breaking news
Prakasam
-
వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం
● డీఈఓ కిరణ్ కుమార్ ఒంగోలు సబర్బన్: వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం కలుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ.కిరణ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ, విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా డీ వార్మింగ్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం రాదన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరించారు. డాక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో స్టెప్ అండ్ యూత్ స్పోర్ట్స్ జిల్లా అధికారి శ్రీమన్నారాయణ, జిల్లా ఉమన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ పాల్గొన్నారు. సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు హైస్కూల్లో ఈనెల 17వ తేదీ 69వ స్కూల్ గేమ్స్ హాకీ అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గరల్స్ జిల్లా టీం సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ డాక్టర్ చెక్క వెంకటేశ్వర్లు, ఏ శిరీష కుమారి తెలిపారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా, పర్యవేక్షకులుగా డీఈఓ ఏ కిరణ్ కుమార్ హాజరవుతున్నట్టు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉన్న హాకీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. అండర్ 17 లో పాల్గొనే ఇంటర్మీడియెట్ బాలబాలికలు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, పాన్ నంబర్, అపార్ ఐడీని ప్రిన్సిపల్తో అటిస్టేషన్ చేయించుకోవాలన్నారు. -
సర్కారు గొప్పలు.. ప్రయాణికులకు తిప్పలు
ఒంగోలు టౌన్: ప్రధాన మంత్రి కర్నూలు పర్యటనకు జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, పొదిలి, మార్కాపురం, కనిగిరి డిపోల నుంచి 160 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో ఒంగోలు డిపోలో 74 పల్లెవెలుగు బస్సులుండగా ఏకంగా 40 బస్సులను కర్నూలు సభకు తరలించినట్లు సమాచారం. మంగళవారమే జిల్లా నుంచి బస్సులన్నీ వెళ్లిపోయాయి. తిరిగి 17వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి గానీ బస్సులు జిల్లాకు చేరుకోవు. 18వ తేదీ నుంచి రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద మూడు రోజుల పాటు జిల్లాలో సగం పల్లెవెలుగు బస్సులు కనిపించవు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో ప్రధానంగా పల్లెవెలుగు బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డిపోలో ఉన్న బస్సుల్లో సగం బస్సులను కర్నూలు సభకు తరలించడంతో మహిళా ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. వందలాది గ్రామాలకు బస్సులు వెళ్లే అవకాశం లేదు కనుక ఆయా గ్రామాలకు చెందిన ప్రయాణికులు, మహిళలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. మహిళలకు ఉచిత బస్సులు ప్రారంభించినప్పటి నుంచి సభలు, సమావేశాలంటూ ఆర్టీసీ బస్సులను తరలించడం నిత్యకృత్యమైపోయిందని ఆర్టీసీ యూనియన్ నాయకులు విమర్శిస్తున్నారు. -
చచ్చినా చావే..!
కంభం: మండలంలోని రావిపాడు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తున్న సమయంలో ఊర్లో ఎవరైనా చనిపోతే నడుముల లోతుకు పైగా నీటిలో అడుగులో అడుగేస్తూ పాడె మోయాల్సిన దుస్థితి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తోంది. గ్రామానికి చెందిన అంజిరెడ్డి(54) బుధవారం మృతి చెందారు. శ్మశానానికి వెళ్లే మార్గంలో గుండ్లకమ్మ వాగులో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మృతుడి బంధువులు, గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. వాగు అవతల ఉన్న పంటపొలాలకు వెళ్లడానికి కూడా తిప్పలు తప్పడం లేదని, అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
నేడు ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన
పెద్దదోర్నాల: నేడు శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేట్టారు. గ్రేహాండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం శ్రీశైలం ఘాట్రోడ్డులో అడుగడుగునా తనిఖీ చేశారు. బందోబస్తుకు హాజరైన పోలీసు సిబ్బందికి ముందుగా పెద్దదోర్నాల పోలీస్స్టేషన్ వద్ద మార్కాపురం డీఎస్పీ నాగరాజు దిశానిర్దేశం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, శ్రీశైలం నుంచి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. లైసెన్స్, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని, మద్యం తాగిన వాహనదారులను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులోకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించేది లేదని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్రావు, పలువురు ఎస్సైలు ఉన్నారు. శ్రీశైలం వచ్చి వెళ్లే వాహనాలు ముమ్మరంగా తనిఖీ భద్రతా చర్యలను పర్యవేక్షించిన మార్కాపురం డీఎస్పీ గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర వాహనాల నిలిపివేత -
నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి
సింగరాయకొండ: నకిలీ, కల్తీ మద్యం వ్యాపారంతో పేద ప్రజల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న దోషులను కఠినంగా శిక్షించి ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని, ఈ అక్రమ వ్యాపారంపై సీబీఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం కల్తీ మద్యం వ్యవహారంపై దోషులను కఠినంగా శిక్షించాలని ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు నాణ్యమైన మద్యం అందించాలని కోరుతూ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కారు. ఈ సందర్భంగా పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నుంచి ప్రధాన రహదారి గుండా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకట్, సీఐ ఎం.శివకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కల్తీమద్యంపై ముఖ్యంగా 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్షాపులు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టుషాపులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పటి వరకు పత్రికల కథనాల ప్రకారం సుమారు 421 మందికి పైగా నకిలీ మద్యం కారణంగా మృత్యువాత పడ్డారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలను గుర్తించి అనర్హులను తొలగించాలన్నారు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుని అమ్మకం వేళలు తగ్గించాలని కోరారు. బడులు, దేవాలయాలకు సమీపంలో, పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేసిన వైన్షాపులు, బార్ల లైసెన్స్లు రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. టీడీపీ కనుసన్నల్లో నకిలీ మద్యం వ్యాపారం: రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం వ్యాపారం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందని ఇందుకు పూర్తి ఆధారాలు బట్టబయలయ్యాయని డాక్టర్ సురేష్ ఆరోపించారు. నెల్లూరు, విజయవాడ, ఏలూరు, పాలకొల్లు, పరవాడ తదితర ప్రాంతాలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బట్టబయలయ్యాయన్నారు. నకిలీ మద్యం వ్యవహారం తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, అనుచరుడు జనార్దనరావు కనుసన్నల్లో జరిగిందని వీరందరూ టీడీపీ వారే కదా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆఫ్రికాలో మద్యం డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు రూ.5,300 కోట్లు నకిలీ మద్యం వ్యాపారం ద్వారా దోచుకున్నారని ఇంతటి భారీ అక్రమ వ్యాపారం బట్టబయలు చేసి దోషులకు శిక్ష పడాలంటే రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండే సిట్ కాదని, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సురేష్ డిమాండ్ చేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తానని ప్రజలను మభ్యపెట్టిందని ఈరోజు నకిలీ మద్యాన్ని ప్రజలకు అందిస్తూ వారి ప్రాణాలను హరించిందని, ఇందుకు ముమ్మాటికీ టీడీపీ నాయకులే కారకులని విమర్శించారు. ర్యాలీ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వై వెంకటేశ్వరరావు, ఎస్ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, మాకినేని వెంకట్రావు, కనపర్తి శేషారెడ్డి, తానికొండ రామచంద్రరావు, రాపూరి ప్రభావతి, షేక్ సుల్తాన్, పఠాన్ రియాజ్, చొప్పర వెంకన్న, కనపర్తి గోవిందమ్మ, యనమల మాధవి, చుక్కా కిరణ్కుమార్, దాసు శ్రీను, షేక్ కరీం, గొల్లపోతు గోవర్దన్, మిరియం సుధాకర్, గాదంఽశెట్టి గుప్తా, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, కోమిట్ల వెంకారెడ్డి, నరేష్, షేక్ అల్లాభక్షు, నాగార్జున, భాను, నవీన్రెడ్డి, బుజ్జమ్మ, చిడిపూడి కృష్ణారెడ్డి, చిమట శ్రీను, చామల ఉదయశంకరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, దేవరపల్లి వరుణ్, బత్తిన మనోహర్రావు, దగ్గుమాటి శంకరరెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, ముప్పా కోటేశ్వరరావు, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, టి రవీంద్రరెడ్డి, వై వీర వసంతరావు, పూనూరి సంజీవరెడ్డి, సోమిశెట్టి సురేష్, బల్లెల ప్రభాకరరెడ్డి, కేశవరపు కృష్ణారెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, కాళహస్తి వెంకారెడ్డి, పురిణి దేవ, గాలి బుజ్జి, దాసరిశేషయ్య, సాయికోటి, మాదాల శంకర్, అంకయ్య, కాకి జయపాల్, వాయిల పున్నయ్య, శివారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
తాళ్లూరు: మండలంలోని వెలుగువారిపాలెం వద్ద సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన పొదిలి మండలం కాటూరివారిపాలెం వాసి మెలిక ప్రసాద్(48) నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే. వల బయటకు లాగే క్రమంలో కాలుకు చుట్టుకోవడంతో పట్టుతప్పి నీటిలో పడిపోయిన ప్రసాద్ అదే ప్రదేశంలో పూడికలో కూరుకుపోయి మృతి చెందాడు. బంధువులతోపాటు స్థానికులు కలిసి వలల సహాయంలో కాలువ నుంచి మృతదేహాన్ని బుధవారం వెలికితీసి స్వగ్రామానికి తరలించారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి, వీఆర్వో చిన్నకృష్ణ పోలీసులకు సమచారం ఇవ్వటంతో సంఘటనా స్థలాన్ని ఏఎస్ఐ భాస్కర్రావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ● హెడ్ పోస్టాఫీసు ఎదుట ఉద్యోగుల ధర్నా మార్కాపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను విడనాడాలని, 8వ పే కమిషన్ సభ్యులను నియమించాలని రాష్ట్ర అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం సహాయ కార్యదర్శి ఎన్.రమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మార్కాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలిండియా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహదేవయ్యను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తొలగించారని, ఆయనను మళ్లీ విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్ఎఫ్పీఈ కార్మిక సంస్థ గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి.నారాయణరెడ్డి, ఎం.శ్రీనివాసులు, ఎ.రవి, కార్తీక్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాసరావు, డి.సుబ్బారావు కుటుంబ సభ్యులకు సహచర ఉద్యోగులు సాయం అందించారు. జిల్లాలోని కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఫండ్ సేకరించి ఒక్కో కుటుంబానికి రూ.74 వేల చొప్పున ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు చేతుల మీదుగా బుధవారం స్థానిక ఎకై ్సజ్ డీసీ కార్యాలయంలో అందజేశారు. సహృదయంతో సాటి ఉద్యోగుల కుటుంబాలకు చేయూతనివ్వాలన్న ఆలోచన చేసిన అసోసియేషన్ నాయకులకు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ ఎస్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
బస్సులు లేక అవస్థలు
● ప్రధాని పర్యటన నేపథ్యంలో రాయలసీమ జిల్లాలకు బస్సుల కేటాయింపు ● జిల్లా నుంచి 160 బస్సులు తరలింపు మార్కాపురం: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీశైలం, కర్నూలులో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్న నేపథ్యంలో జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, కనిగిరి, పొదిలి డిపోల నుంచి సుమారు 160 బస్సులను నంద్యాల, కర్నూలు జిల్లాలకు పంపడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పలువురు బస్టాండులకు రాగా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పలు బస్టాండుల్లో బస్సులు లేక ఖాళీగా కనిపించగా, ప్రయాణికులతో నిండిపోయాయి. అరకొరగా వచ్చే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు సీట్ల కోసం యుద్ధమే చేయాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల బుధవారం వర్షం కురవడంతో అటు బయటకు రాలేక, ఇటు బస్టాండులో ఉండలేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లా పాపలు, లగేజీతో బస్టాండుకు వస్తే బస్సులు లేవు. ముఖ్యంగా మార్కాపురం నుంచి విజయవాడ, ఒంగోలు, కడప, వినుకొండ, మాచర్ల, గిద్దలూరు తదితర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేసి రాయలసీమ జిల్లాలకు పంపారు. మార్కాపురం పట్టణానికి వచ్చేందుకు సమీప గ్రామాల ప్రజలు ఆటోలను ఆశ్రయించగా కంభం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, కొనకనమిట్ల, పొదిలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో బస్సులు లేకపోవడంతో ఆటోల్లో లేదా కార్లు బాడుగకు మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిద్దలూరు నుంచి 35, మార్కాపురం నుంచి 35, ఒంగోలు నుంచి 35, కనిగిరి నుంచి 35, పొదిలి నుంచి 20 బస్సులను కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాలకు పంపారు. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. దీంతో పలువురు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి
మార్కాపురం: ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై దీపావళి పండగలోగా జీవో విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగుల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య హెచ్చరించారు. బుధవారం మార్కాపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 28న ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రి అనుమతి ఇచ్చినప్పటికీ జీఏడీ విభాగంలో పెండింగ్ పెట్టి ఇంతవరకూ జీఓ విడుదల చేయలేదన్నారు. దీంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సుమారు 6 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని చెప్పారు. ఈ సమస్యను దీపావళిలోగా పరిష్కరించకుంటే ఉద్యమమే శరణ్యమని హెచ్చరించారు. అనంతరం మార్కాపురం ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద నూతనంగా నిర్మించిన ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చక్రపాణి, ఎస్వీఎస్ శాస్త్రి, బీబీ వెంకటేశ్వర్లు, సీహెచ్ జనార్దన్రావు, పి.శేఖర్నాయుడు, బాషా హుస్సేన్, మంగమ్మ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీ ఓ దండగమారి విధానం
ఒంగోలు వన్టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి సర్కారు తెరపైకి తెచ్చిన పీపీపీ విధానం ఓ దండగమారి పంచాయితీ అని, తక్షణమే పీపీపీ మోడల్ను ఉపసంహరించుకోవాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఒంగోలులోని కలెక్టరేట్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ సంక్షేమంపై ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మాల కార్పొరేషన్కు రూ.341 కోట్లు, మాదిగ కార్పొరేషన్కు రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారే కానీ 16 నెలలుగా ఒక్క రూపాయి కూడా అర్హులకు అందించలేదని దుయ్యబట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ప్లాన్ ప్రకటించి ఆరు నెలలైనా ఒక్క రూపాయి నిధులివ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాలకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. దళితులు పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులైనా మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అబ్రహాము, జాన్ వెస్లీ, యేసు దాస్, ధనరాజ్, జిలాని, బ్రహ్మ, సామేలు, మోషే, మరియమ్మ, శాంతి, విజయలక్ష్మి, మనోహర్, కావేరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టొద్దు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు మంజూరు చేయాలి దళిత హక్కుల పోరాట సంఘం నేతల డిమాండ్ -
వైద్య విద్యకు కూటమి సర్కారు సమాధి
పొదిలిలో సంతకాల సేకరణను ప్రారంభిస్తున్న బత్తుల, అన్నా రాంబాబు ఉప్పలపాడులో సంతకాల సేకరణలో పార్టీ నేతలు పొదిలి రూరల్: సామాన్యులు, పేదలకు వైద్యం, వైద్య విద్య అందకూడదనే దురుద్దేశం, అనుచరులకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే దుర్మార్గపు ఆలోచనలతో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడె బత్తుల బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని బుధవారం పొదిలి, ఉప్పలపాడు గ్రామాల్లో ప్రారంభించారు. పొదిలి విశ్వనాథపురంలో పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, ఉప్పలపాడులో మండల పార్టీ అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డితో కలిసి సర్కారు తీరుకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. కోటి సంతకాల సేకరణ సమావేశాల్లో బత్తుల, అన్నా మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వాటిలో ఇప్పటికే 7 కాలేజీలు ప్రారంభం కాగా, మరో 10 కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. కూటమి గద్దెనెక్కిన తర్వాత వైద్య కళాశాలలను సమాధి చేసేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. దాదాపు రూ.లక్ష కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను, వేలాది ఎకరాల భూములను సీఎం చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు చీకటి బాగోతాన్ని బట్టబయలు చేసేందుకు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో రాష్ట్ర ప్రజలకు కలిగే నషం, ఇబ్బందులను వివరించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రారష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, నాయకులు గొలమారి చెన్నారెడ్డి, సాయి రాజేశ్వరరావు, కె నరసింహరావు, కల్లం సుబ్బారెడ్డి, జి.శ్రీనివాసులు, నూర్జహన్ బేగం, గౌసియా బేగం, యక్కలి శేషగిరి రావు, మస్తాన్వలి, ఫిరోజ్, వెంకటేశ్వరరెడ్డి, పార్టీ వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అందులో భాగమే.. ప్రజా సమస్యలు గాలికొదిలేసి దోపిడీకి తెరలేపారు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల, మాజీ ఎమ్మెల్యే అన్నా ధ్వజం కూటమి సర్కారు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పొదిలిలో కోటి సంతకాల సేకరణ -
ఒంగోలులో నకిలీ బీరు కలకలం
ఒంగోలు టౌన్: నగరంలో నకిలీ బీరు బాటిల్ కలకలం సృష్టించింది. నగర శివారులోని కొప్పోలులో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో మంగళవారం ఒక కస్టమర్ మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన అతడు ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షించాడు. తొలుత మాన్షన్ హౌస్ లిక్కర్ తీసుకొని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా మద్యం బాటిల్ వివరాలు వచ్చాయి. ఆ తరువాత బీర్ బాటిల్ మీద ఉన్న క్యూ ఆర్ కోడ్కు స్కాన్ చేశాడు. ఎర్రర్ అని వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసిన సదరు కస్టమర్ ఒంగోలులోని వైన్ షాపుల్లో నకిలీ బీర్ విక్రయిస్తున్నారని, మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. నకిలీ బీరు తాగుతున్నామంటూ మందుబాబులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్లో కేవలం నకిలీ లిక్కర్ను మాత్రమే గుర్తించే సౌకర్యం ఉందని, బీరు బాటిళ్లను గుర్తించే సౌకర్యం లేదని ఎక్సైజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను కేవలం లిక్కర్ బాటిళ్ల స్కానింగ్కు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. బీరు బాటిళ్ల మీద కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, ప్రభుత్వ యాప్కు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 🚨 Public Alert! Be Cautious! 🚨A shocking incident has come to light at Koppole Road, Ongole.At Sai Wines, when people scanned the Mansion House QR code, it worked successfully but when they scanned a beer bottle, the code showed an error on the official AP consumer website.… pic.twitter.com/uTOsi9ilqc— VoiceOfAndhra (@VoicesOfAndhra) October 14, 2025 -
ఒక్క పనిముట్టు.. అందితే ఒట్టు!
మార్కాపురం: కూటమి ప్రభుత్వ తీరు వ్యవసాయ రంగాన్ని క్రమంగా సంక్షభంలోకి నెడుతోంది. పంటలకు గిట్టుబాటు కల్పించడంలో, ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వ పాలకులు.. అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించకుండా చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ వ్యవసాయ పనిముట్లు అందకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకుని వాడుకోవాల్సిన దుస్థితి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో ఖరీఫ్లో 70 వేల హెక్టార్లలో రైతులు వరి, మొక్కజొన్న, కంది, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి, మిర్చి సాగు చేశారు. ఈ పంటల్లో తెగుళ్లను నివారించేందుకు తైవాన్ స్ప్రేయర్లు అవసరం. దీంతోపాటు రబీ సీజన్లో పొలాలు సాగు చేసుకునేందుకు, దుక్కులు దున్నుకునేందుకు మెయింటైన్ కల్టివేటర్ (ట్రాక్టరుతో నడిచే గొర్రు), నూర్పిడి యంత్రాలు, భూమ్ స్ప్రేయర్ (ట్రాక్టరుతో నడిపే స్ప్రేయరు), విత్తనాలు ఎదబెట్టే గొర్రులు రైతులకు అత్యవసరం. ఇవేవీ జిల్లా వ్యాప్తంగా రైతులకు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వస్తాయో.. రావో.. కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చినా అవి కొన్ని మండలాలకే పరిమితం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ ప్రారంభం కావడంతో మొక్కజొన్న, శనగ సాగు చేసుకునేందుకు, విత్తనాలు ఎద పెట్టుకునేందుకు, ట్రాక్టరుతో నడిచే గొర్రు అత్యవసరం. పత్తి, మిర్చి, వరి పంటల్లో తెగుళ్ల నివారణకు తైవాన్ స్ప్రేయర్లు అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. పెట్టుబడి మరింత భారం పత్తి, మిర్చి పండిస్తున్న రైతులు లక్షల రూపాయల సొమ్మును పెట్టుబడి కోసం ఖర్చు చేస్తున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ.25 వేల వరకు, మిర్చి సాగుకు లక్షన్నర రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ నేపఽథ్యంలో పవర్ స్పేయర్లు, ఇతర యంత్ర పరికరాలకు బాడుగలు చెల్లించాలంటే ఆర్థికంగా మరింత భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పత్తి సుమారు 13 వేల హెక్టార్లలో, వరి 6 వేల హెక్టార్లలో, మొక్కజొన్న సుమారు 5వేల హెక్టార్లలో సాగుచేశారు. కాగా పత్తికి అక్కడక్కడా తామర పురుగు, పచ్చదోమ, మిర్చికి పై ముడత, వరికి ఆకుమచ్చ తెగులు ఆశించింది. వీటి నివారణకు మందులు పిచికారీ చేయాలంటే కశ్చితంగా తైవాన్ స్ప్రేయర్ అవసరం. సేద్యానికి అవసరమైన పనిముట్లతో తైవాన్ స్ప్రేయర్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన వ్యవసాయ పరికరాలు అందిస్తే రబీ సీజన్లో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్లో సాగుచేసిన పత్తి రబీ ప్రారంభమైనా రైతులకు అందని వ్యవసాయ పరికరాలు రోటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్ల కోసం ఎదురుచూపులు జిల్లాలో ఖరీఫ్లో 70 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు పనిముట్లకు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడిన రైతులు -
డైవర్షన్ పాలిటిక్స్లో దిట్ట చంద్రబాబు
● మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారు ● వైఎస్సార్ సీపీ బీసీ గౌడ నాయకుల ఆగ్రహం ఒంగోలు వన్టౌన్: నకిలీ మద్యం కేసులో అసలు దొంగలను తప్పించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరదీయడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ బీసీ గౌడ నాయకుడు తాతా నరశింహ గౌడ్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులోని బొట్ల సుబ్బారావు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారా వారి నకిలీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతోందని ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం విక్రయించి ప్రజా ధనం దోచుకుంటూ అడ్డంగా దొరికిన టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, జనార్దన్రావు, సురేంద్రనాయుడు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుతో లింకులు ఉన్న టీడీపీ ముఠాను తప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కాగా స్కెచ్ వేశారని, గౌడ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ కేసు నమోదు అందులో భాగమేనని ఆరోపించారు. ఈ కుట్రలో అసలు సూత్రదారులు చంద్రబాబు, లోకేష్ కాగా, పాత్రధారులు జయచంద్రారెడ్డి, జనార్థన్ అని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నకిలీ మద్యం మకిలిని వైఎస్సార్ సీపీ అంటించాలని సాగిస్తున్న కుట్రలు భగ్నం కాక తప్పదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులు, గౌడ సంఘీయులను సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గత 17 నెలలుగా ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయించడం బడుగుబలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేందుకేనని విమర్శించారు. ఒక పక్క మట్టి, ఇసుక, లిక్కర్ సిండికేట్లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కూటమి ముఠాలు.. అది చాలదన్నట్లు నకిలీ మద్యంతో రూ.వేల కోట్లు పోగేసుకున్నాయని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కేసును తప్పుదారి పట్టించేందుకు జోగి రమేష్పై అక్రమ కేసులు బనాయించడం అవివేకమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. నకిలీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే జోగి రమేష్ గౌడ్ మీద అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు తాతా నాంచార్లు గౌడ్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిదపు సుధాకర్, కొత్తపట్నం మండలం బీసీ సెల్ అధ్యక్షుడు తుళ్లూరి వెంకట నారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు 38వ డివిజన్ పాలడుగు శ్రీనివాసరావు, 15వ డివిజన్ నాయకుడు వీసం బాలకష్ణ, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి ఉసురు తీసిన ఈత సరదా
గిద్దలూరు రూరల్: ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని కొండపేట గ్రామ సమీపంలో గల ఆంజనేయస్వామి గుడి వెనుక సగిలేరు వాగులో మంగళవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సయ్యద్ ఆసిఫ్(22) స్నేహితులతో కలిసి సగిలేరు వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వాగు లోతట్టు ప్రాంతంలోకి వెళ్లిన ఆసిఫ్ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్నేహితులు గమనించి అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. నీటిలో మునిగిపోయిన ఆసిఫ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ కె.సురేష్ తమ సిబ్బందితో కలిసి వాగు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ఆసిఫ్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆసిఫ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడి మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆసిఫ్ తండ్రి రసూల్ అటవీశాఖలో కాంట్రాక్ట్బేస్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియెట్ వరకు చదివిన ఆసిఫ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. -
అడవుల సంరక్షణకు ప్రాధాన్యం
ఒంగోలు సబర్బన్: అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. వివిధ విభాగాల అటవీ శాఖ అధికారులతో, పర్యాటక శాఖ అధికారులతో మంగళవారం ఆయన ప్రకాశం భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి పైనా దృష్టి సారించాలని అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అందిస్తామన్నారు. జిల్లాలో అటవీ ప్రాంత విస్తీర్ణం, నగరవనాల అభివృద్ధి, రోడ్లు, మొబైల్ టవర్ల నిర్మాణాలు తదితర ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు, కోస్తా తీరం వెంట గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అభివృద్ధి, రెవెన్యూ రికార్డుల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూముల వివరాల అప్డేషన్, మ్యుటేషన్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, పర్యాటక అభివృద్ధి, స్థానికులకు జీవనోపాధి కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అటవీ శాఖల వివిధ విభాగాల నుంచి ఒకరిని ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పారు. దీంతోపాటుగా ప్రతినెలా అటవీ భూముల పరిరక్షణకు అవసరమైన సంయుక్త సమావేశం, భూముల జాయింట్ సర్వే జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. జిల్లాలో రెండు విమానాశ్రయాలు రానున్నాయని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వెలుగొండ ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన అని కలెక్టర్ చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లా ముఖచిత్రమే మారిపోతుందన్నారు. హైదరాబాద్, అమరావతి, తిరుపతి, బెంగళూరుకు మధ్యలో ఉన్న ప్రాంతం కావడం, నల్లమల పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్, డీఎఫ్వో(సోషల్ ఫారెస్ట్) రాజశేఖర్ రావు, గిద్దలూరు టైగర్ రిజర్వ్ డీడీ నిషాకుమారి, మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్, జిల్లా ఇన్చార్జి పర్యాటక అధికారి రమ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధి పైనా దృష్టి సారించాలి అటవీ, పర్యాటక శాఖలపై సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు
తాళ్లూరు: సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. ఈ సంఘటన తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం పంచాయితీ రెడ్డి సాగర్ ఓబీసీ కెనాల్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామానికి చెందిన మెలిక ప్రసాద్(40) తన భార్య కొండమ్మతో కలిసి చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. రోజూమాదిరిగానే సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వల వేశౠరు. నీటిలో నుంచి వల బయటకు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వల కాలుకు చుట్టుకోవడంతో పట్టుతప్పి కాలువలో పడి గల్లంతయ్యాడు. మెలిక ప్రసాద్(40)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రసాద్ మరణించి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు తమ బంధువులతో కలిసి మృతదేహాం కోసం గాలిస్తున్నారు. -
ప్రధాని పర్యటనకు భద్రత కట్టుదిట్టం
పెద్దదోర్నాల: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ నెల 16వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రం పర్యటన నేపథ్యంలో చేపట్టబోయే భద్రతా ఏర్పాట్లపై సీఐ ప్రభాకర్రావు, ఎస్సై మహేష్లతో కలిసి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే వాహనాలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండల కేంద్రంలోని మల్లికార్జున నగర్లోనే నిలిపేస్తామని తెలిపారు. దీంతో పాటు అదే రోజు ప్రధాని కర్నూలు పట్టణంలో పర్యటిస్తుండటంతో గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను కుంట, గిద్దలూరు, నంద్యాల మీదుగా దారి మళ్లించనున్నట్లు తెలిపారు. భక్తులు, యాత్రికులు తమ ప్రయాణాలను కొద్ది గంటల పాటు వాయిదా వేసుకోవాలని, వీలుంటే రద్దు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు శ్రీశైలం వెళ్లే వాహనదారులు లైసెన్స్లతో పాటు వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తమ వాహనాల్లో కచ్చితంగా ఉంచుకోవాలన్నారు. లైసెన్సులు, ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో పాటు నల్లమల అభయారణ్యంలో ప్రయాణించే యాత్రికులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయటం తీవ్రంగా పరిగణిస్తారన్నారు. అలా ఎక్కడ పడిలే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే చలానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులు పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. శ్రీశైలం వెళ్లే వాహనచోదకులు మద్యం తాగి వాహనాలు నడపటం నేరమని, అధికారులకు పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. నల్లమల అభయారణ్యంలో సుమారు 300 మంది సిబ్బందిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 16వ తేదీ ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు శ్రీశైలం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో నిలిపివేత ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ప్రయాణాలు నిషేధం కర్నూలు వెళ్లే వాహనాలు కుంట, గిద్దలూరు మీదుగా దారి మళ్లింపు -
ఏకేయూలో బీఎడ్ పరీక్షల నిర్వహణ
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ 2వ సంవత్సరం మూడో సెమిస్టర్ విద్యార్థులకు 13వ తేదీ సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ జి.సోమశేఖర మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సోమశేఖర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ అధికారులు 42 మంది అబ్జర్వర్లు, 3 స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే డీబార్ చేస్తున్నామని తెలిపారు. 14వ తేదీ మంగళవారం గిద్దలూరు పరిధిలో జరిగిన పరీక్షలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను స్క్వాడ్ టీం డీబార్ చేశారన్నారు. తాను సీఎస్ఆర్ శర్మ కాలేజీ, శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ సెంటర్లను పరిశీలించినట్లు చెప్పారు. -
కలెక్టర్ను కలిసిన గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డీడీ
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ పీ.రాజాబాబును గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక ప్రకాశం భవన్లోని కలెక్టర్ చాంబర్లో మంగళవారం కలిసిన ఆమె కలెక్టర్కు మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరి అధికారుల మధ్య టైగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, నల్లమల ప్రాజెక్టులో పర్యాటక అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. చీమకుర్తి: గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సమ్మె విరమిస్తున్నట్టు ఫ్యాక్టరీల యజమానుల యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గత 14 రోజుల నుంచి చేస్తున్న సమ్మెను విరమించి బుధవారం నుంచి ఫ్యాక్టరీలను తిరిగి నడపనున్నట్లు యజమానులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు విజయవాడలోని మైన్స్ మంత్రిని కలిశారు. గ్రానైట్ రాయల్టీ వసూళ్లలో ప్రైవేటు ఏజెన్సీ ఏఎంఆర్ కంపెనీ వారు ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీకి రెట్టింపు డబ్బులు అనధికారికంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సూచనల మేరకు మంగళవారం సమ్మెను విరమించాలని సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, కందుల నారాయణరెడ్డి మంగళవారం చీమకుర్తిలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్లో గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులతో సమావేశమయ్యారు. అనంతరం సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. -
ప్రక్షాళనకు వేళాయే!
వేటుతో మొదలాయే..● ఏడాదిన్నరగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పోలీసులు ● సీఐ, ఎస్సైల వ్యవహారశైలిపై నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్న ఎస్పీ హర్షవర్దన్ రాజు ● మహిళల ఫిర్యాదుతోనే పొదిలి సీఐ వెంకటేశ్వర్లుపై వేటు వేసినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం ● మరో సీఐపై కూడా వేటుకు రంగం సిద్ధం ● డ్రంక్ అండ్ డ్రైవ్ వసూళ్లపై సీరియస్ ● ఎస్బీ సిబ్బందిపైనా ఫిర్యాదుల వెల్లువ ● జిల్లాలో భారీగా పోలీసు శాఖ ప్రక్షాళనజిల్లాలో కొంత మంది పోలీసు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్రాజు వీటన్నింటిపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పొదిలి సీఐపై వేటు పడిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొత్త పోలీస్ బాస్ ప్రక్షాళన చేసే దిశగా అడుగలు వేస్తారా అన్నది అన్ని వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్బీలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది వ్యవహారశైలి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. పోలీసు శాఖ ఉద్యోగులుగా కాకుండా అధికారపార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. వారు చక్రం తిప్పి జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని అటాచ్మెంట్ చేయించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపుగా జిల్లాలో పనిచేస్తున్న అత్యధిక శాతం సీఐలు, ఎస్సైల మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో సమగ్రమైన మార్పు తీసుకురావాలంటే చాలామంది వేటు వేయాల్సి వస్తుందని, అది సాధ్యమయ్యే పనేనా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వచ్చాయి. శాంతి భద్రతలను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని పలు సర్కిల్ అధికారులపై, కింది స్థాయి సిబ్బంది అధికార పార్టీ నేతలు అండచూసుకుని రెచ్చిపోతున్నారని విమర్శలు ఉన్నాయి. గత నెల 14వ తేదీ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.హర్షవర్థన్ రాజు తనదైన శైలిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొదిలి సీఐ వెంకటేశ్వర్లును రేంజి వీఆర్కు పంపించడమే కాకుండా ఆఘమేఘాలపై కొత్త సీఐగా రాజేష్ బాధ్యతలను చేపట్టారు. ఇదే తరహాలో మరికొంత మందిపై వేటుపడనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఒంగోలు రూరల్, తాలుకా పోలీసుస్టేషన్లకు కూతవేటు దూరంలో టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి అత్యంత దారుణంగా హత్యకు గురైన తర్వాత జరిగిన పరిణామాలతో అప్పటి తాలూకా సీఐపై మాత్రం వేటువేసి చేతులు దులుపుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ట్రాఫిక్ విభాగంపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరో కీలక అధికారి వ్యవహారంపై కూడా పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కొత్త బాస్ ఒంగోలు నగరంపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లపై రహస్యంగా నివేదిక తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. మహిళల ఫిర్యాదుతోనే పొదిలి సీఐపై వేటు... పొదిలి సీఐ వెంకటేశ్వర్లు మీద తొలి నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి అరోపణలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగత వ్యవహారశైలి గురించి పలు ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలు వన్టౌన్ సీఐగా పనిచేసిన సమయంలో వ్యక్తిగత సమస్య మీద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వేధించడంపై పత్రికలలో కథనాలు వచ్చాయి. మార్టూరు టోల్ ప్లాజా వద్ద ప్రజలంతా చూస్తుండగానే మహిళను కొట్టడం సంచలనం సృష్టించింది. తాజాగా పొదిలి సీఐగా ఉన్న ఆయన పోలీస్స్టేషన్కు వచ్చే మహిళలను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ..విషయాన్ని రేంజి ఐజీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రాత్రికి రాత్రే ఆయన్ను వీఆర్కు పంపించడమే కాకుండా ఆయన స్థానంలో రాజేష్ను నియమించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యాపారంపై సీరియస్... జిల్లా కేంద్రమైన ఒంగోలులో గత ఏడాదిన్నర కాలంగా ట్రాఫిక్ డీఎస్పీ లేకుండానే గడిచిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రంక్ డ్రైవ్లో పట్టుబడిన వాహనాల అసలు జరిమానా కంటే వారి వసూళ్లే అధికంగా ఉండేవని బాధితులు వాపోయారు. మోటారు బైకు దొరికితే అదనంగా రూ.10 వేలు, ఆటో, కార్లు వంటి వాహనాలు దొరికితే రూ.20 వేల వరకు వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా .. జిల్లాలో కొందరు సీఐలు రాజకీయ నాయకులు మద్దతుతో రెచ్చిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. నగరంలోని ఒక ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే మహిళా ఉద్యోగినిని ఇద్దరు సహోద్యోగులు వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఓ సీఐ కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా బేఖాతరు చేయలేదని ఆ మహిళా ఉద్యోగి ఆరోపిస్తున్నారు. గత సోమవారం సదరు మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసు గురించి కూడా ఆయన సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒక ఎస్ఐ తీరుపై కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒంగోలు డెన్పై విమర్శల వెల్లువ... నగరంలోని ఓ పోలీసు అధికారి అనధికార డెన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఏ నేరం జరిగినా డెన్కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సింగిల్ నెంబర్ లాటరీ, గంజాయి కేసుల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ యువకులను తీసుకొచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు కేంద్రంగా పనిచేస్తున్న మరో సీఐపై కూడా ఇదే విధమైన ఫిర్యాదులొచ్చినట్టు సమాచారం. రెండు నెలల క్రితం సదరు సీఐ డిపార్టుమెంట్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని తీసుకొని వైజాగ్ విహారయాత్రకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న గత ఎస్పీ దామోదర్ సీఐకు క్లాస్ పీకడమే కాకుండా సదరు మహిళా ఉద్యోగినిపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ఇక గ్రానైట్ టిప్పర్లు, ఇసుక లారీల నుంచి సైతం భారీగా వసూలు చేస్తున్నారని ఆయనపై వస్తున్న ఆరోపణల విషయంలో కూడా ఎస్పీ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. -
జనార్దనరావు వెనుక ప్రభుత్వ పెద్దలు?
ఒంగోలు సిటీ: కుటీర పరిశ్రమల్లా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు జోగి రమేష్కు ప్రమేయం ఉందంటూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దానిపై ఎల్లో మీడియా రెచ్చిపోతూ, నిన్న సాయంత్రం నుంచే ట్రోల్స్ చేస్తోందన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా కక్ష సాధింపులకు పాల్పడడం, కేసు నుంచి తాము బయట పడేందుకు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం చంద్రబాబు చేసిన కుట్ర అని దుయ్యబట్టారు. ‘‘అసలు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అద్దేపల్లి జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? పైగా తన ఫోన్ పోయిందని చెప్పినట్లు ఎల్లో మీడియాలోనే వచ్చింది. అలాగే ఏ కేసులో నిందితుడైనా, ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నిలబడి, చేతులు కట్టుకుని వినమ్రతతో మాట్లాడతారు. కానీ నిన్న జనార్దనరావు లీక్ చేసిన వీడియోలో ఆయన చక్కగా చైర్లో కూర్చుని ఉన్నాడు. పక్క నుంచి ఆఫీసర్ ఎవరో ప్రామ్ట్ చేస్తునట్లుగా ఉంది. పైగా తను ఆఫ్రికా నుంచి వచ్చినప్పటి డ్రెస్తోనే ఉన్నాడు. మరి ఆ వీడియో ఎప్పుడు, ఎవరు, ఎవరి ఫోన్లో రికార్డు చేశారు? ఇదంతా చూస్తుంటే, ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర మాదిరిగా కనిపించడం లేదా’’ అని వరికూటి సూటిగా ప్రశ్నించారు. అలాగే ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అన్నది తేలాలన్నారు. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోందని, పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. జనార్దనరావు గత వారం ఆఫ్రికా నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడని, నకిలీ మద్యం తయారీలో పార్టీ, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని, తాము మాత్రమే ఆ పని చేశామని చెప్పుకొచ్చాడన్నారు. ఆ రోజే మరి నిజంగా జోగి రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని, రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేసిన విషయాన్ని ఆ వీడియోలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కేసులో ఏ–1 నిందితుడైన జనార్దనరావు చంద్రబాబుకు అంతటి సన్నిహితుడేనని, 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దనరావు అక్కడే ఉన్నాడన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్దనరావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతమన్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా జనార్దనరావుకు జోగి రమేష్ సన్నిహితుడన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథన్నారు. నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వ్యక్తి ఓ కార్పొరేట్ పారిశ్రామికవేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన ధీమా వెనుక దన్ను ఎవరు? కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారని ఆరోపించారు. అంత హడావుడిగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు? వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టు కథలు చెప్పాలన్న ముఖ్యనేత ఆదేశించారన్నది నిజం కాదా అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేశ్కు ఆయన నిజంగానే సన్నిహితుడే అయితే ఇంత హడావుడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చేయలేరు కదా? అంటే జనార్దన్రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కథ అన్నది స్పష్టమవుతోందన్నారు. అసలు జనార్దనరావు ఫోను గుట్టు విప్పితే దీని వెనకాల ఉన్న బడా వ్యక్తుల జాతకాలు బయటకు వస్తాయన్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం రాకెట్ బయటపడిన రోజు మీడియాతో మాట్లాడిన ఎకై ్సజ్ అధికారులు, అక్కడ ఈ ఏడాది మే, జూన్ నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పారన్నారు. ఇప్పుడు జనార్దనరావు తన వీడియోలో గత ప్రభుత్వ హయాం నుంచి జోగి రమేష్ చెప్పడం వల్లనే నకిలీ మద్యం తయారు చేశానని చెబుతున్నారని, దానికి, దీనికి లింక్ కుదరడం లేదన్నారు. బాబు మాటలే జనార్దనరావు వీడియో.. జనార్దనరావు వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, అందులోని విషయాలపై ముందురోజు రాత్రే.. అంటే ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు? అంటే ఆ వీడియో విడుదల కానుందని, అందులో ఏం మాట్లాడారన్న సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రమేయం ఉందని చంద్రబాబు ఆదివారం రాత్రి చెప్పిన విషయాలే.. సోమవారం విడుదలైన జనార్దన్రావు వీడియోలోనూ ఉండటం వెనుక లోగుట్టు ఏమిటన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఇదంతా ఒక పక్కా వ్యూహం ప్రకారం విపక్ష వైఎస్సార్ సీపీపై బురద చల్లుతూ, తాము ఈ కేసు నుంచి బయట పడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రన్నారు.. ఒక్క మాటలో చెప్పాల్చంటే.. పెదబాబు, చినబాబు చేసిన కుట్ర, కుతంత్రం ఇదంతా? అది నిజం కాదని చెప్పే ధైర్యం ఆ ఇద్దరికీ ఉందా? అని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డిని ఎందుకు తీసుకురావడం లేదు.. ములకలచెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం లేదని వరికూటి ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని నిలదీశారు. నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారన్నారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారన్నారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం రాష్ట్రమంతా విస్తరించిందని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. నిజంగా జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారు చేస్తే.. తాను జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే ఆ మద్యాన్ని రవాణా చేశానని జయచంద్రారెడ్డి డ్రైవర్ చెప్పారు. మరి అక్కడ కూడా జోగి రమేష్ చెబితేనే ఆ రవాణా జరిగిందా? అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నట్లు నకిలీ మద్యం కేసుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని వైన్షాప్లు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టు షాప్ల్లో తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ఏది అసలు మద్యం? ఏది నకిలీ అనేది గుర్తించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. -
17న జాబ్ మేళా
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న ఎస్ఎన్పాడు మండలంలోని ఎండ్లూరి డొంకలోని మహిళా ప్రాంగణంలో ‘జాబ్ మేళా‘ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రాజా బాబు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఛాంబర్లో అందుకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో హెటెరో లాబ్స్, శ్రీ చక్ర హ్యుందాయ్, ఎంఆర్ఎఫ్, బ్రహ్మ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, భారత్ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, పీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, తిరుమల ఆటోమోటివ్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు తమ అర్హత ప్రకారం ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. బీటెక్, డిగ్రీ, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, పీజీ వంటి అర్హతలున్న అభ్యర్థులకు వివిధ రంగాల్లో అవకాశాలు లభించనున్నాయి. జిల్లా యువత తమ రిజిస్ట్రేషన్ను రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తి చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు: 99888 53335, 87126 55866, 87901 18349, 87901 17279 ఈ నంబర్లతో పాటు కార్యాలయంలో అందుబాటులో సంప్రదించవలసిన ఎస్.కె. బాషా: 99630 05209 ను కూడా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె.రవితేజతో పాటు ఇతర ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శానిటేషన్ పరిశీలించిన డీపీఓ
సంతనూతలపాడు: మండల కేంద్రమైన సంతనూతలపాడులో మంగళవారం శానిటేషన్, ఓహెచ్ఎస్ఆర్, తాగునీటి ట్యాంకు, ఎస్ డబ్ల్యూపీసీ కేంద్రం, గార్బేజ్ కలెక్షన్, స్వామిత్వ సర్వేలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పరిశీలించారు. వాటర్ ట్యాంక్ వద్ద ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా వాటర్ టెస్టింగ్ చేయించారు. 15 రోజులకు ఒకసారి ఓహెచ్ ఎస్ఆర్ ట్యాంకును క్లీన్ చేయాలని డీపీఓ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రం చేయించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో డి.సురేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో పి.రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజినీర్ మధుసూదన్రావు, పంచాయతీ కార్యదర్శి ఎన్.ప్రతాప్ కుమార్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ చక్రధర్, నియోజకవర్గ రిసోర్స్ పర్సన్ జయశంకర్, గ్రామపంచాయతీ ప్రతినిధులు బాబురావు, శిఖామణి, పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, క్లాప్ మిత్రలు పాల్గొన్నారు. -
నాణ్యం పేరుతో కల్తీ మద్యం
యర్రగొండపాలెం: కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనస్సులో పెట్టుకొని నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన ఏకై క నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి, ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాజకీయ చరిత్రలో కనీసం నాణ్యమైన మంచి నీళ్లు ఇచ్చిన చరిత్ర లేదని ఆయన విమర్శించారు. బాబు మాటలు నమ్మిన మద్యం ప్రియుల నోట్లో మట్టి కొడుతున్నాడని, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం సరఫరా చేసి వారి ప్రాణాలను హరిస్తున్నాడని విమర్శించారు. కూటమి నాయకులు దోపిడీనే లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా దోచుకోమని వాళ్ల ఎమ్మెల్యేలకు, నాయకులకు ఈ వ్యాపారాన్ని అప్పచెప్పాడని, సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు సినిమాలు అప్పచెప్పినట్లు మద్యం వ్యాపారాన్ని దళారులకు అప్పచెప్పాడని అన్నారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అయ్యనపాత్రుడి పక్కనే ఉన్న నాయకుడికి, బనగానిపల్లెలో ఆ నియోజకవర్గ ఇన్చార్జికి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఇంకొక నాయకుడికి, కృష్ణ, గుంటూరును అక్కడ ఉన్న ఒకరికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడని, రాష్ట్రంలో ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతోందని అన్నారు. జగనన్న పాలనలో ఒక్క బెల్ట్ షాపు ఉండేదికాదని, ఆయన పాలనలో రాష్ట్రంలో ఉన్న 40 వేల బెల్ట్ షాపులు తీసివేయిస్తే అప్పట్లో మద్యం అమ్మకాలు తగ్గాయని, అర్ధరాత్రి మద్యం సీసా దొరికేది కాదని అన్నారు. ప్రతి చోట పిప్పరమెంట్ దొరకదేమో కానీ నారావారి కల్తీ బుడ్డి దొరుకుతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కాలంలో ప్రతి సంవత్సరం 10 శాతం మద్యం అమ్మకాల్లో ఆదాయం వచ్చేదని, మద్యం అమ్మకాలు తగ్గాయని, ఆదాయం పెరిగేదని, ఈ రోజు అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, ఆదాయం మాంత్రం 3 శాతానికి పడిపోయిందని అన్నారు. 10 శాతం నుంచి 3 శాతానికి ఆదాయం పడిపోయిందంటే మిగిలిన ఆ డబ్బు కూటమి ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తోందని అన్నారు. ఊరూరా వెలిసిన ఈ సారా కొట్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని, తక్షణమే ఎకై ్సజ్ శాఖవారు జోక్యం చేసుకొని వీటిని అదుపు చేయకపోతే మహిళలే ఆ షాపులపై తిరగబడతారని హెచ్చరించారు. 30 వేల మంది కల్తీమద్యం బారినపడి చనిపోయారని సిగ్గులేకుండా టీడీపీ నాయకులు చెప్పారని, చనిపోయిన వారిపేర్లు ఈ నాటివరకు చెప్పడంలేదని, కల్తీమద్యంతో పట్టుబడిన టీడీపీ నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగిందని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాన్ని ఆపాలని, మద్యం, వ్యవసాయం, మట్టి, ఇసుక, గనులను ప్రైవేటు వారికి అమ్మేస్తున్నాడని, ఈ రోజు గ్రానైట్ ఇండస్ట్రీ పనిచేయడం లేదని, ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి సీనరేజ్లు వసూలు చేస్తున్నారని అన్నారు. జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీని తమకు అనుకూలమైన ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశాడని, ఇటువంటి ఒంటెత్తు పోకడలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మరో నేపాల్ మాదిరి గా ఆంధ్ర రాష్ట్ర మారుతుందని హెచ్చరించారు. -
హాస్టళ్లు తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సోమవారం పట్టణంలో ఉన్న హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ బాలికలు, బాలుర హాస్టళ్లలో ఉన్న విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఆయా వసతి గృహాల్లో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. శుభ్రమైన భోజనం, శుద్ధి చేసిన నీటిని విద్యార్థులకు అందించాలని వార్డన్లకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి ఉన్నారు. ఒంగోలు సబర్బన్: సురక్షితమైన జీవితానికి ఏడు సూత్రాలు పాటిస్తే అనారోగ్యంపాలు కాకుండా చేసుకోవచ్చని కలెక్టర్ పీ.రాజాబాబు పేర్కొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ముద్రించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని మీ కోసం భవన్లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, యూనిసెఫ్, విజయ వాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ పీ.రాజాబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ముఖ్యమైన ఏడు సందర్భాల్లో చేతులను కడుక్కోవడం అలవాటుగా చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్ఓ ఓబులేసు, జిల్లా విద్యాధికారి కిరణ్ కుమార్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ టీ రంగారావు, వాష్ ప్రోగ్రాం ప్రతినిధి కే మరియబాబు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని పాకల బీచ్కు ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ప్రజా రవాణాధికారి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొదిలి ఆర్టీసీ డిపో నుంచి ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు ట్రిప్పులు వేసినట్లు చెప్పారు. కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి కందుకూరు మీదుగా 4 బస్సు సర్వీసులు, కందుకూరు డిపోలో 6 బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూపుల వారీగా వనభోజనాలకు వెళ్లే వారికి అద్దె ప్రతిపాదికన ప్రత్యేక బస్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
కడలి వెంట కన్నీటి చూపులు
చీరాల: కడలి కెరటాలు ఆ కుటుంబాలలో కన్నీటిని మిగిల్చాయి. సరదాగా సేద తీరేందుకు చీరాల ఓడరేవు తీరానికి వచ్చి సముద్రస్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతైన ఐదుగురు విద్యార్థులలో ఆదివారమే ముగ్గురు మృతదేహాలు లభ్యమవగా, సోమవారం మరో విద్యార్థి మృతదేహం తీరానికి చేరింది. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అమరావతిలోని విట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్న ఏడుగురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల ఓడరేవు సముద్రతీరానికి వచ్చి గల్లంతైన విషయం విధితమే. స్థానిక మత్య్సకారులు గమనించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకురాగా, సాయి మణిదీప్ (జడ్చర్ల), జీవన్ సాత్విక్ (హైదరాబాద్), శ్రీసాకేత్ (హైదరాబాద్) గల్లంతయ్యారు. కొంత సమయం తర్వాత ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. భోరుమన్న గౌతమ్ కుటుంబ సభ్యులు... మరో ఘటనలో వేటపాలెం మండలం వడ్డె సంఘానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఆదివారం గల్లంతయ్యారు. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా వీరి ఆచూకీ లభించలేదు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా వాడరేవు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మైరెన్, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా తీరం వద్దనే వేచి ఉన్నారు. సోమవారం ఉదయం తీరానికి గౌతమ్ కృష్ణప్రసాద్ మృతదేహం వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి... ఆదివారం లభ్యమైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు, సోమవారం తీరానికి చేరిన మరో విద్యార్థికి మృతదేహానికి చీరాల ఏరియా వైద్యశాలలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థులు గల్లంతైన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన చీరాల వచ్చి ఏరియా వైద్యశాలలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పెద్ద చదువులు చదువుకుని ఆసరాగా నిలుస్తారని అనుకుంటే అందరినీ వదిలి వెళ్లిపోయారా అంటూ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. ఐదో విద్యార్థి షారోన్ ఆచూకీ లభించకపోవడంతో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, ఆర్డీఓ చంద్రశేఖర్నాయుడు, చీరాల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చీరాల ఓడరేవు తీరానికి వచ్చిన గౌతమ్ మృతదేహం విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి జాడలేని షారోన్ తీరంలో గాలింపు చర్యల కొనసాగింపు -
విద్యుదాఘాతానికి బేల్దారి కూలీ మృతి
కంభం: విద్యుదాఘాతానికి బేల్దారి కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..కందులాపురం కూడలి సమీపంలో నిర్మాణంలో ఓ గృహం వద్ద పసుపుల పెద్ద గురువయ్య(53) అనే వ్యక్తి పనిచేస్తున్న సమయంలో ఆ గృహానికి ముందు భాగంలో ఉన్న విద్యుత్లైన్ తీగలకు తగిలి షాక్ గురై కిందకు పడిపోయాడు. అతన్ని వెంటనే కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
గడువు లోగా పరిష్కరించాలి
● ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువు లోగా చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన శ్రీప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, పార్ధసారధి, విజయజ్యోతిలు అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, ఆ నమ్మకాన్ని ప్రతి అధికారి నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి అర్జీని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీఆర్పై మాక్డ్రిల్ ఈ సందర్భంగా సీపీఆర్పై మాక్డ్రిల్ నిర్వహించారు. ఆకస్మాత్తుగా ఎవరైనా గుండెపోటుతో పడిపోతే ఏ విధంగా సీపీఆర్ చేయాలో వైద్యులు అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహిచంచారు. ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, డీసీహెస్ డార్టర్ సూరిబాబు, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సీపీఆర్ చేయాల్సిన పద్ధతిని వివరించారు. -
కేసు నమోదు చేయాలంటూ ఆందోళన
మార్కాపురం: లారీ డ్రైవర్ను కొట్టిన ఓనర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ తరఫు వారు సోమవారం మార్కాపురం పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పట్టణంలోని సుందరయ్యకాలనీలో నివాసముండే లారీ డ్రైవర్ నారాయణ మద్యం తాగాడని మూడు రోజుల క్రితం చీమకుర్తికి చెందిన లారీ ఓనర్ మర్రిచెట్లపాలెం సమీపంలో తీవ్రంగా కొట్టాడు. దీంతో పొదిలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నారాయణ చికిత్స పొందాడు. ఈ సంఘటనకు సంబంధించి లారీ ఓనర్పై మార్కాపురం పోలీసుస్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేయాలని సీపీఎం నాయకుడు రూబెన్, మరికొంత మంది సుందరయ్యకాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, కాలనీవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ విధులను అడ్డుకోవద్దంటూ ఎస్సై సైదుబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంతసేపు స్వల్ప ఉద్రిక్తత కూడా నెలకొంది. సీపీఎం నాయకుడు రూబెన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సీపీఎం నాయకుడు రఫీ, తదితరులు స్టేషన్కు చేరుకుని మాట్లాడారు. అనంతరం వివాదం సద్దుమణిగింది. కాగా, మార్కాపురం పట్టణ ఎస్సై తన విధులకు ఆటంకం కలిగించారంటూ సీపీఎం నాయకుడు రూబెన్పై కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేసిన దేవరాజు, మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గనుల శాఖపై నిరంతర పర్యవేక్షణ
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: గనుల శాఖకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ పి.రాజాబాబు గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గనుల శాఖ అధికారులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, ప్రభుత్వానికి రావాల్సిన రాబడిపై, గనుల రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.432.94 కోట్లు రాబడి లక్ష్యం నిర్దేశించగా, సెప్టెంబర్ నెల వరకు రూ.157.08 కోట్లు వచ్చిందన్నారు. జిల్లాలో మేజర్, మైనర్ మైనింగ్ క్వారీలు ఉండగా, అందులో 144 క్వారీలు పనిచేస్తున్నాయని, 132 క్వారీలు పనిచేయడం లేదని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రాబడి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మైనింగ్పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగరాదని స్పష్టం చేశారు. జిల్లాలో ఏ కారణం చేతనైనా మైనింగ్ క్వారీ జరగకపోతే సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ గనుల శాఖ డీడీని ఆదేశించారు. -
శివాలయంలో చోరీ
దొనకొండ: మండలంలోని మంగినపూడి శివాలయంలో దుండగులు ఆదివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. శివాలయం గేటు తాళం పగలకొట్టి కానుకల హుండీని తీసుకువెళ్లి పక్కనే చెరువులో పడేసి, అందులోని కానుకలను తీసుకువెళ్లారు. శివాలయం ఎదురు బడ్డీ కొట్టులో తాళం పగలకొట్టి అందులోని పెట్రోలు, ఇతర తిను బండారాలు, సిగరెట్లు, కూల్డ్రింక్స్ సీసాలు, కొంత నగదు తీసుకువెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే శివాలయంలో చోరీకి పాల్పడి విలువైన వస్తువులు అపహరించారని గ్రామస్తులు తెలిపారు. రెండు చెక్ బౌన్స్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష ఒంగోలు: రెండు వేర్వేరు చెక్ బౌన్స్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి వి.వెంకటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. వెలిది బాలాజీ బాబు అనే వ్యక్తి వద్ద నలగర్ల ప్రసాద్ అనే వ్యక్తి రెండు దఫాలుగా రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ చెల్లింపు నిమిత్తం రూ.9,03,800 విలువైన చెక్కు జారీచేయగా, దానిని వెలిది బాలాజీ బాబు బ్యాంకులో జమచేయగా బౌన్స్ అయింది. దీంతో బాలాజీ బాబు కోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయమూర్తి.. నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితుడు నలగర్ల ప్రసాద్కు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో పాటు ఫిర్యాదికి రూ.17,97,600 చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు జరిమానా విధించారు. మరో కేసులో... చిల్లర నందకిషోర్ అనే వ్యక్తి వద్ద పొత్తూరి బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ నిమిత్తం రూ.8 లక్షలకు చెక్కు జారీ చేయగా నందకిషోర్ బ్యాంకులో జమచేశాడు. అది బౌన్స్ అయినట్లు నిర్ధారణ అయింది. దీంతో నంద కిషోర్ కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన న్యాయమూర్తి నేరం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, ఫిర్యాదికి రూ.12 లక్షలు చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు జరిమానా విధించారు. -
బస్సుల్లో ఎక్కించుకోవాలని భక్తుల ఆందోళన
పెద్దదోర్నాల: శ్రీశైలం వెళ్లే బస్సుల్లో తమను ఎక్కించుకోవాలంటూ పలువురు భక్తులు ఆర్టీసీ బస్సుల ఎదుట ఆందోళన నిర్వహించి ఆర్టీసీ బస్సులను నిలువరించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పెద్దదోర్నాల ఆర్టీసీ బస్టాండులో చోటు చేసుకుంది. వివరాల మేరకు రెండవ శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు దినాలు కావటంతో మండల కేంద్రంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులతో రద్దీ నెలకొంది. దీంతో శ్రీశైలం వెళ్లే పలు వాహనాలు యాత్రికుల రద్దీతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మండల కేంద్రంలో రద్దీ ఎక్కువ కావటంతో శ్రీశైలం వెళ్లే ప్రతి బస్సు వద్ద యాత్రికులు ఎగబడ్డారు. అయితే ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ఘాట్ రోడ్లలో పరిమితికి లోబడి ప్రయాణికులతో వెళ్లాలన్న నిబంధనలు ఉండటంతో కొంత మంది ఆర్టీసీ సిబ్బంది అధిక లోడు ప్రయాణికులతో వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో తాము మూడు గంటల నుంచి బస్సుల కోసం కాసుకుని ఉన్నా తమను బస్సుల్లో ఎక్కించుకోలేదని కొందరు ప్రయాణికులు ఆందోళన నిర్వహించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో స్పందించిన ఆర్టీసీ కంట్రోలర్లు భక్తులకు నచ్చబెప్పి ప్రతి బస్సులో కొందరు ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించటంతో గొడవ సద్దుమణిగింది. -
అధికారులా.. రౌడీలా?
యర్రగొండపాలెం: రెవెన్యూ అధికారులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, బోగస్ ఇంటి స్థల పట్టాలని చెప్పి నిర్మాణాల్లో ఉన్న గృహాలను వారు దౌర్జన్యంగా కూలగొట్టించారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. స్థానిక కొప్పుకొండకు సమీపంలో ఉన్న వెంకటగిరి కాలనీలో గుడిసెలు, నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలు, నీటి తొట్లు కూల్చివేయించారని ఆ ప్రాంతం గిరిజనులు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించి ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లి ఆ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997, 2008 సంవత్సరాల్లో ప్రభుత్వం చెంచు గిరిజనులకు ఇచ్చిన ఇంటి పట్టాలు బోగస్ పట్టాలని తహసీల్దార్ కూలకొట్టించడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో పట్టాలు ఇచ్చిన తహసీల్దార్లు బోగస్ పట్టాలు మంజూరు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ అవి బోగస్ పట్టాలని ఏ విధంగా నిర్ధారించారని, చెంచు గిరిజనులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఉన్న నిర్మాణాలను కూలగొట్టించడం హేయమైన చర్యఅని ఆయన అన్నారు. కొంతమంది టీడీపీ నాయకులు ఆ స్థలాలపై కన్నేసి, వాటిని కాజేయటానికి వేసిన పన్నాగాన్ని అధికారులు సమర్ధించి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దొంగలు రాజ్యమేలుతున్నారని, ఈ ప్రభుత్వం పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వలేకపోయినా.. సొంతంగా నిర్మించుకుంటున్న గృహాలను కూల్చివేయిస్తోందని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో గిరిజనులకు ఇంటి పట్టాలు ఇవ్వకుంటే రూ.1.80 కోట్లతో ఐటీడీఏ నిధులు ఖర్చుపెట్టి తారు రోడ్డు ఎందుకు వేయించిందని, తాగు నీటి కోసం బోరు ఏ విధంగా వేయించారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో గిరిజన కాలనీలు ఉన్నాయన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఐటీడీఏ నిధులను కేటాయించిన విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోకుండా టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా వ్యవహరిస్తున్నారని, గిరిజనులు గృహ నిర్మాణాలు చేయనీయకుండా గిరిజనులను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తామని, గిరిజనులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, సర్పంచ్ ఆర్.అరుణాబాయి, వివిధ విభాగాల నాయకులు సయ్యద్ జబీవుల్లా, కందూరి కాశీవిశ్వనాథ్, ఆవుల కోటిరెడ్డి, బి.బాలచెన్నయ్య ఉన్నారు. -
జూనియర్ చాంబర్ అధ్యక్షుడిగా శబరీనాథ్
ఒంగోలు టౌన్: జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఛాప్టర్ అధ్యక్షుడిగా పి.శబరీనాథ్ నాయర్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కె.వీరబ్రహ్మం, కోశాధికారిగా జె.శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మాంటిస్సోరి స్కూల్లో జూనియర్ చాంబర్ వార్షిక సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో 2026వ సంవత్సరానికి గాను నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోనంకి వరుణ్ కుమార్, పి.రామాంజనేయులు, ఏడుకొండలు, శ్రీరాములు రెడ్డి, నాగేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సమావేశంలో జేసీఐ పూర్వాధ్యక్షులు టి.రవికుమార్, కనకారావు, అద్దంకి శ్రీనివాసరావు, వివి రమణ, ఇస్మాయిల్, ఈపూరి శివప్రసాద్, ఆంద్ర శ్రీనివాసరావు, జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలు మంగమూరు రోడ్డులో బైపాస్ వద్ద ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి నెలా ఒక నియోజకవర్గంలో జిల్లా కమిటీ, స్థానిక సంఘీయులతో చర్చించి స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు చెరిగిచర్ల ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు పులివర్తి సాయిబాబా, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి పావులూరు బ్రాహ్మణచారి, కీనల శ్రీనివాసచారి, సన్నమూరి వీరబ్రహ్మం, పదిరి ఆదినారాయణ, చెరుకూరి ఓంకార చారి, పచ్చవ సుబ్రహ్మణ్యం, వేల్పూరి రామారావు, రాచకుళ్ళ రవికుమార్, పోతులూరి వీరబ్రహ్మం, మునిగంటి వెంకటేశ్వరచారి, పోతులూరి శివ, బ్రహ్మచారి, మునగంటి విశ్వరూపచారి, అలుగుపల్లి శ్రీనివాసచారి, గోనుగుంట దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
తాళ్లూరు: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శివరాంపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు. గుమ్మడి ముత్యాలు, సుజాత కుమారుడు గుమ్మడి సన్నీ (20 ) ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కావడంతో గ్రామంలోని కొంత మంది యువకులతో కలిసి పెద్దసాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో సన్నీ నీటిలో మునిగి మృతి చెందాడు. మృతునికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సింగరాయకొండ: దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళితే..మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్ 3వ లైనులో నివసిస్తున్న కొల్లా వినయ్పై ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఊళ్లపాలెంకు చెందిన కొల్లా సాయి చరణ్, జరుగుమల్లి మండలం సతుకుపాడు గ్రామానికి చెందిన బల్లికుర సుమంత్ దాడి చేశారు. బాధితుడు వినయ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇద్దరు నిందితులను శనివారం సాయంత్రం కందుకూరు ఫ్లైఓవర్ వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఒంగోలు టౌన్: నగరంలోని బైపాస్ రోడ్డులో డంపింగ్ యార్డు వద్ద అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్న 20 ట్రాక్టర్లను పోలీసులు పటుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసిన వ్యక్తిని కాదని అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్స్ రద్దు చేయాలని ప్యూచర్ ట్రేడ్స్కు చెందిన భరత్ ఇటీవల మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్కు వినతిపత్రం అందజేయడంతో ఇసుక అక్రమ విక్రయాల వ్యవహారం బట్టబయలైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నగరంలో అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్న 20 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్ సీఐ విజయకృష్ణ నిర్ధారించకపోవడం గమనార్హం. -
విషతుల్యం
కూటమి నేతలు ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లక్షలాది మందికి నీటి సరఫరా చేసే విషయంలో కాసులకు కక్కుర్తి పడి కలుషిత జలాలతో జనాలను అనారోగ్యం పాలుచేస్తున్నారు. రక్షిత మంచినీరు బదులు మురుగునీటిని సరఫరా చేస్తున్నా అటు పాలకులు, ఇటు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణజలం..దర్శి: దర్శి పట్టణం నుంచి దర్శి, పొదిలి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు చెందిన ప్రజలకు నిత్యం సాగర్ జలాలు సరఫరా చేసేందుకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఎన్ఏపీ (నెదర్లాండ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్) సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించారు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రూ.4 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. సాగర్ కాలువ నుంచి వచ్చే జలాలను స్టోరేజ్ ట్యాంకుకు మోటార్ల ద్వారా సరఫరా చేసి వాటిని శుద్ది చేసి నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు చేశారు. ప్రారంభంలో దీని ద్వారా దర్శి, కనిగిరి, పొదిలి ప్రాంతాలకు నిత్యం రెండు లక్షల మందికి తాగునీరు అందించేవారు. 930 మీటర్ల మట్టికట్టతో 2538 మిలియన్ లీటర్ల పరిమాణం కలిగిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీటిని శుద్ధి చేసేందుకు 7 శాండ్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేశారు. 5 లక్షల లీటర్ల నీటి పరిమాణం కలిగిన క్లియర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను కూడా నిర్మించారు. ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసిన జలాలను నేరుగా క్లియర్ వాటర్ ట్యాంక్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో దర్శి, పొదిలి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు నీటిని పంపేవారు. తర్వాత మర్రిపూడి, కనిగిరి మండలాలకు సైతం నీటిని సరఫరా చేశారు. ఈ నీటిని సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించేవారు. కాంట్రాక్టు పొందిన వ్యక్తి నీటిని క్రమం తప్పకుండా శుద్ధి చేసి పంపిణీ చేయాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా అంతా సక్రమంగా జరిగింది. రోజు విడిచి రోజు నీటిని పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. అంతేకాకుండా నీటి శుద్ధి చేయకుండా సరఫరా చేస్తున్నారు. సాగర్ కాలువ కట్టపై ఉన్న డంపింగ్ మురుగు వర్షాలకు సాగర్ కాలువలోకి చేరుతోంది. ఆ నీటినే నేరుగా మంచినీటి రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నానని, ఆ నీటిని కనీసం శుద్ధి చేయకుండా అలాగే నేరుగా క్లియర్ వాటర్ ట్యాంక్కు సరఫరా అవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిల్టర్ చేయకుండా నేరుగా నీటిని సరఫరా చేస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి మినరల్ వాటర్ కొనుగోలు చేయలేక సాగర్ జలాలు వాసన వస్తున్నా గత్యంతరం లేక ఆ నీటిని తాగాల్సి వస్తోందని వాపోతున్నారు. టెండర్ల దశలోనే తిరకాసు.. గత ప్రభుత్వంలో ఈ నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టరు ద్వారా నీటిని సరఫరా చేసే వారు. నీటి పంపిణీకి సంబంధించి దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులకు విడివిడిగా టెండర్లు పిలిచేవారు. దర్శికి సంబంధించి రూ.2 కోట్లు, తాళ్లూరు మండలానికి రూ.76.5 లక్షలు, ముండ్లమూరు మండలానికి రూ.98 లక్షలు చెల్లించేలా టెండర్లను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పిలిచేవారు. మొత్తంగా రూ.3.735 కోట్లకు సంబంధించిన టెండర్లను వైఎస్సార్ సీపీ హయాంలో 30 శాతం తక్కువకు టెండర్ వేసేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ నీటిని శుద్ధి చేస్తూ రోజు విడిచి రోజు నీటిని అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టెండర్ల దశలో అంతా గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరూ పోటీకి రాకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కేవలం ఒక శాతం తక్కువ కోడ్ చేసి దక్కించుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. అయితే తాను చేసే పనిలో అధిక మొత్తంలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధికి భారీగా నజరానా చెల్లించాడని సమాచారం. కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి నీటి సరఫరాకు సంబంధించి కనీస నిబంధనలు పాటించడంలేదని తెలుస్తోంది. నీటిని శుద్ధి చేయడంలేదని, కనీసం బ్లీచింగ్ కూడా వేయకుండా అలాగే సాగర్ జలాలు గ్రామాలకు మురుగు నీరుగా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పురుగులను నిర్మూలించేందుకు గ్యాస్ లేదా బ్లీచింగ్ కూడా నీటిలో కలుపకుండా అలాగే సరఫరా చేయడంతో అందులో పురుగులు కూడా వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టిమట్టిగా నీరు రావడమే కాకుండా దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. నిండుగా నీరున్నా వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఫలితంగా తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలుషిత నీరు వస్తున్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఏపీ రిజర్వాయర్ -
ఫిల్టర్ బెడ్ సంపులో జారిపడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఒంగోలు టౌన్: నగర పాలక సంస్థలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి నగరంలోని ఒక మంచినీటి సంపులో జారిపడి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక చెరువుకొమ్ముపాలేనికి చెందిన సీతారాం శ్రీనివాస్ (30) నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతంలో చెరువుకొమ్ముపాలెంలో ఐదేళ్లపాటు పనిచేసిన శ్రీనివాస్.. ఆరు నెలల కిత్రం ఒంగోలు వచ్చి నగరంలోని బాలాజీరావుపేట ఫిల్టర్ బెడ్స్లో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాత్రి 12 గంటల సమయం తర్వాత నైట్ డ్యూటీలో వుండగా పొరపాటున సంపులో జారిపడి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఆదివారం ఉదయం మృతదేహం నీటిపై తేలియాడుతుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఒంగోలు వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థ వద్ద ధర్నా ఒంగోలు సిటీ: నారాయణ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం టాలెంట్ టెస్ట్లు నిర్వహించడం నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సీహెచ్ వినోద్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని నారాయణ విద్యా సంస్థ వద్ద ఆదివారం ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి అధ్యక్షత వహించగా, వినోద్ మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల పట్ల విద్యాశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. నారాయణను మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందన్నారు. నారాయణ విద్యాసంస్థ అడ్మిషన్ల పక్రియలో భాగంగా టాలెంట్ టెస్ట్ పేరుతో విద్యార్థుల వద్ద నుంచి రూ.100 వసూలు చేసి గెలుపొందిన విద్యార్థికి కోటి రూపాయలు ఇస్తామని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల కోసం ఈ విధమైన టాలెంట్ టెస్టులు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. పేద విద్యార్థుల పట్ల నారాయణ విద్యాసంస్థలకు నిజంగా ప్రేమ ఉంటే ఆ విద్యాసంస్థల్లో 10 శాతం సీట్లు ఉచితంగా పేదలకు కేటాయించి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. మళ్లీ టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తే తప్పనిసరిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్, పాండురంగారావు, సాయి, గంగాంజీ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ● బంగారం, వెండి, నగదు అపహరణ సంతమాగులూరు (అద్దంకి రూరల్): తాళం వేసిన ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బంగారం వెండి, నగదు దొంగిలించిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రులో జరిగింది. సంతమాగులూరు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. కందుర్రు గ్రామంలో ఎస్కే ఖాశింసైదా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళాలు వేసి పనిమీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తుతెలియని వారింటి తాళాలు పగులగొట్టి బీరువా తెరిచి రూ.20 వేల నగదు, సవర బంగారం, 35 తులాల వెండి వస్తువులు అపహరించారు. ఇంటికి వచ్చిన ఖాశింసైదా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేశారు. ఒంగోలు టౌన్: పొదిలి సీఐ వెంకటేశ్వరరావును వీఆర్కు పంపించారు. ఆ మేరకు ఐజీ కార్యాలయం నుంచి ఆదివారం ఉత్తర్వులు వచ్చాయి. ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న యు.రాజేష్ను నియమించారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. రాజేష్ గతంలో జిల్లాలోని పామూరు, కంభం సీఐగా పనిచేసి ఉన్నారు. పొదిలి సీఐ వెంకటేశ్వరరావు మీద పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. -
ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం.. సమాచార హక్కు చట్టం
● ర్యాలీలో డీఆర్ఓ ఓబులేసు ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు అన్నారు. సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలులో ర్యాలీ, సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ సమాచర హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ, సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రజలడిగిన సమాచారాన్ని అధికారులు అందించాలన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం విజయవాడలోని ప్రధాన సమాచార కార్యాలయం వర్చువల్గా కూడా విచారణ నిర్వహిస్తోందని, ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ జ్యోతి, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదనరావు, ఒంగోలు రూరల్ డిప్యూటీ తహసీల్దార్ కుట్టుబోయిన అశోక్ కుమార్, రూరల్ ఆర్ఐ శ్రీకంఠ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేతల మేత.. పేదలకు వాత..!
మార్కాపురం: జిల్లాలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులే రేషన్ డీలర్లుగా అవతారమెత్తి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి స్వాహా చేస్తున్నారు. కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ జరగక లబోదిబోమంటున్నారు. జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ఇటీవల నాగులుప్పలపాడు, పొన్నలూరు, మార్కాపురం ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కేసులు మాత్రమే నమోదు చేసి బయటకు తెలుస్తుండగా, జిల్లావ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా విచ్చలవిడిగా రేషన్ దందా సాగుతోంది. రేషన్ కార్డుదారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు రేషన్ పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘ సమావేశాలు మొక్కుబడిగా సాగుతుండటంతో అక్రమార్కులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా.. పట్టించుకునేవారు లేకపోవడంతో కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6,37,820 రేషన్కార్డులు, 1,392 రేషన్ దుకాణాలు... జిల్లాలో రేషన్ పంపిణీ ఒక ప్రహసనంలా మారింది. బియ్యానికి బదులుగా కిలోకు 10 రూపాయల డబ్బులిస్తామని, తీసుకుంటే తీసుకోండి.. లేదంటే లేదంటూ బాహాటంగానే రేషన్ డీలర్లు చెబుతున్నా పట్టించుకునే అధికారులు లేరు. ఎక్కడైనా రేషన్ బియ్యం పట్టుబడితే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించాల్సిన ఆహార సలహా సంఘ సమావేశాలు జిల్లాలో నాలుగైదు చోట్ల మాత్రమే మొక్కుబడిగా సాగాయి. టంగుటూరు, కంభం, గిద్దలూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఈ సమావేశాలు నిర్వహించగా, మిగిలిన చోట వీటి ఊసే లేదు. గత నెల 16న ప్రభుత్వం (వినియోగదారుల కమిషన్) సమావేశాలు నిర్వహించాలని చెప్పడంతో మొక్కుబడిగా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 6,37,820 రేషన్కార్డులు ఉండగా, 1392 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 10,582 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాకు వస్తోంది. కానీ, పేదలకు సక్రమంగా అందకుండా కూటమి నాయకులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా సమావేశాలు... జిల్లా వ్యాప్తంగా ఆహార సలహా సంఘాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవటంతో సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. సక్రమంగా సమావేశాలు నిర్వహించకపోవటంతో వినియోగదారులకు అందాల్సిన నిత్యావసర వస్తువులు సక్రమంగా అందడం లేదు. అధికారులను ప్రశ్నించే కమిటీ లేకపోవటంతో నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం రేషన్దుకాణాలు అలంకారప్రాయంగా మిగిలాయి. గతంలో బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమలు, కందిపప్పు, నూనె, గోధుమపిండి, ఉప్పు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బియ్యం, చక్కెరకు మాత్రమే పరిమితమయ్యాయి. కమిటీ ఇలా... ఆహార సలహా సంఘ కమిటీలో ఆర్డీఓ, తహసీల్దార్, ఒక డీలర్, ప్రింట్ మీడియా సభ్యుడు, ఎంపీడీఓ, నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వీరందరూ నెలవారీగా సమావేశాలు నిర్వహించి కార్డుదారుల ఇబ్బందులు, తదితర అంశాలపై చర్చించి ప్రత్యేక రిజిష్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరా గోడౌన్ నుంచి రేషన్ దుకాణాలకు వచ్చే సరుకుల వివరాలపై సభ్యులకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండాలి. కానీ, కమిటీల సమావేశం జరగకపోవడంతో సమస్యలు అధికారుల దృష్టికి పోవటం లేదు. రేషన్ బియ్యం పలు చోట్ల పక్కదారి పడుతోంది. మార్కాపురం, తర్లుపాడు, మర్రిపూడి మండలాల్లో కొంతమంది రేషన్ డీలర్లు బాహాటంగానే బియ్యం బదులుగా కిలోకు 10 రూపాయలు డబ్బులిస్తామని చెబుతున్నారు. జిల్లాలో అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థ కూటమి నాయకుల కనుసన్నల్లో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం బియ్యంకు బదులు కిలోకు రూ.10 ఇస్తామంటున్న డీలర్లు తమ సమస్యలు పట్టించుకునేవారు లేరంటున్న కార్డుదారులు మొక్కుబడిగా ఆహార సలహా సంఘ సమావేశాలు కమిషన్ ఆదేశాలు పట్టించుకోవడం లేదు జిల్లాలో ఆహార సలహా సంఘ సమావేశాలను గత నెల 16వ తేదీ నిర్వహించాలని కమిషన్ ఆదేశించింది. అక్కడక్కడా మాత్రమే కొంతమంది తహసీల్దార్లు నిర్వహించారు. అవి కూడా మొక్కుబడిగా సాగాయి. కొన్నిచోట్ల డిప్యూటీ తహసీల్దార్లే ఈ సమావేశాలు పెట్టారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే సమావేశాలు నిర్వహించడం లేదు. దీనివలన ప్రభుత్వం దృష్టికి కార్డుదారుల సమస్యలు వెల్లడం లేదు. రేషన్ దుకాణాలు, పెట్రోల్ బంకులను కమిటీ సభ్యులతో కలిసి అధికారులు తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చినప్పటికీ అమలు కావడం లేదు. ఇప్పటికై నా సమావేశాలు నిర్వహించి రేషన్ కార్డుదారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. – ఓఏ మల్లిక్, జిల్లా వినియోగదారుల సమాఖ్య గౌరవాధ్యక్షుడు -
ఇసుక తోలలేక!
తమ్ముళ్లతో తాళలేక..‘‘ఇసుక డంపింగ్ యార్డు నిర్వహణకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. అయితే కొంతమంది వ్యక్తులు ప్రైవేటుగా వాహనాల్లో తెచ్చి సొంతంగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఒక్క ఒంగోలు నగరంలోనే 40 మంది వ్యక్తులు సొంతంగా ఇసుక డంపింగ్ చేస్తున్నారు. వారితో నేను పోరాడే పరిస్థితి లేదు. ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ను దయచేసి రద్దు చేయండి...’’ అంటూ ఫ్యూచర్ ట్రెండ్స్కు చెందిన భరత్ మైనింగ్ డిప్యూటీ డైరక్టర్ రాజశేఖర్కు వినతి పత్రం అందచేయడం జిల్లాలో అధికార కూటమి నేతల ఇసుక ఆగడాలకు అద్దం పడుతోంది. లైసెన్స్ పొందిన వ్యాపారులపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యాలు, రౌడీయిజానికి అంతేలేకుండా పోతోందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపున మద్యం బెల్ట్ షాపుల తరహాలో ప్రైవేటు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకున్న తమ్ముళ్లు యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పేరుతో గత ఏడాది నవంబరులో జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో డంపింగ్ యార్డులకు అనుమతిచ్చి లైసెన్స్లు మంజూరు చేసింది. ఫ్యూచర్ ట్రెండ్స్ సంస్థ నిర్వాహకుడు భరత్కు ఒంగోలు డంపింగ్ యార్డుకు లైసెన్స్ మంజూరైంది. భరత్ పశ్చిమ ప్రకాశం జిల్లా అధికార పార్టీకి చెందిన ఒక కీలక ఎమ్మెల్యే అనుచరుడిగా ప్రచారం జరుగుతోంది. ఈ లైసెన్స్ కోసం ఆయన కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. జనవరిలో ఆయన డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే నగరంలో టీడీపీకి చెందిన కొందరు నాయకులు సొంతంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకుని ఇసుక విక్రయాలు ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి ప్రైవేటు డంపింగ్ యార్డులు ఒక్క ఒంగోలు నగరంలోనే సుమారు 40 యార్డులు ఉన్నట్లు భరత్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అధిక ధరలకు ఇసుక విక్రయించడమే కాకుండా ప్రభుత్వ డంపింగ్ యార్డులో ఇసుక కొనుగోలు చేయకుండా కస్టమర్లపై ఒత్తిళ్లు చేసేవారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ డంపింగ్ యార్డు నిర్వాహకుడైన భరత్ ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికే కోటి రూపాయల చేతిచమురు వదిలించుకున్న ఆయన డంపింగ్ యార్డుకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. ఇటీవల కలెక్టర్ పిలుపు మేరకు ఒంగోలు వచ్చిన ఆయన తిరిగి డంపింగ్ యార్డు తెరిచినప్పటికీ తెలుగు తమ్ముళ్ల దందా ముందు తాళలేకపోయాడు. ఈసారి ఏకంగా తన లైసెన్స్ రద్దు చేయమంటూ ఆయన మైనింగ్ డీడీకి వినతి పత్రం అందించడంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఉచిత ఇసుక దోపిడీపై చర్చకు తెరతీసినట్లయింది. ఇసుక అమ్మకాల విషయంలో జిల్లాలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, అరాచకాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. కీలక నాయకులు నిర్ణయించిన టీడీపీ నాయకులు మాత్రమే ఇసుక అమ్మకాలు చేయాలని హుకుం జారీ చేసి బహిరంగంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇసుక వ్యాపారుల మీద దాడులు చేశారు. వారి టిప్పర్లను ధ్వంసం చేశారు. లారీ డ్రైవర్లను చితకబాది వేధింపులకు గురిచేశారు. లారీలను స్వాధీనం చేసుకున్నారు. తమకు కప్పం కట్టకుండా జిల్లాలో ఇసుక విక్రయించడానికి వీలులేదని రౌడీయిజం చెలాయించారు. టిప్పర్ల యజమానులకు కోట్లాది రూపాయలు ఇవ్వకుండా వేధించడంతో వారు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగడం సంచలనం సృష్టించింది. తాజాగా మరో వ్యక్తి తనకు ఇచ్చిన లైసెన్స్ను రద్దు చేయమని కోరడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ అధికారులైతే మొద్ద నిద్ర పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మైనింగ్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బెల్టు షాపుల తరహాలో ఇసుక యార్డులు కూడా వెలిశాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ అనధికారిక యార్డులు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాము చెప్పిన రేటుకే ఇసుక అమ్మకాలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. తమ వద్దకాదని ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను తెచ్చుకుంటే లారీకి వారు చెప్పిన కప్పం కట్టి వెళ్లాల్సిందే. లేదంటే అధికారులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం గిద్దలూరులో అధికారికంగా ఇసుక డంపింగ్ యార్డు నిర్వహణకు లైసెన్స్ మంజూరు చేసింది. నియోజకవర్గంలో ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఇసుక కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ అధికార టీడీపీ కీలక నేత ఇక్కడ సొంతంగా ప్రతి మండలంలోనూ ఇసుక డంపింగ్ యార్డులకు అనుమతి ఇవ్వడం విమర్శల పాలవుతోంది. నియోజకవర్గంలోని కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, బేస్తవారిపేట, కంభంలలో ఇసుక డంపింగ్ యార్డులు పెట్టి అనధికారికంగా ఇసుక అమ్మకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పొదిలిలో అనధికారికంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి అధిక ధరలకు ఇసుక విక్రయాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మార్కాపురంలో అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. నేరుగా ఇసుక తెచ్చుకుంటే రూ.900 కు వచ్చే ఇసుక ఇసుకను రూ.1500 కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల జేబుకు రూ.600 వరకు చిల్లు పడుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దారవీడు, దోర్నాల మండలాల్లో కూడా అనధికారికంగా డంపింగ్ యార్డులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి కనుసన్నల్లోనే ఈ యార్డులను ఏర్పాటు చేసి దొడ్డిదారిన ఇసుక విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు ఒక కంటైనర్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎక్కడనుంచైనా నియోజకవర్గంలోకి ఇసుక లారీ, ట్రాక్టర్ వచ్చిందంటే వీరికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక జిల్లా కేంద్రమైన ఒంగోలులో 40 వరకు ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నట్లు అధికారిక డంపింగ్ యార్డు నిర్వాహకుడు భరత్ ఆరోపణలు చేయడం గమనార్హం. కొండపి నియోజకవర్గానికి డంపింగ్ యార్డు మంజూరు చేయలేదు. జరుగుమల్లి, పొన్నలూరు మండలాలు పాలేరు నదీ తీర ప్రాంతంలో ఇసుక లభ్యమౌతుంది. ఇక్కడ నుంచి టీడీపీ నాయకులు ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుకుంటున్నారు. ట్రాక్టర్ లోడింగ్ రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో అనధికారికంగా ఇసుకను అమ్మేసుకుంటున్నారు. కనిగిరిలో ట్రాక్టర్కు రూ.500 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పేదోళ్ల ఆరోగ్యాన్ని దూరం చేసేందుకు కుట్ర
యర్రగొండపాలెం: పేద వర్గాల ఆరోగ్యం, వారి బిడ్డల వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నిందని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగనన్న తన పాలనలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని, వాటిని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్లలేక తమ ప్రాణాలు కోల్పోతున్నారన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి తీసుకొచ్చారని చెప్పారు. వాటిలో కొన్ని కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసుకొని నిర్వహణ కొనసాగుతోందని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు పేదల రక్తాన్ని పీల్చి దోచుకోవటానికి తమ అనుచరులకు ఆ కళాశాలలను అప్పనంగా అప్పచెప్పేందుకు పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. దీనివలన పేద, మధ్య తరగతి కుటుంబీకులు వైద్యం చేయించుకోలేని పరిస్థితిని తీసుకొస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్రానికి మెడికల్ సీట్లు మంజూరు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన దుర్మార్గపు సీఎం చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు. కూటమి నాయకులు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి తమ జేబులు నింపుకోవటానికి ఇటువంటి చర్యలు చేపడుతున్నారని, మెడికల్ కళాశాలలను చిల్లర డబ్బులకు లీజుకు ఇచ్చి తాము రూ.కోట్లల్లో దోచుకొని దాచుకోవటానికే పీపీపీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీలు దొంతా కిరణ్గౌడ్, ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, గుమ్మా పద్మజ ఎల్లేష్ యాదవ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, ఆర్.వాగ్యానాయక్, పార్టీ మండల కన్వీనర్లు గంటా వెంకట రమణారెడ్డి, దోమకాళ్ల వెంకటేశ్వర్లు, పి.కృష్ణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఉడుముల అరుణ, ఆర్.అరుణాబాయి, పొన్న వెంకటలక్ష్మి, పల్లె సరళ, జి.శార, కె.ఓబులరెడ్డి, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఒంటేరు నాగేశ్వరరావు, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, ఎల్.రాములు, లాలు నాయక్, షేక్.షెక్షావలి, చిట్టేల వెంకటేశ్వరరెడ్డి, సన్నెపోగు సుందరరాజు, పి.రాములు నాయక్, టి.సత్యనారాయణరెడ్డి, కోటిరెడ్డి, దుగ్గెంపూడి సుబ్బారెడ్డి, ఎస్.ప్రసాద్, బి.బాలచెన్నయ్య పాల్గొన్నారు. -
మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో డీఎస్సీ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఒంగోలు సిటీ: మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో డీఎస్సీ కౌన్సెలింగ్ నిర్వహించాలని బీటీఏ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం అన్నారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అత్యవసర సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు బీటీఏ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవసహాయం మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ 2025 కౌన్సెలింగ్ జీఓ నంబర్ 90 ప్రకారం సెలెక్షన్ లిస్టును రీ ఆర్గనైజ్ చేసి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కమిషనర్ ఇచ్చిన నియమాలను అనుసరించి కేవలం మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని, ఈ విధానాన్ని బీటీఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేవలం మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించడం వలన రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని బీటీఏ పక్షాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు వినతిపత్రాలను మెయిల్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటి వరకు జరిగిన కౌన్సెలింగ్ను రద్దు చేసి జీఓ నంబర్ 90 అనుసరించి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. బీటీఏ రాష్ట్ర కార్యదర్శి పారాబత్తిన జాలరామయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రిజర్వేషన్ వర్గాల వారికి తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. పదోన్నతుల్లో, బదిలీల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం మెరిట్ ప్రకారం నిర్వహించి రిజర్వ్ వర్గాల వారికి వ్యతిరేకంగా చేసిందని చెప్పారు. సమావేశంలో బీటీఏ జిల్లా ప్రచార కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండమూరి కొండల రాయుడు, జిల్లా నాయకులు చెక్క కోటేశ్వరరావు, బాజీ బాబు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఒంగోలు సబర్బన్: స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశ పెట్టడం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో నూతన అధ్యాయమని కలెక్టర్ పీ.రాజాబాబు అన్నారు. ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఏ షాపులో, ఏ సమయంలో రేషన్ సరుకులు తీసుకున్నారో ట్రేస్ చేయవచ్చన్నారు. కార్డు పోయినా జిరాక్స్ కాపీతో కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6,51,818 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీరికి 1392 రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని డీఎస్ఓ పద్మశ్రీ తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, ఒంగోలు ఆర్డీవో కళావతి, ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.వెంకట్రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ సుజాత, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సింగరాయకొండ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం అండర్–19 బాల బాలికల జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. జూనియర్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ కే శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెలక్టర్లుగా జే ప్రభాకర్, నామా చంద్రశేఖర్, ఏ కిరణ్కుమార్, పీ రమేష్, సయ్యద్ జంషీర్ అబ్దాల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు బుద్ధి చెప్పాలి
బేస్తవారిపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరంచేసే ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు ప్రజలే బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. కంభంలోని వైజంక్షన్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా కందులాపురం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీగా వైజంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరారు. పీపీపీ పేరుతో ప్రజలకు వైద్యం అందుబాటులోకి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. టీడీపీ పెద్దలు వారి అనుచరులకు, బినామీలకు మెడికల్ కాలేజీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు. నేడు వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు చేసి వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను అక్రమ అరెస్ట్లు చేయడంపై దృష్టి పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటిరోజు నుంచే నకిలీ మద్యం తయారు కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ పాలనలో 43 వేల బెల్ట్షాపులను తొలగిస్తే నేడు ఇంటింటికీ మద్యం సరఫరా జరుగుతోందన్నారు. 1923 నుంచి 2019 వరకు ఏపీలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, 2300 మంది డాక్టర్లుగా చదువుకునేవారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత కరోనా సమయం రెండున్నరేళ్లు పోగా దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకుకొచ్చిందన్నారు. ఒక్కొక్క కళాశాలకు 50 ఎకరాలు స్థలం కేటాయించారని, ఐదు కళాశాలలను పూర్తి చేసి ప్రారంభించారని చెప్పారు. ఎన్నికల సమయంలో మరో రెండు కళాశాలల పనులు పూర్తయ్యాయన్నారు. ఇంకో ఆరు కాలేజీలు 80 శాతం, మూడు కాలేజీలు 40 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అన్నీ కళాశాలలు పూర్తయి ఏడాదికి 2550 మంది డాక్టర్లుగా చదువుకుని బయటకు వస్తారన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలకు వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ అవుతాయన్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ పూర్తి కావడంతో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో అధునాతనమైన ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. చంద్రబాబు పాలన అంతా ఆర్భాటం.. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సమయంలో ఏనాడూ పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. సూపర్సిక్స్తోపాటు 200 హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 2–3 పథకాలు అరకొరగా అమలు చేశారన్నారు. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానేసాటి అని మరొక్కసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. ఒక్క మెడికల్ కళాశాల ఏర్పాటైతే 1500 పడకలు, స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులు కేవీ రమణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, ఎంపీపీలు వేగినాటి ఓసూరారెడ్డి, చేగిరెడ్డి తులశమ్మ, ఎం వెంకట్రావ్, జెడ్పీటీసీలు బీవీ రాజయ్య, వెంకటనాయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు నెమిలిదిన్నె చెన్నారెడ్డి, అబ్దుల్ గఫార్ఖాన్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, ఆవుల శ్రీధర్రెడ్డి, యేరువ రంగారెడ్డి, ఎం రవికుమార్, మాజీ ఎంపీపీలు రవికుమార్యాదవ్, వెంకటరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. -
తొలి మద్యం తయారీ కేంద్రం కుప్పం
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో మొదటి డిస్టిలరీ ఫ్యాక్టరీ కుప్పంలోనే ప్రారంభం అయిందని.. చివరి డిస్టిలరీ కేంద్రం విశాఖపట్టణంలో ఏర్పాటు చేశారని, అదికూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు చెందిందని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొని వచ్చింది మద్యం కంపెనీలు తప్ప ప్రజలకు మంచి చేసే కంపెనీలు తేలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు నవరత్నాల పథకం కింద అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు ఎంతో మేలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి అన్నీ చేశామని డప్పాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళలు, రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపడుతుంటే అరకొరగా పథకాలను అమలు చేశారని చెప్పారు. అబద్ధాల ప్రచారంలో దిట్ట.. ఇటీవల సూపర్ సిక్స్–సూపర్ సక్సెస్ అని మూడు హామీలు సీ్త్రశక్తి, నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాల పింఛన్ ఎత్తివేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గ్లోబల్ ప్రచారం చేయడం మొదలు పెట్టారని ఆయన అన్నారు. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే మనం వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పేద ప్రజలకు తాము కూడా అన్యాయం చేసినవారమవుతామన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రామాలలో ప్రజలకు అవగాహన పరచాలని, వారిలో చైతన్యం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, ఆళ్ల ఆంజనేయరెడ్డి, గుమ్మా ఎల్లేష్ యాదవ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, ఆర్.వాగ్యానాయక్, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాళ్ళ వెంకటేశ్వర్లు, పి.కృష్ణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల రాష్ట్ర. జిల్లా నాయకులు ఉడుముల అరుణ, ఆర్.అరుణాబాయి, పొన్న వెంకటలక్ష్మి, పల్లె సరళ, గార్లపాటి శార, కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, కందూరి కాశీవిశ్వనాథ్, పి.రాములు నాయక్ పాల్గొన్నారు. -
కర్నూలు రోడ్డుపై నెల రోజులుగా గొయ్యి..!
ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు సమీపంలోని బ్రిడ్జిపై ఉన్న గొయ్యి ఒంగోలు – కర్నూలు రోడ్డుపై సంతనూతలపాడు సమీపంలో ఉన్న బ్రిడ్జి మీద రోడ్డు దెబ్బతిని నెల రోజుల క్రితం గొయ్యి ఏర్పడింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్అండ్బీ రహదారిపై పెద్ద గొయ్యి పడి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీనిపై గత నెల 22వ తేదీ సాక్షి దినపత్రిక ఒంగోలు క్లస్టర్ పేజీలో ‘రహదారి ఇలా.. రాకపోకలు సాగేదెలా’ అనే శీర్షికతో గొయ్యికి సంబంధించిన ఫొటోలతో కథనం కూడా ప్రచురితమైంది. ఇరవై రోజులైనా అధికారులుగానీ, పాలకులుగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం ఆ గొయ్యి పెద్దదిగా మారి మరింత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వ అధ్వానపు పరిపాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పైగా, ఆ గొయ్యి వద్ద అడ్డంగా పోలీసులు బ్యారికేడ్ ఏర్పాటు చేసి నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని వాహనదారులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అసలే వంతెన కావడంతో ఆ గొయ్యి వద్ద ఏమాత్రం ప్రమాదం జరిగినా భారీ నష్టం జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రానైట్ రాళ్లతో భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదం జరిగే అవకాశం... చీమకుర్తి మండలంలోని రామతీర్థం గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ రాళ్ల ఓవర్ లోడుతో నిత్యం భారీ టిప్పర్లు, ట్రాలీలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జిపై గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో సగం రోడ్డుకు అడ్డంగా పోలీసులు బ్యారికేడ్ ఏర్పాటు చేసి వదిలేయడంతో అక్కడ సగం రోడ్డుపైనే వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉంది. దీంతో అక్కడ ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పైగా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి కింద నీటి ప్రవాహం ఎక్కువై రోడ్డు మరింత దెబ్బతింటోంది. ఫలితంగా ఆ బ్రిడ్జి మధ్యలో ఏర్పడిన గొయ్యి సైజు పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ పాలకులుగానీ, అధికారులుగానీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లను సూపర్గా చేశామని సీఎం, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతుండటంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. నడిరోడ్డుపై ఉన్న గోతులు కూడా పూడ్చకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు. 20 రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితమైనా స్పందించని అధికారులు, పాలకులు ప్రస్తుతం మరింత పెద్దదిగా మారి ప్రమాదకరంగా మారిన గొయ్యి -
వాగులో పడి బాలుడు మృతి
గిద్దలూరు రూరల్: వాగులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని గడికోట గ్రామ సమీపంలో గల సగిలేరువాగు వద్ద శనివారం జరిగింది. గడికోట గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (15) గేదెలను మేపేందుకు వాగు సమీంలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో గేదెలు వాగులో ఉండటం వల్ల వాటిని బయటకు తోలేందుకు వాగులోకి దిగాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ వాగు లోతట్టు ప్రాంతంలో చిక్కుకుని మునిగిపోయాడు. స్థానికులు అతడిని వాగులో నుంచి బయటకు తీసేలోపే మృతి చెందాడు. హుస్సేన్ ముండ్లపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో గేదెలను మేపేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులకు హుస్సేన్ పెద్ద కుమారుడు కాగా, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. -
ఫ్రిజ్ పేలడంతో రూ.4 లక్షల ఆస్తి నష్టం
కొమరోలు: షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద శబ్ధంతో ఫ్రిజ్ పేలిపోయిన సంఘటన కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రాజుపాలెం గ్రామానికి చెందిన దద్దనాల చెంచయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉండటంతో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. అయితే, ఇంట్లోని సామగ్రి అగ్నికి ఆహుతవడంతో రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు చెంచయ్య తెలిపారు. సమాచారం అందుకున్న గిద్దలూరు అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొండపి: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపి మండల కేంద్రంలోని పొదిలి రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ సమీపంలో చోటుచేసుకుంది. కొండపి ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ ఆరీఫ్ (22)కు తాను ప్రేమించిన యువతితో మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో వారు నివసిస్తున్న సమయంలో గొడవల కారణంగా అక్కడి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇవ్వగా ఆరీఫ్కు, ఆ యువతకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరికీ ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఆరీఫ్ శుక్రవారం అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో కొండపిలోని ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని మరణించాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు, డార్మిటరీ, కొత్త కూరగాయల మార్కెట్, పాత కూరగాయల మార్కెట్, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తనిఖీలు చేశారు. పేలుడు పదార్థాలు కనుగొనడంలో ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం చీతా సహాయంతో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలలో పాల్గొంది. టాస్క్ఫోర్స్, స్పెషల్ పార్టీ బృందం మాదక ద్రవ్యాలు, ఇతర అక్రమ రవాణాను గుర్తించడానికి అనువణువూ పరిశీలన చేశారు. అనుమానం కలిగిన బ్యాగులను పరిశీలించడమే కాకుండా వ్యక్తుల వద్ద గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. తనిఖీలలో ఎస్సై శివరామయ్య, డాగ్ హ్యాండర్ల ప్రభాకర్ పాల్గొన్నారు. -
బీకే త్రషర్స్ను పరిశీలించిన బీమా కంపెనీ
సింగరాయకొండ: అగ్నిప్రమాదం సంభవించిన బీకే త్రషర్స్ కంపెనీని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, క్లూస్ టీం సిబ్బంది శనివారం పరిశీలించారు. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేప్రయత్నం చేశాయని, మంటలు అదుపులోనే ఉన్నా ఇంకా బేళ్లు మండుతున్నాయని కంపెనీ ప్రతినిధులు వారికి వివరించారు. కాగా బీకేటీ కంపెనీ శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ కంపెనీలో జీపీఐకి చెందిన రూ.550 కోట్ల విలువైన పొగాకు, ఎల్అండ్ఎం కంపెనీకి చెందిన రూ.18 కోట్ల విలువైన పొగాకు కాలిపోయిందని, గోడౌన్కు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.598 కోట్ల నష్టం వాటిల్లిందని జీఎం శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు రూరల్: పట్టణంలోని 9వ వార్డు కుమ్మరివీధిలో పల్లె నాగమ్మకు చెందిన మట్టి మిద్దె ప్రమాదవశాత్తూ కూలిపోయింది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె పూర్తిగా నాని ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఆ సమయంలో నాగమ్మ వరండాలో నిద్రిస్తుండటంతో ప్రమాదం తప్పింది. మిద్దెలోని దంతెలు, మట్టి కిందపడిపోవడంతో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర సరుకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిద్దె కూలి తనకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. గిద్దలూరు రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడి తీవ్రగాయాలై వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని కె.ఎస్.పల్లె గ్రామ సమీపంలో జరిగింది. కె.బయనపల్లె గ్రామానికి చెందిన పాములేటి (39) అనే వ్యక్తి తన బైక్పై పెద్దచెరువు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ శుక్రవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. నంద్యాల హైవేలో విధులు నిర్వర్తిస్తున్న హైవే పోలీసులు పాములేటిని 108 అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రజలే శ్రమదానం..!
ప్రభుత్వ వైఫల్యం..ఒంగోలు – మంగమూరు రోడ్డుపై పాడైపోయి ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్న మంగమూరు యువకులుసంతనూతలపాడు: కూటమి ప్రభుత్వంలో చెప్పేదొకటి..చేసేదొకటి అనేదానికి రోడ్లే నిదర్శనంగా ఉన్నాయి. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రోడ్లన్నింటికీ మరమ్మతులు చేయించామని సీఎం చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేల వరకూ గొప్పలు చెప్పుకుంటుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అనేక ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ఇలాంటి ఓ రోడ్డు గురించి పాలకులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరు నెలల క్రితం ఏకంగా ఒక మహిళ మృత్యువాతపడింది. ఈ రోడ్డు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉందా అంటే.. అదేమీ కాదు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోనే ఉంది. అదే.. ఒంగోలు నుంచి మంగమూరు వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో సుందరమ్మ వాగు వద్ద తారు రోడ్డు 20 అడుగుల పొడవున ఉబ్బెత్తుగా మారి ప్రమాదాలకు నిలయమైంది. కొణిజేడు కొండ నుంచి ఎర్రమట్టిని ఓవర్ లోడుతో తరలిస్తూ వాహనాలు తిరుగుతుండటంతో ఈ రోడ్డుపై కొంతభాగం దెబ్బతింది. రోడ్డు ఉబ్బెత్తుగా మారిన ప్రాంతం ప్రమాదాలకు కారణమవుతోంది. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగి పలువురికి గాయాలు... రాత్రి వేళల్లో ఒంగోలు నుంచి మంగమూరు రోడ్డుపై ప్రయాణం చేసేవారు సుందరమ్మ వాగు వద్ద ఉబ్బెత్తుగా మారిన రోడ్డును గమనించ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయపడుతున్నారు. ఆరు నెలల క్రితం మంగమూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒంగోలు వెళ్లి రాత్రివేళ తిరిగి ఇంటికొస్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. వాహనం వెనుకవైపు కూర్చున్న మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు మృత్యువాత పడింది. తరచూ ఎవరో ఒకరు అదే ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతూ గాయపడుతున్నారు. గత శుక్రవారం రాత్రి కూడా మంగమూరుకు చెందిన ఒక యువకుడు ఒంగోలు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తూ ఉబ్బెత్తుగా ఉన్న తారు రోడ్డు వద్ద వాహనం అదపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో మంగమూరు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. మంగమూరు అంబేడ్కర్ నగర్కు చెందిన యువకులు శనివారం ఉదయం శ్రమదానం చేసి ఉబ్బెత్తుగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు భాగాన్ని తవ్వి చదును చేశారు. ఇక్కడే కాకుండా ఓవర్ లోడుతో వాహనాలు ప్రయాణించడం వలన మంగమూరు – ఒంగోలు రోడ్డు పలు చోట్ల పాడైపోయి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు పూర్తిగా మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతులు చేసిన వారిలో మంగమూరు అంబేడ్కర్ నగర్ యువకులు కొండసింగు ధనుంజయ, పైడి హనుమంతరావు, పందిపాటి రవి, కసుకుర్తి శివ, కంకణాల వెంకటేశ్వర్లు, మంచికలపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పాడైపోయి వాహన ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు పలువురు ప్రమాదాలకు గురై గాయాలతో ఆస్పత్రి పాలు ఆరు నెలల క్రితం ఒక మహిళ మృతి శుక్రవారం రాత్రి యువకుడికి గాయాలు నెలల తరబడి పట్టించుకోని పాలకులు, అధికారులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేసుకున్న యువత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యపు పాలనకు నిలువెత్తు నిదర్శనం -
అక్రమంగా కలప తరలింపుతో బిక్కుబిక్కుమంటున్న వన్యప్రాణులు...
గిద్దలూరు అటవీశాఖ పరిధిలో గుండ్లకమ్మ రేంజ్, తురిమెళ్ల రేంజ్, బేస్తవారిపేట రేంజ్, గిద్దలూరు రేంజ్, స్క్వాడ్ రేంజ్, డీఈటీ రేంజ్ కలిపి మొత్తం 6 రేంజ్లకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు. అందులో గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి స్క్వాడ్ రేంజ్కి ఇన్చార్జిగా, గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ నరసింహారావు డీఈటీ రేంజ్కి ఇన్చార్జిగా, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు బేస్తవారిపేట రేంజ్కి ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిద్దలూరు అటవీశాఖ పరిధిలో అభయారణ్యం సుమారు 10 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. గిద్దలూరు రేంజ్లోని గుండ్లమోటు, గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని కుక్కలగుండం, ఇసుకల గుండం నుంచే కాకుండా నంద్యాల జిల్లా పచ్చర్ల అటవీప్రాంతం నుంచి సైతం అక్రమంగా వెదురు, ఇతర కలప తరలిస్తున్నారు. అక్రమంగా కలప తరలించే వారు అభయారణ్యంలో ఎలా అడుగు పెడుతున్నారు.. అక్రమంగా కలప ఎలా తరలిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కలప, వెదురు నరికే వారి గొడ్డలి చప్పుళ్లకు వన్యప్రాణులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. -
ప్రైవేటీకరణపై పోరాటం
మార్కాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు విద్యార్థులకు వైద్య విద్యను కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు వివరించారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టడం బాధాకరమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు చెప్పారు. మార్కాపురం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం వాల్పోస్టర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలలను నిలిపివేయడంతోపాటు ఇటీవల కాలంలో వాటిని ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ విధానంలో నిర్మించాలని టెండర్లను ఆహ్వానించడం దారుణమని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో మెడికల్ కళాశాలల నిర్వహణ ఉంటే పేదలకు ఉచితంగా వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని నవంబరు 22వ తేదీ వరకూ గ్రామాలు, పట్టణాల్లో వాడవాడలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న మార్కాపురం నియోజకవర్గ కేంద్రాల్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ జరుగుతుందన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను 23న జిల్లా కేంద్రాలకు పంపనున్నట్లు వెల్లడించారు. అనంతరం 24న పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన తరువాత రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేది కాదని, ప్రజలందరూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీర్జా షంషేర్ ఆలీబేగ్, మార్కాపురం, కొనకనమిట్ల ఎంపీపీలు లక్ష్మీదేవీ కృష్ణారెడ్డి, మురళీకృష్ణ యాదవ్, మార్కాపురం, కేకే మిట్ల జెడ్పీటీసీలు నారు బాపన్రెడ్డి, అక్కిదాసరి ఏడుకొండలు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు పీఎల్పీ యాదవ్, పార్టీ పట్టణ కన్వీనరు సలీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పొదిలి పట్టణ, మండల కన్వీనర్లు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, చంద్ర శేఖర్, రోజ్లిడియా, ముత్తారెడ్డి వెంకట రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, శేషయ్య, కొండయ్య, గౌస్ మొహిద్దీన్, కేకే మిట్ల వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం వాల్పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మారం పామూరు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓ కార్యక్రమానికి వెళ్తూ మార్గం మధ్యలో పామూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంకె మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, పేద విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు ఏకంగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించి నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇప్పటికే 7 కళాశాలల నిర్మాణాలు పూర్తికాగా మరో 10 కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయా వైద్య కళాశాలలపై సవతి తల్లి ప్రేమ చూపుతూ వాటి ప్రైవేటీకరణకు మొగ్గుచూపడం అత్యంత హేయమని అన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు. కోటిసంతకాల సేకరణ చేపట్టి గవర్నర్కు వినతిప్రతం ఇచ్చే కార్యక్రమం చేపడుతోందని తెలిపారు. కూటమి పాలనా పగ్గాలు చేపట్టిన 15 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని, మద్యం బెల్ట్ దుకాణాలతో గ్రామాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, పేదల కుటుంబాలు బజారున పడుతున్నాయని జంకె ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నాయకులు కల్తీ మద్యంతో కోట్లు దండుకుంటూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అనంతరం జంకెను స్థానిక నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గంగసాని హుసేన్రెడ్డి, టీచర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు కల్లూరి రామిరెడ్డి, అంబటి కొండారెడ్డి, గట్లా విజయభాస్కర్రెడ్డి, పాలేటి ప్రేమ్కుమార్, చల్లా సుబ్బారావు, జొన్నలగడ్డ గోవిందయ్య, శ్రీరాం శ్రీనివాసులు, వెలుతుర్ల తిరుపతిరెడ్డి, షేక్ రసూల్, చింతంరెడ్డి బాలిరెడ్డి, కోటపాటి రమణారెడ్డి, వాకమళ్ల కోటిరెడ్డి, తాతిరెడ్డి నరసారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి -
ఇంటి దొంగలు..!
అటవీశాఖలో గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని నల్లమల అభయారణ్యంనల్లమల అటవీ ప్రాంతం గిద్దలూరు రూరల్: అటవీశాఖలో ఇంటి దొంగల చేతివాటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి సహకారంతోనే అక్రమార్కులు చెలరేగిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని నల్లమల అభయారణ్యంలో వేటగాళ్లు, అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమార్కుల అడుగులు పడుతుండటంతో అలజడి ఎక్కువైపోతోంది. దుండగులు అభయారణ్యంలోకి ప్రవేశించేందుకు అటవీశాఖలోని ఇంటి దొంగలు సహకరిస్తున్నారని, అధికారులు, సిబ్బంది సైతం అవినీతికి పాల్పడుతూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది అనుమతులు లేనిదే అక్రమార్కులు, వేటగాళ్లు అడవిలో అడుగుపెట్టడం వీలుపడదనే వాదన వినిపిస్తోంది. యథేచ్ఛగా వన్యప్రాణుల వేట... వేటగాళ్లు సైతం అభయారణ్యంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తూ వారికి కావాల్సిన జంతువులను వేటాడుతున్నారు. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం జరగ్గా.. ఈ నెల 7వ తేదీ సండ్రపాడు బీటులో ఇద్దరు వేటగాళ్లు నాటుతుపాకీతో అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. 9వ తేదీ రైలులో తరలివెళుతున్న అక్రమ వెదురు కలపను స్వాధీనం చేసుకున్నారు. 2022 నుంచి 2025 వరకు గుండ్లకమ్మ రేంజ్ పరిధిలో దుప్పి, జింక, ఉడుము, కణతి, నెమలి, అడవి పందులు, ఇతర వన్యప్రాణులను వేటాడిన కేసులు 40కిపైగా నమోదయ్యాయి. గిద్దలూరు, తురిమెళ్ల, బేస్తవారిపేట రేంజ్ పరిధిలో 25 కేసులు కలిపి మొత్తం 65 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వేటగాళ్ల చేతిలో గాయపడిన వన్యప్రాణులకు అటవీశాఖ అధికారులు చికిత్స అందించి సురక్షితంగా అభయారణ్యంలో వదిలిన సంఘటనలు అనేకం జరిగాయి. నామమాత్రంగా వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు... ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలను నామమాత్రంగా నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితాలు శూన్యం. అడవి అక్కడ.. సిబ్బంది ఇక్కడ..! వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న గిద్దలూరు అభయారణ్యాన్ని సంరక్షించే అటవీశాఖ అధికారులు.. వారికి కేటాయించిన పోస్టులకు సంబంధించిన ప్రాంతాల్లో అందుబాటులో లేకుండా దూరంగా నివాసం ఉండటం వల్ల అటవీ సంరక్షణ కష్టతరం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు గిద్దలూరు అటవీశాఖ పరిధిలో 6 రేంజ్లలో ఏబీఓ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 7, ఎఫ్ఎస్ఓలు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత ఉండటం వలన ఉన్న అరకొర సిబ్బందితో అటవీ సంరక్షణ కష్టతరంగా మారింది. సిబ్బంది కొరతతో అవస్థలు... ఇసుకగుండం నార్త్, ఈస్ట్, మాలకొండపెంట ఈస్ట్, వెస్ట్, ఓబులేసుపెంట, దిగువమెట్ట ఈస్ట్, వెస్ట్, టన్నల్ బీటు, రాచర్ల, ఆకవీడులో మొత్తం 10 బీట్లకుగానూ గుండ్లకమ్మ రేంజ్లో ఏబీఓ పోస్టులు 10, దిగువమ్టెట ఠాణాలో 2 కలిపి మొత్తం 12 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 8 మంది పనిచేస్తున్నారు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇసుకగుండం, రాచర్ల, మాలకొండపెంట, దిగువమెట్ట బీట్లకు సెక్షన్ ఆఫీసర్లుగా ఎఫ్ఎస్ఓలు నలుగురు ఉండాల్సి ఉండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆర్వోగా ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు. తురిమెళ్ల, బేస్తవారిపేట రేంజ్లలో 8కి 8 ఏబీఓ పోస్టులు ఖాళీ... గిద్దలూరు రేంజ్ పరిధిలో కొత్తకోట, సండ్రపాడు, బోది, ఎస్.ఆర్.పేట, గడికోట కలిపి మొత్తం 5 బీట్లకుగానూ కొత్తకోటలో మాత్రమే ఏబీఓ పనిచేస్తున్నారు. మిగిలిన నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓ 1, ఎఫ్ఎస్ఓ 1 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తురిమెళ్ల రేంజ్లో పుల్లలచెరువు, జేబీకే పురం, పాపినేనిపల్లె, బొల్లుపల్లె, వెలగలపాయ, పాపినేనిపల్లె–2, పాపినేనిపల్లె ఠాణాలో 2 కలిపి మొత్తం 8 మంది ఏబీఓలు ఉండాల్సి ఉండగా, అన్ని పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 9 మంది ఉండాల్సి ఉండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్ఎస్ఓ ఒక్క పోస్టు ఉండగా, ఆ ఒక్కటి ఖాళీగా ఉంది. మూడు డీఆర్ఓలకుగానూ ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. బేస్తవారిపేట రేంజ్ పరిధిలో తాటిచెర్ల, నల్లగుంట్ల, చింతలపల్లె, జె.పి.చెరువు, చిన్న ఓబినేనిపల్లె, సింగసానిపల్లె, అల్లినగరం, గుంతపల్లిలో 8 ఏబీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్బీఓలు 8 మందికిగానూ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్ఎస్ఓలు ముగ్గురు ఉండాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆర్వో ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. వారి సహకారంతోనే జోరుగా కలప అక్రమ రవాణా జరుగుతోందని విమర్శలు 40కిపైగా నమోదైన వన్యప్రాణుల వేట కేసులు సిబ్బంది నిర్లక్ష్యానికి వన్యప్రాణులకు పొంచి ఉన్న ప్రమాదం పనిచేసే ప్రాంతంలో నివాసం ఉండని అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు -
డ్రోన్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
ఒంగోలు టౌన్: డ్రోన్ పెట్రోలింగ్ను ముమ్మరంగా నిర్వహించాలని, జిల్లాలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు అధికారులు తరచూ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వి.హర్షవర్ధన్రాజుతో కలిసి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత నేర పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్థిక నేరాలలో టాప్ 10 స్థానాలలో ఉన్న వారిపై నిఘా ఉంచాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వలపై దృష్టి సారించాలని చెప్పారు. నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఒంగోలు డీఎస్సీ శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డీఎస్సీ నాగరాజు, కనిగిరి డీఎస్సీ సాయిఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్సీ రమణ కుమార్, సీఐలు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూం
ఒంగోలు వన్టౌన్: ప్రకాశం భవనంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాలను కలెక్టర్ పీ రాజాబాబు శుక్రవారం రాత్రి పరిశీలించారు. కలెక్టరేట్లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం పీజీఆర్ఎస్ మీకోసం హాలు, ఆడిట్ టీము, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ విభాగం పనిచేస్తున్న కార్యాలయాలను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డీఆర్ఓ బీ చిన ఓబులేసులతో కలిసి తనిఖీ చేశారు. వీరి వెంట కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు ఉన్నారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో తాగునీటి పరఫరా తీరును డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెనకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన ఒంగోలు నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. రాంనగర్, సంతపేట, అన్నవరప్పాడు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా అవుతున్న ఎస్ఎస్–2 ట్యాంక్ పరిధిలోని ప్రాంతాలను మునిసిపల్ ఇంజినీర్ యేసయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో సరఫరా అవుతున్న తాగునీరు ప్రసుత్తం పరిశుభ్రంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించామని డీఎంహెచ్ఓ చెప్పారు. నగరంలో తాగునీరు పైపులు లీకేజి ఉంటే వెంటనే వాటిని మరమ్మతులు చేసి ప్రజలకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలని మునిసిపల్ ఇంజినీర్కు సూచించారు. -
‘కల్తీ మద్యం’పై నిరసన
ఒంగోలు సిటీ: మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ ఒంగోలులోని అంబేడ్కర్ భవనం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మహిళా విభాగం నాయకులు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం లో డీసీ కి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కార్యాలయం ఎదురు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కల్తీ మద్యం వల్ల మరణాలు ఎక్కువవుతున్నాయన్నారు. అధికార పార్టీ అండతో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరు ఏరియాలను పంచుకున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్చార్జ్ గంగసాని లక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఇంటి వద్దకే పరిపాలన అని మంచి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని హోం డెలివరీ చేస్తోందని విమర్శించారు. లిక్కర్ షాపులే ఒక కుంభకోణమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం పాడు ఎంపీపీ గాయం సావిత్రి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ, పార్టీ మహిళా నాయకులు సన్నపురెడ్డి రవణమ్మ, గోనెల మేరీ కుమారి, సయ్యద్ అప్సర్, పులి శాంతి, వడ్లమూడి వాణి, కాకర్లమూడి రజిని, జమీల బేగం, సవరం రత్తమ్మ, నెలకుర్తి మహేశ్వరి, పండిటి లక్ష్మి,నాగమణి, మన్యం సంధ్య, పి.లక్ష్మి, కె.సంధ్య, మొలకపల్లి సీతమ్మ, తన్నీరు రాగమ్మ, కే లక్ష్మి, పీ పార్వతి, జీ మాలతి, పీ అమూల్య, జీ తిరుపతమ్మ, రాచూరి సుస్మిత, మాధవి, బత్తుల కోటమ్మ, రాధా, ఎన్ సరిత, ఇండ్ల భాను, ముద్దావనమ్మ, రాచూరి పుష్ప, ఎం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
సింగరాయకొండ: పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను, వైద్యాన్ని దరిచేర్చటానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పన్నాగాలను అడ్డుకోవటంతో పాటు పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని పాకల గ్రామంలో అభ్యుదయ కళ్యాణ మండపంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్ల కొరతను తెలుసుకుని పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దరిచేర్చే మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి వాటిలో 5 మెడికల్ కాలేజీలను పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయగా రెండు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు పప్పు బెల్లాల రూపంలో అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. ఎకరా స్థలాన్ని కేవలం ఏడాదికి రూ.100 కు లీజు పద్ధతిన 66 ఏళ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ సుమారు 50 ఎకరాల్లో ఉంటుందని ఆ విధంగా ఒక్కో మెడికల్ కాలేజీ ఏడాదికి రూ.5 వేల లీజు పద్ధతిలో అందజేయటానికి పూనుకుందని, ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం మరొకటి లేదని ఘాటుగా విమర్శించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు అవుతుందని ఆ ప్రకారం 17 మెడికల్ కాలేజీలకు రూ.8,500 కోట్లు అవుతుండగా ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల వరకు జగనన్న ఖర్చు చేశాడని మిగిలిన, రూ.5 వేల కోట్లను సంవత్సరానికి వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేసి పూర్తి చేయవచ్చని, కానీ డబ్బులు లేవని ప్రైవేటుకు అప్పగిస్తామని చెప్పటం సిగ్గుచేటన్నారు. పేదలకు వైద్యాన్ని, విద్యను దూరం చేయటంలో మంత్రి స్వామి తన వంతు పాత్ర పోషించాడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పూనుకోవటాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అన్నారని ఇప్పుడు ప్రైవేటుకు కట్టబెడుతుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని విమర్శించారు. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవస్థలను ప్రైవేటీకరించేందుకే మొగ్గు చూపుతుందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తహశీల్దార్, ఎంపీడీఓ, పోలీస్స్టేషన్ లను కూడా ప్రైవేటీకరించినా ఆశ్చర్యం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్సీట్లు మంజూరు చేస్తానంటే వద్దు అని చెప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యుటివ్ మెంబర్ డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయటాన్ని దేశచరిత్రలో తీసుకున్న నికృష్టమైన నిర్ణయమని ఎద్దేవా చేశారు. తరువాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 500 సంతకాలను సేకరించారు. అంతకుముందు వైఎస్సార్, డాక్టర్ కోటారెడ్డి, పూనూరు వెంకారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు, పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు, బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లిఖార్జునరావు, కేశవరపు కృష్ణారెడ్డి, గొల్లపోతు గోవర్దన్, ఎంపీటీసీలు గోళ్లమూడి అశోక్కుమార్రెడ్డి, ఏపూరి శ్రీనివాసులు, అంకయ్య, బల్లెల ప్రభాకరరెడ్డి, ఎం శివారెడ్డి, బుర్ల భాస్కరరెడ్డి, పాలెపు మాధవరావు, వినోద్, గౌడపేరు రాఘవ, మాధవ, కుర్రు కళ్యాణ్, బుజ్జమ్మ, పున్నయ్య తాతయ్య, విజయ్, పౌల్, వాయిల ఆనంద్, ప్రభుదాసు, కాలేషా, షకీలా, ప్రమీల, ప్రళయకావేరి శివ, వీ పెద్ద యలమందయ్య, ఢాకా పిచ్చిరెడ్డి, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, నరేందర్రెడ్డి, సుదర్శి వెంకట్రావు, షేక్ సుల్తాన్, చుక్కా కిరణ్కుమార్, యనమల మాధవి, కోమిట్ల వెంకారెడ్డి, చొప్పర శివ, పెరికాల సునీల్, షేక్ కరీం, సోమిశెట్టి సురేష్, మాదాల శంకర్, ప్రభాకరరెడ్డి, దాసరి శేషయ్య, భాగ్యమ్మ, నవీన్రెడ్డి, భాను, నాగార్జున, చిడిపోతు కృష్ణారెడ్డి, షేక్ నౌషాద్, పుట్టా వెంకట్రావు, ఎం వెంకటాద్రి రెడ్డి, బొక్కిసం సుబ్బారావు, గొట్టిపాటి మురళి, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పిల్లి తిరుపతిరెడ్డి, తానికొండ రామచంద్రరావు, నాగినేని భాస్కర్, దుంపా అనిల్కుమార్రెడ్డి, పిన్నిక కమలేష్, నరేష్, సయ్యద్ ఆబిద్ అలీ, షేక్ అల్లాబక్షు, షేక్ పటేల్, మారంరెడ్డి గంగాధరరెడ్డి పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, ప్రకాశం: ప్రకాశం(Prakasam) జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని కలికివాయి బిట్రగుంటలో పొగాకు గోదాంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిరిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో బెల్లం కోటయ్యకు చెందిన పొగాకు గోదాంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేనప్పటికీ భారీగా జరిగిన ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. -
బోధనేతర కార్యక్రమాలకు మినహాయింపు ఇవ్వండి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి, డీఆర్ఓ ఓబులేసుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి బోధనేతర పనులు, విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో మితిమీరిన బోధనేతర కార్యక్రమాలతో బోధనా సమయం హరించుకుపోతోందన్నారు. ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గేలా బోధనేతర కార్యక్రమాలు పెరిగిపోయాయని, పలు దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపడతారని, మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ తప్ప ఏ ఇతర బోధనేతర పనులను గానీ, అనవసరమైన గూగుల్ షీట్స్ నింపడం గాని, విద్యా శక్తి, జీఎస్టీ 2.0 లాంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.ఎర్రయ్య ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ షేక్ అబ్దుల్ హై, ఫ్యాప్టో కో చైర్మన్ వి.మాధవరావు, సభ్యులు డి.శ్రీనివాసులు, పీవీ సుబ్బారావు, జి.ఉమామహేశ్వరి, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది ● ఎస్పీ హర్షవర్ధన్రాజు ఒంగోలు టౌన్: కొత్త చట్టాలపై పోలీసు అధికారులంతా పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంలని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు సూచించారు. నూతన చట్టాలకు అనుగణంగా రూపొందించిన రిజిస్టర్లను నిక్కచ్చిగా నిర్వహించడం తప్పనిసరని స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్లో గురువారం నూతన చట్టాలపై పోలీసు అధికారులు, పోలీస్స్టేషన్ల రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటలైజేషన్, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా నూతన చట్టాలను రూపొందించినట్లు వివరించారు. జీరో ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్లను సమర్ధవంతంగా అమలు చేయడంలో రికార్డులు కీలకమని చెప్పారు. అధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్ఐఆర్, దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ సమన్స్ పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్, ఈ ఎవిడెన్స్ వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లు కొత్త విధానం ప్రకారం నిర్వహించాలని సూచించారు. రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ప్రిలిమినరీ ఎంకై ్వరీ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయడానికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలన్నారు. నేరాల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్త చట్టాల అమలుతో పోలీసుల జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మార్కాపురం సబ్ కలెక్టర్ బదిలీ
మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆయనను గృహ నిర్మాణశాఖ డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్కుమార్మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు వన్టౌన్: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు, అభ్యర్థులు తమ పేర్ల నమోదుకు 83099 15577 నంబర్నుగానీ, ఒంగోలులోని భాగ్యనగర్ 4వ లైన్ 11వ అడ్డరోడ్డులో ఉన్న రూడ్సెట్ సంస్థ కార్యాలయంలోగానీ సంప్రదించాలని సూచించారు. ఒంగోలు వన్టౌన్: జీఎస్టీపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని జేసీ గోపాలకృష్ణ సూచించారు. స్థానిక ప్రకాశం భవన్ వద్ద నుంచి గురువారం ఏర్పాటు చేసిన జీఎస్టీ 2.0 ర్యాలీని జేసీ ప్రారంభించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకురావడంతో మెడిసిన్స్, మొదలు అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గిందని తెలిపారు. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించినట్లు చెప్పారు. వాటన్నింటిపై అవగాహన ఉండాలని సూచించారు. డ్రగ్ కంట్రోలర్ పీఎస్ జ్యోతి, డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీరామమూర్తి, ఒంగోలు రిటైల్ షాప్ అధ్యక్షుడు జి.వెంకటరెడ్డి, వి.వెంకటరావు, వైద్యారోగ్యశాఖ తరఫున డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.శ్రీనివాసనాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సూరిబాబు, ఆర్బీఏకే నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, జిల్లా మీడియా అధికారి బెల్లం నరసింహరావు, నర్సింగ్ విద్యార్థులు, అధ్యాపకులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో హెచ్ఎం కొట్టడంతో విద్యార్థినికి ఫిట్స్ వచ్చి ఆస్పత్రి పాలైంది. బుధవారం జరిగిన ఈ సంఘటన గురువారం పాఠశాల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్ త్రివినాగ్కు బాధిత విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కీర్తన అనే విద్యార్థిని తరచూ పాఠశాలకు లేటుగా వస్తుందన్న కారణంతో బుధవారం హెచ్ఎం శ్రీదేవి కొట్టడంతో ఫిట్స్కు గురవగా, వెంటనే సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ఇంటికి వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి దేవి గురువారం ఉదయం పాఠశాల తనిఖీ నిమిత్తం సబ్ కలెక్టర్ త్రివినాగ్ వస్తున్నాడని తెలుసుకుని హెచ్ఎం శ్రీదేవిపై ఆయనకు ఫిర్యాదు చేసింది. స్పందించిన సబ్ కలెక్టర్.. పాఠశాల హెచ్ఎంపై విచారణ చేసి నివేదిక పంపాలని ఎంఈఓను ఆదేశించారు. పాఠశాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆలస్యంగా రావడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రేయర్ సమయానికల్లా హాజరుకావాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులు ఉదయం 8.45 గంటల్లోగా పాఠశాలకు చేరుకునేలా వార్డెన్లకు సమాచారం పంపాలని హెచ్ఎంలకు సూచించారు. లేకుంటే వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. -
పార్టీ అండగా ఉంటుంది
భయం వద్దు..● వైఎస్సార్ సీపీ శ్రేణులకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భరోసా ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వ వేధింపులకు వైఎస్సార్ సీపీ శ్రేణులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. వినాయకుని నిమజ్జనంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటలు పెట్టారనే అక్కసుతో ఒంగోలు 45వ డివిజన్కు చెందిన వైఎస్సార్ సీపీ వర్గీయులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపగా, బెయిల్పై బయటకు వచ్చిన వారు గురువారం వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. నిమజ్జనం రోజు ఏం జరిగిందో వైవీకి వివరించారు. మహిళల పట్ల కూడా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, 50 మందికిపైగా వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసు బనాయించారని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి ప్రజల్లో పెరుగుతున్న బలాన్ని చూసి భయపడుతున్న కూటమి పాలకులు వైఎస్సార్ సీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేసే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులో బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ న్యాయవాదులు పెన్నా నాగరాజు, ధర్నాసి హరిబాబు, జయచంద్రనాయక్, అలికేపల్లి యగ్నేశ్వరరెడ్డి, కోడూరి రవిబాబును వైవీ సుబ్బారెడ్డితో పాటు పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అభినందించారు. వారి వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ ఉన్నారు. -
కాసులు పిండేస్తాం!
కేసులు పెడతాం..ఇతర లారీలు ససేమిరా... ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం కంటే అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. ప్రతి మండలంలో ఐదు నుంచి పది మంది లూజు ఇసుక అమ్ముకుని జీవించేవారు. బలవంతంగా వారిని అమ్ముకునే పరిస్థితి లేకుండా చేశారు. – డాకాల పుల్లయ్య, రైతు సంఘ నియోజకవర్గ కార్యదర్శి బేస్తవారిపేట: జిల్లాలో వందలాదిమంది ఇసుక వ్యాపారులున్నారు. ఏళ్ల తరబడి ఇసుక అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సుమారు 400 నుంచి 500 మంది ఇసుక విక్రయాలపై బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇసుక రీచ్ల నుంచి ఇసుక తెచ్చుకుని అమ్ముకోకుండా వారిపై ఒత్తిడి చేయడం, పోలీసు కేసులతో బెదిరించడంతో పాటు భయాందోళనకు గురిచేశారు. ఇసుక వ్యాపారుల టిప్పర్లను ధ్వంసం చేయడమే కాకుండా రోజుల తరబడి వారి అధీనంలో పెట్టుకుని వేధించారు. దాంతో టిప్పర్ యజమానులు, ఇసుక వ్యాపారులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అయినప్పటికీ పచ్చనేతలు ఊరుకోలేదు. ప్రైవేటు వ్యాపారులు ఇసుక అమ్మడానికి వీళ్లేదని ఆంక్షలు విధించారు. ఎవరైనా ఇసుక తెచ్చుకున్నా తమ ఇసుక స్టాక్ పాయింట్లో, చెప్పిన ధరకే అన్లోడ్ చేయాలని హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక ఇసుక వ్యాపారులు కూలి పనులకు వెళ్తున్నారు. కొందరు మాత్రం పచ్చనేతలతో బేరం కుదుర్చుకుని స్టాక్ పాయింట్కు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు రూ.2.75 కోట్ల దోపిడీ... జిల్లాలో నెలకు 50 నుంచి 65 వేల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల అంచనా. ప్రతి టన్నుపై టీడీపీ నాయకులు 500 నుంచి 700 రూపాయలు అధికంగా ఎల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు రూ.2.75 కోట్లకుపైగా అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారని సమాచారం. ఇంత భారీ మొత్తం దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఇంకా ఉచిత ఇసుక గురించి మాట్లాడుతుండటంపై సామాన్యులు మండిపడుతున్నారు. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలో పరిస్థితిని పరిశీలిస్తే.. కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో దాదాపుగా నెలకు 8500 టన్నుల ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు లారీలో ఇసుక తీసుకొస్తే టన్ను రూ.800కు స్టాక్ పాయింట్లో దించాలి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు టన్ను రూ.1200 ప్రకారం స్టాక్ పాయింట్లకు చేరవేస్తున్నారని తెలుస్తోంది. టన్నుకు అదనంగా రూ.400 నుంచి రూ.700 దండుకుంటున్నారు. 8500 టన్నులకు నెలకు రూ.34 లక్షలు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గతంలో రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై ఇసుక స్టాక్ పాయింట్ను అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రతి మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలకు అప్పగించారు. వీరు అదనపు దోపిడీకి తెరలేపారు. బేస్తవారిపేట జంక్షన్, కొమరోలు, రాచర్ల మండల కేంద్రాల్లో టన్ను రూ.1300, అర్ధవీడులో టన్ను రూ.1500, గిద్దలూరులో టన్ను రూ.1200, కంభంలో రూ.1500కు విక్రయిస్తున్నారు. మండల కేంద్రం నుంచి పల్లెలకు ట్రాక్టర్లతో ఇసుక తరలించడానికి అదనపు భారం పడుతోంది. గతంలో 40 టన్నుల లారీ ఇసుక రూ.34 వేల నుంచి రూ.36 వేలకు వచ్చేది. నేడు రూ.52 వేలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. బాడుగ అదనం... తరలించే దూరాన్ని బట్టి టన్నుకు రూ.200 నుంచి రూ.400 బాడుగ అదనంగా చెల్లించాలి. అరకొరగా అవసరమైన ఇసుకను తెచ్చుకోవాలంటే బాడుగ ఖర్చులు భారంగా మారుతున్నాయి. మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో స్టాక్ యార్డ్ పేరుతో ఈ దందా జరుగుతోంది. ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎమ్మెల్యేల అనుచరులు ఇసుక అమ్మకాలపై డేగకన్ను వేశారు. లూజుగా ఇసుక అమ్ముకునే వ్యక్తుల వద్దకు వెళ్లి కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో బాడుగలకు వెళ్లిన లారీలు ఖాళీగా తిరిగి వచ్చే సమయంలో ఇసుక తెచ్చుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది. వారిని పోలీసులతో బెదిరించి పోలీస్స్టేషన్లలో లారీలను పెట్టడంతో వారు చెప్పిన ధరకే డంపింగ్ యార్డ్లో అన్లోడ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిద్దాం
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని చూస్తుందని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడిక్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్పరం చేసి పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సంతకాలు సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలో తొలుత పాకల గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పేద విద్యార్థులు, పేద ప్రజల కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పూనుకుంటే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేసి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. పాకలలోని అభ్యుదయ కళ్యాణమండపంలో జరిగే కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై వెంకటేశ్వరరావు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొంటారన్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, నరేందర్రెడ్డి, షేక్ మహమ్మద్బాషా, షేక్ సుల్తాన్, యనమల మాధవి, చుక్కా కిరణ్కుమార్, దాసు శ్రీను, గొల్లపోతు గోవర్దన్, నరేష్, పటేల్, కోమట్ల వెంకారెడ్డి, గాలిబుజ్జి, బుజ్జమ్మ, పెరికాల సునీల్, కుంచాల రవి, చొప్పర శివ, షేక్ అల్లాభక్షు, సోమిశెట్టి సురేష్, రావినూతల అంకయ్య, ఎం భాగ్యలక్ష్మి, కేశవరపు నవీన్రెడ్డి, ఎం జెస్సిపాల్, షేక్ కరీం, మాదాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
త్రిపురాంతకం: బొలోరా వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడపి – మానేపల్లి రోడ్డులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. త్రిపురాంతకం మండలం గణపవరానికి చెందిన మందా పేరయ్య (22), మందా కోటేష్లు పుల్లలచెరువు మండలం ఐటీవరంలో ఉన్న తల్లి కోటమ్మ వద్దకు వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో పేరయ్య అక్కడికక్కడే మృతి చెందగా కోటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. బేల్దారీ పనుల నిమిత్తం గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతుడు పేరయ్య తండ్రి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. బొలోరా వాహనంలో ప్రయాణిస్తున్న ఐటీవరానికి చెందిన కొన్ని కుటుంబాలు రవ్వారంలోని గురప్పస్వామి దేవాలయానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. సీఐ అసాన్, ఎస్సై శివబసవరాజులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన పేరయ్య కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వారితో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మరొకరి పరిస్థితి విషమం మేడపి–మానేపల్లి రోడ్డులో ప్రమాదం -
సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి
● సోమవారం నుంచి విధుల్లోకి.. కనిగిరి రూరల్: మెగా డీఎస్సీ ద్వారా ఎంపికై న సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తయినట్లు డీఈఓ కిరణ్కుమార్ తెలిపారు. స్థానిక ఆల్ఫా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి స్థానాలు కేటాయించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో 124 మంది సెకండరీ గ్రేడ్ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై నట్లు తెలిపారు. వారికి ఈ నెల 3వ తేదీ నుంచి రెసిడెన్షియల్ తరహాలో శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. సోమవారం నుంచి వారంతా కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు. కౌన్సెలింగ్లో మండల విద్యాశాఖ అధికారులు యూవీ నారాయణరెడ్డి, జి.సంజీవి, రాజాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అంతరిక్ష వారోత్సవాలు
ప్రాజెక్టులు పరిశీలిస్తున్న విద్యార్థులు బహుమతులు అందజేస్తున్న దృశ్యం ● రెండో రోజు స్పేస్ ఎగ్జిబిషన్కి విశేష స్పందన ఒంగోలు సిటీ: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షార్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇస్రోలో చేసిన వివిధ ప్రయోగాల గురించి వివరించారు. రానున్న కాలంలో మరిన్ని ప్రయోగాలు చేస్తామన్నారు. గగన్యాన్ తదితర ప్రాజెక్టుల గురించి విద్యార్థులకు వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం సైన్సు రంగంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది లివ్ ఇన్ స్పేస్ కాన్సెప్ట్తో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజల్లో, విద్యార్థుల్లో సైన్సు గురించి అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వారోత్సవాలకు ఏర్పాటు చేసిన క్విస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రి దేవిలకు కృతజ్ఞతలు తెలిపారు. 3 వేల మంది విద్యార్థుల సందర్శన అంతరిక్ష వారోత్సవాలకు వివిధ పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు 3 వేల మంది హాజరయ్యారు. స్పేస్ ఎగ్జిబిషన్, ప్రాజెక్ట్ ఎక్స్పోని తిలకించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎక్స్ పో, పెయింటింగ్ పోటీలు, క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్ తదితర పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ హనుమంతరావు, డీపీఎస్ ఆర్ డైరెక్టర్ డాక్టర్ బీవీ సుబ్బారావు, వరల్ట్ స్పేస్ వీక్ – 2025 ఒంగోల్ సబ్ కమిటీ ఛైర్మన్ లీలా నాగ శ్రీనివాసరావు, మెంబర్ సెక్రటరీ ఆదిత్య, ఇస్రో అధికారులు రామాంజనేయులు, అప్పారావు, శివ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెల్టు, కల్తీ మద్యంపై ఆందోళన చేస్తాం
ఒంగోలు సిటీ: ప్రజల పక్షాన నిలబడి బెల్టుషాపులు, కల్తీ మద్యంపై ఆందోళన చేస్తామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యంకి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పాలసీ మార్చేసిందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ కూటమి నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, రకరకాల అంశాలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి కల్తీ మద్యాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్టుషాపులు మూసివేస్తే కల్తీ మద్యానికి ఆస్కారం ఉండదన్నారు. లిక్కర్ స్కాం పేరుతో అక్రమ అరెస్టులు... ఏమీ లేని దానికి తమ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ అక్రమ అరెస్టులు చేస్తూ భూతద్ధంలో చూపిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించామన్నారు. లక్షలు వెచ్చించి ఖరీదైన వైద్యాన్ని పేదలు చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలలు ప్రారంభించామన్నారు. వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్న గొప్ప ఆలోచనతో వాటిని ప్రారంభించామని అన్నారు. వాటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న కుట్రతో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెస్తోందన్నారు. ప్రైవేటీకరణను ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నర్సీపట్నంలో నిర్మాణం మొదలుపెట్టిన కళాశాల వద్దకు ఆయన వెళ్తున్నారన్నారు. ఒక్కరోజులో అన్ని భవనాల నిర్మాణాలు పూర్తికావని, నర్సీపట్నంలో ఏమీలేదన్న స్పీకర్ ప్రకటనపై వాస్తవాలు చూపించేందుకు తమ పార్టీ అధినేత వెళ్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసే హక్కు ఎవరికై నా ఉంటుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేయలేమని చెప్పడం సరికాదని, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఆ స్థాయిలో రక్షణ కల్పిస్తే ఎలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదని వైవీ అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు ఉంటే మెరుగైన వైద్యం అందుతుందా..లేదా..? అన్నది ప్రజలు కూడా గమనించాలన్నారు. డీఎస్సీ పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. దానిపై విచారణ జరిపించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలన్నారు. వైవీ సుబ్బారెడ్డి వెంట వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేట్పరం దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయాలని చూడటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామ/వార్డు రచ్చబండ ద్వారా సంతకాలు సేకరిస్తామన్నారు. కొండపి నియోజకవర్గంలోని పాకల గ్రామంలో 10వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం ఒంగోలులో సంతకాల సేకరణ చేస్తామన్నారు. అక్టోబర్ 28న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 23న నియోజకవర్గాల కేంద్రాల నుంచి సంతకాలు చేసిన వినతిపత్రాలు జిల్లా కేంద్రాలకు వచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు లేదా ఇన్చార్జిలు జెండా ఊపి ప్రారంభించాలని తెలిపారు. నవంబర్ 24న సంతకాలు చేసిన వినతిపత్రాలను జిల్లా కేంద్రం నుంచి కేంద్ర కార్యాలయానికి చేర్చే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ జాబితాలను గవర్నర్ అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రవేశపెట్టిన 104, 108 వాహనాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు. పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యం.. పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. అందులో 7 మెడికల్ కళాశాలలు నిర్మాణాలు పూర్తికాగా, 10 కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కానీ టీడీపీ నాయకులు నిత్యం అబద్ధాలు వల్లె వేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంతటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. కనీసం ఓట్లు వేసిన ప్రజల కోసమైనా టీడీపీ నాయకులు నిజాలు మాట్లాడాలన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అందుకే కోటి సంతకాలను సేకరిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాలలు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్పరం కానివ్వకుండా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ పార్లమెంట్ కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, జాయింట్ సెక్రటరీ బొగ్గుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
దర్శి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సాయినగర్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జునరావు, పద్మజలు బైక్పై వెళుతుండగా కుక్క అడ్డు రావడంతో అందుతప్పి కిందపడి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. ఒంగోలు టౌన్: నగరంలోని స్పా సెంటర్లలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని సీఐలు, ఎస్సైలతో కూడిన 9 బృందాలు నగరంలోని 9 స్పా సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్పా సెంటర్ల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులు, అనుమతులు, స్పా సెంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించారు. స్పా సెంటర్లలోని సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటి పనితీరు, అంతర్గత నిర్మాణ శైలి వంటివాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్ష వర్థన్ రాజు మాట్లాడుతూ...స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ఉజ్వల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. తనిఖీల్లో ఒన్టౌన్ సీఐ నాగరాజు, సబ్ డివిజన్ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, సుధాకర్, పున్నారావు, అజయ్బాబు, వెంకటసైదులు, నాగేంద్ర కుమార్, ఫణిభూషన్ పాల్గొన్నారు. దొనకొండ: బాడుగకు ఆటో మాట్లాడుకుని డ్రైవర్పై కత్తితో దాడి చేసి ఆటోను తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని మల్లంపేట సమీపంలో జరిగింది. ఎస్సై టి.త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురానికి చెందిన నాగరాజు ఆటోను దొనకొండకు గుర్తు తెలియని వ్యక్తి రూ.600 కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్కాపురం నుంచి మల్లంపేట మీదుగా దొనకొండకు బయల్దేరారు. ఆటో మల్లంపేట గ్రామం దాటిన వెంటనే ఆటోలో కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి డ్రైవర్ నాగరాజుపై కత్తితో దాడి చేసి కింద పడేసి ఆటో తీసుకుని పరారయ్యారు. గాయపడిన నాగరాజు సమీపంలోని మల్లంపేటకు చేరుకుని గ్రామస్తుల సహకారంతో చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. సమాచారం తెలుసుకున్న దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందుతుడి కోసం గాలింపు వేగవంతం చేయాలని పోలీస్ సిబ్బందికి ఆయన సూచించారు. ● మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు దర్శి: ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గమని మాజీ శాసనమండలి సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. సీఐటీయూ, యూటీఎఫ్, జనవిజ్ఞాన వేదికల అధ్వర్యంలో తాండవ రంగారావు అధ్యక్షతన తాలూకా క్లబ్ సమావేశం హాలులో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసినప్పుడు వేతనాలు పెంచుతామని ఇచ్చిన వాగ్దానం నేటికీ అమలు కాలేదన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, 6 డీఏలు ఇవ్వాల్సి ఉన్నా ప్రకటించడం లేదని, అందుకోసం పోరాటాలు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రపంచ విప్లవకారుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, యూటీఎఫ్, జేవీవీ నాయకులు మీనిగ శ్రీనివాసరావు, రాజశేఖర్, ఫాతిమా, తిరుపతమ్మ పాల్గొన్నారు. -
ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేయాలి
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు వన్టౌన్: ఉపాధి కల్పనే లక్ష్యంగా సంబంధిత శాఖలు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పీ రాజాబాబు అధికారులను ఆదేశించారు. నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పనపై బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి మార్గం చూపించాలన్నారు. సెర్ప్, మెప్మా, నైపుణ్యాభివృద్ధి విభాగాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు మరింత చురుకై న పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. సెర్ప్, మెప్మా పొదుపు సంఘాలలోని మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం వివిధ వృత్తులు చేస్తున్నారని, వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని కల్పించడం ద్వారా వారి వద్ద మరింత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పొదుపు సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సంయుక్తంగా మినీ డైరీ ఫారాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మెప్మా ద్వారా ఉపాధి కల్పిస్తున్న, భవిష్యత్తు అవకాశాలను తెలుపుతున్న బ్రోచర్ను సమావేశంలో కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, ఉపాధి కల్పన అధికారి రమాదేవి, రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఇన్చార్జి రజనీ కుమారి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
క్యాన్సర్పై అవగాహన అవసరం
ఒంగోలు టౌన్: క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని, మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక వైద్య శాఖ కార్యాలయంలో ఆశా, ఏఎన్ఎంలకు బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్యాన్సర్ అనుమానిత కేసులను వెంటనే వైద్యాధికారికి రెఫర్ చేయాలని ఆదేశించారు. వైద్యాధికారి సదరు కేసులను జీజీహెచ్లోని ప్రివెంటివ్ అంకాలజీ విభాగానికి చెందిన రూం నంబర్ 222కు రెఫర్ చేయాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలను పురస్కరించుకొని రొమ్ము క్యాన్సర్ స్వీయ పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో ఆరోగ్య చర్చలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా క్యాన్సర్పై తగిన పరిజ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పారు. బ్యానర్లు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుందనే నినాదాలతో అవగాహనా శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వజన ఆస్పత్రి వైద్యులు భగీరథి, ఎన్సీడీ సీడీ నోడల్ డాక్టర్ కమలశ్రీ, డాక్టర్ నళిని, డాక్టర్ వాణిశ్రీ, హెచ్సీజీ క్యాన్సర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీసీ అవినీతిపై విజిలెన్స్ విచారణ
దొనకొండ: గతంలో సీ్త్ర శక్తి కార్యాలయంలో సీసీగా విధులు నిర్వర్తించిన ఈవీ సుచేంద్రరావు అవినీతిపై జిల్లా విజిలెన్స్ సీఐ ఎన్.ఎస్.ఎస్.అపర్ణ బుధవారం విచారణ చేపట్టారు. స్థానిక సీ్త్ర శక్తి కార్యాలయంలో గ్రూపు మహిళలు, సిబ్బందితో ఆమె మాట్లాడారు. 2016 నుంచి 2019 వరకు సీసీ సుచేంద్రరావు సుమారు రూ.13 లక్షలను ఇతర అకౌంట్లకు బదిలీ చేసి స్వాహా చేశారని కేసు నమోదైంది. ఒంగోలు డీఆర్డీఏ వెలుగు వారు ఈ అవినీతి కేసును జిల్లా విజిలెన్స్ సీఐ అపర్ణకు అప్పగించారు. అవినీతికి పాల్పడిన వారందరికీ ఫోన్ చేసి సీఐ మాట్లాడారు. బేతేలు గ్రామ సంఘం రూ.1.46 లక్షలు, పెద్దగుడిపాడు రూ.6.36 లక్షలు, యర్రబాలెం రూ.3.10 లక్షలు, గంగదేవిపల్లి రూ.2.48 లక్షలు, బాదాపురం రూ.35 వేలు, రాగమక్కపల్లి రూ.14,500 వేలు కలిపి మొత్తం రూ.13,89,500ను సుచేంద్రరావు తనకు అనుకూలంగా ఉన్న వారి అకౌంట్లలో జమ చేసి వారి దగ్గర నుంచి తీసుకున్నట్లు సమాచారం. అంతేగాకుండా తన కుటుంబ సభ్యులైన భార్య, తల్లి అకౌంట్లలో కూడా నగదు జమచేసినట్లు రికార్డు పూర్వకంగా రుజువైందని ఆమె తెలిపారు. దీనికి బ్యాంకు వారు కూడా సహకరించినట్లు సమాచారం. ఎవరి అకౌంట్లలో జమచేశారో వారందరిపై నేరం రుజువైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సీఐ హెచ్చరించారు. ముందుగా కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆరోపణలపై వచ్చిన సిబ్బందిని పిలిపించి మాట్లాడారు. స్థానిక కెనరా బ్యాంక్కు వెళ్లి పూర్తి సమాచారం తీసుకున్నారు. రూ.6 లక్షలు సుచేంద్రరావు కట్టినట్టు వివరించారు. రుద్రసముద్రంలో రేషన్ షాపును తనిఖీ చేశారు. గతంలో విధులు నిర్వహించిన ఏపీఎం మాణిక్యరావు.. సుచేంద్రరావు చేసిన అవినీతిని వెలికితీసి విచారించగా అవినీతి చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వటంతో సుచేంద్రరావును సస్పెండ్ చేశారు -
జ్వరాలకు భయపడాల్సిన అవసరం లేదు
● జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు కురిచేడు: పస్తుత పరిస్థితుల్లో ఏ జ్వరమైనా భయపడాల్సిన పనిలేదని, అన్ని రకాల జ్వరాలకు వైద్యం అందుబాటులో ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. డెంగీతో విద్యార్థిని మృతిచెందిన కురిచేడు మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారం గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. డెంగీ జ్వరంతో మరణించిన విద్యార్థిని కేసనపల్లి మధురవాణి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని ఏఎన్ఎం వద్ద జ్వర పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎవరికి ఏ జ్వరమొచ్చినా ఇష్టం వచ్చినట్లు మందులు వాడకుండా ఏఎన్ఎంలనుగానీ, లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగానీ సంప్రదించాలని కోరారు. డెంగీ జ్వరానికి కూడా మందులున్నాయని, సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే కచ్చితంగా తగ్గుతుందని అన్నారు. డెంగీ జ్వరం వచ్చిన 3 రోజుల తర్వాత పరీక్షలలో నిర్ధారణ జరుగుతుందన్నారు. రెండో రోజు డెంగీ పరీక్ష పాజిటివ్ రావడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రక్త పరీక్ష చేసిన ల్యాబ్ను, వైద్యచికిత్స అందించిన వైద్యశాలను తనిఖీ చేసి మధురవాణికి వాడిన మందుల గురించి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థాయిని మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఆర్ఎంపీలను హెచ్చరించారు. ప్రజలు సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా వుండాలని, ఏ అనుమానం వచ్చినా వెంటనే ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎన్.మధుసూదనరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇద్దరు వేటగాళ్లు అరెస్టు
గిద్దలూరు రూరల్: గిద్దలూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని సండ్రపాడు బీటు అభయారణ్యంలో వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి అరెస్టు చేశారు. మండలంలోని కె.బయనపల్లె గ్రామానికి చెందిన మన్నెం రంగయ్య, దిగువమెట్ట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాటుతుపాకీతో అభయారణ్యం ప్రాంతంలో తిరుగుతున్నట్లు మంగళవారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, ఎఫ్బీఓలు చంద్రశేఖర్రెడ్డి, చాంద్బాషలు అడవిలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో వేటాడేందుకు తుపాకీ చేతిలో ఉన్న ఇద్దరు వారి కంటపడ్డారు. అనుమానం వచ్చి వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా వన్యప్రాణులను వేటాడేందుకు అడవిలోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో వారి వద్ద ఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మద్దిపాడు: మండలంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయానికి వరద నీరు ఉధృతంగా చేరుతోంది. గిద్దలూరు, వినుకొండ తదితర గుండ్లకమ్మ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో మారెళ్ల వద్ద ఉన్న ఈదర వాగు, తాళ్లూరు మండలంలోని దోర్నపు వాగు, చిలకలేర్లు ఉధృతంగా ప్రవహిస్తూ గుండ్లకమ్మ నదిలో కలుస్తున్నాయి. దీంతో బుధవారం తెల్లవారుజామున గుండ్లకమ్మ రిజర్వాయర్కు వరద నీరు భారీగా చేరింది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి బయటకు విడుదల చేశారు. రిజర్వాయర్లోకి 12 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా ఆరు గేట్ల ద్వారా 12 వేల కూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ రామాంజనేయులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం 24 మీటర్ల వద్ద నీటిని నిల్వ ఉంచినట్లు చెప్పారు. వరద ఉధృతి కొనసాగితే ఎక్కువ గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తామన్నారు. -
అర్హత ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
ఒంగోలు: విచారణలో ఉన్న, అర్హత ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. బుధవారం విచారణలో ఉన్న ఖైదీల విషయాలపై స్థానిక తన చాంబరులో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో తమ కేసులు నడిపించుకునేందుకు న్యాయవాదిని నియమించుకోలేని ప్రతి ఖైదీకి ఉచితంగా న్యాయవాదిని నియమించి వారికి న్యాయ సహాయం అందిస్తామన్నారు. రెవెన్యూశాఖ, పోలీసుశాఖ, జైళ్ల శాఖల అధికారులు సమన్వయంగా వ్యవహరించి చట్టపరంగా సమస్యలు పరిష్కారానికి విచారణ ఖైదీలకు సహకరించాలన్నారు. ఆర్డీవో సీహెచ్ ఓబులేసు, సీఐలు మల్లిఖార్జునరావు, దేవ ప్రభాకర్, జైలు శాఖ అధికారులు శ్రీనివాసరావు, యలమందరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
క్విస్లో అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
● సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ ఒంగోలు సిటీ: శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ , ఇస్రో, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి షార్ డైరెక్టర్ పద్మకుమార్, అసోసియేట్ డైరెక్టర్ ముత్తుచెరియన్, క్విస్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రి దేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ పద్మకుమార్ విద్యార్థులకు షార్, ఇస్రో పనితీరును వివరించారు. రాకెట్ లాంచింగ్ ఏ విధంగా ప్రారంభమైందో వివరించారు. రానున్న కాలంలో ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేస్తోందని, దానికి అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది లివ్ ఇన్ స్పేస్ కాన్సెప్ట్తో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, స్పేస్ ట్రావెల్ ఎలా ఉంటుంది? స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను సామాన్యులకు తెలిసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అసోసియేట్ డైరెక్టర్ ముత్తుచెరియన్ మాట్లాడుతూ షార్, ఇస్రో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసిందన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో తమ టెక్నాలజీని వాడుతున్నారన్నారు. ఓషన్ టెక్నాలజీలో సైతం ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు. అలరించిన అంతరిక్ష ప్రదర్శన... అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 2000 మంది విద్యార్థులు ప్రదర్శనను వీక్షించారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ హనుమంతరావు, డీపీఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, సీఎస్ సీడీఈ డీన్ డాక్టర్ భార్గవ్, వరల్ట్ స్పేస్ వీక్ – 2025 ఒంగోల్ సబ్ కమిటీ ఛైర్మన్ లీలా నాగ శ్రీనివాసరావు, మెంబర్ సెక్రటరీ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
పార్శిల్ సెంటర్ల ఆకస్మికంగా తనిఖీ
ఒంగోలు టౌన్: నగరంలోని పాత మార్కెట్ సెంటర్, పాపా రైస్ మిల్, పద్మ టవర్, ఏ వన్ ఫంక్షన్ హాలు ఎదురుగా ఉన్న పార్శిల్ సెంటర్లను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింధూ పోలీసు డాగ్తో ఆయా కార్యాలయాల్లోని అన్నీ రకాల పార్శిళ్లను పరిశీలించారు. అనుమానం వచ్చిన పార్శిళ్లను తెరచి తనిఖీలు చేయించారు. జిల్లాలో ఏఏ ప్రదేశాల నుంచి పార్శిళ్లు ఎక్కువగా వస్తున్నాయో, ఏ రకం పార్శిళ్లు వస్తున్నాయో కార్యాలయాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పార్శిళ్లను ఎన్ని రోజులు స్టోరేజి ఉంచుతారు, పార్శిల్ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారా లేదా, వాటికి సంబంధించిన హార్ట్ డిస్క్లు ఎక్కడ ఉంటాయనే అనే విషయాలను ఆరా తీశారు. చౌక డిపోల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియాన్ని అక్రమంగా తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పార్శిల్ సర్వీసుల నిర్వాహకులకు ఆదేశాలిచ్చారు. ఒకవేళ ఎవరైనా రేషన్ బియ్యాన్ని తరలించినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పార్శిల్ చేస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు. మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, టాస్క్ఫోర్స్ ఎస్సై చెంచయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● నంద్యాల ఫారెస్టు కన్జర్వేటర్ విజయకుమార్ మార్కాపురం: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నంద్యాల అటవీశాఖ కన్జర్వేటర్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి విజయ్కుమార్, సబ్కలెక్టర్ త్రివినాగ్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బుధవారం మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం అనంతరం, ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి బాగుండాలంటే అడవులను సంరక్షించుకోవాలని, వాటితోపాటు అందులో జీవించే వివిధ రకాల వన్యప్రాణులను కూడా కాపాడినప్పుడే ప్రకృతి సమతుల్యత బాగుంటుందని అన్నారు. అవగాహన లేక పలువురు అటవీ ప్రాంతంలోకి వేటకు వెళ్లి వన్యప్రాణులను చంపుతున్నారని, ఇది సహించరాని నేరమని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద జైలుకు పంపుతామని హెచ్చరించారు. మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, నెమళ్లు పలురకాల వన్యప్రాణులు ఉన్నాయని, ఇవి పొరపాటున జనావాసాల్లోనికి వస్తే వాటిపై రాళ్లు విసిరి చంపకుండా తమకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణపై పలువురు విద్యార్థినులు మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వన్యప్రాణులను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గిద్దలూరు, నంద్యాల అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్లు నిషాకుమారి, అనురాగ్ మీనా, మార్కాపురం డీఎస్పీ డాక్టర్ నాగరాజు, శ్రీశైలం, నంద్యాల సబ్డీఎఫ్ఓలు బాలరాజు, భవిత కుమారి, ఎఫ్ఆర్ఓ పిచ్చిరెడ్డి, డీఆర్ఓ నాగరాజు గౌడ్, హెచ్ఎం శ్రీదేవీ తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న కూలీల ఆటోను ఢీకొన్న కారు
● ఆటో డ్రైవర్తో పాటు ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు పెద్దదోర్నాల: కూలీలను ఎక్కించుకునేందుకు రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను వేగంగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని యడవల్లి తిరమలనాథ స్వామి కొండ వద్ద చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ ఒడిచర్ల కృష్ణారెడ్డితో పాటు ఆటోలో ఎక్కుతున్న చిట్యాల సరస్వతి, అల్లు నారాయణమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు ఐనముక్కలకు చెందిన వ్యవసాయ కూలీలు కొందరు యడవల్లి వద్ద జరుగుతున్న వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పనుల్లో పాల్గొన్న వ్యవసాయ కూలీలను తీసుకొచ్చేందుకు ఐనముక్కలకు చెందిన ఓ ఆటో యడవల్లి వద్ద ఉన్న తిరుమలనాథ స్వామి ఆలయం వద్ద రోడ్డుపై ఆగింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ కృష్ణారెడ్డితో పాటు మరి కొందరు వ్యవసాయ కూలీలు ఆటోలో ఎక్కే సమయంలో వేగంగా వస్తున్న కర్నాటకకు చెందిన ఇన్నోవా కారు ఢీకొనటంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిట్యాల సరస్వతి, ఒడిచర్ల కృష్ణారెడ్డిలను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాతాళంలో పొగాకు ధరలు
చీమకుర్తి: పొగాకు రైతుల ఆశలు రోజురోజుకూ ఆవిరవుతున్నాయి. పొగాకు కొనుగోళ్లలో బ్రైట్ పొగాకు కేజీ ధర గరిష్టంగా రూ.346 పలికింది. ఇప్పుడు అది రూ.315కు పడిపోయింది. సరాసరిన రూ.234 వద్ద నిలిచింది. లోగ్రేడ్ పొగాకు మొదట్లో గరిష్టంగా కేజీ రూ.160– రూ.170 మధ్య పలికింది. నేడు కనిష్ట ధర రూ.69కు పడిపోయింది. ధరలు పెరుగుతాయేమోనని ఇన్నాళ్లు కోల్డ్స్టోరేజీల్లో దాచిన పొగాకును వేలం కేంద్రాల్లోకి తీసుకొచ్చి విక్రయిస్తుంటే బయ్యర్లు వేస్తున్న ధరలు చూసి రైతులు అక్కడికక్కడే కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నాలుగేళ్ల పాటు పొగాకు రైతులకు స్వర్ణయుగంగా గడిచింది. ఈ ఏడాది మాత్రం రైతులు జీవితంలో మర్చిపోలేని విధంగా దారుణమైన ధరలు పలుకుతుండటంతో పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు ఎలా తీర్చాలో, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎలా విడిపించుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. లోగ్రేడ్ పొగాకు క్వింటా రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలుకుతుంటే ఇక కోలుకునేది ఎక్కడని రైతులు ఆందోళన చెందుతున్నారు.లోగ్రేడ్ కొనే దిక్కు లేదు...హైగ్రేడ్ పొగాకు ధరలు క్రమంగా తగ్గుస్తూ వస్తుండగా మరోపక్క లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు అసలు ముందుకే రావడం లేదు. లోగ్రేడ్ పొగాకు కేజీ ప్రస్తుత ధర రూ.69లకు పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినా సరే లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోగ్రేడ్ బేళ్లను వేలం కేంద్రాలకు తీసురావడం.. అమ్ముడుపోక తిరిగి ఇంటికి తీసుకెళ్లడం రైతులకు పరిపాటిగా మారిపోయింది. దీని వల్ల రైతులపై రవాణా చార్జీలు, వెయిట్లాస్ రూపం మరింత నష్టం వస్తోంది. ఒకసారి వేలం కేంద్రానికి తీసుకురావాలంటే ఒక బేల్కి రూ.200ల ఖర్చవుతుండగా, శాంపిల్స్ రూపంలో బేల్కి ఐదారు కేజీల పొగాకును నష్టపోతున్నారు. ఇలా రెండు మూడు సార్లు వేలం కేంద్రాలకు బేళ్లను తీసుకురావడం వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. దీని వల్ల ప్రస్తుతం ఈ ఏడాది పొగాకు రైతులకు సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.122 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు పూర్తిఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం 11 వేలం కేంద్రాల పరిధిలో మొత్తం 104.6 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేస్తామని బోర్డు అధికారికంగా నిర్ధారించగా రైతులు పరిమితికి మించి సాగు చేయటంతో అది కాస్త 158.6 మిలియన్ కేజీలకు పెంచింది. దానిలో ఇప్పటి వరకు 122 మిలియన్ కేజీల పొగాకు (78 శాతం)ను కొనుగోలు చేసింది. రైతుల వద్ద ఇంకా కొనుగోలు చేయాల్సిన పొగాకు 35 మిలియన్ కేజీల పొగాకు నిల్వలు ఉన్నాయి.దానిలో భాగంగానే పొగాకు నారు మడులను నిర్వహించే రైతుల వద్ద నుంచే ఆంక్షలు మొదలు పెట్టి పొగాకు సాగును నియంత్రిస్తున్నారు. అందుకనుగుణంగానే పొగాకు నారుమడులు పెట్టుకునే వారు ముందుగానే పొగాకు బోర్డు అధికారుల వద్ద అనుమతి తీసుకొని వారు నిర్ణయించిన మేరకే పొగనారుమడులను సాగు చేయాలనే ఆంక్షలు విధిస్తున్నారు. దాంతో రైతులు ఇప్పటి నుంచి పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని బోర్డు అధికారులు ఊరూరు తిరిగి అవగాహన కల్పిస్తున్నారు.158 మిలియన్ కేజీల నుంచి 90 మిలియన్ కేజీలకు తగ్గింపుఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 158 మిలియన్ కేజీల పొగాకు రైతులు సాగు చేయగా వచ్చే ఏడాది దానిని 90 మిలియన్ కేజీలకు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు ఉండే గిట్టుబాటు ధరలు, పొగాకు కంపెనీల అవసరాలను బట్టి రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఈ ఏడాది అనుమతినిచ్చిన 158 మిలియన్ కేజీలను వచ్చే ఏడాదికి 90 మిలియన్ కేజీలకు తగ్గించినట్లు బోర్డు అధికారులు ఇప్పటికే రైతులకు అవగాహన సదస్సులు పెట్టి వివరిస్తున్నారు. దాని ప్రకారం నల్లరేగడి నేలల పరిధిలో ఒక్కో బ్యారన్కు గతంలో 5.56 ఎకరాల్లో సాగుకు, 41.75 క్వింటాళ్లకు అనుమతినిచ్చేవారు. దానిని ఇప్పుడు వచ్చే ఏడాదికి 4.75 ఎకరాలకు పరిమితం చేసి 35.65 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి పెంచకూడదని బోర్డు నిర్ణయించింది. తేలిక రకం నేలల్లో గతంలో 8.42 ఎకరాల్లో సాగు చేసే పరిస్థితి నుంచి 7.25 ఎకరాలకు పరిమితం చేశారు. 42.75 క్వింటాళ్ల నుంచి 36.65 క్వింటాళ్లకు పొగాకు ఉత్పత్తిని తగ్గించారు.లోగ్రేడ్ పొగాకు ధరలు పతనమయ్యాయిపొగాకు లోగ్రేడ్ రకం క్వింటా రూ.7 వేలకు పడిపోయింది. రైతులు పొగాకు మీద పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. చేసేది లేక బయ్యర్లు అడిగిన ధరకు ఇష్టమున్నా, లేకున్నా వేలం కేంద్రాల్లో రైతులు వదిలేసి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు.– సూరం గురవారెడ్డి, పేర్నమిట్టఇప్పటి వరకు 122 మిలియన్ కేజీలను కొనుగోలు చేశాంఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 122 మిలియన్ కేజీల పొగాకును బోర్డు ద్వారా కొనుగోలు చేశాం. రైతుల వద్ద ఇంకా మరో 35 మిలియన్ కేజీల పొగాకు ఉండొచ్చు. దానిని వచ్చే నెలలోపు కొనుగోళ్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాదికి పొగాకు ఉత్పత్తిని 90 మిలియన్ కేజీలకు పరిమితం చేశారు.– ఎస్.రామారావు, ఆర్ఎం, ఒంగోలు -
సంతకాల సేకరణ విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: గ్రామస్థాయిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు జరిగే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలపై చర్చించారు. అక్టోబరు 28 న నియోజకవర్గాల్లో ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. కోటి సంతకాల సేకరణ పూర్తయిన అనంతరం నవంబరు 26 గవర్నర్కు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఏరులై పారుతున్న నకిలీ మద్యం
సంతనూతలపాడు: ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో బూం బూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్తో పాటు సూపర్ సిక్స్ అనే బ్రాండ్ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్ర లోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్థమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మందు తాగొద్దు.. తస్మాత్ జాగ్రత్త: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని మేరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగి పోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లు తయారు చేసి వైన్ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మద్యం బాటిల్ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. -
పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: ఒంగోలులోని డీ.ఎస్.గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (ఆటోనమస్), ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఆర్సెట్ 2024–25) నోటిఫికేషన్ విడుదలైందని, ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, వాటికి అనుబంధ ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్డీ (డాక్టరల్ డిగ్రీ) ప్రోగ్రాంలకు ఫుల్ టైమ్, పార్ట్టైమ్ మోడ్లలో ప్రవేశాలు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.కల్యాణి, రీసెర్చ్ కోఆర్డినేటర్ డా.ఎం.శ్రీనివాస రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కళ్యాణి మాట్లాడుతూ పరీక్షలు వచ్చే నెల 3 నుంచి 7వ తేదీ వరకు వరకు నిర్వహిస్తారన్నారు. అర్హత గల అభ్యర్థులు హెచ్టీటీపీఎస్://సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.ఎపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న డీ.ఎస్.గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్లు (పుల్టైమ్, పార్ట్టైమ్) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రీసెర్చ్లో ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కాలేజీ అనుభవజ్ఞులైన పరిశోధనా మార్గదర్శకులు, లైబ్రరీ, ల్యాబ్ సదుపాయాలతో మహిళా పరిశోధకుల కోసం ఒక సురక్షితమైన, ప్రోత్సాహకరమైన అకడమిక్ వాతావరణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు సిటీ: జిల్లాలో 35 ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ నోటీసులు జారీ చేసినట్లు ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న 17 ఎయిడెడ్ పాఠశాలలకు 30 డిసెంబర్ 2024న నోటీసులు జారీ చేశారన్నారు. ప్రస్తుతం 35 ఎయిడెడ్ పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మొత్తం జిల్లాలో 52 ఎయిడెడ్ పాఠశాలలు ఏప్రిల్ 23, 2026 నాటికి మూతపడనున్నాయని తెలిపారు. ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేస్తామని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అయితే జిల్లాలో ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సీనియార్టీ జాబితా తయారుచేసి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం 98 ఎయిడెడ్ పాఠశాలల్లో 106 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, 2026 ఏప్రిల్ నాటికి 46 ఎయిడెడ్ పాఠశాలలే మిగులుతాయని తెలిపారు. ఒంగోలు వన్టౌన్: దీపావళి పండుగ సమయానికి జిల్లాలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ పీ రాజాబాబు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ అధికారులతో ప్రకాశం భవన్లోని తన చాంబర్లో బుధవారం సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ స్కీములో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పీఎంఏవై, పీఎం జన్మన్ పథకాల కింద జిల్లాలో మంజూరైన ఇళ్లు, నిర్మాణం పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కానివి, స్థానిక పరిస్థితులపై నియోజకవర్గాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ పి.శ్రీనివాస ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ పూర్తయిన నిర్మాణ దశలను బట్టి ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేస్తున్నందున లబ్ధిదారులందరూ త్వరగా పూర్తి చేసుకునేలా నిరంతరం పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాకు 8839 ఇళ్ల నిర్మాణాల టార్గెట్ ఇచ్చినట్లు పీడీ తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ లక్ష్యాన్ని పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, హౌసింగ్ స్కీములో ఆప్షన్ 3 కింద లబ్ధిదారులుగా ఉన్నవారికి కూడా కాంట్రాక్టర్లు త్వరగా ఇళ్లు నిర్మించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. స్పష్టమైన పురోగతి లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో హౌసింగ్ ఈఈలు, డీఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉపసంహరించుకోండి
13 గంటల పనిదినాన్ని ఒంగోలు టౌన్: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని గంటలను 8 నుంచి 13 గంటలకు పెంచడం దుర్మార్గమని, వెంటనే 13 గంటల పనిదినాన్ని ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. పనిగంటలు పెంచుతూ ఆమోదించిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బుధవారం నగరంలోని ఆర్టీసీ డిపో సెంటర్లో సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పని చేస్తున్న కూటమి ప్రభుత్వం కార్మికుల శ్రమశక్తిని దోచుకునే విధంగా పని గంటలను 8 నుంచి 13 గంటలకు పెంచిందని ఆరోపించారు. ఎన్నో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కాలరాసి తీసుకొచ్చిన పనిగంటల పెంపును మొత్తం కార్మిక లోకం వ్యతిరేకిస్తోందని చెప్పారు. కార్మికులు సాధించుకున్న 29 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి అమలు చేస్తోందని, అందులో భాగంగానే 13 గంటల పనిదినాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో పట్టపగలే రక్షణ లేకుండా పోయిన నేపథ్యంలో రాత్రి పూట మహిళలతో పనులు చేయించాలనుకోవడం వివేకం అనిపించుకోదని విమర్శించారు. దీనివలన మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారి హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలపై కార్మికులు, ఉద్యోగులతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.కల్పన, బాలకోటయ్య, కేఎఫ్ బాబు, కనపర్తి సుబ్బారావు, యం.రమేష్, కాలం సుబ్బారావు, చీకటి శ్రీనివాసరావు, కుమారి, శేషయ్య, కె.వెంకటేశ్వర్లు, బీవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులను ప్రేమ, గౌరవంతో చూడాలి
ఒంగోలు సబర్బన్: వయో వృద్ధులు ప్రేమ, గౌరవంతో జీవించగలిగే ఒక సహాయక సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి మనం కలిసి సంకల్పిద్దామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) బీసీహెచ్.ఓబులేసు పిలుపునిచ్చారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.ఓబులేసు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వృద్ధులు సంఘాలు, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొని వృద్ధుల సంక్షేమం, రక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సీహెచ్.సువార్త మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అవసరమైన సహాయాన్ని, చర్యలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొందరు వృద్ధులు తమ సమస్యలను తెలియజేయగా, డీఆర్వో వాటిలో కొన్నింటిని వెంటనే పరిష్కరించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్ధుల సంఘ ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకుని, సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థనలు సమర్పించారు. ఈ సందర్భంగా వృద్ధుల సేవలో విశేషంగా సహకరించిన వారిని సన్మానించారు. అవసరమైన వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ చేశారు. -
పులి పంజా
పల్లెల్లో 1. నల్లమలలో సంచరిస్తున్న పెద్ద పులి (ఫైల్)2. భైరవకోన రిజర్వ్ఫారెస్ట్ ట్రాప్ కెమెరాలో చిక్కిన చిరుత3. పులి కనిపించిన ప్రాంతంలో పులి పాదముద్రలుకనిగిరిరూరల్/పెద్దదోర్నాల: నల్లమలలో కొన్ని రోజులుగా వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల జరిగిన పులుల గణనలో పులుల సంతతి పెరిగిన విషయం తేలింది. ప్రసుతం నల్లమల అభయారణ్యంలో 85 వరకు పెద్దపులులు, లెక్కకు మించిన చిరుత పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వర్షాకాలం ఆరంభమైన నాటి నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో నల్లమలలో కొంత మేర నీటికి ఇబ్బందులతో పాటు పులుల ఆహార సమస్యలను తీర్చే సాంబార్, కణుతుల వంటి భారీ వన్యప్రాణుల సంచారం లేకపోవటంతో పులులకు ఆహార కొరత ఏర్పడింది. నీరు, ఆహారాన్ని వెతుక్కుంటూ పులులు అటవీ సమీప గ్రామాలకు వస్తుండటంతో స్థానికుల కంటపడుతున్నాయి. కొన్నిసార్లు పశువులపై దాడి చేస్తున్నాయి. కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సుమారు 48,500 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 7 సెక్షన్లు, 16 బీట్లు ఉన్నాయి. ప్రధానంగా భైరవకోన, వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ప్రాంతాల్లో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్లోని నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్ల పరిధిలోని కొండ కింద శివారు గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తోంది. వారం రోజుల క్రితం మరపగుంట్లలో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు సేకరించి 3, 4 ఇంచుల పొడవు ఉన్నట్లు తెలిపారు. పాద ముద్రలను బట్టి అది పెద్దపులి కాదని నిర్ధారించారు. పెద్దపులి పాద ముద్రలు 7, 8 ఇంచుల పొడవు ఉంటాయన్నారు. అక్కడ ఉన్న పాదముద్రల నమూనాలను బట్టి చిరుత పులి, లేదా జంగు పిల్లి అయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. తాజాగా గత శనివారం రాత్రి ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి మధ్య ప్రాంత పొలాల్లో, గ్రామ శివార్లలో బైక్పై వెళ్తున్న ఒకరు పులిని చూసినట్లు చెప్పాడు. దీంతో ఆదివారం ఫారెస్ట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పాదముద్రల నమూనాలను సేకరించారు. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల తుంగోడు, చెన్నపునాయినిపల్లి, మైలుచర్ల బొంతవారిపల్లి, పిల్లిపల్లి బీట్లలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో వన్య ప్రాణులతో పాటు చిరుత పులులు కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. యర్రగొండపాలెం రేంజ్ పరిధిలోనూ.. యర్రగొండపాలెం రేంజి పరిధిలోని కొలుకుల బీట్లో పెద్దపులి కనబడటంతో రైతులు భయంలో వణికిపోతున్నారు. గత ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులకు పెద్దపులి కనిపించింది. దీంతో పొలాలకు వెళ్తున్న రైతులతో పాటు రైతు కూలీలు సైతం భయాందోళనతో వణికిపోతున్నారు. కొలుకుల బీటులోని అటవీ ప్రాంతంలో పెద్దదోర్నాల మండల పరిదిలోని పెద్దబొమ్మలాపురం రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటంతో తరచూ వన్యప్రాణులతో సమస్యలు ఎదురవుతున్నాయి. పెద్దపులి సంచారం ఉన్న దేవలూడు ప్రాంతంలో గతంలోనే అటవీశాఖ బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. పులులకు ఆహారం దొరక్క పశువుల మందలు ఉన్న పెద్దదోర్నాల మండలం గండిచెరువు సమీప ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ఎక్కువగా ఉందని పశువుల కాపరులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దేవలూడు ప్రాంతంలో నీటి నిల్వలు అధికంగా ఉండటం కూడా పులుల సంచారానికి మరో కారణమని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పాలుట్లలో తన పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న రైతు బాలునాయక్పై పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా, బొమ్మలాపురానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన ఎద్దును పులిని సైతం పులి హతమార్చింది. గ్రామానికి చెందిన దేవలూడు, గండి చెరువు ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం గ్రామస్తుల వ్యవసాయ భూములు ఉండటంతో బొమ్మలాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనూ.. 2అర్థవీడు మండలంలోని కొత్తూరు, దొనకొండ, వెలగలపాయ, బొల్లుపల్లి, అచ్చంపేట, మాగుటూరు, మోహిద్దీన్పురం గ్రామాల పరిధిలో తరచూ పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెలగలపాయ, దొనకొండ, మాగుటూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. మొహిద్దీన్పురం వద్ద కారులో వెళ్తున్న కొందరికి పులి రోడ్డు దాటుతూ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. కంభం మండలంలోని దర్గా కొండ సమీపంలో నెల రోజుల క్రితం పులి అడుగులు కనిపించడంతో ఫారెస్టు అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని సూరేపల్లి సమీపంలో కొండవద్ద పులి అడుగులు ఉన్నాయని స్థానికులు చెప్పగా ఫారెస్టు అధికారులు ట్రాప్ కెమెరాలు బిగించి పరిశీలించారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో నీటివనరులు ఏర్పాటు చేయాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని 16 వేల గ్రామ పంచాయతీలు, 660 మండలాలు, 17 నగర పాలక సంస్థల నుంచి లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్ ఏర్పాటు చేసి మెగా సమావేశాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు చెప్పారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఎస్సీ సెల్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ సెల్ జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల్లోపే గ్రామ స్థాయి కమిటీలు వేయడానికి సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి క్రీయాశీలకంగా వ్యవహరించే ఇద్దరు నాయకుల పేర్లను సూచించాలని కోరారు. అందులోంచి ఒకరిని మండల కమిటీకి ప్రతిపాదిస్తారని, మరొకరిని గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తారని వివరించారు. వీరందరితో త్వరలోనే జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన కమిటీలతో కేంద్ర కార్యాలయంలో మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎస్సీ సెల్ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు సరైన ప్రాముఖ్యత ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్నీవర్గాల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పార్టీ అధినేత ఆదేశాలను, జిల్లా అధ్యక్షుడి సూచనలు సలహాలను, ఇన్చార్జిల సహకారాన్ని తీసుకొని క్షేత్ర స్థాయిలో పనిచేయాలని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నిబద్ధతగా పనిచేయాలని, పార్టీకి ఎస్సీ సెల్ ప్రాణవాయువులా పనిచేయాలని కోరారు. చంద్రబాబు పాలనలో దళితులకు అన్యాయం: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్రంలోనే దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని సుధాకర్ బాబు ఆరోపించారు. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో ఎస్సీలకు రూ.20 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలతో దళితులకు ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. ఉచిత బస్సుల పథకంలో రోజూ ప్రయాణించే మహిళలు ఎవరు, వారి సామాజిక వర్గాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఉచిత బస్సుల్లో ప్రయాణించే వారిలో మాల, మాదిగ, రెల్లి, పైడి కులాలకు చెందిన మహిళలు ఎంతమంది ఉన్నారో చెప్పాలని నిలదీశారు. ఉచిత బస్సు పథకంతో దళితులకు జరిగే మేలు ఏమీ లేదని వివరించారు. ఇప్పటికే దళిత బిడ్డలు చదువుకుంటున్నారని కక్ష కట్టి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం తీసేశారని, అమ్మ ఒడి లేదు, చేయూత లేదని చెప్పారు. రాష్ట్రంలో లక్ష పింఛన్లను తొలగించారని, అందులో 50 వేల పింఛన్లు దళితులకు చెందినవే ఉన్నాయన్నారు. ఉచిత గ్యాస్ పథకం కూడా దళితులకు పూర్తిగా వర్తించదని, గ్యాస్ సిలిండర్లు వాడేవారిలో ఎక్కువగా దళితులు లేరని, కట్టెలు తెచ్చుకొని పొయ్యిలో వంట చేసుకునే వారే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లలో ఎంత మంది ఎస్సీలు ఉన్నారో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. జగనన్న పాలనలో వివిధ పథకాల ద్వారా రూ.70 వేల కోట్లను దళితులకు అందజేశారని తెలిపారు. జగనన్న మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. అవే కనుక ప్రభుత్వ నిర్వహిస్తే అందులో ఉచితంగా వైద్య సేవలను పొందేవారిలో దళితులే ఎక్కువగా ఉంటారని, మెడికల్ కాలేజీల్లో దళిత బిడ్డలు చదువుకునేవారని చెప్పారు. అందుకే కక్షకట్టి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడని ఆరోపించారు. అయినప్పటికీ ప్రైవేటు మెడికల్ కాలేజీల జీవో రద్దు చేసేంత వరకు జగనన్న ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబును గద్దె దింపడమే దళితుల ఏకై క లక్ష్యమన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.దేవ ప్రసాద్, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె.దానియేలు, దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు జి.యేసుదాసు, కొండపి నియోజకవర్గ అధ్యక్షుడు చుక్కా కిరణ్ కుమార్, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షుడు ఏ.లూక్, ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు దుడ్డు వినోద్ కుమార్, బి.ప్రవీణ్ కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ ఒంగోలు సీటీ అధ్యక్షుడు పి.గోపిచంద్, నాయకులు కె.డేవిడ్, డి.రమణ పాల్గొన్నారు. -
న్యాయవాదుల రాస్తారోకో
సీజేఐపై దాడి యత్నానికి నిరసనగా ఒంగోలు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడి యత్నాన్ని ఖండిస్తూ ఒంగోలులో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించడంతోపాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి జగ్జీవన్రామ్, సంయుక్త కార్యదర్శి గ్రేస్ కుమారిల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట రోడ్డుపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని, న్యాయవ్యవస్థ స్వత్రంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దాడికి యత్నించిన న్యాయవాది లైసెన్స్ను రద్దుచేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు మరొకరు పాల్పడకుండా చర్యలు ఉండాలని కోరారు. సీజేపై దాడి యత్నం అనైతిక చర్య అని ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యులు నినదించారు. -
పాలుట్లకు రవాణా సౌకర్యం కల్పించండి
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజన గూడెంకు రవాణా సౌకర్యంలేక ఆ ప్రాంతం గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మండలంలోని గాంధీనగర్ నుంచి పాలుట్లకు రోడ్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఓఎస్డీ కె.వెంకటకృష్ణకు అర్జీ అందజేశారు. పాలుట్లలో 200కు పైబడి కుటుంబాలు నివశిస్తున్నాయని, వారందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారు పండించిన పంటలకు రవాణా సౌకర్యంలేక సకాలంలో తమ పంటలను మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నారని ఆ అర్జీలో పేర్కొన్నారు. అంతేకాకుండా మండల కేంద్రమైన యర్రగొండపాలెంకు నిత్యం విద్యార్థులు, రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుండాలని, వైద్యం కోసం దాదాపు 40 కిలో మీటర్లు రావల్సి ఉంటుందని, రోడ్డు సౌకర్యంలేక గర్భిణులు, దీర్ఘ వ్యాధిగ్రస్తులు మెరుగైన వైద్యానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన గూడెం వాసులు కోరుతున్నా ఫారెస్ట్ క్లియరెన్స్ చేయలేక పోయారని, వెంటనే డిప్యూటీ సీఎం స్పందించి పాలుట్ల గిరిజన గూడెంకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, అందుకు ఫారెస్ట్ క్లియరెన్స్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, పుల్లలచెరువు మండల మాజీ ఎంపీపీ మార్తాల సుబ్బారెడ్డి, సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.వీరవెంకట కోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, సురేష్ నాయక్ ఉన్నారు. తాళ్లూరు: మండలంలోని మాధవరం గ్రామంలో ప్రసిద్ధ గాంచిన గంగా పార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి కావడంతో సూర్యకిరణాలు గర్భగుడి నుంచి నేరుగా స్వామి వారి మూలమూర్తిని తాకాయి. ఏటా కార్తీక మాసానికి ముందు వచ్చే పౌర్ణమి, మళ్లీ కార్తీక పౌర్ణమి రోజున, శివరాత్రి రోజున ఇలా జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతోలతో పూజలు నిర్వహించారు. -
వాల్మీకి జీవితం ఆదర్శనీయం
● జయంతి కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: మానవాళికి రామాయణం లాంటి మహత్తరమైన కావ్యాన్ని అందించిన మహానుభావుడు మహర్షి వాల్మీకి అని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. మహనీయుల జయంతులు, ఉత్సవాలు నిర్వహించుకోవడమంటే కేవలం వారిని స్మరించుకోవడమే కాదని, వారు అందించిన సేవలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. అన్నదమ్ముల మధ్య సంబంధం ఎలా ఉండాలి, కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉండాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ధర్మం వైపు నిలిచి ఉండటం ఎలా అనే విషయాలను సమాజానికి తన కావ్యం ద్వారా తెలియజేసిన మహోన్నతుడు వాల్మీకి అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నిర్మల జ్యోతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, పలు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పొన్నలూరు: గేదె కోసం వాగులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన పొన్నలూరు మండలం రాజోలుపాడులో మంగళవారం జరిగింది. కుటుంబసభ్యులు, స్థానికుల తెలిపిన వివరాలు మేరకు..గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎలికా దేవదాస్(45) రోజు మాదిరిగానే తన గేదెలను కాసుకోవడానికి పొలం వెళ్లాడు. గేదెలు గ్రామ శివారులో ఉన్న నీటి వాగులోకి దిగాయి. వీటిని బయటకు తోలే క్రమంలో దేవదాస్ కూడా వాగులోకి దిగాడు. అయితే వాగు లోతుగా ఉండి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. దేవదాస్ వాగులో దిగినట్లు ఆనవాళ్లు ఉండటంతో ఈత రాక మృతి చెందినట్లు బంధువులు నిర్ధారించుకొని మృతదేహం కోసం వాగులో గాలిస్తున్నారు. ఉరి వేసుకొని యువకుడి మృతి ఒంగోలు టౌన్: నగరంలోని మంగమూరు డౌనులో ఉన్న ఒక బేకరిలో పని చేసే కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన చల్లగాలి బాబు (19) గత కొంత కాలంగా నగరంలోని మంగమూరు సెంటర్లో గల ఒక బేకరిలో పనిచేస్తున్నాడు. బేకరిలోని ఒక గదిలోనే ఉంటాడు. సోమవారం రాత్రి పని చేసిన బాబు అదేరోజు రాత్రి గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని మరణించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లయ్ఓవర్ బ్రిడ్జి మీద శవం... నగరంలోని సౌత్ బైపాస్ హైవే ఫ్లయ్ఓవర్ బ్రిడ్జి మీద ఒక గుర్తు తెలియని శవాన్ని హైవే పోలీసులు గుర్తించారు. మంగళవారం తెలవారుజామున 7 గంటల సమయంలో మృతదేహం బ్రిడ్జి మీద పడినట్లు భావిస్తున్నారు. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీ కొడితే మరణించాడో, లేక ఏదైనా వాహనం నుంచి జారి పడి మరణించాడో స్పష్టంగా తెలియడం లేదు. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దాడి కేసులో ఇద్దరు అరెస్టు
మార్కాపురం: ఇంటి స్థలాన్ని ఆక్రమించగా ప్రశ్నించిన మహిళపై దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు. పట్టణంలోని బాపూజీ కాలనీలో గోపాలుని లక్ష్మీభవానీ ఇంటి స్థలాన్ని షేక్ అబ్దుల్ రహమాన్, కందుకూరి శంకరాచారి ఆక్రమించారు. దీనిపై భవానీ వారిని ప్రశ్నించగా వారు ఆమైపె దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. నిందుతులు ఇద్దరిని సబ్జైల్కు తరలించినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు చెప్పారు. ఒంగోలు వాసి సికింద్రాబాద్లో మృతిఒంగోలు టౌన్: ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీను అనే భవన నిర్మాణ కార్మికుడు సికింద్రా బాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తుర్కపల్లి పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవన నిర్మాణ పనుల నిమిత్తం ఒంగోలు నుంచి భువనగిరి వచ్చిన శ్రీను అక్కడ నుంచి తుర్కపల్లి మండలం రామోజీ నాయక్ తండాకు వెళ్తున్న క్రమంలో పెద్ద తండా గ్రామ శివారు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీను మరణించాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియవు. మెడ మీద అమ్మ అని, కుడి చేతిమీద లవ్ సింబల్, స్టార్ పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడి ఆచూకీ తెలిసినవారు 8712662479, 8712662805ను సంప్రదించాలని తుర్కపల్లి పోలీసులు కోరారు. -
ఆర్తనాదం
ఓ వైపు వర్షాలు మరో వైపు పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలుల ధాటికి అరటి తోటలు ఎక్కడ నేలకొరిగిపోతాయోనని ఆందోళన చెందుతున్న రైతులను.. పతనమైన ధరలు మరింత భయపెడుతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఏడాదిపాటు శ్రమించి అరటి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో ధర లేకపోవడంతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. వినాయక చవితి వరకు రూ.300కు పైగా పలికిన అరటి గెల ధర ప్రస్తుతం రూ.100కు అమ్ముడుపోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంభం: జిల్లాలో సుమారు 1500 ఎకరాల్లో అరటి సాగు చేశారు. చారిత్రాత్మక కంభం చెరువు ఆయకట్టు కింద రైతులు ఎక్కువగా అరటి సాగు చేస్తారు. చెరువులో కొద్ది పాటి నీరు ఉండటంతో పంటల సాగుకు విడుదల చేయకపోయినా కేవలం బోర్ల మీద ఆధారపడి ఈ ప్రాంత రైతులు అరటి సాగు చేశారు. కంభంతోపాటు గిద్దలూరు, బేస్తవారిపేట, దోర్నాల, యరగొండపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం మండలాల్లో రైతులు అధికంగా అరటి సాగు చేస్తుంటారు. మొదటిసారి అరటి సాగు చేసిన రైతులు ఎకరాకు సుమారు లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. రెండోసారి తోట కొనసాగించిన వారు రూ.లక్ష వరకు, కౌలు రైతులు అంతకంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి కోసం ఖర్చు చేశారు. వినాయక చవితి తర్వాత ధరలు పతనం రైతులు ఎక్కువగా అరటిని గుంటూరు మార్కెట్ కు తరలిస్తుంటారు. వినాయక చవితి పండగకు ముందు గుంటూరులో గెల సైజును బట్టి రూ. 300కు పైగా ధర లికింది. పండుగ ముగిసిన అనంతరం రోజు రోజుకు ధరలు పడిపోయాయి. ప్రస్తుతం గెల సైజును బట్టి రూ.100 నుంచి రూ.150 లోపు పలుకుతోందని, కొన్ని సార్లు వందకన్నా తక్కువ ధర ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. గుంటూరుకు ఆటోకై తే రూ.6 వేలు, మినీ లారీకి రూ.12 వేలు బాడుగ ఖర్చవుతుందని రైతులు, కనీసం ఆ డబ్బులు కూడా చేతికొచ్చే పరిస్థితి ఉండటం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో గుంటూరులో మార్కెట్ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని, అక్కడ కూడా ఆశించిన ధర దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్కు తరలించేందుకు ఆటోలో ఎక్కిస్తున్న గెలలుకోతకు సిద్దంగా ఉన్న అరటి గెలలు స్థానికంగా కొందరు దళారులు బట్టీలు ఏర్పాటు చేసుకొని కమిషన్ వ్యాపారం చేస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని రైతులు స్థానికంగా ఉండే కమీషన్ కొట్లకు అరటి గెలలను తీసుకెళ్తారు. ఒకరోజు బట్టీలో ఉంచిన అనంతరం మరుసటి రోజు తెల్లవారు జామున ఆ గెలలకు వేలం నిర్వహిస్తారు. వేలం అనంతరం వారి కమీషన్, బట్టీ కూలీ, ఆటో కూలీ తీసుకొని మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి అరటి గెలలు వస్తుండటంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. పెద్ద సైజు గెలలు కూడా వంద రూపాయలలోపే పలుకుతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న అరటి తోటలు గడిచిన ఏడాదిన్నర వ్యవధిలో పెనుగాలుల ధాటికి నేలకొరిగిపోయి రైతులు నష్టపోయారు. పంట నష్టం వివరాలను ఉద్యానవన శాఖాధికారులు నమోదు చేసుకుని వెళ్లారేగానీ పరిహారం ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో అరటికి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వినాయకచవితి తర్వాత పూర్తిగా పతనమైన అరటి గెలల ధరలు గుంటూరు మార్కెట్లో ధరలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనం అక్కడా అదే పరిస్థితి ఎదురవటంతో లబోదిబోమంటున్న రైతన్నలు పండగకు ముందు రూ.300 ధర పలికిన గెల ప్రస్తుతం రూ.100 ఆరుగాలం శ్రమించినా ఆదాయం లేక అప్పులపాలవుతున్నామని ఆవేదన -
ట్రేడింగ్ యాప్ పేరుతో ఘరానా మోసం
● ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్లో మహిళ చాటింగ్ ● ట్రేడింగ్ పేరుతో రూ.1.16 కోట్లు దండుకుని మోసం చేసిన వైనం ● కనిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన కనిగిరిరూరల్: రోజుకో కొత్త సైబర్ మోసం వెలుగులోకి వస్తోంది. ఇటీవల కనిగిరి పట్టణానికి ఓ ఉపాధ్యాయుడు డిజిటల్ మోసానికి గురై రూ.32 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మరవక ముందే కొత్తగా పట్టణానికి చెందిన ఓ షోరూం వ్యాపారి ట్రేడింగ్ యాప్ మోసానికి గురై రూ.1.16 కోట్లు మోసపోయాడు. బాధితుడు పరువు పోతుందని భావించి గుట్టుచప్పుడు కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు మంగళవారం రాత్రి సీఐ ఎస్కే ఖాజావలి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ట్రేడింగ్ యాప్ పేరుతో ఫేస్బుక్, వాట్సప్ల ద్వారా పరిచయం చేసుకుని, ముందుగా మంచి ప్రాపర్టీలు చూపించి ఆశ పెట్టి.. యాప్లో డబ్బులు పెట్టించి, చాటింగ్ చేస్తూ.. మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా పద్ధతిలో పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి మోసపోయినట్లు చెప్పారు. ఫేస్బుక్లో ట్రెడింగ్ యాప్లో ఓ మహిళ పరిచయమై, ఆ తర్వాత వాట్సప్ గ్రూప్ పెట్టి ట్రేడింగ్ చేస్తూ రూ.1.16 కోట్లు మోసం చేసినట్లు వెల్లడించారు. బాధితుడు ఇటీవల తమకు ఫిర్యాదు చేశారన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు ● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం భూగర్భ, జల వనరుల శాఖ, డ్వామా, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ గ్రామాల వారీగా వాటర్ డిమాండ్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. జిల్లాలో గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికల రూపకల్పనపై సమీక్షించి తగు సూచనలు చేశారు. జిల్లాలోని 799 ఇరిగేషన్ ట్యాంకులు, సంబంధిత ఫీడర్ ఛానెల్స్లో ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానిస్తూ పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా నివేదిక రూపొందించాలని ఇరిగేషన్, డ్వామా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వాటర్ మేనేజ్మెంట్పై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జల వనరుల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు వరలక్ష్మి, బాల శంకరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, గ్రౌండ్వాటర్ శాఖ డీడీ వందనం, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఉద్యాన శాఖాధికారి గోపీచంద్, ఏపీఎంఐపీ పీపీ శ్రీనివాసరావు, డ్వామా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై ఉక్కుపాదం
● రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య ఒంగోలు సబర్బన్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పి.రాజాబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఇతర అధికారులతో వివిధ అంశాలపై కృష్ణయ్య చర్చించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగాన్ని నివారించి, మరోవైపు ఇప్పటికే ఉన్న వ్యర్థాలను రీసైకిల్, రీయూజ్ చేయటం ద్వారా సర్క్యులర్ ఎకానమీ పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదే సమయంలో కాలుష్యాన్ని కూడా తగ్గించడంపై దృష్టి సారించాల్సిన అవసరం సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఇప్పటికే గ్రానైట్స్తో పాటు మత్స్య, వ్యవసాయ– దాని అనుబంధ రంగాలలో అవలంబిస్తున్న విధానాల ద్వారా వస్తున్న వ్యర్థాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతున్న తీరుపై ఆయన చర్చించారు. ఆయా రంగాల ద్వారా వస్తున్న వ్యర్థాలను రీయూజ్ చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. బయోడీగ్రేడబుల్ సంచులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. పరిశ్రమలతో పాటు రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్ల పరిసరాలు శుభ్రంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నివారణ, వివిధ రంగాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు సంబంధిత సమన్వయంతో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీపీఓ వెంకటేశ్వరరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓ కళావతి, జిల్లా వ్యవసాయ అధికారి రజనీకుమారి, డీఎస్ఓ పద్మశ్రీ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గోపీచంద్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, అన్ని మున్సిపాలిటీలు, అటవీ, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు. -
మార్కెట్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దు
● వామపక్ష నేతలు డిమాండ్ ఒంగోలు టౌన్: నగర నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన పాత మార్కెట్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆలోచన విరమించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వందల కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు వదిలిపెట్టడం పాలకులు ప్రజా ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చినట్లేనని ఆరోపించారు. గత 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని ఎలాంటి చర్చ లేకుండా కౌన్సిల్లో తీర్మానం చేయడం, కేవలం 5 రోజుల్లోనే టెండర్లు పిలవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనుక ఏయో శక్తులు ఉన్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన నగరపాలక సంస్థే వాటిని వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని విమర్శించారు. నగరపాలక సంస్థ స్వయంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని , ఆ భవనాన్ని చిరువ్యాపారులకు అద్దెకిచ్చి స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకొని నిర్మాణాలు చేయాలే తప్ప నిధులు లేవన్న సాకుతో బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమవుతుందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు 33 సంవత్సరాల లీజుకు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న పాలకులు మరోవైపు ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం చేయడాన్ని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. నిరసనలో సీపీఎం నగర నాయకులు సయ్యద్ హుసేన్, టి.మహేష్, తంబి శ్రీనివాసరావు, జి.రమేష్, మారెళ్ల సుబ్బారావు, భక్త్ సింగ్ రాజు, సిపిఐ నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు, కారుమూడి నాగేశ్వరరావు, నూనె మోహన్రావు, సిద్ధయ్య, కోనూరి వెంకటేశ్వర్లు, కల్లూరు లక్ష్మయ్య, మన్నం హనుమంతరావు, ఏవై రెడ్డి పాల్గొన్నారు. -
దళితుల భూఆక్రమణకు తెగబడిన టీడీపీ నేతలు
మార్కాపురం టౌన్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ నేతలు భూఆక్రమణలకు యథేచ్ఛగా తెగబడుతున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. దళితులు సాగుచేసుకుంటున్న భూమిని టీడీపీ నేత ఆక్రమించుకునేందుకు పైరును ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన దళితులపై ఎదురు దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దళిత సంఘ నేత ఐజక్ రెండు ఎకరాల్లో సాగు చేసిన కంది పంటను పట్టణానికి చెందిన టీడీపీ నేత వక్కలగడ్డ మల్లికార్జున్ అనుచరులు సోమవారం రాత్రి ధ్వంసం చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న ఐజక్ అతని బంధువులు పంట వద్దకు చేరుకుని వారిని అడ్డుకుంటుండగా తమపై మల్లికార్జున్ అనుచరులు దాడిచేశారని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై ఎస్పీకి, స్థానిక పోలీసు అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేసి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. మంగళవారం ఉదయం ఇరువర్గాలు పొలం వద్దకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో మార్కాపురం సీఐ సుబ్బారావు సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిస్థితి అదుపు చేశారు. అర్ధరాత్రి పంటను ధ్వంసం చేసి, కబ్జాకు యత్నం అడ్డుకునేందుకు వెళ్లిన దళితులపై ఎదురు దాడి -
టీచర్ల పోరుబాట
కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోగా వారిపై బోధనేతర పనుల భారాన్ని మోపుతూ విద్యాబోధనకు దూరం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు చదువు దూరమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా తమపై పనిభారం మోపుతున్నారంటూ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాటతప్పింది. అడ్డగోలు నిర్ణయాలతో ఉపాధ్యాయుల మీద మరింత ఒత్తిడి పెంచింది. విద్యార్థులకు చదువులు చెప్పకుండా, ఇతర పనులు అప్పగించడంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల పనులను ఉపాధ్యాయులపై రుద్దింది. చంద్రబాబు తన ప్రచార యావతో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధ్యాయులను స్కూళ్లకు దూరం చేశారు. అలాగే పేరెంట్, టీచర్స్ సమావేశాల పేరుతో దాదాపు రెండు వారాలపాటు ఉపాధ్యాయులు పాఠాలకు దూరమయ్యారు. దీనికి తోడు రకరకాల శిక్షణ పేరుతో టీచర్లు బడులకు వెళ్లలేక పోయారు. ఫలితంగా విద్యార్థులు సైతం చదువులకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆంక్షలతో కొంతకాలం మౌనం వహించిన ఉపాధ్యాయ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. సమస్యల పరిష్కారం కోసం, హక్కులను కాపాడుకునేందుకు జిల్లాలో సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులు ఆందోళనబాటపట్టారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై విజయవాడ ధర్నా చౌక్లో నేడు రాష్ట్రస్థాయి ధర్నా చేపట్టారు. ధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు. -
శనగ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు సబర్బన్: శనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం వివిధ రైతు సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న శనగ నిల్వలను క్వింటా రూ.10 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే క్వింటా శనగలకు రూ.3 వేల సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల వద్ద శనగల నిల్వలు పేరుకుపోయాయని, కనీస ధరలు లేక అమ్ముకోలేకపోతున్నారన్నారు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు రద్దు చేయడం దారుణమన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, టాంజానియా దేశాల నుంచి దిగుమతులు వస్తే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పప్పుదినుసులుగా ఉపయోగించే ఉతృత్తులను దేశీయ అవసరాలకు తగినట్లుగా సాగు ఉత్పత్తులను నియంత్రించి ధరలు నిలకడగా ఉండేలా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిగుమతి సుంకాలు పెంచి దిగుమతులను అడ్డుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. వివిధ రైతు సంఘాల నేతలు జె.జయంత్ బాబు, కె.వీరారెడ్డి, చుంచు శేషయ్య, పరిటాల కోటేశ్వరరావు, జి.నాగేశ్వరరావు, బెజవాడ శ్రీనివాసు పాల్గొన్నారు. క్వింటా రూ.10 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన -
ప్రజల సొమ్ము ప్రైవేట్కు కట్టబెట్టడమే పీ3
మార్కాపురం: ప్రజల సొమ్మును ప్రైవేట్కు కట్టబెట్టడమే పీ3 ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సీపీఎం పట్టణ కార్యదర్శి డీకేఎం రఫీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మార్కాపురం మెడికల్ కాలేజీని పీ3 విధానంలో నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అతి తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తికావడానికి అవకాశమున్న మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వారికి అప్పగించడం మంచి పద్ధతి కాదన్నారు. 66 ఏళ్ల పాటు వైద్యశాలను ప్రైవేట్ వారికి అప్పగించడమంటే వైద్య రంగాన్ని ప్రజలకు దూరం చేయడమేనన్నారు. కూటమి నాయకులు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీని సీట్ల అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడేమో మాట మార్చి మొత్తం వైద్యకళాశాలనే కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్ల ప్రయోజనం కోసమే వైద్యరంగాన్ని ప్రభుత్వ రంగంగా కాకుండా ప్రైవేట్ వారికి మేలు చేయడమే అన్నారు. అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో సరైన వైద్యం అందక అనేక మంది సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాలకు తలొగ్గి మోడీ బాటలో పయనిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తన పీ3 విధానాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే నిర్మించాలన్నారు. ఎకరా 1 రూపాయితో వందల ఎకరాల ప్రజల భూమిని 66 ఏళ్ల లీజుకు ఇవ్వడమంటే ప్రజల సొమ్మును ప్రైవేట్ వారికి అప్పజెప్పడం కాదా అని విమర్శించారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కార్యాలయ ఏఓ రవీంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు అందె నాసరయ్య, ఎస్కే ఖాశీం, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సోమయ్య, రఫీ, గుమ్మా బాలనాగయ్య, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, అమ్ఆద్మీపార్టీ జిల్లా అధ్యక్షుడు వి.సుదర్శన్, కాంగ్రెస్పార్టీ నాయకులు ఇమ్రాన్, మాబూవలి, కాాశయ్య, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ -
అమ్ముతాం ఆపేదెవరు !
● యథేచ్ఛగా నల్లబజారుకు పేదల బియ్యం మర్రిపూడి: కూటమి నేతల కనుసన్నల్లో సాగుతున్న రేషన్ దుకాణాల నుంచి రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారు. రేషన్దుకాణాల నిర్వాహకులు పేదల నుంచి ప్రతినెలా ఇంటికి సైతం వెళ్లి వేలుముద్రలు సేకరించి బియ్యం పంపిణీ చేయకుండా వారికి కిలో బియ్యం రూ.10 వంతున చెల్లిస్తున్నారు. మిగిలిన బియ్యాన్ని రాత్రిపూట లారీలుపెట్టి దుకాణంలోని సరుకును లోడ్చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. విషయం అంతా తెలిసినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మర్రిపూడి మండలంలో 24 చౌకదుకాణాలు ఉండగా, 13,114 రేషన్కార్డులు ఉన్నాయి. సుమారు 39,342 టన్నుల బియ్యం, 6 వేల టన్నుల చక్కెర రేషన్ దుకాణాలకు ప్రతి నెలా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో 80 శాతం బియ్యం బ్లాక్మార్కెట్కు తరలుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 4, 5 తేదీల్లో మర్రిపూడిలో 2వ నంబరు దుకాణందారుని భర్త నేరుగా లారీని దుకాణం ఎదురు నిలిపి పేదలకు పంచాల్సిన సరుకును లారీలో నింపి బ్లాక్ మార్కెట్కు తరలించారు. 15 వ తేదీ దాకా కార్డుదారులకు అమ్మాల్సిన బియ్యాన్ని ముందే స్టాక్ను ఎత్తి వేయడం గమనార్హం. -
12వ పీఆర్సీ వెంటనే నియమించాలి
● పెన్షనర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఒంగోలు సబర్బన్: ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని నియమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బోడా అంకిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీని నియమించి ఐఆర్ను 30 శాతం ప్రకటించాలన్నారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలలో రెండింటిని వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ అలవెన్స్, 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే విడతల వారీగా చెల్లించాలన్నారు. అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డుపై అన్ని వ్యాధులకు క్యాష్లెస్ వైద్యం అందించాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కె.సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పొన్నలూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పొన్నలూరు పోలీసులు మూడు రోజుల కిత్రం పట్టుకోని పోలీస్స్టేషన్కు తరలించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీసులు గత శనివారం ముత్తరాసుపాలెం సమీపంలోని ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద ఓవీ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తేండగా కనిగిరి నుంచి కందుకూరు వైపు మినీ ట్రక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని సోమవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై అనూక్ తెలిపారు. అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యం బస్తాలను స్థానిక రేషన్ షాపుకు తరలించారు. వెలిగండ్ల(కనిగిరిరూరల్): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని గోకులంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన ఎన్ సుజాత (35) ఇంట్లో ఎవ్వలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణపావని సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కంభం: కాలువలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం కంభంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పెద్దనల్లకాల్వ గ్రామానికి చెందిన బోధనం రవిశేఖర్ ట్రాక్టర్తో పొలం దున్నుతూ తన కుమారుడు అశ్వంత్(12)ను పొలం పక్కనే పంట కాలువ గట్టుపై కూర్చొపెట్టాడు. కొద్ది సేపటి తర్వాత చూడగా పిల్లవాడు కనిపించకపోవడంతో పిల్లవాడు ఫిట్స్ వచ్చి కాలువలో పడిపోయినట్లు గుర్తించి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన బాలుడి స్థితి మానసికంగా బాగాలేదని తెలిసింది. -
ప్రకృతి పరిరక్షణ
పులుల సంరక్షణ.. మార్కాపురం: పర్యావరణ సమతుల్యతలో పులులు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని రక్షించుకోవడం ద్వారా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోగలం. జీవవైవిధ్యం దెబ్బతింటే మనిషి ఉనికికే ప్రమాదంగా మారుతుంది. ఈ క్రమంలో ఏటా అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే పులులు వాటి జీవనశైలిపై ప్రత్యేక కథనం. పెద్దపులల రక్షణకు ప్రత్యేక దృష్టి దేశంలోనే అతిపెద్దదైన నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టులో 87 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా వేశారు. నల్లమల అటవీ ప్రాంత పరిధిలో ఉండే మార్కాపురం, ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల పరిధిలో పెద్దపులుల రక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటుచేశారు. నల్లమల పరిధిలోని 4 అటవీశాఖ డివిజన్లకు ప్రస్తుతం డీఎఫ్ఓ స్థాయి అధికారులు ఉన్నారు. మార్కాపురం అటవీశాఖకు డిప్యూటీ డైరెక్టర్ హోదా అధికారి పర్యవేక్షిస్తున్నారు. వీరి పరిధిలో డీఆర్ఓలు, రేంజ్ ఆఫీసర్లు, బీటు ఆఫీసర్లు, గార్డులు వీరితో పాటు ప్రత్యేక బృందాలు పులుల సంరక్షణ కోసం పనిచేస్తున్నారు. మొత్తం 295 మంది సిబ్బంది పులుల సంరక్షణలో ఉన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో 32 బేస్క్యాంపులు ఏర్పాటుచేశారు. అటవీ ప్రాంతం మొత్తాన్ని 7 రేంజ్లుగా విభజించి 7 స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటుచేశారు. అతిపెద్ద టైగర్ రిజర్వు మార్కాపురం డివిజన్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, మాచర్ల, నాగార్జునసాగర్ ప్రాంతాలున్నాయి. వీటి పరిధిలో 87 పెద్దపులులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏకై క టైగర్ రిజర్వు అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు 5360.22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా గుర్తింపు పొందింది. ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, సహజసిద్ధమైన గొప్ప జీవ వైవిద్యాల ప్రాంతంగా నల్లమలకు గుర్తింపు వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానది సుమారు 200 కిలోమీటర్ల పొడవునా ఈ రిజర్వులో ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్టీఆర్ (నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్టు) లో 87 పెద్దపులులు ఉన్నాయి. పెద్దపులులు దక్షిణాది వైపు సంచరిస్తూ శేషాచలం బయోస్పియర్ రిజర్వులో తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు వన్యప్రాణ వేట నిరోధక శిబిరాలను ( యాంటీ పోచింగ్ క్యాంప్)ఏర్పాటు చేసి 295 మంది సిబ్బందితో పాటు అధనంగా చెంచు గిరిజనులను సంరక్షకులుగా, స్వచ్ఛ సేవకులుగా చెక్పోస్టులో, అటవీ ప్రాంతాల్లో నియమించారు. పులుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శ్రీలంకామల్లేశ్వర వన్యప్రాణ అభయారణ్యం, పెంచల నరసింహ వన్యప్రాణుల అభయారణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మూడు ప్రాంతాలు సుమారు 9335.78 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి భవిష్యత్లో పులులు తమ ఆవాసాలను ఏర్పరుచుకునే వాతావరణానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నల్లమలలో ఇప్పటికే 32 బేస్ క్యాంపులు ఏర్పాటుచేశారు. 2022లో ఏడాది దాదాపు 73 పెద్ద పులులు ఉండగా, గత ఏడాది ఈ సంఖ్య 80కి పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు 87కి చేరింది. పులుల సంరక్షణకు తీసుకునే చర్యలతో పులుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా అటవీ ప్రాంతంలో గడ్డి పెంపకం వల్ల పొదలు ఏర్పడ్డాయి. జింకలు, దుప్పుల సంఖ్య పెరిగింది. వీటి వలన పెద్దపులుల సంఖ్య కూడా పెరిగింది. బేస్ క్యాంపుల ఏర్పాటు.. అటవీ ప్రాంతంలో ఉన్న టైగర్ వాచర్స్ నిరంతరం అడవిలో తిరుగుతూ పులుల సంరక్షణపై దృష్టి పెట్టి పులుల కదలికలను ట్రాక్ చేస్తారు. సీసీ కెమెరాల ద్వారా పెద్దపులుల కదలికలను పరిశీలిస్తుంటారు. పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, నారుతడికల, పాలుట్ల, ఇష్టకామేశ్వరీ, దొరబైలు, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, చినమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్లు ఉన్నాయి. ఇందులో అటవీశాఖ సిబ్బంది ఉంటారు. అడవిలోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక రాత్రిపూట శ్రీశైలం వెళ్లే ప్రయాణికులను దోర్నాల చెక్పోస్టు వద్ద రాత్రి 9 గంటలకే నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ప్రాంత నుంచి వచ్చే వాహనాలను కూడ ఈగలపెంట వద్ద 9 గంటలకు నిలిపి వేస్తున్నారు. ఇలా చేయటం వల్ల రాత్రిపూట పెద్దపులులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది. నల్లమలలో సంచరిస్తున్న పెద్దపులి -
ఉరుములు, మెరుపులతో బెంబేలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని తీర ప్రాంత మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి మొత్తం పెద్ద శబ్దాలతో ఉరుములు, మెరుపులతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత మండలాలతో పాటు వాటికి ఆనుకొని ఉండే మండలాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. కొత్తపట్నం మండలంలో 72.4 మిల్లీ మీటర్లు, చీమకుర్తి 72 మిల్లీ మీటర్లు, ఒంగోలు రూరల్ 62.6, ఒంగోలు అర్బన్ 62.6, మద్దిపాడు 48.8, నాగులుప్పలపాడు 40.6, సంతనూతలపాడు 39.8, టంగుటూరు 33.6, మర్రిపూడి 26 మి.మీ, పొదిలి, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఒంగోలు నగరంతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. తీర ప్రాంత మండలాలలోని పలు గ్రామాల్లో కూడా ఉదయం 8 గంటలకు వరకు కూడా విద్యుత్ సరఫరా చేయలేదు. ఒంగోలు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు తీసి 10 గంటలకు విద్యుత్ను ఇచ్చారు. ఒక పక్క ఉరుములు, మెరుపులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే విద్యుత్ లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఒంగోలు నగరం, పరిసరాల్లో పిడుగులు, కుండపోత వాన మరోపక్క విద్యుత్ కోతలతో ప్రజల అవస్థలు నగర వీధులు జలమయం -
టీడీపీలో రేషన్ బియ్యం.. కయ్యం
సాక్షి నెట్వర్క్, ఒంగోలు: రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా రెండు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. చివరకు వివాదంగా మారింది. ఆ వివరాలు... కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం కె.అగ్రహారం రేషన్ షాపు నుంచి 53 బస్తాల బియ్యాన్ని కావలి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఈ నెల 3న అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కొండపిలోని అన్ని మండలాల్లో డీలర్ల నుంచి రేషన్ బియ్యం కేజీ రూ.20 చొప్పున కొని తీసుకెళ్తున్నారు. అయితే, కొండపిలో రేషన్ బియ్యం అక్రమ దందాను మంత్రి లోకేష్కు సన్నిహితంగా ఉండే, నామినేటెడ్ పోస్టులోని నాయకుడు నడిపిస్తున్నారు. ఆయన అనుచరులు సింగరాయకొండ కేంద్రంగా రేషన్ మాఫియా సాగిస్తున్నారు. దీనికిగాను ఆ యువ నేతకు నెలకు రూ.25 లక్షలను ఓ రైస్ మిల్లు యజమాని అందజేస్తున్నట్లు సమాచారం. డీలర్లు కార్డుదారులకు బియ్యం బదులు నగదు ఇస్తూ భారీగా బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. డీలర్ నుంచి కిలో రూ.15– రూ.16కు కొండపి నేత అనచరులు కొంటున్నారు. 12 వేల బస్తాల రేషన్ బియ్యం నెలనెలా అక్రమంగా రవాణా అవుతోంది. అయితే, కావలి నేత అనుచరులు కేజీకి రూ.20 ఇస్తుండటంతో డీలర్లు వారివైపు మొగ్గుచూపారు. ఇది కొండపి నియోజకవర్గ నేతకు వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలా ఎందుకు జరిగింది? అని ఆయన ఆరా తీయగా... కావలి టీడీపీ నాయకుల దందా బయటపడింది. దీంతో పొన్నలూరు మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకు ఉప్పందించారు. వారు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నారు. ఆయన పోలీసులకు పట్టించారు.. ఈయన కేసు వద్దన్నారు తన అనుచరుల బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్టపడడంతో వెంటనే కావలి ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. కొండపి నుంచి రాష్ట్ర స్థాయి కీలక పదవిలో ఉన్న నాయకుడికి ఫోన్ చేశారు. కేసు లేకుండా తమవాళ్ల వాహనాన్ని వదిలేయాలని కోరారు. కేసులు పెడితే మీ బియ్యం లారీలు మా నియోజకవర్గం మీదుగా వెళ్లలేవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొండపి కీలక నాయకుడు.. కేసులు పెట్టవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారు. కానీ, నామినేటెడ్ పదవిలో ఉన్న నేత కల్పించుకుని కేసులు పెట్టాలని పట్టుబట్టారు. ఈ పరిస్థితిలో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు, శ్ఙ్రీరేషన్ బియ్యం అక్రమ రవాణా సమాచారం మేరకు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నాం. అందులో గోతాలు, పట్టాలే ఉన్నాయి. వాహనాన్ని స్టేషన్కు తరలించాంశ్రీశ్రీ అని వెల్లడించారు. కానీ, రేషన్ దందా బట్టబయలవడంతో ఎస్సై అనూక్ సోమవారం వివరణ ఇచ్చారు. ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద తనిఖీల్లో 40 బస్తాల బియ్యాన్ని పట్టుకుని ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించామన్నారు. కేసు పెట్టామని చెప్పారు. శుక్రవారం పట్టుకున్న బియ్యానికి సోమవారం కేసు నమోదు, వాహనంలో బియ్యమే లేవని చెప్పి ఇప్పుడు 40 బియ్యం బస్తాలు పట్టుకున్నామని చెప్పడం గమనార్హం. మరోవైపు రేషన్ బియ్యం కె.అగ్రహారం నుంచి రవాణా అవుతుంటే... కనిగిరి వైపు నుంచి వస్తుండగా ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద పట్టుకున్నామనడంతో ఏంజరిగిందో తెలిసిపోయింది. కొసమెరుపు ఏమంటే... ఆదివారం కావలి టీడీపీ నేతలు కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలంలో 80 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు పెట్టారు. -
సమాచార హక్కు చట్టంతో పారదర్శకత
ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత పెరుగుతుందని సేంద్రియ వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ వి.సుభాషిణి అన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆ విభాగం అధికారులు, సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ ప్రతి పౌరుడు తనకు అవసరమైన సమాచారాన్ని పొందడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను ప్రోత్సహించవచ్చని చెప్పారు. క్యాడర్ సభ్యులు గ్రామస్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, ప్రజలకు అవగాహన పెంపు గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా టీమ్ సభ్యులు, క్లస్టర్ కో ఆర్డినేటర్లు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు: ౖబెక్ చోరీ కేసులో నిందితునికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఒంగోలు ఎకై ్సజ్ మేజిస్ట్రేట్ ఎస్ కోమలవల్లి సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2022 ఆగస్టు 14వ తేదీ రాత్రి 10 గంటలకు సంతనూతలపాడు ఎన్ఎస్పీ కాలనీ నివాసి మందాడి సత్యన్నారాయణ తన ఇంటిముందు బైక్ పార్కు చేసి నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం బైక్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఒంగోలు జయప్రకాష్ కాలనీకి చెందిన మోటా నవీన్గా గుర్తించి ఆగస్టు 18న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ నవీన్కు రెండేళ్ల జైలుశిక్ష విధించారు. నిందితులకు శిక్ష పడడంలో కృషి చేసిన ఏపీపీ శ్రావణ్కుమార్, సంతనూతలపాడు ఎస్సై అజయ్బాబు, కోర్టు కానిస్టేబుల్ కె.వెంకట్రావులను ఎస్పీ హర్షవర్థన్రాజు ప్రత్యేకంగా అభినందించారు. సేంద్రియ వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ సుభాషిణి -
గోవిందయ్య జోలికి వెళ్తే ఊరుకోం
● మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సాక్షి, అమరావతి: గంగాధర నెల్లూరు అంబేడ్కర్ విగ్రహం కాలిపోయిన ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడైన గోవిందయ్యను విచారణ పేరుతో నిర్బంధించడాన్ని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆయన జోలికి వచ్చినా .. గోవిందయ్యపై కేసులు బనాయించిన చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సెగ్మెంట్ పరిధిలో వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి పంచాయతీ దేవళంపేట అనే గ్రామంలో తమ పార్టీకి సంబంధించిన గోవిందయ్య, 2023 సంవత్సరంలో 10 అడుగుల అంబేడ్కర్ విగ్రహం స్థాపించారు. సర్పంచిగా ఉండి అనేక మంచి పనులు చేసిన ఆయనకు టీడీపీ నాయకుడు సతీష్ నాయుడుతో రాజకీయపరమైన వైరం ఉంది. ఈ విగ్రహం పెట్టే రోజు కూడా సతీష్ నాయుడు అడ్డుకోబోయాడు. విగ్రహం పెట్టడానికి వీల్లేదని పెట్టనీకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. విగ్రహ స్థాపన రోజు నుంచి ఆ విగ్రహాన్ని ఏవిధంగా తొలగించేందుకు సతీష్ నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సొంత నియోజకవర్గం ఇది. స్థానిక ఎమ్మెల్యే థామస్ అండతోనే ఈ ఆరాచకాలు చేస్తున్నాడు. గురువారం అర్థరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చివేశారు. విగ్రహం పెట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ మూకలు ఏవిధంగా నైనా ఆ విగ్రహాన్ని తొలగించాలని కుట్రతో ఈ ఘటనకు పాల్పడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాబుకు మొదటి నుంచి దళిత వ్యతిరేక విధానం ఉంది. టీడీపీ అమలు చేసిన పథకాల వల్ల దళిత సమాజానికి ఎలాంటి మేలు జరగటం లేదు. విగ్రహం తగుల బెట్టించింది కాక గోవిందప్ప ఇంటిపై పోలీసులు దాడి చేసి, నీవే తగులబెట్టావ్ అని ఒప్పకో కేసులు లేకుండా చేస్తాం అంటున్నారు. సర్పంచ్ని అలా బెదిరిస్తే చూస్తూ ఊరుకోము. చంద్రబాబును గద్దెదింపే దాకా ఈ దళిత సమాజం నిద్రపోదు. సీసీ టీవీ పుటేజీ తీయండి. నిజనిర్ధారణ చేయండి. అసలైన నిందితుడిని పట్టుకోవాలని’’ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
మార్కాపురం: మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా నాయకుడు దగ్గుబాటి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి అనంతరం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ మార్కాపురం రెవెన్యూ డివిజన్లో వేలాది ఎకరాల్లో రైతులు విరివిగా పత్తిని సాగు చేశారని, గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో ప్రైవేట్ పత్తి వ్యాపారులు ప్రవేశించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. మార్కాపురం మార్కెట్యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ.8,110లుగా ప్రకటించినా ఒక్క క్వింటా కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదన్నారు. ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని కోరారు. గ్రామాల్లో క్వింటా పత్తిని రూ.5,500 నుంచి 6,500 మధ్యనే కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతు సంఘం నాయకులు జి రాజశేఖర్రెడ్డి, ఏరువ పాపిరెడ్డి, డి.తిరుపతిరెడ్డి, రైతులు లక్ష్మినాయక్, కాశిరెడ్డి, వెంకట రమణ, నాగేశ్వరరావు, ఓర్సు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన -
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం
● ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల వేదికకు ఎంతో నమ్మకంతో వస్తున్న బాధితుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 66 ఫిర్యాదులు వచ్చాయి. బాఽధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్య పూర్వాపరాలను అడిగి తెలసుకొని ఆయా పోలీసుస్టేషన్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిలో వృద్ధులు, నడవలేనిస్థితిలో ఉన్న మహిళలు వస్తుంటారని, అలాంటి వారి సమస్యలను సావదానంగా విని వారికి సత్వర న్యాయం అందిస్తామన్న భరోసా ఇవ్వాలని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు స్థానిక పోలీసుస్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్లలో ఫిర్యాదులను అందజేయాలని చెప్పారు. కార్యక్రమంలో పీసీఆర్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, పామూరు సీఐ బీమానాయక్, కంభం సీఐ మల్లికార్జునరావు, మీకోసం వేదిక ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. -
కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి
ఒంగోలు వన్టౌన్: కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ కోరారు. ఆదివారం ఒంగోలు వచ్చిన ఆయన ప్రకాశం జిల్లా కాపు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొమ్మరులను గిరి బలిజగా మారుస్తూ ఇచ్చిన జీఓను స్టేటస్ కో ఇచ్చారన్నారు. దశాబ్ద కాలంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ పెండింగ్లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రకటన చేయాలన్నారు. కాపు సమస్యలు అనేకం పరిష్కారం కాకుండా ఉంటే, ప్రభుత్వ పెద్దలు నూతన సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. జనాభా దామాషా ప్రకారం కాపులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షుడు కే సంజీవ్ కుమార్, పీ రాజ్య సులోచన, ఎన్ హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు. -
సీనరేజి వసూలును ప్రైవేటుకు అప్పగించొద్దు
చీమకుర్తి రూరల్: గ్రానైట్ సీనరేజి వసూలు బాధ్యతను ప్రైవేటు సంస్థ అయిన ఏఎంఆర్ కు కేటాయించడాన్ని రద్దు చేయాలని ఎడ్జ్ కటింగ్ యూనిట్ల యూనియన్ అధ్యక్షుడు బూర్సు వెంకట కొండయ్య డిమాండ్ చేశారు. రామతీర్థంలోని వీటీసీ కార్యాలయంలో ఎడ్జ్ కటింగ్ యూనిట్లు నడుపుతున్న యజమానులు ఆదివారం సమావేశమయ్యారు. గ్రానైట్ పరిశ్రమల యజమానుల సమ్మెకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఫ్యాక్టరీలు మూతపడే స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు గ్రానైట్ పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉండాలే కానీ, గ్రానైట్ పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మార్చేలా ఉండకూడదన్నారు. ఎడ్జ్ కటింగ్ వంటి చిన్న కుటీర పరిశ్రమలపై ఆధారపడి సుమారు వెయ్యి నుంచి 2 వేల మంది బతుకుతున్నారన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రానైట్ పరిశ్రమలను సంక్షోభం నుంచి బయటపడేలా రాయితీలు ఇవ్వాలని, కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎడ్జ్ కటింగ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఐనీడి బుల్లియ్య, చంద్ర, శివ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహ దహనం హేయం
● వైఎస్సార్ సీపీ ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున సంతనూతలపాడు: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఆమేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై నిత్యం దాష్టీకాలేనని, దీనిలో భాగంగానే చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన టీడీపీ నేత సతీష్ నాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల గ్రామ బహిష్కరణలు, అంబేడ్కర్ విగ్రహాలకు అపచారం నిత్య కృత్యమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. అంబేడ్కర్ భావజాలాలపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవం నిలబెట్టడానికి అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున విలువైన స్థలంలో రూ.450 కోట్లతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని చూసి తట్టుకోలేక స్మృతి వనంలో లైటింగ్ తీసివేయించారని ఆరోపించారు. ఒంగోలు టౌన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోనే పేద ప్రజలకు వైద్యం లభిస్తుందని, వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడమంటే పేద ప్రజలకు వైద్యాన్ని తిరస్కరించడమేనని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యను, ప్రజారోగ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే ఆలోచనలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరగదని, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను మానుకోవాలని కోరారు. జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.వెంకటరావు, జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీ సహా రాష్ట్రంలోని ఇతర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీ మార్కాపురం ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు, ప్రముఖ వైద్యులు, వైద్యరంగ నిపుణులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జేవీవీ నాయకులు ఏవీ పుల్లారావు, కుర్రా రామారావు, సీహెచ్ జయప్రకాష్, డాక్టర్ దార్ల బుజ్జిబాబు, యు.భాస్కర్, డీఎల్ ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని అరెస్టు చేయాలని ఐఎల్పీ అధ్యక్షుడు డీ సుందరరావు డిమాండ్ చేశారు. ఒంగోలు మంగమూరు డొంకలోని అంబేడ్కర్, పూలే, బుద్ధ విగ్రహాలకు ఆదివారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం దేవళంపేట గ్రామంలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో కే వరప్రసాద్, డీ సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. -
పులి సంచారంపై అటవీ అధికారుల విచారణ
వెలిగండ్ల (కనిగిరి రూరల్): నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి, వెదుళ్ల చెరువు, గుడిపాటి పల్లి బీట్ అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితం మరపగుంట్ల పొలాల్లో పులి తిరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఆప్రాంతంలో పాద ముద్రల నమూనాలను సేకరించి.. అవి పెద్దపులి ఆనవాళ్లు కాదని తెలిపారు. చిరుత పులి, లేదా జంగుపిల్లి పాద ముద్రలు అయి ఉండవచ్చునని నిర్ధారించారు. తాజాగా శనివారం రాత్రి ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి (శివారు ప్రాంతాల్లోని) గ్రామాల్లోని పొలాల్లోకి రాత్రి పది గంటల సమయంలో పులి రోడ్డు దాటుతుండటాన్ని బైక్ పై వెళ్తున్న జీ వెంకటయ్య చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈమేరకు ఫారెస్ట్ రేంజర్ తుమ్మా ఉమా మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గుడిపాటిపల్లి, సీఎస్పురం బీట్ సెక్షన్ అధికారులు దొరసాని, నవీన్, నాయక్లు ఆయా ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. వన్యప్రాణుల ఆనవాళ్లు, పాద ముద్రల నమూనాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి తుమ్మ ఉమా మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కనిగిరి ఫారెస్ట్ ప్రాంతంలో టైగర్ పెద్ద పులులు లేవని తెలిపారు. చిరుత లేదా, జంగుపల్లి ఆనవాళ్లుగా తెలుస్తోందన్నారు. పొలాల్లో సంచరిస్తున్న వన్యప్రాణులను నిర్ధారించేందుకు నాగిరెడ్డిపల్లి, వెదుళ్ల చెరువు బీట్ ప్రాంతాల్లో ‘కెమెరా ట్రాప్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొండ కింద గ్రామాల ప్రజలు రాత్రి వేళ ఆరు బయట పడుకోవద్దని, పొలాలకు, పశువుల మేతకు ఒంటరిగా అడవి ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. -
దోపిడీ హై..
పరిహారంలో● పొదిలి–తూర్పు గంగవరం హై టెన్షన్ టవర్ల నిర్మాణంలో మాయాజాలం ● రైతులకు పరిహారం చెల్లింపులో నిబంధనలు బేఖాతరు ● రైతులను మోసగించిన ట్రాన్స్ కో, రెవెన్యూ అధికారులు ● హై టెన్షన్ విద్యుత్ లైన్ వెంట 144 ఎకరాల్లో నష్టపోయిన రైతుల గగ్గోలు ● రైతుల సొమ్ము మింగేసిన అధికారులు, కాంట్రాక్టర్లు హైటెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణంలో నష్టపోయే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ట్రాన్స్కో, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఐదు రకాల పరిహారాలు ఇవ్వాల్సి ఉంటే లబ్ధిదారులకు అరకొరగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. పరిహారం చెల్లింపులో తమకు జరిగిన అన్యాయంపై కొందరు రైతులు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడంతో చివరకు ట్రాన్స్కో అధికారులు రైతులతో చర్చలకు దిగారు.పరిహారాల్లో లోపం జరిగింది నిజమే.. రైతులకు నష్ట పరిహారం విషయంలో రెవెన్యూ అధికారులతో, రైతులతో చర్చలు జరుపుతున్నాం. ఇటీవల ఒంగోలు ఇన్చార్జ్ ఆర్డీఓ సమక్షంలో ట్రాన్స్ కో అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులతో చర్చించాం. రైతులకు పరిహారాల్లో కొంత లోపం జరిగిన మాట వాస్తవమే. నేను బాధ్యతలు తీసుకోకముందు జరిగిన పరిస్థితులు కొన్ని ఉండవచ్చు. అయితే నేను వచ్చిన తరువాత రైతులతో నేరుగా మాట్లాడుతున్నాను. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇద్దరు కాంట్రాక్టర్లు మారారు. రైతులకు న్యాయం చేస్తాం. – ఏ.కృష్ణారెడ్డి, ట్రాన్స్ కో ఈఈ పంట పొలాల్లో వేసిన విద్యుత్ టవర్లు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: విద్యుత్ కాంట్రాక్టుల విషయంలో ట్రాన్స్ కో అధికారుల దోపిడీ అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద టవర్లు...హైటెన్షన్ విద్యుత్ లైన్లు పొలాల్లో గుండా పోతుంటాయి. కానీ రైతులకు రావాల్సిన పరిహారాలు ఇవ్వకుండానే అధికారులు, అధికార పార్టీ నాయకులు తినేస్తున్నారు. రైతులకు తెలియక ప్రభుత్వం విద్యుత్ లైన్లు వేస్తుంది మనమేమీ చేయలేమని వదిలేస్తున్నారు. అదే ట్రాన్స్ కో అధికారులకు వరంగా మారి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... పొదిలి–తూర్పు గంగవరం హైటెన్షన్ విద్యుత్ లైను నిర్మాణాన్ని ట్రాన్స్ కో అధికారులు చేపట్టారు. ఏడు సంవత్సరాల నుంచి పనులు చేపడుతున్నా ఇప్పటికీ విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇద్దరు కాంట్రాక్టర్లు మారారు. మొత్తం రూ.50 కోట్ల నిర్మాణ పనులు. మొదటి కాంట్రాక్టర్ రూ.12 కోట్లు పనులు చేశామని పూర్తిగా పనులు చేయకుండానే చేతులెత్తేశాడు. ఆ తరువాత మరో కాంట్రాక్టర్ రూ.15 కోట్ల వ్యయంతో చేస్తామని పనులు ప్రారంభించాడు. కానీ అదీ కూడా అంతంత మాత్రమే. రైతులకు శఠగోపం... పొదిలి నుంచి తూర్పు గంగవరం వరకు హై టెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణంతో పాటు పెద్ద పెద్ద విద్యుత్ టవర్లు కూడా నిర్మించాల్సి ఉంది. అందుకు సంబంధించి రైతులకు ఐదు రకాలుగా పరిహారాలు చెల్లించాలి. రైతులకు చెల్లించకుండానే చెల్లించామని రూ.10 కోట్లు ఇద్దరు కాంట్రాక్టర్లు, ట్రాన్స్ కో అధికారులు తినేశారన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. పొదిలి నుంచి తూర్పు గంగవరం వరకూ వెళ్లాల్సిన హైటెన్షన్ విద్యుత్ లైను, టవర్ల నిర్మాణంలో 144 ఎకరాలు పొడవునా రైతులు నష్ట పోతున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో రైతుకు పది సెంట్ల మొదలుకొని 30 సెంట్ల వరకు పొలాన్ని కోల్పోతున్నాడు. అంటే మొత్తంగా విద్యుత్ లైన్ కింద మాత్రమే కోల్పోయే రైతులు 144 ఎకరాలు లెక్కల ప్రకారం తేలుతుంది. ఈ 144 ఎకరాలు లెక్కేస్తే మొత్తం రూ.8 కోట్లు అవుతుంది. మొత్తంగా 73 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ నిర్మాణం, స్థలం ఖరీదు లెక్కేస్తే ఒక్కో టవర్ ఏరియాకు రూ.1.20 లక్షలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. మొత్తం కలిపి రూ.87.60 లక్షలు రైతులకు పరిహారంగా ఇవ్వాలి. దానికి తోడు పంట నష్టం మొత్తం 500 ఎకరాల్లో జరుగుతుంది. పంట నష్టం కింద ప్రభుత్వం విడుదల చేసిన జీఓల ప్రకారం ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అంటే మొత్తం రూ.2.50 కోట్లు ఇవ్వాలి. మొత్తంగా 73 టవర్లు నిర్మించాల్సి ఉంటే వాటి నిర్మాణ సమయంలో చుట్టూ 50 మీటర్లు పొలాన్ని వాడుకుంటారు. పంట ఉన్నా ధ్వంసం చేసిమరీ వాడుకున్నారు. ఆ విధంగా చూస్తే 73 టవర్లకు ఒక్కోటవర్ కింద రైతుకు మరో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అన్నీ కలిపి దాదాపు రూ.12 కోట్ల వరకు ఉంటుంది. తమకు నిబంధనల మేరకు పరిహారం అందలేదని పది మంది రైతులు నెల రోజుల క్రితం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాల విషయం వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు మరికొంత మంది రైతులకు కూడా పూర్తిస్థాయిలో పరిహారం దక్కలేదని తెలుస్తోంది. అక్రమాల వెనుక రెవెన్యూ అధికారుల పాత్ర... సాధారణంగా ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి పరిశ్రమలకై నా, విద్యుత్ లైన్లకై నా భూములు కావాలంటే రెవెన్యూ అధికారులు సర్వే చేయాల్సి ఉంది. రైతులను గుర్తించాలి. వాళ్లకు నోటీసులు ఇవ్వాలి. ఆ తరువాత వాళ్ల వద్ద నుంచి ఆధార్ కార్డులు, వాళ్ల బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలి. రైతులు ఇష్ట పడితేనే వాళ్లకు రావాల్సిన ఐదు రకాల నష్ట పరిహారాలు వాళ్ల బ్యాంకు అకౌంట్లలో పరిహారం జమ చేయాలి. అయితే ట్రాన్స్ కో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క 73 టవర్లు నిర్మాణంలో ఉన్న రైతులకు మాత్రమే రూ.30 వేల నుంచి రూ.65 వేల వరకూ వేశారు. అంటే ఇక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. ట్రాన్స్ కో, రెవెన్యూ అధికారులు కూడబలుక్కొని రైతులకు చెందాల్సిన సొమ్ముకు వాటాలు వేసుకున్నారు. అసలు ఈ విద్యుత్ లైన్ కింద ఎంత మంది రైతులు ఉన్నారు. వాళ్లకు ఎంతమేర నష్ట పరిహారం ఇచ్చామని ట్రాన్స్ కో అధికారులు కూడా లెక్కలు బయట పెట్టడం లేదంటే రైతుల సొమ్ము ఎంత దోచుకున్నారో అర్థమవుతోంది. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సిగ్గుచేటని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ తీవ్రంగా విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాలులో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కళాశాలలు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం నిర్మాణాల కోసం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం అభ్యంతరకరమన్నారు. పీపీపీ పేరుతో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ వినోద్ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన యూనివర్శిటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీలను నిర్మించలేదని, మార్కాపురానికి కేటాయించిన వైద్య కళాశాలను నిర్మాణం పూర్తిచేయకుండా పీపీపీ పేరుతో సొంత వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కాపురం వైద్య కళాశాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని సీపీఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడం భావ్యం కాదని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేగ్ విమర్శించారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు మోహన్, సీపీఐ నాయకులు ఎంఏ సాలార్, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, సమాజ్వాదీ పార్టీ నాయకులు కార్తీక్, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు సుధాకర్, పీడీఎస్యూ నాయకులు సచిన్, ప్రేమ్, సామాజిక కార్యకర్త శివరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న మట్టి దొంగలు
పామూరు: ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, చెరువులను వదలకుండా కూటమి నేతలు యథేచ్ఛగా మట్టిని జేసీబీలతో తవ్వించి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. మండలంలోని అనుములకొండ సమీపంలో చింతలపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన పొలాల్లో కొన్ని రోజులుగా జేసీబీ, ట్రాక్టర్లతో కూటమి నాయకులు పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో నూతనంగా వేస్తున్న లేఅవుట్ల రోడ్లకు, నూతన భవనాల నిర్మాణాల పునాదుల కోసం తరలిస్తున్నారు. ఈప్రాంతంలో ఉన్న మరసమట్టి మేలురకం కావడంతో ట్రాక్టర్ రూ.650 నుంచి రూ.800 దాకా పలుకుతోంది. ఇంత జరుగుతున్నా అటు పంచాయతీ కార్యదర్శులుగానీ, వీఆర్ఓలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా 167బి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దూబగుంట్ల చెరువులో ఇటీవల కూటమి నాయకులు డోజర్, జేసీబీలను పెట్టి మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కన ఇలా తవ్వకాలు చేపడుతున్నారంటే అధికార బలంతోనే కూటమి నాయకులు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఆగని తవ్వకాలు: ఇటీవల మండలంలోని దూబగుంట్ల చెరువులో మట్టి తవ్వకాలను అధికారులు అడ్డుకుని జేసీబీ, ట్రాక్టర్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా దూబగుంట్లలో తవ్వకాలు ఆపేసి మరో ప్రాంతంలో తవ్వకాలకు తెరలేపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేఅవుట్లలో చదునుకోసం, రోడ్ల నిర్మాణానికి వందల సంఖ్యలో ట్రాక్టర్ల మట్టి అవసరమవుతుండగా దీనిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు
ఒంగోలు టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఆదివారం పోలీసులు విస్తృతంగా దాడులు చేశారు. ఒంగోలు తాలూకా, సంతనూతలపాడు, సింగరాయకొండ, జరుగుమల్లి, మార్కాపురం, మర్రిపూడి, మార్కాపురం రూరల్, కనిగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 55 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి 93,630 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండలో కోడిపందేలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,27,800 స్వాధీనం చేసుకున్నారు. కొండప్రాంతాలు, పొలాల్లో పేకాట శిబిరాలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి మరీ దాడులు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 47 మందితో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేశారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వెంటనే 112, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం తెలియజేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు కోరారు. మార్కాపురం: మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి శనివారం సాయంత్రం తన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా కోలభీమునిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బోయలపల్లి పోలిరెడ్డి దూషించడంతోపాటు అధికారిక విధులను ఆటంక పరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు. -
తాడిపత్రి డేరా బాబావి.. ఒంగోలులో ఏం పీకుతావు జేసీ!: టీడీపీ నేత ఫైర్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండి ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు జేసీ ప్రభాకరరెడ్డి’.. అంటూ ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్రెడ్డి(Surya Prakash) మండిపడ్డారు. ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ఫోన్చేసి తనను బెదిరించారని శనివారం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి వెల్లడించారు.ఆయన ఏమన్నారంటే.. జేసీ ప్రభాకరరెడ్డి(Prabhakar Reddy) శుక్రవారం సాయంత్రం ఫోన్చేసి ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్పగించాలంటూ నన్ను బెదిరించాడు. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు.. నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు. సెటిల్ చేసుకో. లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నుంచే ఎత్తుకు వస్తారు అని బెదిరించాడు. గలీజు మాటలు, బండ బూతులు, మీడియా ముందు చెప్పుకోలేని పదజాలం వాడాడు. గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. జేసీ ప్రభాకర్రెడ్డీ.. అనంతపురం జిల్లాలో, తాడిపత్రిలో చేసినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు ఒంగోలులో చేస్తే చెల్లవు. నువ్వూ టీడీపీ నాయకుడివే. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్వి. తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో. అక్కడ మురుగు కంపుకొడుతోంది. దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేది ఏంది? అంటూ ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు టీడీపీలో(TDP) కొత్త ట్విస్ట్ ఇచ్చాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కొండపోరంబోకులు
గిద్దలూరు రూరల్: గిద్దలూరు మున్సిపల్ పరిధిలోని కొండపోరంబోకు స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. అధికార టీడీపీ నేతలకు ప్రభుత్వ భూములు మేతగా మారుతున్నాయి. పట్టణంలోని హోసన్న మందిరం వైపు ఉండే కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాలను టీడీపీ నాయకులు అధికారం బలంతో ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పట్టణంలోని రాజానగర్, నల్లబండబజారు, కొండపోరంబోకు స్థలాల్లో పెద్ద ఎత్తున లేఔట్లు వేసి పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆ ప్రదేశాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అటు వైపు అడుగులు వేయకపోగా ఉన్న కొద్ది పాటి స్థలాలు ఆక్రమణలకు గురవుతుంటే చూస్తూ ఉండిపోయింది. హోసన్న మందిరం వైపు ఉన్న కొండపోరంబోకు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా రెవెన్యూ శాఖ బోర్డు పెట్టింది. కొండపోరంబోకు స్థలాలు ఎవరూ కొనరాదు, అమ్మరాదు, ఇంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆ బోర్డులో పేర్కొన్నారు. ఈ ప్రకటన ఉల్లంఘించిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. చివరకు హెచ్చరిక బోర్డును ఆనుకుని కొన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయి. హెచ్చరిక బోర్డుకు కూతవేటు దూరంలో ఇటీవల ఓ టీడీపీ నాయకుడు అధికారుల అండదండలతో సుమారు 20 స్లెంట్ల స్థలాన్ని పొక్లెయిన్తో చదును చేయించాడు. సదరు స్థలంలో రాతి కట్టడం కట్టాడు. ప్రభుత్వ స్థలాలు అప్పన్నంగా కాజేస్తున్నా వారి పేరు మీదు ఎలాంటి నోటీసులు లేదా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎటువంటి రాజకీయ అండదండలు లేని నిరుపేదలు ఆక్రమణలు జరిపిన వారికి మాత్రం నోటీసులు జారీ చేస్తూ కట్టడాలను అడ్డుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఏకంగా గృహాలే నిర్మాణం పట్టణంలోని రాజానగర్, హోసన్న మందిరం, నల్లబండ బజారు, శ్రీరామ్నగర్, నరసింహాస్వామి మెట్లరోడ్డు వైపు ఉండే కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురై వందల సంఖ్యలో గృహ నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణకు పాల్పడిన వారి నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 225 జీఓ ప్రకారం వారి వద్ద ఉన్న ఆధారల మేరకు నగదు చెల్లించుకుని వారి అక్రమ కట్టడాలను రెగ్యులరైజేషన్ చేయాల్సి ఉంది. రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు వేయలేదు. రాజానగర్, హోసన్న మందిరం, నల్లబండబజారు, శ్రీరామ్నగర్, నరసింహాస్వామి మెట్లరోడ్డు ప్రాంతాల్లోని కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు చేసి దర్జాగా నివశిస్తున్నా రెగ్యులరైజేషన్లు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గిద్దలూరు పట్టణంలో భూకబ్జాలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండాపోయింది. కొండపోరంబోకు స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. ఖాళీ జాగా కనిపిస్తే క్షణాల్లో ఏదో ఒక కట్టడం కట్టేస్తున్నారు. అక్రమార్కులు ఇష్జారాజ్యంగా రెచ్చిపోతున్నా ఇదేందని అడిగే వారు లేకుండాపోయారు. ఇటీవల ఓ టీడీపీ నాయకుడు 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి చదును చేయించినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
జవాన్ భూమి కబ్జాకు పచ్చనేతల పన్నాగం
యర్రగొండపాలెం: ఆర్మీ జవాన్కు దాదాపు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమిని కబ్జా చేసేందుకు పచ్చనేతలు తహసీల్దార్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూమిని ఆన్లైన్ నుంచి తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం సర్వే నంబర్ 383లో దాదాపు 163.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 86.24 ఎకరాల భూమి సేద్యానికి ఉపయోగపడుతుందని అధికారులు గుర్తించి 2008 అక్టోబర్ 30న పేదలకు భూమిని పంపిణీ చేశారు. అందులో భాగంగా దూదేకుల తంగెళ్ల ఖాశిం 4.70 ఎకరాలు, ఆయన సోదరుడు దూదేకుల ఖాశింకు 3 ఎకరాలు చొప్పున ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి వారు ఆ భూమిలో వివిధ పంటలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారిలో తంగెళ్ల ఖాశిం ఆర్మీ జవాన్గా, ఖాశిం హైదరాబాద్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కె.ఏడుకొండలు, ఆర్.చిన్నతిరుపాలు ఆ భూములపై కన్నేశారు. 2020లో వారికి ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలపై కొండవాగు పోరంబోకు భూమి అని అభ్యంతరం తెలిపారు. దీనిపై అప్పటి తహసీల్దార్ దర్యాప్తు జరిపి వారికి భూమిని స్వాధీనం చేశారు. తమకు, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సోదరులు ఇద్దరు ఎస్పీకి అర్జీ పెట్టుకున్నారు. అప్పటి తహసీల్దార్ కూడా వారి కుటుంబంతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి రక్షణ కల్పించాలని త్రిపురాంతకం పోలీస్స్టేషన్కు లెటర్ పెట్టారు. ఈ విషయంపై పోలీసులు వారిని పిలిపించి హెచ్చరించడంతో వారు మిన్నకుండిపోయారని ఆర్మీ జవాన్ తెలిపాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య మొదటికి వచ్చింది. ఆ భూమిపై కన్నేసిన ఏడుకొండలు, చిన్న తిరుపాలు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అండదండలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ చీరాల కృష్ణమోహన్పై ఒత్తిడి తీసుకొచ్చి ఆన్లైన్లో వారి భూములను తొలగింప చేశారు. అంతేకాకుండా ఆర్మీ జవాన్ తండ్రి దూదేకుల జానయ్యపై దాడి చేయించారు. ఈ విషయంపై పోలీస్స్టేషన్కు వెళ్లి కేసు పెట్టినప్పటికీ నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేదని, కనీసం పోలీస్స్టేషన్కు పిలిపించి మందలించక పోవడంతో వారు మరింతగా రెచ్చిపోయి పొలానికి రక్షణగా వేసుకున్న కంచెను, విద్యుత్ బోరు పరికరాలను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయులు చేస్తున్న దౌర్జన్యాలపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, ఆయనకు ఇచ్చిన అర్జీని దర్శి డీవైఎస్పీకి పంపారని తెలిపారు. ఎస్పీ ఫార్వర్డ్ చేసిన అర్జీపై డీవైఎస్పీ మాట్లాడుతూ ఇది సివిల్ కేసని, కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని చెప్పారు. సమగ్ర దర్యాప్తు జరపకుండా ఆన్లైన్ తొలగింపు టీడీపీ వర్గానికి చెందిన వారు చేసిన ఫిర్యాదు మేరకు ఎటువంటి విచారణ జరపకుండా తమ భూమిని తహసీల్దార్ ఆన్లైన్ నుంచి తొలగించారని బాధితులు ఆరోపించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏడుకొండలు అతని అనుచరులు తాము అనుభవిస్తున్న భూమిపై అర్జీలు ఇవ్వడం వారితో చీవాట్లు పెట్టించుకోవడం అలవాటైపోయిందని, అధికారం ఉందన్న అహంకారంతో తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టి వారం రోజులు కాకముందే పచ్చ నేతలు హాజరు కావడం, అర్జీ ఇవ్వడం, ఆన్లైన్ నుంచి ఆర్మి జవాన్ అతని సోదరుడి భూమిని తొలగించడం యుద్ధప్రాతిపదికగా జరిగి పోయాయని ఆ గ్రామస్తులు ఆరోపించారు. విచారణ జరపకుండా ఆన్లైన్ నుంచి భూమిని ఏ విధంగా తొలగించావని కలెక్టర్ తహసీల్దార్ను ప్రశ్నించినట్లు తెలిసింది. అధికార వర్గీయుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటం వలన తాను వారి భూమిని ఆన్లైన్ నుంచి తొలగించాల్సి వచ్చిందని తహసీల్దార్ కృష్ణమోహన్ సమాధానం తెలిపినట్లు తెలిసింది. ఆ భూమిపై కన్నేసి.. డబ్బులు దండుకొని ఆర్మీ సోదరుల భూమిపై కన్నేసిన పచ్చ గద్దలు అర ఎకరం ప్రకారం తమ పేర్లతో ఆన్లైన్ చేయిస్తానని 10 మంది నుంచి డబ్బులు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం ఆ గద్దలు భూమిపై హక్కుపొందిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాగు పోరంబోకు భూమి అని సాకులు చూపుతున్న రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబర్లో పంపిణీ చేసిన 86.24 ఎకరాల భూమిని పక్కనపెట్టి కేవలం 7.70 ఎకరాలపైనే దృష్టి పెట్టి పచ్చ గద్దలకు ఆహారంగా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దేశరక్షణ కోసం పాటు పడుతున్న ఆర్మీ జవాన్, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. భూ పత్రాలు చూపినా ఆన్లైన్ నుంచి తొలగింపు పట్టాదారు తండ్రిపై దాడి చేసినా పట్టించుకోని పోలీసులు దౌర్జన్యంగా పొలం ఫెన్సింగ్ తొలగింపు, బోరు ధ్వంసం కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించిన బాధితులు -
గంజాయి ప్రియులకు కౌన్సెలింగ్
ఒంగోలు టౌన్: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 46 మందికి, 9 మంది విక్రేతలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. శనివారం గంజాయి వినియోగిస్తున్న మామిడిపాలెం, కేశవరాజుకుంట, కమ్మపాలెం, ఇందిరమ్మ కాలనీ, గోపాల్ నగర్, మంగమూరు రోడ్డు, భారత్ కాలనీ, నెహ్రూ నగర్, వెంకటేశ్వర కాలనీ, త్రోవగుంట, దిబ్బల రోడ్డు ప్రాంతాలకు చెందిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న మామిడిపాలెం, శివప్రసాద్ కాలనీ, గాంధీనగర్, మదర్థెరిసా కాలనీ, పేర్నమిట్ట, వెంకటేశ్వరకాలనీ, ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని ప్రాంతాలకు చెందిన వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వివరించి చెప్పారు. చట్టపరంగా ఎదురయ్యే కష్టనష్టాలను, దాని వలన కలిగే సామాజిక ప్రభావాన్ని వివరించారు. గంజాయి కట్టడికి ప్రజలు సహకరించాలని, ఏదైనా సమాచారం ఉంటే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
అమ్మకానికి ప్రభుత్వ స్థలాలు
పట్టణంలోని నల్లబండబజారు, రాజానగర్, శ్రీరామ్నగర్, నరసింహస్వామిమెట్ల రోడ్డు, హోసన్న మందిరం రోడ్డుల్లోని కొండపోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాచేసి అక్రమ కట్టడాలు చేపట్టి అమ్మకాలు జోరుగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. కొండపోరంబోకు స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలకు ఇతర సర్వే నంబర్లు వేసి ఆ సర్వే నంబర్లో ఇంటి నిర్మాణం చేపట్టినట్లు మున్సిపల్ శాఖ నుంచి పన్ను రసీదులు పుట్టించుకుని దాని ఆధారంగా అమ్మకాలు కొనసాగిస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. -
రేషన్ బియ్యంపై నిరంతరం నిఘా
నాగులుప్పలపాడు: రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల నుంచి కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ స్థానిక పోలీసులకు పట్టుబడిన బియ్యాన్ని శనివారం ఎన్ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్లు నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్లో పరిశీలించారు. 720 బ్యాగుల్లో ఉన్న బియ్యాన్ని ఒంగోలు స్టాక్ కేంద్రానికి తరలించారు. అనంతరం మద్దిపాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లును పరిశీలించారు. అక్కడ ఎలాంటి పీడీఎస్ రైస్ లేవని స్పష్టం చేశారు. మద్దిపాడు: మండలంలోని గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై వెంకట సూర్య అందించిన సమాచారం ప్రకారం.. తిమ్మనపాలెం గ్రామానికి చెందిన అన్నంగి కుమార్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రోత్ సెంటర్ వైపు నుంచి నాగులుప్పలపాడు రోడ్డుకు వెళ్తుండగా ఒంగోలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఒంగోలు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంగోలు వన్టౌన్: ఏసీ, రిఫ్రిజిరేటర్ మరమ్మతులపై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరక్టర్ పీ శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ 30 రోజుల పాటూ ఈ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. అభ్యర్థులు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. శిక్షణ కాలంలో పూర్తి ఉచిత, భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 9573363141 అనే నంబరుపై సంప్రదించాలన్నారు. కందుకూరు రూరల్: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఓగూరు సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన పి.భార్గవ్నాథ్ కొరియర్ బాయ్గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై కందుకూరు వచ్చి విధులు ముగించుకొని తిరిగి ఒంగోలు వెళ్తున్నాడు. ఓగూరు సమీపంలోని రవి గార్డెన్ వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ నాన్ స్టాప్ బస్ ఢీకొట్టింది. భార్గవ్నాథ్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్ తెలిపారు. -
ఆర్భాటం తప్ప..సాయం అంతంత మాత్రమే
ఒంగోలు సబర్బన్: ఆటో డ్రైవర్ సేవ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంటే జిల్లా కేంద్రం ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమానికి కనీసం 400 ఆటోలు కూడా రాలేదు. జిల్లా వ్యాప్తంగా 11,356 మంది ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమాన్ని అందిస్తుంటే కనీసం 400 ఆటోలు కూడా రాలేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ మంత్రి మండిపడ్డారు. ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమం శనివారం ఒంగోలులోని మినీ స్టేడియంలో జరిగింది. ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మెగా చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. అర్హత ఉన్న ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.15 వేలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు, కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, డీటీసీ ఆర్.సుశీల, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి అసహనం లబ్ధిదారులు తక్కువ మంది హాజరు కావడంపై ఆగ్రహం -
కౌశల్ పోటీలను విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కౌశల్ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని డీఈఓ కిరణ్కుమార్ కోరారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కౌశల్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ కిరణ్కుమార్ మాట్లాడుతూ కౌశల్ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. స్కూల్ లెవెల్ పరీక్షలో.. ● క్విజ్ పోటీలకు అర్హత 8, 9, 10వ తరగతి విద్యార్థులు, విద్యార్థుల సంఖ్య తరగతికి ముగ్గురు మాత్రమే ఉండాలి. ● రీల్ పోటీలకు పదో తరగతి విద్యార్థులు పాల్గొనాలి. ● పోస్టర్ కాంపిటీషన్–1 పోటీలకు అర్హత 9వ తరగతి, ఇద్దరు మాత్రమే ఉండాలి. ● పోస్టర్ కాంపిటీషన్–2 పోటీలకు అర్హత 8వ తరగతి, ఇద్దరు మాత్రమే ఉండాలి. క్విజ్, రీల్ కాంపిటీషన్, పోస్టర్ కాంపిటీషన్లో పాల్గొనే విద్యార్థులు స్కూల్ లెవెల్లో ఆన్లైన్ పరీక్ష రాయాలి. పైన తెలిపిన పోటీల్లో పాల్గొనే విద్యార్థులు సిలబస్ కోసం క్విజ్ పోటీలకు ఎస్సీఈఆర్టీ అక్టోబర్ వరకు, రీల్ పోటీలకు ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ వెబ్ సైట్లో, పోస్టర్ కాంపిటేషన్ పోటీలకు భారత దర్శన్ మెటీరియల్లో చూడాలి. స్కూల్ లెవెల్ ఎగ్జామ్లో ప్రతి తరగతి నుంచి క్విజ్కు 20 మంది విద్యార్థులు, రీల్కు 20 మంది విద్యార్థులు, పోస్టర్–1కు 20 మంది విద్యార్థులు, పోస్టర్–2కు 20 మంది విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయికి ఎంపికై న విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష జరుగుతుంది. రాష్ట్రస్థాయికి ప్రతి జిల్లా నుంచి క్విజ్ పోటీలకు ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు, 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు పాల్గొంటారు. రీల్ కాంపిటీషన్కు 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు, పోస్టర్ కాంపిటీషన్–1కు 9వ తరగతి విద్యార్థులు విద్యార్థులు, పోస్టర్ కాంపిటీషన్–2కు 8వ తరగతి విద్యార్థులు ఇద్దరు ఎంపికవుతారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు వారి విభాగాల్లో ముఖాముఖి పోటీలు జరుగుతాయి. స్కూల్ లెవెల్లో పరీక్షలు 8వ తరగతి నవంబర్ 1, 9వ తరగతి–నవంబర్ 3, పదో తరగతి– నవంబర్ 4వ తేదీల్లో జరుగుతాయి. జిల్లా స్థాయి పరీక్షలు 8వ తరగతి, 9వ తరగతికి నవంబరు 27న, 10వ తరగతికి నవంబరు 28న పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 27 తిరుపతిలో భారతీయ విజ్ఞాన జాతీయ సమ్మేళనంలో జరుగుతాయని డీఈఓ కిరణ్కుమార్ వివరించారు. డీవైఈఓ చంద్రమౌలేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్, గుడివాడ శ్రీనివాసరావు, నాగినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. డీఈఓ కిరణ్కుమార్ -
పొగాకు రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: రైతుల వద్ద ఇంకా 30 శాతం బర్లీ పొగాకు మిగిలిపోయిందని, రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని, వర్జీనియా పొగాకు లో గ్రేడ్ రకాన్ని రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తగినంత మేర నిధులు కేటాయించి పొగాకును కొనుగోలు చేయకపోతే రైతులు కోలుకోని విధంగా నష్టపోతారని చెప్పారు. ఇటీవల వర్జీనియా నంబర్ పొగాకుకు కాస్త రేటు వచ్చినప్పటికీ అది తాత్కాలికంగా కొనుగోలు చేశారని, తిరిగి మాములు పరిస్థితి నెలకొందని చెప్పారు. లో గ్రేడ్ పొగాకు రేట్లు బాగా పతనమయ్యాయన్నారు. దీని వలన బ్యారన్కు రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలో శనగలను దాచి పెట్టుకున్నా సరైన ధరలు రాక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారన్నారు. శనగలు క్వింటాకు రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రూ.234 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి జమ చేసినా రైతుల రుణమాఫీ గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూశనగలు రూ.10 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంతిబాబు అధ్యక్షత వహించగా పెంట్యాల హనుమంతరావు, ఏడుకొండలు, అబ్బూరి వెంకటేశ్వర్లు, రత్నారెడ్డి, గంగినేని సత్యనారాయణ, కరిచేటి హనుమంతరావు, బెజవాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టండి
ఒంగోలు టౌన్: కులగణన చేపట్టిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, కులాల జనాభా ప్రతిపాదికన స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కులగణన చేపట్టాన్న డిమాండ్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జనగణనతో పాటుగా కులగణన చేపట్టాలని, కులాల జనాభా ప్రతిపాదికన వారికి దక్కాల్సిన హక్కులు కేటాయించాలని కోరారు. బీసీలలో 143 కులాలు ఉన్నా వాటిలో ఎక్కువ భాగం కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే హీనమైన జీవితాలను అనుభవిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వారికి సక్రమంగా దక్కడం లేదని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్ఆర్సీ తీసుకొచ్చిందని చెప్పారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కులగణన ప్రతిపాదికన రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వలన ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కోల్పోయిన యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోవున్న పార్టీలు ప్రజలను కులమతాలుగా విడగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నీరు శివప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలు ఐక్య పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని చెప్పారు. కులగణన చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆచరణలో వెనేకంబ వేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ముందుకు వచ్చి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మొండిబండ కులసంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గంగిరెడ్డు, బుడబుక్కల, కాటికాపరులు, పాముకులస్తులు బీసీ కులాల జాబితాలో ఉన్నా ఎస్సీ, ఎస్టీల కంటే హీనంగా బతుకుతున్నారని చెప్పారు. పోరాటాల ద్వారానే కులగణన సాధ్యమవుతుందని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు సయ్యద్ యాసిన్, కృష్ణ గౌడ్, యం.విజయ, ఖాసీం, బేగ్, ఎల్.రాజశేఖర్, పి.సుధాకర్, పేరయ్య, సుబ్బారావు, ఆర్.వెంకటరావు, కవరది సుబ్బారావు, వీరారెడ్డి, మురళి, డి.శ్రీనివాస్, మౌలాలి, లక్ష్మీ, రామయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. -
పత్తిపై విద్వేష కత్తి
దొనకొండ: కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా, కాపు దశలో ఉన్న 6.39 ఎకరాల పత్తి పొలాన్ని విద్వేషంతో దున్నేసిన టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ ఇది. దొనకొండ మండలం వద్దిపాడు గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తొలుచూరి చిన్నయ్య సర్వే నంబర్ 174లో తను కొనుగోలు చేసిన 7.80 ఎకరాలను కుమారుడు కోటయ్యకు అలాగే అల్లుడు గుమ్మా కొండయ్యకు సమానంగా 1992లో జాయింట్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పాటు సర్వే నంబర్ 166/2లో 1.66 ఎకరాలు, 158/2లో 0.83 ఎకరాలు అల్లుడు కొండయ్యకు రిజిస్ట్రేషన్ చేశారు. తద్వారా మొత్తం 6.39 ఎకరాలు కొండయ్యకు దఖలుపడింది. అప్పటి నుంచి వీరు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మోసంతో రిజిస్ట్రేషన్... కాగా, కొద్ది సంవత్సరాల క్రితం కొండయ్య మతి స్థిమితం తప్పింది. దీనిని ఆసరాగా చేసుకుని కొండయ్యకు చెందిన 6.39 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తాడి నారాయణరెడ్డి తన బినామీ తోట వెంకట రమణ పేరున 2022 మేలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ తరువాత కొద్ది నెలలకే కొండయ్య మృతి చెందడంతో ఈ మొత్తం వ్యవహారంపై తొలుచూరి కోటయ్య, ఆయన సోదరి, గుమ్మా కొండయ్య భార్య పెద్ద కోటమ్మ అదే ఏడాది సెప్టెంబర్లో దర్శి జూనియర్ కోర్టులో ఇంజెక్షన్ దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. నేటికీ ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఈ ఉత్తర్వుల మేరకు నాటి తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావు ఈ భూమిని‘డిస్ప్యూట్’ పెట్టారు. కోర్టు కేసుల్లో ఉన్న పొలం ‘తిరిగి’ రిజిస్ట్రేషన్ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే సదరు టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి తహసీల్దార్తో లాలూచీ పడి ఈ ఏడాది ఏప్రిల్ 24న భూమిని ‘డిస్ప్యూట్’ నుంచి తొలగించారు. అదే నెలలో ఈ భూమిని తోట వెంకట రమణచేత నారాయణరెడ్డి తన కుమారుడు తాడి శేఖర్రెడ్డిపై తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. కోర్టులో పొలం వ్యాజ్యం ఉండగా, ఈ రిజిస్ట్రేషన్ అన్యాయమని పేర్కొంటూ కోటమ్మ ఈ వ్యవహారాన్ని ఆగస్టులో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా, కొద్ది నెలల క్రితం కోటమ్మ తమ ఆధీనంలో ఉన్న మొత్తం 6.39 ఎకరాల్లో రూ.లక్షలు ఖర్చుచేసి పత్తి పంట వేసింది. పొలం మొత్తం కాపు దశలో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి, ఆయన అనుచరులు శనివారం తెల్లవారుజామున భూమిని ట్రాక్టర్తో దున్నేశారు. ఉదయం 6 గంటలకు ఈ దారుణాన్ని తెలుసుకున్న బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దున్నడం తప్పే: ఈ ఘటనపై తహసీల్దార్ బి.రమాదేవిని వివరణ కోరగా.. రైతు సాగు చేసిన పొలాన్ని అన్యాక్రాంతంగా వేరే వారు దున్నటం తప్పని పేర్కొన్నారు. ఆటో మ్యుటేషన్ కారణంతో రెండవదఫా రిజిస్ట్రేషన్ జరిగి ఉండవచ్చని తెలిపారు. – తహసీల్దార్ త్రిపురాంతకం సీఐ బెదిరించారు ఈ వ్యవహారంపై నన్ను త్రిపురాంతకం సీఐ హసన్ పిలిపించి పొలం నుంచి వైదొలగకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించారు. – తొలుచూరి కోటయ్య, వద్దిపాడు నా భర్తకు మతి స్థిమితం లేదు నా భర్త కొండయ్యకు మతి స్థిమితంలేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మా కుటుంబ సభ్యులకు తెలియకుండా నా భర్తతో నారాయణరెడ్డి తన బినామీ వెంకటరమణకు రిజిస్ట్రేషన్ చేయించాడు. మా భూమికి సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్లు దారుణం. – గుమ్మా పెద్ద కోటమ్మ, వద్దిపాడు -
దోపిడీ బండ
బాహాటంగాచీమకుర్తి: గ్రానైట్పై సీనరేజి వసూలు బాధ్యతలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడాన్ని నిరశిస్తూ గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ప్రైవేటు సంస్థకు, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో సదరు ప్రైవేటు సంస్థ బహిరంగంగానే అదనపు వసూళ్లకు పట్టుబడుతూ గ్రానైట్ యజమానులపై ఒత్తిడి తేవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలో ప్రభుత్వం ఒక్కో బ్లేడ్కు అదనంగా మైనింగ్ బిల్లుకు రూ.8 వేలు పెంచింది. దాని వలన ఇప్పటి వరకు శ్లాబ్ విధానంలో ఒక్కో బ్లేడ్కు చెల్లించే రూ.27 వేలకు అదనంగా మరో రూ.8 వేలు పెంచటంతో మొత్తం కలిసి రూ.35 వేలు అయింది. దానికి జీఎస్టీ, ఇతర ఖర్చులు కలిపితే మొత్తం రూ.40 వేలకు చేరుకుంటుంది. ఒక్కో గ్రానైట్ ఫ్యాక్టరీలో కనీసం రెండు బ్లేడ్లు నుంచి మూడు, నాలుగు, మల్టీ సంఖ్యలో బ్లేడ్లు ఉంటాయి. ఎన్ని బ్లేడ్లు ఉంటే అన్ని రూ.35 వేలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్లాబ్ విధానంలో చెల్లించే బిల్లులను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి అప్పగించటంతో ఈ బిల్లులను ప్రైవేటు కంపెనీకి చెల్లించాలి. అయితే ప్రైవేటు కంపెనీ వారు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక్కో బ్లేడ్కు రూ.35 వేలతో పాటు కంపెనీకి అనధికారకంగా మరో రూ.35 వేలు చెల్లించాలని బాహాటంగా చర్చల్లో పెట్టి నిలువు దోపిడీకి తెరలేపింది. దానిపై శనివారం ఒంగోలులోని గ్రానైట్ క్వారీల యజమానుల అతిథి గృహంలో ప్రైవేటు కంపెనీకి, చీమకుర్తిలోని గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో ప్రైవేటు రుబాబు వసూళ్ల వద్దే ఫ్యాక్టరీల యజమానులు అడ్డం తిరిగారు. భారమైనా ప్రభుత్వం చెల్లించమన్న రూ.35 వేలను ఒక్కో బ్లేడ్కు చెల్లిస్తాం.. అంతే గానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేటు కంపెనీ రుబాబు చేసి అనధికారికంగా చెల్లించమన్న రూ.35 వేలను కట్టే ప్రసక్తే లేదని తెగేసి చెప్పటంతో ప్రైవేటు కంపెనీ వారు తమ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మాట్లాడి ఈనెల 9వ తేదీ లోపు చెప్తామంటూ చర్చలను అసంతృప్తిగా ముగించారు. ముడిరాయి, వేస్ట్ రాళ్లపై కూడా ప్రైవేటు కంపెనీ బాదుడు: గ్రానైట్ క్వారీలో నుంచి ఫ్యాక్టరీల యజమానులు కొనుగోలు చేసే ముడిరాళ్లు అన్నీ ప్రాసెస్ చేసే సమయానికి వేస్ట్, క్రాక్లు, సక్రమ సైజులు లేకపోవడం వలన కొనుగోలు చేసిన రాళ్లల్లో దాదాపు 20–25 శాతం రాయి వృథాగా పోతోంది. కానీ క్వారీ నుంచి కొనుగోలు చేసిన రాయి బయటకు వచ్చే సమయంలో సీనరేజి వసూళ్లకు వచ్చిన ప్రైవేటు కంపెనీ మాత్రం వేస్ట్గా పోయే రాళ్లతో సహా రాయల్టీని చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్టరీల యజమానులపై ఇప్పుడే ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఫ్యాక్టరీల యజమానులు మాత్రం ఫినిష్డ్ చేసిన మెటీరియల్పై మాత్రమే రాయల్టీ చెల్లిస్తామంటున్నారు. ఇలా రాయల్టీ, శ్లాబ్ విధానంలో మైనింగ్ బిల్లులు చెల్లించలేక ఫ్యాక్టరీల యజమానులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి నెలసరి వాయిదాలు, కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడుతుంటే వాటితో పాటు అనధికారకంగా ఒక్కో బ్లేడ్కు రూ.35 వేలు చెల్లిస్తారా..? లేక చెల్లించరా ? అంటూ ఫ్యాక్టరీల యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీల మూసివేత ఎప్పటి వరకు ఉంటుందో... వారి మధ్య సయోధ్య ఎప్పటికి కుదురుతుందోనని ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీల యజమానులకు గ్రానైట్ రాళ్లను రవాణా చేసే ట్రాలీలు, లారీల యజమానులు సంఘీభావం ప్రకటించి తమ మద్దతు తెలిపారు. మర్రిచెట్లపాలెంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో గ్రానైట్ బ్లాకులను కట్ చేస్తున్న బ్లేడ్ రుబాబు వసూళ్లపై నోరు మెదపని మైన్స్ అధికారులు ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు నిస్సిగ్గుగా గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులను అనధికారికంగా రూ.35 వేలు చెల్లించాలని బహిరంగంగా చర్చలు పెట్టి మరీ మేము అడిగినంత ఇస్తారా..? లేదా..? డిమాండ్ చేస్తుంటే జిల్లా మైన్స్ అధికారులు నోరు మెదపకపోవడం శోచనీయమని ఫ్యాక్టరీల యజమానులు వాపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రైవేటు కంపెనీ వారి వసూళ్లలో వీరి పాపం కూడా ఉందేమోనని ఫ్యాక్టరీల యజమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్లుగా నియామకం
కనిగిరిరూరల్: పార్టీలో నిబద్ధతగా, అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఉన్నత స్థానం కల్పించారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం కల్పించారు. కనిగిరి నియోజకవర్గానికి చెందిన చింతలచెరువు సత్యన్నారాయణరెడ్డిని సీఈసీ మెంబర్గా నియమించారు. ఆయన గతంలో వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకునిగా, 2024 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ పరిశీలకుడిగా, ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. తన నియామకం పట్ల చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి మార్కాపురం: వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యునిగా ప్రస్తుత నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని నియమించారు. జంకె వెంకటరెడ్డి రెండు సార్లు మార్కాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ పరిశీలకునిగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన పై ఎంతో నమ్మకంతో అప్పగించిన ప్రతి పదవిని బాధ్యతగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని జంకె వెంకటరెడ్డి తెలిపారు. కొండపి నుంచి డాక్టర్ మాదాసి వెంకయ్య సింగరాయకొండ: కొండపి నియోజకవర్గానికి చెందిన మాజీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్, పీడీసీసీబీ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. -
రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా మన్నం వెంకయ్య
టంగుటూరు: రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా మండలానికి చెందిన మన్నం వెంకయ్యను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మన్నం వెంకయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పదవి రావడానికి సహకరించిన పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు టౌన్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేయడానికి ఈకేవైసీ కచ్చితంగా చేసుకోవాలని డ్వామా పీడీ జోసఫ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ అమలులోకి వస్తుందని, ఈకేవైసీ పూర్తి చేయని శ్రామికులకు పని ఇచ్చే అవకాశం ఉండదన్నారు. నవంబర్ 7వ తేదీలోగా జిల్లాలోని ఉపాధి శ్రామికులు ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించారు. ఒంగోలు వన్టౌన్: మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సాధికారత అధికారి నిర్మలా జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కాన్ఫరెన్సు హాలులో ఈ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని వాల్మీకి సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కనిష్ట, గరిష్ట ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం ప్రారంభం నుంచి గరిష్ట ధర కేజీ రూ.280 కి కొనుగోలు చేసి వేలం చివర దశకు వచ్చేసరికి కేజీ రూ.346 చేశారు. అనంతరం ఇదే రౌండ్లో రూ.316 కు గరిష్ట ధరను తీసుకొచ్చారు. ఒక్క రోజులోనే గరిష్ట ధర పది రూపాయలు పడిపోయింది. 12వ రౌండ్ వేలం ప్రారంభంలో గరిష్ట ధర పెంచుకుంటూ పోయిన వ్యాపారులు చివరి దశకు వచ్చేసరికి మళ్లీ తగ్గించుకుంటూ వస్తున్నారని రైతులు వాపోతున్నారు. అదేమని అడిగితే అప్పుడు అవసరం ఉంది ఇప్పుడు అవసరం లేదని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. నాణ్యమైన పొగాకును గతంలో తక్కువకు కొనుగోలు చేయడం వల్ల నష్టపోయామని, ఇప్పుడు కనిష్ట ధరలు కూడా తగ్గించుకుంటూ పోతూ కేజీ రూ.85కు తీసుకొచ్చారని రైతులు వాపోతున్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర కేజీ రూ.85 పలికిందని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని కట్టవారిపాలెం, నర్సింగోలు గ్రామాలకు చెందిన రైతులు 1162 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 1019 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 143 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.316, సరాసరి ధర కేజీ రూ.233.33 గా నమోదైంది. వేలంలో 16 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: గ్రానైట్ రాయల్టీని పెంచి వసూలు బాధ్యతను ఏఎంఆర్ సంస్థకు అప్పగించడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలం సుబ్బారావు, యం.రమేష్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిపోయిన తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని వివరించారు. ఫ్యాక్టరీల రాయల్టీని రూ.27 వేల నుంచి రూ.35 వేలకు పెంచడంతో పాటుగా జీఎస్టీతో కలిపి రూ.40 వేలకు చేరిందని తెలిపారు. అంతేకాకుండా రాయల్టీ వసూళ్లను ఏఎంఆర్ కంపెనీకి అప్పగించిందని, పెంచిన రాయల్టీతో పాటు అనధికార వసూళ్లకు తెరలేపడం, పనికిరాని రాయికి కూడా రాయల్టీ చెల్లించాలని యజమానులపై ఒత్తిడి చేయడం వంటి చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా 800 ఫ్యాక్టరీలు మూతవేసి ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు. గ్రానైట్ పాలిషింగ్ అండ్ కటింగ్ ఫ్యాక్టరీల యజమానులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. -
పండగ పూటా పచ్చ కుట్రలు
కొండపి: కొండపి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. పండగ పూటా పచ్చ నేతలు కుట్రలు చేసిన తీరు చూసి జనం చీకొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మహర్నవమి సందర్భంగా బుధవారం రాత్రి కొండపి మండలం పెద్ద కండ్లగుంట గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయంలో వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభపై కోలాట ప్రదర్శనకు, టీడీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభపై పాటకచేరీకి ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు పోలీసుల అనుమతికి దరఖాస్తు చేసుకోగా నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కోలాట ప్రదర్శనకు పోలీసులు అనుమతించక తప్పలేదు. తొలుత అనుమతి నిరాకరించేలా పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసిన టీడీపీ నాయకులు తమ కుట్రలకు మరింత పదునుపెట్టారు. కోలాట ప్రదర్శనను సవ్యంగా సాగకుండా పోలీసులను ఉసిగొల్పి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. లైట్లు ఆపేసి.. ప్రదర్శన త్వరగా నిలిపేసి.. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బెలూన్లు తొలగింపజేసిన పోలీసులు.. డెకరేషన్ లైట్లను సైతం ఆపివేయించారు. మైకుల సంఖ్యను కూడా కుదించి కోలాట ప్రదర్శనను నిర్వహించుకోవాలని సూచించారు. అయినప్పటికీ సంయమనం పాటించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు.. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు ఇచ్చిన ఆదేశాలను పాటించారు. అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ల వెలుగులోనే కోలాట ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రభపై అశ్లీలతకు పేరొందిన రికార్డ్ డ్యాన్స్కు అడగగానే అనుమతిచ్చేసిన పోలీసులు.. సాంస్కృతిక కార్యక్రమమైన కోలాట ప్రదర్శనకు అనుమతి నిరాకరించడం, లైట్లు ఆపేయడం, బెలూన్లు సైతం తొలగించడం చూసి చుట్టుపక్కల గ్రామాల భక్తులతోపాటు గ్రామస్తులు విస్తుపోయారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన కోలాటాన్ని రెండు గంటల వ్యవధిలోనే అంటే 11 గంటలకే నిలిపేసిన పోలీసులు.. టీడీపీ ప్రభపై రికార్డ్ డ్యాన్స్ను మాత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు దగ్గరుండి జరిపించడం గమనార్హం. ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన పెద్దకండ్లగుంటలో కోలాట ప్రదర్శన ఆహూతులను అలరించింది. సుమారు 46 మంది కళాకారులు రెండు నెలలపాటు సాధన చేసి కోలాటం ప్రదర్శించారు. కోలాటాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. రెండు గంటలపాటు సాగిన ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా 2 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్, మండల సీనియర్ నాయకులు వేముల రమేష్, ఎంపీటీసీ సుబ్బారావు, లక్ష్మీనరసయ్య, కార్తీక్ సుల్తాన్, రవీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఓబుల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండపి మండలం పెద్దకండ్లకుంటలో టీడీపీ నేతల దుశ్చర్య కోలాట ప్రదర్శనకు అనుమతివ్వకుండా పోలీసులపై ఒత్తిడి హైకోర్టు అనుమతితో కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ శ్రేణుల ఏర్పాట్లు అయినా పోలీసులను పురమాయించి అడుగడుగునా ఆంక్షలు ప్రభ డెకరేషన్ లైట్లు ఆపి, రాత్రి 11 గంటలకే ప్రదర్శన నిలిపివేత టీడీపీ ప్రభపై తెల్లవారుజామున 3 గంటల వరకు రికార్డు డ్యాన్స్ అనవసర రాద్ధాంతం చేశారు కోలాట ప్రదర్శనకు అనుమతి అడిగితే పోలీసులు కాదనడంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించకూడదన్నది వారి ఉద్దేశం. అందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టారు. అయినా మేమంతా సంయమనం పాటించాం. పోలీసుల సూచన మేరకు లైట్లు ఆపేసి ఉన్న కాస్త వెలుగులోనే ప్రదర్శన కొనసాగించాం. ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన కోలాట ప్రదర్శన పోలీసుల ఆంక్షల వల్ల 9 గంటలకు మొదలైంది. టీడీపీ ప్రభ వద్ద జనం లేరన్న కారణంతో 11 గంటలకే మా ప్రోగ్రామ్ను ఆపేశారు. పండగ పూట రాజకీయాలు చేయడం, అందుకు పోలీసులు సహకరించడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి. – భువనగిరి సత్యనారాయణ, పెద్దకండ్లగుంట సర్పంచ్ -
డీపీవో ఉద్యోగులు సమయపాలన పాటించాలి
● ఎస్పీ హర్షవర్ధన్రాజు ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో) ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ఫైల్స్ పెండింగ్ లేకుండా సకాలంలో పనులు పూర్తిచేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు ఆదేశించారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, పనులు వాయిదా వేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి తన దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, డీటీఆర్బీ, పరిపాలనా విభాగంలోని అన్ని సెక్షన్లు, అడిషనల్ ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు. సంబంధిత అధికారుల నుంచి ఆయా విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించిన ఎస్పీ.. వాటిని క్రమబద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ విధుల గురించి ఆరా తీశారు. వారి పనితీరుపై సమీక్షించి సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సలహాలు, సూచనలు చేశారు. వివిధ కమిషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి నిర్ణీత కాలంలో సమాధానాలు పంపించాలని చెప్పారు. ఎస్పీ వెంట డీపీవో ఏవో రామ్మోహన్రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఆర్ఐ సీతారామిరెడ్డి ఉన్నారు. ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా నాయకులను పార్టీలోని వివిధ పదవుల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జంకె వెంకటరెడ్డి, కనిగిరి నియోజకవర్గానికి చెందిన చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, కొండపి నియోజకవర్గానికి చెందిన మాదాసి వెంకయ్యని నియమించారు. అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) మెంబర్లుగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కొండపి నియోజకవర్గానికి చెందిన బత్తుల అశోక్రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పిడతల ప్రవీణ్కుమార్రెడ్డిని నియమించారు. ఒంగోలు సిటీ: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్, ఒకేషనల్)కు పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 2026 మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ కె.ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ వాళ్లకు 2026 ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్ వాళ్లకు 2026 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెక్షన్లలో జరుగుతాయని తెలిపారు. సమగ్రశిక్ష ఒకేషనల్ ట్రేడ్ ఎగ్జామ్ 13–02–2026న జరుగుతుందన్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జాం జనవరి 23 ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్... ఫిబ్రవరి 23న తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/తమిళ్/ఒరియా/కన్నడ/అరబిక్/ఫ్రెంచ్, 25న ఇంగ్లిష్, 27న హిస్టరీ, మార్చి 2న మ్యాథ్స్, 5న బయాలజీ, 7న ఎకనామిక్స్, 10న ఫిజిక్స్, 12న కామర్స్, 14న సివిక్స్, 17న కెమిస్ట్రీ, 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, 24న మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫి పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్... ఫిబ్రవరి 24న తెలుగు, 26న ఇంగ్లిష్, 28న బోటనీ/హిస్టరీ, మార్చి 3న మ్యాథ్స్ 2ఏ/సివిక్స్ 2, 6న జువాలజీ–2/ఎకనామిక్స్–2, 9న మ్యాథ్స్ 2బీ, 11న కామర్స్–2/సోషియాలజీ–2/ఫైన్ ఆర్ట్స్/మ్యూజిక్, 13న ఫిజిక్స్–2, 16న మోడరన్ లాంగ్వేజ్/జాగ్రఫీ, 18న కెమిస్ట్రీ–2, 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పరీక్షలు జరుగుతాయి. సెకండియర్ పరీక్షలు పాత సిలబస్ ప్రకారం జరుగుతాయని, అదేవిధంగా విద్యార్థులకు ఫస్టియర్ సబ్జెక్ట్లు పెండింగ్ ఉంటే కూడా పాత సిలబస్ ప్రకారమే జరుగుతాయని తెలిపారు. -
‘ప్రకాశం’ పేరును నిలబెడదాం
● ఆయుధ పూజలో ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: ప్రశాంత వాతావరణానికి నిలయమైన ప్రకాశం జిల్లా పేరును నిలబెట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ వి.హర్షవర్థన్రాజు పిలుపునిచ్చారు. విజయ దశమి పండగను పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలంలో శాస్త్రోక్తంగా ఆయుధపూజ నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో సతీసమేతంగా ఎస్పీ పూజలు చేశారు. నిత్యం పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడటంలో ఆయుధాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు , సిబ్బంది పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, తాలుకా సీఐ విజయకృష్ణ, మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, సీసీఎస్ సీఐ జగదీష్, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: గంజాయి, ఇతరా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి చేసే నేపథ్యంలో జిల్లా పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలోని పార్శిల్ కార్యాలయంలో అనుమానాస్పద బుకింగ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన స్లీపర్ డాగ్ రాక్సీతో కలిసి బస్సులు, రైళ్లలోని ప్రయాణికుల లగేజీ బ్యాగులను పరిశీలించారు. తనిఖీలకు నేతృత్వం వహించిన వన్టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. గంజాయి రవాణాను కట్టడి చేయడానికి ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశాలతో పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల రవాణా విషయంలో నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేదిత వస్తువులకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 91211 02266కు తెలియజేయాలని కోరారు. -
గ్రానైట్ అక్రమ తవ్వకాలు ఆపాలి
ఒంగోలు సబర్బన్: చీమకుర్తిలో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని, లేకుంటే అనేక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు కలెక్టర్ పీ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఒంగోలు ఎంపీ, జిల్లా దిశ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 18 గ్రామాలకు తాగునీరు, 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే కారుమంచి కాలువ దాని పక్కనున్న క్వారీలో పడిపోయి రైతులు, రైతు కూలీల జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని తెలిపారు. కారుమంచి కాలువను ఆనుకుని ఉన్న మధుకాన్ గ్రానైట్ క్వారీ వారు పరిధిని మించి తవ్వకాలు చేపట్టారని, ఇరిగేషన్ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ కాలువను కూడా అక్రమంగా తవ్వారని తెలిపారు. ఫలితంగా చీమకుర్తి పట్టణ దక్షిణపు గ్రామాల రైతులు, రైతు కూలీలు సాగునీరు అందకపోవడంతో పాటు తాగునీరు కూడా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చివరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సి వచ్చిందని కూడా గుర్తు చేశారు. డీఎంఎఫ్ గ్రాంట్ నుంచి 2.62 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ టెండర్ పిలవకపోవడంలో ఆంతర్యం ఏమిటని వేమా ప్రశ్నించారు. లైనింగ్ మార్చి ఉన్న ప్రాంతానికి దూరంగా లైనింగ్ వేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రైతుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండో విధానంలో పైపులైను ద్వారా కారుమంచి కాలువను పునరుద్ధరించాలనే ఆలోచన కూడా చేస్తున్నారని, ఇది రైతులకు ప్రయోజనకరం కాదని అన్నారు. రైతులకు నష్టం వాటిల్లే నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఉమ్మడి కార్యాచరణతో క్షేత్రస్థాయి నుంచి ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. స్పందించిన కలెక్టర్.. తక్షణమే ఈ విషయంపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలపై కమిటీ చైర్మన్ మాగుంట సమీక్షించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
త్రై లోక్య మాతా.. ధన్యోస్మి
యర్రగొండపాలెం/మార్కాపురం టౌన్: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం యర్రగొండపాలెంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు విజయ ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రూ.27 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో నిర్వాహకులు అలంకరించగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శమిపూజ అనంతరం మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరించి రథోత్సవం నిర్వహించారు. అలాగే మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి వద్ద ముద్దసానమ్మ ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిగ్రహ మూర్తిని రూ.24,11,116 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. -
గాంధీజీ మార్గం అనుసరణీయం
ఒంగోలు సబర్బన్: జాతిపిత మహాత్మాగాంధీ వ్యక్తిత్వం, ఆయన చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని కలెక్టర్ పీ రాజాబాబు అన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు గాంధీరోడ్డులోని గ్రామచావిడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల జయంతులు నిర్వహించుకోవడం మనందరి అదృష్టమన్నారు. వారు చూపిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామచావిడిని పునర్నిర్మిస్తున్నామని, ఇది అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 10 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, బీఎన్ విజయ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత పాల్గొని గ్రామ చావిడి పునర్నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీకి వైఎస్సార్ సీపీ నాయకుల నివాళులు... ఒంగోలు సిటీ: స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బొగ్గుల శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు, రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ అశోక్, రాష్ట్ర ఇంటలెక్చువల్ కమిటీ ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, నాయకులు సయ్యద్ అప్సర్, షేక్ మీరావాలి, వీసం బాలకృష్ణ, పిగిలి శ్రీనివాసరావు, షేక్ జిలానీబాషా, ఫణిదపు సుధాకర్, డివిజన్ అధ్యక్షులు రాజేష్, భాస్కర్, గళ్లా దుర్గా, పార్టీ నాయకులు వేముల శ్రీకాంత్, వెంకయ్య నాయుడు, పెట్లూరి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగంగానే మాంసం అమ్మకాలు...
గాంధీ జయంతి రోజు జిల్లాలో బహిరంగంగానే మాంసం అమ్మకాలు జరగాయి. నగరంలోని 60 అడుగుల రోడ్డు, నెల్లూరు బస్టాండు సెంటర్, అద్దంకి బస్టాండ్ సెంటర్, కర్నూలు రోడ్డు, గుంటూరు రోడ్లలో బిర్యానీ సెంటర్లను వ్యాపారాలు నిర్వహించుకోవడం కనిపించింది. ఇక, చికెన్ పకోడా సెంటర్లయితే లెక్కేలేదు. చికెన్ దుకాణాలు మూసివేసినప్పటికీ బిర్యానీ హోటళ్లకు చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేనాథుడే లేడు. ఒంగోలు నగరం పాతమార్కెట్ సెంటర్, ఊరచెరువు రోడ్డు, కొత్త కూరగాయల మార్కెట్లో చికెన్, మటన్ అమ్మకాలు జోరుగా సాగాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఎయిడెడ్ స్కూళ్లకు సీఆర్పీలను కేటాయించాలి
● ఏపీ టీచ ర్స్ గిల్డ్ జిల్లా నేతల డిమాండ్ ఒంగోలు సిటీ: జిల్లా పరిధిలోని 39 ఎయిడెడ్ ఏకోపాధ్యాయ పాఠశాలలకు సీఆర్పీలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెళ్లూరు, కొప్పోలు, ఒంగోలు, కొత్తపల్లి, బసవన్నపాలెం, మద్దిరాలపాడు, పోతవరం, అమ్మనబ్రోలు, తిమ్మసముద్రం, ఉప్పుగుండూరు, చెరుకూరు, ఇడుపులపాడు, మార్టూరు, రాజుపాలెం, అద్దంకి, చీమకుర్తి, రాజుపాలెం, రావిపాడు, కంభం,తిరుమలాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, కనిగిరి, గుడిపాటి పల్లి, కరేడు ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచరే 1 నుంచి 5వ తరగతి, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు బోధిస్తున్నారని వివరించారు. టీచర్లు సెలవు పెట్టినప్పుడు సీఆర్పీలను పంపాల్సి ఉండగా కొందరు విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటరీ టీచర్ను నియమించుకుని సెలవు పెట్టుకోవాలని ఎంఈఓలు సూచించడాన్ని తప్పుబట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ఏకోపాధ్యాయ పాఠశాలలకు శాశ్వత సీఆర్పీలను కేటాయించాలని కోరారు. ● ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు అందాలని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. వినియోగదారులకు కలిగే మేలుపై అవగాహన కల్పించడానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్లో నిర్వహించిన సదస్సుకు దినకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలను సక్రమంగా అమలు చేసి ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సేవలు న్యాయమైన ధరకు అందేలా పర్యవేక్షించాలని వినియోగదారుల కమిషన్ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాశ్, డీఆర్ఓ ఓబులేసు, ఒంగోలు చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువాయి కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దేవతు శ్రీరాములు, ఎస్టీపీ అసోసియేషన్ అధ్యక్షుడు రోశయ్య పాల్గొన్నారు. -
ఎన్సీడీసీ రుణాల మంజూరులో భారీ అవినీతి
ఒంగోలు సబర్బన్: నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) రుణాల మంజూరులో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా సహకార యూనియన్ ద్వారా ఇచ్చిన ఎన్సీడీసీ రుణాల్లో అవినీతిని నిగ్గు తేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా యూనియన్ ద్వారా 2014 నుంచి 2021 వరకు గొర్రెల పెంపకందారుల అభివృద్ధి కోసం మూడు దఫాలుగా రూ.20 కోట్ల రుణాలు సుమారు 1000 మందికి ఇచ్చారన్నారు. అయితే అప్పటి పాలకవర్గం, అధికారులు కుమ్మకై ్క నిబంధనలకు విరుద్ధంగా రుణాలు పంపిణీ చేశారని ఆరోపించారు. ఆడిట్ అధికారులు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రుణాల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు నివేదిక ఇచ్చారన్నారు. దీనినిబట్టి రుణాల మంజూరు సమయంలో దరఖాస్తుదారుల డాక్యుమెంట్ల పరిశీలన కూడా సరిగా చేయలేదని అర్థమవుతోందన్నారు. ప్రధానంగా ఒకే మార్ట్గేజిపై ఇద్దరికి, ముగ్గురికి ఒకరి డాక్యుమెంట్ల జిరాక్సులే పెట్టి రుణాలు ఇవ్వడం, సొసైటీలో లేని సభ్యులకు రుణాలు ఇవ్వడం, అలాగే ఒకే సొసైటీలో 10 నుంచి 20 మందికి రుణాలు ఇవ్వడం, బినామీ పేర్లతో రుణాలు పొందేందుకు సహకరించడం లాంటి అక్రమాలకు యథేచ్ఛగా పాల్పడ్డారని, అందుకు అప్పటి అధికారులు సహకరించడం దారుణమన్నారు. ఈ క్రమంలో అర్హులు ఉన్నప్పటికీ కొన్ని సొసైటీల్లో ఒక్కరికీ కూడా ఎన్సీడీసీ రుణం మంజూరు చేయలేదని చెప్పారు. రుణాల మంజూరులో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నగదు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసపాటి వెంకటరావు, జిల్లా కార్యదర్శి తోట తిరుపతరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ఆంజనేయులు, చిట్టిబోయిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమాల నిగ్గు తేల్చాలి పశుసంవర్ధక శాఖ జేడీకి ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఫిర్యాదు -
కార్యకర్తలే పార్టీకి బలం
ఒంగోలు సిటీ: ‘కార్యకర్తలే పార్టీకి బలం. వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 17 మెడికల్ కళాశాలలు, సచివాలయ వ్యవస్థ, పోర్టులు వంటి వాటితో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. పార్టీని ఎలా పటిష్టం చేసుకోవాలో వివరించారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకే డిజిటల్ బుక్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసుకోవడంలో కార్యకర్తలకే కీలకమన్నారు. ఏ పార్టీకై నా జెండా మోసే నాయకులు, కార్యకర్తలు లేకపోతే పార్టీ నిలబడదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల తీరుతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. అందుకే వారికి అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వారి సమస్యలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులపై భవిష్యత్లో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక చిన్న స్థాయి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎదిగానంటే మీ అందరి ఆదరణ అభిమానమేనన్నారు. కార్యకర్త పడే కష్టాలు, ప్రజాప్రతినిధులు పడే కష్టాలు తెలుసని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్లో పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను మర్చిపోమన్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు మాట్లాడుతూ 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించాలని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని, జిల్లాలోని అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగ నాగార్జున, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైజాగ్ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.శివశంకర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రా భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా అఫిలియేటెడ్ వింగ్ ఇన్చార్జి వెంకటప్పరెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ విజయభాస్కరరెడ్డి, అషోది యలమందారెడ్డి, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో వారే కీలకం వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బూచేపల్లి అధ్యక్షతన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
● అర్బన్ వైద్యశాలను సందర్శించిన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి ఒంగోలు టౌన్: పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడడం దుర్మార్గమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి తీవ్రంగా విమర్శించారు. వైద్యం కోసం పేదలు అప్పులు చేస్తున్నారని, నిరుపేదలకు వైద్య సేవలను అందిస్తున్న అర్బన్ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ నాయకులతో కలిసి స్థానిక పాపాకాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో బుధవారం సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందిని, చికిత్స కోసం వచ్చిన రోగులను వైద్యశాలలో లభిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అత్యవసర సేవా రంగంగా గుర్తించిన వైద్యరంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం అందుతున్న అరకొర ప్రభుత్వ వైద్యాన్ని సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒంగోలు నగరంలోని పాపా కాలనీలో పనిచేస్తున్న వైద్యుడిని మంగళవారం, గురువారం, శనివారం డిప్యూటేషన్పై నియమించడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఇన్ సర్వీసు కోటా పునరుద్ధరించాలి ప్రభుత్వ వైద్యులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పీజీ చేయడం పరిపాటేనని రమాదేవి చెప్పారు. గతంలో పీహెచ్సీ వైద్యులకు పీజీ ప్రవేశాల్లో 30 శాతం ఇన్ సర్వీసు కోటా ఉండేదని , దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి 15 శాతానికి కుదించడం దారుణమన్నారు. పీహెచ్సీ వైద్యులకు కోటాను యథాతధంగా కొనసాగించాలని చెప్పారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెను ఉపసంహరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని, వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, కంకణాల రమాదేవి, సయ్యద్ హుసేన్, ఆర్.శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసరావు, జి.రమేష్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు
ఒంగోలు టౌన్: సాధారణ బదిలీల్లో భాగంగా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.హర్షవర్థన్ రాజును జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్కు వచ్చిన నాయకులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎంఎల్సీ తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, పార్టీ పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ, కదిరి బాబురావు, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ కనకరావు మాదిగ, రాష్ట్ర బూత్ వింగ్ ప్రసిడెంట్ కాకుమాను రాజశేఖర్ ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. -
కారు ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు
కనిగిరిరూరల్: బైక్ను కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కనిగిరి పొగాకు బోర్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..పెదారికట్లకు చెందిన ఎస్కే ఖదీర్ స్కూటీపై కనిగిరి వైపు వస్తున్నాడు. ఆ సమయంలో కనిగిరి నుంచి పొదిలి వైపుకు వేగంగా వస్తున్న కారు పొగాకు బోర్డు యార్ట్ వద్ద బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ బైక్ ఉన్న ఎస్కే ఖదీర్కు తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. స్కూటీని ఢీకొన్న కారును గడ్డమీదపల్లి వద్ద స్థానికులు అడ్డుకుని ఆపినట్లు తెలిసింది. క్షతగాత్రుడు ఖదీర్ మంగళవారమే బెంగుళూరు నుంచి వచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులు
ఒంగోలు సిటీ: కూటమి పాలన నానాటికీ దిగజారుతోందని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. యూరియా గురించి తాము మాట్లాడితే అబద్ధమంటారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం యూరియా సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు. రోడ్లు బాగలేవని తమ నియోజకవర్గాల్లో ప్రజలు తిరగనిచ్చే పరిస్థితులు లేవని అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాపోతున్నారన్నారు. లంచాలు తీసుకుంటున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని కారుమూరి దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పంటలను రోడ్డుపై పారబోసుకుంటున్నారని వాపోయారు. కార్యకర్తలే వెన్నెముక.. వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే వెన్నెముక అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే చంద్రశేఖర్, అన్ని వర్గాల ఇన్చార్జిలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. డిసెంబరు నెలాఖరులోపు కార్యకర్తలకు ఐడీ కార్డులు, బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాలతో ఇబ్బందులు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని కారుమూరి చెప్పారు. గ్రామస్థాయిలో ఎలాంటి చిన్న సమస్య ఎదురైనా క్షణాల్లో అధిష్టానం దృష్టికి వచ్చేలా ఇది ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, ఎస్ఎన్పాడు ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, మార్కాపురం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైజాగ్ పార్లమెంట్ అబ్జర్వర్ కదిరి బాబురావు, కనిగిరి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఆదెన్న, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు బొట్ల రామారావు, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, మీరావలి, తదితరులు పాల్గొన్నారు. -
వేలం తీరును పరిశీలించిన పొగాకు బోర్డు ఈడీ
ఒంగోలు సబర్బన్: త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2ను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ బుధవారం పరిశీలించారు. వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం విధానాన్ని పరిశీలించారు. వ్యాపారులతో కలిసి కొనుగోలు చేస్తున్న తీరును, రైతులకు ధర వస్తున్న వైనాన్ని కూడా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద పొగాకు స్టాక్ ఎంత ఉందో గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు. 2025–26 పంట కాలానికి బోర్డు ఇచ్చిన పరిమితి మేరకే పొగాకు సాగు చేసుకోవాలని కోరారు. ఒంగోలు–2 వేలం కేంద్రం సూపరింటెండెంట్ జే.తులసిని పొగాకు మార్కెట్ పరిస్థితిని, బ్యాలెన్స్ క్వాంటిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లాట్ఫాంలోని గోడౌన్ని కూడా పరిశీలించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఆక్షన్ మేనేజర్ రామాంజనేయులు, రీజినల్ మేనేజర్ రామారావు, రైతు నాయకులు పాల్గొన్నారు. -
పొగాకు వేలం అడ్డగింత
కొండపి: ఒక్కసారిగా పొగాకు ధరలు దిగ్గోయడంపై రైతులు మండిపడ్డారు. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్లీ ధరలు తగ్గించడం ఏంటని రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన బుధవారం కొండపి పొగాకు వేలం కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..క్లస్టర్ పరిధిలోని గుర్రప్పడియ, మూగచింతల, నెన్నూరుపాడు, చతుకుపాడు, కె.అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు వేలానికి వచ్చారు. అయితే వేలం ప్రారంభమైన కొద్ది సేపటికే కొన్ని రోజులుగా పెంచిన ధరలను ఒక్కసారిగా రూ.100 తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి వేలాన్ని అడ్డుకున్నారు. తమ క్లస్టర్ పరిధిలోకి వచ్చేసరికి ధరలు ఎందుకు తగ్గిస్తున్నారని వేలం నిర్వహణ అధికారి సునీల్కుమార్ను ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్ లేకపోవడంతో ధరలు తగ్గించారని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా..రైతులు ఒప్పుకోలేదు. రైతులందరి వద్ద ఒకే విధంగా కొనుగోలు చేయానే గానీ ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తే కుదరదని చెప్పి వేలాన్ని బహిష్కరించారు. గరిష్ట ధర రూ.340లకు కొనుగోలు చేయాల్సిందేనని భీష్మించారు. దీంతో వేలం నిర్వహణాధికారి రైతులు, వ్యాపారులతో చర్చించి అదే ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి వేలం ప్రారంభమైంది. పొగాకు కనిష్ట ధర రూ.90 స్థానిక పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర రూ.90 పలికిందని వేలం నిర్వహణాధికారి జి.సునీల్కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని మూగచింతల గుర్రప్పడియ, నెన్నూరుపాడు, కె అగ్రహారం, చతుకుపాడు గ్రామాల చెందిన రైతులు 1214 బేళ్లను వేలానికి తీసుకురాగా 1146 బేళ్లను కొనుగోలు చేసి 68 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.330, సరాసరి ధర రూ.260.09గా నమోదైంది. వేలంలో 19 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె ఒక్కసారిగా ధరలు తగ్గించడంపై రైతుల మండిపాటు వ్యాపారులతో చర్చల అనంతరం కొనసాగిన వేలం -
బాణసంచా కేంద్రాలపై ఆకస్మిక దాడులు
ఒంగోలు టౌన్: దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలోని బాణసంచా పరిశ్రమలు, గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బాణసంచా విక్రయదారులు ఫైర్ అధికారుల నిబంధనలను అమలు చేస్తున్నారో లేదో పరిశీలించారు. షాపుల్లో అమర్చిన అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా లేదో పరిశీలించారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పేందుకు సమీపంలో నీరు, ఇసుక అందుబాటులో ఉంచారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఫైర్ ఇంజన్ వెంటనే చేరుకునేందుకు తగిన స్థలం ఉందో లేదో చూశారు. బాణసంచా తయారీ కేంద్రాలలో కానీ, విక్రయ కేంద్రాలలో కానీ 18 ఏళ్ల లోపు పిల్లల చేత పనిచేయించరాదని సూచించారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు హెచ్చరించారు. 1034 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు.. గత నెలలో బహిరంగంగా మద్యం తాగుతున్న 1034 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు తెలిపారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 293 ప్రదేశాలను గుర్తించి అందులో 265 ప్రదేశాలను శుభ్రం చేయించినట్లు వివరించారు. గుడి, బడి పక్కన గుబురుగా ప్రదేశాలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుందని చెప్పారు. ఎవరైనా బహిరంగంగా మద్యం సేవిస్తుంటే వెంటనే వీడియో తీసి పోలీసు వాట్సప్ నెంబర్ 9121102266 నంబర్కు పంపించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎంఎస్సీడీ ద్వారా నిందితుల గుర్తింపు.. శాంతి భద్రతలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి గస్తీ నిర్వహించడమే కాకుండా మొబైల్ సెక్యురిటీ చెక్డ్ డివైజ్ (ఎంఎస్సీడి) అనే అత్యంత ఆధునిక పరికరం ద్వారా అనుమానిత వ్యక్తుల వేలి ముద్రలను సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ పరికరం ద్వారా పోలీసులు ఒక వ్యక్తి నుంచి సేకరించిన వేలిముద్రలను అక్కడిక్కడే స్కాన్ చేసి అతడి నేరచరిత్రను గుర్తించవచ్చన్నారు. గత నెలలో 4494 మంది వేలిముద్రలు సేకరించగా వారిలో 15 మంది నిందితులను గుర్తించామని, తనిఖీల్లో ఒంగోలుకు చెందిన షేక్ రఫీ అనే నిందితుడు 12 కేసుల్లో ఉన్నట్లు గుర్తించి వెంటనే అతడిని సంబంధిత పోలీసు స్టేషన్లలో బైండోవర్ చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉన్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రాంతాల్లో వాహన తనిఖీలు, కొత్తగా వచ్చిన వారి పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిక -
గనుల శాఖ ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ
● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో గనులు, ఏపీ ఎండీసీ, పర్యావరణ కాలుష్యం నియంత్రణ మండలి, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, వాటి రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా వివరాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఇదే సమయానికి 18శాతం వృద్ధి ఉన్నట్లు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వం మన జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలోని 12 స్టాక్ యార్డుల్లో 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ రాఘవరెడ్డి, డీటీసీ ఆర్.సుశీల, ఆర్టీసీ ఆర్ఎం జి.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో చోరీ ● 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.9 వేల నగదు అపహరణ ఒంగోలు టౌన్: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ డిపో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని దొంగలు చేతివాటం ప్రదర్శించి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సర్వేరెడ్డిపాలెంకు చెందిన పోపూరి సుమతి పర్చూరు వెళ్లేందుకు బుధవారం ఒంగోలు ఆర్టీసీ డిపోకు వచ్చారు. ఈ క్రమంలో బస్సు రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కారు. ఎందుకో అనుమానం వచ్చిన సుమతి తన పర్సు తీసి చూడగా అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఆందోళన చెందిన ఆమె వెంటనే ఆర్టీసీ డిపోలో ఔట్పోస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేబస్సులో కొత్తపట్నం మండలం ఆలూరు నుంచి ఇంకొల్లు వెళ్లేందుకు బస్సు ఎక్కిన కనపర్తి సువార్తమ్మ పర్సులోని రూ.9 వేల నగదు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సీసీ కెమెరాలు పరిశీలించారు. వన్టౌన్ సీఐ నాగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాచర్ల: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఒద్దులవాగుపల్లెలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒద్దులవాగుపల్లె గ్రామానికి చెందిన మదిరె ఈశ్వర్రెడ్డి (60) అప్పుల బాధ భరించలేక బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఉరేసుకొని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.