పొగాకు రైతులకు దక్కని మద్దతు ధర ధరల కోసం నాటి చంద్రబాబు పాలనలోనూ ఐదేళ్లపాటు రైతుల పోరాటాలు మరోసారి చంద్రబాబు పాలనలో కుదేలవుతున్న పొగాకు రైతులు ప్రస్తుతం పొగాకు వేలంలో ధరలు రాక భారీ నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులు ఆదుకునేందుకు కనీస ప్రయత్నం చేయని కూటమి ప్రభుత్వం -
నాగులుప్పలపాడుకు తొలి మహిళా ఎస్సై
● బాధ్యతలు స్వీకరించిన షేక్ రజియా సుల్తానా నాగులుప్పలపాడు: స్థానిక పోలీస్స్టేషన్కు మొదటిసారి మహిళా ఎస్సైను నియమించారు. నూతన ఎస్సైగా షేక్ రజియా సుల్తానా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన బి.శ్రీకాంత్పై పలు ఆరోపణలు రావడం, ఎస్పీ దామోదర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు స్టేషన్కు ఎస్సైగా రజియా సుల్తానాను నియమించడంతో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని తెలిపారు. పోలీస్స్టేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారి బాధ్యతలు చేపట్టిన మహిళా ఎస్సైకి సిబ్బంది అభినందనలు తెలిపారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి ఒంగోలు వన్టౌన్: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మాలలు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ప్రభుత్వ సముదాయాల కార్యాలయం వద్ద ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, సోషల్ బహిష్కరణలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
పొదిలి: ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్ల మండలం బచ్చలకూరపాడు పంచాయతీ మెట్టువారిపల్లి గ్రామానికి చెందిన మెట్టు మాధవరెడ్డి(27) బస్టాండ్ ఎదురుగా సాయిసూర్య లాడ్జిలో పనిచేస్తుంటాడు. ఆదివారం బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని కిందపడి చక్రాలు ఎక్కడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడలో ఉంటున్న మాధవరెడ్డి ఇటీవలే స్వగ్రామం వచ్చి లాడ్జిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వవిరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంటిపై పిడుగు ముండ్లమూరు(కురిచేడు): ముండ్లమూరు మండలంలోని తూర్పు కంభంపాడు గ్రామంలో ఇంటిపై పిడుగు పడింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. గ్రామంలోని తొట్టెంపూడి ధనలక్ష్మి ఇంటిపై కప్పు చివరన పిడుగుపడి కప్పు విరిగి ఇంటిపక్కన భూమిలోకి వెళ్లిపోయింది. ఇంటి పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. పిడుగుపాటుకు చుట్టుపక్కల 12 గృహాల్లోని గృహోపకరణాలు షార్ట్ సర్క్యూట్కు గురయ్యాయి. ఇళ్లలోని టీవీలు, ఫ్రీజ్, కూలర్, మిక్సీలు కాలిపోవడంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జేవీవీ కృషిపొదిలి: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జన విజ్ఞాన వేదిక 37 ఏళ్లుగా అలుపెరుగని కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం జిల్లాస్థాయి విస్తృత సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి గురుస్వామి అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరించారు. మురళీధర్ మాట్లాడుతూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, అందరికీ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కల్పించాలనే ఆశయ సాధన కోసం జేవీవీని స్థాపించారన్నారు. ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజినీర్లు, మేధావులు, విద్యావంతులు జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరాలని కోరారు.రాష్ట్ర కమిటీ సభ్యులు వి.మాలకొండారెడ్డి, పి.స్వరూపరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక సమస్యలకు సైన్సు మాత్రమే పరిష్కారం చూపిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్సుకు, పరిశోధనలకు, అధ్యయనాలకు తగినన్ని నిధులు కేటాయించి ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహాసభలను ఆగస్టు 9వ తేదీన గిద్దలూరులో నిర్వహించాలని తీర్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.జయప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు ఖాజా హుస్సేన్, యు.వెంకటరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూదాల దేవ ప్రసాద్, ఎస్ఎండి.రఫీ, జి.శ్రీనివాసరెడ్డి, ఏ.విశ్వరూపం, వి.వెంకటేశ్వర్లు, ఎస్వి.రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.